FPIs
-
విదేశీ అంశాలు, ఎఫ్పీఐల చేతుల్లోనే..
న్యూఢిల్లీ: కంపెనీల త్రైమాసిక ఫలితాల సీజన్ (క్యూ3) ముగియడంతో.. అంతర్జాతీయ అంశాలు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) ట్రేడింగ్ తీరు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్ణయించనున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు నిరంతరాయంగా అమ్మకాలు చేస్తుండడం, క్యూ3లో కంపెనీల ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడం గత వారం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీయడం గమనార్హం. దీంతో నిఫ్టీ కీలకమైన 22800 మద్దతు స్థాయికి సమీపానికి మరోసారి వచ్చింది. నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా ఎనిమిదో రోజూ (గత శుక్రవారం) నష్టాల్లో ముగిశాయి. ఇలా చాలా అరుదుగానే చూస్తుంటాం. ఎనిమిది రోజుల్లో కలిపి బీఎస్ఈ సెన్సెక్స్ 2,645 పాయింట్లు కోల్పోగా (3.36 శాతం), ఎన్ఎస్ఈ నిఫ్టీ 810 పాయింట్లు (3.41 శాతం) నష్టపోయింది. ‘‘డిసెంబర్ త్రైమాసికం ఫలితాలు ముగిసిపోయాయి. డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలతో నెలకొన్న అనిశి్చతుల మధ్య చోటుచేసుకునే అంతర్జాతీయ పరిణామాలపైకి ఇన్వెస్టర్ల దృష్టి మళ్లొచ్చు’’అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్విసెస్ వెల్త్ మేనేజ్మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా తెలిపారు. వీటికి అదనంగా డాలర్తో రూపాయి తీరు, బ్రెండ్ క్రూడ్ ధరలు సైతం ప్రభావం చూపించొచ్చని భావిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, కరెన్సీ మారకంపై మార్కెట్ దృష్టి సారించొచ్చని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. దేశీయంగా ఎలాంటి ముఖ్యమైన సంకేతాలు లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్ తీరును నిర్ణయించొచ్చని ఏంజెల్ వన్ సీనియర్ అనలిస్ట్ ఓషో కృష్ణన్ పేర్కొన్నారు. ‘‘మార్కెట్ పతనానికి ఎన్నో అంశాలు దారిచూపాయి. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార టారిఫ్లపై చేసిన ప్రకటన సెంటిమెంట్కు దెబ్బకొట్టింది. దీనికి అదనంగా క్యూ3 కార్పొరేట్ ఫలితాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం ఇన్వెస్టర్ల విశ్వాసంపై ప్రభావం చూపించింది’’అని మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా తెలిపారు. దిగ్గజ కంపెనీల మార్కెట్ విలువ ఆవిరి విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడికి మార్కె ట్ విలువ పరంగా టాప్–10లోని ఎనిమిది కంపెనీలు గడిచిన వారంలో రూ.2 లక్షల కోట్లకు పైన విలువను నష్టపోయాయి. అన్నింటిలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువ నష్టాన్ని చూసింది. రూ.67,527 కోట్లు తగ్గి రూ.16,46,822 కోట్ల వద్ద స్థిరపడింది. టీసీఎస్ మార్కెట్ విలువ రూ.34,951 కోట్ల మేర తగ్గి రూ.14,22,903 కోట్ల వద్ద ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.28,382 కోట్లను నష్టపోయింది. మార్కెట్ విలువ రూ.12,96,708 కోట్లుగా ఉంది. ఐటీసీ రూ.25,430 కోట్ల నష్టంతో రూ.5,13,670 కోట్ల వద్ద స్థిరపడింది. ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ 19,287 కోట్లు తగ్గిపోగా, ఎస్బీఐ రూ.13,431 కోట్లు, హిందుస్థాన్ యూనిలీవర్ రూ.10,714 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ రూ.4,230 కోట్లు చొప్పున మార్కెట్ విలు వను కోల్పోయా యి. ఎయిర్టెల్ మార్కె ట్ విలువ రూ.22,426 కోట్లు పెరగడంతో రూ.9,78, 631 కోట్లకు చేరింది. అలాగే, ఐ సీఐసీఐ బ్యాంక్ విలువ సైతం రూ.1,182 కోట్ల మేర లాభపడి రూ.8,88,815 కోట్లుగా ఉంది. ఎఫ్పీఐల అమ్మకాలు రూ.21,272 కోట్లు ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లోనూ ఎఫ్పీఐలు పెద్ద మొత్తంలో విక్రయాలు చేపట్టారు. నికరంగా రూ.21,272 కోట్లను ఈక్విటీల నుంచి ఉపసంహరించుకున్నారు. జనవరిలోనూ వీరు రూ.78,027 కోట్ల మేర అమ్మకాలు చేపట్టడం గమనార్హం. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు వీరు భారత ఈక్విటీల నుంచి రూ.99,299 కోట్లను వెనక్కి తీసుకెళ్లిపోయారు. డెట్ విభాగంలో ఈ నెల మొదటి రెండు వారాల్లో నికరంగా రూ.1,296 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. డాలర్ ఇండెక్స్ తగ్గుముఖం పట్టినప్పుడు ఎఫ్పీఐలు తిరిగి పెట్టుబడులతో రావొచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్కుమార్ తెలిపారు. ‘‘స్టీల్, అల్యూమినియంపై ట్రంప్ టారిఫ్లు ప్రకటించడం, ప్రతీకార సుంకాల ప్రణాళికలతో మార్కెట్లో ఆందోళనలు చెలరేగాయి. దీంతో భారతసహా వర్ధమాన మార్కెట్లలో తమ పెట్టుబడులను ఎఫ్పీఐలు సమీక్షిస్తున్నాయి’’అని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ వివరించారు. -
మార్కెట్కు దేశీ ఇంధనం!
సుమారు 15 ఏళ్ల తదుపరి తొలిసారి దేశీ స్టాక్ మార్కెట్లలో సరికొత్త ట్రెండ్కు తెరలేవనుంది. ఇటీవల దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (డీఐఐలు) పెట్టుబడులు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) అమ్మకాలను మించుతున్నాయి. దీంతో ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో డీఐఐల వాటా ఎఫ్పీఐలకున్న పెట్టుబడుల విలువను అధిగమించనుంది! ఫలితంగా తొలిసారి లిస్టెడ్ కంపెనీలలో ప్రమోటర్ల తదుపరి అతిపెద్ద వాటాదారులుగా డీఐఐలు నిలవనున్నాయి. వెరసి రేసులో ఎఫ్పీఐలను వెనక్కి నెట్టనున్నాయి.దేశీ లిస్టెడ్ కంపెనీలలో ఈ ఏడాది ప్రమోటర్లేతర ఓనర్íÙప్లో ఆధిపత్యం చేతులు మారనుంది. 1992లో దేశీ స్టాక్ మార్కెట్లలో ఎఫ్పీఐలను అనుమతించాక భారీ పెట్టుబడులతో దూకుడు చూపుతున్నారు. డీఐఐల పెట్టుబడులకంటే అధికంగా ఇన్వెస్ట్ చేస్తూ దేశీ స్టాక్స్లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల ట్రెండ్ మారుతోంది. గత నాలుగేళ్లుగా బుల్ ట్రెండ్తో దేశీ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకుతూ వచ్చాయి. ఇందుకు ప్రధానంగా దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లుగా పిలిచే మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్ పెట్టుబడులు ప్రభావం చూపుతున్నాయి. అయితే గతేడాది అక్టోబర్ నుంచి ఎఫ్పీఐలు యూటర్న్ తీసుకున్నారు. ఇదే సమయంలో డీఐఐలు మరిన్ని పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. వెరసి ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో ఎఫ్పీఐల వాటా తగ్గుతుంటే.. డీఐఐల వాటా పెరుగుతోంది.2015తో పోలిస్తే 2025లో ఎఫ్పీఐలు, డీఐఐల పెట్టుబడుల విలువ మధ్య అంతరం 2009 తదుపరి అత్యంత కనిష్టానికి చేరింది. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో 2024 డిసెంబర్కల్లా ఎఫ్పీఐల వాటా 17.23 శాతానికి దిగిరాగా.. డీఐఐల వాటా 16.90 శాతానికి బలపడింది. అంటే అంతరం 33 బేసిస్ పాయింట్లు(0.33 శాతం) మాత్రమే. నిజానికి 2015లో ఎఫ్పీఐ, డీఐఐ వాటాల మధ్య అంతరం 1032 బేసిస్ పాయింట్లు(10.32 శాతం)గా నమోదైంది. జనవరిలోనూ ఎఫ్పీఐల అమ్మకాలు కొనసాగడం, పెట్టుబడుల బాటలో డీఐఐలు కొనసాగుతుండటంతో త్వరలో ఎఫ్పీఐలపై డీఐఐలు ఆధిపత్యం వహించనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫండ్స్ ఆధిపత్యం డీఐఐలలో మ్యూచువల్ ఫండ్స్దే అగ్రస్థానంకాగా.. వీటికి రిటైల్ ఇన్వెస్టర్ల నుంచే అధిక బలం సమకూరుతోంది. గత నెల(జనవరి)లో ఎఫ్పీఐలు నికరంగా రూ. 78,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయిస్తే.. డీఐఐలు రూ. 86,000 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. ఇక 2024 అక్టోబర్–డిసెంబర్లో ఎఫ్పీఐలు రూ. లక్ష కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ.1.86 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. విలువపరంగా డీఐఐల వద్ద గల ఈక్విటీలు రూ. 73.5 లక్షల కోట్లు! ఎఫ్పీఐల వాటాల విలువకంటే 1.9 శాతమే తక్కువ! దశాబ్దంక్రితం ఎఫ్పీఐల పెట్టుబడులలో దేశీ ఫండ్స్ ఈక్విటీల విలువ సగమేకావడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం! ఈ బాటలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్లు) పెట్టుబడులు 10వ వంతుకు చేరడం విశేషం!రిటైలర్ల బలమిది ఇటీవల కొన్నేళ్లుగా రిటైల్ ఇన్వెస్టర్లు దేశీ మార్కెట్లకు తరలి వస్తున్నారు. ఎంఎఫ్లలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫలితంగా 2019లో రూ. 7.7 లక్షల కోట్లుగా నమోదైన ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) 2024 డిసెంబర్కల్లా రూ. 31 లక్షల కోట్లను తాకింది! ఇదే కాలంలో సిప్ ద్వారా పెట్టుబడులు రూ. 8,518 కోట్ల నుంచి రూ. 26,549 కోట్లకు జంప్ చేశాయి. 2024 చివరి క్వార్టర్లో రిటైలర్లు స్టాక్స్లో రూ. 57,524 కోట్లు ఇన్వెస్ట్ చేశారు! ఈ జోష్తో గతేడాది 91 కంపెనీలు ఐపీఓలతో రూ.1.6 లక్షల కోట్లకుపైగా సమకూర్చుకోవడం కొసమెరుపు!!జనవరిలో ఎఫ్పీఐల అమ్మకాలు రూ. 78,000 కోట్లుదేశీ ఫండ్స్ పెట్టుబడుల విలువ రూ. 86,000 కోట్లు అక్టోబర్–డిసెంబర్లో ఎఫ్పీఐల అమ్మకాలు రూ. లక్ష కోట్లు ఇదే కాలంలో డీఐఐల కొనుగోళ్లు రూ. 1.86 లక్షల కోట్లు –సాక్షి, బిజినెస్ డెస్క్ -
మళ్లీ డబ్బు పెడుతున్న ఎఫ్పీఐలు
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీరేట్లను మరింత తగ్గించనుందనే అంచనాలతో భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను పెంచుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భారీగా అమ్మకాలు చేసిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్పీఐ) రెండు వారాలుగా తిరిగి ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ను పెంచుతున్నారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.డిసెంబరు మొదటి రెండు వారాల్లో ఎఫ్పీఐలు నికరంగా రూ.22,766 కోట్లను భారతీయ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారు. నవంబర్లో వీరు రూ.21,612 కోట్లు, అక్టోబర్లో భారీగా రూ.94,017 కోట్లను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు సెప్టెంబరులో ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్ తొమ్మిది నెలల గరిష్టానికి చేరడం విశేషం. ఆ నెలలో నికర పెట్టుబడి రూ.57,724 కోట్లుగా ఉంది.ఇదీ చదవండి: క్లెయిమ్ చేసుకోని నిధులు రూ.880 కోట్లుఎఫ్పీఐలు పెరగడానికిగల కారణాలు..అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతపై అంచనాలు: ఇప్పటికే ఫెడ్ వడ్డీరేట్లను దాదాపు 50 బేసిస్ పాయింట్లకు తగ్గించింది. డిసెంబర్ 19న విడుదలయ్యే ఫెడ్ సమావేశంలో మరో 25 బేసిస్ పాయింట్లను తగ్గించనున్నట్లు అంచనా వేస్తున్నారు. దాంతో ఇతర ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్లను మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.మార్కెట్ సెంటిమెంట్: సానుకూల రాజకీయ పరిణామాలు, కార్పొరేట్ ఆదాయాల్లో రికవరీ, ప్రైమరీ, సెకండరీ మార్కెట్లలో పెరిగిన పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచాయి.సీఆర్ఆర్ తగ్గింపు: క్యాష్ రిజర్వ్ రేషియో(సీఆర్ఆర్) తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం వల్ల మార్కెట్లో లిక్విడిటీ, సెంటిమెంట్ మెరుగుపడనుంది.ద్రవ్యోల్బణం తగ్గుదల: భారత వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం అక్టోబర్లో 6.21 శాతం నుంచి నవంబర్లో 5.48 శాతానికి తగ్గింది. ఇది ఆర్బీఐ ద్రవ్య విధాన సడలింపుపై ఆశలను పెంచింది.చైనా మార్కెట్లలో అనిశ్చితి: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చైనా వస్తువులపై ప్రతిపాదిత సుంకాల పెంపు అంచనాలు భారతీయ ఈక్విటీలకు పాజిటివ్గా నిలుస్తున్నాయి. -
కొనుగోళ్లకే ఎఫ్పీఐల ఓటు
గత నెలలో దేశీ స్టాక్స్లో భారీగా ఇన్వెస్ట్ చేసిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఈ నెల(డిసెంబర్)లోనూ కొనుగోళ్లకే ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ నెల తొలి రెండు వారాల్లో ఎఫ్పీఐలు రూ. 22,766 కోట్ల విలువైన స్టాక్స్ సొంతం చేసుకున్నారు. ఇందుకు ప్రధానంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు ప్రభావం చూపుతున్నాయి. కాగా.. అక్టోబర్లో మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 94,017 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్లోనూ నికరంగా 21,612 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సెపె్టంబర్లో గత 9 నెలల్లోనే అధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
మార్కెట్లో మతాబులు వెలిగేనా?
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై పలు అంశాలు ప్రభావం చూపనున్నాయి. దేశీయంగా కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు, అక్టోబర్ ఎఫ్అండ్వో సిరీస్ ముగింపు కీలకంగా నిలవనున్నాయి. దీంతో ఈ వారం మార్కెట్లు ఆటుపోట్లకు లోనుకానున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇప్పటికే వేడెక్కిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పశి్చమాసియాలో తలెత్తిన యుద్ధ భయాలు సైతం ట్రెండ్ను ప్రభావితం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ స్టాక్ మార్కెట్ల తీరు, క్యూ2 ఫలితాలపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఈ వారం బీహెచ్ఈఎల్, డాబర్ ఇండియా, గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీలు.. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ పవర్ జులై–సెపె్టంబర్(క్యూ2) పనితీరును వెల్లడించనున్నాయి. గురువారం(31న) అక్టోబర్ డెరివేటివ్స్ గడువు ముగియనుంది. ఇది మార్కెట్లలో హెచ్చుతగ్గులకు కారణంకావచ్చని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అంచనా వేశారు. స్వల్ప కాలంలో మార్కెట్లు కన్సాలిడేట్ కావచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం, యూఎస్ అధ్యక్ష ఎన్నికలు పూర్తికావడం వంటి అంశాలు ట్రెండ్ రివర్స్కు దోహదం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఎఫ్పీఐల ఎఫెక్ట్ కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్లో వెల్లువెత్తుతున్న ఎఫ్పీఐల అమ్మకాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తున్నట్లు నాయిర్ పేర్కొన్నారు. ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. దీపావళి సందర్భంగా శుక్రవారం(నవంబర్ 1) మార్కెట్లకు సెలవుకాగా.. సంవత్ 2081 ప్రారంభం సందర్భంగా స్టాక్ ఎక్సే్ఛంజీలు గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్ను నిర్వహించనున్నాయి. ఎప్పటిలాగే బీఎస్ఈ, ఎన్ఎస్ఈ.. సాయంత్రం 6–7 మధ్య ముహూరత్ ట్రేడింగ్కు తెరతీయనున్నాయి. నిరుత్సాహకర క్యూ2 ఫలితాలు, ఎఫ్పీఐల భారీ అమ్మకాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు పతనబాటలో సాగిన సంగతి తెలిసిందే. దీంతో సెంటిమెంటు బలహీనపడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్కుమార్ తెలియజేశారు. అందుబాటు ధరల్లో ఉన్న చైనా మార్కెట్లు, అక్కడి ప్రభుత్వ సహాయక ప్యాకేజీ ఎఫ్పీఐ అమ్మకాలకు కారణమవుతున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు, ముడిచమురు ధరలు కీలకంగా నిలవనున్నట్లు సంతోష్ పేర్కొన్నారు. వీటికితోడు ఎఫ్పీఐల తీరు, క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు వివరించారు. యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు తెలియజేశారు. ఈ వారం యూఎస్ క్యూ3(జులై–సెపె్టంబర్) జీడీపీ గణాంకాలు, సెప్టెంబర్ ఉపాధి రిపోర్ట్, చైనా తయారీ రంగ డేటాతోపాటు.. యూఎస్ పీసీఈ ధరలు వెల్లడికానున్నాయి. ఇవి ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణ అంచనాలపై ప్రభావం చూపే విషయం విదితమే. జపాన్ మానిటరీ పాలసీ సమావేశం జరగనుంది. 2.2 శాతం డౌన్ గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు అమ్మకాలతో నీరసించాయి. సెన్సెక్స్ నికరంగా 1,822 పాయింట్లు(2.25 శాతం) పతనమై 79,402 వద్ద నిలవగా.. నిఫ్టీ మరింత ఎక్కువగా 673 పాయింట్లు(2.7 శాతం) కోల్పోయి 24,181 వద్ద ముగిసింది. మిడ్క్యాప్ 5.2 శాతం, స్మాల్క్యాప్ 7.4 చొప్పున కుప్పకూలాయి. కాగా.. దేశీ మార్కెట్ రికార్డ్ గరిష్టం నుంచి 8 శాతం పతనమైనట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా ప్రస్తావించారు. ఇందుకు నిరాశపరుస్తున్న క్యూ2 ఫలితాలు, ఎఫ్పీఐల అమ్మకాలు కారణమవుతున్నట్లు తెలియజేశారు. సమీపకాలంలో ఈ ట్రెండ్ కొనసాగే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎఫ్పీఐల అమ్మకాల రికార్డ్ గత నెలలో దేశీ స్టాక్స్లో నికర ఇన్వెస్టర్లుగా నిలిచిన ఎఫ్పీఐలు ఉన్నట్టుండి అక్టోబర్లో అమ్మకాల బాట పట్టారు. ఇటీవల అమ్మకాల స్పీడ్ పెంచి నిరవధికంగా స్టాక్స్ నుంచి వైదొలగుతున్నారు. తద్వారా ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 85,790 కోట్ల(10.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వెరసి మార్కెట్ చరిత్రలోనే అక్టోబర్ నెల అత్యధిక విక్రయాల రికార్డ్కు వేదికకానుంది. అంతక్రితం నెల(సెపె్టంబర్)లో ఎఫ్పీఐలు గత 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఎఫ్పీఐలు ఒక నెలలో అత్యధికంగా రూ. 61,973 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఎన్నికల భయం.. 10 రోజుల్లో రూ. 17,000 కోట్లు వెనక్కి..
