first
-
Keerthy Suresh: భర్త ఆంటోనితో కీర్తి మొదటి సంక్రాంతి.. స్పెషల్ గెస్ట్గా విజయ్ (ఫోటోలు)
-
ఐపీఎల్ మెగా వేలం-2025: ఎవరీ మల్లికా సాగర్? (ఫొటోలు)
-
'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అంటోన్న నిఖిల్.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం మరో మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల సినిమా టైటిల్తో టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. స్వయంభూ సెట్స్పై ఉండగానే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే మూవీని ప్రకటించి ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చాడు హీరో. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, దివ్యాంశ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఎస్వీసీసీ బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.(ఇది చదవండి: 'అబ్బాయిలు తాగడానికి కారణం అమ్మాయిలేరా?'.. ఆసక్తిగా టీజర్)తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ను మేకర్స్ రిలీజ్ చేశారు. హే తారా అంటూ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణచైతన్య లిరిక్స్ అందించగా.. కార్తీక్, నిత్యశ్రీ ఆలపించారు. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే ఈ మూవీని లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రానికి కార్తీక్ సంగీతమందించారు. -
త్వరలో తొలి ఎయిర్ ట్రైన్.. ప్రత్యేకతలివే
న్యూఢిల్లీ: దేశంలోనే తొలి ఎయిర్ ట్రైన్ (ఆటోమేటెడ్ పీపుల్ మూవర్-ఏపీఎం) సర్వీసు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభం కానుంది. ఎయిర్ ట్రైన్ అనేది మెట్రో తరహాలోని డ్రైవర్ లేని రైలు.ప్రయాణికులు ఇప్పటివరకూ విమానాశ్రయంలోని మూడు టెర్మినళ్లకు వెళ్లేందుకు, లేదా విమానాన్ని డీబోర్డింగ్ చేశాక క్యాబ్ను ఎక్కేందుకు బస్సు సర్వీస్ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుంది. ఈ ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం రూ. రెండువేల కోట్లతో 7.7 కి.మీ. పొడవున ఎయిర్ రైలు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2027 నాటికి ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతమున్న బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. 🚨 Delhi airport to get India's first air train by 2027, connection terminals 1, 2, and 3. pic.twitter.com/z9Qsiok9t9— Indian Tech & Infra (@IndianTechGuide) September 24, 2024ఎయిర్ ట్రైన్ అనేది పరిమిత సంఖ్యలో కంపార్ట్మెంట్లను కలిగి ఉంటుంది. ఇది ట్రాక్లపై నడుస్తుంది. నిర్ణీత ట్రాక్లో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళుతుంది. దీంతో వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. విమానాశ్రయంలోని ఇతర టెర్మినళ్లు, పార్కింగ్ స్థలాలు, క్యాబ్ పికప్ పాయింట్లు, హోటళ్లు మొదలైన వాటిని చేరుకోవడానికి ఎయిర్ ట్రైన్స్ ఉపయోగపడతాయి. ఇది కూడా చదవండి: చైనా క్షిపణి ప్రయోగం.. అమెరికా, తైవాన్, జపాన్లకు ముప్పు -
ఐఫోన్ 16 అందుకున్న తొలి కస్టమర్ ఇతనే..
ప్రపంచంలో ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఖరీదైనా కొనడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా ఐఫోన్ 16 సిరీస్ విడుదలైంది. దీంతో ముంబైలోని యాపిల్ స్టోర్కు కస్టమర్లు పోటెత్తారు. స్టోర్ తెరవక ముందు నుంచే బారులు తీరారు.ముంబైకి చెందిన ఉజ్వల్ అనే యువకుడు స్థానిక స్టోర్లో ఐఫోన్ 16 అందుకున్న తొలి కస్టమర్గా మారాడు. ఇందు కోసం ముందు రోజే ఆయన ముంబైలోని బీకేసీలో ఉన్న యాపిల్ స్టోర్ వద్దకు చేరుకున్నాడు. 21 గంటల పాటు లైన్లో వేచి ఉన్నాడు. ముందు రోజు రాత్రి ఉజ్వల్ అక్కడికి చేరుకోగానే పదుల సంఖ్యలో జనం క్యూలో అతనితో చేరారు. ఉదయానికి వందల మంది వచ్చేశారు. యాపిల్ స్టోర్ తలుపులు తెరుచుకోగానే ఉజ్వల్ మొదటి కస్టమర్గా లోపలికి అడుగుపెట్టాడు.యాపిల్ అభిమాని అయిన ఉజ్వల్ ఐఫోన్ తొలి కస్టమర్ కావడం ఇదే మొదటిసారి కాదు. కొత్త ఐఫోన్ విడుదలైన ప్రతిసారి ముందు వరుసలో ఉంటుంటాడు. గత సంవత్సరం ఐఫోన్ 15 విడుదలైనప్పుడు కూడా కొనుగోలు చేయడానికి మొదటి వ్యక్తిగా 17 గంటలు వేచి ఉన్నాడు. యాపిల్ ఉత్పత్తుల పట్ల అతనికున్న క్రేజ్ ఎలాంటిదో దీన్ని బట్టి తెలుస్తోంది. -
Teachers' Day 2024 : ప్రపంచంలో తొలి పాఠశాల ఎలా ప్రారంభమయ్యింది?
మనిషి జీవితంలో గురువు పాత్ర అమోఘమైనది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి కూడా. అయితే ప్రపంచంలోని మొట్టమొదటగా పాఠశాల ఎలా ప్రారంభమయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రపంచంలోని మొట్టమొదటి ప్రొఫెషనల్ టీచర్గా కన్ఫ్యూషియస్ గుర్తింపు పొందారు. 551 బీసీలో చైనాలో జన్మించిన తత్వవేత్త కన్ఫ్యూషియస్ ఒక ప్రైవేట్ ట్యూటర్గా జీవితం ప్రారంభించారు. కొంతమంది గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ను మొదటి గురువుగా పరిగణించినప్పటికీ, కన్ఫ్యూషియస్ను కూడా అదేవిధంగా భావిస్తారు. కన్ఫ్యూషియన్ చైనాలోని ఒక పేద కుటుంబంలో జన్మించాడని చెబుతారు. ఆయన స్వతహాగా సంగీతం, చరిత్ర, గణితం నేర్చుకున్నాడు. ఆ కాలంలో రాజకుటుంబంలోని పిల్లలకు మాత్రమే విద్యనభ్యసించే అవకాశం ఉండేది. అయితే కన్ఫ్యూషియస్ విద్య అనేది అందరికీ చేరాలని కోరుకున్నాడు. అందుకే అతను ట్యూటర్గా మారి, అందరికీ విద్యను బోధించడం ప్రారంభించారు.3,000 బీసీ నాటికే ఈజిప్టులో పాఠశాల విద్య ప్రారంభమైంది. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా తెలిపిన వివరాల ప్రకారం ఈజిప్టులో రెండు రకాల అధికారిక పాఠశాలలు నెలకొల్పారు. ఒకటి క్లరికల్ పనులు నేర్చించేందుకు, మరొకటి పండిత శిక్షణ కోసం కేటాయించారు. ఐదేళ్ల వయసు గల పిల్లలను ఈ పాఠశాలల్లో చేర్పించేవారు. వారికి 16-17 ఏళ్లు వచ్చేవరకూ విద్యను బోధించేవారు. -
ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డీజీగా చరిత్రకెక్కిన సాధనా సక్సేనా
ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా సాధనా సక్సేనా నాయర్ ( Sadhna Saxena Nair) రికార్డు సృష్టించారు. ఆర్మీ మెడికల్ సర్వీసెస్ తొలి మహిళా డీజీగా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ ఈ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఆగస్టు 1న (గురువారం) ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారు.ఈ నియామకానికి కంటే ముందు ఆమె ఆర్మీ బలగాల డైరెక్టర్ జనరల్ బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవి చేపట్టిన తొలి మహిళా అధికారి కూడా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయరే కావడం గమనార్హం. ర్యాంకులో ఎయిర్ మార్షల్గా పదోన్నతి కల్పించి మరీ ఆమెను ఆ పదవిలో నియమించారు. గతంలో ఆమె ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్గా కూడా పనిచేశారు.పుణెలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన ఎయిర్ మార్షల్ సాధనా సక్సేనా నాయర్ 1985లో వైద్యురాలిగా ఆర్మీలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఎయిర్ మార్షల్ హోదాకు చేరుకున్నారు. డిసెంబరు 1985లో ఆర్మీ మెడికల్ కార్ప్స్లో నియమితులయ్యారు. 1986లో ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ఫ్లైట్ లెఫ్టినెంట్గా చేరారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ , స్విట్జర్లాండ్లోని MME (మిలిటరీ మెడికల్ ఎథిక్స్)తో CBRN (కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ మరియు న్యూక్లియర్) వార్ఫేర్లో శిక్షణ పొందారు.వైద్య విద్యపై ఆసక్తితో ఆర్మీలో పనిచేస్తూనే ఆమె ఫ్యామిలీ మెడిసిన్లో పీజీ చేశారు. న్యూ ఢిల్లీలోని ఆల్-ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో మెడికల్ ఇన్ఫర్మేటిక్స్లో రెండు సంవత్సరాల శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తాజాగా ర్మీ మెడికల్ సర్వీసెస్కు డీజీగా ఎంపికయ్యారు. ఆమె అందించిన సేవలకు గాను విశిష్ట సేవా పతకాన్ని (VSM) అందుకున్నారు. మెరిటోరియస్ సర్వీస్ కోసం ఆమెకు AOC-in-C (వెస్ట్రన్ ఎయిర్ కమాండ్),చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ప్రశంసలు లభించాయి. జనరల్ ఆఫీసర్ ఎయిర్ మార్షల్ కేపీ నాయర్ (రిటైర్డ్)ని వివాహం చేసుకున్నారు. నాయర్ కుటుంబంలోని మూడు తరాలు గత 70 ఏళ్లుగా సాయుధ దళాలలో పనిచేశారు. -
తొలి ఆషాడం.. పుట్టింటికి వచ్చిన హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ (ఫొటోలు)
-
కొడుకు ఫేస్ రివీల్ చేసిన సింగర్ గీతామాధురి.. ఎంత ముద్దొచ్చేస్తున్నాడో! (ఫొటోలు)
-
వారణాసిలో తొలి హైడ్రోజన్ క్రూయిజ్
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో దేశంలోనే తొలి హైడ్రోజన్ క్రూయిజ్ను నడపనున్నారు. ఈ క్రూయిజ్ ఆదివారం అర్థరాత్రి వారణాసికి చేరుకుంది. మొదట ఈ హైడ్రోజన్ క్రూయిజ్ను నమో ఘాట్కు తీసుకువచ్చి, తరువాత రామ్నగర్లోని మల్టీమోడల్ టెర్మినల్కు తరలించారు. ఈ క్రూయిజ్ కొచ్చిలోని షిప్యార్డ్లో అనేక సౌకర్యాలతో నిర్మితమయ్యింది.ఈ క్రూయిజ్లో 50 మంది ప్రయాణికులు కూర్చునేందుకు అవకాశం ఉంది. కాలుష్యాన్ని ఉత్పత్తి చేయకుండా గంగానదిలో నడిచే తొలి క్రూయిజ్ ఇది. ఈ క్రూయిజ్ వారణాసి- చునార్ మధ్య నడుస్తుంది. దీనిని పర్యాటక శాఖ పర్యవేక్షించనుంది.ఈ క్రూయిజ్ నిర్వహణ కోసం వారణాసిలోని రామ్నగర్ మల్టీ మోడల్ టెర్మినల్లో తాత్కాలిక హైడ్రోజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. హైడ్రోజన్ శక్తితో నడిచే ఈ క్రూయిజ్లో ఎలక్ట్రిక్ ఇంజన్ కూడా అమర్చారు. తద్వారా హైడ్రోజన్ ఇంధనం తగ్గినప్పుడు, క్రూయిజ్ను ఎలక్ట్రిక్ ఇంజిన్తో నడపవచ్చు. వారణాసి తర్వాత అయోధ్య, మథురలలో కూడా ఈ క్రూయిజ్ను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
CNG-Powered Bike: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ (ఫొటోలు)
-
కొడుకు గౌతమ్ తొలి స్టేజీ ఫెర్ఫార్మెన్స్.. మహేశ్ బాబు భార్య ఎమోషనల్ (ఫొటోలు)
-
మోదీ 3.0 కేబినెట్ తొలి భేటీ.. కీలక నిర్ణయాలివే..
సాక్షి,ఢిల్లీ: కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడ్డాక తొలి కేబినెట్ భేటీ బుధవారం(జూన్18) జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 14 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించారు. నూనె గింజలు, పప్పులకు మద్దతు ధర ఎక్కువగా పెంచారు. కందిపప్పునకు క్వింటాలుకు 552 రూపాయల ధర పెంచగా వరి, రాగి, జొన్న , పత్తి తదితర పంటలకు నూతన మద్దతు ధర ప్రకటించారు. -
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
-
తొలి డిజిటల్ బెగ్గర్ కన్నుమూత!
రాజు భికారీ పేరెప్పుడైనా మీరు విన్నారా? బీహార్లోని బెట్టియా రైల్వే స్టేషన్లో బిచ్చమెత్తుకునేవాడు ఈయన. మామూలు బిచ్చగాడైతే ఎవరూ పట్టించుకోకపోదురు కానీ... ఈయన దేశంలోనే తొలి డిజిటల్ బెగ్గర్! పాపం.. గుండెపోటుతో కాలం చేయడంతో ఈయన గురించి ఇప్పుడు అందరికీ తెలిసింది. ఏమిటబ్బా ఈ డిజిటల్ బెగ్గర్ కథ అనుకుంటున్నారా? మరి చదివేయండి.బెట్టియా రైల్వే స్టేషన్లో చాలాకాలంగా రాజు భికారీ ఓ ప్రత్యేక ఆకర్షణగా ఉండేవాడు. ఎందుకంటే.. మెడలో గూగుల్పే, ఫోన్పే, పేటీఎం క్యూర్ కోడ్లతో కూడిన ట్యాగ్లు వేలాడుతూండేవి. వచ్చి పోయే వారిని డబ్బులు అడుక్కునేవాడు. అయితే పేమెంట్ మాత్రం డిజిటల్ పద్ధతిలోనే చేయాలి. అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బిచ్చం వేయాలన్నమాట. ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా స్ఫూర్తితో తానీ కొత్త తరహా భిక్షాటనకు పూనుకున్నానని బతికుండా రాజు భికారీ చెప్పుకునేవాడు.డిజిటల్ పద్ధతులు రాక ముందే.. అంటే దాదాపు 32 ఏళ్లుగా రాజు భికారీకి భిక్షాటనే జీవనోపాధి. మోడీ అంటే అభిమానం ఎక్కువ. ‘మన్ కి బాత్’ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వినేవాడట. అంతకు ముందు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను తన తండ్రిగా చెప్పుకునేవాడు రాజు. అప్పట్లో ఆయనకు బెట్టియా రైల్వే స్టేషన్ క్యాంటీన్ నుంచే రోజుకు రెండు పూటల ఆహారం దొరికేది కూడా.డిజిటల్ పద్ధతిలో అడుక్కోవడం మొదలుపెట్టిన తరువాత కూడా లాలూ అంటే అభిమానం పోలేదు కానీ.. మతిస్థిమితం సరిగ్గా లేకుండా పోయింది. ఆరోగ్యమూ అంతకంత క్షీణించడం మొదలైంది. చివరకు బెట్టియా రైల్వే స్టేషన్లో క్యూఆర్ కోడ్లు చూపిస్తూ అడుక్కుంటూండగానే... గుండెపోటు వచ్చింది.!! -
అందాల దీవుల్లో అడుగు పెట్టిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
దేశంలోనే అగ్రగామి ప్రైవేటు బ్యాంకుగా కొనసాగుతున్న హెచ్డీఎఫ్సీ కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్లో అడుగుపెట్టింది. లక్షద్వీప్ రాజధాని కవరాట్టిలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు తొలి బ్రాంచ్ ఏర్పాటు చేసింది. లక్షద్వీప్లో ఇప్పటివరకు ఏర్పాటైన మొదటి ప్రైవేటు బ్యాంకు ఇదే. భారత్కు నైరుతి దిశలో అరేబియా సముద్రంలో కొలువు దీరిన అందమైన ద్వీపాల సమాహారం.. లక్షద్వీప్. ఇటీవల మాల్దీవుల వివాదం నేపథ్యంలో లక్షద్వీప్కు విపరీతమైన ప్రచారం లభించింది. ప్రధాని మోదీ కూడా స్వయంగా లక్షద్వీప్లో అడుగుపెట్టి టూరిజాన్ని ప్రోత్సహిస్తూ పర్యాటకులు ఇక్కడికి రావాలని ప్రకటనలు చేశారు. ఫలితంగా ఈ దీవులకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారిన లక్షద్వీప్ ప్రాంతంలో బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు, స్థానికులు, పర్యాటలకు పర్సనల్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో తమ బ్రాంచిని ఏర్పాటు చేసినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. 2023 డిసెంబర్ 31 నాటికి, హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు 3,872 నగరాలు, పట్టణాల్లో 8,091 బ్రాంచ్లు, 20,688 ఏటీఎంలు ఉన్నాయి. -
త్వరలో తొలి స్లీపర్ వందేభారత్.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు?
దేశంలోని తొలి స్లీపర్ వందేభారత్ త్వరలో పట్టాలపై పరుగులు తీయనుంది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్- న్యూఢిల్లీ మధ్య స్లీపర్ వందే భారత్ను నడపడానికి ఈశాన్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇండియన్ రైల్వే టైమ్ టేబుల్ కమిటీ (ఐఆర్టీటీసీ) ఏప్రిల్ 10 నుంచి 12 వరకు జైపూర్లో సమావేశం కానుంది. దీనిలో ఈ రైలుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని రైల్వే జోన్ల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు.. కొత్త రైళ్లను నడపడం, ట్రిప్పులను పెంచడం, రూట్లను మార్చడం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈశాన్య రైల్వే రూపొందించిన ప్రతిపాదన ప్రకారం నూతన స్లీపర్ వందేభారత్ రైలు వారానికి మూడు రోజులు నడవనుంది. గోరఖ్పూర్ నుంచి రాత్రి వేళల్లో ఈ రైలును నడపాలని ప్రతిపాదించారు. ఈ రైలు గోరఖ్పూర్ నుండి న్యూఢిల్లీకి 12 గంటల్లో చేరుకుంటుంది. ఈ సమావేశంలో ఈ రైలుకు ఆమోదం లభిస్తే 2024, జూలై నుంచి ఈ రైలు రాకపోకలు సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోరఖ్పూర్ నుంచి న్యూఢిల్లీకి నేరుగా రైలు నడపాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ప్రస్తుతం గోరఖ్పూర్ నుండి ప్రయాగ్రాజ్ వరకు వందే భారత్ రైలు నడుస్తోంది. నూతన ప్రతిపాదనల ప్రకారం స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ గోరఖ్పూర్ నుండి రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. అంటే గోరఖ్పూర్ నుంచి ఢిల్లీకి కేవలం 12 గంటల్లోనే చేరుకోవచ్చు. -
శాంతి స్వరూప్ కన్నుమూత
రామంతాపూర్, సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రచార సాధనమైన దూర దర్శన్ చానల్లో తొలి తెలుగు యాంకర్గా ప్రసి ద్ధులు, తెలుగు ప్రజలకు తన కంచు కంఠంతో వార్తలు చెప్పిన జయంత్ శాంతి స్వరూప్ (74) కన్నుమూశారు. శుక్రవా రం ఉదయం ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో పుట్టి పెరిగిన శాంతి స్వరూప్ దూరదర్శన్ సీనియర్ యాంకర్ రోజా రాణిని వివాహమాడారు. ఆమె కొన్ని సంవత్స రాల క్రితమే చనిపోయారు. శాంతి స్వరూప్కు ఇద్దరు కుమారులు మేగాన్‡్ష, అగ్నేయ. 1978లో దూరదర్శన్ కేంద్రంలో యాంకర్గా చేరిన ఆయన 1983 నుంచి తెలుగులో వార్తలు చదవ డం మొదలుపెట్టారు. 2011లో పదవీ విరమణ చేశారు. టెలిప్రాంప్టర్ర్ లేని రోజుల్లోనే వార్తలను ముందుగానే మననం చేసుకుని తెర ముందు పొల్లు పోకుండా తప్పులు లేకుండా అనర్గళంగా చదివి తెలుగు ప్రజలకు వార్తలు అందించారు. శాంతి స్వరూప్కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవా ర్డుతో పాటు పలు సంస్థలు ఎన్నో అవార్డులతో సత్కరించాయి. భూపాల్ గ్యాస్ దుర్ఘటన కవ రేజ్ను వీక్షకులకు కళ్ళకు కట్టినట్లుగా అందించిన ఆయన రాతి మేఘం, క్రికెట్ మీద క్రేజ్, అర్ధాగ్ని అనే నవలలు కూడా రాశారు. ఆయన పార్ధివ దేహాన్ని రామంతాపూర్ టీవీ కాలనీలోని స్వగృహానికి తరలించి అక్కడి నుంచి అంబర్పేట్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కంచుకంఠం మూగబోయిందనీ, తొలితరం న్యూస్ రీడర్గా అందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ మృతి బాధాకరమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంతాపాన్ని ప్రకటించారు. శాంతి స్వరూప్ సేవలు చిరస్మరణీయం తెలుగులో వార్తలు చదివిన తొలి తరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సంతాపం ప్రకటించా రు. ఆయన అందించిన సేవలు తెలుగు మీడి యా రంగంలో చిరస్మరణీయమని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరా లని ప్రార్థించారు. శాంతి స్వరూప్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. న్యూస్రీడర్గా తనదైన ముద్ర శాంతి స్వరూప్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. టీవీలో వార్త లను చదివే తొలితరం న్యూస్ రీడర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందిన శాంతి స్వరూప్ మీడియా రంగంలో తనదైన ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
గాల్లోకి ఎగిరిన క్షణాల్లోనే పేలిన జపాన్ తొలి ప్రైవేటు రాకెట్..!
టోక్యో: వాణిజ్యపరంగా అంతరిక్ష ప్రయోగాల రంగంలోకి ప్రవేశించాలన్న జపాన్ ప్రయత్నాలకు ఆదిలోనే చుక్కెదురైంది. బుధవారం ఉదయం కుషిమోటో పట్టణంలోని లాంచ్ సెంటర్ నుంచి నింగిలోకి బయల్దేరిన దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ కైరోస్ లాంచ్ అయిన కొద్ది సెకన్లలోనే పేలిపోయింది. ఈ రాకెట్ నింగిలోకి ఎగిరితే జపాన్ చరిత్రలోనే తొలి ప్రైవేట్ రాకెట్ నింగిలోకి ఎగిరిన రికార్డు క్రియేట్ అయ్యేది. JUST IN: Space One rocket in Japan explodes after takeoff during its “inaugural launch.” The Kairos rocket was attempting to make Space One the first Japanese company to put a satellite in orbit. (Reuters) The 59 ft, four-stage solid-fuel rocket was launched from the Kii… pic.twitter.com/BJAAWXGsCy — Collin Rugg (@CollinRugg) March 13, 2024 ఈ రాకెట్ను స్పేస్ వన్ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. 59 అడుగుల పొడవైన కైరోస్ రాకెట్ ఘన ఇంధనంతో పనిచేస్తుంది. కైరోస్ రాకెట్ ప్రభుత్వానికి చెందిన సాటిలైట్ను నింగిలోకి మోసుకెళ్లాల్సి ఉంది. రాకెట్ పేలిపోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. శిథిలాలు సమీపంలోని పర్వతాలు, సముద్రం మీద చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ రాకెట్ మార్చ్ 9వ తేదీనే లాంచ్ కావల్సి ఉండగా పలు కారణాల వల్ల లాంచింగ్ వాయిదాపడింది. రాకెట్ పేలిపోవడంతో స్పేస్ వన్ కంపెనీ షేర్లు జపాన్ స్టాక్మార్కెట్లో ఒక్కరోజే 13 శాతం పడిపోయాయి. ఇదీ చదవండి.. చైనాలో భారీ పేలుడు -
తొలి వేద గడియారం సిద్ధం.. అందుబాటులోకి ఎప్పుడంటే..
ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో రూపొందింది. దీనిని మార్చి ఒకటిన ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సంయుక్తంగా కాళిదాస్ అకాడమీలో ప్రారంభించనున్నారు. వేద గడియారానికి సంబంధించిన ఇన్స్టలేషన్, టెస్టింగ్ వర్క్ పూర్తయింది. భారత ప్రామాణిక సమయాన్ని ఈ వేద గడియారంలో చూడవచ్చు. ఈ గడియారంలో ఒక గంట అంటే 48 నిమిషాలు. ఈ గడియారం వేద సమయంతో పాటు వివిధ ముహూర్తాలను కూడా చూపిస్తుంది. ఉజ్జయినిలో క్రేన్ సాయంతో దాదాపు 80 అడుగుల ఎత్తులో వాచ్ టవర్ పై దీనిని అమర్చారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ మార్చి ఒకటిన ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ వాచ్ కానుంది. ఇది భారతీయ ప్రామాణిక సమయం (ఐఎస్టీ), గ్రీన్విచ్ మీన్ టైమ్ (జీఎంటీ) మాత్రమే కాకుండా పంచాంగంతో పాటు ముహూర్తాల గురించిన సమాచారాన్ని అందిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయాలే కాకుండా సూర్య , చంద్ర గ్రహణాల గురించి కూడా తెలియజేస్తుంది. కాగా వేద క్లాక్ రీడింగ్ కోసం మొబైల్ యాప్ రూపొందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని స్మార్ట్ఫోన్, కంప్యూటర్, టెలివిజన్ తదితర పరికరాలలో వినియోగించే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ వేద గడియారాన్ని వ్యవస్థాపించేందుకు ఉజ్జయినిలోని జివాజీ అబ్జర్వేటరీ సమీపంలో 85 అడుగుల ఎత్తైన టవర్ను నిర్మించారు. -
ఆరోగ్య సూచీల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే గుర్తింపు దానంతట అదే వస్తుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా వైఎస్ జగన్ సర్కార్ నిలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా.. వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వం తొలినుంచీ ముందడుగు వేస్తోంది. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వంటి అనేక కార్యక్రమాల అమలు ద్వారా ప్రజారోగ్యానికి భరోసాగా నిలుస్తోంది. నీతిఆయోగ్ విడుదల చేస్తు న్న ఆరోగ్య సూచీల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంటోంది. రక్తహీనత నివారణ చర్యల్లో భేష్ రక్తహీనత నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీని నివారణకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్న ఏపీకి జాతీయ స్థాయిలో మొదటి అవార్డు లభించింది. అంగన్వాడీలు, పాఠశాలల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోష ణ ప్లస్, జగనన్న గోరుముద్ద కార్యక్రమాల కింద ప్రభుత్వం పోషకాహారం పంపిణీ చేస్తోంది. స్కూల్ హెల్త్ యాప్తో విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ చేపడుతోంది. డిజిటల్ వైద్య సేవల్లో ఫస్ట్ ప్రజలకు డిజిటల్ వైద్యసేవల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ నిలుస్తోంది. పౌరులకు డిజిటల్ హెల్త్ అకౌంట్లు సృష్టించి, అందులో వారి ఆరోగ్య వివరాలను అప్లోడ్ చేయడం, భవిష్యత్లో వారు పొందే వైద్య వివరాలను డిజిటలైజ్ చేస్తున్నారు. మొత్తం జనాభాలో అత్యధికులకు హెల్త్ అకౌంట్లు సృష్టించడంతోపాటు ఆస్పత్రుల్లోనూ డిజిటల్ వై ద్యసేవల కల్పనలో ఏపీకి ఇప్పటికే జాతీయస్థాయిలో అనేక మొదటి బహుమతులు లభించాయి. డిజిటల్ వైద్య సేవల కల్పనలో ఇతర రాష్ట్రాలు సై తం ఏపీ విధానాలను అవలంభించాలని అన్ని రా ష్ట్రాలకు నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో లేఖ రాశారు.రాష్ట్రంలోని పౌరులకు టెలీ మెడిసిన్ సేవల కల్పనలో దేశంలో ఏపీ తొలి స్థానంలో నిలుస్తోంది. 2019 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 20.41 కోట్లకు పైగా టెలీకన్సల్టేషన్లు నమోదు కాగా.. ఇందులో 25 శాతానికిపైగా టెలీకన్సల్టేషన్లు కేవలం ఏపీ నుంచే ఉంటున్నాయి. ఆరోగ్య ధీమా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా మధ్యతరగతి, పేద కు టుంబాల ఆరోగ్యానికి సీఎం జగన్ ప్రభు త్వం అండగా నిలుస్తోంది. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఈ పథకం పరిధిలోకి తెచ్చింది. దీంతో ఏపీలోని 95 శాతం కుటుంబా లకు ఆరోగ్య బీమా లభిస్తోంది. అత్యధిక జనా భాకు పూర్తి ఆరోగ్య బీమా కలి్పస్తున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని నీతిఆయోగ్ ప్రశంసించింది. 2019 నుంచి ఇప్పటివరకు వైద్యరంగం బలోపేతానికి తీసుకున్న చర్యలివీ ► వైద్య శాఖలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలకు అప్పుడే యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తున్న ప్రభుత్వం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు ► రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల బలోపేతం ►గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు. 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు ►దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు ► టీడీపీ హయాంలో నిర్విర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్య 1,059 నుంచి 3,257కు పెంపు. వైద్య ఖర్చుల పరిమితి రూ.25 లక్షలకు పెంపు ►108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం. -
విద్యార్థుల చేరికల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి : విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 2021 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి (పిల్లలు చేరికలు)లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండడమే ఇందుకు నిదర్శనం. ఈ విషయాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2017తో పోలిస్తే 2021లో దేశంలోని స్థూల నమోదు నిష్పత్తి పెరిగిన టాప్– రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని ఆ నివేదిక తెలిపింది. అలాగే, 2021లో జాతీయ స్థూల నమోదును మించి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక స్థూల నమోదు ఉందని కూడా పేర్కొంది. 2017తో పోలిస్తే.. 2021లో రాష్ట్రంలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఎలిమెంటరీ స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి భారీగా పెరిగిందని కూడా నివేదిక తెలిపింది. ‘అమ్మఒడి’ ప్రోత్సాహంతోనే.. అలాగే, స్థూల నమోదు నిష్పత్తిలో టాప్ నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తరువాత ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఉండగా.. స్థూల నమోదు 2017తో పోలిస్తే 2021లో తగ్గిన నాలుగు రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్, బీహార్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2017తో పోలిస్తే 2021లో ప్రైమరీలో 18.4 శాతం, అప్పర్ ప్రైమరీలో 13.4 శాతం, ఎలిమెంటరీలో 16.5 శాతం స్థూల నమోదు పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం బడి ఈడు పిల్లలందరూ బడుల్లోనే ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. అన్ని వర్గాల్లోని పేదల తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులు భారం కాకూడదనే దూరదృష్టితో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకం అమలుచేస్తోంది. ఈ పథకం అమలు ద్వారా పేద వర్గాల పిల్లలందరూ స్కూళ్లలో చేరేలా ప్రోత్సాహం అందిస్తోంది. నిజానికి.. పేదలు పిల్లలను బడికి పంపకుండా పనికి పంపిస్తే తమకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలుస్తారనే ఆలోచనలో వారుండే వారు. అయితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న అమ్మఒడి ద్వారా పిల్లలను స్కూళ్లకు పంపితే ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో అన్ని వర్గాల్లోని పేదలు తమ పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారు. స్థూల నమోదు వృద్ధికి దోహదపడిన సంస్కరణలు.. ► మనబడి నాడు–నేడు ద్వారా తొలిదశలో.. 15 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. ► రెండో దశలో మరో 22,221 స్కూళ్ల రూపురేఖలను మార్చే పనులు చేపట్టారు. ► దీంతోపాటు.. పిల్లలు మధ్యలో చదువు మానేయకుండా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. పిల్లలు ఎవరైనా స్కూళ్లకు వెళ్లకపోతే వలంటీర్లు ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి కారణాలు తెలుసుకుని తిరిగి స్కూళ్లకు వచ్చేలా ప్రభుత్వం చర్యలను తీసుకుంది. ► అంతేకాక.. స్కూళ్లకు వచ్చే పిల్లలకు జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది. ► పేద పిల్లల చదువులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు యూనిఫాం, బూట్లు తల్లిదండ్రులపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే జగనన్న విద్యా కానుక ద్వారా ఉచితంగా కిట్ను అందిస్తోంది. ► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను కూడా అమలుచేస్తోంది. ► పిల్లలకు ట్యాబులను కూడా అందిస్తోంది. ఈ చర్యలన్నీ కూడా పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి పెరగడానికి దోహదం చేశాయి. -
భారత్లో తొలి క్రిస్మస్ కేక్ ఎక్కడ తయారయ్యిందో తెలుసా!
కేక్ అనేది మన సంప్రదాయ వంటకం కాదు. బ్రిటీష్ వాట్ల నుంచి వచ్చిందే. అయితే మన దేశంలో మొట్టమొదటి క్రిస్మస్ కేక్ ఎక్కడ తయారయ్యింది? ఎవరు తయారు చేశారో వింటే ఆశ్చర్యపోతారు. పైగా ఆ కాలంలో కేక్ తయారీకి కావల్సిన పదార్థాలు కూడా అందుబాటులో కూడా ఉండేవి కాదు. అయితే కేరళకు చెందిన ఒక వ్యక్తి బ్రిటీష్ వాళ్లు మెచ్చుకునేలా తయారుచేశాడు. ఇప్పుడు అతని షాపే ఫ్లమ్ కేక్ తయారీలో నెంబర్ వన్గా లాభాలు ఆర్జిస్తోంది కూడా. 1883లో క్రిస్మస్ సందర్భంగా బర్మా నుంచి వచ్చిన ఔత్సాహిక స్థానిక వ్యాపారవేత్త మాంబల్లి బాపు భారతదేశంలో తొలి క్రిస్మస్ కేక్ని తయారు చేశారు. దాల్చిన చెక్క తోటను అభివృద్ధి చేస్తున్న బ్రిటీష్ వ్యవసాయాధికారి మర్డోక్ బ్రౌన్ సూచనలతో తయారు చేసినట్లు బాపు మనవడు చెబుతున్నాడు. తన ముత్తాత మాంపల్లి బాపు బర్మాలో వ్యాపారావేత్త. అతను ఈజిప్టులో బ్రిటీష్ దళాలకు పాలు, టీ, రొట్టే వంటివి రవాణ చేసేవాడని, ఆ తర్వాత 1880లో కేరళలలోని తన సొంతూరు తలస్సేరికి వచ్చిన వెంటనే బేకరీని స్థాపించాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే దూరంగా ఉన్న కోలకతాలో ఉన్న ఒకేఒక్క బేకరీ మాత్రమే బ్రిటీష్ ప్రజల అవసరాలను తీర్చేది. ఆ లోటుని బాపు బిస్కట్స్ ఫ్యాక్టరీ తీర్చింది. కాబట్టి బాపు రాయల్ బిస్కట్స్ ఫ్యాక్టరీ భారతీయులచే స్థాపించబడిన తొలి బేకరిగా మారింది. బర్మాలో ఉండగా బాపు తొలుత బిస్కెట్ తయారీలో మంచి శిక్షణ పొందాడు. ఆ బ్రిటీష్ రైతు మర్డోక్ బ్రౌన్ ఇంగ్లండ్ నుంచి తెచ్చిన రిచ్ ప్లం కేక్తో బాపు బిస్కెట్ ఫ్యాక్టరీకి వెళ్లాడు. కేక్ ముక్కను రుచి చూడమని బాపుని కోరాడు. అంతేగాక ఇదే మాదిరిగా కేక్ని తయారీ చేయాలని చెప్పాడు కడా. ఈ తయారీనే తనకు భారతదేశ పాకశాస్త్ర చరిత్రలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరస్తుందని ఊహించని బాపు అందుకు ఒప్పుకున్నాడు. మర్డోకో ఆ కేక్ తయారీకి కావాల్సిన బ్రౌన్ కోకో, ఖర్జూరం, ఎండుద్రాక్ష, వివిధ డ్రై ఫ్రూట్స్ని అందించాడు. అలాగే పక్కనే ఉన్న పుదుచ్చేరి నుంచి బ్రాందీని కూడా కొనుగోలు చేసి తయారు చేయమని చెప్పాడు మర్డోక్. ఆ రోజుల్లో కిణ్వన ప్రక్రియ కోసం అందుబాటులో ఈస్ట్ లేదు. అందుకని 14 కిలోమీటర్లు ప్రయాణించి మాహేకి వెళ్లి బ్రాందీని కొనుక్కోవాల్సి వచ్చేది. దీంతో వ్యయభారాన్ని తగ్గించుకునేందుకు బాపు జీడిపప్పు, యాపిల్, అరటి రకమైన కడలిపాజమ్ని ఉపయోగించి స్థానికంగా తయారుచేసిన మద్యంతో ఆ సమస్యను భర్తీ చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అలా కేక్ తయారీకి స్థానికంగా తయారైన మద్యంతోనే తయారు చేయడం మొదలు పెట్టాడు బాపు. అయితే బాపు చేసిన కేక్ని రుచి చూసిన మర్డోకో బ్రౌన్ వావ్! ఇదే ది బెస్ట్ కేక్ అని కితాబి ఇచ్చి మరీ డజనులు కొద్దీ కేకులను కొనుక్కుని మరీ వెళ్లాడు. ఇప్పుడూ ఆ షాపే భారతదేశంలో అతిపెద్ద ప్లం కేక్ మార్కెట్ని కలిగి ఉంది. ఈ వ్యాపారంలో మాంపల్లి కుటుంబానికి ప్రధాన వాటా కూడా ఉందని బాపు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతడి కుటుంబ సభ్యులంతా కేరళలో అగ్రశ్రేణి బేకరీలను నిర్వహిస్తున్నారు. వారంతా కేరళలో.. కొచ్చిలోని కొచ్చిన్ బేకరీ, తిరువనంతపురంలోని శాంత బేకరీ, కోజికోడ్లోని మోడరన్ బేకరీ, కొట్టాయంలోని బెస్ట్ బేకింగ్ కో. తలస్సేరిలోని మాంబల్లి బేకరీలతో బాపు వారసత్వాన్ని కొనసాగించడం విశేషం. అంతేగాదు ప్రతీ బేకరీలో బాపు బ్రౌన్కేక్ను అందచేసిన పేయింటింగులతో కస్టమర్లను స్వాగతిస్తూ చారిత్రక ఘట్టాన్ని తెలియజేస్తున్నారు. (చదవండి: జీసస్ రియల్ లుక్ ఎలా ఉండేదంటే..? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
మాటిచ్చిన రేవంత్రెడ్డి, ఇప్పుడు సీఎంగా..
తెలంగాణలో తొలి ఉద్యోగం నాకే రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. గాంధీ భవన్ వెళ్లినప్పుడు ఆయన నాకు ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ ఆయన నెరవేరుస్తుండడం హ్యాపీగా ఉంది.. :::రజిని అధికారంలోకి గనుక వస్తే.. అంటూ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సర్కార్ ఏర్పాటు అవుతున్న తరుణంలో వాటిని నెరవేర్చేందుకు సిద్ధమైపోయింది. రేపు డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో రేవంత్ ప్రమాణం ముఖ్యమంత్రిగా చేయనున్నారు. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీ హామీలు నెరవేర్చడంపైనా ఆయన స్పష్టమైన ఒక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. తొలి ఉద్యోగం కూడా ఎవరికి ఇవ్వాలనే దానిపై ఓ క్లారిటీతో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పాలనలో తొలి ఉద్యోగం రజినీ అనే యువతికి దక్కనుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని అధికార యంత్రాంగాన్ని రేవంత్రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. తొలి ఉద్యోగం రజినీకి ఇస్తాం అని స్వయంగా ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడా గ్యారెంటీని నెరవేర్చేందుకు రెడీ అయిపోయారు. అక్టోబర్ 17వ తేదీన.. నాంపల్లికి చెందిన రజిని అనే ఓ దివ్యాంగురాలు గాంధీభవన్కు వెళ్లి రేవంత్రెడ్డిని కలిశారు. రజిని రెండేళ్ల క్రితం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం వెతుకుతోంది. పీజీ చేసిన తనకు ఇటు ప్రభుత్వంలోనూ అటు ప్రైవేటులోనూ ఉద్యోగం రావట్లేదని తన బాధను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చెప్పింది. అప్పుడు రేవంత్ రెడ్డి .. ‘‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి ఉద్యోగం నీకే ఇస్తాం. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకార సభ ఉంటుంది. ఆ సభకు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ వస్తారు. ఆ సభలోనే మొదటి ఉద్యోగం నీకేనమ్మా. ఇది నా గ్యారెంటీ’’ అంటూ రేవంత్ ఆమెకు హామీ ఇచ్చారు. అంతేకాదు.. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు మీద స్వయంగా ఆయన రజినీ పేరు రాసి.. కింద సంతకం కూడా చేశారు. As PCC President of Telangana , promised first job to Rajini, a physically challenged girl from Nampally as soon as #Congress comes to power. I filled the Congress guarantee card with Rajini's name. Rajini, who completed post graduation expressed her grief that she is not… pic.twitter.com/JFSha8a56M — Revanth Reddy (@revanth_anumula) October 17, 2023 నెలన్నర తర్వాత.. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో తొలి ఉద్యోగం రజినికే దక్కబోతోంది. కానీ, ప్రమాణ స్వీకారమే రెండు రోజులు ముందుగానే జరుగుతోంది. -
రిస్క్ చేయాలేగానీ..మా తర్వాతే ఎవరైనా..!
సక్సెస్కి మారుపేరుగా నిలవాలంటే జెండర్తో పని ఏముంది. పట్టుదల ఉండాలి...దానికి తగ్గ కృషి, వీటన్నింటికీ మించిన సంకల్పం ముఖ్యం. దీనికి ఆత్మ విశ్వాసాన్ని, కఠోర శ్రమను జోడించి సక్సెస్తో సలాం చేయించుకుంటూ ఈ విషయంలో మేమేం తక్కువ కాదంటోంది మహిళా శక్తి. వివక్షల్నీ, అడ్డంకుల్నీ అధిగమించి వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళా శక్తికి, సాధికారతకు, నిదర్శనంగా నిలిచారు ముగ్గురు ధీర వనితలు. దేశం గర్వించేలా భారత నారీశక్తిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. అక్షతా కృష్ణమూర్తి అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)తో కలిసి మార్స్ రోవర్ను నిర్వహించే తొలి మహిళగా చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ డా. అక్షతా కృష్ణమూర్తి. పెద్ద పెద్ద కలలు కనడం పిచ్చితనమేమీ కాదు.. మిమ్మల్ని మీరు నమ్ముకోండి.. ఆశయ సాధనలో అలుపెరుగక పనిచేస్తూ పొండి... విజయం మీదే, నాదీ గ్యారంటీ అంటారామె. అంగారక గ్రహంపై రోవర్ను ఆపరేట్ చేయనున్న తొలి భారతీయ మహిళగా అవతరించిన తన సక్సెస్ జర్నీని ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. 13 ఏళ్ల క్రితమే నాసాలో పని చేయాలనేది ఆమె కల. భూమి ,అంగారక గ్రహంపై సైన్స్ అండ్ రోబోటిక్ ఆపరేషన్స్కు నాయకత్వం వహించాలనేది చిరకాల డ్రీమ్. అలా అమెరికా ప్రయాణం ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో లక్ష్యాన్ని సాధించేంతవరకు ఎవరేమన్నా పట్టించుకోలేదు. View this post on Instagram A post shared by Dr. Akshata Krishnamurthy | Rocket Scientist (@astro.akshata) కానీ ఇది అంత సులువుగా ఏమీ జరగలేదు. పీహెచ్డీ డిగ్రీనుంచి నాసాలో ఫుల్ టైం ఉద్యోగం వచ్చేదాకా ఎంతో కష్టపడ్డాను అని చెప్పారు. ఈ రోజు, అంగారక గ్రహంనుంచి అనేక శాంపిల్స్ను భూమికి తీసుకురావడానికి రోవర్తో సహా పలు కూల్ స్పేస్ మిషన్లలో పని చేస్తున్నాను అని పేర్కొన్నారు. అక్షత MIT (మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుండి పీహెచ్డీ ఏశారు. నాసాలో చేరిన అతికొద్ది మంది భారతీయుల్లో ఆమె కూడా ఒకరు. నాసాలో ప్రధాన పరిశోధకురాలిగా గత ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. మహిళా ఆర్మీ డాక్టర్ కెప్టెన్ గీతిక కౌల్ సియాచిన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్లోని భారత సైన్యానికి చెందిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. స్నో లెపార్డ్ దళానికి చెందిన కెప్టెన్ గీతికా కౌల్ చరిత్ర సృష్టించారు. హిమాలయాల ఉత్తర భాగంలో ఉన్న సియాచిన్ బాటిల్ స్కూల్లో కఠినమైన ఇండక్షన్ శిక్షణను సక్సెస్ఫుల్గా ప పూర్తి చేసి మరీ ఈ కీలకమైన మైలురాయిని సాధించారు. అనేక అడ్డంకులను ఛేదించి అంకితభావంతో, దేశానికి సేవ చేయడం స్ఫూర్తిదాయకం. స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాధి తొలి మహిళగా రికార్డు క్రియేట్ చేసిన మరో మహిళా శక్తి స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాధి. మిజోరాంలో గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి కీలక పదవిలో పాధిని ఎంపిక చేశారు. 2015 బ్యాచ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అయిన Sqn లీడర్ మనీషా పాధిని భారత సాయుధ దళాల నుండి భారతదేశపు తొలి మహిళా సహాయకురాలుగా (ఎయిడ్-డే-క్యాంప్) నియమించారు.అధికారికంగా ఆమె బాధ్యతలను కూడా స్వీకరించారు. Sqn లీడర్ మనీషా పాధి మూడు కీలక పదవులను కూడా నిర్వహించారు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్, బీదర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, పూణే, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, భటిండాలో పనిచేశారు. ఒడిశాలోని బెర్హంపూర్కు చెందిన మనీషా తండ్రి ఇన్స్పిరేషన్. ఆమె భర్త మేజర్ దీపక్ సింగ్ కర్కీ ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్నారు. భువనేశ్వర్లోని CV రామన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ చేసిన మనీషా 2015లో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించి ఏఐఎఫ్లో చేరారు. Squadron Leader Manisha Padhi appointed as Aide-De-Camp(ADC) to the Governor of Mizoram. Sqn Leader Manisha is India’s first Woman Indian Armed Forces officer to be appointed as Aide-De-Camp(ADC) to the Governor in the country: Governor of Mizoram (Source: Office of Governor of… pic.twitter.com/3wsWuI5hBW — ANI (@ANI) December 4, 2023 ఏడీసీ అంటే? గవర్నర్కు వ్యక్తిగత సహాయకురాలిగా అధికారిక పర్యటనలలో కూడా రాజ్యాంగ అధికారంతో వెంట ఉంటారు. ప్రతి గవర్నర్కు ఇద్దరు ADCలు ఉంటారు, ఒకరు సాయుధ దళాల నుండి , మరొకరు పోలీసు అధికారి. మిజోరంలో,రెండో ఏడీసీ రాష్ట్ర పోలీసు అధికారిగా జోనున్ తారా ఉన్నారు. -
కాలేయ మార్పిడితో బతికిన బాలుడు.. డాక్టర్ అయ్యాడు!
