friendship
-
సల్మాన్కు దగ్గరైనందుకే సిద్ధిఖీ హత్య?
ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని ముంబైలో శనివారం రాత్రి ముగ్గురు నిందితులు కాల్చి చంపారు. ఈ హత్య పలు సందేహాలకు తావిస్తోంది. బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్కు దగ్గరైనందుకే బాబా సిద్ధిఖీని హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులు తాము బిష్ణోయ్ గ్యాంగ్కు చెందినవారిమని పోలీసులకు చెప్పారని సమాచారం. ఈ షూటర్లలో ఒకరి పేరు కర్నైల్ సింగ్, ఇతను హర్యానా నివాసి. రెండో షూటర్ ధరమ్రాజ్ కశ్యప్.. ఇతను యూపీకి చెందినవాడు. వీరు గత కొంతకాలంగా బాబా సిద్ధిఖీ ఇంటికి రెక్కీ చేశారని పోలీసుల విచారణలో తేలింది.గత కొన్నేళ్లుగా నటుడు సల్మాన్ ఖాన్ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వెంబడిస్తోంది. లారెన్స్ గ్యాంగ్ షూటర్లు సల్మాన్ ఖాన్ను రెండుసార్లు రెక్కీ చేశారు. మొదటిసారి రెడీ సినిమా షూటింగ్లో ఉండగా, రెండోసారి పన్వేల్లోని సల్మాన్ ఫామ్హౌస్కి వెళ్లి రెక్కీ చేశారు. ఆ తరువాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముంబైలోని సల్మాన్ ఉంటున్న లాక్సీ అపార్ట్మెంట్పై కాల్పులు జరిపారు. అమెరికాలో ఉంటున్న లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ ఈ ముఠాను నిర్వహిస్తున్నాడని సమాచారం. సల్మాన్ ఇంట్లో జరిగిన కాల్పుల కేసులో ప్రధాన సూత్రధారి అంటూ గతంలొ అన్మోల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన ముష్కరులతో అన్మోల్ సిగ్నల్ యాప్ ద్వారా మాట్లాడాడు. వారికి ఆదేశాలు ఇచ్చాడని తేలింది.ఇదిలావుండగా లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు రోహిత్ గోద్రా ఇటీవల మీడియాతో.. సల్మాన్ ఖాన్కు స్నేహితుడైనవాడు తమకు శత్రువు అని వ్యాఖ్యానించాడు. బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న బాబా సిద్ధిఖీకి సల్మాన్ ఖాన్తో మంచి స్నేహం ఉంది. దీనికి తోడు బాలీవుడ్ హీరోలు సల్మాన్- షారుక్ ఖాన్ మధ్య స్నేహాన్ని కుదర్చడంలో సిద్ధిఖీ కీలకపాత్ర పోషించాడని చెబుతారు. మొత్తంగా చూస్తే సల్మాన్తో దోస్తీ కారణంగానే బాబా సిద్ధిఖీ.. లారెన్స్ బిష్ణోయ్కి శత్రువయ్యాడని, ఈ నేపధ్యంలోనే అతనిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: మాజీ మంత్రి సిద్ధిఖీ హత్య వెనుక బిష్ణోయ్ గ్యాంగ్ -
పుతిన్తో ట్రంప్ రహస్య స్నేహం.. పదవి నుంచి దిగిపోయాక ఆరుసార్లు ఫోన్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రష్యా అధినేత పుతిన్ కోసం కోవిడ్–19 టెస్టింగ్ కిట్లు రహస్యంగా అందజేశారా? పుతిన్ వీటిని వ్యక్తిగతంగా వాడుకున్నారా? పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా పుతిన్తో ట్రంప్ రహస్యంగా స్నేహ సంబంధాలు కొనసాగించారా? అవుననే చెబుతోంది ఓ పుస్తకం. వాటర్గేట్ కుంభకోణంపై వార్తలు రాసిన విలేకరి బాబ్ వుడ్వర్డ్ రచించిన ‘వార్’అనే పుస్తకంలో ఈ సంచలన విషయాలు ప్రస్తావించారు. ఈ పుస్తకం ఈ నెల 15న విడుదల కానుంది. ఇందులోని కొన్ని ముఖ్య అంశాలను అమెరికా పత్రికలు బయటపెట్టాయి. ట్రంప్ 2021లో అధికారం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ట్రంప్, పుతిన్ కనీసం ఆరుసార్లు ఫోన్లో సీక్రెట్గా మాట్లాడుకున్నారని ట్రంప్ సహాయకుడు చెప్పినట్లు పుస్తకాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం మొత్తం అమెరికాలో సంచలనాత్మకంగా మారింది. ఇదిలా ఉండగా, వార్ పుస్తకంలోని అంశాలను ట్రంప్ ప్రచార బృందం ఖండించింది. అదొక చెత్త పుస్తకం, అందులోని కాగితాలు టాయిలెట్ టిష్యూగా వాడుకోవడానికి పనికొస్తాయని ఎద్దేవా చేసింది. ట్రంప్ సైతం స్పందించారు. కథలు చెప్పడంతో దిట్ట అయిన బాబ్ వుడ్వర్డ్ చెప్పే పనికిమాలిన విషయాలు నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. అతడొక చెడ్డవ్యక్తి అని విమర్శించారు. తాజా వివాదంపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ కూడా స్పందించింది. ‘వార్’పుస్తకంలో ప్రస్తావించిన వాటిలో ఏమాత్రం వాస్తవం లేవని, అవన్నీ అభూత కల్పనలు అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తేలి్చచెప్పారు. -
స్నేహమే నన్ను ఈ స్థాయిలో నిలిపింది
సాక్షి, హైదరాబాద్: మంచి స్నేహితుల సాన్నిహిత్యం దొరికితే జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఛేదించవచ్చని.. జీవితాన్ని ఉత్తమంగా ఆస్వాదించవచ్చని చెప్పారు డీజీపీ జితేందర్. తాను ఈ స్థాయికి ఎదగడంలో తన స్నేహితుల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయని గుర్తు చేసుకున్నారాయన. 36 ఏళ్ల తమ స్నేహ జీవితంలో ఎన్నో సందర్భాలు చూశామని, ఆ మధురస్మృతులను స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు డీజీపీ జితేందర్... ఆ విషయాలు ఆయన మాటల్లోనే... ‘‘నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు. ఒకరు ప్రస్తుతం జార్ఖండ్లో ఐఏఎస్గా పనిచేస్తున్న డా.ఏపీ సింగ్, మరొకరు కేంద్ర ప్రభుత్వ సైంటిస్ట్గా పనిచేస్తున్న డా.రాజీవ్ వర్‡్షనై. మేం ముగ్గురం ఢిల్లీ జేఎన్యూలో స్కూల్ లైఫ్ సైన్స్లో ఎంఫిల్ చేశాం. ఐదేళ్లపాటు ఒకే దగ్గర కలిసి ఉన్నాం.. మా జీవితాలను మలుపు తిప్పింది ఆ ఐదేళ్లే. యూపీఎస్సీకి బీజం పడింది అక్కడే.. నేను ఈ రోజు డీజీపీగా ఉన్నానంటే అందుకు ఆ స్నేహమే కారణం. నేను ఐపీఎస్, ఏపీ సింగ్ ఐఏఎస్, రాజీవ్ సైంటిస్ట్లుగా కెరీర్ మలచుకున్నాం. 36 ఏళ్లుగా మా స్నేహం కొనసాగుతూనే ఉంది.. నా ప్రతి కష్టంలో, సంతోషంలో ప్రాణ మిత్రులిద్దరూ నాతో ఉన్నారు. మేం ఎప్పుడు కలిసినా కుటుంబాలతో సహా కలుస్తాం. ప్రతి రెండు, మూడేళ్లకు ఒకసారి తప్పకుండా మా ఫ్యామిలీస్ గెట్ టు గెదర్ ఉంటుంది. స్నేహం గురించి చెప్పాలంటే ఏదో ఆశించి చేసే స్నేహం ఎప్పటికీ నిలవదు. ఫ్రెండ్షిప్ అనేది ఒక ఎమోషనల్ ఫీలింగ్..ఒక సెక్యూరిటీ..మంచి స్నేహితులున్న వారు జీవితంలో ఉన్నతంగా ఉంటారు. ఉత్తమ జీవితం గడుపుతారు. అందుకు నేను ఉదాహరణ. ప్రతి ఒక్కరి జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ చాలా ముఖ్యం. మంచి స్నేహితుడు ఉంటే ఏ ఒత్తిడీ మన దరి చేర దు. అందుకే యువతకు నేను చెప్పేది ఒక్కటే. మంచి స్నేహితులను సంపాదించుకోండి.. జీవితాన్ని ఫలవంతంగా..ఆనందంగా గడపండి’’అని డీజీపీ జితేందర్ తెలిపారు. -
‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ఏంటి? ఫిజికల్ రిలేషన్ షిప్కు ఎందుకు తావులేదు?
వివాహం అంటే రెండు ఆత్మల కలయిక అని చెబుతుంటారు. వివాహానికి ఇచ్చే వివరణల్లో కాలనుగుణంగా అనేక మార్పులు వచ్చాయి. లివ్ ఇన్ రిలేషన్ షిప్ కూడా ఇలాంటివాటిలో ఒకటి. దీనిలో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ భార్యాభర్తలుగానే కలసి జీవిస్తుంటారు.ఇప్పుడు పెళ్లి విషయంలో మరో కొత్త ప్రయోగం జరుగుతోంది. ఇది జపాన్లో ప్రారంభమయ్యింది. అక్కడి యువతలో ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది వివాహాల్లో మరో నూతన విధానం. ఇందులో యువతీయువకులు భాగస్వాములుగా మారుతారు. అయితే ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’లో ప్రేమ లేదా శారీరక సంబంధానికి అవకాశం ఉండదు. జపాన్లోని మొత్తం జనాభాలో ఒక శాతం మంది ఈ రకమైన వివాహాన్ని ఇష్టపడుతున్నారు.‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’లో చట్టబద్ధంగా వివాహం చేసుకుంటారు. కానీ ఫిజికల్ రిలేషన్ షిప్కి అవకాశం ఉండదు. అయితే కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలను కనేందుకు అవకాశం ఉంటుంది. ఇటువంటి వివాహంలో ఇద్దరు భాగస్వాములూ విడివిడిగా వారికి నచ్చిన మరో మరొక భాగస్వామితో సంబంధం పెట్టుకునే స్వేచ్ఛను పొందుతారు. ఇలాంటి వివాహం చేసుకున్న ఒక జంట మీడియాతో మాట్లాడుతూ ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’అంటే మనకు నచ్చిన రూమ్మేట్ని ఎంచుకోవడం లాంటిదని అన్నారు. ఈ విధంగా ఒకచోటు చేరిన భాగస్వాములు ఇంటి ఖర్చులను, ఇతర ఖర్చులను సమానంగా పంచుకుంటారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం 32 ఏళ్లుదాటిన యువతీ యువకులు ఇటువంటి వివాహలపై మక్కువ చూపిస్తున్నారు. పెళ్లయిన తర్వాత కూడా స్వేచ్ఛగా ఉండాలనుకునే వారు ఇటువంటి ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’కు ప్రాధాన్యతనిస్తున్నారు. 2015 మార్చి తరువాత నుండి జపాన్లో వంద మందికి పైగా యువతీ యువకులు ఈ విధమైన వివాహం చేసుకున్నారని సమాచారం. -
‘భారత్ ప్రయోజనాలను రష్యా ఎప్పుడూ దెబ్బతీయదు’
న్యూఢిల్లీ: భారత్-రష్యా మధ్య సంబంధాలు చాలా స్థిరంగా, స్నేహపూర్వకంగా ఉంటాయని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. భారత ప్రయోజనాలను రష్యా ఎప్పుడూ దెబ్బతీయదని స్పష్టం చేశారు. జర్మనీకి చెందిన వార్త పత్రికతో కేంద్రమంత్రి జైశంకర్ మాట్లాడారు. ఉక్రెయిన్లో రష్యా యుద్ధాన్ని ముగించాలని పశ్చిమ దేశాలు ఒత్తిడి చేస్తున్న వేళ ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను జైశంకర్ మరోసారి గుర్తు చేశారు. ‘పూర్వపు అనుభావాలతోనే ప్రతి ఒక్కరూ మంచి స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తారు. నాకు తెలిసినవరకు భారత దేశానికి స్వాతంత్రం రాక ముందు నుంచి భారత్-రష్యా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా భారత్-రష్యా ఇరు దేశాలు కూడా ప్రయోజనాలు దెబ్బతీసేలా వ్యవహరించలేదు. ఇరు దేశాల మధ్య స్థిరమైన, చాలా స్నేహిపూరిత సంబంధాలు ఉన్నాయి. ఈ అనుభావాల రీత్యా మాస్కోతో భారత్ స్నేహబంధం బలంగా ఉంది’ అని విదేశాంగ మంత్రి జై.శంకర్ పేర్కొన్నారు. రష్యా వద్ద భారత్ ముడి చమురు కొనుగోలు విషయంపై కేంద్రమంత్రి జైశంకర్ స్పందించారు. ‘రష్యా నుంచి ముడి చమురరు కొనగోలు చేయకుండా ప్రతి ఒక్కరూ.. ఇతర దేశాల మీద ఆధారపడితే.. ఇతర దేశాల్లో చమురుపై డిమాండ్ అధికమై ధరలు పెరిగేవి’అని తెలిపారు. ఉక్రెయిన్పై ఫిబ్రవరి, 2022 నుంచి రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యా ముడి చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. భారత్ మాత్రం రష్యా వద్ద చమురు కొనుగోళ్లు ఆపకపోవటం గమనార్హం. ఇక.. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా విషయంలో భారత్ జోక్యం చేసుకుంటే రష్యా యుద్ధాన్ని ఆపే అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. చదవండి: మహారాష్ట్ర: మరాఠా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం -
పాక్, ఇరాన్ దోస్తీ ఎందుకు చెడింది? భారత్కు ఏం దక్కింది?
పాకిస్తాన్, ఇరాన్లు స్నేహపూర్వక సంబంధాలు కలిగిన దేశాలు. ఈ రెండూ ముస్లిం దేశాలు కావడంతో ఈ సంబంధం మరింత బలపడింది. 1965, 71లో భారత్-పాక్ యుద్ధ సమయంలో ఇరాన్.. పాకిస్తాన్కు పూర్తి సాయం అందించింది. పలు అంతర్జాతీయ ఫోరమ్లలో కూడా, ఇరాన్.. భారత్ను వ్యతిరేకించి, పాకిస్తాన్కు మద్దతునిచ్చింది. ఇప్పుడు ఈ రెండు దేశాలు బద్ధ శత్రువులుగా మారడానికి కారణం ఏమిటి? పాకిస్తాన్పై ఇరాన్ వైమానిక దాడి నేపధ్యంలో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడటానికి కారణమేమిటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అదే సమయంలో పాకిస్తాన్కు మిత్రదేశంగా ఉన్న ఇరాన్.. భారత్తో ఎందుకు సన్నిహితంగా మెలగడం ప్రారంభించింది? 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం జరిగినప్పుడు పాకిస్తాన్, ఇరాన్ల మధ్య స్నేహంలో చీలిక ఏర్పడింది. దీని తరువాత ఆఫ్ఘన్ జిహాద్ సమయంలో పాకిస్తాన్ సౌదీ ప్రేరణతో వహాబీ ఇస్లాం వైపు మొగ్గు చూపింది. ఇక్కడి నుంచే ఇరు దేశాల మధ్య అపార్థాలు పెరగడం మొదలైంది. పాకిస్తాన్ జనాభాలో అధికశాతంలో సున్నీ ముస్లింలు ఉన్నారు. ఇరాన్లో షియా ముస్లింల సంఖ్య అధికంగా ఉంది. షియా.. సున్నీ గ్రూపులు రెండూ ముస్లిం మతానికే చెందినవైనప్పటికీ వారి నమ్మకాలు, సిద్ధాంతాలలో తేడా ఉంది. సాధారణంగా సున్నీలను ఫండమెంటలిస్టులుగా పరిగణిస్తారు. షియా ముస్లింలను మితవాదులని అంటారు. కొన్ని శతాబ్దాల క్రితం ఇస్లాం స్థాపకుడు ప్రవక్త మహమ్మద్ను షియా ముస్లింలు హత్య చేసిన దరిమిలా షియా.. సున్నీ ముస్లింల మధ్య వివాదం మొదలైంది. విభజన సమయంలో.. 1947 ఆగస్టు 14న భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయినప్పుడు, పాకిస్తాన్ను ఒక దేశంగా గుర్తించిన మొదటి దేశం ఇరాన్. ఈ రెండు దేశాలు భౌగోళికంగా దగ్గరి అనుసంధానంతో 990 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. 1947 తరువాత ఇరాన్, పాకిస్తాన్ మధ్య పలు స్నేహపూర్వక ఒప్పందాలు కుదిరాయి. ఇరాన్లో పాకిస్తాన్ తన తొలి రాయబార కార్యాలయాన్ని కూడా ప్రారంభించింది. భారత్- పాక్ యుద్ధ సమయంలో.. 1965లో భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇరాన్ అనేక బాంబర్ ఎయిర్క్రాఫ్ట్లు, యుద్ధ సామగ్రిని పాకిస్తాన్కు అందించింది. ఈ ఉదంతాన్ని చూస్తే పాకిస్తాన్, ఇరాన్ మధ్య స్నేహాన్ని అంచనా వేయవచ్చు. అదేవిధంగా 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో ఇరాన్.. పాకిస్తాన్కు పూర్తిస్థాయిలో దౌత్య, సైనిక మద్దతు ఇచ్చింది. అంతే కాదు బలూచ్లు పాకిస్తాన్పై తిరుగుబాటును ప్రారంభించినప్పుడు, బలూచ్ల నిరసనను అణచివేయడంలో ఇరాన్.. పాకిస్తాన్కు సహాయం చేసింది. ప్రతిఫలంగా పాకిస్తాన్ అణు శాస్త్రవేత్తలు ఇరాన్లో అణు కార్యక్రమాలను అభివృద్ధి చేయడంలో సహకరించారు. షియా, సున్నీల అంతర్గత పోరు 1990వ దశకంలో పాకిస్తాన్లో షియా, సున్నీల మధ్య అంతర్గత పోరు ఊపందుకున్నప్పుడు, ఇరాన్ షియాలను రెచ్చగొడుతోందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మొదలైంది. దీనికితోడు లాహోర్లో ఇరాన్ దౌత్యవేత్త సాదిక్ గంజి హత్య, 1990లో పాకిస్తాన్-ఇరానియన్ ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లను దారుణంగా హతమార్చడం వంటివి ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని మరింత పెంచాయి. ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్, ఇరాన్ల వైరుధ్య విధానాలు కూడా ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వానికి కారణంగా నిలిచాయి. పాకిస్తాన్ నిరంతరం తాలిబాన్కు మద్దతు పలుకుతుంటుంది. ఈ నేపధ్యంలో ఇరాన్.. పాకిస్తాన్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 2014లో ఐదుగురు ఇరాన్ సైనికులను పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఉల్-అద్ల్ కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత ఇరాన్.. పాక్పై సైనిక చర్యలు చేపడతామని హెచ్చరించింది. ఉద్రిక్తంగా పాక్- ఇరాన్ సంబంధం నిపుణుల అభిప్రాయం ప్రకారం 2021 నుండి పాకిస్తాన్-ఇరాన్ సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఇరు దేశాలు పలు ఒప్పందాలు, సంయుక్త సైనిక విన్యాసాలపై సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక వాణిజ్యం కూడా పెరగడం ప్రారంభమైంది. దీనికితోడు ఈ రెండు దేశాలు విద్యుత్ పంపిణీ లైన్ను ప్రారంభించాయి. 2023లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇరాన్లో పర్యటించారు. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులపై పట్టు బిగించలేకపోయింది. అయితే ఇటీవల ఇరాన్లో జరిగిన ఉగ్రదాడిలో పాక్ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో పాకిస్తాన్పై ఇరాన్ ఆకస్మిక దాడి చేసింది. దీంతో పాకిస్తాన్-ఇరాన్ సంబంధాలు తిరిగి ఉద్రిక్తంగా మారాయి. బలపడిన భారత్- ఇరాన్ బంధం పాకిస్తాన్, ఇరాన్ మధ్య సంబంధాలు క్షీణించిన తరువాత, భారత్, ఇరాన్ మధ్య సంబంధాలు కొత్త మలుపు తిరిగాయి. 2001లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఇరాన్లో పర్యటించి, పలు కీలక ఒప్పందాలు చేసుకున్న దరిమిలా భారత్-ఇరాన్ సంబంధాలు మరింత బలపడ్డాయి. అటల్ తరహాలోనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా 2016లో ఇరాన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో 12కి పైగా కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆ తర్వాత 2018లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ భారత్కు వచ్చారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలో ధృడత్వం ఏర్పడింది. 2022 సంవత్సరంలో మొదటిసారిగా సమర్కండ్లో ప్రధాని మోదీ..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కలుసుకున్నప్పుడు భారత్-ఇరాన్ సంబంధాల బలోపేతాన్ని అన్ని దేశాలు చూశాయి. -
పాక్కు చైనా అందిస్తున్న ఆయుధ సహకారమెంత?
చైనా, పాకిస్తాన్ నౌకాదళాలు తొలిసారి సంయుక్త నావికా విన్యాసాన్ని నిర్వహించబోతున్నాయి. ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఈ కసరత్తుపై పాక్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాగా పాకిస్తాన్ తన మిత్రదేశం చైనాను హాంగౌర్ క్లాస్ జలాంతర్గామి కావాలని కోరింది. ఈ రెండు దేశాలు దీనిని నిర్మించే ప్రయత్నంలో ఉన్నాయి. పాకిస్తాన్ తన ఆయుధ అవసరాలను తీర్చుకునేందుకు చైనాపైననే అధికంగా ఆధారపడుతోంది. యునైటెడ్ స్టేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్- 2023 నివేదిక ప్రకారం 80వ దశకంలో ఆఫ్ఘన్ జిహాద్ను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ అమెరికా నుండి పెద్ద మొత్తంలో ఆయుధాలను కొనుగోలు చేసేది. అయితే 2005 నుండి 2015 వరకు పాకిస్తాన్.. చైనా నుండి అత్యధిక ఆయుధాలను కొనుగోలు చేసిందని ఆ నివేదిక వెల్లడించింది. గత 15 ఏళ్లలో పాకిస్తాన్కు చైనా 8,469 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అందించింది. అంతకుముందు గత 50 ఏళ్లలో, చైనా.. పాకిస్తాన్కు 8794 మిలియన్ డాలర్ల (ఒక మిటియన్ అంటే రూ. 10 లక్షలు) విలువైన ఆయుధాలను అందించింది. ఇంతేకాకుండా పాకిస్తాన్ సైన్యం అమెరికా, రష్యా నుండి కూడా గరిష్ట సంఖ్యలో ఆయుధాలను కొనుగోలు చేస్తుంటుంది. 2015 నుండి పాకిస్తాన్ ఆయుధ అవసరాలలో 75 శాతం చైనా తీరుస్తుంది. 2021లో పాకిస్తాన్.. చైనా నుండి హై-టు-మీడియం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎయిర్ మిసైల్ను కొనుగోలు చేసింది. పాకిస్తాన్ ఆర్మీలో చైనా ఫిరంగి, రాకెట్ లాంచర్లను ఉపయోగిస్తున్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్తో కలసి నావికా విన్యాసాలు చేపట్టనున్న సందర్భంగా చైనా తన ఆరు నౌకలను అరేబియా సముద్రంలో దించనుంది. ఈ నౌకల్లో గైడెడ్ మిస్సైల్ జిబో, గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ జింగ్జౌ, లిని ఉన్నాయి. ఇది కాకుండా రెండు షిప్బోర్న్ హెలికాప్టర్లలో నావికాదళ సిబ్బంది విన్యానాల్లో పాల్గొననున్నారు. అలాగే చైనా టైప్-093 సాంగ్ కేటగిరీకి చెందిన డీజిల్-ఎలక్ట్రిక్ సబ్మెరైన్ను కూడా మోహరించినుంది. పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ తెలిపిన వివరాల ప్రకారం సీ గార్డియన్- 2023 నావికా విన్యాసాల ఉద్దేశ్యం ఇరు దేశాల నౌకాదళాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నెలకొల్పడం. ఇది కూడా చదవండి: కొత్త రూపంలో కోవిడ్-19.. భారత్కూ తప్పని ముప్పు? -
అలాంటి వాళ్లతో స్నేహం, విరోధం రెండూ వద్దు
దుర్మార్గులతో స్నేహం చేయకూడదు. వాళ్ళతో విరోధం కూడా కూడదు. వారిని పట్టించుకోకుండా ఉండడమే మేలు. నిప్పును పట్టుకుంటే కాలుతుంది. చల్లారిన తర్వాత పట్టుకున్నా మసి అవుతుంది. కనుక దాని జోలికి పోకపోవడమే మేలు. విలువలేని దుమ్ము కూడా ఒక్కోసారి నీ కంట్లో పడి విలవిలలాడేలా చేస్తుంది. విలువ లేని కొందరు మనుషులు కూడా చాలాసార్లు తమ మాటలతో బాధపెడతారు. ఊదేసుకుని ముందుకు వెళ్ళడమే ఉత్తముల లక్షణం. నమ్మకం అనేది గాజు పాత్ర లాంటిది. గాజు పాత్ర ఒక్కసారి చేతి నుండి కింద పడితే దాన్ని అతికించడం ఎలా అసాధ్యమో, ఒకసారి మనం ఒక వ్యక్తి దగ్గర నమ్మకాన్ని కోల్పోతే మళ్ళీ తిరిగి ఆ నమ్మకాన్ని సంపాదించడం అలా అసాధ్యం... అసంభవం. కాబట్టి కలుషితమైన ఈ రోజుల్లో కల్మషం లేకుండా నిన్ను ఎవరైనా నమ్మితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం నీ ప్రాణాన్ని అయినా పణంగా పెట్టు తప్పులేదు కానీ నమ్మకాన్ని కోల్పోకు... -
సత్సాంగత్యం
ఏమీ చదువుకోక పోయినా, విద్యాగంధం ఏ మాత్రం లేక పోయినా కొంత మంది మాటలు పండితులకే ఆశ్చర్యం కలిగిస్తాయి. వారు ఉంటున్న, లేదా పని చేస్తున్న ప్రదేశంలో ఉన్న వాతావరణం ప్రభావం అది. అందరు వైద్యులే ఉన్న కుటుంబంలో ఉన్న పిల్లలు అప్రయత్నంగా వైద్య పరిభాషని ఉపయోగించటం, సంగీత విద్వాంసుల కుటుంబంలో వారి పిల్లలు రాగాలని గుర్తు పట్టటం వంటివి మనం చూస్తూనే ఉంటాం కదా! అదంతా సాంగత్య ప్రభావం. ఒక వ్యక్తి నిత్యం ఎవరితో ఎక్కువగా కలిసి ఉంటే వారి ప్రభావం వల్ల కొన్ని లక్షణాలు సంక్రమిస్తాయి. మంచివారితో కలిసి ఉంటే సహజంగా దురాలోచన ఉన్న వ్యక్తి అయినా కొంత వరకు చెడు ప్రవర్తనకు దూరంగా ఉండటం జరుగుతుంది. దుర్మార్గుల సాహచర్యంలో ఉంటే చెడ్డపనులు చేయక పోయినా ఆమోదించటం, అనుమోదించటం జరుగుతుంది. కనుకనే ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నాము... అన్న దానిని గమనించుకుంటూ ఉండాలి. కొన్ని ప్రభావాలు తాత్కాలికం. మందారపువ్వు పక్కన ఉన్న గాజుపట్టకం లాగా. పువ్వుని అక్కడి నుండి తీసేయగానే అప్పటి వరకు ఎర్రగా కనపడిన గాజుపట్టకం తన సహజ వర్ణానికి వచ్చేస్తుంది. కొన్నిటిని తప్పించుకోవటం కష్టం. మరికొన్నిటి ప్రభావం శాశ్వతం. స్వభావంలో జీర్ణించుకుపోతాయి. శక్తివంతమైన చెడు ప్రభావాల నుండి తప్పించుకోవటానికి మార్గం దూరంగ ఉండటమే. ‘‘దుష్టుడికి దూరంగా ఉండ’’ మని పెద్దలు చెప్పిన మాట ఇందుకోసమే. మరి కొన్నిటి ప్రభావం ఆ పట్టకం పైన రంగులని పూసినట్టు. గట్టిగా తుడిచినా, నీళ్ళతో కడిగినా సహజ స్థితికి వస్తుంది. అదే, పట్టకం తయారు అయే సమయంలో ద్రవస్థితిలో ఉండగానే ఏదైనా రంగు కలిపితే అది శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే మంచివారి సాంగత్యంలో ఎంత వీలైతే అంత ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం చేయాలి. స్వభావసిద్ధంగా దుర్బుద్ధి అయిన ధృతరాష్ట్రుడు ఉత్తమ గతులు పొందటానికి కారణం ఎంతో సమయం విదురుడి సమక్షంలో గడపటమే. మనసు బాగుండనప్పుడు విదురుడిని పిలిపించుకొని అతడి సమక్షంలో కాలం గడిపే వాడు. శాశ్వతంగా కాక పోయినా విదురుడు మాట్లాడినంత సమయం ధృతరాష్ట్రుడు సదాలోచనాలతోనే ఉన్నాడు. కనీసం దురాలోచనలు చేయకుండా ఉన్నాడు కదా! పూలు మాల కట్టిన దారానికి ఆ పూల పరిమళం అంటుకు పోతుంది. ఒకరి ప్రభావం మరొకరి మీద ఉండటం ఎట్లా కుదురుతుంది? అనే దానికి సాన్నిధ్యం లో ఉండటమే కారణం అన్నది సమాధానం. ఇనుము అయస్కాంత సన్నిధిలో కొంతకాలం ఉండగా ఉండగా దాని లక్షణాలు ఇనుముకి రావటం చూస్తున్నాముగా! ఆయుధాన్ని దగ్గర ఉంచుకున్న మునిలో హింసాప్రవృత్తి క్రమంగా పెంపొందిన ఇతివృత్తాన్ని సీత రాముడికి చెప్పింది. అదే విధంగా బోయల మధ్య పెరిగిన ప్రచేతసుడనే ముని కుమారుడు బోయవాడుగా మారటం మనకి తెలుసు. ఇది పైకి కనిపించే అర్థం. అసలు అర్థం మరొకటి ఉన్నదని పెద్దలు చెపుతూ ఉంటారు. ‘సత్’ అంటే ఉన్నది, సత్యము అని కూడా అర్థాలున్నాయి. ‘సత్’ అంటే భగవత్తత్త్వం. ఆ సత్ (వేదాంతులు సత్తు అని అంటూ ఉంటారు) తో సాహచర్యం చేస్తూ ఉండటం. అంటే నిరంతరం దైవచింతనలో ఉండటం. అట్లా కుదురుతుందా? అంటే అందరినీ దైవస్వరూపులుగా భావిస్తే అదెంత పని? ‘సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల తత్త్వం, నిశ్చల తత్త్వే జీవన్ముక్తిః’ అన్నారు ఆది శంకరులు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా మంది పాల్గొంటారు. వీరిలో ఒకరికైనా సద్బుద్ధి కలిగిందని చెప్పగలరా? అంటూ విమర్శిస్తూ ఉంటారు కొందరు. వారికి సద్బుద్ధి కలిగిందో లేదో మనకి అనవసరం. కాని, ఆ కార్యక్రమంలో ఉన్నంత కాలం దురాలోచనలు లేక ఉంటారు. అది గొప్ప ప్రయోజనమే కదా! తరువాత అది నెమ్మది గా మిగిలిన సమయాలకి కూడా విస్తరించే అవకాశం ఉంది. పూలు మాల కట్టిన దారం పువ్వుగా మారక పోవచ్చు కాని పూలవాసనని మాత్రం సంతరించుకుంటుంది. – డా. ఎన్.అనంతలక్ష్మి -
కోలీవుడ్ను నమ్మి క్లీన్ బోల్డ్ అయిన 5 మంది స్టార్ క్రికెట్ ఆటగాళ్లు
కొందరు భారత్ ప్రముఖ క్రికెటర్లు సినిమా రంగంలో రానించాలనే కోరికతో తమిళ చిత్రసీమలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని కలలు కంటూ.. తొలి సినిమాతోనే క్లీన్ బౌల్డ్ కావడమే కాకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చినంత వేగంగానే చెన్నై వదిలి వెళ్లిపోయారు. అలాంటి ఐదుగురు సెలబ్రిటీల గురించి చూద్దాం. భారత్లో క్రికెట్కు అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో క్రికెటర్లకు ఉన్న ప్రాధాన్యతను తెలుసుకుని కొందరు క్రికెటర్లు తమిళ చిత్రసీమలోకి హీరోలుగా అడుగుపెట్టినా.. విజయావకాశాలను అందిపుచ్చుకోలేకపోయారు. (ఇదీ చదవండి: లారెన్స్ తన కూతురిని దాస్తున్నాడా? ఆయనకు అంత పెద్ద కూతురు ఉందా?) తమిళ సినీ పరిశ్రమలో కనిపించిన ఐదుగురు క్రికెట్ సెలబ్రిటీలకు కొంతమేరకు నష్టం తెచ్చింది. కానీ అందరికంటే భారత మాజీ కెప్టెన్ ధోనీనే ఎక్కువగా నష్టపోయాడని చెప్పవచ్చు. మరోవైపు సినిమాల్లో నటించి సక్సెస్ కాకపోవడంతో ఆ క్రికెటర్లకు అవకాశాలు రాలేదు. కొన్ని నెలల క్రితం విడుదలైన ఎల్జీఎం అనే చిత్రాన్ని క్రికెటర్ ధోనీ నిర్మించాడు. ఎనిమిది కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్ హీరోగా నటించగా ఇవానా హీరోయిన్గా నటించింది. నదియా, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ సమీక్షలను అందుకుంది. అలాగే, ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని OTTకి విక్రయించడానికి ధోని కష్టపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అదే విధంగా ఈ సినిమా వల్ల ధోని సంస్థ నష్టపోయింది. మొదటి ప్రొడక్షన్ LGM ఫ్లాప్ కావడంతో, ధోని తన తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తాడా? అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. నటులుగా అరంగేట్రం చేసిన క్రికెట్ దిగ్గజాలు ఈ జాబితాలో క్రికెటర్ సదాగోపన్ రమేష్ మొదటి స్థానంలో ఉన్నాడు. 1999 సెప్టెంబరులో అతను వన్డే క్రికెట్లో మొదటి బంతికే వికెట్ తీసిన తొలి భారతీయ క్రికెటర్గా గుర్తింపు పొందాడు. కానీ ఆయన కేవలం 19 టెస్ట్ మ్యాచ్లతో పాటు 24 వన్డేలు మాత్రమే ఆడారు. 2011లో దర్శకుడు యువరాజ్ దయాళన్ దర్శకత్వంలో 'బొట్ట బొట్టి' తమిళ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం ఒక చిన్న గ్రామంలో క్రికెట్ మ్యాచ్ చుట్టూ కేంద్రీకృతమై, హాస్య కథాంశం ఆధారంగా రూపొందించబడింది. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆదిలోనే సినీ పరిశ్రమకు దూరమయ్యాడు. అతని తర్వాత నటుడు హర్భజన్ సింగ్ ఇటీవలే 'ఫ్రెండ్షిప్' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అదే విధంగా, ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా కోలీవుడ్లో నటించాడు. చియాన్ విక్రమ్ నటించిన 'కోబ్రా' చిత్రంలో పోలీసు అధికారి పాత్రను పోషించాడు. సినిమాలో అతని పాత్ర ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ 'కోబ్రా' సినిమా ఘోర పరాజయం అయింది. దీంతో ఇర్ఫాన్ పఠాన్ కూడా సినిమాల నుంచి కనిపించకుండా పోయాడు. అతని తర్వాత క్రికెటర్ శ్రీశాంత్ కూడా గత సంవత్సరం విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన 'కథు వాకిల్ దౌ కాదల్'లో చిన్న పాత్రలో నటించాడు. ఈ సినిమాలో ఆయన నటించిన సన్నివేశాలను ఎక్కువగా కట్ చేయడంతో ఆయన పాత్రకు స్కోప్ లేకుండా పోయింది. అలా ఆయన కూడా మరోసారి తమిళ చిత్రసీమలో అడుగుపెట్టలేదు. (ఇదీ చదవండి: విశాల్ 'మార్క్ ఆంటోనీ' సినిమాపై బ్యాన్ విధించిన కోర్టు) సినిమా అంటే తెలుగు ప్రేక్షకలకు చాలా మక్కువ.. అందుకే భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా జైలర్,జవాన్,విక్రమ్ వంటి సినిమాలకు టాలీవుడ్లో భారీగా కలెక్షన్స్ వచ్చాయి. అలా ధోనీ నిర్మించిన మొదటి సినిమా టాలీవుడ్ నుంచి అయి ఉండుంటే కచ్చితంగా విజయవంతం అయి ఉండేదని పలువురు అభిప్రాయ పడ్డారు. ధోనీ తన LGM ప్రొడక్షన్ నుంచి తర్వాత నిర్మించబోయే సినిమా తెలుగు నుంచే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. -
మురళీధరన్ అదే చేశాడు! – సచిన్ టెండూల్కర్
‘‘1993లో మురళీధరన్ని కలిశాను. అప్పట్నుంచి మా స్నేహం అలాగే ఉంది. ఎంతో సాధించినా సాధారణంగా ఉంటాడు. అతను ఏదైనా అడిగితే కుదరదని చెప్పడం కష్టం.. అందుకే పిలవగానే ఈ వేడుకకి వచ్చాను’’ అన్నారు భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్టల్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వివేక్ రంగాచారి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ‘800’ ట్రైలర్ని సచిన్ టెండూల్కర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఆటలో గెలు పోటములు ఉంటాయి. మళ్లీ నిలబడి పోటీ ఇవ్వడమే నిజమైన ఆటగాడి లక్షణం. మురళీధరన్ అదే చేశాడు.. అతని జీవితం గురించి ప్రజలు తెలుసుకోవాలి’’ అన్నారు. ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ– ‘‘నేను సచిన్ ఫ్యాన్ని. మరో వందేళ్ల తర్వాత కూడా సచిన్ లాంటి క్రికెటర్, వ్యక్తి రాలేరు’’ అన్నారు. ‘‘ఈ సినిమాను విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘800’ మానవత్వంతో కూడిన కథ’’ అన్నారు ఎంఎస్ శ్రీపతి. ‘‘మురళీధరన్గారి పాత్ర చేయడం ఓ పెద్ద బాధ్యత’’ అన్నారు మధుర్ మిట్టల్. -
ఈ ప్రేమ అనిర్వచనీయం
-
పాము, ఆవు ఎంత సన్నిహితంగా ఉన్నాయంటే..చూస్తే వామ్మో ఏంటిది?
-
ఫేస్బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్కు.. అంజూ వ్యవహారంలో కొత్త ట్విస్ట్!
ప్రేమకు హద్దులు ఉండవని అంటుంటారు. అందుకేనేమో ప్రేమించిన వారి కోసం ఏకంగా దేశాలు దాటుతున్నారు. కుటుంబాన్ని, ఉన్న ఊరును విడిచి ప్రేయసి, ప్రియుడు కోసం దారులు వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు ప్రేమ పావురాలు. సోషల్ మీడియా వినియోగంతో ఇలాంటి ఘటనలు మరింత ఎక్కువవుతున్నాయి. పబ్జీ ప్రేమ ఓ మహిళను పాకిస్తాన్ నుంచి ఇండియాకు రప్పిస్తే..ఫేస్బుక్ ప్రేమ మరో మహిళను భారత్ నుంచి పాకిస్థాన్కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే రాజస్థాన్కు చెందిన అజు అనే మహిళ ఫేస్బుక్లో పరిచయమైన ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి పాక్స్థాన్కు వెళ్లిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తనపై మీడియాలో వస్తున్న వార్తలపై అంజూ స్పందించింది. ప్రస్తుతం ఆమె పాకిస్థాన్లో సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. తను కేవలం సందర్శన కోసమే పాకిస్థాన్ వచ్చిన్నట్లు పేర్కొంది. పాక్లో ఓ పెళ్లి ఉందని, దానికి హాజరు అయ్యేందుకు వచ్చానని తెలిపింది. ఇందుకు అన్ని చట్టపరమైన విధానాలను అనుసరించినట్లు చెప్పింది. మూడేళ్లుగా పరిచయం తన పాకిస్థాన్ రాకపై ఎవరికీ ఏం తెలియదని, తన భర్తతో జైపూర్కు వెళ్తున్నట్లు చెప్పినట్లు తెలిపింది. ‘ముందుగా భివాడి నుంచి ఢిల్లీకి వచ్చాను. తర్వాత అమృత్సర్కు వెళ్లాను. ఆ తర్వాత వాఘా బోర్డర్కు వెళ్లి అక్కడి నుంచి పాకిస్థాన్లోకి అడుగుపెట్టాను. ఇక్కడ నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. తన పేరు నస్రుల్లా. మేం ఫేస్బుక్ ద్వారా స్నేహితులం. తను రెండుమూడేళ్లేగా నాకు తెలుసు. ఈ విషయం మా అక్క, అమ్మలకు కూడా తెలుసు. మా రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలున్నాయి. సీమా హైదర్తో పోల్చకండి కేవలం పెళ్లి కోసమే వచ్చాను. నాకు ఇక్కడ ఇంకేం పని లేదు. నన్ను సీమా హైదర్తో పోల్చకండి.. నేను ఇక్కడ సురక్షితంగా ఉన్నాను. నస్రుల్లాను పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. త్వరలోనే తిరిగి భారత్ వస్తాను. నా భర్తకు నాకు మనస్పర్థలు తలెత్తాయి. నా భర్త నుంచి విడిపోయి.. పిల్లలతో కలిసి నివసించాలనుకుంటున్నాను’ అని తెలిపింది. సంబంధిత వార్త: ఆమెకు పిల్లలున్నా పాక్ యువకుడితో ప్రేమ.. అతడి కోసం సరిహద్దు దాటి.. పెళ్లి చేసుకునే ఆలోచన లేదు మరోవైపు అంజూ ఆగస్టు 20న భారత్కు రానుందని ఆమె పాకిస్థాన్ స్నేహితుడు నస్రుల్లా(29) తెలిపాడు. అంజూ తనకు కేవలం స్నేహితురాలు మాత్రమేనని, వారి మధ్య ప్రేమ లేదని పేర్కొన్నాడు. ఆమె పాకిస్థాన్కు పర్యటనకు వచ్చిందని, ఆమెను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెలిపాడు. ఆమె వీసా గడువు ఆగస్టు 20న ముగియనుండటంతో అప్పుడే భారత్కు తిరిగి వెళ్లనుందని చెప్పాడు. ఆమె తన ఇంట్లోనే వేరే గదిలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుందని తెలిపాడు. 2019లో పరిచయం కాగా ఉత్తరప్రదేశ్లోని కైలోర్కు చెందిన అంజూ రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో నివాసముంటోంది. ఈమెకు అరవింద్ అనే వ్యక్తితో 2007లో వివాహం జరిగింది. వీరికి 15 ఏళ్ల బాలిక, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అంజు ప్రస్తుతం.. ప్రైవేట్ సంస్థలో బయోడేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్కు చెందిన నస్రుల్లాతో 2019లో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. వాలిడ్ పాస్పోర్టుతో.. అయితే అతడిని నస్రుల్లాను కలవడానికి అంజు 30 రోజుల పాకిస్తాన్ వీసాపై గురువారం పాక్లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఎఅప్పర్ దిర్ జిల్లాకు వెళ్లిన్నట్లు తేలింది. అయితే, అంజు పాకిస్థాన్లో ఉన్నట్టు తెలియడంతో రాజస్థాన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆమె గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిందని, పాక్కు వెళ్లేందుకు అంజూ వద్ద అన్ని ప్రయాణ పత్రాలు కరెక్ట్గానే ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. -
భారత్, పాక్లను కలిపిన కేంబ్రిడ్జ్ స్నేహం.. గత 31 ఏళ్లుగా..
చాలామందికి కాలేజీ రోజులు ఎంతో ఆనందంగా గడుస్తాయి. కొత్త పరిచయాలు, కొత్త అనుభవాల అన్వేషణలో వారు తలమునకలై ఉంటారు. ఆటువంటి సమయంలో ఏర్పడిన స్నేహబంధం కొందరి విషయంలో జీవితాంతం నిలిచిపోతుంది. అటువంటి స్నేహితులు తమ స్నేహితుల కష్టనష్టాల్లో పాలు పంచుకుంటారు. ఇలాంటి కాలేజీ స్నేహితులు రీ యూనియన్ పేరుతో కలుసుకుంటారు. ఇటువంటి దీర్ఘకాల స్నేహబంధానికి సంబంధించిన ఒక ఉదంతం రథిన్ రాయ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. డాక్టర్ రాయ్ తనకు 31 ఏళ్లుగా స్నేహితునిగా ఉన్న తన క్లాస్మేట్ డాక్టర్ అలీ చీమాతో పాటు తాను ఉన్న ఒక ఫొటోను షేర్ చేశారు. డాక్టర్ రాయ్ భారత్కు చెందిన వ్యక్తి. డాక్టర్ చీమా పాకిస్తాన్కు చెందిన వ్యక్తి. క్యాప్షన్లో డాక్టర్ రాయ్ ఇలా రాశారు..‘రథిన్ రాయ్ పీహెచ్డీ(కేంబ్రిడ్జ్) భారత పౌరుడు, అలీ చీమా పీహెచ్డీ(కేంబ్రిడ్జ్) పాక్ పౌరుడు. స్కాలర్ షిప్ పొందుతూ చదువుకున్న వీరు సామాన్య కుటుంబాల నేపధ్యం నుంచే వచ్చారు’ ఈ పోస్టుకు 75 వేల వ్యూస్ వచ్చాయి. దీనిని చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టు తమ హృదయాలను హత్తుకున్నదని కొందరు అంటుండగా, ఈ ఫొటో వైరల్ అయ్యేందుకు అర్హత కలిగినదని పలువురు పేర్కొంటున్నారు. ఇది కూడా చదవండి: ఎత్తుకెళ్లిన విగ్రహాలన్నీ తిరిగి వస్తున్నాయి Rathin Roy PhD (Cambridge). India citizen Ali Cheema PhD (Cambridge). Pakistan citizen Scholarship students ordinary background 31 years of friendship, collegial affection. We can still meet without being lynched Thank you, London the melting pot of the subcontinent ♥️ pic.twitter.com/nc4SWtAKiR — rathin roy (@EmergingRoy) July 17, 2023 -
ఈ స్నేహం ఎంత గొప్పదో
-
ఎల్కేజీ ఫ్రెండ్ను దగ్గర చేసిన ఇన్స్టాగ్రామ్
చిన్ననాటి స్నేహితులను ఎవరూ అంత త్వరగా మరచిపోలేరు. అయితే ఒక్కోసారి స్నేహితులను విడిచి మరో ప్రాంతానికి వెళ్లిపోవడమో లేక మరో స్కూలుకు మారడమో లాంటివి జరుగుతుంటాయి. అటువంటి సందర్భాల్లో చిన్నారుల స్నేహాలు దూరమవుతుంటాయి. అయితే ఒక యువతి తన చిన్ననాటి స్నేహితురాలిని వెదికి పట్టుకుంది. నేహా అనే ఈ యువతి తన ఇన్స్టాగ్రమ్ అకౌంట్లో తన కథను వీడియో రూపంలో వివరించింది. తాను తన లోవర్ కేజీ స్నేహితురాలిని వెదికేందుకే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రూపొందించానని తెలిపింది. దీనిసాయంతో తన బాల్య స్నేహితురాలిని వెదికానని వెల్లడించింది. వీడియోలో నేహ తెలిపిన వివరాల ప్రకారం 2006లో తన స్నేహితురాలు లక్షితతో పాటు ఎల్కేజీ చదివానని పేర్కొంది. అయితే లక్షిత తల్లిదండ్రులతో పాటు వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవడంతో తమ స్నేహం తెగిపోయిందని తెలిపింది. తనకు తన స్నేహితురాలి పూర్తిపేరు కూడా తెలియదని,అయితే తన రూపం, స్నేహం గుర్తుకు వస్తుండటంతో ఆమెను ఎలాగైనా వెదకాలని అనుకున్నానని తెలిపారు. ఇందుకోసం తాను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రూపొందించానని అన్నారు. దానిలో తన స్కూలు గ్రూపు ఫొటో పోస్ట్ చేశానని తెలిపారు. తరువాత తాను లక్షిత పేరుతో గల వేల అకౌంట్లను వెదికానన్నారు. వారికి మెసేజ్లు చేస్తూ, ఫొటోలను చెక్ చేశానని తెలిపారు. ఎట్టకేలకు తన స్నేహితురాలు లక్షిత నుంచి రిప్లయ్ వచ్చిందని ఆనందంగా తెలిపారు. తాము 18 ఏళ్ల తరువాత కలుసుకుని మాట్లాడుకున్నమని అన్నారు. దీనిని ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు తన స్నేహితురాలు జైపూర్లో ఉన్నదని తెలిసిందన్నారు. నేహ పోస్టును చూసిన చాలామంది ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నేహా తన స్నేహితురాలిని కనిపెట్టేందుకు అనుసరించిన విధానం నచ్చిందని, తాము కూడా తమ బాల్య స్నేహితులను ఇలానే వెదికి తీరుతామని తెలిపారు. మరొక యూజర్ సోషల్ మీడియా అద్భుతాలు చేస్తున్నదని పేర్కొన్నారు. -
మరో కొత్త మాంద్యం! ఏంటది.. నిఖిల్ కామత్ ఏమన్నారు?
ప్రపంచాన్ని మరో కొత్త మాంద్యం చుట్టుముడుతుందట.. అదే ‘స్నేహ మాంద్యం’ (friendship recession). ప్రముఖ స్టాక్ బ్రోకరింగ్ సంస్థ జెరోధా (Zerodha) సహ వ్యవస్థాపకుడు, ఇటీవలే తన సోదరుడు, వ్యాపార భాగస్వామి నితిన్తో కలిసి ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ లిస్ట్ 2023లో చేరిన నిఖిల్ కామత్ ఈ మాట అన్నారు. జీవితంలో స్నేహం ప్రాముఖ్యతను ఇలా గుర్తు చేశారు. ఒంటరితనం, స్నేహ బంధానికి సంబంధించి అమెరికన్ పర్స్పెక్టివ్స్ సర్వే గ్రాఫిక్ చిత్రాలను నిఖిల్ కామత్ తన ట్విటర్లో షేర్ చేశారు. ఆప్యాయతను పంచే మిత్రులు, సంక్షోభ సమయాల్లో ధైర్యాన్నిచ్చే ఆత్మీయ స్నేహితులు తగ్గిపోవడాన్ని స్నేహ మాంద్యంగా ఆ చిత్రాల్లో పేర్కొన్నారు. ఒంటరితనం అనేది రోజుకు 15 సిగరెట్లు తాగడంతో సమానం అని కూడా అందులో రాసి ఉంది. తనకు సోదరులలాంటి ఐదుగురు స్నేహితులు ఉన్నారని, వారి కోసం తాను ఏదైనా చేస్తానని నిఖిల్ కామత్ వెల్లడించారు. స్నేహ బంధం జీవితాన్ని మారుస్తుందన్నారు. ఈ ట్వీట్లో ఆయన స్నేహానికి సంబంధించిన విషయాలతోపాటు మానవ సంబంధాలు, వాటి ప్రాముఖ్యతను కూడా గుర్తుచేశారు. వీటికి సంబంధించిన వివరణాత్మక గ్రాఫ్ను షేర్ చేశారు. The more #philosophy you read (not stoic), having a community seems to be the biggest precursor to #happiness (as fleeting as it might be). I have 5 bros in my life I would do all for, life-changing this is, seriously ♥️ pic.twitter.com/jMxVDKs031 — Nikhil Kamath (@nikhilkamathcio) May 26, 2023 ఇదీ చదవండి: Satyajith Mittal: బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు.. చిన్నప్పుడు పడిన ఇబ్బందే ప్రేరణ! -
స్నేహమొక్కటి నిలిచి వెలుగును
ఉస్తాద్ బడే గులామ్ అలీఖాన్ ఎప్పుడు మద్రాసు వచ్చినా ఘంటసాల ఇంట్లో బస చేసేవారు. ఇప్పటిలా ఉదయమొచ్చి సాయంత్రానికి వెళ్లిపోవడం కాదు. నెలా రెండు నెలలు ఉండిపోవడమే. మేడ మీద వారు ఉంటే అన్నము, రొట్టెలు నిరాటంకంగా ఘంటసాల ఇంటి నుంచి వెళ్లేవి. బడే గులామ్ అలీఖాన్ ‘మొఘల్ ఏ ఆజమ్’లో నాలుగైదు నిమిషాల ఆలాపనకు 25 వేల రూపాయలు తీసుకున్నారు– 1960లో. అంటే నేటి విలువ 20 కోట్లు. అంత ఖరీదైన, మహా గాత్ర విద్వాంసుడైన బడే గులామ్ అలీఖాన్ ఏం చేసేవారో తెలుసా? తనకు బస ఇచ్చిన ఘంటసాల స్నేహాన్ని గౌరవిస్తూ, అన్నం పెడుతున్న ఘంటసాల సతీమణి సావిత్రమ్మను గౌరవిస్తూ తాను ఉన్నన్నాళ్లు ప్రతి శుక్రవారం పిలిచి ప్రత్యేకం వారిద్దరి కోసమే పాడేవారు. గంట.. రెండు గంటలు... పాడుతూనే ఉండిపోయేవారు. స్నేహం అలా చేయిస్తుంది. లతా మంగేష్కర్ వృద్ధిలోకి వచ్చిందని ఎవరికో కన్ను కుట్టింది. ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చి చంపడానికి వంట మాస్టర్ని ప్రవేశ పెడితే స్లో పాయిజన్ ఉన్న వంట తిని ఒక్కసారిగా ఆమె జబ్బు పడింది. మూడు నెలలు మంచం పట్టింది. బతుకుతుందో లేదో మరల పాడుతుందో లేదో తెలియదు. కాని గీతకర్త మజ్రూ సుల్తాన్పురి ఆమెను రోజూ మధ్యాహ్నం చూడటానికి వచ్చేవాడు. సాయంత్రం ఏడూ ఎనిమిది వరకు కబుర్లు చెబుతూ కూచునేవాడు. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు... ఆమె తిరిగి రికార్డింగ్ థియేటర్లో అడుగుపెట్టే రోజు వరకూ అతడా పని మానలేదు. స్నేహం అలానే చేయిస్తుంది. గబ్బర్సింగ్గా విఖ్యాతుడైన అంజాద్ ఖాన్ అమితాబ్కు ఆప్తమిత్రుడు. కుటుంబంతో గోవా వెళుతూ తీవ్రమైన కార్ యాక్సిడెంట్ జరిగితే అందరూ చచ్చిపోతాడనే అనుకున్నారు. అమితాబ్కు ఈ విషయం తెలిసి ఆగమేఘాల మీద ఆస్పత్రికి వచ్చాడు. ఇంటికెళ్లక దివారాత్రాలు కాపలా కాశాడు. ఏమి సాయం కావాలంటే ఆ సాయం చేయడానికి సిద్ధం. అతి కష్టమ్మీద అంజాద్ ఖాన్ బతికాడు. స్నేహితుడు అమితాబ్ బచ్చన్ తన కంటికి కునుకు పట్టే అనుమతినిచ్చాడు. ఈద్ అంటారొకరు. పండగ అంటారొకరు. దువా అంటారొకరు. ప్రార్థన అంటారొకరు. మక్కా మదీనాల ఫొటో ఒక గుమ్మం మీద. విఘ్నేశ్వరుడి చిత్రపటం ఒక వాకిలికి. అమ్మ వండితే ‘ఖీర్’ అంటారొకరు. ‘పాయసం’ అని లొట్టలు వేస్తారొకరు. విరజాజుల పూలతీవ ఇరు ఇళ్ల మీద ఒక్కలాంటి పరిమళమే వెదజల్లుతుంది. ప్రభాతాన సుప్రభాతం అయితే ఏమిటి... వినిపించే అజాన్ అయితే ఏమిటి... ఒడలు పులకరింప చేస్తుంది. క్యా భాయ్ అని ఒకరు.. ఏవోయ్ అని ఒకరు.. స్నేహం దేవుళ్ల అనుమతితో జరగదు. అది హృదయాల దగ్గరితనంతో సంభవిస్తుంది. కళే మతం అనుకునే కళకారులకు ఈ స్నేహం ఒక ఆరాధనగా ఉంటుంది. ‘ప్యార్ కియా జాయ్’ (ప్రేమించి చూడు)లో మెహమూద్, ఓం ప్రకాశ్ల కామెడీ విపరీతంగా పండింది. సినిమా పిచ్చోడైన మెహమూద్, తండ్రి ఓం ప్రకాశ్ను పెట్టుబడి పెట్టమని పీడించుకు తింటుంటాడు. చివరకు ఒకనాడు ‘అసలేం తీస్తావో కథ చెప్పు’ అని ఓం ప్రకాశ్ అంటే మెహమూద్ దడుచుకు చచ్చే హారర్ స్టోరీ చెబుతాడు. నవ్వూ, భయమూ ఏకకాలంలో కలిగే ఆ సన్నివేశంలో మెహమూద్ యాక్షన్ ఎంత ముఖ్యమో ఓం ప్రకాశ్ రియాక్షన్ అంతే ముఖ్యం. ఆ సన్నివేశం మెహమూద్కు ఆ సంవత్సరం బెస్ట్ కమెడియన్గా ఫిల్మ్ఫేర్ సంపాదించి పెడితే వేదిక మీద అవార్డ్ అందుకున్న మెహమూద్ కారు ఎక్కి ఆనందబాష్పాలతో నేరుగా ఓం ప్రకాశ్ ఇంటికి వెళ్లాడు. ‘మనిద్దరం చేసిన దానికి నాకొక్కడికే అవార్డు ఏంటి? ఇది నీదీ నాదీ’ అని పాదాల దగ్గర పెట్టాడు. స్నేహితులు ఇలాగే ఉంటారు. స్నేహారాధన తెలిసిన కళాకారులు ఇలాగే. కళ ఈ దేశంలో ఎప్పుడూ మతాన్ని గుర్తు చేయనివ్వలేదు. మతం మనిషికి మించింది కాదని చెబుతూనే వచ్చింది. ఒక హిందూ సితార్తో ఒక ముస్లిం తబలా జుగల్బందీ చేసింది. ఒక హిందూ గాత్రంతో ఒక ముస్లిం సారంగి వంత పాడింది. ఒక హిందూ నర్తనతో ఒక ముస్లిం షెహనాయి గంతులేసింది. ‘మిమ్మల్ని అమెరికా పట్టుకెళతాం... హాయిగా సెటిల్ అవ్వండి’ అని బిస్మిల్లా ఖాన్తో అంటే ‘తీసుకెళతారు నిజమే... నేను పుట్టిన ఈ కాశీ పుర వీధులు, ఈ పవిత్ర గంగమ్మ ధార... వీటిని నాతో పాటు తేగలరా’ అని జవాబు పలికాడు. ఈ జవాబే ఈ దేశ సిసలైన సంస్కృతి. సంతూర్ విద్వాంసుడు పండిట్ శివ్కుమార్ శర్మ మొన్నటి దినాన మరణిస్తే ఆయనతో సుదీర్ఘ స్నేహంలో ఉన్న, కలిసి వందలాది కచ్చేరీలు చేసిన తబలా మేస్ట్రో ఉస్తాద్ జకీర్ హుసేన్ ఆయన పార్థివ దేహానికి తన భుజం ఇచ్చాడు. దహన సంస్కారాలు మొదలయ్యాక అందరూ పక్కకు తొలగినా స్నేహితుణ్ణి విడిచి రాను మనసొప్పక పక్కనే ఒక్కడే చేతులు కట్టుకుని నిలుచున్నాడు. ఈ ఫొటో వైరల్గా మారితే ఇది గదా ఈ దేశపు నిజమైన సంస్కారం అని ఎందరో కళ్లు చెమరింప చేసుకున్నారు. కష్టపెట్టేవాటిని ప్రకృతి ఎక్కువ కాలం అనుమతించదు. వడగాడ్పులను, తుఫాన్లను, భూ ప్రకంపనాలను, విలయాలను లిప్తపాటే అనుమతిస్తుంది. ద్వేషానికి, విద్వేషానికి కూడా అంతే తక్కువ స్థానం, సమయం ఇస్తుంది. ప్రేమ దాని శిశువు. స్నేహం దాని గారాల బిడ్డ. ఆ గారాలబిడ్డకు అది పాలు కుడుపుతూనే ఉంటుంది. ఈ దేశం ప్రేమ, స్నేహాలతో తప్పక వర్థిల్లుతుంది. -
యూపీలో మరో వ్యక్తి కొంగ స్నేహం..ఏం జరుగుతుందో చూడాలి..
ఉత్తరప్రదేశ్లోని అమేథీ రైతు ఆరిఫ్ ఖాన్ గుర్జార్ గాయపడిన కొంగను కాపాడినందుకు అతనిపైకేసు నమోదైన సంగతి తెలిసిందే. రైతు ఆరిఫ్ ఆ కొంగను కాపాడటంతో అతనితోనే ఉండిపోవడంతో వారి మధ్య స్నేహం ఏర్పడింది. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొట్టింది. దీంతో అటవీ అధికారులు వన్యప్రాణి సంరక్షణ పేరుతో అతని నుంచి కొంగను వేరుచేసి సంరక్షణ కేంద్రానికి తరలించిన ఉదంతం మరువుక మునుపే అచ్చం అలాంటి కొంగ స్నేహమే యూపీలో మరొకటి చోటుచేసుకుంది. అయితే ఈ వ్యక్తికి మాత్రం కొంగతో స్నేహం చాలా యాదృచ్ఛికంగా జరిగింది. ఈ మేరకు యూపీలోని మౌకీకి చెందిన రామ్సముజ్ యాదవ్ అనే వ్యక్తికి తన పొలంలో ఈ కొంగ కనిపించింది. దానికి అనుకోకుండా ఒకరోజు ఆహారం పెట్టడం జరిగింది. అలా రెండు సార్లు చేశాడు. అంతే ఆ కొంగ అతని వద్దకు పదేపదే రావడం జరిగింది. దీంతో ఆయన ఆ కొంగను మిగతా కొంగల గుంపులో వదిలేసినా, వేరు చేసేందుకు యత్నించినా అది మాత్రం ఆయన్ను వదిలిపెట్టలేదు. ఇలా ఏడాదిగా ఆ వక్తితో ఈ కొంగ స్నేహం చేస్తోంది. రాజ్సముజ్ పిలుపు వినగానే వచ్చే ఈ కొంగ.. ఆయన ఎక్కడకు వెళ్తుంటే అది అక్కడకు వెళ్తోంది. వాస్తవానికి యూపీ రాష్ట్ర పక్షి అయినా ఈ కొంగను 1972 వన్యప్రాణి చట్టం కింద పెంచుకోవడం నేరం, పైగా ఇవి రెడ్లిస్ట్ పెట్ బర్డ్స్ జాబితాలో ఉండటంతో ఇవి పెంచడం చట్ట విరుద్ధం. కాగా, అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ విషయం అటవీ అధికారుల దృష్టికి చేరితే ఏం జరుగుతుందో చూడాలి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్లు పెట్టారు. #WATCH | Heartwarming bonhomie between a Sarus crane and Mau's Ramsamuj Yadav in Uttar Pradesh I had found it on the farm where I had fed it once. After feeding it twice initially, it started to come to me repeatedly. It roams around freely in the village: Ramsamuj Yadav pic.twitter.com/W9Fw3Ozwdu — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 15, 2023 (చదవండి: మోదీ నమ్మశక్యంకాని గొప్ప దార్శనికుడు..అమెరికా మంత్రి పొగడ్తల జల్లు) -
చరణ్,తారక్ల స్నేహానికి ఏమైంది? దూరంగా ఉండటానికి కారణం అదేనా?
-
అది స్నేహం, సహకారం, శాంతి యాత్ర: చైనా
బీజింగ్: రష్యాలో చైనా అధినేత షీ జిన్పింగ్ పర్యటన బుధవారం ముగిసింది. ఈ పర్యటనను స్నేహం, సహకారం, శాంతి యాత్రగా చైనా అభివర్ణించింది. ఉక్రెయిన్కు అమెరికా ఆయుధ, ఆర్థిక సాయం అందిస్తుండడాన్ని డ్రాగన్ దేశం తప్పుపట్టింది. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతలను ఇంకా రెచ్చగొట్టడానికి అమెరికా కుట్రలు పన్నుతోందని ఆరోపించింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం విషయంలో తాము తటస్థంగానే వ్యవహరిస్తామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బుధవారం స్పష్టం చేశారు. ఉక్రెయిన్ విషయంలో తమకు ఎలాంటి స్వార్థపూరిత ప్రయోజనాలు లేవన్నారు. ఈ యుద్ధాన్ని లాభం కోసం వాడుకోవాలన్న ఆలోచన ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. జిన్పింగ్ రష్యా పర్యటనపై ప్రపంచవ్యాప్తంగా పూర్తి సానుకూల స్పందన వ్యక్తమైందని వెన్బిన్ హర్షం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్–రష్యా దేశాల నడుమ శాంతి చర్చల కోసం తాము చొరవ చూపుతున్నామని వివరించారు. ఇదిలా ఉండగా, జిన్పింగ్ రష్యా పర్యటన వల్ల తక్షణ ఫలితమేమీ కనిపించలేదు. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా వెనక్కి తగ్గడం లేదు. శాంతి ప్రణాళికతో రష్యాకు వచ్చానని జిన్పింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. -
సో క్యూట్.. బుజ్జి కుక్కపిల్లకు కోడి పిల్ల సాయం.. చూస్తుంటే ఎంత ముద్దుగుందో!
-
స్నేహితురాలిని అలా చూస్తూ..! ‘స్నేహం కోసం..’ సినిమాలో క్లైమాక్స్లా
తిరుపతి రూరల్: కుటుంబ బంధాలతోపాటు వారి మధ్య స్నేహం పెరిగింది. అలా 64 ఏళ్లపాటు తమ స్నేహబంధాన్ని కొనసాగించారు. అనారోగ్యంతో మృతి చెందిన స్నేహితురాలిని కడచూపు చూసేందుకు వచ్చింది. నిర్జీవంగా మారిన స్నేహితురాలిని తదేకంగా చూస్తూ.. తానూ తుది శ్వాస విడిచింది. ‘స్నేహం కోసం..’ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాన్ని తలపించిన ఈ ఘటన తిరుపతి మండలం మల్లంగుంటలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... మల్లంగుంటకు చెందిన దివంగత కంబాల గంగయ్య భార్య కంబాల మునెమ్మ(80), అదే గ్రామానికి చెందిన అంజూరి పాపమ్మ (80) వరుసకు అక్కచెల్లెళ్లు. అంతకుమించి 64 ఏళ్లుగా మంచి స్నేహితులు. పిల్లల చదువుల నుంచి వారి పెళ్లిళ్లు, మనవళ్ల యోగక్షేమాల వరకు ఇరువురూ మాట్లాడుకునేవారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కంబాల మునెమ్మ ఈ నెల 9న రాత్రి మృతి చెందింది. ఆమె కుమారుడు అమెరికాలో ఉండటంతో శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న అంజూరి పాపమ్మకు మునెమ్మ చనిపోయిన విషయం చెప్పకుండా కుటుంబ సభ్యులు దాచారు. చివరి నిమిషంలో తెలుసుకున్న పాపమ్మ అనారోగ్యంతో ఉన్నప్పటికీ స్నేహితురాలు మునెమ్మను కడచూపు చూసేందుకు శనివారం సాయంత్రం వచ్చింది. స్నేహితురాలిని ఫ్రీజర్ బాక్స్లో అచేతన స్థితిలో చూస్తూ పాపమ్మ కుప్పకూలి అక్కడే ప్రాణాలు వదిలింది. మునెమ్మ అంత్యక్రియలను శనివారమే ముగించగా.. పాపమ్మకు ఆదివారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. స్నేహబంధానికి నిదర్శనంగా నిలిచిన మునెమ్మ, పాపమ్మ స్నేహంపై గ్రామంలో అందరూ చర్చించుకుంటున్నారు. -
ఇరాన్, సౌదీ అరేబియా స్నేహగీతం
దుబాయ్: ప్రత్యర్థి దేశాలుగా ఇన్నాళ్లూ కత్తులు దూసుకున్న ఇరాన్, సౌదీ అరేబియా ఇప్పుడు స్నేహగీతం ఆలపిస్తున్నాయి. దౌత్యపరమైన సంబంధాలను పునరుద్ధరించుకొనేందుకు, రాయబార కార్యాలయాలను తెరిచేందుకు ఇరు దేశాలు శుక్రవారం అంగీకారానికొచ్చాయి. ఇరాన్, సౌదీ అరేబియా మధ్య ఏడేళ్ల క్రితం సంబంధాలు తెగిపోయాయి. చైనా చొరవతో మళ్లీ సంబంధాలు మెరుగుపడుతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య సాయుధ ఘర్షణ తలెత్తే ప్రమాదం ఇక తప్పినట్లేనని పరిశీలకులు చెబుతున్నారు. గల్ఫ్లోని అరబ్ దేశాలు అగ్రరాజ్యం అమెరికా వైపు మొగ్గుచూపకుండా చైనా ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్, సౌదీ అరేబియా నడుమ ఇటీవలే సయోధ్య కుదిర్చింది. ఇది చైనాకు దౌత్యపరంగా అతిపెద్ద విజయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాతో కుదిరిన ఒప్పందంపై ఇరాన్, సౌదీ అరేబియా ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. అయితే, దీనిపై చైనా మీడియా ఇంకా స్పందించలేదు. యెమెన్లో ఇరాన్, సౌదీ అరేబియా ఘర్షణలు కూడా çసమసేలా కనిపిస్తున్నాయి. -
సీగల్కు రష్యా ఫ్రెండ్షిప్ అవార్డు
మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధా న్ని సమర్థించిన హాలీవుడ్ యాక్షన్ స్టార్ స్టీవె న్ సీగల్ (70)కు రష్యా ‘ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్షిప్’ అవార్డు ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు సీగల్ గట్టి మద్దతుదారు. 2014లో క్రిమియా ఆక్రమణను కూడా సమర్థించారు. 2016లో ఆయనకు రష్యా తమ దేశ పౌరసత్వం కూడా ఇచ్చింది. అంతేగాక పుతిన్ వ్యక్తిగతంగా సీగల్కు రష్యా పాస్పోర్టు అందజేశారు! 2018 నుంచీ అమెరికా, జపాన్ దేశాల్లో రష్యా విదేశాంగ శాఖ ప్రత్యేక రాయబారిగా కూడా సీగల్ పని చేస్తున్నారు. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్, ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో తదితరులకు కూడా ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అవార్డు ప్రకటించారు. -
నువ్వు సల్లగుండాలే.. చిన్న నవ్వు ఒకటి సరిపోదా! వైరల్ వీడియో
స్నేహం ఏం కోరుకుంటుంది? కోట్లు కోరుకోదు. చిన్న నవ్వు ఒకటి సరిపోదా!స్నేహం ‘మా దేశం అయితేనే’ అంటుందా?‘కానే కాదు’ అని చెప్పడానికి ఈ వీడియో క్లిప్ సరిపోదా! బ్రిటన్కు చెందిన జర్నలిస్ట్, టీవి ప్రెజెంటర్ తాను చేస్తున్న ‘టైమ్లెస్ తమిళనాడు’ టీవీ ప్రొగ్రామ్ కోసం తమిళనాడులోని మదురైలో అడుగుపెట్టింది. మదురై అద్భుత అందాల అనుభూతి నుంచి పూర్తిగా బయటికి రాకముందే మల్లెపూలు అమ్మే మహిళ రూపంలో ఆమెకు అపురూపమైన స్నేహం కలిసింది. ఈవిడ మదురై తమిళ యాస ఆమెకు అర్థం కాకపోవచ్చు.ఆవిడ బ్రిటీష్ ఇంగ్లీష్ ఈవిడకు అర్థం కాకపోవచ్చు... అయితే అదేమీ వారి స్నేహానికి అడ్డుగోడ కాలేదు. పూలమ్మ ఎలెక్స్కు జడ వేసి మల్లెపూలు పెట్టేది.ఆ జడ చూసుకుని ఎలెక్స్ మురిసిపోయేది!తన స్టైల్లో జోకులు చెప్పేది పూలమ్మ. అవి అర్థం కాక ఎలెక్స్ తెల్లముఖం వేసే లోపే దారిన పోయే దానయ్యలు తమకు తెలిసిన ఇంగ్లీష్లో ఎలెక్స్కు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. మదురై నుంచి వెళ్లే క్రమంలో తన సెలబ్రిటీ పూలమ్మతో ఫొటోలు దిగింది ఎలెక్స్.కథ ఇదే అయితే అది మదురైలో మాత్రమే ఆగిపోయి ఉండేది. అయితే ఎలెక్స్ స్వదేశానికి చేరుకున్న తరువాత పూలమ్మతో తాను ఉన్న చిన్న వీడియో క్లిప్ను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. తక్కువ సమయంలోనే ఈ క్లిప్కు 4.7 లక్షల వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో క్లిప్లో పెద్ద పెద్ద మాటలేవీ లేకపోవచ్చు. అయితే వారి భావోద్వేగాన్ని, అనుబంధాన్ని నెటిజనులు తమదైన శైలిలో వ్యాఖ్యానించారు. ‘మల్లెపూలు అందమైనవి. మీ స్నేహం అంతకంటే అందమైంది’ అన్నారు.‘గ్రేట్ క్రాస్ కల్చరలిజం’ అంటూ వీరి స్నేహాన్ని ఆకాశానికెత్తారు! తమిళనాడులోని సముద్రపు అందాలు, కొండలు, కోవెలల సౌందర్యం, తేయాకు తోటల పచ్చదనం, చల్లని మనసున్న హిల్ స్టేషన్ల గురించి చెబుతూ ‘అద్భుతం’ అన్నది ఎలెక్స్. అయితే వీరి వీడియో క్లిప్ మాత్రం సామాజిక మాధ్యమాల్లో మహా అద్భుతంగా మారింది! View this post on Instagram A post shared by Alex Outhwaite (@alexouthwaite) -
క్షమాపణలు చెప్పిన రాఖీ సావంత్.. హగ్గులు, కిస్సులతో రచ్చ
బాలీవుడ్ నటి రాఖీ సావంత్.. ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆమె వివాహ జీవితం ఇప్పుడు బీటౌన్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, రాఖీ, బాలీవుడ్ హీరోయిన్ షెర్లిన్ చోప్రా మధ్య రాజుకున్న వివాదం సద్దుమణిగింది. ఇద్దరూ మునుపటిలా ఫ్రెండ్స్లా కలిసిపోయారు. మీడియా సాక్షిగా ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ముద్దులు, హగ్గులతో తమ ఫ్రెండ్షిప్ను చాటుకున్నారు. తాము ఎప్పటినుంచో ఫ్రెండ్స్ అని, కానీ చిన్న గొడవలతో తమమధ్య దూరం పెరిగిందని, ఇప్పుడు మళ్లీ ముందులా కలిసిపోయామన్నారు. కాగా మీటూ వివాదంలో బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్పై షెర్లిన్ చోప్రా లైంగిక ఆరోపణలు చేయగా, రాఖీ సావంత్ అతనికి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఇద్దరు స్నేహితులు బద్దశత్రువలయ్యారు..సోషల్ మీడియాలో తనపై అభ్యంతకర పదజాలాన్ని ఉపయోగించిందని షెర్లిన్ చేసిన ఫిర్యాదుతో రాఖీని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా షెర్లిన్, రాఖీ కలిసిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ప్రేమ కోసం ప్రేమగా
ధనం వృద్ధి ΄పొందటానికి కొంత సమయం పడుతుంది. విత్తనాన్ని భూమిలో నాటితే ఫలం చేతికి అందటానికి సమయం పడుతుంది, కానీ క్షణంలో ఫలితాన్ని అందజేసేది ప్రేమ ఒక్కటే. ప్రేమతో కూడిన ఒక్క మాట, ఒక చర్య అద్భుతాలను సృష్టిస్తుంది. ఈ ప్రేమకు వయసుతో పనిలేదు. రక్తసంబంధం ఉండాలని నియమం లేదు. కుల మతాల ప్రసక్తే లేదు.మరో గొప్ప విషయం ఏమిటీ అంటే ఇచ్చేవారికీ, పుచ్చుకునే వారికీ సంతోషం కలిగించే శక్తి కేవలం ప్రేమకు మాత్రమే ఉంది. ఒక్కసారి ప్రేమ గొప్పతనం అర్థం అయ్యాక, ప్రేమను పంచటంలోని మాధుర్యం అనుభవం అయిన తరువాత కఠినంగా కఠోరంగా ఉండటం సాధ్యం కాదు. పరిస్థితుల దృష్ట్యా కొన్నిసార్లు కావాలని కఠినంగా ఉండాలని ప్రయత్నించినా రాతి అడుగున దాగిన నీటి బుగ్గలాగా పెల్లుబికి వస్తుంది ప్రేమ. మట్టితో కూడిన చెరువు నీటికుండలో చిన్న పటిక ముక్క వేస్తే మట్టి విడిపో యి స్వచ్ఛమైన నీరు తయారవుతుంది. అనేక సమస్యలు, ఒత్తిడులతో మనశ్శాంతికి దూరం అయిపో తున్న నేటి సమాజంలో శాంతిని చేకూర్చగల ఏకైక మార్గం ప్రేమ. కేవలం యువతీ యువకుల మధ్య కలిగేదే ప్రేమ అనే భ్రమ నుంచి బయటపడితే ప్రతిజీవి తోటి వారి అందరిపట్ల పశుపక్ష్యాదుల పట్ల, ప్రకృతి పట్ల చూపించేది అంతా ప్రేమే. ఒక కర్మాగారం చాలా చిక్కు సమస్యలలో మునిగి పో యింది. కార్మికుల మధ్య తగులాటలు, శత్రుత్వాలు. అప్పటివరకు ఉన్న అధికారి ఆ ఒత్తిడిని తట్టుకోలేక పదవికి రాజీనామా చేసి వెళ్లిపో యాడు. అతని స్థానంలో మరొక అధికారిని నియమించారు. కొద్దికాలంలోనే కర్మాగారం పరిస్థితి చక్కబడింది. మునుపటి శత్రుత్వం నిండిన వాతావరణం మారిపో యి చక్కని వాతావరణం ఏర్పడింది. పైవారు కొత్త అధికారిని ప్రశంసలతో ముంచెత్తారు. ఇటువంటి మార్పు కోసం ఆ కొత్త అధికారి ఉపయోగించిన ఏకైక ఆయుధం ప్రేమ. ఉదయం రాగానే అందరినీ ఒక్కొక్కరినీ పిలిచి ప్రేమగా పలకరించేవాడు. వారి యోగక్షేమాలను విచారించేవాడు. మీకు ఏ కష్టం వచ్చినా చెప్పండి నేను ఉన్నాను. మనందరం ఒక కుటుంబం అని ప్రేమగా మాట్లాడేవాడు. ఆ చిన్న పని వల్ల ఆయన అందరికీ ఆత్మీయుడిగా మారిపో యాడు.ఆయన సంతోషం కోసం అందరూ గొడవలు మానేసి పరస్పరం స్నేహంగా ఉండటంప్రా రంభించారు. మనం ప్రస్తుతం నివసిస్తున్న ఈ సమాజంలోఅన్నీ వుండి కూడా కాస్తంత ప్రేమ కోసం అలమటించే వారు ఎందరో ఉన్నారు. అయిన వారందరూ దూర్రప్రాం తాలకు తరలిపో గా ఒంటరితనంతో బాధపడుతూ కాస్తంత ఆప్యాయత కోసం, తపించి పో యే వారికి ఊరట కలిగేలా మనకు ఉన్న సమయంలో కొద్ది సమయం ఇటువంటి వారికోసం కేటాయించి ప్రేమతో నాలుగు మాటలు మాట్లాడితే వారికి ఎంతో ఉత్సాహం కలుగుతుంది. జీవితం పట్ల ఆసక్తి నశించిపో యి జీవించే వారికి జీవితం పట్ల ఆసక్తి కలుగుతుంది. అంతేకాదు, ప్రేమను చవిచూసిన వారు ఇతరులకు ప్రేమను పంచగలుగుతారు. మన దైనందిన జీవితంలో మనకు సేవలందించే వారిపట్ల ప్రేమతో నాలుగు మంచి మాటలు మాట్లాడితే, వారంతా మనకు మరింత దగ్గరవుతారు. వారితోపాటు మన జీవితం కూడా ఆనందమయంగా మారుతుంది. – పొత్తూరి విజయలక్ష్మి -
నాకు 30 ఆమెకు 12 అంటూ..షాకింగ్ వ్యాఖ్యలు చేసిన బైడెన్
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలు నెట్టింట పెద్ద దుమారం రేపాయి. ఈ మేరకు డెమొక్రాటిక్ నాయకుడు జో బైడెన్ అమెరికాలో అతిపెద్ద టీచర్స్ యూనియన్ అయిన నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్లో ప్రసంగిస్తూ....తన స్నేహం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వయసుకి సంబంధించి చాలా ఏళ్లు వెనక్కి వెళ్లాలంటూ ప్రసంగాన్ని ప్రారంభించడంతో...అక్కడ ఉన్న ఉపాధ్యాయ ప్రేక్షకులంతా చాలా ఆసక్తిగా బైడెన్ వ్యాఖ్యలను తిలకించ సాగారు. ఇంతలో బైడెన్ అక్కడ ఉన్న ఒక మహిళ ఉపాధ్యాయురాలిని చూస్తూ...తనకు 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడూ 12 ఏళ్ల బాలికతో స్నేహం చేశానని చెప్పారు. వయసు భేదం ఉన్నప్పటికీ ఆమె నాకు చాలా పనుల్లో సహయం చేసింది అన్నారు. అంతే ఆ సమావేశంలో ఒక్కసారిగా అందరి ముఖాలపై నవ్వులు విరబూశాయి. అతేకాదు ఆ సమావేశంలో రిపబ్లికన్ అబార్షన్ నిషేధం బిల్లు గురించి ప్రస్తావించారు. పైగా ఆ బిల్లు తన వద్దకు వస్తే వీటో చేస్తానని హామీ కూడా ఇచ్చారు. వాస్తవానికి ఈ బిల్లు విషయంలో ఆశా, ఐక్యత, ఆశావాదం, విభజన, భయం, చీకటి వంటి వాటికి సంబంధించినసరైన ఎంపికగా అభివర్ణించారు. అలాగే అమెరికాలో ఉన్న తుపాకీ సంస్కృతి పట్ల కూడా మాటల దాడి చేశారు. ఐతే ఆయన తన ప్రసంగం ప్రారంభంలో చేసిన వ్యాఖ్యలే ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారాయి. తనకు 30 ఆమెకు 12 అంటే ఎవరామె అంటూ ఆసక్తకర చర్చ సాగింది. దీంతో కొంత మంది వినియోగదారులు 30 అంటే బైడెన్ గురువు అని 12 అంటే బైడెన్ వయసు అయ్యి ఉంటుందని ఒకరు, మరోకరేమో! ఏమైంటుందా అంటూ.. తెగ చించేసుకుంటూ ట్విట్లు పెట్టడం ప్రారంభించారు. Biden: “She was 12 I was 30.” D.C. Crowd: haahahahahaha And Democrats call Republicans brainwashed? pic.twitter.com/wB2EKHREg6 — Charles R Downs (@TheCharlesDowns) September 23, 2022 (చదవండి: కదన రంగంలో అత్యంత శక్తిమంతమైన యుద్ధ ట్యాంకులు! షాక్లో ఉక్రెయిన్) -
స్నేహంలో శారీరకంగా లోబర్చుకునే హక్కేం లేదు!
ముంబై: స్నేహంలో ఒక పురుషుడు, ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నంత మాత్రానా.. అది ఆమె నుంచి లైంగిక సంబంధానికి అంగీకారం తెలిపినట్లు కాదని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. తాజాగా ఓ కేసు విచారణ సందర్భంగా.. జస్టిస్ భారతీ డాంగ్రే నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఓ వ్యక్తి తన స్నేహితురాలిని పలుమార్లు లొంగదీసుకున్నాడు. తీరా గర్భం దాల్చాక.. మాట మార్చాడు. ఈ వ్యవహారంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే.. ముందస్తు బెయిల్ కోసం అతను దాఖలు చేసిన అభ్యర్థనను బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాలని, ఆ మహిళను బలవంతంగా లొంగదీసుకున్నాడో లేదో తేల్చాల్సిన అవసరం ఉందని బెంచ్ ఆదేశించింది. ఒక అమ్మాయి అబ్బాయితో స్నేహంగా ఉంటే.. అది ఆమెతో లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఆమె ఇచ్చిన సమ్మతిగా భావించడానికి వీల్లేదు అని జస్టిస్ భారతి అభిప్రాయపడ్డారు. నేటి సమాజంలో.. స్నేహం అనేది ఆడా-మగా అనే తేడాలను బట్టి ఉండడం లేదు. ఒకే తరహా అభిప్రాయాలు, ఆలోచనలు లేదంటే కంఫర్ట్ జోన్లో ఉండడం లాంటి అంశాలను బట్టే స్నేహాలు చేస్తున్నారు. ముఖ్యంగా పని చేసే చోట కలిసి మెలిసి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగని.. స్నేహం అనేది బలవంతంగా వాళ్లను(మహిళలను) లొంగదీసుకునేందుకు మగవాళ్లకు దొరికే హక్కే ఎంత మాత్రం కాదు అని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కేసులో ఆమె అతని పట్ల ఆకర్షితురాలైందని, కానీ, పెళ్లి ప్రస్తావనతో అతనికి లొంగిపోయిందా? లేదంటే బెదిరింపులకు, బలవంతం చేశాడా? అనేది నిర్ధారణ కావాల్సి ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
ఈ బంధమేనాటిదో!
మల్కన్గిరి(భువనేశ్వర్): తన ఆనందం, అవసరాల కోసం సాధు జంతువులను మచ్చిక చేసుకోవడం వేల సంవత్సరాల క్రితమే మనిషి ప్రారంభించాడు. కొందరైతే అడవుల్లో ఉన్న వన్య ప్రాణులకు సైతం ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చి, యజమానిలా వాటితో ఆదాయం పొందుతుంటారు. మరికొందరు రాక్షసానందం కోసం జీవాల ప్రాణాలు హరిస్తుంటారు. మల్కన్గిరి జిల్లా కేంద్రానికి చెందని మహేంద్ర మాత్రం పైవాటికి భిన్నం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వన్యప్రాణికి ఆశ్రయం కల్పించడంతో పాటు ఆలనాపాలన చూస్తున్నారు. జీవం కూడా నిన్ను వదలి పోలేనంటూ గత 20 ఏళ్లుగా ఆయనను విడిచి పెట్టడం లేదు. వివరాల్లోకి వెళ్తే... 20 ఏళ్ల క్రితం వచ్చిన వరదలో మల్కన్గిరిలోని జగన్నాథ్ మందిరం సమీపంలో నివాసం ఉంటున్న మహేంద్ర ఇంటికి సమీప కాలువలో అడవిపంది పిల్ల కొట్టుకు వచ్చింది. చలికి గజగజా వణుకుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వరాహాన్ని గమనించిన ఆయన.. ఇంటికి తీసుకు వచ్చి, ఆహారం అందించాడు. రక్షణ కల్పించి, అక్కడే ఆశ్రయం కల్పించాడు. అడవిలో వదిలి పెట్టినా.. వరాహం కొద్దిగా కోలుకున్న అనంతరం మహేంద్ర అటవీశాఖ అధికారులకు అప్పగించేందుకు ప్రయత్నించాడు. అయితే చిన్న పిల్ల కావడంతో అతనే వద్దే క్షేమంగా ఉంటుందని భావించిన సిబ్బంది.. తిరిగి అడవిలోకి పంపించేందుకు నిరాకరించారు. దీంతో అప్పటి నుంచి తన ఇంట్లో మనిషిలాగే వన్యప్రాణిని పెంచి, పెద్ద చేశాడు. దానికి రాజు అని పేరు కూడా పెట్టాడు. ఈ ఇద్దరి బంధం ఏనాటిదో గానీ మహేంద్ర ఎంత చెబితే అంతే అన్నట్లుగా వరాహం తయారైంది. రెండు దఫాలు అడవిలో వదిలినా, తిరిగి మహేంద్ర ఇంటికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో జీవిపై మరింత ప్రేమ పెంచుకొని, తనకు ఉన్న దాంట్లోనే రాజుని కూడా పోషిస్తున్నాడు. మనుషుల్లాగే అన్నం, బిస్కెట్లు, రొట్టె, చపాతీ తదితర పదార్థాలను ఆహారంగా అందిస్తున్నాడు. ఈ 20 ఏళ్లలో ఎవరికీ ఎలాంటి హానీ చెయ్యలేదని, వీధిలో పిల్లలు కూడా రాజుతో కాసేప గడిపేందుకు ఆసక్తి చూపుతారని మహేంద్ర చొప్పుకొచ్చారు. ఆహారం కోసం అడవికి వెళ్లినా.. సాయంత్రం తిరిగి వస్తుందని, రాత్రి సమయంలోనూ తనను విడిచి ఉండదని వన్యప్రాణి ప్రేమను ఆయన వివరించాడు. చదవండి: ప్రేమ పెళ్లి.. నా భర్త దగ్గరికి వెళ్లిపోతా.. ఇంతలోనే ఘోరం.. -
స్నేహమొక్కటి నిలిచి వెలుగును
ఉస్తాద్ బడే గులామ్ అలీఖాన్ ఎప్పుడు మద్రాసు వచ్చినా ఘంటసాల ఇంట్లో బస చేసేవారు. ఇప్పటిలా ఉదయమొచ్చి సాయంత్రానికి వెళ్లిపోవడం కాదు. నెలా రెండు నెలలు ఉండిపోవడమే. మేడ మీద వారు ఉంటే అన్నము, రొట్టెలు నిరాటంకంగా ఘంటసాల ఇంటి నుంచి వెళ్లేవి. బడే గులామ్ అలీఖాన్ ‘మొఘల్ ఏ ఆజమ్’లో నాలుగైదు నిమిషాల ఆలాపనకు 25 వేల రూపాయలు తీసుకున్నారు– 1960లో. అంటే నేటి విలువ 20 కోట్లు. అంత ఖరీదైన, మహా గాత్ర విద్వాంసుడైన బడే గులామ్ అలీఖాన్ ఏం చేసేవారో తెలుసా? తనకు బస ఇచ్చిన ఘంటసాల స్నేహాన్ని గౌరవిస్తూ, అన్నం పెడుతున్న ఘంటసాల సతీమణి సావిత్రమ్మను గౌరవిస్తూ తాను ఉన్నన్నాళ్లు ప్రతి శుక్రవారం పిలిచి ప్రత్యేకం వారిద్దరి కోసమే పాడేవారు. గంట.. రెండు గంటలు... పాడుతూనే ఉండిపోయేవారు. స్నేహం అలా చేయిస్తుంది. లతా మంగేష్కర్ వృద్ధిలోకి వచ్చిందని ఎవరికో కన్ను కుట్టింది. ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చి చంపడానికి వంట మాస్టర్ని ప్రవేశ పెడితే స్లో పాయిజన్ ఉన్న వంట తినీ తినీ ఒక్కసారిగా ఆమె జబ్బు పడింది. మూడు నెలలు మంచం పట్టింది. బతుకుతుందో లేదో, మరల పాడుతుందో లేదో తెలియదు. కానీ గీతకర్త మజ్రూ సుల్తాన్పురి ఆమెను రోజూ మధ్యాహ్నం చూడటానికి వచ్చేవాడు. సాయంత్రం ఏడూ ఎనిమిది వరకు కబుర్లు చెబుతూ కూచునేవాడు. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు... ఆమె తిరిగి రికార్డింగ్ థియేటర్లో అడుగుపెట్టే రోజు వరకూ అతడా పని మానలేదు. స్నేహం అలానే చేయిస్తుంది. గబ్బర్సింగ్గా విఖ్యాతుడైన అంజాద్ ఖాన్, అమితాబ్కు ఆప్తమిత్రుడు. కుటుంబంతో గోవా వెళుతూ తీవ్రమైన కారు యాక్సిడెంట్ జరిగితే అందరూ చచ్చిపోతాడనే అనుకున్నారు. అమితాబ్కు ఈ విషయం తెలిసి ఆగమేఘాల మీద ఆస్పత్రికి వచ్చాడు. ఇంటికెళ్లక దివారాత్రాలు కాపలా కాశాడు. ఏమి సాయం కావాలంటే ఆ సాయం చేయడానికి సిద్ధం. అతి కష్టమ్మీద అంజాద్ ఖాన్ బతికాడు. స్నేహితుడు అమితాబ్ బచ్చన్ తన కంటికి కునుకు పట్టే అనుమతినిచ్చాడు. ఈద్ అంటారొకరు. పండగ అంటారొకరు. దువా అంటారొకరు. ప్రార్థన అంటారొకరు. మక్కా మదీనాల ఫొటో ఒక గుమ్మం మీద! విఘ్నేశ్వరుడి చిత్రపటం ఒక వాకిలికి! అమ్మ వండితే ‘ఖీర్’ అంటారొకరు. ‘పాయసం’ అని లొట్టలు వేస్తారొకరు. విరజాజుల పూలతీవ ఇరు ఇళ్ల మీద ఒక్కలాంటి పరిమళమే వెదజల్లుతుంది. ప్రభాతాన సుప్రభాతం అయితే ఏమిటి... వినిపించే అజాన్ అయితే ఏమిటి... ఒడలు పులకరింప చేస్తుంది. ‘క్యా భాయ్’ అని ఒకరు.. ‘ఏవోయ్’ అని ఒకరు! స్నేహం దేవుళ్ల అనుమతితో జరగదు. అది హృదయాల దగ్గరితనంతో సంభవిస్తుంది. కళే మతం అనుకునే కళాకారులకు ఈ స్నేహం ఒక ఆరాధనగా ఉంటుంది. ‘ప్యార్ కియా జాయ్’ (ప్రేమించి చూడు)లో మెహమూద్, ఓం ప్రకాశ్ల కామెడీ విపరీతంగా పండింది. సినిమా పిచ్చోడైన మెహమూద్, తండ్రి ఓం ప్రకాశ్ను పెట్టుబడి పెట్టమని పీడించుకు తింటుంటాడు. చివరకు ఒకనాడు ‘అసలేం తీస్తావో కథ చెప్పు’ అని ఓం ప్రకాశ్ అంటే మెహమూద్ దడుచుకు చచ్చే హారర్ స్టోరీ చెబుతాడు. నవ్వూ, భయమూ ఏకకాలంలో కలిగే ఆ సన్నివేశంలో మెహమూద్ యాక్షన్ ఎంత ముఖ్యమో ఓం ప్రకాశ్ రియాక్షన్ అంతే ముఖ్యం. ఆ సన్నివేశం మెహమూద్కు ఆ సంవత్సరం బెస్ట్ కమెడియన్గా ఫిల్మ్ఫేర్ సంపాదించి పెడితే వేదిక మీద అవార్డ్ అందుకున్న మెహమూద్ కారు ఎక్కి ఆనందబాష్పాలతో నేరుగా ఓం ప్రకాశ్ ఇంటికి వెళ్లాడు. ‘మనిద్దరం చేసిన దానికి నాకొక్కడికే అవార్డు ఏంటి? ఇది నీదీ నాదీ’ అని పాదాల దగ్గర పెట్టాడు. స్నేహితులు ఇలాగే ఉంటారు. స్నేహారాధన తెలిసిన కళాకారులు ఇలాగే! కళ ఈ దేశంలో ఎప్పుడూ మతాన్ని గుర్తు చేయనివ్వలేదు. మతం మనిషికి మించింది కాదని చెబుతూనే వచ్చింది. ఒక హిందూ సితార్తో ఒక ముస్లిం తబలా జుగల్బందీ చేసింది. ఒక హిందూ గాత్రంతో ఒక ముస్లిం సారంగి వంత పాడింది. ఒక హిందూ నర్తనతో ఒక ముస్లిం షెహనాయి గంతులేసింది. ‘మిమ్మల్ని అమెరికా పట్టుకెళతాం... హాయిగా సెటిల్ అవ్వండి’ అని బిస్మిల్లా ఖాన్తో అంటే, ‘తీసుకెళతారు నిజమే... నేను పుట్టిన ఈ కాశీ పురవీధులు, ఈ పవిత్ర గంగమ్మ ధార... వీటిని నాతో పాటు తేగలరా’ అని జవాబు పలికాడు. ఈ జవాబే ఈ దేశ సిసలైన సంస్కృతి. సంతూర్ విద్వాంసుడు పండిట్ శివ్కుమార్ శర్మ మొన్నటి దినాన మరణిస్తే ఆయనతో సుదీర్ఘ స్నేహంలో ఉన్న, కలిసి వందలాది కచ్చేరీలు చేసిన తబలా మేస్ట్రో ఉస్తాద్ జకీర్ హుసేన్ ఆయన పార్థివ దేహానికి తన భుజం ఇచ్చాడు. దహన సంస్కారాలు మొదలయ్యాక అందరూ పక్కకు తొలగినా స్నేహితుణ్ణి విడిచి రాను మనసొప్పక పక్కనే ఒక్కడే చేతులు కట్టుకుని నిలుచున్నాడు. ఈ ఫొటో వైరల్గా మారితే... ‘ఇది గదా ఈ దేశపు నిజమైన సంస్కారం’ అని ఎందరో కళ్లు చెమరింప చేసుకున్నారు. కష్టపెట్టేవాటిని ప్రకృతి ఎక్కువ కాలం అనుమతించదు. వడగాడ్పులను, తుపాన్లను, భూ ప్రకంపనాలను, విలయాలను లిప్తపాటే అనుమతిస్తుంది. ద్వేషానికి, విద్వేషానికి కూడా అంతే తక్కువ స్థానం, సమయం ఇస్తుంది. ప్రేమ దాని శిశువు. స్నేహం దాని గారాల బిడ్డ. ఆ గారాల బిడ్డకు అది పాలు కుడుపుతూనే ఉంటుంది. ఈ దేశం ప్రేమ, స్నేహాలతో తప్పక వర్ధిల్లుతుంది. -
తప్పు నల్లిది... శిక్ష మంచానికి!
మనుష్యుడు తనంతతానుగా తప్పు చేసేవాడు కాకపోయినా, దుర్మార్గులతో స్నేహం చేస్తే పడరాని కష్టాలను పడతాడని చెప్పడానికి...సుమతీ శతకకారుడు బద్దెనగారు బహు సులభమైన ఉపమానాలతో వివరిస్తున్నాడు... ‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ /గించిత్తు నల్లి కుట్టిన/ మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ’’ ...‘‘కొంచెపు నరు..’’ అంటే... బుద్ధి పరిణతి చెందనివాడు, అధముడు, దుర్బుద్ధి కలిగినవాడు, ఎప్పుడూ కూడా చెడు ఆలోచనలతో ఉండేవాడు–వాడు బాగుపడడు, ఇతరులను బాగపడనివ్వడు. దుర్జనులతో స్నేహం చేస్తే అంచితముగ కీడువచ్చు..అంటే అంతాఇంతా అని చెప్పలేనంత అపకీర్తి, ప్రమాదం, కష్టం ముంచుకొచ్చేస్తాయి.... ఎలాగంటే... ఇప్పటితరానికి ఎక్కువగా తెలిసే అవకాశం లేదు కానీ వెనకటికి నులక మంచాలు, నవారు మంచాలు, పేము మంచాలంటూ ఉండేవి. కట్టెమంచాలకు నవారు, నులక లేదా పేము అల్లి వాడుకొనేవారు. మంచానికున్న పట్టీలు, కోళ్ళు, నవారు, నులకల మధ్య సందుల్లో కుప్పలు కుప్పలుగా నల్లులు చేరేవి, గుడ్లు పెట్టేవి. వీటికి ఒక లక్షణం ఉంటుంది. మంచంమీద పడుకున్న వ్యక్తి మేలుకుని ఉన్నంతవరకు అవి బయటికి రావు. నిద్రలోకి జారుకోగానే అవి కుడుతుంటే సుఖంగా నిద్రపోవడం సాధ్యం కాదు. వాటి బాధ వదిలించుకోవాలంటే పగలు ఎర్రటి ఎండలో మంచాన్ని నేలకేసి పదేదపదే కొడితే నల్లులు రాలిపడుతుంటాయి. కాళ్లతో వాటిని నలిపి చంపుతారు. అయినా ఇంకా సందుల్లో గుడ్లు ఉంటాయి. వాటిమీద కిరసనాయిలు పోసేవారు.... ఇప్పడు మనం ఆలోచించాల్సింది ఏమిటంటే.... నిద్రపోతున్న మనుషులను కుట్టినది నల్లులయితే మధ్యలో ఆ మంచం చేసిన తప్పేమిటి ? నిజానికి పడుకోవడానికి ఉపయోగపడడం తప్ప మరోపాపం ఎరుగదు. కానీ నల్లులకు ఆశ్రయం ఇచ్చినందుకు ... దెబ్బలు తిన్నది మాత్రం మంచమే. నల్లులు చేరిన తరువాత మంచానికి కష్టాలు ఎలా వచ్చాయో, దుర్మార్గులతో కలిసిన వారి జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. మహాభారతంలో దుర్యోధనడు అంటాడు...‘‘జానామిధర్మంనచమే ప్రవృత్తిః జానామ్యధర్మం నచమే నివృత్తిః...’’ నాకు ధర్మం తెలియదనుకుంటున్నారా...నాకు అన్నీ తెలుసు కానీ దాన్ని పాటించాలనిపించడం లేదు. దాన్ని పట్టుకుంటే జీవితంలో వృద్ధిలోకి వస్తామని కూడా తెలుసు. విజయాలు వరిస్తాయనీ తెలుసు. నాకు అధర్మం ఏదో తెలియదనుకుంటున్నారా.. ఏది చెయ్యకూడదో నాకు తెలుసు. అది చేస్తే భగవంతుడి అనుగ్రహం ఉండదని కూడా తెలుసు. అలా ఉంటే జీవితంలో ఇబ్బందులపాలవుతామనీ తెలుసు...అయినా అధర్మాన్ని విడిచిపెట్టాలనిపించదు. ’’ అంటూ ఇంకా దుర్యోధనుడు ఏమన్నాడో చూడండి...‘‘...కేనాపి దేవేన హృధిస్థితేన యథాప్రవృతోస్మి తథాకరోమి’’...అన్నాడు... అంటే.. ఇందులో నా తప్పేముంది? మీ అందరికీ ఉన్నట్టే నా హృదయంలో కూడా భగవంతుడున్నాడు. ఆయన నన్ను ధర్మాన్ని పట్టుకోనీయడం లేదు. అధర్మాన్ని పట్టుకోనిస్తున్నాడు. నేను పట్టుకుంటున్నా. ఇది నా తప్పెలావుతుంది? ఏదయినా తప్పు ఉంటే లోపల ఉన్న భగవంతుడిది అవుతుంది..’’ అటువంటి వితండవాదనలు చేసే మూర్ఖులను ఎంతమంది రుషులు, సాధుసత్పురుషులు వచ్చినా ఏం మార్చగలరు? జీవితంలో మనకు ఇటువంటి వారు కూడా ఎక్కువగా తారసపడుతుంటారు... వారితో స్నేహం వల్ల మన జీవితాలు కూడా దారి తప్పుతాయి... మన చుట్టూ ఉండేవారిపట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో బద్దెనగారు ఉద్బోధ చేస్తున్నారు. అలా ఉండకపోతే...నల్లులకే కాదు, మంచానికి ఏర్పడిన ప్రమాదం లాగా మనకే కాదు, మన పక్కన ఉన్న ఇతరులు కూడా కష్టాలపాలవుతారని హెచ్చరిస్తున్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
17 ఏళ్ల బాలికపై యువకుడి అమానుషం.. ఆ ప్రపోజల్ వద్దన్నందుకు..
జైపూర్: సాధారణంగా కొంత మంది యువకులు.. యువతుల్ని స్నేహంపేరుతో, ప్రేమపేరుతో వేధిస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కొసారి కొంతమంది యువకులు అమ్మాయిల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు వార్తల్లో చూస్తునే ఉంటాం. తాజాగా, ఇలాంటి ఒక అమానవీయకర సంఘటన రాజస్తాన్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, జైపూర్లోని స్థానిక పాఠశాలలో చదువుకుంటున్న 17 ఏళ్ల బాలికను.. ఒక యువకుడు స్నేహంపేరుతో వేధించసాగాడు. స్నేహం చేయాలని ప్రతిరోజు బాలికను ఇబ్బందిపేట్టేవాడు. ప్రతిరోజు బాలికను అనుసరించేవాడు. ఆ బాలిక మాత్రం యువకుడి స్నేహాన్ని తిరస్కరించింది. ఈ క్రమంలో ఆ యువకుడు.. ఒకరోజు బాలిక చదువుకుంటున్న పాఠశాలను చేరుకున్నాడు. ఆ తర్వాత.. బ్లేడ్ తీసుకుని ఆమెపై విచక్షణ రహితంగా దాడిచేశాడు. దీంతో ఆమె షాక్కు గురై.. గట్టిగా కేకలు వేసింది. బాలిక అరుపులు విని పాఠశాల ఉపాధ్యాయులు అక్కడికి చేరుకున్నారు. ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో కింద పడిపోయి ఉన్న బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాలిక వాగ్మూలాన్ని తీసుకున్న పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. -
సమంతది నిజమైన ప్రేమ: ఉపాసన ఆసక్తికర కామెంట్స్
Upasana Konidela About Samantha: ఉపాసన-సమంతల స్నేహం గురించి తెలిసిందే. ఫిట్నెస్, ఆరోగ్యం, మహిళా శక్తి వంటి ఎన్నో విషయాల్లో వీరిద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. ఈ క్రమంలో ఉసాసన-సామ్కు మంచి అనుబంధం ఏర్పడింది. గతంలో ఉపాసన సొంత వెబ్సైట్ యువర్ లైఫ్.కో.ఇన్కు సామ్ గెస్ట్ ఎడిటర్గా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉపాసన సమంత గురించి తనకున్న అభిప్రాయంపై ఓపెన్అప్ అయ్యింది. చదవండి: ఆ చీకటి ఙ్ఞాపకాల్లోకి మమ్మల్ని మళ్లీ లాగొద్దు : వెంకటేశ్ 'నేను తెలంగాణ బిడ్డను. దసరా వంటి పండుగల సమయంలో కూడా మాంసం తింటాను. అయితే సమంత ఆర్టికల్స్ ఎడిట్ చేసిన తర్వాత మాంసం తినడం చాలావరకు తగ్గించాను. సమంతలో సాయం చేసే గుణం ఉంది. ఎన్నో విషయాల్లో ఆమె నాకు సహాయం చేసింది. సమంతది నిజమైన ప్రేమ' అని పేర్కొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. చదవండి: ఆమె పంపిన మెసేజ్ వల్ల మా ఇంట్లో గొడవ జరిగింది : కార్తికేయ అందుకే ఆఫర్స్ వచ్చినా వదులుకున్నాను: హీరోయిన్ -
వీటి స్నేహం బంధం చాలా గొప్పది
-
కుక్కతో చిరుత స్నేహం.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: జాత్యాహాంకారం, మత విద్వేషాలతో మనుషులు కొట్టుకు సచ్చిపోతున్నారు. కానీ ఈ జంతువులు మాత్రం జాతి వైరాన్ని మరిచి విభిన్న జాతులతో ఎంతో ప్రేమపూరితమైన స్నేహ భావంతో మెలుగుతున్నాయి. అచ్చం అలానే ఒక చిరుత, కుక్క ఎంత స్నేహ భావంగా ఉన్నాయో. పైగా అవి మొదట చూడగానే అవి ఒకే జాతి అనిపించేంత స్నేహంగా ఉంటాయి. (చదవండి: ప్రమాదం ఆ కుక్క జీవితాన్ని మార్చింది.. ఏకంగా మనిషిలా..) సరిగా చూస్తే ఈ రెండు ఎంత విభిన్న జాతులో తెలుస్తుంది. ఈ చిరుత ఎనిది నెలలు వయసులోనే తల్లికి దూరమవడంతో వెంజా రోట్వీలర్ అనే కుక్కను పెంచుకుంటున్న ఒక మహిళ ఈ చిరుతను దత్తత తీసుకుంది. ఈ చిరుతకు లునా అని పేరు పెట్టుకుని పెంచుతుంది. కానీ లునా(చిరుత), రోట్వీలర్ కొద్ది రోజుల్లోనే మంచి స్నేహితుల్లా మారిపోయాయి. అయితే దీనికి సంబంధించిన ఒక వీడియోను సదరు మహిళ "వాళ్లది విలువైన బంధం. లూనా మీపై దాడిచేయాలని సీరియస్ చూస్తుంది" అనే క్యాప్షన్తో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో పాటు లక్షల్లో వ్యూస్, లైక్లు వచ్చాయి. మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: ప్రతి డెలివరీ బోయ్కి అదే గిఫ్ట్గా ఇస్తాను) -
మీ కుటుంబానికి ఉన్నారా స్నేహితులు?
Rajinikanth Dadasaheb Phalke Award 2021: ‘నా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ నా స్నేహితుడు రాజ్ బహదూర్కు అంకితం అన్నాడు నటుడు రజనీ కాంత్. 50 ఏళ్ల నాటి స్నేహం వారిది. ఇవాళ్టికీ రజనీకాంత్ తన స్నేహితుడి ఇంటికి వెళ్లి మంచం మీద స్నేహితుడు పడుకుంటే తాను కింద పడుకుంటాడు. కుటుంబాలు కేవలం తల్లి, తండ్రి, పిల్లలతో మనలేవు. స్నేహితులు కావాలి. గాఢమైన స్నేహాలే బతుకు నావలో సంతోషాన్ని, కష్టం వచ్చినప్పుడు సపోర్ట్నీ ఇస్తాయి. మరి మనకు ఉన్నాయా అంతటి గట్టి స్నేహాలు. మన పిల్లలకు నేర్పిస్తున్నామా ఆ సంస్కారాలు? ‘ఒక మనిషికి అసలైన నష్టం ఏమిటంటే నిజమైన మిత్రుణ్ణి కోల్పోవడమే’ అని సూక్తి. సంపదలు ఎన్ని రకాలైనా ‘స్నేహ సంపద’ వాటిలో ఉంది. స్నేహితుల్ని కోల్పోవడం అంటే సంపదను శాశ్వతంగా కోల్పోవడం. ‘నీ స్నేహితులెవరో చెప్పు... నువ్వెవరో చెప్తా’ అనేది ఎందుకంటే ఆ స్నేహితుల సంఖ్యను, వ్యక్తిత్వాన్ని బట్టి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిర్థారించవచ్చు. కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చు. కాని కళ్లు తడవకుండా, ఆ సమయంలో పక్కనే స్నేహితుడు లేకుండా జీవితాన్ని దాటడం కష్టం. స్నేహ సంబంధాలు నిలబెట్టు కోవడానికి సమయం ఇస్తున్నామా? స్నేహితులను కోల్పోతే మళ్లీ పొందగలమా? ‘ఫ్యామిలీ ఫ్రెండ్స్’ అనే మాట ఉంది. మనకిప్పుడు ఎంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందరు మన ఇంటికి వచ్చి ఎందరి ఇంటికి మనం వెళ్లగలిగేలా ఉన్నాము. చెక్ చేసుకోవడం తప్పనిసరి. స్నేహంలో ఉండే ఆనందమే బలం. ఆయుష్షు. రజనీకాంత్ మరియు అతడు మొన్న ఢిల్లీలో రజనీకాంత్ తన నట జీవితానికి సంబంధించి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారాన్ని తన గురువు కె.బాలచందర్తో పాటు స్నేహితుడు రాజ్ బహదూర్కు కూడా ఇచ్చాడు. రజనీకాంత్కు బెంగళూరులో రాజ బహదూర్ అనే స్నేహితుడు ఉన్నట్టు చాలా మందికి తెలుసు. అయితే ఇప్పుడు మళ్లీ ఆ స్నేహం... స్నేహానికి ఉండే విలువ చర్చకు వచ్చాయి. ‘నాలోని నటుణ్ణి రాజ్ బహదూర్ గుర్తించి నన్ను మద్రాసు వెళ్లి సినిమాల్లో ట్రై చేయమని ప్రోత్సహించాడు’ అని రజనీకాంత్ అన్నాడు. ఒక స్నేహితుడు అన్న మాట, అతని ప్రోత్సాహమే ఇవాళ దేశానికి రజనీకాంత్ వంటి సూపర్స్టార్ని ఇచ్చింది. అందుకే రజనీకాంత్ ఆ స్నేహం పట్ల కృతజ్ఞతతో... ఆ స్నేహాన్ని నిలబెట్టుకుని ఉన్నాడు. ఎప్పటి స్నేహం? 1970 నాటి సమయం. అప్పుడు రజనీకాంత్ బెంగళూరులో తన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్గా ఉన్నాడు. బస్ కండక్టర్గా కర్ణాటక ఆర్.టి.సిలో ఉద్యోగంలో చేరాడు. అతని బస్ నంబర్ 10 ఏ. మెజెస్టిక్ నుంచి శ్రీనగర్ స్టాప్ల మధ్య తిరిగేది. దాని డ్రైవర్ రాజ్ బహదూర్. రాజ్ బహదూర్ రజనీ కన్నా ఏడేళ్లు పెద్దవాడు. కాని వారికి స్నేహం కుదిరింది. ‘ఆ సమయంలోనే రజనీకాంత్లో మంచి స్టయిల్ ఉండేది. ప్రయాణికులకు చిల్లర ఇవ్వాల్సి వస్తే కాయిన్ ఎగరేసి ఇచ్చేవాడు. ఏ కార్యక్రమాలు జరిగినా స్టేజ్ మీద నాటకం వేసేవాడు. అందరికంటే బాగా నటించేవాడు.’ అని 77 ఏళ్ల రాజ్ బహదూర్ గుర్తు చేసుకున్నాడు. అతను అప్పటి నుంచి ఇప్పటి వరకూ చామరాజ్నగర్లోనే ఉంటున్నాడు. రజనీకాంత్ అప్పట్లో దానికి దగ్గరగా ఉండే హనుమంతనగర్ లో ఉండేవాడు. డ్యూటీ సమయాల్లోనూ డ్యూటీ లేనప్పుడూ ఇద్దరూ కలిసి తిరిగేవారు. స్నేహితుడే దారి రజనీకాంత్ను సినిమాల్లో చేరమని రాజ్ బహదూర్ శత పోరు పెట్టాడు. కాని ఉద్యోగాన్ని వదిలి మద్రాసు వెళ్ళడం రజనీకి పెద్ద రిస్క్. నీకెందుకు నేనున్నా అన్నాడు రాజ్ బహదూర్. ఆ రోజు ల్లో రాజ్ బహదూర్ జీతం 400. అందులో 200 రజనీకాంత్కు పంపేవాడు. రజనీకాంత్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్న రోజులకు, స్ట్రగుల్ అయిన రోజులకు రాజ్ బహదూర్ పంపిన డబ్బే పెద్ద ఆధారం. ‘ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కోర్స్ పూర్తయ్యాక ముగింపు ఫంక్షన్కు కె.బాలచందర్ చీఫ్ గెస్ట్. ఆ టైమ్లో ఆయన రజనీకాంత్ని చూసి ‘తమిళం నేర్చుకో’ అని మాత్రం చెప్పి వెళ్లిపోయారు. రజనీ నా దగ్గరకు వచ్చాడు. బాలచందర్ ఈ మాట అన్నాడ్రా అన్నాడు. అంతేకాదు.. ఇవాళ్టి నుంచి నాతో తమిళంలోనే మాట్లాడు అన్నాడు. నేను తమిళం మాట్లాడుతూ తమిళం నేర్చుకోవడంలో సాయం చేశాను’ అన్నాడు రాజ్ బహదూర్. కృష్ణ–కుచేల నిజానికి రజనీకాంత్ ఇప్పుడు కృష్ణుడు. కాని రాజ్ బహదూర్ దగ్గర ఎప్పుడూ కుచేలుడిగానే ఉంటాడు. ఫోన్లు చేయడు. మెసేజ్లు పెట్టడు. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు గుట్టు చప్పుడు కాకుండా రాజ్ బహదూర్ ఇంటికి వచ్చి బెల్లు కొడతాడు. ఆర్టిసిలో రిటైర్ అయ్యి తమ్ముడి కుటుంబంతో సొంత ఇంట్లో జీవిస్తున్న రాజ్ బహదూర్ దగ్గర రజనీ కాంత్ కోసమే ఎప్పుడూ ఒక గది సిద్ధంగా ఉంటుంది. ఆ గదిలో ఒక సింగిల్ కాట్ ఉంటుంది. రాజ్ బహదూర్ దానిమీద రజనీకాంత్ కింద నిద్రపోతారు. రజనీకాంత్ వచ్చాడంటే స్నేహితులిద్దరినీ ఆ గదిలో వదిలి కుటుంబ సభ్యులు ఏమీ ఎరగనట్టుగా ఉండిపోతారు. ఇక రేయింబవళ్లు వాళ్ల కబుర్లు సాగుతాయి. రజనీకాంత్ ఒక్కోసారి రాజ్ బహదూర్ దగ్గర వారం పది రోజులు ఉండిపోతాడు. ఇద్దరూ చీకటి పడ్డాక మామూలు మనుషుల్లా బెంగళూరు రోడ్ల మీద తిరుగుతారు. కొనసాగే బంధం సినిమా రంగంలోని కృత్రిమత్వం నుంచి పారిపోవడానికి రజనీకాంత్ తన స్నేహాన్ని ఒక సాధనం చేసుకున్నాడు. ఒక్క రాజ్ బహదూర్ దగ్గర మాత్రమే రజనీ మామూలు మనిషిలా ఉండగలడు. మనల్ని భ్రమల్లో నుంచి, అహంలో నుంచి బయటపడేలా చేస్తూ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ మన పిల్లలకు ‘మావయ్యగానో బాబాయిగానో’ ఉంటూ మన కోసం ప్రాణం పెట్టే స్నేహితులు ఉండాలని అనిపిస్తుంది. ఇలాంటి స్నేహాలు పొందడం కష్టం కాదు. కాపాడుకోవడమే కష్టం. అందుకు ప్రయత్నించినవాళ్లే ధన్యులు. -
వైరల్ వీడియో: ‘ఏడవకురా.. ఏప్రిల్లో వెళ్లిపోతాం లే’
-
‘ఏడవకురా.. ఏప్రిల్లో వెళ్లిపోతాం లే’
ఈఇటానగర్: ప్రతి మనిషి జీవితంలో బాల్యం అందమైన జ్ఞాపకంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికి మన బుర్రలో స్వార్థం, ద్రోహం, మోసం, పేద, ధనిక తేడాలు వంటి దుర్మార్గపు ఆలోచనలు ఉండవు. మనసు నిర్మలంగా.. కల్లాకపటం లేకుండా ఉంటుంది. అందరితో కలిసి పోతాం.. త్వరగా స్నేహం చేస్తాం. ఆ వయసులో మనలో జాలి, దయ, కరుణ మాత్రమే ఉంటాయి. మన నేస్తం బాధపడితే చూడలేం. ఏదోలా వారిని ఓదారుస్తాం. ఇక చిన్నారుల్లో స్నేహం ఎంత నిజాయతీగా ఉంటుందో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. హాస్టల్కి వెళ్లిన ఓ చిన్నారి అమ్మ గుర్తుకువచ్చి ఏడుస్తాడు. అది చూసి వాడి స్నేహితురాలు ‘ఏడవకురా.. ఏప్రిల్లో వెళ్లిపోతాంలే’ అంటూ ఓదారుస్తుంది. ఈ చిన్నారుల క్యూట్ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రసుత్తం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ఈ సంఘటన అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ప్రాంతంలోని ఓ హాస్టల్లో చోటు చేసుకుంది. వీడియోలో ఓ చిన్న పిల్లాడు తన అమ్మ గుర్తుకు వచ్చి.. ఏడుస్తూ ఉంటాడు. అది గమనించి ఆ పిల్లాడి స్నేహితురాలు దగ్గరకు వెళ్లి ఓదారుస్తుంది. ‘‘అరే ఏడవకురా.. ఊర్కో. అమ్మ గుర్తుకు వస్తుందా.. ఏడవకు.. ఏప్రిల్లో వెళ్లిపోతాం లే’’ అంటూ తనకు తోచిన రీతిలో తన స్నేహితుడిని ఓదారుస్తుంది. (చదవండి: భారత్లో అందరికంటే ముందు నిద్రలేచే గ్రామం ఏదో తెలుసా?) ‘‘ప్రేమ అనేది మానవుల సహజ లక్షణం.. అలవాటు చేసుకుంటే అయ్యేది కాదు. ప్రేమ విశ్వవ్యాప్తం.. దానికి ఎంతో శక్తి ఉంది. ప్రేమిస్తూ ఉండండి.. హాస్టల్లో ఉన్న ఈ ఇద్దరు చిన్నారులు ఒకరినొకరు ఎలా ఓదార్చుకుంటున్నారో చూడండి’’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. ఎంత క్యూట్గా ఉన్నారో.. నాకు నా బాల్యం గుర్తుకు వచ్చింది. ఎంత అందమైన బంధమో కదా అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. (చదవండి: మేకింగ్ ఆఫ్ ఎ క్వీన్.. పచ్చళ్ల మహారాణి) చదవండి: నాన్నా బాగానే ఉన్నా అంటూ చివరి ఫోన్కాల్.. -
ఈ ‘ఫ్రెండ్షిప్’కి నెటిజనులు ఫిదా.. ఏకంగా 13 మిలియన్లకు పైగా వ్యూస్
ఒక కుటుంబానికి చెందిన వారు.. ఒకే తల్లికి జన్మించిన వారి మధ్య ప్రేమాభిమానాలు ఉండటం సహజం. కానీ ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా.. జీవితాంతం మన వెంట నిలిచేదే మైత్రి బంధం. స్నేహితుడు.. పేరులోనే ఉంది మన హితం కోరేవారని. జీవితంలో బంధువులు, తోబుట్టువులు మనల్ని విడిచిపెట్టి పోవచ్చు. కానీ ఫ్రెండ్ మాత్రం మనల్ని ఎన్నటికి విడిచిపెట్టడు. అయితే ఈ స్నేహ గుణం కేవలం మనుషులకు మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటే. నోరులేని మూగజీవుల మధ్య కూడా మైత్రి బంధం ఉంటుంది. అది కూడా వేర్వేరు జాతుల జీవిల మధ్య. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ట్విటర్లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఓ వ్యక్తి చేతిలో బెర్రి పళ్లు పట్టుకుని.. అడవిలాంటి ప్రదేశంలో నిల్చుని తన పెంపుడు మేక పిల్లను పిలుస్తాడు. యజమాని పిలుపు విన్న వెంటనే మేక అల్లంత దూరం నుంచి పరిగెత్తుకువస్తుంది. దగ్గరకు వచ్చాకే కనిపిస్తుంది అసలు చిత్రం. ఆ మేకపిల్ల ఒంటరిగా రాదు.. దానితో పాటు తన ఫ్రెండ్ అయిన చిన్న కోతి పిల్లను కూడా తీసుకువస్తుంది. ఆ బుజ్జి కోతి పిల్ల.. ఎంచక్కా మేకపిల్ల మెడను కర్చుకుని పట్టుకుంటుంది. (చదవండి: తిమింగలంతో దోస్తి) యజమాని దగ్గరకు వచ్చాక మేకపిల్లతో పాటు కోతి పిల్ల కూడా బెర్రి పళ్లను నోట కర్చుకుని మేక వీపు మీద కూర్చుని తింటుంది. ఈ సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. వీటి ఫ్రెండ్షిప్కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజనులు.. ఈ మూగ జీవుల మైత్రి బంధానికి ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోని 13 మిలియన్ల మందికి పైగా చూశారు. నా జీవితంలో ఇంత అద్భుత దృశ్యాన్ని ఇప్పటివరకు చూడలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. Am I high right now what is happening pic.twitter.com/itBaV1XUNK — Kristi Yamaguccimane (@wapplehouse) September 26, 2021 చదవండి: Friendship Day 2021: ముఖేశ్ మనసులో ఆనంద్ది చెరిగిపోని స్థానం -
సెప్టెంబర్లో హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ ‘ఫ్రెండ్షిప్’
ఇండియన్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ హీరోలుగా నటించిన చిత్రం ‘ఫ్రెండ్ షిప్’. జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత ఎ.ఎన్ బాలాజీ విడుదల చేస్తున్నారు. చదవండి: ‘పుష్ప’ కోసం బన్ని డెడికేషన్, మేకప్కు అంత సమయమా..! ఈ సందర్భంగా... శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎఎన్ బాలాజీ మాట్లాడుతూ ‘సెకండ్ వేవ్ తర్వాత తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఎంతో గొప్పగా ఆదరిస్తున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మా ‘ఒరేయ్ బామ్మర్ది’ చిత్రం. ఇటీవల థియేటర్లో విడులైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అందరూ సూపర్ హిట్ సినిమా అంటున్నారు. ఇప్పుడు ‘ఫ్రెండ్ షిప్’ సినిమాను సెప్టెంబర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దాదాపు 25 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో వైవిధ్యంగా రూపొందిన ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది’ అని చెప్పారు. చదవండి: అభిషేక్కు గాయాలు.. హాస్పిటల్కు రాని ఐశ్వర్యరాయ్? కాగా మలయాళంలో అందరూ కొత్త నటీనటులతో చేసి సూపర్ హిట్ అయిన ‘క్వీన్’ సిరీస్కు రీమేక్ రైట్స్ తీసుకుని ‘ఫ్రెండ్షిప్’ పేరుతో రీమేక్ చేశారు. ఇందులో హర్భజన్, అర్జున్ పోటాపోటీగా నటించారు. ఈ మూవీలో మొత్తం ఐదు ఫైట్స్, నాలుగు పాటలు ఉన్నాయట. రాజకీయాలకు, కాలేజ్ స్టూడెంట్స్ మధ్య ఏం జరిగిందనే విషయాన్ని ఆసక్తికరంగా, కమర్షియల్ అంశాలతో ఎంగేజింగ్గా దర్శకుడు జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య ఫ్రెండ్షిప్ను తెరకెక్కించారు. ఈ మూవీ ఐదు భాషల్లో(తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం) విడుదలవుతుంది. సెన్సార్కు సిద్ధమైంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్లో విడుదల చేసేలా ప్లాన్ చేశారు మేకర్స్. ఇక త్వరలోనే రిలీజ్ డేట్ను కూడా ప్రకటిస్తామని చిత్ర బృందం ఈ సందర్భంగా వెల్లడించింది. -
`ఫ్రెండ్షిప్’లో తప్పకుండా వైవిధ్యంగా ఉంటుంది: ఎ.ఎన్ బాలాజీ
ఇండియన్ మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఫ్రెండ్షిప్’. జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య దర్శకులు. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్పై ఎ.ఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేరోజున విడుదలవుతున్న ఫ్రెండ్షిప్ చిత్రాన్ని తెలుగులో ఎ.ఎన్.బాలాజీ సెప్టెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ మాట్లాడుతూ.. ‘మలయాళంలో అందరూ కొత్త నటీనటులతో చేసి సూపర్ హిట్ అయిన `క్వీన్` సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని `ఫ్రెండ్షిప్` పేరుతో రీమేక్ చేశారు. హర్భజన్, అర్జున్ పోటాపోటీగా నటించారు. దాపు పాతిక కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా తప్పకుండా వైవిధ్యంగా ఉంటుంది. రాజకీయాలకు, కాలేజ్ స్టూడెంట్స్ మధ్య ఏం జరిగిందనే విషయాన్ని ఆసక్తికరంగా, కమర్షియల్ అంశాలతో ఎంగేజింగ్గా దర్శకుడు జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య తెరకెక్కించారు. సినిమా ఐదు భాషల్లో(తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం) విడుదలవుతుంది. సెన్సార్కు సిద్ధమైంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్లో విడుదల చేసేలా ప్లాన్ చేశాం. త్వరలోనే రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేస్తాం’అన్నారు. -
పాటకు... ఫైట్కూ రెడీ
క్రికెటర్ హర్భజన్ సింగ్, హీరో అర్జున్ నటిస్తున్న చిత్రం ‘ఫ్రెండ్ షిప్’. ‘సింగ్ అండ్ కింగ్’ అనేది ఉపశీర్షిక. జాన్ పాల్ రాజ్–శ్యామ్ సూర్య సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ బిగ్బాస్ ఫేమ్, మాజీ మిస్ శ్రీలంక లోస్లియా హీరోయిన్గా నటì స్తున్నారు. ఆర్.కె ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్పై ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తున్నారు. నేడు (జూలై 3) హర్భజన్ సింగ్ పుట్టినరోజుని పురస్కరించుకుని షూటింగ్ విశేషాలను చిత్రబృందం తెలియజేసింది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రమిది. తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జెఎస్కె) విలన్గా నటిస్తున్నారు. మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామి మంత్రాలయంలో విడుదల చేసిన లోగోకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలోని ఒక పాట, ఫైట్ని హైదరాబాద్లో చిత్రీకరించనున్నాం’’ అన్నారు. సో.. హర్భజన్ పాటకు, ఫైట్కూ రెడీ అవుతున్నారన్న మాట. ఈ చిత్రానికి సంగీతం: డి.ఎం. ఉదయ్ కుమార్, కెమెరా: శాంతకుమార్. -
భజ్జీ సినిమా టీజర్ విడుదల, విషెస్ చెప్పిన రైనా
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆటగాడు హర్బజన్ సింగ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఫ్రెండ్ షిప్’. ప్రస్తుతం ఈ సినిమా చివరి షూటింగ్ షెడ్యూల్ను జరుపుకుంటోంది. ఈ క్రమంలో భజ్జీ తన మూవీ టీజర్ను ట్విటర్లో మంగళవారం విడుదల చేశాడు. హిందీ, తెలుగు, తమిళ బాషల్లో విడుదలైన ఈ టీజర్ యూట్యూబ్ లింక్లను షేర్ చేస్తూ.. ‘నా మూవీ ‘ఫ్రెండ్షిప్’ టీజర్ వచ్చేసింది. లింక్స్ ఇక్కడ ఉన్నాయి. చూసి ఎంజాయ్ చేయండి గాయ్స్’ అంటూ భజ్జీ ట్వీట్ చేశాడు. దీంతో క్రికెటర్ సురేష్ రైనా, మరికొందరు ఆటగాళ్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా భజ్జీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఇప్పటికే విడుదలైన ఈ మూవీలోని పాట, ఫస్ట్లుక్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. Sharp,Crisp,Intense #FriendShipMovieTeaser of my Movie is Here.Enjoy it,Guys! Tamil -https://t.co/LSUImD7xUG Telugu-https://t.co/unECTwvJK5 Hindi-https://t.co/BSzIWz05iG @JPRJOHN1 @akarjunofficial @shamsuryastepup #Losliya @actorsathish @JSKfilmcorp @ImSaravanan_P — Harbhajan Turbanator (@harbhajan_singh) March 1, 2021 ఇటీవల విడుదలైన ఓ సాంగ్లో భజ్జీ లుంగీతో మాస్ స్టేప్పులేసి అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న హర్భజన్ అనంతరం ఐపీఎల్లో పాల్గోననున్నాడు. ఇదివరకు భజ్జీ బాలీవుడ్ చిత్రాలు ‘ముజే షాదీ కరోగీ’, ‘సెకండ్ హ్యాండ్ హస్బెండ్’తో పాటు ఓ పంజాబీ మూవీల్లో అతిథి పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. జాన్ పాల్రాజ్, శ్యామ్ సూర్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2019లో ప్రారంభమైన ఈ సినిమా కరోనా వలన ఆలస్యమైంది. ఇప్పుడు షూటింగ్ను శరవేగంగా పూర్తిచేసుకుంటూ వేసవిలో విడుదలకు సిద్ధంగా అవుతోంది. చదవండి: తమిళ బంధాన్ని తలుచుకుని భావోద్వేగం భజ్జీ సినిమా హక్కులు ఎ.ఎన్.బాలాజీకీ -
తిమింగలంతో దోస్తి
వావ్ అనిపించే చిత్రం.. ఏదో బెస్ట్ ఫ్రెండ్స్లాగ.. వీరిద్దరి బంధం సూపర్ కదూ.. దీని వెనుక ఓ కథ ఉంది. 2019లో నార్వేలోని హామర్ఫెస్ట్లో శరీరంపై కెమెరా తగిలించి ఉన్న ఈ బెలూగా వేల్ కొంతమంది మత్స్యకారులకు కనిపించింది.. ఈ కెమెరా పరికరం మీద సెయింట్ పీటర్స్బర్గ్ పేరు ఉండటంతో.. రష్యావాళ్లు పంపిన గూఢచారి తిమింగలం అని అప్పట్లో అనుకున్నారు.. కన్ఫర్మ్ కాలేదనుకోండి.. అయితే.. కెమెరా చుట్టి ఉండటంతో ఇది చాలా ఇబ్బంది పడుతూ కనిపించింది.. తిమింగలం కావడంతో దాన్ని విప్పదీయడానికి అందరూ దూరం నుంచి ట్రై చేశారు.. కానీ సాధ్యం కాలేదు.. అప్పుడు ఈ చిత్రంలోని హెస్టెన్ అనే వ్యక్తి ధైర్యం చేసి.. నీళ్లలోకి దిగి.. దీనికి బంధవిముక్తి కలిగించాడు. అప్పట్నుంచి వీరిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు.. ఆ మధ్య కలిసినప్పుడు ఓ ఫొటోగ్రాఫర్ తీసిన చిత్రమిది.. అద్భుతంగా ఉంది కాబట్టి.. సోనీ వరల్డ్ ఫొటోగ్రఫీ అవార్డ్స్ 2021 తుది జాబితాకు ఎంపికైన చిత్రాల్లో దీనికీ చోటు దక్కింది. ఇంకో విషయం.. ఈ వేల్కు ఉన్న ఫ్రెండ్లీ నేచర్ వల్ల ఇప్పుడది లోకల్గా ఓ సెలబ్రిటీ అయిపోయింది. దూరప్రాంతాల నుంచి పర్యాటకులు దీన్ని చూడటానికి వస్తుంటారు. -
హీరోయిన్తో మాస్ స్టెప్పులేసిన క్రికెటర్
లుంగీ కట్టి.. కళ్లజోడు పెట్టుకుని హీరోయిన్తో కలిసి భారత వెటరన్ క్రికెటర్ ఊరమాస్ స్టెప్పులు వేశాడు. త్వరలోనే ప్రేక్షకులు, అభిమానులను పలకరించేందుకు వెండితెరపై రానున్నాడు. ఆయనే స్పిన్నర్ హర్బజన్ సింగ్. ఆయన ‘ఫ్రెండ్షిప్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ పాట షూటింగ్ చేశారు. ఈ షూటింగ్లో భాగంగా భజ్జీ మాస్ స్టైల్ లుక్లో కనిపించాడు. భజ్జీ ప్రస్తుతం ‘ఫ్రెండ్షిప్’ సినిమా పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తవుతోందని, వేసవిలో విడుదల అవుతుందని ట్విటర్ వేదికగా హర్బజన్ ప్రకటించాడు. ఈ సందర్భంగా భజ్జీ భావోద్వేగానికి లోనయ్యాడు. తమిళ సంప్రదాయ వస్త్రధారణ (ధోతి) ధరించానని చెబుతూ.. ‘తమిళనాడు నన్ను తల్లిలా ఆదరించింది’ అని తమిళంలో ట్వీట్ చేశాడు. గతంలో చెన్నె సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా హర్బజన్ సింగ్ గుర్తుచేసుకున్నాడు. బిగ్బాస్-3 ఫేమ్ లోస్లియా భజ్జీకి జోడీగా నటిస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ లోస్లియాతో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఫొటోలు వైరల్గా మారాయి. జాన్ పాల్రాజ్, శ్యామ్ సూర్య నిర్మాణంలో ఫ్రెండ్షిప్ సినిమా రూపుదిద్దుకుంటోంది. యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2019లో ప్రారంభమైన ఈ సినిమా కరోనా వలన ఆలస్యమైంది. ఇప్పుడు షూటింగ్ శరవేగంగా పూర్తయి వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది. హర్బజన్ ప్రస్తుతం ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. సినిమా పూర్తయిన అనంతరం ఐపీఎల్లో కనిపించే అవకాశం ఉంది. వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాలో హర్బజన్ చోటు దక్కించుకున్నాడు. Friendship Movie Final Schedule Production has taken of in Jet Speed. I am eagerly waiting to meet you al in theaters in a Different Pitch in a New Avatar.This Summer Let's Rock #FriendshipSummer@ImSaravanan_P @JPRJOHN1 @akarjunofficial @shamsuryastepup #Losliya @actorsathish pic.twitter.com/D54Q84JVeJ — Harbhajan Turbanator (@harbhajan_singh) February 15, 2021 -
భజ్జీ సినిమా హక్కులు ఎ.ఎన్.బాలాజీకీ
క్రికెటర్ హర్భజన్ సింగ్, నటుడు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫ్రెండ్ షిప్’. ‘సింగ్ అండ్ కింగ్’ అన్నది ఉపశీర్షిక. మాజీ మిస్ శ్రీలంక, తమిళ బిగ్ బాస్ విన్నర్ లోస్లియా హీరోయిన్ గా నటిస్తున్నారు. జాన్ పాల్ రాజ్–శ్యామ్ సూర్య సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. 25 కోట్ల బడ్జెట్తో తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు హక్కులను శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఎ.ఎన్.బాలాజీ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎ.ఎన్ . బాలాజీ మాట్లాడుతూ –‘‘ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ నేపథ్యంలో ప్రేమలు, గొడవల మధ్య ఆద్యంతం ఉత్కంఠగా నడిచే చిత్రమిది. చివరి షెడ్యూల్ ప్రస్తుతం కోయంబత్తూర్, ఊటీలలో జరుగుతోంది. హర్భజన్ సింగ్కు దేశవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఈ చిత్రం హిందీలోనూ విడుదల కానుంది’’ అన్నారు. -
ఇన్స్టాగ్రామ్లో పరిచయం.. ఇంటికి వచ్చి
సాక్షి, నాగోలు: ఇన్స్టాగ్రామ్లో అయిన పరిచయంతో ఆకలవుతుందని ఇంటికి వచ్చి బంధించి సొత్తును దొంగిలించిన అంతర్రాష్ట్ర నేరస్తులను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.26 లక్షల విలువ చేసే సామగ్రిని స్వాదీనం చేసుకున్నారు. సోమవారం ఎల్బీనగర్లో రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన నిఖిల్, వినయ్ చౌదరి, ఉదయ్ కుమార్, బ్రహ్మ తేజలు చిన్నానాటి స్నేహితులు. నలుగురూ నేరాల బాట పట్టారు. వనస్థలిపురంలో స్వచ్చంద హెల్ప్ కిడ్స్ హ్యాపీ కిడ్స్ అనే సంస్థ నడిపే సతీష్తో ఇన్స్ట్రాగామ్ లో పరిచయం పెంచుకున్న నిఖిల్ అతని ఆర్థిక లావాదేవీల గురించి తెలుసుకున్నాడు. చదవండి: మొన్న తమ్ముడు.. నేడు అన్న సతీష్ దగ్గర డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితులు బొమ్మ పిస్టల్ తీసుకొని వచ్చారు. ఈ నెల 15వ తేదీన వనస్థలిపురంలో నివాసముండే సతీష్ ఇంటికి నలుగురూ వచ్చారు. హఠాత్తుగా సతీష్పై దాడి చేసి నోరు మూసి తాడుతో చేతులు కట్టి బొమ్మ పిస్టల్తో బెదిరించి. నగదు. రూ.1.18 లక్షల నగదు, విదేశీ, కరెన్సీ, రెండు ల్యాప్టాప్లు, మూడు మొబైల్ ఫోన్లు, సిల్వర్ నెక్లెస్ దోపిడీ చేశారు. తరువాత బళ్లారికి పారిపోయారు. మళ్లీ నేరం చేసేందుకు సోమవారం శంషాబాద్కు వచ్చారు. నిందితులపై నిఘా ఉంచిన ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.26 విలువ చేసే వస్తువులను స్వాదీనంచేసుకున్నారు. -
అమ్మాయితో స్నేహం నచ్చక కొట్టి చంపారు
న్యూఢిల్లీ: ఒక యువతితో స్నేహం చేసినందుకు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని ఆమె బంధువులు కొట్టి చంపారు. ఈ నెల 7న ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం పశ్చిమ ఢిల్లీ ఆదర్శనగర్లో ఉంటున్న 18 ఏళ్ల వయసున్న రాహుల్ రాజ్పుత్ ఢిల్లీ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబాన్ని పోషించడానికి చాలా మందికి ట్యూషన్లు చెబుతూ ఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయితో స్నేహం బాగా బలపడింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి స్నేహం నచ్చక అమ్మాయి తరఫు బంధువులు రాహుల్పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత రాహుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు నార్త్వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఆర్య చెప్పారు. అయిదు మంది కలిసి రాహుల్ని తోస్తూ పక్కకి లాగడం, అతనిపై దాడికి దిగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ అమ్మాయి సోదరుడు, మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసింది. పల్లెటూరు నుంచి వచ్చిన ఆ కుటుంబాన్ని రాహుల్ పోషిస్తున్నాడని, అందరికీ సాయపడుతూ ఉండే అతని మృతి ఆ కుటుంబానికి తీరని లోటని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. శనివారం ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. దోషుల్ని కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
ఆమెతో స్నేహం.. యువకుడి ప్రాణాలమీదకు
న్యూఢిల్లీ: చెల్లెలితో స్నేహం చేస్తున్నాడని పగబట్టిన ఓ అన్న 18 ఏళ్ల యువకుడిపై దాడి చేసి హతమార్చాడు. ఢిల్లీలోని ఆదర్శనగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్ రాజ్పుత్ ఢిల్లీ యూనివర్సిటీలో ఓపెన్ విధానంలో డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నాడు. వారు నివాసం ఉంటున్న ఆదర్శనగర్ ప్రాంతానికి చెందిన అమ్మాయితో గత రెండేళ్లుగా స్నేహంగా ఉంటున్నాడు. యువతి కుటుంబ సభ్యులు వారి ఫ్రెండ్షిప్పై పలుమార్లు అభ్యంతరం తెలిపారు. ఈక్రమంలోనే యువతి అన్న గత బుధవారం రాహుల్ రాజ్పుత్ని నందా రోడ్డు వద్దకు పిలిచి గొడవకు దిగాడు. తన చెల్లితో స్నేహం ఆపాలంటూ మరో ముగ్గురితో కలిసి చితకబాదాడు. అనంతరం అక్కడ నుంచి జారుకున్నాడు. విషయం తెలుసుకున్న రాహుల్ కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. యువతి అన్న, అతని ముగ్గురు స్నేహితులను అరెస్టు చేశామని వాయువ్య ఢిల్లీ డీసీపీ విజయంత ఆర్యా పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామని తెలిపారు. (చదవండి: ప్రాణాలు తీసిన ట్రయాంగిల్ లవ్స్టోరీ..) పోస్టుమార్టం నివేదికలో రాహుల్కు అంతర్గతంగా తీవ్ర గాయాలయ్యాయని తేలిందని వెల్లడించారు. రాహుల్ ప్లీహానికి చీలిక రావడంతో మరణం సంభవించిందని డాక్టర్లు చెప్పినట్టు డీసీపీ తెలిపారు. ఇది రెండు కుటుంబాల మధ్య ఘర్షణ మాత్రమేనని.. దీనిపై ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసి ఉద్రిక్తతలు రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు. కాగా, తొలుత కేసు నమోదు చేయడంలో పోలీసులు జాప్యం చేశారని రాహుల్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దాడి విషయం తెలియగానే.. నిందితులపై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్కు వెళ్తే తమ మాట వినిపించుకోలేదని అన్నారు. రాహుల్ ఒంటిపై చిన్న గాయమైనా లేదని కేసు నమోదు చేయలేదని చెప్పారు. తమ బిడ్డ ప్రాణాలు గాల్లో కలిసిపోయాక పోలీసులు కళ్లు తెరిచారని విమర్శించారు. (చదవండి: పూజ చేయొద్దని మహిళపై దాడి) -
కోహ్లితో పాటు ఆడటం నా అదృష్టం: విలియమ్సన్
ముంబై: భారత కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు క్రికెట్ ఆడటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. చిన్ననాటి నుంచి క్రికెటర్గా కోహ్లి ఎదుగుదలను దగ్గర నుంచి పరిశీలిస్తున్నానని కేన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం అగ్రశ్రేణి క్రికెటర్లుగా వెలుగొందుతోన్న వీరిద్దరూ... 2008లో టీమిండియా టైటిల్ నెగ్గిన ఐసీసీ అండర్–19 వరల్డ్కప్ సెమీఫైనల్లో ప్రత్యర్థులుగా తలపడ్డారు. ‘కోహ్లి, నేను ఒకే తరంలో క్రికెట్ ఆడటం మా అదృష్టం. చిన్న వయస్సులోనే మేమిద్దరం కలుసుకున్నాం. అప్పటి నుంచి అతని పురోగతిని, క్రికెటర్గా అతని ప్రయాణాన్ని అనుసరిస్తున్నా. సుదీర్ఘ కాలంగా ఆటలో మేం ఒకరితో ఒకరం తలపడుతున్నాం. కానీ గత కొన్నేళ్లుగా ఆటపై మా అభిప్రాయాలను, ఆలోచనలను నిజాయితీగా ఒకరితోఒకరం పంచుకుంటున్నాం. మా ఇద్దరి ఆటతీరు వేరైనప్పటికీ... కొన్ని అంశాల్లో మా ఆలోచనా తీరు ఒకేలా ఉంటుంది’ అని విలియమ్సన్ పేర్కొన్నాడు. -
నాలుగు భాషల్ ఫ్రెండ్షిప్
క్రికెటర్ హర్భజన్సింగ్ హీరోగా నటిస్తోన్న తొలి చిత్రం ‘ఫ్రెండ్షిప్’. ఈ చిత్రంలో తమిళ బిగ్బాస్ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో ‘యాక్షన్ కింగ్’ అర్జున్, సతీష్ ప్రధాన పాత్రధారులు. దర్శక ద్వయం జాన్పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమాను జేపీఆర్, స్టాలిన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హర్భజన్ ఇంజనీరింగ్ స్టూడెంట్గా కనిపిస్తారని సమాచారం. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వేల్మురుగన్, రాబిన్. -
రెండేళ్ల చిన్నారితో ఓ ఏనుగు ఫ్రెండ్షిప్
-
వైరల్ : ఇదేం వింత స్నేహం?!
రెండు భిన్న జాతులకు చెందిన జంతువులు స్నేహంగా ఉండటం మనం చూసే ఉంటాం. పిల్లి-కుక్క, పిల్లి-ఎలుక, కుక్క-పులి, కోతి-కుక్క, కుక్క-గుర్రం ఇలా పొంతన కుదరదు అనుకునే జంతువులు స్నేహంతో ఒక్కటై మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ వింత స్నేహానికి సంబంధించి వార్త ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. పాము- పిల్లి ఈ రెండు జంతువుల మధ్య స్నేహం ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. డిచ్ పోనీ అనే మహిళకు చెందిన రికీ పేరుగల నల్ల పిల్లి, గత కొద్దిరోజులుగా ఓ నల్ల పాముతో స్నేహంగా ఉంటోంది. ఇది గమనించిన పోనీ వాటి ఫొటోలను తీసింది. పాముతో ఆడుకుంటున్న పిల్లి తన ట్విటర్ ఖాతాలో ఉంచి ‘‘ నా పిల్లి ఎల్లప్పుడూ ఆ పాముతో ఉంటోంది. దానికి ఎలాంటి హానీ చేయటం లేదు. ఇద్దరూ కలిసి ఎండలో సన్బాత్ చేయటం లేదు కదా?’’ అంటూ ఫన్నీగా స్పందించింది. ఈ వింత స్నేహం దాదాపు లక్ష రీట్వీట్లతో.. 60వేల లైకులతో దూసుకుపోతోంది. కొందరు నెటిజన్లు ‘‘ అలాంటి స్నేహం నాకూ కావాలి... స్నేహితుడితో సన్ బాతింగ్... ఇదేం వింత స్నేహం?!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. why did I find my cat hanging out with a snake? neither harmed- just basking together pic.twitter.com/dvTRHF1Wiy — ditch pony (@molly7anne) April 30, 2020 చదవండి : లాక్డౌన్ తొలగిస్తే ఇలాగే పరిగెడతారేమో! -
క్రికెటర్ టు స్టూడెంట్!
క్రికెటర్ నుంచి యాక్టర్గా మారి ‘ఫ్రెండ్షిప్ యువర్స్ ఫ్రెండ్లీ’ అనే చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నారు హర్భజన్ సింగ్. ఇందులో లోస్లియా మరియాసేన్ కథానాయికగా నటిస్తున్నారు. జాన్పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటుడు అర్జున్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఈ సినిమాలో మెకానికల్ స్టూడెంట్గా హర్భజన్ సింగ్ నటిస్తున్నట్లు తెలిసింది. ‘‘స్కూలింగ్ తర్వాత కొంత గ్యాప్ వచ్చి, మళ్లీ చదువును కొనసాగించే వ్యక్తి పాత్రలో కనిపిస్తారు హర్భజన్ సింగ్. మెకానికల్ ఇంజినీరింగ్ చదవడం కోసం పంజాబ్ నుంచి కోయంబత్తూర్ వచ్చి ఓ కాలేజ్లో జాయిన్ అవుతారు హర్భజన్. కోయంబత్తూర్కే హర్భజన్ ఎందుకు వచ్చాడు? అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే కథాంశం. ఈ చిత్రంలో అర్జున్ క్యారెక్టర్ ఆడియన్స్కు థ్రిల్లింగ్గా ఉంటుంది. లాక్డౌన్కి ముందే తొలి షెడ్యూల్ పూర్తయింది. లాక్డౌన్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం
అప్పుడు సరిగ్గా ఉదయం 8.20 అయింది. ఆజానుబాహువు– అరవింద దళాయతాక్షుడు ఔనో కాదో కళ్లద్దాల వెనుక కనబట్టం లేదు. నల్లనివాడు కాదుగాని, చేత ధరించిన బ్రీఫ్కేస్ నల్లగానే ఉంది. రైలు దిగి తిన్నగా పెద్దపెద్ద అడుగులేసుకుంటూ స్టేషన్లో ఓ ఫర్లాంగు దూరంలో ఉన్న ఓ రెస్టారెంట్ని దాటి వెళుతున్నాడు. రెస్టారెంట్లో కూర్చుని, అప్పుడే రైలు దిగిన ప్రయాణికులు, ఆవురావురుమంటూ టిఫిన్లు తిని కాఫీలు తాగుతున్నారు. రెస్టారెంట్లోంచి నాసికాపుటాల్ని తాకి నోరూరించే సువాసనలు కూడా ఆ నరమానవుడిలో ఏ విధమైన చలనాన్నీ కలిగించలేదంటే చాలా ముఖ్యమైన పనిమీదే ఉన్నట్లున్నాడు గురుడు. మూడు నాలుగు మలుపులు తిరిగి ఎదురుగా గర్వంగా నిలబడి ఉన్న ‘శాన్ రోజరియో జాతీయ బ్యాంకు’ ముందు నిలబడ్డాడు– పరిశీలనగా చూశాడు. తల పంకించాడు. తన జేబులో చెయ్యి పెట్టి ఓ చిన్న విజిటింగ్ కార్డులాంటిది పైకితీసి ఒకసారి పరిశీలించి– మెరిసీ మెరవని చిరునవ్వును బలవంతంగా అదిమిపెట్టి– కృతనిశ్చయంతో లోపల ప్రవేశించాడు. అప్పుడే బ్యాంకు సిబ్బంది కొంతమంది వచ్చారు– వాళ్ల వాళ్ల సీట్లలో సర్దుకుంటున్నారు. మరికొందరు వస్తున్నారు. క్యాషియర్ కరెన్సీ లెక్క పెట్టుకుని కౌంటరు తాళాలు తీసుకుని ఇంకో కౌంటరులో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాడు. మన ఆగంతకుడుగారు క్యాష్ కౌంటర్ ముందు నిలబడి సిద్ధంగా ఉన్నాడు. క్యాషియర్ విసుగ్గా మొహంపెట్టి ‘‘కౌంటర్ తెరవడానికి ఇంకో పదినిమిషాలు టైముంది మహానుభావా!’’ అన్నాడు. వచ్చిన ఆసామీ జేబులోంచి ఓ కార్డు తీసి కౌంటరు కన్నంలోంచి పైకి తోశాడు. దీని మీద... జేఎఫ్సీ నెటిల్విక్– నేషనల్ బ్యాంక్ ఎగ్జామినర్ అని ఉంది. క్యాషియర్ కంగారుపడిపోయాడు. ‘‘మీ..రా.. సర్!... మీరు ఇదివరకు ఎప్పుడూ ఇటు రాలేదనుకుంటాను... అందుకే మీరు ఎవరో కస్టమర్ అయుంటారనుకున్నాను. క్షమించండి... అటు తిరిగి రండి సర్... ముందు మేనేజర్గారిని కలవడం పద్ధతి కదా!... పరిచయం చేస్తాను’’ అన్నాడు భయం భయంగా... బ్యాంకు మేనేజర్ మేజర్ థామస్ బి కింగ్మన్ మహాశయుడు– అయితే ఎంత పెద్దపేరు పెట్టినా చివరకు మిగిలేది టామ్ డిక్ హ్యారీలాంటిది ఏదో మిగులుతుంది. అతని పూర్తి పేరుతోకాక మేజర్ టామ్ అని పిలుస్తుంటారు. పరస్పర పరిచయాలు అయ్యాక... ‘‘అరె మీరొచ్చారేమిటి? మేం వస్తాడనుకుంటున్నది శామ్ టర్నర్ కదా! నాలుగేళ్ల నుంచి ఆయనే మా బ్యాంకు ఇన్స్పెక్షన్ నిర్వహిస్తున్నాడు. అహ! దానికేముంది లెండి... మాది చిన్న బ్యాంకు ఏదో నెట్టుకొస్తున్నాం తప్ప మా టర్నోవర్ కూడా అంతంత మాత్రం. కొంచెం నిదానంగానే చేతురుగాని. అసలు టర్నరయితే అసలేం చూడకుండానే ‘వెరిఫైడ్ అండ్ ఫౌండ్ కరెక్ట్’ అని రాసి పారేయండి కింద వేలిముద్ర వేసేద్దాం అంటాడు.. హహ్హహ్హ!’’ అంటాడనికాదు– మా లావాదేవీలు అంత నిర్దుష్టంగా ఉంటాయి సుమా! అని, అయితే ఆయన వెరిఫై చెయ్యకమానడు హ్హె! హ్హె! హ్హె! అంటూ వెర్రినవ్వులాంటిదేదో నవ్వేశాడు. ఈ ఆడిటర్గారిది కర్రపిడి వ్యాపారం. ముఖంమీద ఏ భావాలూ పట్టుకోలేరు. ‘‘ఇటు వాళ్లు– ఆ ప్రాంతానికి ఆ ప్రాంతం వాళ్లు ఈ ప్రాంతానికి మారి చెక్ చెయ్యాలని స్పెషల్ ఆర్డర్స్ వచ్చాయి’’ అని వడివడిగా అనేసి ‘‘క్యాష్కౌంటర్కి, స్ట్రాంగ్రూమ్కి పదండి’’ అన్నాడు ప్యాంటు జేబులో చెయ్యిపెట్టుకుని స్టిఫ్గా లేస్తూ. ‘‘ఆల్రైట్ పెర్రిడొర్సీ! ఈయన వ్యవహారం చూసుకోవోయ్’’ అన్నాడు క్యాషియర్ వైపు చూస్తూ. పెర్రిడోర్సీ మహాకాయుడు. అతని చేతిలో చిల్లర లెక్కపెట్టేటప్పుడు చూడాలి చిన్న చిన్న తుపాకి రవ్వల్లా మెరుస్తుంటాయి నాణేలు. ఈ నాణేల లెక్క ప్రహసనం ఇలా జరుగుతుండగా ఓ చిన్న తమాషా జరిగింది. టామ్ కింగ్మన్– మెసెంజర్ రాయ్కి కళ్లతో ఏదో సంజ్ఞ చేయడం, రాయ్ మెల్లగా పక్క నుంచి రోడ్డు మీదకు జారిపోవడం– తిన్నగా స్టాక్మన్ నేషనల్ బ్యాంకుకు పరుగు తీయడం జరిగింది. బహుశ! అవతల మా బ్యాంకు ఇన్స్పెక్షన్ జరుగుతోందని ఉప్పందించమని పంపాడేమో అనుకుంటే పొరపాటే! ఒక చోట ఆడిటింగ్ జరుగుతుంటే మరో బ్యాంకుకు ఉప్పు అందించడం వాళ్లలో వాళ్లు ఏర్పాటు చేసుకున్న ఒక అవగాహన– కేవలం అండర్స్టాండింగ్. ఆ బ్యాంకు మేనేజర్ కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు. ఇలా కొత్త ఆడిటర్ వచ్చి నానా పెంటా పెడుతున్నాడని విని– చిరునవ్వు నవ్వాడు బక్లీ అనే ఆ మేనేజర్. రాసే ఫైలును పక్కన పెట్టేడు– ‘‘కూర్చోవోయ్ రాయ్– టేక్ యువర్ సీట్’’ అన్నాడు. ‘‘నో సర్! మళ్లీ వెళ్లిపోవాలి. వచ్చిన కొత్తాయన చండాశసనం ముండావాడిలా ఉన్నాడు’’. ‘‘కాఫీ తాగి వెళ్లవోయ్– ఈలోగా ఉపద్రవాలేం జరగవు– కాఫీ కూడా ‘ఉప’ద్రవమే.. హ్హె హ్హె హ్హె’’ అని నవ్వేశాడు. ‘‘కాద్సార్’’ ‘‘ఏదీ లేదు సర్, ‘‘తప్పదు’’ అని ఫ్లాస్కులోని కాఫీ కప్పులో పోసి అందించాడు– చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన మేనేజర్లేమో– వాళ్లెప్పుడూ తరతమ భేదాలనూ, అంతరాలనూ పాటించేవారు కాదు... కాఫీ పూర్తిచేసి ‘‘వస్తాను సర్’’ అని లేచాడు రాయ్. ‘‘చూడు మిస్టర్ రాయ్... సమయానికి ఆదుకోలేనందుకు అయాం సారీ... ఈ ఉత్తరాన్ని మీ బాస్కి ఇవ్వు’’ ‘‘సమయానికి ఆదుకోవడం ఏమిటి సర్!’’ వెర్రిమొహం వేశాడు రాయ్. ‘‘ప్రశ్నలొద్దు– నే చెప్పినట్టు చెయ్యి’’ అన్నాడు బక్లీ. ‘పెద్దవాళ్ల గోలలు మనకేల?’ అనుకుని అతడిచ్చిన కవర్ని జాగ్రత్తగా తీసుకెళ్లి టామ్కి అందించాడు. సందేశాన్ని కూడా వినిపించాడు చెవిలో. ఈలోగా ఆడిట్ ఇన్స్పెక్షన్ చరమ ఘట్టంలోకి వచ్చింది. ‘‘ఇంక చివరి ఐటమ్– లోన్స్– దాంతో ఈ ఇన్స్పెక్షన్ పూర్తయిపోతుంది.. ఈసారి అంతా పర్ఫెక్ట్గా ఉంది ఇంతవరకు. ఇల్లలకగానే పండుగ అనుకోకండి– ఎప్పటికైనా మిమ్మల్ని హ్యాండ్సప్ అనిపించగలను’’ అంటూ లోన్ ఓచర్స్ ఫైల్ను గబగబా ఒకదాని తర్వాత ఒకటి చకచకా తిరగేసి– తన బ్రీఫ్కేసు తీసి నోట్స్లో అన్ని ఐటమ్స్ ముందూ ‘‘రైట్’’ మార్కులు పెట్టేసి ఓ లోన్ ఓచర్స్ ముందు మాత్రం ‘‘?’’ పెట్టి టప్పున మూసేసి– ‘‘థాంక్యూ మిస్టర్ కింగ్మన్.. సీయూ’’ అనబోయి– ఒక్కసారి మీ గదిలోకి దయచేస్తారా... మాట్లాడాలి’’ అన్నాడు. ఇద్దరూ మేనేజర్గారి ప్రత్యేకమైన గదిలో కూర్చున్నారు. ఆడిటర్ చాలా హుషారుగా ఉన్నాడు. అది తాను ఆడిట్ను రికార్డు స్పీడులో ముగించినందుకు తనను తాను అభినందించుకుంటున్న హుషారు కావచ్చు. లేదా మరొకందుకు కావచ్చు. ఆయన ఏమంటాడో వింటేగాని చెప్పలేం. ‘‘అయ్యా ఘనత వహించిన మేనేజర్గారూ! మీ బ్యాంకు నిర్వహణ చాలా ప్రశంసనీయంగానే ఉంది. ‘‘నే’’ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ పంటలు దెబ్బతినడం మూలానా చాలా బ్యాంకులు చేతులెత్తేసిన తరుణంలో స్వల్పలాభాల్లోనా గెంటుకొస్తున్నారంటే ప్రశంసార్హమే– మీ గుమాస్తాలంతా ఒళ్లు వంచి కష్టపడి పనిచేసే స్వభావం కలవాళ్లే– లెడ్జర్లు, పద్దు పుస్తకాలు, కరెన్సీ నోట్ల లెక్కలు, చిల్లరతో బ్యాలెన్సయ్యాయంటే– నేను మిమ్మల్ని అభినందించి తీరాలి... కాని... కాని...’’ అల్పపీడనం తాకిడి నుంచి తీరం బయట పడిందనుకుంటే... మళ్లీ వెనుదిరిగి ముంచుకొచ్చిందేమోనని షాక్ తిన్నవాడిలా కనబడుతున్నాడు టామ్. అయితే నెటిల్విక్గారికి ‘కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్’ అన్నంత హుషారుగా ఉంది. ‘‘చూడండి మిస్టర్ టామ్ 40 వేల పౌండ్ల ముఖవిలువ గల కేవలం ఆరు బాండ్ పత్రాలు మీ ఫైల్లో కనబడటం లేదు. వాటి నిజ విలువ 70 వేల వరకు ఉండవచ్చు– మరి అవి ఏమయ్యాయో మరి..?’’ ‘‘అదే చెప్పబోతున్నాను సర్! అని ఒక్కసారిగా నాటకీయంగా గొంతు సవరించుకుని లేచి పైపు వెలిగించాడు టామ్. నెటిల్విక్ విలాసంగా సిగరెట్ వెలిగించి గుండెల నిండా పొగ పీల్చి రింగు రింగులుగా వదులుతూ.. వెటకారంగా... ‘‘ఊ.. చెప్పండి సర్’’ ‘‘అబ్బే ఏం లేదు సర్! ఇది మా స్నేహితుడు బాబ్– వాడూ నేనూ చిన్నప్పట్నించి ఒకే కంచం, ఒకే మంచంగా పెరిగినవాళ్లం– ఇద్దరం పేదరికంలోంచి పైకి వచ్చిన వాళ్లం. వాడూ పశువుల్ని కాశాడు– నేనూ కాశాను. పశువుల ధరలు పలికినప్పుడు డబ్బు చేసి వాడు షేర్ బ్రోకర్గా ఎదిగాడు, నేను బ్యాంకు మేనేజర్గా ఎదిగాను. అయితే ఏ రోజూ వాణ్ణి నేనుగాని వాడు నన్నుగాని కలుసుకోకుండా ఉండేవాళ్లం కాదు. వాడికి గుర్రప్పందేలంటే తగని పిచ్చి... ‘‘ఇరవై సంవత్సరాలు వెనక్కి వెడితే (బాబూ ఈ పురాణం నాకెందుకట!! ఈ 70 వేలకీ దీనికీ సంబంధం ఏమిటట– విసుక్కున్నాడు నెటిల్విక్) నేను ఈ గ్రామానికి షరీఫ్నయ్యాను. వాణ్ణి నా సెక్రటరీని చేసుకున్నాను. ఇది మేం పశువుల బేరాల్లో సొమ్ము చేసుకోకముందే అనుకోండి. అయితే అప్పుడు షరీఫే కలెక్టరుగా కూడా వ్యవహరించేవాణ్ణి– ఈ రోజుల్లో కలెక్టరంటే, షరీఫంటే తేలికైపోయింది గాని ఆ రోజుల్లో అది చాలా గొప్ప. అప్పుడే నాకు ఒక గుర్తింపు వచ్చి పిల్లల్నివ్వడానికి ముందుకొచ్చారు. అంతవరకు నేను తోక తెగిన గాలిపటంలా తిరిగిన వాణ్ణే హ్హ! హ్హ! హ్హ!’’ అని నవ్వి చిలుము పట్టిన పైపును దులిపి– మళ్లీ దాన్లో టొబాకోని దట్టించి, దీర్ఘాలోచనగా అటూ ఇటూ తిరుగుతూ– ఆలోచిస్తున్నాడు. నెటిల్విక్– రెండో బ్యాంకు పనికూడా సాధ్యమైనంత తొందరగా ముగించుకుని 11.35 ట్రెయిన్లో వెళ్లిపోదామనే ఆత్రంలో ఉన్నాడు. ఈ 70 వేల పౌండ్ల కుంభకోణం ఏమిటో తేలాలి. ఆలస్యాన్నయినా సహించగలడు గాని అవినీతిని క్షమించడం తన నిఘంటువులోనే లేదు. ‘‘త్వరగా తెమల్చవయ్యా మహానుభావా!’’ అని మనసులో అనుకోగలడు కాని పైకి తేలాడో తాను తేలికైపోతాడు. ఇలాంటి టామ్, డిక్, హ్యారీలు తనకు కొత్త కాదు. గ్రీన్విచ్ గ్రామంలో నేషనల్ గ్రిండ్లీ బ్యాంకులో క్యాష్ ట్యాలీ కాలేదు. తను నిలదీసేసరికి క్యాషియర్ జేబులోంచి రివాల్వరు తీసి కాల్చుకు చచ్చిపోయాడు. అయినా తను లొంగలేదు– తగ్గిన డబ్బుని భార్యాపిల్లల పుస్తెలూ పూసలూ అమ్మించి మరీ కట్టించి వదిలాడు. డ్యూటీ అంటే డ్యూటీయే. దాన్లో ఇక వెసులుబాట్లూ, నసుగుళ్లూ ఉండరాదు. విందాం దీనికి ఎలా మసిపూసి మారేడుకాయ చేస్తాడో. టామ్ హరికథ మొదలుపెట్టాడు ‘‘పెళ్లంటే నూరేళ్ల పంట... అప్పటిదాకా అనామకుడిగా ఉండిపోయిన వాడికి బాధ్యతలు, బంధుత్వాలు, బంధాలు పెరుగుతాయి. నువ్వు లేచి కాలకృత్యాలు తీర్చుకుని షేవ్ చేసుకుని పొగలుకక్కే కాఫీ తాగుతుంటే ముద్దు ముద్దుగా మీ పాపా, బాబూ గుడ్ మోణింగ్ డాడీ అంటూ ఆప్యాయంగా బుగ్గల మీద ఒక పప్పీ ఇచ్చారనుకో నిజంగా ఒళ్లు ఆనందంతో పులకించిపోదోయ్– ఇంకో రౌండ్లో ఒరేయ్– ఏరా... అని తర్వాత ‘ల–’కార ప్రయోగంలోకి కూడా దిగేలా ఉన్నాడు. ‘‘బాబూ టామ్గారూ! ప్రాణాలు తియ్యక సబ్జెక్టులోకి రండి’’ అన్నాడు అసహనంగా వాచీ చూసుకుంటూ– ‘‘ఆ ఎక్కడున్నాం? నాకు పెళ్లయిన ఆర్నెల్లకే మా బాబ్గాడూ పెళ్లాడేశాడు. షరా మామూలే. వాడు గుర్రపు రేసులు మాత్రం మానడు– మా చెల్లెమ్మ అంటే ఐ మీన్, మా బాబ్గాడి భార్యామణి మాత్రం కన్నీళ్లు పెట్టుకుని ‘‘చూడండి అన్నయ్యగారూ... ఈయన ఇల్లట్టకుండా ఎలా తిరుగుతున్నారో’’ అని తరచు బాధపడుతుండేది. ‘‘ఏం చెల్లెమ్మా– వాడికి రేసులూ లాభసాటిగానే ఉన్నాయిగా– వాడి జాతకంలో గెలుపేగాని ఓటమి లేదు’’ అని ఓదార్చేవాణ్ణి. ‘‘అబ్బబ్బా!’’ అని నెటిల్విక్ చికాకు పడిపోతున్నాడు. ఒకో రౌండ్ స్పీచ్కొట్టి, పదేసి నిమిషాలు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోవడం– మళ్లీ ఏదో జ్ఞాపకం వచ్చినవాడిలా– ‘‘ఆ ఎక్కడికొచ్చింది కథ... యస్..’’ అని అనబోతుండగా ఏదో ట్రెయిన్ దడదడమని చప్పుడు చేసుకుంటూ వెళ్లిపోతోంది. ‘‘అరె 11.45 ట్రెయినా?’’ కంగారుగా అనేశాడు నెటిల్విక్. ‘‘మరేం కంగారు లేదు సర్. ఇది 10.45 డౌన్ ట్రెయిన్. మీది అప్ ట్రెయిన్ కదా... మరో గంటపైగా టైము ఉంది. మీరు తీరుబడిగా డిన్నరు తీసుకు వెళ్లొచ్చు.’’ ‘‘మరి ఆ రెండో బ్యాంకు సంగతి?’’ ‘‘మళ్లీ ఓ క్యాంపు వేసుకుందురుగాని– కంగారేం?’’ ‘‘నో, నో.. ప్రతిదీ అనుకున్న ప్రకారం జరగడమే నా పద్ధతి– ఇంతకీ ఆ 70 వేల పౌండ్ల సంగతి...’’ ‘‘ఆ వేళ, అది శుక్రవారం, వీకెండ్ సన్నాహంలో బాబ్ ఇంట్లో ఉండగా మెసెంజర్ 65 వేల పౌండ్ల క్యాష్ తెచ్చి బ్యాంకుకు రమ్మన్నాడు. సరే మళ్లీ ఎవడు వెనక్కెళ్తాడని చెప్పేసి ‘‘బాబ్’’ ఐరన్సేఫ్లో దాచి తాళాలు వాడికే ఇచ్చి ఇద్దరం బోటు షికారు ప్లాన్ చేసుకోవడంలో మునిగిపోయాం. సరే ఆదివారం హాయిగా గడిపేసి సోమవారం ఉదయమే తాళాలు తీసి ‘‘క్యాష్’’పట్రారా అంటే బాబ్గాడు నసగడం ప్రారంభించాడు. ఏరా అని నిలదీసే సరికి గుర్రప్పందేల్లో పెట్టేశానని, దురదృష్టం కొద్ది పోగొట్టుకున్నానని– మళ్లీ నెలలో తనకు రావలసిన షేర్లు ఉన్నాయని, ఎడ్జస్ట్ చేస్తానని...’’ ‘‘సర్’’ అని రాయ్ ప్రవేశించి, ఏదో కవర్ అందించి– ‘‘సర్’’ అని తలవంచుకుని వినయంగా వెళ్లిపోయాడు. అయితే ఎగ్జామినర్ మాత్రం– ఆ కవర్లో ఏమి ఉంటుందో– దాన్ని జేబులో పెట్టుకునే ప్రయత్నం చేస్తే రెడ్హ్యాండెడ్గా పట్టుకుందామని రెడీగా కూర్చున్నాడు. టామ్ కవర్ని నిర్ల్యంగా చింపి, కాగితాన్ని పైకి లాగి ఆల్మోస్ట్ చూడకుండానే టేబుల్మీద పారేశాడు. కథ మాత్రం కొనసాగించాడు. ‘‘ఇంతకీ బాబ్ డబ్బు వాడేసుకున్నట్టు– రెండ్రోజుల్లో సర్దేస్తానంటే..’’ ‘‘అదంతా నాకనవసరం... ఉండాల్సిన బిల్స్... ఉండాల్సిన చోట ఉండకపోవడం పెద్ద నేరం. నీ కాకమ్మ పిచికమ్మ కథలు నాకనవసరం...’’ చాలా సీరియస్గానే అన్నాడు. బిత్తరపోతాడనుకున్న టామ్ కనీసం తత్తరపాటైనా పడలేదు. ‘‘హ్హ హ్హ హ్హ’’ అని వికటాట్టహాసం చేశాడు. ‘‘అలాంటి ప్రమాదం ఏమీ లేదు మిస్టర్ నెటిల్విక్... నువ్వు ఆఫీసులో పుట్టి ఆఫీసులో పెరిగి రూల్సుని భోంచేసి డబ్బుల గలగల మ్యూజిక్కులో పెరిగినవాడివి! నీకు సెన్సాఫ్ హ్యూమర్– ప్రాక్టికల్ జోక్స్ అంటే తెలీదనుకుంటాను– ఇక్కడ మా స్టయిల్ వేరు. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ నవ్వుతూ చావాలిరా’’ అన్నది మా తత్వం... ఘనత వహించిన పరీక్షాధికారిగారూ! మిమ్మల్నో ఆటపట్టిద్దామని మీరు క్యాష్ లెక్కెడుతుండగా ఆ ఫైల్లోంచి నేనే కొన్ని బిల్స్ మాయం చేశా... ఇవిగో ఆ బిల్స్, స్టాక్స్, బాండ్స్, షేర్స్... హ్హ హ్హ హ్హ..’’ అని నవ్వేశాడు. నెటిల్విక్ చేష్టలుడిగి అలా కూర్చుండిపోయాడు. ‘‘ఆల్రైట్, ఆల్రైట్’’ అంటూ తను డైరీలో రాసుకున్న రిమార్కులు కొట్టేసి.. ‘‘మహానుభావా నీ ప్రాక్టికల్ జోక్ కాదుగాని... నేను వేసుకున్న డబుల్ ప్రోగ్రామ్ పాడు చేశావు కదా... ఇంకా స్టాక్మన్ నేషనల్ బ్యాంకు పని రేపే చేస్తా– దయచేసి మీ మెసంజర్ని సాయం ఇచ్చి గెస్ట్హౌస్కు దారి చూపిస్తారా– ఈ రాత్రికి ఇక్కడే మకాం’’ అని ఓ వెకిలి నవ్వు నవ్వేసి– కరచాలనం చేసి రాయ్ వెనకాల రాగా వెళ్లిపోయాడు. ఇక్కడికి ఈ కథ అయిపోయినట్లే కాని... ఒక చిన్న విషయాన్ని చెప్పుకుని ముగిద్దాం. బల్లమీద ఉన్న కవర్లో కాగితం మీద ఇలా రాసి ఉంది. ప్రియమైన టామ్, వేటకుక్కలు విజృంభిస్తున్నాయన్న కబురు విన్నాను. టర్నరయితే ఇబ్బంది ఉండకపోను. ప్రస్తుతం మా బ్యాంకులో 22 వేల డాలర్ల బ్యాలన్సు ఉంది. ఉండాల్సింది మరో ‘0’ అదనం. అంటే 2.20 లక్షల డాలర్లు. స్నేహితులు రాన్, ఫిషన్లు– గొర్రెలు కొనుక్కుంటామంటే 20 వేలు అప్పిచ్చాను.– మూజువాణీగా... వెధవలు సమయానికి ఎడ్రస్ లేకుండా పోయారు. అందుకే ఈ రాత్రికి ఈ ఆడిటర్గాడు ఇక్కడే ఆగిపోయేట్టు చూడమని ‘‘హరికథా కాలక్షేపం నీకలవాటేగా’’ అని రిక్వెస్ట్ చేశాను కథా–హరికథా రంజుగానే సాగుతున్నట్లు మీ వాళ్లు ఫోన్ చేశారు. మెనీ మెనీ థ్యాంక్స్– వెధవలిద్దరూ 10.45 ట్రెయిన్లో తగలడ్డారు. బేరాల్లో లాభం బాగానే తీశార్ట. డబ్బు రెడీ... నెటిల్విక్గాడు కాదు... వాడి జేజెమ్మ కూడా... మన పిక్కమీద వెంట్రుక కూడా పీకలేరు థాంక్యూ ఫర్ ది కోపరేషన్ బాబ్ బక్లీ టామ్ కవర్ని ముక్కలు ముక్కలు చేసి చెత్తబుట్టలో పారేసి చేతులు దులుపుకున్నాడు. ఇంగ్లిష్ మూలం : ఓ హెన్రీ అనువాదం: ఎంవీ నారాయణాచార్య -
జుట్టంతా రాలిపోతోంది.. గైనకాలజిస్ట్ను కలవాలి!
‘‘బెంగళూరు నీళ్లకు కాబోలు జుట్టంతా రాలిపోతోంది..’’ తల స్నానం చేసి జుట్టుకు హెయిర్ డ్రయర్ పెడుతూ అన్నది నమ్రతా జార్జ్. ‘‘ఓసారి ట్రైకాలజిస్ట్ను కలవాలి’ అంది మళ్లీ తనే నమ్రత పక్కనే ఉన్న రూమ్మేట్ థెరిసాతో. ‘‘అప్పర్ లిప్ మీద హెయిర్ వస్తోంది. ముఖమంతా యాక్నే, ఒంటిమీద నల్లగా చుక్కలు కూడా వస్తున్నాయి. డెర్మటాలజిస్ట్ను కూడా కలవాలేమో’’ దిగులుగా తనలో తనే అనుకున్నట్లుగా అంటోంది నమ్రత. ‘‘నువ్వు కలవాల్సింది గైనకాలజిస్ట్ని’’ డ్రెస్ వేసుకుంటూ, హడావుడిగా టేబుల్ దగ్గరకు వెళ్లి వెజిటబుల్ సలాడ్ ఫోర్క్తో నోట్లో పెట్టుకుంటూ బదులిచ్చింది థెరిసా. థెరిస్సాను విచిత్రంగా చూసింది నమ్రత. ‘‘నాకు వరుసగా మూడు నెలలు పీరియడ్స్ మిస్ అయ్యాయని గైనకాలజిస్ట్ని కలిశాను కదా! అప్పుడు తెలిసింది ఇవన్నీ పీసీఓఎస్ లక్షణాలని. నన్నయితే బరువు తగ్గమని గట్టిగా చెప్పింది. నువ్వు కూడా ఓ సారి కలువు’’ నమత్ర వైపు చూడకుండా చెప్పుకుంటూ పోతోంది థెరిసా. నమ్రతా జార్జ్, థెరెసా బోబన్లు పదకొండేళ్లుగా స్నేహితులు. ఈ కేరళ అమ్మాయిలు ఏడేళ్లుగా రూమ్మేట్లు. ఇద్దరూ ఫ్యాషన్ ఎక్స్పర్ట్లే. సొంతూరు కొచ్చి నుంచి గత ఏడాది బెంగుళూరుకొచ్చి ఫ్యాషన్ పరిశ్రమలో పని చేస్తున్నారు. థెరిసా సలహాతో నమ్రత గైనకాలజిస్ట్ను సంప్రదించింది. నిజమే! ఆమె సమస్య కూడా పీసీఓఎస్నే. అండాశయంలో సిస్ట్లు ఏర్పడ్డాయి. నిండా పాతికేళ్లు లేవు. ఇప్పుడే గర్భాశయ సమస్యలేంటి? అసలీ పీసీఓఎస్ ఏంటి? ఇది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది? అని పరిశోధన చేసినంత పని చేశారు. తమ ఇద్దరిలోనే కాదు ఈ పీసీఓఎస్ ప్రపంచ వ్యాప్తంగా కోటిమంది మహిళలను వేధిస్తోందనీ, మన దేశంలో ఈ దశాబ్దంలో విపరీతంగా పెరిగిపోతోందనీ తెలుసుకున్నారు. ధైర్యం చెబుతున్నారు మనదేశంలో మహిళలు తమ ఆరోగ్యాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియచేస్తున్నారు కేరళకు చెందిన ఇద్దరు స్నేహితులు. ఇంకా ముఖ్యంగా ఆడపిల్లలను పెళ్లికి ముందు రొటీన్ చెకప్లలో భాగంగా గైనకాలజిస్టుకు చూపించడానికి తల్లిదండ్రులు భయపడతారు. పెళ్లికావల్సిన అమ్మాయిని గైనకాలజిస్టు దగ్గరకు తీసుకెళ్లినట్లు ఎవరికైనా తెలిస్తే ‘వాళ్లు ఏమనుకుంటారో’ అని ఆందోళన పడుతుంటారు తప్ప సమస్య తొలిదశలో ఉన్నప్పుడే వైద్యం చేయించాలనుకోరు. పీసీఓఎస్ సమస్య దీర్ఘకాలం కొనసాగితే గర్భధారణ సమస్యలు ఎదురవుతాయని తెలిసినా సరే పెళ్లయిన తర్వాత డాక్టర్ను సంప్రదించవచ్చని.. సమస్యను తీవ్రతరం చేసుకుంటుంటారు. ఇంకా... పీసీఓఎస్కు చికిత్స చేయించుకుందని బంధువులకు, స్నేహితులకు తెలిస్తే ‘ఈ అమ్మాయికి సమస్య ఏ స్థాయిలో ఉందో ఏమిటో, పిల్లలు పుడతారో లేదో’ అనే అనుమానాలను చిలువలు పలువలు చేసి ప్రచారం చేస్తారేమోనని మరొక భయం. తేలిగ్గా వివరిస్తున్నారు ఆడపిల్లలను గైనకాలజిస్టుకు చూపించడం మీద మన సమాజంలో ఉన్న అనేక అపోహలను తొలగించే ప్రయత్నం మొదలు పెట్టారు నమ్రతా జార్జ్, థెరెసా బోబన్లు. ఇందుకోసం ఇన్ స్టాగ్రామ్లో పేజీ ఓపెన్ చేసి సందేహాలకు సమాధానాలిస్తున్నారు. గైనిక్ సమస్యల పట్ల యువతులను చైతన్యవంతం చేయడానికి పూనుకున్న స్నేహితుల చొరవ ఇది. డాక్టర్లు వివరించేటప్పుడు వైద్యపరమైన సాంకేతిక పదాలు సామాన్య యువతులను, మహిళల్ని భయపెడుతుంటాయి. ఈ ఫెండ్స్ మాత్రం విషయాన్ని సామాన్యులకు అర్థమయ్యే çపదాలతో సులువుగా వివరిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ పేజీ అంతగా విజయవంతం కావడానికి ఇదీ ఒక కారణమే. ‘‘మొదట్లో కొన్నాళ్లు బెంగళూరు నీటిని తిట్టుకున్నాం. ఆ తర్వాత రియాలిటీలోకి వచ్చాం’’ అని నవ్వారు ఈ ఫ్రెండ్స్. – మంజీర సమస్యే కాదు డిజిటల్ మీడియా వేదికగా మేము చేపట్టిన ఈ ఉద్యమం... మహిళల ఆరోగ్యం పట్ల మన సమాజంలో కరడుగట్టి ఉన్న నిరాసక్తతను పటాపంచలు చేయడానికే. ‘టూ బ్రోక్ గర్ల్స్ విత్ పీసీఓఎస్’ పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేశాం. అందులో పీసీఓఎస్ లక్షణాల గురించి సమగ్రంగా తెలియచేస్తున్నాం. అవసరమైతే నిపుణుల సలహా తీసుకుని ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని కూడా సూచిస్తున్నాం. మా పేజీని అనుసరిస్తున్న వాళ్లలో కొందరు తమలో ఉన్న కొన్ని లక్షణాలను బట్టి డాక్టర్ను సంప్రదిస్తున్నారు. అన్నింటికంటే ముందుగా పీసీఓఎస్ కారణంగా దేహంలో ఎదురయ్యే అవాంఛిత రోమాల వంటి వాటి గురించి అమ్మాయిలు విపరీతంగా వ్యాకులతకు లోనవుతుంటారు. ఇది మానసిక వేదనకు లోను కావాల్సిన సమస్య కానే కాదని వాళ్లకు ధైర్యం చెబుతున్నాం. బయటకు చెప్పుకోలేని ఆవేదనను పంచుకోవడానికి, చైతన్యవంతం కావడానికి ఒక వేదిక కల్పించాం. ఇది ఆరోగ్య చైతన్య విప్లవం. – నమ్రత, థెరిసా View this post on Instagram It’s par-TEA time 🍵🍵🍵 We can’t start a day without a glass of one of our favourite brews. While researching for what dietary changes could help reverse the effect of pcos, we came across the benefit of having herbal teas to help control the condition. Some teas even have scientific evidence in helping reversing the side effects of pcos. Have a TEA-rrific day. Do share you experiences with various herbal teas that might have helped you #pcos #periodpositive #tea #women A post shared by Nams & Ter (@twobrokegirlswithpcos) on Feb 4, 2020 at 9:00pm PST -
చేయి చేయి కలిపితే విజయం
పని ప్రదేశాల్లో ముఖ్యంగా ఉద్యోగాలు చేసే చోట మహిళలు ఒకరికొకరు నిజాయితీతో మనస్ఫూర్తిగా స్నేహితులుగా ఉండగలరా..? సాటి స్త్రీల పట్ల అసూయ, శత్రుత్వాలను అధిగమించి విజయాలను చేరుకోగలరా..? స్త్రీ స్నేహాలు నిస్సారంగా, సత్యానికి దూరంగా ఉంటాయా..? ఈ ప్రశ్నలతో పాటు సమాధానాలనూ హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో ప్రచురించారు. ఈ రివ్యూలో ప్రచురించిన హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధన దీనికి కొన్ని రుజువులను చూపింది. రుజువులు ఇవి.. ►మహిళలు స్నేహితులుగా, సన్నిహిత ఆరోగ్యకరమైన బంధాలను పంచుకోవడమే కాదు వారి స్నేహితుల విజయాలకు కూడా కీలకపాత్ర పోషిస్తారు. ►బలమైన స్నేహాలు మహిళల వృత్తిని సానుకూలంగా ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ►విజయాలను సాధించిన మహిళా స్నేహితులను కలిగి ఉంటే వారి నుంచి మంచి కెరీర్ సలహాలను పొందవచ్చు. సమస్యను వారు అర్ధం చేసుకుని, తగిన సహాయాన్ని అందించగలరని నిర్ధారించుకోవచ్చు. సూచనలివి.. ►మీ స్నేహితులతో మీరే అధికంగా మాట్లాడుతూ ఉండటం కన్నా వినడం వల్ల ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ►నైపుణ్యాలను పెంచే సలహాలు ఇవ్వగల వ్యక్తిని కలిగి ఉండటమే కాదు.. ఆమె అడుగుజాడలను అనుసరించాలని భావించే స్నేహితులకు ఒక మద్ధతును లభిస్తుంది. ►ఇటీవల కాలంలో ఉద్యోగ నియామకాల విషయానికి వస్తే పురుషులు కూడా లింగభేదాల పట్ల పట్టింపు లేదనే విషయాన్ని వెల్లడించినట్లు ఆ రివ్యూ స్పష్టం చేసింది. దీనికి కారణం ‘పురుషల ఆధిపత్య వృత్తులను స్త్రీలు సమర్ధవంతంగా నిర్వహిస్తుండమే. అధిగమించేందుకు నైపుణ్యాలు ►స్నేహితులతో ఉన్నప్పుడు మీ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు చర్చించడానికి వెనకడుగు వేయద్దు. పని చేసే చోట మీ అనుభవాలు, పోరాటాలు, సందేహాలను తీర్చడానికి అవి ఉపయోగపడతాయి. అంతేకాదు, మీరు కూడా సలహాలను కోరడానికి సిగ్గుపడకూడదు. ►రెజ్యూమ్ను తయారుచేయడానికి లేదా ఇంటర్వూ్యలో నెగ్గడానికి చిట్కాలు, పనిలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించే నైపుణ్యాలు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాయి. ►పని చేసేచోట పురుషులతో పాటు మహిళలను సమానంగా పరిగణించినట్లయితే ఈ సహాయక వ్యవస్థ అవసరం లేదు. కిందటేడాది బుకింగ్.కామ్ నిర్వహించిన అధ్యయనంలో పాల్గొన్న 42 శాతం మంది మహిళలు కార్యాలయంలో పక్షపాతాన్ని ఎదుర్కొన్నామని చెప్పారు. సీనియర్ మేనేజ్మెంట్లో ఉన్న 52 శాతం మహిళలు, ఎగ్టిక్యూటివ్ బోర్డు సభ్యులుగా పనిచేస్తున్న 57 శాతం మహిళలు కార్యాలయంలో లింగ పక్షపాతాన్ని ఇప్పటికీ ఎదుర్కొంటున్న అంగీకరించారు. అయితే, ఈ పక్షపాతం మహిళ వృత్తిలో ఎదగడానికి నిచ్చెనలా సాయపడుతుంది అని వారు తెలియజేయడం విశేషం. పని చేసే చోట సమాజంలో లింగ విభజనను సృష్టించే వైఖరి క్రమంగా తగ్గుతోంది. పూర్తిగా కనుమరుగయ్యేవరకు మహిళలు ఒకరికొకరు వ్యక్తిగత, వృత్తిపరమైనా సహాయాన్ని అందించుకోవడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు. -
చక్కర లేని తియ్యని బంధం
బినోతా నాద్కర్ణి గోవాలో ఆర్కిటెక్టు. ఆమెకు సైక్లింగ్ అంటే ఇష్టం. ఏడాది కిందట ఆమె ఒక చాలెంజ్ చేశారు. ఆ చాలెంజ్ను ఈ ఏడాది జనవరి 31వ తేదీతో విజయవంతంగా పూర్తి చేశారు. ‘నో షుగర్ చాలెంజ్’ అది. ఏడాది పాటు చక్కెరకు దూరంగా గడపడం! వండర్ అనిపిస్తుంది మనకు. అయితే చక్కెర తినకుండా ఏడాది పాటు ఉండడం పెద్ద విషయమేమీ కాదని అంటారు బినోతా! స్వీట్లు, చాక్లెట్లు, క్రీమ్ బిస్కెట్లు, ఐస్క్రీములను దూరంగా ఉంచడం తనకు ఏ మాత్రం కష్టం కాలేదని చెబుతూ, ‘‘చక్కెర లేని టీ తాగడానికి మాత్రం ఒక వారం రోజుల పాటు కష్టపడ్డాను’’ అన్నారు బినోతా. ఆ కష్టం కూడా నాలుక మీదుండే రసన నాడులు (టేస్ట్బడ్స్) అలవాటు పడే వరకు మాత్రమేనట. ఛాలెంజ్ తీసుకున్న ఈ ఏడాదిలో నాలుగు కేజీల బరువు తగ్గడంతోపాటు దేహం తేలిగ్గా అనిపించడం కూడా తనను ఉల్లాసంగా ఉంచుతోందని ఆమె అంటున్నారు. ఇంతకీ ఆమె ఈ చాలెంజ్ని ఎందుకు తీసుకున్నారో తెలిస్తే మాత్రం మనసు కరిగిపోవడం ఖాయం. స్నేహితురాలి కోసం యాభై రెండేళ్ల బినోతా నాద్కర్ణి స్నేహితురాలు క్యాన్సర్ బారిన పడింది. ట్రీట్మెంట్ జరుగుతోంది. చక్కెర ఒక్క పలుకు కూడా తీసుకోకూడదని చెప్పేశారు డాక్టర్లు. క్యాన్సర్ వచ్చిందనే బాధ కంటే చక్కెర తినకూడదన్న మాటకే ఆమె ఎక్కువగా కదిలిపోయింది. తన జీవితంలో తీపి కరువైందని, ఇక ఏ రకంగానూ సంతోషాలు ఉండవని వాపోయింది. స్నేహితురాలికి ధైర్యం చెప్పారు బినోత. ఎంతగానో నచ్చచెప్పారు. క్యాన్సర్ బారిన పడిన బాధలో తన స్నేహితురాలికి ప్రతిదీ కొండంత కష్టంగా అనిపిస్తోందని కూడా అర్థమైంది బినోతకు. ‘‘చక్కెర లేకుండా జీవితం గడపడం కష్టమేమీ కాదు. కావాలంటే చెప్పు, నీ కోసం నేను కూడా చక్కెర మానేస్తాను’’ అని ఆ క్షణంలో స్నేహితురాలికి మాటిచ్చారు బినోత. ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడే ఉన్నారు. మాటిచ్చి ఏడాది దాటింది. స్నేహితురాలు తన కోసం తన నాలుకను తియ్యదనానికి దూరం చేసుకోవడం ఆమెలో గొప్ప మార్పునే తెచ్చింది. ఆ మార్పు తను కూడా చక్కెరకు దూరం కావడం వరకే పరిమితం కాలేదు. వ్యాధితో పోరాడటానికి మానసికంగా సిద్ధమయ్యేటంతగా ప్రభావితం చేసింది. తన స్నేహితురాలి గురించి ఇన్ని సంగతులు చెప్పిన బినోతానాద్కర్ణి తన ఫ్రెండ్ పేరు మాత్రం చెప్పడం లేదు. ఆ స్నేహితురాలి ఫొటోను ఫేస్బుక్ కానీ ఇతరత్రా ఎక్కడా షేర్ చేయడం లేదు. ‘‘అలా చేస్తే ఇక ఆమె ఎక్కడ కనిపించినా ఆమెను క్యాన్సర్ పేషెంట్గా చూస్తారు తప్ప, ఎవరూ ఆమెను మామూలు మనిషిగా చూడరు. ఆమె గోప్యతను కాపాడడం కూడా స్నేహితురాలిగా నా ధర్మం’’ అంటారు బినోత. తల్లికి డయాబెటిస్ దాదాపుగా ఇదే సమయంలో బినోత తల్లి కూడా డయాబెటిస్ బారిన పడ్డారు. ఆమెది కూడా చక్కెర మానేయాల్సిన అత్యవసర స్థితే. ‘‘మా అమ్మకు కాఫీలో చక్కెర బదులు తేనె, బెల్లం వంటివి వాడడం కూడా ఇష్టం ఉండేది కాదు. ‘తీపి లేకుండా నేను తాగుతున్నాను కదమ్మా, అంత కష్టమేమీ కాదు, నువ్వు ఒకసారి ప్రయత్నించు’ అని చెప్పగలిగాను. ఇప్పుడు నా స్నేహితురాలికీ, మా అమ్మకు నేనొక వింత, విచిత్రం మాత్రమే కాదు.. మిగతావారికీ పెద్ద ఉదాహరణ కూడా. చక్కెర తినకుండా, ఆహారంలో ఉండే సహజమైన చక్కెరలతోనే దేహంలో షుగర్ లెవెల్స్ సమతూకంగా ఉంచుకోగలిగిన రోల్మోడల్ని’’ అంటూ సైకిల్ని పరుగు తీయిస్తారు బినోతా నాద్కర్ణి. ఆమె గోవా వీధుల్లో వారంలో ఐదు రోజులు సైకిల్ మీదే కనిపిస్తారు. “తన స్నేహితురాలి గురించి ఇన్ని సంగతులు చెప్పిన బినోతానాద్కర్ణి తన ఫ్రెండ్ పేరు మాత్రం చెప్పడం లేదు. ఆమె గోప్యతను కాపాడడం కూడా స్నేహితురాలిగా నా ధర్మం’’ అంటారు బినోత”. బినోతా నాద్కర్ణి: కూతుళ్లతో... సైక్లింగ్ చేస్తూ... స్నేహితురాలి కోసం తల్లి తీసుకున్న ఛాలెంజ్ను అభినందిస్తున్న బినోత కూతుళ్లు. -
‘ఫ్రెండ్షిప్’ అంటున్న హర్భజన్
చెన్నై : సినీ కళాకారులు, క్రీడాకారులు కాలేరేమో గానీ, క్రీడాకారులు సినీ కళాకారులగా మారడం సులభమే అవుతోంది. ఇప్పటికే పరుగుల రాణి అశ్వినీ నాచప్ప నటిగా నటించింది. ఇక కొందరు క్రికెట్ క్రీడాకారులు హీరోలుగా నటించారు. తాజాగా ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు, బౌలర్ అయిన హర్భజన్ సింగ్ కథానాయకుడిగా అవతారమెత్తనున్నారు. ఈయన సినిమాకు పరిచయం అవుతున్న చిత్రం ఇదే అవుతుంది. క్రీడా మైదానంలో పోటీ జట్టు బ్యాట్స్మెన్లను తన బంతులతో దడ పుట్టించిన హర్బజన్సింగ్ ఇప్పుడు వెండితెరపై నటుడిగా ప్రేక్షకులను ఎంతగా అలరిస్తారో చూడాలి. షండో స్టూడియో అండ్ సినిమాస్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో హర్భజన్సింగ్ హీరోగా నటిస్తున్నారు. దీనికి జేపీఆర్ - శ్యామ్ సూర్యల ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శక ద్వయం ఇంతకు ముందు అగ్నిదేవి అనే చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. కాగా హర్భజన్సింగ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ఫ్రెండ్షిప్ అనే టైటిల్ను నిర్ణయించారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ను హర్భజన్సింగ్ ఆదివారం విడుదల చేశారు. కాగా ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, ఇతర సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర వర్గాలు తెలిపారు. కాగా సంకెళ్లు వేయబడ్డ రెండు చేతులు మాత్రమే కలిగిన ఫస్ట్లుక్ పోస్టర్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదేదో ఖైదీలకు సంబంధించిన కథాంశంతో కూడిన చిత్రమా అన్న ఆసక్తి నెలకొంది. కాగా ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా భారతీయ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. కాగా ఇదే సమయంలో భారత క్రికెట్ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్ను గెలుచుకున్న ఇతివృత్తంతో బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్, కోలీవుడ్ నటుడు జీవా నటించిన 83 చిత్రం తెరపైకి రానుందన్నది గమనార్హం. -
హీరోబజన్ సింగ్
ఇండియన్ టీమ్ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ తన స్పిన్ బౌలింగ్తో మ్యాజిక్ చేసేవారు. ఈ మధ్యే నటుడిగా మారి యాక్టింగ్ మొదలుపెట్టారు. తమిళ నటుడు సంతానం నటిస్తున్న ‘డిక్కీలోనా’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా లీడ్ యాక్టర్గా ఓ సినిమా చేస్తున్నారు. ‘ఫ్రెండ్షిప్’ అనే టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒక క్రికెటర్ లీడ్ యాక్టర్గా నటించడం ఇదే తొలిసారి అని చిత్రబృందం పేర్కొంది. జేపీఆర్, శ్యామ్ సూర్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. -
అబ్బాయిలూ.. మీ లేఖ అందింది!
కొత్త వ్యక్తులతో స్నేహం చేయడానికి కొంతమంది ఆసక్తి చూపుతారు. తమ అభిప్రాయాలు, ఆలోచనలకు దగ్గరగా ఉండేవాళ్లతో పరిచయం చేసుకోడానికి ఉవ్విళ్లురుతారు. అయితే ఇంగ్లండ్లోని ఓ నలుగురు స్నేహితులు మాత్రం విచిత్రంగా ఓ జంతువుతో స్నేహం చేయాలని భావించారు. అంతేగాక దానితో స్నేహం కోసం ఓ లేఖ కూడా రాశారు. చివరికి బదులుగా వచ్చిన సమాధానం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు వాళ్లు దేనితో స్నేహం చేయాలనుకుంటున్నారు.. సమాధానం ఏం వచ్చింది అని ఆలోచిస్తున్నారా.. అయితే చదవండి. ఇంగ్లండ్లోని బ్రిస్టల్కు చెందిన జాక్ మెక్క్రాసన్, తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఇటీవల ఓ ఇంట్లోకి అద్దెకు దిగారు. వారికి పెంపుడు జంతువులంటే ప్రాణం. కానీ ఇంటి యాజమాని అందుకు అనుమతించకపోవడంతో నిరాశ చెందారు. దీనికి పరిష్కారం అలోచించిన ఆ స్నేహితులు ఎదురింట్లో పెంపుడు కుక్క ఉందని తెలుసుకున్నారు. ఇక తలచిందే తడవుగా మీ కుక్కతో వాకింగ్ చేయొచ్చా.. స్నేహం చేయొచ్చా అని పక్కింటి వారికి లేఖ రాశారు. దీనికి ప్రతిస్పందనగా వారికి కుక్క తరఫున మరో లేఖ అందింది. అది చూసిన ఆ నలుగురు ఆనందంలో మునిగితేలారు. ‘‘అబ్బాయిలూ.. మీరు రాసిన లేఖ అందింది. నాకూ కొత్త వ్యక్తులను కలవడం ఇష్టమే. మీరు నా స్నేహితులవ్వడం గొప్ప విషయంగా భావిస్తున్నా. కానీ ఇందుకు కొన్ని షరతులు ఉన్నాయి. మన స్నేహం విలువ రోజుకు ఐదు బంతులు విసిరాలి. నన్ను బుజ్జిగించి ఆడుకోవాలి. ఇది మీకు అంగీకారమైతే నా సేవకుడి (ఇంటి యాజమానురాలి)కి వాట్సాప్ చేయండి. త్వరలోనే కలుద్దాం’’ అంటూ ఆ కుక్క భావాలను లెటర్ రూపంలో ఇంటి యాజమానురాలు పంపారు. ఈ విషయమంతా సదరు వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ లేఖ వైరల్గా మారింది. ఈ లేఖను చదివిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘మా పెంపుడు కుక్కకు స్నేహితులంటే ప్రాణం. మీరు ఎప్పుడైనా రావచ్చు’ అంటూ కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. Been saying we’d love a dog about the house but our landlord doesn’t allow pets, so my housemate posted a letter to our neighbours asking if we could walk their dog every once and a while and the response was better than we could have ever hoped for pic.twitter.com/dcMOfPk5UH — Jack McCrossan (@Jack_McCrossan) December 10, 2019 -
స్నేహం విలువ!
‘‘మీకందరికీ శుభవార్త. కొన్ని రోజుల కిందట మన కుందేలును చంపిన ఆ సింహానికి తగిన శాస్తి జరిగింది. ఆవును చంపి తింటున్నప్పుడు ఒక పెద్ద ఎముక నోటిలో గుచ్చుకొంది. తన కాళ్లతో తీయలేక చాలా ఇబ్బంది పడుతోంది. చూస్తుంటే అలాగే చనిపోయేలా ఉంది’’ గట్టిగా అంటూ ఆ చిట్టి కుందేలు సంతోషంతో అటూ ఇటూ పరుగెత్తసాగింది. ‘‘అయ్యో పాపం’’ అంది వయసు మళ్లిన కుందేలు. ‘‘ఏమిటి జాలి చూపిస్తున్నావు’’. ‘‘ఆపదలో ఉన్న జంతువుకు సహాయం చేస్తే తప్పకుండా మార్పు వస్తుంది’’ ‘‘మార్పు రావడం కాదు నిన్ను మింగుతుంది’’ కోపంగా అంది మరో కుందేలు. ‘‘ఆ సింహాన్ని కాపాడి, ఆ సింహంతో స్నేహం చేసుకొని స్నేహం విలువలను మీకు చూపిస్తాను’’ అంటూ వెళ్ళింది వయసు మళ్లిన కుందేలు. బాధతో మూలుగుతున్న ఆ సింహంవైపు చూస్తూ ‘‘సింహం మిత్రమా, నిన్ను కాపాడాలంటే నీ నోటిలో దూరి ఎముక తీయాలి. ఆ తరువాత నన్ను చంపి తినవుగా...’’ అంది కుందేలు. కన్నీళ్ళతో లేదన్నట్టుగా తల ఆడించింది. కుందేలు సింహం నోటిలోనికి వెళ్లి ఆ ఎముకను తీసి ఒక్కసారిగా బయటకు దుమికి చెట్టు పైకి ఎక్కింది. ‘‘కుందేలు మిత్రమా ఎందుకు భయపడతావు. నా ప్రాణాన్ని కాపాడిన నీకు నేను ఆపద కలిగించితే మా సింహం జాతికే అవమానం. ఇక మీదట నీవు నా ప్రాణ స్నేహితుడివి నీవేమి చెప్పినా చేస్తాను’’ అంది సింహం. ‘‘నేను నిన్ను కాపాడటానికి వెళ్తుంటే మా కుందేళ్లు అన్నీ కోపడ్డాయి.’’ ‘‘ఎందుకు కోప్పడ్డాయి. నేను ఇంత వరకు కుందేలును వేటాడలేదు’’ ‘‘కుందేలును వేటాడలేదా?’’ అనుమానంగా అడిగింది కుందేలు. ‘‘తెలివైన కుందేలు వల్ల మా తాత బావిలో దూకి చనిపోయాడంట. ‘కుందేళ్లు చాలా తెలివైనవి. వాటిని మాత్రం వేటాడవద్దు. వాటితో స్నేహంగా ఉండు’ అని మా అమ్మ చెప్పింది. మా అమ్మకిచ్చిన మాట ప్రకారం కుందేలును వేటాడటం మానుకున్నాను. కానీ కుందేళ్లు నాతో స్నేçహానికి ముందుకు రాలేదు’’ ‘‘మిత్రమా, నీవు అప్పుడప్పుడు మా కుందేళ్ళను చంపి తింటున్నందుకు అందరూ నీపైన కోపంగా ఉన్నారు.’’ ‘‘కుందేలు మిత్రమా అప్పుడప్పుడు నాకు ఆ నక్క కుందేలు మాంసం తెచ్చిస్తుంది. ఇంతవరకు నేను ఒక్కటీ వేటాడలేదు. ఒట్టు’’ అంది ‘‘మా కుందేళ్లతో నీవు చంపినట్లు నక్క చెప్పింది.’’ ‘‘ఈ సాయంత్రం వస్తే అడుగుతాను’’ అంది సింహం. సాయంత్రం నక్క రాగానే అక్కడున్న జింక మాంసం చూసి లొట్టలేసింది. ‘‘ఏంటి నక్కా, జింక మాంసం ఏమీ రుచిగా లేదు. నీవు తెచ్చే కుందేలు మాంసం చాలా బాగుంది. దొరికితే తీసుకునిరా. కావాలంటే ఈ మాంసం అంతా నీవు తీసుకో’’ అంది సింహం. ‘‘ఎలాగైనా తీసుకొని వస్తాను’’ అంటూ జింక మాంసం తినడానికి వెళ్తున్న సమయాన చెట్టు చాటున ఉండి జరిగిందంతా విన్న కుందేళ్ల గుంపు ఒక్కసారిగా బయటకు వచ్చి సింహం ముందు నిలబడగానే, నక్కకు తాను ఆడిన నాటకం తెలిసిపోయిందనుకొంది. ‘‘సింహం గారూ! నన్ను క్షమించండి. కుందేలును నేను చంపినా వీళ్లతో నీవు చంపినట్లు చెప్పాను. అప్పుడే మీరు చంపిన పెద్ద జంతువుల మాంసాన్ని నాకు ఇస్తారన్న ఆశతో అలా చేశాను’’ అంది. సింహం కోపంతో ఆ నక్కను ఒక్క దెబ్బతో చంపింది. కుందేళ్లు అన్నీ ఆ సింహంతో స్నేహితులుగా కలిసి పోయాయి. సింహంలాంటి స్నేహితుడు అండగా ఉండటం వల్ల కుందేళ్ళకు అడవిలోని జంతువుల వల్ల ఎటువంటి ఆపద కలుగలేదు. సింహం కుందేళ్ళ స్నేహాన్ని చూసిన జంతువులు స్నేహానికి ఎల్లలు లేవన్న నిజాన్ని గ్రహించాయి. -
స్నేహం పేరుతో వ్యభిచార కూపంలోకి
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): స్నేహం పేరుతో మైనర్ బాలికను వ్యభిచార కూపంలోకి దింపిన దారున ఘటన ఓ తల్లి ఫిర్యాదుతో బయటపడింది. ప్రధాన నిందితుడిని కంచరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచరపాలెం సీఐ కృష్ణారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కంచరపాలెం బర్మాక్యాంపు ప్రాంతానికి చెందిన మైనర్ బాలికతో స్థానికంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు పరిచయం పెంచుకున్నారు. ఆమె చేత అరుకు వంటి పలు పర్యాటక ప్రాంతాల్లో వ్యభిచారం చేయించారు. నిందితులు ఆ బాలికను వారి సొంత అవసరాలకు వాడుకున్నారు. దీని ద్వారా వచ్చిన సొమ్ము కూడా వారే తీసుకున్నారు. కుమార్తె ప్రవర్తనను గుర్తించిన తల్లి కంచరపాలెం పోలీసులను ఆశ్రయించింది. దీంతో నాని అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై అట్రాసిటీ కేసు, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ఏసీపీకి ఈ కేసును బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకునేందుకు గాలింపు చేపడుతున్నామని సీఐ పేర్కొన్నారు. -
డీల్ కంటిన్యూ..
-
పక్కనే ఉండు
చెవులకు మఫ్లర్, ఒంటికి స్వెట్టర్ వేసుకుని.. దాదాపుగా రాత్రి పదకొండు అవుతుండగా ధర్మజీవి ఇంటికి వచ్చాడు విశ్వేశ్వర్. వచ్చీరావడంతోనే ‘‘నీ సలహా కోసం వచ్చాన్రా «ధర్మా..’’ అన్నాడు.. «ధర్మజీవి పడుకుని ఉన్న మంచం మీద అతడి కాళ్ల వైపు కూర్చుంటూ.‘‘కుర్చీలో కూర్చోరా..’’ అన్నాడు ధర్మ.. దుప్పట్లో చాపుకుని ఉన్న కాళ్లను పైకి మడుచుకుంటూ. ‘‘పర్లేదురా’’ అని ధర్మజీవి కాలిపై మృదువుగా చెయ్యి ఆన్చాడు విశ్వేశ్వర్. అప్పుడనిపించింది ధర్మజీవికి.. విశ్వేశ్వర్ లోలోపల ఎందుకనో నలిగిపోతున్నాడని. దిగ్గున మంచం మీద లేచి కూర్చున్నాడు. ‘‘ఏమైందిరా విశ్వా?’’ అన్నాడు ఆప్యాయంగా భుజం మీద చెయ్యి వేసి.వాళ్లిద్దరూ స్నేహితులు. ఊళ్లో ఊడలు దిగిన జంట మర్రిచెట్ల లాంటి స్నేహితులు. అరవై ఏళ్ల స్నేహం. ‘‘ఏమైందిరా విశ్వా?’’ మళ్లీ అడిగాడు «ధర్మ. విశ్వ ఏం చెప్పలేదు. ధర్మ కళ్లలోకే చూస్తున్నాడు.మామూలుగా ధర్మను విశ్వ కలిసే సమయం ఇలాగే బాగా పొద్దుపోయాక ఉంటుంది. ధర్మ కూడా ఎప్పుడైనా వెళ్లి విశ్వను వాళ్లింట్లో కలుస్తుంటాడు. అయితే విశ్వ వచ్చి కలిసినంతగా, «ధర్మ Ðð ళ్లి కలవడు. అందుకు ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. ధర్మ ఇల్లు సౌకర్యవంతంగా ఉంటుంది. ధర్మకు ప్రత్యేకంగా ఒక గది ఉంటుంది. భార్యా పిల్లలు వేరుగా వేరే గదుల్లో ఉంటారు. ఇప్పుడా పిల్లలు కూడా లేరు.అమెరికాలో ఒకరు, జర్మనీలో ఒకరు వేరే గదులు చూసుకుని వెళ్లిపోయారు. «ధర్మ, అతడి భార్య జానకి మాత్రం మిగిలారు. విశ్వక్కూడా.. పిల్లలు పెళ్లిళ్లై వెళ్లిపోయాక ఇంట్లో కాస్త స్పేస్ దొరికింది. అయితే పిల్లల్లేని ఆ స్పేస్ అతడికి కొన్నాళ్లకే ఇరుగ్గా ఉన్నట్లనిపించడం మొదలైంది. ఆ ఇరుకును మరింత ఇరుకు చేస్తూ భార్య కూడా అతడికి మరికొంత స్పేస్ ఇచ్చి వెళ్లింది. కొన్ని నెలల క్రితమే ఆమె చనిపోయింది.ఒక్కడే ఇప్పుడు విశ్వ. అతడికున్నదీ ఈ విశ్వంలో ఒక్కడే ఇప్పుడు.. ధర్మ. ‘‘ఇంక చాలనిపిస్తోందిరా’’ అన్నాడు విశ్వ.. నిట్టూరుస్తూ. ధర్మకు అర్థమైంది.‘‘తిన్నావా?’’ అన్నాడు. ‘‘ఊ..’’ అన్నాడే కానీ, విశ్వ తినిరాలేదు. కొద్ది రోజులుగా అతడికి తినవలసిన అవసరం కూడా కనిపించడం లేదు.‘‘జానకీ.. విశ్వా వచ్చాడు..’’ హాల్లోకి చూస్తూ చెప్పాడు ధర్మ ‘‘వద్దమ్మా.. టీ తాగే వచ్చాను’’ అన్నాడు విశ్వ.. ఆమెకు వినిపించేలా. ‘‘సరే.. కాస్త ఆగి తీసుకురా జానకీ’’ అన్నాడు «ధర్మ. పన్నెండూ ఒంటిగంట వరకు ఆ స్నేహితులిద్దరూ మాట్లాడుకోవడం ఆమెకు తెలిసిన సంగతే. ‘‘బతికింది చాలనిపిస్తోందిరా’’ అన్నాడు విశ్వ. అతడి వైపు తీక్షణంగా చూశాడు ధర్మ. ‘‘ఎవరు మాత్రం పనికట్టుకుని బతుకుతారు చెప్పూ. జీవితమే ఏదో ఒక ఆశను పెట్టి, లేదంటే నెత్తి మీద ఓ బాధ్యతను పెట్టి ఏ క్షణానికాక్షణం బతికిస్తుంటుంది మనుషుల్ని.చిన్న వయసులో ఆశలు. పెద్దయ్యాక బాధ్యతలు. ఎవరి బతుకూ వారి చేతుల్లో ఉండదు’’ అన్నాడు. ‘‘ఆశలేం లేవు. బాధ్యతలూ తీరిపోయాయి’’ అన్నాడు విశ్వేశ్వర్. ‘‘ఆశలు నెర వేరీ, బాధ్యతలన్నీ తీరిపోయి ఖాళీగా కూర్చున్న వాళ్లంతా నీలాగే అనుకుంటున్నారా విశ్వా!’’‘‘అది కాదురా.. నాకు ఈ జీవితంపై ఏవిధమైన ఆసక్తీ కలగడం లేదు. ఊరికే.. నాది కాని ఇంట్లోకి వచ్చి కూర్చున్నట్లుగా ఉంది.. నేనింకా ఈ భూమ్మీదే ఉండడం..’’‘‘పోనీ నాకోసం బతకరా. నేను పోయే దాకా. నిద్ర లేస్తే ఎప్పుడూ మన ఆశలు, మన బాధ్యతలేనా? మనపై ఆశలు పెట్టుకున్నవారినీ, మన బాధ్యత తీసుకోవాలని ఆశపడుతున్నవారిని నిరాశపరిచి వెళ్లిపోతామా’’ అన్నాడు ధర్మ. విశ్వేశ్వర్ పెద్దగా నవ్వాడు. ‘‘ఎవరు పెట్టుకుంటార్రా నా మీద ఆశలు. పైకి పోయిన నా భార్య పెట్టుకుంటుందా? పై చదువులని చెప్పి అట్నుంచటే వెళ్లిపోయిన నా పిల్లలా? ఇంకో మాట కూడా అన్నావు. ‘మన బాధ్యత తీసుకోవాలని ఆశపడుతున్న వారిని నిరాశపరిచి వెళ్లిపోతామా?’ అని. ఎవరికైనా ఎందుకిస్తాం మన బాధ్యతను? చెప్పు’’ అన్నాడు విశ్వేశ్వర్. ‘‘పోనీ నీ బాధ్యతను ఎవరి మీదైనా పెట్టెయ్. అప్పుడు బతకాలనిపిస్తుందేమో’’ అన్నాడు ధర్మ. ‘‘అలా ఉంటుందా ధర్మా. ముందసలు బతుకుపై ఆసక్తి ఉంటే కదా.. బాధ్యతలు ఇవ్వడమైనా, బాధ్యతలు తీసుకోవడమైనా! ఇవన్నీ అటుంచు.. నా బాధ్యతను ఇంకొకరు తీసుకోడానికి నేనెందుకు అంగీకరిస్తానని అనుకుంటున్నావు’’ అన్నాడు విశ్వేశ్వర్.‘‘అవుననుకో..’’ అని ఆగిపోయాడు ధర్మ. మాటల మధ్య జానకి ఎప్పుడొచ్చి వాళ్లకు అక్కడ టీ పెట్టి వెళ్లిందో ఇద్దరూ చూసుకోలేదు. ‘‘టీ తీస్కోరా విశ్వా’’ అన్నట్లు చూశాడు ధర్మ. టీ తాగుతున్నంతసేపూ విశ్వేశ్వర్నే చూస్తూ.. టీ తాగడం అయ్యాక.. ‘‘జీవితంపై ఆసక్తి లేదంటున్నావంటే.. జీవితంలోని సంతోషాలను చూడలేకపోతున్నావని అర్థం’’ అన్నాడు ధర్మ. ‘‘ఏం మిగిలి ఉంటాయని.. సంతోషాలు.. సూర్యుడు పడమటికి దిగిపోతుంటే..’’‘‘సంతోషాలు మిగిలిపోవు. ఉండిపోవు విశ్వా. రోజూ బతికే బతుకులోనే వెతుక్కోవాలి’’‘‘ఆశ ఉంటేనే కదా ధర్మా.. వెతుక్కుంటాం. నాకలాంటి ఆశ లేదంటున్నాగా..’’ అన్నాడు విశ్వేశ్వర్. ధర్మకు అర్థమైంది.. విశ్వ ఏదో తీర్మానించుకునే వచ్చాడని. ‘‘సరే.. చెప్పు.. సలహా కోసం వచ్చానని అన్నావ్ కదా. దేనికి సలహా? బతికింది చాలనుకోడానికా?’’ అని నవ్వాడు. విశ్వేశ్వర్ మౌనంగా ఉన్నాడు. ‘‘బతికింది చాలనుకోడానికైతే నా దగ్గరేం సలహా లేదు. బతకడానికైతే మాత్రం ఉంది. నేను నీ మీద ఆశ పెట్టుకుంటాను. నేను నీ బాధ్యత తీసుకుంటాను’’ అన్నాడు ధర్మ. విశ్వేశ్వర్కి అర్థం కాలేదనిపించి మళ్లీ చెప్పాడు.‘‘నా జీవితాంతం నువ్వు నా పక్కనే ఉండాలని నా ఆశ. ఇక నేను తీసుకోవాలనుకుంటున్న బాధ్యత.. నిన్నూ మా ఇంట్లో మనిషిగా, మాతో పాటు ఉంచుకునే బాధ్యత. ఏమంటావ్? నాఆశనెరవేరుస్తావా? నీ బాధ్యతను తీసుకోనిస్తావా?’’ అన్నాడు. మళ్లీ ఇందాకటే మాటే అన్నాడు విశ్వేశ్వర్. ‘‘నాపై నీ ఆశకు నా ప్రమేయం లేదు. నీపై నేను పెట్టే బాధ్యతేమీ ఉండబోదు’’ అన్నాడు. అని పైకి లేచాడు. పైకి లేవడం అంటేకుర్చీలోంచి పైకి కాదు. కుర్చీ కన్నా పైకి! ‘‘ఒరేయ్.. విశ్వా’’ అని పెద్దగా అరిచాడు ధర్మజీవి.. తల పైకెత్తి చూస్తూ. ‘‘ఏంటండీ.. అని హాల్లోంచి ముందు గదిలోకి వచ్చింది జానకి. ‘‘నిర్ణయం తీసేసుకున్నాక సలహా తీసుకోడానికి వచ్చినట్లున్నాడు జానకీ’’ అన్నాడు ధర్మజీవి. ఆ మాట ఆమెకు అర్థం కాలేదు. తెల్లారి.. జానకమ్మ.. ముందు గదిలోకి వచ్చి టీ కప్పులు తీయబోయింది. వాటిల్లో ఒకటి మాత్రమే ఖాళీగా ఉంది. ‘‘విశ్వా.. రాత్రి టీ తాగి వెళ్లలేదా?’’ భర్తను లేపుతూ అడిగింది. ధర్మజీవి కదల్లేదు. - మాధవ్ శింగరాజు -
ప్రతి రోజూ ఆ ప్రశ్న అడగాలి!
సాక్షి, హైదరాబాద్: వివాహ జీవితం, రిలేషన్షిప్లో సంతోషంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు కానీ చాలా సార్లు అనుకున్నట్లుగా ఉండలేకపోతుంటారు. డబ్బు, పలుకుబడి ఉంటేనే సంతోషంగా ఉండగలమని కొన్ని జంటలు అనుకుంటాయని కానీ అది కూడా సరైన అభిప్రాయం కాదని నిపుణులు అంటున్నారు. ప్రేమలో నిజాయితీగా ఉండటమే సంతోషానికి కారణమని తెలిపారు. కింది సూచనలు పాటించడం ద్వారా రిలేషన్షిప్ను ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 1. భాగస్వామికి అండగా నిలవాలి... జీవితం విషయంలో, ఉద్యోగ విషయాల్లో మీ పార్టనర్కు తోడుగా నిలబడండి. వారికి ఉన్న గోల్స్ను సాధించుకొనే క్రమంలో మీ వంతు సహకారాన్ని వారికి అందించండి. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రోత్సాహాన్ని అందించండి. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అలవర్చుకోవాలి. 2. అన్నీ మంచి రోజులే ఉండవు... రిలేషన్షిప్లో అన్నీ సంతోషకరంగా గడిచే క్షణాలే ఉండవు. కొన్నిసార్లు మనస్పర్థలు, గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో సంయమనం పాటించడం నేర్చుకోవాలి. మంచిరోజులైనా, చెడురోజులైనా ఒకరినొకరు అర్థం చేసుకొని అండగా నిలవాలి. ఏరోజు జరిగిన గొడవలను ఆ రోజు రాత్రికల్లా పరిష్కరించుకొని తర్వాతి రోజును ప్రేమతో ఆరంభించాలి. 3. సమయం గడపాలి... ఉద్యోగాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీ భాగస్వామితో కొంత సమయం గడపడానికి ప్రయత్నించాలి. రిలేషన్షిప్లో మీ వారితో మీరు ఎంత సమయం గడుపుతున్నారన్నదే ఆ బంధం లోతును తెలియజేస్తుంది. ఈ రోజు ఎలా గడిచింది ? అనే ప్రశ్న ప్రతి రోజూ అడగాలి. మీ భాగస్వామి మీతో ఎంతో మాట్లాడాలని, చెప్పాలని ఉన్నప్పటికీ మీరు అడగకపోతే కొన్నిసార్లు చెప్పలేకపోవచ్చు. సమయం దొరికినపుడు విహారయాత్రలకు కలిసి వెళ్లి సంతోషంగా గడిపిరావాలి. 4. నిజమైన మిత్రులు... కుటుంబమైనా, రిలేషన్షిప్ అయినా పురుషులు, మహిళలు మిత్రులుగా ఉంటేనే ఆ బంధం ఎక్కువ కాలం నిలుస్తుంది. ఇద్దరి మధ్యలో ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. మీకు ఎదురయ్యే ఇబ్బందులను, ఆనందాలను ఒకరితో ఒకరు పంచుకోవాలి. ప్రేమ బంధానికి స్నేహం జతకలిస్తేనే అది అవిభాజ్య బంధంగా మారుతుంది. 5. బయటకు కనిపించాలి.... రిలేషన్షిప్లో ఎదురయ్యే పలు ఇబ్బందులను మీరు అధిగమించడం మీ తోటి మిత్రులు చూడాలి. రోజురోజుకు బలపడుతున్న మీ బంధానికి వారే సాక్షులుగా నిలవాలి. దాని నుంచి వారు నేర్చుకోవడం మాత్రమేగాక సమాజంలో ఇదో బాధ్యత అనే విషయం మీకు కూడా బోధపడుతుంది. ఈ విషయాల పట్ల కొంచెం జాగ్రత్త తీసుకొని, అనుదిన జీవితంలో పాటించడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. -
ఔను... వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు
సాక్షి, మధిర: గతంలో ఉప్పు, నిప్పుగా ఉండే ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు నేడు ఒకే పార్టీలో ఉన్నారు. ఎర్రుపాలెం మండలానికి చెందిన భద్రాచలం దేవస్థానం ట్రస్ట్బోర్డు మాజీ చైర్మన్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. గతంలో అయిలూరి కాంగ్రెస్లో ఉన్నప్పుడుకానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీలో ఉన్నప్పుడుకానీ ప్రత్యర్థి వర్గంగా టీడీపీకి చెందిన చావా రామకృష్ణ ఉన్నారు. ఆ మండలం లో ఈ రెండు వర్గాల మధ్య గ్రూపు తగాదా లు, పార్టీల విభేదాలు ఉండేవి. ప్రతీ గ్రామంలో వారిరువురికీ అనుచరులు ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి తుమ్మల వర్గీయునిగా కొనసాగుతున్న చావా రామకృష్ణ, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరునిగా ఉన్న అయిలూరి వెంకటేశ్వరరెడ్డి వేర్వేరు సందర్భాల్లో టీఆర్ఎస్ చేరారు. ఈ క్రమంలో మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి చొరవతో ఆ ఇద్దరు నాయకులు ఎర్రుపాలెం మం డలంలో టీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజ్ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. గతంలో ప్రత్యర్థివర్గాలుగా ఉన్న ఈ ఇద్దరు నాయకులు ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉండి కమల్రాజ్ గెలుపుకోసం ఒకే వాహనంలో తిరుగుతూ ప్రచారం చేయడం గమనార్హం. మధిర నియోజకవర్గంలో ఎర్రుపాలెం మండలానికి ప్రత్యేకత ఉంది. ఆ మండలంలో ఏ అభ్యర్థికి మెజార్టీ వస్తుందో ఆ అభ్యర్థే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో గెలిచిన సం దర్భాలు ఉన్నాయి. దీంతో అయిలూరి వెంకటేశ్వ రరెడ్డి, చావా రామకృష్ణ కమల్రాజ్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. ఇప్పటికే చావా రామకృష్ణకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అప్పగించగా రాబోయే ప్రభుత్వంలో అయిలూరికి సముచిత ప్రాధాన్యత కల్పించేందుకు మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి హామీ ఇచ్చినట్లు సమాచారం. బుధవారం మధిరలో కమల్రాజ్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా వారిద్దరూ కోర్టు ఆవరణలో ఉన్న వేపచెట్టుకింద కూర్చొని రాజకీయ పరిస్థితుల గురించి చర్చించు కోవడం గమనార్హం వారిద్దరి కలయికను ఆప్రాంతంలో ఉన్న వారు ఆసక్తిగా తిలకించారు. -
వరాహంపై వానరం
కురవి : వరాహం వీపుపై వానరం కూర్చుని సుమారు అరగంటపాటు ఆడుకున్న సంఘటన కురవి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వెనుక భాగంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వరాహం రోడ్డు పక్కన వెళ్తుండగా కోతి(వానరం) ఒక్క ఉదుటున వచ్చి దాని వీపుపై ఎక్కి కూర్చుంది. కొద్దిసేపు అలానే పడుకుని నిద్రపోయింది. వరాహం మేత మేసుకుంటూ వెళ్తూ ఉండగ వానరం వీపుపై అలాగే ఉన్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. వరాహం కోతిని ఏమి అనకపోవడంతో సుమారు అరగంట పాటు వినోదాన్ని పంచింది. -
సాంగ్స్తో ఆదరగొట్టిన బన్ని, నాని
టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, నాని స్నేహానికి ఎంత విలువ ఇస్తారో తెలిసిన విషయమే. బన్ని ఓ ఈవెంట్లో సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ బహుమతిగా ఇచ్చిన జాకెట్ ధరించి తాను స్నేహానికి ఎంత విలువ ఇస్తాడో తెలిపారు. అలాగే నాని కూడా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో స్నేహంగా వ్యవహరిస్తారు. పలు హీరోల చిత్రాల ప్రమోషన్స్లో పాల్గొంటూ వారి మధ్య స్నేహాన్ని వ్యక్తపరిచారు. కానీ ఇప్పడు బన్ని, నానిలు కలిసి ఓ వేడుకలో చేసిన సందడి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలు చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. బన్ని, నానిల కామన్ ఫ్రెండ్ వివాహ వేడుకలో వీరు ఇలా ఎంజాయ్ చేసినట్టుగా తెలుస్తోంది. బన్ని, నానిలు కలసి ఎటో వెళ్లి పోయింది మనసు’ చిత్రంలోని ‘ ప్రియతమా నీ వచట కుశలమా..’ అని పాడుతూ సందడి చేశారు. ఆ తర్వాత బన్ని ఆర్య2 చిత్రంలోని ‘ఉప్పెనంత ఈ ప్రేమ..’కు పాటను ఆలపిస్తూ.. తన భార్య స్నేహరెడ్డితో కలిసి స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. నాని తన భార్య అంజనాతో కలిసి నిన్నుకోరి చిత్రంలోని ‘అడిగా, అడిగా..’ సాంగ్ పాడారు. బన్ని, నానిలు ఇలా పాటలు పాడుతుంటే అక్కడున్న వారంతా గోల చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడొచ్చు.. -
మ్యారేజ్ పార్టీలో సందడి చేసిన బన్ని, నాని జంటలు
-
ఒక అఆ కథ!
ఆయన పేరు ఆనందు. ఆనందు కళ్లలోకి సూటిగా చూస్తే... ‘అప్పులోనే ఆనందం ఉంది’ అని చెబుతాయి ఆ కళ్లు. ఆనందును ఆ పేరుతో కాకుండా ‘అఆ’ (అప్పుల ఆనందు) అని పిలుస్తుంటారు అందరూ. ఆ నోటా ఈ నోటా విన్న ఆయన ఆటోబయోగ్రఫీ ప్రకారం... ప్రైమరీ స్కూల్ రోజుల్లో ఆనందు పక్క సీటు వాడి దగ్గర బలపాలు అప్పు చేసేవాడు. ‘‘మొన్న నా బలపం తీసుకున్నావు. ఇవ్వు’’ అని బలపం అప్పిచ్చిన వాడు అడిగితే, ఆనందు అమాయకంగా ముఖం పెట్టి బిగ్గరగా ఏడ్చాడు. ‘‘ఏమైంది?’’ అని పంతులుగారు ఆరా తీస్తే... ‘‘ఈడు నన్ను బలపం ఇవ్వమని కొడుతున్నాడు’’ అని ఏడుపు పొడిగించాడు. వీడి ఏడుపుకు గుండె కరిగిన పంతులుగారు ఆవేశపడిపోయి ఆనందు ఫిర్యాదు చేసిన వాడిని ఓ రేంజ్లో బాదారు. పంతులుగారు క్లాసురూమ్ దాటి బయటికి వెళ్లగానే.... ‘బలపం కావాలట బలపం...గిల్పం కావాలట గిల్పం’ అంటూ బాధితుడ్ని వెక్కిరించాడు ఆనందు. ఈ ఆనందు అప్పుల ఆగడాలు బలపాలతో ఆగలేదు. హైస్కూల్ రోజుల్లో టెక్ట్స్బుక్లు అప్పు అడిగేవాడు. ‘నీ సోషల్ బుక్ ఒక్కసారి ఇవ్వరా’ అని ఎవరో ఒకరి దగ్గర పుస్తకం తీసుకుంటాడు. అంతే... వారం దాటినా ఆ పుస్తకం జాడ తెలియదు. అరువు తెచ్చుకున్న పుస్తకాన్ని ఇంట్లో పాత పెట్టెలో దాచుకొని పదేపదే మురిసిపోయేవాడు. ‘అయ్యో! బుక్ను ఎలుకలు కొట్టేశాయి’ అంటూ స్నేహితుని చెవిలో పువ్వు పెట్టేవాడు. ఇక ఇంటర్ రోజుల్లో షర్ట్లు, ప్యాంట్లు అప్పు చేసేవాడు. ‘‘అరే మామా! నీ షర్ట్ సూపర్గా ఉంది. ఒకసారి వేసుకొని ఇస్తాను’’ ఎవరో ఒక ఫ్రెండ్ను అడిగేవాడు. ‘‘అలాగే’’ అని అమాయకంగా ఇచ్చేవాడు ఆ ఫ్రెండ్. వారం రోజులు దాటినా ఇచ్చిన షర్ట్ తిరిగి రాకపోయేసరికి... ‘‘షర్ట్ ఎప్పుడిస్తావురా?’’ అని వీలైనంత దీనంగా అడిగేవాడు షర్ట్ ఓనరు. ‘‘నీ షర్టు ఎడమజేబు మీద చిన్న చిన్న పువ్వులు డిజైన్ చేయిస్తున్నాను. పూలరంగడు సినిమాలో నాగేశ్వర్రావు షర్ట్లా ఉంటుందనుకో’’ అని నమ్మబలికేవాడు. ‘‘అబ్బే! నీకెందుకు అనవసరంగా ఖర్చు’’ అనేవాడు షర్ట్ ఇచ్చిన వాడు మొహమాటంగా. ‘‘ఫ్రెండ్షిప్ అన్నాక డబ్బు గురించి అతిగా ఆలోచించొద్దు’’ అనేవాడు ఆనందు గంభీరంగా. మంచితనం, మమకారం, ఆప్యాయత, అనురాగం, స్నేహధర్మం, త్యాగ్యనిరతి...మొదలైన వాటికి తలదాచుకోడానికి లోకంలో ఎక్కడా చోటు లేక ఆనందులో కొలువున్నవి అనుకునేవాడు షర్ట్ ఓనరు అమాయకంగా. ఒక్క వారం కాదు... ఎన్ని వారాలు గడిచిపోయినా ఆ షర్ట్ ఏమైందో తెలిసేది కాదు. పూలరంగడు ఏమయ్యాడో తెలిసేది కాదు. ‘‘మొన్న ఒక ఫంక్షన్లో ఆనంద్గాడు నీ షర్ట్ వేసుకొని కనిపించాడు!’’ అని ఎవరో ఒకరు చెవిలో వేస్తే ఏడవాలో, నవ్వాలో తెలియక రెండిటినీ మిక్స్ చేసి ఏడుపుగొట్టు నవ్వు నవ్వేవాడు షర్ట్ ఓనరు. పుస్తకాలు పెద్దగా చదవకపోయినా ముళ్లపూడి వారి ‘రుణానందలహరి’ పుస్తకం అంటే ఆనందుకు అమితమైన ఇష్టం. అందులో ఒక పద్యం ఉంటుంది ఇలా... ‘అప్పులు చాలా చేసితిని యర్హత లేదనబోకు లోకమం దప్పులు తప్పులు న్నెరుగనేరని వారెవరైన నుందురే అప్పులస్వామి యా వరుణ, డప్పుల కుప్పలు మేఘవార్నిధుల్ తప్పగునా రుణంబు? రుణదా! శరధీ! కరుణాపయోనిధి!’ రేడియోలో సుప్రభాతం వస్తున్న టైమ్లో ఈ పద్యాన్ని రోజూ నిష్ఠగా చదువుకునేవాడు ఆనందు. అలాంటి ఆనందు ఒక ఉద్యోగంవాడయ్యాడు. ఆనందు మాంచి మాటకారి. ఎంత బిగుసుకుపోయిన వాడినైనా ఒక్కరోజులో ఫ్రెండ్గా మార్చుకోగలడు. మూడురోజుల్లో క్లోజ్ఫ్రెండును చేసుకోగలడు. వారం తిరిగేలోపు తనకు ప్రేమతో అప్పు ఇచ్చేలా చేసుకోగలడు. ఎన్నో ఉద్యోగాలు మారిన ఆనందు ఎందరో మహానుభావుల దగ్గర ఎన్నో అప్పులు చేశాడు. ఆ అప్పుల పుణ్యమా అని ఆనందు ఆర్థికపరిస్థితి మారిపోయింది. కొండాపూర్లో ఖరీదైన ఇళ్లు కట్టుకున్నాడు. ఆ ఇంటికి ‘రుణానందలహరి’ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఆ ఇంటి గోడలపై అక్కడక్కడా ‘రుణానందలహరి’లో నుంచి ఇలాంటి వాక్యాలు కనిపిస్తాయి. ‘సూర్యుడు సముద్రుడి దగ్గర అప్పు తీసుకుంటాడు. ఆయన దగ్గర నుంచి భూమి అప్పు తీసుకుంటుంది. దాన్ని సముద్రుడు వాడేసుకుంటాడు. మళ్లీ పై వాడికి అప్పులిస్తాడు’ ‘గొప్పవాళ్లలో అప్పు చేయని వాడెవడు?’ ఒకానొక రోజు ఆనందు గుండెపోటుతో గుటుక్కుమన్నాడు. ఆ ఇల్లు జనాలతో కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా ఏడుపులే! ‘‘ఈయనకు ఇంత ఫాలోయింగ్ ఉందా?’’ అని అప్పారావు సుబ్బారావుని అడిగాడు. ‘‘ఫాలోయింగా పాడా! ఇక్కడ ఏడుస్తున్న వాళ్లంత ఆయన ఆత్మీయులు కాదు...అప్పులు ఇచ్చిన వాళ్లు! నిన్నటి వరకు తమ అప్పు ఏరోజుకైనా తీర్చకపోతాడనే చిన్న ఆశ ఉండేది. చివరికి ఆ ఆశ కూడా తుపాన్లో దోశలా కొట్టుకుపోయింది. అదీ విషయం’’ అని చెప్పాడు సుబ్బారావు. – యాకుబ్ పాషా -
స్వార్థం లేనిదే స్నేహం
ఇశ్రాయేలీయులను, యూదులను పరిపాలించిన సౌలు కుమారుడు యోనాతాను, సౌలు వద్ద ఉన్న దావీదుతో స్నేహం చేశాడు. ఒక రాజ కుమారుడు సాధారణమైన వ్యక్తితో స్నేహం చేయడం వెనుక అతని హృదయ స్వచ్ఛత కనిపిస్తుంది. స్నేహం అంటే కలిసి తిరగడం, అల్లరి చేయడం అనే ఈ తరం వారికి తెలుసు, కానీ స్నేహం అంటే త్యాగం అనే విషయం ఇప్పటి తరానికి నేర్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. వీరుడైన దావీదు తన రాజ్యాన్ని ఎక్కడ ఆక్రమిస్తాడో అని అనుకున్న సౌలు దావీదును చంపడానికి ఆలోచిస్తున్నాడు. అయితే తన కుమారుడైన యోనాతానుతో దావీదుకున్న స్నేహం గురించి అతనికి తెలియదు కనుక ఆ విషయాన్ని యోనాతానుతోనే చెప్పాడు. దావీదును చంపాలన్న ఆలోచన తన తండ్రి చేస్తున్నాడని తెలిసిన యోనాతాను, ఎలాగైనా తన స్నేహితుడిని రక్షించాలనుకున్నాడు. ఆ విషయాన్ని దావీదుకు తెలియజేసి ‘‘నీవు రహస్యస్థలంలో దాగి ఉండు’’ అని అతనిని తన తండ్రి యొద్దనుండి రక్షించిన గొప్ప స్నేహితుడు యోనాతాను. దావీదును యోనాతాను రక్షించడం వెనుక ఎలాంటి స్వార్థం లేదు, కేవలం దావీదు తన స్నేహితుడు అంతే, దావీదును సౌలు చంపితే ఆ రాజ్యానికి రాజు యోనాతాను కావచ్చు. అయినా ఆ రాజ్యం కంటే కూడా తన స్నేహితుడే తనకు ముఖ్యమని దావీదును కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని గొప్ప స్నేహితుడు యోనాతాను, తన కుమారుడే తన శత్రువైన దావీదును రక్షిస్తున్నాడని తెలిసికొన్న సౌలు ‘నీవే దావీదును నా వద్దకు రప్పించమని’ యోనాతానుతో చెప్పినపుడు తన స్నేహితుని కోసం తండ్రినే ఎదిరించి దావీదు వద్దకు పోయి కౌగిలించుకుని బిగ్గరగా ఏడ్చి తన తండ్రి ఉద్దేశ్యం అంతా అతడికి వివరించి దావీదు ప్రాణాన్ని కాపాడి అతడిని అక్కడినుండి తప్పించాడు, ఆ విడిపోతున్న సందర్భంలో ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని బిగ్గరగా ఏడ్చిన సందర్భంలో యోనాతాను దావీదుతో చేసుకున్న నిబంధన ఎంతో గొప్పది, ఇలాంటి స్నేహం మనం ఇప్పుడు చూడగలమా? ఇలాంటి స్నేహితులు ఇప్పుడు మనకు కనిపిస్తున్నారా? అసలు స్నేహం అనే పదానికి అర్థం కూడా మార్చివేసిన ఒక భయంకరమైన సందర్భంలో మనం ఉన్నాం. రాజ్యాలను విడిచి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ స్నేహానికి వారిచ్చిన విలువ ఎంత గొప్పదో కదా! తరువాత రోజుల్లో యోనాతాను మరణించాక దావీదు తన పరిపాలన కాలంలో దివ్యాంగుడైన యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును వెదికించి అతడికి రావలసినదంతా ఇప్పించి అతడు ఇక ఎప్పటికి తనతో కలిసి తన బల్లపైనే భోజనం చేయాలని కోరుకున్నాడు. ఇదంతా తన స్నేహితుడైన యోనాతానును బట్టే. యోనాతాను మరణించినా అతడి స్నేహాన్ని మరచిపోకుండా అతని కుమారుడికి మేలు చేసిన దావీదుది ఎంత గొప్ప హృదయమో కదా! ఇలాంటి స్నేహితులు మనకుంటే ఎంత బావుంటుంది! మనకు మంచి స్నేహితుడు దొరకాలంటే ముందు మనం మంచి స్నేహితులమై ఉండాలి. అప్పుడే మనకు యోనాతాను, దావీదులాంటి స్నేహితులు దొరుకుతారు. – రవికాంత్ బెల్లంకొండ -
పక్కింటి స్నేహం
అది నిద్రో తెలీదు. మెలకువో తెలీదు. రాత్రుళ్ళు నిద్ర పడుతుందో! లేదో! కూడా తెలీదు. ఎప్పుడు మెలకువ వచ్చినా.. అసలు నేను ఇప్పటి వరకూ నిద్రపోయానా! లేక మెలకువగానే ఉన్నానా! అనిపించేలా ఉంటుంది. ఆ రోజూ అంతే. నిద్ర కోసం అలసి సొలసి వేకువజామున చల్లగాలికి మాగన్ను పడుతుంటే.. ఆ ప్రశాంతతని భగ్నం చేస్తూ ఏదో చప్పుడు. హోరుమంటూ అదే పనిగా వినవస్తున్న చప్పుడు. ఆ గందరగోళానికి బాగా దగ్గరలోనే ఉన్నట్లు ఉన్నా.. కళ్ళు తెరవలేని అశక్తత. నిద్రమత్తుని బలవంతంగా పక్కకు నెట్టి, మెలకువ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆ చప్పుడు అలాగే వినవస్తోంది. జలజలమంటూ ఒకే శబ్దంతో హోరున పడుతున్నాయి. అది అంతకంతకూ భరించలేనట్లుగా తయారయ్యింది. ఎవరో నీళ్ళ పంపు వదిలేసినట్లున్నారు.అది పక్క ఇంటి ముసలమ్మగారి పనే. పదేళ్ళ పైనుంచీ ఒక్కతే ఉంటోంది. కొడుకో చోట, తనో చోట. కొడుకూ ఒంటికాయ సొంటికొమ్మే. నలభై అయిదేళ్ళు వచ్చేసినయ్యి. ఇంకా పెళ్లి లేదు. ముసలమ్మ కొడుకుని ఒప్పించలేక ‘‘మా అబ్బాయికి అస్సలు తీరిక ఉండదు. అస్తమానం సింగపూరు, వైజాగ్, హైదరాబాదు అంటూ ఊళ్లు తిరుగుతూ ఉంటాడు. అక్కడ సొంతంగా కంపెనీలు ఉన్నాయి. అయినా మాలో లేట్ మారేజెస్ తప్పు కాదు లెండి’’ అని చెబుతుంది ముసలమ్మ, కోడలోచ్చి, అత్తగారిగా సుఖపడాల్సిన వయస్సులో కూడా. స్థిరంగా ఉండలేని కొడుకు దగ్గర ఉండలేక, సొంత ఫ్లాటులోనే ఉండిపోతుంది. ఆ పంపు కింద బకెట్టు అయినా వెయ్యదు. అలా నీళ్ళు వదిలేసి, ఉదయాన్నే ఇంటి చుట్టూరా ఉన్న బాల్కనీ కడుక్కుంటూ వస్తుంది. నిజానికి పనిచేసుకునే తీరు చూస్తే.. ఇంటిలో ఓ బకెట్టు కూడా ఉండి ఉండదన్న అనుమానం నాకు.ఓసారి అననే అన్నా, ‘‘ఆ పంపు కింద ఓ బకెట్టు వెయ్యొచ్చు కదా. అన్ని నీళ్ళు పోతున్నాయి’’ అని. అసలే నా గొంతులో కరుకుదనం ఎక్కువ. అది బయట పడకుండా లేని నవ్వును నటిస్తూ, ఎక్కడ గట్టిగా మాట్లాడితే పక్కనున్న వాళ్లతో స్నేహం దెబ్బతింటుందేమోనన్న అనుమానం పీడిస్తుండగా. ఆఫీసులో అయితే ఆ బాధలేదు. మాట్లాడాలనుకున్నదేదో నిర్మొహమాటంగా మాట్లాడేస్తా. అవసరం అయితే, పోట్లాడడానికైనా వెనుకాడం. ఏదైనా అప్పటికప్పుడే. మరునిమిషం మామూలే. ఏదీ మనసుకు హత్తుకోదు. హత్తుకున్నా కాలం గాయాన్ని మాన్పేస్తుంది. ట్రాన్స్ఫర్లలో పాత నీరు పోయి, కొత్త నీరు వస్తుంది. కొత్త మనుషులు.. కొత్త ప్రపంచం.కానీ, బయట ప్రపంచంలో, అందునా పక్కనున్న వాళ్లతో చాలా జాగ్రతగా ఉండాలి. ఇక్కడ ట్రాన్స్ఫర్లు, కొత్త పరిస్థితుల రాకా ఉండదు. ఏదైనా జరిగితే డోర్ మూసుకుపోయినట్లే. ఆ మాటకు తుడుస్తున్న తుడుపు ఆపి ‘‘నేను ఇక్కడే ఉన్నాను కదా. పని చేసుకుంటూనే ఉన్నాను కదా’’ అంటూ అసహనంగా నాకోసం అన్నట్లు పంపుని కాస్త కట్టి, వదిలేసింది. అయినా నీళ్ళు కారుతూనే ఉన్నాయి. ఇక నాకేం మాట్లాడాలో తెలీలేదు. గట్టిగా మాట్లాడిన దాకా ఉంటే ‘మీరు నలుగురున్న మనుషులు.. మీకన్నా ఎక్కువ నీళ్ళు వాడేస్తానా..’ అంటేనో! దానికి నా దగ్గర సమాధానం లేదు. అనవసరంగా మాట్లాడి స్నేహం పోగొట్టుకోవడం ఎందుకు? పక్కింటి వాళ్లతో స్నేహం డబ్బిచ్చి కొనుక్కోలేం.అయితే.. ఇప్పుడు ఆ నీటి ధార చేసే చప్పుడు. నన్ను పడుకోనివ్వకుండా ఇబ్బంది పెడుతోంది. పూర్తిగా మెలకువ వచ్చిన తరువాత.. ఎంతోసేపు ఉండలేకపోయాను. ఇంకా ఊరుకుంటే, పైన ట్యాంకులో నీళ్ళు అయిపోయే ప్రమాదం ఉంది. లేచి, వంటగది కిటికీ దగ్గరకు వెళ్లి.. పక్కింటి బాల్కనీ వైపు చూశాను. పంపు ఆసాంతం విప్పి ఉంది. నీళ్ళు ధారగా పోతున్నాయి. ఆవిడ ఇక్కడ పని మొదలుపెట్టి, ఇంట్లోకి వెళ్లి, మరో పని చూసుకుంటున్నట్లు ఉంటుంది కాబోలు.. పంపు అలాగే పడుతోంది.‘‘ఏమండీ. నీళ్ళు పోతున్నాయి కదా’’ గట్టిగా పిలిచాను ముసలమ్మగార్ని.దరిదాపుల్లో ఉన్నట్లు లేదు. చడీ చప్పుడూలేదు. ఉలుకూ పలుకూ లేదు.రెండు నిమిషాలు చూసి, ‘‘ఏమండీ! రమణమ్మ గారూ’’ మరింత గట్టిగా స్వరం పెంచాను. నా అరుపుకి హడావుడిగా బయటకొచ్చిన ముసలమ్మ పంపుని గట్టిగా కట్టి ‘‘నాకు తెలుసండీ. అస్తమానంనాకేం చెప్పాల్సిన పనిలేదు. నేనేం చిన్న పిల్లనా!’’ అంది.‘‘నీళ్లు పోతున్నాయి కదా..’’ మాట ఇంకా గొంతులో ఉండగానే.. ‘‘మీరింకేం మాట్లాడ కండి. నా సంగతి నాకు తెలుసు’’ అంటూ, చీపురుతో బాల్కనీ తుడుస్తూ, ‘‘తెల్లారింది మొదలు ఇవే మాటలు అయిపోయినాయ్. ఎంత జాగ్రత్తగా ఉంటున్నా కూడా’’ అంటూ తప్పు తనది పెట్టుకుని కూడా సణుక్కోసాగింది.పొద్దుటే, ఏం మాట్లాడాలో తోచింది కాదు.ఆమెలో ఎప్పుడూ ఇలాంటి ధోరణి చూసింది లేదు. అవాక్కయ్యాను. నిద్ర లేచిన వెంటనే, గొడవకు దిగితే, ఇక రోజు ఏం ప్రశాంతంగా ఉంటుంది. మౌనంగా ఉండిపోయాను. ఇన్నాళ్లూ అభిమానంగా ‘‘ఇంట్లో పూజ చేసుకున్నాను. వచ్చి తాంబూలం తీసుకునెళ్ళండమ్మా’’ అన్న ముసలమ్మగారేనా ఈవిడ. తన తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంలో ఈ విధంగా మాట్లాడేస్తోంది.పిలిచిందే తడవుగా.. ఇంట్లోకి వెళ్లి, దేవుడికి దండం పెట్టుకుని, అక్కడే ప్లేటులో ఆవిడ అమర్చిపెట్టిన పసుపూ, కుంకుమా, వాయనం అన్నీ తీసుకుని, చివరిగా ఆవిడ అందించే ప్రసాదం తీసుకుని, వస్తుంటాం.ఇక ఆ భాగ్యానికి నేను నోచుకోనేమో అనిపించింది ఆ క్షణాన. ఇంతటితో మా పదేళ్ళ స్నేహానికి అడ్డుకట్ట పడిందా! అపార్టుమెంటులో ఉన్న జబ్బే ఇది.వేసవికాలం అయినా పైపులు అలా వదిలేసి, ఇస్టానుసారంగా నీళ్ళు వాడేస్తారు. రెండు బోర్లు తవ్వించారు. ఒకటి పోయినా ఒకటి ఉంటుందని.మంచినీళ్ళకి మున్సిపల్ వాటర్ ఎలాగూ ఉంది. మంచినీళ్ళు రాకపోవడం అంటూ ఉండదు. ఎటొచ్చీ వాడకం నీటికే జాగ్రత్త.పేపర్లు, టీవీలు అదే పనిగా ఘోషించి, నీటి ఎద్దడిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నా గాని, అవన్నీ ఎక్కడో కదా అన్నట్లు చూస్తారే తప్ప.. వాస్తవాన్ని గ్రహించలేరు. ఈరోజు సుఖంగా గడిస్తే చాలు.. రేపటి సంగతి రేపు చూసుకుందాం అనుకునే నైజం.ఏదో ఓ రోజున బోర్లలో ఉండే భూగర్భజలం అడుగంటుకుపోయి, ఆ వచ్చే కాసిన్ని చుక్కలూ రాకుండా పోతాయి. నీళ్ళు తోడే మోటారు అస్తమానం తోడలేక, తోడి తోడి ఐదో అంతస్తుపైన ఉన్న వాటర్ ట్యాంకులోకి ఎక్కించలేక.. అప్పుడప్పుడూ మొరాయిస్తుంది. అదీ వేసవిలోనే. వెంటనే బాగు చేయిద్దాం అన్నా, సమయానికి మెకానిక్ దొరకడు. తక్కువలో తక్కువ రెండు రోజులు పడుతుంది. అయిదు అంతస్తులు కిందికి దిగి, వీధి కుళాయిల దగ్గర పట్టుకోవాలి. ముప్పై పోర్షన్ల వాళ్ళూ ఓ రోజు బిందెలు పట్టుకుని కిందకి దిగితే, సాయంత్రానికల్లా లిఫ్ట్ పాడైపోతుంది. అది ఇంకా నరకం. బిందె, బిందెకూ వంద మెట్లెక్కి దిగాలి. ఎవ్వరికీ.. రాబోయే కష్టం గురించి ఆలోచన లేదు. అలాంటి పరిస్థితి రాకూడదనే మాట్లాడినందుకు పక్కింటి స్నేహానికి ఎసరొచ్చింది. ఏం చేస్తాం? ఇంతకు ఇంతే ప్రాప్తం అని సరిపెట్టేసుకున్నా. నాకు ఇల్లే కాదు ఆఫీసు అనే మరో ప్రపంచం కూడా ఉంది. కాబట్టి, విషయం అంతగా పట్టించుకోలేదు. ఈ వేసవికి ముసలమ్మగారింటికి పెంపుడు కూతురు పిల్లలతో సహా వచ్చింది. ఆవిడకీ ఒంటరితనానికి తెర పడింది. మా చూపులు పలకరించుకోవడం పూర్తిగా మానేశాయి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే అనుకుంటున్నాం, ఈసారి ఎండలు మరీ ఎక్కువగా ఉన్నాయి అంటూ. శెలవు రోజుల్లో ఇంట్లో ఉండాల్సి వస్తే మాత్రం చాలా కష్టం అయిపోయింది. ఆకాశంలో.. అయిదవ అంతస్తు. ఎండా, వేడీ అంతా ఇంట్లోనే. ఉదయం పది గంటలయితే చాలు వడగాడ్పు మొదలు. తలుపులు ఓ వారగా వేసుకుని, గాడ్పు నుండి ఉపశమనం పొందడం. గదిలో ఫ్యానులు ఆగకుండా తిరిగేవి. అయినా ఉక్కబోత. ముఖం మీద చర్మం కాలిపోతుందన్న భావన. ఎన్ని మంచినీళ్ళు తాగినా దాహం తీరదు. ఒక్కచోట కూర్చోలేని అనిశ్చితి. ఉస్సూరస్సూరంటూ రోజు గడిచేది. అలాంటి వేసవిలో ఆరోజు..ఆఫీసుకి వెళ్ళే తొందరలో వంటగదిలో సింకు దగ్గర పని చేసుకుంటున్నాను. అక్కడ నిలబడి ఎదురు బాల్కనీలోకి చూస్తే ముసలమ్మగారు ఏం పని చెసుకుంటున్నదీ కనిపిస్తుంది. అలాగే పైపులు వదిలేసినా తెలుస్తుంది. కాబట్టే, నేనావిడని కట్టడి చేసేది. అలా జరిగినప్పటి నుంచీ, ఆవిడ జాగ్రత్తగానే ఉంది, నీటి వాడకం విషయంలో. ఏమనుకుందో ముసలమ్మగారు.. ఎప్పటిలాగే మా వంటగది కిటికీ ఎదురుగా నిలబడి, కిటికీలోకి తొంగి చూస్తూ.. నన్ను ఉద్దేశించి కాస్త గట్టిగా ‘‘ఎండలు మండిపోతున్నాయండీ. అస్సలు ఉండలేకపోతున్నాము. మీకెలా ఉందో గాని, నేనైతేతట్టుకోలేకపోతున్నాను’’ అంటూ నోరు విప్పి మాట్లాడింది, నెల రోజుల తరువాత. హమ్మయ్యా! ఇన్నాళ్ళకు గ్రహణం వీడింది.ముసలమ్మగారు నాతో మాట్లాడుతోంది. చాలా సంతోషమేసింది. అపార్థాల మంచుతెరలు తొలగి, పిల్లతెమ్మెర వీచినట్లు. ‘‘అవునండీ. అస్సలు భరించలేకుండా ఉన్నాం. నేనైతే ఆఫీసులో ఎక్కువసేపు కంప్యూటర్లు ఉన్న ఏసీ రూంలోనే కూర్చుంటున్నాను. నా సీటు పని కూడా అక్కడేతీసుకువెళ్ళి చేసుకుంటున్నాను. ఎప్పుడోగాని బయటకు రావడం లేదు’’ చెప్పాను అవకాశాన్ని అంది పుచ్చుకుంటూ. ముసలమ్మగారితో మాట్లాడానన్న ఆనందం నన్ను ఉత్సాహపరిచింది. మనిషి సంఘజీవి. ఎవ్వరితోనూ మాట్లడకుండా, మనసు పంచుకోకుండా ఎక్కువకాలం ఉండలేడు. నాకంటే మరో ప్రపంచం ఉండబట్టి పట్టించుకోలేదు గాని, వంటరి ముసలమ్మలాంటి వాళ్ళకు పొరుగింటివాళ్ళ తోడు అవసరం. నాకు మాత్రం ఆవిడంటే కోపమా ఏమిటీ? ఎప్పుడూ లేనిది ఆవిడ విసుక్కుందని ఆవిడ వైపు చూడడం మానేశాను గాని.ఏది ఏమైనా మండు వేసవి. ఎండల కారణంగా.. శిశిరం తరువాత వచ్చే వసంతంలా.. ముడుచుకున్న మా స్నేహం తిరిగి చిగురించినందుకు సంతోషపడ్డాను. ఇప్పుడు ముసలమ్మగారు ఎప్పుడు కనిపించినా చిన్నగా నవ్వుతోంది ఎప్పటిలానే. బయట ఎండలు మండుతున్నా.. పక్కింటి స్నేహం వెన్నెల్ని కురిపిస్తూనే ఉంది మనసుకి హాయిగా. - పీఎల్ఎన్ మంగారత్నం -
జాతివైరం మరిచి.. ప్రేమను చాటి...
కేసముద్రం(మహబూబాబాద్): ఓ కొండెంగ.. మరో కొండెంగ పిల్లపై దాడి చేసి చంపగా.. గతంలో దానితో జాతి వైరం మరిచి స్నేహం చేసిన శునకం గ్రామస్తులు నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొని గ్రామ శివారులో ఖననం చేసే సమయంలో కొండెంగ కలేబరాన్ని ఆత్మీయంగా తాకుతూ.. తాన స్నేహాన్ని చాటిన సంఘటన కేసముద్రం మండలం కల్వల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం. కల్వల గ్రామానికి చెందిన ఆకుల సుధాకర్ అనే రైతు పంటపొలాల్లో, గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో రెండు కొండెంగలను తీసుకువచ్చి సాకుతున్నాడు. కొండెంగలకు ఆరునెలల క్రితం పిల్ల జన్మించింది. ఈ మేరకు తల్లికొండెంగను చెట్టుకు కట్టేయగా, పిల్ల కొండెంగ అటుఇటూ తిరుగుతుండగా, ఇదే గ్రామంలో గుట్టయ్య అనే రైతు పెంచుకుంటున్న కుక్క జాతివైరాన్ని మరచి ఆ కొండెంగ పిల్లతో స్నేహం చేస్తూ వచ్చింది. కొండెంగ పిల్ల ఎక్కడుంటే ఆ శునకం అక్కడే ఉంటూ, దాన్ని నిమురుతూ స్నేహంగా మెదలాడాన్ని స్థానికులు చూసి ఆశ్చర్యపోయేవారు. ఊళ్లో కొండెంగలు ఉండటం వలన గ్రామానికి కోతులు రాకపోవడంతో, గ్రామస్తులు నిత్యం ఆ కొండెంగలకు పండ్లు, కూరగాయలు పెడుతూ వచ్చారు. ఈక్రమంలో అటవీ ప్రాంతం నుంచి ఊళ్లోకి చేరుకున్న మరో కొండెంగ గత కొద్దిరోజులుగా , పెంచుకునే కొండెంగలపై దాడిచేసే ప్రయత్నం చేస్తుండగా, గమనించిన గ్రామస్తులు ఆ కొండెంగను బెదిరించి పంపించేవారు. ఈ క్రమంలో సోమవారం తల్లి కొండెంగను గొలుసుతో చెట్టుకు కట్టేయగా, పిల్ల కొండెంగ చెట్టు ఎక్కడాన్ని గమనించిన అడవి కొండెంగ మెడకొరికి దాడిచేసి చంపేసింది. దీంతో గ్రామస్తులు ఆ కొండెంగకు మేళతాళాల నడుమ, పాడెను కట్టి, ఊరి చివర వరకు తీసుకెళ్లి, ఖననం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇదిలా ఉండగా ఇన్ని రోజులుగా జాతివైరాన్ని మరిచి స్నేహం చేసిన శునకం మృత్యువాతపడిన కొండెంగ వద్దకు వచ్చి నిమురుతూ, ఆ తర్వాత పాడెకట్టి తీసుకెళ్తుంటే దానివెంటే వెళ్లి, చివరకు ఖననం చేసే ప్రాంతానికి చేరుకుని దానిచుట్టూ తిరిగింది. మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా మరో జంతువుపై ఇంత ప్రేమ ఉంటుందా.. అని గ్రామస్తులు ఆశ్చార్యానికి లోనయ్యారు. పైగా ఒకే జాతి కొండెంగ చంపగా, మరో జాతికి చెందిన శునకం మాత్రం స్నేహభావాన్ని చాటింది. -
జస్ట్ ఫ్రెండ్.. అంతే!
రెండు మూడు రోజుల నుంచి బీటౌన్లో ఒకటే గుసగుస. హీరోయిన్ నిధీ అగర్వాల్ డేటింగ్ గురించి. క్రికెటర్ కేఎల్ రాహుల్తో ఆమె డేటింగ్లో ఉన్నారని ఈ గుసగుసల సారాంశం. అయితే ఈ గుసగుసల్లో ఏ మాత్రం నిజం లేదంటున్నారు నిధీ అగర్వాల్. ‘‘రాహుల్ నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. అతను క్రికెటర్ కాకముందునుంచి నాకు తెలుసు. నేను హీరోయిన్ కాకముందే అతనికి నేను తెలుసు. అందుకని మాట్లాడుకుంటుంటాం. అంత మాత్రాన మా మధ్య ఏదో ఉన్నట్లేనా? రాహుల్ది కూడా బెంగళూరునే’’ అని చెప్పుకొచ్చారు ఈ మంగుళూరు బ్యూటీ. నిధీ అగర్వాల్ మూలాలు హైదరాబాద్లో ఉన్నప్పటికీని, ఆమె చదువుకుంటూ పెరిగింది మాత్రం బెంగళూరులోనే. ఆ సంగతి అలా ఉంచితే... నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సవ్యసాచి’ చిత్రంలో నిధీ కథానాయికగా నటిస్తున్నారు. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాతోనే నిధీ టాలీవుడ్కు పరిచయం కానున్నారు. -
స్నేహానికి 200 గంటలు
నమ్మకమనే విత్తనం లేకుండా, ఇష్టం, స్నేహం, ప్రేమ వంటి ఏ బంధమూ మొలకెత్తదు. అన్ని బంధాల్లోకీ తియ్యనైనది స్నేహం. దానికీ నమ్మకం అనే విత్తనం కావలసిందే కానీ.. అది మొలకెత్తడానికి కనీసం 200 గంటల సమయం పడుతుందట! కొత్తగా పరిచయమైన వ్యక్తి మీద నమ్మకం ఏర్పడి, వారిద్దరి మధ్య స్నేహం వెల్లివిరుస్తుంది. ఒకే గూటి పక్షులు ఒకే మాట మాట్లాడతాయన్నట్లుగా, ఒకే భావాలు ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ స్నేహబంధం ఏర్పడుతుంది. అయితే మొదటి చూపులోనే ప్రేమ ఏర్పడినట్లుగా తొలి పరిచయంతోనే స్నేహం ఏర్పడదు అని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. కన్సాస్ యూనివర్సిటీ కమ్యూనికేషన్ స్టడీస్ విభాగంలో ప్రొఫెసర్గా ఉన్న జెఫ్రీ హాల్.. స్నేహం గురించి పరిశోధన చేసి ఇద్దరు మనుషుల మధ్య స్నేహం ఏర్పడటానికి ఎంతలేదన్నా కొంత సమయం పడుతుందని అంటున్నారు. ఆన్లైన్ పరిశోధనలో ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు గ్రహించారు. గత ఆరు నెలలుగా కొత్త స్నేహితుల కోసం ఆసక్తి కనపరుస్తున్న 355 మందితో మాట్లాడారు. వారు కొత్తవారితో ఎన్ని గంటలు కలిసి ఉంటున్నారో పరిశీలించారు. సాన్నిహిత్యం, సరదాగా స్నేహం, స్నేహం, గాఢమైన స్నేహం... ఈ నాలుగు అంశాల మీద జెఫ్రీ హాల్ సర్వే జరిపారు. రెండవ దశగా 112 మంది విద్యార్థులను ప్రశ్నించారు. స్కూల్స్ తెరవడానికి రెండు వారాల ముందు నుంచే తాము, తమ స్నేహితులు కలుస్తామని వారు చెప్పారు. వారిని సుమారు నాలుగు నుంచి ఏడు వారాల పాటు అధ్యయనం చేశాక.. సాధారణమైన స్నేహం ఏర్పడటానికి 40–60 గంటల సమయం, సాధారణ స్థాయి నుంచి కొద్దిగా ముందుకు వెళ్లడానికి 80–100 గంటల సమయం, మంచి స్నేహితులు కావడానికి కనీసం 200 గంటల సమయం పడుతోందని హాల్ గమనించారు. అంటే మధురమైన స్నేహాన్ని పటిష్టంగా ఏర్పరచుకోవడానికి 200 గంటలు నిరీక్షించాల్సిందేనా? అవసరం లేదు. మంచి స్నేహం ఏర్పడిందంటే రెండొందల గంటలు గడిచి ఉంటాయనే అనుకోవాలి జెఫ్రీ హాల్ మాటల్ని బట్టి. – రోహిణి -
స్నేహం, శత్రుత్వం రెండూ అవసరం
సూత్రం నం.1 : ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మొదట నిన్ను నువ్వు మూడు ప్రశ్నలు వేసుకో. నేనెందుకు ఈ పని చేస్తున్నాను? ఫలితం ఎలా ఉండబోతోంది? ఇందులో నేను విజయం సాధిస్తానా? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభిస్తే అప్పుడు నువ్వు ముందుకు వెళ్లవచ్చు. సూత్రం నం. 2 : పుస్తకాలకే పరిమితమైన జ్ఞానం, ఇతరుల స్వాధీనంలో ఉన్న ఆస్తి.. మన అవసరాలకు ఉపయోగపడవు. చాణక్యుడి అర్థశాస్త్రంలోని సూత్రాలివి. ఇంకా చాలా సూత్రాలు ఉన్నాయి. అన్నిటి అంతస్సూత్రం ఒకటే.. ‘నీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకు. అది నిన్ను నాశనం చేస్తుంది’. చాణక్యుని కీలక గురుమంత్రం ఇది. నువ్వు బయట పడితే నీకు భయపడడం తగ్గుతుందన్నది అంతరార్థం. చాణక్యుని ‘అర్థశాస్త్రం’లో ఆరువేలకు పైగా సూత్రాలు ఉన్నాయి. ‘చాణక్య నీతి’ అనేది మరో ఉద్గ్రంథం. అందులో నీతి సూత్రాలు ఉన్నాయి. అర్థశాస్త్రంలో డబ్బు గురించి ఉన్నప్పటికీ, డబ్బు గురించి మాత్రమే లేదు. రాజనీతి, యుద్ధనీతి, వ్యక్తి నీతి, సంఘ నీతి... ఇలా అనేక జీవన నీతులున్నాయి. ఇప్పటికీ, ఎప్పటికీ అవి మనిషికి, వ్యవస్థలకు అవసరమైనవి. అప్పుడప్పుడు మన బడ్జెట్ ప్రసంగాలలో చాణక్యుని మాట వినిపిస్తుంటుంది. బడ్డెట్ల రూపకల్పనల్లో చాణక్య నీతి కనిపిస్తుంటుంది. బతకడానికి, బాగా బతకడానికి మధ్య తేడాలను చెప్పిన తాత్విక పండితుడు చాణక్యుడు. అనుభవంతో పండి, అనుభవసారాన్ని పిండి లోకానికి ఉగ్గు పట్టించిన వాడు చాణక్యుడు. వృత్తిలో ఎదగదలచిన వాడికి స్నేహమెంత ముఖ్యమో, శత్రుత్వం కూడా అంత ముఖ్యమని అంటాడు. ఎదుగుతున్న క్రమంలో మంచీచెడూ రెండూ సోపానాలే అంటాడు. ఏదైనా పని మొదలు పెట్టేముందు ఎవరైనా తమ ఇష్టదైవాన్ని స్తుతిస్తారు. చాణక్యుడు మాత్రం ఓం మంచీచెడాయనమః అంటాడు. ఆయన భాషలో అది ‘ఓం నమః శుక్రబృహస్పతిభ్యాం’. అంటే బృహస్పతికొక దండం, శుక్రాచార్యుడికొక దండం అని. బృహస్పతి దేవతల గురువు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. దండం ఇద్దరికీ పెట్టినా అంతర్లయగా మంచికే లయబద్ధుడై ఉన్నాడు చాణక్యుడు. -
స్నేహానికి మీరిచ్చే స్థానం...?
సెల్ఫ్చెక్ స్నేహబంధం ఎంత మధురం... దేవుడే దిగివచ్చి ఏమి కావాలంటే మిద్దెలొద్దు మేడలొద్దు ఒకే నేస్తం చాలంటా!... ఆపదల్లో ఉన్నప్పుడు అయినవాళ్ల దగ్గరకు వెళ్లేకంటే స్నేహితుడి ఇంటికెళ్లటం మంచిదంటారు. ఇలా స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరికీ అన్ని బంధాలూ లేకపోయినా స్నేహబంధం మాత్రం కచ్చితంగా ఉంటుంది. స్నేహం కోసం దేన్నైనా త్యాగం చేసేవారు కొందరైతే, స్నేహం పేరిట వంచించేది కొందరు. నిజమైన స్నేహితుల మధ్య ఎలాంటి ఘర్షణలు వచ్చినా చివరికి ఒకటౌతారు. అదే స్నేహం గొప్పదనం. స్నేహానికి మీరెలాంటి స్థానం ఇస్తున్నారు? స్నేహాన్ని స్నేహంగా చూస్తున్నారా? మిత్రులతో మనస్ఫూర్తిగా మెలుగుతున్నారా? మీతో స్నేహం చేయటానికి అందరూ ఇష్టడుతున్నారా? 1. మీ స్నేహితుల పార్టీ (బర్త్డే, అభినందన సభ మొదలైనవి) జరుగుతుంటే ఆ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. ఎ. అవును బి. కాదు 2. మీ స్నేహితుల మధ్య ఏదైనా సమస్య వస్తే పెద్ద సీన్ చేస్తారు. ఎ. కాదు బి. అవును 3. మీ స్నేహితులు మిమ్మల్ని తరచుగా అభినందిస్తుంటారు. సర్ప్రైజ్ గిఫ్ట్లు మీకందుతుంటాయి. ఎ. అవును బి. కాదు 4. మీ వస్తువులను మీ ఫ్రెండ్స్ తీసుకుని వాటిని పోగొట్టినప్పుడు మీరు పెద్దగా ఫీలవ్వరు. వేరేవాటిని కొనటానికి సిద్ధపడతారు. ఎ.అవును బి. కాదు 5. మీరనుకున్న పని మీ స్నేహితులు చేయనప్పుడు, మీరనుకున్న ప్రణాళికను మార్చినప్పుడు వారిపై కోపగించుకుంటారు. మీరు చెప్పిందే జరగాలని పట్టుపడతారు. ఎ. కాదు బి. అవును 6. మీ స్నేహితులందరూ ఒకేమాట మీద ఉన్నప్పుడు, ఏదైనా కార్యక్రమాన్ని ప్లాన్ చేసినప్పుడు వారితో మీరూ ఏకీభవిస్తారు. ఎ. అవును బి. కాదు 7. మీ స్నేహితులందరికంటే మీరే గొప్పని వారితో వాదిస్తుంటారు. వారికేమీ తెలియదని అవహేళన చేస్తారు. ఎ. కాదు బి. అవును 8. మీ స్నేహితులు ప్రమాదాలు లేదా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి వెంట తప్పకుండా ఉంటారు. ఎ. అవును బి. కాదు 9. మీ అవసరాలప్పుడు స్నేహితులతో బాగా మాట్లాడుతూ అవసరం తీరాక ఇంకోలా ప్రవర్తిస్తారు. మీ అవసరాలు తీర్చడానికే మీ స్నేహితులున్నారనుకుంటారు. ఎ. కాదు బి. అవును 10. స్నేహితులంతా ఒకచోట చేరినప్పుడు మిమ్మల్ని సరదాగా కామెంట్ చేస్తే నొచ్చుకుంటారు. వారితో చాలారోజుల వరకు మాట్లాడరు. ఎ. కాదు బి. అవును ‘ఎ’ లు నాలుగు వస్తే మీరు స్నేహం చేయగలరు గాని మీ స్నేహానికి హద్దు ఉంటుంది. దాన్నుంచి బయటకు రాలేరు. ‘ఎ’ లు ఏడు దాటితే మీరు స్నేహాం కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు. నిజమైన స్నేహం ఎలా ఉంటుందో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలన్నంత విలువను స్నేహానికి ఇస్తారు. మీ ఫ్రెండ్స్ వల్ల కొంచెం ఇబ్బంది కలిగినా దాన్ని సీరియస్గా తీసుకోరు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే స్నేహానికి మీరిచ్చే స్థానం చాలా చిన్నదిగా ఉంటుంది. అవసరాలప్పుడే మీకు స్నేహితులు గుర్తొస్తారు. -
'మా బంధం తేనె కంటే తియ్యనైనది'
ఇస్లామాబాద్: పాకిస్తాన్తో తమ అనుబంధం స్టీల్ కంటే ధృడమైనదని, తేనె కంటే తియ్యనైనదని పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమంలో చైనా వైస్ ప్రీమియర్ వాంగ్ యాంగ్ అన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. కష్ట కాలంలో ఒకరి కోసం మరొకరు ఆపన్న హస్తాలు అందించుకున్నాయని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో కూడా తమ బంధం ఇలాగే కొనసాగుతుందని చెప్పారు. చైనా కేంద్ర పొలిట్బ్యూరో కమిటీలో సభ్యుడైన వాంగ్.. చైనాలోని కమ్యూనిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకుల్లో ఒకరు. రెండు రోజుల పర్యటన కోసం ఆయన పాకిస్తాన్లో అడుగుపెట్టారు. పర్యటనలో తొలిరోజైన సోమవారం ఇస్లామాబాద్లో పాకిస్తాన్ స్వతంత్ర వేడుకల సందర్భంగా ఆయన ప్రసంగించారు. అభివృద్ధి దిశగా పాకిస్తాన్కు చైనా సాయపడుతుందని చెప్పారు. వాంగ్తో పాటు చైనాకు చెందిన పలువురు అధికారులు కూడా పాకిస్తాన్కు విచ్చేశారు. కార్యక్రమ అనంతరం ఇరు దేశాల మధ్య భారీ స్ధాయిలో ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి. వన్ బెల్ట్-వన్ రోడ్లో అంతర్భాగమైన చైనా-పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్(సీపీఈసీ)ను ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. -
దోస్తీ కుదిరింది..
దౌత్య సంబంధాలు, దీర్ఘకాలిక మైత్రీ బంధం, ఇతర దేశాధినేతలతో మాట్లాడుతున్నపుడు పాటించాల్సిన మర్యాద... ఇవేవీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పట్టవు. మాకేంటి? అనే ఫక్తు వ్యాపార ధోరణి కనిపిస్తుంది. అమెరికాలో ఉద్యోగ కల్పన జరగాలని గట్టిగా కోరుకునే ట్రంప్కు, ‘మేకిన్ ఇండియా’ మంత్రం పఠించే భారత ప్రధాని నరేంద్ర మోదీల తొలిభేటీపై ఒకే ఉత్కంఠ. వీరిద్దరికీ ఏమేరకు లంకె కుదురుతుందనేదే ప్రశ్న. సోమవారం భేటీ సందర్భంగా మోదీకి ట్రంప్ ఇచ్చిన ప్రాధాన్యత, ఇద్దరి మధ్య ఆలింగనాలు, పరస్పర పొగడ్తలు చూశాక ఇద్దరికీ స్నేహం బాగానే కుదిరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికాతో భారత్ బంధం ఇదివరకట్లాగే కొనసాగుతుందనే నమ్మకం కలుగుతోంది. 2014లో ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత మోదీకి అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అమెరికా– భారత్ సంబంధాలు బాగా బలపడ్డాయి. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో అనిశ్చితి. భారత ఐటీ పరిశ్రమకు ఆయువుపట్టు లాంటి హెచ్1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయడం, కాల్ సెంటర్ల ఔట్సోర్సింగ్పై ఆంక్షలు పెట్టడం... తదితర ట్రంప్ చర్యలు భారత ప్రయోజనాలను భంగకరం. ఇలాంటి వివాదాస్పద అంశాలకు భారత్ తన అజెండాలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇరుదేశాల ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగానే అజెండా రూపొందించారు. మోదీ కూడా ఈసారి అమెరికా పర్యటనలో భారీ కార్యక్రమాల జోలికి వెళ్లకుండా... లో ప్రొఫైల్లో ఉన్నారు. ట్రంప్ది దుందుడుకు స్వభావం. ఆస్ట్రేలియా ప్రధాని టర్న్బుల్ శరణార్థులను అమెరికా తీసుకోవాల్సిందేనని నొక్కి చెప్పడంతో ట్రంప్ అర్థంతరంగా ఫోన్ పెట్టేశారు. అలాగే జర్మనీ ఛాన్స్లర్ మెర్కెల్తో కరచాలనం చేయడానికి మీడియా కెమేరాల సాక్షిగా నిరాకరించారు. కాబట్టి భారత అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తొలిభేటీలో పరిచయం చేసుకోవడం, పరస్పరం భావాలను పంచుకోవడం, మైత్రి చిగురించడం, ఒకరిపై మరొకరికి సదభిప్రాయం ఏర్పడటం ముఖ్యమని భావించారు. భేటీపై భారీ అంచనాలు లేకుండా చూశారు. దేశాధినేతలు బాగా కలిసిపోతే... మిగతావన్నీ చక్కబడతాయి’ అని భారత విదేశాంగ కార్యదర్శి జయశంకర్ వ్యాఖ్యానించారు. సోమవారం భేటీ ఆద్యంతం ఇరువురి ముఖాలపై చిరునవ్వు, మూడుసార్లు ఆలింగనాలు, మోదీకి ట్రంప్ స్వయంగా వైట్హౌస్ను చూపించడం... కెమిస్ట్రీ బాగా కుదిరిందడానికి నిదర్శనాలుగా పేర్కొంటున్నారు. పరస్పరం పొగడ్తలు... ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ నాయకుడికి స్వాగతం పలకడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే అధిక వృద్ది రేటును కలిగిన దేశమని, తాము కూడా ఆ స్థాయి వృద్దిరేటును సాధించే దిశగా ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే భారత్ను అందుకుంటామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జీఎస్టీ లాంటి అతిపెద్ద సంస్కరణ తెచ్చారని, ప్రధానిగా మోదీ అద్భుత పనితీరును కనబరుస్తున్నారని ప్రశంసించారు. నన్ను గెలిపిస్తే వైట్హౌస్లో నిజమైన మిత్రుడు ఉంటాడని ఎన్నికల ప్రచారంలో చెప్పాను. ఇప్పుడదే జరిగింది... శ్వేతసౌధంలో మీకు నిజమైన మిత్రుడున్నాడు... అని ట్రంప్ పేర్కొన్నారు. వ్యాపార రంగంలో మీకున్న అపార అనుభవం ఇరుదేశాల సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుందని మోదీ అమెరికా అధ్యక్షుడిని పొగిడారు. మీ నాయకత్వంలో ఇరుదేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుతాయని నేను విశ్వసిస్తున్నాను... అని మోదీ అన్నారు. మోదీకి స్వాగతం నుంచి వీడ్కోలు పలకడం దాకా... సృహుద్భావపూరిత వాతావరణం వెల్లివిరిసింది. ట్రంప్ అవే లెక్కలు.. భారత్ను కీలకమైన భాగస్వామిగా పేర్కొంటూనే... ట్రంప్ తనదైన శైలిలో అమెరికాకు మరిన్ని ప్రయోజనాలు ఉండాలని ఆశించారు. భారత్తో అమెరికాకు 31 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటు ఉందనే విషయాన్ని ఎత్తిచూపుతూ... దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా ఉత్పత్తులకు భారత్లో మరింత మార్కెట్ కల్పించాలని, నిబంధనలను సడలించాలని కోరారు. వ్యాపారవేత్తగా తన విజయాలను గొప్పగా చెప్పుకోవడం ట్రంప్కు అలవాటు. అదే ధోరణిలో సోషల్ మీడియాలో మోదీ నేను వరల్డ్ లీడర్స్ అని గర్వంగా ప్రకటిస్తున్నానన్నారు. ట్వీటర్లో ప్రపంచంలో అత్యధికంగా ట్రంప్కు 3.28 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా, 3.1 కోట్లతో మోదీ తర్వాతి స్థానంలో ఉన్నారు. అమెరికాలో ఉద్యోగాల కల్పనకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పుకోవడానికోసం... స్పైస్జెట్ సంస్థ 100 బోయింగ్ విమానాలను ఆర్డర్ చేసిందని... వారికి కృతజ్ఞతలు తెలిపారు. దీని మూలంగా అమెరికా వేలకొద్ది ఉద్యోగాలు కొత్తగా వస్తాయన్నారు. అమెరికా నుంచి 22 గార్డియన్ డ్రోన్ల కొనుగోలుకు ముందుకు వచ్చినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా నుంచి భారత్ సహజ వాయువు కొనుగోలుకు సంబంధించి దీర్ఘకాలిక ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయని, కొంచెం ఎక్కువ ధరను కోరుకుంటున్నామని... మొత్తానికి ఒప్పందం కుదురుతుందనే నమ్మకాన్ని వెలిబుచ్చారు. భారత్ ఆయుధ కొనుగోళ్లను దృష్టిలో పెట్టుకొని రక్షణ రంగంలో మరింత సహకారానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సంయుక్త ప్రకటనలో హెచ్1బీ వీసా, వాతావరణ మార్పులు తదితర వివాదాస్పద ప్రస్తావన లేకపోవడం గమనార్హం. అసలు హెచ్1బీ అంశం ప్రస్తావనకు రాలేదని వార్తలు వస్తున్నాయి. ఇది భారత ఐటీ కంపెనీలతో పాటు తెలుగురాష్ట్రాలకు చెందిన ఐటీ నిపుణులకు తీవ్ర నిరాశ కలిగించే అంశం. భారత్తో ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాల్లో అమెరికాకు మరిన్ని ప్రయోజనాలు ట్రంప్ ఆశిస్తున్నారనేది సుస్పష్టం. భారత్కు ఏంటి? ఈ భేటి ద్వారా భారత్కు ఒనగూరిన ప్రయోజనం ఏమిటంటే... ఉగ్రవాదానికి ఊతమిచ్చే విషయంలో పాక్ పట్ల అమెరికా మరింత కఠిన వైఖరిని తీసుకోవడం. నిజానికి ట్రంప్ గెలిచినప్పటి నుంచే పాక్ చిత్తశుద్ధిపై అనుమానంతోనే ఉన్నారు. పాక్కు వార్షిక సహాయాన్ని 1645 కోట్ల నుంచి 645 కోట్లకు తగ్గించడమే కాకుండా దీన్ని సహాయంగా కాకుండా రుణంగా మార్చారు. అలాగే పాకిస్తాన్కు నాటోయేతర ప్రధాన భాగస్వామి హోదా ఉంది. ఈ హోదాను ఉపసంహరించాలని ఇటీవలే అమెరికా కాంగ్రెస్లో ఇద్దరు సభ్యులు ఒక బిల్లు పెట్టారు. సోమవారం ట్రంప్తో మోదీ భేటీ కావడానికి కొద్దిగంటల ముందు... తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ చీఫ్ సయ్యల్ సలాహుద్దీన్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. సీమాంతర ఉగ్రవాద దాడులకు పాక్ భూభాగాన్ని వాడుకోకుండా చూడాల్సిన బాధ్యత ఆ దేశంపై ఉందని అమెరికా, భారత్లు సంయుక్త ప్రకటనలో కోరాయి. తీవ్రవాదాన్ని సమూలంగా రూపుమాపడానికి, వారి సురక్షిత స్థావరాలను తుడిచిపెట్టడానికి కలిసి పనిచేస్తామని ట్రంప్ అన్నారు. తీవ్రవాదంపై పోరు తమ తొలి ప్రాధాన్యమని ఇరువురు నేతల పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో సుస్థిరతకు పాక్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అమెరికా ఆ దేశంతో మంచి సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది. అయితే తాజా ప్రకటన పాక్ పట్ల అమెరికా మరింత కఠిన వైఖరి తీసుకుంటోందనే దానికి సంకేతంగా భావిస్తున్నారు. పాక్– చైనాతో చెట్టాపట్టాలేసుకోవడం, ఆసియాలో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవాలంటే భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యం అవసరం. ఈ రెండు అంశాలు కూడా పాక్ పట్ల అమెరికా వైఖరి మారడానికి కారణాలే.– సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఒక్క సుగుణమున్నా చాలు!
ఆత్మీయం భగవంతుడు ఎంతో దూరదృష్టి కలిగినవాడు కనుకనే ప్రతివారికీ ఏదో ఒక సుగుణాన్ని ప్రసాదించి తద్వారా వారికి ఎనలేని కీర్తి కలిగేలా దీవిస్తాడు. ఉదాహరణకు రాక్షసులకు ఉన్నంత దీక్ష, పట్టుదల దేవతలలో కనిపించవు. అందుకే దేవతలు రాక్షసుల ముందు తలవంచ వలసి వచ్చేది. తామనుకున్న కార్యం సాధించే వరకూ, సకల దుఃఖాలనూ ... చివరకు ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి తపస్సు చేసి, అసాధారణ వరాలు పొందగలిగిన రాక్షసులు తమకున్న ఓర్పు, పట్టుదల అనే సుగుణాలతో దైవాన్ని కూడా వశపరచుకోగలిగారు. మహాబలి దాతృత్వం ముందు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే వామనుడై చేయి సాచాడు. పదితలల రావణాసురుని భక్తి ముందు కైలాసనాథుడే ఆత్మలింగమై చేతికి చిక్కాడు. దుర్యో«దనుని స్నేహధర్మం ముందు అతడెంత దుర్మార్గుడైనా, శ్రీకృష్ణుడంతటి వాడిని కూడా నిర్లక్ష్యం చేసి, తన సర్వస్వాన్ని అతని పాదాక్రాంతం చేశాడు కర్ణుడు. వీరంతా ఎంతటి కర్కోటకులైనా, లోకకంటకులైనా, వారిలోని ఒక్క మంచిగుణంతో చరిత్రలో శాశ్వత కీర్తిని పొందగలిగారు. -
స్నే‘హితుడు’
ఆత్మీయం లింగ వయోభేదాలు లేనిది స్నేహం. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకూ – స్నేహం చేయవచ్చు. బాధ చెప్పుకోవడానికి, ఓదార్పు పొందడానికి స్నేహితులను మించినవారు ఎవరుంటారు! నిష్కల్మషమైన స్నేహం జీవితాలను ప్రకాశవంతం చేస్తుంది. స్నేహం కలవటం సులభమే! కానీ, ఆ స్నేహం కలకాలం నిలుపుకోవడమే కష్టం. ఆ స్నేహం కూడా సజ్జనులతో కలవాలి. అది చిరకాలం నిలవాలి. ఎవరైనా చెడుపనులు చేస్తూంటే మంచి మిత్రుడు నివారించాలి. అలాగే మంచిపనులు చేయటంలో ప్రోత్సహించాలి. మిత్రునికి సంబంధించిన రహస్యాలను సంరక్షించాలి అంటే తనలోనే దాచుకోవాలి. మిత్రునిలోని మంచి లక్షణాలను నలుగురిలో తెలియజేయాలి. మిత్రునికి ఆపద కలిగినప్పుడు మొహం చాటేయడమో, తప్పుకు తిరగడమో చేయకూడదు. చేతనైన సహాయం చేయాలి. అవసర సమయాలలో తగిన సహాయాన్ని చేయాలి. ఇవి మంచి మిత్రునికి ఉండవలసిన లక్షణాలుగా భర్తృహరి చెబుతాడు. ‘‘అనేక సద్గుణాలు, విశేషమైన ప్రేమ కలిగిన నువ్వు స్నేహితుడుగా లభించడం నా అదృష్టం. ఇలాంటి వ్యక్తి స్నేహితుడుగా ఉంటే ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు. నీతో స్నేహం కలవడం అనేది నాకు దైవమిచ్చిన వరం అనుకుంటాను’’ అంటాడు సుగ్రీవుడు శ్రీరామచంద్రునితో. ఆపదలోను, ఆనందంలోను ఒకే విధంగా నడుచుకునేవాడే మిత్రుడు అవుతాడు. సంపదలున్నప్పుడు చెలిమి చేసి, ఆపదలో ముఖం చాటు చేసేవాడు అవకాశవాదే గానీ, స్నేహితుడు కాడు. -
స్నేహం కోసం.. సూపర్స్టార్
సూపర్స్టార్ రజనీకాంత్ ఇటీవల తన స్నేహితులు, సన్నిహితులను ప్రోత్సహించడానికి ముందుంటున్నారు. అలాంటి కార్యక్రమాల్లో చక్కని సూచనలు కూడా ఇస్తున్నారు. తాజాగా తనకు మంచి మిత్రుడైన నటుడు చరణ్రాజ్ వారసుడి చిత్ర ఆడియోను ఆవిష్కరించి ఆ నవ కథానాయకుడిని ప్రోత్సహించారు. బాషా చిత్రంలో చరణ్రాజ్ రజనీకాంత్కు స్నేహితుడిగా నటించారు. ఆయన కొడుకు తేజ్ చరణ్రాజ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం లాలి లాలి ఆరారో. నూతన నటి శివాని నాయకిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని లింగన్ రాజాళి దర్శకత్వంలో అరుణ్పాండియన్ మూవీ మేకర్స్ పతాకంపై ఏ.అరుణ్పాండియన్ నిర్మిస్తున్నారు. కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించే విధంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం చక్కని సెంటిమెంట్, ఎమోషన్తో కూడిన లవ్ ఎంటర్టెయినర్గా ఉంటుందంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న లాలి లాలి ఆరారో చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ చిత్ర ఆడియోను తమిళ నూతన సంవత్సరం రోజైన శుక్రవారం రజనీకాంత్ తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన చరణ్రాజ్ వారసుడికి ఆశీస్సులు అందించారు. -
సుదీప్ హర్ట్ చేశాడు..హీరో ఆవేదన!
హీరో సుదీప్తో ఇకపై స్నేహం ఉండదంటూ చేసిన ట్వీట్లపై హీరో దర్శన్ స్వయంగా స్పందించారు. ఎవరో తన ట్విట్టర్ఖాతాను హ్యాక్ చేసి చేసిన ట్వీట్లు కాదని, తానే స్వయంగా చేసినవని స్పష్టం చేశారు. తనకు సినీ పరిశ్రమలో అవకాశాలు రావడానికి తానే కారణమని సుదీప్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయన్నారు. దీనిపై తానేమీ స్పందించబోనని కిచ్చ సుదీప్ నిన్న ఇక్కడ వ్యాఖ్యానించారు. సినిమాలో తెరపై సంభవించే మలుపులు ప్రేక్షకులను సస్పెన్స్కు గురిచేస్తాయి. అదే నిజజీవితంలో జరిగితే ఆ ఉత్కంఠ చెప్పలేనిది. ప్రముఖ శాండల్వుడ్ హీరో దర్శన్ తన ట్విటర్ అకౌంట్లో సహ నటుడు కిచ్చా సుదీప్తో దోస్తీ కట్ అన్నాడు. సుదీప్తో ఇకపై తనకు ఎలాంటి సంబంధాలు కొనసాగవని, కేవలం కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నటులుగా మాత్రమే ఉంటామనేది ఈ వ్యాఖ్యల సారాంశం. ఆదివారం సాయంత్రం దర్శన్ ట్విటర్ అకౌంట్లో ఈ వ్యాఖ్యలు ప్రత్యక్ష్యమయ్యాయి. దర్శన్ ట్వీట్లో ఏముందంటే... దర్శన్ ఏమని ట్వీట్ చేశారంటే ‘ఇకపై నేను, సుదీప్ స్నేహితులం కాదు, మేమిద్దరం కేవలం కన్నడ చిత్ర పరిశ్రమలోని నటులు మాత్రమే. ఇందులో మరే ఊహాగానాలకు తావులేదు. ఇది ఇక్కడితో ముగిసే విషయం’ అని కుండబద్ధలు కొట్టారు. కాగా, ఈ వ్యాఖ్యలు దర్శన్ చేశారా లేదంటే ఆయన అకౌంట్ను ఎవరైనా హ్యాక్ చేశారా అన్న విషయంపై శాండల్వుడ్లో చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితికి దారితీసిన ఘటన ఏమిటి? ఈ విషయం పై నటుడు కిచ్చా సుదీప్ ఏ విధంగా స్పందిస్తారనే అంశంపై కన్నడ సినీపరిశ్రమతో పాటు ఇద్దరు నటుల అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయోమయం పోటీ తీవ్రంగా ఉండే సినీ పరిశ్రమలో ఈ ఇద్దరు హీరోలు మంచి స్నేహితులుగా తెలుసు. అనేక కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసే కనిపించేవారు. అంతలోనే స్నేహబంధం బీటలు వారిందా, దీనికి కారణాలేమిటనేది సినీ వర్గాలను ఉత్కంఠకు గురిచేస్తోంది. దీనిపై ఇద్దరూ కూడా పబ్లిగ్గా స్పందించలేదు. తాజా వ్యవహారంతో ఇరువురు హీరోల అభిమానుల్లోనూ అయోమయం నెలకొంది. -
అనుష్క సీనియర్ అయితే..
నటి అనుష్క తనకంటే సీనియర్ అయినా అంటున్నారు నటి తమన్నా. ఇంతకీ ఈ మిల్కీబ్యూటీ చెప్పేదేమిటీ? సినీ తారల్లో ముఖ్యంగా నటీమణుల్లో పోటీ తీవ్రంగా ఉంటుంది. ఒకరి అవకాశాలను మరొకరు ఎగేసుకుపోవడానికి ఎత్తులు వేసుకోవడం చిత్ర పరిశ్రమలో సర్వసాధారణం. అదే విధంగా ఈర్ష్య ద్వేషా లకు కొదవ ఉండదంటారు. కానీ నటి తమన్నా మాత్రం వీటికి భిన్నంగా చెబుతున్నారు. అదేమిటో ఆమె మాటలో్లనే... కథానాయికల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని, ఒకరిని చూసి మరొకరు ముఖం చిట్లించుకుంటారని, ఈర్షాధే్వషాలు ఎకు్కవేనని రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి. అభిమానులు తారల మధ్య పోటీ ఉంటుందని భావిస్తుంటారు. నిజానికి తెరవెనుక వాస్తవ పరిస్థితులు వేరు. కథానాయికలు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ కుశల ప్రశ్నలతో సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. చిత్రాలు విజయం సాధిస్తే అభినందించుకుంటారు. కష్ట సమయాల్లో పరామర్శించుకుంటారు. కథానాయికల మధ్య సత్సంబంధాలు ఉంటాయి. పోటీ అన్నది మీడియా సృష్టే. నా వరకూ చెప్పాలంటే చాలా మంది కథానాయికలతో స్నేహం ఉంది. అందులో ప్రధాన స్నేహితురాలు అనుష్క. నేను ఆరంభ దశలో చిత్ర పరిశ్రమలో ఎవరూ తెలియక చాలా కష్టపడ్డాను. అప్పటికే నటిగా అనుష్క నాకంటే సీనియర్. అయినా ఎలాంటి గర్వం చూపకుండా నాతో స్నేహంగా మెలిగారు. చిత్ర పరిశ్రమ గురించి, ఇక్కడ ఎవరితో ఎలా మసలుకోవాలన్న పలు విషయాలను చెప్పారు. ఒక నటి నిరంతరంగా ఒక కాస్ట్యూమ్ డిజైనర్ను నియమించుకోవాలన్న విషయాన్ని తెలియని నాకు అనుష్కనే చెప్పారు. ఇలా చాలా విషయాల్లో తను నాకు సాయం చేశారు. నటి కాజల్ అగర్వాల్ నాకు మంచి స్నేహితురాలే. మేమిద్దరం సినిమాలో సమానంగా పయనిస్తూ దశాబ్ద కాలంగా నటిస్తున్నాం. ఎలాంటి పాత్ర అయినా అందులో అద్బుతంగా నటించగల ప్రతిభాశాలి కాజల్. ఇక నా కళ్ల ముందు ప్రముఖ కథానాయకిగా ఎదిగిన నటి సమంత. తనతోనూ నాకు మంచి స్నేహబంధం ఉంది. సమంత ప్రతిభతో పాటు తెలివైన నటి. సినిమాల్లో సంపాదించింది ఇతరులకు సాయం చేయాలన్న లక్ష్యంతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమంతను అభినందించాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది తమన్నా భాటియా. -
విప్లవ సింహం
-
క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగు
నంద్యాల: క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగవుతాయని శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంవీ సుబ్బారెడ్డి చెప్పారు. గురురాజ ఇంగ్లిష్ మీడియం స్కూల్ మైదానంలో జిల్లా స్థాయి త్రోబాల్ టోర్నమెంట్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి కాంస్య విగ్రహానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ నాగనరసింహులు, గురురాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ దస్తగిరిరెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, బాల్ బ్యాడ్మింటన్ సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపురెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఏడాది టోర్నమెంట్... తండ్రి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి జ్ఞాపకార్థం ప్రతి ఏడాది క్రీడా పోటీలతో పాటు, పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు గురురాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ దస్తగిరిరెడ్డి చెప్పారు. పోటీల్లో పాల్గొనడానికి విచ్చేసిన క్రీడాకారులకు భోజనం, ఇతర వసతులు కల్పిస్తున్నామన్నారు. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. అనంతరం విద్యార్థుల శాస్త్రీయ, ఆధునిక నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గురురాజ విద్యాసంస్థల కో డైరెక్టర్లు షేక్షావలిరెడ్డి, మౌలాలిరెడ్డి పాల్గొన్నారు. -
చిరకాల స్నేహానికి క్రీడలే కారణం
– జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అనంతపురం సప్తగిరి సర్కిల్ : చిరకాల స్నేహానికి క్రీడలే ప్రధాన కారణమని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్, ఆర్డీటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 38వ జాతీయ సాఫ్ట్బాల్ క్రీడా పోటీలను స్థానిక అనంత క్రీడా గ్రామంలో మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు. తొలుత కలెక్టర్తో పాటు ముఖ్య అతిథులుగా హాజరైన జెడ్పీ చైర్మన్ చమన్, ఆర్డీటీ హాస్పిటాలిటీ డైరెక్టర్ విశాల ఫెర్రర్ 23 రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ క్రీడల్లో ప్రధానమైన అంశం గెలుపోటములు కాదని, ఇక్కడ ఏర్పడే పరిచయాలు జీవితాంతం గుర్తుండిపోతాయన్నారు. ఈ టోర్నీ ఈ నెల 4 నుంచి 8 వరకు కొనసాగుతుందన్నారు. క్రీడలకు ఆర్డీటీ కషి అమోఘమన్నారు. రాష్ట్రం నుంచి చైనా వెళ్లే భారత జట్టులో రాధిక, భూమి ఉండటం సంతోషించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో జాతీయ సాఫ్ట్బాల్ టీమ్ సీఈఓ ప్రవీణ్ అనౌకర్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశులు, రాష్ట్ర చైర్మన్ నరసింహం, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్కుమార్, డీఎస్డీఓ బాషామోహిద్దీన్, ఆర్డీఓ మలోలా, డీఈఓ అంజయ్య, నారాయణ, జిల్లా సాఫ్ట్బాల్ అధ్యక్షులు నాగరాజు, శ్రీకాంత్చౌరత్, లక్ష్మణ్, పీఎన్పారీ, పుంగవనం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. తొలిæరోజు విజేతల వివరాలు : తెలంగాణ జట్టును ఛత్తీస్గఢ్ జట్టు 3–0 తో ఓడించింది. మణిపూర్ను హర్యాణా జట్టు 10–0 తో ఓడించింది. బీహార్ను చండీఘడ్ జట్టు 10–0తో ఓడించింది. ఆంధ్రప్రదేశ్ను పంజాబ్ జట్టు 5–1 తో ఓడించింది. ఒరిస్సాను కర్ణాటక 11–0 తో ఓడించింది. ఢిల్లీని కేరళ జట్టు 1–0 తో ఓడించింది. గోవాను మహారాష్ట్ర జట్టు 15–0 తో ఓడించింది. గుజరాత్ ను అస్సాం జట్టు 8–7 తో ఓడించింది. బీహార్ ను పంజాబ్ జట్టు 10–0తో ఓడించింది. తెలంగాణ ను మహరాష్ట్ర జట్టు 6–0 తో ఓడించింది. హిమాచల్ప్రదేశ్ను గోవా జట్టు 9–4 తో ఓడించింది. మణిపూర్ ను ఢిల్లీ జట్టు 4–3 తో ఓడించింది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఛత్తీస్ఘడ్ ను కేరళ జట్టు 3–1 తో ఓడించింది. హర్యాణను చంఢీఘడ్ జట్టు 12–0 తో ఓడించింది. అస్సాం ను గుజరాత్ జట్టు 11–0 తో ఓడించింది. -
చెలిమి చేసి.. జాతివైరం మరచి...
పిల్లి పిల్లకు కుక్క పాలు ఇస్తోందేమిటని ఆశ్చర్యంగా చూస్తున్నారా! నిజమేనండి.. జాతి వైరాన్ని మరచి పిల్లి పిల్లకు కుక్క పాలిస్తోంది. మరో కుక్క హాని కలగజేయకుండా పిల్లి పిల్ల దగ్గరకు రానీయకుండా చూస్తోంది. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద కనిపించిన దృశ్యమిది. రెండు నెలలుగా ఈ పిల్లి పిల్లను కుక్క సాకుతోందని అదే ప్రాంతానికి చెందిన గుత్తుల భాస్కరరావు ‘సాక్షి’కి చెప్పారు. – అయినవిల్లి -
క్రీడలతో స్నేహ సంబంధాలు
– జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ కల్లూరు: క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగుపడతాయని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. శనివారం నగరంలోని డీఎస్ఏ అవుట్డోర్ స్టేడియం ఆవరణలో రాష్ట్ర స్థాయి టెన్నీస్ వాలీబాల్ బాలబాలికల పోటీలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒలింపిక్స్లో మహిళలు రాణించి పతకాలు సాధించారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నిరంతర సాధన చేస్తే విజయాలు సొంతమవుతాయన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని చాటాలని డీవీఈఓ సుబ్రమణేశ్వర్, ఆర్ఐఓ పరమేశ్వరరెడ్డిఅన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో టెన్నీస్ వాలీబాల్ క్రీడను అభివృద్ధి చేస్తామని టెన్నీస్ వాలీబాల్ సంఘం చైర్మన్ జోసఫ్జాయ్ పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్యార్డు చైర్పర్సన్ శమంతకమణి, గొర్రెల పెంపకందారుల సంఘం జిల్లా చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, డిప్యూటీ ఈఓ వెంకటరావు, ఒలింపిక్ సంఘం కార్యదర్శి సి. రామాంజనేయులు, టెన్నీస్ వాలీబాల్ సంఘం అధ్యక్షుడు సత్రం రామకష్ణుడు, రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావ్, బీసీమహిళా సంఘం అద్యక్షులు పార్వతమ్మ, పోటీల నిర్వాహక కార్యదర్శులు చలపతిరావు, ఈశ్వర్ పాల్గొన్నారు. -
ఆరోగ్యంతో ‘దోస్తీ’ చేద్దాం
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. అన్నాడో కవి. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. మంచి మిత్రుడు తోడుంటే ఆ ధైర్యమే వేరు. జీవితంలో మిత్రులు లేకున్నా .. ధూమపానం చేసినా శరీరానికి ఒకే రకమైన హాని కలుగుతుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఒంటరితనం వల్ల ఒత్తిడి పెరిగి రక్తంలో ఫైబ్రోనోజిన్ ప్రోటీన్ స్థాయి పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ ప్రోటీన్ రక్తంలో కొవ్వు పేరుకుపోయేలా చేసి రక్తపోటును పెంచుతుంది. దీనివల్ల గుండెపోటుతో పాటు తదితర వ్యాధులు వస్తాయి. కుటుంబంలోని వ్యక్తులు, వారికున్న స్నేహితులను బట్టి వారి రక్తంలో ఫైబ్రోనోజిన్ స్థాయిలకు ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐదుగురు స్నేహితులు ఉన్న వారి రక్తంలో ఫైబ్రోనోజిన్ స్థాయి 10 మంది స్నేహితులు ఉండే వారి కన్నా 20 శాతం అధికంగా ఉంది. ఐదుగురి కన్నా తక్కువ మంది స్నేహితులు ఉన్న వారిలో ధూమపానం చేస్తే పెరిగే స్థాయిలో రక్తంలో ఫైబ్రోనోజిన్ పెరుగుతుందని శాస్త్రవేత్తలు అన్నారు. సమాజంతో మనకున్న సంబంధాలు రక్తంలో ఫైబ్రోనోజిన్ స్థాయి పెరుగుదలకు మధ్య సంబంధాలు ఉంటాయని పరిశోధకులు తెలిపారు. హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం ఫలితాలను విడుదల చేశారు. -
నాకు డబ్బే ముఖ్యం
* స్నేహం గీహం జాన్తానై * నీ ఇంట్లో మగదిక్కు లేకుండా చంపాలనుకున్నా * చిన్ననాటి స్నేహితుడు సోమ రామకృష్ణకు నయీమ్ బెదిరింపులు * నాటి భయంకర రోజులను గుర్తుచేసుకున్న రామకృష్ణ భువనగిరి: ‘‘నేను నక్సలైట్లతో పోరాడుతున్నా.. నాకు డబ్బే ముఖ్యం.. దానికి మించి మరేది నాకవసరం లేదు.. నేను కబ్జా చేసిన భూమిని ప్రభుత్వంతో ఒత్తిడి తెచ్చి తీసుకున్నారు.. నాకు నష్టం జరిగింది.. ఇప్పటి వరకు ఎవరూ ఇలా తీసుకోలేదు. అంతటితో ఆగకుండా మీ తమ్ముడు నాపై ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఆ సంగతి నాకు వెంటనే తెలిసింది. దీంతో మీ ఇంట్లో మగ దిక్కులేకుండా చేద్దామనుకున్నా.. నీవు త్రుటిలో తప్పించుకున్నావు. మీ తమ్ముడ్ని చంపేశాం..’’ అని నయీమ్ తనను బెదిరించినట్టు భువనగిరికి చెందిన సోమ రామకృష్ణ అలియాస్ నవత రాము చెప్పారు. చిన్నతనంలో నయీమ్, ఈయన స్నేహితులు. కొన్నాళ్ల తర్వాత ఓ భూమి విషయంలో ఈయనను సైతం నయీమ్ బెదిరించాడు. రామకృష్ణ సోమవారం తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. నా తమ్ముడి తల కోసి చంపాడు.. నయీమ్, నేను స్థానిక డిగ్రీ కళాశాలలో చదువుకున్నాం. అప్పట్నుంచే స్నేహితులం. మా ఇంటికి వచ్చేవాడు. చదువుకునే సమయంలో చురుగ్గా ఉండేవాడు. పాములతో భయపెట్టేవాడు. ఆయన సోదరిని నల్లగొండలో దగ్గరి బంధువు ప్రేమ పేరుతో మోసం చేశాడు. అప్పుడు పోలీస్లకు ఫిర్యాదు చేస్తే న్యాయం జరగలేదు. దీంతో ఆగ్రహించి ఆలేరు దళంలో చేరాడు. ఆ తర్వాత నాకు కలువలేదు. 2009లో భువనగిరి మండలం ముత్తిరెడ్డి గూడెం వద్ద మా దగ్గరి బంధువు రాజ్కుమార్కు చెందిన 50 ఎకరాల స్థలంలో 11 ఎకరాల స్థలం కబ్జా పెట్టాడు. దీంతో అతడు అప్పటి ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. దగ్గరి బంధువు కావడంతో నేను కూడా ఆయనతో వెళ్లాను. దీంతో స్పందించిన ప్రభుత్వం కబ్జాలో ఉన్న స్థలాన్ని తిరిగి ఇప్పించింది. ఈ విషయంలో నేను.. రాజ్కుమార్కు సహకరించానని ఆగ్రహంతో 2010 నవంబర్ 29న నాపై భువనగిరి శివారులోని మాస్కుంట వద్ద నయీమ్ అనుచరులు హత్యాయత్నం చేశారు. కొద్దిలో తప్పించుకున్నా. ఈ విషయాన్ని అప్పటి ఎస్పీకి తమ్ముడు రాధాకృష్ణ, నేను కలిసి ఫిర్యాదు చేశాం. అయితే అక్కడ ఉన్న పోలీస్ ఒకరు నయీమ్కు సమాచారం అందించాడు. దీంతో కక్ష పెంచుకున్న నయీమ్ అరు నెలల తర్వాత హైదరాబాద్లో ఉంటున్న నా తమ్ముడు రాధాకృష్ణను ఇంటి వ ద్దే నయీమ్ అనుచరులు తల కోసి దారుణంగా చంపారు. దీంతో భయంతో వణికిపోయిన మా కుటుంబం ప్రాణాలు దక్కించుకోవడానికి ఎలాగైనా నయీమ్ను కలిసి రాజీ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కొందరు స్నేహితులు నయీమ్తో గొడవ ఎందుకని హితవు చెప్పారు. అప్పటికే పలుమార్లు నయీమ్ నుంచి పిలుపు వచ్చింది. స్నేహాన్ని గుర్తు చేసినా వినలేదు.. 2011లో నేను, నయీమ్ను రహస్య ప్రాంతంలో కలిశా. మా తమ్మున్ని ఎందుకు చంపావని అడిగితే ముత్తిరెడ్డిగూడెంలో కబ్జా చేసిన భూమి విషయం, పోలీస్లకు చేసిన ఫిర్యాదు విషయాలను చెప్పాడు. ‘మీ కుటుంబంలో మగదిక్కు లేకుండా చేయాలనుకున్నా. కానీ నీవు తప్పించుకున్నావు. నాకు కలిగిన నష్టం భర్తీ చేసుకునే వరకు వదిలేది లేదు’ అని హెచ్చరించారు. చదువుకునే రోజుల్లో చేసిన స్నేహం, అప్పటి మధుర క్షణాలు, కలిసిమెలిసి తిరిగిన పలు విషయాలు గుర్తు చేస్తే.. ‘అవన్నీ నాకు అవసరం లేదు. నేను కబ్జా చేసిన 11 ఎకరాల భూమి విషయంలో జరిగిన నష్టం పూడ్చాలి. లేదంటే ఇప్పటికే నీ తమ్ముడు చనిపోయాడు. నీతోపాటు నీ కుటుంబ సభ్యులు , నీ రక్త సంబంధీకులు ఎవరు మిగలరు. నీ ఇష్టం..’ అని బెదిరించాడు. దీంతో విధిలేక ఉన్న అస్తులు, బంగారం తెగనమ్మి, అప్పులు తెచ్చి పెద్ద మొత్తంలో చెల్లించి బయటపడ్డాను. అలాగే నాకు దగ్గరి బంధువు ఎన్నారై ఇండియాలో స్థిరపడదామని భునగిరికి వస్తే నయీమ్ బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేశాడు. దీంతో అతను అమెరికా తిరిగి వెళ్లిపోయాడు. ఇప్పటికైనా నయీమ్ను ఎన్కౌంటర్ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేరు. కానీ కోల్పోయిన అస్తులు, డబ్బులు బాధితులకు తిరిగి ఇప్పిస్తే జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటాం. -
‘ఫేస్ టు ఫేస్’కే ప్రాధాన్యత
వాషింగ్టన్: ఫేస్బుక్, వాట్సాప్, మెసెంజర్, ట్విటర్ వంటివి అందుబాటులోకి వచ్చాక ప్రజలంతా సోషల్ మీడియాలోనే మాట్లాడుకుంటున్నారనేది చాలామంది అభిప్రాయం. అయితే ఈ అభిప్రాయం తప్పంటోంది అమెరికాకు చెందిన కాన్సాస్ యూనివర్సిటీ. వార్తావిశేషాలు, శుభాకాంక్షలు చెప్పుకునేందుకు మాత్రమే సోషల్ మీడియాను వినియోగిస్తున్నారని, వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకునేందుకు చాలామంది నేరుగా కలిసి మాట్లాడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని కాన్సస్ ప్రొఫెసర్ జెఫ్రే హాల్ తెలిపారు. దీనిని ఇప్పటి యువత ఓల్డ్ ఫ్యాషన్గా భావిస్తోందని, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడానికే చాలామంది ఇష్టపడుతున్నారని, సోషల్ మీడియా స్నేహం ఎంతోకాలం సాగడం లేదని, ప్రత్యక్షంగా కలుసుకొని మాట్లాడుకున్నవారి స్నేహం ఎక్కువ రోజులు కొనసాగుతోందని చెప్పారు. -
బీజేపీతో దోస్తీ లేదు
-
నాడు వైరుద్యం.. నేడు స్నేహ భావం
ఒకే వేదికపై కడియం, ఎర్రబెల్లి పాలకుర్తి : సుదీర్ఘకాలంగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ప్రస్తుత డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం ఒక్కటయ్యారు. పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు. సంవత్సరం క్రితం వరకు ఈ ఇద్దరి నేతల మధ్య ఉన్న వైరుద్యంతో కార్యకర్తలు చీలిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి. నేడు ఆ నేతలు ఒకే వేదికపై దర్శనమిచ్చి కలిసి పనిచేస్తామంటూ సందేశం ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇది శుభ పరిణామమే అయినప్పటికీ ఈ పరిస్థితి ఎప్పటి వరకు కొనసాగుతుందనేది కొందరిలో నెలకొన్న ప్రశ్న. గత సంవత్సరం రాయపర్తి మండలంలో డిప్యూటి సీఎం కడియం శ్రీహరితో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేయడానికి రాగా అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్రావు.. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి నిధులు రాకుండా అడ్డుకుంటున్నావని అనడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ తరువాత పాలకుర్తి మండల బమ్మెర గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ సభలో ఇరువురు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత పాలకుర్తిలో వ్యవసాయ మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కడియం శ్రీహరి, సుధాకర్రావు వర్గీయులు, ఎమ్మెల్యే దయాకర్రావు అనుచరుల మధ్య యుధ్ద వాతావరణం తలపించే విధంగా ఘర్షణలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో పాలకుర్తి నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం కోసమే అధికార పార్టీలో చేరినట్లుగా ప్రకటించిన ఎర్రబెల్లి నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్రావుతో కలిసి పనిచేస్తూ డిప్యూటి సీఎం కడియం శ్రీహరిని శనివారం నియోజకవర్గానికి తీసుకు వచ్చారు. రాయపర్తి, తొర్రూరు మండలాల్లో జరిగిన హరిత హారం కార్యక్రమంలో నేతలంతా ఒకే వేదికపై పాల్గొన్నారు. తామంతా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతామన్నారు. ఒకరి సహకారం ఒకరం తీసుకుంటామని ప్రజల సమక్షంలో హామీ ఇచ్చారు. ఈ హామీలు నిలుపుకుని జిల్లా, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. -
మృత్యువులోనూ వీడని స్నేహం
♦ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి ♦ మేడ్చల్ 44వ జాతీయ రహదారిపై ఘటన ♦ బైక్ను ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ప్రమాదం ♦ మద్యం మత్తులో డ్రైవర్..? మేడ్చల్: ఓ ప్రైవేట్ బస్సు బైక్ను ఢీకొనడంతో ఇద్దరు స్నేహితులు దుర్మరణం చెందారు. మేడ్చల్ పట్టణ శివారులో బుధవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. సీఐ రాజశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం కాళ్లకల్కు చెందిన ఎంకినోళ్ళ సాయికుమార్(19) తన కుటుంబంతో కలిసి మేడ్చల్ కిందిబస్తీలో నివాసముంటున్నాడు. బిహార్కు చెందిన సిపూన్(22) కాళ్లకల్లోని ఓ కంపెనీలో పనిచేసుకుంటూ అదే బస్తీలో ఉంటున్నాడు. ఈనేపథ్యంలో ఇద్దరూ స్నేహితులయ్యారు. ఇదిలా ఉండగా, బుధవారం సాయంత్రం స్నేహితులు బైక్పై బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో 44వ జాతీయ రహదారిపై మేడ్చల్ నుంచి చెక్పోస్టుకు వెళ్తున్నారు. ఈక్రమంలో ఇసుకబావి వద్ద వెనుక నుంచి వచ్చిన ఓ కంపెనీ ఉద్యోగులను నగరానికి తీసుకెళుతున్న ప్రైవేట్ బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో సిపూన్, సాయికుమార్ రోడ్డుపై పడిపోయారు. సాయికుమార్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. గాయపడిన సిపూన్ను 108 వాహనంలో నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, బస్సు డ్రైవర్ వేగంగా నిర్లక్ష్యంగా నడిపాడని అతడిని అదుపులోకి తీసుకున్నాడు. మద్యం మత్తులో వాహనం నడిపి ఉండొచ్చనే అనుమానంతో వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి పంపినట్లు సీఐ తెలిపారు. అయితే, ఇంటర్ పూర్తి చేసిన సాయికుమార్ పాలీటెక్నిక్లో చేరే ప్రయత్నంలో ఉన్నాడు. అతడికి ఓ సోదరుడు ఉన్నాడు. సిపూన్ బిహార్ నుంచి ఒంటరిగా వలస వచ్చి కార్మికుడిగా జీవనం సాగిస్తుండేవాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సమభావం.. స్నేహసౌభాగ్యం
ప్రేమానురాగాలతో కూడిన స్నేహమే గొప్పది. సాటి వారికి ప్రేమను పంచండి.. ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించండి.. ఇదే ఇస్లాం ఆశయం. ఇస్లాంలో స్నేహితులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. స్నేహితులను ప్రేమాభిమానాలతో చూడాలి. అత్యంత ప్రీతిపాత్రులుగా ఉండాలి. దరిద్రులంటే ధనం లేని వారు కాదు.. వాస్తవానికి మిత్రులు లేనివారే గొప్ప దరిద్రులు. మిత్రుడు జీవితానికి అలంకరణ, జీవనయాత్రలో సహాయకారి. కష్టసుఖాలలో ఒకరికొకరు తోడునీడగా ఉండాలి. అప్పుడే ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుందని చెబుతున్నారు మదనపల్లె పట్టణానికి చెందిన ప్రముఖ మతగురువు మౌల్వీ షాకీరుల్లాసాహెబ్ లతీఫ్. మదనపల్లె సిటీ: ఏ వ్యక్తి అయితే ఇతరులను ప్రేమించడో, ఆ వ్యక్తిలో ఎలాంటి మంచితనం గాని, శుభం గానీ ఉండవు. ప్రజలతో కలిసిమెలసి ఉంటూ వారి వల్ల కలిగే బాధలను సహించే విశ్వాసి. ప్రజలకు దూరంగా ఉంటూ వారి వల్ల కలిగే బాధల్ని భరించలేని వాడికంటే ఉత్తముడు. మిత్రులతో కలిసి మెలసి వారి వల్ల కలిగే బాధల్ని భరించలేని వాడికంటే ఉత్తముడు. మిత్రులతో కలిసి మెలిసి ప్రేమతో జీవితం గడపాలి. నిస్వార్థమైన అనుబంధాలు ఏర్పరుచుకుని వాటిని పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నించాలి. స్నేహితులను అసహ్యించుకోవడం, ఈసడించుకోవడం, రుసరుసలాడే వైఖరిని వదులుకోవాలి. ఎల్లప్పుడు సత్ప్రవర్తన, మంచి నడవడిక గల వారిలో స్నేహం చేయాలి. స్నేహితుల ఎంపికలో ధర్మం రీత్యా, నీతిగా మీకు ఉపయోగపడేవారిని ఎన్నుకోవాలి. మనిషి తన స్నేహితుల ధర్మాన్ని (జీవన విధానాన్ని) అనుసరిస్తాడు. అందుచేత తాను స్నేహం చేస్తున్న వారిని గురించి ఆలోచించుకుని మరీ స్నేహం చేయాలి. విశ్వాసి సహచర్యంలో ఉండాలి. మీరు అన్న పానీయాలను దైవ భీతిపరుడితో కలిసి పుచ్చుకోండి. కలిసి మెలిసి భోజనం చేయడం ప్రేమానురాగాలకు మూలం. కేవలం అల్లాహ్ కోసమే స్నేహితులను ప్రేమించాలి. దేవుని ప్రీతిపాత్రులైన దాసులు దైవ ప్రాతిపాదికపైనే ఒకరితో ఒకరు ఏకమవుతారు. భుజానికి భుజం, మనస్సుకు మనస్సు కలిపి దైవ ధర్మ సంస్థాపన, సంరక్షణ బాధ్యతను నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరి కలిసిమెలసి ముందుకెళుతూ ప్రేమానురాగాలతో కూడిన సమాజాన్ని నిర్మించినప్పుడే మానవ జన్మకు సార్థకత సాధ్యమవుతుంది. ఆ దిశగా ప్రతి ఒక్కరు నడవాలని మతగురువు పేర్కొంటున్నారు. ఇస్లాంలో సోదరభావానికి పెద్దపీట ‘ఇస్లాం’ అంటే శాంతి. శాంతికి మూలమైన సోదరభావం, సౌభ్రాతృత్వానికి ‘ఇస్లాం’ పెద్ద పీట వేస్తోంది. అందరం కలిసి మెలసి వెంటేనే సమాజంలో శాంతి సాధ్యమవుతుంది. రంజాన్ మాసంలో ఇఫ్తార్ సమయంలో సోదరభావం వెల్లివిరుస్తుంది. - ఖాదర్హుస్సేన్, మదనపల్లె స్నేహానికి మతాలు అడ్డురావు స్నేహానికి మతాలు అడ్డురావు. ఏ మతమైనా శాంతిని ప్రభోదిస్తుంది. ప్రేమానురాగాలు,బంధాలు, అనుబంధాలతోనే శాంతి సాధ్యం. రంజాన్ మాసం ముఖ్యంగా సమానత్వానికి,సోదరభావానికి,కలిసిమెలిసి జీవించడానికి పెద్దపీట వేస్తాయి. - మునిగోటి శ్రీనివాసశర్మ,మదనపల్లె -
స్నేహమని నమ్మితే ....
చేయని నేరానికి.. జీవచ్ఛవంగా మారిన బాధితురాలు స్నేహమని నమ్మితే కాలయముడయ్యాడంటున్న తల్లిదండ్రులు కఠినంగా శిక్షించాలంటున్న మహిళా, ప్రజాసంఘాలు తిరుపతిక్రైం: తిరుపతిలో ప్రేమించలేదనే కారణంతో యువతిని బైక్తో ఢీకొని హత్యాయత్నానికి పాల్పడ్డ కేసులో రోజురోజుకూ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. స్నేహంగా ఉంటూనే హత్యాయత్నం చేయడంతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ నిందితులు బాధితురాలిని బెదిరించినట్లు తెలుస్తోంది. పగతోనే ఘాతుకానికి ఒడిగట్టారు.. పగతోనే నిందితులు నవీన్కుమార్, యశ్వంత్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారని కనకభూషణం లేఔట్కు చెందిన బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పైగా నిందితులు అరెస్టు చేయడంలో మొదట్లో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహించారని వాపోతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ కుమార్తెను బెదిరిం చేందుకు కూడా నిందితులు వెనుకాడలేదని ఆరోపించారు. మృగాళ్లను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు, మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రెండో నిందితుడికి రిమాండ్ ప్రేమపేరుతో వేధించి ఓ యువతిని వాహనంతో ఢీ కొని గాయపరిచిన కేసులో రెండో నిందితుడు జి.యశ్వంత్ను పోలీసుల మంగళ వారం తిరుపతి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇతడికి జూలై 13వతేదీ వరకు రిమాండ్ విధిస్తూ తిరుపతి నాల్గవ అదనపు జూనియర్ జడ్జి సన్యాసినాయుడు ఆదేశాలు జారీ చేశారు. నిందితుడు యశ్వంత్పై అలిపిరి పోలీసులు ఐపీసీ 354, 354డి, 324, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసులో మొదటి నిందితుడుగా వున్న ఎన్.నవీన్కుమార్ ఈనెల 21వతేదిన కోర్టులో సరెండర్ అయి మరుసటి రోజు బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. రౌడీషీటు నమోదు యువతలను వాహనంతో ఢీ కొన్న నవీన్కుమార్, యశ్వంత్పై నిర్భయ చట్టం నమోదు చేశామని, అంతేగాక వీరిపై రౌడీషీటు తెరిచామని అలిపిరి సీఐ శ్రీనివాసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేయడంలో పోలీసులు ఎటువంటి నిర్లక్ష్యం వహిం చలేదన్నారు. కాగా తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి కూడా దీనిపై స్పందించి నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఓ ప్రకటన విడుదల చేశారు. స్నేహమంటూ మాట కలిపితే.. ఆప్తుడనుకుంది. సలహాలిస్తుంటే.. స్నేహితుడిగా భావించింది. అయితే మంచిత నం ముసుగులో ముంచేస్తాడని, కా దంటే ప్రాణాలే తీసేందుకు తెగిస్తాడని ఊహించలేకపోయింది. ప్రస్తుతం వెన్నెముక దెబ్బతో జీవచ్ఛవంగా మారి దీనస్థితిలో మంచానికి పరిమితమైంది. సకాలంలో స్పందించడంలేదు మహిళల పట్ల జరుగుతున్న వేధింపులు, హత్యాయత్నాల సంఘటనలపై పోలీసులు సకాలంలో స్పందిస్తే ఇలాంటివి అరికట్టవచ్చు. ఇప్పటికైనా బాధితురాలికి సత్వర న్యాయం చేయాల్సిన బాధ్యత వారిపై వుంది. నిర్భయచట్టం కింద వచ్చే డబ్బులు వెంటనే ప్రభుత్వం మంజూరు చేసి అన్ని విధా లా ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి. - నిర్మల, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి -
పాముకాటుకు విద్యార్థిని మృతి
పాము కాటుతో పదో తరగతి విద్యార్థిని మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట్లో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన స్నేహ(15) బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కుట్టినా.. గమనించకుండా అలాగే పడుకుంది. ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించి ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించేలోపే మృతిచెందింది. -
మీ ఫ్రెండ్ కి ఇవాళే చెప్పేయండి
నిర్భయ-2 బాయ్స్ మంచివాళ్లే. ఫ్రెండ్సూ మంచివాళ్లే. బాయ్ఫ్రెండ్స్తోనే.. అమ్మాయిలకు టార్చర్. ఆడ-మగ మధ్య స్నేహంలో తప్పు లేదు. ఒక ఏజ్లో.. అదీ ఈ న్యూ ఏజ్లో.. ఆడ మగతోనూ, మగ ఆడతోనూ స్నేహం చెయ్యకుండా ఆ దేవుడు కూడా ఆపలేడు! కానీ, ఫర్ ది సేక్ ఆఫ్ గాళ్స్.. దేవుడు చెయ్యలేని ఒక పనిని అమ్మాయి చెయ్చొచ్చు! ఆడ-మగ మధ్య స్నేహంలో.. స్నేహాన్ని మాత్రమే పెరగనిచ్చి, ఆడ, మగల్ని ఎక్కడున్నారో అక్కడే.. హద్దుల్లో ఉంచేయొచ్చు. హద్దుల్లో ఉంచే శక్తి, హద్దుల్లో ఉండే శక్తీ.. రెండూ అమ్మాయిలకు ఉన్నాయి. మగపిల్లలు ట్రై చేస్తూనే ఉంటారు... ఆడ-మగ స్నేహంలో.. స్నేహాన్ని ఎక్కడిదక్కడే ఉండనిచ్చి, ఆడ-మగలను మాత్రం పెరగనివ్వడానికి!! దాన్ని పెరగనివ్వకండి. స్నేహం ‘బ్రేకప్’ అయినా పర్వాలేదు. స్నేహం కానిది ‘బిల్డప్’ కాకూడదు. Friend అనే మాటకు డిక్షనరీలో మంచి అర్థం ఉంది. A person whom you know well and whom you like a lot. నీకు బాగా తెలిసినవాడు, నువ్వు బాగా ఇష్టపడేవాడు ఫ్రెండ్. Boyfriend కి వేరే అర్థం ఉంది.A man with whom a person is having romantic or sexual relationship. క్లియర్. ఫ్రెండ్ హృదయం. బాయ్ఫ్రెండ్ దేహం. ఫ్రెండ్ జాగ్రత్త చెప్తాడు. బాయ్ఫ్రెండ్ ధైర్యం చెప్తాడు. ఫ్రెండ్.. ‘అమ్మ, నాన్న, ఒక ఫ్రెండ్’లా ఉంటాడు. బాయ్ఫ్రెండ్.. ‘నువ్వు, నేను, మధ్యలోకి ఇంకెవరూ వద్దు’ అంటాడు. ఫ్రెండ్ చీకటి పడుతోంది అంటాడు. బాయ్ఫ్రెండ్ చీకటి పడనిద్దాం అంటాడు. ఫ్రెండ్ మా ఇంటికి వెళ్దాం అంటాడు. బాయ్ఫ్రెండ్ నా రూమ్కి వెళ్దాం అంటాడు. ఇదిగో.. ఈ సంగతి తెలీకే 16 ఏళ్ల బ్రెజిల్ అమ్మాయి తన ఫ్రెండ్ రూమ్కి వెళ్లింది. వాడు అక్కడ బాయ్ఫ్రెండ్ అయిపోయాడు. 33 మంది, ఆమెపై 36 గంటల పాటు అత్యాచారం చేశారు. ఈ ఘటనపై ప్రపంచం ఇప్పుడు ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇదిగో.. ఈ సంగతి తెలీకే 18 ఏళ్ల మన ‘నిర్భయ’ తన ఫ్రెండ్తో కలిసి రాత్రి పూట బస్లో వెళ్లింది. అతను అక్కడ ఆమెను రక్షించుకోలేని బాయ్ఫ్రెండ్ అయిపోయాడు. తర్వాత జరిగిందేమిటో ఎన్ని తరాలు గడిస్తే మర్చిపోగలం? ఇదిగో.. ఈ సంగతి తెలీకే 23 ఏళ్ల యువతి కరీంనగర్లో ఫ్రెండ్ని నమ్మి వేరే ఊరు వెళ్లింది. వాడక్కడ బాయ్ఫ్రెండ్ అయిపోయాడు. ఆమె నలుగురి చేతిలో పడింది. ఇదిగో... ఈ సంగతి తెలీకే.. ఫ్రెండ్తో సెల్ఫీ దిగి, ఫ్రెండ్తో సొంత విషయాలన్నీ చెప్పుకుని, ఫ్రెండ్తో ఒంటరిగా వెళ్లి.. ఆ ఫ్రెండులోని బాయ్ఫ్రెండ్ అపరిచితుడిలా పైకి లేచి, చేసిన ద్రోహానికి బలైపోయిన అమ్మాయిల సంఖ్యే ఎక్కువ... నేషనల్, ఇంటర్నేషనల్ క్రైమ్ డేటాలో. ఆ డేటాలో లేటెస్ట్ ఎంట్రీ... బ్రెజిల్ నిర్భయ. గాళ్స్.. మీ ఫ్రెండ్కి ఇవ్వాళే చెప్పేయండి. తనని మీరు ఫ్రెండ్గా మాత్రమే ఇష్టపడుతున్నారనీ. బాయ్ఫ్రెండ్ వేషాలు వేస్తే కుదరదనీ! -మాధవ్ శింగరాజు -
సమయోచితంగా...
పురానీతి వానరరాజు సుగ్రీవుడు, ఆయన మంత్రి హనుమంతుడు. ఇద్దరూ ఋష్యమూక పర్వతం మీద అటూ ఇటూ నడుస్తూ ఏదో విషయం మీద సంభాషించుకుంటున్నారు. ఇంతలో సుగ్రీవుడి దృష్టి దూరంగా నడిచి వస్తున్న ఇద్దరు వ్యక్తుల మీద పడింది. చూడటానికి సాధువుల్లా ఉన్నా, ఎంతో బలిష్టంగా, భుజాన ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. వారి చేతులలో ఉన్న ఖడ్గాలు సూర్యకాంతి పడ్డప్పుడల్లా తళుక్కుమని వజ్రాల్లా మెరుస్తున్నాయి. వారిని చూసి సుగ్రీవుడు భయంతో బిగుసుకుని పోయాడు. మాటలలో తడబాటు, నడకలో తత్తరపాటు మొదలైంది. అది గమనించిన హనుమ, ‘రాజా! నీ భయానికి కారణం నాకు అర్థమైంది. ఆ వ్యక్తులను చూసే కదా నువ్వు కలవరపడుతున్నావు. నీవు అనుకుంటున్నట్టుగా వాలి ఇటు రాలేడు. ఒకవేళ మూర్ఖత్వంతో వస్తే మతంగ మహర్షి శాపం వల్ల తల వక్కలై మరణిస్తాడు. ఆ విషయం వాలికీ తెలుసు. నీకూ తెలుసు. రాజైనవాడు అవతలి వారి నడక, అవయవాల కదలికను బట్టి, మాటతీరును బట్టి, వారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనసులో ఏ భావం దాగి ఉందో కనిపెట్టి, అందుకు అనుగుణంగా నడిచి, తనని, తన ప్రజలని రక్షించుకోగలడు. అటువంటి సమర్థత నీకుంది. అయినా కూడా నువ్వు భయపడుతున్నావంటే, నీ అన్నగారైన వాలి శక్తిసామర్థ్యాల గురించి నీకు క్షుణ్ణంగా తెలిసి ఉండటమే కారణం అనుకుంటున్నాను. అయినా, వారెవరో. ఎందుకు వస్తున్నారో కనుక్కొని వస్తాను. మంత్రిగా అది నా కర్తవ్యం. అంతవరకూ నువ్వు స్థిమితంగా ఉండు’’ అంటూ సుగ్రీవుడి భుజం తట్టాడు హనుమ. కపిశ్రేష్ఠుడైన హనుమ మాటలతో కొండంత ధైర్యం వచ్చింది సుగ్రీవుడికి. వెంటనే హనుమ తన మనసులో ఇలా అనుకున్నాడు. వారసలే కొత్తవ్యక్తులు. తానేమో వానరుడు. వారేమో నరులు. తనను చూస్తే, వారు సరిగ్గా సమాధానం ఇస్తారో ఇవ్వరో అనే ఉద్దేశంతో వృద్ధబ్రాహ్మణ వేషం ధరించి, వారివద్దకు వెళ్లాడు. నమస్కరించి, ‘‘అయ్యా! మీరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? చూడటానికి బ్రాహ్మణుల్లా ఉన్నారు. కానీ, ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. బలిష్టంగా ఉన్నారు. మీ నడకను బట్టి, వేషభాషలను బట్టి మీరు ఈ ప్రాంతానికి కొత్తవారని అర్థమవుతోంది. మీరు ఏ పని మీద వచ్చారో తెలిస్తే, నేను మీకు సాయపడగలను’’ అని ఎంతో వినయంగా అన్నాడు. హనుమకు ప్రతినమస్కారం చేశాడు రాముడు. తామెవరో, ఏ పని మీద వచ్చారో క్లుప్తంగా తెలియజేశాడు. తన సోదరుడైన లక్ష్మణుని పరిచయం చేశాడు. వారి మాటలకు ఎంతో ఆనందపడ్డాడు హనుమ. ‘‘మా రాజు సుగ్రీవుడు. ఎంతో బలమైనవాడు. అయితే అంతకన్నా బలశాలి, అన్నగారు అయిన వాలితో విరోధం. వాలికి ఎవరూ ఎదురు నిలిచి పోరాడలేరు. ఎందుకంటే తన ఎదురుగా నిలిచిన వారి బలాన్ని గ్రహించే శక్తి కలిగిన అన్నగారంటే అమిత భయం. అందుకే ఆయన కంట పడకుండా ఈ పర్వతం మీద తలదాచుకుంటున్నాడు. మీరు వచ్చిన కార్యం నెరవేరాలంటే మీరు సుగ్రీవుడితో స్నేహం చెయ్యండి. ఆయనకు అపారమైన వాన రగణం అనుచరులుగా ఉన్నారు. వారి సహకారంతో సీతాన్వేషణ మీకు సులువవుతుంది. అలాగే వాలిని ఎదిరించి పోరాడాలంటే మీవంటి అమిత పరాక్రమశాలురు స్నేహితులుగా ఉండటం సుగ్రీవుడికి కూడా అవసరమే. మీరు నాతో రండి’’ అంటూ ముందుకు దారి తీశాడు. సమయోచిత వేషధారణ, సమయోచితంగా సంభాషించగలిగే సామర్థ్యాన్ని గురించి వ్యక్తిత్వ వికాస తరగతుల్లో కూడా బోధిస్తూ ఉంటారు. అలాంటి సమయోచిత వేషధారణ, సంభాషణా చాతుర్యం హనుమకు వెన్నతో పెట్టిన విద్య. ఎంతో పెద్ద వాగ్విశారదుడని పేరు తెచ్చుకున్న రాముడంతటివాడు అతను మాట్లాడిన నాలుగు మాటలకే ఎంతో ముచ్చటపడి, ‘‘చూశావా లక్ష్మణా! హనుమ ఎలా మాట్లాడాడో, ఆయన మాట లు విన్నావా? ఇలా మాట్లాడేవాడు మంత్రిగా కలిగిన ఆ రాజు ఎంత అదృష్టవంతుడు. ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తుంటే- వేదాలన్నీ క్షుణ్ణంగా ఔపోసన పట్టినట్లు కనిపిస్తోంది. వ్యాకరణం ఈయనకు కొట్టిన పిండి వంటిదనిపిస్తోంది. ఉపనిషత్తుల అర్థం పూర్తిగా తెలుసనుకుంటా. అందుకే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమ్మలు నిష్కారణంగా కదలడం లేదు. లలాటమూ కదలడం లేదు. వాక్యం లోపలి నుంచి పైకి వచ్చేటప్పుడు గొణుగుతున్నట్లు లేదు. గట్టిగానూ లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంతవరకు ఉచ్చరించాలో అలాగే పలుకుతున్నాడు. ఇటువంటి వ్యక్తి సుగ్రీవుడికి సచివుడిగా దొరికి, మన దగ్గరకు వచ్చి సుగ్రీవుడితో స్నేహం కలపాలని కోరుకుంటున్నాడు’’ అని అన్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు హనుమ ఆనాటి గొప్ప కమ్యూనికేటర్ అని. ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు, ఉద్యోగజీవితంలో, వ్యక్తిగత జీవితాలలో సందర్భోచిత వేషధారణ, మాటలను హనుమంతుడిని చూసి నేర్చుకోవాలి. -
రెజీనా కొత్త నిర్ణయం
నటి రెజీనా కెరీర్కు కొంత గ్యాప్ ఏర్పడడంతో ఆమె కొత్త నిర్ణయం తీసుకున్నారు. కేడి బిల్లా కిల్లాడి రంగా, నిర్ణయం, రాజతంత్రం అంటూ తమిళంలో కొన్ని చిత్రాలలో మాత్రమే నటించిన రెజీనా తెలుగులోనూ తక్కువ చిత్రాలలోనే నటించారు. ప్రముఖ హీరోయిన్గా తాను రాణించాలనే ఆసక్తి రెజీనాకు అధికంగానే ఉంది. ఆమె నటనకు ప్రశంసలు అందాయి. అయితే తనకు తగిన పాత్రలు ఎంపిక చేయకపోవడం, ఫెయిల్యూర్ చిత్రాలలో నటించడం ఆమె పురోగతికి అడ్డుగా నిలిచింది. షూటింగ్కు వచ్చినా ఎవరితోను మాట్లాడకుండా దూరంగా కూర్చునేవారు. దీంతో సహ నటీనటులు ఆమెతో సహజంగా మెలిగేందుకు సంశయించేవారు. ఇతరులతో సన్నిహితంగా ఉంటే తిప్పలు తప్పవని భావించిన రెజీనాకు అదే తంటాగా మారింది. ఇలా వెనక్కి తిరిగి చూస్తే చిత్రరంగంలో చాలా ఏళ్లు గడిచిపోయాయి. పాత పొరపాట్లను తలచుకుని మనస్తాపానికి గురైన రెజీనా ప్రస్తుతం ఇతరులతో సన్నిహితంగా మెలుగుతున్నా స్నేహం అని చెప్పుకునేందుకు పెద్దగా లేరు. దీంతో ప్రత్యామ్నాయ మార్గంలో అవకాశాలను అందుకునేందుకు గ్లామరస్గా నటించేందుకు సిద్ధమని ప్రకటించారు. -
ప్రేమా? స్నేహమా?
‘‘మీకు సునీత అనే అమ్మాయి తెలుసా?’’.. కిరణ్ ఆఫీసునుంచి రాగానే అడిగింది ఉష. ‘‘హా.. తెలుసు. ఏం?’’ సమాధానం చెప్తూ అడిగాడు కిరణ్. ‘‘ఎవరావిడ?’’ ‘‘ఫ్రెండ్.’’ ‘‘ఫ్రెండా? గాళ్ ఫ్రెండా?’’ ‘‘మ్మ్మ్... ఫ్రెండ్, హూ ఈజ్ ఎ గాళ్. అడగాలనుకున్నదేదో సూటిగా అడుగు. డొంక తిరుగుడొద్దు.’’ ‘‘సూటిగానే అడుగుతున్నా.. ఆవిడ మీకెంత క్లోజ్? ‘‘అన్ని విషయాలూ మాట్లాడుకునేంత క్లోజ్. చాలా?’’ ‘‘మాటలేనా... లేక?’’ ‘‘వాట్ డూ యూ మీన్?’’ ‘‘అంటే.. మాటలతోనే ఆగారా... లేక ఇంకా ముందుకు పోయారా? అని.’’ ‘‘సీ ఉషా! నాకు కుమార్ ఎలాగో సునీత కూడా అంతే. కుమార్తో డిస్కస్ చేసినట్లే తనతోనూ డిస్కస్ చేస్తుంటా.’’ ‘‘కుమార్ అన్న విషయం వేరు. ఆవిడతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది?’’ ‘‘ఒకచోట పనిచేస్తున్నప్పుడు మాట్లాడుకోక తప్పదు.’’ ‘‘అంటే.. మీరు మీ ఆఫీసులో ఆడాళ్లందరితో అలాగే క్లోజుగా మాట్లాడతారా?’’ ‘‘అందరితో కాదు.. సునీతతో మాత్రమే.’’ ‘‘ఆవిడతోనే ఎందుకు అంత క్లోజుగా మాట్లాడటం?’’ ‘‘నాకు యండమూరి నవలలంటే ఇష్టం, ఇళయరాజా సంగీతమంటే పిచ్చి. తనకు కూడా అంతే. అలా కామన్ ఇంట్రస్ట్ల గురించి మాట్లాడుకుంటాం.’’ ‘‘ఓహో.. అన్ని అభిరుచులూ అంతగా కలిశాయన్నమాట.’’ ‘‘అలాగనేం లేదు. నాకు రామ్గోపాల్ వర్మ సినిమాలంటే పిచ్చి, ఆవిడకు ఆర్జీవీ పేరెత్తితేనే మంట. సో, వాటి గురించి మాట్లాడుకోం. నువ్వు ఏదేదో ఊహించుకుని పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. షి ఈజ్ మై ఫ్రెండ్... అంతే!’’ ‘‘ఆహా.. ఫ్రెండ్ని కన్నా, బుజ్జీ అని కూడా పిలుస్తారా?’’ ‘‘ఓహ్.. అదా నీ ప్రాబ్లమ్. తన ముద్దుపేరు బుజ్జి, అందుకే అప్పుడప్పుడూ అలా పిలుస్తాను. అంతే!’’ అలాఅలా ఆ సంభాషణ చిలికి చిలికి గాలివానగా మారింది. ఉష, కిరణ్ ఇద్దరూ హద్దులు దాటి మాటలు అనేసుకున్నారు. దాంతో ఉష కోపంగా ఇల్లు విడిచి వెళ్లిపోయింది. కిరణ్ ఆపే ప్రయత్నం చేయలేదు. ‘‘ఏమైందిరా?’’ చెల్లిల్ని అనునయంగా అడిగింది రేఖ. ‘‘కిరణ్ సునీత అనే ఆవిడతో రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు, చాట్ చేస్తున్నాడు.’’ ‘‘నువ్వు చూశావా?’’ ‘‘హా.. మొన్న తను మొబైల్ మర్చిపోయి ఆఫీసుకు వెళ్లినప్పుడు చెక్ చేశా. ఇద్దరూ గంటలకు గంటలు చాట్ చేసుకుంటున్నారు.’’ ‘‘అవునా... దేని గురించి మాట్లాడుకుంటున్నారు?’’ ‘‘ఏవో.. ఆఫీసు విషయాలు. మేనేజ్మెంట్ సబ్జెక్ట్ గురించి.’’ ‘‘ఇంకా?’’ ‘‘సినిమాలు, మ్యూజిక్, లిటరేచర్ గురించి.’’ ‘‘ఇంకా?’’ ‘‘ఫ్యామిలీస్ గురించి.’’ ‘‘అంతేగా... అంత మాత్రానికే బాధపడతావేం?’’ ‘‘నువ్వు అలాగే అంటావ్. బావగారు వేరే ఎవరితోనైనా మాట్లాడితే తెలుస్తుంది ఆ బాధేంటో. ఆవిడతో కిరణ్కు రిలేషన్ షిప్ ఉందేమోనని డౌట్గా ఉందక్కా. ఆవిడను బుజ్జీ, గజ్జీ అని పిలుస్తున్నాడు.’’ ‘‘వాళ్ల చాటింగ్లో రొమాంటిక్ విషయాలున్నాయా?’’ ‘‘వూహూ... అలాంటివేం లేవు.’’ ఉష సమస్యేమిటో రేఖకు అర్థమైంది. ‘‘సరేరా.. నీ ఫీలింగ్ నాకు అర్థమౌతుంది. అయితే ఈ విషయాన్ని మనం సైంటిఫిక్గా విశ్లేషించుకుంటే మంచిది. రాబర్ట్ స్టెర్న్బర్గ్ అనే సైకాలజిస్ట్ ప్రేమ గురించి ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దాని గురించి మాట్లాడుకుందాం.’’ ‘‘సరే.. చెప్పు’’ అయిష్టంగానే అంది ఉష. ‘‘స్టెర్న్బర్గ్ సిద్ధాంతం ప్రకారం ప్రేమలో అభిరుచి (ప్యాషన్), సాన్నిహిత్యం (ఇంటిమసీ), నిబద్ధత (కమిట్మెంట్) ఈ మూడూ ఉంటేనే అది పరిపూర్ణమైన ప్రేమ. ఇద్దరు వ్యక్తుల మధ్య కేవలం సాన్నిహిత్యం మాత్రమే ఉంటే అది నిజమైన స్నేహం. నిబద్ధత మాత్రమే ఉంటే శూన్యమైన ప్రేమ, కేవలం ప్యాషన్ మాత్రమే ఉంటే అది ఆకర్షణ. ప్యాషన్, ఇంటిమసీ రెండూ ఉంటే అది రొమాంటిక్ లవ్. సాన్నిహిత్యంతో పాటు నిబద్ధత ఉంటే అది సహచర ప్రేమ. ప్యాషన్, కమిట్మెంట్ మాత్రమే ఉంటే అది ఫాచువస్ లవ్. ఇలా ప్రేమలో ఆరు రకాలుంటాయి. ఇప్పుడు చెప్పు... సునీతకూ, కిరణ్కు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటో?’’ ‘‘వాళ్లిద్దరి అభిరుచులు కలిశాయనే చెప్పాడు కిరణ్.’’ ‘‘కదా.. మరి నువ్వెందుకు వేరేలా అనుకున్నావ్?’’ ‘‘అంటే అక్కా... ఆవిడ్ని బుజ్జీ అని పిలిచేసరికి...’’ ‘‘అది ఆవిడ పెట్నేమ్ కూడా అయ్యుండొచ్చుగా?!’’ ‘‘అవును... ఆవిడ్ని ఇంట్లో అలానే పిలుస్తారని చెప్పాడు కిరణ్.’’ ‘‘కదా? అందుకే అతనూ అలా పిలిచి ఉంటాడు. అయినా ఓసారి అతనితో మాట్లాడుతాలే. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా ఉండు.’’ అని చెప్పింది రేఖ. ‘‘సరే అక్కా’’ అంటూ నవ్వింది అనుమానాలు వీడిన ఉష. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
ఆ సంబంధాన్ని ప్రసారం చేయడంపై ఆగ్రహం
జాతి వైరాన్నిమరచిపోవడమే కాదు... రెండు మగ జంతువుల మధ్య ఊహించని రీతిలో ఏర్పడ్డ సంబంధాన్ని రష్యన్ మాస్ మీడియా ప్రసారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. ఓ పక్క జంతు ప్రేమికులు మీడియా ప్రసారాలకు మద్దతు పలుకుతుంటే... మరోవైపు రష్యాలోని గే ప్రాపగాండను ఉల్లఘించడమేనంటూ నిరసన వెల్లువెత్తుతోంది. ఇటువంటి ప్రసారాలు సాంప్రదాయ విలువలకు నష్టాన్ని తెస్తాయని, జంతువుల మధ్య స్వలింగ సంపర్క సంబంధాలు పిల్లలకు హాని కలుగ జేస్తాయని న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రష్యా ప్రమోర్సి ప్రాంతానికి చెందిన న్యాయవాదులు అముర్ అనే మగపులి, మగ మేక తిముర్ మధ్య సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఫార్ ఈస్ట్ సఫారి పార్క్లో రెండు వేర్వేరు జాతులకు చెందిన అముర్, తిముర్ల మధ్య లైంగిక సంబంధంపై కవరేజ్కు వ్యతిరేకంగా విచారణ జరపాలని నోవోసిబ్రిస్క్కు చెందిన లాయర్ అలెక్సి క్రిష్టియానావ్ ప్రాసిక్యూటర్లను కోరారు. సఫారీ పార్క్ లోని రెండు మగ జంతువుల మధ్య లైంగిక సహజీవనాన్ని ఇటీవల రష్యన్ మాస్ మీడియా ప్రసారం చేయడంపై ఆయన ఫేస్ బుక్లో విమర్శించారు. ఇది జంతువులపై ప్రతికూల ప్రచారమే అయినప్పటికీ ఈ ప్రభావం రష్యా ప్రజలపై పడటమే కాక, రష్యా గే-ప్రాపగాండను ఉల్లంఘించినట్లవుతుందని క్రిస్టియానావ్ వాదిస్తున్నారు. అంతేకాక హోమో సెక్సువాలిటీని ప్రోత్సహించినట్లు అవుతుందంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రభావం పిల్లలపై త్వరగా పడే అవకాశం ఉందని, వారు సంప్రదాయ విలువలకు వ్యతిరేకంగా లైంగిక సంబంధాలను పెంచుకునే ప్రమాదం ఉంటుందని క్రిస్టినావ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ప్రాపగాండపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, పిల్లలకు రక్షణ కల్పించాలని కోరారు. తన ఫాలోయర్స్ తో కలిపి క్రిస్టినావ్ ప్రాసిక్యూటర్ జనరల్కు బహిరంగ లేఖ రాశారు. ఈ ఫిర్యాదుపై ప్రాసిక్యూటర్లు దర్యాప్తు జరుపుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే జూ అధికారులు ఆ రెండు జంతువులు ఒకదానిపై ఒకటి ప్రేమ పెంచుకోవడం మొదలు పెట్టిన తర్వాత... విడివిడిగా ఎన్క్లోజర్స్ లో ఉంచుతున్నారు. -
అచ్చం మీలాగే ఆలోచించే మహిళ కావాలా!
న్యూయార్క్: మీకు అచ్చం మీలాగే ఆలోచించే మహిళ కావాలనుకుంటున్నారా అయితే మీరు మొబైల్లో ఓ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. 'హే! వీనా' పేరుతో ఉన్న ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకుంటే మీలాంటి భావాలే ఉన్న మహిళలను కలుసుకోవచ్చు. అయితే ఇది కేవలం మహిళలకు మాత్రమే ఉద్దేశించిన యాప్ సుమీ. మిగతా ఆన్లైన్ డేటింగ్ యాప్లలా కాకుండా మహిళలు తమతో సారూప్య భావాలున్న వారిని కలుసుకొని రోజువారి జీవితంలో వారికి ఎదురయ్యే సమస్యలు, ప్రయాణాలు, కెరీర్, ఇతర విషయాలను పంచుకోవచ్చు. చుట్టూ ఎంతమంది ఉన్నా.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఆలోచనలు కలవని వారితో స్నేహం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే ఈ యాప్ ద్వారా మహిళల మనోగతాన్ని ముందుగా కొన్ని ప్రశ్నల ద్వారా తెలుసుకొని అచ్చం వారిలా ఆలోచించే వారిని జత చేస్తామని యాప్ ఫౌండర్ ఒలీవియా జూన్ పూల్ తెలిపారు. ముందుగా యూజర్ల ఫేస్బుక్ అకౌంట్కు హే! వీనా యాప్ కనెక్ట్ అవుతుందని ఆమె తెలిపారు. -
కొత్త సినిమా విడుదల ఎప్పుడో?
డేట్లైన్ హైదరాబాద్ పతాక సన్నివేశం తరువాత ఎప్పటిలాగే శుభం కార్డు పడింది. కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఈ సఖ్యత ఎంతకాలం నిలుస్తుందన్న ప్రశ్న మిగిలే ఉంది. ప్రస్తుతానికైతే ఓటుకు కోట్లు వ్యవహారం నుంచి బయటపడడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించి మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కొంతకాలం పాటు అపూర్వ సహోదరుల మాదిరిగానే కొనసాగుతారు. ‘ఆగర్భ శత్రువులు-అపూర్వ సోదరులు’ అనే చలనచిత్రాన్ని 2015 సంవత్సరంలో మనం రెండు భాగాలుగా చూశాం. ఇక ఈ ఏడాది ఎలాంటి సినిమాలు చూపించబోతున్నారో మన నాయకులు? కొత్త సంవత్సరం ప్రవేశించింది ఇప్పుడే కదా! తినబోతూ రుచులు అడగడం ఎందుకు? అయితే 2016లో కూడా మనం తప్పనిసరిగా కొన్ని సినిమాలు చూస్తాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అయితే కొత్త సంవత్సరం ఆరంభంలోనే ఒక సినిమా చూపించేశారు. మొన్న ప్రకాశం జిల్లాలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి అక్కడ ఆయన చూపించిన సినిమాకు, ‘బాబుగారి గది’ అని పేరు పెడితే బాగానే ఉంటుంది. ఈ మధ్యనే ‘రాజుగారి గది’ అన్న పేరుతో ఒక బడ్జెట్ సినిమా విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా కథ ఏమిటంటే, ఆ రాజుగారి గదిలో అన్నీ దయ్యాలూ, భూతాలూ ఉన్నట్టు భ్రమ కలుగు తుందట. ఆయన వైఖరి చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఇలాంటి భ్రమలే కలుగుతున్నాయేమోననిపిస్తుంది. ఆయననూ, ఆయన ప్రభుత్వాన్నీ ఎవరు విమర్శించినా, నిరసించినా సరే, అందులో చంద్ర బాబుకు వైఎస్ఆర్సీపీయే కనిపిస్తున్నదట. ఆయన రాజ్యంలో ఎవరూ నిరసన తెలిపే సాహసం చేయకూడదు. అసలు నిరసనకారులంతా ఆయన కంటికి టైస్టుల మాదిరిగా కనిపిస్తున్నారు. నిరసన తెలియచేస్తారని ఎవరి మీద అనుమానాలు ఉన్నాయో, వారందరినీ బాబుగారి పర్యటన సంద ర్భంగా పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో తమ వంతు కర్తవ్యాన్ని పూర్తి చేశారు. జర్నలిస్టులకూ సమస్యలు ఉంటాయి, వారు కూడా నిరసన తెలియచేయగలరన్న ఊహ తట్టకపోవడం వల్ల పోలీసులు విలేకరుల జోలికి పోలేదు. తీరా ప్రెస్ గ్యాలరీలో కూర్చున్న విలేకరులు తమ బొడ్లో దాచి పెట్టిన నినాదాల కాగితాలు తీసి ప్రదర్శించడంతో చంద్రబాబుగారికి ఎక్కడ లేని ఆగ్రహం పెల్లుబికింది. విలేకరులు బొడ్లో నుంచి తీసినవి కాగితాలే, కత్తులు కావు. అయినా వాళ్లు కూడా ఆయనకు టైస్టుల్లాగే కనిపించారు. అంతేకాదు, ఆ జర్నలిస్టులు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం కూడా వైఎస్ఆర్సీపీ నడుపుతున్న సంఘంలా కనిపించింది. అంటే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్లో ఎవరు నిరసన తెలియచేసినా కూడా ఆ నిరసనకారులంతా వైఎస్ఆర్సీపీ సభ్యులుగా, లేదా ఆ పార్టీ అనుబంధ సంస్థల సభ్యులుగానో చంద్రబాబు కంటికి కనిపిస్తున్నారు. తొలిభాగంలో... తాము మనుగడ సాగిస్తున్నది ప్రజాస్వామిక వ్యవస్థ అన్న సంగతిని చంద్ర బాబు మరచిపోతున్నారు. ‘ఏదన్నా అడుక్కోవాలంటే ఓ పక్కకొచ్చి నిలబడండి! వెళ్లేటప్పుడు చూస్తాను. అంతేకానీ నిరసన తెలియచేస్తే మీ సంగతి తేలుస్తా!’ అని బెదిరిస్తారాయన. నిరసనకారులంతా మన పాలకులకు అడు క్కునేవాళ్ల మాదిరిగా కనిపించడం ప్రజాస్వామ్యానికి చేటు. జర్నలిస్టులకు సంబంధించి ఇలాంటి బెదిరింపులు ఇంకొక చోట కూడా వినిపించిన సంగతి గుర్తుకు రావడం లేదా!? ఔను, చంద్రబాబుకు అపూర్వ సోదరుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కూడా అధికారంలోకి రాగానే తెలంగాణ జర్నలిస్టుల నిరసనను అణచివేయడానికి ప్రయత్నించినప్పుడు ఇంతకంటే తీవ్ర స్వరంతో హెచ్చరికలు సంధించారు. ఈయన మీ సంగతి తేల్చేస్తానన్నారు. ఆయన మెడలు విరిచి అవతల పారేస్తానన్నారు. ఈ రెండు వ్యక్తీకరణలకీ పెద్ద తేడా లేదు. ఆరు దశాబ్దాల సమరశీల పోరాటాల చరిత్ర కలిగిన జర్నలిస్ట్ ఉద్యమానికి రాజకీయ ముద్రలు వేసే ప్రయత్నం చేస్తు న్నారు. బాబుగారు గది నుంచి బయటకు వస్తే అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అసలు సినిమా ‘ఆగర్భ శత్రువులు-అపూర్వ సోదరులు’ విషయానికి వస్తే; ముందే చెప్పుకున్నట్టు ఇది రెండు భాగాలుగా సాగింది. ఫిరాయింపు రాజకీయాలు, ఎంఎల్సీ ఎన్నికలు, ఓటుకు కోట్లు వ్యవహారం, శాసనసభ్యుడే జైలుకు వెళ్లడం, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రే అవినీతిని ప్రోత్సహిస్తూ ఫోన్లో మాట్లాడి పబ్లిగ్గా దొరికిపోవడం, నువ్వు జైలుకు పోతావంటే, నువ్వు నాశనమైపోతావని ముఖ్యమంత్రులిద్దరూ రోడ్డెక్కి బాహాటంగా తిట్టుకోవడం మొదటి భాగంలో చూశాం. ఇంకా, కొన్ని రోజుల పాటు సాగిన ఉద్రిక్త వాతావరణంలో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని చంద్రశేఖరరావు బహిరంగ వేదికల మీదే గర్జించగా, నీ అంతు చూస్తాను, నాకూ ఏసీబీ ఉంది. పోలీసులూ ఉన్నారు అంటూ చంద్రబాబు విజయవాడ వీధులలో హుంకరిం చారు. ముఖ్యమంత్రులమన్న సంగతి సరే, అసలు నాగరికులమన్న స్పృ హను కూడా వారు కోల్పోయారు. వీరి కోపతాపాలకు అనుగుణంగా అటూ ఇటూ మంత్రులు, ఎంఎల్ఏలు, పార్టీల నాయకులు ఒకరినొకరు నోరారా తిట్టుకోవడం వంటి ఘట్టాలు కూడా ఈ భాగంలోనే తిలకించాం. సినిమా ఏ మలుపు తిరుగుతుందోనని అనుకుంటూ విశ్రాంతి సమ యంలో చాయ్ తాగి థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకులు దిమ్మెరపోయారు. రెండోభాగంలో ఆ ఇద్దరూ అపూర్వ సోదరులైపోయారు. ఆలింగనాలు, పుష్పగుచ్ఛాలు, పిండివంటలతో భోజనాలు, దుశ్శాలువలతో మర్యాదలు, వాటిని కొనసాగింపుగా ఆహ్వానాలు- ఇదీ వరస. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించడానికి చంద్రబాబు స్వయంగా విచ్చేస్తే, తాను నిర్వహించిన అయుత చండీయానికి రమ్మని చంద్రబాబును పిలవడానికి చంద్రశేఖరరావు విజయవాడ వెళ్లారు. ఈ ఆహ్వానాల కార్యక్రమం కోసం వారు ఉపయోగించిన హెలికాప్టర్ తదితర సౌకర్యాలకు అయిన ఖర్చంతా రెండు రాష్ట్రాల ప్రజలదే. అట్టహాసంగా జరిగిన అమరావతి శంకుస్థాపనకు చంద్రశేఖరరావు హాజరు కాగా, అయుత చండీయాగానికి దీక్షా వస్త్రాలు ధరించి మరీ చంద్రబాబు హాజరయ్యారు. ప్రభుత్వాధినేత యాగం చేస్తే ఎలా? అమరావతి శంకుస్థాపన గురించీ, చండీయాగం గురించి ఇక్కడ కొంచెం స్పష్టంగా మాట్లాడాలి. స్పష్టంగా అనడం ఎందుకంటే, వాటి గురించి బాహా టంగా విమర్శించడానికి చాలామంది జంకుతున్నారు. కొంతమంది తమలో తాము గొణుక్కుంటూ ఉంటే, కొందరు తమకెందుకులే అని మౌనం దాల్చారు. అమరావతి వ్యవహారంలో కొద్దిపాటి నిరసన అయినా వ్యక్తమైం ది. ఆ రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ. అది బలమైన ప్రతిపక్షం. వైఎస్ఆర్సీపీ, ఇతర పార్టీలు కూడా శంకుస్థాపన ఆర్భాటాన్నే కాకుండా, ఇతర అంశాల గురించి కూడా గళం ఎత్తాయి. కొన్ని కోట్ల ప్రజాధనం ఎందు కు వృథా చేయాలని విమర్శించాయి. అయుత చండీయాగం విషయంలో అలా కాదు. సొంత సొమ్ముతో నిర్వహిస్తున్నానని చంద్రశేఖరరావు ప్రకటిం చారు. అంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ మూఢ నమ్మకాలను పారద్రోలి ప్రజలలో శాస్త్రీయ అవగాహన పెంచవలసిన కాలంలో ప్రభుత్వాధి నేతలు యాగాలు చేయడం ఏమిటని ఒక్కరూ ప్రశ్నించకపోవడం విచార కరం. పూర్వం రాజులు ఈ యాగాలు చేశారు. అవన్నీ రాజ్య విస్తరణ కాంక్షతో చేసినవే తప్ప, ప్రజల క్షేమం కోసం చేసినవి మాత్రం కాదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే అయుత చండీయాగం చేస్తానని మొక్కుకు న్నట్టు చంద్రశేఖరరావు ప్రకటించారు. ఇంకేముంది! అందరి నోళ్లూ మూతప డ్డాయి. అక్కడ అమరావతి నిర్మాణం విషయంలో విమర్శలు ఎక్కుపెట్టిన వారిని రాజధానికే వ్యతిరేకులని ఏ విధంగా ముద్ర వేస్తున్నారో, తెలంగా ణలో కూడా అయుత చండీయాగాన్ని విమర్శిస్తే తెలంగాణకే వ్యతిరేకులన్న ముద్ర పడవచ్చుననే వాతావరణం కల్పించారు. యాగాలు మత సంబంధమై నవి. మత విశ్వాసాలు వ్యక్తిగతమైనవి. వాటిని చులకన చేయవలసిన అవ సరం లేదు. కానీ అవి వ్యక్తులకూ, వారి ఇళ్లకూ పరిమితం కావాలి. అంతే తప్ప, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాధినేతలు యాగాలు చేయడం సరికాదు. వ్యక్తిగత హోదాలో సీఎం ఈ యాగాన్ని నిర్వహించారనే అనుకుంటే, ప్రజా స్వామ్యంలోని నాలుగు అంగాలకు చెందిన పెద్దలు కూడా పాల్గొనడం ఏ విధంగా రాజ్యాంగ స్ఫూర్తికి దోహదం చేయగలుగుతుంది? పతాక సన్నివేశంలో... ఇక సినిమా పతాక సన్నివేశం తరువాత ఎప్పటిలాగే శుభం కార్డు పడింది. కానీ తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య ఈ సఖ్యత ఎంతకాలం నిలుస్తుందన్న ప్రశ్న మిగిలే ఉంది. ప్రస్తుతానికైతే ఓటుకు కోట్లు వ్యవహారం నుంచి బయట పడడం కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం, రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించి మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి తెలం గాణ సీఎం కొంతకాలం పాటు అపూర్వ సహోదరుల మాదిరిగానే కొనసాగు తారు. తెలంగాణ రాష్ట్రానికి మకుటం హైదరాబాద్. అక్కడ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎప్పుడూ గెలవలేదు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా గెలవలేకపోతే ఆ పార్టీ రాజకీయంగా ఇబ్బందుల్లో పడుతుంది. గెలవాలంటే హైదరాబాద్లో స్థిరపడిన ఆంధ్రుల ఓట్లు కావాలి. జీహెచ్ఎంసీ ఎన్ని కలు పూర్తి కాగానే ఈ సంవత్సరంలోనే ఈ ముఖ్యమంత్రులు ఇద్దరూ రాజకీయ వెండితెర మీద మరో కొత్త సినిమా చూపించినా ఆశ్చర్యపోనక్కరలేదు. (వ్యాసకర్త : దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రెటరీ జనరల్, datelinehyderabad@gmail.com ) -
జాతి వైరాన్నిమరచి...
పగలూ, ప్రతీకారాలు మరచిపోయాయి. రెండు విభిన్న జాతులమన్న ఆలోచననూ కనీసం ఆ దరిదాపులకు రానివ్వలేదు. ఓ కుక్కపిల్లా, బాతు కలసి మెలసి ఆనందంగా ఆడుతున్నాయి. స్నేహబంధానికి ఎటువంటి హద్దులూ ఉండవని నిరూపిస్తున్నాయి. జాతి వైరాన్ని మరచి చూపరులకు కనువిందు చేసిన ఆ వీడియో ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆకారంలోనూ, జాతుల్లోనూ ఏమాత్రం పోలిక లేకపోయినా... కక్షలూ, కార్పణ్యాలకు దూరంగా ఒకేచోట బతుకుతున్న ఆ జంతువులు.. కల్మషంతో కుళ్ళుకునే మనుషులకు కనువిప్పు చేస్తున్నాయి. పక్షుల్ని చూస్తే పీక పట్టుకునే కుక్క... కుక్కను చూడగానే ముక్కు పెట్టి పొడిచేందుకు తయారయ్యే బాతూ... ఇక్కడ మాత్రం ఒకదానికొకటి మంచి స్నేహితులుగా కనిపిస్తూ...చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. చాలా సీరియస్ గా కొట్టుకుంటున్నా దెబ్బలు తగలని ఈ దృశ్యం.. ఓ రెజ్లింగ్ క్రీడను తలపిస్తోంది. ఒకదాన్నొకటి కొరుకుతూ..ముందుకు నెడుతూ వాటి బలాబలాలను పరీక్షించుకుంటున్నాయి. ఏది ఏమైనా సరదాకు, ఆగ్రహానికి మధ్య ఉన్న చిన్నపాటి గీతను దాటకుండా సంయమనం పాటిస్తూ ఆటలాడుతున్న ఆ జంతువుల వీడియో... స్నేహ బంధాన్ని మరోసారి రుజువు చేస్తోంది. యజమాని తోటలో జతగా బలపరీక్షకు దిగిన ఈ పెంపుడు జంతువులు...ఎటువంటి హాని కలగకుండా సున్నితంగా ఆడుకోవడం వాటిలోని ఆలోచనా శక్తిని ప్రస్ఫుటిస్తుంది. -
మన జాతీయాలు
లొట్టాభట్టీయం మనుషుల్లో చేతల మనుషులు, మాటల మనుషులు అని రెండు రకాలు. చేతల మనుషులు... తాము చేయదలిచిన పనిని ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా చేసేస్తారు. మాట మీద నిలబడతారు. అతిగా మాట్లాడరు. గొప్పలకు పోరు. అసాధ్యమైన పనిని సైతం ‘నేను చేస్తాను చూడు’ అని డంబాలు పలుకరు. ఇక మాటల మనుషుల తీరు దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఈ కోవకు చెందినవాళ్లు మాటలకు తప్ప చేతలకు ప్రాధాన్యత ఇవ్వరు. పని విషయంలో సాధ్యాసాధ్యాల గురించి విశ్లేషించడం కూడా కనిపించదు. ఏ పని అయినా సరే- ‘‘అదొక లెక్కా... నేను చేసేస్తాను’’ అంటారు. తీరా పనిచేయాల్సి వచ్చేసరికి సాకులు వెదుక్కొని తప్పించుకుంటారు. ఇలాంటి వాళ్లు ఎంతోమంది మనకు నిత్యజీవితంలోనూ తారస పడుతుంటారు. ఈ కోవకు చెందిన వాడే లొట్టాభట్టు. ఈ భట్టుగారు నోరి విప్పితే చాలు... కోతలే కోతలు. ‘ఆకాశంలో చుక్కలు కావాలి’ అని అడిగితే - ‘అదెంత పని’ అనేవాడట వినేవాళ్లు నమ్మేలా. దేనినీ చాతకాదు అనడం ఈయనకు చాత కాదు. ఏదైనా చేసేస్తాను అనడమే ఈయనగారికి వచ్చు. నిజంగా వచ్చా అంటే సమాధానం శూన్యం. అందుకే కోతలు కోయడం, గొప్పలు చెప్పుకోడం లాంటి వాటికి లొట్టాభట్టు పేరు పర్యాయపదం అయిపోయింది. అందుకే ఎవరైనా సాధ్యం కాని పనులను సాధ్యం చేస్తామని చెప్పినా, కోతలు కోసినా - ‘‘ఆయన చెప్పింది నమ్మేవు సుమీ... అదొక లొట్టాభట్టీయం’ అంటుంటారు. దింపుడు కళ్లం ఆశ మనిషిని బతికించేది ఆశ అంటారు. చనిపోయిన మనిషి మళ్లీ బతుకుతాడు అనుకోవడం కూడా ఆశే. కాకపోతే అది తీరే ఆశ కాదు. అయినా కూడా తీరుతుందేమో నని ఆచరించేదే దింపుడు కళ్లం. చనిపోయిన వ్యక్తిని శ్మశానం వరకూ ఊరేగింపుగా తీసుకెళ్తూ, మధ్యలో ఒకచోట శవాన్ని కిందికి దింపి, చెవిలో మూడుసార్లు పేరు పెట్టి పిలుస్తారు. ప్రాణం మిగిలుంటే లేస్తారని ఆ ప్రయత్నం. దీన్ని దింపుడు కళ్లం ఆశ అంటారు. కళ్లం అంటే ప్రదేశం అని అర్థం. గతంలో ఎప్పుడో, చనిపోయాడని నిర్ధారించుకున్న ఓ వ్యక్తి, నిప్పు పెట్టే ముందు చితిమీది నుంచి లేచి కూర్చు న్నాడట. అదెంతవరకూ నిజమో తెలి యదు కానీ, ఆచార వ్యవహారాల ప్రకారం దింపుడు కళ్లం ఆశకు ఎలాంటి అర్థం ఉన్నా, ఒక చిట్టచివరి ఆశ అన్న భావన వచ్చింది. ఒక పని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగ దని తెలిసినా, మనసులో ఏదో మూల చిన్న ఆశ ఉంటుంది. ఆ ఆశ గురించి చెప్పేటప్పుడు ఈ మాటను వాడతారు. చుట్టమై వచ్చి దెయ్యమై పట్టి! పనులు చక్కబెట్టుకోవడానికి లేదా తమ పబ్బం గడుపుకోవడానికి కొంతమంది ఆత్మీయత, స్నేహం, బంధుత్వం అనే ఆయుధాలను వాడుతుంటారు. ఒక పని నెరవేర్చుకోవాలంటే ఎవరి వల్ల అవుతుంది, ఎవరి ద్వారా ఎలాంటి లాభాలు పొందవచ్చు అని కనుక్కొని జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. వారితో వ్యూహాత్మకంగా స్నేహమో, బంధుత్వమో కొని తెచ్చుకుంటారు. వీరి నట ఆత్మీయతను చూసి అవతలి వాళ్లు సులభంగా బుట్టలో పడి పోతారు. కాల క్రమంలో ఈ ఆత్మీయులు కాస్తా గుదిబండల్లా తయారవుతారు. దాంతో వీరిని వదిలించుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అలాంటి వారి విషయంలో వాడే జాతీయం ఇది. ‘‘అలాంటివాడిని ఎందుకు నమ్మావు?’’ అని అడిగితే- ‘‘ఏం చేస్తాం మరి... చుట్టమై వచ్చి దెయ్యమై పట్టాడు’’ అంటారు. ఈగెంతా పేగెంతా! కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలంటారు. వియ్యం సంగతి సరే, కయ్యంలో మాత్రం తరచుగా వినిపించే మాట ఇది. సంపద, జ్ఞానం, వయసు మొదలైన విషయాల్లో పోల్చి చూసే సందర్భాల్లో వాడే జాతీయం ఇది. ‘‘నువ్వెంత, నీ స్థాయి ఎంత? నీ మాటలను నేను లెక్కలోకి తీసుకోను. ఈగెంతా పేగెంతా’ అంటుంటారు. ఈగ అంటేనే చిన్న జీవి. ఇక దాని పేగు ఎంత ఉంటుంది! మరీ చిన్నగా ఉండదూ! తక్కువలో తక్కువ, అల్పంలో అల్పం అని చెప్పడానికి ‘ఈగ’ను ప్రతీకగా వాడుకొని ఇలా చెబుతుంటారన్నమాట. -
అక్టోబర్ 12 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: ఎహసాన్ నూరాని (సంగీత దర్శకుడు), స్నేహ (నటి) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 3. ఇది దేవగురువైన బృహస్పతి సంఖ్య కావడం వల్ల వీరు నిశిత పరిశీలన, కుశాగ్రబుద్ధి, సృజనాత్మకత కలిగి, మేధావిగా గుర్తింపబడతారు. ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. సద్గురువులు, సజ్జనుల సాంగత్యం ఏర్పడటం వల్ల ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థికాభివృద్ధి. రచయితలు, వక్తలు, సంగీత క ళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ ఉంటాయి. అయితే న్యాయపరమైన లావాదేవీలు అనుకూలించకపోవచ్చు. పుట్టిన తేదీ 12 అంటే 3. ఇది కూడా బృహస్పతి సంఖ్యే కాబట్టి వీరిపై ఈ సంవత్సరం గురుడు బలమైన ప్రభావాన్ని చూపడం వల్ల ధారణ శక్తిని, విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. ఉద్యోగులకు బదిలీలు ఉండవచ్చు. లక్కీ నంబర్స్: 1,2,3,5; లక్కీ కలర్స్: పర్పుల్, గ్రే, ఎల్లో, క్రీమ్, వైట్, శాండల్; లక్కీ డేస్: సోమ, మంగళ, గురువారాలు. సూచనలు: కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వటం, గురుశ్లోకం చదవటం, దక్షిణామూర్తిని ఆరాధించటం, పెద్దలను గౌరవించటం, వృద్ధులను, అనాథలను ఆదుకోవడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్ -
మన జాతీయాలు
చేతి చమురు భాగవతం! పూర్వపు రోజుల్లో వీధుల్లో భాగవతం ఆడేవారు. అందులోని వివిధ ఘట్టాలు ప్రేక్షకులను కట్టిపడేసేవి. పోను పోను ఏ నాటకం ఆడినా ‘వీధి భాగవతం ఆడుతున్నారు’ అనడం పరిపాటయింది. ఈ సంగతి ఎలా ఉన్నా... ఆ కాలంలో ఇప్పటిలా సౌకర్యాలేం లేవు కాబట్టి, స్టేజీ వేయడం నుంచి పెద్ద పెద్ద దీపాలు వెలిగించడం వరకు చాలానే కష్టపడాల్సి వచ్చేది. నాటకం జరుగున్నంత సేపూ దీపాలు వెలిగించడానికి అయ్యే చమురు ఖర్చు కూడా ఎక్కువగానే ఉండేది. అయితే నాటకానికి మంచి స్పందన వచ్చినప్పుడు... నటులకు చదివింపులు ఘనంగా ఉండేవి. నటులను సంతోష పెట్టడానికి ఊరివాళ్లు పోటీ పడి రకరకాల కానుకలు సమర్పించే వాళ్లు. అలా అని అన్ని సందర్భాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉండేది కాదు. కొన్నిసార్లు నాటకం ప్రేక్షకులకు నచ్చేది కాదు. ఒకవేళ నచ్చినా ఆ నచ్చడం అనేది ప్రశంసలకు మాత్రమే పరిమితమయ్యేది. మరికొన్నిసార్లు భారీ వర్షం వచ్చి నాటకం మధ్యలోనే ఆగిపోవడం లాంటివి జరిగేవి. దీంతో నిర్వాహకులు, నటులు ‘చమురుకు పెట్టిన డబ్బులు కూడా రాలేదు’ అని నిరాశ పడేవారు. పెట్టిన ఖర్చును చూసి బాధపడేవారు. అప్పటి నుంచి... వృథా ఖర్చు చేసి నష్టపోయిన సందర్భాల్లో ‘చేతి చమురు భాగవతం’ అనడం మామూలు అయిపోయింది. నిమ్మకాయ వాటం! అర చేతిలో గుమ్మడికాయ పడుతుందా? పట్టదు గాక పట్టదు. మరి నిమ్మకాయ? చాలా ఈజీగా పట్టేస్తుంది. పనుల్లో కూడా చేయదగినవి, చేయలేనివి, కష్టమైనవి, సులువైనవి ఉంటాయి. ఎవరి గురించైనా చెప్పేటప్పుడు ‘‘వాడికా పని కష్టమేం కాదు... నిమ్మకాయ వాటం’’ అంటారు. అంటే నిమ్మకాయ చేతిలో పట్టినంత తేలిగ్గా అతడు ఆ పని చేసి పారేస్తాడు అని. అలాగే ఆత్మవిశ్వాసం గురించి చెప్పేటప్పుడు... ‘‘చేయలేను అనడం వాడికి చేతకాదు. వాడిదంతా నిమ్మకాయ వాటం’’ అంటుంటారు. ఉమ్మాయ్ జగ్గాయ్! ‘‘వారి ప్రాణస్నేహాన్ని చూస్తే చూడముచ్చటగా ఉందనుకో’’ అంటాడో వ్యక్తి. ‘‘ప్రాణస్నేహమా పాడా! వాళ్లది ఉమ్మాయ్ జగ్గాయ్ స్నేహం’’ అంటాడు రెండో వ్యక్తి. అంటే అర్థం ఏమిటి? స్నేహం అంటే కలకాలం కలిసి ఉండడం, ఒకరి కోసం మరొకరు ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడడం. కొన్ని స్నేహాలు అలాగే కనిపిస్తాయి. తీరా లోతుల్లోకి వెళితే... అది ‘కాలపరిమితి’తో కూడిన స్నేహం అని అర్థమవుతుంది. కొందరు ఏదైనా నిర్దిష్టమైన పని కోసం స్నేహితులవుతారు. ఆ సమయంలో వారిని చూస్తే- ‘ఆహా! ఎంత బాగా కలిసిపోయారో!’ అనిపిస్తుంది. కానీ వాళ్లు పని పూర్తయ్యాక ఎవరి దారి వారు చూసుకుంటారు. అలాంటి వారిని ఉద్దేశించి వాడేదే ఈ జాతీయం! ఉమామహేశ్వరుడు, జగన్నాథుడు పేర్ల నుంచి ‘ఉమ్మాయ్’, ‘జగ్గాయ్’ పుట్టుకొచ్చాయి. పురాణాల్లో శివుడు, విష్ణువు... రాక్షసుల పని పట్టడానికి ఏకమవుతారు. పని పూర్తయ్యాక ఎవరి పనిలో వారి పడిపోతారు. అందుకే వారి పేర్ల నుంచి ఈ జాతీయం పుట్టిందంటారు. ఇప్ప పూల వాసన! కొన్ని విషయాలు రహస్యంగా ఉండిపోవు. పైగా కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ప్రతిభ కూడా అంతే. దాచాలని ప్రయత్నించినా, అడ్డుకోవాలనుకున్నా అది ఆగదు. పూల వాసన దాస్తే దాగేది కాదు. ఇప్ప పూల వాసననైతే అస్సలు ఆపలేం. ఆ పూల నుంచి ఘాటైన, మత్తయిన వాసన వస్తుంది. అది చాలా మేరకు విస్తరిస్తుంది. దానినెలాగైతే ఆపలేమో... ఒక వ్యక్తిలో ఉన్న ప్రతిభను కూడా వెలికి రాకుండా ఆపలేం అని చెప్పడమే ఈ జాతీయం ఉద్దేశం. కేవలం ప్రతిభ అనే కాదు... దాగని రహస్యం విషయంలోనూ ఈ ‘ఇప్ప పూల వాసన’ జాతీయాన్ని వాడుతుంటారు. ‘ఈ రహస్యాన్ని ఎక్కువ కాలం దాచలేం, అది ఇప్ప పూల వాసనలాంటిది’ అంటారు. -
తత్వబాదుడు
హ్యూమర్ ప్లస్ జాతి వైరం కూడా మరచి ఒక కుక్క, పిల్లి స్నేహం కలిపాయి. దట్టమైన ఆ స్నేహానికి కారణం పరస్పర గౌరవమే. మియ్యావ్ అనేది శబ్దం కాదని, ఒక నాదమని, అది సరిగమల మిశ్రమమని కుక్క విశ్లేషించేది. భౌభౌ అనే పదంలో భౌతిక సూత్రాలకు అందని భావుకత్వ ఆనందతత్వం వుందని పిల్లి పేర్కొనేది. కూతలో చేతనత్వం, మేతలో అనంత ఆత్మ ప్రబోధం వుందని పసర్పరం సంభాషించుకుంటూ తోకలు పెనవేసుకుంటూ ఉండేవి. పొగుడుకుంటే పోయేదేమీ లేదని సిద్ధాంతీకరించుకుని అన్యోన్యంగా జీవిస్తూ ఉండేవి. సిద్ధాంతం, రాద్ధాంతం, వేదాంతం - ఈ మూడింటివల్లే ప్రపంచం నడుస్తూ వుందని నమ్మిన ఒక యూనివర్సిటీ వాళ్లు పనేమీ లేక ఒక సెమినార్ పెట్టి ఈ స్నేహితులని ఆహ్వానించారు. తత్వబోధన - ఒక వీరబాదుడు అనే అంశంపై వీలైతే క్లుప్తంగా ప్రసంగించమని ప్రాధేయపడ్డారు. మైకుల్ని, ప్రేక్షకుల్ని గజగజ వణికించడం ప్రాసంగిక ధర్మమని తెలిసి కూడా వాళ్లు ఈ కోరిక కోరడంలో వక్తల్లో రౌద్రరసం ఉప్పొంగింది. కుక్క ఆవేశంగా లేచి ఒక మైకు విరగ్గొట్టింది. తరువాత రెండో మైకు అందుకుని ‘‘మైకు విరవడం ప్రజాస్వామ్య ప్రాథమిక లక్షణమని మా మిత్రులు పిల్లిగారు చెపుతుంటారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. నా మిత్రుడి మాటల్లో చెప్పాలంటే తోక వూపడానికి మించిన తత్వశాస్త్రం లేనేలేదు. కుడి, ఎడమలు కాకుండా నిట్టనిలువుగా కూడా తోకను ఊపవచ్చు. ఈ మూడు రకాలు తెలిసినవాడు ముల్లోకాలు జయిస్తాడు. క్లుప్తత అంటే సంక్లిష్టత. అందరూ క్లుప్తతను ఇష్టపడతారు కానీ ఎవడి క్లుప్తత వాడికుంటుంది. క్లుప్తత వల్ల నిర్లిప్తత, నిర్లిప్తత వల్ల నిర్వేదం, దానివల్ల వైరాగ్యం, ఆ తరువాత ఆరోగ్యం సంప్రాప్తిస్తాయి. బోధన, బాదుడు ఈ రెండూ పరస్పర ఆశ్రీతాలు. బాదితేనే బోధన అర్థమయ్యేది. తత్వాన్ని బోధించడం ఎవడివల్లా కాదు. మన తత్వాన్ని ఎదుటివాడు, ఎదుటివాడి తత్వాన్ని మనం అర్థం చేసుకోవడమే బోధన. పాలు దొరికినా దొరక్కపోయినా మా మిత్రుడు మియ్యావ్ అనే అంటాడు. మి అంటే తెలుగులో మీరు అని, ఇంగ్లీష్లో నేను అని అర్థం. సర్వేజనో అనే భావం ఇందులో ఇమిడి ఉంది. రష్యా, చైనా భాషల్లో ఇంకా బోలెడు అర్థాలున్నాయి. అవేవీ మనకు అర్థం కావు. అర్థమైనవాటిని అర్థమయ్యేలా చెప్పడానికే నానా చావు చస్తున్నాం. అర్థంకాని వాటి జోలికి పోకుండా వుండడమే అర్థశాస్త్రం. ఈ విషయం తెలియక కౌటిల్యుడు అనవసరంగా పెద్ద పుస్తకమే రాశాడు. ఎదుటివాడి డబ్బుని లాక్కోవడం, మన డబ్బుని ఎదుటివాడు లాక్కోకుండా కాపాడుకోవడం ఇదే కదా అర్థశాస్త్రం. దీనికి పుస్తకాలు చదవడం దండగని మా మిత్రుడి అభిప్రాయం. ఆయన భావజాలాన్ని నేను ప్రచారం చేసినట్టే నా భావ ఇంద్రజాలాన్ని ఇప్పుడు ఆయన వివరిస్తాడు’’ అని చెప్పింది. పిల్లి లేచి ఒళ్లు విరుచుకుని, తోకని జెండాలా వూపి, మీసాలు సవరించుకుని ‘‘భౌభౌ అంటే భయం లేకుండా భవబంధ సాగరాన్ని ఈదడం. అరవడం, కరవడమే జీవన్ముక్తికి మార్గమని మిత్రుడి ఉపదేశం. మనం కరచినవాళ్లంతా తిరిగి కరుస్తారని, కరవనివాళ్లంతా మనల్ని కరవకుండా వుంటారని అనుకోవడమే భ్రాంతి. పాలగిన్నె, దుడ్డుకర్ర ఈ రెండే నిజాలు. కర్రకు దొరక్కుండా బర్రెపాలు తాగాలి. ఇదే నీతి, నేతి. ఇది తెలియనివాళ్లు నూతిలో కప్పలా మిగిలిపోతారు...’’ సభికుల్లోంచి ఒక కప్ప లేచి ‘‘అయ్యా! నేను బావిలోని కప్పను కాను. బావులన్నీ ఎండిపోయి యాభై ఏళ్లయింది. మీ మిత్రులిద్దరూ ఒకరి డోలు ఇంకొకరితో కొట్టిస్తున్న తీరు అద్భుతం. మీరు మనుషులకి దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ల మనోధర్మ సంగీతాన్ని అనుసరిస్తున్నారు. కానీ పొగడ్డం, పొగిడించుకోవడం చేతకాని నాలాంటి వాళ్ల సంగతేమిటి? బెకబెక శబ్దానికి విలువేలేదా?’’ అని నిలదీసింది. కప్ప మాట్లాడింది సత్యమే అయినా, సత్యం మాట్లాడ్డానికి కప్పని అనర్హురాలిగా ప్రకటించి ‘‘ఆల్ ఫ్రాగ్స్ ఆర్ రోగ్స్’’ అనే సిద్ధాంతాన్ని ఆవిష్కరించి, దాన్ని చైనీస్ కర్రీ సెంటర్కి పార్సిల్ చేసి సభ ముగించారు. - జి.ఆర్. మహర్షి -
మా బ్రేకప్ కలలో కూడా జరగదు!
షారుక్ ఖాన్ అంటే దీపికా పదుకొనేకి ప్రత్యేకమైన అభిమానం. ఆయన హీరోగా రూపొందిన ‘ఓం శాంతి ఓం’ ద్వారానే కథానాయికగా బాలీవుడ్కి పరిచయమయ్యారు దీపిక. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ‘చెన్నై ఎక్స్ప్రెస్’, ‘హ్యాపీ న్యూయర్’ చిత్రాల్లో నటించారు. ఆ విధంగా వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. కానీ, ఇప్పుడా స్నేహం బ్రేకప్ కావడం ఖాయమని బాలీవుడ్వారు అంటున్నారు. దానికి కారణం షారుక్ నటించిన ‘దిల్వాలే’, దీపిక నటించిన ‘బాజీరావ్ మస్తానీ’ ఒకే రోజున విడుదల కానుండటమే. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రాలు విడుదల కానున్నాయి. దాంతో షారుక్, దీపిక మధ్య పోటీ ఉంటుందని, ఇప్పటికే ఈ బ్యూటీ మీద షారుక్ కోపంగా ఉన్నారని వార్త ప్రచారమవుతోంది. ఈ వార్తకు దీపిక స్పందిస్తూ - ‘‘షారుక్కి నాపై కోపమా? వినడానికే హాస్యాస్పదంగా ఉంది. మేమిద్దరం మంచి స్నేహితులం. మా బ్రేకప్ని ఎవరైనా చూడాలంటే అది కలలో కూడా సాధ్యం కాదు. నేను నటించిన సినిమా విడుదల తేదీ నా చేతుల్లో ఉండదు. నిర్మాత ఎప్పుడనుకుంటే అప్పుడు విడుదలవుతుంది. అది షారుక్కి కూడా బాగా తెలుసు. అలాంటప్పుడు నాపైన ఆయనకు కోపం ఎందుకు ఉంటుంది? మా గురించి లేనిపోని వార్తలు ఎన్ని కల్పించినా, మా ఈక్వేషన్ని ఏమీ చేయలేరు’’ అన్నారు. -
కుల వివక్ష వీడిన ఎల్గోయి.. వెలుగోయి
కులం చెదిరింది.. స్నేహం కుదిరింది నాడు కత్తులు దూసిండ్రు.. నేడు మిత్రులవుతుండ్రు ‘సాక్షి’ చిరు ప్రయత్నం.. నేడు గ్రామంలో వివాహం అందరికీ అందిన శుభలేఖలు సంగారెడ్డి: నిండు వేసవిలోనూ నిగనిగలాడే హరిత వనాల్లాంటి చెరుకు తోటలు.. వాటి నడుమ చుట్టూ ఏడూళ్ల శివార్లతో సరిహద్దు.. తెలగ, దళిత, లింగాయత్, బీసీ సబ్బండ జాతులు కలగలిసిన జీవనం.. వ్యవసాయమే జీవితం. రెక్కల కష్టమే జీవనాధారం. బాంధవ్యం, బంధుత్వమే వాళ్ల బలం. అలాంటి పల్లెలో కులం చిచ్చు రేగింది. దళితులు ‘ఆత్మగౌరవం’ కావాలంటే మరో సామాజిక వర్గం ‘అవమానం’గా భావించింది. ఇన్నాళ్లు కలిసి ఉన్న వాళ్లు వైరి వర్గాలయ్యారు. కుల కట్టుబాట్లు పుట్టుకొచ్చాయి. కుల సంఘాలు చొచ్చుకొచ్చాయి. ఠాణా వరకు వెళ్లారు. పచ్చగా బతికిన పల్లె జనం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.. కులం కొలిమిలో మాడుతున్న ఆ పల్లె పేరు ఎల్గోయి. కత్తులు దూసుకున్న ఆ పల్లెలో ఇప్పుడిప్పుడే మళ్లీ పాత స్నేహం చిగురేస్తోంది. మునుపటి ఆప్యాయతను, అనురాగాన్ని పంచుకునేందుకు తొలి అడుగు వేస్తోంది. ఊరి జనం కుల బంధనాల్లోంచి బయటికి రాబోతున్నారు. వైరి వర్గాలను కలపడం కోసం ‘సాక్షి’ ఓ చిరు ప్రయత్నం చేసింది. శనివారం గ్రామంలోని ముఖ్యులను ఒకచోట కలిపింది. పెద్దలంతా కలిసి మనుసు విప్పి మాట్లాడుకున్నారు. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకున్నారు. ‘ఆత్మగౌరవం’ గొప్పతనాన్ని గుర్తించారు.. దళితుల నిర్ణయాన్ని స్వాగతించారు. ఆదివారం జరిగే తన కొడుకు పెళ్లికి రమ్మని కొత్తదొడ్డి రామన్న ఊరు ఊరంతా ‘శుభలేఖ’లు ఇచ్చారు. గతంలో ఇక్కడ ఎస్పీ సుమతి, డీఎస్పీ తిరుపతన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనం కూడా వీరి మైత్రికి తోడ్పడిందనే చెప్పాలి.. ఇదీ నేపధ్యం.. ఎల్గోయి గ్రామానికి చెందిన దళితులు.. సమాధుల కోసం బొందలు తీయడం ఆత్మగౌరవ సమస్యగా మారిందని, ఇకపై శవాలను ఖననం చేయడానికి బొందలు తీయకూడదని తీర్మానించుకున్నారు. దీన్ని అవమానంగా భావించిన కొన్ని సామాజిక వర్గాలు వ్యవసాయ పనుల్లో దళితులను తీసుకోకూడదని, వారిని సాంఘిక బహిష్కరణ చేయాలని ప్రతి తీర్మానం చేశాయి. 15 రోజుల పాటు కట్టుబా ట్లు రాజ్యమేలాయి. అది గొడవలకు దారి తీసింది. క్రమంగా విషయం బయటికి పొక్కడంతో మీడి యా, కుల సంఘాలు దళితులకు అండగా నిలబడ్డా యి. పోలీసులు రంగంలోకి దిగారు. దళితులు తమను వ్యతిరేకించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టారు. కేసు విచారణ దశలో ఉంది. ఎంతో కోల్పోయారు.. పల్లెలో కులం చిచ్చు రేగి నెల గడిచింది. వ్యవసాయ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కట్టుబాట్లతో చెరకు తోటల్లో కలుపుతీత పనులు నిలిచిపోవడంతో కలుపు మొక్కలు పెరిగాయి. ఇక పోలీసుస్టేషన్లు, నేతల రాకపోకలతో ఖర్చేగానీ రూపాయి కూడా ఆదాయం లేకుండా పోయింది. అన్నింటికి మించి పొద్దున లేచింది మొదలు ఇప్పటి దాకా ఒకరి మొఖం ఒకరు చూసుకుంటూ పనుల్లో ఇచ్చిపుచ్చుకుంటూ ఒకే కుటుంబంగా కలసి బతికిన ప్రజలు.. ఇప్పుడు ఎడ ముఖం పెడముఖంగా బతికారు. మనసు మారిందిలా.. నిజానికి ఒక గ్రామ ప్రముఖుని ఇంట్లో నెల కిందట జరిగిన వివాహ మహోత్సవంలో దళితులకు అవమానం జరిగింది. దళితులు వాయించే బాజాభజంత్రీలను తప్పని పరిస్థితుల్లో వెనక్కి పంపించారు. కాలం గడిస్తున్న కొద్ది మిగిలిన సామాజిక వర్గాలు కూడా తమ తప్పును తెలుసుకున్నాయి. దళితుల అభిప్రాయాన్ని గౌరవించాల్సిందేనని, మునుపటిలాగా కలసిమెలిసి ఉండాలనే అభిప్రాయానికి వచ్చాయి. ఇక్కడ ఎస్పీ సుమతి, డీఎస్పీ తిరుపతన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనంతోనే ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో కొత్తదొడ్డి రామన్న తన కొడుకు వివాహానికి ఊరునంతా ఆహ్వానించారు. కుల గొడవలు పక్కనపెట్టి ఇంటింటికి పెళ్లి శుభలేఖలు ఇచ్చారు. సుమారు 2 వేల మందికి భోజన ఏర్పాటు చేస్తున్నారు. ఈ పెళ్లికి తామంతా వెళ్తామని, కులమతాలకు అతీతంగా కొత్త దంపతులను ఆశీర్వదిస్తామని ఎంపీటీసీ మల్లికార్జున్ పటేల్, సర్పంచ్ పెంటయ్య, మాజీ సర్పంచులు బాబూమియా, నర్సింహులు ‘సాక్షి’ ప్రతినిధితో తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. అంతరమే పంచాయితీకి ఓ కారణం గ్రామంలో మొత్తం 120 దళిత కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 22 కుటుంబాలకు అసలు భూమి లేదు. ఒక ఎకరా...అర్ధ ఎకరా భూమి కలిగి ఉన్న వాళ్లు 32 కుటుంబాలు ఉన్నాయి. మరి కొన్ని కుటుంబాలకు ఊరుకు తూర్పు భాగంలో ఉన్న సర్వే నెంబర్ 125, 54 ల్లో దాదాపు 75 మందికి భూములు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదు. పైగా నీళ్లు లేక భూమి సాగుకు అనుకూలంగా లేకపోవడంతో దళితులు వాటిని సాగుచేయడం లేదు. మరో వైపు ఊరు ఉత్తరం దిక్కున ఎక్కువగా ఇతర సామాజిక వర్గానికి చెందిన భూములున్నాయి.ఈ భూముల్లో నీటి సౌకర్యం ఉండటంతో మూడు కాలాల్లో కూడా పంటలు పండుతాయి. వీళ్ల భూముల్లోనే దళితులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. ఉన్నఫలంగా దళితులను వ్యవసాయ పనుల్లోకి రాకుండా అడ్డుకోవడంతో వారు ఇందోళన చెంది తిరుగుబాటు చేశారు. ‘దళితులకు ప్రభుత్వం చెప్పినట్టుగా భూ పంపిణీ చేస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మా పిల్లలకు ప్రభుత్వం ఇతరులతో పాటు ఆర్థిక పరిపుష్టి కల్పించాలి. ప్రభుత్వం చెప్పినట్టు ప్రతి దళితునికి 3 ఎకరాలు ఇచ్చి నీటి వసతి కల్పించాలి’ అని దళిత నాయకుడు తలారి వీరన్న చెప్పడం వారి ఆకాంక్షకు అద్దం పడుతోంది. అభివృద్ధి లేని పల్లె.... పల్లెలో స్వయం జీవన విధానమే కనిపించింది. దాదాపు 2,400 ఓట్లు ఉన్న గ్రామంలో కనీస వసతులు మాత్రం ఏమీ లేవు. 3,500 ఎకరాల సాగు భూమి ఉన్నప్పటికీ సేద్యానికి పనికి వస్తున్నది కేవలం 2వేల ఎకరాలకు మించదు. దళిత, బీసీ కాలనీలు మట్టి రోడ్లతోనే ఉన్నాయి. కొద్దిపాటి చినుకులు రాలినా బజార్లు అన్ని గుంతలు పడి నడవటానికి వీలులేకుండా మారుతాయి. ఎస్సీ కాలనీలో 7,300 మీటర్ల పొడవైన సీసీ రోడ్డు, బీసీ కాలనీలో కనీసం 6వేల మీటర్ల సీసీ రోడ్డు అవసరం ఉన్నాయి. సీసీ రోడ్లు నిర్మించాలని ప్రతిపాదనలు పంపి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆయా ప్రతిపాదనలకు అనుమతి రాలేదు. గ్రామంలో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. ఆర్ఓఆర్ వాట ర్ ఫిల్టర్ యంత్రాలను ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. అనుకోకుండా జరిగిపోయింది తాము అంతా కలసి మెలిసి ఉన్న వాళ్లమే. గ్రామంలో ఎక్కువతక్కువ కులం అనే అభిప్రాయభేదాలు లేవు. మొన్న జరిగిన సంఘటన ఒక పీడకల. అందరం కలసి పోవాలే. ఎప్పటిలాగే అన్ని శుభకార్యాలు కలసే చేసుకోవాలే. - బాబూమియా, మాజీ సర్పంచ్ ఈ నెల రోజులు చాలా కోల్పోయాం ఈ గొడవలతో చాలా కోల్పోయాం. వాళ్లు మేము ఎప్పుడూ ఎదురుపడి గొడవపడింది లేదు. పొలంలో కలుపు పెరిగిపోయింది. ఎన్ఆర్జీఎస్ పనులు ఆగిపోయాయి. ఒక రకంగా గ్రామం అభివృద్ధి ఆగిపోయింది. - జగన్నాథరెడ్డి రైతు నూతన జంటను ఆశీర్వదిస్తాం రామన్న ఇంటి పెళ్లికి మేం అంతా వెళ్తాం. నవ దంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వస్తాం. గతంలో మేం అంతా కలిసి ఉన్న వాళ్లమే. అనుకోకుండా జరిగిన సంఘటన మమ్ములను ఇబ్బంది పెడుతోంది. - మల్లికార్జున్ పటేల్, ఎంపీటీసీ -
నాతో స్నేహం చేస్తావా?
ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. దానికి స్నేహితులు లేరు. ఒకరోజు అది ఎవరితోనైనా స్నేహం చేద్దావునుకుంది. దానికి ఒక కుందేలు కనిపించింది. ‘‘నువ్వు నాతో స్నేహం చేస్తావా?’’ అంటూ కుందేలును అడిగింది ఏనుగు. ‘‘అమ్మో నీతోనా? నువ్వు సరిగా చూసుకోకుండా కాలు వేస్తే నీ కాలి కింద నలిగి చచ్చిపోతా!’’ అంది కుందేలు. ఏనుగు ఒక కోతిని కలుసుకుని తన కోరిక చెప్పింది. ‘‘నేనేమో చెట్లమీద గెంతుతూ ఉంటాను. నువ్వేమో నేల మీద నడుస్తావు. వునకెలా స్నేహం కుదురుతుంది.?’’ అంటూ కిచకిచలాడింది కోతి. ఇంతలో ఒక కప్ప కనిపించడంతో, కనీసం కప్పతోనైనా స్నేహం చేయూలనుకుంది ఏనుగు. దాని కోరిక విని కప్ప- ‘‘నిన్ను చూసి నా స్నేహితులంతా భయుంతో పారిపోతారు. నీతో స్నేహం వద్దు బాబూ’’ అంటూ చెరువులోకి దూకి వెళ్ళిపోరుుంది కప్ప. ఆ తరువాత ఏనుగు చాలా జంతువులను కలుసుకుంది. చివరకు తాబేలును కూడా అడిగింది తనతో స్నేహం చేయువుని. కానీ అన్నీ దాని భారీ ఆకారాన్ని చూసి భయుపడ్డారుు. ఏం చేయూలో పాలుపోక నిరాశగా ఒక చెట్టు కింద నిలబడింది ఏనుగు. ఇంతలో అడవిలోని జంతువులన్నీ ప్రాణభయుంతో పరుగెత్తసాగారుు. ‘‘ఏం జరిగింది? ఎందుకలా పారిపోతున్నారు’’ అంటూ ఒక జింకను ఆపి అడిగింది ఏనుగు. ‘‘పులి... పులి వువ్ముల్ని చంపడానికి వూ వెంట పడింది.’’ వుుందుకు ఉరుకుతూ చెప్పింది జింక. ఏనుగుకు చాలా కోపం వచ్చింది. పులిని వెతుక్కుంటూ వుుందుకు వెళ్ళింది. భీకరంగా గర్జిస్తూ దారిలోనే ఎదురుపడింది పులి. ‘‘నీకు తినడానికి ఈ అవూయుకపు ప్రాణులే దొరికాయూ?’’ దారికి అడ్డంగా నిలబడి అడిగింది ఏనుగు. ‘‘ప్రశ్నించడానికి నువ్వెవరు?’’ గాండ్రించింది పులి. ఏనుగు పులిని ఒక్క తన్ను తన్నింది. పులి ఎగిరి దూరంగా వెళ్ళి పడింది. తర్వాత అవమాన భారంతో అక్కడి నుండి చల్లగా జారుకుంది. పొదల చాటు నుండి ఈ దృశ్యం చూసిన జంతువులు సంతోషంగా చప్పట్లు చరుస్తూ ఏనుగు వుుందుకు వచ్చారుు. ‘‘నీలాంటి మిత్రుడు ఒక్కడుంటే చాలు. నీ వంటి బలశాలి, ధైర్యవంతునితో స్నేహం చేయడం మాకెంతో సంతోషం’’ అంటూ ఏనుగు చుట్టూ జంతువులన్నీ చేరి తవుతో స్నేహం చేయువుని ప్రాధేయుపడ్డారుు. ‘ఒక వుంచిపని ఎంతవుంది స్నేహితులను సంపాదించి పెడుతుందో కదా’ అని ఆనందించింది ఏనుగు. -
అందుకే కట్ చేశా
నటి త్రిషతో స్నేహాన్ని కట్ చేసుకోవడానికి కారణమేమిటన్న ప్రశ్నకు నటి రాయ్లక్ష్మి చెప్పిన బదులేమిటో తెలుసా? అసత్యాలు ఆమెకు నచ్చవట. వీరి సంగతేమిటో చూద్దాం. త్రిష, రాయ్లక్ష్మి ఒకప్పుడు మంచి స్నేహితులు. అలాంటి స్నేహం ఇప్పుడిద్దరి మధ్య లేదట. ఇటీవల సౌకారపేట చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాయ్లక్ష్మి విలేకరులతో ముచ్చటిస్తూ ప్రస్తుతం హాస్యంతో కూడిన హార్రర్ చిత్రాలకు ప్రేక్షకులు నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఈ సౌకారపేట చిత్రం ఆ కోవలోకే వస్తుందని చెప్పారు. అరణ్మణై చిత్రం తరువాత తానీ దెయ్యం ఇతివృత్తంతో కూడిన చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు. మధ్యలో తానెక్కడికో పారిపోయినట్లు బోలెడు కథలల్లేస్తూ ప్రచారం చేశారన్నారు. నిజానికి నచ్చిన పాత్రలు లభించకపోవడంతో దొరికిన ఖాళీ సమయాన్ని న్యూజిల్యాండ్లో స్కై డైయింగ్, స్కూచ్ డైయింగ్ లాంటి క్రీడలో శిక్షణ పొందడానికి వెచ్చించానని వివరించారు. తనకు నటి త్రిష మధ్య కోల్డ్వార్కు కారణం ఏమిటని అడుగుతున్నారన్నారు. నాకు అసత్యాలాడే వారంటే నచ్చరని పేర్కొన్నారు. మొదట్లో త్రిష తాను చాలా ఫ్రెండ్లీగా ఉండేవారమని చెప్పారు. విందులు, వినోదాలకు కలిసే పాల్గొనేవారమని అలాంటి తనతో అబద్దాలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అయితే ఈ విషయమై తాను పూర్వాపరాల జోలికి వెళ్లదలచుకోలేదని రాయ్లక్ష్మి అన్నారు. వాళ్లను ఉరి తీయాలి: ఇంటర్నెట్లో తారల ఫొటోలను మార్ఫింగ్ చేసి బాత్రూమ్ సన్నివేశాలను ప్రచారం చేసే సంస్కృతి అధికం అవుతోందన్నారు. తారపై ద్వేషంతోనే కొందరు ఇలాంటి నీచ కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. తన ఫొటోలతో కూడిన బాత్రూమ్ సన్నివేశాలు ఇటీవల ఇంటర్నెట్లో హల్ చల్చేశాయన్నారు. ఇలాంటి వారిని ఊరికే వదిలేయకూడదని, ఇంకా చెప్పాలంటే బతకనీయరాదని అన్నారు. దుబాయ్లోని చట్టాలను తీసుకొచ్చి వారిని ఉరేయాలని రాయ్లక్ష్మి మండిపడ్డారు. -
ఎట్‘లాస్ట్’!
ఫ్రెండ్షిప్ ప్రేమగా మారి... డేటింగ్షిప్కు గ్రీన్ సిగ్నల్ వేసి... ఫియాన్స్ మ్యాంగనీలోతో తెగ తిరిగేస్తున్న హాలీవుడ్ తార సోఫియా వెర్గారా ఎట్టకేలకు వెడ్డింగ్ బెల్ మోగించింది. త్వరలోనే తమ ప్రేమ పెళ్లిగా మారబోతోందని... డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందని ఎంతో సంతోషంగా చెప్పిందీ చిన్నది. ప్రస్తుతం పాపులర్ టీవీ షో ‘మోడ్రన్ ఫ్యామిలీ’తో బిజీగా ఉన్న సోఫియా... పెళ్లి తంతుకు సంబంధించి ఇంకా ప్లానింగ్ జరగలేదని చెప్పింది. 38 ఏళ్ల నటుడు మ్యాంగనీని తన జీవిత భాగస్వామి అయ్యే రోజు కోసం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నానందీ 42 ఏళ్ల నటి. తన జీవితంలో ఇంతకంటే ముఖ్యమైన ఘట్టం మరోటి లేదంటూ మురిసిపోతోంది. -
అప్పట్నుంచీ అబ్బాయిలతో స్నేహమంటే ఆలోచిస్తున్నా!
అబ్బాయి, అమ్మాయి స్నేహితులుగా ఉండకూడదా? ఒకప్పుడైతే ఇదో పెద్ద వింత. కానీ, ఇప్పుడు ఆడా, మగా స్నేహితులుగా ఉంటే పెద్దగా తప్పుపట్టడంలేదు. కానీ, ఆ స్నేహితుడు హఠాత్తుగా ‘ఐ లవ్ యు’ చెప్పాడనుకోండి.. అప్పుడు అమ్మాయి ఇరుకుల్లో పడిపోతుంది. గతంలో ప్రియాంకా చోప్రాకి అలానే జరిగిందట. ఇటీవల ఓ సందర్భంలో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ - ‘‘ఇది నేను సినిమాల్లోకి రాకముందు జరిగిన సంఘటన. నేనూ, ఒక అబ్బాయి చాలా స్నేహంగా ఉండేవాళ్లం. తనలో నేను మంచి స్నేహితుణ్ణి చూసుకుంటే, తను మాత్రం నన్నో ప్రేయసిగా చూశాడు. కానీ, ఆ విషయాన్ని నేను గ్రహించలేదు. ఓ రోజు తన ప్రేమను నా దగ్గర వ్యక్తపరిస్తే, నేను షాకయ్యాను. అలాంటి సంఘటనలను ఎదుర్కోవడం అంత సులువు కాదు. నేను చాలా బాధపడ్డాను. ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోతున్నాననే బాధ అది. అతనితో జీవితాంతం స్నేహంగా ఉండాలనుకున్నాను. కానీ, ఎప్పుడైతే అతని ప్రేమను తిరస్కరించానో నాకు దూరమయ్యాడు. అప్పట్నుంచీ అబ్బాయిలతో స్నేహం అంటే ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకుంటున్నాను’’ అని చెప్పారు. -
శునకం, వానరంల బంధమిది..!
-
స్నేహానికి గౌరవాన్నిచ్చే నన్భేండా
సృష్టిలో తీయనిది స్నేహం అంటారు. మరి ప్రేమా? ఈ రెండింటినీ చర్చించే చిత్రమే నన్భేండా. నటుడు ఉదయనిధి స్టాలిన్ నాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇంతకుముందు ఇదు కదిర్వేలన్ కాదల్ చిత్రం ఉదయనిధితో రొమాన్స్ చేసిన నయనతార ఈ చిత్రంలోనూ ఆయనతో జత కట్టారు. ఎం.రాజేష్ శిష్యుడు ఏ.రాజేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడితో చిన్న భేటీ... ప్ర: నన్భేండా చిత్ర కథేంటి? జ: జీవితంలో స్నేహం మాత్రం చాలా ముఖ్యమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్నేహం గౌరవాన్ని పెంచే చిత్రమే నన్భేండా. ఇదిచక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రేమ ముఖ్యమా? స్నేహం ముఖ్యమా? అన్న విషయం గురించి ఎలాంటి చర్చ అవసరం లేదు. రెండింటిలోనూ రెండు ఉంటాయి. రెండూ ముఖ్యమే అని చెప్పే చిత్రం నన్భేండా. ప్ర: ఉదయనిధి స్టాలిన్, నయనతారల నటన గురించి? జ: ఇదు కదిర్ వేలన్ కాదల్ చిత్రం తరువాత ఉదయనిధి స్టాలిన్, నయనతారలు మరోసారి కలసి నటిస్తున్న చిత్రం నన్భేండా. ఇందులో వీరి మధ్య కెమిస్ట్రీ ఎంతగా వర్కౌట్ అయ్యిందంటే చిత్రం చూస్తే మీకే అర్థమవుతుంది. చిత్రం ఆద్యంతం నటనలో విజృంభించారు. షాయాజి షిండే, శ్రీరంజనిల కొడుకుగా జీవితం గురించి ఎలాంటి చింతా పడని పాత్రలో ఉదయనిధి స్టాలిన్ నటించారు. ఆయన మాత్రమే నప్పే పాత్ర అది. ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించగల బుద్ధి శాలి. ఇక నయనతార పూర్తి నిడివిగల పాత్రలో నటించారు. ఒక బ్యాంకులో పనిచేసే యువతి పాత్ర. ఆమె తల్లిదండ్రులు చిత్రంలో చూపించకపోయినా ఫొటోల్లో కనిపిస్తుంటారు. వారెవరన్నది సస్పెన్స్. ప్ర: మరి సంతానం మాటేమిటి? జ: ఉదయనిధి స్టాలిన్ పాత్రకు పూర్తి విరుద్దమైన పాత్రలో సంతానాన్ని చూస్తారు. వినోదాన్ని పండించడంలో విరగదీశారు. ఏ విషయాన్నైనా శాస్త్రవేత్త మాదిరి పూర్తిగా పరిశోధించి పరిష్కరించే వ్యక్తిత్వం. తను సీరియస్గా చేసే విషయాలన్నీ ఆడియన్స్ను కడుపుబ్బా నవ్విస్తాయి. ప్ర: చిత్రంలో నటి తమన్న కూడా ఉన్నారట? జ: అది సస్పెన్స్ పాత్ర. అయితే చాలా ముఖ్యమైన పా త్ర. తమన్నతో పాటు షెరిన్, శుసన్తదితరులుముఖ్యపాత్రలు పోషించారు. షెరిన్ ప్రతినాయకి పాత్ర లో నటించారు. కొంచెం గ్యాప్ తరువాత వస్తున్న ఆమెకీ పాత్ర పేరు తెచ్చిపెడుతుంది. కరుణాకరన్, నాన్ కడవుల్ రాజేంద్రన్, మొదలగు వారు వారి పాత్రలకు న్యాయం చేశారు. ప్ర: హరీష్జయకుమార్ సంగీతం గురించి? జ: ప్రేమ కథా చిత్రాలకు పెట్టింది పేరు హరీష్జయరాజ్. ఈ చిత్రం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చాలామంది సం గీతాన్ని అందించారు. చిత్రంలో ఆరు పాటలు ఉన్నాయి. అన్ని పాటలు విజువల్గాను కనువిందు చేస్తాయి. ప్ర: చిత్రంలో పంచ్ డైలాగ్స్ ఉంటాయట? జ: ఉదయనిధిస్టాలిన్, సంతానం నటిస్తున్నారంటే ఆ చిత్రం గురించి అభిమానులు చాలా ఊహించుకుంటారు. అందువలన చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక్కో పంచ్ డైలాగ్స్ పేలేలా రూపొందించాం. చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా విడుదలకు అన్ని విధాలుగా సన్నాహాలు చేస్తున్నాం. -
అవినీతి పోలీసుల చేతివాటం..!
సాక్షి, గుంటూరు: కంచే చేను మేసిన చందంగా రక్షణగా నిలవాల్సిన పోలీసులే బాధితుల సొమ్ము నొక్కేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా దొంగలతో దోస్తీ చేస్తున్నారు. దొంగలు దోచుకుపోయారంటూ పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్న పౌరులకు రిక్త హస్తం చూపుతున్నారు. అవినీతి పోలీసు అధికారుల బండారాలు జిల్లాలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, బంగారం రికవరీ కేసులో పోలీసులే రూ. 50 వేలు లంచం తీసుకుని నిందితుడిని వదిలేసిన సంఘటన బయట పడింది. పాత గుంటూరు అంబేద్కర్ నగర్కు చెందిన బొర్రా వీరేశ్వరరావు అనే పత్తి కంపెనీ కూలీ ఇంట్లో 2013 మార్చిలో దొంగతనం జరిగింది. సుమారు 70 గ్రాముల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడు లబోదిబోమంటూ పాతగుంటూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా నంబరు 67/2014తో కేసు నమోదు చేశారు. ఇది జరిగిన పది రోజుల వ్యవధిలో పెదకాకాని పోలీసులు ఓ దొంగను పట్టుకుని విచారించగా పాతగుంటూరులో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో దొంగను అప్పగించడంతో పాతగుంటూరు పోలీసులు విచారణ చేపట్టారు. అంబేద్కర్నగర్లో దొంగిలించిన బంగారాన్ని గుంటూరులో శ్రీనివాసరావు అనే వ్యక్తికి విక్రయించినట్టు తేలింది. ఈ విషయం బయటకు పొక్కడంతో శ్రీనివాసరావు పరారయ్యాడు. దీంతో పోలీసులు దొంగను మాత్రమే కోర్టులో హాజరుపర్చారు. ఆ తరువాత రెండు నెలలకు శ్రీనివాసరావును పట్టుకున్న పోలీసులు బంగారం రికవరీ చేయకుండా రూ. 50 వేలు లంచం తీసుకుని వదిలేశారు. ఈ కేసులో బాధితుడు బొర్రా వీరేశ్వరరావు రెండు రోజుల క్రితం అర్బన్ ఎస్పీ రాజేష్కుమార్ను కలవడంతో ఈ విషయం బయటపడింది. దీంతో పోలీసులు శ్రీనివాసరావును కలవడంతో తన వద్ద రూ. 50 వేలు కాజేసి తిరిగి బంగారం అడగడమేంటని, ఇలాగైతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు తెలిసింది. దీంతో ఆత్మరక్షణలో పడ్డ ఓ సీఐ పంచాయితీ పెట్టి బాధితుని బంగారం వెనక్కు తెప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఎస్పీ రాజేష్కుమార్ను ‘సాక్షి’ వివరణ కోరగా ఇలాంటి సంఘటనలు తన దృష్టికి వచ్చాయని విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొన్న ఎస్ఐ, నిన్న డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నేడు మరో సీఐ.. గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో పోలీసులు దొంగల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని నొక్కేసిన సంఘటనలు వరుసగా మూడు వెలుగులోకి వచ్చాయి. మొన్న గుంటూరు రూరల్ సీసీఎస్ పోలీసులు ఓ దొంగను పట్టుకుని విచారించగా తన వద్ద ఓ ఎస్ఐ 200 గ్రాముల బంగారం రికవరీ చేసి కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే దొరికినట్టు చూపారని చెప్పాడు. విచారించగా అది నిజమని తేలింది. ఆ ఎస్ఐ అర్బన్ పరిధిలో ఉండటంతో అవాక్కైన సీసీఎస్ పోలీసులు అర్బన్ ఎస్పీ రాజేష్కుమార్కు సమాచారం ఇచ్చారు. మరో సంఘటనలో.. ఓ కేసులో దొంగను పట్టుకుని డీఎస్పీ, ఇద్దరు సీఐలు విచారించగా 250 గ్రాముల బంగారం రికవరీ అయింది. అయితే వీరు ముగ్గురూ కూడబలుక్కుని ఆ బంగారాన్ని నొక్కేశారు. ఇటీవల కాకినాడ సీసీఎస్ పోలీసులకు దొరికిన ఆ దొంగ ఈ విషయాన్ని బయటపెట్టడంతో అదికాస్తా అర్బన్ ఎస్పీ దృష్టికి వెళ్లింది. దీనిపైన ఆయన విచారణకు ఆదేశించారు. తాజాగా పాతగుంటూరు పోలీస్స్టేషన్ పరిధిలో బంగారం రికవరీ చేయకుండా రూ. 50 వేలు కాజేసిన వైనం వెలుగులోకి వచ్చింది. విచిత్రమేమిటంటే ఈ మూడు సంఘటనలూ పాతగుంటూరు పోలీస్టేషన్తో సంబంధం ఉన్న కేసులు కావడం గమనార్హం. -
స్పృహ తప్పిన నేస్తాన్ని.. బ్రతికించుకుందిలా..!!
-
హైడొలైట్
కేరళ వాసి సి.ఎస్.మనోజ్, తమిళనాడు వాసి కెప్టెన్ ఆనంద్లకు సిటీకి చెందిన ఎ.వి.రామకృష్ణతో స్నేహం. ఇతర రాష్ట్రాలవారైనా చాలా కాలంగా ఇక్కడే స్థిరపడిన వీరికి ఈ నగరంలోని అణువణువుతో పరిచయముంది. ‘‘ ఈ సిటీపై అభిమానమే సిటీ కోసం ఒక ఆర్ట్ ఫెస్టివల్ను నిర్వహించాలనే ప్రేరణ ఇచ్చింది. మరెందరినో ఈ సిటీకి అభిమానులుగా మార్చాలనిపించింది. అందుకు తగ్గట్టుగానే దీనికి హైదరాబాద్, ఫేవరెట్ కలిపి ‘హైడొరైట్’గా పేరు పెట్టాం’’ అంటూ చెప్పారు ఆనంద్. ఇది లాంగెస్ట్ ఫెస్ట్. ఈ స్థాయిలో 100 రోజుల ఫెస్టివల్ ప్రపంచంలోనే లేదు. దీని గురించి మాట్లాడుతూ ‘‘ఈ ఆలోచన చెప్పినప్పుడు చాలా మంది అసాధ్యం అన్నారు. అయితే మేం రెండు సీజన్లను విజయవంతం చేశాం. 3వ సీజన్లోకి అడుగుపెట్టాం’’ అంటూ సంతోషంగా చెప్పారు మనోజ్. చేదు అనుభవాలూ ఉన్నాయి... ఒక నగరంలో విభిన్న వేదికలపై 100 రోజుల ఆర్ట్ ఫెస్ట్ అంటే చాలా పెద్ద కార్యక్రమం. అత్యంత వ్యయప్రయాసలు దీనిలో ఇమిడి ఉన్నాయి. ‘‘మేమంతా మధ్యతరగతి వాళ్లమే. అయితే మాకున్న పరిచయాలు, మాలాగే చాలా మందిలో సిటీ అంటే ఉన్న అభిమానం... వీటినే నమ్ముకుని ముందడుగు వేశాం’’ అంటూ చెప్పిన ప్రిస్మ్ మేగ్జైన్ వ్యవస్థాపకులు ఎ.వి.రామకృష్ణ... తమకు తగిలిన ఎదురు దెబ్బల గురించి చెబుతూ ‘‘తొలి ఏడాదే వాతావరణం అనుకూలించని కారణంగా శివమణి ఈవెంట్ రద్దు కావడం లాంటి పెద్ద సమస్యలతో పాటు చిన్నా చితకా ఎదురు దెబ్బలూ తక్కువేం లేవు. అయితే సీజన్ సీజన్కి పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్, పెరుగుతున్న స్పాన్సరర్ల మద్ధతు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైదరాబాద్ అభిమానుల అభినందనలు... అవన్నీ మరచిపోయేలా చేస్తున్నాయి’’ అంటారు. ఈ ఏడాది అన్నీ ప్రత్యేకమే... తెలంగాణ ఏర్పడ్డాక జరుగుతున్న తొలి అతిపెద్ద ఆర్ట్ ఫెస్టివల్ ఇది. అంతేకాకుండా 52 వారాల పాటు నిర్వహిస్తున్న హ్యాపెనింగ్ హైదరాబాద్లోనూ ఇది భాగం. ‘‘ హ్యాపెనింగ్ హైదరాబాద్లో మా కార్యక్రమమే మేజర్ పార్ట్ పోషిస్తోంది. ఈసారి ప్రభుత్వం కూడా మాకు మద్ధతుగా నిలిచి పలు వేదికల్ని ఉచితంగా అందిస్తూ ప్రోత్సహిస్తోంది’’ అంటూ రామకృష్ణ చెప్పారు. వారాంతాల్లో జరిగే 14 ఈవెంట్లలో పాల్గొనేందుకు అతిరథ మహారథులు అనదగ్గ కళాకారులు విభిన్న ప్రాంతాల నుంచి వస్తున్నారు. ప్రేక్షకుల్ని సైతం పార్టిసిపేట్ చేసేలా సాగే ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ఈవె ంట్లన్నింటికీ ఫ్రీ ఎంట్రీ. ‘‘ఇచ్చిన పాసుల తప్పనిసరిగా వినియోగించుకోవాలి. లేదా తిరిగి అప్పజెప్పాలి అనేది మా నిబంధన. ఎందుకంటే ఉచితం కాబట్టి తీసేసుకుని వాటిని నిరుపయోగం చేయకూడదని మా ఆలోచన’’ అన్నారు మనోజ్. స్పెయిన్లోని లా టొమాటినా ఫెస్టివల్లా, బెల్జియంలోని టుమారో ల్యాండ్ ఈవెంట్లను మించి హైడొరైట్ పాప్యులర్ కావాలని, మా తర్వాత కూడా చిరస్థాయిగా కొనసాగాలని కోరుకుంటున్న ఈ మిత్రత్రయం... ఈ ఏడాది నుంచి దీన్ని ఒక పూర్తిస్థాయి ట్రస్ట్గా మారుస్తున్నామని చెప్పారు. అలాగే ఒక పూర్తిస్థాయి కల్చరల్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రతిభావంతులైన యువతకు అవకాశాలు కల్పించనున్నామన్నారు. వీరి కల సాకారమై, న‘వన’గరంలో మరెన్నో కళా సుమాలు పరిఢవిల్లేందుకు కారణం కావాలని కళాభిమానులు కోరుకుంటున్నారు. హైదరాబాద్... జిందాబాద్. ..:: ఎస్.సత్యబాబు -
ఏం చేస్తే తను మారుతుంది?
వేదిక స్నేహమనేది ఎప్పుడూ నిన్ను ఒక వ్యక్తిగా నిలబెట్టాలి తప్ప, తప్పు దోవలో నడిపించకూడదు. అలా నడిపిస్తే అది నిజమైన స్నేహమే కాదని నా స్థిరమైన అభిప్రాయం. ఆ అభిప్రాయమే నన్ను, రమ్యను దూరం చేసిందనుకుంటా. నేను, రమ్య ఎంత మంచి స్నేహితులమంటే... ఎక్కడికైనా ఇద్దరం కలిసే వెళ్లేవాళ్లం. ఒకే స్కూలు, ఒకే ట్యూషను, ఒకే కాలేజీ... మా స్నేహాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. కొందరు అసూయ కూడా పడేవారు. అలాంటి మా మధ్య దూరం పెరుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. చదువులు పూర్తయ్యాక ఇద్దరం ఒకేసంస్థలో ఉద్యోగాలు సంపాదించాం. కొన్నాళ్లపాటు బాగానే గడిచింది. కానీ రోజులు గడిచేకొద్దీ రమ్యలో ఏదో మార్పు. తనకి కొత్త ఫ్రెండ్స్ వచ్చారు. దానివల్ల నాకు ఇబ్బంది లేదు. కానీ తన స్నేహాలు సరిగ్గా లేకపోవడమే నన్ను బాధించింది. ఎటువంటి కమిట్మెంట్స్, సిన్సియారిటీ లేని మనుషులతో తిరుగుతూ తను కూడా వాళ్లలా తయారవడం మొదలుపెట్టింది రమ్య. అది నాకు నచ్చలేదు. చాలాసార్లు వారించాను. పనిని నిర్లక్ష్యం చేయవద్దని చెప్పాను. కానీ తను వినలేదు. పైగా నా పోరు పడలేక నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టింది. దీనికితోడు తనను నిస్వార్థంగా, నిష్కల్మషంగా అభిమానించిన నాకు అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టింది రమ్య. తనని ఏమీ అనలేకపోయేదాన్ని. అలాగని తనను సపోర్ట్ చేయలేను. ఎందుకంటే, తను వెళ్తోన్న దారి తప్పని నాకు తెలుసు కాబట్టి. తన ప్రవర్తన కారణంగా తను కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు నేను తనని వెనకేసుకుని రాలేకపోయాను. నువ్వలా చేసివుండకపోతే ఈ పరిస్థితి వచ్చి వుండేది కాదు కదా అన్నాను. ఆ మాటని తను తప్పుగా అర్థం చేసుకుంది. నేను తనని దూరం పెడుతున్నానని అనుకుంది. తనే నాకు దూరంగా వెళ్లిపోయింది. నిజానికి ఆ దూరం తను కోరుకుంది. కానీ అది నన్ను మాత్రం చాలా బాధించింది. ఆ విషయం ఎలా చెబితే రమ్యకి అర్థమవుతుంది! ఏం చేస్తే తను మారుతుంది! కనీసం మీరైనా చెప్పరూ! - వందన, రాయచూర్ -
కలలో చిలుకా... కాస్త చెప్పవా!
స్వప్నలిపి చిలకది చూడచక్కని రూపం. ఏ చెట్టుపైనో చిలకను చూసీ చూడగానే ‘ఆహా’ అనుకుంటాం. మరి కలలో కనిపిస్తే? ‘ఆహా’ అనడం మాట అలా ఉంచి, కాస్త ఆలోచించాల్సిందే అంటున్నారు స్వప్నవిశ్లేషకులు. వారి విశ్లేషణల్లో కొన్ని... చిలక మీ కలలో కనిపించింది అంటే, మీరు చేయకూడని వారితో స్నేహం చేస్తున్నారని అర్థం. చిలక ఈకలు కలలో కనిపించడం అనేది... మీకు ఉన్న స్నేహితులలో బూటకపు స్నేహితులు, పక్కదారి పట్టించే స్నేహితులు ఎక్కువ ఉన్నారనేదాన్ని ప్రతిబింబిస్తుంది. ‘పంజరంలో చిలక’ కలలో కనిపిస్తే ... మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని పక్కదోవ పట్టిస్తున్నాయని లేదా ఊపిరి సలపని పనితో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అర్థం. చిలక మిమ్మల్ని కొరికినట్లు కల వస్తే... మిమ్మల్ని చూసి కొందరు ఈర్ష్యపడుతున్నారని అర్థం. వేరే వాళ్లను చిలక కొరికినట్లు కల వస్తే... ఏదో విషయంలో ఆ వ్యక్తిని మీరు అప్రతిష్ఠపాలు చేస్తున్నట్లు అర్థం. రెక్కలు దెబ్బతిన్న చిలక... ఎగరలేక ఇబ్బంది పడుతున్న దృశ్యం మీ కలలోకి వస్తే, మీరు మార్పు కోరుకుంటున్నప్పటికీ, ఆ మార్పుకు అవసరమైన పరిస్థితులు మీకు అనుకూలంగా లేవని అర్థం. ఏం మాట్లాడినా...వల్లె వేసే చిలక కలలోకి వస్తే... మీకంటూ సొంత అభిప్రాయం లేకుండా ఉన్నారని, ఎవరు ఏది చెప్పినా దాన్ని గుడ్డిగా సమర్థించడం తప్ప, వాస్తవ ప్రాతిపాదికగా మీరు అభిప్రాయ ప్రకటన చేయడం లేదని అర్థం చేసుకోవాలి. చేతిపైన చిలక వచ్చి కూర్చున్నట్లు యువతులకు కల వస్తే వారి ప్రేమ ఫలించడానికి సూచనగా అర్థం చేసుకోవాలి. -
‘దిక్కులు చూడకు రామయ్య’ ఆడియో
-
రాజమౌళిని ఒరే పొట్టోడా...
ప్రముఖ దర్శకుడు రాజమౌళిని పొట్టోడా అని పిలిచే గట్స్ ఎవరికైనా ఉన్నాయా?... అవును ఉన్నాయట... అయితే అది ఒకప్పుటి మాట. ఇప్పుడు మాత్రం మౌళి గారూ అంటూ గౌరవంగా పిలుస్తాడు. ఈ విషయాన్ని రాజమౌళే స్వయంగా 'దిక్కులు చూడకు రామయ్య' ఆడియో వేడుకలో చెప్పారు. ఆ చిత్ర దర్శకుడు త్రికోటి గురించి రాజమౌళి డిటైల్డ్గా వివరించారు. దర్శకుడు క్రాంతికుమార్ దగ్గర తాను అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసేవాడినని, అక్కడ కోటి తనకన్నాసీనియర్ అని చెప్పారు. కోటి సినిమా పిచ్చోడని... సాధారణంగా కాస్త ఎక్కువ సినిమాలు చూసేవాడినే సినిమా పిచ్చోడు అంటాం గానీ, కోటి లాంటి సినిమా పిచ్చోడిని తన జీవితంలో చూడలేదని చెప్పారు. చేతిలో డబ్బులున్నా లేకపోయినా... తినడానికి తిండి లేకున్నా కోటి సినిమా చూడాల్సిందే. పది రూపాయలు చేతిలో ఉంటే మనం ఆకలిగా ఉంటే ఏదైనా తింటామని, అయితే కోటి మాత్రం ఎంత దూరమైనా నడిచి వెళ్లి ప్రతిరోజూ సెకండ్ షో చూస్తాడన్నారు. హైదారాబాద్లో షూటింగ్ అయిపోయిన తర్వాత... అమీర్పేటలోని శేష్మహల్ థియేటర్లో పాత సినిమాలకు ఇద్దరం వెళ్లేవాళ్లమని చెప్పారు. సినిమా చూసి తిరిగి వస్తూ ఒరే పొట్టోడా ఆ సినిమాలో.... ఆ సీను... అనేవాడని... తాను హైట్గా ఉన్నా పొట్టోడా అని ఎందుకు పిలుస్తున్నారని అడిగితే... పొట్టోడా అంటే చిన్నోడురా... అని కోటి చెప్పారట. తనకు సీనియర్గా ఉన్నప్పుడు ఏరా, ఒరే, పొట్టోడా అని పిలిచినా, తన దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా పని చేసేందుకు వస్తానన్నప్పుడు... ఏ మౌళీ... ఏ మౌళీ అని పిలిచేవాడని... సీన్ కట్ చేస్తే ఇప్పుడు సార్ అని పిలుస్తున్నాడని రాజమౌళి చెప్పాడు. కోటి సీనియర్, తాను జూనియర్ని అంటూ జక్కన్న తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పారు. త్రికోటికి ఐదుసార్లు దర్శకుడిగా చేసే అవకాశం వచ్చి చివరి నిమిషంలో చేజారిపోయినా నిరుత్సాహపడలేదని.... ఇప్పటికీ అదే ఉత్సాహంతో ఉన్నాడని రాజమౌళి తెలిపారు. కోటి పెద్ద దర్శకుడు కావాలని, దిక్కులు చూడకు రామయ్యా చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. -
కోతి మావా.. ఇలా రా.. నీకో సీక్రెట్ చెబుతా..
జాతి వైరం మనకొద్దు.. స్నేహమే ముద్దు అంటున్నాయి ఈ జంతువులు. సాధారణంగా కోతి, కుక్క ఒకేచోట ఉండవు. కుక్క కనిపిస్తే కోతి ఆ పరిసరాల్లో ఉండదు. అటువంటిది నల్లజర్ల జంక్షన్లో ఓ కోతి, కుక్క రెండూ ఆటలాడుకుంటూ గురువారం ఇలా కెమెరాకు చిక్కాయి. వాటిని చూసిన స్థానికులు ఔరా అంటూ ఆశ్చర్యపోయారు. -
తర్పణ
కథ ‘‘హృదయ విదారకమైన దుర్ఘటన! నిశ్చేష్టుడయ్యాడు! కానిదెవరు చెప్పు. కాలేదు అంటే మనసు లేనట్లే! మనిషి కానట్లే! వాడే కోలుకుంటాడు. మృత ప్రాణాల్ని విద్యావస్తువులుగా చూసినవాడు. యింకో రెండేళ్లలో డాక్టర్ దినకర్ అవుతాడు. నీ ఆలోచనకు దూరమైన దాన్నేదో చిత్రించుకుని కలవరపడకు.’’ సుమరశ్మి మనసులో ప్రశాంతత చేకూరడానికి ముందుగా ఆ మాటలు అన్నాడు భర్త భేషజంతో ఉదయార్క. ‘‘కాలేజీకి వెళ్లడం లేదు. ముఖంలో తేజస్సు మారింది. పరిస్థితి చేయి దాటకుండా చూడండి. మీ తెలివితో నా నోరు ఇప్పుడు మాత్రం మూసేయకండి’’ వేదనలో కూడా భర్త నైజానికి ఓ చురక వేసి, ఉపశమనంగా భర్త భుజాన్ని తలతో నిమిరింది సుమరశ్మి. భార్య పరిశీలనే తనూ గమనించాడు కొడుకులో. సంగతేంటని కొడుకునే అడగొచ్చు. కొడుకుతో స్నేహితుడిలా మాట్లాడిన సందర్భాలున్నాయి. పూర్తి స్నేహ వాతావరణానికి మానసిక అసౌకర్యం తావివ్వలేదు. దినకర్ కూడా గీతదాటి చనువు తీసుకోలేదు. జనన సున్నితత్వాలను ఇద్దరూ గౌరవించారు, సహజ ప్రేమ పలచబడకుండా. ఆలోచన, ఆచరణ, లక్ష్యంపై దృష్టి వంటి అంశాల్లో దినకర్ ఓ సంపూర్ణతకు చేరాడనే తృప్తి తనకు ఎప్పుడో కలిగింది, జన్మనిచ్చినందుకు సాఫల్యతగా! ‘‘అదీగాక వాడి మనసుకేమన్నా గాయమైందా?’’ ఆలోచన ఆపి అన్నాడు. ‘‘అవకాశం లేదండీ. తీర్థ విషయంలో వాడి ఇష్టాన్నే సమ్మతించాం. తీర్థ తండ్రి మనల్ని అవమానించిన సంఘటనని మీరే చిరునవ్వుతో తుడి చేశారు...’’ ఓ పద్ధతిలో మాట్లాడుతున్నానో లేదో అని క్షణ మౌనాన్ని ఆశ్రయించింది సుమరశ్మి. ‘‘అప్పుడు కుంభకోణం బడి మంటల్లో చిన్నపిల్లలు బూడిదయ్యారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. వాడి కళ్లు వాడే తుడుచుకున్నాడు. చదువుపై ఏకాగ్రతను సడలనివ్వలేదు. అంతకుముందు, ఆ తర్వాత! ఎన్ని ఘోరాలు వినలేదు మనం, ఏవో ఎక్కడో జరిగాయి అని ఎప్పుడూ అనుకోలేదు. వాడి అనుభవంలో వాడే ఎన్నో చూశాడు. నీ అభిమాన నటి సౌందర్య జీవితం అలా ముగిసిపోయినప్పుడు వాడే కదా నిన్ను ఓదార్చింది. అంతగా మనసెదిగినవాడు ఈ విషాదానికి అంత తీవ్రమైన ఉద్వేగానికి ఎందుకు లోనయ్యాడో అర్థం కావట్లేదు. అవునూ, వాడి గురించి స్నేహితులేమంటున్నారు...’’ శూన్యంలో దినకర్ స్నేహితుల పలకరింపులు ఊహిస్తూ ఆగిపోయాడు ఉదయార్క. స్నేహం మాట వచ్చేసరికి - ‘‘అదే! ఓ విధంగా ఆ జలహంతకితో చేయి కలిపిందేమోనండి. చావు పరుగులెత్తుతూ మీద పడబోతున్నా వాళ్లకు చూపు లేకుండా చేసింది, స్నేహం ఇచ్చిన మూర్ఖ ధైర్యం, ఆ క్షణంలో! దానికి ముందు, బస్సులో ఆ స్నేహం ఆనందాల్ని చూడండి, ఆ పాటల్ని చూడండి, ఆ కేరింతల్ని చూడండి’’ అంటూ సెల్లులో వీడియో నొక్కింది. పెల్లుబికి వస్తున్న కన్నీళ్లను అసంకల్పితంగా కూడా ఆపడానికి ప్రయత్నించకుండా, సంస్కారానికి రవంత కూడా మచ్చ పడకుండా - తనే తట్టుకోలేకపోతున్నది... ఆ కన్నతల్లులు, తండ్రులు ఎలా ఉన్నారో అని తలుచుకుని విలపిస్తూ. ఉచ్ఛ్వాస, నిశ్వాసలతో తప్ప శరీరంలో ఏ కదలికలు లేని మానసిక స్థితిలో ఉన్నట్లుగా ఉన్నాడు దినకర్. స్నేహితులొచ్చి బయటికి తీసుకెళ్లారు. వాళ్లూ కాబోయే డాక్టర్లే. ఏ విషయాన్ని ప్రస్తావించినా నిస్పందనగా ఉన్నాడు. దినకర్ మనసుని మాటగా మార్చడానికి వాళ్లు మాటలు వెతుకుతున్నారు. దినకర్ కోసం వస్తున్న తీర్థ దార్లో వాళ్లని చూసి కారాపింది. తీర్థ పలకరించినప్పుడు దినకర్ని నిశితంగా చూశారు స్నేహితులు. దినకర్ ప్రవర్తనపై తమకు సరైన అవగాహన కలగాలనే ఉద్దేశంతో. ‘‘తీర్థా! వాడికి జన జీవన వేగాన్ని చూపించి నోరు పెగిలేట్లు చేయి. మనిషికీ జంతువుకీ మాటే తేడా అన్నారు. మాట పోతే వీడేమవుతాడో. ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్ని వెనక్కు తిప్పి రాయాల్సి వస్తుందేమో’’ అన్నాడో స్నేహితుడు నవ్వుతూ, నవ్వుని ఆశిస్తూ. తీర్థ కూడా నవ్వింది. దినకర్ ముఖంలో ఏ కణమూ చలించలేదు. లిప్తపాటు కలవరపడింది తీర్థ. తీర్థ పక్కన దినకర్ని ఓ బొమ్మలా కూర్చోబెట్టారు స్నేహితులు. సముద్రపు ఒడ్డు. అంతా అణుమయమని సందేశాన్నిస్తున్నది సైకతం! వెన్నెల వెలుగులలో మెరిసిపోతూ ఎగిసిపడుతున్న అలల్ని చూస్తున్నారు. ‘‘మూడు వంతుల నీళ్లతో గుండ్రంగా అనంత విశ్వ శూన్యంలో భూమి ఎలా ఉంటున్నదో ఇప్పటికే నాకు అంతుపట్టని అద్భుతమే దినకర్’’ అంది తీర్థ. సముద్రపు హోరులో కూడా నిశ్శబ్దాన్ని చూస్తూ నిశ్శబ్దాన్ని వినిపిస్తున్నట్లు ఉన్నాడు దినకర్. ‘‘దినకర్! నీ ప్రేమ నీడలో నడుస్తున్నాను నేను. బతుకుతున్నాను నేను. ఏమైంది నీకు. దినకర్! విజ్ఞత ఉన్నచోటే పరిస్థితి ఇలా ఉంటే లేని చోట మాటేంటి?’’ ‘‘..................’’ ‘‘నీవిలా అయ్యావంటే ఎవరూ నమ్మట్లేదు. నమ్మాల్సివస్తే మిగిలేది నవ్వే. నవ్వుల పాలవుతావు దినకర్.’’ ‘‘..................’’ ‘‘నీ సంగతి చెబితే మా నాన్న ఏమన్నాడో తెలుసా? ఇంత సున్నితమైన మనసున్నవాడు రేపు కార్పొరేట్ ఆసుపత్రిలో ఏం పని చేస్తాడో అని!’’ ‘‘..................’’ ‘‘అది డబ్బెక్కువై మనసు రాయైన మనిషి మాటనుకో!’’ ‘‘..................’’ ‘‘ఇటువంటి సంఘటనల్లో నువు రోజంతా మౌనంగా, నిరాహారంగా ఆత్మల శాంతి కోరేవాడివి. ఇప్పుడూ అదే అనుకున్నా, కానీ ఇదేంటి?’’ ‘‘..................’’ ‘‘మానవాళి గుండె కన్నీటితో తడిసింది! అరెరే! పూర్ణ, ఆనంద్లు సాక్షాత్కరించిన విజయానందాన్ని సంపూర్ణంగా ఆస్వాదించకుండానే తెలుగు కంటిలో శోకధారలు! ఆ కంట ఆ నీరు, ఈ కంట ఈ నీరు, ముక్కంటి హిమాచల ప్రదేశంలోనే! తన నెత్తిమీద కాలు పెట్టారన్న కోపం అనుకోడానికి వీల్లేదు, తనే భుజం మీదకి ఎత్తుకున్నాడు! మరి ఇదేంటో, శివ లయ లీల!’’ ‘‘..................’’ ‘‘మారణ హోమంలో మనిషి దేవుడితో పోటీ పడుతున్నాడు, యుగాలుగా. అది నీవన్న మాటే!’’ ‘‘..................’’ ‘‘ఈ వీడియో మా ప్రత్యేకం అంటూ ఆయిల్ మార్కులు వేసుకుంటున్నారు కొందరు, అదేంటో. ఏ గుర్తింపు కోసమో!’’ ‘‘..................’’ ‘‘ప్రకృతి విలయాలు, జల ప్రళయాలు, అగ్ని ప్రమాదాలు, తుఫాను బీభత్సాలు... ఎన్నో. ఎన్నో. మనిషి జీవితం ఎంత అల్పమో చెబుతున్నా అహంభావాలు, అహంకారాలు, స్వార్థ చింతనలు సమసిపోవడం లేదు.’’ ‘‘..................’’ ‘‘బియాస్ నదీ తీరంలో సుందర దృశ్యాలు మనమెంతో ఆస్వాదించాం, ఆనందించాం. గులకరాళ్లను పలకరిస్తూ, పరవళ్లు తొక్కే ఆ నీళ్లలో మనం ఆడుకున్నాం. ఆ నీళ్లు చల్లుకున్నాం.’’ ‘‘..................’’ ‘‘ఆల్బర్ట్ స్కీవిట్జర్ డాక్టర్ వృత్తిని త్యాగం చేసి ఫిలాసఫర్ అయ్యాడు అంటుంటావు. ఒకవేళ నువ్విలా అయినా నేను నీ దాన్నే దినకర్!’’ ‘‘..................’’ ఓడిపోతున్నానేమో అని భయం కలిగింది తీర్థ మనసులో! గెలుపు ఓటములేంటి! దినకర్ని కాపాడుకోవాలి! కాపాడుకోవడమేంటి నా పిచ్చిగాని, తనకు తనే సమన్వయ పడింది, రేపు ఇలాగే ఎందుకుంటుంది అన్న ఆలోచనతో. అంతులేని కాలగమనంలో రేపు అనే ఆశతో కోట్లాది హృదయాలు కాలం గడుపుతున్నాయి. దినకర్కి ఇష్టమైన ఓ పుస్తకాన్ని గుర్తు చేయాలనుకుంది. ‘‘బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ - తెలుగులో వచ్చింది చూశావా?’’ ‘‘..................’’ ‘‘సరే! సమయానికి మించి ఉండలేం కదా, వెళ్దాం’’ అంటూ లేచింది. దినకర్ కూడా లేచి నించున్నాడు. దినకర్ వీపు మీద ఇసుకను దులిపింది. కారులో కూర్చోబోతుంటే - ‘‘ఇంకా శవాల కోసం గాలిస్తూనే ఉన్నారట!’’ పక్కనే వెళ్లే ఎవరో మాటలు వినిపించాయి. కారు కదిలింది. ‘‘ఆ పిల్లలకు అమ్మా, నాన్నలు ఉన్నారు అనే విషయం గుర్తుండుంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదేమో దినకర్’’ అంది, అప్పటికప్పుడు అనిపించిన భావంగా. ఏకీభావంగా ఔనంటున్న ముఖ ప్రకటనను ప్రస్ఫుటంగా చూసింది దినకర్ కదలికలో! ఆ కదలికతో తీర్థ మనసు కుదుటపడింది. *** ఈసారి దినకర్ పుట్టినరోజు ఎప్పటిలా జరిగేట్లు లేదు. అదే మాట స్నేహితులతో చెప్పి ఇంటికి వచ్చింది తీర్థ. టీవీ పెట్టే ఉంది. ఎవరూ చూడటం లేదు, చూసి తట్టుకోలేక! గ్యాస్ లీక్ ప్రమాదం! మంటలలో అంటుకుపోయిన తల్లీ పిల్ల! బూడిదైన దేహాలు! బొగ్గయిన కొబ్బరి తోటలు!... నీరలా..! నిప్పిలా..! విషాదాలు విషాదాల్లో కొట్టుకుపోవాల్సిందేనా! కన్నీళ్లెండిన కళ్లను - పంచభూతాలు పగబట్టి ఒక్కటై ఒకేసారి విరుచుకుపడినా ఏం చేస్తాయిలే... ‘‘అమ్మా...!!!’’ -
ఫ్రెండ్షిప్ డే ఇలా కూడా.. doggies డే అవుట్
ఫ్రెండ్షిప్డే రోజు ఏం చేస్తారు! ఫ్రెండ్స్కి కాల్ చేసి విష్ చేస్తారు. క్లోజ్ ఫ్రెండ్స్ అయితే అభిమానంగా బ్యాండ్స్ కడతారు. ఈ రొటీన్ సెలబ్రేషన్కి చెక్ పెట్టండి. కుక్క విశ్వాసం కలిగిన జంతువే కాదు... మనిషి ప్రియనేస్తం కూడా. అలాంటి నేస్తానికి ఈ ఫ్రెండ్షిప్డే సందర్భంగా సాయం చేసి, మీ సహృదయతను తెలియజెప్పమంటోంది గ్రూప్ ఆన్ ఇండియా. వీధికుక్కల సంక్షేమం, పునరావాసం కోసం ఎన్జీవో ఫ్రెండికోస్తో భాగస్వామ్యమైన ఈ సంస్థ.. ఈ స్నేహితుల దినోత్సవాన వీధి కుక్కలను కాపాడి లేదంటే వైద్యమందించి మీ ఔదార్యాన్ని చాటుకొమ్మంటోంది. ఇందుకోసం 99 రూపాయల నుంచి 499 రూపాయల వరకు ప్యాకేజెస్ను అందిస్తోంది. ఇందుకోసం http://gr.pn/1nLFctk లో లాగాన్ అవ్వాలి. అందులో మీరు డీల్ కుదుర్చుకోవాలనుకున్న ప్రైస్ మీద క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేయండి. అంతే... 99 రూపాయలకయితే మీరు కాపాడిన కుక్కకు మంచి ఆహారం అందిస్తారు. ఇక 299 రూపాయలతో డీల్ కుదుర్చుకుంటే ఫస్ట్ఎయిడ్, వ్యాక్సినేషన్తోపాటు దానికి ఫ్లూయిడ్స్ కూడా ఇస్తారు. ఇక 499 రూపాయల డీల్ అయితే గాయపడిన డాగీని కాపాడేందుకు అంబులెన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ డీల్ కాలపరిమితి ఈ నెల 25. -
ఖాన్ దాదాలు కలిసిపోయారు!!
తనకు, సల్మాన్ఖాన్కు మధ్య స్నేహం, ప్రేమ మెండుగా ఉన్నాయని సూపర్ స్టార్ షారుక్ ఖాన్ అన్నాడు. మంచి పెయింటర్ కూడా అయిన సల్మాన్ ఖాన్ ఎప్పుడైనా మీకు ఏదైనా స్కెచ్ బహుమతిగా ఇచ్చాడా అని అడిగితే, ఇవన్నీ బాగా పాతప్రశ్నలు అయిపోయాయని షారుక్ అన్నాడు. వాటితో తనకు బోర్ కొట్టేసిందని, ఏమైనా కొత్తవి ఉంటే అడగాలని కోరాడు. ఇప్పుడు తామిద్దరం కలిశామని, పరస్పరం కౌగలించుకున్నామని చెప్పాడు. తామిద్దరి మధ్య స్నేహం, ప్రేమ.. అన్నీ ఉన్నాయని స్పష్టం చేశాడు. బాలీవుడ్లో ఖాన్ దాదాలు ఇద్దరి మధ్య శత్రుత్వం, మళ్లీ వాళ్లు కలిసిపోవడం లాంటివి చాలాకాలంగా జరుగుతూనే ఉన్నాయి. 2008లో కత్రినా కైఫ్ పుట్టినరోజు పార్టీలో గొడవ జరిగేవరకు సల్మాన్, షారుక్ మధ్య సంబంధాలు బాగానే ఉండేవి. ఆ తర్వాతి నుంచి చాలాకాలం పాటు ఇద్దరూ ఒకరిని ఒకరు కలవడం మానేశారు. అయితే.. గత సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా కాంగ్రెస్ నాయకుడు బాబా సిద్దిఖీ ఇఫ్తార్ విందులో మాత్రం ఇద్దరూ కౌగలించుకున్నారు. -
మా ఇద్దరినీ కలిపింది కవిత్వం కాదు... జీవనోత్సాహం!
తనికెళ్ల భరణి... ఈ ప్రపంచానికి ఒక్కడిగా కనిపించొచ్చు! కానీ ప్రకాశ్రాజ్కి మాత్రం భరణి చుట్టూరానే ప్రపంచం కనిపిస్తుంది! ప్రకాశ్రాజ్ సుదీర్ఘ ప్రయాణంలో ఓ రహదారిలా... ఓ వారధిలా... దొరికిన సాంగత్యం భరణి! వీరిద్దరి స్నేహంలో ఓ ప్యాసా ఉంది... ఓ అంతుచిక్కని మజా ఉంది..! భరణి గురించి ప్రకాశ్రాజ్ హృదయావిష్కరణ... ‘సాక్షి’కి ప్రత్యేకం మనం ప్రేమించిన క్షణం... గడిచిపోయిన క్షణం కాదు. తలచుకొన్నప్పుడల్లా కాలాన్ని గెలిచి, మళ్లీ మళ్లీ బతికే క్షణం! ‘దేవదాసు’ చేసిన 20 ఏళ్ల తర్వాత దిలీప్కుమార్గారు బెంగళూరు వెళ్లారు...ఓ అభిమాని ‘దేవదాసు’ని గుర్తు చేసి‘ఎంత బాగా చేశారండీ’ అని ప్రశంసించాడు.దిలీప్కుమార్ కదిలిపోయారు.నేను వేషం వేస్తున్నప్పుడు బతికింది ఒక్క క్షణమే.తెరపై ఆ పాత్రను చూసి ప్రేక్షకుడు పులకించిందీ ఒక్క క్షణమే! అయితే ఆ పులకింతలన్నీ అనంతవాహినిలా ప్రవహిస్తూ... ఇరవై ఏళ్ల తర్వాత కూడా మళ్లీ నా క్షణాన్ని నాకు గుర్తు చేసింది కదా అనుకున్నారు దిలీప్కుమార్. తనికెళ్ల భరణి పొయిట్రీ చదువుతుంటే కూడా నాకదే ఫీలింగ్... మళ్లీ మళ్లీ బతికే క్షణం! అసలు తనికెళ్ల భరణి ఎవరు? నేను ఎవరు? ఓ రచయితగా, నటునిగా వాడు నాకు తెలియదు... నేనూ వాడికంతే! ఓ జర్నీ చేయడానికి ఇద్దరం దొరికాం.పది పదిహేనేళ్ల నుంచి జరుగుతున్న జర్నీ ఇది. ఒకరికొకరం వెతుక్కుంటూ వెళ్తే దొరికినవాళ్లం కాదు! వాడి ప్రపంచం వేరు... నా ప్రపంచం వేరు.అయినా కలిశాం. ఎందుకు కలిశామంటే... మేం కలవాలంతే! భరణి అంటే ఎందుకిష్టమంటే? ఏమో చెప్పలేను. కొన్నింటిని ఎక్స్ప్రెస్ చేస్తే ఆ మిస్టరీ పోతుంది. మా ఇద్దర్నీ కలిపింది కవిత్వం కాదు.. జీవనోత్సాహం! వాడు చాలా ప్రామాణికుడు... నిజంగా ప్రేమిస్తాడు. ఆత్మబంధువులా ఉంటాడు. కొందరే ఉంటారలా! తన ఆంతర్యాన్ని, ఆత్మను, అభివ్యక్తీకరించే తీరు... అదే నాకు నచ్చుతుందేమో! భరణి రాసిన ‘శృంగార గంగావతరణం’ చదివారా? వెంటనే చదవండి. ‘గంగోత్రి’ షూటింగ్ జరుగుతున్నప్పుడు గంగానది ఒడ్డున కూర్చుని, వినిపించాడు నాకు.శివుడు తన జటాజూటంలో గంగాదేవిని బంధిస్తే..గంగకే చెమట్లు పట్టడం లాంటి ఎక్స్ప్రెషన్స్... ఎన్నెన్నో! కొన్ని నెలల తర్వాత కలిసినా... ‘అరె.. నిన్ననే కలిశాం కదా’ అనిపించడమంటే.. ఆ బంధంలోని గాఢత్వం గురించి ఇంకేం చెప్పాలి? వాడు సంబరం చేసుకుంటుంటే వాడిలో సగమై నేనుంటా! నేను ఉత్సాహంతో ఊరేగుతుంటే వాడు నాలో ఉంటాడు! ఎక్కడో అమలాపురంలో షూటింగంతా కానిచ్చేసి మహ్మద్ రఫీ పాట వింటూ... ఓ తన్మయావస్థలో ఉన్నప్పుడు వాడు గుర్తుకొస్తాడు. చిన్న ఫోన్ కాల్... రెండు నిమిషాల టాక్... ఎందుకో ఆ సఖ్యం ఎప్పుడూ కావాలనిపిస్తుంది. ప్రపంచంలో వాడొక భాగం కాదు... వాడి చుట్టూరా ఉన్నదే ప్రపంచం! అక్కడ్నుంచే అసలు ప్రపంచం మొదలైందనిపిస్తుంది. వాడి అమెరికా వేరు... వాడి పల్లెటూరి వేరు. వాడి శివుడు వేరు.. వాడి ప్రేమ వేరు. నాదీ అదే పరిస్థితి! ఈ తీవ్రతే... ఈ విభిన్నతే... మా ఇద్దరికీ బ్రిడ్జ్ వేసినట్టుంది. ప్రతి మనిషిలోనూ పొయిట్రీ ఉంటుంది. ఆస్వాదించడం తెలియాలి... ఆహ్వానించడం రావాలి. వాడి ఆలోచనలెప్పుడూ ప్రెగ్నెంటే! అదే వాడిలో ఉన్న బ్యూటీ ఏమో!! ఫేమస్ పొయిట్ వర్డ్స్వర్త్ ఏమంటాడంటే... నువ్వో చెట్టు కింద విశ్రమిస్తే- ఎక్కడి నుంచో కోయిల పాట వినిపిస్తుంది.. ఆస్వాదించు. అంతేగానీ... అది ఎక్కడ నుంచి పాడుతుంది? ఎందుకు పాడుతుంది? దాని సైజేంటి? కలరేంటి? ఇలాంటి ప్రశ్నలన్నీ అవసరమా నీకు? ఎక్కడో పడిన వర్షానికే ఇక్కడ చల్లగాలి వీస్తుంది. ఇదొక జర్నీ. దాన్ని స్వచ్ఛంగా ఆస్వాదించడం తెలియాలి. భరణితో ప్రయణాన్ని కూడా ఎలాంటి ప్రశ్నలూ వేసుకోకుండా సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నా! నేను ‘భరణీ’ అని పిలుస్తాను. వాడు నన్ను ‘ప్రకాశ్’ అంటాడు. ఎందుకో ఆ చనువు అలా వచ్చేసింది! నా వయసెంతో తనకు తెలీదు... అతని వయసు గురించి నాకనవసరం. ఎక్కడో నేను చూసిన వింతైన మనుషులు, గమ్మత్తయిన సంఘటనలు, కొన్ని మాటలు, కొంత మౌనం... ఇవన్నీ భరణితో షేర్ చేసుకోవాల్సిందే. బయటకు చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. కానీ, ఎవరో ఒకరితో చెప్పుకోవాల్సిందే. మన దృష్టితో ఆలోచించేవాడయితేనే ఆ ట్రాన్స్ఫర్మేషన్ కుదురుతుంది. భరణి అలాంటివాడే! గుత్తొంకాయ కూర... తింటే వాడింట్లో తినాల్సిందే! షూటింగ్లో కలుసుకున్నప్పుడు... రేపు లంచ్లో మెనూ ఇదీ అంటాడు. తను రాకపోయినా గుత్తొంకాయ కూర వస్తుంది. ఆ రంగు.. రుచి.. వాసన.. ఆహా.. నోరూరిపోతుంది! ఫోన్ చేసి బావుందిరా అంటే... వాడి మనసు నిండిపోతుంది. అప్పుడప్పుడూ... చెన్నైలో సముద్రపు ఒడ్డున కూర్చుంటాం. ఎదురుగా సముద్రం... మాకిష్టమైన బ్రాండ్... ఇక మాటలే మాటలు..! నేను కర్నాటక పొయిట్రీ గురించి చెబుతాను... వాడు తెలుగు లిటరేచర్లోని అందాలు ఆవిష్కరిస్తాడు! ఇద్దరం అలా అలా... మరాఠీ కవితల్లోకి .. బెంగాలీ కథల్లోకి కొట్టుకెళ్లిపోతాం. జయంత్ కైకిని అని కన్నడంలో గొప్ప కవి. తను రాసిన ‘శబ్ద తీర’ పుస్తకం ఇప్పుడు చదువుతున్నా. ఓసారి అనుకోకుండా ముగ్గురం కలిశాం. జయంత్కి, భరణికి ఒకరికొకరికి ముఖపరిచయం లేదు. కానీ బాగా పరిచయస్తుల్లా కలిసిపోయారు. భరణి పొయిట్రీ గురించి జయంత్ ఆశువుగా చెప్పేస్తున్నాడు... జయంత్ కథల్లోని మెరుపుల గురించి భరణి తన్మయంగా వివరిస్తున్నాడు... వాళ్లిద్దర్నీ అలా చూస్తూ నాలో నేనే మైమరచిపోయా! వారిద్దరికీ బ్రిడ్జ్ని నేనే కదా మరి! ఈ భార్య, పిల్లలు, ప్రియురాలు, స్నేహితుడు... ఇలా కొంతమందికే పరిమితమైన ఆప్తవలయంలో వాడు ఉన్నాడు. మా రిలేషన్షిప్ దేనికీ ఆనదు. దేర్ ఆర్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అందుకే నేనెక్కువ మాట్లాడలేకపోతున్నా. అయినా మా జర్నీ ఇంకా ఉంది కదా... మరింకెలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? అందుకే మళ్లీ కలుద్దాం! బై! సంభాషణ: పులగం చిన్నారాయణ -
నన్ను చూస్తే చాలు... పారిపోయేవాళ్లు!
కనువిప్పు ‘వీడితో గొడవ ఎందుకు?’ అనుకునేవారో ఏమో తెలియదుగానీ, అప్పు మాత్రం ఇచ్చేవారు. నా గురించి కాలేజీ మొత్తం తెలిసిపోయింది. ఎక్కడ అప్పు అడుగుతానోనని నన్ను తప్పించుకొని తిరిగేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగింది. అందరూ అవసరాల కోసం అప్పులు చేస్తారు. నేను మాత్రం సరదా కోసం చేసేవాడిని. ఇతరులను పరీక్షించడానికి కూడా అప్పులు చేసేవాడిని. అప్పు ఇస్తే స్నేహంగా ఉండేవాడిని. ఇవ్వకపోతే వారితో ఏదో విధంగా తగాదాకు దిగేవాడిని. నేను కథా రచయితను కాదు. కానీ అప్పుల కోసం కథలు చెప్పడంలో నన్ను మించిన వాడు లేడు. ‘‘నేను కాలేజీకి వస్తుంటే.... ‘ఆకలిగా ఉంది పది రూపాయలు ఉంటే ఇవ్వు బాబూ’ అని ఎవరో ముసలాయన అడిగాడు. నేను వెంటనే నా జేబులో నుంచి వందరూపాయలు తీసి ఆయన చేతిలో పెట్టాను. ప్రస్తుతం నా చేతిలో చిల్లిగవ్వ లేదు. ఒక వంద ఉంటే ఇవ్వు. రేపు ఇస్తాను’’ అని ఒకరోజు, ‘‘నాకు బాగా తెలిసిన వ్యక్తి వెయ్యి రూపాయలు అప్పు అడిగితే ఇచ్చాను. నిజానికి నాకు కూడా డబ్బులకు ఇబ్బందిగా ఉంది. అంత పెద్దమనిషి అలా అడిగేసరికి కాదనలేకపోయాను. ఒక అయిదువందలు ఉంటే ఇవ్వు వారంలోపు ఇస్తాను’’ అని మరొకసారి... ఇలా రకరకాల అబద్ధాలు ఆడేవాడిని. విన్న వాళ్లు నమ్మేవారో, ‘వీడితో గొడవ ఎందుకు?’ అనుకునేవారో తెలియదుగానీ, అప్పు మాత్రం ఇచ్చేవారు. నా గురించి కాలేజీ మొత్తం తెలిసిపోయింది. ఎక్కడ అప్పు అడుగుతానోనని నన్ను తప్పించుకొని తిరిగేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగింది. ఒకసారి మా అమ్మకు కంటి ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. డబ్బు కోసం నాన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అది తెలిసి వారించాను. నేను రంగంలోకి దిగాను. తొలిసారి ఒక నిజమైన కారణం కోసం అప్పు అడిగాను. ఒక్కరంటే ఒక్కరు కూడా సహాయం చేయలేదు. కొందరైతే ఏకంగా గొడవకు కూడా దిగారు. ‘‘ఎన్ని రోజులు ఇలా ఇతరుల చెవిలో పూలు పెడతావు?’’ అన్నవాళ్లు కూడా ఉన్నారు. ఇక నాకు అప్పు పుట్టదనే విషయం స్పష్టంగా అర్థమైంది. నా పరిస్థితి గమనించిన నాన్న ఎవరి కాళ్లో పట్టుకొని అప్పు తెచ్చి అమ్మకు కంటి ఆపరేషన్ చేయించాడు. ఇక అప్పటి నుంచి నాలో పూర్తిగా మార్పు వచ్చింది. ‘ఒక్కసారి నమ్మకం కోల్పోతే వందసార్లు ప్రయత్నించినా రాదు’ అనే విషయం అర్థమైంది. ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. -టి.కె, రాజమండ్రి -
రక్తపు మడుగులో నేను!
కనువిప్పు ప్రతి మనిషికీ ఎంతో కొంత స్వార్థం ఉంటుందిగానీ, ఒకప్పుడు నా ఒంట్లో రక్తం కంటే స్వార్థమే ఎక్కువగా ఉండేది. ప్రతి చిన్న విషయాన్ని కూడా నా కోణంలో నుంచే చూసేవాడిని. ‘‘నాకేమిటి?’’ అని అడిగేవాడిని. ఇక ఇతరులకు సహాయపడడం అనేది కలలో మాట. ఎవరైనా నా దగ్గరకి సహాయానికి వస్తే... ‘‘ఒకరి దగ్గర చేతులు చాచడానికి సిగ్గు లేదూ?’’ అని మండి పడేవాడిని. నా వ్యవహారం తెలిసి అందరూ దూరంగా ఉండేవారు. నాతో స్నేహం చేయడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపేవారు కారు. కానీ నేను ఇలాంటివి పట్టించుకునేవాడిని కాదు. ఎప్పుడూ నా స్వార్థమేదో నేను చూసుకునేవాడిని. ఇంటర్ చదువుతున్న రోజుల్లో నా స్నేహితుడితో కలిసి సినిమాకు వెళుతున్నాను. అప్పటికే సినిమా టైం అయిపోయిందని వేగంగా నడుస్తున్నాం. ఈలోపే మా కళ్ల ముందు ఓ యాక్సిడెంట్ జరిగింది. ‘‘అరెరే...’’ అంటూ నా స్నేహితుడు వారికి సహాయం చేయడానికి పరుగెత్తాడు. నేనూ వాడి వెనకాలే పరుగెత్తాను. నేను పరుగెత్తింది ప్రమాదంలో గాయపడిన వారికి సహాయపడడానికి కాదు. సినిమా గురించి ఫ్రెండ్కు గుర్తు చేయడానికి! ‘‘ఒరేయ్...ఇలాంటివి రోజూ ఎన్నో జరుగుతుంటాయి. మనం కాకపోతే ఎవరో ఒకరు వాళ్ళను హాస్పిటల్కు తీసుకుపోతారు. ఓవర్ యాక్షన్ ఆపి...సినిమాకు పదా’’ అన్నాను ఎవరికీ వినబడకుండా. వాడు నా వైపు అదో రకంగా చూసి- ‘‘ఛీ...నువ్వు ఈ జన్మలో మారవు’’ అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. నేను మాత్రం అదేమీ పట్టించుకోకుండా సినిమా చూడడానికి వెళ్లాను. ఇది జరిగిన కొద్ది కాలానికి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో...నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. రక్తపు మడుగులో కొట్టుకుంటూ ‘‘రక్షించండీ... రక్షించండీ’’ అని అరుస్తుంటాను. కానీ నన్ను ఎవరు పట్టించుకోకుండా ఎవరి దారిన వారు వెళుతుంటారు. కొద్దిసేపటి తరువాత చనిపోయానన్నది ఆ కల సారాంశం. ఒక్కసారిగా దిగ్గున లేచి కూర్చున్నాను. ఈ కల తరువాత...నాలో పూర్తిగా మార్పు వచ్చింది. ‘‘మనం ఎవరికీ సహాయం చేయకపోతే, మనకూ ఎవరూ సహాయం చేయరు’’ అనే విషయం బోధపడింది. ఇక అప్పటి నుంచి ఇతరులకు సహాయం చేయడం నేర్చుకున్నాను. స్వార్థాన్ని వదిలాను. ఇప్పుడు నా మనసుకు ఎంతో తృప్తిగా ఉంది. - డియస్కె, విజయనగరం -
'మోడీవన్నీ అబద్ధాలే.. ఆయన నా స్నేహితుడు కాదు'
బీజేపీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఆయన తనకెప్పుడూ స్నేహితుడు కాడని సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ స్పష్టం చేశారు. తామిద్దరం తరచు కలిసేవారిమని, తామిద్దరి మధ్య స్నేహ సంబంధాలు ఉండేవని మోడీ చెప్పడం చాలా హాస్యాస్పదమని అన్నారు. మోడీ అలా చెప్పడం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని, ప్రజల్లో లేనిపోని గందరగోళం సృష్టించడానికే ఆయనలా చేస్తున్నారని తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి తాను ఏమైనా తీసుకున్నట్లు ఆయనవద్ద ఆధారాలుంటే నిర్భయంగా బయట పెట్టాలి తప్ప ఇలా చెప్పడం సరికాదని అన్నారు. తన సొంత పార్టీలోనే ఎవరితోనూ స్నేహంగా ఉండని మోడీ... తనతో స్నేహం చేయడం ఎలా సాధ్యమని అహ్మద్ పటేల్ ప్రశ్నించారు. మోడీని ఆయన ఇంట్లో గానీ, కార్యాలయంలో గానీ ఎప్పుడూ కలవలేదని, అలాగే ఆయన కూడా తనతో కలిసి ఎప్పుడూ భోజనం చేయలేదని స్పష్టం చేశారు. దూరదర్శన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అహ్మద్ పటేల్, తాను మంచి స్నేహితులమని నరేంద్రమోడీ చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనలా లేరని, బహుశా ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉండటంవల్లే తనను తప్పించుకుని తిరుగుతున్నారని మోడీ చెప్పారు. పటేల్ను తానెప్పుడూ అహ్మద్ భాయ్ అనలేదని, బాబూ భాయ్ అనేవాడినని అన్నారు. దాన్నే అహ్మద్ పటేల్ ఇప్పుడు నిర్ద్వంద్వంగా ఖండించారు. -
వంకాయ కూరలో రుచి ఉందా?
లారెన్సు ఒకచోట రాస్తున్నాడు ఒకరికి... ‘నన్ను నువ్వు నలుగురిలో తిడుతున్నావని నాకు తెలుసు. ఆ తిట్టే అవసరం నేను అర్థం చేసుకోగలను. నీ గొప్పదనం కోసం నన్ను తిట్టాల్సి వొస్తుంది నువ్వు. నన్ను తిడుతున్నావని నాకు తెలిసి, నేను కోపగించుకుంటున్నానని నాతో స్నేహం మానెయ్యకు. నాకు కోపం లేదు. ఎందుకంటే ఆ తిట్ల వెనుక అసలు నీకు నా మీద వుండే ఇష్టాన్ని నేనెరుగుదును’ గొప్పవాడు కదూ! అతన్ని ఇంగ్లండు బాధించి వెళ్ళగొట్టింది. ఇంగ్లీష్వాడనే పేరు ఎత్తవద్దంటాడు చివరికి. అది పోనీండి. ఒక ప్రకృతి దృశ్యం ఉంది. దాన్ని గొప్ప ఫొటోగ్రాఫర్ తీస్తాడు. అసలు ఆ దృశ్యాన్ని చూస్తే ఆ ఫొటోలో వున్న అందం కనబడదు మసుషులకి. మరి ఆ అందం ఎక్కడ వుంది? అసలు దృశ్యంలో ఉందా? ఫొటోలో ఉందా? ఇట్లాంటి ప్రశ్నలు నాలో వస్తే నేను రచయితగా చెడిపోయానన్నారు. వంకాయకూరలో రుచి అసలు వుందా? లేదా? ‘‘చాలా రుచి’’ అన్నవాడు మోసపోతున్నాడా? లేదన్నవాడు నాలిక రుచి లేని అంధుడా? అది తేలిందా- ఈ ప్రపంచ రహస్యమే తేలిపోతుంది. - చలం, 16-11-1950, అరుణాచలం. (‘మహాస్తాన్’ నుంచి) -
మంచి స్నేహితులుగా మారిన త్రివిక్రమ్, పవన్
-
మా మధ్య దూరం లేదు
ఏ రంగంలో అయినా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఈరోజు బద్ధశత్రువులుగా ఉన్నవారు రేపు అత్యంత ఆప్తమిత్రులుగా మారిపోయినా ఆశ్చర్యపోనవసరంలేదు. త్రిష, నయనతార ఈ కోవకు చెందినవారే. ఒకప్పుడు ‘ఈ ఇంటి మీద వాలిన కాకి.. ఆ ఇంటిమీద వాలకూడదు’ అన్నట్లుగా ఉండేవాళ్లు. ఇప్పుడు మాత్రం స్నేహితులైపోయారు. దీని గురించి త్రిష చెబుతూ -‘‘ఒకప్పుడు నేను, నయన్ ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉండేవాళ్లం. మీడియాలో మా గురించి ఏవేవో వార్తలు వచ్చేవి. మా మధ్య మనస్పర్థలు ఉన్నాయని రాసేవాళ్లు. అవి వదంతులని స్పష్టం చేయడానికి కూడా మాకు టైమ్ ఉండేది కాదు. పైగా ఆ వార్తలకు మేం అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇద్దరం ఒకే సిటీలో ఉండం కాబట్టి, తరచుగా కలవడానికి కుదిరేది కాదు. దాంతో మా మధ్య చాలా దూరం ఉందనుకునేవాళ్లు. ఇక, ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెడితే మంచిది. నయన్, నేను మంచి స్నేహితులం. వీలు కుదిరినప్పుడల్లా కలుసుకుంటాం. బోల్డన్ని కబుర్లు చెప్పుకుంటాం. మా ఇద్దరి అభిప్రాయాలూ దాదాపు ఒకే విధంగా ఉంటాయి’’ అని చెప్పారు. -
జాతి వైరాన్ని మరచిన వానరం, మార్జాలం
-
ఆ ఎనిమిది స్నేహాలు అవసరం!
అధ్యయనం చిన్నప్పుడు బలపం అరువిచ్చిన స్నేహం, కాలేజీలో మన పక్కనే కూర్చున్న స్నేహం, ఆఫీసులో ఆత్మీయంగా పలకరించే స్నేహం.... వింటుంటేనే మనసు తేలికపడుతోంది కదా! స్నేహాలు... ఒక్క మగవారిసొమ్మేనా? పెళ్లయ్యాక ఆడవారి స్నేహాలు తగ్గిపోవాలా? చిన్ననాటి స్నేహితుల్ని మరచిపోవాలా? కొత్త స్నేహాలు చేయకూడదా? ఈతరం మహిళల్ని వేధిస్తున్న ప్రశ్నలివి. పెళ్లయ్యాక మహిళలకు ఎనిమిది రకాల స్నేహాలుండాలంటున్నారు మానసిక నిపుణులు. బాధని, సంతోషాన్ని పంచుకోడానికి అన్నివేళలా ఇంటివాళ్లే అనువుకాదు కాబట్టి మనసెరిగిన స్నేహితురాలు చెప్పే కబుర్లు, ఇచ్చే సలహాలు, పంచుకున్న భావాలు మహిళల్ని మరింత ఆరోగ్యంగా ఉంచుతాయంటున్నారు. ఇదే అంశంపై ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో ప్రొఫెసర్ జాన్బొరేసింకో చేసిన అధ్యయనంలో ఎక్కువమంది స్నేహితులున్న మహిళలకు స్థూలకాయం, మానసిక ఒత్తిడి, గుండెజబ్బులు తక్కువగా ఉన్నాయని తేలింది. స్నేహితులంటే ఒక్క ఇరుగుపొరుగువారనే కాదు చిన్ననాటి స్నేహితులు, కొత్తగా పరిచయమైనవారు. తోటి ఉద్యోగులు, గుడిలో కలిసేవారు, పిల్లలు, భర్త స్నేహితులు, తల్లి, మీరు ఇలా ఎనిమిది రకాల స్నేహితులున్న ఆడవాళ్లు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారన్నది ఆ అధ్యయన సారాంశం. ఒక్కసారి చిన్ననాటి స్నేహితుల చిరునామా కనుక్కుని వారితో కాసేపు కబుర్లు చెప్పుకుంటే ఆ అధ్యయనం చెప్పే పాఠమేమిటో మీకూ అర్థమవుతుంది. -
శత్రువులెవరో.. చిన్నారులకూ తెలుసు!!
మాటలు రాకపోయినా.. తమకు మిత్రులెవరో, శత్రువులెవరో చిన్నారులు కూడా సులభంగా గుర్తు పట్టేస్తారట. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో శిశువుల మీద చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. చివరకు 9 నెలల పిల్లలు కూడా తమతో ఎవరెలా వ్యవహరిస్తున్నారో ఇట్టే గుర్తుపట్టేస్తారని, ఇతరుల సామాజిక సంబంధాలను వాళ్లు చాలా పక్కాగా గమనిస్తుంటారని పరిశోధనలో పాలుపంచుకున్న సైకాలజీ ప్రొఫెసర్ అమందా ఎల్. వుడ్వర్డ్ తెలిపారు. 9 నెలల వయసున్న మొత్తం 64 మంది పిల్లలను బృందాలుగా చేసి, వారికి ఇద్దరు పెద్దవాళ్ల వీడియోలు చూపించారు. వాళ్లు రెండు వేర్వేరు రకాల ఆహారాలు తిన్నారు. అలా తినేటప్పుడు కూడా అయితే పాజిటివ్గా, లేకపోతే నెగిటివ్గా వారు స్పందించారు. ఈ వీడియోలను పిల్లలకు చూపించారు. అప్పుడు వాళ్లు ఈ ఇద్దరి విషయంలో వేర్వేరుగా తమ భావాలు పలికించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తినేటప్పుడు శిశువులు వాళ్ల ఆహారపు అలవాట్లను పరిశీలిస్తారని, దాన్ని బట్టే సామాజిక సంబంధాలు నిర్వహిస్తారని పరిశోధనలో పాల్గొన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కేథరిన్ డి.కింజ్లర్ తెలిపారు. -
ఫేస్బుక్ స్నేహం..చేసింది సాయం
అమలాపురం రూరల్, న్యూస్లైన్ : ఎక్కడెక్కడివారినో ఫేస్బుక్ స్నేహితులుగా కలిపింది. సరదా కబుర్లతో కాలక్షేపం చేయకుండా ఎదుటివారికి సాయపడేలా ఆ స్నేహితులు నిర్ణయించుకున్నారు. రూ.35 వేలను వారిలో వారే సేకరించుకున్నారు. ఈ సాయాన్ని ఆపన్నులకు ఇచ్చి ఆదుకోవాలని భావించారు. అమలాపురం కొంకాపల్లిలోని హరిమనోవికాస కేంద్రంలో ఉన్న మానసిక వికలాంగులకు ఆ సొమ్మును సాయం అందించాలనుకున్నారు. గురువారం జరిగిన బాలల దినోత్సవ వేడుకలను వేదికగా చేసుకున్నారు. మిత్ర టీం పేరుతో వారు సేకరించిన రూ.35 వేలతో మానసిక వికలాంగుల పిల్లలకు నెలకు సరిపడే కిరాణా సరుకులు, టీచింగ్ మెటీరియల్, కుర్చీలు, మందులు సమకూర్చారు. ఫేస్బుక్ ద్వారా కలిసిన మిత్ర టీంలో సభ్యుడైన డాక్టర్ రామకృష్ణ ఈ సాయాన్ని ఆర్డీఓ సీహెచ్.ప్రియాంక చేతులమీదుగా అందించారు. డాక్టర్ రామకృష్ణ వికలాంగులకు ప్రత్యేక వైద్యపరీక్షలు చేసి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఫేస్బుక్ ద్వారా మిత్రులై ఇలాంటి సేవా కార్యక్రమానికి ముందుకు వచ్చిన మిత్ర టీంను అభినందించారు. వికలాంగుల పిల్లలతోఆర్డీఓ కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో హరిమనోవికాస కేంద్రం డెరైక్టర్ ఎస్.అశోక్కుమార్ పాల్గొన్నారు. -
స్నేహమేరా జీవితం..
స్నేహానికి చిరునామాగా, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు జనగామకు చెందిన ఈ ఫొటోలోని ముగ్గురు వ్యక్తులు. చిన్నప్పటి నుంచి స్నేహితులైన వారు... వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. కానీ స్నేహం వారిని ఎంతోకాలం విడిగా ఉంచలేకపోయింది. ముగ్గురూ ఒక్కటై అంచలంచెలుగా ఎదుగుతున్నారు. జనగామ పట్టణంలో ఒకప్పుడు జనతా ఫెర్టిలైజర్స్ పేరుతో ఎండీ ఇద్రిస్, కిషోర్ ఆగ్రో సర్వీసెస్ పేరుతో పజ్జూరి గోపయ్య, సంతోష్ ఫెర్టిలైజర్స్ పేరుతో గొరిగె అయిలయ్య వేర్వేరుగా వ్యాపారాలు నిర్వహించేవారు. స్నేహితులం.. ముగ్గురు కలిసి వ్యాపారం చేస్తే బాగుంటుంది...లాభనష్టాలను సరిసమానంగా పంచుకుందామని తలచారు. అనుకున్నదే తడవుగా 2006లో తమ వ్యాపార సంస్థల పేర్లలో మొదటి అక్షరాలను చేర్చి జేకేఎస్ అగ్రిమాల్, జేకేఎస్ జిన్నింగ్ మిల్ను మల్టీనేషనల్ కంపెనీలకు దీటుగా స్థాపించారు. పెద్ద కంపెనీలతో పోటీపడుతూ ముందుకు సాగుతున్నారు. ‘స్నేహం విలువ మాకు తెలుసు. అదే మమ్మల్ని ఒక్కటిగా చేసింది. వ్యాపారంలో పొత్తులు కుదరవని.. విడిపోవడం ఖాయమని చాలా మంది భావించారు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మా మధ్య మనస్పర్థలు చోటుచేసుకోలేదు. అందరం ఒకే మాట.. ఒకే బాటగా సాగుతున్నాం.’ అంటూ సమాజంలో స్నేహానికి ఉన్న విలువను చాటిచెబుతున్నారు అయిలయ్య, గోపయ్య, ఎండీ.ఇద్రిస్.