agri gold
-
ఉదయగిరి ఎమ్మెల్యే కర్ర సా(స్కా)ము
సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం ఎమ్మెల్యేలు సహజ వనరులను దోపిడీ ఘరూ చేశారు. ఇసుక, గ్రావెల్, క్వార్ట్జ్ మెటల్ను దోచేస్తున్న నేతలు తాజాగా అగ్రిగోల్డ్ భూములపై కన్నేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో వందలాది ఎకరాల్లోని జామాయిల్ కర్రను అక్రమంగా నరికించి సొమ్ము చేసుకుంటున్నారు. సాక్షాత్తు ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ కార్యాలయం నుంచే అక్రమ దందా పర్యవేక్షణ జరుగుతుండడంతో పోలీస్, రెవెన్యూ యంత్రాంగం కూడా వారికి సహకరిస్తోంది. 450 ఎకరాల్లో అగ్రిగోల్డ్ జామాయిల్ తోటలుఉదయగిరి నియోజవర్గంలోని వరికుంటపాడు, కలిగిరి, దుత్తలూరు, వింజమూరు మండలాల్లో సుమారు 450 ఎకరాలు అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి. ఈ భూములను ఆ సంస్ధ బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకుంది. సంస్థ దివాలా తీయడంతో ఆ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ భూముల్లో జామాయిల్, మామిడి, ఎర్ర చందనం, శ్రీగంధం తదితర మొక్కలు ఉన్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఈ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా, అందులో ఉన్న విలువైన సంపద చోరీ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాకతో తెలుగుదేశం నాయకులు వరికంటపాడు పంచాయతీ పరిధిలో ఉన్న భాస్కరపురం, జంగం రెడ్డిపల్లి, కనియంపాడు గ్రామాల్లో అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న దాదాపు రూ.10 కోట్లు విలువ చేసే జామాయిల్ కర్రను నరికించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పక్కా ప్రణాళికభాస్కరపురం రెవెన్యూలో 69 నుంచి 112 వరకు పలు సర్వే నెంబర్లలో సుమారు 140 ఎకరాల అగ్రిగోల్డ్ భూములు బినామీ పేర్లపై ఉన్నట్లు సమాచారం. రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా అగ్రిగోల్డ్ ఆస్తులుగా నమోదు కాలేదు. పైగా ఈ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా అవి అగ్రిగోల్డ్ సంస్థకు చెందినట్లుగా తెలిపే సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో స్థానికులకు, రెవెన్యూ అధికారులకు తప్ప మిగితా వారు ఆ భూములు గుర్తించలేరు. దీనిని ఆసరా చేసుకున్న ఒక అధికార ప్రజాప్రతినిధి రెవెన్యూ, పోలీసు అధికారులను మ్యానేజ్ చేశారు. ఎవరైనా ఈ విషయం గురించి రెవెన్యూ అధికారులను అడిగితే అవి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూములు అని చెప్పి తప్పించుకుంటున్నారు. విషయం తెలిసిన స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసుల పేరుతో భయపెడుతున్నారు.తరలుతున్న సంపదవరికుంటపాడు పంచాయతీ పరిధిలో ఉన్న అగ్రిగోల్ట్ భూముల్లో సుమారు 12,500 టన్నుల వరకు జామాయిల్ కర్ర ఉందని అంచనా. ప్రస్తుతం టన్ను జామాయిల్ రూ.8 వేలు వరకు విక్రయిస్తున్నారు. దీంతో సుమారు రూ.10 కోట్లు విలువ చేసే కర్రను గత వారం రోజుల నుంచి నరికి అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి నాలుగు ముఠాలను రప్పించి రోజువారీగా నరికిస్తున్నారు.వైఎస్సార్సీపీ నేతలకు బెదిరింపులుఅగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ కలప నరికివేత విషయం తెలిసి వైఎస్సార్సీపీ నేత ఒకరు ప్రశ్నించగా పోలీస్ తరహాలో బెదిరింపులు వెళ్లాయి. ఈ విషయం వెలుగులోకి తెచ్చినా, అడ్డుకున్నా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయించి జైలుకు పంపిస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. తాజాగా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయం నుంచే పర్యవేక్షణ జరుగుతుండడంతో పాటు పది రోజులుగా ఒక ప్రణాళిక ప్రకారం అధికారులను, నాయకులను మ్యానేజ్ చేసుకుని పక్కాగా జామాయిల్ కర్రను నరికించేసి విలువైన సంపదను దోచుకుంటున్నారు. -
అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయాలని చూసి.. ఇప్పుడు నీతులు చెబుతావా లోకేష్
టీడీపీ ప్రభుత్వంలో వెలుగుచూసిన అగ్రిగోల్డ్ కుంభకోణాన్ని చంద్రబాబు, టీడీపీ నేతలు ఆస్తుల సంపాదనకు అక్షయ పాత్రగా మలచుకోవాలని పన్నిన పన్నాగాలు అన్నీ ఇన్ని కావు. కేసులను బూచిగా చూపి అగ్రిగోల్డ్ ఆస్తులను చవగ్గా కొట్టేయడానికి ఆ సంస్థ యాజమాన్యంతో తెరచాటు మంతనాలు సాగించారు. ప్రధానంగా రాజధాని అమరావతి పరిధిలో ఉన్న వందల కోట్ల విలువైన హాయ్ల్యాండ్ను హస్తగతం చేసుకోవాలని పంతం పట్టిన చంద్రబాబు తనయుడు లోకేశ్ ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నాడు. మేము అగ్రి గోల్డ్ బాధితులకు 7 కోట్లు (ఆత్మహత్య చేసుకున్న 142 మందికి ఒక్కొక్కరికి 5 లక్షలు చొప్పున ) ఇచ్చామని లోకేష్ అంటున్నారు. రాష్ట్రంలో 11 .57 లక్షల మంది డిపాజిటర్లు అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేశారు. వారిలో 20 వేలు లోపు డిపాజిట్ చేసినవారికి "930 కోట్లు చెల్లించి" 10.37లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్నారు సీఎం జగన్. మిగిలిన వారికి కూడా డిపాజిట్ మొత్తం చెల్లించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంతో ఏలూరు కోర్టులో కేసు వేసి పోరాడుతోంది జగన్ ప్రభుత్వం (అసలు అగ్రిగోల్డ్ కుంభకోణం వెలుగుచూసింది చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే) అగ్రిగోల్డ్ సంస్థ 8 రాష్ట్రాల్లో 19 లక్షల మంది (19,18,865 )డిపాజిటర్ల నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేసి, వారందరినీ నిలువునా ముంచింది. టీడీపీ ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించిన ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నతాధికారి ద్వారా మంత్రాంగం చేశారు, 85 ఎకరాల్లో విస్తరించిన హాయ్ల్యాండ్లో దాదాపు 25 ఎకరాల్లో భవనాలు, సామగ్రి ఉన్నాయి. అందుకోసం అగ్రిగోల్డ్ ఆస్తులను సంస్థ యాజమాన్యం అమ్మేసుకుని వ్యక్తిగత ఖాతాలకు మళ్లించేందుకు టీడీపీ ప్రభుత్వం సహకరించింది. ప్రతిఫలంగానే అగ్రిగోల్డ్ యాజమాన్యం కోట్లు విలువ చేసే కొన్ని కీలక ఆస్తులను కారు చౌకగా టీడీపీ ముఖ్యులకు విక్రయించింది. అగ్రిగోల్డ్ మాజీ వైస్ చైర్మన్ డొప్పా రామ్మోహన్రావు 2016 ఏప్రిల్ 30న టీడీపీలో చేరడం ఆ సంస్థ యాజమాన్యానికి చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలకు నిదర్శనం. అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్మెంట్ జీవో రాక ముందే 2015 జనవరి 19న టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చౌదరి భార్య వెంకాయమ్మ పేరుతో అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీ అయిన రామ్ ఆవాస్ రిసార్ట్స్, హోటల్స్ గ్రూప్ డైరెక్టర్ ఉదయ్ దినకర్ నుంచి 14 ఎకరాలు కొన్నది. అగ్రి గోల్డ్ డైరెక్టర్లు, వారి భార్యలు, బంధువులు, బినామీల పేరుతో ఉన్న వందల కోట్ల విలువైన ఆస్తులపై అప్పట్లో సీఐడీ దృష్టి పెట్టలేదు. రూ. 976 కోట్లను 156 కంపెనీలకు మళ్లించిన విషయాన్నీ పట్టించుకోలేదు. ఇదీ చదవండి: ఓం ప్రథమం... ఎదురైంది దుశ్శకునం -
అగ్రిగోల్డ్ భూములు అన్యాక్రాంతం!
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసు దర్యాప్తులో సీఐడీ నిద్రమత్తులో జోగుతోంది. వేల ఎకరాలు చే తులు మారుతున్నా పట్టించుకోకపోవడమే కాకుం డా గతంలో అటాచ్ చేసిన ఆస్తులను కాపాడటంలోనూ విఫలమవుతోంది. హైదరాబాద్లో అగ్రిగోల్డ్కు చెందిన ఓ భవనాన్ని కబ్జాదారులు కూల్చేసి దర్జాగా మరో నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమవుతుండటం ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. నాలుగేళ్ల క్రితం జప్తు: హైదరాబాద్లోని కాప్రాలో అగ్రిగోల్డ్ ఫుడ్స్ అండ్ ఫారమ్స్ లిమిటెడ్కు 333 గజాల స్థలంలో ఓ భవనం ఉంది. దీన్ని సీఐడీ 2018లోనే జప్తు చేసింది. అయితే గతేడాది 2021 మేలో ఒక వ్యక్తి కబ్జాకు విఫలమయత్నం చేశాడు. అప్పుడు అగ్రిగోల్డ్ డైరెక్టర్లలో ఒకరైన అవ్వా సీతారామారావు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. కబ్జా వ్యవహారం, కేసు నమోదుపై 2021, మే 21న మల్కాజ్గిరి డీసీపీ సీఐడీకి ఓ లేఖ రాశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్మెంట్కు సంబంధించిన జీవోలతోపాటు వివరాల ప్రతిని ఇవ్వాలని, తమ జోన్లో అగ్రిగోల్డ్ ఆస్తుల్లో ఒక భవనం కబ్జాపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు సీఐడీకి ఆ డీసీపీ రాసిన లేఖగానీ, ఆస్తి కబ్జా సమాచారం గానీ లేదు. గతేడాది దర్యాప్తు అధికారి ఆ వ్యవహారంపై దృష్టి పెట్టకపోవడం, అగ్రిగోల్డ్ డైరెక్టర్లు ఇచ్చిన సమాచారంతో కనీసం క్షేత్రస్థాయిలోనూ తనిఖీ చేయకపోవడం వివాదాస్పదమవుతోంది. దర్జాగా భవనం కూల్చి...: ఈసీఐఎల్లో ఉన్న అగ్రిగోల్డ్కు చెందిన భవనాన్ని కూల్చేసి బోరు వేసి న ఓ వ్యక్తిపై అగ్రిగోల్డ్ బాధిత సంఘం ‘సాక్షి’కి సమాచారం ఇచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. అగ్రిగోల్డ్ వ్యవహారంపై వరుస కథనాలు అందిసు ్తన్న ‘సాక్షి’కి బాధితులు ఆ ఆస్తికి సంబంధించిన అన్ని వివరాలు అందజేశారు. ఈ విషయాన్ని సీఐడీ ఉన్నతాధికారులకు తెలపగా అప్పుడు రంగంలోకి దిగారు. నెల రోజుల క్రితం ఆ స్థలంలో ఉన్న భవ నం కూల్చేసి బోర్ వేసినట్టు బాధితులు గుర్తించా రు. ఆ ఫొటోలను సీఐడీకి పంపగా కొత్తగా వచ్చిన దర్యాప్తు అధికారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి సంబంధిత స్థలం సీఐడీ జప్తులో ఉందని, కబ్జాకు యత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందంటూ ఎట్టకేలకు బోర్డు ఏర్పాటు చేశారు. జప్తు చేసిన వాటిని కాపాడాలి.. అగ్రిగోల్డ్కు చెందిన బినామీ ఆస్తులను ఎలాగూ గుర్తించని సీఐడీ అధికారులు, కనీసం జప్తులో ఉన్న ఆస్తులనైనా కాపాడాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కష్టపడి సంపాధించిన సొమ్మును అగ్రిగోల్డ్లో పెట్టి మోసపోయామని... ఇప్పటికైనా సీఐడీ అధికారులు జప్తు చేసిన ఆస్తుల పరిస్థితి ఏమిటి? అవి భద్రంగా ఉన్నాయా లేకా అన్యాక్రాంతమయ్యాయా అనే అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. మరోవైపు ఈ విషయంలో స్థానిక పోలీసుల నుంచి లేఖలు వచ్చినా అవి దర్యాప్తు అధికారి వరకు రాకపోవడంపై ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం అటాచ్ చేసిన ఆస్తుల పరిస్థితిపై దృష్టి పెట్టకపోవడంపై గత దర్యాప్తు అధికారి నిర్లక్ష్యం ఉన్నట్లు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ అధికారిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
‘అగ్రిగోల్డ్’లో కొత్త ట్విస్ట్లు
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసు పునర్విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అగ్రిగోల్డ్కు బినామీ కంపెనీలుగా ఉన్న నాలుగు కంపెనీలను గుర్తించడంలో విఫలమైన గత దర్యాప్తు అధికారులు... వాటిని అమ్మిన, కొన్న వ్యక్తుల విచారణలోనూ విఫలమైనట్లు సీఐడీ ఉన్నతాధికారులు తాజాగా గుర్తించారు. 76 ఎకరాలకు సంబంధించి జరిగిన లావాదేవీల్లో కొనుగోలు చేసిన వ్యక్తిని బినామీగా ఆరోపించిన గత అధికారులు... మరి నాలుగు కంపెనీల్లో డైరెక్టర్గా లేదా కనీసం ఉద్యోగిగా కూడా లేని వ్యక్తి విక్రయాలు సాగించడంపై ఎందుకు దృష్టి సారించలేదన్నది ఇప్పుడు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 2016లో 76 ఎకరాల భూమి అమ్మకం జరగ్గా కొనుగోలు చేసిన వ్యక్తిని బినామీగా గత దర్యాప్తు అధికారులు అనుమానిస్తూ 2020లో పలు విభాగాలకు లేఖలు రాశారు. బినామీ కంపెనీల నుంచి భూములు కొన్న వ్యక్తి హైకోర్టు ఆదేశాల ప్రకారం మహబూబ్నగర్లోని మిడ్జిల్లో 150 ఎకరాల అగ్రిగోల్డ్ భూమిని 2018లో వేలంపాటలో దక్కించుకున్నాడు. అప్పుడు వేలంపాట కమిటీలో ఉన్న సీఐడీ దర్యాప్తు అధికారి ఎందుకు అభ్యంతరం చెప్పలేదన్నది ఇప్పుడు సీఐడీ ఉన్నతాధికారులకు అంతుచిక్కకుండా ఉంది. ఇది నిర్లక్ష్యమా లేకా మరేదైనా వ్యవహారమా అన్నది తేల్చే పనిలో ఉన్నతాధికారులున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే దర్యాప్తు అధికారిని మార్చి ప్రస్తుతం అంతర్గత విచారణ చేస్తున్నట్లు సమాచారం. అగ్రిగోల్డ్ బినామీ కంపెనీల పేరిట ఉన్న 76 ఎకరాల భూమిని గుర్తించలేని దర్యాప్తు అధికారులు 2020లో అకస్మాత్తుగా ఎలా గుర్తించారు? గుర్తించినా అర్హతలేని వ్యక్తి అమ్మకం సాగించినా కేసు ఎందుకు పెట్టలేదు? కొనుగోలు చేసిన వ్యక్తికి అవి అగ్రిగోల్డ్ భూములు కాదని ఎలా తెలుస్తుంది? బినామీ కంపెనీలను ఎందుకు కేసులోకి లాగలేకపోయారు వంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే పనిలో ఉన్నారు. -
అగ్రిగోల్డ్ నయా ‘భూ’గోతం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అగ్రిగోల్డ్ కంపెనీకి అనుబంధ కంపెనీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగు సంస్థలకు చెందిన 76 ఎకరాల అమ్మకం వెలుగులోకి రావడం పెనుదుమారం రేపుతోంది. దీనిపై ఇన్నాళ్లూ దర్యాప్తు చేసిన అధికారులు కళ్లు మూసుకున్నట్లు వ్యవహరించిన తీరే కారణమా అనే అనుమానాలు బలపడుతున్నాయి. బినామీ కంపెనీలుగా ఉన్న కంపెనీలకు చెందిన ఎకరాల కొద్దీ భూమిని ఓ మామూలు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అమ్మకం చేయగా మాజీ కానిస్టేబుల్ కొనుగోలు చేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతున్నట్లు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ చైర్మన్ను విచారించిన సీఐడీ.. అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావును శుక్రవారం సీఐడీ అధికారులు విచారించారు. ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లా, ఫరూక్నగర్ మండలంలో ఉన్న అగ్రిగోల్డ్ బినామీ కంపెనీలుగా సీఐడీ భావిస్తున్న మోహనా గ్రోవిస్ ఇన్ఫ్రా, లియోరా ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మాతంగి ఇన్ఫ్రా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఖిలేంద్ర ఇన్ఫ్రా ఆగ్రో వెంచర్స్ లిమిటెడ్కు చెందిన 76 ఎకరాల భూమి విక్రయ వ్యవహారంపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కంపెనీల పేరిట ఉన్న భూములను రాందాస్ అనే వ్యక్తి ఏ అధికారంతో విక్రయించారో చెప్పాలని ప్రశ్నించినట్లు సమాచారం. సంబంధిత కంపెనీల డైరెక్టర్లు రాందాస్కు అధికారం ఇచ్చి ఉంటారా అనే విషయం తెలియదని అగ్రిగోల్డ్ చైర్మన్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అగ్రిగోల్డ్ ప్రధాన కంపెనీల నుంచి బినామీ కంపెనీల్లోకి జరిగిన లావాదేవీల పూర్తి వివరాలు అందించాలని కోరగా ఇప్పటికే పలు రాష్ట్రాల అధికారులు డాక్యుమెంట్లు సీజ్ చేశారని ఆయన సమాధానమిచ్చినట్లు తెలియవచ్చింది. అటాచ్ ప్రాపర్టీ విక్రయం ఎలా? అగ్రిగోల్డ్కు చెందిన 80 కంపెనీలతోపాటు బినామీ కంపెనీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 70 కంపెనీలకు చెందిన ఆస్తులను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగాలు అటాచ్ చేస్తూ గతంలోనే ఉత్తర్వులిచ్చాయి. అయితే మహబూబ్నగర్కు చెందిన ఆస్తులు తెలంగాణ పోలీస్ శాఖ ఆటాచ్ చేసిన జాబితాలో లేవు. ఈ వ్యవహారంపై రామారావును సీఐడీ అధికారులు ప్రశ్నించగా గతంలోనే ఆంధ్రప్రదేశ్ సీఐడీ ఈ ఆస్తులను అటాచ్ చేసి ఉంటుందని, వాటిని ఎలా విక్రయించారో తనకు తెలియదని, 2016లో ఈ రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు తాను జైల్లో ఉన్నట్లు రామారావు బదులిచ్చినట్లు సమాచారం. హైకోర్టులో అఫిడవిట్.. ఈ భూముల్లో కొంత భాగాన్ని మాజీ కానిస్టేబుల్ కొనుగోలు చేయడంపై గతంలో ఈ కేసు దర్యాప్తు చేసిన అధికారి హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించినట్లు తెలిసింది. మాజీ కానిస్టేబుల్ అగ్రిగోల్డ్కు బినామీగా వ్యవహ రించినట్లు ఆ అధికారి కోర్టు తెలిపారని తెలిసింది. అయితే దర్యాప్తు సమయంలో ఈ బినామీ కంపెనీలకు చెందిన ఆస్తులను గుర్తించడంతోపాటు విక్రయాలు జరిగాయా లేదా అనే అంశాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారన్న విషయంపై ఇప్పుడు సీఐడీలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఆ దర్యాప్తు అధికారిని సీఐడీ వెంటనే పక్కనపెట్టి మరో అధికారికి బాధ్యతలు అప్పగించడంతో ఈ భూముల వ్యవహారంపై విచారణ లోతుగా కొనగసాగుతున్నట్లు తెలుస్తోంది. -
రైతులకు ఎస్బీఐ తీపికబురు.. తక్కువ వడ్డీకే రుణాలు!