Indias 1st Child Liver Transplantee: పాతికేళ్ల క్రితం కాలేయ మార్పిడితో పునర్జన్మ పొందిన బాలుడు ఇప్పుడు అదే వైద్యరంగంలో డాక్టర్ అయ్యాడు. అవయవ మార్పిడి అద్భుత విజయానికి సజీవ సాక్ష్యంగా నిలిచాడు. భారతదేశపు మొట్టమొదటి విజయవంతమైన పీడియాట్రిక్ కాలేయ మార్పిడి గ్రహీత అయిన తమిళనాడుకు చెందిన సంజయ్ కందసామి వైద్య విద్యను అభ్యసించి డాక్టరుగా సొంతూరు కాంచీపురంలో విజయవంతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ 1998లో 20 నెలల చిన్నారిగా ఉన్నప్పుడు కందసామికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడిని నిర్వహించింది. తద్వారా దేశంలోనే మొట్టమొదటి పీడియాట్రిక్ లివర్ ట్రాన్స్ప్లాంటీగా కందసామి నిలిచాడు. ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేస్తున్న కృషిని దగ్గర నుంచి చూసి తాను కూడా వైద్యుడు కావాలనుకున్నానని కందసామి మీడియా ప్రకటనలో తెలిపారు. డాక్టరుగా తాను కూడా రోగుల ప్రాణాలు కాపాడటంలో భాగం కావాలని, జీవితంలో ఎటువంటి సవాలునైనా అధిగమించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలవాలని భావించినట్లు పేర్కొన్నారు. దేశంలో మొదటి బాలుడు తమిళనాడులోని కాంచీపురానికి చెందిన కందసామి బైలరీ అట్రేసియా అనే కాలేయ రుగ్మతతో జన్మించాడు. ఇది లివర్ ఫెయిల్యూర్కి దారితీయడంతో కాలేయ మార్పిడి చేయాల్సిన అవసరం వచ్చింది. దీంతో కందసామి తండ్రి కాలేయాన్ని ఇచ్చేందుకు ముందుకువచ్చారు. ఆ తర్వాత న్యూ ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్లో నిపుణుల బృందం మార్పిడిని విజయవంతంగా నిర్వహించింది. దేశంలో లివర్ ప్లాంటేషన్ చేయించుకున్న మొట్టమొదటి బాలుడు కందసామే. లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయించుకున్నవారు దీర్ఘకాలం సాఫీగా జీవించవచ్చు అనేదానికి కందసామి ఒక అద్భుతమైన ఉదాహరణని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్లో గ్రూప్ మెడికల్ డైరెక్టర్, సీనియర్ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ అనుపమ్ సిబల్ అన్నారు. కందసామి కాలేయ మార్పిడి ఆపరేషన్ తన కెరీర్లో గర్వించదగిన క్షణాలలో ఒకటిగా పేర్కొన్నారు మరో డాక్టర్, మేదాంత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ ఏఎస్ సోయిన్. కందసామి విజయవంతమైన ఆపరేషన్ తర్వాత అపోలో ఆసుపత్రి వైద్యులు ఇప్పటి వరకు 4,300 కాలేయ మార్పిడి ఆరరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. ఇందులో 515 మంది పిల్లలు ఉండటం గమనార్హం. -
అన్నేసి గంటలేంటి? ‘సిల్లీ’కాకపోతే: ప్రముఖ కంపెనీ అధినేత్రి కౌంటర్!
ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి (Infosys founder NR Narayana Murthy) ‘వారానికి 70 గంటల పని’ వ్యాఖ్యల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. అసలే పని ఒత్తిడితో సతమతమవుతూ కుటుంబ జీవితాన్ని ఆస్వాదించలేకపోతుంటే మళ్లీ అధిక పని గంటల సలహాలేంటని చాలా మంది ఉద్యోగులు కస్సుమంటున్నారు. ఇక వ్యాపారాధినేతలు, కంపెనీల ప్రముఖలలో కొందరు ఈ సలహాను సమర్థిస్తుంటే మరికొంత మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అలా నారాయణమూర్తి ‘70 గంటల పని’ భావనను వ్యతిరేకిస్తున్నవారిలో తాజాగా మరో ప్రముఖురాలు చేరారు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (PMS) కంపెనీ ఫస్ట్గ్లోబల్గ్రూప్ ఫౌండర్, చైర్పర్సన్, ఎండీ దేవినా మెహ్రా (Devina Mehra) ‘వారానికి 70 గంటల పని’ భావనను తప్పుపట్టారు. సుదీర్ఘ పని గంటల వల్ల ఉత్పాదకత పెరుగుతుందని ఆమె విశ్వసించడం లేదు. అంతేకాదు ఈ సలహాలను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు కూడా. అది వెర్రితనం ‘వాస్తవంగా చెప్పాలంటే ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఉత్పాదకత తగ్గుతుంది. ఇది ప్రపంచమంతటికీ బాగా తెలుసు. కాబట్టి వారానికి 70 గంటలు పని చేయాలని చెప్పడం వెర్రితనం అవుతుంది. నా ఉద్దేశంలో ఈ భావన పనికిరాదు’ అని చెప్పారు దేవినా మెహ్రా. వారానికి 70 గంటలు పనికే కేటాయిస్తే వాళ్లు ఇతర బాధ్యతలను ఏం నిర్వర్తించగలరని ఆమె పశ్నించారు. వర్క్ఫోర్స్లో చాలా మంది మహిళలకు వర్క్తోపాటు ఇతర బాధ్యతలూ ఉంటాయని, సుదీర్ఘ పని గంటల వాతావరణంలో అలాంటి మహిళలు పని చేయలేరని మెహ్రా వివరించారు. యువత ఆఫీస్లో అత్యధిక సమయాన్ని వెచ్చించాల్సిన పనిలేదని, అయితే నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఒక యజమానిగా తాను అవుట్పుట్పై దృష్టి పెడతాను కానీ, పని గంటల సంఖ్యపై కాదని ఆమె స్పష్టం చేశారు. -
‘సరి- బేసి’ విధానం తొలుత ఏ దేశంలో మొదలయ్యింది?
కాలుష్యం కాటుకు ఢిల్లీ-ఎన్సిఆర్ జనం అతలాకుతలం అవుతున్నారు. గత కొద్దిరోజులుగా కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దేశ రాజధానిలో హెల్త్ ఎమర్జెన్సీ స్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరోసారి సరి-బేసి ఫార్ములాను అమలు చేస్తోంది. దీపావళి అనంతరం ఢిల్లీలో సరి-బేసి ఫార్ములా అమలుకానుంది. అయితే ఈ విధమైన ఫార్ములా తొలిసారిగా ఎక్కడ అమలయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో కాలుష్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం 2016లో బేసి-సరి ఫార్ములాను అమలు చేసింది. ఆ సమయంలో ఈ విధానం అందరికీ కొత్తగా అనిపించింది. చాలామందికి దీని గురించి అర్థం కాలేదు. ఈ ఫార్ములా ప్రకారం చివర బేసి సంఖ్య (3,5,7,9) ఉన్న వాహనాలు మాత్రమే బేసి సంఖ్యగల తేదీలలో నడుస్తాయి. సరి సంఖ్య గల వాహనాలు (2,4,6,8) రోడ్లపైకి రావడానికి సరిసంఖ్య గల తేదీలలోనే అనుమతి ఉంటుంది. 2016లో ఢిల్లీలో అమలు చేసిన ఈ ఫార్ములాను తొలిసారిగా మెక్సికోలో ప్రవేశపెట్టారు. దీనికి ‘హోయ్ నో సర్కులా’ అనే పేరు పెట్టారు. దీని అర్థం ‘మీ కారు ఈరోజు నడవదు’. అనంతర కాలంలో ప్రపంచంలోని అనేక దేశాలలో ఇటువంటి విధానాలను అమలు చేశారు. బీజింగ్, బ్రెజిల్, కొలంబియా, పారిస్ తదితర ప్రాంతాల్లో సరి-బేసి విధానానికి సంబంధించిన నిబంధనలు అమలయ్యాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుండి జనవరి వరకు ఢిల్లీలో కాలుష్య సమస్య తీవ్రంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఇది కూడా చదవండి: దీర్ఘాయుష్షు అంటే ఎంత? -
యూట్యూబ్లో మొదటి వీడియో ఏది? ఎంతమంది చూశారు?
ఈ రోజుల్లో యూట్యూబ్ అనేది వినోద ప్రపంచపు రారాజు. ఒకవైపు యూట్యూబ్ ద్వారా కోట్లాది మంది వినోదం పొందుతుండగా, మరోవైపు లక్షలాది మంది ఈ ప్లాట్ఫారమ్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. నేటి రోజుల్లో యూట్యూబర్గా మారడం అనేది ఉద్యోగం కంటే ఉత్తమమైన ఆదాయం అందుకోగల వృత్తి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే యూట్యూబ్ ఎప్పుడు ప్రారంభమయ్యింది? దానిలో పోస్ట్ చేసిన మొదటి వీడియో ఏది? అనే ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. యూట్యూబ్ని 2005లో స్టీవ్ చెన్, చాడ్ హర్లీ, జావేద్ కరీం ప్రారంభించారు. అయితే ఆ తర్వాత వీరు దీనిని 165 కోట్ల డాలర్లకు గూగుల్కు విక్రయించారు. ఈ రోజు ఈ యాప్కున్న క్రేజ్ ఎంతంటే ప్రతి నెలా 200 బిలియన్లకు(ఒక బిలియన్ అంటే వంద కోట్లు) పైగా వినియోగదారులు దీనిని సందర్శిస్తున్నారు. యూట్యూబ్లో మొదటి వీడియో 2005 సంవత్సరంలో ఏప్రిల్ 24న రాత్రి 8:27 గంటలకు అప్లోడ్ చేశారు. ఈ వీడియోను యూట్యూబ్ సహ వ్యవస్థాపకుడు జావేద్ కరీం అప్లోడ్ చేశారు. ఈ వీడియో టైటిల్ ‘మీ ఎట్ ది జూ’. ఈ 19 సెకన్ల వీడియోలో జావేద్ ఏనుగుల గురించి మాట్లాడుతూ ‘ఇప్పుడు మనం ఏనుగుల ముందున్నాం. ఏనుగులకు పొడవాటి తొండం ఉంటుంది’ అని అన్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 291 మిలియన్లకు (ఒక మిలియన్ అంటే పది లక్షలు) పైగా వీక్షణలు దక్కాయి. అదే సమయంలో 4.09 మిలియన్ల మంది ఈ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఈ వీడియోను 14 మిలియన్ల మంది లైక్ చేశారు. అయితే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఛానెల్లో ఈ వీడియో తప్ప మరో వీడియో అందుబాటులో లేదు. ఇది కూడా చదవండి: గోల్ఫ్ కోర్సుల రంధ్రాల మూసివేత ఎందుకు? -
దేశంలోని తొలి సినిమాహాలు ఏది? ఏ సినిమాలు ఆడేవి?
‘ఈమధ్య మీరు ఏ సినిమా చూశారు?’ ఈ ప్రశ్నకు ప్రతి ఒక్కరి దగ్గరా సమాధానం ఉంటుంది. ఇందులో తేడా ఏమిటంటే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతారు. మరికొందరు తమ జ్ఞాపకాలను రిఫ్రెష్ చేసుకోవడానికి పాత సినిమాల గురించి ప్రస్తావిస్తారు. మొత్తం మీద దీనికి మంచి సమాధానమే దొరుకుతుంది. అయితే ఇదే సమయంలో దేశంలోనే మొదటి సినిమా థియేటర్ గురించిన వివరాలు తెలిస్తే ఎవరైనా కాసేపు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం భారతదేశంలోని మొట్టమొదటి సినిమా థియేటర్ గురించి తెలుసుకోబోతున్నాం. భారతదేశంలో నిర్మితమైన మొదటి సినిమా థియేటర్ చాప్లిన్ సినిమా. దీనిని ఎల్ఫిన్స్టోన్ పిక్చర్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ‘చాప్లిన్ సినిమా’ను 1907లో జమ్షెడ్జీ రామ్జీ మదన్ నిర్మించారు. ఆయన మదన్ థియేటర్స్ పేరుతో భారతదేశంలో మొదటి థియేటర్ చైన్ స్థాపించారు. ‘చాప్లిన్ సినిమా’.. 5/1, చౌరింగ్గీ ప్లేస్, కోల్కతా చిరునామాలో ఉండేది. జమ్షెడ్జీ రామ్జీ మదన్ను భారతదేశంలో చిత్ర నిర్మాణ పితామహునిగా పిలుస్తారు. మదన్ ఎల్ఫిన్స్టోన్ డ్రామా క్లబ్లో అసిస్టెంట్ బాయ్గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఈ క్లబ్ ఎంతో విజయవంతమైంది. ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు సాగించింది. జమ్షెడ్జీ కలకత్తాలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ప్రసిద్ధ నాటక థియేటర్ అయిన కొరింథియన్ హాల్ను కొనుగోలు చేశారు. 1902లో మైదాన్ చుట్టూ బయోస్కోప్ షోలను ఏర్పాటు చేశారు. చివరికి అతని ఆసక్తి సినిమా ప్రదర్శన వైపు మళ్లింది. 1907లో ఎల్ఫిన్స్టోన్ పిక్చర్ ప్యాలెస్ను ప్రారంభించారు. ఈ ప్యాలెస్కు తరువాతి కాలంలో మినర్వా అనే పేరు పెట్టారు ఇది హాలీవుడ్ చిత్రాలను ప్రదర్శించే ప్రసిద్ధ థియేటర్గా మారింది. థియేటర్ లాభాలను కాపాడుకునే ప్రయత్నంలో దీనిని చార్లీ చాప్లిన్ పేరు మీద ‘చాప్లిన్ సినిమా’ అనే పేరు పెట్టారు. అయితే ఈ థియేటర్ను పలు కారణాలతో 2003లో కూల్చివేశారు. ఇది కూడా చదవండి: ఫ్రాన్స్లో నల్లుల నకరాలు.. జనం పరేషాన్! -
పసిడి పారుల్ అన్ను బంగారం
చైనా గడ్డపై భారత మహిళా అథ్లెట్లు పారుల్ చౌధరీ, అన్ను రాణి అద్భుతం చేశారు. ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారి భారత్కు 5000 మీటర్ల విభాగంలో పారుల్... జావెలిన్ త్రోలో అన్ను రాణి పసిడి పతకాలు అందించారు. ఈ ఇద్దరితోపాటు మహిళల 400 మీటర్ల హర్డిల్స్లో విత్యా రామ్రాజ్ కాంస్యం... పురుషుల ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రావెల్ కాంస్యం... పురుషుల 800 మీటర్ల విభాగంలో మొహమ్మద్ అఫ్జల్ రజతం... పది క్రీడాంశాల సమాహారమైన డెకాథ్లాన్లో తేజస్విన్ శంకర్ రజతం గెల్చుకున్నారు. అథ్లెటిక్స్ కాకుండా బాక్సింగ్లో రెండు కాంస్యాలు... కనోయింగ్లో ఒక కాంస్యం లభించాయి. ఓవరాల్గా ఆసియా క్రీడల పదో రోజు భారత్ ఖాతాలో తొమ్మిది పతకాలు చేరాయి. మరో ఐదు రోజులపాటు కొనసాగే ఈ క్రీడల్లో ప్రస్తుతం భారత్ 69 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆర్చరీలో మూడు పతకాలు... బాక్సింగ్లో మరో పతకం... క్రికెట్లో ఒక పతకం కూడా ఖరారయ్యాయి. ఫలితంగా ఆసియా క్రీడల చరిత్రలోనే భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడం లాంఛనం కానుంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 70 పతకాలు సాధించింది. హాంగ్జౌ: బరిలోకి దిగితే పతకం సాధించాలనే లక్ష్యంతో తమ ఈవెంట్లలో పోటీపడుతున్న భారత అథ్లెట్లు ఈ ఆసియా క్రీడల్లో మెరిపిస్తున్నారు. నిలకడగా రాణిస్తూ... తమపై పెట్టుకున్న అంచనాలకు మించి ప్రతిభ కనబరుస్తూ... 1951 తర్వాత ఈ క్రీడల చరిత్రలో పతకాలపరంగా తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశారు. పోటీల పదోరోజు భారత్కు తొమ్మిది పతకాలు రాగా... అందులో ఆరు అథ్లెటిక్స్ ఈవెంట్ల నుంచి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు ఇప్పటికే 22 పతకాలు (4 స్వర్ణాలు, 10 రజతాలు, 8 కాంస్యాలు) గెలిచారు. తద్వారా 2018లో 20 పతకాల ప్రదర్శనను సవరించారు. 1951లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన తొలి ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అత్యధికంగా 34 పతకాలు గెలిచారు. మంగళవారం భారత మహిళా అథ్లెట్లు పారుల్ చౌధరీ, అన్ను రాణి పసిడి కాంతులు విరజిమ్మారు. 5000 మీటర్ల రేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన పారుల్ విజేతగా అవతరించింది. ఆమె అందరికంటే వేగంగా 15 నిమిషాల 14.75 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని గెలిచింది. తద్వారా ఈ క్రీడల చరిత్రలో 5000 మీటర్లలో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా పారుల్ గుర్తింపు పొందింది. తాజా క్రీడల్లో పారుల్కిది రెండో పతకం. ఆమె 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో రజతం గెలిచింది. గతంలో మహిళల 5000 మీటర్ల విభాగంలో భారత్ తరఫున సునీతా రాణి (1998–రజతం; 2002–కాంస్యం), ఓపీ జైషా (2006–కాంస్యం), ప్రీజా శ్రీధరన్ (2010–రజతం), కవితా రౌత్ (2010–కాంస్యం) పతకాలు నెగ్గారు. తాజా స్వర్ణ పతకంతో ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగంలో తనను డీఎస్పీగా నియమిస్తారని పారుల్ ఆశిస్తోంది. యూపీ ప్రభుత్వ క్రీడా పాలసీ ప్రకారం ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన వారికి డీఎస్పీ ఉద్యోగం ఇస్తారు. మూడో ప్రయత్నంలో... వరుసగా మూడోసారి ఆసియా క్రీడల్లో పోటీపడ్డ జావెలిన్ త్రోయర్ అన్ను రాణి తొలిసారి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 2014 ఇంచియోన్ ఏషియాడ్లో ఉత్తరప్రదేశ్కు చెందిన అన్ను రాణి కాంస్యం సాధించింది. 2018 జకార్తా క్రీడల్లో ఆరో స్థానంతో నిరాశపరిచింది. మూడో ప్రయత్నంలో 31 ఏళ్ల అన్ను రాణి ఏకంగా బంగారు పతకాన్ని మెడలో వేసుకుంది. 11 మంది పోటీపడ్డ ఫైనల్లో అన్ను రాణి జావెలిన్ను తన నాలుగో ప్రయత్నంలో గరిష్టంగా 62.92 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని ఖరారు చేసుకుంది. నదీషా దిల్హాన్ (శ్రీలంక; 61.57 మీటర్లు) రజతం, హుయ్హుయ్ లియు (చైనా; 61.29 మీటర్లు) కాంస్యం గెలిచారు. ‘ఏడాది మొత్తం ఎంతో ప్రయత్నించినా నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయా. ప్రభుత్వం నాపై ఎంతో డబ్బు వెచి్చంచి విదేశాల్లో శిక్షణకు పంపించింది. ఫలితాలు రాకపోవడంతో కాస్త నిరాశకు గురయ్యా. అయితే ఆసియా క్రీడల్లో ఈ సీజన్లోనే ఉత్తమ ప్రదర్శనతో స్వర్ణం సాధించడంతో చాలా ఆనందంగా ఉంది’ అని అన్ను రాణి వ్యాఖ్యానించింది. ఆసియా క్రీడల మహిళల జావెలిన్ త్రోలో గతంలో బార్బరా వెబ్స్టర్ (1951; కాంస్యం), ఎలిజబెత్ డావెన్పోర్ట్ (1958; రజతం... 1962; కాంస్యం), గుర్మిత్ కౌర్ (1998; కాంస్యం) పతకాలు గెలిచారు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్లో విత్యా రామ్రాజ్ కాంస్య పతకాన్ని సాధించింది. హీట్స్లో 55.42 సెకన్ల సమయం నమోదు చేసి పీటీ ఉష జాతీయ రికార్డును సమం చేసిన విత్యా ఫైనల్లో దానిని పునరావృతం చేయలేకపోయింది. తమిళనాడుకు చెందిన 25 ఏళ్ల విత్యా 55.68 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. పురుషుల 800 మీటర్ల విభాగంలో మొహమ్మద్ అఫ్జల్ రజత పతకం గెలిచాడు. తొలిసారి ఆసియా క్రీడల్లో పోటీపడ్డ ఈ కేరళ అథ్లెట్ ఒక నిమిషం 48.43 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచాడు. పురుషుల ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రావెల్ భారత్కు కాంస్య పతకాన్ని అందించాడు. తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల ప్రవీణ్ 16.68 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు. 49 ఏళ్ల తర్వాత... పది క్రీడాంశాల (100 మీటర్లు, లాంగ్జంప్, షాట్పుట్, హైజంప్, 400 మీటర్లు, 110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్లు) సమాహారమైన డెకాథ్లాన్లో 49 ఏళ్ల తర్వాత భారత్కు పతకం లభించింది. ఢిల్లీకి చెందిన తేజస్విన్ శంకర్ 7666 పాయింట్లతో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకాన్ని సాధించాడు. 2011 నుంచి భారతీందర్ సింగ్ (7658 పాయింట్లు) పేరిట ఉన్న డెకాథ్లాన్ జాతీయ రికార్డును తేజస్విన్ సవరించాడు. 1974 టెహ్రాన్ ఆసియా క్రీడల్లో విజయ్ సింగ్ చౌహాన్ స్వర్ణం, సురేశ్ బాబు కాంస్యం గెలిచాక ఈ క్రీడల్లో మళ్లీ భారత్కు పతకం అందించిన డెకాథ్లెట్గా తేజస్విన్ గుర్తింపు పొందాడు. -
Live Stock Expo : పశు సంపద రంగానికి తగినంత గుర్తింపు రావాలి
ఎల్డిఎఫ్ ఇండియా, పశువులు, పాడి పరిశ్రమ మరియు మత్స్య పర్యావరణ వ్యవస్థలన్నింటిని ఒకే పైకప్పు కిందకు తీసుకువచ్చే భారతదేశపు మొట్టమొదటి ఎక్స్పో గురువారం హైటెక్స్లో ప్రారంభమైంది. ఆదివారం వరకు మూడురోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోలో సుమారు 80 స్టాల్స్ హైలైట్గా నిలవనున్నాయి. ఈ కార్యక్రమాన్ని హైటెక్స్, ఆక్వా ఫార్మింగ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ (AFTS) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. డాక్టర్ తరుణ్ శ్రీధర్, మాజీ యూనియన్ సెక్రటరీలతో పాటు పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ వేడుకలో పాల్గిన్నారు. ఈ సందర్భంగా డా. తరుణ్ శ్రీధర్ మాట్లాడుతూ.. పశుసంపద సరైన గుర్తింపుకు నోచుకోలేదని, భారత్లో ఇప్పటికే చాలామంది గ్రామాల్లోనే నివసిస్తున్నారని తెలిపారు. అసలు పశువులతో సంబంధం లేకుండా ఏ రైతును చూడలేరన్నారు. భారతదేశం గణనీయమైన పశువుల జనాభాను కలిగి ఉందని, ప్రపంచ చేపల ఉత్పత్తి సహా పాల ఉత్పత్తి వినియోగంలో భారత్ ముందుందని పేర్కొన్నారు. ఎల్డిఎఫ్పై అంకితమైన ఎక్స్పో చాలా అవసరం. ఇది త్వరలో ప్రపంచ స్థాయిలో బోస్టన్ సీఫుడ్స్తో సమానంగా ఎదుగుతుందనన్నారు.ఇలాంటి ఎక్స్పోలు మన బలాన్ని ప్రదర్శించడమే కాకుండా విధి విధానాలను నిర్మించే ప్రభుత్వ అధికారులను మేల్కొల్పుతాయని అన్నారు డాక్టర్ తరుణ్ శ్రీధర్. 2022-23లో రికార్డు స్థాయిలో 174 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించింది. ఇది రూ.63,960 కోట్ల సీఫుడ్ ఎగుమతులను సాధించిందని, ఇంకా, భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారు అని భారతదేశంలోని చేపలలో 68% ఆక్వాకల్చర్ రంగం నుండి వస్తుందని తెలిపారు. పశువులు శక్తి. పశువులు ఎల్లప్పుడూ వ్యవసాయంలో అంతర్భాగంగా ఉంటాయి. కానీ ఇది చాలా మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, యువతకు ఆకర్షణీయంగా కనిపించదు. అయితే ప్రపంచం మొత్తం సహజ, సేంద్రియ, పున రుత్పత్తి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నందున మంచి రోజులు వచ్చాయి. పశుసంవర్ధక రంగం ఇప్పుడు ఆహార భద్రత నే కాక, పోషకాహార భద్రతగానూ గొప్ప సంభావ్యత కలిగిన చాలా పెద్ద రంగంగా పరిగణించబడుతుంది. ప్రపంచ ఆకలి సూచీలో 121 స్థానాల్లో భారతదేశం 107 స్థానాల్లో ఉన్న నేపథ్యంలో పశు సంపదకు సంబంధించిన ఉత్పత్తులకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మాంసం తినే జనాభాలో 70% కంటే ఎక్కువ భారతదేశం. 2050లో 18.1 MT తలసరి మాంసం వినియోగం 13.8 కిలోల అంచనాగా ఉందని NABARD చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల అన్నారు. గోదావరి కట్స్లో 25 కిలోల ఎల్లోఫిన్ ట్యూనా అనే అరుదైన చేపలను ప్రదర్శించారు. ఎల్లోఫిన్ ఆరు లేదా ఏడు సంవత్సరాల వరకు జీవించగలదు. ఇవి అధిక వలసలు, పసిఫిక్, అట్లాంటిక్ -హిందూ మహాసముద్రాల అంతటా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద జీవరాశి అయిన ఎల్లో ఫిష్ ట్యూనా అంతరించిపోతోంది. భారత ప్రభుత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు డెవలప్మెంట్ కమీషనర్ డి. చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. ''భారతదేశంలో 46 (23 మంది స్థానిక, 23 మంది స్థానికేతర) సూక్ష్మ, చిన్న వ్యాపారవేత్తలు పాల్గొనేందుకు మంత్రిత్వ శాఖ వీలు కల్పించింది. రిటైర్డ్ బ్యూరోక్రాట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయిన డబ్ల్యువిఆర్ రెడ్డి మాట్లాడుతూ మనమందరం చిన్నతనం నుండే పశువులతో ముడిపడి ఉన్నాం. కానీ మన యువత ఇప్పుడు దానిపై ఆసక్తి చూపడం లేదు. యువతను ఆకర్షించేందుకు వీలుగా ఈ రంగాన్ని బ్లూ కాలర్ లాంటి రంగంగా మార్చాలి. మీరు సాంకేతికతపరమైన ఆవిష్కరణలను తీసుకురావాలని ఆయన పిలుపునిచారు.దళిత బంధు లబ్ధిదారులు కూడా అవకాశాలను అన్వేషించడానికి ఎక్స్పోను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారు. ఎక్స్పోలో కంట్రీ చికెన్ వంటి అనేక స్టాల్స్ ఉన్నాయి. దీనిని ఇద్దరు యువ పారిశ్రామికవేత్తలు సాయికేష్ గౌండ్, మొహమ్మద్ సమీ ఉద్దీన్ స్థాపించారు. ఆధునిక,పరిశుభ్రమైన మాంసం దుకాణాలు అవసరమని చాలా మంది తెలియచేశారు. కూరగాయలకు మంచి, పరిశుభ్రమైన దుకాణాలు ఉన్నప్పటికీ, పరిశుభ్రమైన మాంసం దుకాణాలు ఎక్కువగా కనిపించవు. గడ్డకట్టిన చేపలను కొనడానికి ప్రజలు నిరాకరిస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు అన్నీ క్రమంగా మారుతూ వస్తున్నాయి. అందరూ తమ వ్యాపారాలకి ప్రజలను ఆకర్షించే కొత్త దారులను వెతుకుతున్నారు. -
ఆరు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు నేడు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. దేశంలో వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇండియా కూటమికి, అధికార బీజేపీకి మధ్య మొదటి పోటీగా ఈ పోలింగ్ను రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. Bypolls: Voting begins in six states for 7 assembly seats Read @ANI Story | https://t.co/6U9T1V6j1l#bypolls #UP #Tripura #Jharkhand #WestBengal pic.twitter.com/rlxhf6bo5k — ANI Digital (@ani_digital) September 5, 2023 జార్ఖండ్లోని డుమ్రి, త్రిపురలోని బోక్సానగర్, మధన్పూర్, ఉత్తరప్రదేశ్లోని ఘోసి, ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్, కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్లోని ధూప్గురి నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 8న కౌంటింగ్ నిర్వహించనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణాల కారణంగా ధూప్గురి, పుతుపల్లి, బాగేశ్వర్, డుమ్రీ, బోక్సానగర్లలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఘోసి, ధన్పూర్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే పదవికి దారా సింగ్ చౌహాన్ రాజీనామా చేయడంతో ఉత్తరప్రదేశ్లోని ఘోసిలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆయన రాజీనామా తర్వాత బీజేపీలో చేరారు. ఉపఎన్నికలకు ఎస్పీ సుధాకర్ సింగ్పై బీజేపీ దారా సింగ్ చౌహాన్ను రంగంలోకి దింపింది.దారా సింగ్ చౌహాన్ ఘోసీ నుంచి 2012 నుంచి 2017 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆ తర్వాత వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తన మిత్రపక్షమైన ఎస్పీకి మద్దతునిస్తోంది. త్రిపురలోని ధన్పూర్లో బీజేపీ అభ్యర్థి ప్రతిమా భూమిక్ లోక్సభ స్థానానికి రాజీనామా చేయడంతో సీటు ఖాలీ అయింది. ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (సీపీఐ-ఎం) అభ్యర్థి కౌశిక్ చందాపై ప్రతిమా భూమిక్ సోదరుడు బిందు దేబ్నాథ్ను భాజపా బరిలోకి దింపుతోంది. అటు.. ఉమెన్ చాందీ మరణంతో పుతుపల్లి సీటు ఖాళీ కావడంతో ఈరోజు పోలింగ్ జరుగుతోంది. సీపీఎం అభ్యర్థి జైక్ సీ థామస్పై కాంగ్రెస్ నేతృత్వంలోని ఫ్రంట్ సీనియర్ నేత తనయుడు చాందీ ఉమెన్ను బరిలోకి దింపింది. ఇదీ చదవండి: కుల విభేదాల్ని మాత్రమే ఖండించా.. ఉదయ్నిధి స్టాలిన్ తాజా ప్రకటన -
నిర్మాతకు డబ్బులొస్తే చాలు: డైరెక్టర్
‘ఎంతో కష్టపడితే దర్శకుడిగా ‘’తో తొలి చాన్స్ వచ్చింది. సినిమా బ్లాక్బస్టర్ అయిందా లేదా అన్నది కాదు.. నిర్మాతకు డబ్బులొస్తే అదే పెద్ద సక్సెస్’’ అని సాయి సునీల్ నిమ్మల అన్నారు. యామిన్ రాజ్, విరాట్ కార్తీక్, ప్రియాంక రేవ్రి లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సీహెచ్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి అతిథులుగా హాజరైన నటులు అరవింద్ కృష్ణ, శివారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ట్రైలర్,పాటలు చాలా బాగున్నాయి. సినిమా హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, డ్రామా ఉన్నాయి’’ అన్నారు యామిన్ రాజ్. -
అంబానీ కుటుంబంలో మొదటి ప్రేమ వివాహం ఎవరిది?