సార్వత్రిక ఎన్నికలు, దాని ఫలితం చుట్టూ ఉన్న అనిశ్చితి, ఖరీదైన వాల్యుయేషన్లు, ప్రాఫిట్ బుకింగ్ కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ ఈక్విటీల నుంచి భారీగా పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. మే నెల మొదటి 10 రోజుల్లో రూ. 17,000 కోట్లను ఉపసంహరించుకున్నారు.మారిషస్తో భారత్ పన్ను ఒప్పందం సర్దుబాటు, యూఎస్ బాండ్ ఈల్డ్లలో నిరంతర పెరుగుదలపై ఆందోళనల కారణంగా ఏప్రిల్లో నమోదైన రూ. 8,700 కోట్ల నికర ఉపసంహరణ కంటే ఇది చాలా ఎక్కువ. అంతకు ముందు ఎఫ్పీఐలు మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. సాధారణ ఎన్నికల తర్వాత నాలుగో త్రైమాసికంలో దేశ కార్పొరేట్ ఆర్థిక పనితీరు బలపడుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు స్పష్టంగా వెలువడేంత వరకు ఎఫ్పీఐలు జాగ్రత్త వైఖరి అవలంబించవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఎఫ్పీఐల ఈ దూకుడు అమ్మకాల వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు, దాని ఫలితాల చుట్టూ ఉన్న అనిశ్చితి కారణంగా, ఎన్నికల ఫలితాలకు ముందే మార్కెట్లోకి ప్రవేశించడంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉన్నారని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ - రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
తప్పుడు ప్లాట్ఫామ్స్తో జాగ్రత్త
తప్పుదారి పట్టించే ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్పట్ల జాగ్రత్త వహించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఇన్వెస్టర్లను హెచ్చరించింది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) మార్గంలో దేశీ ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ అవకాశాలను కల్పించనున్నట్లు పేర్కొనే ప్లాట్ఫామ్స్పట్ల అప్రమత్తతను ప్రదర్శించవలసిందిగా సూచించింది. మోసగాళ్లు స్టాక్ మార్కెట్ పేరుతో ఆన్లైన్ ట్రేడింగ్ కోర్సులు, సెమినార్లు, మెంటార్íÙప్ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా ఇన్వెస్టర్లను బురిడీ కొట్టిస్తున్నట్లు వివరించింది. ఇందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ తదితర లైవ్ బ్రాడ్క్యాస్ట్లను వినియోగించుకుంటున్నట్లు పేర్కొంది. సెబీ వద్ద రిజిస్టరైన ఎఫ్పీఐలు లేదా ఉద్యోగులులా మభ్యపెడుతూ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకునేలా వ్యక్తిగత ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు వెల్లడించింది. సంస్థాగత ఖాతాల లబ్దిని అందుకోమని ప్రోత్సహిస్తూ షేర్ల కొనుగోలు, ఐపీవోలకు దరఖాస్తు తదితరాలను ఆఫర్ చేస్తున్నట్లు తెలియజేసింది. ఇందుకు ఎలాంటి ట్రేడింగ్ లేదా డీమ్యాట్ ఖాతా అవసరంలేదంటూ తప్పుదారి పట్టిస్తున్నట్లు వివరించింది. ఈ పథకాలకు తప్పుడు పేర్లతో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్లను సైతం వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. -
ఎఫ్పీఐల దూకుడు
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత ఈక్విటీల పట్ల దూకుడు వైఖరి ప్రదర్శిస్తున్నారు. గడిచిన కొన్ని నెలలుగా అమ్మకాలు సాగిస్తూ వచ్చిన ఎఫ్పీఐలు, ఈ నెలలో మాత్రం భారీ పెట్టుబడులకు మొగ్గు చూపించారు. డిసెంబర్ నెలలో మొదటి ఆరు ట్రేడింగ్ రోజుల్లో (8వ తేదీ నాటికి) ఏకంగా రూ.26,505 కోట్ల మేర కొనుగోళ్లు చేశారు. ఇటీవల ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉండడం, మూడు రాష్ట్రాల్లో బీజేపీ బంపర్ మెజారిటీ సాధించడంతో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రస్తుత ప్రభుత్వమే కొనసాగుతుందన్న స్పష్టత ఎఫ్పీఐల్లో సానుకూలతకు దారితీసింది. అక్టోబర్ నెలలోనూ ఎఫ్పీఐలు నికరంగా రూ.9,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అంతకుముందు ఆగస్ట్, సెపె్టంబర్ నెలలో రూ.39,300 కోట్ల మేర పెట్టుబడులను వారు ఉపసంహరించుకోవడం గమనార్హం. ఇక మీదట ఎఫ్పీఐల పెట్టుబడులు కొనసాగుతాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్కుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో రాజకీయ స్థిరత్వం కొనసాగుతుందన్న సంకేతాల ఫలితమే ఎఫ్పీఐల పెట్టుబడులు భారీగా రావడానికి కారణమని ఫిడెల్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ వ్యవస్థాపకుడు కిస్లే ఉపాధ్యాయ పేర్కొన్నారు. ‘‘2024 సాధారణ ఎన్నికల అనంతరం రాజకీయ స్థిరత్వం, భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు, ద్రవ్యోల్బణం తగ్గడం, అమెరికా బాండ్ ఈల్డ్స్ స్థిరంగా తగ్గుతూ వస్తుండడం, బ్రెండ్ క్రూడ్ ధరల్లో దిద్దుబాటు భారత్కు అనుకూలించే అంశాలు’’అని విజయ్ కుమార్ వివరించారు. వీటిల్లో పెట్టుబడులు ‘‘వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నుంచి రేట్ల కోత ఉంటుందని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సంకేతం ఇవ్వడం, అధిక వడ్డీ రేట్ల వాతావరణం నుంచి మళ్లనున్నట్టు సూచించడమే అవుతుంది. దీంతో ఇతర కరెన్సీలతో యూఎస్ డాలర్ బలహీనపడడం మొదలైంది’’అని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ క్షీణించడంతో ఎఫ్పీఐలు భారత ఈక్విటీల్లో ఉన్న రిస్్క–రాబడుల తీరును తిరిగి మదించడానికి దారితీసినట్టు చెప్పారు. బ్యాంకులు, ఐటీ, టెలికం, ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల్లో ఎఫ్పీఐల కొనుగోళ్లు ప్రధానంగా ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం మీద ఇప్పటి వరకు ఎఫ్పీఐలు ఈక్విటీల్లో రూ.1.31 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయగా, డెట్ మార్కెట్లో రూ.55,867 కోట్ల పెట్టుబడులు పెట్టారు. -
కొనసాగుతున్న ఎఫ్పీఐ అమ్మకాలు
న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లు పెరుగుతుండటం వంటి అంశాల నేపథ్యంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) దేశీయంగా ఈక్విటీలను విక్రయించడం కొనసాగిస్తున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం .. నవంబర్లో ఇప్పటివరకు (1 నుంచి 10వ తేదీ వరకు) రూ. 5,800 కోట్ల మేర అమ్మేశారు. ఇప్పటికే అక్టోబర్లో రూ. 24,548 కోట్లు, సెపె్టంబర్లో 14,767 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దాని కన్నా ముందు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (మార్చి నుంచి ఆగస్టు వరకు) దాదాపు రూ. 1.74 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు, అక్టోబర్లో డెట్ మార్కెట్లో రూ. 6,381 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 6,053 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద ఈ ఏడాది ఇప్పటివరకు ఎఫ్పీఐల పెట్టుబడులు ఈక్విటీల్లో రూ. 90,161 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 41,554 కోట్లకు చేరాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఉద్రిక్తతలు, అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్లు పెరగడం వంటి అంశాల కారణంగా ఎఫ్పీఐల విక్రయాల ధోరణి కొనసాగుతోందని మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాస్తవ చెప్పారు. పరిస్థితులు మెరుగుపడి ఈక్విటీల్లో తిరిగి ఇన్వెస్ట్ చేసే వరకు నిధులను స్వల్పకాలికంగా డెట్ మార్కెట్లోకి మళ్లించే వ్యూహాన్ని మదుపుదారులు అమలు చేస్తున్నట్లు పరిశీలకులు తెలిపారు. ఆర్థిక రంగ సంస్థలు మెరుగైన క్యూ2 ఫలితాలు ప్రకటిస్తూ, ఆశావహ అంచనాలు వెలువరిస్తున్నప్పటికీ ఎఫ్పీఐలు వాటిలో అత్యధికంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీంతో బ్యాంకింగ్ స్టాక్స్ వేల్యుయేషన్లు ఆకర్షణీయంగా మారినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. -
గ్లోబల్ ట్రెండ్, ఎఫ్పీఐలే కీలకం.. ఈ వారం మార్కెట్ దిశపై నిపుణుల అంచనాలు
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను పలు అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని తెలియజేశారు. ఇటీవల విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఎఫ్పీఐ పెట్టుబడులకూ ప్రాధాన్యమున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసిక(ఏప్రిల్–జూన్) ఫలితాల సీజన్ ముగింపునకు చేరడంతో ఇకపై ఇన్వెస్టర్లు ఇతర అంశాలపై దృష్టి సారించనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ వివరించారు. జియో ఫైనాన్స్ లిస్టింగ్ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో నేడు(సోమవారం) లిస్ట్కానుంది. దేశీ ఎన్బీఎఫ్సీలలో రెండో పెద్ద కంపెనీగా ఆవిర్భవించిన సంస్థపై పలువురు కన్నేయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. వెరసి ఈ కౌంటర్లో భారీ ట్రేడింగ్ యాక్టివిటీకి వీలున్నట్లు అంచనా వేశారు. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టేందుకు కారణంకానున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్ధ్ ఖేమ్కా పేర్కొన్నారు. మార్కెట్ల ట్రెండ్లోని ఇన్వెస్టర్ల దృష్టి కొన్ని రంగాల నుంచి మరికొన్ని రంగాలవైపు మళ్లడం సహజమన్నారు. విదేశీ పరిస్థితులు: యూఎస్లో గృహ విక్రయాలు, ఉపాధి గణాంకాలకు మార్కెట్లు స్పందించనున్నట్లు మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ సీనియర్ వైస్ప్రెసిడెంట్ అర్విందర్ సింగ్ నందా పేర్కొన్నారు. అంతేకాకుండా యూరోజోన్, ఎస్అండ్పీ గ్లోబల్ కాంపోజిట్ పీఎంఐ గణాంకాలూ ప్రభావం చూపనున్నట్లు విశ్లేషించారు. ఈ వారం గ్లోబల్ గణాంకాలకుతోడు యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగానికి సైతం ప్రాధాన్యత ఉన్నట్లు ప్రస్తావించారు. ఇక దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ గత పాలసీ వివరాలు(మినిట్స్) వెలువడనున్నట్లు ప్రస్తావించారు. ఇతర అంశాలపైనా కన్ను అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, రుతుపవన పురోగతి సైతం దేశీ మార్కెట్ల ట్రెండ్కు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇటీవల యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ దూ కుడు చూపుతుండటంతో ఇకపై విదేశీ పెట్టుబడులు పరిమితంకావచ్చని, ఇది మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపే వీలున్నదని జియోజిత్ ఫైనా న్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ అభిప్రాయపడ్డారు. గత వారం పారిశ్రామికోత్పత్తి, టో కు ధరల ద్రవ్యోల్బణం వెనకడుగు, ఇదే సమయంలో రిటైల్ ధరల వేడి వంటి అంశాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు పేర్కొన్నారు. కాగా.. యూస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలకుతోడు పటిష్ట రిటైల్ అమ్మకాలు, చైనా కేంద్ర బ్యాంకు అనూహ్య రేట్ల కోత వంటి అంశాలతో గత వారం సెంటిమెంటు బలహీనపడింది. దీంతో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య స్వల్ప నష్టాలతో ముగిశాయి. చైనా మందగమనం, అభివృద్ధి చెందిన దేశాల వడ్డీ రేట్ల పెంపు అంచనాలు ఇందుకు కారణమయ్యా యి. సెన్సెక్స్ నికరంగా 374 పాయింట్లు(0.6 %) క్షీణించి 64,949 వద్ద స్థిరపడింది. వెరసి 65,000 స్థాయి దిగువకు చేరగా.. నిఫ్టీ 118 పాయింట్లు(0.6 శాతం) నీరసించి 19,310 వద్ద నిలిచింది. -
ఐదేళ్ల గరిష్టానికి పీనోట్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: పార్టిసిపేటరీ నోట్ల (పీనోట్లు) ద్వారా దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు జూన్ చివరికి రూ.1,11,291 కోట్లకు చేరాయి. దేశ ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీల్లో (క్యాపిటల్ మార్కెట్లు) కలిపి ఈ మేరకు పెట్టుబడులు ఉన్నాయి. ఐదున్నరేళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. మే చివరికి పీ నోట్ల పెట్టుబడుల విలువ రూ.1,04,585 కోట్లుగా ఉంది. స్థూల ఆర్థిక అంశాలు స్థిరంగా ఉండడం ఇందుకు మద్దతుగా నిలిచిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పీనోట్ల పెట్టుబడుల విలువ పెరగడం వరుసగా నాలుగో నెలలోనూ నమోదైనట్టు సెబీ గణాంకాలు స్పస్టం చేస్తున్నాయి. సెబీ వద్ద నమోదు చేసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే విదేశీ ఇన్వెస్టర్లకు పీనోట్లను జారీ చేస్తుంటారు. సెబీ వద్ద నమోదు చేసుకోకుండా పీ నోట్ల ద్వారా ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది.పీ నోట్ జారీ చేసే ఎఫ్పీఐలు ఇందుకు సంబంధించి సెబీ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రి ల్ చివరికి పీ నోట్ల పెట్టుబడుల విలువ రూ. 95, 911 కోట్లుగా ఉంటే, మార్చి చివరికి రూ. 88,600 కోట్లు, ఫిబ్రవరి చివరికి రూ.88,398 కో ట్లు, జనవరి చివరికి రూ.91,469 కోట్ల చొప్పున ఉంది. బలమైన పనితీరు వల్లే.. సాధారణంగా ఎఫ్పీఐల పెట్టుబడుల ధోరణికి అనుగుణంగానే పీనోట్ల పెట్టుబడులు కూడా ఉంటుంటాయి. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశి్చతులు నెలకొన్న సమయంలో భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన పనితీరు చూపిస్తుండడం పీ నోట్ పెట్టుబడుల వృద్ధికి దోహదపడినట్టు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జూన్ చివరికి ఉన్న రూ.1.11 లక్షల కోట్లలో ఈక్విటీల్లోనే రూ.1,00,701 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. డెట్లో రూ.12,382 కోట్లు, హైబ్రిడ్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు రూ.203 కోట్లుగా ఉన్నాయి. జూన్ చివరికి ఎఫ్పీఐల నిర్వహణలోని పెట్టుబడులు రూ.55.63 లక్షల కోట్లకు చేరాయి. మరోవైపు భారత ఈక్విటీల్లో ఎఫ్పీఐల పెట్టుబడులు పది నెలల గరిష్ట స్థాయి అయిన రూ.47,184 కోట్లకు జూన్ నెలలో చేరాయి. అదే నెలలో డెట్మార్కెట్లో ఎఫ్పీఐలు రూ.9,200 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. -
భారత్పై ఆశావహంగా విదేశీ ఇన్వెస్టర్లు
ముంబై: భారత్పై అమెరికా, యూరప్లోని విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) ఆశావహంగా ఉన్నారు. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు ఈక్విటీల్లోకి 9.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు తిరిగి రావడమే ఇందుకు నిదర్శనమని స్విస్ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ సెక్యూరిటీస్ ఒక నివేదికలో తెలిపింది. అంతక్రితం మూడు నెలల్లో 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తరలిపోయాయని వివరించింది. చాలా మంది గ్లోబల్ ఇన్వెస్టర్లు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీనే తిరిగి గెలుస్తారని విశ్వసిస్తున్నారని, డిసెంబర్ త్రైమాసికంలో పలు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల ఫలితాల గురించి వారు పెద్దగా పట్టించుకోవడం లేదని పేర్కొంది. 50 పైగా అమెరికన్, యూరోపియన్ ఎఫ్పీఐలతో సమావేశాల అనంతరం యూబీఎస్ ఈ నివేదికను రూపొందించింది. ఆర్థిక, రాజకీయ పరిస్థితులతో పాటు పెట్టుబడులు మెరుగ్గా ఉండటం .. ఇన్వెస్టర్లలో ఆశావహ ధోరణికి కారణమని పేర్కొంది. అయితే, బ్యాంకు వడ్డీ రేట్లు పెరుగుతున్నందున ప్రజలు తమ సొమ్మును ఈక్విటీల్లో కాకుండా ఇతరత్రా సాధనాల్లో దాచుకోవడం, వృద్ధి బలహీనపడటం తదితర రిస్కులు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిఫ్టీ 18,000 స్థాయిలోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు యూబీఎస్ వివరించింది. -
ఈక్విటీలలో భారీ పెట్టుబడులు.. ఇప్పటివరకూ రూ.30,945 కోట్లు
న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ(2–19) నికరంగా రూ. 30,945 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఇందుకు ప్రధానంగా దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండటం, వడ్డీ రేట్లు వెనకడుగు వేయనున్న అంచనాలు, సానుకూల కార్పొరేట్ ఫలితాలు, స్టాక్స్ విలువలు దిగివస్తుండటం వంటి అంశాలు సహకరిస్తున్నాయి. డిపాజిటరీల గణాంకాల ప్రకారం మే నెల పెట్టుబడులను కలుపుకుంటే ఈ క్యాలండర్ ఏడాది(2023)లో ఇప్పటివరకూ ఎఫ్పీఐలు రూ. 16,365 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్లో రూ. 11,630 కోట్లు, మార్చిలో రూ. 7,936 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసినప్పటికీ.. జనవరి, ఫిబ్రవరిలలో రూ. 34,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇక ఈ నెలలో రుణ సెక్యూరిటీలలో ఎఫ్పీఐలు రూ. 1,057 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇదీ చదవండి: Rs 2000 Note Withdrawn: రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ గవర్నర్ స్పష్టత.. కీలక విషయాలు వెల్లడి -
అదానీ స్టాక్స్లో విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇటీవల అదానీ గ్రూప్ స్టాక్స్లో రూ. 15,446 కోట్లు ఇన్వెస్ట్ చేయడంతో మార్చిలో పెట్టుబడులు లభించినట్లు నమోదైంది. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) నికరంగా రూ. 11,500 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అదానీ గ్రూప్లో యూఎస్ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ పెట్టుబడులను(రూ. 15,446 కోట్లు) మినహాయిస్తే దాదాపు రూ. 4,000 కోట్లమేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. యూఎస్లో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ విఫలంకావడంతో ఇకపై విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం ఎఫ్పీఐలు మార్చి 1–17 కాలంలో రూ. 11,495 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంతకుముందు ఫిబ్రవరిలో రూ. 5,294 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా, జనవరిలో మరింత అధికంగా రూ. 28,852 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అయితే 2022 డిసెంబర్లో నికరంగా రూ. 11,119 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. -
ఎఫ్పీఐలకు కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ: సమాచార వెల్లడి అంశంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీలు) నిబంధనలను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా సవరించింది. ఎఫ్పీఐల నిర్మాణం(స్ట్రక్చర్), యాజమాన్యం(కామన్ ఓనర్షిప్) తదితర అంశాలలో ప్రస్తావించదగ్గ మార్పులు ఉంటే 7 పని దినాలలోగా తెలియజేయవలసి ఉంటుంది. అంతేకాకుండా కొత్తగా రిజిస్టర్కాదలచిన ఎఫ్పీఐల విషయంలో అవసరాన్నిబట్టి అదనపు డాక్యుమెంట్లను దాఖలు చేయవలసిందిగా సెబీ ఆదేశించనుంది. తాజా మార్గదర్శకాలతో సెబీ నోటిఫికేషన్ను జారీ చేయడంతో ఈ నెల 14 నుంచి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. తద్వారా నిబంధనలను మరింత పటిష్ట పరచింది. వెరసి స్ట్రక్చర్, యాజమాన్య నియంత్రణ తదితర అంశాలలో అక్రమ లేదా తప్పుదారి పట్టించే మార్పులు చోటుచేసుకుంటే సెబీతోపాటు, తత్సంబంధిత డిపాజిటరీకు ఏడు పనిదినాలలోగా వివరాలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఇదేవిధంగా విదేశీ నియంత్రణ సంస్థలు ఏవైనా చర్యలు తీసుకుంటున్నా నిర్ణత గడువులోగా వెల్లడించవలసి ఉంటుంది. జరిమానాలు, దర్యాప్తులు, పెండింగ్ కార్యాచరణ తదితర అంశాలుంటే వారం రోజుల్లోగా తెలియజేయాలి. ఎఫ్పీఐ లేదా ఇన్వెస్టర్ గ్రూప్ యాజమాన్య నియంత్రణ, స్ట్రక్చర్ అంశాలలో ప్రత్యక్ష లేదా పరోక్ష మార్పులు చోటు చేసుకుంటే తాజా నిబంధనలు వర్తిస్తాయి. ఇదేవిధంగా డిపాజిటరీ పార్టిసిపెంట్లు ఈ సమాచారాన్ని సెబీకి రెండు రోజుల్లోగా వెల్లడించవలసి ఉంటుంది. -
ఈక్విటీల్లో ఎఫ్పీఐల వాటా డౌన్
న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) వాటాల విలువ వరుసగా మూడో త్రైమాసికంలోనూ క్షీణించింది. మార్నింగ్స్టార్ నివేదిక ప్రకారం 2022 ఏప్రిల్–జూన్(క్యూ1)లో 14 శాతం నీరసించి 523 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంతకుముందు క్వార్టర్లో ఈ విలువ 612 బిలియన్ డాలర్లుకాగా.. 2021 జూన్ క్వార్టర్కల్లా 592 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచీ విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దేశ, విదేశాలలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల ప్రభావంతో పెట్టుబడుల్లో వెనకడుగు వేస్తున్నారు. దేశీ ఈక్విటీ మార్కెట్ల విలువలోనూ ఎఫ్పీఐల వాటా మార్చిలో నమోదైన 17.8 శాతం నుంచి 16.9 శాతానికి నీరసించింది. 2022 జూన్ త్రైమాసికంలో ఎఫ్పీఐలు 13.85 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను విక్రయించారు. మార్చి క్వార్టర్లో వెనక్కి తీసుకున్న పెట్టుబడులు 14.59 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి తక్కువే కావడం గమనార్హం! యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కఠిన విధాన నిర్ణయాల నేపథ్యంలో ఎఫ్పీఐల సెంటిమెంటు బలహీనపడినట్లు నివేదిక పేర్కొంది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు కారణంగా బాండ్ల ఈల్డ్స్ సైతం జోరందుకున్నట్లు తెలియజేసింది. వీటికి చమురు హెచ్చుతగ్గులు, కమోడిటీ ధరల పెరుగుదల, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు జత కలిసినట్లు వివరించింది. -
కమోడిటీ డెరివేటివ్లలో ఎఫ్పీఐలకు సై
ముంబై: ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ కమోడిటీ డెరివేటివ్స్(ఈటీసీడీ) విభాగంలో కార్యకలాపాలు చేపట్టేందుకు సెబీ తాజాగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు)కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్టాక్ మార్కెట్లో మరింత లిక్విడిటీ, గాఢత పెరిగేందుకు వీలుంటుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ బోర్డు బుధవారం నిర్వహించిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంది. వీటిలో భాగంగా మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్ఫోలియో మేనేజర్ల పాలనా సంబంధ నిబంధనల సవరణలకు బోర్డు ఆమోదముద్ర వేసింది. అంతేకాకుండా కార్పొరేట్ బాండ్లు, రెపో లావాదేవీలకు సంబంధించిన లిమిటెడ్ పర్పస్ క్లయరింగ్ కార్పొరేషన్(ఎల్పీసీసీ)కు చెందిన ఎస్ఈసీసీ నియంత్రణల ప్రొవిజన్ల సవరణలకు సైతం ఓకే చెప్పింది. మార్చితో ముగిసిన గతేడాది(2021–22)కి వార్షిక నివేదికను బోర్డు ఆమోదించింది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి దాఖలు చేయనుంది. వ్యవసాయేతర విభాగం అన్ని రకాల వ్యవసాయేతర కమోడిటీ డెరివేటివ్స్లోనూ ట్రేడింగ్ చేపట్టేందుకు ఎఫ్పీఐలను సెబీ బోర్డు అనుమతించింది. వీటితోపాటు కొన్ని ఎంపిక చేసిన ప్రామాణిక ఇండెక్సులలోనూ లావాదేవీలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. తొలి దశలో నగదు ద్వారా సెటిల్ చేసుకునే కాంట్రాక్టుల్లో ట్రేడింగ్కు మాత్రమే ఎఫ్పీఐలకు వీలుంటుంది. ఈటీసీడీలో విదేశీ ఇన్వెస్టర్లకు అవకాశం కల్పించడం ద్వారా మార్కెట్లలో గాఢతను పెంచడంతోపాటు మరింత లిక్విడిటీకి అవకాశముంటుందని బోర్డు సమావేశం అనంతరం సెబీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో సరైన ధర నిర్ణయాని(ప్రైస్ డిస్కవరీ)కి సైతం వీలుంటుందని తెలియజేసింది. ఈ విభాగంలో ఇప్పటికే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్(ఏఐఎఫ్లు), పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు, మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్లు) తదితర కేటగిరీ–3 పెట్టుబడిదారులకు అనుమతి ఉంది. అర్హతగల విదేశీ సంస్థ(ఈఎఫ్ఈ)లు మార్గంలో ప్రస్తుతం అమల్లో ఉన్న దేశీ ఫిజికల్ కమోడిటీల ట్రేడింగ్ను రద్దు చేయనుంది. అయితే ఈటీసీడీలలో ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లుగా భారీ కొనుగోలు శక్తి కలిగిన ఎఫ్పీఐలను అనుమతించరు. తాజా నిర్ణయాల అమలు తేదీలను తదుపరి ప్రకటించనుంది. ప్రస్తుతం 10,000 ఎఫ్పీఐలు రిజిస్టరై ఉన్నప్పటికీ, పదో వంతు పార్టిసిపేట్ చేసినప్పటికీ మార్కెట్లు భారీగా విస్తరించే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. -
పడిపోతున్న విదేశీ ఇన్వెస్టర్ల వాటా
ముంబై: విదేశీ ఇనిస్టిట్యూషన్స్ భారత స్టాక్స్లో పెట్టుబడులను గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా తగ్గించుకున్నాయి. 2020–21లో 23 బిలియన్ డాలర్లు (రూ.1.72 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయగా.. 2021–22లో కేవలం 3.7 బిలియన్ డాలర్లు (రూ.27,750 కోట్లు) పెట్టుబడులకే పరిమితమయ్యాయి. దీంతో ఎన్ఎస్ఈ 500 కంపెనీల్లో వాటి మొత్తం మొత్తం వాటాలు 19.9 శాతానికి, 582 బిలియన్ డాలర్ల విలువకు (రూ.43.65 లక్షల కోట్లు) పరిమితమయ్యాయి. ఈ వివరాలను బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ వారం ఆరంభం వరకు చూస్తే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) పెట్టుబడుల ఉపసంహరణ 14.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో మార్చి నెలలోనే 5.4 బిలియన్ డాలర్లు బయటకు వెళ్లిపోవడం గమనార్హం. ఫిబ్రవరిలో 4.7 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నారు. మరింత వివరంగా.. ► 2022 మార్చి 15 నాటికి ఎఫ్పీఐల హోల్డింగ్స్ విలువ 582 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021 సెప్టెంబర్లో ఇది 667 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనించాలి. ► ఐటీ రంగంలో ఎఫ్పీఐల వాటాలు 0.87 శాతం పెరిగి 15 శాతానికి, ఇంధన రంగ కంపెనీల్లో 0.44 శాతం పెరిగి 15.5 శాతానికి, హెల్త్కేర్ రంగంలో 0.22 శాతం పెరిగి 4.9 శాతానికి చేరాయి. ► ఫైనాన్షియల్ కంపెనీల్లో ఎఫ్ఫీఐల పెట్టుబడులు 1.07 శాతం తగ్గి 31.5 శాతానికి పరిమితం అయ్యాయి. డిస్క్రీషనరీ కంపెనీల్లో 0.49 శాతం తగ్గి 9.1 శాతం మేర ఉన్నాయి. ► దేశీ ఇనిస్టిట్యూషన్స్ ఎన్ఎస్ఈ కంపెనీల్లో 2022 ఫిబ్రవరి నాటికి 265 బిలియన్ డాలర్ల పెట్టుబడులు కలిగి ఉన్నాయి. 13.1 బిలియన్ డాలర్లను తాజాగా కేటాయించాయి. ► ఎఫ్పీఐల వాటాల విలువ 2021–22 మొదటి త్రైమాసికం నాటికి 667 బిలియన్ డాలర్లుగా ఉంటే, అక్కడి నుంచి 112 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. ► దేశీ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు చురుగ్గా పెట్టుబడులు పెడుతుండడం వల్లే మార్కెట్లు మరీ పతనాన్ని చూడలేదని బ్యాంకు ఆప్ అమెరికా సెక్యూరిటీస్ పేర్కొంది. ► 2022 మార్చిలో ఎఫ్పీఐలు భారత ఈక్విటీల నుంచి 5.4 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. వరుసగా ఆరో నెలలోనూ వారు పెట్టుబడుల ఉపసంహరణను కొనసాగించారు. దీంతో మొత్తం మీద ఆరు నెలల్లో 14.6 బిలియన్ డాలర్లు వెనక్కి తీసుకెళ్లిపోయారు. ► దేశీ లిస్టెడ్ కంపెనీల్లో ఎఫ్పీఐల వాటాలు 2020 డిసెంబర్లో 21.4 శాతం స్థాయిలో ఉన్నాయి. అక్కడి నుంచి 19.9 శాతానికి దిగొచ్చాయి. -
తరలిపోతున్న విదేశీ ఇన్వెస్టర్లు
