graduate MLC elections
-
‘సమన్వయం’తో ముందుకు!
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించేలా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీలోగా ఎన్నికల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది. అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకుని సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ నెలాఖరులోగా అభ్యరి్థని ఖరారు చేయాలని భావిస్తోంది. ఎన్నికల వ్యూహాల అమలు కోసం ప్రత్యేకంగా వార్ రూమ్ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యనేతలతో సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. పథకాలు, కార్యక్రమాలపై విస్తృత ప్రచారంఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని రేవంత్ సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి విచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపడుతోందని, ప్రధానంగా డీఎస్సీ ద్వారా 11 వేల ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, టీచర్లకు ప్రమోషన్లు, టీచర్ల బదిలీ చేపట్టడంతో పాటు ఒక అద్భుతమైన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ అంశాలను పట్టభద్రులైన యువత దృష్టికి ప్రధానంగా తీసుకెళ్లాలని సూచించారు. రుణమాఫీతో సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్ టెక్నాలజీ యూనివర్సిటీల ఏర్పాటు లాంటి విప్లవాత్మక కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. తక్షణమే ఓటర్ల నమోదుగ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారిని ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియను పార్టీ పక్షాన వెంటనే ప్రారంభించాలని, ఈ ప్రక్రియలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐలను భాగస్వాములను చేయాలని రేవంత్రెడ్డి కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ద్వారా రాష్ట్రంలోని యువత కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉందనే విషయాన్ని మరోమారు తెలియజేయాలని, ఈ మేరకు ఎన్నికల వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి మాట్లాడుతూ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీలోని అన్ని స్థాయిల నేతలు, కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని కోరారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్లు కూడా జూమ్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. -
ఓటుకే భద్రత లేదు!
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తంతు ప్రహసనంలా మారింది. ఈ జాబితాలో పేరు ఉండాలంటే ప్రతిసారి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని చెబుతుండడం అందరికీ ఇబ్బంది అవుతోంది. వచ్చే ఏడాది మార్చి నెలలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజాగా షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, గతంలో ఓటుహక్కు వినియోగించుకున్న పట్టభద్రుల జాబితా లేదని, మళ్లీ కొత్తగా నమోదుకు చర్యలు చేపట్టింది. కొరిటెపాడు(గుంటూరు): ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అర్హులైన పట్టభద్రులంతా సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్లో తమ ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ ఎన్నికలు జరిగే ప్రతిసారీ ఇలా ఓటు హక్కు నమోదు చేసుకోవాలంటే ఎలా అంటూ ఓటర్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోయినా.. పట్టభద్రులైతే చాలు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్సీకి పోటీ చేసే అభ్యర్థికి తొలి, ద్వితీయ, తృతీయ ప్రాధాన్య ఓట్ల ద్వారా కనీసం 50 శాతంపై అనుకూలంగా పడితేనే విజయం వరిస్తుంది. 3 లక్షలు దాటే అవకాశం ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 2019 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,48,799 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో కేవలం 1,14,325 (45.79 శాతం) మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మార్చి 2025లో జరిగే పట్టభద్రుల ఎన్నికలకు సుమారు 3 లక్షల మందికిపైగా నమోదు చేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నమోదు నిబంధనలు ఇవీ.. » ఈ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు మళ్లీ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. » ఫాం 18 వినియోగించుకుని దరఖాస్తు అందించాలి. » సెపె్టంబర్ 30 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో నమోదుకు అవకాశం ఉంది. » ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే.. అధికారులు నేరుగా ఇంటి చిరునామాకు వచ్చి ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. » ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి పరిశీలనా ఉండదు. » ఫాం 18లో వివరాలను తొలుత పూరించాలి. ఆధార్ కార్డు, డిగ్రీ సర్టిఫికెట్ నకలు, నివాస ధ్రువపత్రం సెట్గా చేసి మండల తహసీల్దార్, గ్రామ సచివాలయం, మీ సేవా కేంద్రాల్లో అందించవచ్చు. హక్కులను హరించినట్టే.. పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారీ ఓటు నమోదు చేయించుకోమనడం సరికాదు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడమంటే ప్రజల హక్కులను హరించినట్లే. గతంలో పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు వేసిన వారిని కొత్తగా నమోదు నుంచి మినహాయించాలి. – తూము వెంకటేశ్వరరెడ్డి, బీకాం, గుంటూరు పునరాలోచన అవసరం పట్టభద్రుల ఓటు నమోదును గ్రామ సచివాలయాల్లో చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓటు నమోదు పట్టభద్రులను అనుమానించడమేనని భావిస్తున్నాం. దీనిపై ఎన్నికల కమిషన్ పునరాలోచన చేయాలి.– ఎం.నరేంద్రరెడ్డి, బీఏ, గుంటూరు -
మండలి సీట్లపై కమలం కన్ను
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే జరగనున్న ఎన్నికల్లో మూడింటికి మూడు ఎమ్మెల్సీ స్థానాలను (రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్) గెలుచుకుని సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. ఈ ఎమ్మెల్సీ సీట్లలో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు పార్టీ ముఖ్యనేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటినుంచే టీచర్, గ్రాడ్యుయేట్ ఓటర్లను పెద్దసంఖ్యలో చేర్పించేలా కార్యాచరణ అమలుచేయాలని తీర్మానించింది. ఓటర్ల నమోదుకు దరఖాస్తులను పార్టీ ఇప్పటికే పెద్దసంఖ్యలో ముద్రించి సిద్ధం చేసింది. ఈ దరఖాస్తులను ఆయా జిల్లాలకు పంపించి టీచర్, గ్రాడ్యుయేట్ ఓటర్లను చేర్చేలా చర్యలు తీసుకోనున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలు (టీచర్స్, గ్రాడ్యుయేట్స్ చెరో సీటు), వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ సీటుకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచి బీజేపీ 4 ఎంపీ, 7 ఎమ్మెల్యే సీట్లలో విజయం సాధించడం తెలిసిందే. ఈ జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ సీట్లను కూడా కచ్చితంగా గెలుపొందడం ద్వారా పార్టీ బలాన్ని నిరూపించాలని పట్టుదలతో పార్టీ నేతలున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదుకు పార్టీపరంగా ఒక ఇన్చార్జిని నియమించాలని నిర్ణయించినట్టు సమాచారం. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరపున గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ అభ్యరి్థగా సుగుణాకరరావు, టీచర్స్ అభ్యరి్థగా మోహన్రెడ్డి పోటీ చేయడం తెలిసిందే. బీజేపీ కార్యాలయంలో గురువారం రాత్రి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో.. పార్టీ ముఖ్యనేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎన్.రామచంద్రరావు, చంద్రశేఖర్ తివారీ, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, దుగ్యాల ప్రదీప్కుమార్ పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్–2024 పై నిర్వహించిన మరో సమావేశంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, అరవింద్ మీనన్, ఏలేటి మహేశ్వర్రెడ్డి, చంద్రశేఖర్ తివారీ, ధర్మారావు, జి.ప్రేమేందర్రెడ్డి, డి.ప్రదీప్కుమార్, బంగారు శ్రుతి పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు
నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డి ఆరోపించారు. 3వ రౌండ్లో తనకు మెజారిటీ ఉన్నా, కాంగ్రెస్ అభ్యరి్థకి మెజారిటీ ఉందంటూ ప్రకటించారని, కౌంటింగ్పై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. నల్లగొండలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద రాకేష్రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ ఏకపక్షంగా చేస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు లేకుండానే 3వ రౌండ్ లీడ్ను ప్రకటించారని చెప్పారు. రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడం లేదన్నారు. 3వ రౌండ్ ఫలితాలు అడిగితే బయటకు నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన గెలుపును అడ్డుకునే కుట్ర జరుగుతోందని, మళ్లీ లెక్కించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మాట్లాడుతూ రౌండ్ ఫలితాలు ప్రకటించే విషయంలో కౌంటింగ్ ఏజెంట్లకు చూపించకుండా ఏకపక్షంగా ప్రకటిస్తున్నారని అన్నారు. అడిగితే అనుమానం నివృత్తి చేయడం లేదని, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తారుమారు జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయని చెప్పారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో గోల్ మాల్.. రాకేష్ రెడ్డి సీరియస్
సాక్షి, నల్లగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ తీరుపై బీఆర్ఎస్ అభ్యర్ధి రాకేష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో గోల్మాల్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు కౌంటింగ్ కేంద్రం వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ.. మూడో రౌండ్లో కాంగ్రెస్కు మూడు వేలు ఆధిక్యం వస్తే నాలుగు వేలకు పైగా ఆధిక్యం వచ్చినట్లు ప్రకటించారని ఆరోపించారు. తాము అభ్యంతరం చెప్పినా ఆర్వో పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మూడో రౌండ్ నుంచి అనుమానం ఉందని చెప్పినా కనీస స్పందన లేదని దుయ్యబట్టారు.ఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తే కౌంటింగ్ బైకాట్ చేస్తామని చెప్పారు రాకేష్ రెడ్డి. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాలని కోరారు. రిటర్నింగ్ అధికారిపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అధికారుల తీరు ఫలితాలను తారుమారు చేసేలా ఉందన్నారు. తమ అభ్యంతరాలకు వివరణ ఇచ్చాకే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కంపు జరపాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. తాజాగా మూడో రౌండ్ ఫలితాలు వెల్లడయ్యాయి. మూడో రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న) లీడ్లో ఉన్నారు. ఆయనకు ఈ రౌండ్లో 4207 ఓట్ల ఆధిక్యత లభించింది.మూడు రౌండ్లు ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న కాంగ్రెస్) 1,06,234.. రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్) 87,356.. ప్రేమేందర్ రెడ్డి( బీజేపీ) 34,516.. అశోక్ (స్వతంత్ర) 27,493 ఓట్లు పడ్డాయి. చెల్లిన ఓట్లు 2,64,216 కాగా చెల్లని ఓట్లు 15784గా ఉన్నాయి. ప్రస్తుతానికి తీన్మార్ మల్లన్న 18878 ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు 2 లక్షల 88 వేల ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి చేయగా. మరో 48013 ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. -
ముగిసిన ఖమ్మం-వరంగల్-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్
Updatesముగిసిన ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్క్యూ లైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశంమహబూబాబాద్ 2 గంటల వరకు పోలింగ్ శాతంపురుషులు: 10745మహిళలు: 6462మొత్తం: 17207శాతం: 49.26% సూర్యాపేట జిల్లా :ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ 2 గంటల వరకు 52.8 శాతంMale: 17968Female: 9220Total: 27188యాదాద్రి భువనగిరి జిల్లాజిల్లాలో 2 గంటల వరకు 47.92 శాతం నమోదుపురుషులు:9673మహిళలు: 6659మొత్తం: 16332శాతం: 47.92 జనగామ జిల్లా:జనగామ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మధ్యాహ్నం 2:00 గంటల వరకు 49.66% పోలింగ్ నమోదు వరంగల్ జిల్లా వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికలలో ఉదయం 12:00 గంటల వరకు పోలింగ్ శాతం 30.18 %జనగామ జిల్లా:జనగామ జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 12:00 గంటల వరకు 28.38% పోలింగ్ నమోదుమహబూబాబాద్ జిల్లా:వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలలో ఉదయం 12:00 గంటల వరకు 28.49 పోలింగ్ శాతం నమోదుహనుమకొండ: ప్రశాంతంగా కొనసాగుతున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్మధ్యాహ్నం 12గంటల వరకు హనుమకొండ జిల్లాలో పోలింగ్ శాతం 32.90యాదాద్రి భువనగిరి జిల్లాజిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు 27.71 శాతం నమోదు పురుషులు: 5902మహిళలు: 3543 మొత్తం: 9445 నల్లగొండ జిల్లా:జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30 పోలింగ్ శాతం నమోదునల్గొండ:సూర్యాపేట జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ శాతం 31.27%పురుషులు: 10813మహిళలు: 5290మొత్తం: 16103 నల్గొండ:మిర్యాలగూడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని పరిశీలించిన బీఆర్ఎస్ మాజీ మంత్రి గుంతకంట్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు.నల్గొండ:తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్నల్లగొండ:నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి అశోక్కు గన్ మెన్ కేటాయింపునార్కెట్పల్లి గొడవ నేపథ్యంలో అధికారుల నిర్ణయంవరంగల్:మహబూబాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం సమీపంలో ఘర్షణపోలీసులకు ఓటు వేయాలని ప్రసన్నం చేసుకుంటున్న పార్టీ నాయకుల మధ్య స్వల్ప ఘర్షణ200 మీటర్ దూరం లో ఉన్నాం మీ కు ఇబ్బంది ఇంటి అని పోలీసుల తో వాగ్వివాదంనల్లగొండ ఎన్జీ కాలేజ్ లో అధికారుల నిర్లక్ష్యంవికలాంగులు ఓటేసేందుకు కనీస సౌకర్యాలు లేని వైనంమేమేం చేయాలి చైర్లు లేకపోతే అంటూ సిబ్బంది సమాధానంఇబ్బందులు పడుతోన్న వికలాంగులు నల్లగొండ నార్కెట్పల్లి లో ఓ షెడ్డులో డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు నార్కట్పల్లి పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించిన స్వతంత్ర అభ్యర్థి అశోక్తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట స్వతంత్ర అభ్యర్థి అశోక్ నిరసనస్టేషన్ ఎదుట బైఠాయించిన అశోక్ సూర్యాపేటలో 11 శాతం పోలింగ్..సూర్యాపేట జిల్లా:ఎమ్మెల్సీ ఎన్నికలో పది వరకు గంటల పోలింగ్ శాతం:Male: 4258Female: 1570Total: 5828Percentage: 11.32% నల్లగొండ:నార్కెట్పల్లిలో స్వల్ప ఉద్రిక్తతఓపార్టీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన స్వతంత్ర అభ్యర్థి అశోక్ఇరు వర్గాల మధ్య వాగ్వాదంపోలీసులకు ఫిర్యాదు చేసిన అశోక్ నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న) ఓటు హక్కును వినియోగించుకున్నారు నల్గొండ: సూర్యాపేట: గ్రాడ్యూయెట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 459 బూత్లో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరంగల్:మహబూబాబాద్ లోని 178వ పోలింగ్ బూత్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్: జనగామ ప్రెస్టన్ కళాశాలలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఖమ్మంఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా చర్ల మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో మందకొడిగా ఓటింగ్ జరుగుతోంది.చర్ల మండలం లో మొత్తం 1122 ఓటర్లు ఉన్నారు.వీరికోసం చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.గ్రాడ్యుయేట్ లు కూడా అర్ధ రాత్రి వరకు రాజకీయ పార్టీల నేతల రాక కోసం ఎదురు చూశారు.కొంతమంది నాయకులు గ్రాడ్యుయేట్ లను కలిసి అన్ని చూసుకుంటామని చెప్పారని తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోందిమూడు ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు ఓటు వేయడానికి తరలి వస్తున్నారు వరంగల్:హన్మకొండ పింగిలి కళాశాల పోలింగ్ బూతులో ఓట్లు వేయడానికి క్యూలో ఉన్న పట్టభద్రులు నల్లగొండ:మిర్యాలగూడ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్లో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు వరంగల్:పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోందిహనుమకొండ పింగళి కాలేజీ పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేట పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోందిసూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైందిఓటు వేయడానికి పట్టభద్రులు తరలి వసున్నారు ఓటు వేయడానికి క్యూలైన్లో నిల్చున్నారు నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రారంభం అయిన పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ వరంగల్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభంవరంగల్- నల్గొండ - ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులువరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,73,413 మంది ఓటర్లు ఉన్నారువీరి కోసం 227 పోలింగ్ కేంద్రాలు 296 బ్యాలెట్ బాక్స్ లు అధికారులు ఏర్పాటు చేశారు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. జూన్ 5వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్నేడు వరంగల్–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది.పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులతో తరలి వెళ్ళిన సిబ్బంది, అధికారులుసోమవారం పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బరిలో 52 మంది ఉన్నా... ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పోటీలో ఉన్నారు.605 పోలింగ్ బూత్లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు.వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34 అసెంబ్లీ నియోజక వర్గాలలో విస్తరించి ఉంది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం.వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో 1,23,985 మంది ఓటర్లునల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుపట్టభద్రులను ఆకట్టుకునే పనిలో మూడు ప్రధానపార్టీల అభ్యర్థుల ప్రచారంఉదయం 6 నుండి సాయంత్రం 8 గంటల వరకు 144 సెక్షన్ అమలుఈ ఎన్నికలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలతోపాటు కొందరు స్వతంత్రులు పెద్దఎత్తున ప్రచారం చేశారు.ఈరోజు తేదిన ప్రత్యేక సెలవువరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లు -
బీఆర్ఎస్పై రఘునందన్ రావు సంచలన ఆరోపణలు.. ఈసీకి లేఖ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ. 30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్ఎస్ తెర లేపి, అక్రమాలకు పాల్పడుతోందని కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి లేఖలు రాశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారిక కెనరా బ్యాంక్ ఎకౌంట్ నుంచి 34 మంది ఎన్నికల ఇంఛార్జిలకు ఈ డబ్బు బదిలీ చేసిందని తెలిపారు.ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ను కూడా తాను రాసిన లేఖకు జతచేశారు. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోకపోతే కోట్లాది రూపాయలతో బీఆర్ఎస్ పార్టీ ఓటర్లను కొనుగోలు చేస్తుందని అన్నారు. వెంటనే అకౌంట్లో డబ్బులు ఫ్రీజ్ చేసి విచారణ జరపాలని కోరుతున్నామని రఘునందన్ రావు అన్నారు.రాష్ట్రంలో ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రేపు (మే 27వ తేదీ 2024)న ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. బరిలో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), రాకేశ్రెడ్డి (భారాస), ప్రేమేందర్రెడ్డి (భాజపా) ఉన్నారు. -
కేటీఆర్ వ్యాఖ్యలపై ఈసీకి మల్లు రవి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అభ్యర్ధి మల్లురవి ఫిర్యాదు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లనన్నను కించపరుస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నమని చెప్పారు. కాగా నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న పోటీలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా కేటీఆర్ విమర్శలు గుప్పిస్తూ, ఆయనపై కేసులు ఉన్నాయని ఆరోపించారు. ఓవైపు బిట్స్ పిలాని, మరోవైపు పల్లి బఠానీ అంటూ విమర్శించారు.దీనిపై మల్లురవి స్పందిస్తూ.. కేటీఆర్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని తెలిపారు. ఇతర పార్టీల నేతలను అవమానించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్ పిలానీలో చదివితే.. ఆ కాలేజీలోనే ఓట్లు అడగాలని చురకలంటించారు.ఆ కళాశాల వారే పట్టభద్రులు, మిగతావారు కాదన్నట్లుగా మట్లాడటం సరికాదని అన్నారు. తీన్మార్ మల్లన్న పోటీకి అర్హుడని ఎలక్షన్ కమిషన్ అంగీకరించిందని, కేటీఆర్ తన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలకు సోనియా గాంధీ వస్తున్నారని మల్లు రవి తెలిపారు. తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా ఆమెను ఘనంగా సన్మానిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పని చేసిన అన్ని పార్టీలను ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు 27 న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ గురించి సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను గెలిపించాలని తీర్మానించాయి. -
TG: ముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది. ఈనెల 27న మూడు ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. బరిలో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), రాకేశ్రెడ్డి (భారాస), ప్రేమేందర్రెడ్డి (భాజపా) ఉన్నారు. పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం జూన్ 5న వెలువడనుంది.సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ప్రచార గడవు శనివారం సాయంత్రం ముగిసింది. ఈనెల 27వ తేదిన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్కు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.ఉమ్మడి జిల్లాలలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ జరగనుంది. మొత్తం 605 పోలింగ్ బూత్లు, 4,63,839 ఓట్లర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లలో పురుషులే అధికంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోరులో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్రెడ్డి బీజేపీ నుంచి ప్రేమేందర్రెడ్డి పోటీ పడుతున్నారు.పోలింగ్ డే 27వ తేదిన ప్రత్యేక సెలవు ప్రకటించారు అధికారులు. పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం జూన్ 5న వెలువడనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో 1,23,985 మంది, నల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇక పోలింగ్ రోజు ఉ.6 నుంిచి సా.8 వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. -
హామీలన్నీ అమలు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: ఈటల
సాక్షి, కొత్తగూడెం: పోరాడి సాధించుకున్న తెలంగాణాలో అహంకారానికి స్థానం లేదని ప్రజలు నిరూపించారని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాటలు తప్ప హమీల అమలు లేదని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని పేర్కొన్నారు. ఆరు నెలల ఈ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. చైతన్యవంతులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి ప్రజాస్వామ్య విలువ పెంచాలని కోరారు.వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ.. కొత్తగూడెం క్లబ్లోని ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ జాతీయ నాయకులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణా ఉద్యమంలో తొలి తూటా దిగింది కొత్తగూడెం గడ్డ పైనేనని తెలిపారు. ఈ జిల్లా చైతన్య వంతమైన జిల్లా అని పేర్కొన్నారు. సమాజం పట్ల మంచి అవగాహన ఉన్న గ్రాడ్యుయేట్స్.. మంచి ఎవ్వరో చెడు ఎవ్వరో తెలుసుకుని ఓటు వేయాలని సూచించారు.ఎన్నికల ఫ్లెయింగ్ స్కాడ్ పేరుతో తమకు ఇబ్బందులు గురిచేయాలని చూశారని ఈటల ఆరోపించారు. లక్ష కోట్ల యజమాని అయిన గుడిసెల్లో ఉన్న వారికైనా ఒకటే ఆయుధం ఓటు అని తెలిపారు. ప్రతి హామీలపై పోరాటం చేసే పార్టీ బీజేపీ పార్టీ మాత్రమేనని అన్నారు. భారత్ తెచ్చి 12వేల కోట్ల టాయిలెట్ కట్టించిన ఘనత తమదేనని పేర్కొన్నారు. ఫోన్ పే, గూగుల్ పే తెచ్చింది నరేంద్రమోీదీనేనని.. 10 సంవత్సరాల పరిపాలనలో కొన్ని వేల కిలోమీటర్లు నేషనల్ హైవే నిర్మించింది బీజేపీనేనని అన్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ తెచ్చి.. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేసిన ఘనత మోదీనేనని ఈటల తెలిపారు. -
నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ మోసం బయట పడింది: హారీష్ రావు
సాక్షి, ఖమ్మం: నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ మోసం బయటపడిందన్నారు మాజీ మంత్రి హరీష్రావు. ఉచిత బస్సు తప్పా పథకాలన్నీ తుస్సేనని విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్ని అబద్ధాలేనని మండిపడ్డారు. కాంగ్రెస్ బండి రివర్స్ గేర్లో నడస్తుందని ఎద్దేవా చేశారు.బీఆర్ఎస్ హయాంలో 24 గంటలు కరెంటు వస్తే.. ఇప్పుడు 14 గంటలు మాత్రమే వస్తుందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. నిరుద్యోగ భృతి అడిగితే భట్టి విక్రమార్క మేము అనలేదని నిండు అసెంబ్లీలో అబద్దాలు చెప్పారని గుర్తు చేశారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు పొడిగించాలని కాంగ్రెస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ 100 కోట్లు ఇస్తా అని 100 రూపాయలు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు.ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పనున్నారు. అబద్దాలు, మోసాలు, ఉన్న పతకాలు ఊడగొట్టటం తప్పా.. కాంగ్రెస్ ప్రజలకు చేసింది ఏమిలేని విమర్శించారు. కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేస్తుందని ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరావు మండిపడ్డారు. తమ్మినేని వీరభద్రం తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలపడం ముదిగొండ అమరవీరుల ఆత్మ క్షోభిస్తుందన్నారు. ప్రశ్నించే గొంతుక అని చెప్పుకునే తీన్మార్ మల్లన్న ఏ రోజైనా పేద విద్యార్థుల కోసం మాట్లాడలేదని అన్నారు. 56 కేసులున్న తీన్మార్ మల్లన్నను పట్టభద్రులా ఎమ్మెల్సీగా ఎన్నుకుంటారా అని ప్రశ్నించారు.ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కామెంట్స్..నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండరు లేదు..తనను గెలిపిస్తే నిరుద్యోగుల, ఉద్యోగుల పట్ల ప్రశ్నించే గోతుకకై పోరాడుతా.కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ 46 ఎందుకు రద్దు చేయడం లేదు.నేను ఎమ్మెల్సీ గా గెలిస్తే నా జీతంతో పేద విద్యార్థుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాను. -
6 నెలల్లోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్: ఈటల
సాక్షి, నల్గొండ: లోక్సభ ఎన్నికల సర్వేలను తలదన్నేలా ఫలితాలు రాబోతున్నాయని మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆరు నెలల కాలంలోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఒకే ఒక సీఎం రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. రేవంత్ పెద్ద సిపాయి అనుకున్నా కానీ అంత ఉత్తదేనని అన్నారు. ప్రజలను దోచుకునే వాళ్లందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని విమర్శించారు.వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగం దేవరకొండలో బీజేపీ నేతలు ఏలేటి మహేశ్వర రెడ్డి, ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. 10 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం ఒక్క స్కాం కూడా చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో అన్ని స్కామ్లేనని.. మంత్రులు జైలుకు కూడా పోయారని పేర్కొన్నారు.అబద్ధాల నిర్మాణం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని మండిపడ్డారు జేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. అవినీతికి,అన్యానికి, ధర్మానికి, ఆ ధర్మానికి జరుగుతున్న పోటీనే ఈ ఎన్నికలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు మధ్య కుమ్ములాటలు తప్ప అభివృద్ధి జరగలేదని దుయ్యబట్టారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాలి: కేటీఆర్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా కొత్తగా ఇవ్వలేదని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమయితే.. నియామక పత్రాలు ఇచ్చింది మాత్రమే రేవంత్ రెడ్డి అని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చానని రేవంత్ అబద్దపు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కొత్తగూడెం ఇల్లందులో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా ఉన్న వాళ్లకు పట్టం కడితే ప్రశ్నించే గొంతుకైతారని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్కు బద్ది చెప్పాలంటే, 2 లక్షల ఉద్యోగాల హామీ నెరవేరాలంటే, ఆ ఒత్తిడి ఉండాలంటే దమ్మున్న రాకేశ్ రెడ్డిని గెలిపిస్తే శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాడని తెలిపారు. పచ్చి అబద్దాలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యావంతులు కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజుల్లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. కేసీఆర్ హయాంలో టెట్కు దరఖాస్తు ఫీజు రూ. 400 పెడితే.. ఇదే రేవంత్ నానా యాగీ చేశారు. ఇవాళ టెట్ పరీక్షకు వెయ్యి పెట్టారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలి. మొదటి కేబినెట్ సమావేశంలో మెగా డీఎస్సీ వేస్తామన్నారు. ఆ హామీ కూడా నెరవేరలేదు. సింగరేణిలో 24 వేల వారసత్వ ఉద్యోగాలు ఇచ్చాం. సింగరేణిని అదానీకి అమ్మేందుకు రేవంత్ సిద్ధంగా ఉన్నాడు. ఇదే విషయంపై మోదీతో రేవంత్ కూడబలుక్కున్నాడు. చివరకు సింగరేణిని కూడా ప్రయివేటుపరం చేస్తారు.ప్రైవేట్ రంగంలో 24 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బీఆర్ఎస్ కృషి చేసింది. సోషల్ మీడియాలో మాపై వ్యతిరేక ప్రచారం వల్లే మా అభివృద్ధి ప్రచారంలోకి రాలేకపోయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ నరేంద్ర మోీదీ తలుపులు తెరుచుకొని ఉన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణి ప్రైవేటుపరం చేయడానికి కంకణం కట్టుకున్నారు. 56 కేసులు ఉన్న ఒక బ్లాక్ మెయిలర్కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి టికెట్ ఇచ్చింది. ఇప్పటికైనా ఆలోచించి పట్టబద్రులు ఓటు వేయాలి’ అని కోరారు. -
తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నేడు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపిచాలని కోరుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారని, ప్రతిష్టాత్మక బిట్స్ పిలానిలో విద్యాభ్యాసం చేశారని తెలిపారు. మేనేజ్మెంట్, ఎకనామిక్స్లో డ్యూయల్ మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆయన, అమెరికాలో ఏడేళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేసి.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారని పేర్కొన్నారు.‘అద్భుతమైన వాగ్ధాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం కలిగిన రాకేష్ రెడ్డి.. సమకాలీన రాజకీయాంశాలపై, ఆర్థిక స్థితిగతులపై ప్రముఖ వార్తా పత్రికల్లో ఆర్టికల్స్ రాయడమే కాకుండా నవశకానికి నాంది, ప్రగతి రథ చక్రాలు, ఫిస్కల్ ఫెడరలిజం, ద డాన్ ఆఫ్ న్యూ ఎరా, తెలంగాణ ఎకానమీ లాంటి పుస్తకాలను రచించారు.సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీపై గెస్ట్ లెక్చర్లు కూడా ఇచ్చారు. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే పేద విద్యార్థుల కోసం రాకేష్ రెడ్డి ఈ-క్లాసెస్ యాప్ అనే ఫ్రీ కోచింగ్ యాప్ను రూపొందించి ఉచితంగా అందజేశారు. హన్మకొండలో మెగా జాబ్ మేళాలు నిర్వహించారు.టీవీ చర్చల్లో చురుగ్గా పాల్గొని, విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యల, హక్కులపై బలంగా గళం విప్పారు. కరోనా మహమ్మారి సమయంలో, వరంగల్లో వరదలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలిచి తన వంతు సహాయాన్ని అందించారు. ఇండస్ ఫౌండేషన్ ద్వారా ఓరుగల్లులో కూచిపూడి, పేరిణి లాంటి నృత్య కళలను, పల్లె సంస్కృతులను, సాహిత్యాన్ని, మన జానపద కళారూపాలను పరిరక్షించడం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారుకేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాకేష్ రెడ్డి.. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సరైన చాయిస్. యువకుడు, ఉన్నత విద్యావంతుడు, ప్రశ్నించే తత్వం, లోతైన విషయ పరిజ్ఞానం ఉన్న రాకేష్ రెడ్డి గారిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే.. పట్టభద్రుల గొంతుకగా నిలుస్తారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు.ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మీ మొదటి ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డి గారికే వేసి.. వారిని గెలిపించాలని కోరుతున్నాం’అని ట్వీట్లో పేర్కొన్నారు.✊ ఈరోజు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు💠 ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో… pic.twitter.com/V7KWVFSdpt— KTR (@KTRBRS) May 18, 2024 -
జనసేనతో పొత్తు ఉన్నా లేనట్లే
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న తనకు మద్దతుగా బహిరంగ ప్రకటన చేయాలని స్వయంగా మిత్రపక్ష జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ను కోరినా ఆయన స్పందించలేదని.. క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసే పరిస్థితి లేనప్పుడు బీజేపీ–జనసేన కలిసి ఉన్నా లేనట్లే అని శాసనమండలిలో బీజేపీ పక్ష నాయకుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ ఘాటుగా స్పందించారు. పొత్తులో కొనసాగుతున్నప్పటికీ జనసేన ఎక్కడా బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలపని అంశంపై మంగళవారం విజయవాడలో జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇన్చార్జిల సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన సాగిన ఈ సమావేశంలో కేంద్ర పార్టీ నుంచి జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలను మాధవ్తో పాటు మరో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, పార్టీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు జనసేనతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేం జనసేనతో కలిసి ఉన్నా లేనట్లేనన్న వాతావరణం ఉంది. ఇటీవల పవన్ కూడా జనసేన–బీజేపీ పొత్తు ఉంది అన్నారు. అయితే, క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం లేదన్నది వాస్తవం. నిజంగా పొత్తులో ఉంటే క్షేత్రస్థాయిలో కూడా కలిసి పనిచేయాలని కోరుతున్నాం. ఆ విధంగా వెళ్తేనే ప్రజలలో మనం కలిసి వెళ్తుతున్నామన్న మాటకు అర్థం ఉంటుంది. నామ్కే వాస్త్గా పొత్తుతో ఉపయోగం లేదని మా అందరి అభిప్రాయం’.. అని మాధవ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ పొత్తు కొనసాగాలనే కోరుకుంటున్నాం.. ‘బీజేపీ–జనసేన కలిసి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ ఇప్పటికీ కోరుకుంటోంది. కలిసి పనిచేస్తే ప్రజా మద్దతు రెండు పార్టీలకు ఉంటుంది. ఆయనా (పవన్) నమ్మాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రకటన చేయాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. పోటీలో ఉన్న అభ్యర్థిగా నేనూ అడిగాను. చాలాసార్లు కోరాం. కానీ, ప్రకటన రాలేదు. మరోవైపు.. ఉత్తరాంధ్రలో పీడీఎఫ్ అభ్యర్థి తమకు జనసేన మద్దతు ఉందని ప్రచారం చేసుకున్నారని, దానిని ఖండించమని కోరినా ఖండించలేదు’.. అని మాధవ్ చెప్పారు. కలిసి పనిచేసే విషయంలో బీజేపీ నుంచే స్పందనలేదని పవన్కళ్యాణ్ అంటున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఆయన వైపు నుంచే స్పందనలేదు’ అని బదులిచ్చారు. అందుకే సొంతంగా ఎదగాలనినిర్ణయించుకున్నాం.. ‘జనసేనతో కలిసి ఉన్నా లేనట్లేనన్న వాతావరణం నేపథ్యంలో పార్టీ తనంతట తాను ఎదిగేలా అన్ని ఏర్పాట్లుచేసుకోవాలని అనుకున్నాం. ఇందులో భాగంగా ఏప్రిల్ 1–14 వరకు బూత్ స్వశక్తీకరణ అభియాన్ కార్యక్రమం చేస్తున్నాం. మే ఒకటి తర్వాత ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీటు వేసే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం. ఏదైనా పొత్తు నిర్ణయం ఉంటే కేంద్ర పార్టీ ఆలోచిస్తుంది’ అని మాధవ్ చెప్పారు. -
'ఓట్ల లెక్కింపులో అక్రమాలు చూపినా ఆర్ఓ పట్టించుకోలేదు'
అనంతపురం క్రైం: ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, వాటిని సాక్ష్యాలతో సహా చూపించినా రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ), కలెక్టర్ నాగలక్ష్మి పట్టించుకోలేదని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల కౌంటింగ్లో అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావడం దేనికి సంకేతం అని ప్రశి్నంచారు. పైగా వారు తమకు పడ్డ ఓట్లను సైతం తగ్గించి చూపించారని మండిపడ్డారు. ఆదివారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రంలో కళ్ల ముందు జరిగిన అన్యాయాన్ని చూసి చాలా బాధేసిందన్నారు. ‘కౌంటింగ్ నిర్వహణలో కలెక్టర్, ఎస్పీ పూర్తిగా వైఫల్యం చెందారు. టీడీపీకి అనైతికంగా మద్దతుగా నిలి్చన వీరిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, టీడీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ ప్రొద్దుటూరు ఇన్చార్జ్ ప్రవీణ్, కమలాపురం ఇన్చార్జ్ నరసింహారెడ్డి, పులివెందులకు చెందిన పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆలం నరసానాయుడు, వడ్డే మురళీ, సరిపూటి రమణ.. ఇలా పది మందికిపైగా టీడీపీ ముఖ్య నేతలు ఏజెంట్లుగా కూర్చున్నప్పటికీ ఆర్ఓ పట్టించుకోలేదు. వీరు కౌంటింగ్ హాల్లోని ప్రతి టేబుల్ వద్దకు వెళ్లి ప్రభావం చూపేలా వ్యవహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కౌంటింగ్ హాలులో పదుల సంఖ్యలో, పరిసర ప్రాంతాల్లో వందలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు తిష్ట వేసినా ఎస్పీ ఫక్కీరప్ప ప్రేక్షక పాత్ర పోషించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ► మాజీ సీఎం చంద్రబాబు ఫోన్ చేస్తే కలెక్టర్ నాగలక్షి్మ, ఎస్పీ ఫక్కీరప్పలు ఏవిధంగా మాట్లాడారు? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయాన్ని మరచిపోయారా? ► కౌంటింగ్ హాల్లో టేబుల్ నంబర్ 19లో ఓ అధికారి టీడీపీ అభ్యర్థివి 44, మా పార్టీవి ఆరు ఓట్లు కట్టకట్టి ఒకే దానిలో వేశారు. దీనిపై మా ఏజెంట్ ఫిర్యాదు చేయగా అసలు నిజం వెలుగు చూసింది. ► అదే అధికారి 3, 4, 5 రౌండ్లలోనూ ఉన్నాడని ఫిర్యాదు చేస్తే తనకేం సంబంధం లేదని రిటర్నింగ్ అధికారి చెప్పడమేంటి? అక్రమాలు జరిగినప్పుడు విచారణ చేయకపోతే ఆర్ఓగా ఎందుకున్నట్లు? మరో అధికారి.. తమవి 70 ఓట్లు ఉంటే ఆ కట్టపై 50 అని రాశారు. టీడీపీవి 30 ఉంటే 50 అని నమోదు చేశారు. ► ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థుల ఓట్లు గల్లంతైనట్లు ఫిర్యాదు చేసినా కలెక్టర్ పట్టించుకోలేదు. ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో నైతిక విజయం మాదే. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. చదవండి: ‘స్కిల్’ సూత్రధారి బాబే -
రెండో ప్రాధాన్యత ఓటుతో గట్టెక్కిన టీడీపీ
సాక్షి ప్రతినిధి, అనంతపురం/చిత్తూరు కలెక్టరేట్/సాక్షి, విశాఖపట్నం : తూర్పు, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండవ ప్రాధాన్యత ఓట్లతో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరూ గెలుపునకు సరిపడా ఓట్లు సాధించ లేక పోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లే గెలుపును నిర్ణయించాయి. మూడు రోజులుగా కొనసాగిన కౌంటింగ్ ప్రక్రియలో శనివారం తుది ఫలితాలు వెలువడ్డాయి. నువ్వా నేనా అన్నట్టు సాగిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి 7,543 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో మెజారిటీ రావడమే కాకుండా.. రెండో ప్రాధాన్యతలోనూ ఆధిక్యంలో కొనసాగిన వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి చివరి రౌండులో ఓటమి పాలయ్యారు. చివరి రౌండులో పీడీఎఫ్ అభ్యర్థి పోతుల నాగరాజుకు వచ్చిన 19వేల పైచిలుకు ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సందర్భంగా టీడీపీకి మెజార్టీ వచ్చింది. బీజేపీ అభ్యర్థి నగనూరు రాఘవేంద్రకు వచ్చిన ఓట్లలోనూ రెండో ప్రాధాన్యత ఓట్లు ఎక్కువగా టీడీపీకి వచ్చాయి. దీంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చెందిన ఎక్కువ ఓట్లు చెల్లుబాటు కాకపోవడం కూడా ఆ పార్టీ అభ్యర్థి ఓటమికి ఒక కారణంగా చెప్పుకుంటున్నారు. మొత్తం మీద బి.రామగోపాల్రెడ్డి (టీడీపీ)కి 1,09,781 ఓట్లు, వెన్నపూస రవీంద్రారెడ్డి (వైఎస్సార్సీపీ)కి 1,02,238 ఓట్లు వచ్చాయి. కాగా, అనంతపురంలోని కౌంటింగ్ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులు తిష్ట వేయడంతో తొలి నుంచి అనుమానాలు తలెత్తాయి. శుక్రవారం రాత్రి ఈ అనుమానాలు నిజమయ్యాయి. వైఎస్సార్సీపీ చెందిన ఓట్లు కొన్ని తెలుగుదేశం పార్టీ కట్టల్లోకి వెళ్లినట్టు తేలింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి మొత్తం ఓట్లను రీకౌంటింగ్ చేయాలని పట్టుపట్టారు. కానీ ఆ బాక్స్ వరకు మాత్రమే లెక్కిస్తామని, మొత్తం రీ కౌంటింగ్ కుదరదని అధికారులు చెప్పారు. కౌంటింగ్ జరుగుతున్న సేపు తెలుగుదేశం నాయకులు అక్కడున్న సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశారు. రెండో ప్రాధాన్యత ఓటుపై పీడీఎఫ్తో పొత్తు వల్లే గెలుపు తూర్పు రాయలసీమలో, ఉత్తరాంధ్రలోనూ పీడీఎఫ్ ఓట్ల వల్లే టీడీపీ అభ్యర్థులు గట్టెక్కగలిగారు. పొత్తు లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోతామన్న భయంతో ముందే పీడీఎఫ్ నేతలను బతిమాలి మరీ టీడీపీ నేతలు రెండవ ప్రాధాన్యత ఓటుపై పొత్తు పెట్టుకున్నారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో టీడీపీ గట్టెక్కగలిగింది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ (తూర్పు రాయలసీమ)గా టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్కు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో స్పష్టత రాకపోవడంతో.. పీడీఎఫ్ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డికి వచ్చిన రెండవ ప్రాధాన్యత ఓట్లతో గెలుపు వరించింది. శ్రీకాంత్కు 1,24,181 ఓట్లు రాగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్రెడ్డికి 90,071 ఓట్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థి వెంపాడ చిరంజీవిరావు రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. విజయానికి 94,509 ఓట్లు కావాల్సి ఉండగా, టీడీపీ మద్దతు అభ్యర్థికి 82,958 ఓట్లు.. వైఎస్సార్సీపీ మద్దతు అభ్యర్థి సీతంరాజు సుధాకర్కు 55,749, పీడీఎఫ్ అభ్యర్థికి 35,148 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 10,884 ఓట్లు వచ్చాయి. దీంతో 36 రౌండ్లలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. బీజేపీ, పీడీఎఫ్ ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతోనే టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. -
రెండు సీట్లకు ఎగిరి గంతేయడమే టీడీపీ స్టైల్!
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్సీ(శాసనమండలి) ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో.. తప్ప మిగిలిన అన్నిటిని కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి రెండు స్థానాలు దక్కాయి. దీంతో తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకుంటోంది. తప్పు లేదు. వందకు వంద మార్కులు వస్తాయని భావించిన వారు రెండు మార్కులు తగ్గితే బాధపడతారు. అదే సున్నా మార్కులు వస్తాయని అనుకున్నవారు రెండు మార్కులు వచ్చినా ఎగిరి గంతేస్తారు. అలాగే ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. టీడీపీ నేతలంతా మొత్తం సాదారణ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చేసినంత హడావుడి చేస్తున్నారు. తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వంటివి అయితే శరభ.. శరభ అంటున్నాయి. ఈనాడు అయితే ఏకంగా తిరుగుబాటు అనే హెడింగ్ పెట్టి ఆత్మ సంతృప్తి చెందింది. తమ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ అక్రమాలను బయటపెడతారా? అనే అక్కసు అందులో కనిపిస్తోంది. సహజంగానే ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల ఫలితాల తర్వాత సమీక్షించుకుని తన బలాన్ని బెరీజు వేసుకుంటుంది. ఇక్కడ గమ్మత్తు అయిన అంశం ఏమిటంటే పశ్చిమ,తూర్పు రాయలసీమలోని టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలు రెండిటిని వైఎస్ ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంటే దానిని ఏదో మామూలు విషయంగా చూస్తున్న టీడీపీ, రెండు చోట్ల గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలలో గెలవడం చాలా పెద్ద విషయం అనుకుంటోంది. స్థానిక సంస్థల నియోజకవర్గాలు తొమ్మిదింటికి గాను ఐదింటిని వైసీపీ ఏకగ్రీవంగా నెగ్గింది. మరో నాలుగింట టీడీపీ మద్దతుతో కొందరు పోటీచేసినా ఫలితం దక్కలేదు.. పశ్చిమగోదావరి వంటి చోట్ల వైసీపీకి ఉన్న బలం కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయట. ఆ సంగతిని టీడీపీ మీడియా కప్పిపుచ్చే యత్నం చేస్తోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమలలోని గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలలో టీడీపీ గెలవడంతో వైసీపీకి పతనం ఆరంభం అయిందని టీడీపీ సీనియర్ నేతలంతా స్టేట్మెంట్లు ఇచ్చేశారు. గ్రాడ్యుయేట్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న వాదన చేసేవారు టీచర్లలో ప్రభుత్వ సానుకూలత ఉందని ఒప్పుకోవలసి ఉంటుంది. నిజానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయా అంటే అది పరిమితం అని చెప్పాలి. అలా అని అసలు ప్రాధాన్యత లేదని కాదు. కానీ గ్రాడ్యుయేట్లు ముందుగా తమ ఓటును రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్నికలు జరిగిన ప్రాంతాలను పరిగణనలోకి తీసుకున్నా ఏభై లక్షల మందికి పైనే గ్రాడ్యుయేట్లు ఉండాలి. కానీ అధికారికంగా ఓట్ల సంఖ్య మాత్రం తొమ్మిది లక్షలే!. .. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ఇతర రంగాలలోని గ్రాడ్యుయేట్లు ఉండవచ్చు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఉద్యోగులను, టీచర్లను టీడీపీ కాని, ఆ పార్టీ మీడియా కానీ, విపరీతంగా రెచ్చగొడుతున్నాయి. బహుశా ఆ ప్రభావం కొంతమేర పడి ఉండడం వల్ల గ్రాడ్యుయేట్ సీట్లలో వైసీపీకి నష్టం కలిగి ఉండవచ్చు. లేదా అభ్యర్థి ఎంపికలో లోపం ఉండవచ్చు. పార్టీ నాయకత్వంలో సమన్వయ లోపం కారణం కావచ్చు. అతి విశ్వాసం కూడా ఉండి ఉండవచ్చు. విశాఖలో అయితే పార్టీలకు అతీతంగా చిరంజీవిరావుకు ఓట్లు పడ్డాయట. దానికి కారణం ఆయన గ్రూప్ పరీక్షలకు భోధన చేసే లెక్చరర్ కావడమట. అది టీడీపీకి కలిసి వచ్చింది. మరి టీడీపీ స్థానిక సంస్థల నియోజకవర్గాలలో కానీ, టీచర్ల నియోజకవర్గాలలో కానీ ఓటమి చవిచూడడానికి కూడా కారణాలు ఉంటాయి కదా? వాటిని విస్మరించి టీడీపీ వారు కేవలం గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో గెలిచినందుకే రెచ్చిపోతే వారికి ఎంత ప్రయోజనమో తెలియదు. నిజానికి గతంలో గ్రాడ్యుయేట్లు, టీచర్ల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంత ప్రాధాన్యత ఉండేది కాదు. ప్రధాన రాజకీయ పార్టీలు స్వయంగా రంగంలో దిగేవికావు. కానీ కాలక్రమేణా అభ్యర్దులకు పరోక్ష మద్దతు, తదుపరి ప్రత్యక్షంగా పార్టీలే రంగంలో దిగడం జరిగింది. టీచర్ల స్థానాలో ఎక్కువగా వామపక్షాలకు సంబందించిన సంఘాల నేతలు పోటీపడేవారు. గ్రాడ్యుయేట్ల స్థానాలలో బీజేపీ, వామపక్షాలు అధికంగా పోటీ పడేవి. దానికి ప్రత్యేక కారణం కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీలకు పెద్దగా సీట్లు వచ్చే పరిస్థితి లేదు. అందుకే పరిమిత ఓటర్లు ఉండే ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇవి ఎక్కువగా దృష్టి పెడుతుండేవి. ఈసారి రెండు ప్రధాన రాజకీయ పార్టీలు పోటీపడడంతో వామపక్షాల సంఘాల అభ్యర్దులు, బీజేపీ అభ్యర్థులు పూర్తిగా తెరమరుగు అయినట్లుగా కనిపిస్తోంది. గతసారి బీజేపీ అభ్యర్ధిగా గెలిచిన మాదవ్ ఈసారి పరాజయం చెందారు. తెలుగుదేశం మీడియా ఈ ఎన్నికల ఫలితాలపై ఒక విశ్లేషణ ప్రచారం చేస్తోంది. గ్రాడ్యుయేట్ల స్థానాలు వంద శాసనసభ స్థానాల పరిధిలో ఉన్నాయని, అందువల్ల ఈ ఫలితాలు వచ్చే సాధారణ ఎన్నికలకు నాందీ అవుతాయని ఆ మీడియా అంటున్నది. అదే నిజమైతే.. ఎన్నికలు జరిగిన ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, శ్రీకాకుళం మొదలైన జిల్లాలు స్థానిక సంస్థల నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. అవన్నీ వైసీపీ పరం అయ్యాయి. అంటే ఈ జిల్లాలన్నిటిలో టీడీపీ తుడిచిపెట్టుకుని పోయినట్లు అంగీకరిస్తారా? రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో టీచర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ రెండు సీట్లు వైసీపీ గెలుచుకుంది. టీడీపీకి అవకాశం లేకుండా పోయిందని అంగీకరిస్తారా? ఈ ఎన్నికల ఫలితాల ప్రాతిపదికనే ఒక అభిప్రాయానికి రావడం కరెక్టు కాకపోవచ్చు. గత నాలుగేళ్లలో జరిగిన అన్ని ఎన్నికలలో వైసీపీనే గెలిచింది. చివరికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే కుప్పంలో సైతం స్థానిక ఎన్నికలన్నిటిని వైసీపీ గెలుచుకుంది. అందువల్ల టీడీపీ పని అయిపోయినట్లు ఎవరైనా అంటే ఒప్పుకుంటారా? అదే సమయంలో వీటిని ఒక సంకేతంగా తీసుకోవడం ఆక్షేపణీయం కాదు. ఆ రకంగా చూసినా టీడీపీ గ్రాడ్యుయేట్ల స్థానాలలోనే గెలిచింది. మిగిలిన అన్ని వైసీపీనే గెలుచుకుంది. మండలి ఎన్నికలలో గెలిచినంత మాత్రాన సాదారణ ఎన్నికలలో గెలవాలని లేదు. ఉత్తరాంద్రలో గతసారి బీజేపీ అభ్యర్ధి మాధవ్ మండలికి గెలిచినా, ఆ తర్వాత జరిగిన సాదారణ ఎన్నికలలో బీజేపీకి ఆ ప్రాంతంలో ఒక్క సీటు కూడా రాలేదు. పీడీఎఫ్ పేరుతో వామపక్ష అభ్యర్దులు పోటీ చేస్తుంటారు. ఉదాహరణకు ఏలూరులో సూర్యారావు అనే టీచర్ వామపక్షవాది. ఆయన మండలి ఎన్నికలలో గెలిచారు. ఆ తదుపరి శాసనసభ ఎన్నికలలో ఆ ప్రాంతంలో సీపీఎం విజయం సాదించలేదు. పీడీఎఫ్ అభ్యర్దులు గెలిచిన జిల్లాలలో శాసనసభ ఎన్నికలలో వారి ప్రభావం ఏమీ కనిపించలేదు. తెలంగాణలో గతంలో బీజేపీ నేత ఎమ్. రామచంద్రరావు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో గెలుపొందారు. కానీ ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. తెలుగుదేశం పార్టీ తనకు ఈ రెండు చోట్ల గెలవడం ఎంతో ఉపయోగంగా సహజంగానే భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే ప్రజలను ప్రభావితం చేసి శాసనసభ ఎన్నికలలో ఫలితం రాబట్టడానికి తంటాలు పడుతోంది. కానీ శాసనసభ ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాది సమయం ఉందన్న సంగతి మర్చిపోరాదు. తాము రెండు చోట్ల గెలిచాము కాబట్టి మండలి ఎన్నికలలో అక్రమాలు జరగలేదని టీడీపీ చెబుతుందేమో తెలియదు. తొలుత తన విజయం మీద నమ్మకం లేక టీడీపీ వర్గాలు అసలు కౌంటింగే జరగరాదని ఏకంగా కోర్టుకే వెళ్లారు. పోలింగ్లో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ఇప్పుడు టీడీపీ ఆ విషయం చెప్పడం లేదు. గతంలో నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలిచిన తర్వాత ఇంకేముంది.. 2019 శాసనసభ ఎన్నికలలో కూడా తమదే గెలుపు అని టీడీపీ నేతలు బీరాలు పోయేవారు. కానీ 2019 ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం మూటకట్టుకోగా, వైసీపీ ఘన విజయం సాధించింది. ఇలా ఎన్నో అనుభవాలు ఉన్నా టీడీపీ అధినాయకత్వం మండలి ఎన్నికల ఫలితాలపైనే ఇంత ప్రచారం చేయడం కేవలం ప్రజలను ప్రభావితం చేయాలన్న ఆశతోనే. కానీ అసలు ఎన్నికలకు ఇంకా ఏడాది టైమ్ ఉందన్న సంగతి గుర్తుంచుకోవాలి. వైఎస్సార్ సీపీ అధినేత , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనసభలో ఒక మాట అన్నారు. పెత్తందారులకు, సామాన్యులకు పోరాటం జరుగుతోందని, తన నడక సామాన్యులతోనేనని, పేదల సంక్షేమం, అభివృద్ధే తన లక్ష్యమని ఆయన స్పష్టంగా చెప్పారు. శాసనసభ సాదారణ ఎన్నికలలో పేద, మధ్య తరగతి ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపే ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇంతకాలం ప్రభుత్వానికి వారే అండగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా అందుకు భిన్నంగా ఉంటారని అనుకోజాలం. గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో గెలవలేకపోవడం వారికి కొంత అసంతృప్తి కలిగించవచ్చేమో కానీ.. అవే వచ్చే శాసనసభ ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయని భావించవలసిన అవసరం లేదు. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ -
Fact Check: టీడీపీ అసత్య ప్రచారం.. అందులో వాస్తవం లేదు
సాక్షి, అమరావతి: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పులివెందులలో అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థి కంటే టీడీపీ అభ్యర్థికి అధిక ఓట్లు వచ్చాయని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం శుక్రవారం ట్విట్టర్లో తెలిపింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వాదన పూర్తిగా నిరాధారమని పేర్కొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. ఎమ్మెల్యే ఎన్నికల మాదిరిగా నియోజకవర్గాల వారీగా జరగదని గుర్తుచేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విడివిడిగా కాకుండా పోలైన ఓట్లన్నీ కలిపే లెక్కింపు చేస్తారని స్పష్టంచేసింది. త్వరలో ఎన్నికల సంఘం తుది వివరాలను ప్రకటిస్తుందని, అసత్య వార్తలను నమ్మవద్దని కోరింది. చదవండి: జై కొట్టిన టీచర్లు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా -
పటిష్టంగా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ
కడప సిటీ: పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ విజయరామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాలులో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై జేసీ సాయికాంత్వర్మ, ఏఎస్పీ తుషార్డూడి, నగర పాలక సంస్థ కమిషనర్ జీఎస్ఎస్ ప్రవీణ్చంద్, అసిస్టెంట్ కలెక్టర్లు ‡రాహుల్మీనా, ప్రవీణ్, డీఆర్వో గంగాధర్గౌడ్తో కలిసి ఎన్నికల నోడల్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గతంలో జరిగిన ఎన్నికల విజయవంతానికి ఏ విధంగా కృషి చేశారో అదే స్ఫూర్తితో ఈ ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. పోలింగ్ సిబ్బందిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా లేని వారిని మాత్రమే నియమించాలన్నారు. వారి సొంత మండలంగానీ, వారు విధులు నిర్వర్తించే మండలానికిగానీ విధులను కేటాయించరాదన్నారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఎన్నికల నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికలకు అవసరమైన వాహనాలను రూట్ మ్యాప్ వేసుకుని ఆ ప్రకారంగా సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల పరంగా ఏవైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే 1950 టోల్ఫ్రీ నంబరుకు కాల్ చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు ధర్మచంద్రారెడ్డి, వెంకట రమణ, జెడ్పీ సీఈఓ సుధాకర్రెడ్డి, డీపీఓ ప్రభాకర్రెడ్డి, సీపీఓ వెంకట్రావు, డ్వామా, డీఆర్డీఏ, మెప్మా, ఏపీఎంఐపీ పీడీలు యదుభూషణరెడ్డి, ఆనంద్ నాయక్, రామ్మోహన్రెడ్డి, రవీంద్రారెడ్డితోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఏపీ, తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు, 3 గ్రాడ్యుయేట్ స్థానాలకు, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, మరో స్థానిక సంస్థల స్థానానికి ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 16న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. -
Graduates MLC: పట్టం కట్టేదెవరికి.. పాఠం కలిసొచ్చేదెవరికి?
రాయలసీమ పశ్చిమ నియోజకవర్గానికి జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఘట్టంలో తొలి అంకం ముగిసింది. గత నెల 30న తుది ఓటరు జాబితా ఖరారైంది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. దీంతో ప్రధాన పారీ్టలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థులతో పాటు ఆశావహులు ప్రచారపర్వంపై దృష్టి సారించారు. ఆరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ఓటర్లతో సమావేశమవుతున్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. – సాక్షి ప్రతినిధి కర్నూలు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్రెడ్డి, కత్తి నరసింహారెడ్డిల పదవీకాలం మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వీటి భర్తీకి ఉపక్రమించింది. ఇప్పటికే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థులు వెన్నపూస రవీంద్రారెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థులు విస్తృత ప్రచారంలో తలమునకలవుతున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులతో.. యూనియన్ల వారీగా, శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు కోరుతున్నారు. పట్టభద్రుల కోటాలో 3,28,807 ఓట్లు నమోదయ్యాయి. గత ఎన్నికల్లో 2.52లక్షలు మాత్రమే ఉన్నాయి. అంటే గతంతో పోలిస్తే 76వేల ఓట్లు అధికం. పెరిగిన ఓట్లు ప్రభుత్వ పనితీరును, గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులపై ప్రభుత్వ చిత్తశుద్ధిని స్పష్టం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థులతో పాటు ‘అనంత’ నుంచి పోటీ చేస్తోన్న బీసీ నాగరాజు మధ్య ప్రధాన పోటీ ఉండే అకాశం ఉంది. వీరితో పాటు బోరంపల్లి ఆంజనేయులు, గైబున్నీసా, బోయ నాగరాజు, పట్టుపోగుల పవన్ కుమార్తో పాటు పలువురు పోటీలో ఉన్నా, పోటీ మాత్రం ఆ ముగ్గురి మధ్యనే ఉన్నట్లు తెలుస్తోంది. వెన్నపూస రవీంద్రారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఎన్జీవో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు తనయుడు కావడం సానుకూలాంశం. రాంగోపాల్రెడ్డి పులివెందుల నియోజవకర్గ వాసి. ఎవ్వరికీ తెలియని వ్యక్తి! రవీంద్రారెడ్డి అభ్యరి్థత్వాన్ని ఆరు జిల్లాలలోని 26మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇన్చార్జీలు ఏకగ్రీవంగా సమర్థించారు. బాధ్యత తీసుకుని గెలుపునకు కృషి చేస్తున్నారు. రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాల్లో 49 చోట్ల ఓడిపోయామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘోర పరాభావం తప్పదని, పోటీ వద్దని టీడీపీ ఇన్చార్జీలు భావించారు. గత ఎన్నికల్లో ప్రతిపక్ష పారీ్టగా వైఎస్సార్సీపీ ఉండి ఎమ్మెల్సీ గెలిచిందని, ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండి కనీసం పోటీ చేయకుంటే ఆ ప్రభావం కేడర్పై బలంగా పడుతుందని నామమాత్రపు పోటీకి సిద్ధమైంది. పోటీకి అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో రాంగోపాల్రెడ్డిని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో తెలిసిందే. అక్కడ టీడీపీకి ఎలాంటి విజయాలు లేవు. అలాంటి నియోజకవర్గం నుంచి అభ్యర్థిని నిలపడం చూస్తే ఈ ఎన్నికలను టీడీపీ ఎంత సీరియస్గా తీసుకుందో అర్థమవుతోంది. రవీంద్రారెడ్డి 28 నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి తరచూ సమావేశాలు నిర్వహించి ఓటర్లను కలుస్తున్నారు. రాంగోపాల్రెడ్డి చంద్రబాబు పర్యటనలో మినహా ఎక్కడా కనిపించని పరిస్థితి. వైఎస్సార్సీపీ అభ్యర్థికి అనుకూల అంశాలు ►సచివాలయాల ఏర్పాటుతో వేలాది నిరుద్యోగులకు సర్కారు కొలువులు. ►ఇచ్చిన మాటకు కట్టుబడి ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో పాటు పర్మనెంట్ చేయడం. ►పోలీస్రిక్రూట్మెంట్ ద్వారా 6,900 పైగా ఉద్యోగాల భర్తీకి చర్యలు. ►అభ్యర్థుల వినతి మేరకు వయస్సు సడలింపు నిర్ణయం. ►న్యాయశాఖ పరిధిలో 3వేలకుపైగా ఉద్యోగాల భర్తీ ►గ్రూప్–1 నోటిఫికేషన్కు చర్యలు. ►వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో ఖాళీలన్నీ భర్తీకి నిర్ణయం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలోనూ త్రిముఖ పోరే.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో 27,716 ఓట్లు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ఈ ఓట్లు కూడా పెరిగాయి. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డితో పాటు బీజేపీ నేత ఒంటేరు శ్రీనివాసరెడ్డి, రామచంద్రారెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి, అనిల్కుమార్రెడ్డితో పాటు పలువురు పోటీ చేస్తున్నారు. కత్తి, ఒంటేరు, రామచంద్రారెడ్డి మధ్య త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది. కత్తి ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘానికి చెందిన వ్యక్తి. ఉపాధ్యాయ ఎన్నికల్లో యూనియన్లు ప్రధానపాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక్కడ అభ్యర్థి గెలుపోటములను యూనియన్లే ప్రభావితం చేయనున్నాయి. దీంతో అభ్యర్థులంతా యూనియన్ల నేతలు, సభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలి
సాక్షి, అమరావతి: త్వరలో జరగనున్న పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపునకు పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు కృషి చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా సీతంరాజుసుధాకర్, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నియోజకవర్గం అభ్యర్థిగా పేర్నాటి శ్యాంప్రసాద్రెడ్డి, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా వెన్నపూస రవి పోటీ చేస్తున్నారని తెలిపారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోటీ
సాక్షి, అమరావతి: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యక్తం చేసిన ఏకాభిప్రాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదించారు. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల గ్రాడ్యుయేట్.... ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్.... ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు చిత్తూరు జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, రెండు టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమవారం సచివాలయంలో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం వైఎస్ జగన్ సమావేశమై అభిప్రాయాలను స్వీకరించారు. వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయం వ్యక్తం చేయడంతో సీఎం జగన్ ఆమోదించారు. గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలను గతంలో ప్రాధాన్యతగా తీసుకోలేదని సీఎం జగన్ పేర్కొనగా.. ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వడం, ఉత్సాహవంతులకు అండగా నిలిచామని ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. అయితే శాసనమండలిలో ప్రభుత్వపరంగా విధానపరమైన నిర్ణయాలకు మద్దతు కోరినప్పుడు మన మద్దతుతో గెలిచిన వారు కూడా మొహం చాటేసిన పరిస్థితులను చూశామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పోటీ చేయడమే మంచిదని ఏకాభిప్రాయంతో సీఎం జగన్కు నివేదించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సూచనకు సీఎం జగన్ అంగీకరించారు. ముందుగా ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను తీసుకుని మూడు గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ ఖరారుచేశారు. ఉమ్మడి విశాఖ– విజయనగరం – శ్రీకాకుళం గ్రాడ్యుయేట్ స్థానానికి అభ్యర్థిగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఎస్.సుధాకర్ను ఖరారు చేశారు. ఉమ్మడి ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు గ్రాడ్యుయేట్ స్థానానికి గూడూరు నియోజకవర్గానికి చెందిన శ్యాంప్రసాద్రెడ్డి అభ్యర్థిత్వాన్ని సీఎం జగన్ ఖరారు చేశారు. ఉమ్మడి కర్నూలు–కడప– అనంతపురం గ్రాడ్యుయేట్ స్థానానికి వెన్నపూస రవి పేరును ఖరారు చేశారు. టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ, అభ్యర్థిపై తర్వాత నిర్ణయం తీసుకుందామని సీఎం జగన్ సూచించారు. -
APలో 3గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో YSRCP పోటీ
-
మల్లన్న ఓటమిని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య
నాంపల్లి (మునుగోడు): తీన్మార్ మల్లన్న ఓటమిని తట్టుకోలేక యువకుడు ఆత్మహ త్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లిలో ఆదివారం జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఏర్పుల శ్రీశైలం (22) ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తీన్మార్ మల్లన్న చేపట్టిన పాదయాత్రలో మూడు నెలల పాటు కళాకారుడిగా పని చేశాడు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సందర్భం గా రెండ్రోజుల పాటు ఇంట్లోనే టీవీకి అతుక్కుపోయి కౌంటింగ్ ప్రక్రియను చూశాడు. శనివారం రాత్రి మల్లన్న ఓడిపోయాడని తెలిసి భోజ నం చేయలేదు. ఆదివారం ఉదయం ఇంట్లో ఉన్న పురుగుల మందు డబ్బాను తీసుకుని పక్కనే ఉన్న గుడిసెలోకి వెళ్లి తాగాడు. ఆ తర్వాత ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేయగా వారు ఎత్తలేదు. అంతలో అతడిని గమనించిన తల్లిదండ్రులు, చెల్లెలు ఇలా ఎందుకు చేశావని శ్రీశైలాన్ని అడిగారు. తీన్మార్ మల్లన్న ఓడిపోవడం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని అన్నాడని కుటుంబసభ్యులు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం శ్రీశైలాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. శ్రీశైలం తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. శ్రీశైలం కుటుంబసభ్యులను ఆదివారం తీన్మార్ మల్లన్న పరామర్శించారు. కుటుంబానికి రూ.50 వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. శ్రీశైలం చెల్లెలి వివాహానికి రూ.లక్ష చెక్కును అందజేశారు. చదవండి: ఓడి.. గెలిచిన తీన్మార్ మల్లన్న -
ఎమ్మెల్సీ ఎన్నికలు: ఫెయిలైన ప్రొఫెసర్లు..!
-
‘పీఆర్సీ ఇవ్వరనే భయంతో టీఆర్ఎస్కు ఓటేశారు’
-
‘పీఆర్సీ ఇవ్వరనే భయంతో టీఆర్ఎస్కు ఓటేశారు’
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ పెరిగిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఓటమి లక్ష్యంగా కొన్ని పార్టీలు పని చేశాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులు లేవని సీఎం కేసీఆర్కు అర్థమైందని తెలిపారు. అందుకే సీఎం కేసీఆర్ బయటకు రాకుండా వేరే పార్టీ నేత ముఖం పెట్టుకుని వచ్చారని మండిపడ్డారు. బీజేపీతో టీఆర్ఎస్లో భయం పట్టుకుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. బంగారు తెలంగాణలో గత పీఆర్సీ కంటే ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ భయంతో కేసీఆర్ ముఖంలో నవ్వు కరువైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టి టీఆర్ఎస్ గెలిచిందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఉద్యోగులను మానసికంగా ఇబ్బంది పెట్టారని బండి సంజయ్ మండిపడ్డారు. పట్టభద్రులు టీఆర్ఎస్ మీద ప్రేమతో ఓటు వేయలేదన్నారు. పీఆర్సీ ఇవ్వరని భయపడే టీఆర్ఎస్కు ఓటేశారని తెలిపారు. పీఆర్సీ ఇవ్వకపోతే సీఎం కేసీఆర్ తలదించుకునేలా చేస్తామని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్, నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 70 శాతం మంది ఓటర్లు టీఆర్ఎస్ను వ్యతిరేకించారని అన్నారు. ఓట్లు చీలడం వల్లే టీఆర్ఎస్ గెలిచిందని, గుర్రం బోడు, భైంసా ఘటనలు, తమ నాయకులపై రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దాడులను మరచిపోమని తెలిపారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పారు. అన్ని కేంద్రం ఇస్తే నువ్వు ఎందుకు ఇక్కడ అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ వాళ్లు వైజాగ్ వెళ్లినా ఎవరు పట్టించుకోరని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. చదవండి: ప్రపంచమంతా ఆగమైతుంటే... ఇక్కడెలా పెరిగింది? -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ భేరీ మోగించడంతో టీఆర్ఎస్ పార్టీకి మళ్లీ జోష్
-
వాడిన కమలం: ‘సిట్టింగ్’ కోల్పోయి.. ‘సెకండ్’ పోగొట్టుకుని!
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ఆత్మ రక్షణలోకి నెట్టాయి. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కోల్పోవడంతో పాటు గతంలో రెండో స్థానంలో నిలిచిన స్థానంలో ఈసారి నాలుగో స్థానానికి దిగజారడం ఆ పార్టీ నేతలను కలవరపరుస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకొంటున్న కమలనాథులు ఈ ఫలితాలతో కంగుతిన్నారు. అధికార టీఆర్ఎస్ అనుసరించిన వ్యూహం ముందు నిలవలేకపోయామా? లేదా పట్టభద్రుల ప్రయోజనాలను పసిగట్టడంలో విఫలమయ్యామా? అనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. అయితే పార్టీ విశ్లేషణలు ఎలా ఉన్నా ఈ ఎన్నికల ద్వారా బీజేపీ రాజకీయంగా నష్టపోయినట్లేనని చర్చ జరుగుతోంది. గెలుస్తామనుకున్న సిట్టింగ్ చేజారి.. కచ్చితంగా గెలుస్తామనుకున్న మహబూబ్నగర్– హైదరాబాద్– రంగారెడ్డిలో బీజేపీకి ఓటమి ఎదురుకావడంతో బీజేపీ శ్రేణులు నైరాశ్యంలో పడ్డాయి. బీజేపీ అభ్యర్థి రామ్చందర్రావు సామాజిక వర్గానికే చెందిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు వాణీదేవిని టీఆర్ఎస్ అనూహ్యంగా బరిలో నిలపడంతో ఆ వర్గం ఓట్లు చీలిపోయాయన్న ఆలోచనల్లో పడింది. మరోవైపు ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ, పీఆర్సీ ఇవ్వబోతున్నారన్న ఉద్యోగ సంఘాల ప్రకటనలు తమ అభ్యర్థి ఓటమికి ప్రధాన కారణంగా బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ శ్రేణుల్లో ఉన్న అసంతృప్తి కూడా బీజేపీ ఓటమికి కారణం అయిందనే వాదనలు ఉన్నాయి. సిట్టింగ్ అభ్యర్థి రామ్చందర్రావు రెండు సార్లు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయడం, ఎంపీగా ఆయననే పోటీలో నిలపడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయనకే టికెటివ్వడం వంటివి పార్టీలోని కొన్ని వర్గాలను అసంతృప్తికి గురి చేసిందనే వాదనలు ఉన్నాయి. గుజ్జుల ప్రేమేందర్రెడ్డి వరంగల్ వరకే పరిమితమైన నేత అనే భావన పట్టభద్రుల్లో ఉంది. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పార్టీ సంస్థాగతంగా బలంగా లేదని, అక్కడి పట్టభద్రుల ఓట్లను రాబట్టుకోవడంలో విఫలమైందనే వాదనలు ఉన్నాయి. దీంతో 2015లో 2వ స్థానంలో ఉన్న బీజేపీ ఈసారి 4వ స్థానానికి పడిపోయింది. హైదరాబాద్పై పెట్టినంత దృష్టి వరంగల్పై పెట్టలేదని, అందుకే నాలుగో స్థానాకి పరిమితమైందన్న చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పట్టభద్రులను పట్టించుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఆ గెలుపును ఉపయోగించుకోలేకపోయామా? దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొందిన గెలుపును సరిగ్గా వినియోగించుకోలేకపోయామన్న అభిప్రాయం కొందరు నేతల నుంచి వ్యక్తం అవుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచాం కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఎలాగూ ఓట్లు వేస్తారనే ఆలోచనలు కూడా తమ ఓట మికి కారణం అయిందన్న భావన నెలకొంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోయారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. కొత్తగా చేరిన నేతలు అందరినీ ఆయా నియోజకవర్గాల్లో చేపట్టిన ప్రచారంలో కలుపుకొని పోలేదన్న విమర్శలు ఉన్నాయి. అభ్యర్థుల గెలుపు విషయంలో పార్టీ శ్రేణులంతా తీవ్రస్థాయిలో కృషి చేయలేదన్న వాదన ఉంది. ఉద్యోగాల కల్పనపై టీఆర్ఎస్ ప్రకటనలను తిప్పికొట్టడంలో వెనుకంజలో ఉన్నారని, కాంగ్రెస్ తరహాలో కూడా విమర్శలు చేయలేకపోయారన్న విమర్శలు వచ్చాయి. కొన్ని అంశాలలో భావోద్వేగ ప్రకటనలు కొన్ని వర్గాల ఓటర్లను దూరం చేశాయని, అదే నల్లగొండ స్థానంలో రెండో ప్రాధాన్యం దక్కకుండా చేసిందని, ఫలితంగా పరాభవం మూటగట్టుకోవాల్సి వచ్చిందన్న చర్చ జరుగుతోంది. చదవండి: MLC Election Results: ఓడి.. గెలిచిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికలు: ఫెయిలైన ప్రొఫెసర్లు..! -
ఎమ్మెల్సీ ఎన్నికలు: ఫెయిలైన ప్రొఫెసర్లు..!
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజులుగా ఉత్కంఠ నడుమ సాగిన మండలి పట్టభద్రుల కోటా ఓట్ల లెక్కింపులో ఇద్దరు ప్రొఫెసర్లు ఓటమి చెందగా, టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన విద్యా సంస్థల యజమానులు ఇద్దరూ విజేతలుగా నిలిచారు. వారిపై పోటీ చేసిన ఇద్దరు ప్రొఫెసర్లు మాత్రం మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. పైగా వారికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థుల విజయంలో కీలకపాత్ర పోషించడం గమనార్హం. మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 53,610 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన నాగేశ్వర్.. లెక్కింపు ప్రక్రియలో చివరి వరకు కొనసాగినా ఎలిమినేషన్ ప్రక్రియలో తగినన్ని ఓట్లు సాధించలేకపోయారు. ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’పట్టభద్రుల స్థానంలో తొలిసారిగా బరిలోకి దిగిన టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. 70,072 ప్రథమ ప్రాధాన్యత ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. పట్టభద్రుల కోటా ఎన్నికల్లో ప్రొఫెసర్లు ఓటమి చెందడం చర్చనీయాంశమైంది. కాగా, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన పలువురు నేతలు కూడా ప్రస్తుత ఎన్నికల్లో ఓటమి చెందారు. ‘నల్లగొండ’స్థానం నుంచి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపకుడు చెరుకు సుధాకర్, యువ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమలు గణనీయంగా ఓట్లు సాధించినా.. గెలుపు తీరాలకు చేరలేకపోయారు. చదవండి: MLC Election Results: ఓడి.. గెలిచిన తీన్మార్ మల్లన్న కేసీఆర్ చాణక్యం: టీఆర్ఎస్కు కలిసొచ్చిన అంశాలివే.. -
కేసీఆర్ చాణక్యం: టీఆర్ఎస్కు కలిసొచ్చిన అంశాలివే..
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ భేరీ మోగించడంతో టీఆర్ఎస్ పార్టీకి మళ్లీ జోష్ వచ్చింది. ఒక సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు కమలం చేతిలో ఉన్న స్థానాన్ని కూడా చేజిక్కించుకుని కారు పార్టీ సత్తా చాటింది. టీఆర్ఎస్ అనుసరించిన బహుముఖ వ్యూహం, ఎత్తుగడలు పార్టీ అభ్యర్థుల విజయానికి బాటలు వేశాయి. టీఆర్ఎస్కు కలిసొచ్చిన అంశాలను ఓసారి పరిశీలిస్తే.. ఫలించిన ‘అనూహ్య అభ్యర్థి’ఎత్తుగడ ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’పట్టభద్రుల స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిని మరోమారు అభ్యర్థిగా ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్నగర్’బరిలో అభ్యర్థిని నిలిపే విషయంలో చివరి నిముషం వరకు గోప్యత పాటించారు. ‘హైదరాబాద్’స్థానానికి 2007, 2009, 2015లో జరిగిన ఎన్నికల్లో 2009 మినహా మిగతా రెండు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని నిలిపినా టీఆర్ఎస్ విజయం సాధించలేదు. దీంతో ప్రస్తుత ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పోటీ చేసే అవకాశం లేదని, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్కు మద్దతు ఇస్తుందని కూడా ఓ దశలో ప్రచారం జరిగింది. ఫిబ్రవరి 23న నామినేషన్ల స్వీకరణ ముగియగా.. ఒకరోజు ముందు ఫిబ్రవరి 22న ‘హైదరాబాద్’స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు కూతురు సురభి వాణీదేవి పేరును అనూహ్యంగా కేసీఆర్ ఖరారు చేశారు. పీవీ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో వాణీదేవి పేరు తెరమీదకు రావడం విపక్షాలతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు ఆశ్చర్యానికి లోనయ్యాయి. శతజయంతి ఉత్సవాల కానుకగా ఆమెను గెలిపించి చట్టసభకు పంపిస్తామని టీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ఓడిపోయే స్థానంలో పోటీకి దింపి వాణీదేవిని బలిపశువును చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. దాంతో టీఆర్ఎస్ ఈ స్థానంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పోలింగ్ తేదీకి కేవలం 20 రోజుల ముందు పార్టీ అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్ శరవేగంగా ప్రచార వ్యూహాన్ని ఖరారు చేయడంతో పాటు పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో మోహరించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (హైదరాబాద్), రాజ్యసభ సభ్యుడు కేశవరావు (రంగారెడ్డి), ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి (మహబూబ్నగర్)కు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ‘నల్లగొండ’పట్టభద్రుల స్థానంలో సమన్వయ బాధ్యతలు ఉమ్మడి జిల్లా మంత్రులకు అప్పగించిన కేసీఆర్ ‘హైదరాబాద్’లో మాత్రం ఉమ్మడి జిల్లాల మంత్రులతో పాటు అదనంగా మరో ముగ్గురు మంత్రులు గంగుల కమలాకర్ (హైదరాబాద్), టి.హరీష్రావు (రంగారెడ్డి), వేముల ప్రశాంత్రెడ్డి (మహబూబ్నగర్)లను ఇన్చార్జ్లుగా నియమించారు. ప్రచారంలో దూకుడు.. పోలింగ్పై దృష్టి ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’స్థానంలో ఆరు నెలలుగా సన్నాహక సమావేశాలతో పార్టీ యంత్రాంగాన్ని సన్నద్దం చేస్తూ వచ్చిన టీఆర్ఎస్ ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్నగర్’లో మాత్రం ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శించింది. మండల, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సన్నాహాక సమావేశాలు ముగిసిన వెంటనే క్షేత్రస్థాయిలో ప్రతీ 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించి ప్రతీ ఓటరును చేరుకునేలా సమన్వయంపై దృష్టి కేంద్రీకరించింది. రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ పార్టీ వ్యూహం అమలును కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు మంత్రులు, ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలు, ఇతర మంత్రులను అప్రమత్తం చేస్తూ వచ్చారు. 22 జిల్లాలు.. 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పట్టభద్రుల ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తి నిపుణులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కొన్ని కుల సంఘాలు, కాలనీ సంఘాలతోనూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడానికి టీఆర్ఎస్ ప్రాధాన్యతనిచ్చింది. పోలింగ్ శాతం పెరిగితేనే పార్టీ అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యత ఓట్లలో ఆధిక్యత దక్కుతుందనే అంచనాతో చేసిన ప్రయత్నాలు కూడా టీఆర్ఎస్కు అనుకూలించినట్లు ఫలితాల సరళి వెల్లడించింది. ఫలించిన ‘ఫిట్మెంట్’.. కలిసొచ్చిన ఓట్ల చీలిక పోలింగ్కు మూడు రోజుల ముందు ప్రగతిభవన్లో కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో జరిపిన భేటీ టీఆర్ఎస్కు కొంత అనుకూల వాతావరణాన్ని సృష్టించింది. 29 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేశారని ఆయా సంఘాల నాయకులు చేసిన ప్రకటనపై విమర్శలు వచ్చినా.. ఆయా వర్గాల్లోటీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకత కొంతమేర తగ్గడానికి ఉపయోగపడింది. ఇదిలా ఉంటే రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేయడం ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలికకు దారితీసింది. ‘హైదరాబాద్’లో 93, ‘నల్లగొండ’లో 71 మంది పోటీ చేయగా, రెండు చోట్లా ఎనిమిదేసి మందికి పైగా అభ్యర్థులు భారీగా ప్రథమ ప్రాధాన్యత ఓట్లు సాధించడం టీఆర్ఎస్ ఆధిక్యానికి బాటలు వేసింది. ఈ ఆధిక్యానికి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు తోడు కావడంతో టీఆర్ఎస్ గెలుపు సునాయాసమైంది. మరోవైపు బీజేపీ లక్ష్యంగా టీఆర్ఎస్ అటు క్షేత్రస్థాయి ప్రచారంలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ అత్యంత దూకుడును ప్రదర్శించింది. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, గ్యాస్, డీజిల్, పెట్రో ధరల పెంపు వంటి అంశాలను ప్రస్తావించడంతో పాటు, ఉద్యోగులు, విద్యార్థులతో తమది పేగు బంధమనే సెంటిమెంటును కూడా లేవనెత్తింది. ] చదవండి: టీఆర్ఎస్కే పట్టం.. రెండు స్థానాలు 'గులాబీ'కే ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను: చిన్నారెడ్డి -
ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను: చిన్నారెడ్డి
సాక్షి, మీర్పేట: డబ్బులు పంచకపోవడం వల్లే తనకు ఓట్లు వేయలేదని, ఇకపై తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఓట్ల లెక్కింపు జరుగుతున్న సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడారు. డబ్బులు లేకపోతే ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయొద్దని సూచించారు. పట్టభద్రులు కూడా అధికార టీఆర్ఎస్కు ఓట్లు అమ్ముకోవడం తనకు బాధ కలిగిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని యువత ఎంతో ఆశపడ్డారని, ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను కూడా ప్రభుత్వం భర్తీ చేయలేకపోయిందని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని 26 నెలలైనా నయా పైసా ఇవ్వలేదని, అయినా యువత వీటన్నింటిని మరిచి రూ.వెయ్యి, రెండు వేలకు ఆశపడి టీఆర్ఎస్కు ఓటు వేయడం బాధ కలిగించిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ డబ్బు, మద్యంతో ప్రభావితం చేసి ఓటు వేయించుకుంటుందని, ఈ సంస్కృతి పోవాలన్నారు. -
రేయింబవళ్లు... 4 రోజులు
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు ఈసారి ఏకంగా నాలుగు రోజుల సమయం పట్టింది. ఈనెల 17వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేయింబవళ్లు కొనసాగి 20వ తేదీ అర్ధరాత్రికి ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు రోజుల పాటు లెక్కింపు ప్రక్రియ జరిగేందుకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి ఎన్నికల బరిలో రెండు నియోజకవర్గాల్లో నూ ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉండడం, పోలింగ్ కూడా ఊహించిన దాని కన్నా ఎక్కువ కావడం, జంబో బ్యాలెట్లతో అధికారులు కుస్తీ పట్టాల్సి రావడం, ఓట్లను బండిల్స్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకోవడం, తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ ప్రక్రియ క్లిష్టతరం కావడంతో చాలా సమయం తీసుకుందని ఎన్నికల వర్గాలంటున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ మూడున్నర లక్షలకుపైగా జంబో బ్యాలెట్లను ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో, ఆపై రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో దాదాపు లక్షన్నర బ్యాలెట్లను పరిగణనలోకి తీసుకోవాల్సి రావడం కత్తిమీద సాములానే మారింది. మొత్తంమీద దాదాపు 90 గంటలు జరిగిన ఈ ప్రక్రియ పెద్దగా సమస్యలు రాకుండానే ముగియడంతో ఎన్నికల యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. బండిల్స్ నుంచి ఎలిమినేషన్ వరకు నల్లగొండలోని వేర్హౌసింగ్ గోదాములో నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, హైదరాబాద్లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ స్థానానికి కౌంటింగ్ జరిగింది. ఈనెల 17న ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బాక్సులను పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో తెరచి వాటిని కుప్పలుగా పోసి 25 ఓట్ల చొప్పున బండిల్స్ కట్టే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, ఈసారి నల్లగొండ స్థానంలో 3,88,011 (76 శాతం) ఓట్లు, రంగారెడ్డిలో 3,57,354 (65శాతం) ఓట్లు పోలయ్యాయి. వీటన్నింటినీ 25 ఓట్ల చొప్పున కట్టలు కట్టేందుకు 12 గంటలకు పైగా సమయం పట్టింది. దీంతో మొదటి ప్రాధాన్యత ఓట్ల తొలిరౌండ్ లెక్కింపు 17న రాత్రి సమయంలో ప్రారంభమైంది. ఒక్కో రౌండ్లో 56 వేల ఓట్లు లెక్కించాల్సి రావడంతో తొలిరౌండ్ ఫలితం వచ్చేసరికే అర్ధరాత్రి దాటింది. హైదరాబాద్ స్థానంలో అయితే తెల్లవారుజామున గానీ తొలిరౌండ్ ఫలితం రాలేదు. అలా ఏడురౌండ్ల కౌంటింగ్కు రెండు రోజులకు పైగా సమయం పట్టింది. ఈనెల 19న ఉదయానికి గానీ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాలేదు. ఆ తర్వాత కొంత విరామం తీసుకున్న ఎన్నికల యంత్రాంగం 19వ తేదీ మధ్యాహ్నానికి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ఒక్కొక్కరినీ తీసేస్తూ.. ఒక్కో ఓటు కలుపుతూ.. ఇక రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు కూడా చాలా సమయం తీసుకుంది. ఈసారి నల్లగొండ స్థానం నుంచి 71 మంది, హైదరాబాద్ నుంచి 93 మంది బరిలో ఉండటంతో వారిలో అత్యంత తక్కువ ఓట్లు దక్కించుకున్న వారిని ఆరోహణ క్రమంలో ఒక్కొక్కరినీ ఎలిమినేట్ చేస్తూ.. వారి బ్యాలెట్లలోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను మిగిలిన వారిని కలుపుతూ పోయారు. అభ్యర్థు లు ఎలిమినేట్ అయ్యే కొద్దీ ఎక్కువ ఓట్లు లెక్కపెట్టాల్సి వచ్చింది. అలా తొలి ఐదు స్థానాల్లో ఉన్న అభ్యర్థులను తేల్చేందుకు శనివారం ఉదయం అయింది. ఆ తర్వాత ఒక్కొక్కరిని తీసివేస్తూ వారి ఓట్లను కూడా లెక్కించి ఇతరులకు కలిపే ప్రక్రియ ప్రారంభించిన అధికారులు అతికష్టం మీద శనివారం రాత్రికి లెక్కింపు ప్రక్రియను పూర్తి చేశారు. 4 రోజులు జరిగిన ఈ కౌంటింగ్ ప్రక్రియ కోసం ఎన్నికల యంత్రాంగం పకడ్బందీ ఏర్పా ట్లు చేసింది. 8 హాళ్లు, ఏడు టేబుళ్లలో, టేబుల్కు వెయ్యి ఓట్ల చొప్పున రౌండ్కు 56 వేల ఓట్లు లెక్కించారు. కౌంటింగ్ నిరంతరాయంగా జరగాల్సి రావడంతో అ«ధికారులు తమ సిబ్బందికి షిఫ్టుల వారీగా డ్యూటీలు వేశారు. కౌంటింగ్లో ఇబ్బందుల్లేకుండా ఎన్నికల యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోగా, కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుం డా పోలీసుశాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. -
వాణీదేవిదే విజయం
సాక్షి, హైదరాబాద్: నువ్వా నేనా అన్నట్టు సాగిన ‘మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్’గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పోరులో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె, టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.వాణీదేవి విజయం సాధించారు. ఆమె ఎన్నికలకు కొత్త అయినప్పటికీ.. బీజేపీ అభ్యర్థి ఎన్.రాంచంద్రరావు, ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్లతో పోటీపడి పైచేయి సాధించారు. ఈ ఎన్నికలో ప్రథమ ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ విజయానికి అవసరమైన ‘కోటా’ఓట్లు రాలేదు. రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించగా.. మొత్తం 1,89,339 ఓట్లు వాణీదేవికి లభించాయి. మొదటి ప్రాధాన్యత ఓటును రాంచంద్రరావుకు వేసిన వారిలో 23 వేల మందికిపైగా రెండో ప్రాధాన్యతగా వాణీదేవికి వేశారు. సుదీర్ఘ లెక్కింపు తర్వాత.. 17వ తేదీన ఉదయమే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలై సుదీర్ఘంగా సాగింది. శనివారం రాత్రి ఫలితం ప్రకటించారు. నాలుగు రోజుల పాటు అటు రాజకీయ నేతలు, విశ్లేషకులతోపాటు సాధారణ ప్రజల్లో సైతం ఇది ఉత్కంఠ రేకెత్తించింది. తక్కువ ఓట్లు వచ్చిన వారందరినీ ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తూ రాగా.. ప్రధాన ప్రత్యర్థి రామచంద్రరావు ఎలిమినేషన్ సమయానికి వాణీదేవికి కోటాకు మించి ఓట్లు లభించాయి. అయితే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో ఇతర అభ్యర్థులు ముందుకు దూసుకెళతారేమో అన్న అభిప్రాయం తొలుత వ్యక్తమైనా.. వాణీదేవి ముందుకు దూసుకెళ్లారు. ప్రథమ ప్రాధాన్యతతో 1,12,689 ఓట్లు పొందిన ఆమె.. రెండో ప్రాధాన్యతగా 76,650 ఓట్లు పొందారు. మొదటి నుంచీ టీఆర్ఎస్ ఆధిక్యత ప్రధమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి చివరి వరకు అధికార టీఆర్ఎస్ ఆధిక్యత ప్రదర్శించింది. ఏడు రౌండ్లలో ప్రతి రౌండ్ ఓట్లలో 34 నుంచి 35 శాతం వరకు ఓట్లు వాణీదేవి ఖాతాలో పడ్డాయి. బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు ప్రతి రౌండ్లో 30 నుంచి 32 శాతం ఓట్లతో గట్టి పోటీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి 7 నుంచి 9 శాతం, టీడీపీ అభ్యర్థి ఎల్.రమణ ఒకటి నుంచి రెండు శాతం ఓట్లకు పరిమితమయ్యారు. స్వతంత్ర అభ్యర్థి ఫ్రొఫెసర్ నాగేశ్వర్రావుకు మాత్రం ప్రతి రౌండ్లో 14 నుంచి 16 శాతం వరకు ఓట్లు వచ్చాయి. రికార్డు ఎన్నిక ఇది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంత భారీగా 93 మంది పోటీ చేయడం, 67 శాతం పోలింగ్ జరగడం ఇదే తొలిసారి. ప్రథమ ప్రాధాన్యతలో తక్కువ ఓట్లు వచ్చినవారిని ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తూ, రెండో ప్రాధాన్యత ఓట్లను కేటాయిస్తూ.. ఏకంగా 92 మందిని ఎలిమినేట్ చేసిన రికార్డు కూడా ఈ ఎన్నికదే. ►మొత్తం 93 మంది అభ్యర్థుల్లో 84 మందికి కనీసం వెయ్యి ఓట్లు కూడా రాలేదు. ►ఒక అభ్యర్థికి కేవలం 8 ఓట్లు మాత్రమే వచ్చాయి ►రెండంకెల ఓట్లు మాత్రమే వచ్చిన వారు 51 మంది, మూడంకెల ఓట్లు దక్కినవారు 32 మంది ►ప్రధాన పోటీదారులు నలుగురు కాకుండా.. 5 వేల కంటే ఎక్కువ ఓట్లు వచ్చినవారు ముగ్గురున్నారు. పట్టభద్ర ఓటర్లకు ధన్యవాదాలు: సీఎం కేసీఆర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా టీఆర్ఎస్ అభ్యర్థులు వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డిలను గెలిపించిన పట్టభద్రులకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. వారి గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అభినందించారు. అలాగే వాణీదేవి, రాజేశ్వర్రెడ్డికి సీఎం అభినందనలు తెలిపారు. వాణీదేవి శనివారం సాయంత్రం ప్రగతిభవన్కు వెళ్లి సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశమిచ్చి, గెలుపు కోసం కృషి చేసిన సీఎంకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వాణీదేవిని అభినందించి, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీలు కె.కేశవరావు, సంతోష్ కుమార్, బడుగుల లింగ య్య యాదవ్, మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వి.శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, శేరి సుభాష్ రెడ్డి, శంభీపూర్ రాజు, నవీన్రావు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, కేపీ వివేకానంద, అబ్రహం, కృష్ణమోహన్ రెడ్డి, మెతుకు ఆనంద్, రాజేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి పాల్గొన్నారు. -
చట్టసభలకు రాకుండా అడ్డుకున్నారు: తీన్మార్ మల్లన్న
సాక్షి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు గెలిచారని స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. శనివారం రాత్రి కౌంటింగ్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దొంగ ఓట్లు, నోట్ల కట్టలతో తనను చట్టసభలకు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. జాతీయ, రాష్ట్ర పార్టీలను కాదని సామాన్యుడినైన తనను పట్టభద్రులు భుజాలపై ఎక్కించుకుని మోశారని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా నల్లగొండ కౌంటింగ్ వైపే చూశారన్నారు. ప్రగతిభవన్ గోడలు బద్దలుకొట్టే రోజులు వస్తాయని, సీఎం కుర్చీపై సామాన్యుడిని కూర్చోబెట్టే వరకు తన ఉద్యమం ఆగదని మల్లన్న స్పష్టంచేశారు. డబ్బున్న వాళ్లు మాత్రమే రాజకీయాలు చేయాలనే దానికి ఎన్నికలు సమాధి కట్టాయని, అధికారపక్షం తలదించుకునేలా ప్రజలు తీర్పునిచ్చారన్నారు. ప్రజలు తనను డిస్టింక్షన్లో గెలిపించాలని చూశారు కానీ పల్లా రాజేశ్వర్రెడ్డి నకిలీ ఓట్లతో గెలిచారని ఆరోపించారు. ఈ సందర్భంగా పల్లాకు శుభాకాంక్షలు తెలిపారు. -
టీఆర్ఎస్కే పట్టం.. రెండు స్థానాలు 'గులాబీ'కే
సాక్షి, హైదరాబాద్: హోరాహోరీగా సాగిన శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి రెండు స్థానాల్లోనూ జయకేతనం ఎగురవేసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది మొదలు ప్రత్యర్థులపై ఆధిక్యత కనబరుస్తూ వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ పైచేయి సాధించి విజేతలుగా నిలిచారు. దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రతికూలతను చవిచూసిన టీఆర్ఎస్కు ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేసిన రెండు చోట్లా పట్టభద్రులు పట్టం కట్టారు. గత ఏడాది అక్టోబర్లో ప్రారంభమైన పట్టభద్ర ఓటర్ల నమోదు మొదలుకుని అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో దూకుడు, పార్టీ యంత్రాంగం నడుమ సమన్వయం.. తదితరాల్లో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అనుసరించిన బహుముఖ వ్యూహం పార్టీ అభ్యర్థుల విజయానికి బాటలు వేసింది. అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనంటూ... రాష్ట్రంలో రాజకీయంగా ఇరకాటంలోకి నెడుతున్న బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, మరోచోట ఆ పార్టీ అభ్యర్థి నాలుగో స్థానంలో నిలవడం టీఆర్ఎస్కు నూతన ఉత్తేజాన్ని ఇస్తోంది. మరోవైపు కేసీఆర్తో విభేదిస్తూ రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన వారితో పాటు సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్న వారు కూడా ఓటమి చెందడం తమ శ్రేణుల్లో నైతిక స్థైర్యం పెంచుతుందని పార్టీ భావిస్తోంది. కాగా పట్టభద్రుల ఎన్నికల ఫలితమిచ్చిన ఊపుతో త్వరలో జరిగే నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలోనూ గెలుపు సాధించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. నల్లగొండలో విజయ సంకేతం చూపిస్తున్న పల్లా -
గులాబీ గుబాళింపు.. వాడిన కమలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమతికి మళ్లీ జోష్ వచ్చింది. ఒక సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు కమలం చేతిలో ఉన్న స్థానాన్ని కూడా చేజిక్కించుకుని సత్తా చాటింది. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ భేరీ మోగించింది. అయితే మొదటి ప్రాధాన్య ఓట్లలో సత్తా చాటకపోయినా రెండో ప్రాధాన్య ఓట్లతో రెండు స్థానాలు గెలుపొందడం ఒకింత ఆందోళన కలిగించే విషయమే. ఉత్కంఠగా హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు జరిగాయి. మొదటి నుంచి టీఆర్ఎస్ ఆధిక్యత కనబరుస్తున్నా.. తీవ్రంగా పోటీ పడాల్సి వచ్చింది. నాలుగు రోజుల పాటు ఊగిసలాడిన విజయం ఎట్టకేలకు అధికార పార్టీ ఖాతాలో పడింది. అయితే ఈ విజయం టీఆర్ఎస్కు అత్యావసరం. రాష్ట్రంలో టీఆర్ఎస్కు రోజులు దగ్గర పడ్డాయని సాగుతున్న ప్రచారానికి దీంతో తెర పడింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో డీలా పడిన గులాబీ పార్టీకి ఈ విజయం ఉపశమనం కలిగించింది. రాష్ట్రంలో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదుగుతోందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలోనే ఈ విజయం సొంతం కావడం టీఆర్ఎస్కు లాభించే విషయమే. పైగా హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ స్థానంలో సిట్టింగ్ ఉన్న బీజేపీని ఓడించడం విశేషం. నాగార్జున సాగర్ ఎన్నికలకు ముందు ఈ విజయం అధికార పార్టీకి ఊపిరి పోసింది. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహ రావు కుమార్తెను అనూహ్యంగా ఎంపిక చేసి కాంగ్రెస్ ఓట్లకు గాలం వేసింది. ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి బలీయమైన నాయకుడుగా ఉన్నారు. ఆ జిల్లాల్లో టీఆర్ఎస్ బలీయంగా ఉండడంతో పల్లా విజయం సునాయాసంగా జరిగింది. అయితే తీన్మార్ నవీన్, ప్రొఫెసర్ కోదండరాం గట్టి పోటీ ఇవ్వడం టీఆర్ఎస్ అప్రమత్తం కావాల్సిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉంటాయని రాజకీయ వర్గాలు భావించగా ఆ అంచనాలు ఈ ఫలితాలు తలకిందులు చేశాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉద్యోగులకు పీఆర్సీ తదితర ప్రకటించకపోవడం టీఆర్ఎస్కు నష్టం కలిగిస్తాయని భావించారు. నిరుద్యోగులంతా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ ఎన్నికలు వచ్చాయి. ఈ ప్రభావం ఎన్నికలపై తీవ్రంగా ఉంటుందని చర్చ నడవగా.. అలాంటిదేమీ లేదని ఈ ఫలితాలు నిరూపించాయి. అయితే మొదటి ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించకపోవడం టీఆర్ఎస్కు లోలోపల ఒకింత అసహనం ఉంది. నిరుద్యోగులు, ఉద్యోగులు టీఆర్ఎస్కు ద్వితీయ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా పట్టభద్రులు ఈ ఉత్కంఠ ఫలితం ఇచ్చారు. ఈ విజయం ఊపుతో గులాబీ పార్టీ నాగార్జున సాగర్ ఎన్నికకు వెళ్లనుంది. దీని ప్రభావం సాగర్ ఎన్నికపై స్పష్టంగా పడే అవకాశం ఉంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ పరిధిలోనే నాగార్జున సాగర్ ఉండడంతో గులాబీకి కలిసొచ్చే అవకాశం ఉంది. సిట్టింగ్ స్థానం కోల్పోవడం బీజేపీకి జీర్ణించుకోలేని విషయం. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలతో జోరు మీదున్న కాషాయ పార్టీకి పట్టభద్రుల తీర్పుతో నిరాశ ఎదురైంది. సాగర్ ఎన్నిక ముందు ఈ ఫలితం రావడం కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. -
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
-
ఎమ్మెల్సీ ఎన్నికలు: చెల్లని పట్టభద్రులు..!
సాక్షి, హైదరాబాద్: వారంతా పట్టభద్ర ఓటర్లు... సాధారణ పౌరులతో పోలిస్తే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకూ అర్హత కలిగిన వారు. కానీ రాష్ట్రంలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గాలకు జరిగిన ఎన్నికల్లో వేల మంది పట్ట భద్రుల అవగాహనారాహిత్యం బయటపడింది. బ్యాలెట్ పత్రంపై తమకు నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యతా క్రమంలో అంకెలను సూచించాల్సి ఉండగా అందుకు భిన్నంగా కామెంట్లు, సంతకాలు చేశారు. ఫలితంగా భారీ స్థాయిలో ఇలాంటి ఓట్లు చెల్లకుండా పోయాయి. హైదరాబాద్– మహబూబ్ నగర్–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల్లో పోలైన ఓట్లలో సుమారు 6 శాతం పట్టభద్రుల ఓట్లు చెల్లకుండా మురిగిపోయాయి. పట్టభద్రుల ఎన్నికలో ఈసారి 3,58,348 లక్షల ఓట్లు పోలవగా అందులో 21,309 ఓట్లు వివిధ కారణాలతో చెల్లలేదు. అదేవిధంగా నల్లగొండ– వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 3,87,969 ఓట్లు పోలవగా అందులో ఏకంగా 21,636 ఓట్లు చెల్లనివిగా తేలాయి. మొత్తం పోలైన ఓట్లలో ఇది సుమారు 6 శాతం కావడం గమనార్హం. చదవండి: రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పల్లాకు తగ్గిన మెజారిటీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గందరగోళం! -
మేం నేర్పిన చదువు ఇదేనా: వాణిదేవి అసహనం
-
రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గందరగోళం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గందరగోళం చోటుచేసుకుంది. అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత వచ్చిన బ్యాలెట్ పేపర్ల కంటే ... రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సమయంలో బ్యాలెట్ పేపర్లను తక్కువగా చూపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 8 మంది ఎలిమినేషన్లో ఉండగా, 50 ఓట్లు గల్లంతైనట్లు చూపడంతో బీజేపీ, కాంగ్రెస్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, ఎన్నికల సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవడంతో ఈ విషయంపై ఆర్వోకు ఫిర్యాదు చేశారు. దీంతో కాసేపు రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ప్రక్రియను నిలిపివేసి తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపులో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రెండో ప్రాధాన్యతలో 14 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇక రెండో ప్రాధాన్యత ఓట్లలో ఇప్పటి వరకు టీఆర్ఎస్ 38, బీజేపీ 17, ప్రొపెఫర్ నాగేశ్వర్ 18, కాంగ్రెస్ 13 ఓట్లు సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల(8042)తో కలిపి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి 1, 12, 727 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి రామచందర్రావు 1, 04, 685, ప్రొఫెసర్ నాగేశ్వర్కు 53,628 , కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి 31,567 ఓట్లతో ఉన్నారు. కాగా 2015లో జరిగిన ఇదే నియోజకవర్గ ఎన్నికల్లో అభ్యర్థులు 31 మందితోపాటు నోటా ఉంది. అయితే, ప్రస్తుతం నోటా లేదు. ఓట్ల లెక్కింపు ప్రాధాన్యత క్రమంలో జరగనున్నందున మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఎవరికీ కోటా ( చెల్లుబాటయ్యే మొత్తం ఓట్లలో సగం కంటే ఒక ఓటు ఎక్కువ) ఓట్లు రాకుంటే, కోటా ఓట్లు వచ్చేంత వరకు తర్వాతి ప్రాధాన్యత ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు. చదవండి: మేం నేర్పిన చదువు ఇదేనా: వాణిదేవి అసహనం -
మేం నేర్పిన చదువు ఇదేనా: వాణిదేవి అసహనం
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లపై టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి అసహనం వ్యక్తం చేశారు. ‘‘మేం నేర్పిన చదువు ఇదేనా’’ అంటూ మండిపడ్డారు. పట్టభద్రులు కూడా ఓటు సరిగా వేయకపోవడం దురదృష్టకరమన్నారు. సరూర్నగర్లో కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చిన సురభి వాణిదేవి మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోందని, గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. కాగా మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి సురభి వాణి దేవి పోటీ చేసిన విషయం తెలిసిందే. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె అయిన ఆమె విద్యావేత్తగా పేరొందారు. ఇక ఈ నెల 14న జరిగిన రంగారెడ్డి–మహబూబ్నగర్– హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో ఈసారి 67 % పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఓట్లను సరూర్నగర్లోని ఇండోర్స్టేడియంలో లెక్కిస్తున్నారు. భారీ సంఖ్యలో 93 మంది అభ్యర్థులు బరిలో ఉండటమే కాక, గతంలో కంటే ఓటర్లు..పోలింగ్ శాతం కూడా భారీగా పెరిగినందున కౌంటింగ్కు చాలా సమయం పడుతోంది. కాగా 2015లో జరిగిన ఇదే నియోజకవర్గ ఎన్నికల్లో అభ్యర్థులు 31 మందితోపాటు నోటా ఉంది. అయితే, ప్రస్తుతం నోటా లేదు. ఓట్ల లెక్కింపు ప్రాధాన్యత క్రమంలో జరగనున్నందున మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఎవరికీ కోటా ( చెల్లుబాటయ్యే మొత్తం ఓట్లలో సగం కంటే ఒక ఓటు ఎక్కువ) ఓట్లు రాకుంటే, కోటా ఓట్లు వచ్చేంత వరకు తర్వాతి ప్రాధాన్యత ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు. తాజా సమాచారం ప్రకారం, ఏడో రౌండ్ పూర్తయ్యేసరికి వాణీదేవి(టీఆర్ఎస్)కి 1,12,689 ఓట్లు పొందినట్లు తెలుస్తోంది. మరోవైపు నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చదవండి: MLC Election Results: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు -
కౌంటింగ్ కేంద్రం వద్ద తీన్మార్ మల్లన్న, పల్లా!
► ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తీన్మార్ మల్లన్న లెక్కలు సేకరించే పనిలో నిమగ్నమయ్యా డు. తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ ►కౌంటింగ్ కేంద్రం వద్ద ఎండ వేడికి మజ్జిగ తాగుతున్న పల్లా నిద్ర సుఖమెరుగదు.. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రెండు రోజులుగా ఎఫ్సీఐ గోదాములో హమాలీలు 24 గంటలు అలుపెరుగక బాక్సులు మోశారు. కంటికి నిద్ర లేకపోవడంతో ఇలా కౌంటింగ్ కేంద్రం ఆవరణలో ఆదమరిచి నిద్రిస్తున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ -
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు; చెల్లని ఓట్లు 18,754
సాక్షి, నల్లగొండ : నల్లగొండ – వరంగల్ – ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తికాగా.. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ముందంజలో ఉన్నారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలనుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకాగా, అదేరోజు రాత్రి ఏడుగంటల సమయంలో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. ఒక రౌండ్లో 56వేల చొప్పున ఓట్లు లెక్కిస్తున్నారు. గురువారం తెల్ల వారుజామున 2.30గంటలకు తొలిరౌండ్ ఫలితం తేలింది. ఇప్పటివరకు ఆరు రౌండ్లలో 3,35,961 ఓట్లను లెక్కించగా.. వాటిలో 18,754 ఓట్లు చెల్ల కుండాపోయాయి. చెల్లిన 3,17207 ఓట్లలో.. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి 95,317 ఓట్లు సాధించారు. ఆయనకు 22,843 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇక, ఆ తర్వాతి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న(నవీన్)కు 72,474 ఓట్లు, టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్కు 59,705 ఓట్లు, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 34,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్కు 24,268 ఓట్లు లభించాయి. నల్లగొండ శివారులోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వామపక్షాలకు ఆరో స్థానం ఓట్ల లెక్కింపు పూర్తయిన ఆరు రౌండ్లలో వామపక్షాల అభ్యర్థి, సీపీఐకి చెందిన జయసారథి రెడ్డి 8,348 ఓట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ 7,881 ఓట్లతో ఏడో స్థానంలో, యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి 6,805 ఓట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానంలో 71మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 22మంది అభ్యర్థులకు కనీసం పది ఓట్లు కూడా పోల్ కాలేదు. ఏజెంట్లకు బ్యాలెట్ పేపర్ చూపిస్తున్న అధికారులు తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యాకే.. గెలుపు కోటా నిర్ణయం ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు కావాలి్సన కోటా ఇంకా తేలలేదు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత చెల్లని ఓట్ల లెక్క తేల్చాక ఈ కోటా నిర్ణయం కానుంది. మొదటి ప్రాధాన్య ఓటుతో ఎవరూ కోటా మేర ఓట్లు సాధించని పక్షంలో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. అప్పటికీ విజేత తేలకుంటే.. మూడో ప్రాధాన్య ఓట్లనూ లెక్కించనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన శుక్రవారం రాత్రి పొద్దుపోయాక కానీ, లేదా శనివారం ఉదయానికి గానీ విజేత ఎవరో తేలనుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా, ఒక్కో రౌండ్ లెక్కింపునకు ఐదు గంటల సమయం పడుతోంది. ఈ లెక్కన మొత్తం ఏడు రౌండ్ల మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి శుక్రవారం తెల్లవారుజామువరకు సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ► మొత్తం లెక్కించిన ఓట్లు 3,35,961 ► చెల్లిన ఓట్లు 3,17,207 ► చెల్లని ఓట్లు 18,754 చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు: 18,549 ఓట్ల ఆధిక్యంలో పల్లా రాజేశ్వర్రెడ్డి -
ఎమ్మెల్సీ ఎన్నికలు: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
-
ఓట్ల లెక్కింపు ప్రారంభమవడంతో స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
-
ఎమ్మెల్సీ ఫలితాలు: ఏం జరుగుతుందో?
సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికలను తలపిస్తూ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈసారి పట్టభద్రుల తీర్పు రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలను దిశానిర్దేశం చేస్తుందన్న అంచనాలు ఉండటంతో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ ప్రధాన రాజకీయ పక్షాల్లో నెలకొంది. కాంగ్రెస్కు చావోరేవో... మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్ట భద్రుల స్థానంతోపాటు వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగ్గా ప్రస్తుతం హైదరాబాద్ స్థానం నుంచి బీజేపీ, నల్లగొండ స్థానం నుంచి టీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్ స్థానాలు నిలబెట్టుకోవడంతోపాటు మరో స్థానంలో పాగా వేయడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు పట్టభద్రుల ఎన్నికల్లో తలపడ్డాయి. అయితే ఈసారి అనుకూల ఫలితాలు వస్తే గతంలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల వల్ల ప్రజల్లో కలిగిన అభిప్రాయం మారుతుందని, పట్టభద్రుల మెప్పు పొందగలిగితే మళ్లీ అనుకూల పవనాలు వీస్తాయని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇక బీజేపీ మాత్రం టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకోవాల్సిన పరిస్థితుల్లో జరిగిన ఈ ఎన్నికల్లో అనుకున్న ఫలితం వస్తే తమకు ఎదురు ఉండదని, 2023 ఎన్నికలకు ధీమాగా వెళ్లవచ్చని లెక్కలు వేసుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో మాత్రం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. గతంలో జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ తాజా రాజకీయ పరిస్థితులు తమకు లాభిస్తాయని, కేంద్ర, రాష్ట్రాలపై వ్యతిరేకతతో పట్టభద్రులు తమవైపే మొగ్గు చూపారని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. ఈ ఎన్నికల్లో ఒక్క స్థానంలో గెలిచినా 2023 ఎన్నికల వరకు ఆందోళన అవసరం ఉండదని భావిస్తోంది. ఒకవేళ ఈ ఎన్నికల్లోనూ ఓడితే పార్టీ పరిస్థితి ఖల్లాసేననే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. ప్రొఫెసర్లు... ఉద్యమకారులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న ఇద్దరు ప్రొఫెసర్లు ఎం. కోదండరాం, డాక్టర్. కె. నాగేశ్వర్ల రాజకీయ భవితవ్యాన్ని కూడా పట్టభద్రులు నిర్దేశించనున్నారు. ఈ ఎన్నికల్లో సానుకూల ఫలితం సాధించగలిగితే వారు మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తారని రాజకీయ వర్గాలంటున్నాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంతో కోదండరాం నల్లగొండ స్థానం నుంచి ప్రధాన పక్షాలకు గట్టిపోటీ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. అలాగే రంగారెడ్డి నుంచి నాగేశ్వర్ ఏ మేరకు పట్టభద్రులను ఆకర్షించగలిగారన్నది ఈ ఫలితాలు తేల్చనున్నాయి. తెలంగాణ ఉద్యమంతో దృఢ అనుబంధం ఉన్న డాక్టర్ చెరుకు సుధాకర్తోపాటు మరికొందరు ఈ ఫలితాలతో తమ రాజకీయ భవిష్యత్తుపై ఓ అంచనాకు రానున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలు: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
-
ఎమ్మెల్సీ ఎన్నికలు : టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి విజయం
సాక్షి, హైదరాబాద్/ నల్లగొండ: తెలంగాణలో ఈ నెల 14న జరిగిన రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావుపై వాణిదేవి గెలుపొందారు. మూడు రోజులుగా ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండగా శనివారం సాయంత్రం హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఫలితం వచ్చింది. ఇంకా నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఫలితం తేలాల్సి ఉంది. ఇక్కడ కూడా టీఆర్ఎస్ ముందంజలో ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం దిశగా పయనిస్తున్నారు. తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో ఉన్నారు. వీరిద్దర మధ్య ఓట్ల వ్యత్యాసం 24 వేలకు పైగా ఉంది. కౌంటింగ్ లైవ్ అప్డేట్స్: నేడు సాయంత్రంలోగా ఎమ్బెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నల్గొండ : ► టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం ► తీన్మార్ మల్లన్నపై 2, 700 ఓట్ల ఆధిక్యంలో పల్లా ► సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీజేపీ ► నల్గొండలో నాలుగో స్థానంలో బీజేపీ హైదరాబాద్ : తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ సంబరాలు ► టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి గెలుపు ►రెండో ప్రాధాన్యం ఓట్లతొ గెలిచిన వాణిదేవి ► గెలుపు దిశగా టీఆర్ఎస్ అభ్యర్తి వాణీదేవి ► హైదరాబాద్ ఎన్నికల బరిలో మిగిలిన ముగ్గురు అభ్యర్ధులు ► 8,812 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్ధి వాణీదేవి ► నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్ధులు ► 23,428 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్రెడ్డి ► రెండో స్థానంలో మల్లన్న, మూడో స్థానంలో కోదండరాం ►హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ► హైదరాబాద్ స్థానంలో ఇప్పటి వరకు 90 మంది ఎలిమినేట్ ►8,812 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్ధి వాణీదేవి ► టీఆర్ఎస్ అభ్యర్ధి వాణీదేవికి 1,28,689 ఓట్లు ► రామచంద్రరావు (BJP) 1,19,198 ఓట్లు, ప్రొ.నాగేశ్వర్కు 67,383 ఓట్లు ► 67వ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేట్ అనంతరం అభ్యర్థుల వారీగా వచ్చిన రెండో ప్రాధన్యత ఓట్లు ► టీఆర్ఎస్, పల్లా రాజేశ్వర్ రెడ్డి -5252 ► తీన్మార్ మల్లన్న-7352 ► కోదండరాం-10299 ►అభ్యర్థుల వారిగా ఇప్పటివరకు వచ్చిన ఓట్లు.... ►పల్లా రాజేశ్వర్ రెడ్డి- 122638. ►తీన్మార్ మల్లన్న-99210 ►కోదండరాం-89409 ►పల్లా ఆధిక్యం-23428 ►ప్రారంభం అయిన బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ ►నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి సరైన మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పల్లా మెజారిటీ తగ్గింది. అయితే ఇప్పటికి కూడా పల్లా రాజేశ్వర్రెడ్డి 25,528 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి పల్లా రాజేశ్వర్రెడ్డికి 1,17,386 ఓట్లు రాగా.. మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి తీన్మార్ మల్లన్నకు 91,858 ఓట్లు రాగా.. మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి కోదండరామ్కు 79,110 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు 66 మందికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ►హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి 8,478 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు వాణీదేవికి 1,15,043 ఓట్లు, రామచంద్రరావు (బీజేపీ) 1,06,565 ఓట్లు ప్రొ. నాగేశ్వర్కు 55,742 ఓట్లు, చిన్నారెడ్డి (కాంగ్రెస్) 32,879 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు 86 మందికి సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ► నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఎవరికీ గెలుపుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. రెండో ప్రాధాన్యతలో కూడా ఎవ్వరికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనపడటం లేదు. ఒకవేళ ఎవరికీ మ్యూజిక్ ఫిగర్ రాకపోతే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. హైదరాబాద్ ► హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ► కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ► రెండో ప్రాధాన్యతలో 14 మంది ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి ► రెండో ప్రాధాన్యతలో టీఆర్ఎస్-38, బీజేపీ-17, నాగేశ్వర్-18, కాంగ్రెస్-13 ఓట్లు ► రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి వాణిదేవి (టీఆర్ఎస్) ఆధిక్యం 8,042 ► వాణీదేవి(టీఆర్ఎస్)కి 1,12,727 ఓట్లు, రామచంద్రరావు(బీజేపీ)కి 1,04,685 ఓట్లు ► ప్రొ. నాగేశ్వర్కు 53,628 ఓట్లు, చిన్నారెడ్డి(కాంగ్రెస్)కి 31,567 ఓట్లు ► హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ఏడో రౌండ్ పూర్తి ► ఏడో రౌండ్ పూర్తయ్యేసరికి వాణీదేవి(టీఆర్ఎస్)కి 1,12,689 ఓట్లు ► రామచంద్రరావు(బీజేపీ)కి 1,04,668 ఓట్లు, ప్రొ. నాగేశ్వర్కు 53,610 ఓట్లు ► ఏడో రౌండ్ పూర్తయ్యేసరికి చిన్నారెడ్డి(కాంగ్రెస్)కి 31,554 ఓట్లు ► మ్యాజిక్ ఫిగర్ను చేరుకోని మొదటి ప్రాధాన్యత ఓట్లు ► అనివార్యమైన రెండో ప్రాధాన్యత ఓట్లపైనే టీఆర్ఎస్, బీజేపీ ఆశలు ► మొదటి ప్రాధాన్యత ఓట్లలో వాణీదేవి(టీఆర్ఎస్) ఆధిక్యం 8,021 ఓట్లు ► ఏడు రౌండ్లలో మొత్తం చెల్లని ఓట్లు 21,309 నల్లగొండ ► కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ► 40 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ముగిసేసరికి లభించిన 1312 ఓట్లు ► పల్లా రాజేశ్వర్రెడ్డి(టీఆర్ఎస్)- 174, కోదండరాం- 193, తీన్మార్ మల్లన్న- 149 ఓట్లు ► మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి పల్లా రాజేశ్వర్రెడ్డికి 1,11,014 ఓట్లు ► మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి తీన్మార్ మల్లన్నకు 83,539 ఓట్లు ► మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి కోదండరామ్కు 70,265 ఓట్లు ► 40 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ముగిసేసరికి లభించిన 1312 ఓట్లు. ► టీఆర్ఎస్ పల్లా రాజేశ్వర్ రెడ్డి-174 ► కోదండరాం - 193 ► తీన్మార్ మల్లన్న -149 ► పూర్తి అయిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ►TRS పల్లా సాధించిన మొదటి ప్రాధాన్యత ఓట్లు-1,10,840 ►మల్లన్న-83,290..... కోదండరాం-70,072.... బీజేపీ-39,107 ►తన సమీప అభ్యర్థి.మల్లన్న పై 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ► మొత్తం ఓట్లు ...3,87,969.... ►చెల్లిన ఓట్లు....3,66,333.... ► మురిగిన ఓట్లు....21,636.... ► రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం... ► పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందలంటే కావాల్సిన ఓట్లు 72,327.. ► తీన్మార్ మల్లన్న గెలుపొందలంటే కావలసిన ఓట్లు 99,877. ► కోదండరామ్ గెలవాలంటే 1,13,095.. హైదరాబాద్: ► ఆధిక్యతలో సురభి వాణీదేవి ►నత్తనడకగా కౌంటింగ్.. ► ఐదు గంటలకు ఒక రౌండ్ పూర్తి ► ఇప్పటివరకు నాలుగు రౌండ్ల కౌంటింగ్ పూర్తి అయింది. ► నేటి మధ్యాహ్నానికి మొదటి ప్రాధాన్యత తుది ఫలితం ►మొదటి ప్రాధాన్యత ఓట్ల నాలుగో రౌండ్ లెక్కింపు ముగిసేసరికి అధికార టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్రావుపై 5,553 ఆధిక్యం కొనసాగిస్తున్నారు. ► మొత్తం 3,57,354 ఓట్లు పోలు కాగా, ఒక్కో రౌండ్కు 56 వేల చొప్పున మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. ► అధికార టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి 70,552 ఓట్లు ► బీజేపీ అభ్యర్థి రామచందర్రావుకు 64,999 ► ప్రొఫెసర్ నాగేశ్వర్కు 34,029 ► కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడికి 24,053 ఓట్లు లభించాయి. ► నాలుగో రౌండ్ సురభీ వాణీదేవికి 1,109 ఓట్ల ఆధిక్యం వచ్చింది. సాక్షి, హైదరాబాద్/ నల్లగొండ: తెలంగాణలో ఈ నెల 14న జరిగిన రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8 గంటలకు ఆ కౌంటింగ్ ప్రారంభం అయిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. గురువారం నాటికి.. నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఐదోరౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసింది. ఐదో రౌండ్ ముగిసేసరికి 18,549 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు పల్లా రాజేశ్వర్రెడ్డికి 79,113 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 60,564, కోదండరామ్కు 49,200 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 28,981 ఓట్లు, కాంగ్రెస్ 20,274 ఓట్లు రాగా, 15,533 చెల్లని ఓట్లు వచ్చాయని కౌంటింగ్ అధికారులు తెలిపారు. ► ముగిసిన మూడో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు. ► మూడో రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందంజ. ► మూడో రౌండ్లో పల్లాకు పడ్డ ఓట్లు..17393... ► తీన్మార్ మల్లన్నకు....13,122 ► కోదండరాంకు 11,907.... ► ఇప్పటివరకు సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 12,142 ఓట్ల ఆధిక్యంతో పల్లా ముందంజ ఇప్పటి వరకు అభ్యర్థుల వారీగా వచ్చి ఓట్లు వరంగల్-ఖమ్మం-నల్గొండ ► పల్లా రాజేశ్వర్ రెడ్డి -47,545 ► తీన్మార్ మల్లన్న-34,864 ► కోదండరామ్-29,560 ► ప్రేమేంందర్ రెడ్డి-19,899 హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ► సురభి శ్రీవాణి-35,171 ► రామచంద్రరావ్-32,558 ► ప్రొ. నాగేశ్వర్ రావు-16,951 ► చిన్నారెడ్డి-10,062 ముగిసిన రెండో రౌండ్. ► టీఆరెస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి -15857 ఓట్లు. ► తీన్మార్ మల్లన్న -12070 ► కోదండరాం-9448, బీజేపీ- 6669, కాంగ్రెస్- 3244 ► రెండో రౌండ్ పూర్తయ్యేసరికి టీఆరెస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 7871 ఓట్ల తో ఆధిక్యం ► తెలంగాణ ఎమ్మెల్సీ కౌంటింగ్: రెండు నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్లో ఉండటం గమనార్హం. ► నల్గొండ సెగ్మెంట్ పరిధిలో ఉదయం తొలి రౌండ్లో మొత్తం 56003 ఓట్లు లెక్కించారు. ► టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డికి 16130 ఓట్లు పడ్డాయి. ► రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న నిలిచారు. ఆయనకు 12046 ఓట్లు పోలయ్యాయి. ► అటు హైదరాబాద్ సెగ్మెంట్ పరిధి తొలి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవికి 17429 ఓట్లు పోలయ్యాయి. ► బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు 16385 ఓట్లు పోలయ్యాయి. ► తొలి రౌండ్లో వాణీదేవీ 1044 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ► ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్రావు నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయనకు 8357 ఓట్లు పోలయ్యాయి. నల్గొండ : ► నల్గొండ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ►6వ నెంబర్ కౌంటింగ్ వద్ద 8 బ్యాలెట్ బాక్సులకు సీల్ లేకపోవడంతో ఏజెంట్ల ఆందోళన ► బ్యాలెట్ బ్యాక్స్ తాళాలు పగలగొట్టి ఉండటంపై బీజేపీ అభ్యర్థి ఆందోళన ► ప్రశ్నిస్తే బయటకు పంపించేస్తున్నారని ప్రేమేందర్ రెడ్డి నిరసన ►బ్యాలెట్ బాక్స్లకు తాళాలు పగలగొట్టే అవసరం ఏమొచ్చిందని ప్రేమే౦దర్ రెడ్డి ప్రశ్నించారు ► ఈ పరిణామంపై రిటర్నింగ్ అధికారికి పిర్యాదు. సరూర్ నగర్ ► సరూర్ నగర్ కౌంటింగ్ హాల్లో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ల పరిశీలన ► చెల్లినవి, చెల్లని ఓట్లను వేరువేరురుగా చేసిన అధికారులు. ► అభ్యర్డులు, వారి ఏజెంట్ల సమక్షంలో బాలేట్ బాక్స్ సీల్ పరిశీలన ► బ్యాలెట్ బాక్స్లను కౌంటింగ్ టేబుల్స్ మీదకు తరలిస్తున్న సిబ్బంది. నల్గొండ.. ► కొనసాగుతున్న ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ► 40% పూర్తయిన బండిల్స్ వర్క్ ►25 ఓట్ల చొప్పున ఒక బండిల్ కడుతున్నారు ► ఈ రోజు సాయంత్రం 5 లోపు పూర్తవనున్న బండిల్స్ ప్రక్రియ ► రాత్రి 9 గంటలలోపు మొదటి రౌండ్ ఫలితం వెలువడుతుందని అంచనా ► ఒక్కో రౌండ్లో 56 వేల ఓట్ల లెక్కింపు ►రేపు తొలి ప్రాధాన్యత ఫలితాలు వెలువడే అవకాశం ► రిటర్నింగ్ అధికారి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ల నుంచి బ్యాలెట్ బాక్స్లను తీసుకొచ్చి బండల్స్ను కడుతున్నారు. ► ముందుగా పోస్టల్ బ్యాలెట్లను బయటకు తీస్తున్నారు. ► నాలుగు వేల మంది సిబ్బందితో షిఫ్ట్ల ప్రకారం నిరంతరం లెక్కింపు కొనసాగనుంది. ‘నల్లగొండ’స్థానంలో మొత్తం 5,05,565 ఓట్లకుగాను 3,86,320(76.41%) ఓట్లు పోలవగా ‘హైదరాబాద్’స్థానంలో 5,31,268 ఓట్లకుగాను 3,57,354 (67.25%) ఓట్లు పోలయ్యాయి. ‘హైదరాబాద్’స్థానం నుంచి 93 మంది అభ్యర్థులు పోటీపడగా ప్రధాన పోటీ సురభి వాణీదేవి (టీఆర్ఎస్), ఎన్. రామచందర్రావు (బీజేపీ), మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్రావు(ఇండిపెండెంట్) మధ్య నెలకొంది. ‘నల్లగొండ’స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధాన పోటీ పల్లా రాజేశ్వర్రెడ్డి(టీఆర్ఎస్), ప్రొఫెసర్ ఎం. కోదండరాం (టీజేఎస్) మధ్య నెలకొంది. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఇలా.. కౌంటింగ్ కోసం ఒక్కో హాల్లో 7 టేబుళ్ల చొప్పున 8 హాళ్లలో మొత్తం 56 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్లో ఒక్కో టేబుల్కు వెయ్యి ఓట్ల చొప్పున 56 వేల ఓట్లను లెక్కించనున్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ పేపర్లను కలిపేసి 25 ఓట్ల చొప్పున ఒక బండిల్ చేశాక.. ఒక్కో టేబుల్కు వెయ్యి ఓట్లు (40 బండిళ్లు) ఇచ్చి లెక్కిస్తారు. అంటే ఒక రౌండ్కు 56 వేల చొప్పున ఓట్లను లెక్కించనుండగా... మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి కనీసం 10–12 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. అంటే తొలి ప్రాధాన్య ఓట్ల ఫలితం 18న ఉదయం 8 గంటలకుగానీ తేలదని అంటున్నారు. ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు సమయంలోనే చెల్లని ఓట్లను పక్కన పెట్టి వాటి లెక్క కూడా తీస్తారు. మొత్తం పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేశాకే అభ్యర్థి గెలుపునకు అవసరమైన కోటాను నిర్ణయిస్తారు. ఆ కోటా మేరకు ఎవరికైనా మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చినట్లయితే విజేతగా ప్రకటించి కౌంటింగ్ నిలిపివేస్తారు. ఒక్కో రౌండ్కు 56 వేల ఓట్ల చొప్పున మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించేందుకు 7 రౌండ్లు పట్టనుంది. గెలవడానికి సరిపడా మొదటి ప్రాధాన్య ఓట్లు ఎవరికీ రాకపోతే రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. -
నేడే ‘మండలి’ కౌంటింగ్.. ఫలితాలకు 2 రోజుల సమయం?
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు ఈ నెల 14న జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు బుధవారం జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా ఫలితాలపై స్పష్టత బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం రానుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘నల్లగొండ’స్థానంలో మొత్తం 5,05,565 ఓట్లకుగాను 3,86,320(76.41%) ఓట్లు పోలవగా ‘హైదరాబాద్’స్థానంలో 5,31,268 ఓట్లకుగాను 3,57,354 (67.25%) ఓట్లు పోలయ్యాయి. ‘హైదరాబాద్’స్థానం నుంచి 93 మంది అభ్యర్థులు పోటీపడగా ప్రధాన పోటీ సురభి వాణీదేవి (టీఆర్ఎస్), ఎన్. రామచందర్రావు (బీజేపీ), మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్రావు(ఇండిపెండెంట్) మధ్య నెలకొంది. ‘నల్లగొండ’స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధాన పోటీ పల్లా రాజేశ్వర్రెడ్డి(టీఆర్ఎస్), ప్రొఫెసర్ ఎం. కోదండరాం (టీజేఎస్) మధ్య నెలకొంది. ఒక్కో రౌండ్కు 56 వేల ఓట్ల లెక్కింపు... మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానానికి సంబంధించిన ఓట్లను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో లెక్కించనుండగా వరంగల్–ఖమ్మం–నల్లగొండ స్థానానికి సంబంధించిన ఓట్లను నల్లగొండ పట్టణంలోని మార్కెట్ శాఖ గిడ్డంగిలో లెక్కించనున్నారు. కౌంటింగ్ కోసం ఒక్కో హాల్లో 7 టేబుళ్ల చొప్పున 8 హాళ్లలో మొత్తం 56 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్లో ఒక్కో టేబుల్కు వెయ్యి ఓట్ల చొప్పున 56 వేల ఓట్లను లెక్కించనున్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ పేపర్లను కలిపేసి 25 ఓట్ల చొప్పున ఒక బండిల్ చేశాక.. ఒక్కో టేబుల్కు వెయ్యి ఓట్లు (40 బండిళ్లు) ఇచ్చి లెక్కిస్తారు. అంటే ఒక రౌండ్కు 56 వేల చొప్పున ఓట్లను లెక్కించనుండగా... మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి కనీసం 10–12 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. అంటే తొలి ప్రాధాన్య ఓట్ల ఫలితం 18న ఉదయం 8 గంటలకుగానీ తేలదని అంటున్నారు. ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు సమయంలోనే చెల్లని ఓట్లను పక్కన పెట్టి వాటి లెక్క కూడా తీస్తారు. మొత్తం పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేశాకే అభ్యర్థి గెలుపునకు అవసరమైన కోటాను నిర్ణయిస్తారు. ఆ కోటా మేరకు ఎవరికైనా మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చినట్లయితే విజేతగా ప్రకటించి కౌంటింగ్ నిలిపివేస్తారు. ఒక్కో రౌండ్కు 56 వేల ఓట్ల చొప్పున మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించేందుకు 7 రౌండ్లు పట్టనుంది. గెలవడానికి సరిపడా మొదటి ప్రాధాన్య ఓట్లు ఎవరికీ రాకపోతే రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. హైదరాబాద్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ఏర్పాట్లు తొలగింపుతో... రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరూ విజయం సాధించకుంటే.. మొదటి ప్రాధాన్య ఓట్లు అతితక్కువగా వచ్చిన అభ్యర్థిని తొలగించి (ఎలిమేషన్ పద్ధతి) సదరు అభ్యర్థి బ్యాలెట్లలో పోలైన రెండో ప్రాధాన్యత ఓట్లు ఏ అభ్యర్థికి వచ్చాయో ఆ అభ్యర్థి ఓట్లకు కలుపుతూ వెళ్తారు. ఇలా మొదటి ప్రాధాన్య ఓట్లు తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఒక్కొక్కరినే తొలగిస్తూ వారి రెండో ప్రాధాన్య ఓట్లను మిగిలిన అభ్యర్థులకు కలుపుతారు. చివరకు కోటా ఓట్లు ఎవరు పొందుతారో వారిని విజేతగా ప్రకటిస్తారు. అయితే తొలి ప్రాధాన్య ఓట్లలో ఎవరూ విజయం సాధించకపోతే.. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి మళ్లీ ఇంతే సమయం పడుతుందని.. తుది ఫలితం 18న రాత్రికి అంటే.. మొత్తంగా కౌంటింగ్ మొదలయ్యాక 48 గంటలు (రెండు రోజులు) పడుతుందని చెబుతున్నారు. షిఫ్ట్లవారీగా సిబ్బంది... ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా జరగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు సైతం షిఫ్ట్లవారీగా ఏర్పాట్లు చేశారు. ‘నల్లగొండ’స్థానం పరిధిలోని 731 పోలింగ్ కేంద్రాలు, ‘హైదరాబాద్’స్థానం పరిధిలోని 799 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ పేర్లను ముందుగా కలపడం (మిక్సింగ్), ఆ తర్వాత 25 ఓట్ల చొప్పున ఒక్కో కట్టను కట్టడం వంటి పనులకే సుమారు 12 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాతనే మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ‘నల్లగొండ’లో ఒక్కో టేబుల్కు ఐదుగురు సిబ్బంది చొప్పున, ‘హైదరాబాద్’లో ఒక్కో టేబుల్కు ఆరుగురు సిబ్బంది చొప్పున ఒక్కో షిఫ్ట్లో ఓట్లు లెక్కించనున్నారు. -
రెట్టింపు పోలింగ్.. రేపే కౌంటింగ్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి–మహబూబ్నగర్– హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం జరగనుంది. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఓట్లను సరూర్నగర్లోని ఇండోర్స్టేడియంలో లెక్కించనున్నారు. భారీ సంఖ్యలో 93 మంది అభ్యర్థులు బరిలో ఉండటమే కాక, గతంలో కంటే ఓటర్లు..పోలింగ్ శాతం కూడా భారీగా పెరిగినందున కౌంటింగ్కు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. 2015లో జరిగిన ఇదే నియోజకవర్గ ఎన్నికల్లో అభ్యర్థులు 31 మందితోపాటు నోటా ఉంది. ప్రస్తుతం నోటా లేదు. ఓట్ల లెక్కింపు ప్రాధాన్యత క్రమంలో జరగనున్నందున మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఎవరికీ కోటా ( చెల్లుబాటయ్యే మొత్తం ఓట్లలో సగం కంటే ఒక ఓటు ఎక్కువ) ఓట్లు రాకుంటే, కోటా ఓట్లు వచ్చేంత వరకు తర్వాతి ప్రాధాన్యత ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఎన్నికలో పోస్టల్బ్యాలెట్ల ఓట్లను విడిగా లెక్కించరని అధికారులు తెలిపారు. గత ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో దాదాపు 8400 ఓట్లు చెల్లకుండా పోయాయి. ప్రస్తుతం అభ్యర్థుల సంఖ్య మూడింతలు పెరిగింది. ఓటర్లు భారీగా పెరిగారు. అప్పట్లో 2.96 లక్షల ఓటర్లుండగా, ప్రస్తుతం 5.31 లక్షలకు పెరిగారు. గత ఎన్నికల్లో 39 శాతం పోలింగ్ జరగ్గా, ప్రస్తుతం 67.25 శాతం పోలింగ్ నమోదైంది. అంటే, పోలింగ్ శాతం దాదాపుగా డబుల్ అయింది. ప్రాధాన్యతలతో ఓట్లను సక్రమంగా వేయలేకపోయిన ఓటర్లు ఎక్కువ మంది ఉండవచ్చుననే అనుమానాలున్నాయి. అదే జరిగితే చెల్లని ఓట్లు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువ మంది బరిలో ఉన్నందున అభ్యర్థులందరి ఓట్లూ లెక్కించేందుకు ఎంతో సమయం పట్టనుంది. బుధవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానున్నప్పటికీ, బ్యాలెట్ పేపర్లను నిర్ణీత సంఖ్యలో బండిల్స్గా కట్టడం, ఇతరత్రా కార్యక్రమాలన్నీ పూర్తిచేయాల్సి ఉండటంతో మధ్యాహ్నం లేదా సాయంత్రం అసలైన లెక్కింపు ప్రారంభం కానుంది. బుధవారం విజేత ఎవరో తెలిసే అవకాశాల్లేవని అధికారులు భావిస్తున్నారు. గురువారం లేదా శుక్రవారం వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. కౌంటింగ్కు ఏర్పాట్లు.. అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎనిమిది హాళ్లలో, ఒక్కో హాల్లో ఏడు టేబుళ్లను కౌంటింగ్ కోసం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తొలుత బ్యాలెట్ పత్రాలను 50 లేదా 100 బ్యాలెట్లను కలిపి ఒక్కొక్క బండిల్గా కడతారని, తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రం పరిశీలన దిల్సుఖ్నగర్: సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం లెక్కింపు కేంద్రాన్ని రాచకొండ సీపీ మహేష్ భగవత్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ భద్రతా ఏర్పాట్లును పరిశీలించారు. ఇండోర్ స్టేడియం వద్ద మూడంచెల భద్రత, 1200 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. స్టేడియం చూట్టూ మౌంటెడ్ గుర్రాలు, పెట్రోలింగ్, సీసీటీవీలు కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజున 144 సెక్షన్ విధించినట్లు వెల్లడించారు. చదవండి: మంచి గవర్నర్... భోజనం పెట్టి; ల్యాప్టాప్ ఇచ్చి -
ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఇలా
పెద్దవూర: రాష్ట్రంలో రెండు స్థానాల్లో వరంగల్–ఖమ్మం–నల్లగొండ, హైదరాబాద్–మహబూబ్నగర్–రంగారెడ్డి పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ఆదివారం ముగిసింది. అయితే సాధారణ ఎన్నికల మాదిరిగా ఓట్ల లెక్కింపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండదు. సాధారణ ఎన్నికల్లో ప్రత్యర్థి కన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా ఆ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటిస్తారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలా ఉండదు. మొత్తం పోలైన ఓట్లలో సగానికి కంటే ఎక్కువ ఓట్లు వస్తేనే గెలిచినట్లు. తెలంగాణ శాసనస మండలి ఎన్నికలు పట్టభద్రులు, ఎమ్మెల్యేలతో పాటు సామాన్య ప్రజా నీకాన్ని సైతం ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ ఎన్నికలు మేధావుల మేధస్సుకు గీటురాయి. సాధారణ ఎన్నికల్లో ఓటరు ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం పాధాన్యతకు అనుగుణంగా అభ్యర్థిని ఎన్నుకోవచ్చు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఏ విధంగా వేస్తారో ఒక్కసారి పరిశీలిద్దాం. ప్రాధాన్యత ఓటింగ్ విధానం ►ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది. కానీ, ప్రాధాన్యత క్రమంలో ఓటేయ్యాలి. దీనినే ప్రాధాన్యత ఓటింగ్ క్రమం అంటారు. అంటే ఓటరు తనకు నచ్చే అభ్యర్థుల ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయవచ్చు. తనకు బాగా నచ్చిన అభ్యర్థికి ‘1’ ప్రాధాన్యత ఓటు వేశాక మిగిలిన అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో 2,3,4 ఇలా ఎంతమందికైనా ఓటు వేయవచ్చు. ►పోలైన మొత్తం ఓట్లలో సగం కన్నా ఒక్క ఓటు ఎక్కువగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఉదాహరణకు నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా మొత్తం 15000 ఓట్లు పోలయ్యా యి అనుకుంటే అందులో గెలవడానికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 7,501 రావాల్సి ఉంటుంది. అలా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అభ్యర్థుల్లో ఏ ఒక్కరికీ మొదటి ప్రాధాన్యత ఓట్లు రాకుంటే ఈ కింది విధంగా లెక్కిస్తారు. ►అ అభ్యర్థికి - 4,000 ►ఆ అభ్యర్థికి - 5,000 ►ఇ అభ్యర్థికి - 3,000 ►ఈ అభ్యర్థికి - 1,000 ►ఉ అభ్యర్థికి - 800 ►ఊ అభ్యర్థికి -1200 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి అనుకుందాము. ♦ఇందులో ఏ అభ్యర్థికి కూడా 50శాతం కంటే ఎక్కువగా అనగా 7501 ఓట్లు రాలేదు. కనుక ఎవరూ గెలవలేదు. దీంతో ప్రాధాన్యత ఓటింగ్లో ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కిస్తారు. ♦అంటే ఇందులో ఉ అభ్యర్థికి అందరి కన్నా త క్కువ ఓట్లు వచ్చినందున అతడిని పోటీనుంచి ఎలిమినేట్ చేస్తారు. అతడికి వచ్చిన 800 ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వ చ్చాయో వాటిని పంపిణీ చేస్తారు. ఈ 800 ఓట్లలో అ అభ్యర్థికి 300, ఆ అభ్యర్థికి 200, ఇ అభ్యర్థికి 100, ఈకి 50, ఊ అభ్యర్థికి 150 రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి అనుకుందాము. అప్పుడు ►అ అభ్యర్థికి 4000+300=4300 ►ఆ అభ్యర్థికి 5000+200=5200 ►ఇ అభ్యర్థికి 3000+100=3100 ►ఈ అభ్యర్థికి 1000+50=1,050 ►ఊ అభ్యర్థికి 1200+150=1350 ఓట్లు వచ్చాయి. ♦కానీ గెలవడానికి కావాల్సిన 7501 ఓట్లు ఎవరికీ రానందున అందులో పై అభ్యర్థుల్లో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన ఈ అభ్యర్థిని పోటీనుంచి తప్పించి అతడికి వచ్చిన 1000 ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు 50. మూడో ప్రాధాన్యత ఓట్లను మిగతా నలుగురికి పంపిణీ చేస్తారు. ♦ఈ అభ్యర్థికి వచ్చిన మొదటి 1000 ప్రాధాన్యత ఓట్లలో అ అభ్యర్థికి 200, ఆ అభ్యర్థికి 550, ఇ అభ్యర్థికి 100, ఊ అభ్యర్థికి 150 ఓట్లు చొప్పున రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి అనుకుందాం. అలాగే ఈ అభ్యర్థికి వచ్చిన 50 రెండో ప్రాధాన్యత ఓట్లు గల బ్యాలెట్ పేపర్లో అ,ఆ,ఇ,ఊ అభ్యర్థులకు వచ్చిన మూడో ప్రాధాన్యత ఓట్లను కలుపగా అకు 10 ఓట్లు, ఆకు 30, ఇకు 3, ఊ నకు7 మూడో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. అప్పుడు ►అ అభ్యర్థికి 4300+200+10=4510 ►ఆ అభ్యర్థికి 5200+550+30=5780 ►ఇ అభ్యర్థికి 3100+100+3=3203 ►ఊ అభ్యర్థికి 1350+150+7=1507 ♦ ఇప్పుడు కూడా అ,ఆ,ఇ,ఊ లలో ఎవరికి కూడా గెలుపునకు అవసరమైన 7,501 ఓట్లు ఎవరికి రా లేదు. కావున పై నలుగురు అభ్యర్థులలో అతి త క్కువ ఓట్లు వచ్చిన ఊ అభ్యర్థిని పోటీ నుంచి తొలగించి అభ్యర్థికి వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లు 1200, రెండో ప్రాధాన్యత ఓట్లు 200, మూడో ప్రా« దాన్యత ఓట్లు 7లలో ఉన్న రెండు, మూడు, నా లుగో ప్రాధాన్యత ఓట్లు పొందిన మిగిలిన ముగ్గురు అభ్యర్థులకు పంపిణీ చేస్తారు. ♦ అలా చేయగా అ అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓట్లు 200, మూడో ప్రాధాన్యత ఓట్లు 30, నాలుగో ప్రాధాన్యత ఓట్లు 1 వచ్చి మొత్తంగా 4741 ఓట్లు వచ్చాయి. ♦ ఆ అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓట్లు 1000, మూడో ప్రాధాన్యత ఓట్లు 110, నాలుగో ప్రాధాన్య త ఓట్లు 5 వచ్చి మొత్తంగా 6895 ఓట్లు వచ్చాయి. ♦ ఇ అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓట్లు 150, మూడో ప్రాధాన్యత ఓట్లు 10, నాలుగో ప్రాధాన్యత ఓట్లు 1 ఓట్లు మొత్తం కలిపి 1668 ఓట్లు వచ్చాయి. ♦ అయినా, అ,ఆ,ఇలలో ఎవరికి కూడా గెలుపునకు అవసరమైన 7501 ఓట్లు రాలేదు. కావున పై ముగ్గురు అభ్యర్థుల్లో అతి తక్కువ ఓట్లు వచ్చిన ఇ అభ్యర్థిని పోటీనుంచి తొలగించి అభ్యర్థికి వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లు 3000, రెండో ప్రాధాన్యత ఓట్లు 100, మూడో ప్రాధాన్యత ఓట్లు 3, నాలుగో ప్రాధాన్యత 1 ఓట్లలో ఉన్న రెండు, మూడు, నాలుగు, ఐదో ప్రాధాన్యత ఓట్లు పొందిన మిగిలిన ఇద్దరు అభ్యర్థులకు పంపిణీ చేస్తారు. ♦ అలా చేయగా అ అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓట్లు 1200, మూడో ప్రాధాన్యత ఓట్లు 30, నా లుగో ప్రాధాన్యత ఓట్లు 2, ఐదో ప్రాధాన్యత ఓట్లు 0 వచ్చాయి. ♦ అలాగే ఆ అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓట్లు 1800, మూడో ప్రాధాన్యత ఓట్లు 40, నాలుగో ప్రా« దాన్యత ఓట్లు 1, ఐదో ప్రాధాన్యత ఓట్లు 1 వ చ్చాయి. అప్పుడు మొత్తంగా ►అ అభ్యర్థికి 4771+1200+30+2+0=6003 ►ఆ అభ్యర్థికి 6895+1800+40+1+1=8767 ♦ దీంతో ప్రాధాన్యత ఓటు క్రమంలో ఆ అభ్యర్థికి పోలైన ఓట్లలో 50శాతం కంటే ఎక్కువగా అనగా 7501 ఓట్ల కంటే ఎక్కువగా వచ్చాయి కనుక ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటించి ఫలితాలు వెల్లడిస్తారు. ఒక వేళ రెండో ప్రాధాన్యతలోనూ ఏ అభ్యర్థికి కూడా 50శాతం కంటే ఎక్కువగా రాకుంటే మూడు, నాలుగు ఆ కింది ప్రాధాన్యత ఓట్లు లెక్కించి మొత్తం ఓట్లలో సగానికి కంటే ఎక్కువ ఓట్లు పోలైన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. -
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డిపై దాడి
ఖమ్మం: ఖమ్మం, వరంగల్, నల్ల గొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ సరళిని పరిశీలించేందుకు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో పర్యటిస్తుండగా ఆయనపై దాడి జరిగింది. ఆయనపై కొంతమంది చాతీపై ఇటుకలతో దాడి చేయడంతో గాయపడ్డారు. పోలీసులు, పార్టీ నాయకులు సమీపంలోని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. ఆస్పత్రికి చేరుకున్న పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రేమేందర్రెడ్డి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని, పోలింగ్ ముగిసిన తర్వాత హైదరాబాద్ తరలిస్తామని తెలిపారు. -
సిలిండర్కు దండం పెట్టుకొని వచ్చా: మంత్రి కేటీఆర్
బంజారాహిల్స్/సాక్షి, హైదరాబాద్: ఎవరో మహానుభావుడు చెప్పినట్లు ఓటేసే ముందు ఇంట్లో సిలిండర్కు దండం పెట్టుకొని వచ్చానని మంత్రి కేటీఆర్ చమత్కరించారు. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఆదివారం నిర్వహించగా మంత్రి బంజారాహిల్స్ రోడ్ నంబర్–2లోని షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో 39% మంది మాత్రమే ఎమ్మెల్సీ ఓటింగ్లో పాల్గొన్నారని ఈసారి పోలింగ్ శాతం పెరిగాల్సిన అవస రం ఉందన్నారు. విద్యావంతులు ఓటింగ్లో పాల్గొనరన్న అపవాదును తొలగించుకోవాలన్నారు. విద్యావంతులకు కృతజ్ఞతలు... పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న విద్యావంతులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని, ఈ హక్కుని వినియోగించుకోవాలని చేసిన ప్రచారానికి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఇన్చార్జిలుగా వ్యవహరించిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ‘హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్’ అభ్యర్థిగా పోటీ చేసిన వాణీదేవి విజయం ఖాయమని టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే.కేశవరావు అన్నారు. -
పట్టభద్రుల చైతన్యం.. గణనీయంగా పెరిగిన పోలింగ్
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రులు చైతన్యం కనబరిచారు. రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గాలకు ఆదివారం నిర్వహిం చిన ఎన్నికల్లో గణనీయంగా పోలింగ్ శాతం పెరిగింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్ చెదురుమదురు ఘటనలు తప్ప ప్రశాంతంగా ముగిసింది. మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 64.87 శాతం, వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 76.35% పోలింగ్ నమోదైనట్టు ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. సాయంత్రం 4 తర్వాత జరిగిన పోలింగ్ను పరిగణనలోకి తీసుకుని ఆర్వోలు ఈ ప్రకటన చేశారు. అయితే, సాయంత్రం నాలుగు గంటల నాటికి హైదరాబాద్ స్థానానికి 59.96 శాతం, నల్లగొండ స్థానానికి 64.7 శాతం పోలింగ్ నమోదైందని సీఈవో శశాంక్ గోయల్ ప్రకటించారు. సోమవారం కచ్చితమైన పోలింగ్ గణాంకాలను ప్రకటిస్తామని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎండ తీవ్రత తగ్గాక సాయంత్రం 4 గంటల నుంచి పోలింగ్ ముగిసే సమయం వరకు చాలా పోలింగ్ కేంద్రాల్లో పెద్దసంఖ్యలో ఓటర్లు క్యూలైన్లలో నిలబడి ఉండటంతో నిబంధనల ప్రకారం వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. కొన్ని చోట్లలో రాత్రి 7 గంటలు దాటిన తర్వాత కూడా పోలింగ్ జరిగింది. కొన్ని పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూంలకు బ్యాలెట్ పెట్టెలు రావాల్సి ఉందని, అప్పుడే స్పష్టమైన పోలింగ్ గణాంకాలు వెల్లడవుతాయని శశాంక్ గోయల్ ‘సాక్షి’కి తెలిపారు. బ్యాలెట్ పెట్టెల్లో భవితవ్యం ‘హైదరాబాద్’మండలి స్థానం నుంచి ఏకంగా 93 మంది, ‘నల్లగొండ’స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో భారీ సైజు బ్యాలెట్ పేపర్లు, జంబో బ్యాలెట్ బాక్స్లను ఉపయోగించి పోలింగ్ నిర్వహించారు. జంబో బ్యాలెట్ బ్యాక్సుల్లో ఓటర్ల తీర్పు నిక్షిప్తమై ఉంది. ఈ నెల 17న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ‘హైదరాబాద్’, నల్లగొండ పట్టణంలోని మార్కెట్ శాఖ గిడ్డంగిలో ‘నల్లగొండ’ఓట్లను లెక్కించనున్నారు. పట్టిష్టమైన భద్రత ఏర్పాట్లతో బ్యాలెట్ పెట్టెలను ఆయా ప్రాంతాల్లో నిల్వచేశామని సీఈవో శశాంక్ గోయల్ తెలిపారు. ఓట్ల నమోదు నుంచి కనిపించిన చైతన్యం చివరిసారిగా 2015 మార్చిలో జరిగిన ఎన్నికల్లో ‘హైదరాబాద్’స్థానానికి 39 శాతం పోలింగ్ జరగగా, తాజా ఎన్నికల్లో 64.87 శాతానికి పెరిగింది. అప్పటి ఎన్నికల్లో ‘నల్లగొండ’స్థానానికి 58 శాతం పోలింగ్ నమోదు కాగా తాజా 74 శాతానికి పెరిగింది. గత ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలో 2,96,318 మంది ఓటర్లు ఉండగా, ఈసారి 5,31,268 మందికి పెరిగారు. నల్లగొండ స్థానంలో 2,81,138 మంది ఓటర్లు ఉండగా, ఈసారి 5,05,565 మందికి పెరిగారు. గత ఎన్నికల నాటితో పోలిస్తే ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో మార్పులు రావడం, భారీగా పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావడం, రాజకీయపార్టీలు, అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించడం, ఆదివారం పోలింగ్ నిర్వహించడం వంటి కారణాలతో ఈసారి పోలింగ్ శాతం పెరగడానికి దోహదపడిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. హోంమంత్రిపై ఈసీకి నివేదిక టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి మేడమ్కు ఓటు వేశానని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చేసిన కామెంట్స్పై ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమర్పించిన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని సీఈవో శశాంక్ గోయల్ తెలిపారు. నివేదిక పరిశీలించి చర్యలపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. -
ఓటరు జాబితాలో మోదీ ఫొటో!
సాక్షి, వికారాబాద్ అర్బన్: ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో ప్రధాని మోదీ ఫొటో దర్శనమిచ్చింది. దీంతో సదరు ఓటరు ఓటుహక్కు వినియోగించుకోనివ్వరనే అనుమానంతో పోలింగ్ కేంద్రానికే రాలేదని సన్నిహితులు తెలిపారు. వికారాబాద్ మండలం పులుసుమామిడి గ్రామానికి చెందిన పట్టభద్రుడు ఎ.దయాకర్రెడ్డి ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకున్నారు. బూత్ నంబర్ 307లో వరుససంఖ్య 269లో ఆయన ఓటు నమోదై ఉంది. దయాకర్రెడ్డి ఫొటో ఉండాల్సి నచోట ప్రధాని మోదీ ఫొటో ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఓటరు జాబితాలో ఉన్న ఫొటోతో సంబంధం లేదని పేరు, ఇతర వివరాలు సరిగ్గా ఉన్న ఆధారాలు చూపిస్తే ఓటు వేసేందుకు అనుమతిస్తామని తెలిపారు. చదవండి: (ఎవరి ధీమా వారిదే..!) -
గట్టిపోటీ ఇచ్చిన కోదండరాం, నాగేశ్వర్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికివారు ధీమాగా ఉన్నారు. పోలింగ్ ముగియడంతో జయాపజయాలపై లెక్కలు వేసుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు పోలింగ్ జరిగిన సరళి తమ కంటే తమకే అనుకూలమంటూ అంచనాలు వేసుకుంటున్నాయి. ఈ రెండు స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ఆ మూడు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండగా, ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు, స్వతంత్రులు కూడా తమ సత్తా చాటుతామని అంటున్నారు. – సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వాలపై వ్యతిరేకత నల్లగొండ–ఖమ్మం–వరంగల్లో గిరిజన నేత రాములునాయక్కు టికెట్ ఇవ్వడం కలసి వస్తుందని, పోలింగ్ సరళి కూడా ఇదే చెబుతోందని గాంధీభవన్ వర్గాలంటున్నా యి. సామాజిక కోణంలో ఓటర్లు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్నగర్లో టీఆర్ఎస్, బీజేపీల నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులుండటం, మరో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నేతకు తాము టికెట్ ఇవ్వడం లాభిస్తుందని అం చనా వేస్తున్నారు. పాలమూరు జిల్లాలో స్థానిక త పనిచేసిందని, రాజకీయంగా తమ అభ్యర్థి చిన్నారెడ్డి అనుభవజ్ఞుడు కావడం లాభించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్పై ఎలాగూ వ్యతిరేకత ఉందన్న ధీమా కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అదే జోరు.. ఈసారీ హుషారు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్తో ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్లిన కమలనాథులు కూడా రెండు స్థానాల్లో విజయం తమదేనని అంటున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని పట్టభద్రులు విశ్వసించారని, తమకు ఎన్నికల ప్రచారంలో లభించిన స్పందనతోపాటు పోలింగ్ జరిగిన సరళి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్పై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేనందున అనివార్యంగా తమను ఎంచుకున్నారని, మోదీ నాయకత్వంపై తెలంగాణ ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, ఈ నేపథ్యంలో విజయం తమదేనన్న విశ్వాసం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. సిట్టింగ్ స్థానం రంగారెడ్డితోపాటు బోనస్గా నల్లగొండ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని, ఇదే ఊపుతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు వెళతామని కమలనాథులంటుండటం గమనార్హం. ఇక సాగర్ ఉప ఎన్నిక రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల స్థానాలకు పోలింగ్ ముగిసిన నేపథ్యంలో రాజకీయ పార్టీల దృష్టి నాగార్జునసాగర్ అసెంబ్లీకి జరిగే ఉపఎన్నిక వైపు మరలనుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా ఉప ఎన్నికపై ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ముగిసిన వెంటనే మళ్లీ అన్ని రాజకీయ పార్టీలు సాగర్ కేంద్రంగా మకాం వేసి ఎన్నికల రాజకీయం నడిపేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం. చెప్పుకోగలిగాం... చేతల్లో చూపిస్తాం పోలింగ్ తర్వాత మంత్రి కేటీఆర్ స్పందిస్తూ తమ ప్రయత్నానికి పట్టభద్రుల నుంచి మంచి స్పందన లభించిందని చెప్పారు. పట్టభద్రులు తమకెందుకు ఓటేయాలనే అంశాన్ని విస్తృతంగా తీసు కెళ్లగలిగామనే అంచనాలో తెలంగాణ భవన్ వర్గాలున్నట్టు కనిపిస్తోంది. ఈ ఎన్నికలు జరిగే జిల్లాలకు చెందిన పార్టీ యంత్రాంగం 10 రోజులుగా పక్కా కార్యాచరణతో ముందుకెళ్లిందని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలకు చెందిన 100కుపైగా సంఘాలు బహిరంగంగా తమకు మద్దతు ప్రకటించినందున ఆ ఓట్లన్నీ తమ ఖాతాలోనే పడ్డాయని టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఉన్న కొంత వ్యతిరేకతను కూడా సమసిపోయేలా చేయగలిగామని, ఈ రెండుస్థానాల్లోనూ ప్రథమ ప్రాధాన్యత ఓటుతోనే గెలుస్తామనే ధీమా టీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. మొదటి, రెండో ప్రాధాన్యత.. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కల్లో రాజకీయపార్టీలు నిమగ్నమయ్యాయి. ఏ పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసినా, రెండో ప్రాధాన్యత విషయంలో క్రాస్ ఓటింగ్ తథ్యమని, ఈ పరిస్థితుల్లో ఫలితం ఎలా ఉంటుందోననే ఆసక్తి అన్ని ప్రధాన రాజకీయ పక్షాల్లోనూ కనిపిస్తోంది. పోలింగ్ జరిగిన సరళిని బట్టి నల్లగొండ నుంచి ప్రొఫెసర్ కోదండరాం గెలుస్తారనే చర్చ రాజకీయవర్గాల్లో జరగడానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది. ఇక్కడ ప్రథమ ప్రాధాన్యత ఎవరికి వేసినా, రెండో ప్రాధాన్యత కింద ప్రొఫెసర్ను ఎంచుకున్నారనే చర్చ జరుగుతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో ఆయనకున్న సంబంధాలు, తెలంగాణ జేఏసీ చైర్మన్గా రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన పాత్రను పరిగణనలోనికి తీసుకుని పట్టభద్రుల పోలింగ్ జరిగిందనే వాదన ఆసక్తిని కలిగిస్తోంది. హైదరాబాద్–రంగా రెడ్డి–మహబూబ్నగర్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ గెలుపుపై కూడా పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రథమ ప్రాధాన్యత ఎవరికి వేసినా, రెండో ప్రాధాన్యత కింద నాగేశ్వర్ను ఎంచుకున్నారనే ప్రచారం పట్టభద్రుల్లో సాగుతోంది.. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్ని ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వస్తాయి... వారికి ప్రథమ ప్రాధాన్యత కింద వచ్చిన ఓట్లలో తమకు ఎన్ని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు వస్తాయన్న దానిపై ప్రధాన పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. -
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటు వేసిన ప్రముఖులు
-
తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
Time 4.00 తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ సమయం ముగియడంతో పోలింగ్ స్టేషన్ల వద్ద ఎన్నికల సిబ్బంది గేట్లు మూసివేశారు. కానీ, భారీ ఎత్తున ఓటు వేసేందుకు పట్టభద్రులు క్యూలైన్లలో బారులు తీరారు. అయితే క్యూలైన్లతో బారులు తీరిన ఓటర్లకు ఓటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. జనగామ: జనగామ జిల్లాలో పోలింగ్ స్టేషన్లలో పెరుగుతున్న ఓటర్ల రద్దీ. గంటల తరబడి నిరీక్షిస్తున్న ఓటర్లు. ఒక్కో ఓటుకు ఐదు నుంచి పది నిమిషాల సమయం పడుతుండటంతో మహిళా ఓటర్లు అవస్థలు పడుతున్నారు. దీంతో ఓటర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదనపు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం: మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురులో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు డబ్బులు పంచుతున్నారనే అనే సమాచారంతో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి అక్కడికి వెళ్లారు. పోలీసుల ముందే టీఆర్ఎస్ నాయకులు ఇటుకలతో దాడికి దిగారు. ఈ ఘటనలో గాయపడిన ప్రేమేందర్ రెడ్డిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వరంగల్: వరంగల్లోని శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే నరేందర్ సందర్శించి, పోలింగ్ సరళిని పరిశీలించారు. సాక్షి, ఖమ్మం: ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాధపాలెం మండలంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్కు ఓటు వేయడానికి పట్టభద్రులు బారులు తీరారు. మండలంలో ఉన్న మొత్తం 1948 ఓట్లకు సంబందించి ఒకే సారి ఓట్లు వేయడానికి పట్టభద్రులు వచ్చారు. రెండే పోలింగ్ బూత్లు ఉండడంతో 4 గంటలు అయిన కేవలం 350 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రంలో సరియైన సదుపాయాలు లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు నేడు (ఆదివారం, మార్చి14) ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆయన సతీమణి మమత. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ యువ తెలంగాణ పార్టీ అభ్యర్ధి రాణి రుద్రమ వరంగల్ జిల్లా నర్సంపేటలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వామపక్షాలు బలపరిచిన అభ్యర్థిగా బరిలో నిలిచిన ప్రొఫెసర్ నాగేశ్వర్, సతీమణితో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరంగల్- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి తల్లి ఆశీర్వాదం తీసుకొని తన ఓటు హక్కును వినియోగించు కున్నారు. అంతకుముందు వరంగల్ జిల్లా మల్లికుదుర్ల గ్రామంలో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఖమ్మం శీలం సిద్దారెడ్డి కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంలో ఓటు వేశారు. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో లోకొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్లోని నీటిపారుదలశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో నగర మేయర్ విజయలక్ష్మి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవియాదవ్ దంపతులు షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. జోగులాంబ గద్వాల జిల్లా: ఇటిక్యాల మండలం కేంద్రంలో 129 బూత్ లో ఓటు వేసిన ఢిల్లీ అధికార ప్రతినిధి అభ్యర్థి మందా జగన్నాథం జోగులాంబ గద్వాల జిల్లాఇటిక్యాల మండలం కేంద్రంలో 30 బూత్ లో ఓటు వేసిన ఎమ్మెల్యే అబ్రహం ఖమ్మం : నగరంలోని శీలం సిద్దారెడ్డి కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మహబూబ్నగర్ : జిల్లా కేంద్రంలోని మహిళా కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఓటు వేశారు. అలాగే మోడ్రన్ హైస్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ వెంకట్ రావ్. వనపర్తి జిల్లా : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి నారాయణపేట జిల్లా : మక్తల్ బాలుర ఉన్నత పాఠశాలలో కుటుంబ సమేతంగా తమ ఓటు వేసినఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ ఛైర్మెన్ నిజాం పాషా ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్, షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. విద్యావంతులు ఓటు హక్కును వినియోగించుకోవాలని, తద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచి బాధ్యతను చాటుకోవాలని ఈ సందర్బంగా ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధికి పాటుపడే అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. ఓ మహానుభావుడు చెప్పినట్లు ఇంట్లో బయల్దేరేటపుడు గ్యాస్ సిలిండర్కు నమస్తే చెప్పి బయల్దేరి విద్యావంతులకు ఓటు వేశానంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లా : ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ : ఓటు హక్కు వినియోగించుకోనున్న లక్ష 29వేల 854 మంది ఓటర్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 189 పోలింగ్ కేంద్రాలు...ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పొలింగ్ కేంద్రాలలో బందోబస్తు ఏర్పాటు. సూర్యాపేట జిల్లా : సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సతీ సమేతంగా ఓటువేసిన మంత్రి జగదీష్ రెడ్డి ఓల్డ్ మలక్పేటలోని అగ్రికల్చర్ కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్లగొండ- ఖమ్మం-వరంగల్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘హైదరాబాద్’ మండలి స్థానం నుంచి ఏకంగా 93 మంది, ‘నల్లగొండ’ స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో .. భారీ సైజు బ్యాలెట్ పేపర్లు, జంబో బ్యాలెట్ బాక్స్లను ఉపయోగించి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ‘హైదరాబాద్’స్థానంలో 5,31,268 మంది, ‘నల్లగొండ’స్థానంలో 5,05,565 మంది ఓటర్లుగా నమోదయ్యారు. సున్నితమైన ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించారు. -
గులాబీకి పట్టు దొరికేనా.. గెలుపు దక్కేనా?
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల కోటాలో ఆదివారం పోలింగ్ జరిగే రెండుస్థానాలను అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ‘వరంగల్- ఖమ్మం- నల్లగొండ’లో మరోమారు విజయం సాధించాలని, ఒక్కసారి కూడా గెలుపొందని ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్’ స్థానంలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలగా ఉంది. ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్’ పట్టభద్రుల స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్రావు బీజేపీ తరఫున మళ్లీ బరిలోకి దిగారు. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలతో ఊపు మీదున్న బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలంటే ‘హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్’ స్థానాన్ని చేజిక్కించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. దివంగత మాజీ ప్రధాని పీవీ కూతురు సురభి వాణీదేవిని ఈ స్థానంలో అభ్యర్థిగా నిలిపిన టీఆర్ఎస్ ఆమె గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. మరోవైపు ఈ రెండు పట్టభద్రుల స్థానాలు 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉండటమేకాక వీటిలో 64 చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఎన్నికల ఫలితాలు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుకు పరీక్షగా మారాయి. పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో మోహరించిన టీఆర్ఎస్ సాధారణ ఎన్నికల స్థాయిలో ప్రచారాన్ని హోరెత్తించింది. ‘హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్నగర్’ప్రతిష్టాత్మకం ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్’ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో 2007, 2009, 2015లో మూడు పర్యాయాలు ఎన్నికలు జరగ్గా 2007, 2015లలో మాత్రమే టీఆర్ఎస్ పోటీ చేసింది. 2015లో ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి విజయం సాధించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో ఏకంగా 9 మంది మంత్రులు ఈ నియోజకవర్గం పరిధిలో మకాం వేసి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి మాజీమంత్రి చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్తోపాటు మొత్తం 93 మంది పోటీ చేస్తున్నారు. -
నేడే తెలంగాణ ‘పట్టభద్రుల’ ఓటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్లగొండ- ఖమ్మం- వరంగల్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘హైదరాబాద్’ మండలి స్థానం నుంచి ఏకంగా 93 మంది, ‘నల్లగొండ’ స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో .. భారీ సైజు బ్యాలెట్ పేపర్లు, జంబో బ్యాలెట్ బాక్స్లను ఉపయోగించి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ‘హైదరాబాద్’స్థానంలో 5,31,268 మంది, ‘నల్లగొండ’స్థానంలో 5,05,565 మంది ఓటర్లుగా నమోదయ్యారు. సున్నితమైన ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించారు. రెండు స్థానాల్లో 15 వేల మంది అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఐదుగురు సిబ్బంది చొప్పున మొత్తం 8 వేల పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యా యని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) శశాంక్ గోయల్ పేర్కొన్నారు. రెండు నియోజక వర్గాల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు శనివారం రాత్రిలోగా పోలింగ్ సామాగ్రితో పోలింగ్ సిబ్బంది చేరుకున్నట్టు నివేదికలు వచ్చాయని వెల్లడించారు. ఈ నెల 17న (బుధవారం) ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలోని 8 హాళ్లలో 56 టేబుళ్లు ఏర్పాటు చేసి ‘హైదరాబాద్’స్థానానికి సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. నల్లగొండలోని మార్కెట్ శాఖ గిడ్డంగిలో ‘నల్లగొండ’ ఓట్లను లెక్కించనున్నారు. ఇక్కడ కూడా 8 హాళ్లలో 56 టేబుళ్లను ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేయనున్నారు. ‘హైదరాబాద్’ స్థానం నుంచి సురభి వాణిదేవి (టీఆర్ఎస్), ఎన్.రామచందర్రావు (బీజేపీ), జిల్లెల చిన్నారెడ్డి (కాంగ్రెస్), ఎల్.రమణ (టీడీపీ), మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్రావు (స్వతంత్ర అభ్యర్థి)లతో సహా 93 బరిలో ఉన్నారు. ‘నల్లగొండ’ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్), ఎస్.రాములునాయక్ (కాంగ్రెస్), గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ), బి.జయసారధి రెడ్డి (సీపీఐ), ప్రొఫెసర్ ఎం.కోదండరాం (టీజేఎస్), రాణిరుద్రమ (యువ తెలంగాణ), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటి పార్టీ)లతో సహా మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతుండటం, భారీసైజు బ్యాలెట్ పేపర్ను వినియోగిస్తుండటంతో ఓటర్లు తమ ప్రాధాన్యతల ఆధారంగా అభ్యర్థుల పేర్లను వెతకడం కొంచెం కష్టంగా మారనుంది. పోలింగ్ శాతం పెరిగేనా? గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పట్టభద్రుల మండలి ఎన్నికలు రాజకీయ వేడి పుట్టించాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. గతంతో పోలిస్తే ఈసారి ఏకంగా 85 శాతం అధికంగా ఓటర్ల నమోదు జరిగింది. పోలింగ్ ఆదివారం రోజున నిర్వహిస్తున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని చూస్తే... ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగే అవకాశముందని అధికారవర్గాలు ఆశిస్తున్నాయి. ‘తొలి’ప్రాధాన్యత ఇస్తేనే ఓటు చెల్లుబాటు / ఫస్ట్ ప్రయారిటీ మస్ట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రాధాన్యత ఓటు విధానంలో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ తొలి ప్రాధాన్యత ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఓటు చెల్లుబాటు కాదు. ఓటింగ్కు సంబంధించి సీఈఓ శశాంక్ గోయల్ ఓటర్లకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. అవి ఇలా ఉన్నాయి.. పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రంతో పాటు ఇచ్చిన ఊదా (వయోలెట్) రంగు స్కెచ్ పెన్తో మాత్రమే ఓటు వేయాలి. మరే ఇతర పెన్నులు, పెన్సిల్స్ ఉపయోగించరాదు. ఓటరు తాను మొదటి ప్రాధాన్యత ఇవ్వదలచుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న ఖాళీ గడిలో ‘1’అంకెను రాయాలి. ఓటర్లు తమ తదుపరి ప్రాధాన్యతలను చెప్పడానికి 2 ,3, 4, 5 ... అంకెలను ద్వారా ఆయా అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ఉన్న గడిలో రాయాలి. ఓటు (బ్యాలెట్ పత్రం) చెల్లుబాటు కావడానికి ఓటర్లు తప్పనిసరిగా తొలి ప్రాధాన్యత (1)ను ఇవ్వాలి. మిగిలిన అభ్యర్థులకు తదుపరి ప్రాధాన్యత ఓట్లు వేయడం, వేయకపోవడం ఓటర్ల ఇష్టం. తొలి ప్రాధాన్యత ఓటు వేసి, తదుపరి ప్రాధాన్యత ఓట్లు వేసినా, వేయకున్నా ఓటు చెల్లుబాటు అవుతుంది. ప్రాధాన్యతలను తెలపడానికి అంతర్జాతీయ ప్రామాణిక అంకెలు 1, 2, 3, 4... లేదా రోమన్ అంకెలు ఐ, ఐఐ, ఐఐఐ, ఐV.. లేదా భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్ గుర్తించిన ఇతర భారతీయ భాషల్లో ఉపయోగించే అంకెలను వినియోగించవచ్చు. అయితే ఓటరు.. ఒకే భాష/ సంఖ్యా విధానానికి సంబంధించిన అంకెలను మాత్రమే వాడాలి. భిన్నమైన న్యూమరికల్స్ను కలిపి ఉపయోగించరాదు. ఒకే సంఖ్యను ఒక అభ్యర్థి కన్నా ఎక్కువ మందికి ఇవ్వకూడదు. అలా రాస్తే ఓటు చెల్లుబాటు కాదు. ఏ ఒక్క అభ్యర్థికి ఒకటి కన్నా ఎక్కువ ప్రాధాన్యతలను ఇచ్చినా ఓటు చెల్లుబాటు కాదు. అభ్యర్థి పేరుకు ఎదురుగా రైట్/ టిక్ గుర్తు లేదా గీ గుర్తులతో ఎంపికను తెలియజేస్తే ఓటు చెల్లుబాటు కాదు. బ్యాలెట్ పత్రంపై ఓటర్లు తమ ఇంటి పేరు, ఇతర పదాలు, సంతకం, పొడి అక్షరాలు రాయకూడదు. వేలిముద్రలు కూడా వేయకూడదు. అలాచేస్తే ఓటు చెల్లదు. ప్రాధాన్యతల ఎంపికను అంకెల్లో మాత్రమే సూచించాలి. ఒకటి, రెండు, మూడు ... అని అక్షరాల్లో రాయకూడదు. అభ్యర్థి ఎదురుగా ఉన్న గడిలో మాత్రమే ప్రాధాన్యత సంఖ్యను రాయాలి. రెండు గడుల మధ్య ఉన్న గీతపై ప్రాధాన్యత అంకెను రాస్తే ఓటు చెల్లుబాటు కాదు. ఓ క్రమపద్దతిలో మడతపెట్టిన బ్యాలెట్ పత్రాన్ని పోలింగ్ అధికారులు ఓటర్లకు అందించనున్నారు. ఓటర్లు మడత విప్పి ఓటు వేసిన తర్వాత మళ్లీ అదే తరహాలో మడత పెట్టి బ్యాలెట్ బాక్సులో వేయాల్సి ఉంటుంది. ఈ గుర్తింపు కార్డుల్లో ఏదున్నా ఓకే... పట్టభద్రుల ఓటర్లందరికి ఓటరు గుర్తింపు (ఎపిక్) కార్డు జారీ చేశారు. పోలింగ్ కేంద్రానికి ఎపిక్ కార్డును తీసుకువచ్చి ఓటేయవచ్చు. ఒకవేళ ఎపిక్ కార్డు అందుబాటులో లేకుంటే ఈ కింద పేర్కొన్న ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తీసుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని సీఈఓ శశాంక్ గోయల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రైవేటు ఇండస్ట్రియల్ హౌస్లు, ఎంపీ/ఎమ్మెల్యే/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, ఓటర్లకు విద్యా సంస్థలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డులు, వర్శిటీలు జారీ చేసిన డిగ్రీ/డిప్లమా సర్టిఫికేట్ ఒరిజినల్, సంబంధిత అధికారులు జారీ చేసిన వికలాంగ ధ్రువీకరణ పత్రం ఒరిజినల్. -
సాఫీగా ‘పట్టభద్రుల’ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికలు సాఫీగా సాగేందుకు అందరూ సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టభద్రుల ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో కోవిడ్ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు చేస్తామని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టభద్రులు తమ ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు అవకాశం కల్పించాలని సూచించారు. పోలింగ్ తీరుతెన్నులపై అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలు, ఇతర కెమెరాలతో వీడియోగ్రఫీ చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు 50 ఫిర్యాదులు అందాయని, ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తీసుకుంటామన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరుల బాధ్యతని.. తద్వారా ప్రజాస్వామ్యం పటిష్టమవుతుందన్నారు. పోలింగ్ రోజున అభ్యర్థికి రెండు వాహనాలతో పాటు ప్రతీ జిల్లాకు అదనంగా ఒక వాహనం ఉపయోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ కూడా పూర్తయిందని శశాంక్ గోయల్ వెల్లడించారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేయడంతో పాటు, ఈ నెల 17న ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
చివరాఖరు వరకు ఫోన్లో కేటీఆర్ బిజీబిజీ
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి పట్టభద్రుల కోటా ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో.. ఈ నెల 14న పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు ఆదేశించారు. ప్రచార తీరుతెన్నులు, క్షేత్రస్థాయిలో ఓటర్ల మనోగతం, పార్టీ ఎన్నికల వ్యూహం అమలు తదితరాలకు సంబంధించి కేటీఆర్ శుక్రవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలకనేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు విస్తరించి ఉన్న ఆరు ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల ఇన్చార్జులుగా వ్యవహరించిన మంత్రుల ద్వారా ప్రచార తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. మండలాలు, మున్సిపాలిటీల వారీగా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ఇతర కేటగిరీల పట్టభద్రులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనాలపై కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం వల్ల 85శాతానికి పైగా పట్టభద్ర ఓటర్లను నేరుగా కలుసుకోవడం సాధ్యమైందని పార్టీ నేతలు కేటీఆర్కు వివరించారు. ప్రతీ 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించడంతోపాటు సుమారు 20 రోజులుగా వారిని సమన్వయం చేశామని వెల్లడించారు. ఓటేసేందుకు వచ్చేలా చూడండి ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ ప్రస్తావించిన అంశాలపై ఓటర్ల స్పందనను తెలుసుకున్న కేటీఆర్.. పోలింగ్ ముగిసేదాకా అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీ పరంగా పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. సానుకూల ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా క్షేత్రస్థాయి సమన్వయకర్తలు పనిచేయాలని ఆదేశించారు. -
తెలంగాణ అసెంబ్లీ గరంగరం!
సాక్షి, హైదరాబాద్: ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గరంగరంగా జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు ఎక్కుపెట్టేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధం అవుతుండగా.. తాము అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రతిపక్షాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. కాగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సమయంలో తెరపైకి వచ్చిన పలు అంశాలు అసెంబ్లీ వేదికగా చర్చకు వస్తాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనా వైఫల్యంపై ప్రతిపక్షాలు గొంతెత్తనున్నాయి. అయితే రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు అధికార పక్షం స్కెచ్ గీస్తోంది. కాగా, ఈ నెల 18న బడ్జెట్ను ప్రవేశపెడతారని, ఈసారి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుందని ప్రభుత్వవర్గాల ద్వారా తెలుస్తోంది. ఉద్యోగాలు.. నిరుద్యోగ భృతి.. సమావేశాల్లో పలు అంశాలను సభలో లేవనెత్తి అధికారపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ ఆధారాలతో సహా వివరాలు సేకరించే పనిలో పడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తెరపైకి వచ్చిన ఉద్యోగాల కల్పన, ఐటీఐఆర్, నిరుద్యోగ భృతి, కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు తదితర అంశాలపై సీఎల్పీ నేత భట్టి నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభు త్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. ఆది లేదా సోమవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అనంతరం సీఎల్పీ భేటీ కానుంది. బీజేపీ కూడా నిరుద్యోగ భృతి, నిజాం షుగర్స్, యూనివర్సిటీల నిర్వీర్యం, ఉద్యోగ నోటిఫికేషన్లు, జోనల్ వ్యవస్థపై నిర్లక్ష్యం, కేంద్ర పథకాల అమలు, ఫసల్బీమా యోజన వంటి అంశాలకు సంబంధించి పూర్తి వివరాలతో రెడీగా ఉంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ నేతలు శనివారం భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ప్రభుత్వం లీకులిచ్చి ఉద్యోగులకు 29% ఫిట్మెంట్ ఇస్తామని చెప్పిన విషయంపై కూడా గణాంకాలతో సహా ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఎదురుచూస్తున్నాయి. ఎంఐఎం కూడా గ్రేటర్ పరిధిలోని సమస్యలు, ఇతర అంశాలతో సభకు హాజరయ్యేందుకు సిద్ధమవుతోంది. గట్టిగానే బదులివ్వాలని.. ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు దీటుగా బదులిచ్చేందుకు అధికార టీఆర్ఎస్ కూడా పకడ్బందీగానే సిద్ధమవుతోంది. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగానే ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాకముందు.. వచ్చిన తర్వాత అభివృద్ధి అనే కోణంలో ప్రతిపక్షాలను తూర్పారపట్టేందుకు సిద్ధమవుతున్నారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. 2014-19 వరకు రాష్ట్రం సగటున 17.24 శాతం వృద్ధి సాధించిందని, 2013-14లో ఉన్న జీఎస్డీపీకి, 2019-20లో ఉన్న జీఎస్డీపీకి 114 శాతం మెరుగుదల ఉందని, రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.1.12 లక్షల నుంచి రూ.2.28 లక్షల వరకు పెరిగిందన్న విషయాలను గణాంకాలతో సహా చెప్పనున్నట్లు తెలుస్తోంది. తాము చేసిన అభివృద్ధికి ఈ గణాంకాలే నిదర్శనమని వివరించేందుకు అవసరమైన అన్ని వివరాలను ఆయన సిద్ధం చేసుకుంటున్నారని అధికారపక్షాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అమలవుతున్న పాలనా సంస్కరణలు, కొత్త చట్టాలు, విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు, హరిత తెలంగాణ, ఐటీ, పరిశ్రమల ఏర్పాటులో పురోగతి, మత సామరస్యం, వ్యవసాయ రంగంలో వృద్ధి, రైతు సంక్షేమం, పంట ఉత్పత్తుల్లో పెరుగుదల, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల అమలు, పల్లె, పట్టణ ప్రగతి వల్ల గ్రామాల్లో, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, మిషన్ భగీరథ, కాకతీయ ఫలితాలు, సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణం, మార్కెటింగ్, గోడౌన్ సౌకర్యాల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, ధరణి, రెసిడెన్షియల్ గురుకులాలు, కరోనాను కట్టడి చేసిన తీరు.. ఇలా ప్రతి విషయాన్ని వివరిస్తూ ప్రతిపక్షాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నట్లు తెలిసింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలోనే కౌంటర్ ఇచ్చి మిగిలిన రోజుల్లో కూడా ప్రతిపక్షాలు నోరెత్తకుండా చేయాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలంగాణ భవన్ వర్గాలంటున్నాయి. మొత్తమ్మీద అధికార, ప్రతిపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలతో అసెంబ్లీ దద్దరిల్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
డిగ్రీ ఓటరుల్లారా ‘పట్టం’ కట్టండి
సాక్షి, హైదరాబాద్: రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం ముగుస్తోంది. దీంతో పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి ప్రయత్నాల్లో పడ్డారు. వీలైనంత మందిని ఆకర్షించడంపై దృష్టి పెట్టారు. ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్’, ‘వరంగల్- ఖమ్మం- నల్లగొండ’ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లకు గత నెల 16న నోటిఫికేషన్ వెలువడగా.. ఈ నెల 14న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. 2015లో ఈ రెండు సీట్లకు జరిగిన ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి రెట్టింపు ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఈ రెండింటిలో 10.36 లక్షల మంది పట్టభద్ర ఓటర్లు ఉండగా.. ఏకంగా 164 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు ఉద్యమ నేపథ్యంలో తెరపైకి వచ్చిన పలు రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కూడా పెద్ద సంఖ్యలో బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో కీలక అభ్యర్థులంతా ప్రచారంపై ఎక్కువ దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, వివిధ సంస్థల మద్దతు కూడగట్టేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రెండు స్థానాల్లో.. చెరోచోట సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్న టీఆర్ఎస్, బీజేపీలు.. సిట్టింగ్ను కాపాడుకుంటూనే, రెండో స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో హీట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా ఈసారి సవాళ్లు, ప్రతి సవాళ్లు.. ఆరోపణలు, ప్రత్యారోపణలతో హైవోల్టేజీలో ప్రచారం సాగింది. రెండు లక్షల మందికి ఉపాధి కల్పించే ఐటీఐఆర్పై ప్రధాన పార్టీల మధ్య విమర్శలు వెల్లువెత్తాయి. ఐటీఐఆర్ పూర్తిస్థాయి డీపీఆర్లను కేంద్రం ఎన్నిసార్లు కోరినా రాష్ట్రం ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఆరోపిస్తే.. ఐటీఐఆర్ను కేంద్రమే రద్దు చేసిందని, కేంద్ర మంత్రి రవిశంకర్ప్రసాద్ పార్లమెంట్లోనే ఈ విషయం చెప్పిన సంగతి తెలియకపోవడం సిగ్గుచేటని మంత్రి కేటీఆర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. 2014 నుంచి ఇప్పటివరకు రాసిన కేంద్రానికి లేఖలు, డీపీఆర్లు ఇస్తామని.. దమ్ముంటే ఐటీఐఆర్ తేవాలని సవాల్చేశారు. ఇక టీఆర్ఎస్ సర్కారు సరిగా ఉద్యోగాలు ఇవ్వలేదని, 1.90 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు విరుచుకుపడ్డారు. తాము 1.26 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్: బలమంతా కేంద్రీకరించి.. తొలుత కేవలం సిట్టింగ్ సీటు ‘వరంగల్- ఖమ్మం-నల్గొండ’లోనే పోటీ చేస్తుందని భావించిన టీఆర్ఎస్.. చివరి నిమిషంలో ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్’లోనూ బరిలోకి దిగింది. మాజీ ప్రధాని పీవీ కూతురు వాణిదేవిని అభ్యర్థిగా ప్రకటించింది. రెండు ఎమ్మెల్సీ సీట్ల పరిధి ఏకంగా ఆరు జిల్లాల్లోని 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తాన్నీ బరిలోకి దింపింది. 14 మంది మంత్రులు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించింది. క్షేత్రస్థాయి దాకా ప్రచారం చేస్తూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, వృత్తి, కుల, సామాజిక సంఘాల మద్దతు సంపాదించడంపై దృష్టి పెట్టింది. ప్రతి 50 మంది పట్టభద్ర ఓటర్లను చేరుకునేందుకు నాయకులు, చురుకైన కార్యకర్తలకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించింది. వివిధ వర్గాలతో ఆత్మీయ సమావేశాలు పెట్టి మద్దతు తీసుకుంటోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రత్యక్ష ప్రచారానికి దూరంగా ఉన్నా.. వివిధ కోణాల్లో అందుతున్న నివేదికల అధారంగా ఎన్నికల ఇన్చార్జిలకు ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాంగ్రెస్: పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ.. రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపిన కాంగ్రెస్ సంస్థాగతంగా మండలాలు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ప్రచార సమావేశాలు ఏర్పాటు చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేయగా.. వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్రెడ్డికి ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్’, భట్టి విక్రమార్కకు ‘వరంగల్-ఖమ్మం- నల్లగొండ’ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ వీలైనన్ని చోట్ల వివిధ కేటగిరీల వారితో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసింది. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని రాములు నాయక్, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన చిన్నారెడ్డికి టికెట్ ఇచ్చిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను ప్రధానంగా ఎత్తిచూపుతూ ప్రచారం నిర్వహించింది. 2019లో జరిగిన ‘కరీంనగర్– మెదక్– ఆదిలాబాద్– నిజామాబాద్’ ఎన్నికలో కాంగ్రెస్ క్యాండిడేట్ జీవన్రెడ్డి గెలిచిన తరహాలోనే.. ఇప్పుడు కూడా ఫలితాలు వస్తాయని లెక్కలు వేసుకుంటోంది. బీజేపీ: టీఆర్ఎస్ టార్గెట్గా ప్రచారం ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న ‘హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్’ స్థానాన్ని నిలబెట్టుకోవడంతోపాటు ‘వరంగల్- ఖమ్మం- నల్లగొండ’ సీటును కూడా గెలుచుకునేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల తరహాలోనే ఈ రెండు చోట్ల గెలుస్తామని భావిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ తరహాలోనే అసెంబ్లీ నియోజకవర్గం, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించిన బీజేపీ.. ప్రతి 25 మంది పట్టభద్ర ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించింది. పార్టీ అనుబంధ సంఘాలు, ఆర్ఎస్ఎస్ కూడా క్షేత్రస్థాయిలో ఓటర్ల మద్దతు కూడగట్టడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్ర మంత్రులు రమేశ్ పోఖ్రియాల్, ప్రకాశ్ జవదేకర్, కిషన్రెడ్డి, రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, ఇతర కీలక నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పాలన, సీఎం కేసీఆర్ లక్ష్యంగా బీజేపీ విమర్శలు గుప్పించింది. సర్వశక్తులు ఒడ్డుతున్న స్వతంత్రులు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, యువ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ, కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న జయసారధిరెడ్డి, తీన్మార్ మల్లన్న వంటి వారు వివిధ వర్గాల మద్దతు కూడగట్టేందుకు పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణం లేకున్నా ఉద్యోగ, ఉపాధ్యాయ, వృత్తి సంఘాల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. -
ప్రథమ ప్రాధాన్య ఓట్లపైనే దృష్టి
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. సభలు, సమావేశాలే కాకుండా క్షేత్రస్థాయిలోని ప్రతి ఓటర్ను కలిసేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. అనుబంధ సంఘాల కార్యకర్తలను క్షేత్రస్థాయికి పంపి మరీ గ్రాడ్యుయేట్ ఓట్లను బీజేపీ అభ్యర్థులకు ఎక్కువ మొత్తంలో పడేలా ప్రణాళికలు రూపొందించుకుంది. ముఖ్యంగా ప్రథమ ప్రాధాన్య ఓట్లు రాబట్టుకోవడమే లక్ష్యంగా విస్తృత ప్రచారం చేస్తోంది. రంగంలోకి సంఘ్ పరివార్.. బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆ పార్టీ అనుబంధ సంఘాలూ రంగంలోకి దిగాయి. చాపకింద నీరులా సంఘ్పరివార్ ప్రచారం నిర్వహి స్తోంది. ఇప్పటికే 25 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని కమలం పార్టీ నియమించింది. ఇటు నియోజకవర్గాల వారీగా ఇప్పటికే సమావేశాలను పూర్తి చేసుకున్న ఆ పార్టీ.. మేధావుల సదస్సులను నిర్వహిస్తోంది. లాయర్లు, డాక్టర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నేతలు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఇక సంఘ్ పరివార్ నేతలు పోలింగ్ బూత్ల వారీగా సమీక్షలతో పాటు క్షేత్రస్థాయిలో ఓటర్లకు టచ్లో ఉంటూ ప్రథమ ప్రాధాన్య ఓట్లను రాబట్టుకునేలా ప్రచారం చేస్తున్నారు. అవే ప్రధాన అస్త్రాలుగా.. ప్రస్తుతమున్న సిట్టింగ్ స్థానంతో పాటు మరో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేలా కమలనాథులు ఎప్పటికప్పుడు ప్రచార ప్రణాళికలను అమలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల్లో వ్యతిరేకత అంశాలనే ప్రధాన ప్రచారాస్త్రాలుగా చేసుకొని బీజేపీ ముందుకెళ్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జి తరుణ్ చుగ్, ఇతర ముఖ్య నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. మరోవైపు కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, రమేశ్ పోఖ్రియాల్ ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. మరికొందరు జాతీయ స్థాయి నేతలు కూడా రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, టీఆర్ఎస్ అభ్యర్థులనే తమ ప్రత్యర్థులుగా చూస్తూ బీజేపీ ప్రచారం చేస్తోంది. ఉద్యోగులు, నిరుద్యోగులు ఏ వర్గం వారూ టీఆర్ఎస్ పాలనలో సంతోషంగా లేరని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇటు పెట్రోల్ ధరల పెంపు అంశాన్ని టీఆర్ఎస్ నేతలు ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు బీజేపీ సోషల్ మీడియా విభాగం గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. గత ప్రభుత్వాల కారణంగానే ధరల పెరుగుదల తప్పడం లేదని చెబుతోంది. తమపై విమర్శలు చేసే ముందుకు పెట్రోల్ ధరల పెంపుతో రాష్ట్రానికి వచ్చే వ్యాట్ (పన్నులు) ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నిస్తోంది. -
నల్లధనం తేలేదు.. నల్ల కుబేరులను దేశం దాటించారు
రాంగోపాల్పేట్: పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వెలికితీస్తామన్నారని, విదేశాల్లో ఉన్న దాన్ని కూడా దేశంలోకి తెప్పిస్తామని చెప్పారని.. కానీ, అది రాకపోగా నల్లకుబేరులు దేశం వదలి పారిపోయేలా చేశారని ప్రధాని నరేంద్ర మోదీపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టి నీరవ్ మోదీ, చోక్సీ, విజయ్ మాల్యా దేశం వదలి పారిపోతే బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. మంగళవారం సికింద్రాబాద్లోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో తెలంగాణ ప్రైవేట్ కాలేజీలు, స్కూల్స్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పీఎల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. జీడీపీని పెంచుతామని చెప్పి అధికారం చేపట్టిన మోదీ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు మాత్రం పెంచుతూపోయారని ఎద్దేవా చేశారు. మోదీ పాలన కంటే ముందు.. గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉండేదని, ఓటేసే ముందు గ్యాస్ బండకు దండం పెట్టుకుని వెళ్లాలని నాడు మోదీ అన్నారని చెప్పారు. నేడు అదే సిలిండర్ ధర రూ.870 అయిందని విమర్శించారు. ఇప్పుడు సెంచరీకి చేరుకున్న లీటర్ పెట్రోల్ ధర చూసి ప్రజలు బంకులోకి వెళ్లి మోదీ ఫొటోకు దండం పెట్టుకుంటున్నారని ఎగతాళి చేశారు. వీటిపై ప్రశ్నిస్తే బీజేపీ నేతలు దేశం కోసం, ధర్మం కోసం అంటూ విరుచుకుపడుతున్నారని.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచింది దేశం కోసం.. ధర్మం కోసమా.. అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రెండు కోట్ల ఉద్యోగాలెక్కడ..? జన్ధన్ ఖాతాలు తెరిస్తే ఒక్కొక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ చెప్పారని.. కానీ, దీనిపై తాను ప్రశ్నిస్తే సామాజిక మాధ్యమాల ద్వారా తన ఖాతాలో 15 లక్షల తిట్లు బీజేపీ నేతల నుంచి పడ్డాయని కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆరున్నర సంవత్సరాల కాలంలో తాము 1,32,799 ఉద్యోగాలు కల్పించామని.. మరి మోదీ చెప్పిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దీనిపై మోదీని ప్రశ్నిస్తే.. రోడ్ల పక్కన పకోడీ, ఇడ్లీ బండి పెట్టుకుని సొంత కాళ్లపై నిలబడి ఉపాధి పొందుతున్న వారిని కూడా తాను కల్పించిన ఉద్యోగుల జాబితాలో చూపిస్తున్నారని విమర్శించారు. అమిత్షా హైదరాబాద్కు వచ్చినప్పుడు లక్ష కోట్లు రాష్ట్రానికి ఇచ్చామని చెప్పారని.. ఆరున్నరేళ్లలో తామే కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు పన్నుల రూపంలో అందించామని గుర్తు చేశారు. ఇవన్నీ అడిగితే.. బీజేపీ నాయకులు హిందూ, ముస్లిం, పాకిస్తాన్ అంటూ ప్రజలను రెచ్చగొట్టి సమాధానాలు దాటవేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించే గొంతుక అంటూ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్రావు అంటున్నారని.. కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయంపై ఎప్పుడైనా ప్రశ్నించారా.. అని అన్నారు. న్యాయవాదుల సంక్షే మ నిధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయిస్తే.. తానే చేయించానని ఆ పెద్ద మనిషి చెబుతున్నారని అంత అభిమానం ఉంటే కేంద్రం నుంచి రూ.10 వేల కోట్ల నిధి ఎందుకు తీసుకుని రాలేకపోయారని ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్లకు సాయం చేయాలని ఆలోచించినా సుమా రు 10–12 లక్షల మంది ఉండటంతో అది సాధ్యం కాక ఏమి చేయలేకపోయామన్నారు. విద్యావంతులంతా ఈ నెల 14న ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేశవరావు కోరారు. -
అందరి దృష్టి రెండో ప్రాధాన్యతపైనే!
సాక్షి, హైదరాబాద్: రెండు నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మరో నాలుగు రోజుల్లో ముగియనుండటంతో ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓ వైపు తమ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ మరోవైపు ఓటింగ్ విధానంపైనా అవగాహన కల్పించేందుకు పార్టీలు, అభ్యర్థులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం శాసనమండలి పట్టభద్రుల కోటాలో ఎన్నికలు జరిగే ‘హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్’, ‘నల్లగొండ-ఖమ్మం -వరంగల్’ స్థానాల్లోనూ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులుతో పాటు, స్వతంత్రులు కూడా ఎక్కువమంది పోటీ చేస్తుండటంతో ‘ప్రాధాన్యత’ ఓట్లపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పోలయ్యే ఓట్లలో (చెల్లుబాటు అయ్యే ఓట్లలో) సగానికి పైగా (50 శాతం + ఒక ఓటు) ప్రథమ ప్రాధాన్యత ఓట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఒక్క అభ్యర్థి ‘ప్రథమ ప్రాధాన్యత’తో గెలుపొందే అవకాశాలు లేవని పార్టీలు, అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను వీలైనన్ని ఎక్కువ సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. తమకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసే అవకాశం లేకుంటే... ఓటింగ్ సమయంలో కనీసం రెండో ప్రాధాన్యత ఓటైనా వేయాలని ప్రచారం సందర్భంగా అభ్యర్థులు, పార్టీలు కోరుతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల నమోదు రెట్టింపు కావడంతో పోలయ్యే ఓట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశముంది. హైదరాబాద్లో బహుముఖ పోటీ ఆరేండ్ల క్రితం... 2015లో ‘హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్’ స్థానంలో 2.96 లక్షల ఓటర్లగాను కేవలం 39 శాతం అంటే 1.13 లక్షల ఓటర్లు మాత్రమే పోలింగ్లో పాల్గొన్నారు. 31 మంది అభ్యర్థులు పోటీలో నిలువగా 53,881 ప్రథమ ప్రాధాన్యత ఓట్లు సాధించిన బీజేపీ అభ్యర్థి ఎన్.రాంచందర్రావు తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్పై గెలుపొందారు (చెల్లని ఓట్లు ఎనిమిది వేల పైచిలుకు ఉండటంతో రాంచందర్రావు ప్రథమ ప్రాధాన్యత ఓట్లతోనే విజయాన్ని అందుకున్నారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సిన అవసరం రాలేదు). ఈసారి టీఆర్ఎస్తో పాటు ఇతర రాజకీయ పక్షాలు, ఔత్సాహిక అభ్యర్థులు పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయడంపై ముందస్తుగా దృష్టి సారించడంతో 5.31 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే ఈ దఫా ఎన్నికల్లో ‘హైదరాబాద్- రంగారెడ్డి మహబూబ్నగర్’ పట్టభద్రుల స్థానంలో ఏకంగా 93 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు వివిధ రంగాలకు చెందిన స్వతంత్రులు కూడా పోటీలో ఉండటంతో గతంలో మాదిరిగా ఏ అభ్యర్థి కూడా ప్రథమ ప్రాధాన్యత ఓటుతో గెలుపొందే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. దీంతో అన్ని పార్టీలు, అభ్యర్థులు వీలైనన్ని రెండో ప్రాధాన్యత ఓట్లు సాధించడంపై దృష్టి కేంద్రీకరించాయి. ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉండటం తమకు అనుకూలిస్తుందని టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటున్నాయి. ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’లో హేమాహేమీలు ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’పట్టభద్రుల స్థానానికి 2015లో జరిగిన ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందారు. 2015 ఎన్నికల్లో 18 మంది అభ్యర్థులు పోటీ చేయగా 2.81 లక్షల ఓట్లకు గాను 1.49 లక్షల మంది పట్టభద్రులు ఓటింగ్లో పాల్గొన్నారు. 53.25 శాతం పోలింగ్ నమోదైనా ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రథమ ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థి కూడా పోలైన ఓట్లలో 50 శాతం మార్క్ను దాటలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపొందారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో 5.05 లక్షల మంది పట్టభద్ర ఓటర్లు ఉండగా 71 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మరోమారు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కూడా విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్, యువ తెలంగాణ నుంచి రాణీరుద్రమతో పాటు జయసారధి రెడ్డి, తీన్మార్ మల్లన్న తదితరులు కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పలువురు ఎన్నికల బరిలో నిలవడంతో ప్రథమ ప్రాధాన్యత ఓటుతో గెలుపొందడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ప్రథమ ప్రాధాన్యత ఓట్ల వేట సాగిస్తూనే రెండో ప్రాధాన్యత ఓట్లను రాబట్టేందుకు అభ్యర్థులు శ్రమిస్తున్నారు. -
సంఘం శరణం.. ఓటు గచ్ఛామి
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు ఓట్ల వేటను ముమ్మరం చేస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమకు మద్దతు కూడగట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అభ్యర్థులంతా సంఘాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గ్రాడ్యుయేషన్ చదివి వివిధ వృత్తుల్లో స్థిరపడిన వారందరినీ నేరుగా కలవలేని పరిస్థితుల్లో... ఆయా ఉద్యోగ, వృత్తి సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ ముందంజలో ఉండగా, కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్రులు కూడా తమకు వీలున్న సంఘాలను కలుస్తూ మద్దతు అభ్యర్థిస్తున్నారు. కాగా అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలతో కూడా భేటీ అవుతూ ఓట్లు అడుగుతున్నాయి. మొత్తం మీద పోలింగ్కు మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంది. పోటీలు పడి.. మద్దతు వివిధ సంఘాలను కలిసి మద్దతు కూడగట్టే క్రమంలో మిగతా పార్టీలతో పోలిస్తే టీఆర్ఎస్ ముందంజలో కనిపిస్తోంది. ఇప్పటికే పలు తెలంగాణ ఉద్యోగ సంఘాలు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆ పార్టీ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్రెడ్డి, సురభి వాణీదేవీలకు బహిరంగంగా మద్దతు ప్రకటించాయి. పారామెడికల్, సెర్ప్, ఐకేపీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, సీపీఎస్ ఉద్యోగులతో పాటు పలు సంఘాలు టీఆర్ఎస్ అభ్యర్థులిద్దరికీ పోటీలు పడి మరీ మద్దతు ప్రకటిస్తున్నాయి. టీఆర్ఎస్కు చెందిన మంత్రులు ఆయా సంఘాల నాయకులు, కార్యవర్గ సభ్యులతో సమావేశాలు పెట్టి వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తుండటంతో వారంతా పల్లా, వాణీదేవీలను గెలిపించాలని తమ సంఘ సభ్యులను కోరుతున్నారు. బీజేపీ అభ్యర్థులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, రాంచందర్రావులు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు, ఇతర ఉపాధ్యాయ సంఘాల మద్దతు కూడగడుతున్నారు. పార్టీకి అనుబంధంగా ఉండే విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సహకారంతో ముందుకెళుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు రాములు నాయక్, చిన్నారెడ్డిలు కూడా తమ పార్టీ అనుబంధ సంఘాల నేతల సాయంతో గ్రామస్థాయిలో ప్రచారానికి వెళ్తున్నారు. నల్లగొండ స్థానం పరిధిలో లెఫ్ట్ అభ్యర్థి జయసారథిరెడ్డి పక్షాన వామపక్ష అనుబంధ సంఘాలన్నీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. రంగారెడ్డి స్థానంలో లెఫ్ట్ పార్టీలకు అనుబంధంగా ఉండే ప్రజాసంఘాలు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్. కె.నాగేశ్వర్కు మద్దతు ప్రకటించాయి. నల్లగొండ స్థానంలో బీసీ సంఘాలు, ఎమ్మార్పీఎస్, ఇతర కుల సంఘాలు తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి డాక్టర్. చెరుకు సుధాకర్కు మద్దతు తెలిపాయి. ఇలా ఎవరికి వారే వృత్తి, కుల సంఘాల సహకారం కోసం నానాపాట్లు పడుతుండటం ఎమ్మెల్సీ రాజకీయాన్ని రక్తి కట్టిస్తోంది. గ్రామాల్లో నేరుగా ఓటర్లను కలస్తూ... గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించినా... ఓటరు జాబితాను దగ్గర పెట్టుకొని గ్రామాల్లోకి వెళ్లి ప్రతి ఓటర్ను కలవడం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. స్వతంత్రులతో సహా అన్ని పార్టీలు ఇప్పటికే గురుకులాలు, కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను ఓమారు చుట్టేసి... ఇప్పుడు గ్రామాలపై దృష్టి సారించాయి. ఆయా గ్రామాల్లోని పార్టీ నేతలు తమ ఇన్చార్జిలు, ముఖ్యనేతలతో కలిసి బ్యాలెట్ పేపర్లను పట్టుకుని ఓటర్లను నేరుగా కలిసి వారిని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. దీంతో పాటు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు సామాజిక వర్గాల వారీగా కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ఈ సామాజిక వర్గాల సమావేశాలు బహిరంగంగా జరుగుతుండగా, మరికొన్ని చోట్ల అంతర్గతంగా మద్దతు కూడగట్టుకుంటున్నారు. మార్నింగ్ వాక్ల పేరుతో ఎన్నికల ప్రచారం ఇంకా సాగుతుండగా, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, హౌసింగ్ సొసైటీల వారీగా కూడా సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ పట్టభద్రుల ఓట్ల కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. -
లక్షా 30 వేల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ఆలోచించాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ పరిశ్రమలు ఉండవని, తెలంగాణ వస్తే ఆంధ్ర, తెలంగాణకు మధ్య గొడవలు జరుగుతాయన్నారని తెలిపారు. అసలు పరిపాలన చేయగలరా అని ప్రశ్నించారని గుర్తు చేశారు. తెలంగాణ కంటే ముందు ఏర్పడిన చత్తీస్ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఇంకా సెటిల్ అవలేదని కిరణ్ కుమార్రెడ్డి చెప్పిన మాటలను ప్రస్తావించారు. తెలంగాణలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మంగళవారం మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు తీవ్ర విద్యుత్ కొరత ఉండేదని, తెలంగాణ వచ్చాక ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించామని వెల్లడించారు. తాను చదువుకునే రోజుల్లో ఎండాకాలం మహిళలు బిందెలతో ధర్నాలు చేసేవారని, ప్రస్తుతం తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కరించినట్లు తెలిపారు. ఇంకా ఆయన మాటల్లోనే... ‘శాంతి భద్రతల సమస్యలను పరిష్కరించాం. ఈ ఆరేళ్లలో ప్రజల మౌలిక సదుపాయాలు కోసం పనిచేశాం. తెలంగాణ వచ్చాక 600 నూతన గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాం. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం లక్షా 20 వేలు ఖర్చు పెడుతోంది. 18 లక్షల మందికి పోస్ట్ మెట్రిక్ ష్కాలర్ షిప్లు ఇస్తున్నాం. 12,800 కోట్లు ఫీజురీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. విదేశాలకు వెళ్లి చదువుకునే వారికి అంబేద్కర్, పూలే, వివేకానంద ష్కాలర్ షిప్ల పేరిట 20 లక్షలు ఇస్తున్నాం. విద్యారంగంపై నిబద్ధతతో పని చేస్తున్నాం. ముఖ్యమంత్రి మనుమడు, మనుమరాలు ఏ బియ్యంతో భోజనం చేస్తారో అదే భోజనాన్ని హాస్టళ్లలోని విద్యార్థులకు అందిస్తున్నాం. లక్షా 80వేల కోట్లు బడ్జెట్ పెట్టుకుని సిద్ధమవగానే కోవిడ్ వచ్చింది. కోవిడ్ వల్ల ప్రభుత్వానికి లక్షా 52వేల కోట్ల నష్టం వాటిల్లింది. 10 లక్షలమంది ప్రయివేట్ టీచర్లున్నారు.. వీరందరికీ సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మీ గొంతులు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రయివేట్ టీచర్లను ఆడుకోలేదు. చదవండి: ‘బీజేపీ వాళ్లకు తెలివి లేదు మన్నులేదు.. తిట్టుడే తిట్టుడు’ దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు. కేసీఆర్ నా తెలంగాణను కోటిన్నర ఎకరాల మాగణ చేస్తున్నారు. హైదరాద్లో 5లక్షల సీసీ కెమెరాలతో భద్రత ఏర్పాటు చేశాం. గూగుల్, అమెజాన్, ఆపిల్ వంటి ఎమ్ఎన్సీ కంపెనీలు వచ్చాయి. బలమైన న్యాయకత్వం, భద్రత వల్ల పెట్టుబడులు వస్తున్నాయి. లక్షా 30 వేల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చాం. దీనిపై ఇటీవలే శ్వేత పత్రం ఇచ్చాం. 2013లో అప్పటి గుజరాత్ సీఎం మోదీ ప్రధాని మన్మోహన్ను ఉద్దేశించి మీది చేతకాని ప్రభుత్వం అని విమర్శించారు. పెట్రోల్ లీటర్ రూ.100కి చేరింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెంచి దేశం కోసం ధర్మం కోసం అంటున్నారు. చదవండి: సర్వే: షీ టీమ్ల పనితీరుపై 89 శాతం సంతృప్తి పెట్రోల్ బంకుల్లో మోదీ ఫోటోలకు దండం పెడుతున్నారు. హైదరాబాద్కు ఒక్క ఐఐఎం కూడా మంజూరు చేయలేదు. ఎన్ఐటీ, ఎయిమ్స్, ఐసార్, నవోదయ, మెడికల్ కాలేజీలు ఒక్కటి కూడా తెలంగణకు ఇవ్వలేదు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ తెలంగాణలో లేదు. లక్ష కోట్లు ఇచ్చామని అమిత్ షా చెప్తారు. తెలంగాణ నుంచి 2లక్షల కోట్లు ట్యాక్స్ కడితే లక్ష కోట్లు కూడా రాలేదు. తెలంగాణ రూపాయి కడితే ఆటానా కూడా రావట్లేదు. బీజేపీ తరపున పోటీ చేసే న్యాయవాది అన్యాయంగా మాట్లాడుతున్నారు. ప్రశ్నించే గొంతు కావాలంటున్న బీజేపీ నేతలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు ప్రశ్నించరు. అందరూ ఓటింగ్లో పాల్గొనండి. వాణి దేవిని గెలిపించండి.’ అని కోరారు. చదవండి: వుమెన్స్ డే: ఆమె కానిస్టేబుల్ కాదు.. హోం మంత్రి! -
ఎవరి లెక్కలు వారివే.. ఎవరి ధీమా వారిదే..
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో బిజీబిజీ అయ్యాయి. విజయంపై ధీమాతో ముందుకెళుతున్నాయి. హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్నగర్, నల్లగొండ– ఖమ్మం– వరంగల్ పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 14న పోలింగ్ జరగనుంది. ఈ రెండింటిలోనూ గెలుపు తమదేననే స్థాయిలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు ప్రచారపర్వంలో దూసుకెళుతున్నాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీలు సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకొని... మరో స్థానాన్ని బోనస్గా దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ కూడా సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇక, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటించి, మరో స్థానంలో అభ్యర్థిని నిలబెట్టిన వామపక్షాలు కూడా తమ అనుబంధ సంఘాల సహకారంతో మండలిలో ప్రాతినిధ్యం దక్కించుకునేందుకు శ్రమిస్తున్నాయి. అందరూ ఎన్నికల ప్రచారంలోనే.. మరో ఐదు రోజుల్లో (ఈనెల 12తో) ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాల నాయకులంతా క్షేత్రస్థాయిలో ఉండి పట్టభద్రుల ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు పట్టభద్రుల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశంతో ఆ పార్టీ నేతలంతా తమ అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డిల గెలుపు కోసం పనిచేస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన లాంటి అంశాలను పట్టభద్రుల దృష్టికి తీసుకెళుతున్నారు. న్యాయవాదులు, ఉద్యోగులు, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయ సంఘాలు, యాజమాన్య సంఘాలు, జర్నలిస్టులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు... ఇలా ఓటర్లందరినీ ఏదో రకంగా కలిసి ఓట్లను అభ్యర్థించే పనిలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి నల్లగొండ అభ్యర్థి రాములు నాయక్తో, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభ్యర్థి చిన్నారెడ్డితో కలిసి ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదివారం భద్రాచలం నుంచి వినూత్నంగా సైకిల్పై ఎన్నికల ప్రచారయాత్ర మొదలుపెట్టారు. వీరికి తోడుగా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నేతలంతా ఎన్నికల ప్రచారంలో గడుపుతున్నారు. ఊరూరా తిరుగుతూ ఓటర్లను కలిసి తమ అభ్యర్థులు రాములు నాయక్, చిన్నారెడ్డిలను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. బీజేపీ పక్షాన బండి సంజయ్, డి.కె.అరుణ, కిషన్రెడ్డిలు కూడా విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీ అభ్యర్థులు రాంచందర్రావు, ప్రేమేందర్రెడ్డిలను గెలిపించాలని పట్టభద్రులను కోరుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఫలితాలతో ఊపు మీదున్న కమలనాథులు అటు వరంగల్ నుంచి ఇటు పాలమూరు వరకు అన్ని జిల్లాలు చుట్టేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మంచి ఫలితం సాధించాలనే పట్టుదలతో దూసుకెళుతున్నారు. ఇక, నల్లగొండ నుంచి బరిలో ఉన్న సీపీఐ అభ్యర్థి జయసారథిరెడ్డి ఇతర వామపక్షాలు, అనుబంధ సంఘాల సహకారంతో ఆ మూడు పార్టీలకు దీటుగానే ప్రచారం నిర్వహిస్తున్నారు. వామపక్ష అనుబంధ సంఘాలయితే గ్రామ గ్రామాన తిరుగుతూ ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తున్నాయి. వీరికి తోడు రెండు నియోజకవర్గాల నుంచి ప్రొఫెసర్లు ఎం.కోదండరాం, డాక్టర్ కె.నాగేశ్వర్లతో పాటు చెరుకు సుధాకర్, గాల్రెడ్డి హర్షవర్ధ్దన్రెడ్డి, సూదగాని హరిశంకర్గౌడ్, రాణీ రుద్రమ, గౌరీ సతీశ్ తదితరులు కూడా తమ శక్తినంతా ధారపోసి ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు గట్టిపోటీ ఇచ్చే దిశలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తం మీద 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాధారణ ఎన్నికలను తలపించే స్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. చదవండి: విజిలెన్స్ పట్టించినా.. ఆర్టీసీ వదిలేసింది వెల్కటూరులో కొత్త రాతియుగం ఆనవాళ్లు -
సీఎం నుంచి విడదీసే శక్తి ఎవరికీ లేదు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ నుంచి టీఎన్జీవోలను విడదీసే శక్తి ఎవరికీ లేదని, వారి మధ్య ఉన్నది పేగుబంధమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టీఎన్జీవోల మద్దతు బేషరతుగా టీఆర్ఎస్కే ఉంటుందని, తెలంగాణ సాధనలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పోషించిన పాత్రను సీఎం మరిచిపోలేదని పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఎన్జీవో భవన్లో ఉద్యోగులతో మంత్రులు గంగుల కమలాకర్, మహమూద్ అలీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవిని ఎమ్మెల్సీగా గెలిపించి సీఎం కేసీఆర్ వద్ద సమస్యలను గర్వంగా సాధించుకుందామన్నారు. ప్రశ్నించే గొంతుక అని చెప్పుకొనే రామచంద్రారావు ఏనాడూ చట్టసభల్లో గ్రాడ్యుయేట్ల హక్కుల గురించి ప్రశ్నించలేదని పేర్కొన్నారు. సురభి వాణీదేవి విద్యావేత్త అని, దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు గట్టెక్కించిన మేధావి పీవీ కూతురుగానే కాకుండా లక్షలాది మంది గ్రాడ్యుయేట్లను సరైన దిశలో నడిపించి ఉపాధి చూపించిన వ్యక్తి అనే విషయం మరవొద్దని అన్నారు. పదేళ్లకోసారి పీఆర్సీని ప్రకటించే కేంద్రం కన్నా, రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగులకు ఎక్కువ మేలు చేస్తుందని గంగుల అన్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలను నమ్మవద్దని, టీఎన్జీవోలకు అత్యధిక లబ్ధి చేకూర్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్న విషయం గుర్తుంచుకోవాలని టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ప్రతాప్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. -
ప్రగతిభవన్లో ద్రోహులు.. రోడ్డున ఉద్యమకారులు
సాక్షి ప్రతినిధి, వరంగల్/ నల్లగొండ టూటౌన్: ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల సంక్షేమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డి ఆరోపించారు. ఎంఐఎం పార్టీతో చెట్టపట్టాలేసుకుని ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణలో ఉద్యమకారులు రోడ్లపై ఉంటే, ఉద్యమద్రోహులు ప్రగతిభవన్కు చేరుకున్నారని ధ్వజమెత్తారు. హన్మకొండ, నల్లగొండలో శనివారం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్, ఒవైసీ కుటుంబాలే బంగారు కుటుంబాలయ్యాయని అన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారాయని విమర్శించారు. సచివాలయానికి రావడం లేదంటే సచివాలయాన్నే కూల్చేసిన గొప్ప సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో ఒక్క ఆసుపత్రి కట్టలేదని, కేసీఆర్ కట్టడు, కేంద్రం కడతామంటే సహకరించరని ఆరోపించారు. 160 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతోనే రైల్వే ఓవర్ హాలింగ్ పరిశ్రమ నిలిచిపోయిందన్నారు. బీబీనగర్లోని మెడికల్ కాలేజీకి ప్రభుత్వం భూములను ఇవ్వలేదని, వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.30 కోట్లు చెల్లించలేదని ఆరోపించారు. రూ.6 వేల కోట్లతో రామగుండంలో ఎరువుల పరిశ్రమను తెచ్చామని, దాన్ని త్వరలోనే ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కేసీఆర్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీని విమర్శించే అర్హతలేదని, ఇష్టారాజ్యంగా కొందరు మంత్రులు ఇకపై జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. వరంగల్ మామునూరులో స్థలాన్ని ఇస్తే వెంటనే ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తామని చెప్పారు. సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమెందర్రెడ్డి, సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బరిలో పీవీ కూతురు: మజ్లిస్ వెనకంజ
సాక్షి,సిటీబ్యూరో : ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన హైదరాబాద్– మహబూబ్ నగర్–రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో మజ్లిస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందన్న విషయంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా మజ్లిస్ అధికారికంగా అభ్యర్థిని రంగంలోకి దింపలేదు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి 93 మంది పోటీ పడుతుండగా, ఓటర్లు ఐదు లక్షలకు పైగానే ఉన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా మైనారిటీ వర్గానికి చెందిన పట్టభద్రులు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే మజ్లిస్ పార్టీ ఎన్నికల బరిలో లేని కారణంగా ఏదో ఒక అభ్యర్థికి సహకరించక తప్పదు. అయితే పార్టీపరంగా ఇప్పటి వరకూ ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో మజ్లిస్ కేడర్లో అయోమయం నెలకొంది. మైత్రి కొనసాగేనా.. అధికార టీఆర్ఎస్తో మజ్లిస్ పార్టీకి బలమైన మైత్రిబంధం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ బరిలో దిగని స్థానాల్లో టీఆర్ఎస్కు బాహాటంగా సహకరించింది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీలో ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేసినప్పటికీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించి స్నేహ్నబంధాన్ని మరోసారి చాటింది. తాజాగా పట్టభద్రుల ఎన్నికల్లో మాత్రం అధికార పక్షానికి సహకరించే పరిస్థితి కనపించడం లేదు. పీవీ కూతురు కావడంతోనే.. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వంపై మజ్లిస్ పార్టీలో నిరాసక్తత వ్యక్తమవుతోంది. సురభివాణి దేవి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు కావడంతో మద్దతు విషయంపై మజ్లిస్ ఎటూ తేల్చుకోలేక పోతోంది. పీవీ ఆయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతకు బాధ్యడని మజ్లిస్ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. అలాంటి వ్యక్తి తనయ అభ్యర్థిత్వాన్ని సమర్థించే ప్రసక్తే ఉండదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మైనార్టీ వర్గంలో కూడా పీవీపై కొంత వ్యతిరేకత ఉంది. దీంతో అధికార టీఆర్ఎస్కు మజ్లిస్ సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. చదవండి: టీఆర్ఎస్కు ఓటేస్తే చెప్పుకు వేసినట్లే.. -
మాకు ఓటేయకుంటే బాగుపడరు.. మంత్రి శాపనార్ధాలు
జడ్చర్ల టౌన్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్న వారు టీఆర్ఎస్కు ఓటు వేయకుంటే బాగుపడరని మంత్రి శ్రీనివాస్గౌడ్ వ్యాఖ్యలు చేశారు. జడ్చర్లలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభలో మంత్రి మాట్లాడుతూ.. ‘అన్ని తిని ఓటు వేయకుంటే మీకే నష్టం జరుగుతుంది. ఆ కుటుంబం బాగుపడదు. స్పృహలో ఉండి ఓట్లు వేయాలి’అని పేర్కొన్నారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉండి, మీ అందరి మంచి చెడు చూసేటోళ్లమని.. అందుకే తమను ఆదరించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపిస్తే మరింత కష్టపడి పనిచేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, సురభి వాణీదేవి పాల్గొన్నారు. -
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఆ హాట్ సీటే టార్గెట్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల కోటాలోని రెండు స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి వారం రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. సిట్టింగ్ స్థానమైన నల్లగొండ-ఖమ్మం-వరంగల్ను నిలబెట్టుకోవడంతో పాటు, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ‘హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్’ స్థానా నికి ప్రస్తుతం నాలుగో పర్యాయం ఎన్నిక జరుగు తుండగా.. గతంలో ఒక్కసారి కూడా ఈ స్థానంలో విజయం సాధించకపోవడాన్ని టీఆర్ఎస్ సవా లుగా తీసుకుంది. ఈ స్థానంలో వరుస ఓటముల అపప్రథను తొలగించుకోవడంతోపాటు దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో దూకుడు మీదున్న బీజేపీకి ఈ స్థానంలో గెలుపు ద్వారా పగ్గాలు వేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్రావు మరోమారు ఎన్నికల బరిలో నిలిచారు. సిట్టింగ్ స్థానంలో బీజేపీని ఓడించడం ద్వారా ఆ పార్టీకి షాక్ ఇవ్వాలని టీఆర్ఎస్ ఆశిస్తోంది. అందుకే వాణీదేవి గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మహిళా ఓటర్లపై ఆశలు హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు సురభి వాణీదేవి పేరును టీఆర్ఎస్ పార్టీ చివరి నిముషంలో ఖరారు చేసింది. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా వాణీదేవిని ఎమ్మెల్సీగా గెలిపించడమే అసలైన నివాళి అని టీఆర్ఎస్ చెబుతోంది. పట్టభద్రుల కోటా ఎన్నికలో ఒక ప్రధాన రాజకీయ పక్షం మహిళా అభ్యర్థిని బరిలోకి దించడం ఇదే ప్రథమం కావడంతో వాణీదేవి అభ్యర్థిత్వంపై ఆసక్తి నెలకొంది. ఈ నియోజకవర్గంలో 5.31 లక్షల మంది ఓటర్లుగా నమోదు కాగా, ఇందులో 1.94 లక్షలు... అంటే సుమారు 36 శాతం మంది మహిళా ఓటర్లు ఉన్నారు. విద్యావేత్తగా వాణీదేవికి ఉన్న గుర్తింపు, ఎలాంటి వివాదాలు లేకపోవపోడం, పీవీ కూతురు కావడం... కలిసి వస్తుందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. వాణీదేవిని రాజ్యసభకు ఎందుకు పంపలేదని, శాసనమండలికి నేరుగా ఎందుకు నామినేట్ చేయలేదని కాంగ్రెస్, బీజేపీ ప్రశ్నిస్తుండగా టీఆర్ఎస్ మాత్రం పట్టభద్రుల ఆమోదంతో ఆమె మండలిలో అడుగుపెడతారని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రధాని హోదాలో పీవీ చేపట్టిన సంస్కరణలు, ఆయన వ్యక్తిత్వం, వాణీదేవి అభ్యర్థిత్వం తదితర అంశాలతో పాటు తమ సంస్థాగత బలం కలిసి వస్తుందని టీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. మంత్రిమండలిలో పది మంది ఇక్కడే శాసనమండలి పట్టభద్రుల ఓటరు నమోదు స్థాయిలో చురుగ్గా వ్యవహరించిన టీఆర్ఎస్ ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్’ నుంచి అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఆఖరి దాకా సస్పెన్స్ కొనసాగించింది. చివరి నిముషంలో వాణీదేవి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన టీఆర్ఎస్ ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో పెద్ద సంఖ్యలో పార్టీ యంత్రాంగాన్ని ఇక్కడ మొహరించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే.కేశవరావుకు సమన్వయ బాధ్యతలు అప్పగించింది. క్షేత్రస్థాయి పార్టీ యంత్రాంగాన్ని కార్యరంగంలోకి దించుతూ.. ప్రచార బాధ్యతలను ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన ఆరుగురు మంత్రులకు అప్పజెప్పింది. వీరితో పాటు పట్టభద్రుల ఎన్నికలు లేని మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు హరీష్రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డికి కూడా ఈ స్థానంలో ప్రచార బాధ్యతలు కట్టబెట్టింది. ఇలా మొత్తం పదిమంది మంత్రులు ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్’లో గెలుపే లక్ష్యంగా ప్రచారం కొనసాగించడం, పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, పార్టీ వ్యూహం అమలు చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిధులు, పథకాల మంజూరులో రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని మంత్రులు ప్రతిచోటా ఎత్తిచూపుతున్నారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నేతలను లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. -
పీవీకి అసలైన గౌరవమిచ్చింది మేమే
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో పురోగతి బాట పట్టించిన మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు అసలైన గౌరవమిచ్చింది టీఆర్ఎస్ పార్టీయేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇప్పుడు పీవీ కుమార్తె సురభి వాణీదేవికి హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంతో మరింత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఈ ఎన్నికల్లో ఆమెను గెలిపించి పీవీకి అసలైన నివాళి ఇవ్వాలని గంగుల పిలుపునిచ్చారు. గురువారం ఇక్కడ మినిస్టర్స్ క్వార్టర్స్లో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు, డివిజన్ ఇన్చార్జులు, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి తోపాటు మంత్రులు మహమూద్ అలీ, తల సాని శ్రీనివాస్యాదవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి గంగుల మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైన ఈ ఏడేళ్లలో సరికొత్త అవకాశాలను సృష్టించుకుంటూ రాష్ట్రం ముందుకుపోతోందన్నారు. ప్రభుత్వ రంగంలో కేవలం ఆరేళ్లలోనే 1.30 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వివరించారు. ప్రైవేటు రంగంలో కూడా లక్షలాది ఉద్యోగాల కల్పనకు కృషి చేశామన్నారు. రాష్ట్రానికి మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును హైదరాబాద్కు ఇవ్వకుండా తన్నుకుపోయిన గద్దలు బీజేపీ నేతలని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 3,400 మంది కార్యకర్తలతో డివిజన్ల వారీగా ఇన్చార్జీలను నియమించి, ప్రతి 50 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని 1.53 లక్షలకుపైగా ఓటర్లను కలిసి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించేలా కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. -
టీఆర్ఎస్కు ఓటేస్తే చెప్పుకు వేసినట్లే..
సాక్షి, యాదాద్రి/భువనగిరి అర్బన్: ముఖ్యమంత్రి పదవి తనకు చెప్పుతో సమానమని చెప్పిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేస్తే చెప్పుకు వేసినట్లేనని ఉద్ఘాటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్యాంగ్స్టర్ నయీం అక్రమ ఆస్తులను కేసీఆర్ స్వాహా చేశారని, వాటిని కక్కిస్తామని చెప్పారు. కరోనా కాలంలో వేతనాలు అందక 40 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజేశ్వర్రెడ్డిని చిత్తుగా ఓడించాలని, అప్పుడే సీఎం కేసీఆర్ నేలపై దిగి వస్తారన్నారు. కాగా, తెలంగాణ ఉద్యమకారిణి,, భువనగిరికి చెందిన మాధురి గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అనంతరం ఆమె తన బుల్లెట్పై సంజయ్ని కూర్చోబెట్టుకుని కొద్దిదూరం ప్రయాణించారు.