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులు ఏదో ఒక విషయమై తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అంబానీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్తలు అంటే ఫ్యామిలీ ఫంక్షన్కు సంబంధించినవి, వ్యాపారానికి సంబంధించిన వార్తలు తరచూ వింటుంటాం. అయితే అంబానీ సోదరీమణులు అంటే ధీరూభాయ్ అంబానీ కుమార్తెల గురించి అంతగా ఎవరికీ తెలియదు. అతనికి ఇద్దరు కుమారులు ముఖేష్, అనిల్ మాత్రమే కాకుండా ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరూ లైమ్లైట్కు దూరంగా ఉంటారు. అందుకే వారి గురించిన సమాచారం బయటకు రాదు. ముఖేష్, అనిల్ అంబానీ సోదరీమణుల పేర్లు నీనా కొఠారి, దీప్తి సల్గావ్కర్. నీనా కొఠారి ఏం చేస్తుంటారు? 1986లో హెచ్సి కొఠారీ గ్రూప్ చైర్మన్ భద్రశ్యామ్ కొఠారితో నీనా వివాహం జరిగింది. అయితే భద్రశ్యామ్ క్యాన్సర్ కారణంగా 2015లో మరణించారు. హెచ్సీ కొఠారి గ్రూప్ ప్రధానంగా చక్కెర, కెమికల్, పెట్రోకెమికల్ వ్యాపారంలో ఉంది. నీనాకు కూతురు నయనతార, కొడుకు అర్జున్ కొఠారి ఉన్నారు. వీద్దరికీ పెళ్లయింది. నయనతార కేకే బిర్లా మనుమడు షమిత్ను వివాహం చేసుకుంది. ఆమె ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగింది. అంబానీ కుటుంబంలో జరిగే ప్రతి ఫంక్షన్కూ నీనా హాజరవుతుంటారు. దీప్తి సల్గాంకర్ ఎక్కడుంటారు? అంబానీ కుటుంబంలో మొదట దీప్తి ప్రేమ వివాహం చేసుకుంది. దీప్తికి 1983లో దత్తరాజ్ సల్గాంకర్తో వివాహం జరిగింది. దీప్తి తండ్రి ధీరూభాయ్.. రాజ్ తండ్రి వాసుదేవ్ సల్గాంకర్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకే భవనంలో ఉండేవారు. దత్తరాజ్ సల్గాంకర్..ముఖేష్ అంబానీ మంచి స్నేహితులు. దీప్తి సల్గాంకర్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి గోవాలో ఉంటున్నారు. ఆమె భర్త దేశంలోని ప్రముఖ ఫుట్బాల్ జట్టు సల్గావ్కర్ యజమాని. అలాగే ఖనిజ మైనింగ్, ఇనుప ఖనిజం ఎగుమతి, రియల్ ఎస్టేట్, ఆరోగ్య రంగాలకు చెందిన వీఎం సల్గావ్కర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు యజమాని. ఇలా ఇద్దరూ దగ్గరయ్యారు ధీరూభాయ్ అంబానీ 1978లో ముంబైలోని ఉషాకిరణ్ సొసైటీలోని 22వ అంతస్తులో ఉండేవారు. ఈ భవనంలోని 14వ అంతస్తులో వ్యాపారవేత్త బాసుదేవ్ సల్గావ్కర్ తన కుటుంబంతో కలిసి ఉండేవారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఒకరి ఇంటికి ఒకరు వస్తూవెళుతూ ఉంటేవారు. ఈ నేపధ్యంలోనే రాజ్, ముఖేష్ అంబానీ మంచి స్నేహితులయ్యారు. తరువాతి కాలంలో రాజ్ సల్గావ్కర్.. ముఖేష్ అంబానీ సోదరి దీప్తితో ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే వారు పెళ్లికి అంగీకరించారు. దీప్తి, రాజ్ల వివాహం 1983లో జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు విక్రమ్, కూతురు ఇషేత. ఇది కూడా చదవండి: భారత్-శ్రీలంకల ‘కచ్చతీవు’ వివాదం ఏమిటి? ఇందిరాగాంధీని ఎందుకు తప్పుబడుతున్నారు? -
తొలి చిత్రాన్ని విడుదల చేసిన చంద్రయాన్-3
చంద్రయాన్-3 తొలి చిత్రాన్ని విడుదల చేసింది. ల్యాండ్ అయిన తర్వాత విక్రమ్ తీసిన ఫొటోలు ఇవి. ల్యాండర్ పంపిన నాలుగు ఫొటోలను ఇస్రో పంచుకుంది. తద్వారా బెంగళూరు రీసెర్చ్ సెంటర్తో ల్యాండర్ కమ్యూనికేషన్ ఫిక్స్ అయినట్లు స్పష్టమవుతోంది. Chandrayaan-3 Mission: Updates: The communication link is established between the Ch-3 Lander and MOX-ISTRAC, Bengaluru. Here are the images from the Lander Horizontal Velocity Camera taken during the descent. #Chandrayaan_3#Ch3 pic.twitter.com/ctjpxZmbom — ISRO (@isro) August 23, 2023 చంద్రయాన్-3 సూపర్ సక్సెస్తో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ మరో మైలురాయి దాటేసింది. చంద్రుడిపై విక్రమ్ విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. బండరాళ్లు, గుంతలు లేని స్థలం చూసుకుని విక్రమ్ దిగింది. తద్వారా.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండైన తొలి దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది. మొత్తంగా చంద్రుడిపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది(అమెరికా, సోవియట్ యూనియన్(USSR), చైనాలు ఉన్నాయి). 1959లో సోవియట్ యూనియన్ ‘లూనా’ ప్రయోగం తర్వాత.. మానవ సహిత చంద్రయాత్రలు కూడా సాగాయి. అయితే ఇవన్నీ భూమి వైపు కనిపించే చంద్రుడి మధ్య రేఖ వద్ద జరిగాయి. అవతల ఎలా ఉంటుందన్న అన్వేషణలో ఎవరూ ముందడుగు వేయలేకపోయారు. పైగా అక్కడంతా బిలాలు, లోయలు, గడ్డ కట్టిన మంచే ఉంటుందని అంచనా వేస్తూ వచ్చారు. ఇప్పుడో అప్పుడో ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది. చంద్రుడిపై అది రెండువారాల పాటు పరిశోధనలు చేస్తుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై మట్టిని అన్వేషించనున్న రోవర్.. మట్టిలో గడ్డకట్టిన మంచు అణువులపైనా అన్వేషణ కొనసాగిస్తుంది. మిగతా దేశాలు మన విక్రమ్ తర్వాతే.. చంద్రుడి దక్షిణ ధ్రువంలో నీటి జాడల పరిశోధనల కోసం ఏకంగా వ్యోమగాముల్ని పంపాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా భావిస్తోంది. ఈ ప్రాజెక్టు 2025లో పట్టాలెక్కనుంది. మరోవైపు చైనా కూడా వ్యోమగామరహిత ప్రయోగాలకు సిద్ధమైంది. -
జాబిల్లి తొలి ఫొటోలు.. షేర్ చేసిన ఇస్రో..
బెంగళూరు: చంద్రునిపై పరిశోధనల కోసం చంద్రయాన్-3.. ఉపగ్రహం జాబిల్లికి మరింత చేరువైంది. ఈ మేరకు ల్యాండర్ విక్రమ్ మొదటిసారి చంద్రుని ఫొటోలను పంపించింది. స్పేస్క్రాఫ్ట్ నుంచి గురువారమే విడిపోయిన ల్యాండర్ విక్రమ్ చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తూ జాబిల్లి ఉపరితలాన్ని క్లిక్మనిపించింది. ఆ ఫొటోలను ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ల్యాండర్ విక్రమ్ తీసిన మొదటి ఫొటోలో చంద్రునిపై ఉన్న బిలాలను కూడా ఇస్రో గుర్తించింది. గార్డియానో బ్రూనో క్రేటర్ అనే పేరు కలిగిన బిలాన్ని గుర్తించారు. ఇటీవలే గుర్తించిన ఈ బిలం వ్యాసం దాదాపు 43 కిలోమీటర్లు ఉంటుంది. అయితే.. శుక్రవారం సాయంత్రం చేపట్టిన వేగాన్ని తగ్గించే ప్రక్రియ మరింత విజయవంతమైనట్లు తెలిపారు. Chandrayaan-3 Mission: View from the Lander Imager (LI) Camera-1 on August 17, 2023 just after the separation of the Lander Module from the Propulsion Module #Chandrayaan_3 #Ch3 pic.twitter.com/abPIyEn1Ad — ISRO (@isro) August 18, 2023 ఒకసారి ల్యాండర్ చంద్రున్ని తాకిన తర్వాత విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ విడివడుతుందని ఇస్రో తెలిపింది. అనంతరం రోవర్ కీలక సమాచారాన్ని సేకరిస్తుందని వెల్లడించింది. చంద్రుని ఆకృతి, శిథిలాలు, నీటి జాడ వంటి అనేక విషయాలను శోధిస్తుంది. ఇదీ చదవండి: India First 3D Printed Post Office: ఆత్మనిర్భర్ స్ఫూర్తి.. దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు.. అదీ 45 రోజుల్లో! -
దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు
బెంగళూరు: భారత్లో తొలిసారి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు భవనాన్ని నగరంలో కేంద్ర మంత్రి అశ్విణీ వైష్ణవ్ నేడు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో దీనిని నిర్మించినట్లు వెల్లడించారు. బెంగళూరులోని కేంబ్రిడ్జీ లే అవుట్లో ఈ పోస్టు ఆఫీస్ను నిర్మించారు. 1,021 చదరపు అడుగుల వైశాల్యంలో దీన్ని నిర్మించినట్లు పోస్టల్ శాఖ తెలిపింది. లార్సెన్ అండ్ టర్బో లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టగా.. ఐఐటీ మద్రాస్ సాంకేతికతను అందించింది. సాంప్రదాయ పద్దతిలో ఏనిమిది నెలలు పట్టేది.. కేవలం 45 రోజుల్లోనే పోస్టాఫీస్ను నిర్మించినట్లు చెప్పారు. The spirit of Aatmanirbhar Bharat! 🇮🇳India’s first 3D printed Post Office. 📍Cambridge Layout, Bengaluru pic.twitter.com/57FQFQZZ1b — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 18, 2023 మన సొంత టెక్నాలజీని ఉపయోగించి 3డీ పోస్టాఫీస్ను నిర్మించినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గతంలో సాధ్యం కానీదాన్ని సుసాధ్యం చేసినట్లు వెల్లడించారు. 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారంగా దీన్ని నిర్మించినట్లు చెప్పారు. ఎవరూ ఊహించని విధంగా 4జీ, 5జీ టెక్నాలజీలను ఇండియా అభివృద్ధి చేసిందని అన్నారు. ఇదీ చదవండి: ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అభ్యర్థుల జాబితా విడుదల.. అత్యధికులు వారే.. -
అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ తొలి జాబితా విడుదల
సాక్షి, ఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. బీజేపీ ఇవాళ రెండు రాష్ట్రాలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 90 స్థానాలు ఉన్న ఛత్తీస్గఢ్ అసెంబ్లీ కోసం 21 మంది అభ్యర్థులతో, అలాగే.. 230 స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్కు 39 మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్ విడుదల చేసింది. కేంద్రం ఎన్నికల సంఘం ఎన్నికల తేదీని ప్రకటించకముందే.. బీజేపీ ఈ జాబితా విడుదల చేయడం గమనార్హం. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయిన మరుసటి రోజే.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ జాబితా వెలువడినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. भाजपा केन्द्रीय चुनाव समिति ने छत्तीसगढ़ एवं मध्य प्रदेश में होने वाले आगामी विधानसभा चुनाव 2023 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। (2/2) pic.twitter.com/VsjOfj3DVe — BJP (@BJP4India) August 17, 2023 ► అభ్యర్థుల పేర్లను ప్రకటించడం వెనుక.. బీజేపీ శ్రేణుల్లోని వర్గపోరును, విభేదాల్ని గుర్తించడం, తద్వారా సమస్యలను ముందుగానే పరిష్కరించడం లక్ష్యంగా అధిష్టానం పెట్టుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. జాబితాను పరిశీలిస్తే.. ఛత్తీస్గఢ్ నుంచి ఎంపీ(దుర్గ్ స్థానం) విజయ్ భాఘేల్ను మళ్లీ అసెంబ్లీ బరిలో నిలిపింది బీజేపీ. ఇంతకు ముందు పటాన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయన.. ఈ దఫా ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ► ఇక మాజీ సీఎం రమణ్సింగ్, ఇతర పార్టీ సీనియర్లు తొలి లిస్ట్లో లేకపోవడం గమనార్హం. ► మధ్యప్రదేశ్ విషయానికొస్తే.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు తొలి జాబితాలో లేదు. అలాగే కొందరు మంత్రుల పేర్లు కూడా లేకపోవడం గమనార్హం. ► బీజేపీ ఛత్తీస్గఢ్ లిస్ట్లో ఐదుగురు మహిళలు, పది మంది ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్లు, ఒక ఎస్సీ కేటగిరీకి చెందిన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ► మధ్యప్రదేశ్ జాబితాలో.. ఐదుగురు మహిళలు, ఎనిమిది మంది ఎస్సీ, 13 మంది ఎస్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. -
బస్సులో మొదట మహిళ ఎక్కితే.. కలిసిరాదా..? ఇది ఏం మూఢత్వం..?