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రైతులకు తీపికబురు అందించింది. రైతులకు తక్కువ వడ్డీకే అగ్రి గోల్డ్ రుణాలను అందిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఆసక్తి గల వ్యక్తులు ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణాన్ని పొందవచ్చు. ఈ వియాన్ని ఎస్బీఐ ట్విట్టర్లో వెల్లడించింది. ఎస్బీఐ అగ్రి గోల్డ్ రుణాల పేరుతో రైతులకు రుణాలను అందిస్తుంది. ఈ రుణాలపై వడ్డీ 7 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. యోనో యాప్ ద్వారా అప్లై చేసే రుణాలు వేగంగా మంజూరవుతాయి. రీపేమెంట్ ఆప్షన్ కూడా రైతులు తమకు కావాల్సినట్టుగా ఎంచుకోవచ్చు. ఈ ఎస్బీఐ అగ్రి గోల్డ్ రుణం మాత్రం కేవలం బంగారు నగలపై మాత్రమే లభిస్తుంది. 24 క్యారట్, 22 క్యారట్, 20 క్యారట్, 18 క్యారట్ స్వచ్ఛత గల నగలు, ఆభరణాలపై రుణాలు తీసుకోవచ్చు. 50 గ్రాముల వరకు బ్యాంక్ గోల్డ్ కాయిన్స్ పైనా రుణాలు లభిస్తాయి. గోల్డ్ బార్స్ పై ఈ రుణాలు వర్తించవు. కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా ఎస్బీఐ అగ్రి గోల్డ్ రుణాలు తీసుకోవచ్చు. డెయిరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, పిగ్గరీ, గొర్రెల పెంపకం లాంటి వాటికీ ఈ రుణాలు వర్తిస్తాయి. యంత్రాల కొనుగోలు, వ్యవసాయం, హార్టీకల్చర్, ట్రాన్స్పోర్టేషన్ లాంటి అవసరాలకు ఈ రుణాలను ఉపయోగించుకోవచ్చు. Avail SBI's Agri gold loan at lowest interest rate through YONO. #SBIAgriGoldLoan #SBI #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/jawDwSzWsH — State Bank of India (@TheOfficialSBI) December 21, 2021 (చదవండి: పన్ను చెల్లింపుదారులకు గుడ్న్యూస్.. రూ.1.44 లక్షల కోట్లు రీఫండ్..!) -
ఏపీ తరహాలో డిపాజిటర్లను ఆదుకుంటారా?
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ డిపాజిటర్లను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం రూ.900 కోట్లు అందించిన తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా వారిని ఆదుకునే అవకాశం ఉందా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖర్రెడ్డి, జస్టిస్ వినోద్కుమార్లతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాను పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చిన రూ.26 లక్షలను అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేశానని, వృద్ధాప్యం లో ఉన్న తనకు ఆ డబ్బు ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన రవికాంత్ సిన్హా దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం విచారించింది. సంస్థ సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడంతో కేన్సర్ బారినపడిన తన భార్యకు చికిత్స అందించలేకపోయానని సిన్హా పేర్కొన్నారు. ఆయన తరఫున న్యాయవాది శ్రవణ్కుమార్ వాదనలు విని పిస్తూ, వృద్ధాప్యంలో ఉన్న సిన్హాకు పూటగడవడం కష్టంగా ఉందని, అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బు హైకోర్టు రిజిస్ట్రార్ అధీనంలో ఉందని, ఆ డబ్బు నుంచి కొంత మొత్తాన్ని సిన్హాకు ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. డిపాజిటర్లను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముం దుకు వచ్చిందని, ఇప్పటి వరకు రూ.900కోట్లు బడ్జెట్లో కేటాయించి డిపాజిటర్లకు పంచిందని తెలిపారు. ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉందని, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డిపాజిటర్లకు న్యాయం చేయాలని కోరారు. కాగా, అగ్రిగోల్డ్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశామని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయ వాది తెలిపారు. అయితే పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణకు చెందిన అగ్రిగోల్డ్ బాధితుల సంఘమని, ఈ పిటిషన్ను బదిలీ చేయరాదని శ్రవణ్కుమార్ కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. అగ్రిగోల్డ్ కుంభకోణంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంతో కలిపి ఈ పిటిషన్ను దసరా సెలవుల తర్వాత విచారిస్తామని స్పష్టం చేసింది. అప్పటిలోగా తెలంగాణకు చెందిన అగ్రిగోల్డ్ డిపాజిటర్లను ఆదుకునే ఉద్దేశం ఉందా అన్నది తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
లేని భూమిని అమ్మేశారు.. అసలు భూమిని కొట్టేశారు
కోడుమూరు: అగ్రి గోల్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ నాయకులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలతో ఆ సంస్థకు కొంత భూమిని అమ్మారు. అమ్మిన భూమికి కూడా తిరిగి తమ కుటుంబ సభ్యుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ తంతు వెనుక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రధాన అనుచరుడు దామోదర్ నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు కీలక పాత్ర పోషించారు. సీఐడీ అధికారుల విచారణలో ఈ విషయం వెలుగు చూసింది. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం గ్రామంలో సర్వే నంబర్ 113లో ఉన్న 8.24 ఎకరాల భూమిని దామోదర్ నాయుడు సోదరులు వెంకటయ్య, నారాయణ గతంలో అగ్రి గోల్డ్ సంస్థకు విక్రయించారు. ఇది సాగులో ఉన్న భూమి కావడంతో రెవెన్యూ అధికారులతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని దామోదర్ నాయుడు భార్య వరలక్ష్మి, వెంకటయ్య భార్య రంగమ్మకు తిరిగి బదలాయించుకున్నారు. అలాగే సర్వే నంబర్ 146/1 రెవెన్యూ రికార్డుల్లో లేకున్నా.. నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకం సృష్టించి 6.95 ఎకరాల భూమిని దామోదర్ నాయుడు అగ్రి గోల్డ్ సంస్థకు విక్రయించారు. 149బీ, 80/1, 40/2, 40, 33/7, 25/9, 84ఏ సర్వే నంబర్లలో దామోదర్ నాయుడు సమీప బంధువులు రామాంజనేయులు, శ్రీనివాసులు, నారాయణ, నాగేశ్వరరావు, లక్ష్మమ్మ, పుల్లయ్య, పార్వతమ్మలకు భూములు లేకపోయినా నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాల ద్వారా 21.4 ఎకరాలను అగ్రి గోల్డ్ సంస్థకు అమ్మారు. బయటపడుతున్న అక్రమాలు అగ్రి గోల్డ్ కొనుగోలు చేసిన భూముల్లో భారీ ఎత్తున అక్రమాలు బయటపడుతున్నాయి. రెవెన్యూ రికార్డులు తారుమారు కావడంతో వాటి మూలాలను వెలికి తీసేందుకు సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డుల్ని పరిశీలించి అవకతవకలను గుర్తించారు. 40/2 సర్వే నంబర్లో రెవెన్యూ రికార్డుల ప్రకారం పూర్తి విస్తీర్ణం 2.72 ఎకరాలుండగా.. 10.61 ఎకరాలున్నట్టు రిజిస్ట్రేషన్ చేయించారు. ఇలా రెవెన్యూ రికార్డుల్లో లేని సర్వే నంబర్లను సృష్టించి నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలతో రిజిస్ట్రేషన్ చేయించి భూములు అమ్మినట్టు సీఐడీ అధికారుల విచారణలో బయటపడింది. వారం పది రోజుల్లో పూర్తి నివేదికను సీఐడీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు సమాచారం. రికార్డులు తారుమారు రెవెన్యూ అధికారులతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని దామోదర్ నాయుడు కుటుంబ సభ్యులు రికార్డులను తారుమారు చేశారు. ప్రస్తుతం కృష్ణగిరి గ్రామ సర్పంచ్ వరలక్ష్మి (దామోదర్ నాయుడు భార్య) పేరిట సర్వే నంబర్ 113లో గల 4.12 ఎకరాల భూమిని గతంలోనే దామోదర్ నాయుడు అగ్రి గోల్డ్కు విక్రయించారు. అలాగే సర్వే నంబర్ 95లో రామాంజనేయులు, శ్రీనివాసులు, నారాయణ, వెంకటలక్ష్మికి ఉన్న 4.57 ఎకరాల భూమిని అగ్రి గోల్డ్కు అమ్మారు. అదే భూమిని వారి కుటుంబ సభ్యులు హరిబాబు, జయరాముడు, వెంకటయ్య పేర్ల మీద బదలాయించుకున్నారు. సర్వే నంబర్లు 123/1ఏ, 123/2ఏ, 123/3ఏ, 141/1, 121/2సీ, 121/1బీ, 113, 93, 92/ఏ2, 76, 68/ఏ, 64/2, 64/ఏ, 54/2, 48/5, 5/4,5,7, 144/1,2, 145/ఏ, 2సీ, 133/2, 3, 149/బీ1, 146/1బీ, 95లలో ఉన్న 126.56 ఎకరాల భూమిని గతంలో అగ్రి గోల్డ్కు అమ్మారు. మా దృష్టికి రాలేదు అగ్రి గోల్డ్ సంస్థ కొనుగోలు చేసిన భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులు తారుమారైనట్టు మా దృష్టికి రాలేదు. ఏడాది క్రితమే నేను కృష్ణగిరి తహసీల్దార్గా బాధ్యతలు తీసుకున్నాను. రికార్డుల మార్పులు, చేర్పులపై సీఐడీ అధికారులు పరిశీలన చేస్తున్నారు. – రామచంద్రారావు, తహసీల్దార్, కృష్ణగిరి -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం
సాక్షి, అమరావతి: అమాయక ప్రజలను అగ్రిగోల్డ్ సంస్థ మోసం చేస్తే, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు అండగా నిలిచి ఆదుకున్నారని అగ్రిగోల్డ్ బాధితులు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని 13 జిల్లాల అగ్రిగోల్డ్ బాధితులు ఆదివారం ‘థ్యాంక్యూ సీఎం సార్’ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అగ్రిగోల్డ్ బాధితులు, సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి ప్రభుత్వం తరఫున రూ.905 కోట్ల మేర సహాయం అందించిన సీఎం.. చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. అగ్రిగోల్డ్ సంస్థ ద్వారా దేశంలో దాదాపు 8 రాష్ట్రాల్లో లక్షలాది మంది నష్టపోయారన్నారు. ఆరేళ్ల క్రితం సంస్థను మూసి వేయడంతో డబ్బు కోసం రోడ్డెక్కి ఆందోళనలు, నిరాహార దీక్షలు, రాస్తారోకోలు చేశామన్నారు. సంస్థ ఆస్తులు విక్రయించడం ద్వారా బాధితులకు న్యాయం చేయవచ్చని గత ప్రభుత్వ హయాంలో కింది స్థాయి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వరకూ ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు అందించినా పట్టించుకోలేదని చెప్పారు. పోలీసులతో లాఠీచార్జ్లు చేయించి, కేసులు పెట్టి, జైళ్ల పాలు చేశారని వాపోయారు. ఆ సమయంలో పాదయాత్రలో వైఎస్ జగన్ను కలిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో పాటు, అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన 10.40 లక్షల మందికి రూ.905 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు. ప్రస్తుతం న్యాయ, సాంకేతిక సమస్యల వల్ల కొంత మంది బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి వినతిపత్రం అందచేశారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘ నాయకులు రత్నాచారి, మోజెస్, జడ్ సన్, రాము, నవరత్నాల ప్రోగ్రామ్ వైస్ చైర్మన్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతల సహకారం.. అగ్రిగోల్డ్ భూములు హాంఫట్!
సాక్షి,కర్నూలు : అగ్రిగోల్డ్ కొనుగోలు చేసిన భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఆ సర్వే నంబర్లకు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వకూడదు. అయితే జిల్లాలో పలుచోట్ల ఇందుకు విరుద్ధంగా జరిగింది. అగ్రిగోల్డ్ సంస్థ కొనుగోలు చేసిన భూములు వేరొకరి పేరున రిజిస్ట్రేషన్అయ్యాయి. కొందరికి పాసు పుస్తకాలు కూడా వచ్చాయి. సంస్థ 450 ఎకరాల భూమిని కొనుగోలు చేయగా..క్షేత్రస్థాయిలో 100 ఎకరాలు కూడా లేదని సీఐడీ అధికారుల విచారణలో బయటపడినట్లు సమాచారం. ఇవీ అక్రమాలు.. కృష్ణగిరిలో సర్వే నంబర్ 65లో ఉన్న 3.25 ఎకరాల భూమిని బోయ లక్ష్మన్న, సర్వే 63లో 5.07 ఎకరాలను కట్టెల రంగారెడ్డి.. అగ్రిగోల్డ్ సంస్థకు విక్రయించారు. అయితే సదరు సర్వే నంబర్లలోని 8.32 ఎకరాల భూమికి కొత్త రాధమోహన్కు 2019 జూలైలో అప్పటి తహసీల్దార్ పట్టాదారు పాసుపుస్తకాన్ని మంజూరు చేశారు. ► అగ్రిగోల్డ్కు చెందిన 83/బీ, 84/సీ, 93, 82/3, 81/1, సర్వే నంబర్లలోని 30ఎకరాల భూమిని కోడుమూరు సబ్రిజిస్టార్ అధికారులు అబ్దుల్ రహిమాన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకం సైతం మంజూరు చేశారు. ►రామకృష్ణాపురంలో టీడీపీ నాయకుడు దామోదర్నాయుడు 113, 146/1 సర్వే నంబర్లలో 13 .19 ఎకరాల భూమిని అగ్రిగోల్డ్ సంస్థకు అమ్మాడు. సర్వే నంబర్ 146/1 రెవెన్యూ రికార్డులలో లేదు. అయినప్పటికీ 5.95 ఎకరాలు ఉన్నట్లు చూపి సంస్థను మోసం చేశాడు. టీడీపీ నేతల సహకారంతో రికార్డులు తారుమారు చేయించాడు. ► కృష్ణగిరి గ్రామంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం కొనుగోలు చేసిన భూములకు సంబంధించి 4/ఏ, 5, 41, 42, 43, 45, 48, 49, 54, 57/బీ, 59/సీ, 64, 113, 146/1, 141 తదితర సర్వే నంబర్లు రెవెన్యూ రికార్డుల్లో లేవు. రెవెన్యూ అధికారులు నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడంతో 102.69 ఎకరాల భూమిని అగ్రిగోల్డ్ సంస్థ కొనుగోలు చేసింది. ► కోడూరు నరసింహారావు, కోడూరు నరసయ్య, కోడూరు శశికళలకు కృష్ణగిరి గ్రామంలో 27.24 ఎకరాల భూమి ఉంది. ఈ భూములకు వేరొకరి పేరు మీద రెవెన్యూ అధికారులు పాసుపుస్తకాలు ఇచ్చారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆ భూములను కొనుగోలు చేసింది. దీంతో పట్టాదారులైన రైతులు ఆందోళన చెందుతున్నారు. -
పెదకాకానిలో అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఐడీ విచారణ
పెదకాకాని : పెదకాకాని మండలంలోని అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఐడీ పోలీసులు విచారణ చేపట్టారు. నంబూరు గ్రామ శివార్లలో అగ్రిగోల్డ్ ప్రతినిధులు 2010లో భూములు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సీఐడీ డీఎస్పీ రామారావు సిబ్బందితో శనివారం పెదకాకాని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అగ్రిగోల్డ్ ప్రతినిధులు నంబూరులో సర్వే నంబర్ 175బీలో 2.10 ఎకరాలు, 178లో ఎకరం చొప్పున మొత్తం 3.10 ఎకరాలను కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఆ భూమిలో 1.60 ఎకరాలను 2014లో వెర్టెక్స్ వెంచర్ నిర్వాహకులు కొనుగోలు చేశారని, అలానే 1.50 ఎకరాలను బొంతు శ్రీనివాసరెడ్డికి అమ్మి రిజిస్ట్రేషన్ కూడా చేశారని గుర్తించారు. అగ్రిగోల్డ్ సంస్థ ఖాతాదారులకు డిపాజిట్లు చెల్లించకుండా వివాదాల్లో ఉన్నప్పుడు కొనుగోళ్లు, అమ్మకాలు ఎలా చెల్లుతాయన్న అంశంపై చర్చించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఖాతాదారులకు డిపాజిట్లు చెల్లించకుండా మోసం చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులు గుర్తించి బహిరంగ వేలం వేస్తామని సీఐడీ డీఎస్పీ రామారావు చెప్పారు. -
సీఎం జగన్ చేసిన మేలు ఎప్పటికీ మరువలేం: అగ్రిగోల్డ్ బాధితులు
-
అచ్చెన్నకు మతి తప్పింది
సాక్షి,అమరావతి: టీడీపీలో ఇంత వరకు చంద్రబాబు, లోకేశ్కే పూర్తిగా మతి చెడిందని అనుకున్నామని, అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బు చెల్లించడంపై అచ్చెన్నాయుడు చేసిన విమర్శలు చూస్తే అచ్చెన్నకు కూడా పూర్తిగా మతి తప్పిందని అనిపిస్తుందని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కో–ఆర్డినేటర్ లేళ్ళ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ బాధితులకు నగదు చెల్లింపుపై కొన్ని పత్రికలు, కొంతమంది స్వార్థరాజకీయ నాయకులు కువిమర్శలు చేయడంపై అప్పిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అగ్రిగోల్డ్లో రూ.20 వేలు లోపు పొదుపు చేసిన వారికి ప్రభుత్వమే ముందుగా చెల్లించి.. ఆ తర్వాత అగ్రిగోల్డ్ ఆస్తులమ్మి తీసుకోవాలని ప్రతిపక్ష నేతగా సీఎం జగన్.. ఆనాడే అసెంబ్లీ సాక్షిగా అప్పటి టీడీపీ ప్రభుత్వానికి సూచించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. కానీ ఆర్బీఐ ఒప్పుకోదన్న కుంటిసాకుతో బాధితుల బలవన్మరణాలకు, వారి కుటుంబాలు రోడ్డున పడడానికీ కారకుడైన చంద్రబాబుకు నేడు అగ్రిగోల్డ్ అన్న పదాన్ని ఉచ్ఛరించడానికి కూడా అర్హత లేదని మండిపడ్డారు. -
మాట నిలబెట్టుకున్నాం: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అగ్రి గోల్డ్లో డిపాజిట్ చేసి మోసపోయిన లక్షలాది మంది కష్టజీవులను ఆదుకోవాల్సిన గత ప్రభుత్వం మోసం చేస్తే, ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మనందరి ప్రభుత్వం న్యాయం చేసిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆ సంస్థలో డిపాజిట్ చేసిన వారందరూ కష్టజీవులని, వారికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అండగా నిలిచామని చెప్పారు. అగ్రి గోల్డ్ వ్యవహారం కోర్టుల్లో కొలిక్కి రాగానే ఆస్తులు అమ్మి, మిగతా బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ప్రైవేట్ కంపెనీ మోసం చేస్తే ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని కష్టజీవులకు న్యాయం చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి అని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని పాదయాత్రలో మాటిచ్చానని, అదే విషయాన్ని మేనిఫేస్టోలో కూడా పెట్టామని.. ఆ మేరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని డిపాజిట్ దారులకు న్యాయం చేశామన్నారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి బాధితుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశారు. గతంలో మిగిలిపోయిన రూ.10 వేల లోపు డిపాజిట్ దారులు మరో 3.86 లక్షల మందికి రూ.207.61 కోట్లు, రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్దారులైన 3.14 లక్షల మందికి రూ.459.23 కోట్లను చెల్లించారు. హైకోర్టు నిర్దేశించిన విధంగా మొత్తం 7 లక్షల పైచిలుకు అర్హులైన అగ్రిగోల్డ్ బాధితులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించి, సీఐడీ ద్వారా నిర్ధారించి.. రూ.666.84 కోట్లను వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని అగ్రిగోల్డ్ బాధితులనుద్దేశించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. వీడియో కాన్ఫరెన్స్లో అగ్రిగోల్డ్ బాధితులతో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ 10.40 లక్షల మందికి రూ.905.57 కోట్లు ► ఈరోజు దేవుడి దయతో దాదాపు 7 లక్షల పైచిలుకు డిపాజిటర్లకు రూ.666.84 కోట్లు నేరుగా వారి అకౌంట్లలో జమ చేస్తున్నాం. మొత్తంగా అగ్రిగోల్డ్ బాధితులకు మొదటి విడత, ఇవాళ ఇస్తున్న రెండో విడత అన్నీ కలుపుకుంటే 10.40 లక్షల మందికి రూ.905.57 కోట్లకుపైనే మన ప్రభుత్వం ఇచ్చింది. ► గత ప్రభుత్వం 2015లోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి మోసం చేసింది. మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, మేనిఫెస్టోలో చెప్పిన మేరకు అడుగులు ముందుకు వేసి బాధితులకు న్యాయం చేశాం. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన కుటుంబాలు అన్నింటికీ ఆ మొత్తం తిరిగి ఇచ్చేసే కార్యక్రమాన్ని ఈరోజుతో పూర్తి చేస్తున్నాం. ఇలా దేశంలో ఎక్కడా జరగలేదు. గత ప్రభుత్వ మనుషుల కోసం జరిగిన స్కాం ► అగ్రిగోల్డ్ స్కాం అన్నది గత ప్రభుత్వం చేత, గత ప్రభుత్వం వల్ల, గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసం జరిగిన స్కాం అని తేలింది. గత ప్రభుత్వంలో ఉన్న వారే అగ్రిగోల్డ్ ఆస్తులను ఏవిధంగా కొట్టేయాలనుకున్నారో సాక్ష్యాధారాలు చూపిస్తూ గతంలో అసెంబ్లీలో చెప్పాం. ► అగ్రి గోల్డ్ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ గత ప్రభుత్వంలోని పెద్దలే. ఆ పెద్దలు ఎంత సేపూ అగ్రి గోల్డ్ ఆస్తులను ఎలా కొట్టేయాలనే ఆలోచించారు. ఈ మల్టీ స్టేట్ స్కాం అనేక రాష్ట్రాల్లో కోర్టుల పరిధిలో విచారణలో ఉంది. కాబట్టి, దీని వల్ల మన రాష్ట్రంలో ఎవరు.. ఎంత నష్టపోయారు? అన్నదాని మీదే ధ్యాస పెట్టాం. రూపాయి కూడా చెల్లించని గత ప్రభుత్వం ► గత ప్రభుత్వం అరకొర లెక్కల ద్వారా రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన బాధితుల సంఖ్యను 8.79 లక్షల మందిగా తేల్చింది. వీరికి రూ.785 కోట్లుగా చెల్లించాలని చెప్పింది. ప్రజలను మోసం చేస్తూ ఎన్నికలకు 2 నెలల ముందు.. 2019 ఫిబ్రవరి 7న జీవో నంబరు 31 జారీ చేసింది. కానీ రూపాయి కూడా చెల్లించలేదు. ► రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ద్వారా అగ్రిగోల్డ్ వ్యవహారం కోర్టుల్లో ఒక కొలిక్కి రాగానే వారి భూముల్ని, ఆస్తులను అమ్మించి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును తీసుకుని, మిగిలిన డబ్బును డిపాజిట్ దారులకు చెల్లించే దిశగా న్యాయపరంగా వేగంగా అడుగులు వేస్తాం. ► మీ అందరి ఆశీస్సులు, దేవుడి దయ వల్ల మీ సోదరుడు ఈ పని చేయగలుగుతున్నాడు. మీ ఆశీస్సులు మనందరి ప్రభుత్వం మీద కలకాలం ఉండాలని కోరుకుంటున్నా. ► ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పాముల పుష్పశ్రీవాణి, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ అండ్ బి మంత్రి ఎం శంకరనారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, సీఐడీ అడిషనల్ డీజీపీ పీ వీ సునీల్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖ వన్టౌన్లో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులు అది శ్రమ జీవుల కష్టార్జితం ► రూపాయి.. రూపాయి దాచుకుని, కొద్దిగా ఎక్కువ వడ్డీ వస్తుందనే ఆశతో డిపాజిట్ చేసిన కష్టజీవుల సొమ్మే అగ్రిగోల్డ్ డబ్బు. ఇక్కడ డిపాజిట్ చేసింది లక్షలాది మంది కూలి పనులు చేసుకుంటున్న వారు, చిన్న చిన్న వృత్తుల వారు, తోపుడు బళ్లు, రిక్షా కార్మికులు. ఇలాంటి కష్టజీవులందరినీ కూడా గత ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పి మోసం చేసి, గాలికి వదిలేసింది. ► అలాంటి వారిని ఆదుకోవాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా నిలదీశాం. వారికి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తూ అధికారంలోకి రాగానే 2019 నవంబర్లో రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన 3.40 లక్షల మందికి కోర్టు ఆమోదించిన జాబితా మేరకు అప్పట్లో రూ.238.73 కోట్లు చెల్లించాం. ► ఆ సమయంలో అర్హత ఉండి కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) జాబితాలో మిగిలిపోయిన మరో 3,86,275 మంది రూ.10 వేలు లోపు డిపాజిట్దారులకు ఇవాళ రూ.207.61 కోట్లు చెల్లింపులు చేస్తున్నాం. దీంతో పాటు రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్దారులు దాదాపు 3.14 లక్షల మందికి రూ.459.23 కోట్లు ఇస్తున్నాం. మొత్తంగా 10.40 లక్షల మందికి రూ.905.57 కోట్లు ఇచ్చాం. రాఖీ పండగ బహుమానం అన్నా.. నేను అగ్రి గోల్డ్లో నెలకు రూ.500 చొప్పున రూ.11,500 జమ చేశాను. కంపెనీ మూత పడటంతో చాలా బాధపడ్డాను. చంద్రబాబుకు చాలాసార్లు ఫిర్యాదు చేశాం. రోడ్లెక్కి ధర్నాలు చేశాం. కానీ సాయం చేయలేదు. మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు మా సమస్య చెప్పుకున్నాం. మీరు సీఎంగా అవగానే వలంటీర్ మా ఇంటికి వచ్చి అన్ని వివరాలు తీసుకున్నారు. ఇప్పుడు రెండో విడతలో మా డబ్బు మాకు అందింది. ఈ రాఖీ పండగకు మీరు మాకు ఇచ్చిన కానుకిది. –విశాలాక్షి, కర్నూలు -
మాట నిలబెట్టుకున్నాం
-
పలు జిల్లాల్లో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
-
అగ్రిగోల్డ్లో ఉన్న డబ్బంతా కష్ట జీవులదే..: సీఎం జగన్
-
‘మేము మోసపోతే.. ప్రభుత్వం ఆదుకోవడం చరిత్ర’
సాక్షి, తాడేపల్లి: అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం రెండో విడత డబ్బులు విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా నుంచి చంద్రశేఖర్ రావు అనే వాచ్మెకానిక్ మాట్లాడుతూ.. ‘‘ఐదు సంవత్సరాల పాటు అగ్రిగోల్డ్ కంపెనీలో రోజుకు 40 రూపాయల చొప్పున 18,500 కట్టాను. 2016లో సంస్థను ఎత్తేశారని తెలిసి ఎంతో బాధపడ్డాను. ఎక్కడ తిరిగినా మాకు న్యాయం జరగలేదు. మీరు పాదయాత్రలో మాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. దానిలో భాగంగానే మొదటివిడతలో పదివేల రూపాయలలోపు బాధితులకు డబ్బులు ఇచ్చారు. రెండో విడతలో భాగంగా 20వేల రూపాయలోపు బాధితులమైన మాకు ఈ రోజు డబ్బులు ఇచ్చారు’’ అని తెలిపారు. ‘‘దీని గురించి వలంటీర్లు మా ఇంటికి వచ్చి.. వివరాలు తెలుసుకుని.. దగ్గరుండి అప్లికేషన్ నింపారు. ఆన్లైన్లో అప్లై చేశారు. ఈ నెల 24 న డబ్బులు వస్తాయని చెప్పారు. మమ్మల్ని ఆదుకున్నందుకు చాలా సంతోషం. ప్రైవేట్ కంపెనీలో డబ్బులు పెట్టి.. మోసపోతే.. ప్రభుత్వం ఆదుకోవడం నిజంగా చరిత్రే. పోయాయనుకున్న డబ్బులు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మీలాంటి సీఎం ఉన్నందుకు గర్వపడుతున్నాను’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. గుంటూరు నుంచి ఉషా రాణి మాట్లాడుతూ.. ‘‘నా భర్త డెలివరీ బాయ్గా పని చేసేవారు. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు పొదుపు చేయాలని భావించి.. అగ్రిగోల్డ్లో నెలనెల పొదుపు చేశాం. కానీ 2016లో కంపెనీని ఎత్తేశారని తెలిసి మా కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యిందని బాధపడ్డాం. మా డబ్బులు తిరిగి ఇప్పించాల్సిందిగా గత ప్రభుత్వాలను అభ్యర్థించాం. మీకోసం కార్యక్రమంలో అప్లికేషన్ పెట్టినా లాభం లేదు. ఏడాదిన్నర పాటు నేను ఒక్కదానే ఆఫీసుల చుట్టూ తిరిగాను. ఆ బాధలు వర్ణించలేను. పాదయాత్రలో మీరు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. దాని ప్రకారమే మొదటి విడతలో పది వేల రూపాలయలోపు బాధితులకు డబ్బులు ఇచ్చారు. దాంతో నాకు నమ్మకం కలిగింది’’ అన్నారు. ‘‘ఈరోజు రెండో విడతలో భాగంగా 20 వేల రూపాలయ లోపు లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేశారు. నేను 15 వేల రూపాయలు కట్టాను. నా కష్టార్జితం తిరిగి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇద్దరుపిల్లలు. వారికి అమ్మ ఒడి, విద్యా కానుకు ఇలా అన్ని పథకాలు అందుతున్నాయి. నాడు-నేడులో భాగంగా స్కూళ్ల రూపురేఖలు మార్చారు. ఇప్పుడవి గవర్నమెంట్ బడుల్లా లేవు.. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో ఉన్నాయి. వలంటీర్లు ఇంటి దగ్గరకే వచ్చి అన్ని ఇస్తుండటంతో ఎంతో మేలు జరగుతుంది. మా ఆయనకు తెలియకుండా పెట్టిన డబ్బులు పొగొట్టుకుని.. ఎంత బాధపడ్డానే నాకే తెలుసు. ఓ అన్నలా మీరు నాకు తోడుండి.. నా డబ్బులు నాకు తిరిగి ఇస్తున్నారు. మీరు తండ్రిని మించిన తనయుడిగా నిలిచారు’’ అంటూ కృతజ్ఞతలు తెలిపింది. కర్నూలు నుంచి చిరువ్యాపారం చేసుకునే విశాలాక్షి మాట్లాడుతూ.. ‘‘వాళ్లు, వీళ్లు చెప్పిన మాటలు విని అగ్రిగోల్డ్ సంస్థలో నెలకు ఐదు వందల రూపాయల చొప్పున 11,500 రూపాయలు దాచుకున్నాను. 2016లో అగ్రిగోల్డ్ సంస్థ ఎత్తేశారని తెలిసి చాలా బాధపడ్డాను. డబ్బులు తిరిగి వస్తాయా రావా అని ఆందోళన పడ్డాను. చంద్రబాబు ప్రభుత్వంలో దీని గురించి ఎన్ని అభ్యర్థనలు చేసినా ఫలితం లేదు. ఇక డబ్బులు రావని ఆశలు వదిలేసుకున్నాను. ఆ సమయంలో మీరు పాదయాత్రలో మా సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అప్పుడు అగ్రిగోల్డ్ సమస్య గురించి మీకు విన్నవించుకున్నాం’’ అన్నారు. ‘‘అధికారంలోకి వచ్చాకా మీరు వలంటీర్లను పంపి మా వివరాలను తెలుసుకుని.. మా డబ్బులు మాకు తిరగి ఇప్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీన్ని ఈ రాఖీ పండుగకు మీరు నాకు ఇచ్చిన కానుకగా భావిస్తున్నాను. డబ్బులు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మన ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి పథకం నాకు అందుతుంది. ఏ ప్రభుత్వం ప్రజల సమస్యల గురించి ఇంతలా ఆలోచించలేదు. మీరే ఎప్పటికి సీఎంగా ఉండాలి అని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ అండగా నిలిచారు: హోంమంత్రి సుచరిత
-
పేద ప్రజలు నష్టపోకుండా బాధ్యతగా తీసుకున్నాం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. దీనిలో భాగంగా 10లక్షల 45వేల కుటుంబాలకు రూ.905.57 కోట్లు చెల్లించినట్లు సీఎం జగన్ తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అగ్రిగోల్డ్ డిపాజిట్దారుల బ్యాంకు ఖాతాల్లో రెండో విడత పరిహారాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రెండో దశ కింద రూ.20వేల లోపు 7 లక్షల మంది డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ చేశామని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని, పేద ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసమే అగ్రిగోల్డ్ స్కామ్ జరిగిందని, గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కైందని సీఎం జగన్ అన్నారు. ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవని, 2019 నవంబర్లోనే 3.40 లక్షల మందికి రూ.238.73 కోట్లు చెల్లించామని సీఎం జగన్ తెలిపారు. రూ.20వేల లోపు డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్లు, 10లక్షల 45వేల కుటుంబాలకు రూ.905.57 కోట్లు జమ చేశామని సీఎం తెలిపారు. అగ్రిగోల్డ్ వ్యవహారం కొలిక్కి రాగానే మిగిలిన డిపాజిటర్లకు చెల్లింపులు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం కష్టజీవుల సొమ్మును కాజేసింది అగ్రిగోల్డ్ సంస్థను నమ్మి చిన్న వ్యాపారులు నష్టపోయారని, ఆ సంస్థలో ఉన్న డబ్బంతా కష్టజీవులదేనని సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వం కష్టజీవుల సొమ్మును కాజేసిందని తెలిపారు. అగ్రిగోల్డ్ స్కామ్కు కర్త, కర్మ, క్రియ గత ప్రభుత్వమేనని సీఎం తెలిపారు. గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసమే అగ్రిగోల్డ్ స్కామ్మని, బాధితులకు ఒక్క రూపాయి చెల్లించలేదని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు మోసం చేస్తూ వచ్చిందని సీఎం జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని, గతంలో 300 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ అండగా నిలిచారని తెలిపారు. రూ.20వేల లోపు డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ చేస్తున్నారని, ఇప్పటికే రూ.10వేలలోపు డిపాజిటర్లకు రూ.238.73 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో బాధితులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు మొదటి దశలో రూ.10 వేల లోపు డిపాజిట్దారులైన 3.40 లక్షల మందికి 2019లోనే రూ.238.73 కోట్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. దీంతో మొదటి, రెండో దశలో కలిపి మొత్తం 10.40 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం రూ.905.57 కోట్లు పంపిణీ చేసినట్లు అయింది. చదవండి: Andhra Pradesh: ఇళ్లకు సుముహూర్తం -
అగ్రి గోల్డ్ బాధితులకు రెండో విడత చెల్లింపులు
-
'అగ్రిగోల్డ్' అసలు దొంగ చంద్రబాబే
గుంటూరు రూరల్: అగ్రిగోల్డ్ సంస్థ విషయంలో అసలు దొంగ చంద్రబాబునాయుడేనని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. లక్షలాదిమంది ప్రజలకు అగ్రిగోల్డ్ శాపంగా మారటానికి ప్రధాన కారకుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని చెప్పారు. ఆయన హయాంలోనే అగ్రిగోల్డ్ కనీసం సెబీ అనుమతి లేకుండా ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. గుంటూరులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అగ్రిగోల్డ్తో లోపాయికారి ఒప్పందం చేసుకుని ప్రజలు, బాధితుల నెత్తిన శఠగోపం పెట్టారని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఆర్థిక నేరాల ద్వారా మోసపోయిన ప్రజలను ఆదుకున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని చెప్పారు. అగ్రిగోల్డ్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి రూ. వేల కోట్లు వసూలు చేశారని, 2014 డిసెంబర్లో బోర్డు తిప్పేశారని తెలిపారు. అప్పుడు చంద్రబాబు బాధితులకు న్యాయం చేస్తానని చెప్పి అగ్రిగోల్డ్ ఆస్తులపై కన్నేసి డిపాజిట్దారులను నట్టేట ముంచాడన్నారు. అగ్రిగోల్డ్తో కుమ్మక్కై విలువైన ఆస్తులను కాజేసి 2014 నుంచి 2019 వరకు బాధితులకు సొమ్ము చెల్లించకుండా తొక్కిపట్టి ప్రజలను మోసం చేశాడని చెప్పారు. 300 మంది ఏజెంట్లు ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రజల కష్టాలను గమనించిన జగనన్న వారికి చెప్పినట్లే ఇప్పటికే రూ.10 వేలలోపు డిపాజిట్దారులకు డబ్బు చెల్లించారని, ఇప్పుడు రూ.20 వేలలోపు డిపాజిట్దారులకు చెల్లిస్తున్నారని వివరించారు. గుంటూరు ఏటీ అగ్రహారంలో ఒక యువతిపై కానిస్టేబుల్ అత్యాచారం చేసినట్లు లోకేశ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. -
AgriGold: బాధితులకు బాసట
అమరావతి: ఓ ప్రైవేట్ కంపెనీ మోసం చేస్తే ప్రభుత్వం బాధ్యత వహించి బాధితులను ఆదుకోవడం అన్నది ఇంతవరకు ప్రపంచ చరిత్రలోనే లేదు. కానీ ప్రజా సంక్షేమంలో కొత్త చరిత్ర సృష్టిస్తూ అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ముందుకొచ్చారు. పాదయాత్రలో, పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ మాట నిలబెట్టుకుంటున్నారు. అగ్రిగోల్డ్ బాధిత డిపాజిట్దారులకు రెండో దశ నష్టపరిహారాన్ని సీఎం జగన్ మంగళవారం అందించనున్నారు. రెండో దశ కింద 7,00,370 మంది డిపాజిట్దారులకు మొత్తం రూ.666,85,47,256 వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. చదవండి: బాధితురాలికి అండగా ప్రభుత్వం తొలిదశలో రూ.238.73 కోట్లు పంపిణీ తమ కష్టార్జితాన్ని అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేసి మోసపోయిన డిపాజిట్దారులను ఆదుకుంటానని పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సీఎం అయిన తరువాత అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ఉపక్రమించారు. మొదటి దశలో రూ.10 వేల లోపు డిపాజిట్దారులైన 3.40 లక్షల మందికి 2019లోనే రూ.238.73 కోట్లను పంపిణీ చేశారు. అర్హులైనప్పటికీ ఏ కారణంతోనైనా సరే మొదటి దశలో పరిహారం పొందనివారికి మరో అవకాశం కల్పిస్తూ రెండో దశలో పంపిణీ చేయాలని నిర్ణయించారు. టీడీపీ సర్కారు నిర్వాకం ఇదీ... అగ్రిగోల్డ్ బాధితుల పట్ల టీడీపీ అధికారంలో ఉండగా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. అరకొర లెక్కల ద్వారా రూ.20 వేల వరకూ డిపాజిట్ చేసిన బాధితులు కేవలం 8.79 లక్షల మందే ఉన్నట్లు నిర్ధారించి వారికి రూ.785 కోట్లు చెల్లించాలని తేల్చింది. అయితే ఎవరికీ ఒక్క రూపాయి కూడా పరిహారం ఇచ్చి ఆదుకోలేదు. బాధితులైన వేల మంది కూలీలు, చిన్న వృత్తులవారు, తోపుడు బండ్లు, రిక్షా కార్మికులు తదితరులను గాలికి వదిలేసింది. రెండో దశలో రూ.666.85 కోట్లు పంపిణీ ఒక డిపాజిట్దారుడికి ఒకటికి మించి డిపాజిట్లు ఉన్నా ఒక డిపాజిట్కు మాత్రమే చెల్లింపులు జరపాలని హైకోర్టు ఆదేశించింది. ఆ విధంగానే ప్రభుత్వం గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా పారదర్శకంగా అగ్రిగోల్డ్ డిపాజిట్దారులను గుర్తించి సీఐడీ విభాగం ద్వారా నిర్ధారించింది. రూ.10 వేల లోపు డిపాజిట్ చేసి గతంలో వివిధ కారణాలతో నష్టపరిహారం పొందలేకపోయిన 3.86 లక్షల మందిని గుర్తించి వారు డిపాజిట్ చేసిన రూ.207,61,52,904 పంపిణీ చేయాలని నిర్ణయించింది.చదవండి: 'అగ్రిగోల్డ్' అసలు దొంగ చంద్రబాబే ఇక రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్దారులైన 3.14 లక్షల మందికి పైగా బాధితులకు రూ.459,23,94,352 పంపిణీ చేయనుంది. ఇలా మొత్తం 7,00,370 మంది డిపాజిట్దారులకు రూ.666,85,47,256 చెల్లించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం బటన్ నొక్కడం ద్వారా అగ్రిగోల్డ్ డిపాజిట్దారుల బ్యాంకు ఖాతాల్లో పరిహారాన్ని జమ చేస్తారు. దీంతో మొదటి, రెండో దశలో కలిపి మొత్తం 10.40 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం రూ.905.57 కోట్లు పంపిణీ చేసినట్లు అవుతుంది. -
అగ్రి గోల్డ్ బాధితులకు అండగా ప్రభుత్వం
సాక్షి, అమరావతి: పాదయాత్ర సందర్భంగా అగ్రి గోల్డ్ బాధితులకు ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి ఖాతాల్లో నగదు జమ చేస్తూ ఆదుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. ఈ నెల 24న రూ.20 వేలలోపు డిపాజిట్దారులకు రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ చేయనుందని తెలిపారు. ఆదివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 19 వరకూ 7.76 లక్షల మంది డిపాజిట్దారులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. రూ.10 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి ఇప్పటికే రూ.240 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్న 1995లో అగ్రి గోల్డ్ సంస్థ భారీ ఎత్తున డిపాజిట్లను సేకరిస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకోలేదని అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. డిపాజిట్దారులకు ఎలాంటి చెల్లింపులు చేయకుండా 2015లో అగ్రిగోల్డ్ యాజమాన్యం బోర్డు తిప్పేస్తే.. ఆ యాజమాన్యంతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తమ పోరాటాల వల్లే అగ్రి గోల్డ్ బాధితులకు ప్రభుత్వం నగదు చెల్లిస్తోందని చంద్రబాబు, టీడీపీ నేతలు బీరాలు పలుకుతున్నారని విమర్శించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అగ్రి గోల్డ్ కేసును తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ప్రభుత్వం ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిందన్నారు. -
అగ్రి గోల్డ్ బాధితులకి అండగా వైఎస్సార్సీపీ:లేళ్ల అప్పిరెడ్డి
-
అగ్రిగోల్డ్ బాధితుల నమోదు గడువు పొడిగింపు
సాక్షి,అమరావతి: అగ్రిగోల్డ్ సంస్థలో రూ.20 వేలు లోపు డిపాజిట్ చేసిన డిపాజిట్దారులు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు గడువును సీఐడీ విభాగం ఈనెల 19 సాయంత్రం5 గంటల వరకు పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 6 నుంచి డిపాజిటర్ల వివరాలను సేకరణ కొనసాగుతోంది. రూ.20వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్దారులు agrigolddata.in వెబ్సైట్లో ఆధార్ నమోదుతో పూర్తి వివరాలును చూడవచ్చు. ఒక వేళ వివరాలను మార్పు చేయాల్సివస్తే ఎంపీడీవో ఆఫీస్ ద్వారా సరిచేసుకునే అవకాశం కల్పించనట్లు అధికారులు తెలిపారు. సందేహాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800-4253875 సంప్రదించాలని అధికారులు కోరారు. -
అగ్రిగోల్డ్ బాధితుల నమోదు గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ సంస్థలో రూ.20 వేలు లోపు డిపాజిట్ చేసిన డిపాజిట్దారులు తమ వివరాలను గ్రామ/వార్డు వలంటీర్ల వద్ద నమోదు చేసుకునేందుకు గడువును సీఐడీ విభాగం రెండు రోజులు పొడిగించింది. డిపాజిట్దారులు శుక్ర, శనివారాల్లో కూడా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 6న మొదలైన వివరాల నమోదు ప్రక్రియ గురువారం వరకు కొనసాగుతుందని సీఐడీ విభాగం ముందు ప్రకటించింది. అగ్రిగోల్డ్ బాధితుల నుంచి వస్తున్న వినతులపై సానుకూలంగా స్పందించిన అధికారులు డిపాజిట్దారులు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు మరో రెండు రోజులు గడువు పొడిగించారు. రూ.20వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్దారులు agrigolddata.in వెబ్సైట్లో ఆధార్ నమోదుతో పూర్తి వివరాలును చూడవచ్చు. ఒక వేళ వివరాలను మార్పు చేయాల్సివస్తే ఎంపీడీవో ఆఫీస్ ద్వారా సరిచేసుకునే అవకాశం కల్పించనట్లు అధికారులు తెలిపారు. సందేహాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800-4253875 సంప్రదించాలని అధికారులు కోరారు. -
అగ్రి గోల్డ్ బాధితులకు 24న రెండోదశ చెల్లింపులు
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ కార్యాచరణకు సిద్ధమైంది. ఇప్పటికే రూ.10 వేలలోపు సొమ్మును డిపాజిట్ చేసిన వారికి ప్రభుత్వం ఆ మొత్తాలను చెల్లించింది. తాజాగా రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్దారులను ఆదుకోవాలని నిర్ణయించింది. సీఎం వైఎస్ జగన్ ఆ డిపాజిట్ దారుల బ్యాంకు ఖాతాల్లో ఆ మొత్తాలను ఈ నెల 24న జమ చేయనున్నారు. అగ్రి గోల్డ్ సంస్థలో రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు కట్టిన డిపాజిట్దారులు సంబంధిత చెక్కు, పే ఆర్డర్, రశీదులు, బ్యాంక్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు వివరాలను తమ గ్రామ/వార్డు వలంటీర్ వద్ద నమోదు చేయించుకోవాలని సీఐడీ విభాగం బుధవారం ఓ ప్రకటనలో కోరింది. సంబంధిత వివరాలను ఈ నెల 6 నుంచి 12లోగా గ్రామ/వార్డు వలంటీర్ ద్వారా నమోదు చేయించుకోవాలి. విధి విధానాలు ఇవీ.. ► కోర్టు పేర్కొన్న జాబితా ప్రకారం చెల్లింపులు జరుగుతాయి. ► డిపాజిట్దారులకు రావాల్సిన నగదును వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తారు. ఇతరుల బ్యాంకు ఖాతాలను సమ్మతించరు. ► ఒక డిపాజిట్దారు ఒక క్లెయిమ్కే అర్హులు. ► చనిపోయిన డిపాజిట్దారుల డిపాజిట్ మొత్తాలను వారి చట్టబద్ధ సంబంధికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. కాబట్టి వారు లీగల్ హైర్ సర్టిఫికెట్ కూడా సమర్పించాలి. ► గతంలో రూ.10 వేల లోపు క్లెయిమ్ పొందిన వారు ప్రస్తుతం అనర్హులు. ఒక్కసారి కూడా నగదు పొందని వారే ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవాలి. ► సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800–425–3875లో సంప్రదించాలి. -
AP Budget 2021: అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.200 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హోం శాఖకు ఈ బడ్జెట్లో రూ.7,039.17 కోట్లను కేటాయించారు. గతేడాది రూ.6,364.98 కోట్లు కేటాయించగా ఈ ఏడాది అదనంగా రూ.674 కోట్లకుపైగా కేటాయింపులు పెరిగాయి. మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. కాగా, పాదయాత్ర సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా ప్రభుత్వం ఈ బడ్జెట్లో వారి కోసం రూ.200 కోట్లు కేటాయించింది. గతంలో రూ.264 కోట్లు కేటాయించి రూ.10 వేల లోపు డిపాజిట్లు చేసిన బాధితులకు చెల్లించారు. తాజాగా కేటాయించిన మొత్తాన్ని రూ.20 వేల లోపు డిపాజిట్లు చేసినవారికి చెల్లించేలా చర్యలు తీసుకోనున్నారు. చదవండి: ప్రాణం విలువ తెలిసిన వాడిని: సీఎం జగన్ -
అగ్రిగోల్డ్ డైరెక్టర్ అవ్వ ఉదయ్ భాస్కరరావు కన్నుమూత
-
‘అగ్రి గోల్డ్’ చెల్లింపులకు అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: అగ్రి గోల్డ్ సంస్థలో డిపాజిట్ చేసి నష్టపోయిన వారికి న్యాయం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019–20 బడ్జెట్లో రూ.1,150 కోట్లు కేటాయించిందని, ఈ డబ్బు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ తెలంగాణ హైకోర్టును అభ్యర్థించారు. అగ్రి గోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయాలని, అగ్రి గోల్డ్పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ 2015లో ఉమ్మడి హైకోర్టు ఉన్న సమయంలో డిపాజిటర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ తరఫున ఆండాల్ రమేష్బాబు ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిల్లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతివాదులుగా ఉన్న నేపథ్యంలో ఈ కేసును విచారించే పరిధి తెలంగాణ హైకోర్టుకు ఉంది. ఈ నేపథ్యంలో.. డబ్బు పంపిణీకి అనుమతి ఇవ్వడంతోపాటు మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ చల్లా కోదండరామ్లతో కూడిన ధర్మాసనాన్ని శ్రీరామ్ బుధవారం అభ్యర్థించారు. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం డిపాజిటర్లను గుర్తించి డబ్బు పంపిణీ చేస్తామని, మానవీయ కోణంలో ఆలోచించి డిపాజిటర్లను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించిందని తెలిపారు. డబ్బు పంపిణీకి అనుమతి కోరుతూ గత ఏడాది డిసెంబర్లో తాము రెండు పిటిషన్లు దాఖలు చేశామని, ప్రభుత్వమే డిపాజిటర్లను ఆదుకునేందుకు డబ్బు చెల్లిస్తున్న నేపథ్యంలో అనుమతించాలని కోరారు. తాము దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను విచారించాలని బాధితుల తరఫు న్యాయవాది అభ్యర్థించారు. ఈనెల 9న ఈ పిటిషన్లను విచారించేందుకు ధర్మాసనం అనుమతించింది. హామీ నిలబెట్టుకున్న సీఎం జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన అగ్రి గోల్డ్ డిపాజిటర్లు తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. వారి బాధను, ఆవేదనను అర్థం చేసుకున్న వైఎస్ జగన్ తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే 2019–20 బడ్జెట్లో రూ.1,150 కోట్లు కేటాయించారు. రూ.10 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లించేందుకు రూ.263.99 కోట్లు విడుదల చేయడంతోపాటు 94 శాతం మందికి చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. రూ.20 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి సైతం డబ్బు చెల్లించేందుకు వీలుగా హైకోర్టు అనుమతి తీసుకుని చెల్లింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అగ్రి గోల్డ్ సంస్థ 32 లక్షల మంది డిపాజిటర్ల నుంచి రూ.6,380 కోట్లు సేకరించి మోసం చేసింది. బాధితులకు ఏపీ ప్రభుత్వం ముందుగానే చెల్లింపులు చేసి.. హైకోర్టు నియమించిన జిల్లా స్థాయి కమిటీల ఆధ్వర్యంలో అగ్రి గోల్డ్ ఆస్తులను అమ్మగా వచ్చిన డబ్బును ప్రభుత్వం తిరిగి తీసుకునేలా ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. -
త్వరలో అగ్రిగోల్డ్ బాధితులకు రెండో విడత చెల్లింపులు!
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ సంస్థలో రూ.20 వేల లోపు సొమ్ము డిపాజిట్ చేసి.. నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఆ మొత్తాన్ని చెల్లించనుంది. న్యాయస్థానాల పరిధిలో ఉన్న ఈ అంశంపై హైదరాబాద్ హైకోర్టు నుంచి ఆదేశాలు రాగానే బాధితులకు సొమ్ము అందజేస్తారు. అలాగే రూ.10 వేలులోపు డిపాజిట్ చేసిన బాధితులు ఎవరికైనా మొదటి విడతలో ఆ సొమ్మును అందకపోయి ఉంటే వారికి కూడా చెల్లింపులు జరుపుతారు. ఈ విషయాన్ని రాష్ట్ర సీఐడీ విభాగం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు చేపట్టారు. బాధితులకు మొత్తం రూ.1,150 కోట్లు చెల్లించేందుకు గానూ 2019 అక్టోబరు 25న ప్రభుత్వం జీవో జారీ చేసింది. అందులో భాగంగా మొదటి విడతలో రూ.10వేల లోపు డిపాజిట్ చేసిన 3,69,655 మంది బాధితులకు 2019 నవంబర్లో నష్టపరిహారం చెల్లించింది. అయితే వారిలో ఇంకా కొందరికి ఆ పరిహారం అందలేదని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో సీఎం వైఎస్ జగన్ ఇటీవల స్పందిస్తూ.. వెంటనే వారికి కూడా నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన బాధితులతో పాటు గతంలో రూ.10 వేల లోపు పరిహారం పొందని వారికి కూడా ఆ మొత్తం చెల్లించాలని నిర్ణయించినట్టు సీఐడీ విభాగం తెలిపింది. హైకోర్టు క్లియరెన్స్ కోసం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని, ఆ మేరకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు మరో 200 కోట్లు
సాక్షి, అమరావతి : అగ్రి గోల్డ్ బాధితులను ఆదుకోవడం.. పోలీసుల సంక్షేమం.. మహిళల రక్షణకు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్ర హోం శాఖకు రూ.5,988.72 కోట్లు కేటాయించగా.. న్యాయ శాఖకు 913.76 కోట్లు కేటాయించింది. పాదయాత్ర సందర్భంగా అగ్రి గోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ బడ్జెట్లో మరో రూ.200 కోట్లు కేటాయించింది. గతేడాది రూ.264 కోట్లు కేటాయించగా.. రూ.10 వేలలోపు డిపాజిట్లు చేసిన బాధితులకు సొమ్ము చెల్లించారు. ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం పేద ప్రజలకు ఇంటి వద్దే నాణ్యమైన బియ్యం అందేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం బడ్జెట్లో పౌరసరఫరాలశాఖకు రూ. 3,100 కోట్లు కేటాయించింది. దారిద్య్ర రేఖకు దిగువనున్న 1.48 కోట్ల కుటుంబాలు దీని ద్వారా లబ్ధి పొందుతాయి. వైఎస్సార్ నవశకం పథకంలో భాగంగా ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు కొత్తగా బియ్యం కార్డులు జారీ చేస్తోంది. ►సరుకుల పంపిణీ కోసం కొత్తగా డోర్ డెలివరీ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. ►దీని ద్వారా నాణ్యమైన బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు ప్రజల ఇంటి వద్దకే చేరుతున్నాయి. ►ఎటువంటి అవకతవకలకు తావులేని విధంగా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా వీటిని పంపిణీ చేస్తున్నారు. ►సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 సెప్టెంబర్ 6న శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ►ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి అన్ని జిల్లాల్లోనూ పేదలకు ఇంటి వద్దే సరుకులు అందేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసింది. ►నాణ్యమైన బియ్యం సబ్సిడీ కోసం రూ. 3,000 కోట్లు, పేదలకు ఉచితంగా ఇవ్వనున్న సంచుల కోసం రూ. 100 కోట్లు కేటాయించింది. -
అగ్రిగోల్డ్ డైరెక్టర్లు,మేనేజర్ల ఇళ్లలో ఈడీ సోదాలు
-
రెవెన్యూ రికార్డుల తారుమారు
కర్నూలు, కోడుమూరు: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో సీబీసీఐడీ అధికారులు శోధించే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. కృష్ణగిరి, రామకృష్ణాపురం, తాళ్ల గోకులపాడు గ్రామాల్లో అగ్రిగోల్డ్ సంస్థ దాదాపు 700 ఎకరాల భూములను కొనుగోలు చేసింది. ఇందులో ఎక్కువగా టీడీపీ నాయకులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించిన ఆధారాలను సీబీసీఐడీ అధికారులు సేకరించారు. రెవెన్యూ రికార్డులలో లేని సర్వే నంబర్లను సృష్టించి రిజిస్ట్రేషన్లు చేశారు. అలాగే విస్తీర్ణం తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువగా చూపి రిజిస్ట్రేషన్ చేశారు. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రధాన అనుచరుడు, రామకృష్ణాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పి.దామోదర్నాయుడు అగ్రిగోల్డ్కు భూములమ్మి..ఆ తర్వాత వాటి రికార్డులను తారుమారు చేసి భార్య వరలక్ష్మీ పేరుమీద పట్టాదారు పాసు పుస్తకం తెచ్చుకున్నాడు. అలాగే దాదాపు 150 ఎకరాల భూములు క్షేత్రస్థాయిలో లేకపోయినప్పటికీ టీడీపీ నాయకులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు సీబీసీఐడీ అధికారుల విచారణలో బయటపడింది. అప్ప ట్లో పనిచేసిన తహసీల్దార్లు సత్యం, సూర్యనారాయణ సంతకాలతో రైతులకు భూములు ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు తీసుకుని.. బోగస్ వ్యక్తులతో రిజిస్ట్రేషన్లు చేయించినట్లు గుర్తించారు. అధికారుల సంతకాలు ఫో ర్జరీవా? నిజమైనవా? తేల్చేందుకు ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు తెలిసింది. దామోదర్ నాయుడు సోదరుడు పి.వెంకటయ్య, నారాయణ స్వామి, ధనుంజయ, బోయ గిడ్డమ్మలు కలిసి 113, 146/1 సర్వే నంబర్లలోని 13.19 ఎకరాల భూమిని అగ్రిగోల్డ్కు చెందిన గోల్డెన్ వుడ్ ట్రేడర్స్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యజమాని సీతారామారావుకు విక్రయించారు. డాక్యుమెంట్ నంబర్ 1760/2009. వాస్తవానికి సర్వే నంబర్ 146/1 రెవెన్యూ రికార్డులలో లేకపోయినప్పటికీ అందులో 9.07 ఎకరాల భూమి ఉన్నట్లు చూపి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన విషయం సీబీసీఐడీ విచారణలో బయటపడింది. అలాగే అగ్రిగోల్డ్కు అమ్మిన భూమిలో 4.12 ఎకరాలను దామోదర్ నాయుడు తన భార్య పి.వరలక్ష్మీ పేరిట బదలాయించి..పట్టాదారు పాసు పుస్తకం (ఖాతా నంబర్ 505) కూడా తీసుకున్నారు. సర్వే నంబర్ 149/బీ, 80/1, 137/డీ, 40/2లలో పి.రామాంజినేయులు, కొండేటి పుల్లయ్య, పి.పార్వతమ్మ, బోయ శేషమ్మలకు 22.78 ఎకరాల భూమి ఉన్నట్లు (డాక్యుమెంట్ నెం.4497/2009) చూపి మాతంగి ఇన్ఫ్రా వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులకు రిజిస్ట్రేషన్ చేయించారు. 40/ 2 సర్వే నంబర్లో రెవెన్యూ రికార్డుల ప్రకారం పూర్తి విస్తీర్ణం 2.72 ఎకరాలు మాత్రమే ఉండగా..ఏకంగా 10.61 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించడం గమనార్హం. ప్రస్తుతం అగ్రిగోల్డ్కు విక్రయించిన పై సర్వే నంబర్లలో భూముల్లో కేబీ మద్దయ్య (ఖాతా నంబర్ 263), కృష్ణ (1139), బోయ సాయిలీల (1267), మురళీధర్ (ఖాతా నం 932), వల్లె ఓబులేసు (ఖాతా నం 615) సాగులో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. రెవెన్యూ రికార్డుల గోల్మాల్పై సీబీసీఐడీ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు. -
కలాం నా దగ్గరే విజన్ నేర్చుకున్నారు..
చంద్రగిరి(చిత్తూరు జిల్లా): నేను సీఎంగా ఉన్నప్పుడు విజన్–2020తో ముందుకెళ్లాను.. నా విజన్ గురించి తెలుసుకున్న దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం.. ఆ విజన్కు సంబంధించిన పలు పత్రాలను తీసుకెళ్లి దేశ ఆర్థిక విజన్పై ఓ పుస్తకాన్ని విడుదల చేశారు’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని మామండూరు వద్ద మూడు రోజుల జిల్లాస్థాయి టీడీపీ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించారు. అనంతరం శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితులకు తెలుగుదేశం ప్రభుత్వం పరిహారం చెల్లించేందుకు సిద్ధమైందని, ఎన్నికల కోడ్ వల్ల అది ఆగిపోయిందన్నారు. అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆ నగదును బాధితులకు చెల్లించిందని చెప్పారు. తాను సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రం రెండంకెల అభివృద్ధిని సాధించిందని చెప్పారు. రాష్ట్రాన్ని నంబర్–1గా తీర్చిదిద్దాలని ఎంతో ప్రయత్నించానని, అయితే ఆ అదృష్టం తనకు లేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సంగతి తేలుస్తా.. ‘మంత్రులు, ఎమ్మెల్యేలు అతి చేస్తే మీ సంగతేంటో చూస్తా’.. అంటూ చంద్రబాబు హెచ్చరించారు. ‘మీరు రోడ్లపైకి వచ్చే రోజు వస్తుంది.. అప్పుడు మీ సంగతి తేలుస్తా’ అంటూ బెదిరించారు. -
మాటిచ్చారు... మనసు దోచారు...
వారి కళ్లల్లో సంభ్రమాశ్చర్యాలు స్పష్టంగా కనిపించాయి. కలో నిజమో తెలియని ఓ సందిగ్ధావస్థ ప్రస్ఫుటమైంది. ఇక రాదేమో అనుకున్న మొత్తాలు బ్యాంకు ఖాతాల్లో జమయినట్టు వచ్చిన మెసేజ్తో వారి కళ్లల్లో ఆనందం సుస్పష్టమైంది. గత పాలకులు తీరని అన్యాయం చేసి మోసం చేస్తే... ప్రస్తుత పాలకులు ఇచ్చిన మాటకు కట్టుబడి పూర్తి న్యాయం చేశారు. సంకల్పయాత్ర సాక్షిగా ఇచ్చిన హామీ... పదవిలోకి వచ్చి ఆరు నెలలు తిరగకుండానే అమలు చేయడం చూసి వారి కళ్ల నుంచి అప్రయత్నంగా కొన్ని ఆనందబాష్పాలు మిలమిలా మెరిశాయి. సాక్షి, విజయనగరం: వారి కష్టం తీరింది. నిరీక్షణ ఫలించింది. ఇప్పటికి న్యాయం జరిగింది. రెక్కలు ముక్కలు చేసుకుని పైసాపైసా కూడబెట్టి వడ్డీలు వస్తాయనీ... తమ సమస్యలు తీరుతాయనీ... పిల్లల భవిష్యత్తుకు ఢోకా ఉండదనీ అగ్రిగోల్డ్లో సొమ్ము దాచుకుంటే అది కాస్తా బోర్డు తిరగేసేసింది. నెలలు... సంవత్సరాలు గడచిపోయాయి. గత సర్కారు చేసిన అన్యాయంతో ఇక సొమ్ము తిరిగి రాదనుకున్న తరుణంలో దేవుడిలా జగన్మోహన్రెడ్డి వారి ఆశలు తీర్చారు. డిపాజిట్ చేసిన మొత్తాలు తిరిగి చెల్లించారు. పదివేల రూపాయల లోపు డిపాజిట్ చేసినవారి మొత్తాలను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయించారు. ఇంతటి బృహత్తరమైన కార్యక్రమం జిల్లాకు చెందిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం జరిగింది. విజయనగరం ఆనందగజపతి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో అగ్రిగోల్డ్లో దాచుకున్న మొత్తాలను వాపసు చేశారు. విజయనగరం ఆనందగజపతి ఆడిటోరియంలో కార్యక్రమానికి హాజరైన అగ్రిగోల్డ్ బాధితులు రూ. 37 కోట్లు విడుదల ప్రజాసంకల్ప యాత్ర సాక్షిగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. దాని ప్రకారం అధికారం చేపట్టిన ఆరునెలల్లోనే తొలివిడతగా రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన జిల్లాలోని 57,941 మందికి న్యాయం చేశారు. వారికోసం మంజూరు చేసిన రూ.36.99 కోట్లు విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన అగ్రిగోల్డ్ బాధితులతో రాష్ట్ర పురపాలక పట్టణాభివద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా మాట్లాడారు. అందరూ నిజమైన లబ్ధిదారులేనా అని ఆరాతీస్తూ వారి మనసులోని భావాలను వెలికి తీసే యత్నం చేశారు. జరుగుతున్నదంతా ఒక కలలా ఉందని, డిపాజిట్లు తిరిగి వస్తాయనుకోలేదని, సీఎం జగన్ చల్లగా ఉండాలని దీవిస్తూ లబి్ధదారులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం అందించిన సాయంతో జిల్లా వ్యాప్తంగా అగ్రిగోల్డ్ ఖాతాదారులు సంబరాలు చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. బాధితులతో మంత్రి బొత్స ముఖాముఖి ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సమావేశానికి వచ్చిన బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. వచ్చిన వారంతా... అగ్రిగోల్డ్ బాధితులేనా, లేక అధికారులు వేరెవరినైనా తీసుకువచ్చి షో చేశారా అని ప్రశ్నిస్తే... లేదనీ.. తామంతా ఖాతాదరులమేనని చేతులెత్తారు. అందులోని కొందరు మహిళలను వేదికపైకి పిలిపించుకుని ఎంతెంత మొత్తాలు డిపాజిట్ చేశారు...ఎన్నాళ్ల కాల వ్యవధికి డిపాజిట్ చేశారో అడిగి తెలుసుకున్నారు. ఇదంతా సీఎం జగన్ చలవే... రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ చిత్తశుద్ధితో నెరవేర్చారు. ఇదే విషయాన్ని మంత్రి బొత్ససత్యనారాయణ సభావేదికపైనుంచి చెప్పడమే గాకుండా... సీఎం చలవ వల్లే ఆ మొత్తాలు తిరిగి వచ్చేశాయని వివరించారు. అంతేగాకుండా ఏవైనా సాంకేతిక కారణాలవల్ల నగదు బ్యాంకు ఖాతాలో జమకాకుంటే కంగారు పడాల్సిన పనిలేదనీ, అందరికీ న్యాయం చేస్తామని ప్రకటించారు. -
మాట నిలబెట్టుకున్న...
సాక్షి, అమరావతి బ్యూరో: తన 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి ఊళ్లో అగ్రిగోల్డ్ బాధితులు చెప్పిన కష్టాలు విన్నానని, నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తొలి అడుగు వేశానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అన్నగా తోడుంటానని భరోసా ఇచ్చారు. గురువారం గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్ డబ్బుల చెల్లింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను విన్నానన్నారు. న్యాయం చేస్తానని ఆ రోజు ఇచి్చన మాట మేరకు ఇప్పుడు తొలి విడతగా రూ.10 వేల వరకు డిపాజిట్ చేసి నష్టపోయిన 3.70 లక్షల మంది కుటుంబాల అకౌంట్లలోకి రూ.264 కోట్ల డబ్బును జమ చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే రూ.20 వేల లోపు వరకు డిపాజిట్దారులకు డబ్బులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. మంత్రివర్గ తొలి సమావేశంలోనే నిర్ణయం ‘‘చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్ స్కామ్ జరిగింది. కానీ అప్పటి ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయలేదు. పైగా గత ప్రభుత్వ పెద్దలు దురాశతో ఆ సంస్థ ఆస్తులు, భూములను కొట్టేయాలని ప్రయతి్నంచారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితుల తరఫున పోరాటం చేశాం. మే 30న మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధితులకు అండగా నిలుస్తూ జూన్ 10న తొలి కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశాం. జూలై 12న తొలి బడ్జెట్లో నిధులు కేటాయించాం. అధికారం చేపట్టిన కేవలం ఐదు నెలల్లోనే బాధితులను ఆదుకునేందుకు చిత్తశుద్ధితో అడుగులు వేశాం. అక్షరాలా 3.70 లక్షల మందికి రూ.264 కోట్లు ఇవ్వగలుతున్నందుకు ఆనందంగా ఉంది. అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, సీహెచ్.రంగనాథరాజు, మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 5 నెలల్లో ఎన్నో చేశాం ఆటో డ్రైవర్లకు అండగా నిలిచాం సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్లు నడుపుకునే డ్రైవర్లకు ఇచి్చన హామీ అమలు చేస్తూ 1.75 లక్షల మందికి ఏటా రూ.10 వేలు ఆరి్థక సాయం అందిస్తూ తొలి అడుగులు వేశాం. అర్హత ఉండీ లబ్ధిపొందని వారి కోసం ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలి్పస్తున్నాం. ఫలితంగా మరో 50 వేల మందికి లబ్ధి కలుగనుంది. మొత్తం 2.25 లక్షల మంది ఆటో నడుపుతున్న సోదరులకు అండగా నిలవగలిగాం. పాదయాత్రలో రైతన్నలు ఎంతో మంది కష్టాలు చెప్పుకున్నారు. నేను విన్నాను.. నేను ఉన్నానని ప్రతి రైతన్నకు ఆరోజు మాటిచ్చా. ఆ రోజు నేను చెప్పిన దానికన్నా మిన్నగా నేడు రైతు భరోసా అమలు చేస్తున్నాం. నాలుగేళ్లు ఇస్తామని చెప్పి.. ఈ రోజు ఐదేళ్లు ఇస్తున్నాం. ఆ రోజు రూ.12,500 చెబితే, ఈ రోజు 13,500 ఇస్తున్నాం. 46 లక్షల రైతు కుటుంబాలకు తోడుగా ఉంటూ, దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్ రైతు భరోసాను ఐదు నెలల్లోనే అమలు చేయగలిగామని సగర్వంగా చెబుతున్నా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత దేశ చరిత్రలో ఎప్పుడూ లేని, జరగని విధంగా తొలిసారిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు నామినేషన్పై ఇచ్చే పనుల్లో, నామినేటెడ్ పదవుల్లో, దేవాలయాల బోర్డుల్లో (టీటీడీ మినహా) 50 శాతం రిజర్వేషన్ కలి్పంచాం. ఈ వర్గాలకు ఇంతగా మేలు చేసిన రాష్ట్రం దేశ చరిత్రలో ఏదీలేదు. ఇలా ఐదు నెలలు తిరగక ముందే అమలు చేసిన ప్రభుత్వం మనదే. వయసు పెరిగిపోయి, ఇబ్బందులు పడుతున్న అవ్వాతాతలకు గత ఐదేళ్లుగా ప్రభుత్వం ముష్టి వేసినట్లుగా పింఛన్ ఇచ్చింది. ఈ పింఛన్ సరిపోదని, పెంచండని అవ్వాతాతలు ఎంతగా అడిగినా పట్టించుకున్న పాపాన పోలేదు. గత ఐదేళ్లలో అవ్వతాతలకు గత ప్రభుత్వం సగటున నెలకు రూ.500 కోట్లు ఇస్తే, ఇవాళ ఈ ప్రభుత్వం నెలకు సగటున రూ.1,300 కోట్లు ఇస్తోంది. ఈ విధంగా గత ప్రభుత్వం కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా అవ్వాతాతల పింఛన్ల బడ్జెట్ మొత్తాన్ని మీ బిడ్డ పెంచాడని తెలియజేస్తున్నా. నిరుద్యోగులు, చదువుకుంటున్న పిల్లలకు అండగా.. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాక అవస్థలు పడుతున్న తీరును స్వయంగా నా కళ్లతో చూశాను. ప్రతి పిల్లవాడికి తోడుగా ఉంటానని మాటిచ్చాను. ఆ ప్రకారం అధికారంలోకి రాగానే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ప్రైవేటు రంగంలో వారికి మేలు జరగాలన్న విధంగా దేశచరిత్రలో ఎప్పుడూ.. ఏ రాష్ట్రంలో జరగని విధంగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చట్టం చేసిన ప్రభుత్వం మనదే. కంటి వెలుగు పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 65 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాం. వారిలో దాదాపు 4.5 లక్షల మంది విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేయడంతో పాటు, అవసరమైన పిల్లలకు శస్త్ర చికిత్సలు చేయిస్తున్నాం’’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, సీహెచ్.రంగనాథరాజు, మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ సొమ్ము ఆదా ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ సొమ్ము ఆదా అయ్యేలా గడిచిన ఐదు నెలల్లోనే పలు చర్యలు చేపట్టాం. మొట్టమొదటిసారిగా జ్యుడిíÙయల్ కమిషన్ను తీసుకొచ్చాం. దేశచరిత్రలో ఎక్కడా జరగని విధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఈ విధానం ద్వారా ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే దాదాపు రూ.830 కోట్లు ప్రభుత్వానికి ఆదా చేశాం. వెలిగొండ ప్రాజెక్టులో దాదాపు రూ.50 కోట్లు మిగిల్చాం. కేవలం ఈ 5 నెలల్లోనే దాదాపు రూ.1,000 కోట్ల పైచిలుకు ప్రజాధనం ఆదా చేయగలిగాం. దీన్ని అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. మీ అందరి ఆశీస్సులతో భవిష్యత్తులో మరింత మంచి పాలన ఇస్తానని చెబుతున్నా. ►మన ఇంట్లో వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు.. మనందరి సమస్యలు విన్నాడు.. మనకు తోడుగా ఉండేందుకు ఐదు నెలల్లో ముందడుగు వేశాడని చెప్పుకునేట్లుగా ఈ ఐదు నెలల్లో 4 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇవ్వగలిగాం. ఇందులో 1.30 లక్షలు శాశ్వత ఉద్యోగాలు. ప్రతి 2 వేల జనాభాకు ఒక గ్రామ/వార్డు సచివాలయం ఏర్పాటు చేసి స్థానికంగా 10 మందికి ఉద్యోగాలిచ్చాం. ►అర్హులైన అగ్రిగోల్డ్ డిపాజిటర్లు ఎవరైనా పేర్లు నమోదు చేసుకోకపోతే కంగారు పడొద్దు. మరో నెల రోజులు సమయం ఇస్తున్నాం. వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ దానిపై అవగాహన లేకపోతే కలెక్టరేట్లు, ఎమ్మార్వో కార్యాలయాలు, గ్రామ సచివాలయాలకు వెళ్లండి. అక్కడ నమోదు చేసే అవకాశం కలి్పస్తాం. ►నిజానికి ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. సంస్థ ఆస్తులన్నీ కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఒక్కో ముడి విప్పుతూ కోర్టు అనుమతితో ఇప్పుడు 3.70 లక్షల మంది డిపాజిటర్లకు రూ.264 కోట్లు ఇచ్చి మేలు చేశాం. రాబోయే రోజుల్లో మిగిలిన వారందరికీ మేలు చేసే దిశగా అడుగులు వేస్తాం. – సీఎం వైఎస్ జగన్ -
అగ్రి సాక్షిగా..
-
మీ అందరి దీవెనలతోనే ఇది సాధ్యం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఇచ్చిన వాగ్దానం ప్రకారం రూ.10వేల లోపు డిపాజిట్ చేసిన 3.7 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వివిధ రాష్ట్రాల్లో బాధితులు ఉన్నా ఆదుకున్నది తమ ప్రభుత్వం మాత్రమే అని సీఎం తెలిపారు. దేవుడి దయ, మీ అందరి దీవెనల వల్లే ఇది సాధ్యంఅయ్యిందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సీఎం జగన్ ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా గురువారం గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బుల పంపిణీ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితుల తరఫున పోరాటం చేశామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి అండగా నిలబడుతున్నామని తెలిపారు. చదవండి: ‘మాట నిలబెట్టుకుని.. మీ ముందు నిలబడ్డా’ -
‘కంచే చేను మేసిందన్నట్లుగా వ్యవహరించారు’
సాక్షి, కృష్ణా : అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో గత టీడీపీ ప్రభుత్వం కంచే చేను మేసిన విధంగా వ్యవహరించిందని రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని దుయ్యబట్టారు. జడ్పీ కన్వెన్షన్ సెంటర్లో మంత్రి నాని గురువారం అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. కష్టపడి సంపాధించుకున్న జీతాన్ని అగ్రిగోల్డ్లో దాచుకుంటే సదరు సంస్థ డిపాజిట్దారుల నుంచి కచ్చుటోపి పెట్టిందని, బాధితుల పక్షాన నిలబడి ఆదుకోవాల్సిన ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నించిందని మంత్రి మండిపడ్డారు. నాడు పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా ఇస్తూ ముందుకు వెళ్లారని, నేడు ఇచ్చిన మాట ప్రకారం రూ. 10,000లు చొప్పున డిపాజిట్ చేసిన ప్రతి ఒక్క బాధితుడికి పరిహారం అందజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి అయిదు నెలలు కూడా గడవకమందే ఇచ్చిన మాట ప్రకారం డిపాజిట్ మొత్తాలను అందజేస్తున్నామని మంత్రి పేర్నినాని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పాల్గొన్నారు. -
‘అభివృద్ది, సంక్షేమం ఆయనకు రెండు కళ్లు’
సాక్షి, కడప : వైఎస్సార్ జిల్లాలోని అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకొనేందుకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులందరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారన్న నమ్మకంతో ఓట్లేశారని, అందుకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన మొదటి బడ్జెట్లోనే బాధితులకు కేటాయింపులు చేశారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల జీవితాలతో ఆడుకుందని, ఉపశమన కమిటీ పేరుతో కాలాయాపన చేసిందని మంత్రి తెలిపారు. తాను కూడా బాధితుల తరుపున పొరాడానని, డబ్బులు అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల సృష్టి టీడీపీ కుట్ర అని, ఆస్తులు ఉన్నా.. వాటిని కొట్టేసే ఉద్దేశంతోనే చంద్రబాబు బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ విశ్వసనీయత ఉన్న నాయకుడని, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని, బాధితుల కుటుంబాలలో సీఎం సంతోషాన్ని నింపుతారని పేర్కొన్నారు. అభివృద్ది, సంక్షేమం సీఎం వైఎస్ జగన్కు రెండు కళ్లు అని, రానున్న రోజుల్లో మరిన్ని కొత్త పథకాలను చూస్తారని మంత్రి వెల్లడించారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే గొర్లె కిరణ్, సీదిరి అప్పలరాజు గురువారం చెక్కులు పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మెహన్రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం బాధితులను ఆదుకున్నారని అన్నారు. మిగతా డిపాజిటర్లకు కూడా మరో దశలో చెక్కులు పంపిణీ చేస్తామని తెలిపారు. నమ్మకమైన చట్టబద్ధత సంస్థలోనే మీ కష్టార్జితం పెట్టుబడి పెట్టండని మంత్రి బాధితులకు సూచించారు. అలాగే ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు, కన్నీళ్లు సీఎం జగన్ అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు. టీడీపీ ప్రభుత్వ పెద్దలే అగ్రిగోల్డ్ కుట్రదారులని, సంస్థ ఆస్తులను చౌకగా లాగేసుకొవడానికే డిపాజిట్ దారులను నిలువునా మోసం చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడతూ.. సీఎం జగన్ పేదలకు అండగా ఉండాలనే సంకల్పంతో ఉన్నారని, మోసపోయి కష్టాల్లో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులను తక్షణమే నిధులు విడుదల చేశారని ఎమ్మెల్యే తెలిపారు. స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ఆగ్రి గోల్డ్ బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్రతి ఒక్క బాధితుడిని సీఎం జగన్ ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. ఆర్థిక సంస్థలు మోసం చేస్తే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని చెల్లించిన సందర్భం లేదని, అగ్రిగోల్డ్ హాయ్ లాండ్ భూములను కాజేయాలని గత ప్రభుత్వం లక్షల మంది డిపాజిట్ దారులను మోసం చేసిందని ఆయన అన్నారు. బాధితుల కష్టార్జితం ఒక్కపైసా కూడా నష్టపోకుండా సీఎం జగన్ తిరిగి ఇచ్చే బాధ్యత తీసుకున్నారని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బుల పంపిణీ కార్యక్రమంలో వైఎస్ జగన్
-
‘చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదు’
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని చూసి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సిగ్గుపడాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర్ నారాయణ మండిపడ్డారు. గురువారం జిల్లాలోని అంబేద్కర్ భవన్లో అగ్రిగోల్డ్ బాధితులకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మానవతా దృక్పథంతో స్పందించి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేశారని అన్నారు. 40 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు.. ఏనాడూ అగ్రిగోల్డ్ బాధితుల గురించి ఆలోచించలేదని విమర్శించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు చంద్రబాబు శతవిధాల కుట్ర చేశారని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితుల అకౌంట్లలోకి నేరుగా డబ్బు జమ చేస్తున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ వివరించారు. ఏపీ వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితుల కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.1150 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. అనంతపురం జిల్లాకు రూ.20.65 కోట్లు వచ్చిందని.. 24000 మంది అగ్రిగోల్డ్ బాధితుల అకౌంట్లలో వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనంతవెంకట్రామిరెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, ఎంపీ గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు. -
‘మాట నిలబెట్టుకుని.. మీ ముందు నిలబడ్డా’
సాక్షి, గుంటూరు : అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తున్నందకు ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్ స్కామ్ జరిగిన బాధితులకు న్యాయం జరగలేదని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితుల తరఫున పోరాటం చేశామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి అండగా నిలబడుతున్నామని తెలిపారు. గురువారం గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘మీ సోదరుడు అధికారంలోకి వస్తే న్యాయం చేస్తాడని భావించిన అక్కాచెల్లమ్మలకు ధన్యవాదములు. అగ్రిగోల్డ్ బాధితులు ఐదేళ్లుగా పడుతున్న బాధలు చూశా.. మీ అందరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మీ ముందు నిలబడ్డాను. 3,648 కి.మీ సాగిన నా పాదయాత్రలో ప్రతి గ్రామంలో అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను విన్నాను. నేను ఉన్నానని మాట ఇచ్చాను. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు తొలి అడుగు వేశాను. కోర్టు పరిధిలో ఉన్నా.. తొలి విడతలో భాగంగ దాదాపుగా 3.70లక్షల మంది బాధితులకు న్యాయం చేస్తున్నాం. రూ. 10వేలలోపు డిపాజిట్లు ఉన్న బాధితులను ఆదుకునేందుకు రూ. 264 కోట్లు విడుదల చేశాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్లోనే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు కేటాయింపులు చేశాం. ఐదు నెలల్లోపే బాధితులకు న్యాయం చేయగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరింత మందికి న్యాయం చేస్తాం. త్వరలోనే రూ. 20వేలలోపు డిపాజిట్ చేసినవారికి డబ్బులు అందజేస్తాం. ఈ ఐదు నెలల్లోనే నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాం. గ్రామా సచివాలయాల ద్వారా లక్ష 30వేల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. 2.25 లక్షల మంది ఆటో కార్మికులకు.. వైఎస్సార్ వాహన మిత్ర అందించాం. పాదయాత్రలో చెప్పిన విధంగా ప్రతి రైతన్నకు రైతు భరోసా అందించాం. అప్పుడు రూ. 12,500 రైతులకు ఇస్తామని చెప్పిన.. దానిని రూ. 13,500కు పెంచాం. అవ్వాతాతల పెన్షన్ కోసం రూ. 1350 కోట్లు మంజూరు చేశాం. గత ప్రభుత్వం కంటే మూడు రెట్లు అధికంగా పించన్ ఇస్తున్నాం. 65 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా కంటి వెలుగు అందిస్తున్నాం. 4.5 లక్షల మంది విద్యార్థులక శస్త్ర చికిత్సల చేయించడం, కంటి అద్దాలు అందజేయడం చేశాం. ప్రైవేటు రంగంలో నిరుద్యోగ యువతకు మేలు జరగాలని.. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకోచ్చాం. ఏడాదికి రూ. 10 వేలు ఇస్తూ ఆటో కార్మికులను ఆదుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా జూడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేశాం. దేశంలో ఎవరు చేయని విధంగా రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చాం. పోలవరంలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 800 కోట్లు ఆదా చేశాం. అవినీత రహితంగా, పారదర్శకంగ పాలన కొసాగిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు నామినేటేడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాం’ అని తెలిపారు. ఇంకా గొప్పగా.. మీ మనస్సులో నిలబడే విధంగా పాలన కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. అర్హులకు మరో అవకాశం.. ఇప్పటివరకు తమ పేరు నమోదు చేసుకోని అర్హులైన అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు సీఎం వైఎస్ జగన్ మరో అవకాశం కల్పించారు. అలాంటి వారు.. నెల రోజుల్లోగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. కలెక్టరేట్, ఎమ్మార్వో, గ్రామ సచివాలయాల్లో కూడా నమోదు చేసుకోవచ్చని అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మాట నిలబెట్టుకుంటూ తొలి అడుగులు వేశా
-
అగ్రిగోల్డ్ బాధితులకు.. నేడు డిపాజిట్ల పంపిణీ
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: మరికొద్ది గంటల్లో అగ్రిగోల్డ్ బాధితుల కల సాకారమవుతోంది. ఐదేళ్ల వారి పోరాటం ఫలించే రోజు రానే వచ్చింది. ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆచరణలోకి తీసుకువచ్చారు. తొలివిడతలో 3,69,655 మందికి సంబంధించిన డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో భాగంగా.. గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా గురువారం అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ముందుగా రూ.10వేలలోపు డిపాజిటర్లకు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేసే నిర్ణయంపై తీర్మానం చేశారు. మొదటి బడ్జెట్లోనే వారికి రూ.1,150 కోట్లు కేటాయించారు. మరోవైపు.. అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయ ప్రక్రియకు సంబంధించిన వివాదాలు కొనసాగున్నా, నిబంధనలకు లోబడి ప్రభుత్వం బాధితులకు చెల్లింపులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. ముందుగా రూ.10 వేలలోపు డిపాజిట్ చేసిన బాధితులకు చెల్లింపులు చేసేందుకు గతనెల 18న రాష్ట్ర ప్రభుత్వం రూ.263.99 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కెఆర్ఎం కిశోర్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. సర్కారు నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 13జిల్లాల్లో ఒకేసారి చెల్లింపుల ద్వారా 3,69,655 మందికి సాంత్వన కలుగుతుంది. దీంతో అగ్రిగోల్డ్ బాధితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కాగా, డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ (డీసీఎల్) ప్రతిపాదనల ప్రకారం జిల్లాల వారీగా ఈ సొమ్మును అందజేయనున్నారు. అలాగే, రూ.20 వేలలోపు వున్న మరో 4 లక్షల మంది డిపాజిటర్లకు కూడా త్వరలో చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా వున్నట్లు అధికారులు తెలిపారు. అధిక వడ్డీల ఆశచూపి.. విజయవాడ కేంద్రంగా అవ్వా వెంకటరామారావు, మరికొందరు డైరెక్టర్లతో కలిసి 1995లో ఏర్పడిన ‘అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్’.. అనతి కాలంలోనే రోజువారీ కష్టం చేసుకునే వారితోపాటు.. చిన్నా, మధ్య తరగతి వర్గాలకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్ల ఆశచూపి వేల కోట్ల రూపాయల మేర డిపాజిట్లను సేకరించింది. వీటి ద్వారా పెద్దఎత్తున ఆస్తులను కొనుగోలు చేసింది. వివిధ రకాల స్కీంల ద్వారా సేకరించిన డిపాజిట్లకు నగదును, భూములను ఇస్తామని చెప్పి వాటిని నిర్ణీత గడువులోగా అందించలేకపోయింది. చివరికి మోసపోయామని గ్రహించిన డిపాజిటర్లు పోలీసులను ఆశ్రయించడంతో ఏపీతో పాటు పలుచోట్ల అగ్రిగోల్డ్ యాజమాన్యంపై పెద్దఎత్తున కేసులు నమోదయ్యాయి. అగ్రిగోల్డ్ ఆస్తులపై గద్దల కన్ను ఈ నేపథ్యంలో.. అగ్రిగోల్డ్ బాధితులు తమకు న్యాయం చేయాలంటూ గత ఐదేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వానికి పదేపదే విన్నవించుకున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నుంచి వారికి స్పందన కరువైంది. మరోవైపు.. గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలే బినామీ పేర్లతో వున్న అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నించారు. దీనిని గ్రహించిన అగ్రిగోల్డ్ బాధితులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రతిపక్షంలో వున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలిచింది. అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీని ఏర్పాటుచేసి అప్పటి చంద్రబాబు సర్కార్ కుట్రలను అడ్డుకుంది. ఇదే క్రమంలో ప్రజాసంకల్ప పాదయాత్రలోనూ బాధితులు అడుగడుగునా వైఎస్ జగన్ను కలిసి తమ కష్టాలను వివరించారు. న్యాయం చేయాల్సి ప్రభుత్వమే తమ కష్టాన్ని దోచుకోవాలని చూస్తోందని మొరపెట్టుకున్నారు. దీంతో తమ ప్రభుత్వం రాగానే ప్రాధాన్యతా క్రమంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానంటూ నాడు వైఎస్ జగన్ ఇచ్చిన హామీని నేడు నెరవేరుస్తున్నారు. సీఎం సభకు ఏర్పాట్లు పరిశీలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉ.11 గంటలకు గుంటూరు నగరానికి రానున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో రూ.10వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జిల్లా మంత్రులు మోపిదేవి వెంకటరమణారావు, మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, మొహ్మద్ ముస్తఫా, విడదల రజని, అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్రెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, పాదర్తి రమేష్ తదితరులు పరిశీలించారు. సీఎం సభకు బుధవారం సాయంత్రానికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ ఐ. శామ్యూల్ ఆనందకుమార్, అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ, జేసీ దినేష్కుమార్, ట్రైనీ కలెక్టర్ మౌర్య నారపురెడ్డి మంత్రులకు వివరించారు. చరిత్రలోనే తొలిసారి.. ఓ ప్రైవేటు కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును ప్రపంచంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చెల్లించిన దాఖలాలు ఎక్కడా లేవని.. పేద ప్రజలను ప్రభుత్వపరంగా ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమానికి పెద్దఎత్తున అగ్రిగోల్డ్ బాధితులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, శాసనసభ్యులు, వైఎస్సార్సీపీ అన్ని విభాగాల నాయకులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ సర్కార్ అండ!
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ కార్యరూపం దాలుస్తోంది. ఐదేళ్ల పోరాటంలో అడుగడుగునా దగాపడ్డ అగ్రిగోల్డ్ బాధితుల కల సాకారమవుతోంది. బాధితుల్లో 3,69,655 మందికి తొలివిడతలో చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధంచేసింది. గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా గురువారం (7వ తేదీ) డబ్బుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను గట్టెక్కించడానికి.. నేనున్నానంటూ ఆనాడు ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ ఇచ్చిన భరోసా నేడు బాధితులకు అండగా నిలుస్తోంది. నమ్మించిన సంస్థ నట్టేటముంచింది. ఆదుకోవాల్సిన సర్కార్ అక్రమాలకు తెగబడింది. రోజువారీ కష్టం చేసుకునేవారి నుంచి, చిన్నా, మధ్యతరగతి వర్గాలను ఆకర్షించిన అగ్రిగోల్డ్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వారి నుంచి 6,380 కోట్ల రూపాయలను సేకరించింది. ఆకర్షణీయమైన వడ్డీరేట్లు, పటిష్టమైన ఏజెంట్ల వ్యవస్థతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తోపాటు మొత్తం ఏడు రాష్ట్రాల్లో 32 లక్షల మంది నుంచి డిపాజిట్లు సేకరించింది. విజయవాడ కేంద్రంగా అవ్వా వెంకట రామారావు, మరికొందరు డైరెక్టర్లతో కలిసి 1995లో ఏర్పడిన ‘అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్’ అనతికాలంలోనే వేలకోట్ల రూపాయలను ప్రజలనుంచి సేకరించి, పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేసింది. వివిధ రకాల స్కీంలలో సేకరించిన డిపాజిట్లకు నగదును, భూములను ఇస్తామని చెప్పి వాటిని అందించలేకపోయింది. చివరికి మోసపోయామని గ్రహించిన డిపాజిట్దారులు పోలీసులను ఆశ్రయించడంతో ఏపీతోపాటు పలుచోట్ల అగ్రిగోల్డ్ యాజమాన్యంపై కేసులు నమోదయ్యాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కష్టజీవుల నుంచి మధ్యతరగతి మహిళలు పొదుపుగా దాచుకున్న మొత్తాల వరకు డిపాజిట్ల రూపంలో అగ్రిగోల్డ్కు చేరాయి. ఆస్తులను మింగేందుకు గత సర్కార్ కుట్రలు.. అవసరానికి ఆదుకుంటాయని భావించిన సొమ్ము కాస్తా.. తిరిగి రాదని గ్రహించిన అగ్రిగోల్డ్ బాధితులు తమకు న్యాయం చేయాలంటూ గత ఐదేళ్లూ చంద్రబాబు ప్రభుత్వానికి పదేపదే విన్నవించుకున్నారు. ఆదుకోవాల్సిన చంద్రబాబు సర్కార్ నుంచి స్పందన లేకపోవడం, మరోవైపు గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలే బినామీ పేర్లతో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నించడం వివాదాస్పదమైంది. సంస్థ ఆస్తులను అమ్మి, తమకు చెల్లింపులు చేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందంటూ అగ్రిగోల్డ్ బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ అగ్రిగోల్డ్ బాధితుల ఉద్యమానికి అండగా నిలిచింది. అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీని ఏర్పాటుచేసి అప్పటి చంద్రబాబు సర్కార్ కుట్రలను అడ్డుకుంది. ఇదేక్రమంలో ప్రజాసంకల్పయాత్రలోనూ అడుగుడునా అగ్రిగోల్డ్ బాధితులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను కలిసి తమ కష్టాలను వివరించారు. న్యాయం చేయాల్సి ప్రభుత్వమే తమ కష్టాన్ని కాజేయాలని చూస్తోందని మొరపెట్టుకున్నారు. వారి బాధలను విన్న వైఎస్ జగన్ తమ ప్రభుత్వం రాగానే ప్రాధాన్యతాక్రమంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటిని తుడిచే చర్యలు వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేసే నిర్ణయంపై తీర్మానం చేశారు. మొదటి బడ్జెట్లోనే బాధితుల కోసం 1,150 కోట్ల రూపాయలను కేటాయిస్తూ తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఇప్పటికే న్యాయస్థానాల పరిధిలో అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయప్రక్రియలో జాప్యం కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుగానే బాధితులకు చెల్లింపులు చేయాలనే నిర్ణయాన్ని కార్యరూపంలోనికి తీసుకువచ్చారు. 10వేల రూపాయల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు చెల్లింపులు చేసేందుకు గత నెల అక్టోబర్ 18వ తేదీన 263.99 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిషోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో ఒక్కసారిగా అగ్రిగోల్డ్ బాధితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల పరిధిలో ఒకేసారి చెల్లింపుల ద్వారా 3,69,655 మందికి న్యాయం జరుగుతోంది. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ(డీసీఎల్) ప్రతిపాదనల ప్రకారం జిల్లాల రీగా ఈ సొమ్మును బాధితులకు అందచేయనున్నారు. అలాగే ఇరవై వేల రూపాయల లోపు ఉన్న మరో 4లక్షలమంది డిపాజిట్దారులకు కూడా చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాల వారీగా అగ్రీగోల్డ్ బాధితులకు తొలిదశ పంపిణీ వివరాలు జిల్లాలు బాధితుల సంఖ్య చెల్లించే మొత్తం విశాఖపట్నం 52,005 45,10,85,805 విజయనగరం 57,941 36,97,96,900 శ్రీకాకుళం 45,833 31,41,59,741 పశ్చిమ గోదావరి 35,496 23,05,98,695 తూర్పుగోదావరి 19,545 11,46,87,619 కృష్ణాజిల్లా 21,444 15,04,77,760 గుంటూరు 19,751 14,09,41,615 ప్రకాశం 26,586 19,11,50,904 నెల్లూరు 24,390 16,91,73,466 అనంతపురం 23,838 20,64,21,009 వైఎస్సార్ కడప 18,864 13,18,06,875 కర్నూలు 15,705 11,14,83,494 చిత్తూరు జిల్లా 8,257 5,81,17,100 -
బాధితులకు భరోసా
-
అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది
సాక్షి, అమరావతి: తొలి మంత్రివర్గ సమావేశంలోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. 13 లక్షల మంది బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. చంద్రబాబు సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుని లబ్ధి పొందే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్ మాత్రం సంక్షోభం నుంచి పరిష్కారాన్ని వెతికారని తెలిపారు. మంగళవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశం జరిగింది. హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. రూ.20 వేల లోపు డిపాజిట్లు చేసిన బాధితులందరికీ ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందని.. దీనివల్ల 65 శాతం మందికి న్యాయం జరుగుతుందన్నారు. మాట ప్రకారం బాధితులను ఆదుకున్నారు: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అగ్రిగోల్డ్ బాధితులందరికీ సీఎం వైఎస్ జగన్ న్యాయం చేస్తారని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఇచ్చిన మాట ప్రకారం బాధితులను సీఎం ఆదుకున్నారన్నారు. బాధితులకు చెల్లించడానికి రూ. 1,150 కోట్లు కేటాయించారని తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా చెల్లించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ప్రైవేటు సంస్థ మోసం చేస్తే బాధితులకు ప్రభుత్వం చెల్లింపులు చేయడం దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ కేసులను సత్వరం పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందన్నారు. ఎమ్మెల్యే విడదల రజని మాట్లాడుతూ.. ఒక్క బాధితుడికి కూడా చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కోఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిధులు కేటాయించడం పట్ల బాధితులు సీఎం వైఎస్ జగన్కు ధన్యవాదాలు చెబుతున్నారన్నారు. -
సీఎం జగన్కు ధన్యవాదాలు: అగ్రిగోల్డ్ బాధితులు
సాక్షి, విజయవాడ : తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్ బాధితులకు జరిగిన అన్యాయంపై చర్చించారు. పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు బాధితులకు రూ. 1150 కోట్ల కేటాయించడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాధితులు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయాలని చూశారని.. తమని ఆదుకోవాలంటూ ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఆయన పట్టించుకోలేదని బాధితులు పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు చంద్రబాబు నిర్వాకం వల్లే చనిపోయారని, తమ బాధలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాదయాత్రలో విన్నవించుకున్నామని బాధితులు అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే భాదితులను ఆదుకుంటామని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేబినెట్లో బాధితులను ఆదుకుంటూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని, అందుకోసం అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్ మాట ఇస్తే తప్పరనే విషయాన్ని మరోసారి నిరూపితమైందని బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ సమావేశంలో మంత్రులు మేకతోటి సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే విడదల రజని, రాష్ట్ర అధికారప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ కో ఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిగతా అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని, బాధితులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని వారు పిలుపునిచ్చారు. -
‘ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ ఆదుకున్నారు’
సాక్షి, విజయవాడ : తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని సీఎం జగన్మోహన్రెడ్డి మరోసారి నిరూపించారని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కో ఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం (అక్టోబర్ 29) నాడు అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు రూ.1150 కోట్ల మంజూరు చేశారని వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పటికీ సీఎం జగన్ బాధితుల పక్షాన నిలిచారని కొనియాడారు. రేపు నిర్వహించబోయే సమావేశానికి వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ ముఖ్య ప్రతినిధులు హాజరుకానున్నట్లు అప్పిరెడ్డి తెలిపారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు భారీ ఊరట
-
అగ్రిగోల్డ్ బాధితులకు మరింత ఊరట
-
‘వైఎస్ జగన్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం’
సాక్షి, అమరావతి: ఇచ్చిన హామీలను అమలుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికి రుణపడి ఉంటామని అగ్రిగోల్డ్ బాధితులు చెప్తున్నారు. గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి అగ్రిగోల్డ్ ఆస్తులు తీసుకున్నారని, కానీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి విడత డబ్బులు విడుదల చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులకు 263 కోట్ల రూపాలను కేటాయించిన సీఎం వైఎస్ జగన్కు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హమీని తాజాగా అమలు చేయడంతో పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎన్ని ఉద్యమాలు చేసినా పట్టించుకోలేదని నేడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఐదునెలల్లోనే ఇచ్చిన మాటలను వైఎస్ జగన్ అమలు చేశారని అగ్రిగోల్డ్ బాధితులు అంటున్నారు. అగ్రిగోల్డ్ బాధితులు సంబరాలు ప్రజాసంకల్పయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేయడంతో అగ్రిగోల్డ్ బాధితులు సంబరాలు చేసుకుంటున్నారు. కృష్ణా జిల్లా పామర్రులో వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చంద్రబాబు హయాంలో తమకు ఎలాంటి న్యాయం జరగలేదని.. కానీ సీఎం జగన్ అధికారంలోకి రావడంతోనే తమ సమస్యల పట్ల దృష్టి సారించడం ఆనందంగా ఉందన్నారు. వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం వైఎస్ఆర్ జిల్లాలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి అగ్రిగోల్డ్ బాధితులు పాలాభిషేకం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్ జగన్ న్యాయం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆకేపటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. అధికారం చేపట్టిన వెంటనే జగన్ బాధితుల కోసం రూ. 1,150 కోట్లు కేటాయించారని.. అందులో మొదటి విడతగా రూ. 265 కోట్లు విడుదల చేశారన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని అంబేడ్కర్ సర్కిల్లో అగ్రిగోల్డ్ బాధితులు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బాధితుల కోసం 265 కోట్లు కేటాయించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇదే నిజమైన పండగ రోజని.. దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు నిధులు విడుదల చేసిన సందర్భంగా నెల్లూరు జిల్లాలో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో అగ్రిగోల్డ్ బాధితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు కూడా పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని అంబేద్కర్ సర్కిల్ లో అగ్రిగోల్డ్ బాధితులు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేసిందని వారు మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్న సీఎం వైఎస్ జగన్ కు విశాఖలో మహిళలు ధన్యవాదాలు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తామని ప్రకటించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలో మాకు ఇచ్చిన మాట సీఎం నిలబెట్టుకున్నారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
విజయవాడలో ఆగ్రిగోల్డ్ బాధితుల హర్షం
-
ఇచ్చిన మాటను బాధ్యతగా తిసుకునే సీఎమ్ వైఎస్ జగన్
-
గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోలేదు
-
బాధితులకు అండగా..
-
అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.1150 కోట్లు జమ
విజయవాడ : రాష్ట్రంలో రూ. ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే వారికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, ఆ వైద్యం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆయన ఆదివారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.1150 కోట్లను హైకోర్టు సమక్షంలో జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని పేదలకు 20 లక్షల ఇళ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించేందుకు అడుగులు వేస్తున్నామని అయన పేర్కొన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ పంచాయతీ వాలంటరీల నియమాక ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ప్రజల ఆశలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల రోజుల పాలన సాగిందని.. అమ్మఒడి , రైతు భరోసా, అంగన్వాడీ, ఆశా వర్కర్ల వేతనాలు వంటి గొప్ప నిర్ణయాలు ఈ నెలలోనే తీసుకున్నారని తెలిపారు. అక్రమ కట్టడాలపై ప్రభుత్వ విధానం ఎలా ఉంటుందో స్వయంగా ముఖ్యమంత్రి జగన్ చెప్పారన్నారు. రవాణా శాఖలో సిబ్బంది కొరత ఉందని.. దాన్ని రూపుమాపడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. -
అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.1150 కోట్లు జమ
-
‘అగ్రిగోల్డ్’ పరిష్కారంలో జాప్యం సరికాదు
హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితుల కేసు కోర్టులో ఉందని సాకు చూపుతూ వారి సమస్యను పరిష్కరించడంలో జాప్యం చేయడం సరికాదని, సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తానంటే ఏ కోర్టూ అభ్యంతరం తెలపదని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నా, ఆర్థికంగా బలహీనంగా ఉన్నా రూ.1,150 కోట్లు అగ్రిగోల్డ్ బాధితులకు మంజూరు చేసిందని, తెలంగాణలోని బాధితులకు రూ.500 కోట్లు కేటాయిస్తే సరిపోతుందని, దీనిలో ముందుగా రూ.300 కోట్లు మాత్రమే కేటాయించాలని కోరుతున్నారని అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించి బాధితులకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్బాబు, అడ్వొకేట్ శ్రవణ్కుమార్ అధ్యక్షతన రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జస్టిస్ లక్ష్మణరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, సీపీఐ నగర కార్యదర్శి ఇ.టి.నర్సింహ హాజరయ్యారు. జస్టిస్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ సంస్థ నిర్వాహకులను ప్రభుత్వం అప్పుడే అరెస్టు చేసి ఉంటే బాగుండేదని, కానీ ఉదాసీనంగా వ్యవహరించడంతో వారు తమ ఆస్తులను బినామీల పేరిట బదలాయించారని, ప్రస్తుతం తమ వద్ద ఏమీ లేదని అంటున్నారని, ఇందులో ప్రభుత్వ తప్పు కూడా ఉందన్నారు. బాధితుల్లో 95% మంది పేదవారేనని, ప్రభుత్వం ఎన్నింటికో ఎన్నో ఖర్చు చేస్తున్నదని, రూ.500 కోట్లు బాధితులకు ఇవ్వాలన్నారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ పశ్చిమబెంగాల్లో శారదా చిట్ఫండ్ కుంభకోణంలో మోసపోయిన బాధితులకు అక్కడి ప్రభుత్వం న్యాయం చేసిందని, ఆ సంస్థ ఆస్తులను జప్తు చేసి బాధితులకు ఇచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణలో కూడా అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసి బాధితులకు ఇవ్వాలన్నారు. ధనిక రాష్ట్రంలో రూ.500 కోట్లు ఇవ్వలేరా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని, బాధితులకు రూ.500 కోట్లు ఇవ్వడం పెద్ద సమస్య కాదని అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలో ప్రాజెక్టులు, నీళ్లు, పంపకాలపై సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ సమస్యపై కూడా దృష్టి సారించాలన్నారు. నర్సింహ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బాధితులకు న్యాయం చేసేందుకు ఎందుకు వెనకాడుతున్నదని ప్రశ్నించారు. ఇటీవల 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని, వారి సీటుకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదేళ్లలో ఎన్ని పోరాటాలు చేసినా స్పందించలేదని, జగన్ మేనిఫెస్టోలో చేర్చగానే అధికారంలోకి వచ్చారన్నారు. -
ఆ ఆస్తులను జప్తు చేయాలి
సాక్షి, విజయవాడ : బినామీ పేర్లతో అగ్రిగోల్డ్ యాజమాన్యం కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేయాలని, ఖరీదైన, విలువైన ఆస్తులను ప్రభుత్వ అవసరాల కోసం కొనుగోలు చేసి బాధితులకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 20 వేల లోపు ఉన్న అగ్రిగోల్డ్ బకాయిలను చెల్లిస్తామని చెప్పినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వం 10 వేల లోపు బకాయిలు ఉన్న వారికి నిధులు ఇస్తామంటూ జీవో జారీ చేశారని, కానీ నేటికీ ఆ నిధులు ఎవరికీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాండ్ల వెరిఫికేషన్కు హై కోర్ట్ మళ్లీ మూడు నెలల సమయం ఇవ్వడం వలన బాధితులు మరింత ఆందోళన చెందుతున్నారన్నారు. మూడు నెలల్లోగా నిధులు విడుదల చేస్తామని ఇచ్చిన వాగ్ధానం అమలు చేయాలని కోరారు. మంత్రి వర్గ సమావేశంలో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. నిధులు విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కలిసి మెమొరాండం అందజేస్తామని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన డేటా ప్రభుత్వం వద్ద ఉందని ప్రభుత్వం వద్ద ఉన్న డేటాను ప్రామాణికంగా తీసుకుని బాధితులకు చెల్లింపులు చేయాలని కోరారు. -
అగ్రిగోల్డ్ ఆస్తులు.. అధికారపార్టీ నేతలే కాజేశారు
విజయవాడ: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధిత ఉద్యమ సంఘాలు బుధవారం భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా బాధితుల సమస్యలపై చర్చ జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులు అందరూ కలిసి జేఏసీని ఏర్పాటు చేశారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అధికార టీడీపీ నేతలే కాజేశారని ఉద్యమ నేతలు మండిపడ్డారు.చంద్రబాబు వల్ల తమనకు ఎటువంటి న్యాయం జరగదని బాధితులు అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ బాధితులకు అండగా ఉంటామని ఇచ్చిన హామీ పట్ల ఉద్యమ నేతలు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే బాధితులకు చెల్లింపులు మొదలు పెడతామన్న హామీపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించుకుంటామని జేఏసీ తీర్మానించింది. రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ నేతలు పర్యటించి వైఎస్సార్సీపీకి అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల మద్ధతు కూడ గట్టాలని నిర్ణయం తీసుకుంది. -
అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ అనుమానాస్పద మృతి
హైదరాబాద్: అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ ఇమ్మిడి సదాశివ వరప్రసాద్ సోమవారం హైదరాబాద్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. విజయవాడ దుర్గాపురం ప్రాంతానికి చెందిన సదాశివ వరప్రసాద్(69) అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్గా ఉన్నారు. హైదరాబాద్ మెహిదీపట్నంలో ఉంటున్న మేనల్లుడు లావణ్యకుమార్ వద్దకు సోమవారం ఉదయం ఆయన విజయవాడ నుంచి రైళ్లో బయలుదేరారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రైలు దిగిన ఆయన పార్సిల్ కార్యాలయం వైపు నడుచుకుంటూ వెళుతూ రోడ్డు మీద పడిపోయారు. వెంటనే స్థానికులు గమనించి ‘108’కు సమాచారం అందించారు. ‘108’సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించగా అప్పటికే ఆయన మరణించినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. సాయంత్రం విషయం తెలుసుకున్న బంధువులు పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. నెలన్నర క్రితం ఆయనకు ఒకసారి గుండెపోటు వచ్చిందని, ఇప్పుడు గుండెపోటుతోనే మరణించారని, పోస్టుమార్టం లేకుండా మృతదేహాన్ని అప్పగించాలన్నారు. అయితే, పోలీసులు దీనికి ఒప్పుకోలేదు. మృతుడు అగ్రి గోల్డ్ సంస్థ కేసులో నిందితుడిగా ఉండటంతో పోస్టుమార్టం తర్వాతనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఇన్స్పెక్టర్ నిరంజన్రెడ్డి వారికి స్పష్టం చేశారు. -
‘చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతున్నారు’
సాక్షి, అమరావతి : అగ్రిగోల్డ్ బాధితులుకు రూ.250 కోట్లు ఇచ్చినట్లుగా ప్రభుత్వం చెప్పుకుంటోందని.. ఆ డబ్బు ఎవరికి ఇచ్చిందో చెప్పాలని, చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతున్నారని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులు సేకరించిన బాధితుల డేటా ఏమైందని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ కంపెనీకి ఎన్ని సిస్టర్ కంపెనీలు ఉన్నాయో అన్నింటిని విచారించాలని కోరారు. అగ్రిగోల్డ్ డైరెక్టర్ తప్పించుకు తిరిగితే.. సీఎం చంద్రబాబు సిగ్గుమాలిన స్టేట్మెంట్లు ఇస్తారని, అవ్వాస్ రామారావును పట్టిస్తే.. నజరానా అని చెప్పడం సిగ్గుచేటన్నారు. అరెస్ట్ చేసిన వెంటనే బెయిల్ ఇచ్చి పంపించారన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం, ప్రభుత్వం నిర్వాకానికి 8 రాష్ట్రాల్లో 32లక్షల మంది 6,800కోట్లు, ఏపీలో 19.52లక్షల మంది రూ. 3960కోట్ల ధనం మోసపోయారన్నారు. 2014లో చంద్రబాబు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లామని కానీ ఆయన అగ్రి బాధితులను పట్టించుకోలేదన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి మా తరుపున గళమెత్తారన్నారు. ప్రభుత్వం కేసును జాప్యం చేస్తూ వచ్చిందన్నారు. ఐదేళ్ల క్రితం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా.. ఇప్పటికీ న్యాయం జరగలేదని అసెంబ్లీ సాక్షిగా 20వేల లోపు ఉన్న బాధితులు 13లక్షల మంది ఉన్నామని వాళ్లకు నాలుగు నెలలలోపు సహాయం చేస్తామని చెప్పి బాబు మోసం చేశారన్నారు. జీవో 724తో చనిపోయిన వాళ్లకు న్యాయం చేస్తామన్నారని కానీ ఆ జీవో కోసం కూడా పోరాడాల్సివచ్చిందన్నారు. జగన్ పోరాడితే 5 లక్షల ఆర్థిక సహాయానికి ప్రభుత్వం ఒప్పుకుందని, అది కూడా స్వల్ప మందికే అందిందని వాపోయారు. నిరాహార దీక్ష చేస్తే కేసులు పెట్టి ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుందన్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చేత సహాయం అందిస్తామని ప్రకంటిచారు కానీ న్యాయం దక్కని పరిస్థితి ఏర్పడిందన్నారు. -
అరణ్య రోదనగా అగ్రిగోల్డ్ బాధితుల సమస్య
సాక్షి, ఒంగోలు సిటీ: అగ్రిగోల్డ్ బాధితుల గోడు అరణ్య రోదనగానే మిగిలిందని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా కన్వీనర్, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు అన్నారు. స్థానిక అగ్రిగోల్డ్ బాధితుల శిబిరం వద్ద మంగళవారం బాధితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల గోడు ఎవ్వరికీ పట్టడం లేదన్నారు. రాష్ట్రంలో 12.5 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల కోసం జగన్మోహన్రెడ్డి వారి పక్షాన నిలిచి అనేక ధర్నాలు, ఆందోళనలను చేసిన నేపథ్యంలో ప్రభుత్వం రూ.250 కోట్ల నిధులను కేటాయించిందని తెలిపారు. అయితే బాధితులకు ఈ నిధుల పంపిణీలో ఒక పద్ధతి లేదన్నారు. రూ.10 వేలు లోపు కట్టిన వారికి చెల్లింపులు చేస్తున్నారని, ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారు 35 శాతం వరకు ఉంటారని తెలిపారు. దీనికితోడు బాధితులు మొత్తాన్ని ఒంగోలుకు రావాలని ఒకే పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. బాధితులకు సరైన సమాచారం ఇవ్వడం లేదన్నారు. పశ్చిమ ప్రకాశం యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, పుల్లలచెరువు ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి రావాల్సి వస్తోందన్నారు. సుమారు 200 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడకు వస్తున్నా సరైన సమాచారం ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ మంది లబ్ధిదారుల బాండ్లు వారి పిల్లల పేర్లపై ఉంటే శిబిరంలో పిల్లలను తీసుకురమ్మని, బాండ్లు ఎవరి పేరిట ఉంటాయో వారిని తీసుకురమ్మని తిరిగి వెనక్కి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.10 వేల లోపు బాండ్లు ఉన్న వారికి డబ్బు చెల్లించాలంటే రూ.364 కోట్లు అవసరమని కానీ ప్రభుత్వం వెచ్చించింది కేవలం రూ.250 కోట్లు మాత్రమేనన్నారు. అగ్రిగోల్డ్కు డబ్బు కట్టిన వారి బాధ అరణ్య రోదనగానే మిగిలిందన్నారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో, డివిజన్, నియోజకవర్గాల కేంద్రాల్లో శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులకు ఈ ప్రయాణ ఖర్చులు తగ్గించి వెంటనే పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు ఇచ్చే సమాచారాన్ని సక్రమంగా వారికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండల కేంద్రంలో బాధితుల వివరాలు సేకరించి కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి న్యాయం చేయాలని కోరారు. -
కట్టలు తెంచుకున్న ఆగ్రహం
విజయనగరం టౌన్: అగ్రిగోల్డ్ బాధితుల ఆవేశం కట్టలు తెంచుకుంది. జిల్లా నలుమూలల నుంచి ఎంతో వ్యయప్రయాసలకోర్చి జిల్లాకు చేరుకున్న బాధితులు మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచే జిల్లా కోర్టు ప్రాంగణం వద్ద బారులు తీరారు. తీరా టోకెన్లు ఇవ్వడం జరగదనే విషయాన్ని తెలుసుకున్న వారంతా ఒక్కసారిగా కోపోద్రిక్తులై రోడ్డెక్కి నిరసన తెలిపారు. జాతీయ రహదారిని ముట్టడించారు. న్యాయసేవాసదన్ కార్యాలయంపై దాడులు చేసి అద్దాలు ధ్వంసం చేశారు. సంస్ధ చైర్మన్ ఆలపాటి గిరిధర్, సంస్థ కార్యదర్శి లక్ష్మీరాజ్యంలను బాధితులు నిలదీశారు. దీంతో వారు బాధితులకు సర్దిచెప్పి, వెనువెంటనే సాధారణంగా ఇచ్చే టోకెన్ల కౌంటర్లతో పాటూ అదనంగా మరో మూడు కౌంటర్లు ఏర్పాటుచేశారు. మార్చి 11తో ముగియాల్సిన ప్రక్రియ ఈ నెల 22 వరకూ పెంచుతున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. రోడ్డెక్కిన నిరసన వేకువజామున 4 గంటల నుంచి అగ్రిగోల్డ్ బాధితులు జిల్లా న్యాయసేవాసదన్ కార్యాలయం వద్ద బారులు తీరారు. సుమారు ఆరువేల మంది బాధితులు టోకెన్ల కోసం చేరుకున్నారు. అప్పటికే టోకెన్లు ఇవ్వరన్న విషయం తెలుసుకున్న బాధితులు నిరసన గళం వినిపించారు. మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున తమ నిరసన వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణమంతా బాధితులతోనే నిండిపోయింది. దీంతో కోర్టు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయమేర్పడింది. పోలీసుల అదుపులో నలుగురు అగ్రిగోల్డ్ బాధితుల ఆక్రోశానికి టోకెన్ల కౌంటర్ల అద్దాలు పగిలిపోయాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల రంగ ప్రవేశం చేసి, పరిస్థితిని అదుపుచేశారు. అనంతరం జిల్లా న్యాయసేవాసదన్ ప్రతినిధులు టోకెన్ల ప్రక్రియను పోలీసులకు అప్పగించారు. దీంతో బుధవారం నుంచి పోలీసుల సమక్షంలో టోకెన్ల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. సరైన ధ్రువపత్రాలు తీసుకురావాలి పోలీసుల అదుపులో టోకెన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో టోకెన్లకు వచ్చే వారు తప్పనిసరిగా అగ్రిగోల్డ్ ఒరిజినల్ బాండ్ పేపర్ను చూపించాల్సి ఉంటుంది. అదే విధంగా ఏరోజైతే టోకెన్పై వెరిఫికేషన్కి ఇచ్చారో ఆ రోజున ఒరిజినల్స్ జెరాక్స్ కాపీలు, రెవెన్యూ స్టాంప్, తదితర వాటిని సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే సహించేది లేదు. ఇప్పటికే ఈ విషయంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. మరికొందరిని గుర్తిస్తున్నాం. బాధితులు సంయమనం పాటించాలి.– ఫక్రుద్దీన్, రూరల్ ఎస్ఐ, విజయనగరం -
దగాపడ్డ జీవితాలు
-
‘ఆందోళన ఉదృతం చేస్తాం’
సాక్షి, హైదరాబాద్ : తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాచౌక్లో అగ్రిగోల్డ్ భాదితులు ఆందోళన చేపట్టారు. తెలంగాణాలో అగ్రిగోల్డ్ కష్టమర్లుకు రావలసిన 500 కోట్లు ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణాలో ఉన్న సుమారు 1200 ఎకరాల అగ్రిగోల్డ్ భూమిని వెంటనే వేలం వేసి న్యాయం చేయాలని కోరారు. ఏపీలో మాదిరిగానే తెలంగాణాలో కూడా మరణించిన బాధితులకు 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. -
ఇదేం ఖర్మరా ‘బాబు’..!
అగ్రిగోల్డు బాధితులకు నాలుగున్నరేళ్లుగా కంటిమీద కునుకు కరువైంది. సంస్థ బోర్డు తిప్పేయడంతో డిపాజిట్దారులు రోడ్డున పడ్డారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం అలక్ష్యం ప్రదర్శించింది. బాధితుల ఆందోళనతో గత ఏడాది పోలీస్ అధికారుల పర్యవేక్షణలో బాధితుల వివరాలను నమోదు చేయించింది. ఇప్పుడు ఆ వివరాలను పక్కనపెట్టి... మళ్లీ న్యాయసేవాధికార సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల వేళ రూ.10వేల లోపు డిపాజిట్ల చెల్లింపునకు శ్రీకారం చుట్టింది. డబ్బుల మాటను పక్కన పెడితే దరఖాస్తుల పరిశీలనకు రోజంతా తిండిలేకుండా క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. బాధితుల సంఖ్య అధికంగా ఉండడం.. నమోదు గడువు తక్కువగా ఉండడంతో బాధితులు కలవరపడుతున్నారు. ఆ ఇచ్చే డబ్బులూ అందుతాయోలేదోనని బెంగపడుతున్నారు. కోర్టు ఆవరణలో పడిగాపులు కాస్తున్నారు. ఇదేం ఖర్మరా ‘బాబు’ అంటూ నిట్టూర్చుతున్నారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: కొడుకు చదువుకోసం.. ఆడపిల్లల పెళ్లికోసం.. వాహనాల కొనుగోలుకు.. ఇళ్ల నిర్మాణం కోసం.. తినీతినక, చెమటను ధారబోసి రూపాయిరూపాయి కూడబెట్టి సంపాదించిన డబ్బులను అగ్రిగోల్డ్ సంస్థలో పేద, మధ్య తరగతి ప్రజలు పొదుపు చేశారు. ఇరవై ఏళ్లుగా సంస్థ సేవలందిస్తుందనే నమ్మకంతో పొదుపు ఖాతాల్లో డిపాజిట్లు పెట్టారు. దురదృష్టవశాత్తూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఒక్కసారిగా అందరూ ఆర్థిక కష్టాల్లో పడిపోయారు. ప్రభుత్వం ఆదుకుంటుందని ఖాతాదారులందరూ ఆశించారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగకపోవడంతో వీరంతా ఆవేదనలో మునిగిపోయారు. కొందరుకొత్త అప్పులు చేశారు. కొందరు ప్రాణాలు తీసుకున్నారు. ఇప్పుడు తాము కట్టిన డబ్బుల కోసం నానా తిప్పలు పడుతున్నారు. సంఖ్య అధికం.. గడువు స్వల్పం జిల్లాలో 1,78,470 మంది అగ్రిగోల్డ్ బాధితుండగా వీరికి చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.765 కోట్లు ఉంది. దీంతో గడిచిన నాలుగున్నరేళ్లలో జిల్లాలో 18 మంది అగ్నిగోల్డ్ బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయిన వారిలో సగం మందికి నేటికీ పరిహారం అందలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది. బాధితుల్లో రూ.10వేల లోపు డిపాజిట్లు కట్టినవారికి తిరిగిస్తామని ప్రకటించింది. జిల్లాలో అలాంటి వారు సుమారు 30 వేల మంది ఉన్నారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 11 లోపు డాక్యుమెంట్లు పరిశీలించేందుకు గడువు ఇచ్చారు. ఈ ప్రక్రియ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరుగుతోంది. అయితే, జిల్లా మొత్తం మీద బాధితులు వివరాలు నమోదు చేసుకోవడానికి విజయనగరం జిల్లా కేంద్రంలో మాత్రమే ఆరు కౌంటర్లు ఏర్పాటు చేసి అవకాశం కల్పించారు. అయితే, ఆ గడువు ఏ మాత్రం సరిపోదని బాధితులు చెబుతున్నారు. గడిచిన మూడు రోజుల్లో కేవలం సుమారు 650 మంది ఖాతాదారుల పత్రాల పరిశీలనే పూర్తయ్యింది. కౌంటర్లు, సిబ్బంది సంఖ్య పెంచాలి జిల్లా వ్యాప్తంగా న్యాయసేవాధికార సంస్థకు సంబంధించిన తొమ్మిది కేంద్రాలు విజయనగరం, ఎస్.కోట, కొత్తవలస, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, కురుపాంలో ఉన్నాయి. వీటన్నింటిలో డాక్యుమెంట్ల పరిశీలనకు అవకాశం ఇచ్చి ఉంటే కాస్త ఊరట ఉండేది. కానీ అలా జరగకపోవడం వల్ల కొద్దిపాటి మొత్తం కోసం జనం నానా అవస్థలు పడుతున్నారు. తాము కట్టిన డబ్బులు తమకు వస్తాయో, రావోననే ఆందోళనలో జిల్లా నలుమూల నుంచి వచ్చి న్యాయసేవాధికార సంస్థ వద్ద పత్రాల పరిశీలనకు పోటీ పడుతూ, ఎండల్లో అవస్థలు పడుతూ, లైన్లలో నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలో తగిన కౌంటర్లు, సిబ్బందిని కేటాయించాలని కోరుతున్నారు. దీనిని గుర్తించిన హైకోర్టు జిల్లా కలెక్టర్ సహకారం తీసుకోవాల్సిందిగా న్యాయసేవాధికార సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. చాలా మందికి అన్యాయం ఒరిజనల్ బాండ్, ఒరిజినల్ ఆధార్ కార్డు, ఒరిజినల్ బ్యాంకు బుక్, రెండు జతల నకళ్లు తీసుకుని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు వెళితే అక్కడ పరిశీలించి, అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ అయితే ఆ జాబితానే జిల్లా కలెక్టర్కు అందిస్తారు. వారంలో కలెక్టర్ పరిశీలించిన నివేదిక ఆధారంగా మార్చి 20 లోపు బాధితుల బ్యాంకు ఖాతాలో కొంత మొత్తాన్ని వేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు కేవలం ఒకేసారి ఫిక్సిడ్ డిపాజిట్ చేసిన వారికి మాత్రమే అది కూడా రూ.పదివేల లోపు ఉంటేనే డిపాజిట్ తిరిగిస్తామంటున్నారు. కానీ చాలా మంది చిరు వ్యాపారులు, పేదలు రోజువారీ, పదిహేనురోజులకోసారి, నెలవారీ కొంత మొత్తాల చొప్పున చెల్లించారు. వారికి తాజా ప్రక్రియలో ఎలాంటి ప్రయోజనం లేదు. వారు కట్టిన డబ్బులు లెక్కలోకి తీసుకోవడం లేదు. 2014లో ఒరిజినల్ బాండ్లను అగ్నిగోల్డ్ సంస్థ వెనక్కు తీసుకుంది. ఖాతాదారుల వద్ద వాటి నకళ్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ నకళ్లను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల వారు నష్టపోతున్నారు. ఏజెంట్లపై పెరుగుతున్న ఒత్తిడి అగ్రిగోల్డ్ బాధితులు ప్రతీ జిల్లాలో 70 వేల మంది వరకూ ఉన్నారు. ఒక్కో కౌంటర్లో రోజుకి 100 నుంచి 150 మంది పత్రాల పరిశీలనే పూర్తవుతోంది. కనీసం రోజుకి వెయ్యి మంది పత్రాలు పరిశీలించినా 70 రోజులు పడుతుంది. ఇచ్చిన గడువు కేవలం 15 రోజులే. అది ఏ మాత్రం సరిపోదు. సబ్ కోర్టుల్లో కూడా అవకాశం కల్పించి ఉంటే కొంతలో కొంత ప్రయోజనం ఉండేది. తాజా ప్రక్రియతో ఏజెంట్లపై ఒత్తిడి పెరుగుతోంది.– మజ్జి సూరప్పడు, జిల్లా అధ్యక్షుడు,అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయనగరం -
‘అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేయటానికే వారి కుట్రలు’
సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేయటానికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్లు కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 20 లక్షల అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను ప్రభుత్వం ఆటకెక్కించిందని మండిపడ్డారు. తాము పోరాటం చేస్తుంటే ప్రభుత్వం హడావిడి చేస్తోందని విమర్శించారు. 1183 కోట్లు ఇస్తే 80 శాతం మందికి న్యాయం జరుగుతుందని, కానీ ప్రభుత్వం దగ్గరనుంచి స్పందన లేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. క్యాబినేట్ సమావేశంలో అగ్రిగోల్డ్ అంశం లేదని, కానీ టీడీపీ గెజిట్ పత్రికల్లో అగ్రిగోల్డ్ బాధితులకు 250 కోట్లు.. అని రాశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తూ అగ్రిగోల్డ్ అంశం ఎక్కడా తేకపోవడం దురదృష్టకరమన్నారు. సీబీసీఐడీ వెంటనే అగ్రిగోల్డ్ ఆస్తుల లిస్ట్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ వాచ్డాగ్లా అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడిందని తెలిపారు. ఫిబ్రవరి 4న విజయవాడ ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. బినామీ ఆస్తులు ఎందుకు సీజ్ చేయడం లేదని ప్రశ్నించారు. ‘అఖిలపక్షం కాదు.. పక్షాలు పోయాయి, పక్షులు మిగిలాయి.. టీడీపీ ఏకాకిగా మిగిలింది’ అంటూ ఎద్దేవా చేశారు. -
ఎన్నికల ముందు కంటితుడుపు ప్రకటనలు
-
‘అగ్రి’ బాధితుల ఏరివేత!
సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్లుగా దాదాపు 20 లక్షల మంది అగ్రిగోల్డ్ డిపాజిటర్ల జీవితాలతో చెలగాటమాడుతూ సంస్థకు చెందిన విలువైన భూములను కాజేసే ఎత్తుగడతో కాలక్షేపం చేసిన టీడీపీ సర్కారు ఎన్నికల ముందు మరో మోసానికి సిద్ధమైంది. అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంఖ్య డేటాతో సరిపోలడం లేదంటూ బాధితుల ఏరివేత చర్యలకు పాల్పడుతోంది. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులందరికీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని, వారికి రూ.1,182 కోట్లను చెల్లిస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రతిపక్షనేత చేసిన ప్రజాసంకల్ప పాదయాత్రలో పలుచోట్ల అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులు పెద్ద ఎత్తున పాల్గొ న్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో అధికారికంగా ఎటువంటి నిర్ణయం తీసుకో కుండానే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.200 కోట్లు ఇస్తుందని, దీనికి అదనంగా ఆస్తుల వేలం ద్వారా రూ.50 కోట్లు ఇస్తామని ప్రకటించారు. అయితే ఇదంతా కేవలం ప్రతిపక్ష నేత ఇచ్చిన హామీకి భయపడే తప్ప ముఖ్యమంత్రికి ఇందులో ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు నిజంగా అగ్రిగోల్డ్ డిపాజిట్దారులను అదుకోవాలనే ఉద్దేశం ఉంటే నాలుగున్నరేళ్లుగా ఎందుకు ముందుకు రాలేదని అధికార వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. బాధితులను ఆదుకోకుండా విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయటంపైనే ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక హోదా దగ్గర నుంచి అగ్రిగోల్డ్ వ్యవహారం దాకా ప్రతిపక్ష నేత బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నడుస్తున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రతిపక్ష నేత ఏది చెబితే దాన్ని సీఎం కాపీ కొడుతున్నారని పేర్కొంటున్నాయి. ఆస్తులను తగ్గించి చూపే యత్నం.. రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్ డిపాజిట్దారులు 19.52 లక్షల మంది ఉండగా రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన వారు 13.83 లక్షల మంది ఉన్నారు. వీరికి రూ.1,182.17 కోట్లు చెల్లించాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వమే తేల్చింది. టీడీపీ సర్కారు కేవలం రూ.200 కోట్లు మాత్రమే చెల్లిస్తామంటూ ప్రకటించడం బాధితులను మోసగించడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరోపక్క అగ్రిగోల్డ్ ఆస్తులను తగ్గించి చూపే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. తొలుత సీఐడీ దర్యాప్తులో అగ్రిగోల్డ్కు 16,857.81 ఎకరాలున్నట్లు తేలింది. పలు ప్రాంతాల్లో అగ్రిగోల్డ్కు ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు, పవర్ ప్రాజెక్టులు, అవెన్యూ ప్లాంటేషన్, డెయిరీ ఫారాలు, మల్టీ ప్రొడెక్ట్స్, హాయ్ల్యాండ్, ఆఫీసు భవనాలు ఉన్నట్లు నిర్ధారించింది. అయితే డిపాజిట్ దారుల సంఖ్యను కుదించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం డేటా, నగదు వివరాలు సరిపోలడం లేదంటూ బాధితులకు ఏకంగా రూ.2,250 కోట్ల మేర ఎగనామం పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. -
అగ్రిగోల్డ్ ఆస్తుల కైవసానికి బాబు కుట్ర
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ కేసు పరిష్కారం కాకుండా వైఎస్సార్సీపీ అడ్డుపడుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చేసిన ఆరోపణలను బొత్స తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ ఆస్తులను కారుచౌకగా కొట్టేసి బాధితులకు అన్యాయం చేయాలని చూస్తున్న ప్రభుత్వ పెద్దలు వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. గతంలో సదావర్తి సత్రం భూములను కొట్టేయాలని చూస్తే.. వైఎస్సార్సీపీ అడ్డుకట్ట వేసిందని గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేయడానికి ఎస్సెల్ గ్రూపు ప్రతినిధులు ముందుకు రాకుండా.. ఢిల్లీలో చంద్రబాబు అర్ధరాత్రి రహస్య చర్చలు సాగించిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. కేబినెట్ మంత్రులు వివరణ ఇవ్వరా? ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై తీవ్ర ఆరోపణలు వచ్చినా కేబినెట్ మంత్రులు వివరణ ఇచ్చేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని బొత్స ప్రశ్నించారు. ‘అగ్రిగోల్డ్ వ్యవహారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పరిధిలోకి వస్తుంది. ఆయన మాత్రం పెదవి విప్పకుండా కుటుంబరావుతో మాట్లాడిస్తున్నారని’ తెలిపారు. గతంలో సత్యం కుంభకోణం వెలుగు చూసిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్పందించి.. ఆ సంస్థను స్వాధీనం చేసుకుని ఉద్యోగులను ఆదుకోవాలని, వాటాదారులకు సాయంగా ఉండాలని, విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని బొత్స గుర్తు చేశారు. నాలుగన్నరేళ్లు రాష్ట్ర సమస్యలను గాలికొదిలి.. ఓట్ల కోసం కడప స్టీల్ ప్లాంట్, ఎయిర్పోర్టు, పోర్టులకు శంకుస్థాపన చేసి మభ్యపెట్టాలని చూస్తే నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పారు. కాగా, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసును జాతీయ విచారణ పరిశోధన సంస్థ (ఎన్ఐఏ)కి అప్పగించడం శుభపరిణామమని బొత్స అన్నారు. హైకోర్టు విభజననను కూడా తాను ఇచ్చిన లేఖకు భిన్నంగా రాజకీయం చేయడం బాబుకే చెల్లిందని బొత్స దుయ్యబట్టారు. టీడీపీ, జనసేన పార్టీలు ఒకే పక్షమని..బయటకు మాత్రం అప్పుడప్పుడూ తిట్టుకుంటూ విడిపోయామని కలరింగ్ ఇస్తున్నారనే విషయాన్ని గుర్తించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు టీడీపీ నేతలను ప్రతిచోటా నిలదీస్తున్నారని గుర్తుచేశారు. చుక్కల భూముల పేరుతో అతి పెద్ద స్కాం చుక్కల భూముల పేరుతో రాష్ట్రంలో అతి పెద్ద స్కామ్ జరుగుతోందని బొత్స అన్నారు. ఈ భూములను ఒకే సామాజికవర్గం వారికి చెందేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను చంద్రబాబు సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుందట కదా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ‘ ఎందుకు సుప్రీం కోర్టుకు వెళుతున్నారు. హత్యాయత్నం వారి కుట్ర కాదా? చంద్రబాబు, నారా లోకేష్, డీజీపీ భాగస్వామ్యం ఇందులో లేదా? నిజంగా వారి ప్రమేయం లేకపోతే ఎందుకు ఎన్ఐఏ విచారణను అడ్డుకోవాలి?’ అని బొత్స ప్రశ్నించారు. రాజధాని నిర్మించకుండానే గ్రాఫిక్స్లో అద్దాల కలలు చూపిస్తున్నారని, ప్రజా సమస్యలను వదిలేసి విదేశీ పర్యటనలు, సభలకు ప్రజాధనం వృథా చేస్తున్నారని దుయ్యబట్టారు. -
అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టండి
చిత్తూరు కలెక్టరేట్: నాలుగన్నర సంవత్సరాలుగా బాధితులను ఆదుకోకుం డా అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకుంటున్న అవినీతి టీడీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టండంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గురువారం చిత్తూరులోని కలెక్టరేట్ ఎదుట అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ధర్నా చేపట్టారు. తొలుతనగర అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు దుర్గమ్మ ఆలయం నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నా శిబిరంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు తమ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేపట్టామన్నారు. శాసనసభలో దీనిపై తొలిసారి తమ పార్టీయే గళం విప్పిందన్నారు. బాధితులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడకూడదని సూచించారు. వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి, ఆ సొమ్మును బాధితులకు అందజేయాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై టీడీపీ కన్నుపడిందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, కుమారుడు లోకేశ్, మంత్రులు అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకునేందుకు ప్రయత్నిం చడం దారుణమన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19.70 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకుండా టీడీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. 1995 నుంచి అగ్రిగోల్డ్ చిన్న రైతులు, అన్ని వర్గాల నుంచి డిపాజిట్లు సేకరించిందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక కుంభకోణం ఏదైనా ఉందంటే అది అగ్రిగోల్డేనన్నారు. అలాంటి వారికి టీడీపీ ప్రభుత్వం మద్ధతు పలికి చర్యలు చేపట్టకపోవడం దారుణమని మండిపడ్డారు. ఇదంతా సీఎం చంద్రబాబునాయుడు అసమర్థపాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా 260 మంది మృతి చెంది తే 140 మందికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. టీడీపీ మంత్రులు పత్తిపాటి, సుజనాచౌదరిలు అగ్రిగోల్డ్ భూములను దోచుకుంటున్నారని విమర్శించారు.అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డీఆర్వో గంగాధరగౌడ్కు వినతిపత్రాన్ని అందజేశారు. ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గాంధీ, జెడ్పీ మాజీ చైర్మన్ కుమారరాజా, ఈసీ మెంబర్ పురుషోత్తంరెడ్డి, అగ్రిగోల్డ్ బాసట కమిటీ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, బంగారుపాళెం మాజీ ఎంపీపీ సుగుణాకర్రెడ్డి, వేల్కూరు బాబురెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ నాయకుడు గోవిందన్ తదితరులు పాల్గొన్నారు. -
తిన్నదంతా కక్కిస్తాం..
అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్ సీపీ బాసటగా నిలిచింది. బాధితులకు మేమున్నామంటూ భరోసా ఇచ్చింది. ఆత్మహత్యలకు పాల్పడవద్దని ధైర్యం చెప్పింది. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే న్యాయం చేస్తామని ప్రతిపక్ష నేత, పార్టీ జాతీయ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హామీనిచ్చారని.. బాధితులు ఎవరూ అధైర్యపడవద్దంటూ పిలుపునిచ్చింది. బాధితుల పక్షాన నిలవాల్సిన అధికార టీడీపీ.. అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయడానికి చూస్తోందంటూ మండిపడింది. రానున్నది రాజన్న ప్రభుత్వమని, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తిన్నదంతా కక్కించి బాధితులకు పంచిపెడతామని స్పష్టం చేసింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వేదికగా అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా వైఎస్సార్ సీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ జిల్లా అధ్యక్షుడు నడింపిల్లి కృష్ణంరాజు ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టింది. విశాఖపట్నం, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): వైఎస్సార్ సీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయ్కుమార్ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బాధితులకు చెల్లించాల్సిందిపోయి వాటిని దోచుకోవడానికి చంద్రబాబు అండ్ కో బృందం కుట్ర పన్నుతుందని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉండగా.. 9 లక్షల వరకు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తాత్సారం వల్ల అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా వైఎస్సార్ సీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేయాలని, బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపాలని తమ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే రూ.1153 కోట్లు ఇచ్చి 80 శాతం మంది బాధితులకు న్యాయం చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మిగతా బాధితులకు కూడా రావల్సిన ప్రతి పైసా చెల్లిస్తామన్నారని చెప్పారు. బాధితులకు సంస్థ చెల్లించాల్సిన మొత్తం కన్నా సంస్థ ఆస్తులు అధికంగా ఉన్నాయని స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రజలు బలి పార్టీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఆయన తనయిడు లోకేష్ స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్ని బలి చేస్తున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలవాల్సిన ప్రభుత్వం.. సంస్థ ఆస్తులను కబ్జా చేసేందుకు పాకులాడుతోందని ఆరోపించారు. బాధితులు 90 రోజులు ఓపిక పడితే.. తమ ప్రభుత్వం రాగానే పూర్తిగా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందన్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి మాట్లాడుతూ బాధితులంతా ధైర్యంగా ఉండాలని, చంద్రబాబు ప్రభుత్వం అంతిమయాత్రకు సిద్ధంగా ఉందని చెప్పారు. పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలోనే అగ్రిగోల్డ్ వ్యవహారం ఓ పెద్ద స్కామ్ అని విమర్శించారు. పేదలకు అండగా నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం వారి ఉసురు పోసుకుంటోందని ఆక్షేపించారు. పార్టీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సంస్థకు వేల కోట్లు ఆస్తులున్నా.. బాధితులకు చెల్లించకపోవడం శోచనీయమన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పైడి వెంకటరమణమూర్తి మాట్లాడుతూ బాధితులు ఎవరూ ప్రాణత్యాగాలకు పాల్పడవద్దని, తమ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి ప్రాధాన్యతగా బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్య చాలా పెద్దదని, పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బుని టీడీపీ నాయకులు దోచుకోవాలనుకోవడం సిగ్గుచేటన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు కొయ్య ప్రసాదరెడ్డి, బొల్లవరపు జాన్వెస్లీ మాట్లాడుతూ టీడీపీ సర్కారు చాలా మంది అగ్రిగోల్డ్ బాధితుల్ని నడిరోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శులు రొంగలి జగన్నాథం, సనపల చంద్రమౌళి, అదనపు కార్యదర్శి గుడిమెట్ల రవికుమార్(రవిరెడ్డి), మైనార్టీ విభాగం నాయకులు ఐహెచ్ ఫారూఖి, బర్కత్ ఆలీ, మహ్మద్ షరీఫ్, బీసీ సెల్ నాయకుడు కె.రామన్నపాత్రుడు, యువజన విభాగం రాష్ట్ర నాయకుడు తుల్లి చంద్రశేఖర్, ఎస్సీ సెల్ నాయకులు రెయ్యి వెంకటరమణ, ప్రేమ్బాబు, మహిళా విభాగం నాయకులు పీలా వెంకటలక్ష్మి, శ్రీదేవివర్మ, రాష్ట్ర నాయకుడు ఆదివిష్ణు, పలు వార్డుల అధ్యక్షులు, నగర, జిల్లా, రాష్ట్ర నాయకులతో పాటు అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ నియోజకవర్గ కన్వీనర్లు మొల్లి అప్పారావు(తూర్పు), పీతల వాసు(దక్షిణ), పామేటి బాబ్జి(ఉత్తరం), పల్లా పెంటారావు(గాజువాక), కోరాడ ముసలినాయుడు(భీమిలి), దాడి సత్యనారాయణ(పశ్చిమ), బి.వెంకట్రావు(ఎస్.కోట), పెద్ద ఎత్తున అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు. డీఆర్వోకు వినతి వైఎస్సార్ సీపీ నాయకులు, బాధితులు ధర్నా అనంతరం కలెక్టరేట్కు ర్యాలీగా తరలివెళ్లారు. అక్కడ డీఆర్వో చంద్రశేఖర్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ముందుగా యలమంచిలికి చెందిన అగ్రిగోల్డ్ ఏజెంట్ తాతబాబు ఇటీవల గుండెనొప్పితో చనిపోవడంతో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తాతబాబు కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రకరకాలుగా మోసం చేశారు.. నేను టీకొట్టు వ్యాపారిని. టీం లీడర్గా పనిచేశాను. నా కింద 45 మంది ఏజెంట్లు ఉన్నారు. డైరెక్టర్లు మమ్మల్ని రకరకాలుగా మోసం చేసి వ్యాపారం చేయించుకున్నారు. చివరికి నడిరోడ్డుపై పడేశారు. – జి.అప్పారావు, అగ్రిగోల్డ్ బాధితుడు వైఎస్సార్ సీపీపైనే ఆశలు వైఎస్సార్ సీపీపైనే అగ్రిగోల్డ్ బాధితులంతా ఆశలు పెట్టుకున్నారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మా కష్టాలు, బాధలు తీరుస్తారన్న నమ్మకం ఉంది. తమకు న్యాయం చేస్తే జగన్కు జీవితాంతం రుణపడి ఉంటాం. 2007లో అగ్రిగోల్డ్లో జాయిన్ అయ్యాను. 2014 వరకు టీమ్లు వేశాను. కంపెనీ మోసం చేసిందనుకుంటే.. వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మమ్మల్ని నాలుగేళ్లుగా మోసం చేసుకుంటూ వచ్చారు.– జి.లక్ష్మి, అగ్రిగోల్డ్ బాధితురాలు -
ఆగ్రి గోల్డ్ బాధితులకు బాసటగా
-
నేడు అగ్రిగోల్డ్ బాధితులకు ‘బాసట’
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్సీపీ బాసట కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం శనివారం మద్దిలపాలెం నగర పార్టీ కార్యాలయంలో జరగనుంది. ఈసమావేశానికి ముఖ్యఅతిథులుగా పార్టీ రాష్ట్ర ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ, అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్సీపీ బాసట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పిరెడ్డి హాజరవుతున్నారని బాసటకమిటీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి నడింపల్లి కృష్ణంరాజు తెలిపారు. మద్దిలపాలెం నగర పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీలను రాష్ట్ర వ్యాప్తంగా 175 మంది కన్వీనర్లతో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విశాఖ వేదికగా రాష్ట్ర స్థాయి సమావేశం శనివారం జరగనుందని, దీనికి తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన కమిటీల కన్వీనర్లు హాజరవుతున్నారని తెలిపారు. ఈసమావేశంలో బాధితుల సమస్యలపై నాలుగు జిల్లాల కన్వీనర్లతో రాష్ట్రస్థాయి నాయకులు చర్చిస్తారని తెలిపారు. జనవరి 3న రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల «ధైర్యంగా ఉండాలని, రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించగానే అగ్రిగోల్డ్ నుంచి బా«ధితులకు ఇవ్వాల్సిన ప్రతి పైసా వసూలు చేసి ఇస్తారని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉండేందుకు వారి కష్టాలను తెలుసుకునేందుకు బాసట కమిటీలు కృషి చేస్తాయని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులు మనో««ధైర్య కోల్పోకుండా, ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడకుండా బాసట కమిటీల సభ్యులకు ధైర్యాన్నిచ్చేందుకు రాష్ట్ర నాయకులు సలహాలు, సూచనలు ఇస్తారని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర అదనపు కార్యదర్శులు జి.రవిరెడ్డి, మొల్లి అప్పారావు, (తూర్పు), బాసట కమిటీ నియోజవర్గం కన్వీనర్లు దాడి సత్యనారాయణ (పశ్చిమం), పామేటి బాబ్జీ (ఉత్తరం), పీతల వాసు (దక్షణం) తదితరులు పాల్గొన్నారు.