న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో 2 శాతం క్షీణించాయి. దీంతో అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో ఎఫ్పీఐ పెట్టుబడుల విలువ 654 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. మార్నింగ్ స్టార్ నివేదిక ప్రకారం జులై–సెప్టెంబర్(క్యూ2)లో ఇవి 667 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఎఫ్పీఐలు భారీ విక్రయాలకు తెరతీయడంతో దేశీ స్టాక్ మార్కెట్లలో దిద్దుబాటు చోటుచేసుకుంది. ప్రధానంగా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్స్లో అత్యధిక విక్రయాలు మార్కెట్లను దెబ్బతీశాయి. వెరసి ఈక్విటీ మార్కెట్ల క్యాపిటలైజేషన్లో ఎఫ్పీఐల వాటా క్యూ3లో నమోదైన 19 శాతం నుంచి క్యూ4 కల్లా 18 శాతానికి నీరసించింది. కాగా.. 2020 డిసెంబర్కల్లా దేశీ ఈక్విటీలలో ఎఫ్పీఐల వాటాల విలువ 518 బిలియన్ డాలర్లుగా నమోదుకావడం గమనార్హం! అమ్మకాలకే ప్రాధాన్యం ఎఫ్పీఐల పెట్టుబడుల్లో ఆఫ్షోర్ బీమా కంపెనీలు, హెడ్జ్ ఫండ్స్, సావరిన్ వెల్త్ ఫండ్స్తోపాటు ఆఫ్షోర్ మ్యూచువల్ ఫండ్స్ సైతం కీలక పాత్ర పోషిస్తుంటాయి. దేశీ ఈక్విటీలలో ఈ ఏడాది క్యూ2లో 56.34 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్పీఐలు క్యూ3లో యూటర్న్ తీసుకుని 5.12 బిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. నెలవారీగా చూస్తే అక్టోబర్లో 1.81 బిలియన్ డాలర్లు, నవంబర్లో 0.79 బిలియన్ డాలర్లు, డిసెంబర్లో మరింత అధికంగా 2.52 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇక 2021 జనవరి–డిసెంబర్ కాలాన్ని పరిగణిస్తే నికరంగా 3.76 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే 2020 ఇదేకాలంలో ఏకంగా 8.42 బిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. 2022లో మరింత డీలా ఇక ప్రస్తుత కేలండర్ ఏడాది(2022)లో సైతం ఎఫ్పీఐలు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ప్రధానంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ బాండ్ల కొనుగోలు నిలిపివేసేందుకు నిర్ణయించడంతోపాటు.. వడ్డీ రేట్ల పెంపువైపు దృష్టిపెట్టడంతో పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కఠిన పరపతి విధానాలు అమల్లోకి రానున్న అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఇటీవల బాండ్ల ఈల్డ్స్ జోరందుకోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. దీంతో ఇన్వెస్టర్లు ఈక్విటీల వంటి రిస్క్ అధికంగాగల ఆస్తుల నుంచి వైదొలగి పసిడివైపు మళ్లుతున్నట్లు తెలియజేసింది. వెరసి 2022లో ఫిబ్రవరి 4వరకూ ఎఫ్పీఐలు 4.95 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లు తెలియజేసింది. చదవండి : డెట్ ఇష్యూల్లో రూ.5 లక్షల వరకు పెట్టుబడులకు యూపీఐ -
జోరుమీదున్న పీనోట్స్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో పి.నోట్స్ రూపంలోని పెట్టుబడులు భారీగా వృద్ధి చెందుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీల్లోని పి.నోట్స్ పెట్టుబడుల విలువ రూ.1.02 లక్షల కోట్లకు చేరింది. సెబీ వద్ద నమోదైన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) పి.నోట్స్ జారీ చేస్తుంటారు. వీటి సాయంతో విదేశీ ఇన్వెస్టర్లు సెబీ వద్ద నేరుగా నమోదు కాకుండానే భారత మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 2018 మార్చిలో పి.నోట్స్ పెట్టుబడుల విలువ రూ.1,06,403 కోట్లుగా ఉండగా, ఆ తర్వాత గరిష్ట స్థాయికి చేరడం మళ్లీ ఇదే మొదటిసారి. అక్టోబర్లో పి.నోట్స్ రూపంలోని పెట్టుబడులు రూ.5,000కోట్లకు పైగా పెరగడం మొత్తం పెట్టుబడుల విలువ ఇతోధికం అయ్యేందుకు సాయపడినట్టు పీఎంఎస్ సంస్థ ‘పైపర్ సెరికా’ ఫండ్ మేనేజర్ అభయ్ అగర్వాల్ తెలిపారు. ‘‘ఆసక్తికరంగా ఈక్విటీల్లోని పి.నోట్స్ పెట్టుబడుల విలువ అక్టోబర్లో రూ.7,000 కోట్ల మేర పెరగ్గా.. డెట్ పెట్టుబడుల విలువ రూ.2,000 కోట్ల మేర తగ్గింది. అయితే, ఇదేమీ ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే దీర్ఘకాలిక వడ్డీ రేట్లు కనిష్టాలకు చేరుకోగా, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో 2022లో ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచక తప్పదు’’ అని అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పి.నోట్స్ పెట్టుబడుల విలువ రూ.97,751 కోట్లుగా ఉంటే, ఆగస్ట్ చివరికి రూ.97,744 కోట్లుగాను, జూలైలో రూ.85,799 కోట్ల చొప్పున ఉంది. ఎఫ్పీఐల నిర్వహణలోని ఆస్తులు అక్టోబర్ చివరికి రూ.53.60 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. -
అవన్నీ తప్పుడు కథనాలు : అదానీ
సాక్షి,ముంబై: ఎన్ఎస్డీఎల్ అదానీ గ్రూపునకు చెందిన మూడు విదేశీ నిధుల ఖాతాలను స్తంభింపజేసిందన్న వార్తలపై అదానీ గ్రూపుస్పందించింది. ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించడానికే ఉద్దేశపూర్వకంగా కుట్ర జరిగిందని వివరించింది. ఈ మేరకు అదానీ గ్రూప్ కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలకు వివరణ ఇచ్చింది. ఇలాంటి వార్తలు పెట్టుబడులకు , సంస్థలకు ఆర్థికపరంగా నష్టం వాటిల్లుతుందని ఆరోపించింది. అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఖాతాలను ఎన్ఎస్డీఎల్ ఫ్రీజ్ చేయలేదని వెల్లడించింది. మైనారిటీ పెట్టుబడిదారుల ఆసక్తిని కాపాడేందుకే ఈ ప్రకటనను జారీ చేస్తున్నామని తెలిపింది. మైనారిటీ పెట్టుబడిదారులపై ఈ వార్తలు ప్రతికూల ప్రభావాన్ని చూస్తే, ఆయా డిమాట్ ఖాతాల స్టేటస్ కో పద్ధతిని పాటించాలని రిజిస్ట్రార్ , ట్రాన్స్ఫర్ ఏజెంట్లను ఇ-మెయిల్ ద్వారా కోరింది. కాగా ఖాతాల లావాదేవీల నిలిపివేత వార్తలతో సోమవారం నాటి మార్కెట్లో అదానీ గ్రూపు మొత్తం ఆరు లిస్టెడ్ కంపెనీల షేర్లు ఇంట్రా-డే ట్రేడ్లో 5నుంచి 20 శాతం వరకు పడిపోయాయి. నాలుగు గ్రూప్ కంపెనీల్లో సుమారు 45 వేల కోట్ల విలువైన షేర్లను మూడు విదేశీ ఫండ్ల ఖాతాలను ఎన్ఎస్డీఎల్ స్తంభింపజేసిందని మీడియాలు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. చదవండి: ఎన్ఎస్డీఎల్: అదానీకి భారీ షాక్ -
నిఫ్టీ–500 స్టాక్స్లో డీఐఐల వాటా డౌన్
ముంబై: దేశీ స్టాక్స్లో ఓవైపు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) పెట్టుబడులకు దిగుతుంటే.. మరోపక్క దేశీ ఫండ్స్(డీఐఐలు) అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో గతేడాది (2020– 21) చివరి త్రైమాసికంలో నిఫ్టీ–500 ఇండెక్సులో భాగమైన కంపెనీలలో ఎఫ్పీఐల వాటా పుంజుకోగా.. డీఐఐల వాటా డీలా పడింది. వెరసి జనవరి–మార్చి(క్యూ4)లో డీఐఐల వాటా 0.5 శాతం క్షీణించి 14.2 శాతానికి పరిమితమైంది. ఇది గత 7 త్రైమాసికాలలో కనిష్టంకావడం గమనార్హం. ఇక ఇదే కాలంలో ఎఫ్పీఐల వాటా 1.6 శాతం బలపడి 22.3 శాతానికి చేరింది. బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ క్రోడీకరించిన గణాంకాలివి. ఇతర వివరాలు చూద్దాం.. క్యూ3తో పోలిస్తే వార్షికంగా చూస్తే నిఫ్టీ–500 స్టాక్స్లో ఎఫ్పీఐల వాటా 20.7 శాతం నుంచి 1.6 శాతం పుంజుకోగా.. డీఐఐల వాటా 14.7 శాతం నుంచి 0.5 శాతం క్షీణించింది. అయితే క్యూ3(అక్టోబర్–డిసెంబర్) తో పోలిస్తే ఎఫ్పీఐల వాటా 0.2 శాతం వెనకడుగు వేయగా.. డీఐఐల వాటా సైతం 0.1 శాతం నీరసించింది. క్యూ4లో ఎఫ్పీఐలు 7.3 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. ఇదే సమయంలో డీఐఐలు 3.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. రంగాల వారీగా గత రెండు త్రైమాసికాలలో ఎఫ్పీఐలు టెలికం, మెటల్స్, కన్జూమర్ డ్యురబుల్స్, రియల్టీ, సిమెంట్ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వగా.. డీఐఐలు ఈ రంగాలలో అధిక అమ్మకాలు చేపట్టాయి. కన్జూమర్, హెల్త్కేర్, ప్రభుత్వ బ్యాంకులను పెట్టుబడులకు ఎంచుకున్నాయి. ఈ నేపథ్యంలో మార్చికల్లా ఎఫ్పీఐల వాటా 22.3 శాతానికి ఎగసింది. ఇది కోవిడ్–19 తలెత్తకముందు స్థాయికావడం గమనార్హం! గతేడాది ద్వితీయార్థంలో ఎఫ్పీఐలు నిఫ్టీ–500 ఇండెక్స్లోని 286 కంపెనీలలో వాటాలు పెంచుకున్నాయి. నిఫ్టీ–50లో 32 కంపెనీలున్నాయి. ఈ బాటలో డీఐఐలు 203–18(నిఫ్టీ) స్టాక్స్లో వాటాలు కొనుగోలు చేశాయి. ఇదే కాలంలో ఎఫ్పీఐలు 203–18 కంపెనీలలో వాటాలు తగ్గించుకోగా.. డీఐఐలు 271–31 స్టాక్స్ పెట్టుబడుల్లో వెనకడుగు వేశాయి. విలువ రీత్యా నిఫ్టీ–500 స్టాక్స్లో ఎఫ్పీఐల వాటా విలువ 593 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రయివేట్ బ్యాంక్స్లో ఎఫ్పీఐల పెట్టుబడుల విలువ 139 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు డీఐఐల వాటాల విలువ 378 బిలియన్ డాలర్లకు చేరగా.. ప్రయివేట్ బ్యాంక్స్లో పెట్టుబడులు 59 డాలర్లుగా నమోదయ్యాయి. ఈ బాటలో టెక్నాలజీ స్టాక్స్ వాటా విలువ 43 బిలియన్ డాలర్లను తాకగా, కన్జూమర్ విభాగంలో 40 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. కాగా.. ప్రయివేట్ బ్యాంక్స్లో ఎఫ్పీఐలు 47.9% ఓనర్షిప్ను కలిగి ఉన్నారు. ఈ బాటలో ఎన్బీఎఫ్సీలలో 32.9 శాతం, ఆయిల్, గ్యాస్లో 23.1 %, బీమాలో 22.2 శాతం, రియల్టీలో 21.5% ఓనర్షిప్ను పొందారు. డీఐఐలు క్యాపిటల్ గూడ్స్ (21.9%), ప్రయివేట్ బ్యాంక్స్(20.4%), మెటల్స్ (18.3%), కన్జూమర్ డ్యురబుల్స్ (17.8%), పీఎస్బీ(17.6%)లలో ఓనర్షిప్ను కలిగి ఉన్నాయి. ఇటీవల డీఐఐలు అత్యధికంగా(1 శాతానికిపైగా) వాటా పెంచుకున్న కంపెనీల జాబితాలో బీపీసీఎల్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చేరాయి. -
రెండు రోజుల నష్టాలకు చెక్- మార్కెట్లు అప్
ముంబై, సాక్షి: రెండు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 351 పాయింట్లు జంప్చేసి 48,445కు చేరింది. నిఫ్టీ సైతం 111 పాయింట్లు ఎగసి 14,248 వద్ద ట్రేడవుతోంది. 10 రోజుల వరుస ర్యాలీకి గత రెండు రోజుల్లో బ్రేక్ పడినప్పటికీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లకు దిగడంతో ప్రారంభంలోనే మార్కెట్లు జోరందుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 48,503 ఎగువన, నిఫ్టీ 14,259 వద్ద గరిష్టాలను చేరాయి. ఇటీవల మార్కెట్లు నిరవధిక ర్యాలీ బాటలో సాగుతుండటంతో ట్రేడర్లు అప్పుడప్పడూ లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. దీంతో గత రెండు రోజుల్లో మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య వెనకడుగు వేసినట్లు తెలియజేశారు. అయితే కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ల అందుబాటు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వెల్లువ వంటి అంశాలు అంతర్గతంగా సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు పేర్కొన్నారు. (యూఎస్ మార్కెట్ల సరికొత్త రికార్డ్) అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా మీడియా, ఐటీ, ఫార్మా, ఆటో 1.5-1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్, బీపీసీఎల్, సన్ ఫార్మా, ఐషర్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, హెచ్సీఎల్ టెక్, విప్రొ 4-2 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్లో హిందాల్కో, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్, టైటన్ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. పవర్ షేర్లు ప్లస్ డెరివేటివ్ స్టాక్స్లో టొరంట్ పవర్, కంకార్, టాటా పవర్, ఐడియా, నాల్కో, ఐబీ హౌసింగ్, కోఫోర్జ్, బంధన్ బ్యాంక్ 4-2.5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు ఎంఅండ్ఎం ఫైనాన్స్, కమిన్స్, శ్రీరామ్ ట్రాన్స్, ఐడీఎఫ్సీ ఫస్ట్, ఇండిగో, గోద్రెజ్ ప్రాపర్టీస్ 2-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5-1 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ 1,706 షేర్లు లాభపడగా.. 521 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్పీఐల అమ్మకాలు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 382 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 990 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 484 కోట్లు, డీఐఐలు రూ. 380 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
రికార్డులతో ప్రారంభమై.. ఫ్లాట్గా
ముంబై, సాక్షి: వరుసగా 11వ రోజూ దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అయితే వెనువెంటనే ఒడిదొడుకులకు తెరలేచింది. ప్రస్తుతం సెన్సెక్స్ 64 పాయింట్లు పుంజుకుని 48,502కు చేరింది. నిఫ్టీ సైతం 22 పాయింట్లు లాభపడి 14,221 వద్ద ట్రేడవుతోంది. తొలుత సెన్సెక్స్ 48,617 సమీపానికి చేరింది. నిఫ్టీ సైతం 14,244 పాయింట్ల వరకూ ఎగసింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 48,373 దిగువన, నిఫ్టీ 14,183 వద్ద కనిష్టాలను చవిచూశాయి. కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ల అందుబాటు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వెల్లువ వంటి అంశాలు ఇన్వెస్టర్లకు జోష్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇటీవల మార్కెట్లు నిరవధిక ర్యాలీ బాటలో సాగుతుండటంతో ట్రేడర్లు కొంతమేర అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ బ్యాంక్స్ జోరు ఎన్ఎస్ఈలో పీఎస్యూ బ్యాంక్స్, మీడియా, ఆటో, మెటల్ 2-0.6 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఎఫ్ఎంసీజీ, ఫార్మా 0.5-0.2 శాతం చొప్పున డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, టైటన్, ఐవోసీ, ఐసీఐసీఐ, ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, మారుతీ 3.3-1 శాతం మధ్య జంప్ ఎగశాయి. ఇతర బ్లూచిప్స్లో ఐటీసీ, ఆర్ఐఎల్, హెచ్యూఎల్, ఐషర్, అల్ట్రాటెక్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ లైఫ్, కొటక్ బ్యాంక్, యాక్సిస్ 1.3-0.3 శాతం మధ్య క్షీణించాయి. నౌకరీ జూమ్ డెరివేటివ్ స్టాక్స్లో నౌకరీ, వేదాంతా, కంకార్, బాటా, ఎన్ఎండీసీ, టాటా కెమ్, శ్రీరామ్ ట్రాన్స్, ఇండస్ టవర్, బీవోబీ 6-2.5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోపక్క లుపిన్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఆర్తి ఇండస్ట్రీస్, అరబిందో ఫార్మా, బయోకాన్, పిరమల్ 3-1 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ 1,711 షేర్లు లాభపడగా.. 700 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్పీఐలు ఓకే నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 986 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 490 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 1,843 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 715 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
సెన్సెక్స్.. నాన్స్టాప్ ఎక్స్ప్రెస్
ముంబై, సాక్షి: తొలుత కొంతమేర వెనకడుగు వేసినప్పటికీ చివరికి మార్కెట్లు హుషారుగా ముగిశాయి. వెరసి వరుసగా 10వ రోజూ లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ 261 పాయింట్లు జంప్చేసి 48,438 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 14,200 వద్ద ముగిసింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా.. కోవిడ్-19 కట్టడికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో సోమవారం సెన్సెక్స్ 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ బాటలో గత 9 రోజులుగా మార్కెట్లు రికార్డుల ర్యాలీ చేస్తుండటంతో తొలుత ట్రేడర్లు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,903 పాయింట్ల వద్ద కనిష్టానికి చేరింది. తదుపరి జోరందుకుని చివరి సెషన్కల్లా 48,486ను అధిగమించింది. వెరసి కనిష్టం నుంచి 583 పాయింట్లు జంప్చేసింది. ఇక నిఫ్టీ సైతం 14,216-14,048 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. (2021లో 15 ఐపీవోలు- ఈ నెలలోనే 6) మెటల్ డీలా ఎన్ఎస్ఈలో ఐటీ 2.6 శాతం, ప్రయివేట్ బ్యాంక్స్ 2 శాతం చొప్పున లాభపడగా.. మెటల్ 1.4 శాతం, రియల్టీ 0.4 శాతం చొప్పున బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, విప్రో, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, టైటన్, హెచ్సీఎల్ టెక్ 6.3-1.3 శాతం మధ్య జంప్ చేశాయి. ఇతర బ్లూచిప్స్లో ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, ఎంఅండ్ఎం, ఎన్టీపీసీ, ఆర్ఐఎల్, బీపీసీఎల్, బజాజ్ ఆటో 2-1 శాతం మధ్య క్షీణించాయి. నౌకరీ జూమ్ డెరివేటివ్ స్టాక్స్లో నౌకరీ 14.5 శాతం దూసుకెళ్లగా.. ఇండస్ టవర్, ఆర్బీఎల్ బ్యాంక్, ఎల్అండ్టీ ఫైనాన్స్, ఆర్తి ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్, ముత్తూట్, శ్రీరామ్ ట్రాన్స్, ఎల్ఐసీ హౌసింగ్ 5.2-3.3 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు పిరమల్, సెయిల్, నాల్కో, ఇండిగో, చోళమండలం, డీఎల్ఎఫ్, బీహెచ్ఈఎల్ 2.5-1.5 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.4-0.7 శాతం మధ్య ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,780 లాభపడగా.. 1,289 నష్టపోయాయి. పెట్టుబడులవైపు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,843 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 715 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. గత శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 506 కోట్లు, డీఐఐలు రూ. 69 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
రికార్డుల ర్యాలీకి చెక్- ఐటీ అప్
ముంబై, సాక్షి: చిట్టచివరికి 9 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీయడంతో మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 141 పాయింట్లు క్షీణించి 48,036కు చేరింది. నిఫ్టీ సైతం 53 పాయింట్లు తక్కువగా 14,080 వద్ద ట్రేడవుతోంది. కోవిడ్-19 కట్టడికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో సోమవారం సెన్సెక్స్ 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ బాటలో 9 రోజులుగా మార్కెట్లు రికార్డుల ర్యాలీ చేస్తుండటంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 48,130-47,903 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఇక నిఫ్టీ సైతం 14,116-14,048 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. మీడియా, రియల్టీ ఓకే ఎన్ఎస్ఈలో మెటల్, పీఎస్యూ బ్యాంకింగ్, ఆటో 1 శాతం స్థాయిలో బలహీనపడగా.. మీడియా, ఐటీ 0.5 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, విప్రో మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 2.3-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇతర బ్లూచిప్స్లో టాటా మోటార్స్, హిందాల్కో, ఓఎన్జీసీ, ఎంఅండ్ఎం, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐవోసీ, కోల్ ఇండియా, ఐసీఐసీఐ, బజాజ్ ఆటో, బీసీసీఎల్ 3-1.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఎంజీఎల్ జోరు డెరివేటివ్ స్టాక్స్లో ఎంజీఎల్, ఐజీఎల్, ఆర్బీఎల్ బ్యాంక్, ఎల్అండ్టీ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్, మదర్సన్, జూబిలెంట్ ఫుడ్, జీ, నౌకరీ, ఇండస్టవర్ 4.2- 1.6 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు పిరమల్, ఇండిగో, చోళమండలం, కెనరా బ్యాంక్, భారత్ ఫోర్జ్, ఐడియా, ఆర్తి ఇండస్ట్రీస్, లాల్పాథ్ 2.6-1.2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్స్ 0.2 శాతం పుంజుకుంది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,229 నష్టపోగా.. 1149 లాభాలతో ట్రేడవుతున్నాయి. పెట్టుబడులవైపు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,843 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 715 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. గత శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 506 కోట్లు, డీఐఐలు రూ. 69 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
మెటల్స్ మెరుపులు- సెన్సెక్స్ రికార్డ్
ముంబై, సాక్షి: దేశీయంగా కోవిడ్-19 కట్టడికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. వెరసి 9వ రోజూ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 308 పాయింట్లు ఎగసి 48,177 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 114 పాయింట్లు జమ చేసుకుని 14,133 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 48,220 వద్ద, నిఫ్టీ 14,148 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను తాకడం విశేషం! (స్ట్ర్రెయిన్ ఎఫెక్ట్- పసిడి, వెండి హైజంప్) పీఎస్యూ బ్యాంక్స్ ఓకే ఎన్ఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా మెటల్ 5 శాతం, ఐటీ 2.7 శాతం, ఆటో 1.6 శాతం చొప్పున ఎగశాయి. పీఎస్యూ బ్యాంక్స్, ఫార్మా, మీడియా సైతం 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్, హిందాల్కో, ఐషర్, ఓఎన్జీసీ, టీసీఎస్, బీసీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, గెయిల్, గ్రాసిమ్, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టెక్ మహీంద్రా టాటా మోటార్స్ 8.4-2.5 శాతం మధ్య జంప్చేశాయి. బ్లూచిప్స్లో కేవలం హీరోమోటో, కొటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, టైటన్, ఏషియన్ పెయింట్స్, పవర్గ్రిడ్ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1.6- 0.5 శాతం మధ్య నీరసించాయి. మెటల్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్లో చోళమండలం, జిందాల్ స్టీల్, సెయిల్, నాల్కో, వేదాంతా, ఎన్ఎండీసీ, ఐడియా, కమిన్స్, అశోక్ లేలాండ్, భెల్ 7-5 శాతం మధ్య దూసుకెళ్లాయి. అయితే మరోవైపు జీ, జూబిలెంట్ ఫుడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, బంధన్ బ్యాంక్, ఐబీ హౌసింగ్ 2.6-0.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,096 లాభపడగా.. 993 మాత్రమే నష్టాలతో ముగిశాయి. పెట్టుబడులవైపు నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 506 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 69 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 1,136 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 258 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
9వ రోజూ జోరు- సెన్సెక్స్@ 48,000
ముంబై, సాక్షి: వరుసగా 9వ రోజూ దేశీ స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం 250 పాయింట్లు ఎగసి 48,119కు చేరింది. నిఫ్టీ సైతం 83 పాయింట్లు పుంజుకుని 14,102 వద్ద ట్రేడవుతోంది. కోవిడ్-19 కట్టడికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 48,168 వద్ద, నిఫ్టీ 14,114 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. చదవండి: (2021లో పెట్టుబడికి 6 స్టాక్స్) అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా మెటల్, బ్యాంకింగ్, మీడియా 2-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్జీసీ, టాటా మోటార్స్, హిందాల్కో, టాటా స్టీల్, గెయిల్, గ్రాసిమ్, బీసీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐషర్, టీసీఎస్, ఐసీఐసీఐ, ఐవోసీ, ఎస్బీఐ, యాక్సిస్ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్లో కేవలం హీరోమోటో, టైటన్, ఆర్ఐఎల్, ఏషియన్ పెయింట్స్ మాత్రమే అదికూడా 0.5 శాతం స్థాయిలో డీలా పడ్డాయి. ఐడియా జూమ్ డెరివేటివ్ స్టాక్స్లో ఐడియా, అశోక్ లేలాండ్, సెయిల్, ఫెడరల్ బ్యాంక్, ఎన్ఎండీసీ, ఐడీఎఫ్సీ ఫస్ట్, ముత్తూట్, భెల్, నాల్కో 5.5-3 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు కాల్గేట్ పామోలివ్ 0.4 శాతం క్షీణించింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,862 లాభపడగా.. 521 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. పెట్టుబడులవైపు నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 506 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 69 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 1,136 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 258 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
కొత్త ఏడాది తొలి రోజూ రికార్డ్స్తో బోణీ
ముంబై, సాక్షి: కొత్త ఏడాది తొలి రోజు దేశీ స్టాక్ మార్కెట్లకు కొత్త జోష్ వచ్చింది. దీంతో సెన్సెక్స్ 48,000 మైలురాయికి చేరువలో నిలవగా.. నిఫ్టీ 14,000 పాయింట్ల మార్క్ను అధిగమించింది. వెరసి వరుసగా 8వ రోజూ మార్కెట్లు లాభపడగా.. మరోసారి సరికొత్త గరిష్ట రికార్డులు నమోదయ్యాయి. సెన్సెక్స్ 118 పాయింట్ల వృద్ధితో 47,869 వద్ద ముగిసింది. నిఫ్టీ 37 పాయింట్లు పుంజుకుని 14,019 వద్ద స్థిరపడింది. గత వారానికల్లా నిరుద్యోగ క్లెయిములు తగ్గడంతో గురువారం యూఎస్ మార్కెట్లు 0.6 శాతం స్థాయిలో బలపడ్డాయి. మరోసారి రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి. దీనికితోడు కోవిడ్-19 కట్టడికి ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) గుర్తింపును ఇవ్వడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,980ను తాకగా.. నిఫ్టీ 14,050కు చేరింది. (2020: ఎఫ్పీఐల పెట్టుబడుల స్పీడ్) ఐటీ, ఆటో.. ఎన్ఎస్ఈలో ప్రయివేట్ బ్యాంక్స్ 0.3 నీరసించగా.. పీఎస్యూ బ్యాంక్స్ 3.3 శాతం ఎగశాయి. ఈ బాటలో ఆటో, ఐటీ, రియల్టీ 1 శాతం స్థాయిలో లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్, టీసీఎస్, ఐటీసీ, ఎంఅండ్ఎం, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఎయిర్టెల్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, సిప్లా 4.4-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐసీఐసీఐ, ఎస్బీఐ లైఫ్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటన్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ 1.4-0.4 శాతం మధ్య డీలా పడ్డాయి. బీహెచ్ఈఎల్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్లో బీహెచ్ఈఎల్, చోళమండలం, ఐడియా, బీఈఎల్, పీఎన్బీ, బీవోబీ, ఎల్ఐసీ హౌసింగ్, లాల్పాథ్, పిరమల్, కెనరా బ్యాంక్ 8-4 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు ఎస్బీఐ లైఫ్, బాలకృష్ణ, ఇండిగో, హావెల్స్, మదర్సన్, వేదాంతా 1.4-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,046 లాభపడగా.. 953 మాత్రమే నష్టాలతో నిలిచాయి. ఎఫ్పీఐల జోరు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,136 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 258 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ, 1,825 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 587 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