భువనేశ్వర్: శాస్త్ర సాంకేతికత పెరిగినా మనిషి మూఢత్వాన్ని వదలడంలేదు. ఎవరో ఎదురువస్తే మంచిదంటూ, మరెవరో వస్తే చెడు జరుగుతుందంటూ కొందరు భావిస్తున్నారు. ఏదో ఒక విధంగా ఏదో ఒక వర్గంపై వివక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి ఘటనే ఒడిశాలో ఎదురైంది. కొత్తగా తీసుకువచ్చిన బస్సుల్లో మహిళలను మొదటి ప్యాసింజర్గా ఎక్కకుండా ఆపేసిన ఘటనపై ఒడిశా మహిళా కమిషన్ మండిపడింది. ఇలాంటి వివక్షను ఆపేయాలని రవాణా డిపార్ట్మెంట్కు సూచనలు చేసింది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా తీసుకువచ్చిన బస్సుల్లో మహిళలను మొదటి ప్యాసింజర్గా ఎక్కకుండా భువనేశ్వర్లోని బారాముండా బస్సు స్టేషన్లో ఆపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమాజిక కార్యకర్త ఘాసిరామ్ పాండా రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కమిషన్ రాష్ట్ర రవాణా యంత్రాంగానికి తగు సూచనలు చేసింది. మహిళలు మొదటి ప్యాసింజర్గా ఎక్కితే.. ఆ రోజు బస్సుకు ప్రమాదమో లేక తక్కువ వసూలు చేయడమో జరుగుతుందని భావించడం వివక్షాపూరితం అంటూ తెలిపింది. ఇది పూర్తిగా మూఢత్వం అని పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన మహిళా కమిషన్.. మహిళలను తొలి ప్రయాణికులుగా ఎక్కేందుకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని రవాణాశాఖకు సూచనలు చేసింది. గతంలోనూ ఈ తరహా ఘటనలు వెలుగుచూసినట్లు గుర్తుచేసింది. ఇకముందు మహిళా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా వారి గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు తమ మొదటి ప్యాసింజర్గా మహిళలనూ అనుమతించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సిబ్బందికి ఈ మేరకు అవగాహన కల్పించాలని కోరింది. బస్సుల్లో మహిళల రిజర్వేషన్ను 50 శాతానికి పెంచాలని మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. ఇదీ చదవండి: ఏంటీ వింత? ఎపుడూ లేనిది.. ఇపుడే కొత్తగా! 45 మందికి షాకిచ్చిన గోవా ఎక్స్ప్రెస్ ట్రైన్ -
30న పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈనెల 30వ తేదీ ఉదయం 6.30 గంటలకు సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగాన్ని నిర్వహించనుంది. ఇప్పటికే నాలుగు దశల అనుసంధానం పనులను పూర్తి చేసి రాకెట్ను మొబైల్ సర్వీస్ టవర్ (ఎంఎస్టీ)కు తీసుకువచ్చారు. అక్కడ ఏడు ఉపగ్రహాలను రాకెట్ శిఖరభాగాన అమర్చి.. హీట్షీల్డ్ క్లోజ్ చేసే ప్రక్రియను బుధవారం పూర్తి చేశారు. 29వ తేదీ ఉదయం 6.30 గంటలకు కౌంట్డౌన్ను ప్రారంభించనున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆ సమయాన్ని కొద్దిగా మార్చే అవకాశం కూడా ఉంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్కు చెందిన 422 కిలోల బరువు కలిగిన ఏడు ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. -
జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులపై మొదటి హక్కు రాష్ట్రానికే
సాక్షి, అమరావతి : జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వానికే మొదటి హక్కు అని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. డిపాజిటర్ల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒకే ఆస్తులపై రెండు దర్యాప్తు సంస్థల జప్తు ఉత్తర్వుల వల్ల డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్నారు. ఆస్తులను విక్రయించి డిపాజిటర్లకు ప్రయోజనం చేకూర్చాలన్న ప్రభుత్వ ప్రయత్నాల్లో తీవ్ర జాప్యం జరిగి బాధితులు నష్టపోతారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులను తిరిగి మనీలాండరింగ్ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేయడం ఎంత వరకు సమంజసమో తేల్చాలని కోర్టును అభ్యర్థించారు.మనీలాండరింగ్, దివాలా చట్టాల కింద చేసిన జప్తులకు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన జప్తునకు మధ్య వైరుద్ధ్యం లేదని తెలిపారు.డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అగ్రిగోల్డ్ ఎగవేసిన మొత్తాలను తిరిగి చెల్లిస్తోందని నివేదించారు. రూ.20 వేలు, అంతకన్నా తక్కువ డిపాజిట్లు చేసిన వారికి ఇప్పటికే రూ.900 కోట్ల మేర తిరిగి చెల్లించినట్లు చెప్పారు. మనీలాండరింగ్, దివాలా చట్టాలు డిపాజిటర్ల పరిరక్షణకు ఉద్దేశించినవి కావని చెప్పారు. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఈడీ గానీ, బ్యాంకులు గానీ నీరుగార్చలేవని అన్నారు. అగ్రిగోల్డ్ డిపాజిట్ల కుంభకోణంలో నిందితులు వారిని వారు రక్షించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.ఇలాంటి పరిస్థితుల్లో జప్తు చేసిన ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు తిరిగి చెల్లించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని ఇతర ఏ దర్యాప్తు సంస్థా నిరోధించలేదని తేల్చి చెప్పారు. ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర ఉందని చెప్పారు.అగ్రిగోల్డ్ యాజమాన్యం నుంచి కొన్న తమ ఆస్తులను ఈడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే బ్యాంకులు నిర్వహించిన వేలంలో కొన్న అగ్రిగోల్డ్ ఆస్తులను కూడా ఈడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ మరికొన్ని కంపెనీలు, వ్యక్తులు, కుంభకోణానికి ముందే అగ్రిగోల్డ్ నుంచి కొన్న భూముల్లో నిర్మించుకున్న అపార్ట్మెంట్లను సైతం సీఐడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ప్లాట్ల యజమానులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కొద్ది రోజులుగా విచారణ జరుపుతున్నారు. గురువారం జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అనంతరం న్యాయమూర్తి విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు. -
గర్భిణిపై కూలిన ఇంటిపైకప్పు
మెదక్ మున్సిపాలిటీ: తొలి కాన్పు కోసం పుట్టింటికి వచ్చిన గర్భిణిపై ఇల్లు కూలిన ఘటనలో కడుపులోని గర్భస్థ శిశువు మృతి చెందగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదఘటన మెదక్లోని మిలట్రీ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుడైన మహ్మద్ సర్వర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రెండో కూతురు యాస్మిన్ సుల్తానా ఇటీవల కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. 15 రోజుల్లో ఆమెకు ప్రసవం చేయాల్సి ఉంది. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తరుణంలో భారీ వర్షాలకు తడిసిన ఇంటి గోడ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో యాస్మిన్ తీవ్రంగా గాయ పడటంతో వెంటనే మెదక్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె కడుపులో గర్భస్థ శిశువు మృతి చెందినట్లు గుర్తించి తొలగించారు. యాస్మిన్ను హైదరా బాద్కు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. కాగా, ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన యాస్మిన్ తల్లి చాంద్ సుల్తానా మెదక్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యాస్మిన్ సుల్తానా కుటుంబాన్ని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గురువా రం పరామర్శించి రూ.లక్ష సాయం అందించారు. -
బర్త్ డే స్పెషల్.. నెవ్వర్ బిఫోర్ గెటప్లో సూర్య (ఫొటోలు)
-
Klin Kaara Konidela First Photos: మెగా ప్రిన్సెస్ మొదటి వీడియో షేర్ చేసిన రామ్చరణ్ (ఫొటోలు)
-
16 ఏళ్ల నాటి ఐఫోన్ రూ. 1.3 కోట్లు.. దీని ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ధర ఎక్కువైనా కొనేందుకు యువత ఆసక్తి చూపిస్తుంటారు. యూజర్ల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడల్లను యాపిల్ సంస్థ మార్కెట్లోకి తీసుకొస్తోంది. ప్రస్తుత తాజా మోడల్ ఐఫోన్ 15 హవా నడుస్తోంది. అయితే 2007లో విడులైన మొదటి తరం ఐఫోన్ తాజాగా జరిగిన వేలంలో రూ. 1.3 కోట్లకు (158,000 డాలర్లు) అమ్ముడుపోయింది.ఇప్పటివరకు వేలంలో అమ్ముడుపోయిన అత్యంత విలువైన ఐఫోన్గా ఇది కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఐఫోన్కు టెక్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈ ఫోన్ రూపొందించడంలో పాలుపంచుకున్న ఇంజనీర్లలో ఒకరికి చెందినది. మొదటి తరం ఐఫోన్ను ప్రపంచానికి పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్, టచ్స్క్రీన్ ఇంటర్ఫేస్, ఆసక్తికరమైన ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను విప్లవాత్మకంగా మార్చారు. కాగా వేలానికి ఉంచిన ఈ ఐఫోన్ 16 ఏళ్లయినా ఇప్పటికీ అంతే కొత్తగా ఉంది. అందుకే వేలంలో అత్యధిక విలువను దక్కించుకుంది. ఇదీ చదవండి ➤ మొబైల్ నంబర్.. మీకు నచ్చినట్టు.. ఈ ఐకానిక్ ఐఫోన్ 4జీబీ వెర్షన్ను ఎల్సీజీ సంస్థ వేలం వేసింది. 50,000 డాలర్ల నుంచి 100,000 డాలర్లు (రూ.41 లక్షలు నుంచి రూ.82 లక్షలు) మధ్య అమ్ముడుపోతుందని ఈ సంస్థ అంచనా వేసింది. అయితే అనూహ్యంగా 158,644 డాలర్లకు అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ. 1.3 కోట్ల భారీ ధరను దక్కించుకుని కొత్త రికార్డు సృష్టించింది. వాస్తవానికి 2007లో విడుదలైన మొదటి తరం ఐఫోన్ 4జీబీ వర్షన్ ధర కేవలం 499 డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 40 వేల కంటే తక్కువే. ఈ ఐఫోన్ మార్కెట్లోకి వచ్చిన 16 ఏళ్ల తర్వాత 318 రెట్లు అధిక ధరకు అమ్ముడుపోవడం విశేషం. -
తొలి కంప్యూటర్ అందించిన టెక్ దిగ్గజం, బిలియనీర్ ఎవరో తెలుసా?
పారిశ్రామికవేత్త టెక్ దిగ్గజం హెచ్సీఎల్ వ్యవస్థాపకుడు, దాత శివ్ నాడార్ (జూలై 14) 78వ పడిలోకి అడుగుపెట్టారు. సెల్ఫ్-మేడ్ ఇండియన్ బిలియనీర్ శివ నాడార్ తన దూరదృష్టి , మార్గదర్శక నిర్ణయాలతో దేశీయంగా తొలి వ్యక్తిగత కంప్యూటర్ను అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో భారతదేశం అగ్రగామిగా ఎదగడానికి సహాయం చేసినవారిలో శివ నాడార్ ప్రముఖుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు విద్యా, గ్రామీణాభివృద్ధిపై శివ నాడార్ ఫౌండేషన్, ఇతర అనేక స్వచ్ఛంద సంస్థలద్వారా భూరి విరాళాలిచ్చే గొప్ప పరోపకారి కూడా. ఎక్కడ పుట్టారు? తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలోని తిరుచందూర్ దగ్గర్లోని మూలైపోజి అనే పల్లెటూర్లో పుట్టారు శివనాడార్. కోయంబత్తూర్లోని పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత, నాడార్ 1967లో పూణేలోని వాల్చంద్ గ్రూప్ కూపర్ ఇంజనీరింగ్లో కరియర్ ప్రారంభించారు. అనంతరం ఢిల్లీ క్లాత్ మిల్స్ డిజిటల్ ఉత్పత్తుల విభాగంలో ఉద్యోగానికి మారారు. (జయహో! రాకెట్ వుమన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్) 1975లో హెచ్సీఎల్ ఆవిర్భావం ఆ తర్వాత 1975లో, తన స్నేహితులు, సహోద్యోగులతో కలిసి మైక్రోకాంప్ లిమిటెడ్ అనే పేరుతో తన సొంత వెంచర్ను ప్రారంభించాడు. కంపెనీలో అతిపెద్ద వాటాదారు అయిన నాడార్తో సహా 8 మంది భాగస్వాములు ఉన్నారు. కంపెనీ తొలుత టెలి-డిజిటల్ కాలిక్యులేటర్లను విక్రయించడంపై దృష్టి సారించింది. 1976లో ఐబీఎం ఇండియా నుంచి వెళ్లిపోవడంతో నాడార్ భారతదేశంలోని కంప్యూటర్ మార్కెట్ అవకాశాలపై దృష్టి పెట్టారు. కేవలం 18,700 రూపాయల ప్రారంభ పెట్టుబడితో హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్సీఎల్) ఆవిష్కరించారు. హెచ్సీఎల్ను మొదటి పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పిపిపి)గా మార్చే కంపెనీలో 26 శాతం వాటాకు బదులుగా రూ. 20 లక్షల అదనపు గ్రాంట్తో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మద్దతిచ్చింది. 1999లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో హెచ్సీఎల్టెక్ లిస్ట్ అయింది. తొలి పీసీ, ఐటీ రంగంపై అంచనాలు ఐబీఎం, యాపిల్ కంటే ముందే దేశంలో తొలి హెచ్సీఎల్ 8సీ తొలి పీసీ 1978లో అందించిన ఘనత శివ నాడార్ దక్కించుకున్నారు. సొంత యాజమాన్య హార్డ్వేర్తో హార్డ్వేర్ కంపెనీగా ప్రారంభమై పర్సనల్ కంప్యూటర్ కంపెనీగా రూపాంతరం చెందింది. తొలి ఏడాదిలోనే రూ. 10 లక్షల అమ్మకాలతో 1979 నాటికి రూ. 3 కోట్ల విలువైన కంపెనీగా నిలిచింది. అంతేనా ఐటీ రంగం, ఐటీ సేవలను ప్రాధాన్యతను అప్పట్లోనే పసిగట్టి, ఇందుకోసం సింగపూర్కు మారారు. అంతర్జాతీయంగా తన వ్యాపారాన్ని విస్తరించారు. (ఐటీఆర్ ఫైలింగ్లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్) బ్లూమ్బెర్గ్ ప్రకారం, 2022లో, సంస్థ 11.5 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని సాధించింది.బ్లూమ్బెర్గ్ ప్రకారం, శివ్ నాడార్ నికర విలువ సుమారు 25.9 బిలియన్ల డాలర్లు అని అంచనా. 2020లో దేశంలో మూడో అతి పెద్ద ఐటీ కంపనీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఛైర్మన్గా తన బాధ్యతలనుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఏకైక కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. శివసుబ్రమణ్య నాడార్ పేరుతో పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపిస్తే శివ నాడార్ స్థాపించారు. 1994లో నాడార్ తన దాతృత్వ సంస్థ శివ్ నాడార్ ఫౌండేషన్ను స్థాపించాడు. తండ్రికి తగ్గ కూతురిగా రోషిణి నాడార్ తన తండ్రి శివ నాడార్ పేరిట "శివనాడార్ విశ్వవిద్యాలయం" స్థాపించడం విశేషం. ఎడెల్గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రఫీ జాబితాలో -2022 జాబితాలో శివ్ నాడార్ టాప్లో నిలిచారు. 2021-22 మధ్య ఆయన ఏకంగా రూ.1,161 కోట్లు విరాళం ఇచ్చారు. అంటే సగటున రోజుకు శివ్ నాడార్ రూ.3 కోట్లు విరాళం గొప్ప పరోపకారిగా నిలిచారు. -
నిరుద్యోగ భర్తకు చేదోడువాదోడు.. అధికారి కాగానే ఆమెకు అన్యాయం చేస్తూ..
ఆ బాధిత మహిళ న్యాయం కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తోంది. ఆమె పేరు మమత. తన భర్త పెద్ద ఆఫీసర్ కాగానే తనను విడిచిపెట్టి మరో వివాహం చేసుకుని తనకు అన్యాయం చేశాడని ఆమె ఆరోపిస్తోంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం వారి పెళ్లినాటికి భర్త నిరుద్యోగి. దీంతో ఆమె కూలీ పనులు చేసి, అతని ఉన్నత చదువులకు ఆసరా అందించి, అతను పెద్ద ఆఫీసర్ అయ్యేందుకు సహాయపడింది. అయినా ఆమెకు అన్యాయమే ఎదురయ్యింది. నిరుద్యోగిగా ఉన్న భర్తను చదివించి.. ఈ ఉదంతం మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ రోదిస్తూ మీడియా ముందు తన గోడు వెళ్లగక్కింది. మమతకు 2015లో కమరూ హఠీలేతో వివాహం జరిగింది. కమరూ ఆ సమయంలో నిరుద్యోగి. అయితే గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. నిరుద్యోగిగా ఉన్న భర్తకు ఆమె అన్ని విధాలుగా చేదోడువాదోడుగా నిలిచింది. ఆమె అండతో కమరూ పెద్ద అధికారి అయ్యాడు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇళ్లలో వంట పనులు చేస్తూ.. భర్తను చదివించేందుకు ఆమె పలు ఇళ్లలో వంట పనులు, పాచిపనులు చేసింది. కొన్నిరోజులు దుకాణాలలోనూ పనిచేసింది. ఇలా వచ్చిన ఆదాయంతో భర్తను ఉన్నత చదువులు చదివించింది. భార్య సాయంతోనే అతను పోటీ పరీక్షలకు కూడా సిద్ధం అయ్యాడు. ఇది కూడా చదవండి: ఆవు మొదలు ఆడ కుక్క వరకూ.. చెత్తపనులుచేసే మసలోడికి అరదండాలు! 2019-20లో కమర్షియల్ టాక్స్ అధికారిగా.. చివరాఖరికి 2019-20లలో కమరూ పోటీపరీక్షల్లో విజయం సాధించాడు. కమర్షియల్ టాక్స్ అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. రత్నాం జిల్లాలో అతనికి పోస్టింగ్ వచ్చింది. ఈ నేపధ్యంలో అతను జోబట్ ప్రాంతానికి చెందిన మరో యువతితో సంబంధం పెట్టుకున్నాడు. మమతను ఆమె పుట్టింటికి పంపివేసి, ఆ యువతితో ఉండసాగాడు. వారిద్దరూ ఆరేళ్లుగా కలిసే ఉంటున్నారు. మమత పెళ్లి వెనుక.. మమత తెలిపిన వివరాల ప్రకారం ఆమెకు మొదటి వివాహం 16 ఏళ్ల క్రితం జరిగింది. పెళ్లియన రెండేళ్లకే ఆమె భర్త మరణించాడు. ఆ మెదటి భర్తతో ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు 15 ఏళ్ల వయసులో మృతి చెందాడు. కమరూ.. మమతకు దూరపు బంధువు. ఈ నేపధ్యంలో ఇద్దరిమధ్య ప్రేమ చిగురించింది. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. భర్త చేతిలో మోసపోయి.. ఆ సమయంలో కమరూ చదువుకునేవాడు. అతను చదువు కొనసాగించేందుకు మమత ఎంతగానో సహాయం చేసింది. కమరూ తనకు ఉద్యోగం వచ్చాక పూర్తిగా మారిపోయాడు. ఒక ఆదివాసీ మహిళను వివాహం చేసుకుని, మమతను విడిచిపెట్టాడు. భర్త కారణంగా మోసపోయిన ఆమె న్యాయం కోసం పలువురు అధికారులకు కలసి వేడుకుంటోంది. భర్త నుంచి నెలకు రూ.12 వేల భరణం ఇప్పించాలని కోరుతూ ఆమె కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఇది కూడా చదవండి: నాటకీయ పరిణామంలో అత్యాచార బాగోతం వెల్లడి.. -
దేశంలో మొదటి ప్రాంతీయ రైలు సర్వీసు.. అతి త్వరలో ప్రారంభం!
దేశంలో మొదటి ప్రాంతీయ రైలు సర్వీసు రాపిడ్ఎక్స్ (RAPIDX) ఈ నెల (జూలై)లోనే ప్రారంభం కానుంది. 17 కిలో మీటర్ల పొడవుతో ఏర్పాటైన ఈ రైలు సర్వీసులో సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్దార్, దుహాయ్ డిపో అనే స్టేషన్లు ఉంటాయని ఎకనమిక్స్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. ఈ అన్ని స్టేషన్లు పనులన్నీ పూర్తయి కార్యకలాపాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయని ఓ సీనియర్ అధికారి చెప్పినట్లుగా పేర్కొంది. దీంతోపాటు సాహిబాబాద్ నుంచి మీరట్ సౌత్ స్టేషన్ వరకు 42 కిలోమీటర్ల రైలు సర్వీస్ కూడా పూర్తయింది. దుహాయ్ డిపో తర్వాత 25 కి.మీ సెక్షన్ను ప్రాధాన్యతా విభాగం తర్వాత ప్రారంభిస్తారని తెలిసింది. ఈ సెక్షన్లో మురదానగర్, మోదీ నగర్ సౌత్, మోదీ నగర్ నార్త్, మీరట్ సౌత్ స్టేషన్లు ఉంటాయి. ఈ సెక్షన్లు ఢిల్లీ - మీరల్ రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్)లో భాగం. ఇందులో రైళ్లు 160 కి.మీ వేగంతో నడిచే అవకాశం ఉంది. 2025 నాటికి 82 కిలో మీటర్లు ఆర్ఆర్టీఎస్ నిర్మాణం 2019 జూన్లో ప్రారంభమైంది. ఆర్ఆర్టీస్ కారిడార్ను నిర్మిస్తున్న నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 2025 నాటికి మొత్తం 82 కి.మీల ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ. 30,274 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఆర్ఆర్టీస్ ప్రాజెక్ట్కు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంకులు నిధులు సమకూర్చాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంతటా సెమీ-హై స్పీడ్ రీజినల్ రైల్ సర్వీస్ను ఎన్సీఆర్టీసీ అభివృద్ధి చేస్తోంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనేది ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలతోపాటు కేంద్రం ప్రభుత్వం జాయింట్ వెంచర్ కంపెనీ. మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్లే ప్రతి రాపిడ్ఎక్స్ రైలులో ప్రీమియం కోచ్ తర్వాత మహిళలకు ఒక ప్రత్యేక కోచ్ ఉంటుంది. రిజర్వ్డ్ కోచ్లో 72 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. పిల్లలున్న తల్లిదండ్రులకు ఉపయుక్తంగా ప్రతి స్టేషన్లోనూ డైపర్ మార్చేందుకు ప్రత్యేక వసతి ఏర్పాటు చేయడం విశేషం. -
ఎగిరే కారుకు ఆమోదం.. ఇక త్వరలో గాల్లోకి..
ప్రపంచంలోని మొట్టమొదటి ఎగిరే కారు (Flying Car) ఇప్పుడు ఫ్లైట్ సర్టిఫికెట్ పొందింది. 177 కిలో మీటర్ల రేంజ్తో రూపొందించిన ఎలక్ట్రిక్ ఎగిరే కార్లను 2025 చివరి నాటికి కస్టమర్లకు డెలివరీ చేయడం ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. అలెఫ్ ఏరోనాటిక్స్ తయారు చేస్తున్న ఫ్లయింగ్ కారు ఎగరడానికి యూఎస్ ప్రభుత్వం నుంచి చట్టపరమైన ఆమోదం పొందింది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) నుంచి ప్రత్యేకమైన ఎయిర్వర్తీనెస్ సర్టిఫికేషన్ను పొందినట్లు కార్ కంపెనీ ప్రకటించింది. ఏవియేషన్ న్యాయ సంస్థ ‘ఏరో లా సెంటర్’ ప్రకారం.. ఈ తరహా వాహనం యూఎస్లో ఇలాంటి సర్టిఫికెట్ పొందడం ఇదే మొదటిసారి. ఫాక్స్ న్యూస్ ప్రచురించిన కథనం ప్రకారం.. కాలిఫోర్నియాలోని శాన్ మాటియో కేంద్రంగా తయారైన ఈ ఫ్లయింగ్ కారు వంద శాతం పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం. ఒకరు లేదా ఇద్దరు ఇందులో ప్రయాణించవచ్చు. రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు ఈ కారు గాల్లో ప్రయాణించగలదు. దీని ధర సుమారు 3 లక్షల డాలర్లు (రూ. 2.5 కోట్లు) ఉండనుంది. గతేడాది అక్టోబరులో రెండు వర్కింగ్ ఫుల్ సైజ్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ కార్లను ఫుల్ సైజ్ స్పోర్ట్స్ కార్తోపాటు కంపెనీ ఆవిష్కరించింది. తమ వాహనాలకు 440కిపైగా వ్యక్తిగత, కార్పొరేట్ కస్టమర్ల నుంచి ముందస్తు ఆర్డర్ల వచ్చినట్లు కంపెనీ గత జనవరిలో పేర్కొంది. నివేదికల ప్రకారం.. 2025 చివరి నాటికి కస్టమర్లకు ఎగిరే కార్లను డెలివరీ చేయడం ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. చరిత్రలో మొట్టమొదటి నిజమైన ఎగిరే కారును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, పెద్ద సంఖ్యలో ముందస్తు ఆర్డర్లు లభించడం ఇలాంటి కార్లకు రానునన్న మార్కెట్ సామర్థ్యాన్ని తెలియజేస్తోందని అలెఫ్ కంపెనీ సీఈవో జిమ్ దుఖోవ్నీ ఈ ఏడాది ప్రారంభంలో ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అలెఫ్ కంపెనీ వెబ్సైట్ ప్రకారం.. సాధారణ పట్టణ, గ్రామీణ రోడ్లపై నడపడానికి ఫ్లయింగ్ కారును అభివృద్ధి చేస్తున్నారు. మామూలు పార్కింగ్ స్థలంలోనే ఈ కారును పార్క్ చేయవచ్చు. ఇది తక్కువ వేగంతో నడిచే వాహనం కాబట్టి రోడ్లపై గంటకు 25 మైళ్లకు మించి వేగంగా వెళ్లదు. కానీ వేగంగా వెళ్లాలనుకుంటే కారును గాల్లోకి లేపి వేగంగా ప్రయాణించవచ్చు. 【空飛ぶカート】 Alef Aeronautics社の一部制限ありで公道走行も可能な電動LSV「モデルA」がFAAから限定的な特別耐空証明を取得。名実共に「空飛ぶカート」(eVTOL)となった模様。#空飛ぶクルマ 《Weird gimballed-cabin eVTOL “flying car” receives limited FAA approval》https://t.co/8wKi2GTqvC pic.twitter.com/lwPSCMDpyk — Iwahori Toshiki (@iw_toshiki) June 29, 2023 -
హీరోలందరికి ఎఫైర్లున్నాయి.. నా భర్తను మాత్రమే ఎందుకంటారు?
అలనాటి బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు పాత తరంలో చెప్పలేనంత ఫ్యాన్ బేస్ ఉన్న హీరో.. ఇప్పటికీ తను నటించిన షోలే(1975) సినిమా భారతీయ సినీ చరిత్రలో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికి ఈ సినిమా ఏదో ఒక చోట ఆడుతూనే ఉంది. దీంతో నేటి తరం వారికి కూడా ఆయనంటే అభిమానం. (ఇదీ చదవండి: అభిమాని చేసిన పనికి భావోద్వేగానికి గురైన తమన్నా) ప్రముఖ నటి హేమమాలిని ధర్మేంద్ర జీవితంలో అడుగుపెట్టేనాటికే అతడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ హేమమాలినితో అతడు ప్రేమలో పడ్డాడు. అటు ఆమె కూడా ధర్మేంద్రను ఎంతగానో ప్రేమించింది. ఈ ప్రేమకు మొదటి పెళ్లి అడ్డవుతుందని అంతా అనుకున్నారు, కానీ వారు మాత్రం అలాంటి భయాలేమీ పెట్టుకోలేదు. 1980లో హేమమాలినిని రెండో పెళ్లి చేసుకుని తన జీవితంలోకి స్వాగతించాడు. కాగా వారికి 1981లో ఇషా డియోల్, 1985లో అహనా డియోల్ జన్మించారు. తాజాగా ఇదే విషయంపై హేమమాలినిని ధర్మేంద్ర పెళ్లి చేసుకోవడంపై మొదటి భార్య ప్రకాష్ కౌర్ సమర్థించింది. హేమమాలిని కూడా ధర్మేంద్రకు సంబంధించిన ఇతర కుటుంబ సభ్యులతో చాలా మర్యాదగానే ప్రవర్తిస్తుందని ప్రకాష్ కౌర్ చెప్పుకొచ్చింది. గతంలో దర్మేంద్రను 'ఉమెనైజర్' అని పలువురు కామెంట్లు చేశారు.. అదే కామెంట్లను ఇప్పుడు కూడా కొందరు చేస్తూ ఉంటారు. అని ప్రకాష్ కౌర్ ఇలా స్పందించింది. (ఇదీ చదవండి: ఆమెకు ఇష్టం లేకున్నా ఎలా పట్టుకుంటావ్.. నటుడిపై ట్రోల్స్) 'నా భర్త మాత్రమే ఎందుకు, ఏ మగాడైనా నాకంటే హేమమాలినినే ఇష్టపడతారు. ఇండస్ట్రీలో సగం మంది ఇదే పని చేస్తున్నప్పుడు నా భర్తను ఉమెనైజర్ అని పిలవడానికి ఎవరైనా ఎంత ధైర్యం చేస్తారు? హీరోలందరూ ఎఫైర్లు పెట్టుకుని రెండో పెళ్లి చేసుకుంటున్నారు. అతను నాకు మంచి భర్త కాకపోవచ్చు, కానీ అతను ఖచ్చితంగా ఉత్తమ తండ్రి. అతని పిల్లలు అతన్ని చాలా ప్రేమిస్తారు. అతను వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు.' అని చెప్పింది. ధర్మేంద్ర మొదటి భార్య పిల్లలు బాలీవుడ్లో టాప్ హీరోలైన సన్నీ డియోల్,బాబీ డియోల్ అని తెలిసిందే. కాగా వారికి విజేత,అజీత అనే సోదరీమణుల ఉన్నారు. -
ఒటీటీ నుంచి వస్తున్న మొదటి స్పై థ్రిల్లర్ మూవీ ఇదే..
వైవిధ్యమైన కంటెంట్ను అందిస్తూ ఆడియెన్స్ హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ ప్లాట్ఫాం జీ 5. ఇప్పుడు సరికొత్త యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘మిషన్ తషాఫి’ ఒరిజినల్తో ఆకట్టుకోవటానికి సిద్ధమవుతోంది. ఎంగేజింగ్, థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్ను డైరెక్ట్ చేస్తున్నారు. సిమ్రాన్ చౌదరి, శ్రీకాంత్ అయ్యంగార్, అనీష్ కురువిల్లా, ఛత్రపతి శేఖర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రధాన తారాగణంగా నటించబోయే నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. హై ఇంటెన్స్ స్పై థ్రిల్లర్గా రూపొందుతోన్న ‘మిషన్ తషాఫి’ ఒరిజినల్ రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందని మేకర్స్ తెలిపారు. (ఇదీ చదవండి: నేను చనిపోతే శేఖర్,జానీ చేసేది ఇదే.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్) 8 ఎపిసోడ్స్ ఉన్న ‘మిషన్ తషాఫి’ వెబ్ సిరీస్ను ఫిల్మ్ రిపబ్లిక్ బ్యానర్పై ప్రణతి రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు ఓటీటీ చరిత్రలో ఇప్పటి వరకు రూపొందని విధంగా ఈ హై ఇన్టెన్స్ యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ను జీ 5 భారీ బడ్జెట్తో రూపొందిస్తుంది. ప్రముఖ అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు చిత్రీకరించని సరికొత్త లొకేషన్స్లో ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. (ఇదీ చదవండి: వైరల్ అవుతున్న హీరోయిన్ లిప్లాక్ వీడియో) -
Adipurush: సినిమా రిలీజ్ తర్వాత తొలిసారి ట్వీట్ చేసిన ఓం రౌత్
ప్రభాస్ కీలక పాత్రలో ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్ ’ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమాపై డివైడ్ టాక్ వస్తున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. కానీ నెటిజన్స్ మాత్రం దర్శకుడు ఓం రౌత్ని ట్రోల్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఇదీ.. ఓం రౌత్ రామాయణం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో రామాయణంలో వున్న కథని వక్రీకరించి ఓం రౌత్ తనకి నచ్చిన కథని పెట్టుకున్నాడు అని విమర్శలు వస్తున్నాయి. (ఇదీ చదవండి: Adipurush: ఫస్ట్ డే కలెక్షన్స్ తుఫాన్.. పక్కాగా ఆ సినిమాలను దాటేస్తుంది) దీంతో 'ఓం! కమ్ టు మై రూమ్' అనే వర్డ్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది. తాజాగా సినిమాపై ఆయన ఓ ట్వీట్ చేశారు. థియేటర్లలో హనుమంతుడి కోసం కేటాయించిన సీట్ల ఫోటోలను ఒకచోటకు చేర్చి ట్విటర్లో షేర్ చేశాడు. 'జై శ్రీరామ్' అంటూ దేశంలోని అన్ని థియేటర్లు భక్తితో నిండిపోయాయని తెలిపాడు. ఆదిపురుష్ కథపై వస్తున్న విమర్శలకు ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. Jai Shri Ram 🙏🏼 pic.twitter.com/oyXY57U7Lz — Om Raut (@omraut) June 17, 2023 (ఇదీ చదవండి: ఓం రౌత్ను ప్రభాస్ డైలాగ్తోనే ఆడుకుంటున్న నెటిజన్లు) -
మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకున్న నయన్- విఘ్నశ్ (ఫొటోలు)
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిన అమన్ గుప్తా..
ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ సహ వ్యవస్థాపకుడు అమన్ గుప్తా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిశారు. రెడ్ కార్పెట్ మీద భార్య ప్రియా దాగర్తో కలిసి అడుగులు వేశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇలా రెడ్ కార్పెట్పై నడిచిన మొదటి భారతీయ పారిశ్రామిక వేత్త ఆయనే. అమన్ గుప్తా తొలిసారిగా కేన్స్ ప్రదర్శన కోసం భార్య ప్రియా దాగర్తో కలిసి వచ్చారు. ఈ మేరకు అమన్ గుప్తా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఫొటోలను షేర్ చేశారు. ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్పై నడిచిన తొలి భారతీయ పారిశ్రామికవేత్తను నేనే కావడం గర్వంగా ఉంది’ అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Aman Gupta (@boatxaman) మరోవైపు బాలీవుడ్ తారలు సారా అలీ ఖాన్, మానుషి చిల్లర్, ఈషా గుప్తా, మృణాల్ ఠాకూర్ వంటి వారు ఈ సంవత్సరం కేన్స్లోకి అడుగుపెట్టారు. కేన్స్ వెటరన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ లోరియల్ బ్రాండ్ అంబాసిడర్గా 21వ సారి ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చింది. -
నడక హక్కును అమలు చేసిన తొలి రాష్ట్రం.. అక్కడ ఫుట్పాత్లు తప్పనిసరి!
దేశంలో నడక హక్కు (రైట్ టు వాక్)ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. రోడ్డు ప్రమాదాల కారణంగా పాదచారులు, సైక్లిస్టుల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్హెచ్ఏఐతో సహా అన్ని రహదారి యాజమాన్య ఏజెన్సీలు రోడ్ల నిర్మాణం, విస్తరణలో భాగంగా ఫుట్పాత్లు నిర్మించడాన్ని తప్పనిసరి చేసింది పంజాబ్ ప్రభుత్వం. తద్వారా 'నడక హక్కు'ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఇదీ చదవండి: Mothers Day: బడా వ్యాపారవేత్తలైనా తల్లిచాటు బిడ్డలే.. టాప్ బిజినెస్ టైకూన్స్ మాతృమూర్తుల గురించి తెలుసా? పంజాబ్ హర్యానా హై కోర్ట్, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిల్ పై ఆయా కోర్టు ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది . పంజాబ్ చీఫ్ సెక్రటరీ విజయ్ కుమార్ జంజువా ఆ రాష్ట్ర ప్రభుత్వ ట్రాఫిక్ సలహాదారు నవదీప్ అసిజాకు ఇచ్చిన సమాచారం మేరకు.. రాష్ట్రంలో ఇకపై చేపట్టే అన్ని రోడ్ల నిర్మాణాలు, విస్తరణల్లో సైకిల్ ట్రాక్లు, ఫుట్పాత్ల ఏర్పాటు తప్పనిసరి. ఈ మేరకు ఫుట్పాత్లు, సైకిల్ ట్రాక్లను నిర్మించడానికి కావాల్సిన బడ్జెట్, కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, స్థానిక సంస్థలు, ఎన్హెచ్ఏఐ, అర్బన్ డెవలప్మెంట్ విభాగాలకు కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం నుంచి లేఖలు అందాయి. ఇదీ చదవండి: మొబైల్ ఫోన్ పోయిందా? ఇక చింతే లేదు.. త్వరలో పటిష్ట వ్యవస్థ! -
ఈ ఓడ ఏ ఇంధనంతో నడుస్తుందో తెలుసా? పర్యావరణానికి ఎంతో మేలు!
ఎరువుగా ఉపయోగించే అమోనియాను వాహనాలకు ఇంధనంగా ఉపయోగించే పద్ధతి మొదలైంది. అమెరికాలోని బ్రూక్లిన్కు చెందిన ‘అమోగీ’ సంస్థ ఇదివరకే అమోనియాతో నడిచే ట్రక్కు, ట్రాక్టర్లను విజయవంతంగా రూపొందించింది. ఇటీవల అమోనియా ఇంధనంగా నడిచే ఓడను కూడా ఈ సంస్థ రూపొందించింది. ఇదీ చదవండి: ఈ స్మార్ట్ వాచ్ సూపర్! 12 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఇంకా మరెన్నో కళ్లుచెదిరే ఫీచర్లు! నార్వేకు చెందిన ‘యారా క్లీన్ అమోనియా’ సంస్థ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న ‘గ్రీన్ అమోనియా’ను వాడుకుని నడిచే వాహనాలను ‘అమోగీ’ సంస్థ తయారు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల పూర్తిగా అమోనియానే ఇంధనంగా ఉపయోగించుకుని ప్రయాణించే ఓడను రూపొందించింది. అమోనియాను ఇంధనంగా ఉపయోగించుకోవడం వల్ల పర్యావరణంలోకి కర్బన ఉద్గారాల విడుదల పూర్తిగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విద్యుత్ వాహనాల వినియోగానికి తగిన వెసులుబాటు లేని ప్రాంతాల్లో అమోనియాతో నడిచే వాహనాలు అద్భుతంగా ఉపయోగపడతాయని వారు చెబుతున్నారు. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
దేశంలో తొలి లిథియం బ్యాటరీ ప్లాంటు షురూ
న్యూఢిల్లీ: లిథియం అయాన్ సెల్ తయారీలో దేశంలో తొలి ప్లాంటు బెంగళూరు సమీపంలో ప్రారంభం అయింది. బ్యాటరీ టెక్నాలజీ స్టార్టప్ లాగ్9 మెటీరియల్స్ దీనిని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం తొలి దశ సామర్థ్యం 50 మెగావాట్ అవర్. ‘దేశీయ మార్కెట్ కోసం సెల్స్ను భారత్లో రూపొందించాం. ఇదీ చదవండి: కియా, హ్యుందాయ్ కంపెనీలకు షాక్! ఆ కార్లు రీకాల్ చేసేయాలని అభ్యర్థనలు ఇక్కడి వాతావరణ పరిస్థితులు, కస్టమర్లకు అనువుగా ఉంటాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ లక్ష్యాన్ని సాకారం చేయడంలో సహాయం చేస్తూ భారత్ను స్వావలంబన చేయడంలో కీలక పాత్ర పోషించబోతున్నాం’ అని లాగ్9 కో–ఫౌండర్, సీఈవో అక్షయ్ సింఘాల్ ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీ తయారీ బ్యాటరీలు 3,000 పైచిలుకు ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించారు. 20కిపైగా నగరాల్లో విస్తరించినట్టు సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
మూత పడనున్న మరో బ్యాంక్? షేర్లు భారీగా పతనం...
అమెరికా సిలికాన్ బ్యాంక్ దివాలా తర్వాత అమెరికాకు చెందిన మరో బ్యాంక్ మూతవేత దిశగా పయనిస్తోంది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ బ్యాంక్తోపాటు మరో ఐదు బ్యాంకింగ్ సంస్థలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ డౌన్గ్రేడ్ కోసం పరిశీలనలో ఉంచింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్లు ఆదివారం (మార్చి12న) ఓపెనింగ్లో రికార్డు స్థాయిలో 67 శాతం పడిపోయాయి. ఫెడరల్ రిజర్వ్, జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కోతో సహా ఒప్పందాల కార్యకలాపాల నిర్వహణ కోసం 70 బిలియన్ డాలర్లకుపైగా అన్ఓపెన్డ్ లిక్విడిటీని కలిగి ఉన్నట్లు బ్యాంక్ ప్రకటించినప్పటికీ షేర్ల పతనం ఆగలేదు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం తర్వాత స్టాక్ మార్కెట్లో పెద్ద బ్యాంకింగ్ సంస్థలు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. మూడీస్ పరిశీలనలో ఉంచిన బ్యాంకుల్లో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్తో పాటు వెస్ట్రన్ అలయన్స్ బాన్కార్ప్, ఇంట్రస్ట్ ఫైనాన్షియల్ కార్ప్, యూఎంబీ ఫైనాన్షియల్ కార్పొరేషన్, జియన్స్ బాన్కార్ప్, కొమెరికా ఇంక్ సంస్థలు ఉన్నాయి. బ్యాంకింగ్ సంస్థలు బీమా చేయని నిధుల లిక్విడిటీపై ఆధారపడటం, పెట్టుబడి పోర్ట్ఫోలియోలలో అవాస్తవిక నష్టాలపై క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ ఆందోళన వ్యక్తం చేసింది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్లు 61.83 శాతం తగ్గాయి. గత వారంలో ఈ బ్యాంక్ స్టాక్ విలువ 74.25 శాతం పడిపోయింది. ఇంతకుముందు ట్రేడింగ్ రోజున దీని విలువ ఒక్కో షేరుకు 19 డాలర్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ పతనానికి చేరుకునే ముందు ఇలాంటి సంకేతాలకే ఇచ్చాయి. ట్రేడింగ్ నిలిపేసే ముందు ప్యాక్వెస్ట్ బ్యాంక్ షేర్లు 82 శాతం క్షీణించాయని, వెస్ట్రన్ అలయన్స్ బాన్కార్ప్ సంస్థ షేర్లు సగానికి పైగా పడిపోయాయని వియాన్ అనే సంస్థ నివేదించింది. -
మరో మైలురాయి: జియో 5జీ సేవల్లో తొలి రాష్ట్రంగా గుజరాత్
సాక్షి,ముంబై: దేశ వ్యాప్తంగా 5జీ సేవలను అందించే లక్క్ష్యంతో రిలయన్స్ జియో దూసుకుపోతోంది. ఇప్పటికే ట్రూ-5జీ సేవలను పలు నగరాల్లో ప్రారంభించిన జియో తాజాగా మరో ఘనతను సాధించింది. భారతదేశంలో జియో 5 జీ సేవలను పూర్తిగా పొందిన తొలి రాష్ట్రంగా గుజరాత్ అవతరించింది. ఈ విషయంలో రిలయన్స్ జన్మభూమి కాబట్టి గుజరాత్ ప్రత్యేక స్థానంలో నిలిచింది. (ఈపీఎఫ్వో ఖాతాదారులకు తీపికబురు!) ‘ట్రూ 5G ఫర్ ఆల్’ ఇనిషియేటివ్ కింద జిల్లా ప్రధాన కార్యాలయాలలో 100శాతం ట్రూ 5జీ సేవలను అందించనుంది. ‘జియో ట్రూ-5జీ వెల్కమ్ ఆఫర్’ నేటి (నవంబరు 25) నుంచి 33 జిల్లా కేంద్రాల్లో 5జీ సేవలు పొందుతారు. ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా 1జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా పొందొచ్చని జియో ఒక ప్రకటనలో వెల్లడించింది. (ఐకానిక్ అశోక్ హోటల్@ రూ.7,409 కోట్లు) గుజరాత్లో ఈ శుభారంభం ఒక ముఖ్యమైన నిజమైన 5G-ఆధారిత చొరవతో జరుగుతోందని కంపెనీ ప్రకటించింది. రిలయన్స్ ఫౌండేషన్, జియో కలిసి ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ కింద మొదట గుజరాత్లోని 100 పాఠశాలల్ని డిజిటలైజ్ చేసి, దీనితో పాఠశాలల్ని అనుసంధానం చేస్తుందని జియో ప్రకటించింది. ⇒ JioTrue5G కనెక్టివిటీ ⇒ అధునాతన కంటెంట్ ప్లాట్ఫారమ్ ⇒ ఉపాధ్యాయ & విద్యార్థి సహకార వేదిక ⇒ స్కూల్ మేనేజ్మెంట్ ప్లాట్ఫారమ్ ఈ సాంకేతికత ద్వారా, దేశవ్యాప్తంగా మిలియన్ల మంది విద్యార్థులు లబ్ది పొందుతారు. డిజిటల్ ప్రయాణంలోనాణ్యమైన విద్య , తద్వారా సాధికారత ఈజీ అవుతుందని కంపెనీ తెలిపింది. 100 శాతం జిల్లా ప్రధాన కార్యాలయాలు 5జీకి అనుసంధానమైన తొలిరాష్ట్రంగా గుజరాత్ నిలవడం సంతోషంగానూ, గర్వంగానూ ఉందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. రాబోయే పది, పదిహేనే ళ్లలో 300-400 మిలియన్ల నైపుణ్యం కలిగిన భారతీయులు వర్క్ఫోర్స్లో చేరనున్నారు. ప్రతి భారతీయుడికి మెరుగైన జీవన ప్రమాణాన్ని మాత్రమే అందించడంతోపాటు,2047 నాటికి అభివృద్ధి చెందిన మన దేశ ఆర్థిక వ్యవస్థగా మారాల ప్రధానమంత్రి లక్క్ష్య సాధనతో తోడ్పడుతుందన్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జియో 1.3 బిలియన్ల యూజర్లతో డిజిటల్ రంగంలో ఇండియాను గ్లోబల్ లీడర్గా నిలిపిందని పేర్కొంది. (Bisleri Success Story 1969-2022: అపుడు 4 లక్షలు, ఇపుడు వేల కోట్లు, ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది?) -
మన దేశంలో ట్విటర్ తొలి యూజర్ ఎవరో తెలుసా?
దాదాపు 16 ఏళ్ల కిందట.. ట్విటర్ పుట్టుక దశలో ఉన్నప్పుడే మన దేశం నుంచి ఒకావిడ ఆ మైక్రోబ్లాగింగ్ సైట్ను వాడింది. ఆవిడ పేరే నైనా రెద్దు. దేశంలోనే తొలి ట్విటర్ యూజర్ అనే విషయం మీకు తెలుసా?. అంతేకాదు ఆమె ప్రొఫైల్కు బ్లూటిక్ కూడా ఉంది. తాజాగా ఎలన్ మస్క్ చేతికి ట్విటర్ వెళ్లడం.. గుణాత్మకం పేరిట అందులో చోటు చేసుకుంటున్న మార్పులపై నైనా స్పందించారు. ఆర్కుట్, బ్లాగింగ్ జమానా టైంలో ట్విటర్ ఇంకా అధికారికంగా అడుగుపెట్టని సమయమది. ఆ ఏడాది(2006)లో TWTTR(ట్విటర్ ప్రాజెక్టు కోడ్ పేరు) పేరిట ఒక మెయిల్ నైనాకు వచ్చింది. ఏదో ఇన్విటేషన్ అనుకుని అందులో చేరారామె. అలా చేరిన ఆమె.. భారత్ తరపున తొలి ట్విటర్ యూజర్ ఖ్యాతిని దక్కించుకున్నారు. నైనా రెద్దు ప్రస్తుతం.. జైసల్మేర్(రాజస్థాన్)లోని ఓ హోటల్లో పని చేస్తున్నారు. అది కాక ఇంకా ఆమెకు కొన్ని హాబీలు పేరు తెచ్చి పెట్టాయి. ప్రస్తుతం ఆమె ఖాతాలో 22 వేల పైగా ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. అందులో సెలబ్రిటీలే ఎక్కువ కావడం గమనార్హం. అయినా ఫాలోవర్స్ సంఖ్య ప్రామాణికం కాదంటున్నారు ఆమె. ఇప్పటిదాకా ఆమె లక్షా 75వేలకు పైగా ట్వీట్లు చేశారు. ఈ క్రమంలో మొదటి నుంచి ట్విటర్లో ఇప్పటిదాకా వచ్చిన మార్పులు, ఎలన్ మస్క్ పగ్గాల గురించీ ఆమె స్పందించారు. TWTTR పేరుతో అందింన ఆహ్వానం నాకింకా గుర్తుంది. అది ట్విటర్ మహావృక్షంగా ఎదుగుతుందని ఆనాడు నేను ఊహించనే లేదు. ఆ టైంలో భారత్ నుంచి యూజర్లు ఎవరూ లేరు. ట్విటర్ ఉద్యోగులు, వాళ్ల స్నేహితులు మాత్రమే ఛాటింగ్లో పాల్గొనేవాళ్లు. ముంబైలో ఉద్యోగం కోసం వచ్చాక.. నేనూ అందులో మెసేజ్లు చేయాలని అనుకున్నా. కేవలం అదొక మెసేజింగ్ ప్లాట్ఫామ్ అనుకుని ఆగిపోయా. అలా ఏడాదిన్నర గడిపోయాక.. ఆ ప్లాట్ఫామ్ గురించి విషయం అర్థమైంది. ట్వీట్లు చేయడం ప్రారంభించా. అమెరికాలో ఓ ఆర్టికల్లో తొలి 140 మంది ట్విటర్ యూజర్ల మీద ఓ కథనం ప్రచురితమైంది. అందులో నా పేరు చూసుకున్నాకే అర్థమైంది.. ఇదేదో ప్రత్యేకమైన ఫ్లాట్ఫామ్ అని. ఆ తర్వాత తక్కువ యూజర్లే ఉన్నప్పటికీ.. తొలి యూజర్కావడంతో ట్విటర్ నుంచి ఆమెకు బ్లూటిక్ మార్క్ దక్కింది. ఇక తాజాగా ఎలన్ మస్క్ బ్లూటిక్కు డబ్బులు వసూలు చేసే అంశంపైనా నైనా స్పందించారు. నెలకు రూ.650(8 డాలర్లు) దాకా చెల్లించాలని అంటున్నారు. అసలు ఎందుకు చెల్లించాలన్న దానిపై స్పష్టత లేదు కదా. ఇప్పుడున్న బ్లూటిక్ అకౌంట్ల విషయంలోనా? కొత్తగా రాబోతున్న అకౌంట్ల విషయంలోనా? లేదంటే ఇంకా ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ప్రతీ ఒక్కరికీ అంటే మాత్రం అది సహేతుకం కాదు. ట్విటర్ ఒక ప్రైవేట్ కంపెనీ. పబ్లిక్ ఫిగర్లకు వెరిఫై పేరిట బ్లూటిక్లను కేటాయించడం మొదలుపెట్టింది. గత 16 ఏళ్లుగా నేను చెల్లింపులు చేయలేదు. అలాంటిది ఇప్పుడెందుకు చేయాలి? అని మస్క్ నిర్ణయంపై నిలదీశారామె. ఇక భారత్లో బ్లూటిక్ చెల్లింపుల పరిణామం అంతగా ఉండకపోచ్చని ఆమె వ్యాఖ్యానించారు. బ్లూటిక్ అనేది సాధారణంగా అవసరం లేని వ్యవహారం. కచ్చితంగా కావాలని అనుకునేవాళ్లు డబ్బు చెల్లిస్తారు. అవసరం లేదనుకునే వాళ్లు మానుకుంటారు. అయితే ఇండిపెండెంట్ జర్నలిజం లాంటి పనులు చేసుకునేవాళ్లకు మాత్రం ఇది ప్రభావం చూపించొచ్చు అని నైనా తెలిపారు. ఇక ట్విటర్ స్వేచ్ఛా ప్రకటనపై ఆమె భిన్నంగా స్పందించారు. ట్విటర్కు స్వేచ్ఛకు సంబంధం ఉందని తాను అనుకోవడం లేదని అన్నారామె. మిగతా యాజర్లలాగా తాను ఇతర సోషల్ మీడియా అకౌంట్లను వాడుతున్నానని, ట్విటర్లో రాబోయే మార్పులు తనపై ప్రభావం చూపించకపోవచ్చని ఆమె అంటున్నారు. Whatever is said and done, there's definitely more excitement on Twitter now, than I've seen in ages, that has nothing to do with government politics. — Naina (@Naina) November 8, 2022 -
యూట్యూబ్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఇదే!
వైరల్: ఇంటర్నెట్, సోషల్ మీడియా.. అందునా వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ యూట్యూబ్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. అలాంటి ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసిన మొదటి వీడియో ఏదో తెలుసా? యూట్యూబ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఉంచింది యూట్యూబ్ ఇండియా. యూట్యూబ్సహ వ్యవస్థాపకుడు జావెద్ కరీం అప్లోడ్ చేసిన ఆ వీడియోను.. పదిహేడేళ్ల కిందట అప్లోడ్ చేశారట. శాన్ డియాగో(కాలిఫోర్నియా) జూ ఎన్క్లోజర్లో ఏనుగు దగ్గర ఉండి ఆయన వీడియో తీసుకున్నాడు. ఆయన తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన ఏకైక వీడియో ఇదేకాగా.. దానికి 235 మిలియన్ వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ అధికారికంగా లాంఛ్ అయ్యింది ఫిబ్రవరి 14, 2005లో. గూగుల్ తర్వాత ఈ ప్రపంచంలో అత్యధిక మంది ఉపయోగించే వెబ్సైట్గా యూట్యూబ్ ఆన్లైన్ వీడియో షేరింగ్ యాప్కు పేరుంది. View this post on Instagram A post shared by YouTube India (@youtubeindia) -
భారత్లో తొలి ఒమిక్రాన్ మరణం ఆ రాష్ట్రంలోనే.. వెల్లడించిన కేంద్రం
జైపూర్: కోవిడ్ మహమ్మారి ఒమిక్రాన్ వేరియంట్గా రూపాంతరం చెంది ప్రపంచదేశాలతో పాటు భారత్ను అల్లాడిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ వేరియంట్ కారణంగా భారత్లో ఒక్క మరణం కూడా లేకపోవడంతో ప్రభుత్వాలు, ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే తాజాగా ఒమిక్రాన్ తొలి మరణం రాజస్తాన్లో నమోదైనట్లు కేంద్రం తెలిపింది. వివరాల ప్రకారం.. 72 ఏళ్ల ఓ వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్తో పాజిటివ్గా రావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. చికిత్స తీసుకుంటుండగా అతనికి ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఒక అధికారి తెలిపారు. ఇదివరకే మహరాష్ట్ర నుంచి ఓ బాధితుడి ఒమిక్రాన్ కారణంగా మృతి చెందినట్లు వార్తలు వచ్చినప్పటికీ అతని మరణానికి ఒమిక్రాన్ కారణం కాదని తేలింది. దీంతో రాజస్తాన్లో నమోదైన మరణమే దేశంలో తొలి ఒమిక్రాన్ మరణంగా నమోదైంది. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 653 ఒమిక్రాన్ కేసులు ఉండగా ఢిల్లీలో 464 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. రాజస్థాన్లో 174 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,135 ఒమిక్రాన్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. చదవండి: Omicron Variant Updates In India: ‘ఒమిక్రాన్ కేసుల జోరు.. భారత్లో మూడో వేవ్, ఢిల్లీలో ఐదో వేవ్’ -
మనకు తెలియని యోధురాలు.. ఆమె ఎవరు?
చరిత్ర కూడా చాలా చమత్కారమైనది. అది కొందరిని ముందుకు తెస్తుంది. కొందరిపై మసక తెర వేస్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయి తెలిసినట్టుగా వేలు నాచ్చియార్ తెలియదు. ఒకరు ఉత్తర భారతదేశం అయితే ఒకరు దక్షిణ భారతదేశం. ఇద్దరూ బ్రిటిష్ వారిపై పోరాడారు. తమిళనాడుకు చెందిన రాణి వేలూ నాచ్చియార్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఆమె జయంతి సందర్భంగా ప్రధాని నివాళి అర్పించడంతో వేలూ నాచ్చియార్ ఎవరు అని కుతూహలం ఏర్పడింది. ఆమె ఎవరు? జనవరి 3 ‘రాణి వేలూ నాచ్చియార్’ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆమెను తలుచుకున్నారు. ‘నారీ శక్తికి ఆమె సంకేతం’ అని ట్విటర్ ద్వారా శ్లాఘించారు. సోషల్ మీడియాలో ఆ వెంటనే రాణి వేలూ నాచ్చియార్ వర్ణ చిత్రాలు ఫ్లో అయ్యాయి. అచ్చు ఝాన్సీ లక్ష్మీ బాయిలా గుర్రం మీద కూచుని చేతిలో కత్తి పట్టుకుని ఉన్న వేలూ నాచ్చియార్ గురించి దేశానికి తెలిసింది ఎంత అనే సందేహం వచ్చింది నెటిజన్లకు. ఝాన్సీ లక్ష్మీ బాయి కంటే యాభై అరవై ఏళ్లకు పూర్వమే బ్రిటిష్ వారిపై పోరాడి విజయం సాధించిన తొలి రాణి అయినప్పటికీ ఆమె ఘన చరిత్ర బయటకు రాకుండా బ్రిటిష్ వాళ్లు జాగ్రత్త పడ్డారన్నది ఒక కథనం. దానికి కారణం ఆమె చేతిలో వారు ఓడిపోవడమే. చరిత్రలో తొలి మానవ బాంబును ప్రయోగించిన ఘనత కూడా వేలూ నాచ్చియార్దే కావడం విశేషం. శివగంగ రాణి నేటి రామనాథపురంలో 18 వ శతాబ్దంలో నెలకొన్న రామనాథ రాజ్యపు యువరాణి వేలూ నాచ్చియార్. 1730 జనవరి 3న జన్మించింది. ఆమె ఒక్కగానొక్క కూతురు కావడంతో తల్లిదండ్రులు ఆమెకు అన్ని విద్యలు నేర్పించారు. తమిళం మాతృభాష అయినప్పటికీ నాచ్చియార్ ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం సంపాదించింది. ఆమెకు 16 ఏళ్లు వచ్చాక 1746లో– గతంలో రామనాథ రాజ్యం నుంచి విడిపోయి మరొక రాజ్యంగా ఏర్పడిన శివగంగ రాజ్యానికి కోడలుగా వెళ్లింది. శివగంగ రాజ్య యువరాజు వడుగనాథ దేవర్ ఆమెకు భర్త అయ్యాడు. వాళ్లకు వెళ్లాచ్చి అనే కూతురు పుట్టింది. ఆ విధంగా రామనాథ రాజ్యం, శివగంగ రాజ్యం హాయిగా తమ ప్రాభవాన్ని కొనసాగిస్తూ ఉండగా బ్రిటిష్వారు ఊడిపడ్డారు. బ్రిటిష్ దాడి అప్పటికే దేశం లోపలి రాజ్యాల నడుమ ఉన్న లుకలుకలను ఉపయోగించుకుని తమ పెత్తనాన్ని స్థిరపరుచుకుంటూ వస్తున్న బ్రిటిష్ వారు దక్షిణాదిలో తమ విస్తరణ కోసం ఆర్కాట్ నవాబుతో చేయి కలిపారు. అప్పటికి ఆర్కాట్ నవాబు మధురై నాయక రాజ్యాన్ని ఆక్రమించుకుని ఉన్నాడు. అతనికి రామనాథ రాజ్యం, శివగంగ రాజ్యం కప్పం కట్టడానికి అంగీకరించలేదు. దాంతో బ్రిటిష్ వారు అతనిని రెచ్చగొట్టి ఆ రాజ్యాలను హస్తగతం చేసుకోవాలనుకున్నారు. అది 1772వ సంవత్సరం. శివగంగ ఆలయానికి దర్శనానికి నిరాయుధునిగా వెళ్లిన వడుగనాథ దేవర్పైన బ్రిటిష్ వారు హటాత్తుగా దాడి చేసి చంపేశారు. అంతేకాదు ఆలయాన్ని లూటీ చేసి 50 వేల బంగారు నాణేలు తీసుకెళ్లారు. ఆలయంలో భర్తను చంపారన్న వార్త విని వేలూ నాచ్చియార్ హతాశురాలైంది. వెంటనే ఒక మంత్రి సహాయం రాగా కుమార్తెను తీసుకుని విరూపాక్షికి వెళ్లిపోయింది. అయితే బ్రిటిష్ వారు ఆమె నమ్మినబంటు ఉడయాళ్ను పట్టుకుని ఆమె ఆచూకి కోసం నిలదీశారు. అతను చెప్పకపోయేసరికి చంపేశారు. ఈ వార్త విన్నాక వేలూ నాచ్చియార్ ఆగ్రహంతో ఊగిపోయింది. ‘బ్రిటిష్వారిని ఓడించి నా రాజ్యాన్ని తిరిగి గెలుచుకుంటాను’ అని శపథం చేసింది. 8 ఏళ్ల అజ్ఞాత వాసం వేలూ నాచ్చియర్ 8 ఏళ్లు అజ్ఞాతవాసం చేసింది. ఆమె నమ్మినబంట్లు మెల్లమెల్లగా ఆమెను చేరుకున్నారు. బ్రిటిష్ వారిని ఓడించాలన్న తలంపుతో ఆమె మాస్టర్ ప్లాన్ వేసి మహిళా దళాన్ని తయారు చేసింది. దానికి తన నమ్మినబంటైన ఉడయాళ్ పేరు పెట్టింది. ‘కుయిలీ’ అనే మహిళ దానికి నాయకురాలు. శివగంగ రాణి ఇలా బ్రిటిష్ వారిపై ప్రతీకారం కోసం ప్రయత్నిస్తున్నదని విన్న మైసూర్ నవాబు హైదర్ అలీ ఆమెకు మద్దతు ఇవ్వడానికి వచ్చాడు. ఆమె తన సైన్యం నిర్మించుకోవడానికి పూర్తి ఆర్థిక సహాయం అందించాడు. వేలూ నాచ్చియార్ తన పదాతి దళం, అశ్వదళం, మహిళా దళంతో పూర్తిగా దాడికి సిద్ధమైంది. అయితే ఆమె దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి చాలా తక్కువ. బ్రిటిష్ వారి దగ్గర ఉన్నది చాలా ఎక్కువ. దానికి విరుగుడు? మానవబాంబు. ప్రతిదాడి అది 1780. విజయదశమి రోజు. ఆ రోజున కోట గోడలు తెరిచి సామాన్యజనాన్ని ఆహ్వానిస్తారు శివగంగ రాజ్యంలో. వేలూ నాచియార్ తయారు చేసిన మహిళా దళం సభ్యులు ఆయుధాలను చీర కొంగుల్లో దాచుకుని సామాన్య మహిళలుగా కోటలోకి ప్రవేశించారు. అదను చూసి నాయకురాలు కుయిలీ ఆదేశం అందుకుని బ్రిటిష్ వారిపై ఊచకోత సాగించారు. బ్రిటిష్వారు ఆయుధగారంలోకి వెళ్లి ఆయుధాలు తీసే లోపు ఒక మానవబాంబు ఒళ్లంతా నెయ్యి పూసుకుని ఆయుధగారంలోకి వెళ్లి మంట పెట్టుకుంది. అంతే. ఆయుధగారం పేలి ఆయుధాలు వృధా అయిపోయాయి. మరోవైపు వేలూ నాచ్చియార్ తన దళంలో ఊడిపడి బ్రిటిష్ వారిని చీల్చి చెండాడి తన రాజ్యం తిరిగి దక్కించుకుంది. అవమానకరమైన ఈ ఓటమిని బ్రిటిష్ వారు చరిత్ర పుటల్లోకి ఎక్కకుండా జాగ్రత్త పడ్డారు. అప్పటికి ఆమెకు 50 ఏళ్లు. ఆ తర్వాత మరో 16 ఏళ్లు జీవించి హృద్రోగంతో 1796లో కన్నుమూసింది వేలూ నాచ్చియార్. ఆమెను తమిళనాడులో ‘వీరనారి’ అని పిలుచుకుంటారు. -
అరుదైన ఘనత.. చరిత్ర సృష్టించిన దుబాయ్
UAE City Dubai world's first govt to go 100% paperless: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశ నగరం దుబాయ్ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి 100 శాతం పేపర్లెస్ గవర్నమెంట్ ఖ్యాతి దక్కించుకుంది. ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల సేవలను, ట్రాన్జాక్షన్స్ను ‘డిజిటల్ ఫార్మట్’లోనే కొనసాగిస్తూ.. ఈ ఘనత అందుకుంది దుబాయ్ నగరం. వంద శాతం ‘పేపర్లెస్’ సాధించిన తొలి ప్రభుత్వంగా దుబాయ్ సిటీ నిలిచింది. ఈ మేరకు ఎమిరేట్స్ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. తద్వారా 14 మిలియన్ గంటల మనిషి శ్రమను.. 1.3 బిలియన్ దిర్హమ్(350 మిలియన్ డాలర్లు) ఆదా చేసినట్లు పేర్కొన్నారాయన. ప్రభుత్వానికి సంబంధించి ఇంటర్నల్, బయటి ట్రాన్జాక్షన్స్తో పాటు.. ప్రభుత్వానికి సంబంధించి ప్రతీ సేవలను డిజిటల్ పద్దతిలో.. అదీ ప్రభుత్వ వేదికల మీదుగానే సాగిందని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించుకుంది. మొత్తం 45 ప్రభుత్వ రంగాల్లో 1,800 రకాల డిజిటల్ సేవలను .. అదీ ఆలస్యం అవ్వకుండా డిజిటల్ ఫార్మట్లో ప్రజలకు చేరవేయడం విశేషం. ఈ క్రమంలో నగరవాసులపై ప్రభుత్వం ఏమాత్రం ఒత్తిడి చేయకుండా.. స్వచ్ఛందంగా ఈ ఘనత సాధించింది. పేపర్లెస్ ఘనత ప్రపంచానికి డిజిటల్ క్యాపిటల్గా నిలవడానికి దుబాయ్కు ఎంతో ప్రొద్భలం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు క్రౌన్ ప్రిన్స్. అంతేకాదు మరో ఐదు దశాబ్దాలపాటు అత్యాధునిక వ్యూహాలతో దుబాయ్లో డిజిటల్ లైఫ్ కొనసాగేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారాయన. ఇదిలా ఉంటే అమెరికా(ఖండాలు), యూకే, యూరప్ దేశాల్లో ప్రభుత్వాలు ఈ తరహా విధానానికి మొగ్గు చూపించినప్పటికీ.. సైబర్ దాడుల భయంతో వెనక్కి తగ్గాయి. కానీ, దుబాయ్ మాత్రం ధైర్యం చేసి ముందడుగు వేసి.. ఈ ఫీట్ సాధించింది. ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ మూమెంట్తో 336 మిలియన్ పేపర్లను, 1.3 బిలియన్ దిర్హమ్(350 మిలియన్ డాలర్లు) బడ్జెట్ను, 14 మిలియన్ గంటల ఉద్యోగుల శ్రమను మిగిల్చింది దుబాయ్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే ప్రపంచంలో రిచ్చెస్ట్ సిటీల్లో ఒకటిగా ఉన్న దుబాయ్ జనాభా 35 లక్షలు కాగా.. మెట్రో ఏరియాలో జనాభా 29 లక్షలకు పైనే ఉంది. చదవండి: అర్జెంటీనా టు అస్సాం వయా దుబాయ్.. ఖరీదు 20లక్షలకుపైనే! -
భారత తొలి ఎలక్ట్రిక్ కారు ఇదేనండోయ్..!
దేశ వ్యాప్తంగా చమురు ధరలు వీపరితంగా పెరిగి పోతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు బెంబేలేత్తిపోతున్నారు. దీంతో పెట్రోల్, డిజీల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించారు. ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ బైక్ కోసం లక్షలాది మంది ప్రీ బుకింగ్స్ కోసం ఎగబడ్డారు. దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని తెలియ జేయడానికి ఇది పెద్ద ఉదాహరణ..! కొనుగోలుదారుల ఆసక్తిని క్యాష్ చేసుకోవడం కోసం పలు దిగ్గజ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించాయి. ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా తొలిసారిగా నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకువచ్చింది. హ్యూందాయ్, టెస్లా, స్కోడా, టెస్లా వంటి దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను భారత్లోకి తెచ్చేందుకు పలు చర్యలను తీసుకుంటున్నాయి. చదవండి: BMW i Vision AMBY : ది సూపర్ ఎలక్ట్రిక్ సైకిల్..! రేంజ్ తెలిస్తే షాక్..! భారత తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే..! భారత్లోకి ఎలక్ట్రిక్ కార్ల వాడకం రిసేంట్గా మొదలైదనుకుంటే పొరపడినట్లే. భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ఎడ్డీ కరెంట్ కంట్రోల్ కంపెనీ రూపోందించిన లవ్బర్డ్ తొలి ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. లవ్బర్డ్ను జపాన్కు చెందిన యాస్కావా ఎలక్ట్రిక్ కంపెనీ సహకారంతో ఎడ్డీ కరెంట్ కంట్రోల్ 1993లో తయారుచేసింది. ఈ వాహనం మొదట ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు. ఇది ప్రారంభించిన తర్వాత కొన్ని అవార్డులు కూడా అందుకుంది. భారత ప్రభుత్వం కూడా ఈ వాహనానికి ఆమోదం తెలిపింది. లవ్బర్డ్ ఫీచర్స్ ఇవే..! లవ్ బర్డ్ కారు చూడడానికి చిన్నగా ఉంటుంది. దీనిలో కేవలం ఇద్దరు మాత్రమే కుర్చొడానికి వీలు ఉంటుంది. రీచార్జ్బుల్ బ్యాటరీ ప్యాక్లను ఇందులో అమర్చారు. ఈ కారులో వాడిన బ్యాటరీ ప్యాక్లు ఆధునాతనమైనవి కావు. వీటిలో లెడ్-యాసిడ్ బ్యాటరీలను ఉపయోగించారు. లవ్బర్డ్లో ఏర్పాటుచేసిన ఎలక్ట్రానిక్ ఛాపర్తో మృదువైన వేగ నియంత్రణ వ్యవస్థను కారుకు అందించింది. కారులో నాలుగు రకాల స్పీడ్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఈ కారు ఫుల్ చార్జ్తో 60 కిలోమీటర్ల మేర ప్రయాణించగలదు. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఆ సమయంలో లేనందున, లవ్బర్డ్లో ఉపయోగించే బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 8 గంటలు పట్టేది. కనుమరుగుకావడానికి కారణం ఇదే..! లవ్బర్డ్ ఆటోమొబైల్ రంగంలో అప్పట్లో ఒక సంచలనంగా నిలిచిన ఎక్కువ రోజులపాటు నిలవలేదు. ఆ సమయంలో ఇంధన ధరలు తక్కువగా ఉండడంతో కొనుగోలుదారులు ఇతర వాహనాలను కొనేందుకే మొగ్గుచూపేవారు. ఈ కారు ఎత్తైన ప్రదేశాలను ఏక్కడంలో విఫలమైంది. లవ్బర్డ్ అమ్మకాలు మూడు అంకెల సంఖ్యను కూడా దాటలేదు. ఆ సమయంలో సరైన విద్యుత్ సరఫరా కూడా ఒక్కింత లవ్బర్డ్ అంతరించిపోవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చును. లవ్బర్డ్పై కొనుగోలుదారులు అంతగా ఆసక్తి చూపకపోవడంతో ప్రభుత్వం కూడా ఈ కారుపై అందించే సబ్సీడిని నిలిపివేసింది. భారత ఆటో మొబైల్ రంగంలోకి మారుతి సుజుకి 800 రాకతో వాహన రంగంతో భారీ మార్పులు నమోదు చేసుకున్నాయి. పలు కారణాల వల్ల లవ్బర్డ్ భవిష్యత్తు తరాలకు కన్పించకుండానే పోయింది. చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! -
మొదటి ఓలా స్కూటర్ ఇదే... ఓ లుక్కేయ్యండి !
ప్రీ బుకింగ్స్తోనే వరల్డ్ రికార్డు సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ లుక్ని ఆ కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ రివీల్ చేశారు. తమిళనాడులో ఉన్న ఫ్యాక్టరీలో తయారైన మొట్ట మొదటి ఓలా మొదటి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫోటోని ట్విట్టర్లో షేర్ చేశారు. ఫిబ్రవరిలో స్కూటర్ తయారీ పనులు మొదలు పెట్టామని, కంపెనీ ఉద్యోగులు ఎంతో శ్రమించి ఈ స్కూటర్ని తయారు చేశారని ఆయన వెల్లడించారు. పెట్రోలు ధరల పెరుగుదలతో ప్రత్యామ్నాయ వాహనాల వైపు చూస్తున్న వారికి ఓలా ఊరట ఇచ్చింది. దీంతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ స్కూటర్కి సంబంధించిన ఒక్కో ఫీచర్ని ట్విట్టర్ ద్వారా భవీష్ అగర్వాల్ వెల్లడిస్తూ వస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఈ స్కూటర్కి సంబంధించిన అన్ని వివరాలను ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడించనున్నారు. Built the first scooter in our Futurefactory today! From barren land in Feb to this in under 6 months despite a pandemic!! The @OlaElectric team is just amazing❤️👍🏼 pic.twitter.com/B0grjzWwVC — Bhavish Aggarwal (@bhash) August 14, 2021 -
భారత తొలి మహిళ డాక్టర్ ఎవరో తెలుసా...?
కోల్కతా: భారత తొలి మహిళ డాక్టర్ కాదంబిని గంగూలీ. ఆనాటి పురుషాధిక్య సమాజంలో గెలిచి, విజయవంతంగా డాక్టర్ విద్యను పూర్తి చేశారు. నేడు గంగూలీ పుట్టినరోజు. కాదంబిని గంగూలీ జూలై 18, 1861 జన్మించారు. కాదంబిని గంగూలీ 160 వ జయంతిని పురస్కరించుకొని గూగుల్ డూడల్ను విడుదల చేసింది. డూడుల్లో భాగంగా కోల్కతా మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ప్రధాన భవనం చిత్రంతో పాటు గంగూలీ ఫోటో వచ్చేలా గూగుల్ డూడుల్ను రూపొందించింది. కాగా ఈ డూడుల్ను బెంగళూరుకు చెందిన ఆర్టిస్ట్ ఒడ్రిజా రూపొందించారు. రాజకీయ నాయకులు, అన్ని వర్గాల ప్రజలు గంగూలీని దేశంలో మహిళల హక్కులకోసం పాటుపడిన వ్యక్తిగా కీర్తించారు. గంగూలీ ఆనాటి సమాజపు పోకడలను పట్టించుకోకుండా ముందుకు సాగింది. కాగా గంగూలీకి సమాజం నుంచి అనేక విమర్శలను ఎదుర్కొంది. ఎడిన్బగ్ నుంచి భారత్కి తిరిగి వచ్చి మహిళల హక్కుల కోసం ప్రచారం చేసింది. ఒకానొక సమయంలో బెంగాలీ పత్రిక ఆమెను పరోక్షంగా బంగాబాషిలో 'వేశ్య' అని పిలిచింది. ఆమె భర్త ద్వారకానాథ్ గంగూలీ ఈ కేసును కోర్టుకు తీసుకెళ్లి గెలిచారు, 6 నెలల జైలు శిక్షతో ఎడిటర్ మహేష్ పాల్కు శిక్షను విధించారు. -
కోవిడ్-19 షాక్నకు ఆర్థిక టానిక్ అదే!
ప్రపంచమంతా మృత్యు ఘంటికలు మోగిస్తున్న కోవిడ్-19 వైరస్పై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ స్పందించారు. ముందు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని వ్యాఖ్యానించారు. ఆర్థిక ఉద్దీపన చర్యల గురించి ఆందోళన చెందకుండా ఈ భయంకరమైన అంటువ్యాధిని అరికట్టేందుకు పోరాడటమే ప్రభుత్వాలు చేయగలిగే గొప్ప పని అని ప్రస్తుతం చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ప్రొఫెసర్గా ఉన్న రాజన్ అన్నారు. కరోనావైరస్ షాక్కు ఉత్తమమైన ఆర్థిక టానిక్ అదే అని ఆయన అభప్రాయడ్డారు. పరిస్థితి అదుపులోనే వుందన్న విశ్వాసాన్ని కంపెనీలకు కలిగించేందుకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. ఈ విషయంలో కేంద్ర బ్యాంకులు కంటే, ఆయా ప్రభుత్వాలే ఎక్కువ స్పందించి, చర్యలు చేపట్టాలని రాజన్ వెల్లడించారు. ప్రజల ఈ వైరస్ను నిరోధించే చర్యల్ని కోరుకుంటున్నారని, ఈ మహమ్మారికి ఒక పరిష్కారం దొరుకుతుందనే ఆశలో వారున్నారని పేర్కొన్నారు. వైరస్పై ప్రజల భయాలు, ఆందోళన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒక దశాబ్దం క్రితం ఆర్థిక సంక్షోభం వైపు నెట్టివేస్తోందన్నారు. గ్లోబలైజేషన్ ఉత్పత్తి చాలా ఘోరంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేశారు. అలాగే ఒక్క వారంలో ఈక్వీటీ మార్కెట్లు ఉత్థాన పతనాలను నమోదు చేసిందంటూ గుర్తు చేశారు. మరోవైపు ఈ సంవత్సరం ప్రపంచ వృద్ధి 2.8 శాతంగా వుండనుందని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. ఇది 2009 నాటి కంటే బలహీనమైనని బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ ఆర్థికవేత్తలు గురువారం హెచ్చరించారు. -
ఏపీలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదు
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లానందిగామ పరిధిలో మొట్ట మొదటి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. తమ పరిధిలోకి రానప్పటికీ బాధితులు ఫిర్యాదులు చేస్తే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.. మొదటిసారిగా బాలుడి మిస్సింగ్ కేసు సంబంధించి కంచికచర్ల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కంచికచర్ల పీఎస్ పరిధి కాకపోయినా కేసు నమోదు చేసిన పోలీసులు రెండు బృందాలతో బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మిర్యాలగూడ మండలం వీరంపాడులో బాలుడిని గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. (చదవండి: ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం) -
టాప్లోకి దూసుకొచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు
సాక్షి, ముంబై: దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. మార్కెట్ క్యాప్ పరంగా అతిపెద్ద మూడవ భారతీయ సంస్థగా నిలిచింది. తాజాగా బ్యాంక్ రూ.7 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను అధిగమించింది. తద్వారా రిలయన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తర్వాత మూడవ భారతీయ కంపెనీగా అవతరించింది. అంతేకాదు ఈ ఘనత సాధించిన మొదటి బ్యాంకుగా నిలిచింది. ఇప్పటివరకూ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), టీసీఎస్ మాత్రమే ఈ మైలురాయిని సాధించాయి. రూ .9.38 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో, ఆర్ఐఎల్ అత్యధిక విలువైన సంస్థ, టిసిఎస్ తరువాత రూ.8.28 లక్షల కోట్లు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదటిసారిగా రూ .7,01,730.21 (7.01 లక్షల కోట్లు)ను తాకింది. 1285 వద్ద 52 వారాల గరిష్ట స్థాయిని చేరిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు 0.7 శాతం పెరిగి బాంబే స్టాక్ ఎక్సేంజ్లో రూ .1283.40 వద్ద ట్రేడవుతున్నాయి. -
తొలి పార్లమెంటేరియన్ తిలక్ కన్నుమూత
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, మొదటి పార్లమెం టేరియన్ కందాళ సుబ్రహ్మణ్య తిలక్ (98) శుక్రవారం అక్కయ్య పాలెంలోని తన కుమారుడి ఇంట మధ్యాహ్నం 12.48 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయ నకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య సూర్యకాంతం 2015లో కన్ను మూశారు. అప్పటి నుంచి కుమారుడు వద్ద ఉంటున్నారు. ఈయన విద్యాభ్యాసం మహారాజా కాలేజీ, బెనారస్ కళాశాల, బెల్గాంలలో సాగింది. గ్రాడ్యు యేషన్ పూర్తిచేసి, న్యాయవిద్యలో పట్టభద్రు లయ్యారు. తొలి పార్లమెంట్ ఏర్పడిన 1952 నుంచి 1957 వరకు విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తిలక్ ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో ఈయన దేశంలోనే రెండో అత్యధిక మెజార్టీ సాధించిన వారిగా గుర్తింపు పొందారు. మొదట్లో కాంగ్రెస్ ద్వారా రాజకీ యాల్లో ప్రవేశించినా తదనంతరం సోషలిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై సోషలిస్టు పార్టీ తరఫున పార్లమెంట్కు ఎన్నికయ్యారు. పార్ల మెంట్కు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకల్లో నాటి ప్ర«ధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నారు. ఇంతవరకు జీవించి ఉన్న తొలి పార్లమెంటే రియన్ ఈయన ఒక్కరే. కాగా, తిలక్ పార్థివ దేహాన్ని ఆయన కోరిక మేరకు గాయత్రి వైద్య కళాశాలకు అందజేయనున్నట్లు కుటుంబ సభ్యు లు తెలిపారు. తిలక్ మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. -
ఆర్బీఐ తొలి సీఎఫ్ఓగా సుధా బాలకృష్ణన్
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నియామకాన్ని చేపట్టింది. తన మొట్టమొదటి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్వో) సుధ బాలకృష్ణన్ను నియమించింది. మే 15 న సెంట్రల్ బ్యాంకులో చేరగా, ఆమె పదవీ మూడు సంవత్సరాలు ఉండనుందని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. కేంద్ర బ్యాంకులో అత్యంత కీలకమైన పదవికి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) మాజీ అధికారి సుధా బాలకృష్ణన్ ఆర్బీఐ తొలి సీఎఫ్వోగా ఎంపిక కావడం విశేషం. అకౌంటింగ్ విధానాలు, నిబంధనలకు లోబడి కేంద్ర బ్యాంకు బ్యాలెన్స్ షీట్ ఇన్ ఛార్జ్ గా సుధా బాలకృష్ణన్ వ్యవహరిస్తారు. ముఖ్యంగా బ్యాంక్ అకౌంటింగ్ విధానాన్ని రూపొందించడం, అంతర్గత ఖాతాలను నిర్వహించడం, ఆర్ధిక ఫలితాల గురించి నివేదించటం, వివిధ ఖాతాల ఖాతాల ద్వారా, బ్యాలెన్స్ షీట్ , లాభ, నష్టాల ఖాతాల పరిశీలన లాంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తారు. రాబడి వసూళ్లు లాంటి ప్రభుత్వ లావాదేవీలతోపాటు విదేశాలలోనూ అత్యున్నత బ్యాంకు పెట్టుబడులను కూడా పర్యవేక్షించే బాధ్యత కూడా నిర్వహించనున్నారు. కాగా 2016, సెప్టెంబరులో ఆర్బీఐ గవర్నర్గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇది అతిపెద్ద సంస్థాగత మార్పుగా చెప్పవచ్చు. గతంలో ఆర్బీఐ గవర్నర్గా రఘురామ్ రాజన్ ఉన్న సమయంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పీవోవో) పదవిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు, కానీ ఆ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించలేదని ఎకనామిక్స్ టైమ్స్ తన నివేదిక పేర్కొంది. మరోవైపు గత ఏడాది జులై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముద్రా పదవీవిరమణతో ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి డిప్యూటీ గవర్నర్ పదవికి అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. -
నో మోర్ టాక్స్ ఫ్రీ: ఇక బాదుడే..!
సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. టాక్స్ ఫ్రీ అనే మాటకు ఈ రెండు గల్స్ దేశాలు చరమ గీతం పలికాయి. ఇప్పటివరకు ఎలాంటి పన్నులు లేకుండా ఉన్న గల్ఫ్ దేశాల్లో తొలిసారిగా విలువ ఆధారిత పన్ను(వ్యాట్) అమల్లోకి రానుంది. దీని ద్వారా రెండు ప్రభుత్వాలు 2018 నాటికి 21 బిలియన్ డాలర్లను ఆర్జించాలని ప్రణాళిక వేశాయి. తద్వారా జీడీపీలో 2 శాతం వృద్ధి సాధించనున్నట్టు అంచనా వేశాయి. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది విదేశీ ఉద్యోగులు, కార్మికులపై ఈ ప్రభావం పడనుంది. ఇటీవలికాలంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పతనమవడంతో గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. బడ్జెట్ లోటుకు దారితీసింది. దీంతో గత రెండు సంవత్సరాల్లో ఆదాయం పెంచడం, వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టిన ఆయిల్ దేశాలు కొత్త ఏడాది తొలిరోజు (సోమవారం) నుంచి వ్యాట్ అమలు చేయనున్నాయి. మొదటి సంవత్సరంలోఆదాయం సుమారు 12 బిలియన్ దిర్హామ్లు (3.3 బిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా వేసింది. దీని ద్వారా సౌదీ ప్రభుత్వానికి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనుల వృద్ధికి సహాయపడుతుందని షాహారా (కౌన్సిల్) కౌన్సిల్ సభ్యుడు మహ్మద్ అల్-ఖునిజీ చెప్పారు. తాజా ఆదేశాల ప్రకారం ఇక అక్కడివారు వివిధ వస్తువులు, సేవలపై సేల్స్ టాక్స్ 5 శాతం చెల్లించాలి. ముఖ్యంగా ఆహారం, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, గ్యాసోలిన్, ఫోన్, నీరు, విద్యుత్ బిల్లులు, హోటల్ రిజర్వేషన్లులాంటి వాటిపై ఈ పన్నును విధించనుంది. అయితే మెడికల్, బ్యాంకులు, ప్రభుత్వ రవాణాను దీన్నుంచి మినహాయింపు ఇవ్వనుందని తెలుస్తోంది. మరోవైపు ఇతర నాలుగు గల్ఫ్ రాష్ట్రాలు బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్ కూడా వ్యాట్ ను విధించాలని యోచిస్తోన్నాయి. 2019 ప్రారంభంలో ఈ పన్ను బాదుడుకు శ్రీకారం చుట్టనున్నాయని సమాచారం. -
షావోమి లవర్స్కి గుడ్ న్యూస్!
సాక్షి, హైదరాబాద్: చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం షావోమీ ఇండియాలో మరింత విస్తరించే దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మొట్టమొదటి ఫ్లాగ్షిప్ ఎంఐ హోమ్ స్టోర్ను హైదరాబాద్లో ప్రారంభించనుంది. ఇప్పటికే బెంగుళూరు, ఢిల్లీ, చెన్నైలలో ఎంఐ హోమ్ స్టోర్లను ప్రారంభించి కార్యకలాపాలను నిర్వహిస్తున్న షావోమి ఇపుడు హైదరాబాద్ కస్టమర్లకు మరింత చేరువలోకి వస్తోంది. దీంతో హైదరాబాద్ ప్రజలు డైరెక్టుగా రిటైల్ స్టోర్కు వెళ్లి షావోమి ఉత్పత్తులను తనిఖీ చేసుకోవచ్చన్నమాట. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా సంస్థ ధృవీకరించింది. సెప్టెంబర్ 12వ తేదీన మాదాపూర్ మెయిన్ రోడ్ లో ఈ స్టోర్ను ఓపెన్ చేయనుంది. తమ ఉత్పత్తులకు లభిస్తున్న విశేష ఆదరణను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ వాసులకు కూడా మరింత చేరువయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. ఇకపై తమ ఉత్పత్తులను ఆలస్యం, ఔట్ ఆఫ్ స్టాక్ లాంటి ఎలాంటి సమస్యలు లేకుండా వినియోగదారులు కొత్త ఎక్స్పీరియెన్స్ ను పొందవచ్చనీ, స్మార్ట్ఫోన్లు సహా, పవర్ బ్యాంకులు, హెడ్ఫోన్స్, ఫిట్నెస్ బ్యాండ్స్, ఎయిర్ ప్యూరిఫైర్స్ తదితర గ్యాడ్జెట్టు ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పింది. కాగా బెంగుళూరులో 3 స్టోర్స్, గురుగ్రామ్, చెన్నైలలో ఒక్కో స్టోర్ ఉండగా తాజాగా నగరంలో ప్రారంభించే స్టోర్తో కలిపి షావోకి ఇది 6వది. భారతదేశంలో 11 నగరాల్లో 600 కి పైగా రిటైల్ దుకాణాలు ఉండగా విజయ్ సేల్స్, సంగీత, బిగ్ సి, ఇజోన్ , హాట్ స్పాట్లాంటి పెద్ద రిటైల్ చైన్స్ తో భాగస్వామ్యం ఉంది. గత నెలలో కంపెనీ 30 నగరాల్లో 1,500 మేర రిటైల్ స్టోర్లను పెంచుతామని జైన్ చెప్పారు. రాబోయే రెండు సంవత్సరాల్లో 100 ఎంఐ హోమ్ దుకాణాలు తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్న షావోమి . #MiHome is coming to Hyderabad on 12th September at Madhapur Main Road! Pre-book now! Including #MiA1! -
టెస్లా మోడల్3 తొలి ఎలక్ట్రిక్ కార్లు డెలివరీ
లాస్ ఏంజిల్స్: అమెరికన్ లగ్జరీ ఎలెక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా మూడు ఎలక్ట్రిక్ కార్లను కస్టమర్లకు అందించింది. కాలిఫోర్నియాలోని ఫ్రెమొంట్ వాహన తయారీ కర్మాగారంలో సంస్థ మొట్టమొదటి 30మందిలో ముగ్గురు కొనుగోలుదారులకు కార్ల కీ ని అందజేసింది. మోస్ట్ ఎవైటెడ్ ఎఫర్డబుల్ ఎలక్ట్రిక్ కార్ల ఎంట్రీకి శుక్రవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో ముగింపు పడిందని టెస్లా సీఈవో ఎల్లోన్ మస్క్ ప్రకటించారు. అమెరికా మార్కెట్లో మోడల్ 3 ప్రారంభ ధర 35వేల డాలర్లుగా (సుమారు రూ. 22.8 లక్షలు) ఉండనుంది. కాగా ఇప్పటికే లాంచ్ చేసిన మొట్టమొదటి మూడు వాహనాలు - రోడస్టర్, మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లు చాలా ఖరీదు. దాదాపు లక్ష డాలర్లకు ( సుమారు రూ. 64 లక్షలు) పై మాటే. టెస్లా ఇతర ఎలక్ట్రిక్ కార్లతో పోల్చుకుంటే మోడల్ 3 అత్యంత సరసమైన కారుగా చెప్పొచ్చు. మొత్తం అల్యూమినియం బాడీకాకుండా కొంత స్టీల్తో రూపొందించారు. ఇంకా సింగిల్ చార్జ్తో 5 నుంచి 6 సెకన్స్ లో 0.60 ఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది. అయితే లార్జ్ బ్యాటరీ, ఆన్ స్క్రీన్ డ్యాష్ బోర్డు, ఫాన్సీ వీల్స్, మెటాలిక్ పెయింట్, అటానమస్ డ్రైవింగ్ ఫీచర్స్ను కావాలంటే కస్టమర్లు జోడించుకోవచ్చు. అలాగే ఈ కారుకు నాలుగు సంవత్సరాల, 50,000 మైళ్లవరకు వారంటీ ఉంది. 100,000 మైళ్ళ పరిధిలో ఎనిమిది సంవత్సరాల బ్యాటరీ వారంటీ కూడా ఉంది. ఇది టెస్లా కు సంబంధించి గొప్ప రోజు..ఎప్పుడూ కేవలం ఖరీదైన కార్లనే తయారు చేయడం తమ లక్ష్యం కాదని , కార్లను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలని తాము కోరుకుంటున్నామని టెస్లా సీఈవో మీడియాకు చెప్పారు. మోడల్ 3 కార్లను ఇపుడు ప్రీ బుకింగ్ చేసుకుంటే 2018లో చివరికి నాటికి అందించే అవకాశం ఉందని చెప్పారు. టెస్లా రూపొందించే ప్రతిదీ అందమైనదిగా ఉంటుందని టెస్లా చీఫ్ డిజైనర్ ఫ్రాంజ్ వాన్ హోల్జాజెన్ అన్నారు. మోడల్ 3 మరింత విశాలంగా కనిపించడానికి ప్రత్యేకంగా గ్లాస్ రూఫ్తో తయారు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ కారుకు డిమాండ్ విపరీతంగా ఉండడంతో మోడల్ 3 ప్రొడక్షన్ పెద్ద ఛాలెంజ్ అని టెస్లా పేర్కొంది. ఈ నేపథ్యంలో 2017 ఆగష్టు నాటికి 100 కార్లను, సెప్టెంబర్ 2017 నాటికి 1500 కార్లను ఉత్పత్తి చేయనుంది. -
ఐఏఎస్ అశోక్ ఖేమ్కా వాట్సాప్లో ఏం చేశారంటే...
చత్తీస్ఘడ్: కమ్యూనికేషన్ రంగంలో వస్తున్నసాంకేతిక విప్లవం నేపథ్యంలో హర్యానా కోర్టు ఓ ఆసక్తికర చర్య తీసుకుంది. దేశంలో మొట్టమొదటి సారి సోషల్ నెట్వర్కింగ్ సైట్ వాట్సాప్ద్వారా సమన్లు జారీ అయ్యాయి. సంచలన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా ఈ సంచలనానికి తెరతీసారు. ఖేమ్కా నేతృత్వంలోని ఫైనాన్సియల్ కమిషనర్ (ఎఫ్సీ) కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ వాట్సాప్ ప్రింట్ అవుట్నే సమన్ల డెలివరీ ప్రూఫ్గా పరిగణించాలని ఆదేశించారు. కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో సివిల్, రెవెన్యూ తగాదాలను పరిష్కరించే ఎఫ్సీ కోర్టు దృష్టికి హిసార్ లోని ఔరంగ్ షాపూర్ గ్రామానికా చెందిన అన్నదమ్ముల ఆస్తి పంపకాల తగాదా ఒకటి వచ్చింది. సత్బీర్ సింగ్కు, సోదరులు రామ్ దయాల్, క్రిష్టన్ కుమార్లతో ఈ వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంలో సమాధానం చెప్పాల్సిందిగా రామ్, క్రిష్ణన్ కుమార్ లకు నోటీసులు పంపింది. అయితే రామదయాల్ నోటీసులను స్వీకరించారు కానీ, ఖాట్మాండులో ఉన్న క్రిష్ణన్ కుమార్కు నోటీసులు అందించండం సాధ్యం కాలేదు. దీనికితోడు స్థానిక రెవెన్యూ అధికారులు ఫోన్ ద్వారా ఆయనను సంప్రదించినపుడు చిరునామా, తదితర వివరాలు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఖేమ్కా ఈ నిర్ణయంతీ సుకున్నారు. ప్రస్తుతం ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ తదితర చిరునామాగా పరిగణిస్తున్న నేపథ్యంలో వాట్సాప్ ద్వారా కోర్టు ముద్రతో కూడిన నోటీసు కాపీని కోర్టుని జత చేసి వాట్సాప్ లో పంపించింది. ఈ వాట్సాప్ మెసేజ్ డెలివరీ ప్రింట్ అవుట్ నే సమన్లు జారీ అయినందుకు సాక్ష్యంగా పరిగణించనుంది. కాగా హర్యానాకు చెందిన అశోక్ ఖెమ్కా నిజాయితీ ఐఏఎస్ అధికారిగా పేరు గడించారు. ముఖ్యంగా భూ వ్యవహారాల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ భూ బకాసురులకు సింహస్వప్నంగా నిలిచారు. అంతేకాదు 46సార్లు బదిలీ అయిన ఏకైక ఐఏఎస్ అధికారికూడా ఈయనే. -
సామాన్యుల్లో ఒకటో తారీఖు టెన్షన్..టెన్షన్..
-
తొలి పరిశోధనాత్మక పాత్రికేయుడు కందుకూరి
తెలుగు అధ్యాపకులు డాక్టర్ సంజీవరావు రాజమహేంద్రవరం కల్చరల్ : పరిశోధనాత్మక జర్నలిజానికి మూలపురుషుడు కందుకూరి వీరేశలింగమని ఎస్కేవీటీ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు డాక్టర్ పి.వి.బి.సంజీవరావు అన్నారు. ప్రభుత్వ అటానమస్ కళాశాలలో ఆవరణలో జరుగుతున్న నవ్యాంధ్రపుస్తక సంబరాలు కార్యక్రమాలలో భాగంగా సోమవారం ఆయన కందుకూరి నాటకాలపై ప్రసంగించారు.1876లో కందుకూరి రచించిన బ్రాహ్మవివాహంలో చిన్నమ్మ పాత్ర కనపడదు, వినపడుతుందన్నారు. ఈ నాటకానికి పెద్దయ్యగారి పెళ్ళి అని నాటి ప్రేక్షకులు పేరుపెట్టారని తెలిపారు. కందుకూరి రచించిన రెండో నాటకం వ్యవహార ధర్మబోధినికి ప్రజలు ప్లీడర్ల నాటకమని పేరు పెట్టారని తెలిపారు. న్యాయ, పోలీస్, మున్సిపల్ వ్యవస్థల్లోని లోపాలను ఈ నాటకం ద్వారా కందుకూరి ఎత్తిచూపారన్నారు. సభకు అధ్యక్షత వహించిన విశ్రాంత రీడర్ చాగంటి శరత్బాబు మాట్లాడుతూ కందుకూరి నిర్వహించిన వితంతు వివాహాలు జాతి సంప్రదాయాలకు విరుద్ధమని కొందరు ప్రచారం చేశారని, ఇది సరికాదన్నారు. పరాశరస్మృతిలో భర్త గతించినప్పుడు స్త్రీలు పునర్వివాహం చేసుకోవచ్చునని తెలిపారని చెప్పారు. ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్, తెలుగు లెక్చరర్ బి.వి.రమాదేవి ఆవంత్స సోమసుందరం సాహిత్యంపై ప్రసంగించారు. నన్నయ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ టి.సత్యనారాయణ స్వాగత వచనాలు పలికారు. సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. -
ఆర్టీసీలో కానరాని ఫస్ట్ ఎయిడ్
ప్రమాదాలు జరిగితే ప్రథమ చికిత్స లేనట్లే! పట్టించుకోని ఆర్టీసీ అధికారులు రాయవరం : ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరం. ఇలా ప్రకటనలు గుప్పిస్తున్న రాష్ట రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ప్రథమ చికిత్స బాక్సుల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తోంది. బస్సు ప్రమాదానికి గురైతే అప్పటికప్పుడు తాత్కాలిక వైద్య సేవలు పొందేందుకు ప్రతి ఆర్టీసీ బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. ప్రస్తుతం అటువంటివి బస్సుల్లో కానవరావడం లేదు. బస్సు షడన్ బ్రెక్ వేసినప్పుడు ప్రయాణికులకు చిన్నపాటి గాయాలపాలైతే వారు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాల్సిందే. 3.23 లక్షల కిలోమీటర్ల ప్రయాణం జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, రావులపాలెం, రాజోలు, రామచంద్రపురం, ఏలేశ్వరం, తుని, గోకవరంలో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరిధిలో మొత్తం 840 బస్సులు వివిధ మార్గాల్లో ప్రతి రోజు 3.23 లక్షల కిలోమీటర్ల పరిధిలోని ప్రయాణికులను చేరవేస్తున్నాయి. ఆర్టీసీలో ఉద్యోగంలో చేరే కొత్త డ్రైవర్లకు, కండక్టర్లకు తొలుత ఫస్ట్ ఎయిడ్ ధ్రువపత్రం ఇచ్చిన తర్వాతనే ఉద్యోగాలిస్తారు. ప్రయాణికులు గాయపడితే.. వారికి అత్యవసర చికిత్స చేసే సామర్థ్యం సంబంధిత బస్సు డ్రైవర్, కండక్టర్లకు ఉంటుంది. కాని ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురై ప్రయాణికులకు గాయాలైతే 108 వాహనం వచ్చే వరకూ ఆగాల్సిందే. అప్పటి వరకు క్షతగాత్రులు నొప్పితో బాధపడాల్సిందే. ప్రథమ చికిత్స అందక పోవడం వలన కొన్ని సందర్భాల్లో ప్రాణాప్రాయం కూడా కలుగుతుంది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో... ఫస్ట్ ఎయిడ్ బాక్సులో రెండు బ్యాండేజ్ కట్టలు, టించర్ అయోడిన్, గ్లాస్ బ్యాండేజ్, నొప్పి తగ్గించే ఆయింట్మెంట్, అత్యవసర మందులు ఉంటాయి. పట్టించుకోని అధికారులు.. బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ల్లో మందులను ఏర్పాటు చేయక పోతే బస్సులను సీజ్ చేసే అధికారం ఆర్టీవో స్థాయి అధికారులకు ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వ బస్సులేనన్న భావనతో సంబంధిత అధికారులు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి.