expenditure
-
ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు అప్
ముంబై: వరుసగా రెండేళ్ల పాటు తగ్గిన ప్రైవేట్ ఈక్విటీ(Private equity), వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు గతేడాది మళ్లీ కొంత మెరుగయ్యాయి. 2024లో 5 శాతం పెరిగి 56 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, అనేక అనిశ్చితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది పెట్టుబడులకు సవాళ్లు ఎదురుకావచ్చనే అంచనాలు నెలకొన్నాయి. పరిశ్రమ లాబీ గ్రూప్ ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.‘అమెరికా నూతన ప్రభుత్వం తన పాలసీలను ఇంకా పూర్తిగా వెల్లడించాల్సి ఉంది. ఇవి అంతర్జాతీయంగా వాణిజ్యం, ఎగుమతులు, కరెన్సీ, క్రూడాయిల్ ధరలపై గణనీయంగా ప్రభావం చూపవచ్చు. దీనితో భారత స్థూల ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రభావం పడొచ్చు’ అని ఈవై పార్ట్నర్ వివేక్ సోని తెలిపారు. దేశీయంగా వినియోగం నెమ్మదిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని, పరిస్థితిని సరిదిద్దేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2024లో పీఈ, వీసీ ఫండ్ల ఒప్పందాలు 54 శాతం పెరిగి 1,352గా నమోదయ్యాయి.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్పై ఎస్బీఐ అంచనాలునివేదికలోని మరిన్ని విశేషాలు..మౌలిక సదుపాయాలు, రియల్టీలో గతేడాది పెట్టుబడులు స్వల్పంగా 3 శాతం క్షీణించాయి. 2023లో 21.5 బిలియన్ డాలర్లుగా ఉండగా 2024లో 20.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2023లో 1 బిలియన్ డాలర్ల విలువ చేసే డీల్స్ 6 నమోదయ్యాయి. వీటి మొత్తం విలువ 9.6 బిలియన్ డాలర్లు. గతేడాది బిలియన్ డాలర్ల ఒప్పందాలు 4 కుదరగా, వీటి మొత్తం విలువ 6.1 బిలియన్ డాలర్లు. ఏటీసీ ఇండియా టవర్ కార్పొరేషన్ను బ్రూక్ఫీల్డ్కి చెందిన డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం.. గతేడాది నమోదైన అతి పెద్ద డీల్.మదుపరుల నిష్క్రమణకు సంబంధించి 26.7 బిలియన్ డాలర్ల విలువ చేసే 282 డీల్స్ నమోదయ్యాయి. 2023లో ఈ పరిమాణం 24.9 బిలియన్ డాలర్లు. 2023లో 95 ఫండ్లు 15.9 బి. డాలర్ల నిధులు సమీకరించగా 2024లో ఇది 34 శాతం తగ్గింది. -
ఖర్చుల్లో తగ్గేది లేదంటున్న ఆంధ్రులు
ఖర్చుల విషయంలో ఆంధ్రులు తగ్గేదే లేదంటున్నారు. ఏపీలో గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో నెలవారీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం జాతీయ స్థాయిని మించి నమోదైంది. 2022–23 ఆరి్థక ఏడాదితో పోలిస్తే.. రాష్ట్రంలోగ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ 2023–24లో నెలవారీ తలసరి వినియోగం వ్యయం పెరిగింది. 2022–23తో పోలిస్తే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం 9.38 శాతం, పట్టణాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం 5.89 శాతం పెరిగింది. 2022–23తో పోలిస్తే రాష్ట్రంలో 2023–24లో గ్రామీణ నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.457, పట్టణ ప్రాంతాల్లో రూ.400 పెరిగింది. గృహ వినియోగ వ్యయ సర్వే 022–23–24ను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం 2023–24లో జాతీయ స్థాయిలో నెలవారీ పట్టణ తలసరి వినియోగ వ్యయం రూ.6,996 ఉండగా.. ఏపీలో నెలవారీ పట్టణ తలసరి వినియోగ వ్యయం రూ.7,182గా నమోదైంది. జాతీయ స్థాయి గ్రామీణ తలసరి వినియోగ వ్యయం రూ.4,122 ఉండగా.. ఏపీలో గ్రామీణ తలసరి వినియోగ వ్యయం రూ.5,327గా నమోదైంది. – సాక్షి, అమరావతిఆహారేతర వస్తువులపైనే ఖర్చుఅన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా ఆహారేతర వస్తువుల వినియోగంపైనే ఎక్కువ వ్యయం చేస్తున్నట్టు సర్వేలో స్పష్టమైంది. 2023–24లో గ్రామీణ ప్రాంతాల్లో 53 శాతం, పట్టణ ప్రాంతాల్లో 60 శాతం ఆహారేతర వస్తువుల వినియోగంపైనే వ్యయం చేశారు. రవాణా, దుస్తులు, పరుపులు, పాదరక్షలు, ఇతర వస్తువులు, వినోదం, మన్నికైన వస్తువులు ఆహారేతర వ్యయంలో ప్రధాన వ్యయ వాటాను కలిగి ఉన్నాయి.పట్టణ ప్రాంతాల్లో ఆహారేతర వ్యయంలో ఇంటి అద్దె దాదాపు 7 శాతం వాటా కలిగి ఉంది. ప్రధానంగా పానీయాలు, రిఫ్రెష్మెంట్లు, ప్రాసెస్ చేసిన ఆహారంలో వ్యయం కొనసాగుతోంది. ఆ తరువాత పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు ఆహార వ్యయంలో ప్రధానంగా ఉన్నాయి. 2022–23తో పోలిస్తే జాతీ య స్థాయిలో 2023–24లో గ్రామీణ ప్రాంతాల్లో నెల వారీ తలసరి వినియోగ వ్యయం 9 శాతం, పట్టణ ప్రాంతాల్లో 8 శాతం పెరిగింది. జాతీయ స్థాయిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయం వ్యత్యాసం మరింత తగ్గింది. 2022–23లో 71 శాతం ఉండగా 2023–24లో 70 శాతానికి తగ్గింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన వినియోగం పెరుగుదలను సూచిస్తోంది. -
అభివృద్ధా? అంతరమా?
సాధారణంగా కనిపించే లెక్కలు అసాధారణమైన అనేక అంశాలను మనకు పట్టి ఇస్తాయి. మన దేశ ప్రజలు దేని మీద ఎంత ఖర్చు చేస్తున్నారు లాంటి లెక్కలు చూసినప్పుడు సమాజంలో వచ్చిన అనేక మార్పులు కళ్ళకు కడతాయి. అతి విస్తృత స్థాయిలో దాదాపు 2.61 లక్షల గృహాలను సర్వే చేసి సేకరించిన సమాచారంతో గణాంకాలంటే ఇక వేరే చెప్పేది ఏముంది! ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్) అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 2023 ఆగస్ట్ నుంచి 2024 జూలై మధ్య ప్రజల వినియోగాన్ని ఈ తాజా సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. సర్వసాధారణంగా అయిదేళ్ళకోసారి జరిపే ఈ సర్వేను వరుసగా గత ఏడాది, ఈ సంవత్సరం కూడా నిర్వహించడం విశేషమే. ప్రజా క్షేమం కోసం ప్రభుత్వం చేపట్టాల్సిన పథకాలు, అనుసరించాల్సిన విధానాలకు ఇలాంటి సర్వే ఫలితాలు దిక్సూచి. అలాగని వాస్తవాల సమగ్ర స్వరూపాన్ని ఇవి ప్రతిబింబిస్తాయని అనుకోలేం. అనేక ఇతర అంశాలు ఈ గృహవినియోగ వ్యయం లెక్కలను ప్రభావితం చేస్తాయన్న సంగతి విస్మరించి, వీటిని బట్టి జనజీవన ప్రమాణాల స్థాయిని నిర్ధారిస్తే అది సరికాదు. వేతనాలతో సహా అనేక ఇతర అంశాలపై సమాచారంతోనూ బేరీజు వేసుకోవాలి. 2023–24కి గాను కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ గత వారం విడుదల చేసిన ఈ హెచ్సీఈఎస్ సర్వే అనేక అంశాలను విశ్లేషకుల దృష్టికి తెచ్చింది. దేశ ఆర్థిక రంగంలో వినియోగదారుల డిమాండ్ ఏ మేరకుంది, మరీ ముఖ్యంగా మహానగరాల్లో ఎలా ఉంది, దాన్నిబట్టి మన ఆర్థిక వ్యవస్థ ప్రస్థానాన్ని ఎలా అంచనా వేయాలనే దానిపై కొంతకాలంగా అనేక సందేహాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా హెచ్సీఈఎస్ సర్వే ఫలితాల పట్ల అందరిలో ఆసక్తి నెలకొంది. నిజానికి, దాదాపు 11 ఏళ్ళ విరామం తర్వాత గడచిన రెండేళ్ళుగా ఈ సర్వేలు వెలువడడం విశేషం. గడచిన ఏడాదితో పోలిస్తే 2023–24లో ఆహారపదార్థాలపై జనం వెచ్చించే మొత్తం పెరిగినట్టుగా తాజా సర్వేలోని గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ కుటుంబాలు చేసే మొత్తం ఖర్చులో సైతం... తిండికి వెచ్చించేది మునుపు 2022–23లో 46.4 శాతం ఉండేది. ఇప్పుడు 2023–24లో అది 47.04కి పెరిగింది. పట్టణప్రాంత నివాసాల్లోనూ ఇలాంటి పరిస్థితే. ఆహారంపై జనం ఎక్కువ వ్యయం చేస్తున్నా, ఇప్పటికీ ఇంటి బడ్జెట్లో ఆహారేతర అంశాలదే సింహభాగం. ఆహారం మీద చేస్తున్న ఖర్చు ఏటేటా పెరుగుతున్నదన్నది మాత్రం స్పష్టం. అంత మాత్రం చేత ప్రజలందరి జీవన ప్రమాణాలు, పౌష్టికాహారం పట్ల శ్రద్ధ, ఆహార భద్రత అధికమయ్యాయని అనుకోలేం. ఆహార ద్రవ్యోల్బణం పెరగడంతో తిండిపై జనం చేయాల్సి వస్తున్న ఖర్చు కూడా అనివార్యంగా పెరిగిందన్నది విస్మరించలేం. ఇంకా చెప్పాలంటే, ఈ 2023–24లో గృహవినియోగ వ్యయం 8 – 9 శాతం దాకా పెరిగింది కానీ, అందుకు కూడా ద్రవ్యోల్బణమే ప్రధాన కారణం. దాన్ని గనక తీసేస్తే, అసలు సిసలు లెక్కల్లో వినియోగం ఏ మేరకు పెరిగిందన్నది తేలుతుంది. ఆ రకంగా చూస్తే, గృహవినియోగ వ్యయం కేవలం 3.5 శాతమే పెరిగిందట. ఆ పెరుగుదల కూడా 2024 ఆర్థిక సంవత్సరంలోని వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 8.2 శాతం కన్నా చాలా తక్కువ. అదీ విశ్లేషకులు తేలుస్తున్న మాట. అంటే, సర్వే గణాంకాలు పైకి ఏమి చెప్పినా, అసలు సిసలు వినియోగ వ్యయ వృద్ధి నత్తనడకనే సాగుతోందని అర్థం. దీనికీ మళ్ళీ కారణం – ద్రవ్యోల్బణం, అందులోనూ ఆహార ద్రవ్యోల్బణమే. ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలి. సర్కారు సైతం ఈ సంగతి గ్రహించకపోలేదు. ఆహార సరఫరా వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నం కూడా చేసింది. ఆహార నిల్వలు, అలాగే కొన్ని ఆహార పదార్థాలు – కూరగాయల ఎగుమతులపై నిషేధం, వంట నూనెల లాంటి వాటిపై దిగుమతి సుంకాల తగ్గింపు తదితర చర్యలు చేపట్టింది. ఈ చర్యల వల్ల కొంత ఫలితం వచ్చింది. ఆహార ద్రవ్యోల్బణానికి ఒక మేర ముకుతాడు వేయగలిగారు. కానీ, ఇవన్నీ శాశ్వత పరిష్కారం చూపలేవు. ఇవాళ్టికీ మనం వ్యవసాయాధార దేశం కావడం, అందులోనూ మన వ్యవసాయమంతా ప్రధానంగా వర్షాధారమైనది కావడం ప్రధానమైన అవరోధం. ఇక, తాజా సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో తలసరి నెలవారీ గృహ వినియోగ వ్యయం నిరుటి రూ. 3,773 నుంచి రూ. 4,122కు పెరిగింది. పట్టణాల్లో అది రూ. 6,459 నుంచి రూ. 6,996కు హెచ్చింది. ఖర్చు విషయంలో గ్రామీణ – పట్టణ ప్రాంతాల మధ్య అంతరం అంత కంతకూ వేగంగా తగ్గుతోందని ఈ సర్వే డేటా చెబుతోంది. పుష్కరకాలం క్రితం 2011–12లో ఆ వ్యత్యాసం 83.9 శాతం. నిరుడు అది 71.2 శాతం. ఇప్పుడు 69.7కు తగ్గాయని సర్వే మాట. ఖర్చుల్లో అంతరాలు తగ్గినట్టు పైకి కనిపిస్తున్నా, అది వేతనంలో గణనీయమైన పెరుగుదల వల్ల వచ్చినవని చెప్పలేం. ఎందుకంటే, 2023–24తో ముగిసిన అయిదేళ్ళ కాలంలో గ్రామీణ వేతనాలు నామమాత్రంగా 5.2 శాతమే పెరిగాయి. పైగా, వాస్తవ వేతన వృద్ధి మైనస్ 0.4 శాతమే. అంటే, ఇవాళ్టికీ గ్రామీణ – పట్టణ, ధనిక – పేద అంతరాలు గణనీయంగానే ఉన్నాయన్నది నిష్ఠుర సత్యం. ఎక్కువగానే ఖర్చు పెడుతున్నారన్నది సర్వేల సారమైనా, చాలీచాలని జీతాలతో, బతుకు బండి ఈడుస్తున్న బడుగుల మాట ఏమిటి? అసలు ఖర్చే పెట్టలేని సగటు ప్రాణుల స్వరాలను ఈ సర్వేలు సరిగ్గా పట్టుకోగలుగుతున్నాయా? ఆ అసమానతలు తొలగించగలిగితేనే ప్రయోజనం. తొలగించడానికి తోడ్పడగలిగితేనే ఈ లెక్కలకు సార్థకత. -
ఆర్థిక అంతరం పెరుగుతోంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య తలసరి ఖర్చు వ్యత్యాసం పెరుగుతోంది. గ్రామీణ తెలంగాణలో నెలవారీ తలసరి ఖర్చు రూ.5,675 కాగా, అర్బన్ తెలంగాణలో అది రూ.9,131గా ఉన్నట్లు తేలింది. కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ ‘గృహ వినియోగ వ్యయ సర్వే–2024’పేరుతో వెల్లడించిన నివేదికలో ఈమేరకు వెల్లడైంది. దీని ప్రకారం రెండు ప్రాంతాల మధ్య వ్యత్యాసం రూ.3,456 కాగా, గ్రామీణ ప్రజల కంటే పట్టణ ప్రజల తలసరి 60 శాతం ఎక్కువ ఖర్చు పెడుతున్నట్లు వెల్లడైంది. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కూడా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఖర్చులో తేడా తెలంగాణలోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. సిక్కిం టాప్.. దేశంలో తలసరి నెల వారీ ఖర్చులో ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం టాప్గా నిలిచింది. ఇక్కడి గ్రామీణ ప్రాంత ప్రజలు నెలకు రూ.9,474 ఖర్చు చేస్తుండగా, పట్టణ సిక్కిం వాసులు రూ.13,675 ఖర్చు చేస్తున్నారు. అన్నిటికంటే తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ నిలిచింది. ఈ రాష్ట్రంలో గ్రామీణ తలసరి ఖర్చు రూ. 2,927 కాగా, పట్టణ ప్రాంతాల్లో ఇది రూ.5,114గా నమోదైంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిశీలిస్తే చండీగఢ్లో అత్యధికంగా గ్రామీణ ప్రజలు రూ. 8,857, పట్టణ ప్రజలు రూ.13,425 ఖర్చు చేస్తున్నారు. అన్నింటికంటే తక్కువగా దాద్రానగర్ హవేలీ, డామన్డయ్యూ గ్రామీణ ప్రజలు నెలకు రూ.4,450, జమ్మూకశీ్మర్లోని పట్టణ ప్రజలు రూ.6,375 ఖర్చు చేస్తున్నారు. దేశ సగటును చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,247, పట్టణ ప్రాంతాల్లో రూ.7,078 చొప్పున నెలకు ఖర్చవుతోంది. తిండి ఖర్చు 40 శాతం లోపే.. తలసరి ఖర్చులో గ్రామీణ, ప్రాంతాల భారతీయులు ఆహారం కోసం ఆదాయంలో 40 శాతం లోపే ఖర్చు చేస్తున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. ఆహారేతర అవసరాల కోసం గ్రామీణ ప్రాంతాల్లో 53 శాతం, పట్టణ ప్రాంతాల్లో 60 శాతం ఖర్చు చేస్తున్నట్లు తేలింది. ఈ కేటగిరీలో ఇంటి అద్దెల కోసం ఎక్కువగా వెచ్చిస్తున్నట్లు వెల్లడైంది. కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ ఈ సర్వే నిర్వహించింది. ఆగస్టు 2022 నుంచి జూలై 2023 వరకు మొదటి విడత, ఆగస్టు 2023 నుంచి జూలై 2024 మధ్య రెండోవిడతలో దేశంలోని 2,61,953 కుటుంబాల నుంచి శాంపిళ్లు సేకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారి ద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇచ్చే ఉచితాలు కలిపి ఓ సర్వే, ఉచితాలను తీసివేసి మరో సర్వే నిర్వహించారు. గ్రామీణ తెలంగాణను అభివృద్ధి చేయాలి దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు మధ్య తేడా ఉంది. కేరళ, తమిళనాడులో గ్రామీణ ప్రజలకు అసంఘటిత రంగంలో ఉపాధి లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 150 ఏళ్లుగా రెండు బ్యారేజీలు అందుబాటులో ఉండటం, విద్యా స్థాయి ఎక్కువ ఉన్న కారణంగా రెండు ప్రాంతాల మధ్య వ్యయ తారతమ్యం తక్కువ ఉంటుంది. బెంగళూరు మినహా దక్షిణాది రాష్ట్రాల్లోని ఏ అర్బన్ ప్రాంత ఆదాయాన్ని కూడా హైదరాబాద్ ఆదాయంతో పోల్చలేం. అయితే, తెలంగాణలో గ్రామీణ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. ఈ కారణాలతోనే గ్రామీణ ప్రాంతాల తలసరి ఖర్చు తక్కువగా ఉంటోంది. గ్రామీణ తెలంగాణను అభివృద్ధి చేయడమే ఇందుకు ఏకైక మార్గమని ఈ నివేదిక ద్వారా అర్థమవుతోంది. –డాక్టర్ అందె సత్యం, ఆర్థిక విశ్లేషకులు -
రైతే 'రాజు'
సాక్షి, అమరావతి: భారత దేశంలో వ్యవసాయ రంగానిదే అగ్రస్థానం. గ్రామాల్లో రైతే రాజు. గ్రామీణులకు అధిక ఆదాయాన్ని సమకూరుస్తోంది వ్యవసాయమే. పంట పండించిన వాడికే ఎక్కువ ఆదాయం వస్తోంది. మిగతా రంగాల వారి ఆదాయం రైతు కుటుంబాలకంటే తక్కువే. నాబార్డు విడుదల చేసిన ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ సర్వే–2021–22 ఈ విషయాన్ని వెల్లడించింది. 2021–22 సంవత్సరంలో దేశంలోని రైతు కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం రూ.13,661గా ఈ సర్వే తేల్చింది. వ్యవసాయేతర కుటుంబాల ఆదాయం రూ.11,348గా తెలిపింది. 2016–17తో పోలిస్తే 2021–22లో వ్యవసాయ కుటుంబాల నెలవారీ ఆదాయం రూ. 4,558 పెరిగింది. వ్యవసాయేతర కుటుంబాల ఆదాయం రూ.4,488 పెరిగింది. అన్ని కుటుంబాల్లో సగటు ఆదాయం రూ. 4,616 పెరిగింది. గ్రామీణ ప్రాంతాల కుటుంబాల నెలవారీ మొత్తం వ్యయంలో 47 శాతం ఆహార వస్తువులపైనే ఉందని, 53 శాతం ఆహారేతర వస్తువులపై ఉందని సర్వే తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో.. ఆంధ్రప్రదేశ్లో 2021–22లో వ్యవసాయ కుటుంబాల సగటు నెలవారీ ఆదాయం రూ.12,294 అని ఈ సర్వే తెలిపింది. ఈ ఆదాయం 2016–17తో పోల్చితే 2021–22లో రూ. 5,195 పెరిగింది. 2016–17లో రాష్ట్రంలో గ్రామీణ కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం రూ.5,842 కాగా నెలవారీ ఖర్చు రూ.5,746 ఉంది. నెలవారీ మిగులు కేవలం 96 రూపాయలు మాత్రమే. 2021–22లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం 11,037 రూపాయలుండగా నెలవారీ వినియోగ వ్యయం 10,448 రూపాయలు ఉంది. నెలవారీ మిగులు 589 రూపాయలుగా ఉంది. సర్వేలో తీసుకున్న అంశాలివీ.. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ, వ్యవసాయేతర, మొత్తం కుటుంబాల నెలవారీ ఆదాయం, వినియోగ వ్యయంపై తొలిసారి 2016–17లో ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ సర్వే జరిగింది. మళ్లీ 2021–22లో సర్వే చేసినట్లు నాబార్డు తెలిపింది. ఈ వివరాలను ఇటీవల విడుదల చేసింది. వ్యవసాయ కుటుంబాలతో పాటు వ్యవసాయేతర కుటుంబాలు, గ్రామాల్లోని మొత్తం కుటుంబాల నెలవారీ ఆదాయాన్ని లెక్కించింది. సాగుతో పాటు పశువుల పెంపకం, తోటల పెంపకం, కూలీ, ఇతర వాణిజ్య, వ్యాపారాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు, అటవీ ఉత్పత్తులు, తయారీ కార్యకాలపాలు, ఉపాధి హామీ, వ్యవసాయ కార్మికులు తదితర కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. నెలవారీ వినియోగ వ్యయాన్ని ఆహార, ఆహారేతర వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది. -
రెండేళ్లలో తగ్గనున్న లాజిస్టిక్స్ వ్యయాలు
న్యూఢిల్లీ: జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలను పెద్ద ఎత్తున నిర్మిస్తున్న నేపథ్యంలో రెండేళ్లలో స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) లాజిస్టిక్స్ వ్యయాల వాటా 9%కి తగ్గుతుందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా ఇది 14% ఉన్నట్లు చెప్పారు. అమెరికాతో పాటు యూరప్లోని పలు పెద్ద దేశా ల్లో ఈ వ్యయాలు 12% ఉండగా చైనాలో 8 శాతంగా ఉన్నట్లు నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివరించారు. 2022–23 ఎకనమిక్ సర్వే ప్రకారం దేశ జీడీపీలో లాజిస్టిక్స్ వ్యయాలు 14–18%గా ఉన్నాయి. అంతర్జాతీయ సగటు 8% తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. ప్రత్యామ్నాయ ఇంధనాలను ఎగుమతి చేసేందుకు భారత్కు భారీగా అవకాశాలు ఉన్నాయని గడ్కరీ చెప్పారు. తక్కువ నాణ్యత గల బొగ్గును మిథనాల్ తయారీకి ఉపయోగించవచ్చన్నారు. జీవ ఇంధనాల విభాగంలో దేశం గణనీయంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. రహదార్ల నిర్మాణంలో రీసైకిలింగ్ చేసిన టైర్ పౌడరు, ప్లాస్టిŠక్ మొదలైన మెటీరియల్స్ను వినియోగించడం వల్ల బిటుమిన్ దిగుమతులు తగ్గగలవని మంత్రి వివరించారు. మరోవైపు, దేశీ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. గతేడాదే జపాన్ను దాటేసి అమెరికా, చైనా తర్వాత మూడో అతి పెద్ద ఆటోమొబైల్ మార్కెట్గా భారత్ ఆవిర్భవించిందని గడ్కరీ చెప్పారు. 2014లో రూ. 7.5 లక్షల కోట్లుగా ఉన్న దేశీ మార్కెట్ 2024 నాటికి రూ. 18 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. -
బాబు దుబారా భరించలేనంత..!
సాక్షి, అమరావతి: ప్రజల సొమ్ము దుబారా చేయడంలో చంద్రబాబు కేరాఫ్ అడ్రస్. గతంలో 2014 – 19 మధ్య సీఎంగా ఉండగా ఆయన విలాసాలు, హంగు, ఆర్భాటం, సొంత ఇళ్లు, క్యాంప్ ఆఫీసులకు పెట్టిన ఖర్చు వంద కోట్లకు పైనే. ఆ ఐదేళ్లలో హైదరాబాద్లో రెండేసి బంగ్లాలు, రెండేసి క్యాంపు ఆఫీస్లు, విజయవాడలో రెండేసి క్యాంపు ఆఫీస్ల పేరుతో మరమ్మతులకు, సెక్యూరిటీ, సీసీ కెమేరాలు, పోలీస్ బరాక్లకు కోట్ల రూపాయల ప్రజా ధనం ఖర్చు చేశారు.హైదరాబాద్లో ఏడు నక్షత్రాల పార్క్ హయత్ హోటల్లో ఉంటూ ప్రభుత్వ ఖజానా నుంచి ఏకంగా రూ.30 కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబుకు హైదరాబాద్లో సొంత ఇల్లు ఉన్నప్పటికీ, స్టార్ హోటల్లో ఉంటూ కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేయడం గమనార్హం. ఇవన్నీ టీడీపీ సోషల్ మీడియాకు మచ్చుకు కూడా కనిపించడంలేదు. పైగా వైఎస్ జగన్ భద్రత కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ దుష్ప్రచారానికి దిగారు.చంద్రబాబు 2014లో సీఎం అయిన తర్వాత హైదరాబాద్ మదీనాగూడలోని తన బంగ్లాను క్యాంపు ఆఫీస్గా ప్రకటించుకున్నారు. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 65లోని తన ఇంటిని కూడా సీఎం క్యాంపు ఆఫీస్గా ప్రకటించుకున్నారు. ఇవే కాకుండా హైదరాబాద్లోని లేక్వ్యూ గెస్ట్ హౌస్ను సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించుకున్నారు. ఇక విజయవాడలోని కలెక్టరేట్ కార్యాలయాన్ని, ఇరిగేషన్ గెస్ట్ హౌస్ను కూడా క్యాంపు కార్యాలయంగా ప్రకటించుకున్నారు. ఆ తరువాత లింగమనేని గెస్ట్ హౌస్ను సీఎం క్యాంపు, నివాస భవనంగా చేసుకున్నారు. వీటన్నింటికీ మరమ్మత్తులు చేయడంతో పాటు భద్రత ఏర్పాట్లు, సీసీ కెమేరాల ఏర్పాటు, పోలీస్ బరాక్ల నిర్మాణం, 24 గంటలు నిఘా ఏర్పాట్లు, విద్యుత్తు పనులు, విజయవాడ క్యాంపు ఆఫీస్లో కంట్రోల్ ఎక్విప్మెంట్, రహదారుల నిర్మాణాలకు చంద్రబాబు ఆ ఐదేళ్లలో ఏకంగా 126.76 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం భారీ రెవెన్యూ లోటులో ఉన్న రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్రబాబు ఆ సమయంలో ఇష్టానుసారం క్యాంపు ఆఫీస్లకు కోట్ల రూపాయలు వెచ్చించడాన్ని అప్పట్లోనే అధికార వర్గాలు తప్పుపట్టాయి. అక్రమ కట్టడమైన లింగమనేని గెస్ట్ హౌస్ను ముఖ్యమంత్రి నివాసంగా మార్చుకుని అక్కడ రోడ్ల నిర్మాణం, భద్రత కోసం ఏకంగా రూ.10 కోట్లు వ్యయం చేశారు.కార్యాలయాల పేరుతో సెక్యూరిటీ తదితరాలకు 2014–19 మధ్య చంద్రబాబు చేసిన కొన్ని ఖర్చులు ఇలా.. ఇదంతా జీవోల ద్వారా చేసిన ఖర్చే..» హైదరాబాద్ సెక్రటేరియట్లోని సీఎం కార్యాలయం (ఎల్ బ్లాక్)రూ.14.63 కోట్లు»సీఎం కోసంహైదరాబాద్ సెక్రటేరియట్లో హెచ్ బ్లాక్కు రూ.6.29 కోట్లు»హైదరాబాద్ లేక్వ్యూ గెస్ట్ హౌస్ కోసం రూ.9.47 కోట్లు»సీఎం కార్యాలయం ఫర్నిచర్కు రూ.10.00 కోట్లు»మదీనాగూడ ఫామ్ హౌస్, జూబ్లిహిల్స్ అద్దె ఇంటికి రూ.4.37 కోట్లు»విజయవాడ ఇరిగేషన్ గెస్ట్ హౌస్, కలెక్టరేట్లో సీఎం క్యాంపు ఆఫీసులకు రూ.42.00 కోట్లు»లింగమనేని గెస్ట్ హౌస్కు రూ.10.00 కోట్లు»హైదరాబాద్లో పార్క్ హయత్ హోటల్లో బసకురూ.30.00 కోట్లు -
విస్తరిస్తున్న విదేశీ టూరిజం
విదేశీ పర్యటనలపై భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోంది. గోవా, కేరళ వంటి పర్యాటక ప్రదేశాల్లో ఖర్చు పెరుగుతుండటంతో విదేశీ ప్రయాణాలు ఆకర్షణీయంగా మారుతున్నాయి. ‘కొన్నిసార్లు మేం దేశీయ పర్యటన కోసం రూ.20 వేలు ఖర్చు చేస్తున్నాం. కాబట్టి మరో రూ.10 వేలకుపైగా ఖర్చు చేసి విదేశాలకు ఎందుకు వెళ్లకూడదు. ఇక్కడ ఖర్చులతో పోలిస్తే విదేశాల్లో తక్కువే’ అని విజయవాడకు చెందిన విశ్రాంత ఉద్యోగి హేమ అభిప్రాయపడ్డారు. ఆదాయ వనరుల్లో వృద్ధి, విమాన ప్రయాణాల కనెక్టివిటీ పెరగడంతో మధ్య తరగతి ప్రజలు విదేశీ పర్యటనలకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం దేశ జనాభాలోని 31శాతం మంది మధ్య తరగతి ప్రజలున్నారు. ఈ సంఖ్య 2040 నాటికి 60 శాతానికి పెరుగుతుందని అంచనా. 2050 నాటికి దేశంలో 100 కోట్ల కంటే ఎక్కువ మంది మధ్య తరగతి ప్రజలు ఉంటారని అంచనా. ఈ క్రమంలోనే 2027 నాటికి ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్లను అధిగమించి ప్రపంచంలోని ఐదో అతిపెద్ద విదేశీ (అవుట్బౌండ్) టూరిజం మార్కెట్గా భారతదేశం అవతరిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అప్పటికి భారత పర్యాటకుల మార్కెట్ విలువ రూ.7.47 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది 2019లో రూ.3 లక్షల కోట్లుగా నమోదైంది. మరోవైపు మరో మూడేళ్లలో అమెరికా, చైనా తర్వాత భారతదేశం మూడో అతిపెద్ద దేశీయ పర్యాటక మార్కెట్గా మారుతుందని భావిస్తున్నారు. – సాక్షి, అమరావతిమధ్యప్రాచ్య దేశాల్లో మనోళ్ల సందడిభారతీయుల్ని మధ్యప్రాచ్య (మిడిల్ ఈస్ట్) దేశాల పర్యాటక రంగం విశేషంగా ఆకర్షిస్తోంది. భారతీయ పర్యాటకుల్లో దాదాపు సగం విదేశీ పర్యటనలు ఇక్కడే చేస్తున్నారు. ఆ తర్వాత ఆగ్నేయాసియా, ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్లో కొనసాగుతున్నాయి. పొరుగున ఉన్న సౌదీ అరేబియా, ఒమన్, దుబాయ్ హాలిడే మేకర్లలో అతిపెద్ద వనరుగా భారత్ మారింది. గోవా, కేరళ వంటి భారతీయ రిసార్ట్ గమ్యస్థానాల ధరలతో సమానంగానే వియత్నాం, శ్రీలంక, థాయ్లాండ్, సింగపూర్ వంటి సమీప దేశాల్లో ధరలు కూడా ఉంటున్నాయని టూరిజం ఏజెన్సీలు చెబుతున్నాయి. దేశంలో తిరిగే ఖర్చుకు మరికొంత వెచ్చించగలిగితే విదేశాలకు వెళ్లవచ్చనే అభిప్రాయం భారతీయ పర్యాటకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల జపాన్ సైతం భారతీయ పర్యాటకుల కోసం కొత్తగా ఈ–వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇదే తరహాలో దుబాయ్ సైతం భారతీయ సందర్శకులను అకట్టుకునేందుకు బహుళ ప్రవేశ పర్యాటక వీసాను రూపొందించింది. దక్షిణాఫ్రికా సరళీకృత వీసాను తీసుకొస్తోంది. మలేíÙయా, కెన్యా, థాయ్లాండ్, ఇరాన్ సహా ఇతర దేశాలు భారతీయ పర్యాటకుల కోసం వీసా అవసరం లేని పర్యటనలు అందిస్తున్నాయి.231 శాతం పెరుగుదలఅమెరికన్లు 63 రోజులు, బ్రిటిషర్లు 90 రోజులతో పోలిస్తే భారతీయులు కేవలం 30 రోజుల ముందుగానే పర్యటనలు ప్లాన్ చేస్తున్నారు. భారతీయులకు సమీప దేశాల ప్రయాణాలకు బడ్జెట్ ఎయిర్లైన్స్ ఎంతగానో దోహదపడుతున్నాయి. ఈ క్రమంలో గతేడాది ఎక్కువ మంది వియత్నాం ప్రయాణించినట్టు గూగుల్ ట్రెండ్స్ చెబుతున్నాయి. అక్కడ 2019తో పోలిస్తే భారతీయ సందర్శకుల సంఖ్య 231 శాతం పెరిగింది. ఇతర ఆగ్నేయాసియా దేశాలైనా థాయ్లాండ్, సింగపూర్, ఇండోనేíÙయా రాకపోకల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది.విదేశాలకు పెరుగుతున్న విమానాలు ఆ్రస్టేలియా, చైనా, జపాన్ వంటి ప్రధాన పోటీదారులను అధిగమించి భారతదేశం ప్రయాణ రంగంలో వేగంగా ముందంజ వేస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ వృద్ధిలో చెప్పుకోదగ్గ పురోగతితో దేశీయంగా, అంతర్జాతీయంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. దేశీయ విమాన ట్రాఫిక్లో ఏటా 7.7 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ వృద్ధి రేటు చైనాలో 7.1 శాతం, జపాన్ 4 శాతం, ఆ్రస్టేలియాలో 2.6 శాతం ఉండగా.. భారత్ ఈ దేశాలను అధిగమించడం విశేషం. ఈ వృద్ధితో విమానయాన రంగంలో బ్రెజిల్, ఇండోనేíÙయాను భారత్ వెనక్కి నెట్టింది. ఏటా విమాన సీట్ల సంఖ్యలో 6.9 శాతం వార్షిక వృద్ధి రేటు కనిపిస్తోంది. యూఎన్ టూరిజం ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది త్రైమాసికంలో అంతర్జాతీయ ప్రయాణాలు ప్రీ–పాండమిక్ స్థాయిలో 97 శాతానికి చేరింది. భారతీయ విదేశీ టూరిజంలో ఉన్నంత వృద్ధి వేగం మరెక్కడా లేదు. వాస్తవానికి గత పదేళ్లలో భారతదేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయింది. తాజాగా మరో 1,200కి పైగా విమానాల కోసం ఆయా సంస్థలు ఆర్డర్లు పెట్టడం విమాన ప్రయాణాల డిమాండ్ను సూచిస్తోంది.టమాటా పండుగకూ వెళ్లొస్తున్నారు టీవీలు, సినిమాల్లో చూపించే విదేశీ నగరాలను చూసేందుకు భారతీయుల్లో ఎక్కువమంది ప్రభావితం అవుతున్నారు. ఉదాహరణకు 2011 తర్వాత స్పెయిన్ను సందర్శించే భారతీయులు 40 శాతం పెరిగారు. అక్కడ జరిగే ‘లా టొమాటినా పండుగ’ ( టమాటాలు విసురుకోవడం) ‘జిందగీ నా మిలేగీ దొబారా’ అనే హిందీ చిత్రం ద్వారా పరిచయం కావడంతో ఆ పండుగను చూసేందుకు భారతీయులు ఆసక్తి కనబరుస్తున్నారు. -
ఆహారంపై భారీగా తగ్గిన వ్యయాలు
కూటి కోసం కోటి విద్యలు అన్నారు. అయితే ఆహారం కోసం చేసే ఖర్చు తగ్గుతుందని గణాంకాలు చెబుతున్నాయి. దేశీయంగా కుటుంబాలు ఆహారంపై సగటున చేసే వ్యయాలు 1947 నాటితో పోలిస్తే తొలిసారిగా సగానికి పైగా తగ్గినట్లు ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) ఒక వర్కింగ్ పేపర్లో వెల్లడించింది.దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాలు నెలవారీగా చేసే మొత్తం వ్యయాల్లో ఆహారానికి వెచ్చించేది భారీగా తగ్గింది. అట్టడుగున ఉండే 20 శాతం మంది విషయంలో ఇది మరింత గణనీయంగా ఉంది. అన్ని రాష్ట్రాల్లోని వారికి, ముఖ్యంగా అట్టడుగు 20 శాతం కుటుంబాలపై ప్రధానంగా లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రత పాలసీలు సమర్ధమంతంగా అమలవుతుండటాన్ని ఇది ప్రతిఫలిస్తోందని వర్కింగ్ పేపర్ పేర్కొంది.వివిధ వర్గాల్లో తృణధాన్యాల వినియోగం తగ్గుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి తగు సాగు విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని వివరించింది. 2011–12 నాటి వినియోగ ధోరణులను 2022–23తో పోలుస్తూ ఈ పేపర్ సమగ్రంగా విశ్లేషించింది. -
ఎన్నికల వేళాపేదల సంక్షేమం
సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా పేదల సంక్షేమానికి, వారి అభివృద్ధికే వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. ఈ విషయాన్ని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు సంబంధించి వివిధ రాష్ట్రాల వ్యయాలను కాగ్ వెల్లడించింది. సామాజిక రంగ వ్యయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సామాజిక రంగానికి రూ.37, 699.55 కోట్ల వ్యయం చేసి టాప్లో నిలవగా.. ఉత్తరప్రదేశ్ రూ.32,800.46 కోట్ల వ్యయం చేసి రెండో స్థానంలో నిలిచింది. సామాజిక రంగ వ్యయం అంటే.. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, సంక్షేమం, పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరాపై చేసిన వ్యయంగా పరిగణిస్తారు. ఈ వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కొలబద్దగా కాగ్, ఆర్బీఐ పరిగణిస్తాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందుగానే.. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నవరత్నాల సంక్షేమ పథకాలకు ఎలాంటి లోటు లేకుండా గత వైఎస్ జగన్ ప్రభుత్వం నిధులను కేటాయించింది. ఎన్నికల సమయంలో సైతం పేదలు నష్టపోకుండా పథకాల ఫలాలు అందించేందుకు కృషి చేసింది. -
అంతా అబద్ధం
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడాశాఖ ఒలింపిక్స్ లక్ష్యంగా ఒక్కో క్రీడాకారుడిపై చేసిన ఖర్చుపై నివేదికను విడుదల చేస్తుంది. అయితే మహిళా డబుల్స్ స్టార్ షట్లర్ అశ్విని పొన్నప్పపై ఆ శాఖ విడుదల చేసిన వ్యయ నివేదికపై ఆమె మండిపడింది. అత్తెసరు, అరకొర సాయం తప్ప అవసరమైన వ్యక్తిగత కోచ్నే ఇవ్వలేదని... అలాంటపుడు ఏకంగా రూ. కోటిన్నర తనపై ఖర్చు చేసినట్లు ఎలా చెబుతారని కేంద్ర క్రీడా శాఖ నిర్వాకంపై అసంతృప్తి వెలిబుచ్చింది. ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్’ (టాప్స్) కింద రూ. 4.5 లక్షలు, అలాగే వార్షిక శిక్షణ, టోర్నీల్లో పాల్గొనడం (ఏసీటీసీ) కోసం రూ. 1 కోటి 48.04 లక్షలను అశ్వినిపై ఖర్చు చేసినట్లుగా ‘సాయ్’ వ్యయ నివేదికలో పేర్కొంది. దీనిపై స్పందించిన షట్లర్ ‘ఇది చూసి నేనైతే తేరుకోలేనంత షాక్కు గురయ్యాను. నాకు ఆర్థిక సాయం అందలేదనే చింత లేదు కానీ అంత మొత్తం నాకు కేటాయించారనే తప్పుడు నివేదిక ఇవ్వడం ఏంటి. నిజంగా చెబుతున్నా. ‘సాయ్’... క్రీడా శాఖ నివేదికలో వివరించినట్లుగా నేనెలాంటి నిధులు అందుకోలేదు. జాతీయ శిక్షణ విషయానికొస్తే... రూ. కోటిన్నర నిధుల్ని మొత్తం శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులపై ఖర్చు పెట్టారు. అంతేతప్ప నా ఒక్కరికే అంత మొత్తం ఇవ్వనేలేదు. ఇంకా చెప్పాలంటే నాకు వ్యక్తిగత కోచే లేడు. క్రీడా శాఖ నియమించనూ లేదు. నా వ్యక్తిగత ట్రెయినర్ను సొంతడబ్బులతో నేనే ఏర్పాటు చేసుకున్నా. ఇలా చెబుతున్నది నిజం తెలియాలనే తప్పా నాకు డబ్బులు ఇవ్వాలని కానేకాదు. 2023 నవంబర్ వరకు కూడా నా సొంత ఖర్చులతోనే శిక్షణ తీసుకున్నా, పోటీల్లో పాల్గొన్నా... ఆ తర్వాతే టాప్స్కు ఎంపికయ్యా’ అని 34 ఏళ్ల అశ్విని వివరించింది. మేటి డబుల్స్ షట్లర్గా ఎదిగిన అశ్విని కామన్వెల్త్ క్రీడల్లో 2010లో స్వర్ణం, 2014లో రజతం, 2018లో కాంస్యం గెలిచింది. 2011 ప్రపంచ చాంపియన్షిలో గుత్తా జ్వాలతో కలిసి మహిళల డబుల్స్లో కాంస్య పతకాన్ని గెల్చుకుంది. జ్వాలతోనే కలిసి 2012 లండన్ ఒలింపిక్స్, 2016 రియో ఒలింపిక్స్లలో డబుల్స్లో పోటీపడింది. పారిస్ ఒలింపిక్స్లో తనీషాతో కలిసి బరిలోకి దిగిన అశ్విని గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. -
కేటాయించినవి ఖర్చు చేయలేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పు పట్టింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను తన నివేదికలో అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. కేటాయింపులు, ఖర్చులు ఇష్టారాజ్యంగా జరిగాయని, కొన్ని పద్దుల్లో కేటాయించిన నిధులు ఖర్చు చేయలేదని, కొన్ని పద్దుల్లో మాత్రం అసెంబ్లీ ఆమోదం పొందకుండానే ఇష్టమొచ్చినట్టు ఖర్చు పెట్టిందని ఆక్షేపించింది.డబుల్బెడ్ రూం ఇళ్లకు రూ.11వేల కోట్లు, గొర్రెలు, మేకల కార్పొరేషన్కు రూ.1000 కోట్లు, ఆయిల్పామ్ పెంపకానికి రూ.1000 కోట్లు, దళిత బంధు కింద రూ. 15,700 కోట్లు, రైతులకు రుణమాఫీ కింద కేటాయించిన రూ.3,964 కోట్లు ఖర్చు చేయకపోవడాన్ని తప్పు పట్టింది. 2014–21 వరకు రూ.2,89,115 కోట్ల అధిక వ్యయం జరిగిందని కూడా వెల్లడించింది. గత మూడేళ్ల పన్నేతర రాబడుల అంచనాలను భారీగా వేశారని, కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయక గ్రాంట్లు రాకపోయినా అవే అంచనాలను రూపొందించారని తెలిపింది.సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.2,06,977 కోట్లు ఎక్కువగా పెరిగిందని, పాలమూరు–రంగారెడ్డికి రూ.12,937 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.11,370 కోట్ల మూలధన వ్యయం ఎక్కువగా జరిగిందని వెల్లడించింది. ద్రవ్యలోటును ఆ ఆర్థిక ఏడాదిలో రూ.2,749 కోట్లు తక్కువగా చూపెట్టారని తెలిపింది.2022–23 ఆర్థిక సంవత్సరంలో అనివార్య ఖర్చులు 43 శాతానికి చేరాయని, రుణాలు, అడ్వాన్సులు 150 శాతం పెరిగి మొత్తం బడ్జెట్లో 11 శాతానికి చేరాయని వెల్లడించింది. బడ్జెట్ వెలుపలి రుణాల విషయంలో స్పష్టత లేదని, డిస్కంల అప్పులను రూ.16వేల కోట్ల మేర తక్కువగా చూపెట్టారని కూడా కాగ్ ఆక్షేపించింది. ఈ మేరకు రెవెన్యూ, ఆర్థిక రంగాల కాగ్ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. పురపాలకశాఖ ఖర్చు చేసింది రూ. 7,990 కోట్లుపురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 2022–23 సంవత్సరంలో కేటాయించిన రూ.10,591 కోట్లలో ఖర్చు చేసిన మొత్తం రూ. 7,990 కోట్లు మాత్రమే. ఈ విషయాన్ని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. గ్రాంట్ కింద కేటాయించిన ఈ మొత్తంలో రూ. 3,832 కోట్లు సరెండర్ చేసిన మొత్తంగా పేర్కొంది. ఇందులో మెట్రో కనెక్టివిటీకి కేటాయించిన రూ. 500 కోట్లు పనులు ప్రారంభించనందున ఖర్చు కాలేదు.ఎయిర్పోర్టు మెట్రో కనెక్టివిటీకి కేటాయించిన రూ.378 కోట్లు కూడా అదే పరిస్థితిలో ఖర్చు కాలేదు. ఓఆర్ఆర్కు కేటాయించిన రూ.200 కోట్లు విడుదల కాలేదు. హైదరాబాద్ పట్టణ సముదాయం కోసం కేటాయించిన రూ.151 కోట్లు, భూముల సేకరణకు కేటాయించిన రూ.100 కోట్లు కూడా వెనక్కి వెళ్లాయి. మూలధన విభాగం కింద రూ.151 కోట్లలో కేవలం రూ. 20,000 మాత్రమే వినియోగించబడినట్టు తెలిపింది.కాంపాలో మిగిలిన రూ.1,114 కోట్ల బ్యాలెన్స్2022–23 ఆర్థిక సంవత్సరం చివర్లో రాష్ట్ర ప్రత్యామ్నాయ అటవీకరణ నిధిలో (కాంపా) రూ.1,114 కోట్ల మొత్తం మేర బ్యాలెన్స్ మిగిలిపోయిందని కాగ్ పేర్కొంది. ఈ ఏడాది సందర్భంగా రూ.68 కోట్లు ఈ నిధిలోకి జమచేసి, మొత్తంగా ఈ నిధినుంచి రూ.404 కోట్లు కేటాయించిందని తెలిపింది. 2019 ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వం ‘స్టేట్ కాంపన్సెటరీ అఫారెస్టెషన్ ఫండ్’ను ఏర్పాటు చేసిందని వెల్లడించింది. -
జూన్ నాటికి ద్రవ్యలోటు 8.1 శాతానికి అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) ముగిసే నాటికి లక్ష్యంలో 8.1 శాతానికి చేరింది. విలువలో ఇది రూ.1,35,712 కోట్లు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) తాజా గణాంకాను విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే... ఆర్థిక సంవత్సరం (2024–25) జీడీపీలో 4.9 శాతం వద్ద కట్టడి చేయాలన్నది నిర్మలా సీతారామన్ బడ్జెట్ లక్ష్యం. విలువలో ఇది 16.14 లక్షల కోట్లు. అయితే జూన్ ముగిసే నాటికి ఈ విలువ రూ.1,35,712 కోట్లకు చేరిందన్నమాట. అంటే ద్రవ్యలోటు ఇప్పటికి 8.1 శాతమని అర్థం. 2023–24లో ద్రవ్యలోటు 5.6 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు రూ.32.07 లక్షల కోట్లుగా, వ్యయాలు రూ.48.21 లక్షల కోట్లుగా బడ్జెట్ అంచనావేస్తోంది. వెరసి ద్రవ్యలోటు రూ.16.14 లక్షల కోట్లుగా నమోదుకానుంది. -
25 కోట్ల కుటుంబాలకు ఐటీసీ ఉత్పత్తులు
న్యూఢిల్లీ: ఐటీసీ ఉత్పత్తులు దేశంలోని 25 కోట్లకు పైగా కుటుంబాలు వినియోగిస్తున్నాయి. తమ ఉత్పత్తులపై కస్టమర్ల వార్షిక వ్యయం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 12 శాతం పెరిగి రూ.32,500 కోట్లకు చేరినట్టు ఐటీసీ ప్రకటించింది. కస్టమర్లు ఐటీసీ ఉత్పత్తుల కొనుగోలుకు వెచి్చంచే మొత్తం ఆధారంగా వార్షిక వ్యయాలను ఐటీసీ లెక్కిస్తుంటుంది. 25కు పైగా ప్రపంచస్థాయి భారత బ్రాండ్లు ఎఫ్ఎంసీజీలో భాగంగా ఉన్నాయని, ఇవన్నీ సొంతంగా అభివృద్ధి చేసినవేనని ఐటీసీ తన వార్షిక నివేదికలో తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఐటీసీ ఉత్పత్తులపై కస్టమర్ల వ్యయం రూ.29,000 కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 23 కోట్లకు ఐటీసీ ఉత్పత్తులు చేరువ కాగా, గత ఆర్థిక సంవత్సరంలో మరో రెండు కోట్ల కుటుంబాలకు చేరుకున్నట్టు సంస్థ తెలిపింది. ఐటీసీ ఎఫ్ఎంసీజీ కింద బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల, విద్య, స్టేషనరీ ఉత్పత్తులు, అగర్బత్తీలు, అగ్గిపెట్టెలు ఉన్నాయి. గడిచిన కొన్నేళ్లలో వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగినట్టు ఐటీసీ తెలిపింది. బ్రాండెడ్ గోధుమ పిండిలో ఆశీర్వాద్ అగ్రస్థానంలో ఉందని.. స్నాక్స్లో బింగో, క్రీమ్ బిస్కెట్లలో సన్ఫీస్ట్ ముందంజలో ఉన్నట్టు వివరించింది. అలాగే నోట్బుక్లలో క్లాస్మేట్, నూడుల్స్లో ఇప్పీ, బాడీవాష్లో ఫియామా, అగర్బత్తీల్లో మంగళ్దీప్ బ్రాండ్లు బలంగా ఉన్నట్టు తెలిపింది. సవాళ్లతో కూడిన వాతావారణంలో, తీవ్ర పోటీ పరిస్థితుల మధ్య కంపెనీ ఎఫ్ఎంసీజీ వ్యాపారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమ సగటు కంటే మెరుగ్గా ఉన్నట్టు వెల్లడించింది. వినియోగం పుంజుకుంటుంది.. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2024–25) అధిక వృద్ధి పథాన్ని కొనసాగిస్తుందని ఐటీసీ విశ్వాసం వ్యక్తం చేసింది. స్థిరమైన పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం పుంజుకోవడాన్ని గుర్తు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం కోలుకుంటున్నందున ఇవన్నీ సమీప కాలంలో వినియోగ డిమాండ్కు ఊతమిస్తాయని అంచనా వేసింది. సాధారణ వర్షపాతంతో రబీ సాగు మంచిగా ఉండడం వృద్ధికి మద్దతునిస్తుందని పేర్కొంది. ‘‘భౌతిక, డిజిటల్ వసతుల విస్తరణకు, తయారీ రంగం పోటీతత్వాన్ని ఇతోధికం చేసేందుకు, ప్రత్యక్ష/పరోక్ష, ఆర్థిక రంగ సంస్కరణలు, వ్యాపార సులభతర నిర్వహణకు కేంద్ర సర్కారు తీసుకున్న చర్యలు రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థను బలంగా ముందుకు నడిపిస్తాయని ఐటీసీ తన నివేదికలో అంచనా వేసింది. ‘‘మూలధన వ్యయాల పెంపు, మౌలిక వసతులపై దృష్టి సారించడం దేశీయ తయారీని నడిపిస్తాయి. వ్యవసాయ సంబంధిత పథకాలు రైతులకు మేలు చేస్తాయి. తద్వారా గ్రామీణ వినియోగ డిమాండ్ పుంజుకుంటుంది. ఇది పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను ఇతోధికం చేస్తుంది’’ అని అంచనా వేసింది. వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు చర్యలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విలువ జోడింపు, మార్కెట్ అనుసంధానత చర్యలు వ్యవసాయరంగ పోటీతత్వాన్ని బలోపేతం చేసేందుకు కీలకమని అభిప్రాయపడింది. -
పెరిగిన గృహావసరాల వినియోగ వ్యయం
సాక్షి, అమరావతి: దేశంలో గృహావసరాల వినియోగ వ్యయంలో వివిధ సామాజికవర్గాల మధ్య అంతరాలు క్రమేణా తగ్గుతున్నాయి. దశాబ్దకాలంలో దేశంలో సగటు గృహావసరాల వినియోగ వ్యయం గణనీయంగా పెరిగింది. ఈ మేరకు జాతీయ గృహావసరాల వినియోగ వ్యయ(హెచ్సీఈఎస్) నివేదిక వెల్లడించింది. 2011–12 నుంచి 2022–23 మధ్యకాలంలో దేశ పౌరులు సగటున గృహావసరాల కోసం వెచ్చిస్తున్న వ్యయాన్ని అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల వినియోగ వ్యయం 9.20శాతం పెరిగింది. కాగా, ఇతర వర్గాల్లో 8.5శాతం పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో గృహావసరాల వినియోగ వ్యయం అధికంగా పెరిగిందని తెలిపింది. హెచ్సీఈఎస్ నివేదికలోని ప్రధాన అంశాలు » 2011–12 దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సగటు కుటుంబ నెల వ్యయం (ఎంపీసీఈ) రూ.1,430 ఉండగా, 2022–23లో రూ.3,773కు పెరిగింది. » పట్టణ ప్రాంతాల్లో సగటు కుటుంబ నెల వ్యయం 2011–12లో రూ.2,630 ఉండగా, 2022–23లో రూ.6,459కు పెరిగింది. » గృహావసరాల వినియోగ వ్యయంలో గ్రామీణ ప్రాంతాల్లో 46శాతం ఆహార పదార్థాలకు, 54శాతం ఇతర అవసరాలకు వెచ్చిస్తున్నారు. » పట్టణ ప్రాంతాల్లో 39శాతం ఆహార పదార్థాలకు, 61శాతం ఇతర అవసరాలకు ఖర్చు చేస్తున్నారు. » సగటు గృహావసరాల వినియోగ వ్యయంలో సిక్కిం మొదటి స్థానంలో ఉండగా, ఛత్తీస్గఢ్ చివరి స్థానంలో ఉంది. » ఆంధ్రప్రదేశ్లో ఎంపీసీఈ గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,870 ఉండగా, పట్టణ ప్రాంతాల్లో రూ.6,782లుగా ఉంది. -
అంబానీ ఇంట పెళ్లి సందడి: రెండో ప్రీ వెడ్డింగ్ బాష్ ఖర్చు ఎంతో తెలుసా?
బిలియనీర్ ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి, అందులోనూ ఈ తరంలో చివరి పెళ్లి. అందుకే బోలెడంత సందడి. ఇది చాలదన్నట్టు ఘనంగా నిశ్చితార్థం, అంగరంగ వైభవంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఇపుడు కనీవినీ ఎరుగని రీతిలో రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు షురూ అయ్యాయి. దీంతో రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్గా నిలిచింది.ముఖేష నీతా అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్తో జూలై 12న ముంబైలో జరగనుంది. దీనికి ముందుగా దక్షిణ ఫ్రాన్స్లో ఉన్న విల్లాలో దేశ విదేశాలకు చెందిన 800 మంది ముఖ్య అతిథులతో ఇటలీ నుండి ఫ్రాన్స్కు వెళ్లే మార్గంలో విలాసవంతమైన క్రూయిజ్లో రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుక జరుగుతోంది. జూన్ 1, 2024న ఇటలీలోని సుందరమైన పోర్టోఫినో నగరంలో ముగుస్తుంది.తాజా సమాచారం ప్రకారం అనంత్ అంబానీ-రాధిక మూడు రోజుల ప్రీ-వెడ్డింగ్లో పాపులర్ అమెరికన్ గాయని-గేయరచయిత, కేటీ పెర్రీ ప్రదర్శన ఇవ్వనుంది. ఈ రోజు సాయంత్రం(మే 31) డార్క్ హార్స్, రోర్, ఎలక్ట్రిక్, హార్లేస్ ఇన్ హవాయి పాటలతో ఈ గ్రాండ్ ఈవెంట్లో సందడి చేయనుంది. 'లా విటా ఇ అన్ వియాజియో' (జీవితం ఒక ప్రయాణం) థీమ్తో ఈ గాలా సాగుతుంది. ఇందుకు కోసం పాప్ ఐకాన్కు భారీ మొత్తంలోనే ముట్ట చెప్పారట. ఖర్చు రూ. 7500కోట్లురూ. 424 కోట్ల విలువైన ఎస్టేట్లో నిర్వహించే రెండో ప్రీ వెడ్డింగ్ బాష్ కోసం అంబానీ కుటుంబం ఏకంగా 7,500 కోట్లు రూపాయలు వెచ్చిస్తోంది. అంతేకాదు క్రూయిజ్లోని ప్రతి సూట్ స్పా, జిమ్, స్విమ్మింగ్ పూల్ మరెన్నో విలాసవంతమైన సౌకర్యాలతో ఉంటుంది. ఒక్కోదానికి ఖర్చు సుమారు రూ. 60 లక్షలు. ఐదు గంటలు పాటు జరిగే మూడో రోజు స్పెషల్ ఈవెంట్లో డీజేలు, బాణా సంచా వెలుగులతో మోత మోగనుంది.కాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జూలై 12, 2024న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోనున్నారు. అతిరథ మహారథుల సమక్షంలో మూడు రోజుల పాటు పెళ్లి సంబరాలు కొనసాగనున్నాయి. -
Lok Sabha Elections 2024: ఈసీ ‘మెనూ కార్డు’
చాయ్కి పంజాబ్లోని జలంధర్లో రూ.15. అదే మధ్యప్రదేశ్లోని మాండ్లాలో అయితే రూ.7. సమోసా కూడా పంజాబ్లో రూ.15 అయితే మధ్యప్రదేశ్లో రూ.7.5. ఏమిటీ ధరలంటారా? లోక్సభ ఎన్నికల ప్రచార నిమిత్తం అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిర్ధారించిన ధరలివి. వీటిని జిల్లా ఎన్నికల విభాగాలు స్థానికంగా నిర్ధారిస్తుంటాయి. దాంతో అవి ఒక్కో ప్రాంతానికి ఒక్కోలా ఉంటాయి. అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై గరిష్ట పరిమితి ఉందన్నది తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యరి్థకి ఈసీ నిర్ధారించిన పరిమితి రూ.95 లక్షలు. అరుణాచల్, గోవా, సిక్కిం రాష్ట్రాల్లో మాత్రం రూ.75 లక్షలు. కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.75–95 లక్షల మధ్య ఉంది. నామినేషనల్ దాఖలు చేసిన నాటి నుంచి ఫలితాలు వెల్లడించే తేదీ దాకా అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయం ఈ పరిమితిని దాటకుండా ఈసీ డేగ కళ్లతో గమనిస్తూ ఉంటుంది. ఇందుకోసం బ్యానర్లు, ఫ్లెక్సీలు, సభా వేదికలు మొదలుకుని కార్యకర్తలు, అభిమానులకు ఆహారం దాకా ప్రతిదానికీ రేటును ఫిక్స్ చేస్తుంది. అయితే వాటికీ, వాస్తవ ధరలకూ చాలాసార్లు పొంతనే ఉండదు. దాంతో ఈసీ ‘మెనూ కార్డు’పై మీడియాలో, సోషల్ మీడియాలో జోకులు పేలుతుండటం పరిపాటి. మరోవైపు, ఎన్నికల వ్యయంపై అభ్యర్థులకు పరిమితి ఉన్నా పార్టీలు చేసే ఖర్చుకు మాత్రం అలాంటిదేమీ లేకపోవడం విశేషం! చాయ్ రూ.5 నుంచి 15 దాకా... చాయ్ ధరను దేశవ్యాప్తంగా ప్రాంతాన్ని బట్టి రూ.5 నుంచి రూ.15 దాకా ఈసీ నిర్ధారించింది. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో కప్పు చాయ్ రూ.5, సమోసా రూ.10. ఇడ్లీ, సాంబార్ వడా, పోహా–జిలేబీ ప్లేటు రూ.20. దోసా, ఉప్మా మాత్రం ప్లేటు రూ.30. మణిపూర్లో జాతుల హింసకు కేంద్రాల్లో ఒకటైన తౌబల్ జిల్లాలో చాయ్, సమోసా, కచోరీ, ఖజూర్, గాజా ఒక్కోటీ రూ.10. రాష్ట్రంలోని తెంగ్నౌపాల్ జిల్లాలో బ్లాక్ టీ రూ.5, సాదా టీ రూ.10. మణిపూర్లో బాతు మాంసం రూ.300. పంది మాంసం రూ.400. ఇక్కడి ఈసీ మెనూలో చికెన్తో పాటు చేపలు కూడా ఉన్నాయి. జలంధర్లో ప్లేటు చోలే భటూరేకు ఈసీ నిర్ధారించిన ధర రూ.40. కిలో చికెన్కు రూ.250, మటన్కు రూ.500. మిఠాయిల్లో ధోడా రూ.450, ఘీ పిన్నీ రూ.300. గ్లాసు లస్సీ రూ.20, నిమ్మరసం రూ.15. చెన్నైలో తగ్గిన చికెన్ బిర్యానీ రేటు చెన్నైలో 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే చాయ్ ధరను రూ.10 నుంచి రూ.15కు ఈసీ పెంచింది. కాఫీ కూడా రూ.15 నుంచి రూ.20కి పెరిగింది. కానీ చికెన్ బిర్యానీ ధరను మాత్రం రూ.180 నుంచి రూ.150కి తగ్గించడం విశేషం! ఢిల్లీ శివార్లలో నోయిడా పరిధిలోని గౌతంబుద్ధ నగర్లో వెజ్ భోజనం రూ.100. సమోసా, చాయ్ రూ.10. కచోరీ రూ.15, శాండ్విచ్ రూ.25, జిలేబీ కిలో రూ.90. ఉత్తర గోవాలో బటాటా (ఆలూ) వడ, సమోసా రూ.15. చాయ్ రూ.15, కాఫీ రూ.20. హరియాణాలోని జింద్లో దాల్ మఖానీ, మిక్స్డ్ వెజ్ కర్రీ రూ.130. మటర్ పనీర్ రూ.160. ఇక్కడ ఈసీ మెనూలో బటర్ నాన్, మిస్సీ రోటీ, ప్లెయిన్ రోటీలతో పాటు కాజూ కట్లీ, గులాబ్జామ్ వంటివి కూడా ఉన్నాయి. వీటికీ రేట్లు ఫిక్స్... ► ఖరీదైన హెలీప్యాడ్లు, లగ్జరీ వాహనాలు, ఫామ్హౌజ్లతో పాటు పూలు, కూలర్లు, టవర్ ఏసీలు, సోఫాల వంటివాటికి కూడా ఈసీ రేట్లు నిర్ధారించింది. ► సభలు, సమావేశాలకు జనాన్ని తరలించేందుకు బస్సులు మొదలుకుని టాటా సఫారీ, స్కార్పియో, హోండా సిటీ, సియాజ్... ఇలా బ్రాండ్లవారీగా కూడా ఒక్కో వాహనానికి ఒక్కో రేటు నిర్ణయించింది. ► దండల్లో కూడా గులాబీ, బంతి... ఇలా పూలను బట్టి రేట్లు నిర్ణయమయ్యాయి. పార్టీల జెండాలు, టోపీలకూ అంతే. ► సభలు, సమావేశాలకు వేదికలు, నేతలకు బస తదితరాలతో పాటు ప్రకటనలు, హోర్డింగులు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రికి కూడా ఇంత అని ఈసీ ముందే రేట్లు ఫిక్స్ చేసి పెట్టింది. కొసమెరుపు: ఎన్నికల వేళ కార్యకర్తలకు పారీ్టలు, అభ్యర్థులు మద్యం అందుబాటులో ఉంచడం బహిరంగ రహస్యమే. కానీ ఈసీ మెనూలో మద్యానికి మాత్రం చోటులేకపోవడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సామాజిక రంగ వ్యయంలో దక్షణాదిలో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: పేదలను విద్యావంతులు, ఆరోగ్యవంతులుగా చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలపై అత్యధిక వ్యయం చేస్తున్నారు. పేదల అభ్యన్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రభుత్వ రంగ విద్య అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి పేదింటి పిల్లవాడూ లేదా అమ్మాయి చదువు మధ్యలో ఆపేయకుండా అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన వంటి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. అంతర్జాతీయ స్థాయి సిలబస్ను పిల్లలకు అందిస్తున్నారు. అదే విధంగా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి, అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. పేదల ఇంటి వద్దకే వైద్యాన్ని చేరుస్తున్నారు. గ్రామీణ, పట్టణాభివృద్ధిపైనా దృష్టి కేంద్రీకరించారు. బడి పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్యాన్ని పెంపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రక్షిత మంచి నీరు అందిస్తున్నారు. ఇలా సామాజిక రంగానికి సీఎం వైఎస్ జగన్ పెద్ద పీట వేస్తున్నారు. తద్వారా గత ఐదేళ్లుగా సామాజిక రంగ కేటాయింపులు, వ్యయంలో మన రాష్ట్రం ముందుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి పది నెలల్లోనూ (ఏప్రిల్ నుంచి జనవరి వరకు) సామాజిక రంగ కేటాయింపులతో పాటు వ్యయంలోనూ దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపులు, నెలవారీ వివిధ రంగాలకు చేసిన వ్యయాలపై కాగ్ గణాంకాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక రంగానికి రూ.1,30,366 కోట్లు కేటాయించింది. ఇందులో పది నెలల్లోనే రూ.1,07,610 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ తెలిపింది. ఇది ఏకంగా 82.54 శాతం. సామాజిక రంగానికి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు, ఆ నిధులను సమర్ధంగా వినియోగించడంలో దక్షిణాదిలో మిగతా రాష్ట్రాలు వెనకబడ్డాయని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ తరువాత స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంది. మూడో స్థానంలో కర్నాటక,, నాలుగో స్థానంలో తెలంగాణ,, ఐదో స్థానంలో కేరళ రాష్ట్రాలు ఉన్నట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. సామాజిక రంగ వ్యయం అంటే.. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, సంక్షేమం, పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరాపై చేసిన వ్యయంగా పరిగణిస్తారు. సామాజిక రంగ వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కొలబద్దగా కాగ్, ఆర్బీఐ పరిగణిస్తాయి. -
అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ : భారీ ఏర్పాట్లు, మొత్తం ఖర్చు ఎంతంటే..!
బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. గుజరాత్లోని జామ్నగర్లో అనంత్-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు పలువురు రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులతోపాటు, గ్లోబల్ టెక్ సీఈఓలు, పాప్ ఐకాన్లు హాజరు కావడం విశేషంగా నిలిచింది. మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన ఈ ఈవెంట్ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించడం విశేషం. ప్రీ వెడ్డింగ్ సందడే ఇంత ఘనంగా జరుగుతోంటే, అదీ ముఖేష్ అంబానీ సంతానంలో జరుగుతున్న చివరి పెళ్లి వేడుక కావడంతో అనంత్ అంబానీ పెళ్లి తంతు ఇంకెంత ఘనంగా ఉంటుందో అనే చర్చ మొదలైంది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్కు రూ.1260 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తద్వారా ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన వేడుకగా ఇది నిలిచింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మెటా హెడ్ మార్క్ జుకర్బర్గ్, ఇవాంకా ట్రంప్, ఇలా డజన్ల కొద్దీ ఇతర ప్రముఖులు బసకోసమే ఏకంగా సుమారు రూ. 52 కోట్లు ఖర్చు పెట్టారట. పాప్ ఐకాన్ రిహన్నా సహా, వీరందరికోసం విలాసవంతమైన వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు, దేశ, విదేశీ భారతీయ అతిథుల కోసం ముఖేష్ అంబానీ ప్రైవేట్ విమానాలను కూడా ఏర్పాటు చేశారు. కేటరింగ్ కాంట్రాక్టుకే రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. మూడు రోజుల పాటు అద్భుతమైన పూలకోసం కూడా భారీగానే వెచ్చించారట. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ప్రకారం అమెరికన్ పూల డిజైనర్ జెఫ్ లీథమ్ అదిరిపోయే కలర్ఫుల్ ఫ్లవర్ సెట్టింగ్స్ తీర్చిదిద్దాడు. కాగా 2023, జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న అనంత్ -రాధికా మర్చంట్ఈ ఏడాది జూలైలో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. -
పట్టణ తలసరి వ్యయంలో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: సగటు భారతీయుడి నెలవారీ ఖర్చు పట్టణాల్లో రూ.6,459 ఉంటే, అదే గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి రూ.3,773గా ఉన్నట్లు ఓ నివేదిక తేల్చింది. పట్టణ ప్రాంతాల్లో ఆహారేతర నెలవారీ ఖర్చు రూ.3,929 కాగా ఆహారానికి సంబంధించి రూ.2,530 వ్యయం చేస్తున్నట్లు తెలిపింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆహారేతర ఖర్చు నెలకు రూ.2,023 కాగా ఆహారానికి రూ. 1,750 వ్యయం చేస్తున్నారు. పెద్ద రాష్ట్రాల్లో సగటు పట్టణ నెలవారీ తలసరి వ్యయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సగటు భారతీయుడి నెలవారీ ఖర్చులు ఎలా ఉంటాయి? వేటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు? పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యయాల తీరు ఎలా ఉంటుంది? ఇవన్నీ అందరికీ ఆసక్తిని కలిగించే అంశాలే. ఈ నేపథ్యంలోనే..‘హౌస్హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ (గృహావసరాల వినియోగ ఖర్చు) (మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్–ఎంపీసీఈ (నెలవారీ తలసరి ఖర్చు) సర్వే 2022–23’పేరిట కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించింది. గతంలో కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే పేరిట ప్రతి ఐదేళ్లకు సర్వే నిర్వహిస్తుండగా, చివరగా 2011–12లో దీనిని నిర్వహించారు. ఇప్పుడు పదేళ్ల తర్వాత తాజా సర్వే నిర్వహించారు. అయితే సర్వేకు అనుసరించిన విధానం (మెథడాలజీ)లో మార్పుల కారణంగా గతంలో నిర్వహించిన అధ్యయనాలతో దీనిని పోల్చలేదని నేషనల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్వో) తెలిపింది. కాగా ఇటీవల విడుదల చేసిన ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ తర్వాత ఢిల్లీ, హిమాచల్ పెద్ద రాష్ట్రాల్లో సగటు పట్టణ నెలవారీ తలసరి వ్యయంలో రూ.8,251తో తెలంగాణ టాప్లో ఉండగా, ఢిల్లీ (రూ.8,250), హిమాచల్ప్రదేశ్ (రూ.8,083) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే మొత్తంగా చూస్తే చండీగఢ్ (రూ.12,577) మొదటి స్థానంలో ఉండగా, సిక్కిం (రూ.12,125), అండమా¯న్ అండ్ నికోబార్ (రూ.10,268), గోవా (రూ.8,761), అరుణాచల్ ప్రదేశ్ (రూ.8,649) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక పట్టణాల్లో శ్రీమంతులుగా ఉన్న టాప్ 5 శాతం మంది రూ.20,824 వ్యయం చేస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,501 ఖర్చు చేస్తున్నారు. మరోవైపు దిగువ స్థాయిలో ఉన్న 5 శాతం మంది పట్టణాల్లో రూ.2,001, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,373 ఖర్చు చేస్తున్నట్లు నివేదిక వివరించింది. -
జాతీయ స్థాయిని మించి ఏపీ తలసరి వినియోగ వ్యయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం జాతీయ స్థాయిని మించి నమోదైంది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే 2022–23 వెల్లడించింది. వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత ఆహార, ఇతర వస్తువులతోపాటు ఆహారేతర వస్తువుల వినియోగం ఆధారంగా 2022–23 గృహ వినియోగ వ్యయ సర్వే కోసం క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించినట్టు సర్వే నివేదిక వెల్లడించింది. ఆహార పదార్థాలైన బియ్యం, గోధుమలు, మొక్కజొన్న రాగులు, పప్పులు, చక్కెర, వంట నూనెలు, ఆహారేతర వస్తువులైన ల్యాప్టాప్, పీసీ, టాబ్లెట్, మొబైల్, సైకిల్, మోటార్ సైకిల్, స్కూటీ, స్కూల్ యూనిఫాం, స్కూల్ షూ తదితర వస్తువులను పరిగణనలోకి తీసుకుని నెలవారీ తలసరి వినియోగ వ్యయాన్ని లెక్కించినట్టు సర్వే నివేదిక తెలిపింది. రాష్ట్రంలో తలసరి వ్యయం ఇలా.. జాతీయ స్థాయిలో గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.3,860 ఉండగా.. పట్టణాల్లో ఆ వ్యయం రూ.6,521 ఉన్నట్టు సర్వే పేర్కొంది. ఏపీ విషయానికి వస్తే గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.4,996 ఉండగా.. పట్టణాల్లో రూ.6,877 ఉన్నట్టు సర్వే వెల్లడించింది. పొరుగు రాష్ట్రం తెలంగాణ గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉంది. తెలంగాణలో తలసరి వినియోగ వ్యయం రూ.4,959గా ఉంది. అత్యల్పంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.2,257 రూపాయలు ఉండగా.. పట్టణాల్లో రూ.4,557 ఉందని సర్వే తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో చూస్తే ఛండీగఢ్లో గ్రామాల్లో అత్యధికంగా నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.7,467 ఉండగా.. పట్టణాల్లో రూ.12,577 ఉంది. అత్యల్పంగా లడ్హాక్లో గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.4,062 ఉండగా.. పట్టణాల్లో రూ.5,511 ఉందని సర్వే నివేదిక తెలిపింది. -
సామాజిక హితం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత మూడేళ్లుగా అభివృద్ధి వ్యయం పెరుగుతుండగా వడ్డీల చెల్లింపుల వ్యయం తగ్గుతున్నట్లు రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) అధ్యయన నివేదిక వెల్లడించింది. రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్లపై నివేదిక విడుదల చేసిన ఆర్బీఐ 2021–22 నుంచి 2023–24 వరకు ప్రధాన ఆర్థిక సూచికలను ఇందులో పొందుపరిచింది. సామాజిక సేవలు, ఆర్థిక సేవల వ్యయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొంది. సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలపై నేరుగా చేసే వ్యయాన్ని అభివృద్ధి వ్యయంగా నిర్వచించింది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యపై చేసే ఖర్చును అభివృద్ధి వ్యయంగా ఉదహరించింది. జీతభత్యాలు భారీగానే.. ► ఆంధ్రప్రదేశ్లో వరుసగా మూడేళ్లుగా సామాజిక రంగ వ్యయం పెరుగుతోంది. సామాజిక సేవలు, గ్రామీణాభివృద్ధి, ఆహార నిల్వలు, గిడ్డంగులు ఈ కోవలోకి వస్తాయి. ఇదే సమయంలో ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగాల కోసం వెచ్చించే వ్యయం కూడా పెరుగుతోంది. ► 2021–22లో మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయం రూ.1.19 లక్షల కోట్లు ఉండగా 2023–24 నాటికి రూ.1.92 లక్షల కోట్లకు పెరిగింది. ► వడ్డీ చెల్లింపులు పెరుగుతున్నాయనే వాదనల్లో నిజం లేదు. రెవెన్యూ రాబడిలో వడ్డీ చెల్లింపుల శాతం తగ్గుతోంది. ► ఏపీలో వేతనాలు, జీతాలు చెల్లింపులు గత ఐదేళ్లుగా పెరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగులకు పీఆర్సీ అమలుతో పాటు చిరు ఉద్యోగుల వేతనాలను పెంచడంతో వేతనాలు, జీతాల వ్యయం పెరుగుతున్నట్లు సూచికలు వెల్లడిస్తున్నాయి. -
తెలంగాణ అప్పు రూ.6,85,765 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘పదేళ్ల బీఆర్ఎస్ విధ్వంసం–ఆర్థిక అరాచకం’పేరుతో విడుదల చేయనున్న శ్వేతపత్రంలో భాగంగా 1956–2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టిన ఖర్చులో తెలంగాణకు వచ్చిన వాటా, తద్వారా జరిగిన అభివృద్ధి, సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాల కోసం చేసిన అప్పుల గురించి వివరించనున్నట్లు సమాచారం. అలాగే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2023–24 బడ్జెట్ ప్రతిపాదనలతో కలిపి మొత్తం అంచనాలు, జరిగిన ఖర్చుతో పాటు అప్పుల గురించి శాసనసభకు తెలియజేయనున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. గత పదేళ్లలో ప్రభుత్వం చేసిన బడ్జెట్ ప్రతిపాదనలకు, ఖర్చుకు పొంతన లేదని, రెండింటికీ మధ్య సుమారు 20 శాతం తేడా ఉందంటూ గణాంకాలు వెల్లడించనున్నట్లు తెలిపాయి. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023–24 వరకు మొత్తం రూ.14,87,834 కోట్లను ప్రతిపాదిస్తే, ఖర్చు చేసింది కేవలం రూ.12,24,877 కోట్లు మాత్రమేనని ప్రభుత్వం వివరించనుంది. అప్పులు ఇలా..! ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.75 వేల కోట్ల అప్పు ఉంటే గత పదేళ్లలో అది రూ.6,85,765 కోట్లకు చేరింది. అందులో ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) పరిమితులకు లోబడి తెచ్చిన అప్పు రూ.3.89 లక్షల కోట్లయితే, వివిధ కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిళ్లు, సంస్థలకు గ్యారంటీల ద్వారా ప్రభుత్వం రూ.1.27 లక్షల కోట్లకు పైగా సమకూర్చి ఖర్చు పెట్టింది. మరో రూ.1.09 లక్షల కోట్లను గ్యారంటీలిచ్చి కార్పొరేషన్ల ద్వారా ఖర్చు పెట్టింది. ఇక ప్రభుత్వ గ్యారంటీలు లేకుండా రూ.60 వేల కోట్ల మేర కార్పొరేషన్లే నేరుగా అప్పులు చేశాయి..’అని విశదీకరించనున్నారు. ‘రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రూ.12 లక్షల కోట్లకు పైగా కేవలం మిషన్ భగీరథ, సీతారామ, కాళేశ్వరంతో పాటు కొంతమేర పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టారు. ఆర్అండ్బీ, మున్సిపల్ శాఖల్లో కొంత వెచ్చించి మౌలిక సదుపాయాలు సమకూర్చారు. అయితే 1956 నుంచి 2014 వరకు అన్ని బడ్జెట్లు కలిపి తెలంగాణకు వచ్చి న వాటా కేవలం రూ.5 లక్షల కోట్లకు పైగా మాత్రమే. ఈ తక్కువ మొత్తంతోనే నాగార్జున సాగర్ నుంచి కృష్ణా, గోదావరి నదులపై అనేక ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, వైద్యసంస్థలు, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ లాంటి ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ఇతర సంక్షేమ పథకాలను గత ప్రభుత్వాలు అమలు చేశాయి..’ అని వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. -
ఉచిత పథకాలపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: ఉచిత పథకాలపై ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పథకాలు వ్యయప్రాధాన్యతను వక్రీకరిస్తాయని చెప్పారు. ఉచిత పథకాల అంశంలో పోటాపోటీగా నడుస్తున్న రాజకీయాలపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ‘భారత మండపం’లో ఎన్హెచ్ఆర్సీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఉచిత పథకాలతో ప్రజల జేబులు నింపడం సరికాదని జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. ప్రజల జీవన శైలి, సమర్థత, నైపుణ్యాలను మెరుగుపరచాలని అభిప్రాయపడ్డారు. భారత్ మాదిరిగా ప్రపంచంలో ఏ ప్రదేశమూ మానవ హక్కులతో విరాజిల్లడం లేదని స్పష్టం చేశారు. ఉచితాలు స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని తగ్గిస్తాయని ఆయన చెప్పారు. ‘అమృత్ కాల్’ సమయంలోనే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కూడా 75వ వార్షికోత్సవాన్ని చేసుకోవడం యాదృచ్ఛికమని జగ్దీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్లోని ఐరాస రెసిడెంట్ కోఆర్డినేటర్ శోంబి షార్ప్ పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ పంపిన సందేశాన్ని ఆయన చదివి వినిపించారు. ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్ జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా తీవ్రవాదం, ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులపై దాని ప్రభావం తీవ్రమైన సమస్యగా ప్రస్తావించారు. ఇదీ చదవండి: ఛత్తీస్గఢ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయి -
లెక్కలు తీస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి ఏమిటో ప్రజలకు చెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ‘ఇది ప్రజాప్రభుత్వం’అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం రోజే ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి కేబినెట్ సమావేశంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఈ పదేళ్ల కాలంలో నిధుల విడుదల, ఖర్చు, మిగులు తదితరాలు ప్రజలకు వివరించాలని నిర్ణయించిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే ప్రభుత్వ శాఖల వారీగా నివేదికలు సేకరించాలని నిర్ణయించి ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా బడ్జెట్ రూపకల్పనలో భాగంగా శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదల, చేసిన ఖర్చులకు సంబంధించి సమాచారం విభాగాధిపతులు సమర్పించడం ఆనవాయితీ. సీఎం ఆదేశాలతో శుక్రవారం పలు విభాగాధిపతులు ఆగమేఘాల మీద ఈ ఏడాదికి సంబంధించిన వివరాలు ప్రభుత్వానికి సమర్పించారు. ప్రత్యేక ఫార్మాట్ రూపకల్పన ! శాఖలవారీగా చేసిన ఖర్చులకు ప్రత్యేక ఫార్మాట్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినట్టు తెలిసింది. 2014 నుంచి ఇప్పటివరకు వార్షిక బడ్జెట్లో జరిపిన కేటాయింపులు, నిధుల విడుదలకు సంబంధించి బడ్జెట్ రిలీజింగ్ ఉత్తర్వులు, చేసిన ఖర్చు, సంవత్సరం వారీగా నిధుల మిగులుకు సంబంధించిన సమాచారం సమర్పించాల్సి ఉంటుంది. ఖర్చుకు సంబంధించిన అంశాలను పథకాల వారీగా వ్యయం, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతోపాటు మరమ్మతులు తదితరాలను పూర్తిస్థాయిలో సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో కూడిన జాబితాతోపాటు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, విడుదలైన నిధులు, చేసిన ఖర్చు వివరాలు కూడా వేరుగా సమర్పించాలని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంతో అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, సమావేశాలు ముగిసేనాటికి వీటిని ప్రజాక్షేత్రంలో ఉంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి పదేళ్ల కాలంలో రూ.25వేల కోట్లు ఖర్చు చేసినట్టు అంచనా. -
అది పార్టీ సభా..లేక కుల సభా..
అసలే ఎన్నికల సమయం. ప్రజలతో భారీ బహిరంగసభలు, రోడ్ షోలు నిర్వహించడం ద్వారా ప్రజలంతా తమవైపు ఉన్నారన్న సంకేతాలు పంపించడమే వాటి ఉద్దేశం. ఇందుకోసం కోట్లాది రూపాయల వ్యయం అవుతుంది. అయినా ఫర్వాలేదు. పార్టీ ప్రతిష్ట ముఖ్యం. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే పరమావధి. అలాంటిదే పరేడ్ గ్రౌండ్లో ప్రతిష్టాత్మకంగా భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే సదరు సభ నిర్వహణకు పార్టీ పేరుమీద కాకుండా.. ఓ సంఘం పేరిట బహిరంగసభ నిర్వహణకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ బహిరంగసభకు కీలక నేత ముఖ్య ప్రసంగం ఉంటుందని, తద్వారా ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడేలా సర్వం సిద్ధం చేసుకున్నారు. కానీ ఇక్కడే తిరకాసు వచ్చిపడింది. అనుమతి తీసుకున్నది ఓ కులసంఘం. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సభకు అనుమతినిచ్చారు. అయితే సభలో ఎక్కడా పార్టీ జెండాలు ఉండరాదని మౌఖికంగా ఆదేశించారట. లేదు.. కూడదు.. బహిరంగసభలో పార్టీ జెండాలు పెడితే.. సంబంధిత ఖర్చులో సగం వరకు స్థానిక అభ్యర్థి లెక్కలో వేస్తామని హెచ్చరించారట... ఏమి చేయాలో పాలుపోని నాయకులకు ఎన్నికల బహిరంగసభ రద్దుకు నిర్ణయం తీసుకున్నారట. అయితే అదే సమయానికి వాతావరణశాఖ కూడా వర్షాలు పడే సూచనలున్నాయంటూ ఇచ్చిన హెచ్చరిక కూడా వీరికి కలిసి వచ్చిందంటున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో ఓ జాతీయ పార్టీ కూడా ఓ కులసంఘానికి సంబంధించిన బహిరంగసభ నిర్వహించింది. అది కూడా ఇంచుమించుగా రాజకీయ వేదికగానే ఉపయోగించుకుంది. కానీ అక్కడ ఎక్కడా తన పార్టీ జెండాలు ఏర్పాటు చేయకుండా జాగ్రత్త పడింది. ఆ సభ ద్వారా కావాల్సినంత ప్రయోజనాన్ని ఎన్నికల్లో పొందడానికి ప్రయత్నం చేసింది. ఆ కుల సంఘం కూడా ఎన్నికల ప్రచారంలో ఆ జాతీయ పార్టీకి పూర్తి మద్దతుగా రంగంలోకి దిగింది. ఇది ఎన్నికల కాలం మహిమ. -
ఉద్యోగాలు పోతున్నాయి.నాకు మాత్రం సూపర్: క్రేజీ ‘బారీ’ ప్రకటన ఏంటంటే!
బ్రిటీష్ మల్టీ-మిలియనీర్, పారిశ్రామికవేత్త బారీ డ్రివిట్-బార్లో (53) గుర్తున్నాడా. గే కపుల్గా క్రేజీ రికార్డు క్రియేట్ చేసిన బారీ ఇపుడు మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. రానున్న క్రిస్మస్ సందర్భంగా తన ఖర్చును తగ్గించుకుంటున్నట్టు తాజాగా ప్రకటించాడు. ఎందుకంటే దేశం కష్టాల్లో ఉంది. అలాగే ప్రపంచంలో చాలా మంది ఉద్యోగాలు, ఇళ్లను కోల్పోతున్న బాధలో ఉన్నారు. అందుకే ఈ ఏడాది క్రిస్మస్ ఖర్చును కేవలం 28 కోట్ల రూపాయలకు పరిమితం చేయబోతున్నానని తెలిపాడు. అలాగే తన హాలిడే షాపింగ్ను తగ్గించాలని ప్లాన్ చేసుకున్నానని కూడా పేర్కొన్నాడు. కానీ తనకు, తన వ్యాపారాలకు మాత్రం 2023 సూపర్ రికార్డ్ సంవత్సరం అని ప్రకటించాడు. అయితే ఇప్పటికే క్రిస్మస్ బడ్జెట్లో తన ఫియాన్సీ స్కాట్ కోసం 1.9కోట్ల రూపాయల విలువైన బ్రాండ్ న్యూ ఆడి ఆర్8ని కొనుగోలు చేశాడు. అలాగే కొడుకు ఆస్పెన్ కోసం లగ్జరీ అపార్ట్మెంట్లు, ఇళ్లను నిర్మించడానికి భూమిని కొనుగోలు చేశాడు. వ్యాపారంలో విజయం,క్రిస్మస్ సందర్భంగా ఆస్పెస్కి ప్రత్యేకంగా ఏదైనా ఇవ్వాలని నిర్ణయించు కున్నాడట. అందుకే ఖరీదైన కొత్త రోలెక్స్ G-వ్యాగన్ రడీ చేశాడు. అతని భార్య పిమ్ కోసం, ఆమె ఫ్యామిలీకి దగ్గరగా ఉండేలా ఆమె సొంత ఊరు బ్యాంకాక్లోని కోట్ల విలువచేసే కొత్త అపార్ట్మెంట్, కొత్త రోజ్ గోల్డ్ రోలెక్స్ వాచ్ కొనుగోలు చేశాడు. ఇంకా అయిపోలేదు అతని కుమార్తె సఫ్రాన్ కోసం, ప్లాటినం రోలెక్స్ వాచ్, లెక్కలేనన్ని దుస్తులు, లేటెస్ట్ లూయిస్ విట్టన్ బ్యాగ్లు ఇలా బోలెడు విలువైన వస్తువులు ఆమె కోసం సిద్ధం చేశాడు. దీంతో పాటు మిగిలిన పిల్లలకి కూడా క్రిస్మస్ కానుకలుగా లగ్జరీ వాచీలు, కార్లు, ఆస్తులను పొందబోతున్నారని స్వయంగా బారీ మీడియాకు వెల్లడించాడు. బారీ డ్రూవిట్-బార్లో టోనీ రికార్డులు, పిల్లలు బ్రిటన్లో బారీ డ్రివిట్-బార్లో భాగస్వామి టోనీతో కలిసి తొలి గే కపుల్గా రికార్డు సృష్టించారు. దాదాపు 11 సంవత్సరాలు కలిసి వున్న తరువాత పిల్లల్ని దత్తత తీసుకోవాలని భావించారు. కానీ 1999లో కాలిఫోర్నియాలో సరోగేట్ ద్వారా కవలలు సాఫ్రాన్, ఆస్పెన్ జన్మనిచ్చి మరో హిస్టరీ క్రియేట్ చేశారు. అంతేకాదు జనన ధృవీకరణ పత్రాలపై తల్లి, తండ్రికి బదులుగా పేరేంట్ -1, పేరెంట్-2 అని నమోదు చేసేలా స్వలింగ తల్లిదండ్రులను అనుమతించాలని ఈ జంట కోర్టును ఆశ్రయించి విజయం సాధించింది. LGBTQ కమ్యూనిటీకి సంబంధించి ఇదొక చారిత్రాత్మక సందర్బంగా నిలిచింది. ఇపుడు ముగ్గురు తల్లిదండ్రులుగా నమోదయ్యేందుకు ప్రయత్నస్తున్నాడు ఈ క్రేజీ గే బారీ. అంతేకాదు అంతర్జాతీయ స్పెర్మ్ డోనర్గా ఇప్పటికే 17మంది పిల్లలకు జీవసంబంధమైన తండ్రిని అని ఇటీవల ప్రకటించాడు బారీ. ఆ తరువాత ఈ జంట సరోగసీ ద్వారా ఓర్లాండో, జాస్పర్ , డల్లాస్ అనే కవల పిల్లలు సహాఎనిమిది మంది పిల్లలున్నారు. కూతురు సాఫ్రాన్ మాజీ ప్రియుడు స్కాట్ హచిసన్తో ప్రేమ కారణంగా 2019లో టోనీతో 32 ఏళ్ల సంబంధాన్ని తెంచుకున్నాడు బారీ. 2020లో, బారీ స్కాట్ తొలిబిడ్డ వాలెంటినా పుట్టింది. ఇక బారీ- టోనీ వ్యాపారానికి విషయానికి వస్తే రియల్ ఎస్టేట్, ట్రాన్స్-అట్లాంటిక్ సరోగసీ వ్యాపారం, గ్లోబల్ మెడికల్ రీసెర్చ్ కంపెనీతో సహా అనేక వ్యాపారాలతో కోట్లకు పడగలెత్తారు. ముఖ్యంగా తన సంతానానికి ప్రతీ ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఖరీదైన బహుమతులిచ్చి ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాడు బారీ . గత ఏడాది క్రిస్మస్ కోసం సుమారు 4 మిలియన్ యూరోలు ఖర్చు చేశాడట. కొడుకు కోసం ఏకంగా రూ.25 కోట్ల విలువైన బోటును గిఫ్ట్గా ఇచ్చాడు పుట్టిన రెండు రోజులకే మిలియనీర్ క్లబ్లో మనవరాలు అంతేకాదు తన మనవరాలికి భారీ ఎత్తున ఆస్తులను పంచి ఇచ్చి పుట్టిన 2 రోజులకే మిలియనీర్గా అవతరించిన రికార్డును అందించాడు. విలాసవంతమైన ఇల్లు, 10 కోట్ల ఆస్తి, 52 కోట్ల ట్రస్ట్ను ఆమెకు రాసిచ్చానని బార్లో ఇన్స్టాగ్రామ్లో వెల్లడించాడం అప్పట్లో వైరల్ అయింది.ఈ భవనంలో పాపాయికి సేవలు చేసేందుకు సకల ఏర్పాట్లు చేసినట్లు పేర్కొనడం విశేషంగా నిలిచింది. -
ఆ కంపెనీల ఆదాయ వ్యయాలు అధికం
డెబ్బై గంటల పని వారాలపై ఇటీవల తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఉద్యోగులు ఎన్నిగంటలు పనిచేసినా కొన్ని కంపెనీల్లో ఉత్పాదకత పెరుగుతోంది. మరొకొన్నింటిలో తక్కువగా ఉంటుంది. కంపెనీ ఉద్యోగికి చేసే ఖర్చు, ఆ ఉద్యోగి సంస్థకు చేకూర్చే ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని సంస్థలు చేసిన సర్వేలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. ఆ వివరాల ప్రకారం..గత ఐదేళ్లలో కంపెనీలకు వచ్చే మొత్తం రాబడిలో సిబ్బంది ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ క్రమంగా పెరుగుతోంది. అయితే 2019లో రూ.1.46 కోట్లుగా ఉన్న టాప్ 500 లిస్టెడ్ కంపెనీల రాబడి 36% పెరిగి 2023లో దాదాపు రూ.2 కోట్లకు చేరుకుంది. కంపెనీల ఉత్పాదకత పెరుగుతుంది. దాంతోపాటు కొన్ని సంస్థలు ఉద్యోగులపై చేసే వ్యయం కూడా అధికమవుతుంది. దాదాపు కంపెనీల వ్యయంలో 10శాతం ఉద్యోగుల జీతాలకు కేటాయిస్తున్నాయి. 2020-21 కరోనా సమయంలో ఉద్యోగుల ఆదాయం పడిపోయింది. కానీ గత రెండేళ్లలో వారి ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతూ వస్తుంది. ద్రవ్యోల్బణం సమయంలో కంపెనీల ఉత్పాదకత తగ్గి ఉద్యోగుల ఖర్చులు పెరిగినట్లు కనిపిస్తాయి. దాంతో వారి ఆదాయాలు పెరిగినట్లు అవుతుంది. కానీ ద్రవ్యోల్బణ భయాలు సమసిపోతున్నపుడు క్రమంగా ఆదాయ వ్యయాలు సర్దుబాటవుతాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీస్, ఐటీ వంటి కొన్ని రంగాల్లో ఉత్పాదకత వాస్తవానికి మెరుగుపడింది. ఆయా రంగాలు వారి ఉద్యోగులను గరిష్ఠస్థాయిలో వినియోగించుకున్నట్లు సర్వేలు తెలిపాయి. ఆ కంపెనీల ఆదాయవ్యయాలు పెరుగుతున్నాయి. రవాణా, లాజిస్టిక్స్, మ్యానుఫాక్చరింగ్, మైనింగ్, రిటైల్ రంగాలు ఇప్పటికీ తక్కువ స్థాయిలో కార్మికులను ఉపయోగిస్తున్నాయి. అయితే 2019 నాటికి టాప్ 500కంపెనీల్లో దాదాపు 6 కోట్ల ఉద్యోగులు ఉండేవారు. 2023 నాటికి వారి సంఖ్య 7 కోట్లకు చేరింది. గడిచిన ఐదేళ్లలో కంపెనీలు ఏటా 12.6శాతం మేర వృద్ధి చెందాయి. అదేవిధంగా వారి ఉద్యోగులకు చేసే ఖర్చు సైతం ఏటా 12.5శాతం చొప్పున పెరిగింది. -
ఆ సీట్లలో రూ.కోట్ల వరద
సాక్షి, హైదరాబాద్: ఓట్ల పండగకు కొత్త నిర్వచనం నోట్ల పండగ. ఎన్నికలు వచ్చాయంటే గ్రేటర్లో నోట్ల వర్షమే కురుస్తోంది. తాజాగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి కనిష్టంగా రూ.50–75 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. అంటే ఒక్కో నియోజకవర్గంలో కనిష్టంగా రూ.150–200 కోట్ల వరకు వ్యయం కానుందని విశ్లేషకుల అంచనా. ఈ మేరకు వెచ్చించగల సత్తా, ఆర్ధిక పరిపుష్టి కలిగిన వారినే అభ్యర్థులుగా ఆయా రాజకీయ పార్టీలు ఖరారు చేశాయి గ్రేటర్ హైదరాబాద్లో 29 నియోజకవర్గాలు ఉన్నాయి. పాతబస్తీ, రిజర్వ్ స్థానాలు మినహా మిగిలిన గ్రేటర్ నియోజకవర్గాల్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో నోట్ల వరద పారనుంది. ఇప్పటికే ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల తాయిలాలు పంపిణీ మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు నుంచే ప్రతి రోజు కార్యకర్తలు, అనుచరుల బాగోగులు చూసు కోవడం తప్పనిసరిగా మారింది. పెట్రోల్ బంక్లలో ఇంధనం వైన్స్, బెల్ట్ షాపులలో మద్యాన్ని పద్దు రూపేణా ఆయా దుకాణాలు, బంకుల యజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవేగాకుండా నియోజకవర్గ కేంద్రం సహా మండలం, వార్డుకు, పంచాయితీకో క్యాంపు ఆఫీసును ఏర్పాటు చేశారు. ఇక్కడ పార్టీ శ్రేణులకు బ్రేక్ ఫాస్ట్ మొదలు రాత్రి విందు, మందు వరకు ఫ్రీ. మరోవైపు ప్రచారరథాలు, ప్రజలను సమీకరణకు లారీలు, డీసీఎం వంటి వాహనాలను అద్దెకు తీసుకుంటున్నారు. ఖరీదైన ఎన్నికలకు కేరాఫ్ దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలకు తెలంగాణ పేరుగాంచింది. గతేడాది నవంబర్లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలలో రెండు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అనే స్థాయిలో పోటాపోటీగా ఖర్చు పెట్టాయి. ఒక్కో ఓటుకు రెండు పార్టీలు కలిపి రూ.10 వేల వరకూ ఓటర్కు అందించినట్లు, మొత్తంగా రూ.600 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు రాజకీయ వర్గాలలో చర్చ నడిచింది. ఇలాంటి పరిస్థితులలో వచ్చే నవంబర్లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు అధికారం చేజిక్కించుకునేందుకు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడట్లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఆర్థికంగా బలమైన అభ్యర్థులకే టికెట్లను కేటాయించడమే ఇందుకు నిదర్శనం. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) ప్రకారం.. ఇటీవల కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు రూ.9,500 కోట్ల నుంచి రూ.10,500 కోట్ల మధ్య ఖర్చు చేశాయని తెలిపింది. 2013 ఎన్నికల వ్యయం కంటే ఇది రెండింతలు అని పేర్కొంది. విభాగాల వారీగా తాయిలాలు.. ఒక్కో అభ్యర్థి ఎన్నికల సంఘం నిర్దేశించిన రూ.40 లక్షలకు మించి వ్యయం చేయకూడదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్–77 ప్రకారం ప్రతి అభ్యర్థి ఎన్నికల ఖర్చులకు సంబంధించి ప్రత్యేకంగా కరెంట్ ఖాతాను తెరవాలి. వ్యయ, నిర్వహణ రికార్డులను ఎన్నికల కమిషన్కు సమర్పించాల్సి ఉంటుంది.అయితే ఈసీ నిర్ణయించిన మొత్తానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వంద రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తారనేది జగమెరిగిన సత్యం. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను వర్గాల వారీగా విభజించి వారిని ఆకట్టుకుంటున్నాయి. మహిళలకు చీరలు, వెండి, బంగారం, కుట్టు మిషన్లు, కుక్కర్లు, మిక్సీలు వంటి గృహోపకరాలను అందిస్తుంటే... యువత కోసం గిఫ్ట్ కూపన్లు, ఆట వస్తువుల పంపిణీ, డ్రైవింగ్ లైసెన్స్, ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఫోన్లు బహుమతులుగా ఇస్తున్నారు. వృద్ధుల కోసం వైద్య శిబిరాలు, దసరా, దీపావళి బహుమతులు, బాణాసంచాలు అందిస్తున్నారు. ఆ సెగ్మెంట్లపై ఈసీ స్పెషల్ ఫోకస్ గ్రేటర్లో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాలపై రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఈ సెగ్మెంట్లలో అభ్యర్థులు అత్యధిక వ్యయం ఖర్చు చేయనున్నారు. హైదరాబాద్,రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని ఈ నియోజక వర్గాలలో సగటున ఐదు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఓటింగ్ శాతం తక్కువే అయినప్పటికీ రాజకీయ పార్టీలు వెచ్చించే సొమ్ము మాత్రం ఎక్కువగా ఉంటుంది. -
108 సేవలకు రూ.725 కోట్లు
సాక్షి, అమరావతి: అనుకోని ప్రమాదాలు, అనారోగ్య సమస్యలకు గురై ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న వారికి 108 అంబులెన్స్లు సంజీవనిలా మారాయి. ఫోన్ చేసిన నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను వేగంగా ఆస్పత్రులకు చేర్చి ప్రాణాలను నిలబెడుతున్నాయి. ప్రాణం విలువ తెలిసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం టీడీపీ హయాంలో నిర్వీర్యమైన 108 వ్యవస్థకు ఊపిరి పోసింది. 768 అంబులెన్స్ల ద్వారా ప్రజలకు ఉచితంగా సేవలందించేందుకు ఇప్పటి వరకూ రూ.589 కోట్లను ఖర్చు చేయగా కొత్త వాహనాల కొనుగోలుకు మరో రూ.136 కోట్లకుపైగా వ్యయం చేయడం గమనార్హం. గర్భిణులే అత్యధికం.. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సగటున మూడు వేల మందికి అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్లు సేవలందిస్తున్నాయి. 2020 జూలై నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు నాటికి 36 లక్షల మంది సేవలు పొందారు. వీరిలో అత్యధికంగా 23 శాతం మంది గర్భిణులుండగా 14 శాతం కిడ్నీ బాధితులు, 11 శాతం మంది రోడ్డు ప్రమాద బాధితులున్నారు. నిర్వహణకు ఏటా రూ.188 కోట్లకు పైగా రోడ్డు ప్రమాదాల బాధితులు, గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని ఎంత త్వరగా ఆస్పత్రికి తరలిస్తే ప్రాణ రక్షణకు అంత ఎక్కువ అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో 108 అంబులెన్స్ల నిర్వహణ, ఉచితంగా అత్యవసర రవాణా సేవలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. క్షేత్ర స్థాయిలో అంబులెన్స్ కార్యకలాపాల కోసం 3700 మందికి పైగా విధులు నిర్వహిస్తుండగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లో మరో 311 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరికి వేతనాలతో పాటు అంబులెన్స్ల నిర్వహణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. ప్రతి నెలా 108 అంబులెన్సుల నిర్వహణ కోసం రూ.14.39 కోట్లు వెచ్చిస్తోంది. ఏడాదికి రూ.172.68 కోట్లను నిర్వహణ కోసం కేటాయిస్తోంది. దీనికి తోడు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కోసం ఏడాదికి రూ.15.88 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోంది. అంటే ఏడాదికి మొత్తం రూ.188 కోట్లకు పైగా వ్యయం చేస్తోంది. గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకంగా వాహనాలు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్సు సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉండగా మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితికి తెర దించుతూ సీఎం జగన్ 2020 జూలై 1న ఏకంగా 412 కొత్త 108 అంబులెన్సులను ప్రారంభించారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది. ఇందుకోసం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. గిరిజన ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా 20 కొత్త అంబులెన్స్లను రూ.4.76 కోట్లతో 2022 అక్టోబర్లో అదనంగా కొనుగోలు చేశారు. దీంతో అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. 2.5 లక్షల కి.మీకిపైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో ఈ ఏడాది జూలైలో 146 కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చారు. వీటి కొనుగోలుకు ప్రభుత్వం మరో రూ.34.79 కోట్లు ఖర్చు చేసింది. ఇలా రూ.136.02 కోట్లు అంబులెన్స్ కొనుగోలుకు వెచ్చించారు. తద్వారా నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలు కోసం రూ.725.02 కోట్లు ఖర్చు చేశారు. -
ఆరోగ్యమే మహా భాగ్యం!
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యమే మహాభాగ్యం... ఈ నినాదాన్ని భారతీయులు తరతరాలుగా ఒక సందేశంగా తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ భారతీయులకు దీని అవసరం ఏర్పడింది. దీనికి తగ్గట్టుగానే 2022–23 ఆర్థిక సంవత్సరంలో తమ కుటుంబ ఆదాయాల్లో పది శాతానికిపైగా ఆరోగ్య పరిరక్షణకు భారతీయులు వ్యయం చేస్తున్నట్టుగా ఇటీవల నివేదికలో వెల్లడైంది. దీనికి సంబంధించి అత్యధికంగా ఖర్చు చేస్తున్న టాప్–5 రాష్ట్రాల్లో కేరళ, మహారాష్ట్ర, యూపీ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ప్రదేశ్ నిలుస్తున్నాయి. ఇది 2017–18 స్థాయిలను బట్టి చూస్తే గణనీయంగా వైద్య, ఆరోగ్యంపై ఖర్చు పెరగడానికి ప్రధానంగా కోవిడ్ మహమ్మారి కారణంగా తలెత్తిన విపత్కర, అనిశి్చత పరిస్థితులే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్) పురోగతిపై తాజాగా ‘మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్’విడుదల చేసిన డేటాలో ఆయా అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా మొత్తంగా చూస్తే.. 2022–23లో 6.67 శాతం ప్రజలు తమ ఆదాయాల్లో పదిశాతానికిపైగా (2017–18లో ఇది 4.48 శాతం) వ్యయం చేశారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా... మొత్తం కుటుంబ ఆదాయాల్లో 25 శాతానికి పైగా ఖర్చు చేస్తున్న వారు 2.3 శాతం మంది ఉన్నట్టుగా ఈ డేటా స్పష్టం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలతో పోలి్చతే పట్టణ ప్రాంతాల్లోని వారే తమ ఆదాయంలో పదిశాతానికి పైగా వ్యయం చేస్తున్నట్టుగా వెల్లడైంది. ఐతే కొన్ని సందర్భాల్లో...పరిస్థితులు చేయి దాటడం లేదా విపత్కర పరిస్థితులు ఎదురుకావడం వంటివి చోటుచేసుకున్నపుడు మాత్రం గ్రామాల్లోని ప్రజలు తమ కుటుంబ ఆదాయాల్లో 25 శాతానికి పైగా ఖర్చు చేయాల్సి వస్తోన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... భారతీయుల వైద్య, ఆరోగ్యానికి సంబంధించి తలసరి వ్యయం 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి (కరోనా తరువాత) అత్యధికంగా పెరిగినట్టుగా కేంద్ర మంత్రిత్వశాఖ నేషనల్ హెల్త్ అకౌంట్స్ (ఎన్హెచ్ఏ) అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్యం, కుటుంబాల ‘ఔట్ ఆఫ్ ప్యాకెట్’వైద్య, ఆరోగ్య వ్యయంపై ప్రభుత్వం ఖర్చు పెంచాక ఈ వృద్ధి నమోదైనట్టుగా ఈ అంచనాల్లోపేర్కొన్నారు. 2014–15 లలో ప్రభుత్వం చేస్తున్న తలసరిఖర్చు రూ. 1,100 కాగా, 2019–20 కల్లా అది రూ. 2,014కు పెరిగినట్టు ఇందులో తెలిపారు. -
AP: ఏడాదిలోనే జీతాల వ్యయం.. రూ.8,068కోట్లు పెరుగుదల
సాక్షి, అమరావతి: దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వోద్యోగుల వేతనాల వ్యయం భారీగా పెరిగింది. అదే సమయంలో పెన్షన్ల వ్యయం కూడా భారీగానే అయింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2022–23 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ప్రాథమిక గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఏడాది వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం భారీగా పెరిగింది. మరోపక్క.. తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల కన్నా ఏపీలోనే ఉద్యోగుల వేతనాల వ్యయం అధికంగా ఉందని కాగ్ తెలిపింది. నివేదిక ముఖ్యాంశాలు ఏమిటంటే.. ♦ 2021–22తో పోలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల వేతనాల వ్యయం 2022–23లో రూ.8,068.39 కోట్లు పెరిగింది. ♦ ప్రభుత్వోద్యోగుల పెన్షన్ల వ్యయం 2021–22తో పోలిస్తే 2022–23లో రూ.2,257.29 కోట్లు పెరిగింది. ♦ 2021–22 ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వోద్యోగుల వేతనాల వ్యయం ఏపీలో రూ.40,895.83 కోట్లు ఉండగా 2022–23లో అది ఏకంగా రూ.48,964.22 కోట్లకు పెరిగింది. ♦ అలాగే, 2021–22లో ప్రభుత్వోద్యోగుల పెన్షన్ల వ్యయం రూ.20,326.67 కోట్లు కాగా, 2022–23లో అది రూ.22,583.96 కోట్లకు పెరిగింది. ..ఇలా రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం ఏటేటా పెరుగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీని అమలుచేయడంతో పాటు ఉద్యోగులకు డీఏలు ఇవ్వడంతో వేతనాల వ్యయం భారీగా పెరుగుతోంది. మరోవైపు.. వైద్య ఆరోగ్య శాఖలో ఏ ఒక్క పోస్టు ఖాళీలేకుండా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తోంది. -
తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. 9 సంవత్సరాలు.. రూ.97,321 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి రూ.97,321 కోట్ల ఖర్చు చేశామని తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్రావు తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం విద్యుత్ సౌధ, మింట్ కాంపౌండ్లోని టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘విద్యుత్ విజయోత్సవ దినం’కార్యక్రమాల్లో మాట్లాడారు. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2022–23లో 2140 యూనిట్లుగా, జాతీయ సగటుతో పోలి్చతే 70శాతం అధికంగా నమోదైందని తెలిపారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ అభివృద్ధికి 9 ఏళ్లలో రూ.14,063 కోట్లు ఖర్చు చేశామని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి అన్నారు. వినియోగదారుల సమస్యలను సత్వరంగా పరిష్కరించి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఉద్యోగులకు సూచించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్, ట్రాన్స్కో జేఎండీ సి.శ్రీనివాసరావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. చదవండి: ఉగ్రవాదులు టార్గెట్ చేసిన రాష్ట్రాలు ఏవి? -
‘వార్ధా’ అంచనాలు పెరగలేదు!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ వార్ధా ప్రాజెక్టులో భాగంగా.. 2018లో బ్యారేజీ నిర్మాణానికి మాత్రమే రూ.750 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామని రాష్ట్ర నీటి పారుదల శాఖ పేర్కొంది. భూసేకరణ, ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు, ఫీల్డ్ చానళ్లు, కరకట్టలు, పంపుహౌజ్లు, విద్యుత్ సబ్స్టేషన్లు, రెగ్యులేటర్లు, క్రాస్ డ్రైనేజీ స్ట్రక్చర్లు, బ్రిడ్జీలు, నిర్వాహణ ఖర్చులతోపాటు 18 శాతం జీఎస్టీ పన్నును కలిపితే మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.4,550.73 కోట్లకు చేరిందని తెలిపింది. కేవలం జీఎస్టీ పన్ను వ్యయం రూ.622.40 కోట్లు కానుందని వెల్లడించింది. ‘వార్ధా ప్రాజెక్టు..భారీ బడ్జెట్’శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి వివరణ ఇచ్చారు. ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగలేదని పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టితో భారం తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా వార్ధా నదిపై బ్యారేజీని నిర్మించనుండటంతో వ్యయం గణనీయంగా తగ్గుతుందని నీటిపారుదల శాఖ పేర్కొంది. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ పొడవు 6.45 కిలోమీటర్లు, గేట్ల సంఖ్య 102కాగా.. వార్ధా బ్యారేజీ పొడవు 1751 మీటర్లు, గేట్ల సంఖ్య 29కి తగ్గుతాయని వివరించింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీలో 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద గరిష్ట నిల్వ సామర్థ్యం 1.85 టీఎంసీలు మాత్రమేకాగా.. వార్ధా బ్యారేజీలో 155 మీటర్ల వద్ద 2.94 టీఎంసీలను నిల్వ చేయవచ్చని తెలిపింది. -
పోలవరం వ్యయం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వ్యయం వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు మొత్తం వ్యయం నుంచి విశాఖపట్నం నగరానికి మంచి నీరు అందించేందుకు కేటాయించిన రూ.7,214 కోట్లను తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) కొట్టేసింది. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని న్యాయస్థానాలు ఆదేశాలు ఇవ్వలేవని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని మొత్తం తామే భరిస్తామని ఇచ్చిన హామీని కేంద్రం ఉల్లంఘిస్తే, దానికి కట్టుబడి ఉండాలని తాము ఆదేశాలు ఇవ్వలేమంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విభజన చట్టం, పార్లమెంట్లో ఇచి్చన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టు వ్యయంలో విశాఖ నగరానికి తాగు నీరు అందించేందుకు అయ్యే వ్యయాన్ని అంతర్భాగంగా పరిగణించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అమలాపురానికి చెందిన రమేష్చంద్ర వర్మ దాఖలు చేసిన పిల్పై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది మంగెన శ్రీరామారావు వాదనలు వినిపిస్తూ.. విశాఖ ప్రజల దాహార్తిని, పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు కేటాయించిన రూ.7,214 కోట్లను పోలవరం ప్రాజెక్టు వ్యయంలో అంతర్భాగంగా పరిగణిస్తున్నట్లు కేంద్రం పార్లమెంట్లో చెప్పిందన్నారు. అయితే ఈ హామీ నుంచి కేంద్రం ఇప్పుడు తప్పుకుందన్నారు. ఇది కూడా చదవండి: పేదలందరికీ ఇళ్లు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
లక్ష్యంలో 82.8 శాతానికి ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.14.53 లక్షల కోట్లకు చేరింది. బడ్జెట్ అంచనాలతో పోల్చితే ఇది 82.8 శాతానికి చేరింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ)ఈ గణాంకాలను విడుదల చేసింది. 2022–23లో మొత్తం ద్రవ్యలోటు రూ.17.55 లక్షల కోట్లుగా అంచనావేయడం జరిగింది. స్థూల దేశీయోత్పత్తి ఇది 6.4 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును జీడీపీలో 5.9 శాతానికి తగ్గించాలన్నది లక్ష్యం. -
ప్రకటనలపై వ్యయాలు 15 శాతం అప్
ముంబై: దేశీయంగా ఈ ఏడాది ప్రకటనలపై వ్యయాలు 15.5% పెరిగి రూ. 1.46 లక్షల కోట్లకు చేరనున్నాయి. 2021తో పోలిస్తే 2022లో పరిశ్రమ 15.7 శాతం వృద్ధి చెందిందని అంచనాలు నెలకొన్నాయి. మీడియా ఏజెన్సీ గ్రూప్ఎం ఈ అంచనాలను వెలువరించింది. అత్యంత వేగంగా ఎదుగుతున్న టాప్ 10 మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా ఉండనుందని, అడ్వర్టైజింగ్పై వెచ్చించే వ్యయాల విషయంలో ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉంటుందని గ్రూప్ఎం వివరించింది. స్థూల ఆర్థిక అస్థిరతలు, అంతర్జాతీయ పరిణామాలు గత మూడేళ్లుగా ప్రకటనకర్తల వ్యాపారాలు, అడ్వర్టైజింగ్ వ్యయాలపై ప్రభావం చూపాయని సంస్థ సీఈఓ (దక్షిణాసియా) ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. 2023లో ప్రకటనల వ్యయాలకు టెలికం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు.. బీమా, రిటైల్, ఫిన్టెక్, గేమింగ్, ట్రావెల్, పర్యాటకం మొదలైన విభాగాల నుంచి ఊతం లభిస్తుందని గ్రూప్ఎం బిజినెస్ ఇంటెలిజెన్స్ హెడ్ పర్వీన్ షేక్ చెప్పారు. ఈ ఏడాది గ్రామీణ ఎకానమీ కూడా పుంజుకోగలదన్నారు. టాప్ మెట్రోలను దాటి ఇతర ప్రాంతాలకూ 5జీ సేవలు విస్తరిస్తుండటం, స్మార్ట్ఫోన్లు చౌకగా లభిస్తుండటం తదితర అంశాలూ ప్రకటనకర్తలు అడ్వర్టైజింగ్పై మరింతగా వెచ్చించేందుకు దోహదపడగలవన్నారు. డిజిటల్దే పైచేయి.. గ్రూప్ఎం అంచనాల ప్రకారం మొత్తం ప్రకటన వ్యయాల్లో సింహభాగం వాటా డిజిటల్ మీడియాదే ఉండనుంది. అత్యంత వేగంగా 20 శాతం వృద్ధితో ఏకంగా 56 శాతానికి చేరనుంది. టీవీ మాధ్యమం వాటా మాత్రం స్వల్పంగా 31 శాతం నుంచి 30 శాతానికి తగ్గనుంది. ప్రింట్ మాధ్యమంలో ప్రకటనలపై వ్యయాలు మరింతగా తగ్గి 11 శాతం (2022లో) నుంచి ఈ ఏడాది 10 శాతానికి పరిమితం కానున్నాయి. విలువపరంగా మాత్రం ప్రింట్లో ప్రకటనలు రూ. 13,519 కోట్ల నుంచి రూ. 14,520 కోట్లకు పెరగనున్నాయి. -
‘21 రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకోండి’.. ఉద్యోగులకు కేంద్రం సూచనలు
న్యూఢిల్లీ: రైతులకు ఎరువులు భారీ స్థాయిలో రాయితీలకు ఇస్తుండటంతో ప్రభుత్వంపై పడిన సబ్సిడీ భారం, పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు తదితరాల పథకాల ఆర్థికభారం నుంచి కాస్తంత ఉపశమనం కోసం కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులోభాగంగా ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణ నిమిత్తం చేసే విమాన, రైలు ప్రయాణాల్లో ఖర్చులు తగ్గించుకోవాలంది. ఆ సూచనలు.. ► అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసి అధిక ధర చెల్లించేకన్నా 21 రోజుల ముందే తక్కువ ధరల శ్రేణి టికెట్లు బుక్ చేసుకోండి. ► అనవసరంగా టికెట్లు క్యాన్సిల్ చేయొద్దు. ► వేర్వేరు టైమ్–స్లాట్లుంటేనే, తప్పనిసరి అయితేనే రెండు టికెట్లు బుక్ చేయాలి. లేదంటే ఒక ప్రయాణానికి ఒక్కటే తీసుకోవాలి. ► విమాన టికెట్లను 72 గంటల్లోపు బుక్చేసినా, 24 గంటల్లోపు క్యాన్సిల్ చేసినా అందుకు కారణం తెలుపుతూ సంబంధిత విభాగానికి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ► తక్కువ క్లాస్ టికెట్తోనే ప్రయాణించండి. నాన్–స్టాప్ ఫ్లైట్ అయితే మరీ మంచిది. చదవండి👇 ఆర్మీలో అగ్నివీర్ తొలి నోటిఫికేషన్ విడుదల వందల సంఖ్యలో రైళ్లు రద్దు..రైళ్ల వివరాలు ఇవే.. -
రక్షణ వ్యయంలో ఆ మూడు దేశాలే టాప్!
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో రక్షణ వ్యయం ఏటేటా ఎగబాకుతోంది. ప్రపంచ సైనిక వ్యయం 2 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించి సరికొత్త శిఖరాలకు చేరింది. సైనిక వ్యయంలో అమెరికా(38%), చైనా(14%), భారత్(3.6%) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) వెల్లడించింది. ప్రపంచ సైనిక వ్యయం మొత్తంలో మొదటి 5 దేశాలదే 62 శాతం ఉండటం గమనార్హం. బ్రిటన్(3.2%), రష్యా(3.1%).. నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. మొత్తం ప్రపంచ సైనిక వ్యయం 2021లో 0.7 శాతం పెరిగి 2113 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఎస్ఐపీఆర్ఐ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమైనప్పటికీ ప్రపంచ దేశాల రక్షణ వ్యయం గణనీయంగా పెరిగిందని ఎస్ఐపీఆర్ఐ సీనియర్ పరిశోధకుడు డాక్టర్ డిగో లోపెస్ డా సిల్వా వెల్లడించారు. కోవిడ్ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థలు మెల్లగా కోలుకోవడంతో రక్షణ వ్యయం ప్రపంచ జీడీపీలో 2.2 శాతానికి చేరుకోగా, 2020లో ఈ సంఖ్య 2.3 శాతంగా ఉంది. అమెరికా మిలటరీ ఖర్చులు 2021లో 801 బిలియన్ డాలర్లకు చేరింది. 2020తో పోలిస్తే ఇది 1.4 శాతం తగ్గింది. 2012- 2021 మధ్య కాలంలో అమెరికా సైనిక పరిశోధన, అభివృద్ధికి నిధులను 24 శాతం పెంచింది. అదే సమయంలో ఆయుధాల కొనుగోళ్ల ఖర్చు 6.4 శాతం తగ్గించింది. రెండో స్థానంలో ఉన్న చైనా 2020తో పోల్చితే 4.7 శాతం వృద్ధితో 293 బిలియన్ డాలర్లను రక్షణ కోసం వెచ్చించింది. గత ఏడాది భారత సైనిక వ్యయం 76.6 బిలియన్ డాలర్లుగా ఉంది. 2020తో పోల్చితే 0.9 శాతం పెరిగింది. 2012 నుంచి భారత రక్షణ వ్యయం 33 శాతం పెరిగింది. స్వదేశీ ఆయుధ పరిశ్రమను బలోపేతం చేయడానికి, 2021 సైనిక బడ్జెట్లో 64 శాతం మూలధన వ్యయం దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ఆయుధాల కొనుగోలుకు కేటాయించారని ఎస్ఐపీఆర్ఐ పేర్కొంది. (క్లిక్: భారత్కు బంపరాఫర్.. అమెరికా, యూరప్ దేశాలకు రష్యా భారీ షాక్!) బ్రిటన్ గత సంవత్సరం రక్షణ కోసం 68.4 బిలియన్ డాలర్ల ఖర్చు చేసింది. 2020తో పోలిస్తే ఇది మూడు శాతం అధికం. రష్యా తన సైనిక వ్యయాన్ని 2021లో 2.9 శాతం పెంచడంతో 65.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. వరుసగా మూడో సంవత్సరం మిలటరీ పద్దు పెరగడంతో రష్యా సైనిక వ్యయం 2021లో జీడీపీలో 4.1 శాతానికి చేరుకుంది. (క్లిక్: ఉక్రెయిన్ను నడిపిస్తున్న... అమెరికా ఆయుధాలు) -
ఆదాయం గోరంత.. ఖర్చు కొండంత
సాక్షి, హైదరాబాద్: ‘బడ్జెట్ నిర్వహణ సరిగా లేదు. బడ్జెట్ ప్రతిపాదనలకు, సవరణలకు, ఖర్చులకు పొంతన లేదు. అప్పులు పెరుగుతున్నా సంపద సృష్టిపై దృష్టి సారించడం లేదు. కనీసం రెవెన్యూ మిగులు చూపించలేక పోయారు. ఆదాయం గోరంత పెరిగితే ఖర్చు కొండంత అవుతోంది. విద్య, వైద్య రంగాలపై ఖర్చు తగ్గిపోయింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యంతో పెద్ద ఎత్తున నిధులు స్తంభించిపోయాయి. మూలధన వ్యయం తగ్గిపోయింది. అదనంగా పెట్టిన ఖర్చుకు అసెంబ్లీ ఆమోదం తీసుకోకపోవడం శాసనసభ సాధికారతను తక్కువ చేయడమే..’అని 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తప్పుబట్టింది. జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్టానికి లోబడే అప్పులు తీసుకుంటున్నా ఏటేటా అప్పులు పెరిగిపోతున్నాయని, ప్రస్తుతమున్న అప్పుల్లో (రూ.89,228 కోట్లు) 46 శాతం ఏడేళ్లలో చెల్లించాల్సి ఉందని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారమవుతుందని మంగళవారం ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక అభిప్రాయపడింది. నివేదికలోని ముఖ్యాంశాలివే.. రెవెన్యూ మిగులు చూపించని బడ్జెట్ ఇదే ►2019–20లో తెచ్చిన అప్పుల్లో 75 శాతం నిధులను గతంలో చేసిన అప్పులు తీర్చేందుకు వినియోగించారు. ఈ విధానం రాష్ట్రంలో సంపద సృష్టిపై ప్రభావం చూపనుంది. ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడే రాష్ట్రం అప్పులను తీసుకువస్తోంది. ఈ సంవత్సరంలో 97 శాతం ద్రవ్యలోటును మార్కెట్ రుణాలతోనే పూడ్చారు. గత ఐదేళ్ల కాలంలో రెవెన్యూ మిగులు చూపించని బడ్జెట్ ఇదే. ►అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పోలిస్తే 2019–20 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఆదాయం రూ.1,124 కోట్లు (1.11%)పెరిగింది. అదే సమయంలో రెవెన్యూ ఖర్చు రూ.11,715 కోట్లు (12.07 శాతం) పెరిగింది. మూలధన వ్యయం తగ్గిపోయింది ►2018–19తో పోలిస్తే మూలధన వ్యయం చాలా తగ్గిపోయింది. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతో పెద్ద ఎత్తున పెట్టుబడి స్తంభించిపోయింది. డిస్కంల నష్టాలను తగ్గించేందుకు గాను మార్చి, 2020 నాటికి ఉదయ్స్కీం కింద ఇస్తానన్న రూ.4,063.65 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ప్రజారుణం (మొత్తం అప్పు) 18.04 శాతం పెరిగింది. జీఎస్డీపీ పెరుగుదల 12.61తో పోలిస్తే కూడా ఇది ఎక్కువ. ►2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం చేసిన బడ్జెట్ ప్రతిపాదనలు వాస్తవ రూపంలోకి రాలేదు. బడ్జెట్ అమలు, పర్యవేక్షణ కూడా సరిగా లేదు. అనుబంధ గ్రాంట్లు, వినిమయాలు కూడా సరిగా లేవు. కొన్నింటికి సభ ఆమోదం కూడా పొందలేదు. రూ.84,650.99 కోట్లకు సభ ఆమోదం పొందాల్సి ఉంది. శాసనసభలో ఆమోదం పొందిన దాని కన్నా గత ఐదేళ్లుగా ఖర్చు ఎక్కువ అవుతుండడం ఆందోళన కలిగించే పరిణామం. ►సామాజిక–ఆర్థిక గ్రాంట్ల కింద చేసిన ప్రతిపాదనలో నాలుగు గ్రాంట్ల కింద ఖర్చు 50 శాతం మించలేదు. ఇది రాష్ట్ర సామాజిక–ఆర్థికాభివృద్ధికి అవరోధం కానుంది. తగ్గిన పన్నేతర ఆదాయం ►రాష్ట్ర పన్నుల ఆదాయం పెరుగుతున్నప్పటికీ అంతకుముందు ఏడాదితో పోలిస్తే పన్నేతర ఆదాయం తగ్గిపోయింది. 2019–20 ఆదాయంలో మొత్తం 7,360 కోట్లు (7%) పన్నేతర ఆదాయం కింద రాగా, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది రూ.2,647 కోట్లు తగ్గింది. ►వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కింద రావాల్సిన ఐజీఎస్టీ ఈ ఏడాదిలో రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదు. 2018–19తో పోలిస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో రూ.2,753 కోట్లు తగ్గాయి. అటుదిటు..ఇటుదటు ►రెవెన్యూ ఖర్చు కింద చూపెట్టాల్సిన రూ.716 కోట్లను మూలధన వ్యయం కింద చూపెట్టారు. మూలధన వ్యయం కింద చూపెట్టాల్సిన రూ. 49.56 కోట్లను రెవెన్యూ వ్యయం కింద చూపెట్టారు. పీడీ అకౌంట్ల నిర్వహణ పారదర్శకంగా లేదు ►పీడీ అకౌంట్ల నిర్వహణ కూడా పారదర్శకంగా లేదు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వీటిని నిర్వహిస్తున్నారు. పీడీ అకౌంట్ల నుంచి నిధులను బ్యాంకులకు తరలించి అక్కడి నుంచి విత్డ్రా చేసుకుంటున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ►అమాంబాపతు పద్దు (800) నిర్వహణ కూడా సక్ర మంగా లేదు. దీంతో కేటాయింపుల ప్రాధాన్యాలు, ఖర్చు లక్ష్యం కూడా అస్పష్టంగా మారిపోయింది. అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసిన నిధుల వినియోగ పత్రాలు(యూసీ) కూడా సమర్పించడం లేదు. ఇది ఆర్థిక నియమాల ఉల్లంఘనే. రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వ అకౌంటింగ్ ప్రమాణాలను ఇంకా పాటించాల్సి ఉంది. ఆర్థిక సంఘం అంచనాలు అందుకోలేదు ►15వ ఆర్థిక సంఘం అంచనాలను రాష్ట్రం అందుకోలేకపోయింది. పన్ను ఆదాయం కింద రూ.89,950 కోట్లు వస్తుందని ఆర్థిక సంఘం అంచనా వేయగా రాష్ట్ర ప్రభుత్వం రూ.69,329 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించింది. కానీ, వచ్చింది మాత్రం రూ.67,957 కోట్లే. పన్నేతర ఆదాయం రూ. 12,354 కోట్ల మేర వస్తుందని ఆర్థిక సంఘం అంచనా వేస్తే, రూ.15,875 కోట్లను ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించగా, కేవలం రూ. 7,360 కోట్లు మాత్రమే వచ్చింది. ►విద్యుత్ సబ్సిడీల కింద ఇచ్చే మొత్తం ఈ ఏడాదిలో రూ. 167.48 కోట్లు పెరగ్గా, పౌరసరఫరాల సబ్సిడీలు రూ. 92 కోట్లు తగ్గాయి. -
ఓ తండ్రి ఆలోచన.. ఒకే ముహూర్తానికి ఆరు పెళ్లిళ్లు
ఈ హెడ్డింగ్కి అర్థం తెలుసుకోవాలంటే మనం కేరళకు వెళ్లాలి. అక్కడ ఒక తండ్రి తన కుమార్తెకు పెళ్లి చేయదలిచాడు. కాని పెళ్లికి అనవసర ఖర్చు వద్దనుకున్నాడు. కట్నం ఇవ్వకూడదనుకున్నాడు. ఆ డబ్బును సద్వినియోగం చేయాలనుకున్నాడు. కూతురి పెళ్లికి ఎంత డబ్బు దాచాడో ఆ మొత్తం డబ్బును అదే ముహూర్తానికి మరో ఐదు మంది అమ్మాయిల పెళ్లికి ఖర్చు చేశాడు. ఒకే ముహూర్తానికి ఆరు పెళ్ళిళ్లు జరిగాయి. ఈ ఆలోచన మనం చేయలేమా? అసలు పెళ్లికి ఖర్చు అవసరమా? పెళ్లి ఖర్చు అనే సామాజిక రుగ్మత నుంచి బయటపడలేమా? ఒక ఆలోచనాత్మక కథనం. ఇటీవల హైదరాబాద్ గోల్కొండ సమీపంలోని ఒక రిసార్ట్లో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి ఖర్చు.. అంటే పెళ్లి జరిపేందుకు అయిన ఖర్చు 2 కోట్లు. ఈ మొత్తంలో లాంఛనాలు లేవు. ఇచ్చిపుచ్చుకున్న ఖర్చూ లేదు. కేవలం కల్యాణ మంటపానికి, భోజనానికి, అతిథి మర్యాదలకి, సంగీత్కి, అలంకరణలకి, అట్టహాసానికి అయిన ఖర్చు అది. ఆ రెండు కోట్లతో మధ్యతరగతి పెళ్లిళ్లు 20 అయినా చేయొచ్చు. పేద పెళ్ళిళ్లు 50 అయినా చేయొచ్చు. పెళ్లి ఇద్దరు స్త్రీ, పురుషులు కలిసే సంతోషకరమైన సందర్భం. దానిని సంతోషంగా చేసుకోవాల్సిందే. ఇరువురి ఆత్మీయులు హాజరవ్వాల్సిందే. కాని ఆ పెళ్లిని ఆసరా చేసుకుని తమ సంపదను, అహాన్ని, హోదాని, పలుకుబడిని నిరూపించాలనుకున్నప్పుడే పేచీ వస్తుంది. వెండి అంచు ఉన్న శుభలేఖలు, వాటితో పాటు ఇచ్చే పట్టుచీరలు, వస్తువులు, భోజనంలో ముప్పై నలభై వంటకాలు, ఖరీదైన వినోద కార్యక్రమాలు ఇవన్నీ పెళ్లి బడ్జెట్ను అమాంతం పెంచేస్తాయి. ఉన్నవారికి ఇదంతా తేలికే కావచ్చు. ఇమిటేట్ చేయాలనుకునే వారికి చిక్కొచ్చి పడుతుంది. ఇటీవల కేరళ లో అట్టహాసపు పెళ్ళిళ్లు, అందుకు పెళ్లికొడుకులు మారాము చేయడం, ఘనంగా చెప్పుకోవడానికి బైక్ దగ్గర కారు అడగడం, కట్నం దగ్గర ఆస్తులు అడగడం, అవి వీలు కాకపోతే భార్యను వేధించడం మామూలు అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల కన్నూరులో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. కన్నూరు సమీపంలోని ఎడచ్చేరీకి చెందిన సలీమ్, రుబీనా జంట తమ కుమార్తె రమీజా పెళ్లిని వినూత్నంగా చేయాలనుకున్నారు. గల్ఫ్లో ఉద్యోగం చేసే సలీమ్ తన కుమార్తె పెళ్లికి డబ్బు దాచి పెట్టాడు. కాని దానిని కట్నంగా ఇవ్వడం, అట్టహాసపు పెళ్లికి ఖర్చు పెట్టడం వద్దనుకున్నాడు. ఎలాగైనా సరే కట్నం అడగని పెళ్లికొడుకుని వెతికి పెళ్లి చేయాలి అని నిశ్చయించుకున్నాడు. అలాంటి వరుడే దొరికాడు. దాంతో అతనికి కట్నం డబ్బు మిగిలిపోయింది. దాంతో పాటు పెళ్లి అర్భాటంగా వద్దనుకున్నాడు కాబట్టి ఆ ఖర్చూ మిగిలింది. ఆ మొత్తం డబ్బుతో ఆర్థికంగా వెనుకబడిన ఐదుగురు అమ్మాయిలను ఎంపిక చేసుకుని వారికి అబ్బాయిలను వెతికి తన కుమార్తెకు పెళ్లి జరిగిన ముహూర్తానికే వారికీ పెళ్లి జరిపించాడు. అంతే మొత్తం ఆరు పెళ్ళిళ్లు ఒకే ముహూర్తానికి జరిపించాడు. ఇందులో ఇద్దరు వధువులు హిందువులు కావడంతో వారి పెళ్లి హైందవపద్ధతిలో జరిగింది. ఈ పెళ్ళిళ్లు జరిపించడంలో సలీమ్, రుబీనా దంపతులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ఐదుగురు అమ్మాయిలకు తగిన అబ్బాయిలను వెతికారు. అలాగే పెళ్లిలో సొంత కూతురితో పాటు మిగిలిన ఐదుగురికీ సమానంగా 10 సవరల బంగారం పెట్టారు. అందరికీ ఒకేరకమైన పట్టు చీరలు తెచ్చారు. ఇంత చక్కగా డబ్బును సద్వినియోగం చేయడం వల్ల ప్రశంసలు పొందారు. ఇందులో మతసామరస్యం కూడా ఉండటంతో పొగడ్తలు మరిన్ని వస్తున్నాయి. కాలం మారుతుంది. రెండు తీవ్రతలు కనిపిస్తున్నాయి. ఒకటి పెళ్లికి చాలా ఎక్కువగా ఖర్చు పెట్టడం...మరొకటి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కేవలం బొకేలు ఇచ్చి పుచ్చుకుని వియ్ ఆర్ మేరీడ్ అనుకోవడం. ఎవరి ఇష్టం వారిదే అయినా పెళ్లి ఖర్చును తగ్గించడం అనేది ఒక అవసరంగా పాటించడం ఆదర్శం అవుతుంది. ఆ ఆదర్శం అందరూ పాటించగలిగితే చాలా కుటుంబాలకు పెళ్లి భారం అనే ఆలోచన తప్పుతుంది. తద్వారా ఆడపిల్లలను కనేందుకు, ఆడపిల్లలను పెంచేందుకు జంకే పరిస్థితి పోతుంది. ‘అమ్మాయి పుడితే ఖర్చు’ అనే మాట ఇంకా ఎంత కాలం? ఆ ఖర్చు పెళ్లి వల్లే కదా? దానిని తేలిక చేయలేమా? సలీం వంటి ఆలోచనలు చేయలేమా? ఆలోచించాలి అందరం. పెళ్లి ఖర్చును తగ్గించడం అనేది ఒక అవసరంగా పాటించడం ఆదర్శం అవుతుంది. ఆ ఆదర్శాన్ని అందరూ పాటించగలిగితే చాలా కుటుంబాలకు పెళ్లి భారం అనే ఆలోచన తప్పుతుంది. -
ఇన్ఫ్రా ప్రాజెక్టులు.. ప్రజల నెత్తిన రూ 4.38 లక్షల కోట్ల భారం!
న్యూఢిల్లీ: ఒకటో వంతు మౌలిక రంగ ప్రాజెక్టులు అధిక వ్యయ భారంతో, జాప్యంతో కొనసాగుతున్నట్టు కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు శాఖ తెలిపింది. రూ.150 కోట్ల వ్యయాలకు మించి 1,679 కోట్ల ప్రాజెక్టులకు గాను సుమారు 439 ప్రాజెక్టులు.. మొత్తం మీద రూ.4.38 లక్షల కోట్ల అధిక వ్యయ భారంతో నెట్టుకొస్తున్నాయని పేర్కొంది. ‘‘1,679 ప్రాజెక్టుల వాస్తవ వ్యయం రూ.22,29,544 కోట్లు. కానీ, వీటిని పూర్తి చేసేందుకు రూ.26,67,594 కోట్లు అవసరమవుతుంది. అదనంగా రూ.4,38,049 కోట్లు కావాలి. ఇది 19.65 శాతం అధికం’’ అని ప్రణాళిక శాఖ తెలిపింది. 2021 నవంబర్ నాటికి ఈ ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చు రూ.12,88,558 కోట్లు కాగా, మొత్తం అంచనా వ్యయాల్లో 48.30 శాతమని వివరించింది. ‘‘నిర్ణీత కాలవ్యవధికి అనుగుణంగా కాకుండా, ఆలస్యంగా నడుస్తున్న 541 ప్రాజెక్టుల్లో.. 90 ప్రాజెక్టులు 1–12 నెలలపాటు ఆలస్యం కాగా, 113 ప్రాజెక్టులు 13–24 నెలలుగా జాప్యంతో నడుస్తున్నాయి. 212 ప్రాజెక్టులు 25–60 నెలలుగా పూర్తికాకుండా ఉన్నాయి. మరో 126 ప్రాజెక్టులు 61 నెలల జాప్యంతో ఉన్నాయి’’ అని ప్రణాళిక శాఖ తెలిపింది. చదవండి:ఏఏఐకు ఎయిర్లైన్స్ బకాయిలు రూ.2,636 కోట్లు -
వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ. 19,675 కోట్లు ఖర్చు
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ల కొనుగోలుకు ఈనెల 20వ తేదీ దాకా రూ. 19,675 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేశామని సామాజిక కార్యకర్త అమిత్ గుప్తా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సమాధానమిచ్చింది. 2021–22 కేంద్ర బడ్జెట్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 35,000 కోట్లను కేటాయించింది. ఈ ఏడాది జనవరి 16న మనదేశంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. కోవిన్ పోర్టల్ ప్రకారం దేశంలో ఇప్పటిదాకా 140 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. మే 1 నుంచి డిసెంబరు 20వ తేదీ దాకా 117.56 కోట్ల డోసులను ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో (సీవీసీ) ప్రజలకు ఉచితంగా అందజేశామని, 4.18 కోట్ల డోసులను మాత్రం ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రజలు తీసుకున్నారని ఆరోగ్య శాఖ వివరించింది. జూన్ 21న మార్చిన నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ తయారీ సంస్థలు తమ నెలవారీ ఉత్పత్తి సామర్థ్యంలో 25 శాతం టీకాలను ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా అమ్ముకోవచ్చు. 60 శాతం మందికి డబుల్ డోస్ దేశంలో అర్హులైన వారిలో (18 ఏళ్లకు పైబడిన వారిలో) 60 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం వెల్లడించారు. 89 శాతం మంది కనీసం ఒక డోసు తీసుకున్నారని తెలిపారు. కాగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య గురువారం 300 దాటింది. -
ప్రజావైద్యంపై రూ. 1,698
సాక్షి, హైదరాబాద్: ప్రజావైద్యంపై తెలంగాణ సర్కారు భారీగా ఖర్చు చేస్తోంది. ఒక్కో వ్యక్తిపై ఖర్చులో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో వ్యక్తిపై చేస్తున్న తలసరి ఖర్చు రూ. 1,698గా ఉందని పేర్కొంది. హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం అత్యధికంగా రూ. 3,177 ఖర్చు చేస్తూ తొలి స్థానంలో నిలవగా రెండో స్థానంలో నిలిచిన కేరళ ప్రభుత్వం రూ. 2,272 ఖర్చు చేస్తోంది. యూపీ, జార్ఖండ్ అతితక్కువగా రూ. 801 చొప్పున మాత్రమే ఖర్చు చేస్తూ చివరి స్థానంలో నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు కంటే వ్యక్తిగతంగా ప్రజలు వైద్యంపై చేస్తున్న ఖర్చు అధికంగా ఉంది. తమ జేబు నుంచి వైద్యం ప్రజలు చేస్తున్న తలసరి ఖర్చు రూ. 2,120గా ఉంది. ఈ విషయంలో తెలంగాణ తొమ్మిదో స్థానంలో ఉంది. అంటే ప్రభుత్వం, ప్రజలు కలిపి ఆరోగ్యం కోసం ఉమ్మడిగా తలసరి రూ. 3,818 ఖర్చు చేస్తున్నారు ప్రజలు సొంతంగా చేస్తున్న తలసరి ఖర్చు కేరళలో అత్యధికంగా రూ. 6,363 ఉండటం విశేషం. ప్రభుత్వం చేస్తున్న తలసరి ఖర్చుకన్నా రెండింతలకుపైగా కేరళ ప్రజలు తలసరి ఖర్చు చేస్తున్నారని నివేదిక తెలిపింది. అత్యంత తక్కువగా తమ జేబు నుంచి వైద్యం కోసం తలసరి ఖర్చు చేస్తున్నది బిహార్వాసులు. ఆ రాష్ట్రంలో ఒక్కొక్కరు రూ. 808 ఖర్చు చేస్తున్నారు. -
ఐదు అసెంబ్లీల ఎన్నికల ప్రచారానికి రూ.252 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ప్రచారం కోసం రూ.252 కోట్లు ఖర్చు చేసినట్లు బీజేపీ వెల్లడించింది. ఇందులో 60% మేర బెంగాల్లోనే ఖర్చు చేసినట్లు తెలిపింది. అస్సాం, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార ఖర్చు వివరాలను బీజేపీ తాజాగా ఎన్నికల సంఘానికి సమర్పించింది. మొత్తం ఖర్చు రూ.252 కోట్లకుగాను అత్యధికంగా రూ.151 కోట్లను బెంగాల్లో ఖర్చు పెట్టింది. అస్సాంలో రూ.43.81 కోట్లు, పుదుచ్చేరిలో రూ.4.79 కోట్లు, తమిళనాడులో రూ.22.97 కోట్లు వ్యయం చేసింది. తమిళనాడులో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసిన బీజేపీకి 2.6% ఓట్లు మాత్రమే పడ్డాయి. కేరళలో రూ.29.24 కోట్లు ఖర్చు చేసింది. ఈ వివరాలను ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో ఉంచింది. బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రూ.154.28 కోట్లు వెచ్చించినట్లు ఎన్నికల సంఘానికి తెలిపింది. -
అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు సెలవులు.. సగం జీతం
భోపాల్: కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతాలకుతలమైన సంగతి తెలిసిందే. వేవ్ మీద వేవ్ ముంచుకొస్తూ.. జనాలను, ఆర్థిక వ్యవస్థను కుదుటపడనీయడం లేదు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఖర్చులు తగ్గించే చర్యలకు పూనుకున్నాయి. దుబారా ఎక్కడవుతుందో గమనిస్తూ.. కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిలో భాగంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. విద్య, వైద్యం, రెవెన్యూ, పోలీస్ విభాగాలు మినహా.. మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఐదేళ్ల పాటు సెలవులు ఇస్తూ.. సగం జీతం ఇవ్వడానికి నిర్ణయించారు అదికారులు. ఖర్చు తగ్గించుకునే పనిలో భాగంగా ఈ వినూత్న పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు మధ్యప్రదేశ్ అధికారులు. ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులకు పెయిడ్ హాలిడేస్ ఇవ్వబోతున్నారు. ఉద్యోగం చేయకపోయినా సగం జీతం తీసుకునే పథకం ఇది. మూడేళ్లనుంచి ఐదేళ్ల వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఇలా విధులకు హాజరు కాకుండా సగం జీతం తీసుకోవచ్చని చెబుతున్నారు. మిగతా సగం జీతాన్ని ప్రభుత్వం తన ఖాతాలో మిగుల్చుకుంటుంది. దీని వల్ల ఏటా 6వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ పథకానికి ఆర్థిక శాఖ అధికారులు కసరత్తులు పూర్తి చేశారు. ఇక ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే అమలులోకి వస్తుంది. మధ్యప్రదేశ్లో అమలు చేయాలనుకుంటున్న ఈ పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విదేశాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇలాంటి వెసులుబాటున్నప్పటికి.. మన దేశంలో మాత్రం పనిలేకుండా సగం జీతం ఇవ్వడం అనేది ఇదే తొలిసారి అంటున్నారు. కరోనా వల్ల మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయంది. 2.53లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. 30శాతం ఆదాయంలో కోతపడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని గట్టెక్కించడం ఎలాగా అని తలలు పట్టుకున్నారు అధికారులు. ఓవైపు నిరర్థక ఆస్తులను అమ్మే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇలా ఇప్పటికే 500కోట్ల రూపాయలు సమీకరించారు. -
ఆమె మెజిస్ట్రేట్, అతనో ఆర్మీ మేజర్.. వీరి పెళ్లి ఖర్చు కేవలం రూ.500
ముంబై: ఈ రోజుల్లో పెళ్లంటే అంగరంగ వైభవంగా ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా ప్రజలు జరుపుకుంటున్నారు. ఇక ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగుల విషయానికొస్తే ఓ రేంజ్లో వాళ్ల వివాహ వేడుకలు ఉంటాయన్న సంగతి తెలిసందే. ఈ క్రమంలో కొన్ని పెళ్లి వేడుకలు మీడియాను సైతం ఆకర్షిస్తుంటాయి. కానీ అందుకు భిన్నంగా అసలు హంగామా లేకుండానే నిరాడంబరంగా ఇద్దరు ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ పెళ్లికి ఖర్చు కేవలం రూ.500 వివాహానికి విపరీతంగా ఖర్చులు పెడుతున్న సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ ధార్ జిల్లాలో.. ఓ ఆర్మీ మేజర్ , సిటీ మెజిస్ట్రేట్లు చాలా సింపుల్గా వాళ్ల పెళ్లి తతంగాన్ని ముగించేశారు. ఇరుకుటుంబాల సమక్షంలో వీరివురు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎంత సింపుల్గా అంటే కేవలం దండలు, స్విట్లు కోసం రూ.500 ఖర్చు చేశారంతే. వధువు శివంగి జోషి ధార్ నగర మెజిస్ట్రేట్ కాగా, వరుడు అంకిత్ చతుర్వేది భారత సైన్యంలో మేజర్గా లడఖ్లో పని చేస్తున్నారు. వీరిద్దరూ భోపాల్కు చెందినవారు. కాగా వీరివురి వివాహం రెండు సంవత్సరాల క్రితం నిశ్చయమైంది. అయితే మేజర్ అంకిత్ చతుర్వేది లడఖ్ లో పని చేస్తుండగా, శివంగి ధార్ జిల్లాలో సిటి మెజిస్ట్రేట్గా కరోనా అడ్డుకట్టకు నిరంతరంగా విధులు నిర్వర్తిస్తున్న కారణంగా వీరి వివాహ తేది వాయిదా పడుతూ చివరకు ఇలా చేసుకున్నారు. వివాహం అనంతరం శివంగి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా ఇంకా పూర్తిగా అంతమవలేదని, ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించాలని అన్నారు. "వివాహానికి విపరీతంగా ఖర్చు చేయడం మాకు నచ్చలేదని, అందుకే మేమే ఇలా చేసుకున్నట్లు" ఆమె తెలిపారు. -
ఆరోగ్య రంగంపై వ్యయాలు పెరగాలి
న్యూఢిల్లీ: ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయాలు పెరగాల్సిన అవసరం ఉందని 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ బుధవారం స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ విలువ కేవలం 0.95 శాతం ఉందని పేర్కొన్న ఆయన, 2024నాటికి ఇది 2.5 శాతానికి చేరాలని సూచించారు. దురదృష్టవశాత్తూ, ఆరోగ్య రంగానికి సంబంధించి దేశంలో మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆసియా హెల్త్ 2020 అనే అంశంపై పారిశ్రామిక వేదిక సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సింగ్ మాట్లాడారు. ఆరోగ్య రంగంలో సవాళ్లను ఏ ఒక్కరో ఎదుర్కొనలేరనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ... ఈ రంగంపై కేటాయింపులను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వాల నుంచి చర్యలు ఉంటాయని తాను విశ్వసిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఎంబీబీఎస్ కోర్సు పరిధి పెంచడం వంటి రెగ్యులేటరీ మార్పులను కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం... ఆరోగ్య సేవల రంగంలో ప్రైవేటు రంగం భాగస్వామ్యం కూడా కీలకమని సింగ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వినూత్న నైపుణ్యలతో ప్రైవేటు రంగం చక్కటి సేవలను అందించగలుగుతుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో మంచి ఫలితాలను సాధించవచ్చని అన్నారు. కోవిడ్–19ను ఎదుర్కొనడంలో ఫ్రంట్లైన్ హెల్త్ వర్కర్స్ కీలకపాత్ర పోషించారని పేర్కొన్న సింగ్, ఆరోగ్య సేవల విషయంలో మరింత గుర్తింపు లభించడానికి వారు అర్హులని అన్నారు. ‘ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్’ ప్రస్తావన ‘‘ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్ ఏర్పాటవుతుందని 1951 సివిల్ సర్వీసెస్ యాక్ట్ పేర్కొంది. ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే, అప్పటి నుంచీ ఈ తరహా సర్వీస్ ఏదీ ఏర్పాటు కాలేదు’’ అని సందర్భంగా పేర్కొన్న సింగ్, అంతర్జాతీయ ప్రమాణాలు, ఇప్పటికే చోటుచేసుకున్న పరిణా మాలు, ఉదాహరణల ప్రాతిపదికన ఈ సర్వీసు ఏర్పాటుకావాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆరోగ్యం రంగం పలు సమస్యలు, సవాళ్ల వలయంలో చిక్కుకుందనీ వ్యాఖ్యానించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తరహాలో ఇండియన్ మెడికల్ సర్వీస్ (ఐఎంఎస్)ను ఏర్పాటు చేయాలని ఇండియన్ మెడికన్ అసోసియేషన్ (ఐఎంఏ) గత కొంత కాలంలో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2021–22 నుంచి 2025–26 మధ్య దేశ ఆర్థిక రంగంలో తీసుకోవాల్సిన చర్యలపై సింగ్ నేతృత్వంలోని 15వ ఫైనాన్స్ కమిషన్ ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీలకు తన సిఫారసులను సమర్పించిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత నివేదికాంశాలు వెల్లడవుతాయి. -
పార్టీల ఎన్నికల ఖర్చుపైనా పరిమితి?
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పెట్టే ఖర్చులపై అభ్యర్థుల మాదిరిగానే పార్టీలకు పరిమితులు ఉండాలని నిపుణుల బృందం ఒకటి ఎన్నికల కమిషన్కు సూచించింది. ఎన్నికలను మరింత సమర్థంగా నిర్వహించే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ గత ఏడాది పలు వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ‘‘ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం పెట్టే ఖర్చుపై ఎలాంటి పరిమితి లేదు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలంటే ఈ ఖర్చులపై పరిమితి అవసరమెంతైనా ఉంది’’అని ఒక వర్కింగ్ గ్రూపు సూచించింది. రాజకీయ పార్టీలు గరిష్టంగా పెట్టగల ఖర్చులను అభ్యర్థుల పరిమితికి కొని రెట్లు ఎక్కువగా విధించాలని ఎన్నికల కమిషన్ 2015లో కేంద్ర న్యాయశాఖకు సూచించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. అయితే ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికల ఖర్చులపై పారదర్శకత కోసం పలు స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: కమల్ సర్కార్లో సింధియా చిచ్చు) -
విద్యార్థులు తక్కువ.. ఖర్చు ఎక్కువ!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు తక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభు త్వం ఏటా ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తుండగా, ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై తక్కువ మొత్తంలో ఖర్చు చేస్తోంది. నోబెల్ అవార్డు గ్రహీత, ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ ఏర్పాటు చేసిన అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్(జే–పాల్)కు చెందిన విద్యా విభాగం పాఠశాల విద్యపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుల లెక్కలు తేల్చింది. కాలిఫోర్నియా వర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రొఫెసర్ మురళీధరన్ కో–చైర్గా వ్యవహరించే ఈ విభాగం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, నాణ్యమైన విద్యను అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఐదేళ్లపాటు పనిచేసేందుకు ఇటీవల పాఠశాల విద్యాశాఖతో ఒప్పందం చేసుకుంది. ఇందు లో భాగంగా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు, వారి వేతనాలు, విద్యా పథకాల నిధులు తదితర వివరాలను క్రోడీకరించింది. వాటిని విశ్లేషించి పాఠశాల విద్యాశాఖకు లెక్కలు అందజేసింది. 9,505 స్కూళ్లలో 30 మందిలోపే.. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క విద్యార్థీ, ఒక్క టీచర్ కూడా లేని పాఠశాలలను మినహాయించగా, విద్యార్థులు, టీచర్లు గల పాఠశాలలు 24,550 ఉన్నట్లు తేల్చింది. అందులో 30 మందిలోపు విద్యార్థులు గల పాఠశాలలు 9,505 ఉన్నట్లుగా పేర్కొంది. వాటిల్లో ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.63,637 వెచ్చిస్తోందని లెక్కలు తేల్చింది. అదే ఎక్కువమంది విద్యార్థులు ఉన్న స్కూళ్లలో ఖర్చు గణనీయంగా తగ్గుతోందని పేర్కొంది. 30 నుంచి 100 మంది వరకు విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ.39,814 ఖర్చు చేస్తుండగా, 100 నుంచి 200 మందిలోపు విద్యార్థులున్న స్కూళ్లలో ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.30,234 ఖర్చవుతోందని తెలిపింది. 200 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లలో ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.22,715 ఖర్చు అవుతోందని వెల్లడించింది. అంటే 200కు పైగా విద్యార్థులున్న పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై అయ్యే ఖర్చు కంటే 30 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లలో ఒక్కో విద్యార్థిపై 3 రెట్లు అదనంగా వెచ్చించాల్సి వస్తోందని తేలింది. హేతుబద్ధీకరణ కోసమేనా.. విద్యార్థుల్లేని స్కూళ్లను, విద్యార్థులు తక్కువగా ఉన్న స్కూళ్లను సమీప పాఠ శాలల్లో విలీనం చేసేందుకు ఇదివరకే విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. టీచర్ల సేవలను సద్వినియోగం చేసుకునేందుకు హేతుబద్ధీకరణ తప్పదని నిర్ణ యానికి వచ్చింది. స్కూళ్లను విలీనం చేసి ఆయా ఆవాస ప్రాంతాల విద్యార్థుల కు రవాణాæ సదుపాయం కల్పించడం వంటి ఆలోచన చేసింది. దీనిపై టీచర్ల సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో ముందుకు వెళ్లలేదు. మరోవైపు ఆవాస ప్రాంతానికి కిలోమీటరు దూరంలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ. దూరంలో ప్రాథమికోన్నత పాఠశాల, 5కి.మీ. పరిధిలో ఉన్నతపాఠశాల ఉండాలని విద్యా హక్కు చట్టం చెబుతోంది. అన్నింటికి 5 కి.మీ. దూరాన్ని పరిగణనలోకి తీసుకు నేలా విద్యాహక్కు చట్టంలో మార్పుల కు అవకాశాలపై కమిటీ వేసింది. దీనిపై నా వ్యతిరేకత రావడంతో ఆగిపోయింది. తాజా గా జే–పాల్ తేల్చిన లెక్కలు హేతుబద్ధీకరణ అవసరమన్న వాదనకే బలం చేకూర్చుతున్నాయి. లెక్కల్లోని మరికొన్ని అంశాలు.. ►30 మందిలోపు విద్యార్థులున్న స్కూళ్లలో 17,808 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ►ఇద్దరికంటే ఎక్కువమంది టీచర్లున్న స్కూళ్లలో 3,750 ఉన్నట్లుగా పేర్కొంది. ►రాష్ట్రంలోని సర్కార్ స్కూళ్లలో 1,37,471 మంది టీచర్లు ఉండగా, వారికి ఏటా వేతనాల రూపంలో రూ.7956,44,31,195 వెచ్చించాల్సి వస్తోందని పేర్కొంది. ►సగటున ఒక్కో టీచర్కు ఏటా 5,78,772 వేతన రూపంలో చెల్లిస్తున్నట్లు తేల్చింది. ►ఇక రాష్ట్రంలో ఒక్క విద్యార్థీ లేని స్కూళ్లు 916 ఉంటే వాటిల్లో 748 మంది టీచ ర్లున్నారు. (పై లెక్కలకు ఇవి అదనం) -
రోజూవారీ ప్రచార వ్యయం కుదింపు
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో మితిమీరిన నగదు ప్రవాహాన్ని అడ్డుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు దిగింది. ప్రచారం నిమిత్తం అభ్యర్థి రోజుకు జరిపే నగదు లావాదేవీలను రూ.20 వేల నుంచి రూ.10 వేలకు తగ్గించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) నుంచి అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. రూ.10 వేల పరిమితి దాటి కూడా ఖర్చు చేయాల్సి వస్తే, ఆ లావాదేవీలను అభ్యర్థి ఖాతా నుంచి చెక్కులు, డ్రాఫ్టులు, నెఫ్ట్/ఆర్టీజీఎస్ రూపంలో నిర్వహించాలని ఈసీ సూచించింది. నవంబర్ 12నే అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధన ఛత్తీస్గఢ్, మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఎన్నికలపై ప్రభావం చూపనుంది. ప్రచార సమయంలో అభ్యర్థి ఎవరైనా వ్యక్తి, సంస్థ నుంచి నగదు రూపంలో రూ.10 వేలకు మించి విరాళాలు, రుణాలు స్వీకరించరాదు. -
లెక్క తప్పొద్దు...
సాక్షి, అచ్చంపేట / జడ్చర్ల టౌన్ : ఎన్నికలంటేనే మరి బోలెడంత ఖర్చు. అయితే ఈ ఖర్చు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను పరిమితి దాటొద్దు అంటోది ఎన్నికల కమిషన్. వెచ్చించే ప్రతీ పైసాకు లెక్క చెప్పాల్సిందేనని స్పష్టం చేస్తోంది. నంటోంది. ఖర్చు చేసే మొత్తాన్ని కూడానిర్ధేశించింది. అంతేకాదు అభ్యర్థి దేనికెంత వెచ్చించాలో కూడా హద్దులు గీసింది. హద్దు దాటితే చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. జాయింట్ అకౌంట్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి తన ఎన్నికల ఏజెంట్ పేరు కలిపి బ్యాంకులో జాయింట్ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. అభ్యర్థి సొంత డబ్బు అయినా, పార్టీ లేదా ఇతర దాతలు ఇచ్చిన డబ్బులు అయినా సరే అందులోనే జమచేసి రోజువారీగా విత్డ్రా చేసి ఖర్చు పెట్టాలి. ఈ ఖర్చు కూడా రూ.28లక్షలకు మించికూడదు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే సమయంలో అధికారులు ప్రతీ అభ్యర్థికి ఒక పుస్తకాన్ని అందజేస్తారు. అందులో ఒక పేజీలో నగదు వివరాలు, రెండో పేజీలో బ్యాంకు ఖాతాలోని నిల్వ, మూడో పేజీలో ఖర్చుల వివరాలు రాయాలి. అభ్యర్థి లేదా వారు నియమించుకున్న ఏజెంట్ ఏరోజుకారోజు ఆ వివరాలను పుస్తకంలో నమోదు చేయాల్సి ఉంటుంది. అంతా ఖాతా ద్వారానే... అభ్యర్థి ఎన్నికల ఖర్చుల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉంటుంది. అంతకు ముందే ఉన్న ఖాతాలను పరిగణనలోకి తీసుకోరు. ఇక కొత్తగా తెరిచిన ఖాతా నుంచే ఎన్నికల ప్రచారం కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ప్రతీ అభ్యర్థి పోలింగ్ ముగిసే లోపు మూడు సార్లు వివరాలను బిల్లులతో సహా సమర్పించాలి. నామినేషన్ల ప్రక్రియ నాటి నుంచి అభ్యర్థి ఖర్చు పెట్టే ప్రతీ పైసాను ఎన్నికల కమిషన్ లెక్కించనున్నారు. కాగా, అభ్యర్థులు తమ విజయం కోసం చేసే ఖర్చుల పద్దు కూడా పెద్దగా ఉండే అవకాశం ఉంది. అయితే గరిష్టంగా ఒక్కో అభ్యర్థి ఎంత ఖర్చు చేయాలి అన్న మొత్తాన్ని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రతీ అభ్యర్థి రూ.28లక్షలకు మించి ఖర్చు చేయొద్దని అదేశించింది. వాహనాలు, భోజనాలు, పార్టీ జెండాలు తదితర వస్తువులకు లెక్కలు రూపొందించింది. నామినేషన్ల ప్రక్రియ నాటి నుంచి అభ్యర్థి ఖర్చు పెట్టే ప్రతీ పైసా లెక్కించనున్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ధరలు - లౌడ్ స్పీకర్, ఆంప్లిఫ్లయర్, మైక్రోఫోన్ రూ.800 (రోజుకు) - బహిరంగ సభ వేదిక రూ.2,500 - ప్లాస్టిక్ కటౌట్ రూ.5వేలు, వాల్పోస్టర్ రూ.10, ప్లాస్టిక్ జెండా రూ.8, కొత్త జెండా రూ.12 - హోర్డింగ్ ఏర్పాటుకు రూ.15వేలు, మున్సిపాలిటీ అనుమతికి రూ.500 - చెక్కతో తయారు చేసిన కటౌట్ రూ.5వేలు - ఫొటో, వీడియో గ్రాఫర్కు రూ.3వేలు (రోజుకు) - స్వాగత ద్వారం ఏర్పాటుకు రూ.2,500, టెంట్ రూ.400 నుంచి రూ.800 వరకు (సైజ్ ఆధారంగా) - కార్పెట్ రూ.250, సైడ్వాల్కు రూ.80 - భోజనం చేసే విస్తర్లు(ప్లేట్లు) రూ.3లు, టీ రూ.6, టిఫిన్ రూ.15 - విశ్రాంతి తీసుకునే ఇంటి అద్దె రూ.2వేలు - టోపీ రూ.50, కండువా రూ.10లు, ఎన్నికల గుర్తుతో ఉన్న టీషర్టు రూ.150 - డ్రైవర్లకు రూ.800 (రోజుకు) - టెంపో రూ.1,600, ట్రాక్టర్ రూ.2,500, కారు 3వేలు, సుమో, క్వాలిస్ రూ.3,500, ఆటో రూ.1000, రిక్షా, మోటార్ సైకిళ్లకు రూ.500 మూడు సార్లు లెక్క చెప్పాలి.. ప్రతీ అభ్యర్థి పోలింగ్ ముగిసే లోపు మూడు సార్లు ఖర్చుల వివరాలను బిల్లులతో సహా ఎన్నికల అధికారి కార్యాలయంలోని అకౌంట్స్ విభాగంలో సమర్పించాలి. ఈ లెక్కల అధారంగా ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు.. ఇంకా ఎంత ఖర్చు చేయవచ్చన్నది వారు సూచిస్తారు. అభ్యర్థి చూపని ఖర్చు ఏదైనా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకొస్తే ఆ వివరాలను ఖాతాలో కలుపుతారు. నిర్ణీత సమయాల్లో ఖర్చులకు సంబంధించిన లెక్కలు చూపనట్లయితే అభ్యర్థులకు ఇచ్చిన వాహనాల అనుమతి, ప్రదర్శనలు, సభలు రద్దు చేసే అధికారం ఎన్నికల కమిషన్కు ఉంటుంది. మాధ్యమాల ఖర్చు సైతం.. పత్రికలు, టీవీ చానళ్లులో ఇచ్చే ప్రకటనలు, చెల్లింపు వార్తాల ఖర్చులను కూడా అభ్యర్థుల ఖర్చు ఖాతాలోనే జమ చేస్తారు. ఈ ఖర్చులను పరిశీలించేందుకు ప్రత్యేక మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటైంది. -
ఎన్నికల లెక్కలు ఇలా...
వనపర్తి : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం కోసం వినియోగించే. వస్తువులు, వాహనాల ధరలను ఇటీవల అధికారులు ఖరారు చేశారు. గతంలో కంటే.. ఈ ధరలు పెరిగినట్లు రాజకీయ నాయకులు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు వాహనాలు, పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, వాహనాలు, హోర్డింగ్లు, మైక్ సెట్లు, స్పీకర్లు, మౌత్పీస్ తదతర వస్తువులతో పాటు నాలుగు, మూడు, రెండు చక్రాలను ఉపయోగిస్తారు. ఈ మేరకు ఏది ఉపయోగిస్తే ఎంత ధర నిర్ణయిస్తారనే విషయాన్ని పలు వ్యాపార సంస్థల కొటేషన్లు స్వీకరించిన అధికారులు తుది ధరలు ఖరారు చేశారు. ఈ ధరల పట్టిక ప్రకారం.. అభ్యర్థుల లెక్కలు పరిశీలించే నోడల్ అధికారి, కమిటీ సభ్యులు వారి ఎన్నికల ఖర్చు నమోదు చేస్తారు. గతంతో పోలిస్తే ఎక్కువే.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఒక్కో అభ్యర్థి పోలింగ్ పూర్తయ్యే నాటికి రూ. 28 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయరాదు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిర్ణయించిన ధరల కంటే ప్రస్తుతం నిర్ణయించిన ధరలు ఎక్కువేనని తెలుస్తోంది. కాగా కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన మరునాటి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు, నాయకులు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇతర బీఎల్ఎఫ్, స్వతంత్య్ర అభ్యర్థులు కొన్ని రోజులుగా ప్రచారం చేస్తుండగా.. మహాకూటమి నుంచి టికెట్లు ఖరారు అనుకున్న వారు మాత్రం గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఎక్కడ సభ, సమావేశాలు నిర్వహించినా లెక్కలోకే... అభ్యర్థులు సభలు, సమావేశాలు ఎక్కడ నిర్వహించినా అక్కడ ఏర్పాట్ల ఖర్చు మొత్తం సదరు అభ్యర్థి పద్దులోకే వస్తుంది. ఇక్కడ ఉపయోగించిన వస్తువులు, స్పీకర్లు, కుర్చీలు, టేబుళ్లు, ఫంక్షన్ హాల్, వాహనాలు, భోజనాలు, టీ, టిఫిన్స్తో సహా అన్ని ఖర్చులు నమోదు చేస్తాం. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతిరోజూ అభ్యర్థులు రోజువారీ ఖర్చుల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అన్నింటినీ కలిపి జిల్లా ఎన్నికల అధికారికి అందజేస్తాం. – స్వామి, ఎన్నికల ఖర్చుల విభాగం నోడల్ అధికారి, వనపర్తి మైక్రోఫోన్తో కూడిన లౌడ్స్పీకర్ (ఒక్క రోజుకు) 100 వాట్స్ రూ.700 250 వాట్స్ రూ.1,700 వేదిక ఏర్పాటు కోసం (ఒక్క రోజుకు) 4 ఫీట్లు రూ.120 6 బై 120 రూ.750 36 బై 36 టెంట్ రూ.2,000 18 బై 36 టెంట్ రూ.800 క్లాత్ జెండాలు ప్రతీ ఫీటు రూ.65 ప్లాస్టిక్ జెండాలు ప్రతి కేజీకు రూ.400 హ్యాండ్ బిల్లు పేపర్స్ వెయ్యికి రూ.900 పోస్టర్లు వెయ్యికి రూ.7,600 పది వేలకు రూ.3,900 యాభై వేలకు రూ.3,200 లక్షకు రూ.3,050 హోర్డింగ్స్ 20 బై 30 రూ.11,500 20 బై 20 రూ.9,800 ఉడెన్ కటౌట్ ప్రతీ స్వే్కర్ ఫీట్కు రూ.95 క్లాత్, ప్లాస్టిక్ కటౌట్లు ప్రతీ స్క్వేర్ ఫీట్కు రూ.70 వీడియో క్యాసెట్లు, సీడీలు ప్రతి నెలా రూ.10వేలు లోకల్ చానల్ (ప్రతి రోజు) రూ.750 ఆడియో క్యాసెట్లు, సీడీలు ఒక్క రికార్డ్కు రూ.5,500 ఆటోలో ఆడియో ప్రచారం (ఒక్క రోజుకు) రూ.2,400 ఆర్చీలు వంద స్వే్కర్ ఫీట్లు రూ.95 వాహనాలు జీపు, టెంపో, ట్రక్కర్ (డీజిల్ లేకుండా ఒక్కరోజుకు) రూ.1,600 సుమో, క్వాలిస్, ఇన్నోవా (డీజిల్ లేకుండా ఒక్క రోజుకు) రూ.2,000 కార్లు (డీజిల్ లేకుండా ఒక్క రోజుకు) రూ.1,500 మూడుచక్రాల వాహనాలు (ఒక్కటి) రూ.1.200 సైకిల్, రిక్షాలు రూ.600 హోటల్ రూంలు, గెస్ట్ హౌస్లు డీలక్స్ ఏసీ గది (ఒక్క రోజుకు) రూ.1,350 నార్మల్ నాన్ ఏసీ గది (ఒక్క రోజుకు) రూ.800 ఫర్నీచర్ (ఒక్క రోజుకు) ప్లాస్టిక్ చైర్ రూ.7 వీఐపీ చైర్ రూ.60 సోఫా రూ.500 టేబుల్ రూ.90 -
ఎస్ఎంఈలపై అమెరికన్ ఎక్స్ప్రెస్ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉద్యోగుల వ్యయ నియంత్రణ, నిర్వహణ సేవలందిస్తున్న అమెరికన్ ఎక్స్ప్రెస్ దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎస్ఎంఈ)లపై దృష్టిసారించింది. ఉద్యోగుల వేతనాలు, ప్రయోజనాల తర్వాత నియంత్రించగలిగేవి వినోద, ప్రయాణ వ్యయాలేనని అమెరికన్ ఎక్స్ప్రెస్ గ్లోబల్ కమర్షియల్ సర్వీసెస్ విభాగం వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ శారు కౌశల్ తెలిపారు. బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కార్పొరేట్ కార్డ్ ప్రోగ్రామ్ ద్వారా కంపెనీల వ్యయ భారం తగ్గుతుందని, సుమారు 10 శాతం వరకు వ్యయం ఆదా అవుతుందని తెలిపారు. ఫార్చూన్ 500 కంపెనీల్లో 60 శాతం కంటే ఎక్కువ కంపెనీలకు మా కస్టమర్లుగా ఉన్నాయని.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 33 లక్షల వ్యాపార సంస్థల తమ సేవలు వినియోగించుకుంటున్నాయని పేర్కొన్నారు. మన దేశంలో రూ.75 కోట్ల నుంచి రూ.600 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న ఎస్ఎంఈ కంపెనీలు తమ సేవలు వినియోగించుకుంటూ ఆయా కంపెనీల్లోని ఉద్యోగుల వినోద, ప్రయాణ ఖర్చులను తగ్గించుకుంటున్నాయని తెలిపారు. సుమారు దేశంలో 13 వేల కంపెనీలు మా కస్టమర్లుగా ఉన్నారని.. ఎంఎంఈ విభాగం వృద్ధి చెందుతుందని తెలిపారు. నగరంలో అంతర్జాతీయ ఐటీ, ఫార్మా, హెల్త్కేర్ కంపెనీలతో పాటూ స్టార్టప్స్, ఎస్ఎంఈలూ ఉన్నాయి. వీటన్నింటికీ మా వాణిజ్య చెల్లింపుల వ్యాపారం బాగా సెట్ అవుతాయి. అందుకే నగరంపై ఫోకస్ చేశామని పేర్కొన్నారు. -
అందరిదీ ఒకే మతం
‘యద్దృశ్యతే శ్రూయతే చ’ దేన్ని ఇష్టంగా మనసుకి పట్టించుకుని చూస్తామో, దేన్ని చెవులారా విని బుద్ధికి ఎక్కించుకుంటామో వాటి ప్రభావం మనమీద తప్పక ఉంటుందనేది నూటికి నూరుపాళ్లు నిజమైన అంశం. శరీరానికి అనారోగ్యకరమైన తిళ్లని తినిపిస్తే ఎలా శరీరం రోగమయమౌతుందో.. వైద్యుని అవసరం కలుగుతుందో, దానివల్ల ఇటు శారీరక బాధ అటు ధనవ్యాయం, అంతేకాక మనకి బంధుమిత్రులు సేవచేయడంలో అలసటా.. కలుగుతాయో, అదే తీరుగా బుద్ధికి కూడా సరికాని కథలనీ సంఘటనలనీ గట్టిగా హత్తుకునేలా అందిస్తే మానసికంగా వ్యక్తి పూర్తిగా రోగిగా మారిపోతాడు. అందుకే పెద్దలు ‘సరైన వాటినే చూపించు–సరైన వాటినే తినిపించు’ అనేవాళ్లు. అలా శరీరానికీ బుద్ధికీ మనసుకీ ఆరోగ్యకరమైన సాయి చరిత్రలో ప్రయాణిస్తూ సాయి దృక్పథాన్ని ఒంటికి పట్టించుకుంటూ వెళ్తున్నాం. ఆ నేపథ్యంలో మరో మతమంటూ లేదనీ అందరిమతం ఒక్కటేననీ నిరూపించే సాయికథని జరిగినదాన్ని జరిగినట్లుగా అనుకుందాం! కృతజ్ఞత ‘కృత = తనకి చేయబడిన సహాయాన్ని, జ్ఞ–త=గుర్తుంచుకోవడం’ అని ఈ మాటకి అర్థం. ‘గోపాలరావు గుండ్’ అనే పేరున్న ఒక ధార్మికుడుండేవాడు. చేస్తున్నది పోలీసుశాఖలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా అయినప్పటికీ, రోజూ నేరగాళ్ల మధ్యే ఉండవలసిన ఉద్యోగమైనప్పటికీ, పూర్తిగా వ్యతిరేకబుద్ధితో నేరం దిశగానే ఆలోచిస్తూ ఎవరొచ్చినా దొంగ– ఘాతుకుడు(హత్య చేసినవాడు).. అని ఈ తీరు మనస్తత్వమే కలిగినవాడుగా ఉండవలసిన వాడే అయినప్పటికీ ధర్మబుద్ధితోనే ఉద్యోగాన్ని చేస్తుండేవాడు. అందుకే ఆయన్ని ధార్మికుడు అనవలసివచ్చింది. తననెప్పుడూ ఏ ఒత్తిడీ ఉద్యోగపరిస్థితీ తోవ తప్పనీయకుండా చేయాలనే దృఢ సంకల్పంతో దైవానికి నిజమైన సమర్పణ బుద్ధితో (ఏదో ఇచ్చుకోవాలనే బుద్ధి అనేది సమర్పణమనే మాటకి అర్థం కాదు. దైవానికి దాసుడైన వాడినని తనని తాను సమర్పించుకున్న బుద్ధి కలవాడనేది అర్థం) ఉంటూ కాలాన్ని గడుపుతుండేవాడు. వివాహమై ఎక్కువకాలమైనా సంతానం కలగలేదు. ఆ భార్య ఒత్తిడితో ప్రోత్సాహంతో మరో ఆమెని చేరదీయడం కాదు. వివాహమే చేసుకున్నాడు. అందుకే అతణ్ణి ధార్మికుడన్నాం. అయినా సంతానం కలగలేదు. ఈ ఉన్న ఇద్దరి భార్యల ప్రోత్సాహం ఒత్తిడితో మూడవవివాహాన్ని కూడా చేసుకున్నాడు. లోపల ఒక భయం. ఇలా ఎన్ని వివాహాలని చేసుకోవాలి? అని. ఈ సారి ఏమైనా మరి వివాహమనేమాటని ఎంతటి ఒత్తిడి వచ్చినా అంగీకరించననుకుని కాలాన్ని గడుపుతూ ఉంటే ఎవరో తన అదృష్టానికి సాయి గురించిన విశేషాలని వివరించారు. తన భార్యలు ముగ్గురితో కలిసి సర్వసమర్పణ æభావంతో ఆయనని చూడలేదు. దర్శించుకున్నాడు హృదయంతో.. హృదయంలో ఉన్న ఆర్తితో..! ఆయన కన్నుల్లో కన్నుల్ని పెట్టి మనసుతో ఆయన మనసుకి విన్పడేలా మౌనంగా చెప్పుకున్నాడు తన ఆవేదనని. వేదన అంటే ఎవరో వినేవాడున్నప్పుడు చెప్పుకోగల బాధ అని అర్థం. ఆవేదన అంటే దైవం తప్ప మరెవరికీ విన్పించుకోగల బాధ అని అర్థం. ఆవేదన అంటే దైవం తప్ప మరెవరికీ విన్పించుకోలేక ఒకవేళ విన్నా మనస్థాయి దుఃఖంతో సమానమైన దుఃఖాన్ని అనుభవిస్తూ అర్థం చేసుకోలేని బాధ అని అర్థం. అలాంటి ఆవేదనని అర్థం చేసుకోగలవాడు సాయి మాత్రమే అని నిశ్చయించుకుని ఆవేదనని చెప్పుకున్నాడు గోపాలరావు గుండ్. సరైన కాలంలో విత్తనాన్ని నాటితే చక్కని అంకురం వచ్చి మొక్కై మానుగా ఎదుగుతుందన్నట్లు సాయికి తన ఆవేదనని చెప్పుకున్న కొంతకాలంలోనే ఆయనకి సంతానం కలిగింది. సంతానం కల్గించిన సాయిపట్ల తన ‘కృత–జ్ఞ–త’ తనకి మేలు కల్గించిన సాయికి తన మానసికానందాన్ని హృదయపూర్వకంగా చెప్పుకోవాలని ప్రత్యక్షంగా తనకి తానుగా ఆయనకి కన్పించి చెప్పుకునేలా వెళ్లాలని బయల్దేరి సాయికి సాష్టాంగపడి తన ‘కృతజ్ఞత’లను నమస్కారపూర్వకంగా తెలియజేసుకున్నాడు.ప్రార్థిస్తే సంతానం కలిగితే అన్ని పనుల్నీ మానుకుని వెళ్లి దర్శించిన గోపాలరావు గుండ్ ద్వారా ఎందరో అర్థం చేసుకోవాలి. ‘మొక్కుకుని, ఆ మొక్కుకున్న కారణంగా తీరవలసిన కోరిక తీరాక, ఇప్పుడు కుదరలేదు, అప్పుడు సాధ్యపడదు, మరొక కొంతకాలం వీలుపడదు’ అంటూ దైవదర్శనాన్ని వాయిదా వేసే వారందరూ ఎంతటి తప్పుని చేస్తున్నారో గమనించుకోగలగాలి. కేవలం ఒక్క కుటుంబపు బాధ్యతని నిర్వహిస్తున్న మనకే వీలుపడలేదని, వీలుపడదనీ మనం అంటుంటే, ఆ దైవం తనకంటూ ఎందరు కుటుంబాల బాధ్యతని చేపట్టి ఉన్నాడో కాబట్టి ఆయన అసలు ఏ మాత్రం తీరుబడి లేనివాడవుతూ మన కోర్కెని పట్టించుకోకుండా ఉన్నా అడిగే అవకాశమే లేదు మనకి. అంతటివాడు మన కోర్కెని తీర్చినా ఆయన్ని దర్శించుకోకపోవడం ఎంత ఘోరం ఎంత నేరం ఎంతటి ద్రోహం? ఎంతటి అకృతజ్ఞత?(కృతజ్ఞతకి వ్యతిరేకం కృతఘ్నత కాదు)అందుకే ధార్మికుడైన గోపాలరావు గుండ్ సాయిని దర్శించి తనకి జరిగిన ఆ ఆనందాన్ని ఒక దర్శనంతో వ్యక్తీకరించుకోవడం కాకుండా, అంతతో ముగించుకోవడం కాకుండా, ఆ ఆనందానికి గుర్తుంగా ప్రతి సంవత్సరం ఒక ఉత్సవం– జాతర– భక్తిపూర్వకంగా జరిపే తిరునాళ్లు జరపాలని దృఢంగా అనుకున్నాడు. బుద్ధింతు సారధిం విద్ధి– మనకి కలిగే ఆలోచనే మన జీవితరథానికి సారథి(నడిపించే వ్యక్తి) అని దీనర్థం. అందుకే తనకి కలిగిన ఈ ఆలోచనని తనకి ఆప్తులైన పాటిల్ ద్వయం(తాత్యా కోత్ పాటిల్, దాదాకోత్ పాటిల్) తోనూ వీరితో సమాన బుద్ధి కలిగిన మాదవరావు అనే ఆయనకీ చెప్పాడు గోపాలరావు గుండ్. ఓ మంచిపనిని చేయబోతే ఆహ్వానం లేకుండానే పదిమంది రావడమనేది సహజం కాబట్టి, నిస్వార్థంగా జరుపబోయే ఉత్సవానికి సంబంధించిన ప్రతిపాదనకి షిర్డీ గ్రామస్థులు కూడా సహకరిస్తామన్నారు. గోపాలరావు గుండ్ ఆనందానికి అవధుల్లేవు. నిరాకరణ – అంగీకారం చేస్తున్నది మంచిపనే కదా! అనే అభిప్రాయంతో ఈ షిర్డీవాసులంతా ఆ ఉత్సవానికి సంబంధించిన అన్ని విధాల సహకారాలని అందించడానికి ముందుకొచ్చారు. అయితే సాంకేతికంగా మాత్రం ఇలాంటి ఉత్సవాలు చేసుకోవాలంటే జిల్లా కలెక్టర్గారి అనుమతి తప్పనిసరి. పైగా ప్రతి సంవత్సరం చేయదలిచిన ఉత్సవం కాబట్టి ప్రతిసారీ ఈ అనుమతి కోసం ఎదురుచూడనక్కరలేకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకున్నారు అందరి తరఫునా గోవిందరావు గుండ్ ప్రభృతులు.వేప చెట్టుకి పాలుపోసినా, తేనెని ఎరువుగా వేసినా, గంధాక్షతలతో పూజ చేసినా, గొడ్డలివేటు వేసినా.. దాని రుచి ఎన్నటికీ తీపికానట్లు, చేదుతనమే తన స్వభావమైనట్లు ఆ గ్రామ కులకర్ణి(కరణం) తనదైన సహజబుద్ధితో ఈ దరఖాస్తుని పంపుతున్నట్లే పంపుతూ.. ఈ ఉత్సవానికి అనుమతినీయడం మంచిది కాదంటూ తన సూచనని రాశాడు. రెవెన్యూ వారు ఈ కులకర్ణి అభిప్రాయాన్ని పరిగణనలోనికి తీసుకు తీరాలి. దానికి కారణం ఆయనే ఆ గ్రామ విశేషాలని అందించాల్సిన అధికారి కాబట్టి. దాంతో అనుమతి నిరాకరింపబడింది.గుర్తుంచుకోవాలి! ఎంత గొప్ప పనిని గోపాలరావు గుండ్ తలపెట్టాడో, దానికి గ్రామస్థులంతా ఎలా ముందుకొచ్చారో, ఒక్క సంవత్సరం ఏదో తూతూ మంత్రంగా కాకుండా ప్రతి సంవత్సరం జరుపదలిచారో, ఇది కూడా గోపాలరావు గుండ్కి చక్కని పరిశోద్ధారకుడు కలిగిన కారణంగా తప్పక కొనసాగుతూ వెళ్తుందో.. ఇన్నింటినీ ఆ గ్రామాధికారిగా ఉండి అన్నీ తెలిసికూడా కులకర్ణి (కరణం) అలా చేసాడంటే గమనించాల్సిన అంశాలు రెండు. ఒకటి : లోకమంతా ఒకవైపున ఉండి మంచి చేయదలిచినా ఇలాంటి చీడపురుగులుంటాయనీ..! రెండు : సాయి అనుగ్రహం కోసం ముందుగా ప్రయత్నించకుండా ఆయనకి మాట మాత్రంగానైనా చెప్పకుండా చేస్తూండడం వల్లే ఇదంతా జరిగిందనీను. భాగవతం చదువుతూ ఉంటే ఎలా కృష్ణుని చరిత్రతోపాటు శిశుపాలుడూ కంసుడూ గురించి కూడా అనుకుంటామో, శ్రీమద్ రామాయణాన్ని చదువుతుంటే ఎలా శూర్పణఖ–సీతని అపహరించవలసిందని చెప్పిన అకంపనుడనే రాక్షసుణ్ణి గురించి కూడా అనుకుంటామో అలా ఈ కులకర్ణి(కరణం) చరిత్రలో ఒక దుష్టునిగా శాశ్వతంగా నిలిచిపోయాడు. కాబట్టి చరిత్రలో మనమెప్పుడు మాయగా అనుకునేలా ప్రవర్తించాలి తప్ప ఎలా బడితే అలా ఉండడం సరికాదన్నమాట! నిరుత్సాహపరులైన గ్రామస్థులందరితో కలిసి గోపాలరావు గుండ్ సాయికి ఈ విషయాన్ని వివరించాడు. అయితే! సాయి ఆశీర్వచనం కారణంగా అనుమతి రానేవచ్చింది కొన్ని రోజుల్లోనే. అంటే ఏమన్నమాట? మనకేదైనా ఓ పని కాక మధ్యలో అడ్డంకి కలిగితే సాయిని ప్రార్థిస్తే పని మళ్లీ సక్రమ స్థితికి వచ్చేస్తుందని తెల్పడమే కదా!మరో విశేషం ఉంది కూడా. గోపాలరావు గుండ్ తనకి పుత్రుడు కల్గిన సందర్భంగా తానొక మహ్మదీయుడు కాబట్టి ఉరుసు ఉత్సవాన్ని చేయ సంకల్పించి ఇంత చేసాడు. సత్ప్రవర్తన కలిగిన మహాత్ములైన మహ్మదీయులు మర ణిస్తే వాళ్ల సమాధుల వద్ద ప్రతి సంవత్సరం వాళ్లని స్మరిస్తూ వాళ్లకి నివాళులనర్పించుకునే ఆరాధనోత్సవం ఉరుసు. అలాంటి ఉరుసుని చేయవచ్చునని కలెక్టర్ నుంచి అనుమతి రాగానే సాయి అందరినీ పిలిచి ఆ ఉరుసుని తప్పకుండా ఈ సంవత్సరంలో ప్రారంభించి ప్రతి సంవత్సరం జరుపుకుందాం! అయితే ఆ ఉరుసుని శ్రీరామనవమినాడు జరుపుకుందామని తన నిర్ణయాన్ని ప్రకటించాడు.గమనించాలి! సాయి ఎంత గొప్పవాడో హృదయవైశాల్యం కలవాడో! పరమత ద్వేషి కానికాడో! ఆ విషయాన్ని అర్థం చేసుకోగలగాలి! ‘నాకు పరమతసహనం ఉంది. స్వమతం మీద సంపూర్ణ అభిమానం మాత్రమే కాదు’ అంటుంటారు ఎందరో. సాయి దాన్ని అంగీకరించాడు. మతాలంటూ రెండున్నాయని అంగీకరిస్తూ ఈ రెంటింటిలో నాదికాని మతాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఇతర మతాన్ని ద్వేషించననడం గొప్ప కాదని తీర్మానిస్తాడు సాయి. రెండు మతాల్లోనూ వేర్వేరుదనం ఉండనే ఉండరాదు. ‘రెండు’ అనుకుంటున్న ఆ ‘రెండూ ఒక్కటే’ అని నిరూపిస్తూ, ముందుకాలం వారికి మార్గదర్శకుడు కూడా అవుతూ ‘ఆ చేయబోతున్న ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమినాడు చేయాలి’ అంటూ ఆజ్ఞ చేసాడు సాయి!ఇలాంటి చరిత్రలని పాఠ్యాంశాల్లో చదివి నేడు కన్పిస్తున్న హిందూ ముసల్మాన్ ద్వేషాలు ఇంతకు వెనుకకాలంలో చరిత్రలో జరిగాయని చెప్పిన ముసల్మాన్ దండయాత్రలు, ప్రస్తుతం ఇంకా జరుగుతున్న హిందూమహ్మదీయ పరస్పర దూషణలు చిన్నచిన్న ఘర్షణలు కూడా పూర్తిగా సమసిపోతాయి. ముఖ్యంగా బాల్యం నుండే పిల్లల్లో మతాల్లో ఉండే రెండు తనం పోయి, మతాలన్నీ ఒకటే అనే అభిప్రాయం బలపడుతుంది! సాయిని కొందరు హిందువులు ఆయన ఓ మహ్మదీయుడనే అభిప్రాయంతోనూ ఆ సంప్రదాయమే ఆయన ఆలయంలో జరుగుతూ ఉంటుందనే ఊహతోనూ సాయిపట్ల ఆయన ఆరాధన పట్ల విముఖతని చూపిస్తూ ఉంటారు. వీరి ఆలోచనే నిజమైనదైనట్లైతే – మసీదేమిటి? ధుని ఏమిటి? లోపల తులసి మొక్కని నాటడమేమిటి? దీపారాధన ఏమిటి? ద్వారకామాయి అని దానికి పేరు పెట్టడమేమిటి? కొద్దిగా ఇలా ఆలోచించుకోగలగాలి. ఇదే సందర్భంలో కొందరు మహ్మదీయులు కూడా ఈయన హిందువనే అభిప్రాయంతో కొంత విముఖతని చూపిస్తూ ఉంటారు. రాబోయే చరిత్రలో ముసల్మానులు అభిప్రాయంతో హిందువులని ఏం చేయబోయారో కూడా తెలియబోతోంది! నిజంగా ఆయన హిందువే అయ్యుంటే నిరంతరం ‘అల్లాహోమాలిక్’ అనడమేమిటి? కఫనీని ధరించడమేమిటి? తల గుడ్డని గట్టిగా చుట్టి ఎడమచెవి మీదుగా ముడిని వేయడమేమిటి? కొద్దిగా పరిశీలించగలగాలి. మరైతే సాయి ఎవరట? ఆయన హిందువుగా కన్పించే మహ్మదీయుడు. మహ్మదీయుడిగా కన్పించే హిందువు. రెంటినీ కలిపి ఒకేమాటలో చెప్పాలంటే ఏ మతానికీ చెందని మహనీయుడూ, అన్ని మతాలు ఒకటే సుమా! అని అర్థం చేసుకునేలా మనకి ఉపదేశాన్నిచ్చే అనన్యసామాన్యుడూను.మొత్తానికి ఉరుసుని శ్రీరామనవమినాడు నిర్వహించడానికి ప్రభుత్వ అనుమతి గ్రామస్థుల సహకారం సాయి అనుగ్రహపూర్వకమైన ఆమోదం అన్నీ లభించాయి గానీ మళ్లీ గ్రామస్థుల్లో ఒక చింత బయల్దేరింది. రెండుత్సవాలనీ ఒకే మారు చేస్తున్న కారణంగా భక్తుల సంఖ్య మరింత మరింత అవుతుంది. షిర్డీలో నీటి సమస్య ఉంది. ఉత్సాహంతో మనం ఉత్సవాలని ఇక్కడ కాకుండా మరోచోట చేసుకుంటేనే ఈ ఉత్సవాలని? అనే ఆలోచనదాక వచ్చేసారు జనం అందరూ. దీన్నే అస్థిర అవిశ్వాస తీర్మానం’ అంటారు. ఒకేచోటంటూ ఉత్సవం జరగాలనే గట్టి ప్రయత్నంతో గోపాలరావు గుండ్ ఇంత భగీరథ ప్రయత్నం చేస్తే చివరి క్షణంలో నీటి సమస్య కారణంగా వాయిదా వేయడమా? అదుగో ఆ ఆలోచననే ‘అస్థిర అవిశ్వాస ఆలోచన’ అంటారు.అస్థిర ఆలోచనంటే ముందు షిర్డీలో అనుకుని, తర్వాత షిర్డీ కాక మరోచోట చేద్దామని సంకల్పించడం, అవిశ్వాస ఆలోచనంటే సాయి కూడా ఈ సమస్యని తీర్చలేడనే మానసిక అవిశ్వాసంతో ఆలోచించడం. అసలు సాయికి ఈ సమస్యని చెప్పుకోకుండా తమలో తాము ఆలోచించేసుకోవడమూను. కొన్ని కొన్ని సందర్భాల్లో మనుష్యులు ఇలాంటి ఆలోచనలనే చేస్తారు. ఆ సరైన ఆలోచన రావడానికి కూడా సాయి అనుగ్రహం ఉండాలి. గోపాలరావు గుండ్తో పాటు పాటిల్ ద్వయం మాధవరావు ఇంకా కొందరికి మెరుపులా ఇదేమిటి? ఇలా ఈ సమస్య మరో తోవ పడుతోంది? అనే ఆలోచన కలిగి సాయికి విన్నవించారు. ‘దేవా! ఈ ఉత్సవాలని చేయదలిస్తే షిర్డీలో రెండే రెండు నీటి వసతులున్నాయి. ఒకపేద్ద నుయ్యి ఉందిగాని ఈ ఉత్సవాలు ఎండల కాలంలో కాబట్టి నీరు సరిపోకపోవచ్చు. లేదా ఇంకిపోతుంది కాబట్టి మధ్యలో ఆ నుయ్యి మనని ఇబ్బందికి గురిచేయచ్చు. ఇక రెండో నుయ్యి ‘నడబావ’. అంటే నాలుగు వైపుల్నించి నడిచే మార్గాల మధ్యలో ఉన్న పెద్ద విశాలమైన బావి. నాలుగు వైపుల వారూ చక్కగా తోడుకుని నీళ్లు పట్టుకోగల వసతి ఉన్న బావి, అయితే దురదృష్టవశాత్తూ ఆ నూతినీరు ఉప్పగా అయిపోయింది. ఎవరికీ ఉపయోగపడడం లేదు. నువ్వే మాకు శరణం’ అని.సాయి చిరునవ్వు నవ్వుతూ ‘చెడు పనులకి విఘ్నాలు కలగనే కలగవు. మంచి పనులకే విఘ్నాల మీద విఘ్నాలొస్తూ ఉంటాయి. (‘శ్రేయాంసి బహు విఘ్నాని’ అని శ్రీమద్ రామాయణంలోని మాట ఇదే అర్థాన్నిస్తుంది) అందుకని ఆలస్యం చేయకూడదు మంచిపని విషయంలో. రండి! అంటూ ఆ నూతి దగ్గరికి వెళ్లి దగ్గర్లో ఉన్న చెట్లపూలని స్వయంగా తానే కోసి లోపల ఏదో ధ్యానం చేసి నూయి చుట్టూ తిరుగుతూ కొన్ని పుష్పాలని తాను వేసాడు నూతిలో.‘ఇక వెళ్దాం!’ అన్నట్టుగా తాను ద్వారకామాయి వైపు నడిచాడు. ఆశ్చర్యం మరురోజునుండే ఎందరో నీళ్లు తోడుకోవడం కన్పించిందక్కడ! నీళ్లన్నీ ఉప్పదనాన్ని కోల్పోయి రుచికరంగా తాగవీలైన తీరులో ఉన్నాయి పరిశీలించి చూస్తే.అప్పుడర్థమైంది షిర్డీ ప్రజలకి. గంగానది మన పక్కనే ప్రవహిస్తూ ఉంటే పొరుగూరి చెరువుకి నీళ్లకోసం వెళ్తున్నామా? అనీ మలయపర్పత వాయువు ఇక్కడే వీస్తుంటే విసనకర్రల్ని కొనుక్కుని వీచుకుంటున్నామా? అనీను! ఇంతలో మరో శుభవార్త వినపడింది అందరికీ! -
దుబారాకు అలవాటు పడ్డ ప్రాణం మరి!
-
దుబారాకు అలవాటు పడ్డ ప్రాణం మరి!
బెంగళూరు: విదేశీ పర్యటనల పేరుతో ఇప్పటికే ప్రజా ధనాన్ని మంచి నీళ్లలా దుర్వినియోగం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. స్వదేశంలో తన లగ్జరీ కోసం చేస్తున్న ఖర్చు కూడా భారీ స్థాయిలోనే ఉంది. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లిన చంద్రబాబుకు అయిన హోటల్ బిల్లు ఎంతో తెలుసా అక్షరాలా రూ. 8.7 లక్షలట. అయితే ఆ మొత్తాన్ని సిగ్గు-ఎగ్గు లేకుండా ప్రభుత్వమే చెల్లించడం ఇక్కడ గమనార్హం. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లిన ఇతర రాష్ట్రాల నేతలు తమ హోటల్ ఖర్చును లక్ష, రెండు లక్షల మధ్యలో ముగించేస్తే, మన ‘డాబు’గారు.. ఏమాత్రం సిగ్గు పడకుండా రూ. 8లక్షలకు పైగా ఖర్చు చేశారట. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లిన నేతలకు అయిన ఖర్చుపై బెంగళూర్ మిర్రర్ ఓ కథనాన్ని ప్రచురించడంతో బాబు గారి దుబారా బయటపడింది. ఎంతైనా ఖర్చుకు అలవాటు పడ్డ ప్రాణం కదా.. ఆ మాత్రం దుబారా లేకపోతే ఎలా? అని చర్చించుకోవడం ప్రజల వంతైంది. -
41 పర్యటనలు.. ఖర్చు రూ.355 కోట్లు..!!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు ఇప్పటివరకూ ఎంత ఖర్చు చేశారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. 2014లో ప్రధాని పగ్గాలు చేపట్టినప్పటి నుంచి నాలుగేళ్లలో ప్రధాని 50 దేశాలకు పైగా 41 విదేశీ పర్యటనలు చేశారు. ఈ పర్యటనలకు రూ 355 కోట్లుపైగా ప్రభుత్వ ఖజానా నుంచి వెచ్చించినట్టు ఆర్టీఐ కింద ప్రభుత్వం ఇచ్చిన సమాచారంతో వెల్లడైంది. బెంగళూర్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెలుగుచూశాయి. ప్రధాని మోదీ ఇప్పటివరకూ తన 48 నెలల పదవీకాలంలో165 రోజుల పాటు విదేశీ పర్యటనల్లో గడిపినట్టు వెల్లడైంది. మరోవైపు గత 48 నెలల్లో ప్రధాని విదేశీ పర్యటన వివరాలతో కూడిన జాబితాను ప్రదాని కార్యాలయ వెబ్సైట్ పొందుపరించింది. ఈ పర్యటనల్లో 30 సార్లు ప్రధాని ఉపయోగించిన చార్టర్డ్ విమానాల బిల్లులను ఇందులో చూపగా, 12 ఈ తరహా పర్యటనల బిల్లులను ఇంకా పొందుపరచలేదు. మోదీ విదేశీ పర్యటనల్లో ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాల పర్యటనకు అత్యధికంగా రూ 31.25 కోట్లు ఖర్చు కాగా, భూటాన్ పర్యటనకు కేవలం రూ 2.45 కోట్లు ఖర్చయినట్టు వెల్లడించారు. -
పోలవరం లెక్కలన్నీ ఆన్లైన్లో పెట్టాలి: సీఎం
అమరావతి: పోలవరం లెక్కలన్నీ ఆన్ లైన్లో పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు లెక్కలపై ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన ఈ ప్రాజెక్టుకు గతంలో పెట్టిన ఖర్చు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చుల వివరాలను పొందుపర్చాలన్నారు. ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను కూడా ఆన్లైన్లో పెట్టాలన్నారు. ఖర్చుల వివరాలతోపాటు పోలవరానికి సంబంధించిన ఇతర వివరాలన్నీ ఆన్లైన్లో పెట్టాలని సీఎం సూచించారు. -
ఎన్నికల ఖర్చు వివరాలివ్వండి
- షాడో అబ్జర్వేషన్ రిజిష్టర్తో సరిపోకపోతే నోటీసులు - జేసీ ప్రసన్న వెంకటేష్ కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల ఉప ఎన్నికలో చేసిన ఖర్చు వివరాలను ఓట్ల లెక్కింపు తేదీ నుంచి నెల రోజుల్లో సమర్పించాలని జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అభ్యర్థులను ఆదేశించారు. మంగళవారం తన చాంబరులో జేసీ విలేకరులో మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారిగా తనకు ఇది మొదటి ఎన్నికని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, విమర్శలు దరిచేరకుండా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు బాగా సహకరించారన్నారు. ఎన్నికల నియమావలి, పెయిడ్ న్యూస్ తదితర వాటిపై నిష్పక్షపాతంగా వ్యవహించామన్నారు. అసిస్టెంట్ వ్యయ పరిశీలకులు షాడో అబ్జర్వేషన్ రిజిష్టర్ నిర్వహించారని, ఇందులో అభ్యర్థి చేసిన ప్రతి ఖర్చును నమోదు చేసి ఉంటారన్నారు. వీటికి అభ్యర్థులు చూపించే లెక్కలకు సరిపోలక పోతే నోటీసులు ఇస్తామన్నారు. నిబంధనల ప్రకారం రూ.28 లక్షలకు మించి ఖర్చు చేయరాదన్నారు. పోలింగ్ సిబ్బందికి రోజుకు టీఏ, డీఏ కింద అదనంగా రూ.300 ఇస్తున్నామని, ఇప్పటికే పీఓ, ఏపీఓలకు అదనపు టీఏ, డీఏ చెల్లించామని, ఇతర పోలింగ్ సిబ్బంది మాత్రం తీసుకోలేదని, వీరు నంద్యాల తహసీల్దారును కలసి అదనపు డీఏ పొందవచ్చని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఇకపై రెవెన్యూ, పౌరసరఫరాల అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. కలెక్టర్, జేసీలకు జిల్లా అధికారుల అభినందనలు నంద్యాల ఉప ఎన్నికను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిర్వహించిన జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ను.. జేసీ–2 రామస్వామి, ప్రత్యేక కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, సీపీఓ ఆనంద్నాయక్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి తదితరులు వేరువేరుగా కలసి బొకేలు సమర్పించి అభినందించారు. అదే విధంగా జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్బాబు, కార్యదర్శి గిరికుమార్రెడ్డి తదితరులు కలెక్టర్, జేసీలను కలిసి ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. -
అంచనాలు.. మూడింతలు
భారీగా పెరిగిన కొమురంభీం ప్రాజెక్టు వ్యయం రూ.882.36 కోట్లకు పరిపాలన అనుమతులు మూడోసారి అంచనాలను సవరిస్తూ జీవో 801 జారీ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ‘కోట్లంటే బిస్కిట్లు అనుకుంటున్నారా.? దస్, బీస్, పచాస్.. సౌ.. కోట్లకు కోట్లు.. పెంచుకుంటూ పోతే ఎలా..?’ సాగునీటి ప్రాజెక్టు పనుల ప్రగతిపై ఇటీవల ఆదిలాబాద్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆ శాఖ మంత్రి హరీష్రావు అధికారులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలివి. మంత్రి వ్యాఖ్యలకు తగ్గట్టుగానే జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. తాజాగా కొమురంభీం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని నీటి పారుదల శాఖ అధికారులు ఏకంగా మూడింతలు పెంచేశారు. ముచ్చటగా మూడోసారి ఈ అంచనాలను సవరించడం గమనార్హం. 45,500 ఎకరాలకు సాగు నీరందించేందుకు పెద్దవాగుపై చేపట్టిన ఈ ప్రాజెక్టును రూ.274.14 కోట్లతో పూర్తి చేయాలని అప్పట్లో నిర్ణయించారు. ఈ మేరకు డ్యాం నిర్మాణం పూర్తిచేశారు. స్పిల్వే, సర్ప్లస్ కోర్సును నిర్మించారు. 34.06 కిలోమీటర్ల ఎడమ కాలువ నిర్మాణం, 32 కిలోమీటర్ల మేరకు డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పూర్తయ్యింది. ప్రస్తుతానికి సుమారు 9,500 ఎకరాలకు సాగు నీరందుతోంది. మిగిలిన 36 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు నీటి పారుదల శాఖ అధికారులు ఈ ప్రాజెక్టు పనుల అంచనాలు సవరించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.902.20 కోట్లకు అంచనాలను పెంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం రూ.882.36 కోట్లకు పరిపాలన అనుమతులిస్తూ శుక్రవారం (ఈనెల 23న) జీవో నెం.801ను జారీ చేసింది. పూర్తి చేయాల్సిన పనులివే.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కాలువ నిర్మాణ పనులు పూర్తికావాల్సి ఉంది. 65 కిలోమీటర్ల పొడవైన ఎడమ కాలువ నిర్మాణం సగం మాత్రమే పూర్తయ్యింది. ఇంకా 30.94 కి.మీలు నిర్మించాల్సి ఉంది. అలాగే ఏడు కి.మీల కుడి కాలువ నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. సుమారు 27.81 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం జరగాల్సి ఉంది. ఈ ఏడాది చివరి వరకు ఈ పనులు పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ భావిస్తోంది. భూసేకరణ.. ఈ పనులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కుడి కాలువ, కోర్సిని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, కుడి కాలువ, డిస్ట్రిబ్యూటరీలు.. వీటి కోసం సుమారు 655 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి రైల్వే లైన్లు దాటాల్సి ఉంది. అలాగే ముంపు గ్రామాల్లోని సుమారు వంద కుటుంబాలకు పునరావాస చర్యలు చేపట్టాల్సి ఉంది. -
పుష్కర పనుల్లో వృథా ఖర్చు
* ప్రణాళిక లేక ఖాళీగా దర్శనమిచ్చిన పుష్కరనగర్లు * కొన్ని చోట్ల ఇప్పటికీ కొనసాగుతున్న రోడ్ల నిర్మాణాలు సాక్షి, అమరావతి బ్యూరో: పుష్కరాల ప్రభుత్వం కోట్ల రూపాలయ సొమ్ము వృథా చేసింది. భక్తులకు ఉపయోగపడతాయా లేదా అని ఆలోచించకుండా జిల్లాలో పుష్కర నగర్లను ఏర్పాటు చేసింది. ఘాట్కు పుష్కరనగర్లను దూరంగా ఏర్పాటు చేసి వాటిని అలంకారప్రాయంగా ఉంచారు. వీటి కాంట్రాక్టులన్నీ అధికార పార్టీ నేతలే దక్కించుకున్నారు. జిల్లా తాడేపల్లిలోని మోడల్æడెయిరీ, రిథం, కృష్ణాకెనాల్ రైల్వేస్టేషన్, నులకపేట కల్యాణ మండపం, మంగళగిరిలోని ఎయిమ్స్, ఉద్దండరాయునిపాలెం, పెనుమూడి, అమరరావతిలోని గుంటూరు, విజయవాడ, సత్తెనపల్లె రోడ్డులో మూడు, గుంటూరు సమీపంలో (ట్రాన్సిట్ పాయింట్), పొందుగుల, దైద, విజయపురిసౌత్లో 14 చోట్ల ఏర్పాటు చేశారు. పేరుకు మాత్రమే.. గుంటూరుకు సమీపంలో రూ.2 కోట్లతో గోరంట్ల వద్ద (ట్రాన్సిట్) పుష్కర నగర్ ఏర్పాటు చేశారు. దీన్ని భక్తులెవరూ ఉపయోగించుకోలేదు. అక్కడ అధికారులు మాత్రమే కనిపించారు. మరుగుదొడ్లు, స్టాల్స్, క్లాక్ Sరూమ్, భారీ ఎల్ఈడీ స్కీన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, మినరల్ వాటర్ ప్లాంట్ల కోసం దాతల నుంచి కార్పొరేషన్ అధికారులు రూ.20 లక్షలు వసూలు చేశారు. ఇవన్నీ వృథాగా మారాయి. ఈ పనులను అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ఓ కంపెనీకి కట్టబెట్టారు. వ్యవహారం మొత్తం చినబాబు కనుసన్నల్లో జరిగినట్లు సమాచారం. ఇవి కాకుండా జిల్లాలో 13 చోట్ల రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలు ఖర్చు చేసి పుష్కర నగర్లను ఏర్పాటు చేశారు. పొందుగుల, కృష్ణవేణి, అమరావతిలోని సత్తెనపల్లె, విజయవాడ రోడ్డులో ఏర్పాటు చేసిన, ఎయిమ్స్ మంగళగిరి, పెనుమూడి, ఉద్దండరాయునివాళెం, తాడేపల్లె ఏర్పాటు చేసిన పుష్కర నగర్లు వెలవెలబోయాయి. పుష్కరాలు ముగిసినా కొనసాగుతున్న పనులు తెనాలి రూరల్: ప్రాంతాల ప్రాధాన్యాన్ని బట్టి ఘాట్లను ఏ, బీ, సీ విభాగాలుగా విభజించారు. ఒక్క పెనుమూడిలోనే వీఐపీ ఘాట్ ఏర్పాటు చేశారు. తెనాలి డివిజన్లో ఏ కేటగిరీ ఘాట్లు లేవు. ఈ ఘాట్లలో టైల్స్ వేయడం, అందంగా తీర్చిదిద్దాల్సి ఉంది. బీ, సీ కేటగిరీల్లో ఘాట్లను నిర్మించి, రంగులు వేసి, నదీ జలాలు లేని చోట జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేయాలి. నదిలో కిందికి వదిలే నీళ్లు లేకపోవడంతో జల్లు స్నానాలతో మమ అనిపించారు. కొన్ని ఘాట్లలో ఒక్కరు కూడా పుష్కర స్నానాలు చేయలేదు. పుష్కరాలు ముగిసినా పనులు సా..గుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే పుష్కరాలకు సంబంధించిన పనులు ఇంకా కొనసాగుతుండడం విశేషం. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కరకట్ట నుంచి నది వరకు అప్రోచ్ రోడ్డు నిర్మించాలి. తెనాలి డివిజన్ కొల్లిపర మండల పరిధిలో అవసరం ఉన్నా, లేకపోయినా 12 ఘాట్లను నిర్మించారు. వీటికి సంబంధించి కరకట్ట నుంచి అప్రోచ్ రోడ్డు వేసేందుకు రూ. 2.65 కోట్ల అంచనాలతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పుష్కరాలకు కేవలం 40 రోజుల ముందే కాంట్రాక్టరుతో ఒప్పందం ఖరారైంది. కొన్ని ఘాట్ల వద్ద అప్రోచ్ రోడ్డుకు మట్టి పని చేయాలి. సుమారు ఐదడుగుల మేర ఎత్తు వరకు మట్టి రోడ్డు వేసి, దానిపై డస్ట్, కంకర పోసి రోలర్లతో తొక్కించి, అనంతరం సిమెంటు రోడ్డు లేదా, బీటీ రోడ్డు వేయాలి. అయితే కొల్లిపరలో ఇప్పటికీ ఒక్క ఘాట్కూ అప్రోచ్ రోడ్డు నిర్మాణం జరగలేదు. కేలవం కరకట్ట నుంచి ఘాట్ వరకు డస్ట్, కంకర వేసి రోలర్తో తొక్కించకుండా వదిలేశారు. ఒప్పందం ప్రకారం కాంట్రాక్టరుకు 90 నుంచి 180 రోజుల సమయం ఉంది. దీంతో పుష్కరాలు పూర్తయినా, ఇప్పటికీ పనులు చేస్తున్నారు. కొల్లూరు మండలంలో 10 ఘాట్లకుగాను రూ. 2.55 కోట్లు కేటాయించారు. ఈపూరు, చిలుమూరు ఘాట్లకు ప్రస్తుతం అప్రోచ్లను నిర్మిస్తున్నారు. కమిషన్ల కోసమే ఘాట్లు నిర్మించారని ప్రజలు విమర్శిస్తున్నారు. -
ప్రచార ఆర్భాటానికి రూ.కోట్ల ఖర్చు
పుష్కర పనుల్లో అవినీతి వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి అప్పిరెడ్డి ధ్వజం చంద్రబాబు సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ గుంటూరు (పట్నంబజారు): కేవలం ప్రచారార్భాటాల కోసం పవిత్ర కృష్ణా పుష్కరాలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు సర్కార్ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ఖర్ఛు చేసిన నిధులు, అభివృధ్ధి పనులపై తక్షణమే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు అరండల్పేటలోని పార్టీ నగర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పుష్కరాల కోసం రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తే, 2 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించి, పిండ ప్రదానాలు చేశారని, అంటే ఒక్కొక్క మనిషి కోసం రూ.1000 ప్రభుత్వం వెచ్చించిందా అని ప్రశ్నించారు. శాశ్వత నిర్మాణాల కోసం ప్రభుత్వం అన్ని వేల కోట్లు ఖర్చు చేస్తే తాము కూడా హర్షించేవారమన్నారు. అవకతవకలు జరిగాయని మీడియాలో ఘోషిస్తున్నా పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. వేలాది కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు సర్కార్ ప్రత్యక్షంగా, పరోక్షంగా 22 మంది మృతికి కారణమైందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం రూ.800 కోట్లతో పుష్కరాలను నిర్వహిస్తే, ఇక్కడికంటే అధికంగా 5 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారని, ఏ ఒక్క ప్రమాదం జరలేదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. పుష్కరాలను సైతం రాజకీయ వేదికగా మార్చుకుని గంటల కొద్దీ ప్రసంగాలు చేయడం హాస్యాస్పదమన్నారు. భక్తులను పోలీసులతో నిర్బంధించి, ఎటువైపు కదలనివ్వకుండా నిలువరించి ప్రసంగాలు చేశారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము) రేపల్లె నియోజకవర్గ గడపగడపకు వైఎస్సార్ పరిశీలకుడు మోదుగుల బసవపున్నారెడ్డి, మైనారిటీ విభాగం గుంటూరు నగరాధ్యక్షుడు షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు. -
ఒలింపిక్స్కు ఎంత ఖర్చయింది?
ప్రపంచ క్రీడాకారుల్లో కొందరికి మధుర జ్ఞాపకాలను, కొందరికి చేదు జ్ఞాపకాలను మిగిల్చి రియో ఒలింపిక్స్ చరిత్ర పుటల్లోకి జారుకుంది. ఇలాంటి ఒలింపిక్స్ నిర్వహించాలంటే ఏ దేశానికైనా ఎంత ఖర్చవుతుంది? ఇప్పటివరకు ఏయే ఒలింపిక్స్కు ఎంత ఖర్చయిందన్నది ఆసక్తికరమైన అంశం. నాలుగేళ్లకోసారి నిర్వహించే సమ్మర్ ఒలింపిక్స్కు సరాసరి సగటున 520 కోట్ల డాలర్లు (2015 సంవత్సరం నాటి అమెరికా కరెన్సీ లెక్కల ప్రకారం), అంటే భారత కరెన్సీలో దాదాపు 34,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని, అదే వింటర్ ఒలింపిక్స్కు 310 కోట్ల డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో 20,806 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, దానికి అనుబంధంగా పనిచేస్తున్న బిజినెస్ స్కూల్ విభాగానికి చెందిన ఆర్థిక నిపుణులు లెక్కలు వేశారు. స్టేడియాల నిర్మాణం, క్రీడాకారులకు వసతి, రవాణా సౌకర్యాలు కాకుండా కేవలం క్రీడల నిర్వహణకే ఇంత ఖర్చవుతుందని వారు తేల్చారు. ఒలింపిక్స్ నిర్వహణకు సంబంధించిన గణాంకాలు 1964 నుంచే అందుబాటులో ఉన్నాయి. అంతకుముందు ఈ క్రీడల నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో గణాంకాలు అందుబాటులో లేవు. గతంలో ప్రతి ఒలింపిక్స్కు అంచనాలకు మించి వంద శాతానికన్నా ఎక్కువగా ఖర్చు అవుతుండగా, గతానుభవాల రీత్యా రియో ఒలింపిక్స్ ఖర్చు అంచనాలకన్నా 50 శాతం మాత్రమే ఎక్కువ ఖర్చయింది. ఏదేమైనా ఖర్చు మాత్రం ఒక ఒలింపిక్స్ నుంచి మరో ఒలింపిక్స్కు పెరుగుతూనే ఉంది. 2012 లండన్లో జరిగిన ఒలింపిక్స్ అత్యంత ఖరీదైనవిగా చరిత్ర సృష్టించింది. ఆ ఒలింపిక్స్కు 1500 కోట్ల డాలర్లు ఖర్చయ్యాయి. 970 కోట్ల డాలర్ల ఖర్చుతో బార్సిలోనా ఒలింపిక్స్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. 1964లో జరిగిన టోక్యో ఒలింపిక్స్కు 28.20 కోట్ల డాలర్లు మాత్రమే ఖర్చయ్యాయి. అదే సంవత్సరం జరిగిన ఇన్స్బర్క్ వింటర్ ఒలింపిక్స్కు 2.20 కోట్ల డాలర్లు మాత్రమే ఖర్చయ్యాయి. లండన్లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్కు బడ్జెట్ అంచనాలకు మించి 76 శాతం ఎక్కువ నిధులు ఖర్చు కాగా, సోచిలో 2014లో జరిగిన వింటర్ ఒలింపిక్స్కు బడ్జెట్ అంచనాలకు మించి 289 శాతం ఎక్కువ నిధులు ఖర్చయ్యాయి. అత్యధికంగా ఖర్చయిన వింటర్ ఒలింపిక్స్గా అది రికార్డులకు ఎక్కింది. ఇటీవల ముగిసిన రియో ఒలింపిక్స్ నిర్వహణకు 460 కోట్ల డాలర్లు ఖర్చు అవుతాయని తొలుత అంచనా వేశారు. కానీ దానికన్నా 51 శాతం ఎక్కువ నిధులు ఖర్చయ్యాయి. ఒలింపిక్స్ క్రీడల 'నాలెడ్జ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్' కింద గత ఒలింపిక్స్కు జరిగిన ఖర్చులను పంచుకోవడం ద్వారా అంచనాలకు, వాస్తవ ఖర్చులకు భారీ వ్యత్యాసం కాస్త తగ్గింది. -
దుబార ఖర్చు చేస్తున్న సీఎం కేసీఆర్
నిజామాబాద్ సిటీ : ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు ఆర్థిక క్రమశిక్షణ లేదని పీసీసీ అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి బొమ్మ మహేశ్ కుమార్గౌడ్ విమర్శించారు. రాష్ట్రంలో అవసరం లేని చోట ప్రాజెక్టుల నిర్మాణం, వాస్తు పేరిట ఉన్నవాటిని కూల్చి కొత్త నిర్మాణాలు చేపట్టడం ప్రజల సొమ్మును దుబార చేయడమే నన్నారు. శనివారం నిజామాబాద్లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చక్కని సీఎం క్యాంపు కార్యాలయం నిర్మించారని, ఏ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినా అన్ని విధాల ఉపయోగపడేలా క్యాంపు కార్యాలయం నిర్మిస్తే దానికి వాస్తు లేదని కూల్చివేసి రూ. 33 కోట్లతో కొత్త క్యాంపు కార్యాలయం నిర్మించేయత్నంలో కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. రూ. ఒక లక్ష 60 వేల కోట్లు అప్పులున్న ఈ రాష్ట్రంలో ఇంత దుబార ఖర్చు అవసరమా అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో నీటి నిపుణులు 1.5 టీఎంసీలకు నిర్దేశిస్తే, సీఎం ఏకంగా 30 నుంచి 40 టీఎంసీలకు వెళ్లి మల్లన్నసాగర్ను నిర్మాణం చేస్తున్నారంటే దాని వెనుక మతలబు ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇదంతా డబ్బులు దండుకోడానికేనని అన్నారు. కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు అవసరమే లేదని ఆరునెలల పాటు లిఫ్టు ద్వారా పంటలకు ఇవ్వవచ్చన్నారు. అక్కడక్కడ చిన్న ప్రాజెక్టులు కట్టుకోవచ్చన్నారు. -
దుబారాలో దూసుకుపోతున్న చంద్రబాబు
విజయవాడ: ఓ వైపు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూనే, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం దుబారా ఖర్చులో దూసుకుపోతున్నారు. కేవలం 26 కిలోమీటర్ల దూరానికి కూడా ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ఉపయోగించారు. తన అధికారిక నివాసం నుంచి చంద్రబాబు గురువారం ఉదయం ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి హెలికాప్టర్లో వెళ్లారు. గతంలోనూ చంద్రబాబు ప్రజాధనం దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయినా చంద్రబాబు మాత్రం తన రూటే సపరేట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకూ బాబు దుబారా ఖర్చు రూ.735 కోట్లుగా తేలింది. విదేశీ పర్యటనలు, రాష్ట్రంలోనే జిల్లాల పర్యటనల కోసం విమానాల ఖర్చులు, చంద్రబాబు నివాసాలు, కార్యాలయాల కోసం ఈ మేరకు ఖర్చు పెట్టినట్లు సమాచారం. కాగా చంద్రబాబు ఇవాళ ఆత్కూరు జడ్పీ పాఠశాలలో విద్యాంజలి కార్యాక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్లో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తారు. -
అన్ని కోట్లు ఖర్చు... ఏం ఉపయోగం?
► గోదావరి పుష్కరాల్లో రూ.2వేల కోట్లు వ్యయం చేస్తే ఏమీ కన్పించలేదు ► కృష్ణా పుష్కరాలకు ఇష్టానుసారం ప్రతిపాదించొద్దు: సీఎస్ టక్కర్ హైదరాబాద్: ‘గతేడాది గోదావరి పుష్కరాల సందర్భంగా ఏకంగా రూ.2వేల కోట్లు వ్యయం చేశారు. తీరా అక్కడ చూస్తే ఏమీ కనిపించలేదు. ఇప్పుడు కృష్ణా పుష్కరాల పేరుతో ఇష్టానుసారం పనులను ప్రతిపాదించవద్దు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్పీ టక్కర్ అధికారులను హెచ్చరించారు. సోమవారం సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధి కారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గతేడాది గోదావరి పుష్కరాల మాదిరి ఈసారి జరగకూడదని చెప్పారు. ఇప్పటికే కృష్ణా పుష్కరాల పేరుతో రూ.1000 కోట్లకు ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిసిందన్నారు. అన్ని పనులకు అనుమతులు ఇవ్వరాదని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. అసెంబ్లీ, శాసన మండలిలో సభ్యులడిగిన ప్రశ్నలకు వందల సంఖ్యలో సమాధానాలు పెండింగ్లో ఉన్నాయని, జీరో అవర్లో లేవనెత్తిన అంశాలకు జవాబులు పెండింగ్లో ఉన్నాయని సీఎస్ పేర్కొన్నారు. అన్ని శాఖలూ వెంటనే సమాధానాలను పంపించాలన్నారు. -
చంద్రబాబు డైరెక్షన్లో బారి బడ్జెట్ ఈవెంట్
-
రాజధాని శంకుస్థాపనకు రూ. 400 కోట్లు!
-
రాబడులు ఓకే.. గత నిధుల వినియోగమే లేదు: కాగ్
హైదరాబాద్: గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెవిన్యూ రాబడులు పెరిగాయని కాగ్ నివేదిక తెలిపింది. ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన కాగ్ నివేదికను తెలంగాణ ప్రభుత్వం గురువారం సభ ముందు ఉంచింది. రెవిన్యూ రాబడులు ఏడాది 6.63శాతం పెరిగాయని, రూ.6,889 కోట్ల మేర రాబడులు పెరిగాయని నివేదిక పేర్కొంది. అయితే, నిధుల వినియోగం ఆశించినంతగా జరగలేదని కాగ్ పేర్కొంది. ఇక నీటి పారుదల, రహదారుల విభాగాల్లో నిర్మాణపనులు, ప్రాజెక్టుల్లో పురోగతి లేదని వెల్లడించింది. 2014 మార్చి నాటికి అసంపూర్తిగా ప్రాజెక్టుల్లో నిలిచిపోయిన పెట్టుబడులు రూ.82,665 కోట్లుగా కాగ్ స్పష్టం చేసింది. దీంతోపాటు 2013-14లో కేటాయించిన నిధులను కూడా సరిగ్గా ఖర్చు చేయలేదని తెలిపింది. వైద్యారోగ్య ప్రమాణాలను ఏ ఆరోగ్య సంరక్షణ కేంద్రంలోనూ పాటించలేదని పేర్కొంది. ఔషదాలు, మందుల నిర్దేశిత ప్రమాణాలను వైద్య కళాశాలలు, టీచింగ్ ఆస్పత్రులు పాటించలేదని వివరించింది. వైద్య సిబ్బంది పోస్టులను కూడా భర్తీ చేయలేదని తెలిపింది. ఎస్టీ సబ్ ప్లాన్ కు 6.6శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా ఐదేళ్లలో 3.9 మాత్రమే కేటాయించారని వివరించారు. ఐటీడీఏ నిధులను కూడా సక్రమంగా ఖర్చు చేయలేదని వివరించారు. 2009-14 మధ్య కాలంలో పాఠశాల భవన నిర్మాణాలు 19శాతం మాత్రమే పూర్తయ్యాయని, బంగారు తల్లి పథకం నిధులు సక్రమంగా వినియోగం కాలేదని కాగ్ వివరించింది. -
ఒక్క టీవీకి రూ. 4 లక్షలా?
హైదరాబాద్: ప్రజా ధనాన్ని దుబారా చేయడంలో చంద్రబాబు సర్కారు ఒక్క నిమిషం కూడా ఆలోచించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఆక్షేపించారు. ప్రభుత్వం చెప్పేవి శ్రీరంగ నీతులు... చేసేవి చెడ్డ పనులని విమర్శించారు. ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టే కార్యక్రమం సీఎం ఆధ్వర్యంలోనే జరుగుతోందని ఆరోపించారు. మంత్రి యనమల తన చాంబర్ కసం రూ.80 లక్షలు ఖర్చు చేశారని, ఒక్క టీవీ కోసమే రూ. 4లక్షలు వెచ్చించారని తెలిపారు. స్పీకర్ కోడెల స్టడీటూర్ల పేరిట జోహెన్నెస్ బర్గ్, కేప్ టౌన్, కెన్యా, మారిషస్ వెళ్తున్నారని చెప్పారు. ఆ దేశాల్లో చట్టసభల తీరు గురించి మనం తెల్సుకోవాల్సింది ఏముందని ప్రశ్నించారు. రాజధాని కోసం చందాలు వసూలు చేస్తున్న దశలో ఇంత ఖర్చు దేనికి అని నిలదీశారు. దుబారా ఖర్చులు చేయకుండా పునరాలోచన చేయాలని అంబటి సూచించారు. -
రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చెంత?
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని జోన్ నిర్మాణానికి భారీగానే సొమ్ము అవసరం అవుతుందని శివరామకృష్ణన్ కమిటీ తెలిపింది. అందులో వేటివేటికి ఎంతెంత కావాలో కమిటీ చెప్పింది. తాగునీరు, మౌలిక వసతులు, డ్రైనేజీల నిర్మాణానికి రూ. 1536 కోట్లు కావాలని తెలిపింది. రాజ్భవన్ కోసం 56 కోట్లు, సచివాలయం కోసం 68 కోట్లు, 8 రైల్వే జోన్ల నిర్మాణానికి 7,035 కోట్లు, అతిధి గృహాల నిర్మాణానికి 559 కోట్లు, డైరెక్టరేట్ల నిర్మాణానికి 6,658 కోట్లు అవసరమని సూచించింది. రాజధాని, ఇతర భవనాల ఏర్పాటుకు 27,092 కోట్లు అవసరమని పేర్కొంది. విమానాశ్రయాల అభివృద్ధికి 10,200 కోట్లు, హైకోర్టు సహా న్యాయవ్యవస్థకు సంబంధించిన నిర్మాణాలకు 1271 కోట్లు అవసరమని నివేదికలో పేర్కొంది. భూసేకరణ ఆలస్యమయ్యే కొద్ది రాజధాని నిర్మాణం ఆలస్యమౌతుందని కమిటీ పేర్కొంది. ఆర్థికలోటుతో అల్లాడుతున్న ఏపీకి ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం సముచితమని కమిటీ అభిప్రాయపడింది. త్వరలోనే ఎన్డీసీను సంప్రదించి స్వతంత్ర ప్రతిపత్తి హోదాను కల్పించాలని సూచించింది. అయితే తమవి కేవలం అభిప్రాయాలు, సూచనలేనని...రాజధాని ఎంపిక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. -
తప్పిన లెక్కతో బిక్కమొహం!
సాక్షి, విశాఖపట్నం: ఏం చేసైనా గెలవాలి... ఏ అభ్యర్థి అయినా ఇలాగే ఆలోచిస్తాడు. కానీ అదే అపరిమిత వ్యయానికి కారణమైంది. ఎన్నికలకు చివరి నాలుగు రోజుల్లో ధన ప్రవాహానికి అంతే లేదు. చాలామంది అభ్యర్థులు భారీగా డబ్బు వెదజల్లారు. నియోజకవర్గంలో ఎక్కడ వెనకబడ్డామో గుర్తించి అక్కడ రెట్టింపు స్థాయిలో ఖర్చు చేశారు. ఫలానా వర్గం ఓటర్లు దూరంగా ఉన్నారని అనుచరులు చెబితే చాలు... వారిని సంతృప్తి పరిచేందుకు నోట్ల కట్టలను మంచినీళ్లప్రాయంగా వెదజల్లారు. అంచనా తప్పిన వ్యయం ఒక్కొక్కరు కోట్లలో వ్యయం చేసి ముందుగా అనుకున్న లెక్కలను దాటేశారు. మరికొందరు అభ్యర్థులు విజయం సాధిస్తామనే ధీమాతో మరింత ఎక్కువ ఖర్చు పెట్టారు. ఖర్చుల అంచనాలు తప్పడంతో బయటి మార్గాల ద్వారా సర్దుబాటు నిధులను రప్పించారు. ఇప్పుడు ఫలితాలు రావడంతో గెలిచిన, ఓడిన అభ్యర్థులు వ్యయంపై లెక్కలేసుకుంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి పోలింగ్ రోజు వరకు మొత్తం ఎంత ఖర్చయిందో తెలుసుకుంటున్నారు. చాలామంది అభ్యర్థులు శనివారం తమ అనుచరులు, బంధువులతో సమావేశాలు నిర్వహించారు. చాలాచోట్ల డబ్బు దారిమళ్లి ఓటర్లకు చేరలేదని తెలిసి పంచాయతీలు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలో మండలాల వారీగా జరిగిన వ్యయంపై స్పష్టత కోసం కొందరు అభ్యర్థులు ఇళ్లల్లోనే అంతర్గత సమావేశాలు నిర్వహించారు. నగర పరిధిలోని అభ్యర్థులు డివిజన్ల వారీగా జరిగిన వ్యయం, మిగిలిన సొమ్ముపై వివరాలు రాబడుతున్నారు. ఆనందం కన్నా ఆవేదనే ఎక్కువ 2009 ఎన్నికల్లో రూ.3 కోట్ల వరకు ఖర్చుచేస్తే... ఇప్పుడు రూ.8 కోట్లు దాటిపోయిందని గెలిచిన ఓ అభ్యర్థి అనుచరుడు వ్యాఖ్యానించాడు. వాస్తవానికి విజేతల్లో చాలామంది విజయం సాధించామన్న ఆనందం కంటే రెట్టింపైన వ్యయాన్ని తల్చుకుని నీరుగారిపోతున్నారు. విశాఖ నగరాన్ని ఆనుకుని ఓ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తనకున్న రెండెకరాల పొలాన్ని విక్రయించి ఎన్నికల ఖర్చుకు పెట్టారు. ఇప్పుడు విజయం సాధించినా ఖర్చయిన మొత్తాన్ని చూసుకుని నెత్తీనోరూ బాదుకుంటున్నారు. ఎమ్మెల్యేగా అయిదేళ్లు ఎంత కష్టపడ్డా తిరిగి అంత రాబట్టుకోవడం సాధ్యమేనా? అని బావురుమంటున్నారు.