నయా జోష్- 48,000 చేరువలో సెన్సెక్స్
ముంబై, సాక్షి: కొత్త ఏడాది తొలి రోజు దేశీ స్టాక్ మార్కెట్లకు కొత్త జోష్ వచ్చింది. దీంతో సెన్సెక్స్ 48,000 మైలురాయివైపు కదులుతుంటే.. నిఫ్టీ 14,000 పాయింట్ల మార్క్ను దాటేసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 193 పాయింట్లు ఎగసి 47,944కు చేరగా.. నిఫ్టీ 49 పాయింట్లు పుంజుకుని 14,031 వద్ద ట్రేడవుతోంది. వెరసి వరుసగా ఏడో రోజు మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. గత వారానికల్లా నిరుద్యోగ క్లెయిములు తగ్గడంతో గురువారం యూఎస్ మార్కెట్లు 0.6 శాతం స్థాయిలో బలపడ్డాయి. మరోసారి రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి. దీనికితోడు కోవిడ్-19 కట్టడికి ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) గుర్తింపును ఇవ్వడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,944కు చేరగా.. నిఫ్టీ 14,033ను తాకింది. ఇవి సరికొత్త గరిష్టాలు కావడం విశేషం! (ఈ కొత్త కుబేరుడు- ఆసియాలోనే టాప్) ఫార్మా, మెటల్ వీక్ ఎన్ఎస్ఈలో పీఎస్యూ బ్యాంక్స్ 2.2 శాతం లాభపడగా.. మీడియా, ఐటీ, ఆటో 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. మెటల్, ఫార్మా స్వల్ప వెనకడుగులో ఉన్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్ఎం, యూపీఎల్, టీసీఎస్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, శ్రీ సిమెంట్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్, ఐటీసీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ 2-0.5 శాతం మధ్య ఎగశాయి. అయితే సన్ ఫార్మా, హిందాల్కో, గ్రాసిమ్, ఎస్బీఐ లైఫ్, ఐషర్, గెయిల్, టాటా స్టీల్ 1-0.4 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఈఎల్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్లో బీఈఎల్, లాల్పాథ్, పీఎన్బీ, బీవోబీ, ఎస్కార్ట్స్, ఎల్ఐసీ హౌసింగ్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, చోళమండలం, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 5-2 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు ఇండిగో, గోద్రెజ్ ప్రాపర్టీస్, బంధన్ బ్యాంక్, సెయిల్, అరబిందో, వేదాంతా 1-0.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,607 లాభపడగా.. 586 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్పీఐల జోరు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,136 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 258 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ, 1,825 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 587 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
నిఫ్టీ భళా- 2020కు రికార్డ్స్తో వీడ్కోలు
ముంబై, సాక్షి: భారీ ఆటుపోట్లను చవిచూసిన 2020 ఏడాదికి దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగింపు పలికాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 వణికించినప్పటికీ చెప్పుకోదగ్గ లాభాలతో నిలిచాయి. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే మార్కెట్లు 16 శాతం స్థాయిలో బలపడ్డాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 47,000 పాయింట్లను అధిగమించడంతోపాటు.. 48,000 మార్క్కు చేరువైంది. ఈ బాటలో నిఫ్టీ 14,000 పాయింట్ల మైలురాయిని దాటేసింది. ఈ ఏడాది కరోనా వైరస్ కల్లోలంతో ఫార్మా రంగం అత్యధికంగా 61 శాతం దూసుకెళ్లగా.. లాక్డవున్ నేపథ్యంలో కొత్త అవకాశాలతో ఐటీ 55 శాతం జంప్చేసింది. వెరసి ఇన్వెస్టర్లకు అత్యధిక రిటర్నులు అందించిన దిగ్గజాలలో దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్ ముందునిలవగా.. ప్రయివేట్ రంగ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ వెనకడుగు వేసింది. ఇదేవిధంగా పీఎస్యూ బ్లూచిప్స్ ఐవోసీ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా సైతం డీలా పడ్డాయి. (తొలిసారి.. 14,000 మైలురాయికి నిఫ్టీ) నేటి ట్రేడింగ్ ఇలా డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ చివరి రోజు స్వల్ప ఒడిదొడుకుల మధ్య మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్ నామమాత్రంగా 5 పాయింట్లు బలపడి 47,751 వద్ద నిలిచింది. నిఫ్టీ యథాతథంగా 13,982 వద్ద స్థిరపడింది. అయితే ఇంట్రాడేలో 47,897 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకోగా.. నిఫ్టీ 14,000 పాయింట్ల మైలురాయిని దాటేసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,602 వరకూ డీలా పడగా.. నిఫ్టీ 14,025-13,936 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2-0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,766 లాభపడగా.. 1,244 నష్టపోయాయి. 2020లో జోష్ ప్రధానంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారీ సహాయక ప్యాకేజీలకు తెరతీశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా లిక్విడిటీ ఊపందుకుంది. ఫలితంగా చౌకగా లభిస్తున్న ప్రపంచ పెట్టుబడులు స్టాక్ మార్కెట్లు, బంగారం, వెండి వంటి సాధనాలలోకి ప్రవహించాయి. ఫలితంగా యూఎస్తోపాటు భారత్ మార్కెట్లు కూడా చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. కోవిడ్-19 భయాలతో ఆగస్ట్లో న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) 2,067 డాలర్ల వద్ద గరిష్టానికి చేరింది. ఈ బాటలో దేశీయంగానూ ఆగస్ట్లో పసిడి 10 గ్రాములు (ఎంసీఎక్స్) రూ. 57,100కు ఎగసింది. ఇది దేశీ బులియన్ మార్కెట్లోనే రికార్డ్కావడం విశేషం! (పసిడి తగ్గనుందా?.. ఇకపై కొనొచ్చా? ) రికవరీ ఆశలు కోవిడ్-19 సంక్షోభం నుంచి నెమ్మదిగా యూఎస్, చైనా, భారత్ వంటి దేశాలు బయటపడుతుండటంతో ఆర్థిక రికవరీపై అంచనాలు పెరిగాయి. ఇది సెంటిమెంటుకు బలాన్నిచ్చింది. దీనికితోడు కొన్ని ఎంపిక చేసిన రంగాలలో కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలు సాధిస్తూ వచ్చాయి. ఇది ఇన్వెస్టర్లకు హుషారునిచ్చింది. వీటికి జతగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల భారీ పెట్టుబడులు, వివిధ వ్యాక్సిన్ల క్లినికల్ పరీక్షల పలితాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ప్రధానంగా గ్లోబల్ ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్లు జోష్నిచ్చాయి. దేశీయంగానూ భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్, జైడస్ క్యాడిలా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తదితర సంస్థలు వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీకి ఒప్పందాలు కుదుర్చుకోవడంతో మార్కెట్లు నిరవధిక ర్యాలీ చేస్తూ వచ్చినట్లు విశ్లేషకులు వివరించారు. -
రెండో రోజూ రూపాయి పరుగు
ముంబై, సాక్షి: వరుసగా రెండో రోజు దేశీ కరెన్సీ జోరు చూపుతోంది. ప్రస్తుతం డాలరుతో మారకంలో 25 పైసలు బలపడి 73.06 వద్ద ట్రేడవుతోంది. ఇది రెండున్నర నెలల గరిష్టంకాగా.. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో తొలుత 15 పైసలు పుంజుకుని 73.16 వద్ద ప్రారంభమైంది. తదుపరి ఒక దశలో 73.05 వరకూ బలపడింది. బుధవారం సైతం డాలరుతో మారకంలో రూపాయి 11 పైసలు లాభపడి 73.31 వద్ద స్థిరపడింది. చదవండి: (2020: ఎఫ్పీఐల పెట్టుబడుల స్పీడ్) కారణాలేవిటంటే.. ఇటీవల కొద్ది రోజులుగా డాలరు ఇండెక్స్ బలహీనపడుతోంది. తాజాగా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో 90 దిగువకు చేరింది. 89.64 వద్ద 32 నెలల కనిష్టాన్ని తాకింది. ఇంతక్రితం 2018 ఏప్రిల్లో మాత్రమే డాలరు ఇండెక్స్ ఈ స్థాయిలో కదిలినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు ఆసియా దేశాల కరెన్సీలు పుంజుకోవడం సెంటిమెంటు బలపడేందుకు దోహదం చేసినట్లు తెలియజేశాయి. ప్రధానంగా చైనా తయారీ రంగం జోరందుకోవడంతో డాలరుతో మారకంలో యువాన్ 6.54ను తాకింది. దేశీ ఎఫెక్ట్ సెప్టెంబర్కల్లా కరెంట్ ఖాతా 15.5 బిలియన్ డాలర్ల మిగులుకు చేరినట్లు ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా దేశీ ఈక్విటీ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల వెల్లువెత్తడం వంటి అంశాలు రూపాయికి ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. దేశీ ఈక్విటీ మార్కెట్లో గత 12 ఏళ్లలోలేని విధంగా ఎఫ్పీఐలు నవంబర్లో 8 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయగా.. డిసెంబర్లోనూ 5 బిలియన్ డాలర్లకుపైగా పంప్చేసిన సంగతి తెలిసిందే. ఈ బాటలో 2020లో ఇప్పటివరకూ 22.6 బిలయన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
తొలిసారి.. 14,000 మైలురాయికి నిఫ్టీ(అప్డేటెడ్)
ముంబై, సాక్షి: వరుసగా ఆరు రోజులపాటు ర్యాలీ బాటలో సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు తాజాగా కన్సాలిడేషన్ బాట పట్టాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 36 పాయింట్లు బలపడి 47,782కు చేరగా.. నిఫ్టీ 9 పాయింట్లు పుంజుకుని 13,991 వద్ద ట్రేడవుతోంది. గత 21 సెషన్లలో 15సార్లు మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు నేడు ముగియనుండటంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,801-47,602 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ సైతం 13998-13936 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మిడ్సెషన్కంటే ముందుగానే నిఫ్టీ 14,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. 28 పాయింట్లు బలపడటం ద్వారా ఇంట్రాడేలో 14,010ను తాకింది. వెరసి మార్కెట్ చరిత్రలో తొలిసారి నిఫ్టీ ఈ ఫీట్ను సాధించింది. పీఎస్యూ బ్యాంక్స్ ప్లస్ ఎన్ఎస్ఈలో ఐటీ, ఎఫ్ఎంసీజీ 0.4-0.2 శాతం చొప్పున నీరసించగా.. మిగిలిన అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా ఫార్మా, ఐటీ, పీఎస్యూ బ్యాంకింగ్1-0.3 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ, సన్ ఫార్మా, సిప్లా, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, దివీస్, ఆర్ఐఎల్ 1.4-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే శ్రీ సిమెంట్, అల్ట్రాటెక్, గ్రాసిమ్, గెయిల్, యూపీఎల్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఐషర్, టీసీఎస్, ఇన్ఫోసిస్ 1.5-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. అరబిందో జూమ్ డెరివేటివ్ స్టాక్స్లో అరబిందో, ఐడియా, పీవీఆర్, బీఈఎల్, గ్లెన్మార్క్, అశోక్ లేలాండ్, లుపిన్, పెట్రోనెట్ 3-1.5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు బంధన్ బ్యాంక్, రామ్కో సిమెంట్, అంబుజా, ఏసీసీ, జీఎంఆర్, అదానీ ఎంటర్, టొరంట్ పవర్ 2-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,488 లాభపడగా.. 703 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్పీఐల జోరు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ, 1,825 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 587 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 2,349 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,010 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
2020: ఎఫ్పీఐల పెట్టుబడుల స్పీడ్
ముంబై, సాక్షి: ఈ కేలండర్ ఏడాది(2020)లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) నుంచి దేశీ క్యాపిటల్ మార్కెట్లలోకి భారీగా పెట్టుబడులు తరలివచ్చాయి. ప్రధానంగా ఈక్విటీలలో ఇప్పటివరకూ 22.6 బిలియన్ డాలర్లు ప్రవహించాయి. ఇవి 2019లో నమోదైన 14.23 బిలియన్ డాలర్లతో పోలిస్తే 58 శాతం అధికంకావడం విశేషం! తద్వారా వర్ధమాన మార్కెట్లలో అత్యధిక ఎఫ్పీఐల పెట్టుబడులను ఆకట్టుకున్న దేశంగా చైనా తదుపరి భారత్ నిలిచింది. ఇప్పటివరకూ చైనాకు 104 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తరలి వెళ్లాయి. అయితే 2019లో చైనా ఆకట్టుకున్న 132.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి 21 శాతానికిపైగా తక్కువకావడం గమనార్హం! కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ రూపొందించిన గణాంకాలివి. కాగా.. 2019లో 4.4 కోట్ల బిలియన్ డాలర్లను ఆకట్టుకున్న రష్యా 2020లో మరింత అధికంగా 12.25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టింది. తద్వారా మూడో ర్యాంకులో నిలిచింది. చదవండి: (2021: ముకేశ్ ఏం చేయనున్నారు?) ఏప్రిల్ నుంచీ జోరు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ రెండో వారంవరకూ చూస్తే దేశీ ఈక్విటీలలోకి రూ. 2 లక్షల కోట్ల ఎఫ్పీఐ పెట్టుబడులు ప్రవహించాయి. వీటిలో ఫైనాన్షియల్ సర్వీసుల రంగం రూ. 63,000 కోట్లను ఆకట్టుకోగా.. రూ. 47,000 కోట్ల పెట్టుబడులతో బ్యాంకింగ్ అగ్రభాగాన నిలిచింది. కోవిడ్-19 కారణంగా నిజానికి ఏప్రిల్, మే నెలల్లో ఎఫ్పీఐలు నికర అమ్మకందారులుగా నిలిచారు. అయితే నవంబర్లో గత 12 ఏళ్లలోలేని విధంగా 8.1 బిలియన్ డాలర్లను ఎఫ్పీఐలు ఇన్వెస్ట్ చేశారు. ఇదే నెలలో భారత్ తదుపరి బ్రెజిల్(6.2 బిలియన్ డాలర్లు), దక్షిణ కొరియా(5.2 బిలియన్ డాలర్లు), తైవాన్(4.5 బిలియన్ డాలర్లు) జాబితాలో చేరాయి. ఇక డిసెంబర్లోనూ ఇప్పటివరకూ దేశీ ఈక్విటీలలోకి 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించడం ప్రస్తావించదగ్గ అంశం! 80 శాతం జూమ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ కల్లోలంతో మార్చిలో స్టాక్ మార్కెట్లు పతనమైన సంగతి తెలిసిందే. తదుపరి పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడంతో విదేశీ పెట్టుబడులు ఊపందుకున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ 75 శాతానికిపైగా ర్యాలీ చేసి సరికొత్త గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ 47,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ 14,000 పాయింట్లవైపు చూస్తోంది. ఈ బాటలో ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 81 శాతం దూసుకెళ్లి 31,000 సమీపానికి చేరింది. ఫలితంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ 80 శాతం స్థాయిలో ఎగశాయి. చదవండి: (2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!) చైనా వెనకడుగు ఈ ఏడాది(2020)లో చైనా, హాంకాంగ్ల నుంచి ప్రయివేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ నిధులు భారీగా క్షీణించాయి. ఈ రెండు ప్రాంతాల నుంచి దేశానికి తరలివచ్చిన పెట్టుబడులు 2019తో పోలిస్తే 72 శాతం పడిపోయాయి. 95.2 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాదిలో 340 కోట్ల డాలర్ల పెట్టుబడులు లభించాయి. వెంచర్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం మెయిన్ల్యాండ్ చైనా నుంచి 64 శాతం తక్కువగా 37.7 కోట్ల డాలర్లు, హాంకాంగ్ నుంచి 75 శాతం తక్కువగా 57.5 కోట్ల డాలర్ల పెట్టుబడులు తరలి వచ్చాయి. కాగా.. చైనీస్ సంస్థలు దేశీయంగా ఇన్వెస్ట్ చేసేందుకు దాఖలు చేసిన 150 అప్లకేషన్లు పెండింగ్లో ఉన్నట్లు ఖైటాన్ అండ్ కో తెలియజేసింది. పెట్టుబడులు తగ్గడానికి ప్రధానంగా ప్రెస్ నోట్3 నిబంధనలు కారణమైనట్లు లా సంస్థ ఖైటాన్ అభిప్రాయపడింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ఏప్రిల్లో ప్రభుత్వం పీఎన్3ను ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. ఈ నిబంధనల ప్రకారం భారత్తో సరిహద్దు కలిగిన విదేశీ సంస్థలు ప్రభుత్వ అనుమతితోనే ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుందని తెలియజేసింది. -
5 రోజుల ర్యాలీకి బ్రేక్- నష్టాలతో షురూ
ముంబై, సాక్షి: వరుసగా ఐదు రోజులపాటు ర్యాలీ బాటలో సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు తాజాగా కన్సాలిడేషన్ బాట పట్టాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 81 పాయింట్లు క్షీణించి 47,532కు చేరగా.. నిఫ్టీ 21 పాయింట్లు తక్కువగా 13,911 వద్ద ట్రేడవుతోంది. గత 20 సెషన్లలో 14సార్లు మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు గురువారం డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనుండటంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,808-47,462 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. పీఎస్యూ బ్యాంక్స్ డౌన్ ఎన్ఎస్ఈలో ఐటీ, ఆటో 0.3 శాతం చొప్పున పుంజుకోగా మిగిలిన అన్ని రంగాలూ డీలాపడ్డాయి. ప్రధానంగా పీఎస్యూ బ్యాంకింగ్, ఫార్మా1-0.6 శాతం స్థాయిలో నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్, ఐషర్, ఎస్బీఐ లైఫ్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీసీఎల్ టెక్, ఎంఅండ్ఎం 3.5-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఎస్బీఐ, ఇండస్ఇండ్, సిప్లా, గ్రాసిమ్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, యాక్సిస్, హిందాల్కో, బ్రిటానియా, ఎల్అండ్టీ, ఆర్ఐఎల్ 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. జీఎంఆర్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్లో జీఎంఆర్, సెయిల్, బాలకృష్ణ, శ్రీరామ్ ట్రాన్స్, ఐసీఐసీఐ లంబార్డ్, పెట్రోనెట్, నౌకరీ, కమిన్స్ 4-1.5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు నాల్కో, బీవోబీ, ఎల్ఐసీ హౌసింగ్, ఐడీఎఫ్సీ ఫస్ట్, పీఎన్బీ, అరబిందో, పీఎఫ్సీ, కెనరా బ్యాంక్, సన్ టీవీ, ఆర్ఈసీ 2-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,130 లాభపడగా.. 1,158 నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్పీఐల జోరు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,349 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,010 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 1,589 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,387 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
అలుపులేని మార్కెట్లు- రికార్డ్స్ నమోదు
ముంబై, సాక్షి: ఇటీవల రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి జోరు చూపాయి. సెన్సెక్స్ 259 పాయింట్లు జంప్చేసి 47,613 వద్ద ముగిసింది. నిఫ్టీ 59 పాయింట్లు ఎగసి 13,933 వద్ద నిలిచింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ 20 ట్రేడింగ్ సెషన్లలో 14సార్లు మార్కెట్లు రికార్డులను నెలకొల్పడం విశేషం! ప్రెసిడెంట్ ట్రంప్ 2.3 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీపై సంతకం చేయడంతో సోమవారం యూఎస్ మార్కెట్లు 0.7 శాతం బలపడ్డాయి. తద్వారా సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. ఇక కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానుండటంతో దేశీయంగానూ సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు నిరవధిక ర్యాలీ చేస్తున్నట్లు వివరించారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,714 వద్ద, నిఫ్టీ 13,967 వద్ద చరిత్రాత్మక రికార్డులను అందుకున్నాయి. రియల్టీ డౌన్ ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్, ఐటీ రంగాలు 1.5-0.8 శాతం మధ్య బలపడగా.. మీడియా, మెటల్, ఆటో, ఫార్మా, రియల్టీ 1.5-0.25 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, టెక్ మహీంద్రా, యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐటీసీ, గెయిల్ 6-1 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్లో హిందాల్కో, నెస్లే, కోల్ ఇండియా, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఆర్ఐఎల్, సిప్లా 2-1 శాతం మధ్య నీరసించాయి. ఐజీఎల్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్లో ఐజీఎల్, జీఎంఆర్, ఎక్సైడ్, ఎంజీఎల్, పీఎన్బీ, ఎస్కార్ట్స్, శ్రీరామ్ ట్రాన్స్, బంధన్ బ్యాంక్, అపోలో టైర్, నౌకరీ 6-2 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు జిందాల్ స్టీల్, మ్యాక్స్ ఫైనాన్స్, వేదాంతా, క్యాడిలా హెల్త్, ఎన్ఎండీసీ, మెక్డోవెల్, పిరమల్ 3- 1.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో స్మాల్ క్యాప్స్ 0.15 శాతం పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1,559 లాభపడగా.. 1,464 నష్టాలతో ముగిశాయి. ఎఫ్పీఐల జోరు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,589 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 1,387 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. గురువారం ఎఫ్పీఐలు దాదాపు రూ. 1,226 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. డీఐఐలు మాత్రం రూ. 1,898 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
రికార్డులే హద్దుగా మార్కెట్ల దూకుడు
ముంబై, సాక్షి: కోవిడ్-19 భయాల నుంచి బయటపడి రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 322 పాయింట్లు జంప్చేసి 47,676కు చేరగా.. నిఫ్టీ 88 పాయింట్లు ఎగసి 13,961 వద్ద ట్రేడవుతోంది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ 20 ట్రేడింగ్ సెషన్లలో 14సార్లు మార్కెట్లు రికార్డులను నెలకొల్పడం విశేషం! ప్రెసిడెంట్ ట్రంప్ 2.3 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీపై సంతకం చేయడంతో సోమవారం యూఎస్ మార్కెట్లు 0.7 శాతం బలపడ్డాయి. తద్వారా సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. ఇక కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానుండటంతో దేశీయంగానూ సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు నిరవధిక ర్యాలీ చేస్తున్నట్లు వివరించారు. (19 సెషన్లలో 13 సార్లు కొత్త రికార్డ్స్) మెటల్ వీక్ ఎన్ఎస్ఈలో మెటల్(0.2 శాతం) మినహా అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ 1 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, విప్రో, హెచ్డీఎఫ్సీ, హెచ్సీఎల్ టెక్, ఐటీసీ, గ్రాసిమ్, యాక్సిస్, హెచ్ఢీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా 4-1.2 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్లో జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, నెస్లే, హిందాల్కో, అల్ట్రాటెక్, ఐషర్, ఆర్ఐఎల్, సిప్లా 1-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఆర్బీఎల్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్లో ఆర్బీఎల్ బ్యాంక్, పీఎన్బీ, బంధన్ బ్యాంక్, టాటా కెమ్, శ్రీరామ్ ట్రాన్స్, బీవోబీ 4-3 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు గోద్రెజ్ ప్రాపర్టీస్, టొరంట్ ఫార్మా, బాటా, ఐబీ హౌసింగ్, ఎస్కార్ట్స్, కాల్గేట్ పామోలివ్, నాల్కో, క్యాడిలా 1- 0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,558 లాభపడగా.. 673 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్పీఐల జోరు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,589 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 1,387 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. గురువారం ఎఫ్పీఐలు దాదాపు రూ. 1,226 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. డీఐఐలు మాత్రం రూ. 1,898 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
19 సెషన్లలో 13 సార్లు కొత్త రికార్డ్స్
ముంబై, సాక్షి: కోవిడ్-19 భయాల నుంచి బయటపడి రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి దూకుడు చూపాయి. సెన్సెక్స్ 380 పాయింట్లు జంప్చేసి 47,354కు చేరగా.. నిఫ్టీ 124 పాయింట్లు ఎగసి 13,873 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వరుసగా నాలుగో రోజూ మార్కెట్లు లాభాల బాటలో కదిలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,407 సమీపంలోనూ, నిఫ్టీ 13,885 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ 19 ట్రేడింగ్ సెషన్లలో 13సార్లు మార్కెట్లు రికార్డులను నెలకొల్పడం విశేషం! కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు యూఎస్ కాంగ్రెస్ ఆమోదించిన భారీ ప్యాకేజీపై ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం చేయడంతో ఇన్వెస్టర్లు హుషారొచ్చినట్లు తెలియజేశారు. దీంతో మార్కెట్లు నిరవధిక ర్యాలీ చేస్తున్నట్లు వివరించారు. ఫార్మా వీక్ ఎన్ఎస్ఈలో ఫార్మా(0.3 శాతం) మినహా అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, మెటల్, పీఎస్యూ బ్యాంక్స్ 2.6 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, టైటన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఎల్అండ్టీ, గెయిల్, ఇండస్ఇండ్, అల్ట్రాటెక్, టాటా స్టీల్, ఐవోసీ, కొటక్ బ్యాంక్, గ్రాసిమ్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, హెచ్ఢీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ 6-1.2 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్లో కేవలం హెచ్యూఎల్, సన్ ఫార్మా, సిప్లా, శ్రీసిమెంట్, బ్రిటానియా అదికూడా 0.5-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. (14,000 పాయింట్లవైపు నిఫ్టీ పరుగు!) గోద్రెజ్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్లో సెయిల్, ఐబీ హౌసింగ్, టాటా పవర్, ఆర్బీఎల్ బ్యాంక్, గోద్రెజ్ ప్రాపర్టీస్, మదర్సన్, నాల్కో, బెల్, ఎల్అండ్టీ ఫైనాన్స్, కెనరా బ్యాంక్, యూబీఎల్, జిందాల్ స్టీల్, పీఎన్బీ, ఫెడరల్ బ్యాంక్ 7.5-3.5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు బయోకాన్ 3.5 శాతం పతనంకాగా.. ఎస్కార్ట్స్, ఇండస్ టవర్, అపోలో హాస్పిటల్, కమిన్స్, అమరరాజా, ఎంఆర్ఎఫ్, క్యాడిలా హెల్త్ 1.2-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-1.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,021 లాభపడగా.. 997 మాత్రమే నష్టాలతో నిలిచాయి. ఎఫ్పీఐల జోరు శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దాదాపు రూ. 1,226 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీ ఫండ్స్(డీఐఐలు) మాత్రం రూ. 1,898 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
మూడో రోజూ ర్యాలీ బాట.. బ్యాంక్స్ జోరు
ముంబై, సాక్షి: వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 309 పాయింట్లు జంప్చేసి 46,753కు చేరగా.. నిఫ్టీ 90 పాయింట్లు ఎగసి 13,691 వద్ద ట్రేడవుతోంది. నిరుద్యోగ క్లెయిములు తగ్గడం, సహాయక ప్యాకేజీకి ఒప్పందం నేపథ్యంలో బుధవారం యూఎస్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య మిశ్రమంగా ముగిశాయి. కాగా.. నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 46,780- 46,615 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఇక ఇంట్రాడేలో నిఫ్టీ 13,702-13,644 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది. ఐటీ మినహా ఎన్ఎస్ఈలో ప్రధానంగా బ్యాంకింగ్, మీడియా, మెటల్, ఆటో రంగాలు 1 శాతం స్థాయిలో పుంజుకోగా.. ఐటీ 0.5 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్జీసీ, టాటా మోటార్స్, గెయిల్, ఎయిర్టెల్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, యాక్సిస్, కోల్ ఇండియా, ఎస్బీఐ, ఇండస్ఇండ్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ 4-1 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్లో కేవలం ఇన్ఫోసిస్, విప్రో అదికూడా 1-0.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. వేదాంతా జూమ్ డెరివేటివ్ స్టాక్స్లో వేదాంతా, అంబుజా, ఏసీసీ, ఎన్ఎండీసీ, సెయిల్, ఐసీఐసీఐ ప్రు, రామ్కో సిమెంట్, పీఎన్బీ, శ్రీరామ్ ట్రాన్స్, ఇండస్ టవర్, ఆర్ఈసీ 6.4-2 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోపక్క ఐడియా, భారత్ ఫోర్జ్, మ్యాక్స్ ఫైనాన్స్, మైండ్ట్రీ 2-0.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,544 లాభపడగా.. 300 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 1,153 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 662 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
కన్సాలిడేషన్లో- మళ్లీ ఐటీ జోరు
ముంబై, సాక్షి: స్వల్ప ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 72 పాయింట్లు పెరిగి 46,079కు చేరగా.. నిఫ్టీ 18 పాయింట్లు బలపడి 13,484 వద్ద ట్రేడవుతోంది. సోమవారం నమోదైన భారీ పతనం నుంచి మార్కెట్లు తిరిగి మంగళవారం కోలుకున్న సంగతి తెలిసిందే. కాగా.. రూపు మార్చుకుని యూరోపియన్ దేశాలలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో మంగళవారం యూఎస్ మార్కెట్లు 0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుండటంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 46,191- 45,899 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 13,517-13,432 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది. ప్రయివేట్ బ్యాంక్స్ డౌన్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఐటీ, రియల్టీ రంగాలు 1.5 శాతం చొప్పున పుంజుకోగా.. మెటల్ 0.5 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, మారుతీ, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, నెస్లే, టీసీఎస్, టైటన్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఓఎన్జీసీ, దివీస్, ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐవోసీ, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్, ఐసీఐసీఐ 1.6-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్లస్ డెరివేటివ్ స్టాక్స్లో గోద్రెజ్ ప్రాపర్టీస్, పిరమల్, జూబిలెంట్ ఫుడ్, ఎస్కార్ట్స్, పిడిలైట్, అశోక్ లేలాండ్, అపోలో హాస్పిటల్స్, మెక్డోవెల్, మ్యాక్స్ ఫైనాన్స్, టాటా పవర్ 4-1.4 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. పీఎన్బీ, అంబుజా, ఎన్ఎండీసీ, ఇండస్ టవర్, ఏసీసీ, జీ, ఐజీఎల్, జిందాల్ స్టీల్ 3-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6-1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,428 లాభపడగా.. 487 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,153 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 662 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్పీఐలు దాదాపు రూ. 324 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 486 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. -
ఐటీ రికార్డ్- మళ్లీ 46,000కు సెన్సెక్స్
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్బ్యాక్ సాధించాయి. ముందు రోజు నమోదైన భారీ పతనం నుంచి బంతిలా పైకెగశాయి. వెరసి సెన్సెక్స్ మళ్లీ 46,000 పాయింట్ల మార్క్ను అధిగమించింది. చివర్లో ఊపందుకున్న కొనుగోళ్లతో సెన్సెక్స్ 453 పాయింట్లు జంప్చేసి 46,007 వద్ద ముగిసింది. నిఫ్టీ 138 పాయింట్లు ఎగసి 13,466 వద్ద నిలిచింది. రూపు మార్చుకుని యూరోపియన్ దేశాలలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా సోమవారం సెన్సెక్స్ 1400 పాయింట్లకుపైగా పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే నేటి ట్రేడింగ్లోనూ తొలి రెండు సెషన్లలో మార్కెట్లు ఆటుపోట్లను చవిచూశాయి. సెన్సెక్స్ 46,080- 45,112 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 13,492-13,193 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది. (దిగివచ్చిన పసిడి, వెండి ధరలు) అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా ఐటీ 3.4 శాతం ఎగసింది. 23,681 వద్ద ఐటీ ఇండెక్స్ సరికొత్త గరిష్టానికి చేరింది. ఈ బాటలో ఫార్మా, మెటల్, ఆటో, బ్యాంకింగ్ 2.3-1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, గెయిల్,విప్రో, పవర్గ్రిడ్, సన్ ఫార్మా, ఎల్అండ్టీ, నెస్లే, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్, దివీస్, ఐషర్, ఏషియన్ పెయింట్స్ 5.5-2 శాతం మధ్య జంప్చేశాయి. బ్లూచిప్స్లో కేవలం కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, ఇండస్ఇండ్, ఆర్ఐఎల్, హిందాల్కో 1-0.2 శాతం మధ్య డీలాపడ్డాయి. (అందరికీ వ్యాక్సిన్లు కష్టతరమే!) కోఫోర్జ్ జోరు డెరివేటి స్టాక్స్లో కోఫోర్జ్, మైండ్ట్రీ, అదానీ ఎంటర్, ఐజీఎల్, బంధన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సన్ టీవీ, ఇండిగో, వేదాంతా, టాటా పవర్, సెయిల్, క్యాడిలా, టాటా కెమ్ 7.5-3.4 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క పీవీఆర్, శ్రీరామ్ ట్రాన్స్, పీఎన్బీ, భారత్ ఫోర్జ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఎస్కార్ట్స్, ఎల్ఐసీ హౌసింగ్, అపోలో టైర్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 6-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,568 లాభపడగా.. 1,352 నష్టాలతో నిలిచాయి. ఎఫ్పీఐల వెనకడుగు నగదు విభాగంలో ఇటీవల పెట్టుబడులకే కట్టుబడుతున్నవిదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) సోమవారం దాదాపు రూ. 324 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 486 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. కాగా.. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 2,721 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,425 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
లాభాలతో మొదలై పతన బాటలోకి..
ముంబై, సాక్షి: ముందు రోజు నమోదైన భారీ పతనం నుంచి దేశీ స్టాక్ మార్కెట్లు కోలుకుని స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే వెనువెంటనే మళ్లీ అమ్మకాలు తలెత్తడంతో నష్టాలలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 396 పాయింట్లు పతనమై 45,158కు చేరగా.. నిఫ్టీ 131 పాయింట్ల నష్టంతో 13,197 వద్ద ట్రేడవుతోంది. రూపు మార్చుకుని యూరోపియన్ దేశాలలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా సోమవారం సెన్సెక్స్ 1400 పాయింట్లకుపైగా పడిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 45,938- 45,141 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 13,447-13,194 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది. (మార్కెట్లను ముంచిన కరోనా సునామీ) ఐటీ మాత్రమే ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, బ్యాంకింగ్, ఆటో, రియల్టీ, ఫార్మా 3- 1 శాతం మధ్య నీరసించాయి. ఐటీ మాత్రమే(0.2 శాతం) ఎదురీదుతోంది. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్జీసీ, ఐవోసీ, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, ఆర్ఐఎల్, ఇండస్ఇండ్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, బీపీసీఎల్, ఐటీసీ 3.3-2.3 శాతం మధ్య డీలాపడ్డాయి. బ్లూచిప్స్లో కేవలం హెచ్సీఎల్ టెక్, దివీస్, టీసీఎస్, పవర్గ్రిడ్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్ 0.5-0.2 శాతం మధ్య బలపడ్డాయి. నేలచూపులో డెరివేటి స్టాక్స్లో పీవీఆర్, భెల్, పీఎన్బీ, ఐబీ హౌసింగ్, జీ, బీఈఎల్, ఇండిగో, శ్రీరామ్ ట్రాన్స్, ఎస్కార్ట్స్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 8.5-4 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క బంధన్ బ్యాంక్, మైండ్ట్రీ, ఐజీఎల్ మాత్రమే అదికూడా 1-0.3 శాతం మధ్య పుంజుకున్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2 శాతం చొప్పున క్షీణించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,928 నష్టపోగా.. 321 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. ఎఫ్పీఐల వెనకడుగు నగదు విభాగంలో ఇటీవల పెట్టుబడులకే కట్టుబడుతున్నవిదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) సోమవారం దాదాపు రూ. 324 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 486 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. కాగా.. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 2,721 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,425 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
కన్సాలిడేషన్లో- ఆటో, బ్యాంక్స్ వీక్
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా సరికొత్త రికార్డులతో దూసుకెళుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు తాజాగా కన్సాలిడేషన్ బాట పట్టాయి. స్వల్ప ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 10 పాయింట్లు బలపడి 46,971కు చేరింది. నిఫ్టీ యథాతథంగా 13,760 వద్ద ట్రేడవుతోంది. సహాయక ప్యాకేజీలపై అనిశ్చితి కొనసాగుతుండటంతో వారాంతాన యూఎస్ మార్కెట్లు 0.4 శాతం వెనకడుగు వేశాయి. దేశీయంగానూ ప్రభావిత అంశాలు కొరవడటంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,012 వద్ద గరిష్టాన్నీ, 46,694 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక నిఫ్టీ 13,764-13,674 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. రియల్టీ సైతం ఎన్ఎస్ఈలో ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో, మెటల్, మీడియా 1-0.5 శాతం మధ్య నీరసించగా.. ఫార్మా, ఐటీ, రియల్టీ 0.4 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, ఐసీఐసీఐ, దివీస్, పవర్గ్రిడ్, ఓఎన్జీసీ, గెయిల్, హిందాల్కో, యాక్సిస్, ఇండస్ఇండ్ బ్యాంక్ 2.3-1.5 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఎల్అండ్టీ, సిప్లా, ఆర్ఐఎల్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ 3.5-0.5 శాతం మధ్య బలపడ్డాయి. ఇండిగో డీలా డెరివేటివ్స్లో ఇండిగో, ఎంఅండ్ఎం ఫైనాన్స్, పెట్రోనెట్, బంధన్ బ్యాంక్, శ్రీరామ్ ట్రాన్స్, పీవీఆర్ 3.5-1.7 శాతం మధ్య డీలాపడ్డాయి. కాగా.. మరోపక్క గ్లెన్మార్క్, మ్యాక్స్ ఫైనాన్స్, జూబిలెంట్ ఫుడ్, క్యాడిలా హెల్త్, లుపిన్, ఇండస్టవర్, అపోలో హాస్పిటల్స్ 2.7-1.2 శాతం మధ్య ఎగశాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.2 శాతం నీరసించగా.. స్మాల్ క్యాప్ 0.2 శాతం బలపడింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,159 లాభపడగా.. 1,156నష్టాలతో ట్రేడవుతున్నాయి. పెట్టుబడుల బాట నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,721 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,425 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 2,355 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,494 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
47,000 దాటేసింది- వెనకడుగు వేస్తోంది
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా సరికొత్త రికార్డులతో దూసుకెళుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు తాజాగా కన్సాలిడేషన్ బాట పట్టాయి. స్వల్ప ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 126 పాయింట్లు క్షీణించి 46,764కు చేరింది. నిఫ్టీ సైతం 36 పాయింట్లు క్షీణించి 13,705 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 47,000 పాయింట్ల మార్క్ను అధిగమించింది. 47,026 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. అయితే తదుపరి అమ్మకాలు తలెత్తడంతో 46,744 వద్ద కనిష్టానికీ చేరింది. ఇక నిఫ్టీ 13,771-13,693 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఆర్థిక రికవరీ అంచనాలు, ఈక్విటీలలో ఎఫ్పీఐల నిరవధిక పెట్టుబడుల కారణంగా ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డుల ర్యాలీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. గురువారం యూఎస్ స్టాక్ ఇండెక్సులు చరిత్రాత్మక గరిష్టాల వద్ద ముగిశాయి. నాస్డాక్ వరుసగా మూడో రోజు సరికొత్త గరిష్టంవద్ద నిలవడం గమనార్హం. (బెక్టర్స్ ఫుడ్ ఐపీవో- వెల్లువెత్తిన బిడ్స్) ఐటీ అప్ ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ దాదాపు 2 శాతం జంప్చేగా.. ఎఫ్ఎంసీజీ 0.15 శాతం పుంజుకుంది. రియల్టీ, ప్రయివేట్, పబ్లిక్ బ్యాంక్స్, మెటల్, మీడియా 0.8-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్, యూపీఎల్, బజాజ్ ఆటో, ఎల్అండ్టీ, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటో 2,7-0.8 శాతం మధ్య ఎగశాయి. అయితే హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, కొటక్ బ్యాంక్, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్, బజాజ్ ఫైనాన్స్, ఐషర్ 1.4-0.7 శాతం మధ్య నీరసించాయి. కోఫోర్జ్ ప్లస్ డెరివేటివ్స్లో కోఫోర్జ్, మైండ్ట్రీ, నౌకరీ, పిడిలైట్, కాల్గేట్ పామోలివ్ 4.25-1.2 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు శ్రీరామ్ ట్రాన్స్, సన్ టీవీ, ఇండస్ టవర్, ఆర్ఈసీ, సెయిల్, అశోక్ లేలాండ్ 2-1 శాతం క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున డీలాపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,435 నష్టపోగా.. 699 లాభాలతో ట్రేడవుతున్నాయి. ఎఫ్ఫీఐల జోరు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,355 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,494 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 1,982 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,718 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
ఐదో రోజూ లాభాలతో రికార్డుల హోరు
ముంబై, సాక్షి: ఈక్విటీలలో ఎఫ్పీఐల నిరవధిక పెట్టుబడుల కారణంగా వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ 224 పాయింట్లు ఎగసి 46,890 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 58 పాయింట్లు బలపడి 13,741 వద్ద స్థిరపడింది. వెరసి నాలుగో రోజూ చరిత్రాత్మక గరిష్టాల వద్ద నిలిచాయి. బుధవారం వరుసగా రెండో రోజు నాస్డాక్ సైతం సరికొత్త గరిష్టంవద్ద నిలిచింది. దీనికితోడు కోవిడ్-19 సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన సంకేతాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ 46,992 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13,773 వద్ద సరికొత్త గరిష్టాలను తాకడం విశేషం! ఎఫ్ఎంసీజీ సైతం ఎన్ఎస్ఈలో రియల్టీ, ప్రయివేట్ బ్యాంక్స్, ఫార్మా 0.5 శాతం చొప్పున బలపడగా.. మీడియా, పీఎస్యూ బ్యాంక్స్, మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ 2-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో దివీస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, బ్యాంక్, శ్రీసిమెంట్, ఇండస్ఇండ్, టీసీఎస్, పవర్గ్రిడ్, అల్ట్రాటెక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే హిందాల్కో, కోల్ ఇండియా, మారుతీ, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, బజాజ్ ఆటో, హెచ్యూఎల్ 2.2-1.2 శాతం మధ్య నీరసించాయి. జూబిలెంట్ అప్ డెరివేటివ్స్లో జూబిలెంట్ ఫుడ్, పేజ్, కెనరా బ్యాంక్, ఎస్ఆర్ఎఫ్, బెర్జర్ పెయింట్స్, బీఈఎల్ 5.6-2 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు సెయిల్, బీవోబీ, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఆర్ఈసీ, జీ, జిందాల్ స్టీల్, నాల్కో, ఆర్బీఎల్ బ్యాంక్, హెచ్పీసీఎల్ 5-2.3 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్స్ 0.25 శాతం డీలాపడింది. ట్రేడైన షేర్లలో 1,387 లాభపడగా.. 1,584 నష్టాలతో నిలిచాయి. ఎఫ్ఫీఐల జోరు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,982 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,718 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 2,484 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,667 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
నాలుగో రోజూ లాభాలతో షురూ
ముంబై, సాక్షి: ఈక్విటీలలో కొనసాగుతున్న ఎఫ్పీఐల పెట్టుబడుల కారణంగా వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 87 పాయింట్లు పుంజుకుని 46,753కు చేరగా.. నిఫ్టీ 23 పాయింట్లు బలపడి 13,705 వద్ద ట్రేడవుతోంది. బుధవారం వరుసగా రెండో రోజు నాస్డాక్ సైతం సరికొత్త గరిష్టంవద్ద నిలిచింది. దీనికితోడు కోవిడ్-19 సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన సంకేతాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,778 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13,718 వద్ద సరికొత్త గరిష్టాలను తాకాయి. మీడియా ప్లస్ ఎన్ఎస్ఈలో ఫార్మా 1.3 శాతం, మీడియా 0.3 శాతం చొప్పున లాభపడగా.. రియల్టీ, ఎఫ్ఎంసీజీ, పీఎస్యూ బ్యాంక్స్ 0.5-0.2 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో దివీస్, శ్రీసిమెంట్, ఇండస్ఇండ్, అల్ట్రాటెక్, హెచ్డీఎఫ్సీ, సన్ ఫార్మా, గ్రాసిమ్, ఆర్ఐఎల్, యూపీఎల్, పవర్గ్రిడ్ 2.6-1 శాతం మధ్య ఎగశాయి. అయితే హెచ్యూఎల్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, నెస్లే, ఎన్టీపీసీ 1.25-0.5 శాతం మధ్య నీరసించాయి. జూబిలెంట్ అప్ డెరివేటివ్స్లో జూబిలెంట్ ఫుడ్, పేజ్, మ్యాక్స్ ఫైనాన్స్, క్యాడిలా హెల్త్, ఎస్ఆర్ఎఫ్, అంబుజా 4-2 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు ఎంఅండ్ఎం ఫైనాన్స్, బీఈఎల్, శ్రీరామ్ ట్రాన్స్, ఇండిగో, సెయిల్, డీఎల్ఎఫ్ 1.3-1 శాతం క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,409 లాభపడగా.. 824 నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఎఫ్ఫీఐల జోరు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,982 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,718 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 2,484 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,667 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
బుల్ జోరు- మార్కెట్లు ఖుషీ
ముంబై, సాక్షి: ఎఫ్పీఐల భారీ పెట్టుబడులు, కోవిడ్-19 సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ రికవరీ వంటి అంశాలతో దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డుల దుమ్మురేపుతున్నాయి. తాజాగా సెన్సెక్స్ 403 పాయింట్లు జంప్చేసి 46,666 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 115 పాయింట్లు ఎగసి 13,683 వద్ద స్థిరపడింది. వెరసి చరిత్రాత్మక గరిష్టాల వద్ద నిలిచాయి. మంగళవారం నాస్డాక్ సైతం సరికొత్త గరిష్టంవద్ద ముగియడం గమనార్హం! తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో వరుసగా నాలుగో రోజు మార్కెట్లు లాభాలతో నిలిచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,705 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13,692 వద్ద సరికొత్త గరిష్టాలను సాధించాయి. మెటల్, ఆటో.. ఎన్ఎస్ఈలో రియల్టీ 5 శాతం జంప్చేయగా.. మెటల్, ఆటో, ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. పీఎస్యూ బ్యాంక్స్ మాత్రం 1.6 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, ఓఎన్జీసీ, దివీస్, యూపీఎల్, ఏషియన్ పెయింట్స్, టైటన్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ 3-2 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, అల్ట్రాటెక్, గెయిల్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్, ఎస్బీఐ, హెచ్సీఎల్ టెక్ 1-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. రియల్టీ అప్ డెరివేటివ్స్లో డీఎల్ఎఫ్ 10 శాతం దూసుకెళ్లగా.. ఐబీ హౌసింగ్, పేజ్, అశోక్ లేలాండ్, జిందాల్ స్టీల్, హావెల్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, జూబిలెంట్ ఫుడ్, నాల్కో, అపోలో టైర్, సెయిల్ 7-3 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు పీఎన్బీ 6 శాతం పతనంకాగా, జీఎంఆర్ ఇన్ప్రా, శ్రీరామ్ ట్రాన్స్, కెనరా బ్యాంక్, టాటా కెమ్, టొరంట్ పవర్, పెట్రోనెట్, కంకార్, ఎల్అండ్టీ ఫైనాన్స్, బీవోబీ 3.3-1.2 శాతం మధ్య క్షీణించాయి. ఇతర కౌంటర్లలో ఐబీ రియల్టీ 12 శాతం, శోభా, ఒబెరాయ్ 5 శాతం చొప్పున ఎగశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.9 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,858 లాభపడగా.. 1,167 నష్టాలతో ముగిశాయి. ఎఫ్ఫీఐల జోరు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,484 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,667 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 2,264 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,721 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
మార్కెట్ల దూకుడు- మళ్లీ రికార్డ్స్ ర్యాలీ
ముంబై, సాక్షి: వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ లాభాల ట్రిపుల్ సెంచరీ చేసింది. నిఫ్టీ సైతం సెంచరీ చేసింది. వెరసి మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 331 పాయింట్లు జంప్చేసి 46,594 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 89 పాయింట్లు బలపడి13,657 వద్ద కదులుతోంది. మంగళవారం యూఎస్ మార్కెట్లు ప్రధానంగా నాస్డాక్ రికార్డ్ గరిష్టం వద్ద నిలవడంతో దేశీయంగానూ సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,599 వద్ద, నిఫ్టీ 13,666 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. (దుమ్మురేపిన బజాజ్ ఫైనాన్స్) ప్రభుత్వ బ్యాంక్స్ వీక్ ఎన్ఎస్ఈలో పీఎస్యూ బ్యాంక్స్(0.5 శాతం) మాత్రమే డీలాపడగా.. మెటల్, రియల్టీ, ఆటో రంగాలు 1.5 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్ఎం, ఓఎన్జీసీ, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, బీపీసీఎల్, టాటా మోటార్స్, ఐవోసీ, కోల్ ఇండియా 3-1.3 శాతం మధ్య బలపడ్డాయి. అయితే టెక్ మహీంద్రా, హెచ్యూఎల్, ఎస్బీఐ లైఫ్, గెయిల్, డాక్టర్ రెడ్డీస్, హెచ్సీఎల్ టెక్ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 0.9-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. (మార్కెట్ డౌన్- ఈ షేర్లు జూమ్) ఐబీ హౌసింగ్ జూమ్ డెరివేటివ్స్లో ఐబీ హౌసింగ్, వేదాంతా, అపోలో టైర్, సెయిల్, అశోక్ లేలాండ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఎన్ఎండీసీ, హెచ్పీసీఎల్, యూబీఎల్ 5-1.3 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోపక్క పీఎన్బీ 6 శాతం పతనంకాగా.. జీఎంఆర్, టొరంట్ పవర్, కోఫోర్జ్, ఇన్ఫ్రాటెల్, టాటా కెమ్, పిరమల్ 1.5-0.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,685 లాభపడగా.. 589 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్ఫీఐల జోరు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,484 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,667 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 2,264 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,721 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
చివర్లో లాభాల్లోకి.. మార్కెట్లు ఫ్లాట్
ముంబై, సాక్షి: రెండు రోజుల వరుస ర్యాలీకి తొలుత బ్రేక్ పడినప్పటికీ చివర్లో మార్కెట్లు కోలుకున్నాయి. వెరసి నామమాత్ర లాభాలతో నిలిచాయి. రోజంతా ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్లు చివరివరకూ నీరసంగా కదిలాయి. సెన్సెక్స్ 10 పాయింట్ల నామమాత్ర లాభంతో 46,263 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 10 పాయింట్లు బలపడి13,568 వద్ద స్థిరపడింది. సోమవారం యూఎస్ మార్కెట్లు 0.5 శాతం స్థాయిలో వెనకడుగు వేయడంతో దేశీయంగానూ సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ చివర్లో 46,350 వద్ద గరిష్టాన్ని తాకగా.. తొలుత 45,966 వద్ద కనిష్టానికి చేరింది. ఈ బాటలో నిఫ్టీ 13,590-13,447 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఐటీ సైతం ఎన్ఎస్ఈలో పీఎస్యూ బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, రియల్టీ, ఫార్మా, ఐటీ 1.5- 0.2 శాతం మధ్య నీరసించగా.. మీడియా, మెటల్, ఆటో 1.7-0.6 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్, ఐషర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, శ్రీసిమెంట్, హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 5-1.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే హెచ్యూఎల్, నెస్లే, బీపీసీఎల్, ఐసీఐసీఐ, యాక్సిస్, ఎస్బీఐ, టీసీఎస్, ఐటీసీ, ఓఎన్జీసీ, సిప్లా 2-1 శాతం మధ్య క్షీణించాయి. జీ జూమ్ డెరివేటివ్స్లో జీ 7 శాతం జంప్చేయగా.. జీఎంఆర్, హావెల్స్, ఎల్అండ్టీ ఫైనాన్స్, భారత్ ఫోర్జ్, జిందాల్ స్టీల్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 5.5-3 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోపక్క కెనరా బ్యాంక్ 5 శాతం పతనంకాగా.. ఇండిగో, ఐజీఎల్, పీవీఆర్, ఐసీఐసీఐ లంబార్డ్, గ్లెన్మార్క్, జూబిలెంట్ ఫుడ్, ఎంజీఎల్ 3.2-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1,550 లాభపడగా.. 1,422 నష్టాలతో ముగిశాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,264 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,721 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 4,195 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,359 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
మార్కెట్లకు అమ్మకాల దెబ్బ..
ముంబై, సాక్షి: రెండు రోజుల వరుస ర్యాలీకి మరోసారి బ్రేక్ పడింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీయడంతో మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 236 పాయింట్లు క్షీణించి 46,017కు చేరింది. నిఫ్టీ సైతం 65 పాయింట్లు తక్కువగా13,493 వద్ద ట్రేడవుతోంది. సోమవారం యూఎస్ మార్కెట్లు 0.5 శాతం స్థాయిలో వెనకడుగు వేయడంతో దేశీయంగానూ సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 45,966 వద్ద, నిఫ్టీ 13,479 దిగువన కనిష్టాలకు చేరాయి. రియల్టీ వీక్ ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, మెటల్, రియల్టీ 0.7 శాతం స్థాయిలో నీరసించగా.. ఫార్మా, ఆటో 0.5 శాతం చొప్పున బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్జీసీ, యాక్సిస్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ, ఎల్అండ్టీ, బీపీసీఎల్, ఐవోసీ, కోల్ ఇండియా, ఆర్ఐఎల్, ఎస్బీఐ 2-1.3 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఐషర్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్, శ్రీ సిమెంట్, ఎంఅండ్ఎం, దివీస్, హెచ్సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.7-0.6 శాతం మధ్య బలపడ్డాయి. (కోవిడ్-19లోనూ.. దేశీ కుబేరులు భళా) కెనరా బ్యాంక్ డౌన్ డెరివేటివ్స్లో కెనరా బ్యాంక్ 6.6 శాతం పతనంకాగా.. భెల్, ఎంజీఎల్, పీఎన్బీ, పీఎఫ్సీ, వేదాంతా, ఐడియా, ఐబీ హౌసింగ్, ఫెడరల్ బ్యాంక్ 2.3-1.8 శాతం మధ్య వెనకడుగు వేశాయి. కాగా.. మరోపక్క లుపిన్, టొరంట్ ఫార్మా, హావెల్స్, జీ, పేజ్, బయోకాన్ 2.3-1.2 శాతం మధ్య ఎగశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2 శాతం చొప్పున క్షీణించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,282 నష్టపోగా..989 లాభాలతో కదులుతున్నాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,264 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,721 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 4,195 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,359 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
రెండో రోజూ మార్కెట్ల ర్యాలీ బాట..
ముంబై, సాక్షి: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 207 పాయింట్లు లాభపడి 46,306కు చేరింది. నిఫ్టీ సైతం 60 పాయింట్లు ఎగసి13,552 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన యూఎస్ మార్కెట్లు స్వల్ప వెనకడుగు వేసినప్పటికీ దేశీయంగా ఆర్థిక రికవరీ, వ్యాక్సిన్ల అందుబాటుపై ఆశలు సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,373 ఎగువన, నిఫ్టీ 13,597 వద్ద గరిష్టాలకు చేరాయి. రియల్టీ వీక్ ఎన్ఎస్ఈలో రియల్టీ(0.2 శాతం) మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి. మెటల్, పీఎస్యూ బ్యాంక్స్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ 2-0.8 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా, కోల్ ఇండియా, ఓఎన్సీసీ, టాటా స్టీల్, ఐవోసీ, బ్రిటానియా, గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, హిందాల్కో 4.4-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐషర్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్ మాత్రమే అతికూడా 1-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఎన్ఎండీసీ అప్ డెరివేటివ్స్లో ఎన్ఎండీసీ, ఫెడరల్ బ్యాంక్, జిందాల్ స్టీల్, సెయిల్, మదర్సన్, బీవోబీ 4.4-2.4 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోపక్క ఎస్కార్ట్స్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, భారత్ ఫోర్జ్, ఐసీఐసీఐ లంబార్డ్, డీఎల్ఎఫ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, టీవీఎస్ మోటార్ 1.5-0.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5-1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,650 లాభపడగా..513 నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 4,195 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,359 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 2,260 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,275 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
మార్కెట్లు బౌన్స్బ్యాక్- ర్యాలీ కంటిన్యూ
ముంబై, సాక్షి: ఒక్క రోజు విరామం తదుపరి తిరిగి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. అయితే మిడ్సెషన్లో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకోవడంతో మార్కెట్లకు షాక్ తగిలింది. చివరికి కోలుకుని ప్రస్తావించదగ్గ లాభాలతో ముగిశాయి. వెరసి రికార్డుల ర్యాలీ తిరిగి ప్రారంభమైందని నిపుణులు పేర్కొన్నారు. సెన్సెక్స్ 139 పాయింట్లు పెరిగి 46,099 వద్ద నిలవగా.. నిఫ్టీ 36 పాయింట్లు పుంజుకుని13,514 వద్ద స్థిరపడింది. గత నెలలో ఉద్యోగ ఆఫర్లు పుంజుకోవడం, సహాయక ప్యాకేజీపై తిరిగి పెరిగిన ఆశల నేపథ్యంలో గురువారం యూఎస్ మార్కెట్లు కనిష్టాల నుంచి కోలుకుని మిశ్రమంగా ముగిశాయి. ఇటీవల జీడీపీ రికవరీ బాట పట్టడం, వ్యాక్సిన్ల అందుబాటుపై అంచనాలు దేశీయంగా సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,310 వద్ద గరిష్టాన్ని, 45,706 వద్ద కనిష్టాన్నీ తాకింది. నిఫ్టీ సైతం 13,579-13,403 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఫార్మా, ఐటీ వీక్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా మెటల్, ఎఫ్ఎంసీజీ, రియల్టీ, బ్యాంకింగ్ రంగాలు 1 శాతం స్థాయిలో పుంజుకోగా.. ఫార్మా, ఐటీ 0.5 శాతం చొప్పున నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, గెయిల్, కోల్ ఇండియా, టాటా స్టీల్, ఐసీఐసీఐ, టైటన్, ఐవోసీ, ఐటీసీ, ఎస్బీఐ 5.4-1 శాతం మధ్య ఎగశాయి. అయితే యాక్సిస్, దివీస్, అదానీ పోర్ట్స్, ఎంఅండ్ఎం, ఐషర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, సిప్లా, టెక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్ 2.3-0.8 శాతం మధ్య డీలాపడ్డాయి. (లాజిస్టిక్స్ కంపెనీలకు వ్యాక్సిన్ల బూస్ట్) అపోలో టైర్ అప్ డెరివేటివ్స్లో అపోలో టైర్స్, పీఎన్బీ, సెయిల్, ఆర్ఈసీ, జూబిలెంట్ ఫుడ్, ఐడియా, ఎన్ఎండీసీ 6.5-3 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క టీవీఎస్ మోటార్, పేజ్ ఇండస్ట్రీస్, నౌకరీ, పిరమల్, బీవోబీ, సన్ టీవీ, మ్యాక్స్ ఫైనాన్స్, వోల్టాస్ 3.3-1.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2-0.5 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,749 లాభపడగా..1218 నష్టాలతో ముగిశాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,260 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,275 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 3,564 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,493 కోట్ల విలువైన అమ్మకాలు నిర్వహించాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 2,910 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,641 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
ర్యాలీ షురూ- 46,000 ఎగువకు సెన్సెక్స్
ముంబై, సాక్షి: ఒక్క రోజు విరామం తదుపరి తిరిగి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 250 పాయింట్లు పెరిగి 46,210కు చేరింది. నిఫ్టీ సైతం 74 పాయింట్లు ఎగసి13,552 వద్ద ట్రేడవుతోంది. గత నెలలో ఉద్యోగ ఆఫర్లు పుంజుకోవడం, సహాయక ప్యాకేజీపై తిరిగి పెరిగిన ఆశల నేపథ్యంలో గురువారం యూఎస్ మార్కెట్లు కనిష్టాల నుంచి కోలుకుని మిశ్రమంగా ముగిశాయి. ఇటీవల జీడీపీ రికవరీ బాట పట్టడం, వ్యాక్సిన్ల అందుబాటుపై అంచనాలు దేశీయంగా సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,247 ఎగువన, నిఫ్టీ 13,562 వద్ద గరిష్టాలకు చేరాయి. (పతన బాటలో యూపీఎల్- ఐఆర్సీటీసీ ) ఐటీ, ఫార్మా.. ఎన్ఎస్ఈలో ఐటీ, ఫార్మా నామమాత్రంగా నీరసించగా.. పీఎస్యూ బ్యాంక్స్ 2.3 శాతం ఎగశాయి. ఈ బాటలో మెటల్, ప్రయివేట్ బ్యాంక్స్, మీడియా, ఎఫ్ఎంసీజీ, ఆటో రంగాలు 1 శాతం స్థాయిలో్ పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్జీసీ 6.4 శాతం జంప్చేయగా, ఐవోసీ, గెయిల్, ఎన్టీపీసీ, యూపీఎల్, ఎస్బీఐ, టాటా స్టీల్, బీపీసీఎల్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం 3-1.25 శాతం మధ్య బలపడ్డాయి. అయితే దివీస్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఐషర్, శ్రీసిమెంట్, ఏషియన్ పెయింట్స్ 1-0.3 శాతం మధ్య డీలాపడ్డాయి. (పసిడికి ఉద్యోగ గణాంకాల దెబ్బ) అపోలో టైర్ అప్ డెరివేటివ్స్లో అపోలో టైర్స్, కెనరా బ్యాంక్, సెయిల్, ఎన్ఎండీసీ, నాల్కో, బంధన్ బ్యాంక్, పీఎన్బీ, ఎల్ఐసీ హౌసింగ్ 4.5-3 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క గోద్రెజ్ ప్రాపర్టీస్, బెర్జర్ పెయింట్స్, సన్ టీవీ, డీఎల్ఎఫ్, అపోలో హాస్పిటల్స్, పిరమల్, టొరంట్ ఫార్మా 1-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5-1 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,665 క్షీణించగా..1241 లాభాలతో కదులుతున్నాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,260 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,275 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకన్నాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 3,564 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,493 కోట్ల విలువైన అమ్మకాలు నిర్వహించాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 2,910 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,641 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
ర్యాలీకి బ్రేక్- 46,000 దిగువకు సెన్సెక్స్
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా రికార్డుల సాధనే లక్ష్యంగా సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లకు తాజాగా బ్రేక్ పడింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకే ఆసక్తి చూపడంతో మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 144 పాయింట్లు క్షీణించి 45,960 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 51 పాయింట్లు కోల్పోయి 13,478 వద్ద స్థిరపడింది. సహాయక ప్యాకేజీపై విభేదాలు, టెక్ దిగ్గజాలలో అమ్మకాల కారణంగా బుధవారం యూఎస్ మార్కెట్లు 0.4-2 శాతం మధ్య క్షీణించాయి. దీనికితోడు ఇటీవల వేగంగా దూసుకెళుతున్న దేశీ మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు వెనకడుగు వేసినట్లు నిపుణులు వివరించారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 45,686 దిగువన, నిఫ్టీ 13,399 వద్ద కనిష్టాలకు చేరాయి. రియల్టీ అప్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, బ్యాంకింగ్, ఆటో రంగాలు 1.6-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. అయితే ఎఫ్ఎంసీజీ 3 శాతం ఎగసింది. రియల్టీ 0.4 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్ 11.5 శాతం కుప్పకూలగా.. అల్ట్రాటెక్, శ్రీ సిమెంట్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, గెయిల్, ఐషర్, ఐవోసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ 3.5-1.3 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు నెస్లే, ఐటీసీ, బ్రిటానియా, హెచ్యూఎల్ 4.2-2.4 శాతం మధ్య పురోగమించాయి. ఈ బాటలో అదానీ పోర్ట్స్, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బీపీసీఎల్, టాటా స్టీల్, ఎల్అండ్టీ 1.7-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. పీఎస్యూ షేర్లు వీక్ డెరివేటివ్స్లో కెనరా బ్యాంక్, రామ్కో సిమెంట్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఎల్ఐసీ హౌసింగ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ 4.4-3 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క నౌకరీ, బంధన్ బ్యాంక్, గోద్రెజ్ సీపీ, టాటా కన్జూమర్, డీఎల్ఎఫ్, డాబర్ 5-2.4 శాతం మధ్య జంప్చేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,665 క్షీణించగా..1241 లాభాలతో ముగిశాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 3,564 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,493 కోట్ల విలువైన అమ్మకాలు నిర్వహించాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 2,910 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,641 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక సోమవారం ఎఫ్పీఐలు రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
రికార్డ్స్కు బ్రేక్- మార్కెట్లు పతనం
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా రికార్డుల సాధనే లక్ష్యంగా సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లకు చెక్ పడింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 353 పాయింట్లు పతనమై 45,751కు చేరింది. నిఫ్టీ సైతం 116 పాయింట్లు కోల్పోయి 13,413 వద్ద ట్రేడవుతోంది. సహాయక ప్యాకేజీపై విభేదాలు, టెక్ దిగ్గజాలలో అమ్మకాల కారణంగా బుధవారం యూఎస్ మార్కెట్లు 0.4-2 శాతం మధ్య క్షీణించాయి. దీనికితోడు ఇటీవల వేగంగా దూసుకెళుతున్న దేశీ మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు వెనకడుగు వేస్తున్నట్లు నిపుణులు వివరించారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 45,743 వద్ద, నిఫ్టీ 13,412 వద్ద కనిష్టాలకు చేరాయి. చదవండి: (46,000 దాటేసిన సెన్సెక్స్ప్రెస్) యూపీఎల్ పతనం ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలహీనపడ్డాయి. ప్రధానంగా మీడియా పీఎస్యూ బ్యాంక్స్, రియల్టీ, మెటల్ 2.6-1.2 శాతం మధ్య డీలా పడ్డాయి. ఫార్మా స్వల్పంగా 0.2 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్ 10.5 శాతం కుప్పకూలగా.. టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐవోసీ, అల్ట్రాటెక్, గెయిల్, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్, బీపీసీఎల్, ఎంఅండ్ఎం 2.5-1.3 శాతం మధ్య క్షీణించాయి. బ్లూచిప్స్లో కేవలం మారుతీ, నెస్లే, టైటన్, దివీస్ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1.5-0.3 శాతం మధ్య లాభపడ్డాయి. (వ్యాక్సిన్ షాక్- పసిడి ధరల పతనం) పీఎస్యూ షేర్లు వీక్ డెరివేటివ్స్లో ఆర్ఈసీ, పీఎప్సీ, బీహెచ్ఈఎల్, కెనరా బ్యాంక్, రామ్కో సిమెంట్, బీఈఎల్, ఐడీఎఫ్సీ ఫస్ట్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, జీ, శ్రీరామ్ ట్రాన్స్ 7-3 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క నౌకరీ, బాలకృష్ణ, డాబర్, బంధన్ బ్యాంక్, అరబిందో, పిడిలైట్, జూబిలెంట్ ఫుడ్, టొరంట్ ఫార్మా 2.4-0.3 శాతం మధ్య బలపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.5 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,548 క్షీణించగా.. 662 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 3,564 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,493 కోట్ల విలువైన అమ్మకాలు నిర్వహించాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 2,910 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,641 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక సోమవారం ఎఫ్పీఐలు రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
రికార్డులే హద్దుగా.. మార్కెట్లు షురూ
ముంబై, సాక్షి: రికార్డుల సాధనే లక్ష్యంగా దేశీ స్టాక్ మార్కెట్లు చెలరేగుతున్నాయి. దీంతో మరోసారి చరిత్రాత్మక గరిష్టాల వద్ద ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 284 పాయింట్లు ఎగసి 45,893కు చేరింది. నిఫ్టీ సైతం 80 పాయింట్లు బలపడి 13,473 వద్ద ట్రేడవుతోంది. కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నవార్తలతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం రికార్డ్ గరిష్టాల వద్ద ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 45,926ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ 13,484కు చేరింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. ఆర్థిక రికవరీపై అంచనాలు, కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఆశలు దేశీయంగా సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. జోరుగా.. ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా మీడియా పీఎస్యూ బ్యాంక్స్, ఫార్మా, ఐటీ, రియల్టీ 2-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో సన్ ఫార్మా, యూపీఎల్, హెచ్సీఎల్ టెక్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, గెయిల్, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్స్, టీసీఎస్ 2.25-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్డీఎఫ్సీ లైఫ్, మారుతీ, ఐషర్, శ్రీసిమెంట్, టైటన్, అల్ట్రాటెక్, బ్రిటానియా, బజాజ్ ఆటో మాత్రమే అదికూడా 0.5-0.2 శాతం మధ్య డీలాపడ్డాయి. పీఎస్యూ షేర్లు అప్ డెరివేటివ్స్లో బీఈఎల్ 7 శాతం దూసుకెళ్లగా.. ఆర్ఈసీ, భెల్, జీఎంఆర్, పీఎన్బీ, జీ, పీవీఆర్, బీవోబీ, పీఎఫ్సీ, గ్లెన్మార్క్ 4.2-2.2 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు రామ్కో సిమెంట్, అపోలో టైర్, ఏసీసీ, అంబుజా, బంధన్ బ్యాంక్, ఎక్సైడ్ 1- 0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,532 లాభపడగా.. 681 నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,910 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,641 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
లాభాలతో షురూ- కొత్త గరిష్టాలకు మార్కెట్లు
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్ల స్పీడ్ కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 238 పాయింట్లు జంప్చేసి 45,665కు చేరింది. నిఫ్టీ సైతం 62 పాయింట్లు పెరిగి 13,418 వద్ద ట్రేడవుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 45,675 వద్ద, నిఫ్టీ 13,426 వద్ద సరికొత్త గరిష్టాలను తాకాయి! ఆర్థిక రికవరీపై అంచనాలు, కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఆశలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. మెటల్ వీక్ ఎన్ఎస్ఈలో మెటల్(0.3 శాతం) మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్స్, రియల్టీ, ఆటో 1.3 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో మారుతీ, యూపీఎల్, అల్ట్రాటెక్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ, గెయిల్, ఎంఅండ్ఎం, హెచ్సీఎల్ టెక్, ఆర్ఐఎల్ 2.6-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్, గ్రాసిమ్, ఐవోసీ, ఐసీఐసీఐ 1.3-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఫైనాన్స్ జోష్ డెరివేటివ్స్లో కెనరా బ్యాంక్, పీఎన్బీ, బీవోబీ, ఎక్సైడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, యూబీఎల్, ఐడియా 7.4-2 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు లుపిన్, జిందాల్ స్టీల్, మ్యాక్స్ ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్, ఆర్బీఎల్ బ్యాంక్ 1-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,566 లాభపడగా.. 621 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 2,970 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,972 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదితమే. -
మార్కెట్లు భల్లేభల్లే- మీడియా, బ్యాంక్స్ ఖుషీ
ముంబై, సాక్షి: జీడీపీ వృద్ధి అంచనాలు, వ్యాక్సిన్ల అందుబాటుపై ఆశలు దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్నిస్తున్నాయి. దీంతో మరోసారి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 347 పాయింట్లు జంప్చేసి 45,427 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 97 పాయింట్లు జమ చేసుకుని 13,356 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో చివర్లో సెన్సెక్స్ 45,459 వద్ద, నిఫ్టీ 13,366 వద్ద సరికొత్త గరిష్టాలను తాకాయి! అయితే తొలుత సెన్సెక్స్ 45,024 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13,242 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేసుకున్నాయి. రియల్టీ డౌన్ ఎన్ఎస్ఈలో రియల్టీ(0.35 శాతం) మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మీడియా, పీఎస్యూ బ్యాంక్స్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ 2.8-1.6 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్, అదానీ పోర్ట్స్, హెచ్యూఎల్, ఎయిర్టెల్, ఓఎన్జీసీ, ఐటీసీ, కోల్ ఇండియా, గెయిల్, హెచ్డీఎఫ్సీ, డాక్టర్ రెడ్డీస్ 4.6-2.5 శాతం మధ్య జంప్ చేశాయి. అయితే ఎస్బీఐ లైఫ్, నెస్లే, కొటక్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్, టైటన్ 1.5-0.7 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఫైనాన్స్ జోష్ డెరివేటివ్స్లో శ్రీరామ్ ట్రాన్స్, కెనరా, గ్లెన్మార్క్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఐబీ హౌసింగ్, సన్ టీవీ, బంధన్ బ్యాంక్, జీ, టాటా కెమికల్స్, లుపిన్, ఎల్అండ్టీ ఫైనాన్స్ 6-3.5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు ఎస్కార్ట్స్, డీఎల్ఎఫ్, చోళమండలం, ఐడియా, వోల్టాస్, జూబిలెంట్ ఫుడ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ 2.3-0.7 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్1-1.3 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,038 లాభపడగా.. 934 నష్టాలతో ముగిశాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,970 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. రూ. 1,972 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 3,637 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,440 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
మార్కెట్లకు జీడీపీ- వ్యాక్సిన్ల జోష్
ముంబై, సాక్షి: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటపట్టినట్లు ఆర్బీఐ వేసిన అంచనాలు, జనవరికల్లా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న ఆశలు దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్నిస్తున్నాయి. దీంతో మరోసారి లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 136 పాయింట్లు పెరిగి 45,215కు చేరింది. నిఫ్టీ సైతం 41 పాయింట్లు ఎగసి 13,300 వద్ద ట్రేడవుతోంది. తొలుత సెన్సెక్స్ 45,245 వద్ద, నిఫ్టీ 13,312 వద్ద ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాలను తాకడం విశేషం! ఫార్మా మాత్రమే ఎన్ఎస్ఈలో ఫార్మా(0.2 శాతం) మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మీడియా, పీఎస్యూ బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ 1.4-1 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, గెయిల్, యూపీఎల్, ఐటీసీ, ఐవోసీ, ఐసీఐసీఐ, ఎయిర్టెల్, కోల్ ఇండియా 3.25-1.6 శాతం మధ్య ఎగశాయి. అయితే హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటన్, దివీస్ ల్యాబ్, టీసీఎస్, కొటక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, విప్రో, హిందాల్కో 1.3- 0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఫైనాన్స్ జోష్ డెరివేటివ్స్లో శ్రీరామ్ ట్రాన్స్, టాటా కెమికల్స్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, ఐసీఐసీఐ లంబార్డ్, వేదాంతా, నాల్కో 7-3 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు ఎస్కార్ట్స్, టొరంట్ ఫార్మా, ఆర్బీఎల్ బ్యాంక్, ఐడియా, బయోకాన్, బాలకృష్ణ 3-1 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5-1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,576 లాభపడగా.. 538 నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,970 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. రూ. 1,972 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 3,637 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,440 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
వ్యాక్సిన్లవైపు మార్కెట్ల చూపు
ముంబై, సాక్షి: వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు మరింత బలపడే వీలున్నట్లు స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్- డిసెంబర్) నుంచీ ఆర్థిక వ్యవస్థ పుంజుకోనున్నట్లు తాజాగా రిజర్వ్ బ్యాంక్ అంచనా వేయడంతో సెంటిమెంటు బలపడినట్లు పేర్కొన్నారు. దీనికితోడు దేశీయంగా రూపొందుతున్న వ్యాక్సిన్లు మూడో దశ పరీక్షలకు చేరడంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి వచ్చే వారం మార్కెట్లు కన్సాలిడేషన్ మధ్య సానుకూలంగా కదిలే అవకాశమున్న్లట్లు అంచనా వేశారు. గణాంకాలు రానున్న శుక్రవారం(11న) నవంబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు విడుదలకానున్నాయి. ఇదే రోజు అక్టోబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి వివరాలు సైతం వెల్లడికానున్నాయి. కోవిడ్-19 సవాళ్ల నుంచి జీడీపీ పురోగతి బాట పట్టినట్లు ఆర్బీఐ తాజాగా అభిప్రాయపడటంతో ఈ గణాంకాలకు ప్రాధాన్యత ఉన్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్, భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. తాజాగా క్యాడిలా వ్యాక్సిన్కు సైతం మూడో దశ పరీక్షలకు గ్రీన్సిగ్నల్ వచ్చింది. యూకే బాటలో దేశీయంగా వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి లభిస్తే మార్కెట్లు మరింత దూకుడు చూపవచ్చని తెలియజేశారు. సాంకేతికంగా.. గత వారం సెన్సెక్స్ 930 పాయింట్లు ఎగసి 45,080 వద్ద నిలిచింది. తద్వారా మార్కెట్ చరిత్రలో తొలిసారి 45,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ సైతం 290 పాయింట్లు జంప్చేసి 13,259 వద్ద ముగిసింది. ఇది కొత్త గరిష్టంకాగా.. సాంకేతిక నిపుణుల విశ్లేషణ ప్రకారం నిఫ్టీ కీలక అవరోధమైన 13,250 పాయింట్లను అధిగమించి నిలిచింది. దీంతో నిఫ్టీకి 13,520 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. ఒకవేళ మార్కెట్లు బలహీనపడితే.. తొలుత 13,100 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించే వీలుంది. ఈ స్థాయిని కోల్పోతే.. 12,800 పాయింట్ల వద్ద మరోసారి మద్దతు దొరకవచ్చు. ఇతర అంశాలూ.. డాలరుతో రూపాయి మారకం, ప్రపంచ మార్కెట్ల సంకేతాలు, 9 నెలల గరిష్టాలకు చేరిన చమురు ధరలు, విదేశీ పెట్టుబడులు వంటి అంశాలు సైతం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగలవని స్టాక్ నిపుణులు పేర్కొంటున్నారు. సెకండ్ వేవ్ లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రపంచ ఇన్వెస్టర్లలో కొంతమేర ఆందోళనలు నెలకొన్నట్లు తెలియజేశారు. అయితే కొత్త ప్రెసిడెంట్గా ఎంపికైన జో బైడెన్ సహాయక ప్యాకేజీకి మద్దతివ్వడంతో వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. ఇక దేశీయంగా ఇటీవల కాలంలో ఎఫ్ఐఐలు ఈక్విటీలలో భారీగా ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. గత నెలలో నికరంగా రూ. 65,317 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే ఇదే సమయంలో దేశీ ఫండ్స్ రూ. 48,319 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! -
రికవరీ బూస్ట్- మార్కెట్ల సరికొత్త రికార్డ్స్
ముంబై, సాక్షి: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటపట్టినట్లు ఆర్బీఐ తాజాగా అభిప్రాయపడటంతో దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 447 పాయింట్లు జంప్చేసి 45,080 వద్ద ముగిసింది. వెరసి మార్కెట్ చరిత్రలో తొలిసారి 45,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఈ బాటలో నిఫ్టీ 125 పాయింట్లు ఎగసి 13,259 వద్ద నిలిచింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో జీడీపీ 5.6 శాతం క్షీణించవచ్చంటూ తొలుత వేసిన అంచనాలను తాజాగా 0.1 శాతం వృద్ధిగా ఆర్బీఐ సవరించడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు వచ్చే ఏడాది మొదట్లో కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న ఆశలు ప్రోత్సాహాన్నిచ్చినట్లు తెలియజేశారు. కాగా.. ఒక దశలో సెన్సెక్స్ 45,148 వద్ద, నిఫ్టీ 13,280 వద్ద ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాలను తాకడం విశేషం! బ్యాంకింగ్ జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, రియల్టీ, ఫార్మా, మెటల్ 2-1.2 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ, హిందాల్కో, అల్ట్రాటెక్, సన్ ఫార్మా, ఎయిర్టెల్, ఎస్బీఐ, హెచ్యూఎల్, గ్రాసిమ్, ఇండస్ఇండ్ 5-2.3 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్లో ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్, బీపీసీఎల్, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. చదవండి: (80% విమానాలకు ఓకే- షేర్లకు రెక్కలు) టాటా కెమ్ జోష్ డెరివేటివ్స్లో టాటా కెమికల్స్, ఇండిగో, బంధన్ బ్యాంక్, డీఎల్ఎఫ్, పేజ్, టాటా పవర్, గ్లెన్మార్క్ 8-3.3 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు అంబుజా, ఏసీసీ, శ్రీరామ్ ట్రాన్స్, జీఎంఆర్, ఎల్అండ్టీ ఫైనాన్స్, ఎల్ఐసీ హౌసింగ్, ఐడియా, పిరమల్, ఐసీఐసీఐ లంబార్డ్, కోఫోర్జ్ 3.2-1.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,646 లాభపడగా.. 1,245 నష్టాలతో ముగిశాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 3,637 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,440 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 357 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,636 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక మంగళవారం ఎఫ్పీఐలు రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
మళ్లీ మార్కెట్లు ప్లస్- విదేశీ ఇన్వెస్టర్ల దన్ను
ముంబై, సాక్షి: ఈ ఏడాది క్యూ3లో దేశ ఆర్థిక వ్యవస్థ స్పీడందుకోనుందన్న అంచనాలతో మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ వచ్చింది. దీంతో హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 172 పాయింట్లు ఎగసి 44,805కు చేరగా.. నిఫ్టీ 59 పాయింట్లు జమ చేసుకుని 13,193 వద్ద ట్రేడవుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,845వరకూ ఎగసింది. నిఫ్టీ సైతం గరిష్టంగా 13,204ను తాకింది. గత కొద్ది రోజులుగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్లో నిరవధికంగా ఇన్వెస్ట్ చేస్తుండటంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మొదట్లో కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న ఆశలు దీనికి జత కలుస్తున్నట్లు తెలియజేశారు. మీడియా అప్ ఎన్ఎస్ఈలో ఐటీ(0.2 శాతం) మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి. మీడియా, ఆటో, ఎఫ్ఎంసీజీ, బ్యాంక్స్ 1.2-0.5 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్, గెయిల్, ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, ఐవోసీ, హిందాల్కో, యూపీఎల్, హీరో మోటో 3.5-1.2 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్లో ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఆర్ఐఎల్, ఎస్బీఐ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1.2-0.25 శాతం మధ్య బలహీనపడ్డాయి. టాటా.. పవర్ డెరివేటివ్స్లో టాటా పవర్ 5.6 శాతం జంప్చేయగా.. పెట్రోనెట్, ఎస్కార్ట్స్, ఇండిగో, యూబీఎల్, టాటా కన్జూమర్, అపోలో టైర్ 3-2 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. మరోవైపు బీవోబీ, క్యాడిలా హెల్త్కేర్, ఇన్ఫ్రాటెల్, పిరమల్, ఐడియా, ఆర్ఈసీ, కోఫోర్జ్, ఐసీఐసీఐ లంబార్డ్ 1.3-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,420 లాభపడగా.. 444 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్ఫీఐల పెట్టుబడులు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 3,637 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,440 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 357 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,636 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక మంగళవారం ఎఫ్పీఐలు రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
కొత్త రికార్డులతో మార్కెట్లు షురూ
ముంబై, సాక్షి: కరోనా వైరస్ కట్టడికి ఫైజర్ వ్యాక్సిన్ను యూకే ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ వచ్చింది. దీంతో హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 137 పాయింట్లు పెరిగి 44,755కు చేరగా.. నిఫ్టీ 50 పాయింట్లు జమ చేసుకుని 13,163 వద్ద ట్రేడవుతోంది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,953వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. తద్వారా 45,000 పాయింట్ల మార్క్కు చేరువైంది. ఇక నిఫ్టీ 13,216ను అధిగమించడం ఇంట్రాడే గరిష్టం రికార్డును సాధించింది. ఈ ఏడాది క్యూ3లో దేశ ఆర్థిక వ్యవస్థ రికవర్కానున్న అంచనాలు సైతం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. మీడియా, మెటల్స్ అప్ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మీడియా, మెటల్, పీఎస్యూ బ్యాంక్స్ 2-1.2 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో మారుతీ, గెయిల్, హిందాల్కో, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హీరో మోటో, ఎస్బీఐ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఎస్బీఐ లైఫ్, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, యాక్సిస్, గ్రాసిమ్, అల్ట్రాటెక్, యూపీఎల్, ఐటీసీ, టీసీఎస్, బజాజ్ ఆటో 1.3-0.4 శాతం మధ్య నీరసించాయి. ఎఫ్అండ్వోలో డెరివేటివ్స్లో టాటా కెమ్, జీ, ఐబీ హౌసింగ్, భారత్ ఫోర్జ్, కోఫోర్జ్, సెయిల్, శ్రీరామ్ ట్రాన్స్, మదర్సన్ 4-2.6 శాతం మధ్య జంప్చేశాయి. అయితే అదానీ ఎంటర్, గోద్రెజ్ సీపీ, బాష్ 1 స్థాయిలో డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 357 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,636 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే డీఐఐలు రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
బ్యాంక్స్ వీక్- మెటల్, రియల్టీ జోరు
ముంబై, సాక్షి: జీడీపీ జోష్తో ముందురోజు హైజంప్ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు రోజంతా ఆటుపోట్ల మధ్య కదిలాయి. చివరికి అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్పంగా 35 పాయింట్లు క్షీణించి 44,621 వద్ద నిలిచింది. నిఫ్టీ నామమాత్రంగా 5 పాయింట్లు బలపడి 13,114 వద్ద స్థిరపడింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో జీడీపీ 7.5 శాతం క్షీణతకే పరిమితంకావడంతో మంగళవారం మార్కెట్లు దూకుడు చూపిన విషయం విదితమే. దీంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,730 వద్ద గరిష్టాన్ని తాకగా.. 44,170 దిగువన కనిష్టానికి చేరింది. నిఫ్టీ సైతం 13,129-12,984 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. గెయిల్ లాభాల్లో ఎన్ఎస్ఈలో రియల్టీ, మెటల్, ఆటో, ఐటీ రంగాలు 3-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. ప్రభుత్వ, ప్రయివేట్ బ్యాంక్స్ 0.5-1.2 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, టైటన్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, టాటా స్టీల్, ఐవోసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ 5-2.6 శాతం మధ్య ఎగశాయి. అయితే కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, శ్రీ సిమెంట్, ఐసీఐసీఐ, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, ఎస్బీఐ 3.4-0.6 శాతం మధ్య నష్టపోయాయి. అదానీ అప్ డెరివేటివ్ కౌంటర్లలో అదానీ ఎంటర్, టాటా కెమ్, నాల్కో, ఇన్ఫ్రాటెల్, ఎన్ఎండీసీ, పిడిలైట్, ఎస్కార్ట్స్, డీఎల్ఎఫ్ 7.2-3.3 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోపక్క కెనరా బ్యాంక్, సన్ టీవీ, టీవీఎస్ మోటార్, మదర్సన్, అపోలో హాస్పిటల్స్, యూబీఎల్, ఎంజీఎల్, ఎల్అండ్టీ ఫైనాన్స్ 4-1.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5-0.7 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,728 లాభపడగా.. 1,196 నష్టాలతో ముగిశాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 7,713 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 4,969 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
నేలచూపులతో- మెటల్, రియల్టీ ప్లస్
ముంబై, సాక్షి: జీడీపీ జోష్తో ముందురోజు హైజంప్ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ స్వల్పంగా 35 పాయింట్లు క్షీణించి 44,621కు చేరింది. నిఫ్టీ నామమాత్రంగా 6 పాయింట్లు బలహీనపడి 13,103 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో జీడీపీ 7.5 శాతం క్షీణతకే పరిమితంకావడంతో మంగళవారం మార్కెట్లు దూకుడు చూపిన విషయం విదితమే. దీంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,730 వద్ద గరిష్టాన్ని తాకగా.. 44,561 దిగువన కనిష్టానికి చేరింది. నిఫ్టీ సైతం 13,128-13,088 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. మీడియా లాభాల్లో ఎన్ఎస్ఈలో మెటల్, రియల్టీ, మీడియా, ఆటో, ఫార్మా రంగాలు 1.7-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. ఐటీ, ప్రయివేట్ బ్యాంక్స్ 0.5 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐవోసీ, టాటా మోటార్స్, హిందాల్కో, యూపీఎల్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, టైటన్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, కోల్ ఇండియా 3.2-1.1 శాతం మధ్య ఎగశాయి. అయితే టెక్ మహీంద్రా, కొటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, శ్రీ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే 1.6-0.5 శాతం మధ్య నష్టపోయాయి. నాల్కో అప్ డెరివేటివ్ కౌంటర్లలో నాల్కో, హెచ్పీసీఎల్, ఐసీఐసీఐ లంబార్డ్, ఎన్ఎండీసీ, వేదాంతా, టాటా కెమ్, ఎక్సైడ్ 4-2 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోపక్క నౌకరీ, మదర్సన్, ఐజీఎల్, ముత్తూట్, బాలకృష్ణ, సన్ టీవీ, సీమెన్స్, అరబిందో, మెక్డోవెల్ 1.5-0.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4-0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,340 లాభపడగా.. 646 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 7,713 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 4,969 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
జీడీపీ జోష్- మార్కెట్లు గెలాప్
ముంబై, సాక్షి: కోవిడ్-19 నేపథ్యంలోనూ జులై- సెప్టెంబర్లో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 506 పాయింట్లు జంప్చేసి 44,655 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 140 పాయింట్లు ఎగసి 13,109 వద్ద నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో జీడీపీ 7.5 శాతం క్షీణతకే పరిమితంకావడంతో ఒక్కసారిగా సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పురోగతిని సాధించే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపినట్లు నిపుణులు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,730ను అధిగమించగా, నిఫ్టీ 13,128 పాయింట్లను దాటింది. చదవండి: (సిమెంట్ షేర్లు.. భలే స్ట్రాంగ్) అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, పీఎస్యూ బ్యాంక్స్, ఐటీ, ఫార్మా, మెటల్ 3.3-1.7 శాతం మధ్య ఎగశాయి. ఎఫ్ఎంసీజీ యథాతథంగా నిలిచింది. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్, సన్ ఫార్మా, ఇండస్ఇండ్, టెక్ మహీంద్రా, యూపీఎల్, ఓఎన్జీసీ, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ, జేస్డబ్ల్యూ స్టీల్, శ్రీసిమెంట్ 8-2.3 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. నెస్లే, కొటక్ బ్యాంక్, టైటన్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్ 2.6-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఎఫ్అండ్వోలో డెరివేటివ్ కౌంటర్లలో అపోలో హాస్పిటల్స్, టాటా పవర్, అదానీ ఎంటర్, కెనరా బ్యాంక్, మదర్సన్, యూబీఎల్, భెల్, బీవోబీ, ఫెడరల్ బ్యాంక్, డీఎల్ఎఫ్ 6.7-4.3 శాతం మధ్య దూసుకెళ్లాయి. అయితే మరోపక్క శ్రీరామ్ ట్రాన్స్, చోళమండలం, మణప్పురం, ఐజీఎల్, అమరరాజా, నౌకరీ, ఎస్కార్ట్స్, జీఎంఆర్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, కమిన్స్ 4.3-2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,927 లాభపడగా.. 973 మాత్రమే నష్టాలతో నిలిచాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 7,713 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 4,969 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక గురువారం ఎఫ్పీఐలు రూ. 2,027 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 3,400 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టినన విషయం విదితమే. కాగా.. నవంబర్ నెలలో ఎఫ్పీఐలు ఈక్విటీలలో రూ. 60,358 కోట్లు ఇన్వెస్ట్ చేయడం విశేషం! -
లాభాలతో షురూ- రియల్టీ, ఫార్మా జోరు
ముంబై, సాక్షి: ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన అంచనాలతో దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 118 పాయింట్లు పుంజుకుని 44,321కు చేరింది. నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 13,007 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో జీడీపీ 7.5 శాతం క్షీణతకే పరిమితంకావడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పురోగతిని సాధించే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లకు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,470, నిఫ్టీ 13,064 పాయింట్ల వరకూ ఎగశాయి. బ్లూచిప్స్ తీరిలా ఎన్ఎస్ఈలో ప్రధానంగా రియల్టీ, ఫార్మా, మెటల్, ఐటీ రంగాలు 2-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. ఆటో, మీడియా 0.25 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్, శ్రీసిమెంట్, అల్ట్రాటెక్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్, బజాజ్ ఆటో, పవర్గ్రిడ్, సన్ ఫార్మా, గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్ 3-1.3 శాతం మధ్య ఎగశాయి. అయితే నెస్లే, కొటక్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎంఅండ్ఎం, హెచ్సీఎల్ టెక్, విప్రో, యాక్సిస్, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్టెల్ 2.3-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఏసీసీ అప్ డెరివేటివ్ కౌంటర్లలో ఏసీసీ, డీఎల్ఎఫ్, హావెల్స్, ఐసీఐసీఐ లంబార్డ్, బంధన్ బ్యాంక్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 4.6-2.5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోపక్క చోళమండలం, మణప్పురం, ఎస్కార్ట్స్, మైండ్ట్రీ, బాటా, అమరరాజా, ఐడియా, కమిన్స్, క్యాడిలా హెల్త్ 2.3-1.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4-0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,355 లాభపడగా.. 641 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 7,713 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 4,969 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక గురువారం ఎఫ్పీఐలు రూ. 2,027 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 3,400 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టినన విషయం విదితమే. కాగా.. నవంబర్ నెలలో ఎఫ్పీఐలు ఈక్విటీలలో రూ. 60,358 కోట్లు ఇన్వెస్ట్ చేయడం విశేషం! -
నష్టాల ముగింపు- చిన్న షేర్లు జూమ్
ముంబై, సాక్షి: రోజంతా కన్సాలిడేషన్ బాటలో సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 110 పాయింట్లు క్షీణించి 44,150 వద్ద నిలివగా.. నిఫ్టీ 18 పాయింట్లు తక్కువగా 12,969 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,407 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకగా.. 43,995 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీ 13,035-12,914 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నేడు క్యూ2(జులై- సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ తొలిరోజు మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య నీరసంగా ముగిశాయి. అయితే మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లకు డిమాండ్ నెలకొనడం గమనార్హం! ఐటీ వీక్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా రియల్టీ, మీడియా, ఆటో, పీఎస్యూ బ్యాంక్స్ 2.7-1.25 శాతం మధ్య బలపడగా.. ఐటీ 0.45 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, హీరో మోటో, దివీస్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే నెస్లే, పవర్గ్రిడ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, శ్రీ సిమెంట్, హెచ్సీఎల్ టెక్, ఓఎన్జీసీ, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ 4.3-1.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఎంజీఎల్ జోరు డెరివేటివ్ కౌంటర్లలో ఎంజీఎల్ 14 శాతం దూసుకెళ్లగా.. కమిన్స్, ఐజీఎల్, ఎల్అండ్టీ ఫైనాన్స్, చోళమండలం, కేడిలా హెల్త్కేర్, ఎక్సైడ్, అపోలో టైర్, టీవీఎస్ మోటార్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 10.4- 5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు పెట్రోనెట్, పిరమల్, ఐసీఐసీఐ లంబార్డ్, ఆర్ఈసీ, జిందాల్ స్టీల్, మారికో, ఇండిగో, కోఫోర్జ్, మెక్డోవెల్ 3-2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,766 లాభపడగా.. 1032 మాత్రమే నష్టాలతో ముగిశాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,027 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 3,400 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్పీఐలు నామమాత్రంగా రూ. 24 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,840 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక మంగళవారం ఎఫ్పీఐలు రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్చేయగా.. డీఐఐలు . 2,522 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
కన్సాలిడేషన్లో మార్కెట్లు- ఆటో స్పీడ్
ముంబై, సాక్షి: డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ తొలిరోజు దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. కన్సాలిడేషన్ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 118 పాయింట్లు క్షీణించి 44,142 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 27 పాయింట్లు తక్కువగా 12,960 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,407 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకగా.. 44,124 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీ 13,035-12,957 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నేడు క్యూ2(జులై- సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. మెటల్ వీక్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, రియల్టీ, మీడియా, ఫార్మా, పీఎస్యూ బ్యాంక్స్ 1.6-0.5 శాతం మధ్య బలపడగా.. మెటల్ 0.35 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఐషర్, గెయిల్, బజాజ్ ఆటో, బ్రిటానియా, టెక్ మహీంద్రా, మారుతీ, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్స్ 4-1.4 శాతం మధ్య ఎగశాయి. అయితే పవర్గ్రిడ్, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ లైఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఆర్ఐఎల్, యాక్సిస్, శ్రీ సిమెంట్, టీసీఎస్, టాటా స్టీల్, ఎయిర్టెల్ 2-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఐజీఎల్ జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో ఐజీఎల్ 11 శాతం దూసుకెళ్లగా.. ఎంజీఎల్, భెల్, కేడిలా హెల్త్కేర్, బాలకృష్ణ, శ్రీరామ్ ట్రాన్స్, సెయిల్, అపోలో టైర్, గోద్రెజ్ సీపీ 9-2.5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు బాష్, ఐసీఐసీఐ లంబార్డ్, ఐబీ హౌసింగ్, జిందాల్ స్టీల్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఇన్ఫ్రాటెల్ 1.4-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,276 లాభపడగా.. 556 మాత్రమే నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,027 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 3,400 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్పీఐలు నామమాత్రంగా రూ. 24 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,840 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక మంగళవారం ఎఫ్పీఐలు రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్చేయగా.. డీఐఐలు . 2,522 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
ఆటుపోట్ల మధ్య మార్కెట్ల దూకుడు
ముంబై, సాక్షి: ముందురోజు నమోదైన పతనం నుంచి దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్బ్యాక్ను సాధించాయి. సెన్సెక్స్ 432 పాయింట్లు జంప్చేసి 44,260 వద్ద ముగిసింది. నిఫ్టీ 129 పాయింట్లు ఎగసి 12,987 వద్ద స్థిరపడింది. అయితే మిడ్సెషన్ వరకూ ఒడిదొడుకుల మధ్య కదిలాయి. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,582 వద్ద కనిష్టాన్ని తాకింది. తదుపరి మిడ్సెషన్ నుంచీ జోరందుకుని 44,362 వరకూ ఎగసింది. ఇదేవిధంగా నిఫ్టీ సైతం 13,108 వద్ద గరిష్టాన్ని తాకగా.. 12,790 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. నేడు నవంబర్ డెరివేటివ్ సిరీస్ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు పొజిషన్లను రోలోవర్ చేసుకోవడానికి ప్రాధాన్యమివ్వడంతో మార్కెట్లు ఆటుపోట్లకు లోనైనట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. బుధవారం ఒక్కసారిగా ఊపందుకున్న అమ్మకాలతో రికార్డుల ర్యాలీకి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ బ్యాంక్స్ జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మెటల్స్ 4 శాతం, పీఎస్యూ బ్యాంక్స్ 2 శాతం, ఫార్మా 1.5 శాతం చొప్పున ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, శ్రీ సిమెంట్, బజాజ్ ఆటో, హిందాల్కో, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 7-2 శాతం మధ్య జంప్చేశాయి. అయితే ఐషర్, మారుఈ, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా 1.6-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. చిన్న షేర్లు ఓకే డెరివేటివ్ కౌంటర్లలో సీమెన్స్ 12.4 శాతం జంప్చేయగా.. సెయిల్, జిందాల్ స్టీల్, ఐసీఐసీఐ లంబార్డ్, ఎల్అండ్టీ ఫైనాన్స్, నాల్కో, బీవోబీ, టాటా కెమికల్స్ 8.3-4.6 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోవైపు ఇండిగో, ఆర్బీఎల్ బ్యాంక్, శ్రీరామ్ ట్రాన్స్, హావెల్స్, ఎస్ఆర్ఎఫ్, ఎస్కార్ట్స్ 2.6-0.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-0.7 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,765 లాభపడగా.. 994 మాత్రమే నష్టాలతో ముగిశాయి. డీఐఐల అమ్మకాలు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) నామమాత్రంగా రూ. 24 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,840 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్చేయగా.. డీఐఐలు రూ. 2,522 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. ఇక సోమవారం ఎఫ్పీఐలు రూ. 4,738 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,944 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
మార్కెట్ల ర్యాలీ బాట- ఐటీ, ఫార్మా జూమ్
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్లలో రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. గత వారం మధ్యలో బ్రేక్ పడినప్పటికీ తిరిగి వరుసగా రెండో రోజు మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 44,271ను తాకడం ద్వారా ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. చివరికి 195 పాయింట్లు బలపడి 44,077 వద్ద నిలిచింది. నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 12,926 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 12,969కు చేరింది. కోవిడ్-19 కట్టడికి వెలువడనున్న వ్యాక్సిన్లపై అంచనాలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆర్బీఐ ప్యానల్ సూచనల నేపథ్యంలో ఎన్బీఎఫ్సీ, స్మాల్ బ్యాంకులు తదితర ఫైనాన్షియల్ రంగ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. బ్యాంక్స్ వీక్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఐటీ, ఫార్మా, మెటల్, రియల్టీ, ఆటో 2.8-0.6 శాతం మధ్య వృద్ధి చూపాయి. అయితే బ్యాంక్ నిఫ్టీ 0.7 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్జీసీ, ఇండస్ఇండ్, గెయిల్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, ఆర్ఐఎల్, బీపీసీఎల్, టీసీఎస్ 6.7-2.5 శాతం మధ్య జంప్చేశాయి. ఇతర బ్లూచిప్స్లో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఎస్బీఐ లైఫ్, టైటన్, ఎస్బీఐ, ఎంఅండ్ఎం, ఎయిర్టెల్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ 3.5-0.6 శాతం మధ్య క్షీణించాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ డెరివేటివ్ కౌంటర్లలో ఐడీఎఫ్సీ ఫస్ట్, బీహెచ్ఈఎల్, జీఎంఆర్, అదానీ ఎంటర్, సెయిల్, శ్రీరామ్ ట్రాన్స్, బాలకృష్ణ, మదర్సన్, పీవీఆర్, ఐడియా 9.5-3.5 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క ఎల్ఐసీ హౌసింగ్, ముత్తూట్, గ్లెన్మార్క్, బీఈఎల్, సీమెన్స్, వోల్టాస్, బీవోబీ, ఎస్కార్ట్స్, పేజ్, మెక్డోవెల్, బాష్, అపోలో టైర్ 2.4-0.6 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.3 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,683 లాభపడగా.. 1,148 నష్టాలతో నిలిచాయి. ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 3,861 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,869 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 1,181 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,855 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
సెన్సెక్స్ కొత్త రికార్డ్- ఫైనాన్స్ షేర్లు జూమ్
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్ల రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. గత వారం మధ్యలో బ్రేక్ పడినప్పటికీ తిరిగి వరుసగా రెండో రోజు మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 44,271ను తాకడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ప్రస్తుతం 243 పాయింట్లు ఎగసి 44,125 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 70 పాయింట్లు బలపడి 12,929 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో 12,962కు చేరింది. కోవిడ్-19 కట్టడికి వెలువడనున్న వ్యాక్సిన్లపై అంచనాలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆర్బీఐ ప్యానల్ సూచనల నేపథ్యంలో ఎన్బీఎఫ్సీ, స్మాల్ బ్యాంకులు తదితర ఫైనాన్షియల్ రంగ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. రియల్టీసహా.. ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, మెటల్, బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా 1-0.5 శాతం మధ్య వృద్ధి చూపాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, బజాజ్ ఫిన్, ఆర్ఐఎల్, హిందాల్కో, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్టీ, యూపీఎల్ 3.4-1 శాతం మధ్య పుంజుకున్నాయి. బ్లూచిప్స్లో ఎయిర్టెల్, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, ఎంఅండ్ఎం, ఏషియన్ పెయింట్స్, ఐవోసీ, అదానీ పోర్ట్స్ 1.2-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ అప్ డెరివేటివ్ కౌంటర్లలో ఐడీఎఫ్సీ ఫస్ట్, శ్రీరామ్ ట్రాన్స్, పెట్రోనెట్, బాలకృష్ణ, జిందాల్ స్టీల్, చోళమండలం, ఆర్బీఎల్ బ్యాంక్, మదర్సన్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 4.2-2.2 శాతం మధ్య జంప్చేశాయి. అయితే మరోపక్క ఎల్ఐసీ హౌసింగ్, ముత్తూట్, గ్లెన్మార్క్, టొరంట్ ఫార్మా, జూబిలెంట్ ఫుడ్, ఇన్ఫ్రాటెల్, టీవీఎస్ మోటార్ 2-1 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7 శాతం మధ్య ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,253 లాభపడగా.. 635 నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 3,861 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,869 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 1,181 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,855 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
వచ్చే వారం మార్కెట్లు మరింత స్పీడ్!?
ముంబై, సాక్షి: వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు మరింత బలపడే వీలున్నట్లు స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, కోవిడ్-19 కట్టడికి రూపొందుతున్న వ్యాక్సిన్ల ఫలితాలు సహకరించనున్నట్లు పేర్కొంటున్నారు. అయితే గురువారం(26న) నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్లను చవిచూడవచ్చని తెలియజేశారు. ట్రేడర్లు డిసెంబర్ సిరీస్ కు పొజిషన్లను రోలోవర్ చేసుకోవడంలో మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొనే వీలున్నట్లు వివరించారు. కాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) నికరంగా ఈక్విటీలలో రూ. 42,300 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. గత రెండు దశాబ్దాలలోనే నవంబర్ పెట్టుబడుల్లో ఇది అత్యధికమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది దేశీయంగా ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. యూఎస్, యూరోపియన్ కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీల కారణంగా పెరిగిన లిక్విడిటీ దేశీయంగా విదేశీ పెట్టుబడులకు దోహదపడుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. సాంకేతికంగా.. గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలక అవరోధమైన 12,850 పాయింట్లకు పైనే నిలిచింది. దీంతో వచ్చే వారం నిఫ్టీకి సాంకేతికంగా 12,970 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకాగలదని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ స్థాయిని అధిగమిస్తే.. 13,100- 13,200 పాయింట్ల వరకూ పుంజుకోగలదని పేర్కొన్నారు. అయితే 12,730 స్థాయిని నిలుపుకోవలసి ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ఈ స్థాయిని కోల్పోతే.. 12,630- 12,530 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇతర అంశాలూ.. ప్రపంచ మార్కెట్ల నుంచి అందే సంకేతాలు, డాలరుతో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగలవని స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. సెకండ్ వేవ్ లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రపంచ ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొన్నట్లు తెలియజేశారు. అయితే తాజాగా ఫైజర్ అత్యవసర వినియోగానికి అనుమతించమంటూ తమ వ్యాక్సిన్ పై యూఎస్ఎఫ్డీఏకు దరఖాస్తు చేయడం, మోడర్నా వ్యాక్సిన్ 94 శాతానికిపైగా సత్ఫలితాలు ఇచ్చినట్లు వెలువడిన వార్తలు వంటి అంశాలు అంతర్గతంగా సెంటిమెంటుకు బలాన్నివ్వగలదని విశ్లేషకులు చెబుతున్నారు. గత వారం ఇలా శుక్రవారం(20)తో ముగిసిన గత వారంలో ఎఫ్ఐఐలు రూ. 13,019 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్ రూ. 12,343 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సెన్సెక్స్ 244 పాయింట్లు(0.6 శాతం) బలపడి 43,882 వద్ద నిలిచింది. అయితే ఇంట్రాడేలో 44,000 పాయింట్ల మైలురాయిని తొలిసారి అధిగమించింది. నిఫ్టీ 79 పాయింట్లు(0.6 శాతం) పుంజుకుని 12,859 వద్ద ముగిసింది. కాగా.. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 3 శాతం స్థాయిలో జంప్చేయడం గమనార్హం! -
మార్కెట్లు బౌన్స్బ్యాక్- ఐటీ, బ్యాంక్స్ భేష్
ముంబై, సాక్షి: ముందురోజు నమోదైన పతనానికి చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్బ్యాక్ను సాధించాయి. అయితే పలుమార్లు ఆటుపోట్లకు లోనయ్యాయి. చివరికి సెన్సెక్స్ 282 పాయింట్లు పెరిగి 43,882 వద్ద ముగిసింది. నిఫ్టీ 87 పాయింట్లు బలపడి 12,859 వద్ద నిలిచింది. సహాయక ప్యాకేజీపై అంచనాలతో గురువారం యూఎస్ మార్కెట్లు 0.2-0.8 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే సెకండ్వేవ్లో భాగంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,013 వద్ద గరిష్టాన్ని తాకగా.. 43,454 దిగువన కనిష్టానికి చేరింది. ఇక నిఫ్టీ 12,892- 12,730 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఐటీ జోరు ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలు 1 శాతం స్థాయిలో వృద్ధి చూపాయి. అయితే మీడియా 0.9 శాతం, మీడియా 0.3 శాతం చొప్పున డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఫిన్సర్వ్ 9.3 శాతం దూసుకెళ్లగా.. టైటన్, గెయిల్, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్టెల్, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, గ్రాసిమ్, నెస్లే ఇండియా, ఎన్టీపీసీ 5.4-2.5 శాతం మధ్య ఎగశాయి. అయితే ఆర్ఐఎల్ 3.7 శాతం క్షీణించగా, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్, యాక్సిస్, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, హెచ్యూఎల్, ఎల్అండ్టీ 1.6-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఇన్ఫ్రాటెల్ జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో ఇన్ఫ్రాటెల్ 20 శాతం దూసుకెళ్లగా.. ఐడియా, బీఈఎల్, ఐసీఐసీఐ లంబార్డ్, జూబిలెంట్ ఫుడ్, నౌకరీ, సెయిల్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ఎంఆర్ఎఫ్ 7.5-3 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క పీవీఆర్, అశోక్ లేలాండ్, ఎన్ఎండీసీ, భారత్ ఫోర్జ్, డీఎల్ఎఫ్, టాటా పవర్, ఐబీ హౌసింగ్ 5-1.6 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.2-0.8 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,548 లాభపడగా.. 1240 నష్టాలతో ముగిశాయి. ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,181 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,855 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 3,072 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,790 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
పతనానికి చెక్- లాభాలతో షురూ
ముంబై, సాక్షి: ముందురోజు నమోదైన పతనానికి చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 164 పాయింట్లు పెరిగి 43,764కు చేరింది. నిఫ్టీ 50 పాయింట్లు బలపడి 12,822 వద్ద ట్రేడవుతోంది. సహాయక ప్యాకేజీపై కాంగ్రెస్లో తిరిగి చర్చలు ప్రారంభంకానున్న అంచనాలతో గురువారం యూఎస్ మార్కెట్లు 0.2-0.8 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే సెకండ్వేవ్లో భాగంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,889 వద్ద గరిష్టాన్ని తాకగా.. 43,649 దిగువన కనిష్టానికి చేరింది. ఇక నిఫ్టీ 12,855- 12,784 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. మెటల్ జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, మెటల్, ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ 1-0.5 శాతం మధ్య వృద్ధి చూపాయి. నిఫ్టీ దిగ్గజాలలో టైటన్, బజాజ్ ఫిన్, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్, నెస్లే ఇండియా, ఎన్టీపీసీ, బ్రిటానియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో 3.6-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే యూపీఎల్, ఆర్ఐఎల్, ఓఎన్జీసీ, ఐటీసీ, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, ఎయిర్టెల్ 1.6-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఐడియా అప్ డెరివేటివ్ కౌంటర్లలో ఐడియా, బీఈఎల్, ఇన్ఫ్రాటెల్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, అపోలో హాస్పిటల్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 5-2.5 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క బాటా, బయోకాన్, టొరంట్ ఫార్మా, అశోక్ లేలాండ్, ఫెడరల్ బ్యాంక్ 2-1 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం స్థాయిలో ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,347 లాభపడగా.. 639 నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,181 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,855 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 3,072 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్ రూ. 2,790 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
రికార్డుల ర్యాలీకి బ్రేక్.. నష్టాలతో షురూ
ముంబై, సాక్షి: రికార్డుల ర్యాలీకి బ్రేక్ వేస్తూ దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 274 పాయింట్ల వెనకడుగుతో 43,906కు చేరగా.. నిఫ్టీ 74 పాయింట్లు క్షీణించి 12,864 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,016- 43,821 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ సైతం 12,908- 12,836 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. సెకండ్వేవ్లో భాగంగా కోవిడ్-19 కేసులు పెరిగిపోతుండటంతో బుధవారం మరోసారి యూఎస్ మార్కెట్లు 1.2-0.8 శాతం మధ్య డీలాపడ్డాయి. వ్యాక్సిన్లు ఆశలు కలిగిస్తున్నప్పటికీ మరోసారి లాక్డవున్లు విధించవచ్చన్న భయాలు ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్లూచిప్స్ తీరిలా ఎన్ఎస్ఈలో రియల్టీ, బ్యాంకింగ్, ఆటో రంగాలు 1-0.4 శాతం మధ్య ఎగశాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా 0.3 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హీరో మోటో 5 శాతం జంప్చేయగా. బీపీసీఎల్, టీసీఎస్, బజాజ్ ఫిన్, మారుతీ, బ్రిటానియా, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఆర్ఐఎల్, సిప్లా 2-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే పవర్గ్రిడ్, ఎస్బీఐ, యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఎల్అండ్టీ, యూపీఎల్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ 3-1 శాతం మధ్య డీలాపడ్డాయి. డెరివేటివ్స్లో ఎఫ్అండ్వో కౌంటర్లలో వేదాంతా, అపోలో హాస్పిటల్స్, బాటా, ఎల్ఐసీ హౌసింగ్, అరబిందో, ఎంజీఎల్, టీవీఎస్ మోటార్ 5-1.5 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క ఆర్ఈసీ, బీవోబీ, ఆర్బీఎల్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, అంబుజా, ఇన్ఫ్రాటెల్, అపోలో టైర్ 2-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 987 లాభపడగా.. 687 నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 3,072 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,790 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 4,905 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 3,829 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
నష్టాలతో ప్రారంభమై.. లాభాల్లోకి
ముంబై: రికార్డుల ర్యాలీకి బ్రేక్ వేస్తూ దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. తదుపరి నష్టాల నుంచి బయటపడి ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 53 పాయింట్లు పుంజుకుని 44,006కు చేరగా.. నిఫ్టీ 17 పాయింట్లు బలపడి 12,891 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,030- 43,816 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ సైతం 12,897- 12,836 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. సెకండ్వేవ్లో భాగంగా కోవిడ్-19 కేసులు పెరిగిపోతుండటంతో మంగళవారం యూఎస్ మార్కెట్లు డీలాపడ్డాయి. మళ్లీ లాక్డవున్లు విధించవచ్చన్న భయాలు ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. చదవండి: (ఎవరెడీ- వొడాఫోన్ ఐడియా జోరు) బ్లూచిప్స్ తీరిలా ఎన్ఎస్ఈలో రియల్టీ, బ్యాంకింగ్, ఆటో రంగాలు 1-0.4 శాతం మధ్య పుంజుకున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా 0.3 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, ఎల్అండ్టీ, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్, సిప్లా 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే బీపీసీఎల్, బ్రిటానియా, టెక్ మహీంద్రా, హెచ్యూఎల్, టైటన్, సన్ ఫార్మా, ఐషర్, ఎయిర్టెల్, నెస్లే, హెచ్డీఎఫ్సీ 1.5-0.5 శాతం మధ్య నీరసించాయి. చదవండి: (జుకర్బర్గ్ను దాటేసిన ఎలన్ మస్క్?) డెరివేటివ్స్లో ఎఫ్అండ్వో కౌంటర్లలో ఆర్బీఎల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఎంజీఎల్, మదర్సన్, సీమెన్స్, బాలకృష్ణ 3-1.3 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. ఐసీఐసీఐ లంబార్డ్, పీవీఆర్, ఐబీ హౌసింగ్, ఐడియా, హెచ్పీసీఎల్, టొరంట్ ఫార్మా 2-1.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.3 శాతం స్థాయిలో బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1023 లాభపడగా.. 615 నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 4,905 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 3,829 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. సోమవారం మార్కెట్లకు సెలవుకాగా.. శనివారం ఎఫ్పీఐలు రూ. 78.5 కోట్లు, డీఐఐలు రూ. 20.3 కోట్లు కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. కాగా.. ఈ నెల 2-13 మధ్య కాలంలో ఎఫ్పీఐలు దేశీ స్టాక్స్లో నికరంగా రూ. 29,436 కోట్లను ఇన్వెస్ట్ చేయడం విశేషం! -
మరోసారి మార్కెట్లకు దివాలీ జోష్?!
ముంబై: దీపావళి జోష్ను చూపిస్తూ నేడు (17న) మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 98 పాయింట్లు ఎగసి 12,880 వద్ద ట్రేడవుతోంది. శనివారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ నవంబర్ ఫ్యూచర్స్ 12,782 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కోవిడ్-19 వ్యాక్సిన్పై ఆశలతో సోమవారం యూఎస్ మార్కెట్లు 1.2-0.8 శాతం మధ్య ఎగశాయి. సరికొత్త గరిష్టాలవద్ద ముగిశాయి. అయితే ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. ముహూరత్ అదుర్స్ సరికొత్త ఏడాది సంవత్ 2077 తొలి రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో బోణీ కొట్టాయి. శనివారం సెన్సెక్స్, నిఫ్టీ లైఫ్టైమ్ గరిష్టాలను తాకాయి. దీపావళి సందర్భంగా నిర్వహించిన ముహూరత్ ట్రేడింగ్లో సెన్సెక్స్ 195 పాయింట్లు ఎగసి 43,638 వద్ద నిలిచింది. నిఫ్టీ 60 పాయింట్లు పుంజుకుని 12,780 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,831 వద్ద, నిఫ్టీ 12,829 వద్ద సరికొత్త గరిష్టాలకు చేరాయి. వెరసి సాయంత్రం 6.15-7.15 మధ్య నిర్వహించిన మూరత్ ట్రేడింగ్లో మార్కెట్లు మరోసారి సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. రోజంతా మార్కెట్లు లాభాల మధ్యే కదలడం విశేషం! నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 12,744 పాయింట్ల వద్ద, తదుపరి 12,707 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 12,823 పాయింట్ల వద్ద, ఆపై 12,865 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 28,433 పాయింట్ల వద్ద, తదుపరి 28,272 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 28,754 పాయింట్ల వద్ద, తదుపరి 28,913 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు. అమ్మకాలవైపు నగదు విభాగంలో శనివారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 78.5 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 20.3 కోట్లు కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 1,936 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,462 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. కాగా.. ఈ నెలలో 2-13 మధ్య కాలంలో ఎఫ్పీఐలు దేశీ స్టాక్స్లో నికరంగా రూ. 29,436 కోట్లను ఇన్వెస్ట్ చేయడం విశేషం! -
ముహూరత్ అదుర్స్- మార్కెట్ల రికార్డ్స్
గత దీపావళి నుంచి ఈ దీపావళి వరకూ విశేషాలు సెన్సెక్స్ : 43,638= దాదాపు 4400 పాయింట్లు(11.4 శాతం) అప్ నిఫ్టీ: 12,780= సుమారు 1150 పాయింట్లు(10.18 శాతం) ప్లస్ డాలరుతో రూపాయి మారకం= 74.60- రూ. 3.76(5.3 శాతం) డౌన్ ముంబై: సరికొత్త ఏడాది సంవత్ 2077 తొలి రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో బోణీ కొట్టాయి. అంతేకాకుండా సెన్సెక్స్, నిఫ్టీ లైఫ్టైమ్ గరిష్టాలను తాకాయి. దీపావళి సందర్భంగా నిర్వహించిన ముహూరత్ ట్రేడింగ్లో సెన్సెక్స్ 195 పాయింట్లు ఎగసి 43,638 వద్ద నిలిచింది. నిఫ్టీ 60 పాయింట్లు పుంజుకుని 12,780 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,831 వద్ద, నిఫ్టీ 12,829 వద్ద సరికొత్త గరిష్టాలకు చేరాయి. వెరసి సాయంత్రం 6.15-7.15 మధ్య నిర్వహించిన మూరత్ ట్రేడింగ్లో మార్కెట్లు మరోసారి సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. రోజంతా మార్కెట్లు లాభాల మధ్యే కదలడం విశేషం! మార్కెట్లకు ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ఆర్థిక రికవరీపై ఆశలు, కోవిడ్-19 కట్టడికి వెలువడనున్న వ్యాక్సిన్లపై అంచనాలు బలాన్నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. దివాలీ బలిప్రతిపద నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. చదవండి: (కొనసాగుతున్న రూపాయి పతనం) బీపీసీల్ భళా ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ 0.5-0.2 శాతం మధ్య లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్ 5.2 శాతం జంప్ చేయగా.. ఐవోసీ, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, గెయిల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ 3-1 శాతం మధ్య వృద్ధి చూపాయి. అయితే హిందాల్కో, హీరో మోటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, శ్రీ సిమెంట్, టైటన్, యాక్సిస్, పవర్గ్రిడ్, ఇండస్ఇండ్ 1.2-0.35 శాతం మధ్య బలహీనపడ్డాయి. చదవండి: (సంవత్ 2076కు లాభాల వీడ్కోలు) ఐడియా జోరు డెరివేటివ్స్లో ఐడియా 6.3 శాతం జంప్చేయగా.. కంకార్, హెచ్పీసీఎల్, ఐడీఎఫ్సీ ఫస్ట్, ఎన్ఎండీసీ, భెల్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 5.2-1.4 శాతం మధ్య ఎగశాయి. హిందాల్కో, పిరమల్, శ్రీరామ్ ట్రాన్స్, జీఎంఆర్, ఆర్ఈసీ, అరబిందో, డీఎల్ఎఫ్, పీవీఆర్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 1 శాతం స్థాయిలో క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6-0.8 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,842 లాభపడగా.. 606 నష్టాలతో ముగిశాయి. ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,936 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,462 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 1514 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్ రూ. 2,239 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
నేడు మళ్లీ మార్కెట్ల వీక్ ఓపెనింగ్?!
ముంబై: నేడు (13న) దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 37 పాయింట్లు క్షీణించి 12,667 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ నవంబర్ ఫ్యూచర్స్ 12,704 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. రోజుకి లక్ష దాటుతున్న కరోనా కేసులు, ప్యాకేజీపై అనిశ్చితి నేపథ్యంలో గురువారం యూఎస్ మార్కెట్లు 1 శాతం నష్టాలతో ముగిశాయి. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు నీరసంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా నేడు మరోసారి మార్కెట్లు బలహీనంగా కదిలే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి:(సూపర్ ర్యాలీకి బ్రేక్- బ్యాంక్స్ బోర్లా) సూపర్ ర్యాలీకి బ్రేక్ చిట్టచివరికి గురువారం 8 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్ల సూపర్ ర్యాలీకి బ్రేక్ పడింది. సెన్సెక్స్ 236 పాయింట్లు క్షీణించి 43,357 వద్ద ముగిసింది. నిఫ్టీ 58 పాయింట్లు క్షీణించి 12,691 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,544 పాయింట్ల వద్ద గరిష్టానికి చేరగా.. 43,128 దిగువన కనిష్టాన్నీ తాకింది. నిఫ్టీ సైతం 12,741- 12,625 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 12,630 పాయింట్ల వద్ద, తదుపరి 12,569 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 12,746 పాయింట్ల వద్ద, ఆపై 12,802 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 28,006 పాయింట్ల వద్ద, తదుపరి 27,732 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 28,612 పాయింట్ల వద్ద, తదుపరి 28,946 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు. ఎఫ్పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1514 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,239 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 6,207 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 3,464 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే.