Honda
-
హోండా కొత్త బైక్.. మార్కెట్లోకి ఎన్ఎక్స్200
దేశంలో అడ్వెంచర్ టూరర్ మార్కెట్ వృద్ధి చెందుతోంది. హై సెట్ బైక్లకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా కంపెనీలు సరికొత్త లాంచ్లతో ముందుకువస్తున్నాయి. ఈ క్రమంలోనే హోండా కొత్త ఎన్ఎక్స్ 200 (Honda Nx200)ను మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.68 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది. ఎన్ఎక్స్ 200 అనేది రీబ్రాండెడ్ సీబీ200ఎక్స్.ఈ కొత్త చేరికతో హోండా భారత్లో విక్రయించే ఎన్ఎక్స్ శ్రేణి బైక్లు రెండుకు చేరతాయి. ఈ రేంజ్లో ఎన్ఎక్స్500ను ఇప్పటికే హోండా ఇక్కడ విక్రయిస్తోంది. భారత్లో ఎన్ఎక్స్కు మెరుగైన బ్రాండ్ రీకాల్, విలువ ఉన్న నేపథ్యంలో సీబీ200ఎక్స్ను ఎన్ఎక్స్200గా రీబ్రాండ్ చేయాలని హోండా నిర్ణయించినట్లు కనిపిస్తోంది.స్టైలింగ్ పరంగా ఎన్ఎక్స్200 కొన్ని చిన్న డిజైన్ జోడింపులు చేశారు. అయితే మొత్తంగా స్టైలింగ్లో పెద్దగా మార్పులు లేవు. కానీ మోటార్సైకిల్పై కొన్ని ప్రధాన ఫీచర్ అప్గ్రేడ్లు కనిపిస్తున్నాయి. అందులో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, బ్లూటూత్ ఇంటిగ్రేషన్తో టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రధానంగా ఉన్నాయి.ఎన్ఎక్స్200 అదే 184సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్తో వచ్చింది. కానీ ఇప్పుడు ఓబీడీ2బీ కాంప్లియన్స్తో వచ్చింది. ఇది 17 ps శక్తిని, 16.1 nm పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా స్లిప్పర్ క్లచ్తో 5 స్పీడ్ గేర్బాక్స్ను ఈ బైక్లో జత చేశారు. హోండా ఎన్ఎక్స్200ను కంపెనీ ప్రీమియం డీలర్షిప్ల ద్వారా విక్రయిస్తారు. ఇది మూడు రంగుల్లో లభిస్తుంది. బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మార్చి నుండి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
హోండా, నిస్సాన్ పొత్తు లేనట్టే!
టోక్యో: వ్యాపార ఏకీకరణపై చర్చలను ముగించినట్లు వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థలు హోండా, నిస్సాన్, మిత్సుబిషి గురువారం తెలిపాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు, అటానమస్ డ్రైవింగ్ వంటి స్మార్ట్ కార్ల అభివృద్ధిపై కలిసి పనిచేయడం కొనసాగిస్తామని ఈ మూడు సంస్థలు వెల్లడించాయి. ‘చర్చలు జాయింట్ హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలన్న అంశంపై జరగాలి. కానీ హోండా అనుబంధ సంస్థగా నిస్సాన్ను మార్చాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రపంచ పోటీలో గెలవడానికి కంపెనీలను కలపాలి. కానీ నిస్సాన్ సామర్థ్యాన్ని గుర్తించడం లేదు. కాబట్టి నేను వారి ప్రతిపాదనను అంగీకరించలేను. హోండా లేకుండా నిస్సాన్ ఆర్థిక పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకోబోతోంది’ అని నిస్సాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మకొటొ ఉషీడా మీడియాకు వెల్లడించారు.నిర్ణయం తీసుకోవడాన్ని వేగవంతం చేయడానికి హోండా స్టాక్ స్వాప్ను సూచించిందని హోండా చీఫ్ ఎగ్జిక్యూటివ్ తోషిహిరో మీబ్ అన్నారు. ‘నేను నిజంగా నిరాశ చెందాను. వ్యాపార అవకాశం గొప్పదని భావించాను. కానీ అది కార్యరూపం దాల్చాలంటే బాధ కలిగించే చర్యలు అవసరమని కూడా నాకు తెలుసు’ అని వివరించారు. నిస్సాన్లో ఫాక్స్కాన్కు వాటా?హోండా మోటార్ కంపెనీ, నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ సంయుక్త హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయడానికి చర్చలు జరపబోతున్నట్లు 2024 డిసెంబర్లో ప్రకటించాయి. ఆ గ్రూప్లో చేరడాన్ని పరిశీలిస్తున్నట్లు మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్ వెల్లడించింది. 2025 జూన్ నాటికి ఒప్పందాన్ని ఖరారు చేసి.. ఆగస్టు కల్లా హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు హోండా, నిస్సాన్ మొదట్లో తెలిపాయి. ఇదిలావుంటే హోండా, నిస్సాన్ మధ్య చర్చలు విఫలమయ్యాయని జపాన్ మీడియా ఇటీవలి కాలంలో కథనాలు ప్రచురించింది. హోండాతో భాగస్వామ్యంలో ఒక చిన్న భాగస్వామిగా మారడానికి నిస్సాన్ నిరాకరించిందన్నది వార్తా కథనాల సారాంశం. నిస్సాన్లో వాటా తీసుకోవడాన్ని తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ పరిశీలిస్తోందన్న మీడియా ఊహాగానాల గురించి తనకు తెలియదని మీబ్ అన్నారు.ఇదీ చదవండి: స్పోర్ట్స్ టెక్నాలజీ మార్కెట్ @ రూ. 49,500 కోట్లు ఆర్థికంగా మెరుగ్గా హోండా..హోండా ఆర్థికంగా చాలా మెరుగ్గా ఉంది. అలాగే ఉమ్మడి కార్యనిర్వాహక బృందంలో ముందంజలో ఉంది. 2024 ఏప్రిల్–డిసెంబర్ లాభాలు 7 శాతం తగ్గి 5 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు హోండా నివేదించింది. మరోవైపు వాహన అమ్మకాలు పడిపోవడంతో జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో నిస్సాన్ నష్టాలను ప్రకటించింది. దీని ఫలితంగా 9,000 మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఫలితాలకు బాధ్యత వహిస్తూ ఉషీడా తన వేతనంలో 50 శాతం కోత విధించుకున్నారు. -
కొత్త లుక్లో ఎలివేట్ బ్లాక్ ఎడిషన్: రేటెంతో తెలుసా?
హోండా కంపెనీ.. ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 15.51 లక్షలు. కాగా ఎలివేట్ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ ధరలు రూ. 15.71 లక్షలు (ఎక్స్ షోరూమ్). బ్లాక్ ఎడిషన్ ఎలివేట్ టాప్-ఆఫ్-ది-లైన్ ZX గ్రేడ్ ఆధారంగా తయారైంది. ఇది మాన్యువల్, సీవీటీ గేర్బాక్స్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.బ్లాక్ ఎడిషన్ కొత్త క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ కలర్ పొందింది. ఇది బ్లాక్ అల్లాయ్ వీల్స్ & నట్లను పొందుతుంది. ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ ఎగువ గ్రిల్, సిల్వర్ ఫినిషింగ్ ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ గార్నిష్లు, లోయర్ డోర్ గార్నిష్.. రూఫ్ రైల్స్పై క్రోమ్ యాక్సెంట్లను కలిగి ఉంది. వెనుకవైపు ప్రత్యేక 'బ్లాక్ ఎడిషన్' చిహ్నం ఉండటం చూడవచ్చు.సిగ్నేచర్ ఎడిషన్లో ఫ్రంట్ అప్పర్ గ్రిల్, ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ గార్నిష్లు, రూఫ్ రెయిల్లు, డోర్ లోయర్ గార్నిష్ నలుపు రంగులో పూర్తయ్యాయి. ఇది ఫ్రంట్ ఫెండర్పై 'సిగ్నేచర్ ఎడిషన్' చిహ్నం ఉంది.రెండు ఎడిషన్లు ఆల్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్ను కలిగి ఉన్నాయి. బ్లాక్ ఎడిషన్లో బ్లాక్ స్టిచింగ్తో బ్లాక్ లెథెరెట్ సీట్లు, బ్లాక్ డోర్ ప్యాడ్లు, ఆర్మ్రెస్ట్లు పీవీసీ, ఆల్ బ్లాక్ డ్యాష్బోర్డ్తో చుట్టి ఉంటాయి. సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ అదనంగా రిథమిక్ 7 కలర్ యాంబియంట్ లైటింగ్ను పొందుతుంది.ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, లెథెరెట్ సీటింగ్, సింగిల్ పేన్ సన్రూఫ్, కెమెరా బేస్డ్ ఏడీఏఎస్, ఆటో హెడ్లైట్లు, వైపర్లు, సెమీ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్,7.0 ఇంచెస్ TFT డిస్ప్లే మాత్రమే కాకుండా ఆరు ఎయిర్బ్యాగ్లు ఉన్నాయి.హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ కూడా అదే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 121 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. భారతదేశంలోని హోండా డీలర్షిప్లలో ఈ కారు బుకింగ్లు ప్రారంభమయ్యాయి. సీవీటీ వేరియంట్ డెలివరీలు జనవరి నుంచి ప్రారంభమవుతాయి. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ డెలివరీలు ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారత్లోని బెస్ట్ క్రూయిజర్ బైకులు ఇవే!హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ ఇండియన్ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్, ఎంజీ ఆస్టర్ బ్లాక్స్టార్మ్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా బ్లాక్ ఎడిషన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకుండా ఇది హోండా ఎలివేట్ క్రెటా, సెల్టోస్, గ్రాండ్ విటారా, హైరిడర్, కుషాక్, టైగన్ వంటి వాటికి అమ్మకాల పరంగా పోటీ ఇస్తుంది.హోండా, నిస్సాన్ విలీనంజపాన్ ఆటోమొబైల్ దిగ్గజాలు హోండా, నిస్సాన్ విలీనం కానున్నట్లు ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. నిస్సాన్కు వాటాలున్న మిత్సుబిషి మోటార్స్ కూడా తన వ్యాపారాన్ని విలీనం చేసే చర్చల్లో భాగమయ్యేందుకు అంగీకరించినట్లు కంపెనీలు వెల్లడించాయి. ఈ డీల్తో విలీన సంస్థ.. అమ్మకాలపరంగా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీగా ఆవిర్భవించనుంది. -
ఆటో దిగ్గజాల జత.. సక్సెస్ మంత్ర..!
ఆటోరంగం ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా ఒక కొత్త ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వేగంగా దూసుకొస్తున్న ఎలక్ట్రిక్ కార్లు ఒకవైపు, ఆర్టీఫిషియల్ టెక్నాలజీతో నడిచే డ్రైవర్ లెస్ కార్లు రోబో ట్యాక్సీలు మరోవైపు ఆటో కంపెనీ లకు ఆర్థిక భారాన్ని పెడుతున్నాయి.. అమెరికా కార్ల దిగ్గజం టెస్లా ఎలక్ట్రిక్ కార్లతో ఆధిపత్యం చెలాయిస్తుంటే, చైనా కంపెనీలు బీవైడీ, నియో, గ్రేట్వాల్ మోటార్స్ తక్కువ ధరకే ఈవీలను రోడ్లపైకి తెస్తూ చైనాకు చెక్ పెడుతున్నాయి. కొత్తగా ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి, అనేక దేశాల్లో ఆటో కంపెనీలు తమ పోటీ కంపెనీలతోనే పొత్తుకు దిగుతున్నాయి.ప్రత్యర్ధి కంపెనీలతోనే చేతులు కలుపుతున్నాయి. కార్ల తయారీ నుంచి మార్కెటింగ్ దాకా పలు విభాగాల్లో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు పూర్తిగా విలీనం బాట పట్టి ఇతర మార్కెట్లకు విస్తరిస్తుంటే మరికొన్ని టెక్నాలజీని షేర్ చేసుకుంటూ కొత్త మోడళ్ల అభివృద్ధి వ్యయాలు తగ్గించుకుంటున్నాయి. తాజాగా జపనీస్ కంపెనీలు నిస్సాన్, హోండా కూడా విలీనానికి చేతులు కలపడం ఆటో రంగంలో ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే కొన్నాళ్లుగా ఈ ట్రెండ్ కొనసాగుతున్నా విలీనాలు, భాగస్వామ్యాలతో ఏ కంపెనీ ఎక్కువ లాభపడినట్లు గణాంకాలు వెల్లడించడంలేదు. వివరాలు చూద్దాం. – సాక్షి, బిజినెస్ డెస్క్భాగస్వామ్యాల తీరిదీ.. ⇒ ఎలక్ట్రిక్ వాహనాలు, అటానమస్ డ్రైవింగ్ సాంకేతికతల కోసం ఫోర్డ్ మోటార్, ఫోక్స్వేగన్ చేతులు కలిపాయి. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల బిజినెస్ను మూసివేయగా.. కొంతమేర లబ్ధి పొందాయి. ⇒ జనరల్ మోటార్స్తో హోండా జత కలిసింది. జీఎం తయారు చేసే 2 ఈవీ కార్లను హోండా విక్రయిస్తోంది. ఈ రెండింటికి మాత్రమే ఈ భాగస్వామ్యం పరిమితం. ⇒ ఫ్రాన్స్ ప్యూజో, ఫియట్ క్రిస్లర్ జట్టు కట్టడం ద్వారా 2021లో స్టెల్లాంటిస్కు ఊపిరిపోశాయి. అయితే ఫ్యాక్టరీలు మూసివేత బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ⇒ రేనాల్ట్తో నిస్సాన్ జత కలిసింది. దీంతో నిస్సాన్ నిలదొక్కుకుంది. అయితే దీర్ఘకాలికంగా చూస్తే అంత విజయవంతంకాలేదు. ⇒ అందుబాటు ధరల కార్ల తయారీకి వీలుగా లగ్జరీ కార్ల కంపెనీ దైమ్లర్తో, క్రిస్లర్ విలీనమైనప్పటికీ 9 ఏళ్ల తదుపరి 2007లో విడిపోయాయి.దేశీయంగా.. టయోటా మోటార్, సుజుకీ మోటార్ కార్పొరేషన్ 2016లోనే భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. 2019 ఆగస్ట్లో దీర్ఘకాలిక సహకారంలో భాగంగా ఈవీ టెక్నాలజీ, అటానమస్ డ్రైవింగ్పై కన్నేశాయి. ఈ బాటలో దేశీయంగా మారుతీ సుజుకీ బ్రాండ్ ద్వారా కార్ల అమ్మకాలు పెంచుకునే ప్రణాళికలు వేశాయి. మరోపక్క మారుతీ సియాజ్, ఎర్టిగా ప్లాట్ఫామ్ ద్వారా అభివృద్ధి చేసిన వాహనాలను సరఫరా చేయనుంది. ఇదేవిధంగా సీవిభాగంలోని ఎంపీవీ, టయోటా కరోలా సెడాన్, విటారా బ్రెజ్జా తదితర ప్లాట్ఫామ్లను పరస్పరం అభివృద్ధి చేయనున్నాయి.టాటా చేతికి జేఎల్ఆర్ 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తదుపరి జాగ్వార్– ల్యాండ్రోవర్(జేఎల్ఆర్), మజ్దా, వోల్వో విభాగాలను ఫోర్డ్ మోటార్ కంపెనీ విక్రయించింది. ఆర్థిక మందగమన పరిస్థితుల్లోనూ భారీ నష్టాలలో ఉన్న బ్రిటిష్ లగ్జరీ కార్ల విభాగం జేఎల్ఆర్ను దేశీ కార్పొరేట్ దిగ్గజం టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. తదుపరి కార్పొరేట్ దిగ్గజం రతన్ టాటా అధ్యక్షతన నష్టాలను వీడి లాభాల బాట పట్టిన సంగతి తెలిసిందే. హోండా – నిస్సాన్ విలీనం.. మూడో పెద్ద కంపెనీ జపనీస్ దిగ్గజాలు హోండా, నిస్సాన్ తాజాగా విలీనానికి అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో అమ్మకాలరీత్యా ప్రపంచంలోనే మూడో పెద్ద కంపెనీ ఆవిర్భావానికి తెరతీయనున్నాయి. మిత్సుబిషీ సైతం వీటితో కలవనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడే విలీన కంపెనీ టయోటా, ఫోక్స్వ్యాగన్తో పోటీ పడనుంది. ఇప్పటికే నిస్సాన్, హోండా, మిత్సుబిషీ సంయుక్తంగా ఈవీల కోసం బ్యాటరీలు తదితర విడిభాగాల తయారీ టెక్నాలజీని పంచుకోనున్నట్లు ప్రకటించాయి. అంతేకాకుండా అటానమస్ డ్రైవింగ్కు వీలుగా సాఫ్ట్ వేర్పై పరిశోధనలు సైతం చేపట్టనున్నట్లు తెలియజేశాయి.ఆర్ఐఎల్– టెస్లా టెస్లా దేశీయంగా రిలయన్స్తో భాగస్వామ్యానికి చర్చలు జరుపుతున్నట్లు సమా చారం. తద్వారా స్థానికంగా టెస్లా ఎల క్ట్రిక్ కార్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ఇప్పటికే వాణిజ్య వాహనాల కంపెనీ అశోక్ లేలాండ్తో భాగస్వామ్యం ద్వారా రిలయన్స్ దేశీయంగా తొలి హైడ్రోజన్ ఐసీఈ ఇంజిన్తో నడిచే హెవీడ్యూటీ ట్రక్ను 2023లో ఆవిష్కరించింది.జేఎస్డబ్ల్యూ– చైనీస్ ఎలక్ట్రిక్ కార్ల తయారీకి జిందాల్ గ్రూప్ దిగ్గజం జేఎస్డబ్ల్యూ సైతం చైనీస్ దిగ్గజాలు బీవైడీ, జీలీ తదితరాలతో చర్చలు. జరుపుతోంది. లైసెన్సింగ్ ఒప్పందం, టెక్నాలజీ బదిలీ తదితరాలకు ఒప్పందాలు కుదుర్చుకునే సన్నాహాల్లో ఉంది. వోల్వో కార్ల కంపెనీగా జీలీ ఇప్పటికే పరోక్షంగా కార్యకలాపాలు కలిగి ఉంది. దేశీయంగా 2024 తొలి 11 నెలల్లో 18.7 లక్షల ఎలక్ట్రిక్ కార్లు విక్రయంకావడంతో పలు దిగ్గజాలు ఈవీ మార్కెట్పై ఆసక్తి చూపుతున్నాయి. -
హోండా, నిస్సాన్ విలీనం
టోక్యో: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజాలు హోండా, నిస్సాన్ విలీనం కానున్నట్లు ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. నిస్సాన్కు వాటాలున్న మిత్సుబిషి మోటార్స్ కూడా తన వ్యాపారాన్ని విలీనం చేసే చర్చల్లో భాగమయ్యేందుకు అంగీకరించినట్లు కంపెనీలు వెల్లడించాయి. ఈ డీల్తో విలీన సంస్థ.. అమ్మకాలపరంగా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీగా ఆవిర్భవించనుంది. ఫ్రాన్స్కు చెందిన రెనోతో భాగస్వామ్యం, అలాగే మిత్సుబిషి మోటార్స్ కార్ప్లతో కలిసి హోండా, నిస్సాన్ కూటమి.. జపాన్కే చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టయోటా మోటర్ కార్ప్, జర్మనీకి చెందిన ఫోక్స్వ్యాగన్లతో పోటీ పడనుంది. విలీనం అమల్లోకి వస్తే మరింత పెద్ద స్థాయిలో కస్టమర్లకు చేరువయ్యేందుకు తోడ్పడగలదని నిస్సాన్ సీఈవో మకొటొ యుషిడా తెలిపారు. ఇటీవలే హోండా, నిస్సాన్ విలీన వార్తలు రావడం తెలిసిందే. ఆటోమొబైల్ పరిశ్రమ క్రమంగా శిలాజ ఇంధనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు, స్వయంచాలిత టెక్నాలజీల వైపు మళ్లుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.50 బిలియన్ డాలర్ల దిగ్గజం..: మూడు కంపెనీల కలయికతో 50 బిలియన్ డాలర్ల పైగా మార్కెట్ విలువ గల దిగ్గజ సంస్థ ఏర్పాటవుతుంది. వీటి వార్షిక వాహనాల ఉత్పత్తి పరిమాణం 80 లక్షలు ఉంటుంది. 2023లో హోండా 40 లక్షలు, నిస్సాన్ 34 లక్షలు, మిత్సుబిషి మోటర్స్ దాదాపు 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేశాయి. అయితే ఈ మూడూ కలిసినా కూడా ఉత్పత్తిపరంగా టయోటానే అగ్రగామిగా కొనసాగనుంది. 2023లో టయోటా మొత్తం 1.15 కోట్ల వాహనాల తయారీతో టాప్లో ఉంది. ఫోక్స్వ్యాగన్ సుమారు 89 లక్షల వాహనాల ఉత్పత్తితో రెండో స్థానంలో నిల్చింది. ప్రస్తుతం దాదాపు 68 లక్షల వాహనాలతో (కియా, జెనెసిస్ బ్రాండ్లతో కలిసి) దక్షిణ కొరియా సంస్థ హ్యుందాయ్ మూడో స్థానంలో ఉంది. ప్రయోజనాలేమిటంటే.. ఒకవైపు వాహన కంపెనీలు శిలాజ ఇంధనాల వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లేందుకు తంటాలు పడుతుండగా మరోవైపు చైనా కంపెనీలు కొత్త టెక్నాలజీల విషయంలో దూసుకెళ్తుండటం పరిశ్రమను కుదిపేస్తోంది. చైనాకు చెందిన బీవైడీ, గ్రేట్ వాల్, నియో వంటి చౌక ప్రత్యామ్నాయ ఎలక్ట్రిక్ వాహనాలు.. జపాన్, అమెరికన్ కార్ల కంపెనీల మార్కెట్ వాటాను కొల్లగొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలో కన్సాలిడేషన్ చోటుచేసుకుంటున్నట్లు పరిశ్రమల వర్గాలు తెలిపాయి. ఆరి్థక సమస్యలు, తగ్గుతున్న లాభదాయకతతో నిస్సాన్ సతమతమవుతోంది. చైనాలో అమ్మకాల బలహీన తతో హోండా లాభాలపైనా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో విలీనం చోటు చేసుకుంటోంది. 2023లో జరిగిన అమ్మకాల పరంగా టాప్ 10 అతిపెద్ద వాహన తయారీదారుల జాబితాటయోటా - 10.3 మిలియన్ వాహనాలువోక్స్ వ్యాగన్ గ్రూప్ - 9.2 మిలియన్ వాహనాలుహ్యుందాయ్ మోటార్ గ్రూప్ - 7.3 మిలియన్ వాహనాలుస్టెలాంటిస్ - 6.4 మిలియన్ వాహనాలుజనరల్ మోటార్స్ - 6.2 మిలియన్ వాహనాలుఫోర్డ్ మోటార్ కంపెనీ - 4.4 మిలియన్ వాహనాలుహోండా - 4.2 మిలియన్ వాహనాలునిస్సాన్ - 3.4 మిలియన్ వాహనాలు(నోట్: విలీన ప్రక్రియ పూర్తైతే హోండా, నిస్సాన్ కలిపి అమ్మకాల్లో టాప్ 3 కంపెనీ అవతరించినట్లువుతుంది.)బీఎండబ్ల్యూ గ్రూప్ - 2.6 మిలియన్ వాహనాలుమెర్సిడెస్ బెంజ్ - 2.5 మిలియన్ వాహనాలు -
హోండా, నిస్సాన్ విలీనం.. టయోటాకు గట్టిపోటీ తప్పదా?
ఆటోమొబైల్ పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రెండు దిగ్గజ కంపెనీలు విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి. జపాన్లో రెండు, మూడో స్థానాల్లో ఉన్న హోండా మోటార్ , నిస్సాన్ మోటార్ సంస్థలు విలీనాన్ని అన్వేషిస్తున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇది వాస్తవ రూపం దాల్చితే జపనీస్ ఆటోమోటివ్ పరిశ్రమ పూర్తీగా మారిపోతుంది. టయోటా మోటార్ కార్పొరేషన్కు గట్టి పోటీ తప్పదని భావిస్తున్నారు.బ్లూమ్బెర్గ్ రిపోర్ట్ ప్రకారం.. ఇరు కంపెనీల మధ్య చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి. పూర్తీగా విలీనం చేయాలా లేదా మూలధనాన్ని పంచుకోవాలా లేదా హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలా అని యోచిస్తున్నాయి. చర్చల నివేదికలు వెలువడిన తర్వాత హోండా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షింజీ అయోమా స్పందిస్తూ కంపెనీ పలు వ్యూహాత్మక అవకాశాలను పరిశీలిస్తోందని, అందులో ఈ విలీనం ప్రతిపాదన కూడా ఉందని ధ్రువీకరించారు.అంతర్గత వర్గాల సమాచారం మేరకు.. విలీనం తర్వాత రెండు సంస్థల సంయుక్త కార్యకలాపాలను నిర్వహించడానికి కొత్త హోల్డింగ్ కంపెనీని స్థాపించడం అనేది పరిశీలనలో ఉన్న ఒక ప్రతిపాదన. నిస్సాన్తో ఇప్పటికే మూలధన సంబంధాలను కలిగి ఉన్న మిత్సుబిషి మోటార్స్ కార్ప్ని కూడా ఈ డీల్లో చేర్చవచ్చు. అయితే దీనికి సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి ఒప్పందంగా మారుతుందా లేదా అన్నది అస్పష్టంగా ఉంది.ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే, అది జపాన్ ఆటో రంగాన్ని రెండు ఆధిపత్య సమూహాలుగా ఏకీకృతం చేస్తుంది. హోండా, నిస్సాన్, మిత్సుబిషి ఒక గ్రూప్గా, టయోటా, దాని అనుబంధ సంస్థలు మరో సమూహంగా ఉంటాయి. ఈ ఏకీకరణ విలీన సంస్థ ప్రపంచ పోటీతత్వాన్ని బలోపేతం చేయగలదు. బ్యాటరీలు, సాఫ్ట్వేర్పై హోండా, నిస్సాన్ మధ్య ఇది వరకే సహకారం కుదిరిన విషయం తెలిసిందే. విలీన చర్చల వార్తల తరువాత బుధవారం ప్రారంభ ట్రేడింగ్లో నిస్సాన్ షేర్లు 24% వరకు పెరిగగా హోండా షేర్లు 3.4% తగ్గాయని బ్లూమ్బెర్గ్ నివేదిక పేర్కొంది. -
భారత్లో అత్యంత ఖరీదైన బైకులు ఇవే! (ఫోటోలు)
-
హ్యాండిల్, సీటు లేని హోండా ఇంజిన్!
-
అర్థం కాని.. అత్యద్భుతమైన మోటార్సైకిల్స్ (ఫోటోలు)
-
90వేల కార్లు వెనక్కి: హోండా కీలక ప్రకటన
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా 90వేల కంటే ఎక్కువ యూనిట్ల వాహనాలకు రీకాల్ ప్రకటించింది. 'ఫ్యూయల్ పంప్లో సమస్య' కారణంగా కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది. ఈ సమస్య ఇంజిన్ ఆగిపోయేలా చేస్తుంది. ఈ రీకాల్ ద్వారా హోండా దీనిని పరిష్కరిస్తుంది.2024 నవంబర్ 5 నుంచి భారతదేశం అంతటా దశలవారీగా కంపెనీ సమస్య ఉన్న కారులోని భాగాలను గుర్తించి ఉచితంగా భర్తీ చేస్తుంది. ఇప్పటికే యజమానులు వ్యక్తిగతంగా సంప్రదిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. జూన్ 2017 - అక్టోబర్ 2023 మధ్య కాలంలో హోండా కార్స్ అధీకృత డీలర్షిప్ల నుండి ఓవర్-ది-కౌంటర్ సేల్స్ ద్వారా ఫ్యూయల్ పంప్ అసెంబ్లీని కొనుగోలు చేసిన కస్టమర్లు కూడా తమ వాహనాన్ని అధీకృత సర్వీస్ సెంటర్లో తనిఖీ చేసుకోవాలని కంపెనీ పేర్కొంది.రీకాల్ అనేది అమేజ్ (18,851 యూనిట్లు), బ్రియో (3,317 యూనిట్లు), బీఆర్-వీ (4,386 యూనిట్లు), సిటీ (32,872 యూనిట్లు), జాజ్ (16,744 యూనిట్లు), డబ్ల్యుఆర్-వీ (14,298 యూనిట్లు) కార్లను ప్రభావితం చేస్తుంది.హోండా కార్స్ ఇండియా వెబ్సైట్లోని సర్వీస్ ట్యాబ్ ద్వారా ప్రోడక్ట్ అప్డేట్/రీకాల్ పేజీని సందర్శించి, వారి కారు 'వీఐఎన్'ను ఫిల్ చేయడం ద్వారా కస్టమర్లు తమ వాహనం రీకాల్ వల్ల ప్రభావితమైందో లేదో తనిఖీ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. -
హోండా 0 సిరీస్ ఎలక్ట్రిక్ కార్లు.. 500 కిమీ టార్గెట్!
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే అనేక సంస్థలు ఈవీలను లాంచ్ చేసి ఉత్తమ అమ్మకాలను పొందుతున్నాయి. ఇప్పటి వరకు హోండా మాత్రం ప్యూర్ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయలేదు. అయితే ఈ సంస్థ 2030 నాటికి ఏడు 0 సిరీస్ మోడళ్లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నద్ధమైంది.హోండా కంపెనీ లాంచ్ చేయనున్న 7 మోడల్స్ 480 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించేలా రూపొందిస్తోంది. జపనీస్ ఆటో మేకర్ లాంచ్ చేయనున్న 0 సిరీస్ మోడల్స్ సరికొత్త బెస్పోక్ ప్లాట్ఫారమ్ ఆధారంగా తయారవుతాయి. ఈ ఎలక్ట్రిక్ కార్ల బాడీ ఫ్రేమ్లు తేలికగా ఉంటాయని తెలుస్తోంది. అంతే కాకుండా డిజైన్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది.హోండా లాంచ్ చేయనున్న 0 సిరీస్ కార్లు మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా.. లెవెల్ 3 ADAS టెక్నాలజీని కూడా పొందుతాయని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.0 సిరీస్ కింద లాంచ్ కానున్న మొదటి ఎలక్ట్రిక్ కారు CES.. ఇప్పటికే ఈ కారు లాస్ వెగాస్లో జరిగిన ఓ కార్యక్రమంలో కనిపించింది. దీన్ని బట్టి చూస్తే.. హోండా లాంచ్ చేయనున్న కార్లు ఎలా ఉండబోతున్నాయనేది స్పష్టమైపోతోంది. కాగా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ రోజు రోజుకు ఊపందుకుంటున్న తరుణంలో హోండా భారీ పెట్టుబడులను పెట్టడానికి యోచిస్తున్నట్లు సమాచారం. -
సీఈఎస్ వేదికపై అట్రాక్ట్ చేస్తున్న 'అఫీలా' కారు - వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ రోజు నుంచి లాస్ వెగాస్లో ప్రారంభమైన సీఈఎస్ 2024 వేదికగా మరిన్ని కొత్త వాహనాలు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. లాస్ వేగాస్లో జరుగుతున్న ఈ ఈవెంట్లో 'సోనీ' (Sony) కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ కారుని ప్రదర్శించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా సోనీ, హోండా కలిసి 'అఫీలా' (Afeela) అనే కొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఆ కారుని కంపెనీ ఎట్టకేలకు ఈ CES 2024 వేదికగా ప్రదర్శించింది. ఇక్కడ కనిపించే కారు కేవలం డెమో కోసం మాత్రమే అని, రానున్న రోజుల్లో టెస్టింగ్ వంటివి నిర్వహించి మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'ఇజుమి కవానిషి' ప్రకారం, ఈ కారు 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభం నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుంది, ఈ కారు లాంచ్ అయిన తరువాత మరిన్ని ఉత్పత్తులు పుట్టుకొస్తాయని వెల్లడించారు. ఇదీ చదవండి: వాచ్మెన్కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే? అఫీలా (Afeela) కారు అద్భుతమైన డిజైన్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇది 3డీ గ్రాఫిక్స్, విజువల్స్ కలిగి మల్టిపుల్ కెమెరా సెటప్ వంటి వాటిని కలిగి ఉంటుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. ఇందులో ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. కంపెనీ ఈ కారుకు సంబంధించిన చాలా విషయాలను రానున్న రోజుల్లో వెల్లడించనుంది. అయితే ఈ మోడల్ భారతీయ తీరానికి చేరుకుంటుందా? లేదా?.. ఒక వేళా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. -
కొత్త కారు కష్టమే..! పెరగనున్న ఆ బ్రాండ్ ధరలు
2023 ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. రానున్న కొత్త సంవత్సరంలో ఆటోమొబైల్ సెక్టార్లోని చాలా కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచడానికి చూస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2024 ప్రారంభం నుంచి 'హోండా కార్స్ ఇండియా' (Honda Cars India) కార్ల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. ముడిసరుకుల ధరలు పెరగటం వల్ల ధరల పెరుగుదల తప్పడం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ధరల పెరుగుదల ఎంత శాతం అనే వివరాలు ఈ నెల చివరి నాటికి వెల్లడించనున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ 'కునాల్ బెహ్ల్' వెల్లడించారు. భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు వెళుతున్న హోండా.. తమ ఉత్పత్తుల ధరలను పెంచినట్లయితే అమ్మకాల మీద ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు, కానీ హోండా బాటలోనే మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆడి వంటి కంపెనీలు నడుస్తుండటంతో సేల్స్ మీద ప్రభావం పెద్దగా ఉండక పోవచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: చైనా వద్దు భారత్ ముద్దు.. ఇండియాపై పడ్డ అమెరికన్ కంపెనీ చూపు.. దేశీయ దిగ్గజం టాటా మోటార్స్, జర్మన్ బేస్డ్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కూడా తమ ఉత్పత్తుల ధరలను 2024 ప్రారంభం నుంచి పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే నిజమైతే టాటా, బెంజ్ కార్లు కొత్త సంవత్సరంలో ఖరీదైనవిగా మారతాయి. -
కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. అదిరిపోయే ఆఫర్స్ వచ్చేశాయ్!
భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమైపోయింది. ఇక రానున్నది విజయ దశమి. ఈ సందర్భంగా చాలామంది వాహన కొనుగోలుదారులు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు వాహన తయారీ సంస్థలు అద్భుతమైన డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందిస్తున్నాయి. ప్రస్తుతం డిస్కౌంట్స్ అందిస్తున్న కార్ల కంపెనీల జాబితాలో మారుతి సుజుకి, హ్యుందాయ్, హోండా వంటివి ఉన్నాయి. హోండా కంపెనీకి చెందిన సిటీ, అమేజ్ వంటి కార్ల మీద డిస్కౌంట్స్ అందిస్తోంది. హోండా సిటీ కారు మీద రూ. 75,000 వరకు ప్రయోజనాలు, అమేజ్ మీద రూ. 57,000 బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. హ్యుందాయ్ కంపెనీ విషయానికి వస్తే, ఇప్పుడు సంస్థ ఐ10 ఎన్ లైన్ మీద రూ. 50000, గ్రాండ్ ఐ నియోస్ మీద రూ. 43000, ఆరా మీద రూ. 33000, వెర్నా అండ్ అల్కజార్ మీద వరుసగా రూ. 25000 & రూ. 20000 ప్రయోజనాలను అందిస్తోంది. ఇదీ చదవండి: మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా? మారుతి సుజుకి కూడా ప్రీ-నవరాత్రి బుకింగ్ స్కీమ్ కింద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో మారుతి ఇగ్నీస్, బాలెనొ అండ్ సియాజ్ ఉన్నాయి. వీటి మీద కంపెనీ వరుసగా రూ. 65000, రూ. 55000 & రూ. 53000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ బెనిఫిట్స్ కేవలం ఈ నెలలో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. Note: హ్యుందాయ్, మారుతి సుజుకి, హోండా కంపెనీలు అందిస్తున్న ఈ ఆఫర్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. కావున ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని సంస్థ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
పండుగ సీజన్లో కొత్త కారు కొనాలా? ఎంచుకో ఓ బెస్ట్ ఆప్షన్..
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో రోజురోజుకి కొత్త కొత్త కార్లు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే రానున్న పండుగ సీజన్ని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు మరిన్ని లేటెస్ట్ కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. కాగా ఈ వారం మార్కెట్లో విడుదలైన కార్లు ఏవి? వాటి వివరాలేంటి? అనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హోండా ఎలివేట్ (Honda Elevate) హోండా కంపెనీ గత కొంత కాలంలో దేశీయ విఫణిలో విడుదల చేయాలనుకున్న ఎలివేట్ కారుని ఈ వారం ప్రారంభంలో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఇది మొత్తం నాలుగు ట్రిమ్లలో మార్కెట్లో లభిస్తుంది. ప్రారంభ ధర రూ. 11 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 16 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. హోండా ఎలివేట్ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 121 హార్స్ పవర్ అండ్ 145 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్టెప్ CVT ఆటోమేటిక్ పొందుతుంది. డిజైన్ అండ్ ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue ADAS) ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న హ్యుందాయ్ వెన్యూ ఇప్పుడు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం (ADAS)తో విడుదలైంది. దీని ధర రూ. 10.33 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్ అండ్ లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ వంటి వాటితో మరింత సురక్షితమైన వాహనంగా నిలుస్తోంది. వోల్వో సీ40 రీఛార్జ్ (Volvo C40 Recharge) స్వీడిష్ కార్ల తయారీ సంస్థ దేశీయ మార్కెట్లో 'వోల్వో' రూ. 61.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ఖరీదైన 'సీ40 రీఛార్జ్' లాంచ్ చేసింది. డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉండే ఈ కారు ఒక సింగిల్ ఛార్జ్ మీద 530 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది. ఇది కేవలం 4.7 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగవంతమవుతుంది. బీఎండబ్ల్యూ 2 సిరీస్ ఎమ్ పర్ఫామెన్స్ ఎడిషన్ (BMW 2 Series M Performance Edition) జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియన్ మార్కెట్లో కొత్త 2 సిరీస్ ఎమ్ పర్ఫామెన్స్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 46 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే పెట్రోల్ ఇంజన్తో అందుబాటులో ఉంది. ఇందులోని 2.0 లీటర్, నాలుగు-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 179 హార్స్ పవర్, 280 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో లభిస్తుంది. ఇదీ చదవండి: జీ20 సమ్మిట్ కోసం భారత్ ఇన్ని కోట్లు ఖర్చు చేసిందా? ఆసక్తికర విషయాలు! హ్యుందాయ్ ఐ20 ఫేస్లిఫ్ట్ (Hyundai i20 facelift) దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త హ్యుందాయ్ ఐ20 ఫేస్లిఫ్ట్ ధరలు రూ. 6.99 లక్షల నుంచి రూ. 11.01 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య ఉంటుంది. ఇది అప్డేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ డిజైన్ కలిగి, కొత్త ఇంటీరియర్ కలర్ స్కీమ్తో ఆధునిక హంగులు పొందుతుంది. ఈ ఫేస్లిఫ్ట్ ఇప్పుడు 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే పొందుతుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. -
ఖర్చులు పెరిగిపోతున్నాయ్..కార్ల ధరల్ని పెంచనున్న హోండా
ప్రముఖ జపనీస్ కార్ల తయారీ సంస్థ భారతీయులకు షాకివ్వనుంది. త్వరలో దేశీయంగా హోండా సిటీ సెడాన్, అమేజ్ సబ్ కాంపాక్ట్ మోడల్స్ ధరల్ని పెంచనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రూ.11.49లక్షల ప్రారంభ ధరతో హోండా ఐదో జనరల్ సిటీ సెడాన్ ఫేస్లిఫ్ట్ వెర్షన్ను,హోండా సిటీ హైబ్రిడ్ వర్షన్ ధర రూ.20.39లక్షల వరకు, హోండా సిటీ ప్రస్తుత ప్రారంభ ధర రూ.11.57లక్షలు, హోండా అమేజ్ రూ.7.05లక్షల ధరలతో విడుదల చేసింది. అయితే, పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చుల కారణంగా కార్ల ధరల్ని పెంచేందుకు హోండా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా సెప్టెంబర్ నుంచి సిటీ, అమేజ్ ధరల పెంపు ఉంటుందంటూ వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఈ ధరల పెంపుపై హోండా అధికార ప్రకటన చేయాల్సి ఉంది. -
ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తోంది...సూపర్ అప్కమింగ్ కార్లు
TopUpcomingCars: పండుగల సీజన్ సమీపిస్తున్నతరుణంలో భారత మార్కెట్లోకి కొత్త కార్లు హల్చల్ చేస్తున్నాయి. వినాయక చవితి దసరా, దీపావళి రోజుల్లో కొత్త వాహనాలను కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పండుగల సీజన్ కార్ల డిమాండ్ నేపథ్యంలో అనేక కంపెనీలు అత్యాధునిక ఫీచర్లు, బడ్జెట్, ఈవీ కార్లు ఇలా రకరకాల సెగ్మెంట్లలో కార్లను లాంచ్ చేస్తుంటారు. ఒకవేళ మీరు కూడా ఈ పండుగ సీజన్లో కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, రానున్న రాబోయే మోడళ్ల కార్లను ఓసారి చూద్దాం! Maruti suzuki invicto మారుతి సుజుకి ఇండియా తన లీడర్ మోడల్ - మారుతి సుజుకి ఇన్విక్టో ఎమ్పివిని జీటా ఆల్ఫా అనే రెండు వేరియేషన్లలో అందుబాటులో ఉంది. మారుతి ఇన్విక్టో ఎలక్ట్రిక్ ఇంజిన్తో సరిపోలిన 2.0-లీటర్ పెట్రోల్ మోటారును పొందుతుంది. ఎలక్ట్రిక్ మోటార్ 11 బిహెచ్పి ,206 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది, ఐసిఇ వెర్షన్ 172 బిహెచ్పి మరియు 188 ఎన్ఎమ్ టార్క్ను కలిగి ఉంది. ధర రూ. రూ. 24.79 లక్షలు 28.42 లక్షలు (ఎక్స్ షోరూం) Honda Elevate హోండా ఎలివేట్ వచ్చే నెల ( సెప్టెంబరు) లో దేశంలో సేల్ కు రానుంది.హోండా ఎలివేట్ 1.5L NA పెట్రోల్ ఇంజన్తో 6-స్పీడ్ MT , CVT అనే రెండు ట్రాన్స్మిషన్ ఆప్షన్స్లో లభ్యం. దీని ధర రూ. 10.50-17 లక్షలు ఉంటుందని అంచనా. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైడర్, వోక్స్వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్ లాంటివాటికి గట్టి పోటీగా ఉండనుంది. Citroen C3 Aircross సిట్రోయెన్ సీ3 ఎయిర్క్రాస్: 7-సీటర్ SUVని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, సిట్రోయెన్ C3 ఎయిర్క్రాస్ బెస్ట్ ఆప్షన్. బోల్డ్ స్టైలింగ్తో, బెస్ట్ ఇంటీరియర్తో వస్తోంది. అయితే ఇది 1.2L టర్బో-పెట్రోల్ కేవలం ఒక ఇంజన్ ఎంపిక మాత్రమే లభ్యం. దీని ధర రూ. 9-13 లక్షలు ఉంటుందని అంచనా. Toyota Rumion మరో 7-సీటర్ కారు టయోటా రూమియన్. ఈమధ్యనే లాంచ్ అయినా ఈ కారు త్వరలోనే కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. విజువల్ ఫ్రంట్లో కొన్ని మార్పులను కలిగి ఉంది. అలాగే రేడియేటర్ గ్రిల్ సవరించిన బంపర్తో కొత్తగానూ, అల్లాయ్ వీల్స్ కూడా తాజా డిజైన్ను కలిగి ఉన్నాయి. టయోటా లోగో మినహా లోపలి భాగంలో అంతా సేమ్. Tata Punch EV SUV టాటా పంచ్ ఈవీ టియాగో ఈవీ తరహాలో ఇదే ఆర్కిటెక్చర్తో పంచ్ ఈవీని విడుదల చేయడానికి టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తోంది. ఇది జిప్ట్రాన్ సాంకేతికతతో బానెట్ కింద ఉంచబడిన ఎలక్ట్రిక్ మోటారుతో వస్తోంది. 350 కిమీల పరిధితో లాంచ్ కానుంది. దీని ధర రూ. 9-12 లక్షలు ఉంటుందని అంచనా. Tata Nexon facelift ప్రమోషనల్ షూట్లో అందరి దృష్టినీ ఆకర్షించిన టాటా నెక్సాన్ ఫేస్లిఫ్ట్ ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి ఇది మార్కెట్లోకి వస్తుందని తొలుత అనుకున్నప్పటికీ పండుగ సీజన్లోనే దాదాపు అక్టోబరులోనే దీన్ని లాంచ్ చేస్తుందని తాజా అంచనా.దీని ధర రూ. 8-15 లక్షలు ఉంటుందని అంచనా. Volvo C40 Recharge వోల్వో సీ40 రీఛార్జ్ (VolvoC40) XC40 రీఛార్జ్ SUV-కూపే వెర్షన్. మెరుగు పర్చిన 78kWh బ్యాటరీ ప్యాక్తో,530కిమీ పరిధిని అందిస్తుంది. 408PSతో డ్యూయల్-మోటార్ AWD కారణంగా 4.7 సెకన్లలో 100kmph వరకు దూసుకెళ్తుంది. అంచనా ధర రూ. 60 లక్షలు (ఎక్స్-షోరూమ్) సెప్టెంబరు 4న లాంచింగ్ -
విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తున్న ఎలివేట్ - బుకింగ్స్ ఎప్పుడంటే?
Honda Elevate Bookings: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'హోండా ఇండియా' (Honda India) త్వరలోనే 'ఎలివేట్' (Elevate) ఎస్యువిని విడుదల చేయడానికి సిద్ధమైంది. కాగా ఇప్పుడు బుకింగ్స్ గురించి అధికారిక సమాచారం వెల్లడించింది. బుకింగ్స్ & లాంచ్ టైమ్ నివేదికల ప్రకారం, హోండా ఎలివేట్ బుకింగ్స్ 2023 జులై 03 నుంచి ప్రారంభమవుతాయి. రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ మిడ్ సైజ్ ఎస్యువి ధరలు ఆగస్ట్ చివరిలో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే అప్పటికి ఈ కారు భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదలవుతుంది. అంతే కాకుండా ఈ నెల చివరి నాటికి డిస్ప్లే, ఆగష్టు చివరి నాటికి టెస్ట్ డ్రైవ్లు ప్రారంభమవుతాయి. వేరియంట్స్ & ఇంజిన్ డీటైల్స్ హోండా ఎలివేట్ నాలుగు ట్రిమ్లలో విడుదలయ్యే అవకాశం ఉందని డీలర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఖచ్చితమైన వివరాలు లాంచ్ నాటికి తెలుస్తాయి. ఎలివేట్ ఎస్యువి 1.5-లీటర్, ఫోర్ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 121 హార్స్ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆప్షనల్ సివిటీ గేర్బాక్స్ పొందనుంది. పవర్ట్రెయిన్ మాత్రం హోండా సిస్టయి మాదిరిగా ఉంటుందని భావిస్తున్నారు. డిజైన్ & ఫీచర్స్ డిజైన్ అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే.. విశాలమైన ఫ్రంట్ గ్రిల్, మధ్యలో బ్రాండ్ లోగో, హెడ్ లైట్, ఫాగ్ లైట్స్, వంటివి ఇందులో గమనించవచ్చు. ఈ ఎస్యువి 4312 మిమీ పొడవు, 1790 మిమీ వెడల్పు, 1650 మిమీ ఎత్తు, 2650 మిమీ వీల్బేస్ కలిగి.. 220 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. కావున పరిమాణం పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: కనుమరుగవుతున్న 44 ఏళ్ల చరిత్ర.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ విలీనం!) హోండా ఎలివేట్ సాఫ్ట్ టచ్ ప్యానెల్స్, విశాలమైన సీటింగ్తో క్యాబిన్ చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్స్క్రీన్, 7 ఇంచెస్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, లేన్-వాచ్ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ప్లే, కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్తో కూడిన ADAS వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి. ఇది సింగిల్-పేన్ సన్రూఫ్ను మాత్రమే పొందుతుంది. (ఇదీ చదవండి: ఈ నెలలో విడుదలైన బెస్ట్ స్మార్ట్ఫోన్స్ - వివో వై36 నుంచి వన్ప్లస్ నార్డ్ వరకు..) ప్రత్యర్థులు కొత్త హోండా ఎలివేట్ దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మొదలైన కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారు ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 12 లక్షల ధర వద్ద విడుదలయ్యే వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
హోండా కస్టమర్లకు షాక్.. 13 లక్షల కార్లు వెనక్కి!
Honda Recall: ప్రపంచ మార్కెట్లో వాహన వినియోగం రోజురోజుకి పెరుగుతున్న తరుణంలో అనేక కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. అయితే ఈ సమయంలో ప్రముఖ జపనీస్ కార్ల తయారీ సంస్థ 'హోండా' (Honda) సుమారు 13 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ రీకాల్ ఎక్కడ ప్రకటించింది? దాని వెనుక ఉన్న కారణం ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, హోండా అమెరికాలోనే 12 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. అంతే కాకుండా కెనడా నుంచి 88,000 & మెక్సికోలో 16,000 కార్ల మీద ఈ ప్రభావం పడినట్లు 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' (NHTSA) తెలిపింది. ఇందులో 2018 నుంచి 2023 మధ్య నిర్మించిన 'ఒడిస్సి', 2019 నుంచి 2022 మధ్య తయారైన పైలట్, 2019 - 2023 మధ్య విడుదలైన హోండా పాస్పోర్ట్ మోడల్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: పాకిస్థాన్లో ఎక్కువ అమ్ముడయ్యే కార్లు - ఇక్కడ చూడండి!) రీకాల్ ప్రకటించడానికి ప్రధాన కారణం.. లోపభూయిష్టమైన కమ్యూనికేషన్ కోక్సియల్ కేబుల్ కనెక్టర్ కలిగి ఉండటం వల్ల 'రియర్ వ్యూ కెమెరా'లో సమస్య ఏర్పడే అవకాశం ఉండటమే. ఈ సమస్యను తొలగించడానికి కంపెనీ రీకాల్ ప్రకటించింది. సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం ఆ సంవత్సరాల్లో ఉత్పత్తయిన కార్లు కలిగిన వినియోగదారులు సమస్యను ఈ రీకాల్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించవలసిన ఏమిటంటే ఇప్పటి వరకు ఈ సమస్య మీద ఎవరు ఫిర్యాదు చేయలేదు. కానీ ముందుగానే కంపెనీ ఈ సమస్యను పరిష్కరించడం కోసం రీకాల్ ప్రకటించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా రీకాల్ భారతదేశంలో ప్రకటించలేదు. -
హోండా ఎలివేట్ వచ్చేసింది.. 2030కల్లా 5 ఎస్యూవీలు
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా.. భారత మార్కెట్లో 2030 నాటికి అయిదు కొత్త ఎస్యూవీలను పరిచయం చేయనుంది. వీటిలో ఎలివేట్ ఎలక్ట్రిక్ మోడల్ సైతం ఉందని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకుయా సుమురా తెలిపారు. మధ్యస్థాయి ఎస్యూవీ ఎలివేట్ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఎలివేట్ సాయంతో కంపెనీ తన స్థానాన్ని మరింత బలపర్చుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం సిటీ, అమేజ్ సెడాన్లను భారత్లో విక్రయిస్తున్నాం. మొత్తం ప్యాసింజర్ వాహన విభాగంలో సెడాన్ల వాటా 10 శాతమే. ఈ విభాగంలోనే కంపెనీ పోటీపడుతోంది. అలాగే ఈ మోడళ్లు మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నాయి. ఎలివేట్ను తొలిసారిగా భారత్లో ప్రవేశపెట్టాం. రానున్న రోజుల్లో ఈ మోడల్ ప్రధాన ఉత్పాదనగా ఉంటుంది. కొత్తగా వచ్చే మోడళ్లు ప్రీమియం సెగ్మెంట్లో పోటీ పడతాయి. ఎలివేట్ ఎగుమతి కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దుతాం. ఇక 2022–23లో 1.2 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేశాం. 2024–25లో దీనిని 1.7 లక్షల యూనిట్లకు చేరుస్తాం’ అని వివరించారు. 2040 నాటికి బ్యాటరీ ఎలక్ట్రిక్, ఫ్యూయల్ సెల్ వాహనాలను మాత్రమే విక్రయిస్తామని హోండా మోటార్ కో ఆసియా హెడ్ తోషియో కువహర తెలిపారు. -
‘ఎలివేట్’ పేరిట హోండా కొత్త కారు.. మూడేళ్ల నుంచి ఊరిస్తూ.. చివరికి ఇలా
జపాన్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా భారత్లో ఎస్యూవీ మార్కెట్ విభాగంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా మిడ్ రేంజ్ ఎస్యూవీ వాహనాలైన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటార’ తరహాలో మిడ్ సైజ్ ఎస్యూవీ కార్ను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెల జూన్ 6న ‘ఎలివేట్’ పేరుతో ఎస్యూవీని విడుదల చేయనున్నట్లు హోండా అధికారికంగా ప్రకటించింది. హోండా ఎలివేట్ ఇంజన్ ఉందంటే ఎలివేట్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లో మార్కెట్కు పరిచయం కానుంది. ఇందులో ట్రాన్స్మిషన్ ఆప్షన్తో పాటు మ్యాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది. సీవీటీ గేర్ బాక్స్లు ఉన్నాయి. కార్ సౌకర్యంగా ఉండేలా అప్రైట్ స్టాన్స్, డ్రైవింగ్ సమయంలో కాంతివంతంగా ఉండేలా స్లీక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ప్రయాణ సమయంలో ఎదురయ్యే ప్రమాదాల నుంచి వాహనంలోని ప్రయాణికుల్ని సంరక్షించేలా మెటల్ బార్స్ గ్రిల్స్తో పాటు ఇతర ఫీచర్లు ఉన్నాయి. దేశీయ కంపెనీలతో పోటీపడలేక భారత్లో ఎస్యూవీలకు మంచి గిరాకీ నడుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఎస్యూవీల వాటా 47 శాతం. కానీ 2020లో ఎస్యూవీ మార్కెట్ వ్యాల్యూ 28 శాతంగా ఉంది. కోవిడ్-19తో ఆటోమొబైల్ రంగం తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. హ్యుందయ్, దేశీయ వాహన తయారీ సంస్థలైన టాటా మోటార్స్, మారుతి సుజికిల నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈ వరుస విపత్కర పరిణామాలతో హోండా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ నోయిడాలో తయారీ ప్లాంటును రాజస్థాన్కు తరలించింది. దీంతో పాటు సివిక్ సెడాన్, సీఆర్- వీ ఎస్యూవీ తయారీని నిలిపింది. 3 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ మరుసటి ఏడాది అంటే 2021లో భారత్లో కొత్త ఎస్యూవీ కారును విడుదల చేయాలని హోండా గట్టి ప్రయత్నాలే చేసింది. 7 సీట్ల ఎస్యూవీ కోసం ‘ఎలివేట్’ పేరుతో ట్రేడ్ మార్క్ను రిజిస్టర్ చేసింది. కానీ ఆ కార్ ఎలా ఉండబోతుంది. ఎప్పుడు విడుదల చేస్తుందనే అంశంపై స్పష్టం చేయలేదు. తిరిగి మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎలివేట్ ఎస్యూవీని విడుదల చేసేందుకు సిద్ధమైంది .కాగా, హోండా కార్స్ ఇండియా ప్రస్తుతం భారత్లో సిటీ , అమేజ్ అనే రెండు మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. చదవండి👉 చాట్జీపీటీ వినియోగంపై పోటీపడుతున్న సీఈవోలు.. ఏం జరుగుతుందో.. ఏమో! -
Honda: ఏప్రిల్ నుంచి ఈ కార్ల ఉత్పత్తి బంద్
గతంలో బిఎస్6 ఉద్గార నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత చాలా కార్ల ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే 2023 ఏప్రిల్ 01నుంచి బిఎస్6 ఫేజ్-2 రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలు అమలులోకి రానున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు తమ ఉత్పత్తులలో కొన్నింటిని నిలిపివేయాలని నిర్చయించాయి. ఇందులో హోండా కంపెనీ కూడా ఉంది. నివేదికల ప్రకారం.. హోండా కంపెనీ ఏప్రిల్ ప్రారంభం నుంచి జాజ్, డబ్ల్యుఆర్-వి, నాల్గవ తరం సిటీ వంటి మోడల్స్ ఉత్పత్తిని నిలిపివేయనుంది. రియల్ డ్రైవింగ్ ఎమిషన్ నిబంధనలు క్యాటలిటిక్ కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సార్ల వంటి భాగాలను నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. బిఎస్6 ఫేస్-2 నిబంధనలు కొంత కఠినంగా ఉంటాయి, కావున కంపెనీ ఉత్పత్తులు మరింత పటిష్టంగా తయారవుతాయి, తద్వారా ధరలు కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కంపెనీ హోండా సిటీ ఐదవ తరం మోడల్, అమేజ్ వంటి వాటిని కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. వచ్చే నెల ప్రారంభం నుంచే తమ ఉత్పత్తుల ధరలు రూ. 12,000 వరకు పెరిగే అవకాశం ఉందని తెలిసింది. ఇదే బాటలో మరిన్ని కంపెనీలు ముందుకు సాగనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. అయితే ఈ ధరల పెరుగుదల వాహనాల అమ్మకాలపైన ప్రభావం చూపుతుందా? లేదా? అనేది త్వరలో తెలియాల్సి ఉంది. -
100 సీసీ హోండా షైన్ వచ్చేసింది! ధర దాని కంటే తక్కువే..
భారత బైక్ మార్కెట్లో హీరో తర్వాత హోండా కంపెనీ మోటార్సైకిళ్లు, స్కూటర్లకు అంతే స్థాయిలో పాపులారిటీ ఉంది. హోండా ఇండియా దేశంలో సరికొత్త షైన్ 100 సీసీ బైక్ను విడుదల చేసింది. ఇంతకు ముందు హోండా షైన్ 125 సీసీ బైక్లకు మంచి ఆదరణ వచ్చింది. ఈ నేపథ్యంలో అదే మోడల్ పేరుతో 100 సీసీ ఇంజన్తో హోండా కంపెనీ కొత్త బైక్ను విడుదల చేసింది. ఇదీ చదవండి: Realme C33 2023: తక్కువ ధరలో రియల్మీ ఫోన్లు... కిర్రాక్ ఫీచర్లు! హోండాకు సంబంధించి దేశంలో 125సీసీ ఆపైన మోడళ్లు అంటే.. యూనికాన్, హోండా షైన్ బైక్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయితే 100సీసీ బైక్ల విషయంలో మాత్రం హోండా వెనుకబడి ఉంది. 100 సీసీ రేంజ్ బైక్ల అమ్మకాల్లో హీరో కంపెనీకి తిరుగులేదు. దానికి కారణం హీరో స్ల్పెండర్ బైక్లు. ఈ నేపథ్యంలో వాటికి గట్టి పోటీ ఇచ్చేందుకు హోండా బాగా పాపులరైన షైన్ పేరుతో 100 సీసీ మోటర్ సైకిల్ తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.64,900 (ఎక్స్షోరూం). అంటే హీరో స్ల్పెండర్ ప్లస్ కంటే తక్కువే.. హోండా షైన్ 100 సీసీ ప్రత్యేకతలు హోండా షైన్ 100 సీసీ బైక్ 6 సంవత్సరాల వారంటీ ప్యాకేజీతో వస్తుందని, ఇందులో 3 సంవత్సరాలు సాధారణ వారంటీ కాగా సంవత్సరాల ఎక్స్టెండెట్ వారంటీ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పొడవాటి సీటు (677 మి.మీ), చిన్న లెగ్ ఓపెనింగ్ యాంగిల్తో కూడిన ట్యాంక్ ఉన్నాయి. ఇంజిన్ ఇన్హిబిటర్తో కూడిన సైడ్ స్టాండ్ ఉంటుంది. దీని వల్ల సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేయడానికి వీలుండదు. హోండా పేటెంట్ అయిన ఈక్వలైజర్తో కూడిన కాంబి బ్రేక్ సిస్టమ్ (సీబీస్)ను ఈ 100సీసీ బైక్లోనూ చేర్చారు. ఇక డిజైన్ విషయానికొస్తే హోండా షైన్ 125 ఉన్నట్టుగానే ఉంటుంది. అయితే అలాయ్ వీల్స్ తదితర చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. హోండా షైన్ 100 సీసీ బైక్ ఐదు రంగుల్లో లభిస్తాయి. అవి బ్లాక్ విత్ రెడ్ స్ట్రిప్స్, బ్లాక్ విత్ గ్రే స్ట్రైప్స్, బ్లాక్ విత్ గోల్డ్ స్ట్రైప్స్, బ్లాక్ విత్ బ్లూ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గ్రీన్ స్ట్రైప్స్. ఇదీ చదవండి: మూత పడనున్న మరో బ్యాంక్? భారీగా పతనమైన షేర్లు.. -
సంక్షోభంతో అల్లాడుతున్న పాక్కు షాక్: మరో ప్లాంట్ షట్డౌన్
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్కు మరో షాక్ తగిలింది. సరఫరా గొలుసులో తీవ్ర అంతరాయం ఏర్పడిందని పేర్కొంటూ మరో కార్ల తయారీ సంస్థ హోండా తన ప్లాంట్ను మూసివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు పాక్కు గుడ్బై చెబుతుండగా, ఈ జాబితాలో తాజాగా ఆటోమొబైల్ దిగ్గజం హోండా కూడా చేరింది. ప్రస్తుతం పాక్లోని హోండా అట్లాస్ కార్స్ పేరుతో కార్లను అసెంబుల్ చేస్తోంది. దేశంలోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే మూసివేతకు కారణమని ప్రకటించింది. జియో న్యూస్ ప్రకారం మార్చి 9 నుంచి 31 వరకు హోండా తన ఫ్లాంట్ను మూసివేయనుంది. పాక్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఉత్పత్తిని కొనసాగించలేని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి స్టాక్ఎక్స్ఛేంజ్కు అందించిన సమాచారంలో కంపెనీ తెలిపింది. ప్రభుత్వం పూర్తి నాక్-డౌన్ కిట్ల దిగుమతి కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్ నిషేధం, ముడిసరుకు, విదేశీ చెల్లింపుల స్తంభన లాంటి చర్యలతో సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతిందని కంపెనీ తెలిపింది. కాగా అధిక ద్రవ్యోల్బణం, పాక్ కరెన్సీ క్షీణత, దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన పాకిస్తాన్ ఆటో పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుందని జియో న్యూస్ నివేదించింది. వాణిజ్య లోటును నియంత్రించేందుకు సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిగుమతుల ఆంక్షలతో ఆటో పరిశ్రమ కూడా దెబ్బతిన్నదని వ్యాఖ్యానించింది. ఉత్పత్తి కార్యకలాపాలు దెబ్బతినడమే కాకుండా కంపెనీలు తమ సీకేడీ మోడళ్ల ధరలను కూడా పెంచాయి, ఇది ఇప్పటికే ప్రజల కొనుగోలు శక్తిని ప్రభావితం చేసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పాక్లోని టయోటా-బ్రాండ్ ఆటోమొబైల్స్కు చెందిన సుకుజీ మోటార్ కంపెనీ (PSMC) ఇండస్ మోటార్ కంపెనీ (IMC) అసెంబ్లర్లు కూడా తమ ఉత్పత్తి ప్లాంట్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. -
హాట్ సమ్మర్లో హోండా కార్లపై కూల్ ఆఫర్స్: ఈ నెల చివరి వరకే!
జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా దేశీయ మార్కెట్లో తమ వాహనాల కొనుగోలుమీద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో హోండా అమేజ్, జాజ్, డబ్ల్యూఆర్-వీ, సిటీ మోడల్స్ ఉన్నాయి. ఈ డిస్కౌంట్స్ ఈ నెల చివరిలోపు కొనుగోలు చేసే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి. హోండా అమేజ్: హోండా కంపెనీ తన అమేజ్ మోడల్ మీద రూ. 26,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 6.89 లక్షలు (ఎక్స్షోరూమ్). ఈ సెడాన్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 88.5 హెచ్పీ పవర్, 110 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా జాజ్: ఇక హోండా జాజ్ విషయానికి వస్తే, దీని ప్రారంభ ధర రూ. 8.01 లక్షలు (ఎక్స్షోరూమ్). ఈ మోడల్ మీద కంపెనీ రూ. 15,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో రూ. 5,000 లాయల్టీ బోనస్ లభిస్తుంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 88.5 హెచ్పీ పవర్, 110 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా డబ్ల్యూఆర్-వీ: హోండా కంపెనీ తన డబ్ల్యూఆర్-వీ మోడల్ మీద రూ. 17,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో రూ. 5,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ. 9.11 లక్షలు (ఎక్స్షోరూమ్). ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 88.5 హెచ్పీ పవర్, 110 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా సిటీ: కంపెనీ పాపులర్ మోడల్ అయిన హోండా సిటీ సెడాన్ కొనుగోలు చేసే కస్టమర్లు ఈ నెలలో రూ. 17,000 వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. ఇందులో రూ. 7,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. దీని ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్షోరూమ్). ఇందులోని 1.5 లీటర్ పెట్రోల్ హైబ్రీడ్ ఇంజిన్ 125 హెచ్పీ పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది, ఇక 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 119.35 హెచ్పీ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ నెలలో పైన తెలిపిన కార్లు కొనుగోలు చేయాలనునే కస్టమర్లు మరింత ఖచ్చితమైన సమాచారం కోసం సమీపంలో ఉన్న కంపెనీ డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
కొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'హోండా సిటీ ఫేస్లిఫ్ట్' భారతీయ మార్కెట్లో విడుదలైంది. ఈ ఐదవ జనరేషన్ ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు, కాగా టాప్-స్పెక్ సిటీ హైబ్రిడ్ ధర రూ. 20.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ అప్డేటెడ్ ఫేస్లిఫ్ట్ ఆధునిక కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. కంపెనీ ఈ కొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే ఆన్లైన్లో బుక్ చేసుకునే కస్టమర్లు రూ. 5,000, డీలర్షిప్లో బుక్ చేసుకునే కస్టమర్లు రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవాలి. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. హోండా సిటీ ఫేస్లిఫ్ట్ వేరియంట్స్ & ధరలు: ఎస్వి: రూ. 11.49 లక్షలు వి: రూ. 12.37 లక్షలు విఎక్స్: రూ. 13.49 లక్షలు జెడ్ఎక్స్: రూ. 14.72 లక్షలు కొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్ బంపర్, గ్రిల్, క్రోమ్ బార్ వంటి వాటిని కలిగి ఎల్ఈడీ లైట్స్, స్వెప్ట్బ్యాక్ టెయిల్ ల్యాంప్ పొందుతుంది. వెనుక వైపు కొత్తగా డిజైన్ చేసిన బంపర్ చూడవచ్చు, అంతే కాకుండా ఈ అప్డేటెడ్ మోడల్ అబ్సిడియన్ బ్లూ పెర్ల్ పెయింట్ షేడ్లో చూడచక్కగా కనిపిస్తుంది. హోండా సిటీ ఫేస్లిఫ్ట్ బేస్ మోడల్ కేవలం మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మాత్రమే వస్తుంది. మిగిలిన మూడు వేరియంట్లు సివిటి గేర్బాక్స్ పొందుతాయి. ఈ కొత్త మోడల్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ADAS ఫీచర్లను పొందుతుంది. కంపెనీ ఇప్పుడు హోండా సిటీ హైబ్రిడ్ వేరియంట్లోని ADAS టెక్నాలజీకి "లో-స్పీడ్ ఫాలో" ఫంక్షన్ అని పిలువబడే ఒక కొత్త ఫీచర్ను జోడించింది. ఇది ముందున్న వాహనానికి దూరంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇందులోని లీడ్ కార్ డిపార్చర్ నోటిఫికేషన్ సిస్టమ్ వల్ల కారు ముందుకు కదిలినప్పుడు డ్రైవర్ను హెచ్చరిస్తుంది. హోండా సిటీ ఫేస్లిఫ్ట్ యాంబియంట్ లైటింగ్, వైర్లెస్ ఛార్జర్ మరియు వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రెయిన్-సెన్సింగ్ వైపర్ వంటి ఫీచర్స్తో పాటు ఆరు ఎయిర్బ్యాగ్లను పొందుతుంది. కంపెనీ ఈ సెడాన్ పెట్రోల్, సిటీ హైబ్రిడ్ రెండింటిపైన మూడు సంవత్సరాలు/అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అందిస్తుంది. దీనిని ఐదు సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. హోండా సిటీ ఫేస్లిఫ్ట్ 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్ 121 బీహెచ్పి పవర్ అందిస్తుంది. హైబ్రిడ్ ఇంజిన్ eCVT ట్రాన్స్మిషన్తో జత చేయబడి ఉంటుంది. కంపెనీ ఈ రెండు ఇంజిన్లను రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ చేసింది. -
చైనా మార్కెట్ కోసం హోండా.. ముచ్చటగా మూడు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'హోండా' చైనీస్ మార్కెట్ కోసం మూడు ఎలక్ట్రిక్ రెట్రో స్కూటర్లను పరిచయం చేసింది. ఈ మూడు స్కూటర్లు సింపుల్ డిజైన్ కలిగి మినిబైకుల మాదిరిగా ఉన్నాయి. ఇవి గతంలో పెట్రోల్ బేస్డ్ మోడల్స్గా అందుబాటులో ఉండేవి. చైనా కోసం రూపొందిన 'కబ్ ఈ (Cub e), డాక్స్ ఈ (Dax e) జూమర్ ఈ (Zoomer e)' ఎలక్ట్రిక్ స్కూటర్లు గతంలో ఎక్కువగా అమ్ముడైన పాపులర్ టూవీలర్స్. ఇవి 1958 నుంచి 2018 వరకు నిరంతరం సిరీస్లో భాగంగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. హోండా కబ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఛార్జ్తో 64 కిమీ రేంజ్, డాక్స్ ఈ 80 కిలోమీటర్లు, జూమర్ ఇ సుమారు 90కి.మీ రేంజ్ అందిస్తుంది. కబ్ ఇ అనేది హోండా కబ్ ఆధారంగా రూపొందించబడింది. ఆ తరువాత ఆధునిక అప్డేట్స్ పొందింది. డాక్స్ ఈ దాని దాని మునుపటి మోడల్స్ ఆధారంగా రూపుదిద్దుకుంది. జూమర్ ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ రక్కస్ స్కూటర్ ప్రేరణ పొందింది. ఇది (రక్కస్) 49 సీసీ ఇంజన్తో అందుబాటులో ఉండేది. అయితే కంపెనీ ఇప్పుడు పరిచయం చేసిన మూడు మోడల్స్ పెట్రోల్ వెర్షన్స్ కాదు, ఇవి పూర్తిగా ఎలక్టిక్ మోపెడ్ స్కూటర్లు. ఇవి చైన్ ఫైనల్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రానికి పవర్ డెలివరీ చేస్తాయి. కొత్త హోండా ఎలక్ట్రిక్ మోపెడ్ స్కూటర్లలో ఛార్జింగ్ అయిపోతే పెడల్ సహాయంతో సైకిల్ మాదిరిగా తొక్కుకుంటూ వెళ్ళవచ్చు. ఈ స్కూటర్ల యొక్క గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. ఇవి కేవలం చైనీస్ మార్కెట్లో మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంటాయి. ఇతర దేశాల్లో విక్రయించే అవకాశం లేదు. -
గుడ్ న్యూస్: భారీ డిస్కౌంట్, ఈ బైక్పై రూ.50వేలు తగ్గింపు!
హోండా మోటార్ సైకిల్ & స్కూటర్ ఇండియా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. బైక్ లవర్స్ను ఆకట్టుకోవడంతో పాటు అమ్మకాలు పెంచుకునేందుకు తాజాగా లాంచ్ చేసిన కొత్త హోండా CB300F నేకెడ్ స్ట్రీట్ఫైటర్ బైక్పై భారీగా డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఏడాది ఆగస్ట్లో సరికొత్తగా హోండా CB300F బైక్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు, ప్రారంభించిన కొన్ని నెలల్లోనే, కంపెనీ ఈ నేక్డ్ స్ట్రీట్ఫైటర్ ధరను రూ.50,000 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ పరిమితి కాలానికే వర్తించనుందని తెలిపింది. భారీ తగ్గింపు! కొత్త హోండా CB300F స్ట్రీట్ఫైటర్ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. అది డీలక్స్ అండ్ డీలక్స్ ప్రో. వాటి ప్రారంభ ధర రూ.2.26 లక్షలు, రూ.2.29 లక్షలు ఉండగా తాజాగా కంపెనీ వాటిపై రూ. 50,000 తగ్గించింది. దీంతో డీలక్స్ ధర రూ. 1.76 లక్షలుకాగా, డీలక్స్ ప్రో వేరియంట్ ధర రూ. 1.79 లక్షలుగా ఉంది. కొత్త ధర ప్రకారం KTM డ్యూక్ 125 అండ్ బజాజ్ డోమినార్ 250 కంటే హోండా సీబీ300F తక్కువ ధరకే లభిస్తుంది. 125 డ్యూక్ ధర రూ.1.78 లక్షలు ఉండగా, హోండా బైక్ ధర రూ. 1.76 లక్షలు ఉంది. హోండా CB300F పవర్లో 293.52cc, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్తో వస్తోంది. ఈ మోటార్ 7,500 RPM వద్ద 24.1 bhp మరియు 5,500 RPM వద్ద 25.6 Nm గరిష్ట టార్క్ను విడుదల చేస్తుంది. ఇంజన్ అసిస్ట్ స్లిప్పర్ క్లచ్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్తో 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో వస్తోంది. -
కార్ల కొనుగోలు దారులకు భారీ షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా కార్ల ధరలను జనవరి 23 నుంచి పెంచుతోంది. మోడల్నుబట్టి ధర రూ.30,000 వరకు అధికం కానుంది. ముడిసరుకు వ్యయాలు దూసుకెళ్లడం, నూతన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారీ చేపడుతుండడం ఇందుకు కారణమని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. కాలుష్యం ఏ మేరకు విడుదల అవుతుందో తెలుసుకునే పరికరాన్ని కార్లలో ఏర్పాటు చేయాలన్న నిబంధన 2023 ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తోంది. ధరలను సవరిస్తున్నట్టు మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, రెనో, కియా ఇండియా, ఎంజీ మోటార్ ఇప్పటికే ప్రకటించాయి. -
రోబోటిక్ వీల్చైర్..శరీరాన్ని వంచితే చాలు..దానంతట అదే వెళ్తుంది!
నడవలేని స్థితి ఎదురైనప్పుడు ఎవరైనా వీల్చైర్ను ఆశ్రయించక తప్పదు. వీల్చైర్లో కూర్చుంటే, వెనుక నుంచి ఎవరో ఒకరు ముందుకు నెడితే తప్ప కదలడం సాధ్యం కాదు. వీల్చైర్ల తయారీలోనూ ఇటీవల అధునాతన మార్పులు వస్తున్నాయి. తాజాగా, జపాన్కు చెందిన బహుళజాతి వాహనాల తయారీ సంస్థ ‘హోండా’ ఈ రోబోటిక్ వీల్చైర్ను రూపొందించింది. మోటార్తో రూపొందించిన కొన్ని వీల్చైర్లను చేతులతో కోరుకున్న దిశకు నడపాల్సి ఉంటుంది. హోండా తయారుచేసిన ఈ వీల్చైర్ మాత్రం చేతులకు శ్రమపెట్టదు. ఇది పూర్తిగా రోబోటిక్ సాంకేతికతతో పనిచేస్తుంది. ఇందులో కూర్చున్న వ్యక్తి ఎటువైపుగా వెళ్లాలనుకుంటే, అటువైపుగా కాస్త శరీరాన్ని వంచితే చాలు. ఇది దానంతట అదే ఆ దిశగా ముందుకు సాగుతుంది. దీనిని స్టార్ట్ చేయాలన్నా, స్థిరంగా నిలపాలన్నా కావలసిన బటన్లు చేతికి అందుబాటులో ఉంటాయి. ‘యూని–వన్’ పేరిట రూపొందించిన ఈ రోబోటిక్ వీల్చైర్ ఇంకా మార్కెట్లోకి విడుదల కావాల్సి ఉంది. -
హోండా, మారుతీ భాగస్వామ్యం: ఎందుకంటే?
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా తాజాగా స్క్రాపింగ్, రీసైక్లింగ్ కంపెనీ మారుతీ సుజుకీ టొయొట్సుతో చేతులు కలిపింది. హోండా కార్ల యజమానులు తమ వాహనాలను సులభంగా స్క్రాపింగ్, పాత వాహనాల డీరిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ పొందవచ్చు. ఇందుకోసం హోండా డీలర్షిప్ కేంద్రాలను వినియోగదార్లు సంప్రదించాల్సి ఉంటుంది. గడువు తీరిన వాహనాల స్క్రాపింగ్ సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మారుతీ సుజుకీ టొయొట్సు ఆమోదం పొందింది. చదవండి : షాకింగ్: 5.4 మిలియన్ల ట్విటర్ యూజర్ల డేటా లీక్! మస్క్ స్పందన ఏంటి? ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు బంపర్ ఆఫర్ -
కీలక మైలురాయిని అధిగమించిన హోండా కార్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా కొత్త మైలురాయిని అధిగమించింది. దేశీయంగా మొత్తం 20 లక్షల కార్లను ఉత్పత్తి చేసినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. 20లక్షల మార్క్గా ప్రీమియం సెడాన్ హోండా సిటీ కారును విడుదల చేసింది. ఇదీ చదవండి : మారుతి స్విఫ్ట్-2023 కమింగ్ సూన్: ఆకర్షణీయ, అప్డేటెడ్ ఫీచర్లతో భారత్లో రాజస్తాన్లోని టపూకరా వద్ద సంస్థకు ప్లాంటు ఉంది. 1997 డిసెంబర్లో ఉత్పత్తి ప్రారంభం అయింది. దేశంలో ఇప్పటి వరకు హోండా రూ.10,000 కోట్లను వెచ్చించింది. సిటీ, అమేజ్ మోడళ్లను 15కుపైగా మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. ప్లాంటు సామర్థ్యం ఏటా 1,80,000 యూనిట్లుగా ఉంది. కాగా భారతదేశంలోని తన వినియోగదారుల కోసం ప్రీమియం, ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందించడంపై దృష్టి సారించి కార్యకలాపాలను ప్రారంభించామనీ,"మేక్ ఇన్ ఇండియా" విజన్లో భాగంగా 2 మిలియన్ల మైలురాయిని దాటామని కంపెనీ ప్రకటించింది. భారత్లో 2 మిలియన్ల కార్ల ఉత్పత్తి అనే చారిత్రాత్మక మైలురాయి దాటడం అంటే గత 25గా 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి హోండా నిబద్ధతకు నిదర్శమ ని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ టకుయా సుమురా తెలిపారు. ఇదీ చదవండి : పలు మోడళ్ల హోండా కార్లపై భారీ తగ్గింపు -
పలు మోడళ్ల హోండా కార్లపై భారీ తగ్గింపు
న్యూఢిల్లీ: పలు మోడళ్ల హోండా కార్లపై భారీ తగ్గింపు లభిస్తోంది. హోండా సిటీ, జాజ్, WR-V లాంటి మోడల్స్ రూ. 63,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. నవంబరు నెలకు సంబంధించిన ఈ డీల్స్ కస్టమర్లు తమకు సమీపంలో ఉన్న డీలర్షిప్ను సంప్రదించడం ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దేశంలో ఐదు విభిన్న హోండా మోడల్లు అందుబాటులో ఉన్నాయి: అమేజ్, సిటీ (5వ తరం), సిటీ (4వ తరం), జాజ్ , WR-బలతో సహా ఐదు విభిన్న మోడళ్లను అందిస్తుంది. హోండా డబ్యుఆర్-వీ డబ్యుఆర్-వీ కి అతిపెద్ద తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 30,000 నగదు తగ్గింపు లేదా రూ. 36,144 విలువైన ఉచిత యాక్సెసరీలున్నాయి. అలాగే రూ. 7,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 లాయల్టీ బోనస్లు తదితరాలు ఉన్నాయి. హోండా అమేజ్ సబ్-కాంపాక్ట్ సెడాన్ హోండా అమేజ్ కొనుగోలుపై కస్టమర్లు రూ. 10,000 నగదు, లేదా రూ. 11,896 విలువైన ఉచిత యాక్సెసరీలను పొంద వచ్చు, అదనంగా రూ. 5,000 లాయల్టీ ఇన్సెంటివ్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు లభ్యం. హోండా జాజ్: త్వరలోనే ఉత్పత్తిని నిలిపివేయాలని భావిస్తున్న హోండా జాజ్పై 25 వేల తగ్గింపు లభ్యం. హోండా సిటీ (5వ జనరేషన్ : హోండా సిటీ మాన్యువల్పై రూ. 59,292 మొత్తం తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 30వేల నగదు తగ్గింపు లేదా రూ. 32,292 విలువైన ఉచిత యాక్సెసరీలు, ఇంకా ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ తగ్గింపును కూడా అందిస్తోంది. -
ఎలక్ట్రిక్ వాహనాల్లోకి సోనీ
టోక్యో: ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వినోద రంగంలో ఉన్న జపాన్ సంస్థ సోనీ.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం వాహన తయారీ దిగ్గజం హోండాతో చేతులు కలిపింది. సోనీ హోండా మొబిలిటీ పేరుతో ఏర్పాటైన కంపెనీ 2025 నాటికి తొలి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనుంది. డెలివరీలు 2026 నుంచి మొదలు కానున్నాయి. తొలుత యూఎస్ మార్కెట్లో ఇవి రంగ ప్రవేశం చేయనున్నాయి. ఆ తర్వాత జపాన్, యూరప్లో అడుగుపెడతాయని సోనీ హోండా మొబిలిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యసుహిదె మిజూనో వెల్లడించారు. పూర్తిగా కొత్తదనం ఉట్టిపడేలా రూపొందిస్తామన్నారు. యూఎస్లోని హోండా ప్లాంటులో ఈవీలను తయారు చేస్తారు. అయితే ఇది ఒక ప్రత్యేక మోడల్ అని, భారీ విక్రయాల కోసం ఉద్దేశించి తయారు చేయడం లేదని కంపెనీ అధికారులు తెలిపారు. చెరి 50 శాతం వాటాతో సంయుక్త భాగస్వామ్య కంపెనీ స్థాపించాలని 2022 మార్చిలో సోనీ గ్రూప్ కార్పొరేషన్, హోండా అంగీకరించాయి. ఇమేజింగ్, నెట్వర్క్, సెన్సార్, వినోద నైపుణ్యంతో సోనీ.. వాహనాలు, మొబిలిటీ టెక్నాలజీ, అమ్మకాలలో హోండాకు ఉన్న నైపుణ్యాన్ని ఒకచోట చేర్చే ఆలోచనతో ఇరు సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. రెండేళ్ల క్రితం లాస్ వెగాస్లో జరిగిన సీఈఎస్ గ్యాడ్జెట్ షోలో సోనీ ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ను ప్రదర్శించింది. -
పొరపాటున అడిషనల్ బోనస్: ఉద్యోగుల కుటుంబాల్లో చిచ్చు
న్యూఢిల్లీ: జపాన్ కార్ మేకర్ హోండా తప్పులో కాలేసింది. ఓహియో-ఆధారిత మేరీస్విల్లే ఫ్యాక్టరీలోని ఉద్యోగులకు చెల్లించాల్సిన బోనస్లో అనుకోకుండా అదనపు మొత్తంలో చెల్లించింది. ఆలస్యంగా పొరపాటు గ్రహించిన సంస్థ అదనంగా చెల్లించిన సొమ్మను ఇచ్చేయాలంటూ తన ఉద్యోగులకు మెమోలు జారీ చేసింది. తాజా పరిణామంతో అవాక్కయిన ఉద్యోగులు చేతికొచ్చిన సొమ్ములు ఎలా ఇవ్వాలో తెలియక తికమకలో పడిపోయారు. మరోవైపు ఉద్యోగులు డబ్బులువాపస్ ఇస్తారా లేదా, లేదంటే భవిష్యత్తు బోనస్లో కట్ చేసుకోవాలో తేల్చుకోలేక హోండా అధికారులు తలలు పట్టుకున్నారు. (SpiceJet Salary Hikes: సంచలనం,పైలట్లకు 20 శాతం జీతం పెంపు!) సెప్టెంబరు 22 వరకు వారు చెల్లించాల్సిన మొత్తాన్ని భవిష్యత్ చెల్లింపుల నుండి తీసుకోవాలా, భవిష్యత్ బోనస్లో మినహాయించుకోవాలా లేదా ముందుగా చెల్లిస్తారా మీరే తేల్చుకోమని ఉద్యోగులను కోరింది. ఈ విషయాన్ని హోండా ప్రతినిధి కూడా ధృవీకరించింది. అయితే సున్నితమైన ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఉద్యోగులు డబ్బును తిరిగి చెల్లించకపోతే హోండా చట్టపరమైన మార్గంలో వెళ్లవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఉద్యోగుల కుటుంబాల్లో ఆగ్రహాలు దీనిపై ఉద్యోగుల కుటుంబాల్లో అగ్రహాలువ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని అందరూ మేనేజ్ చేయలేరంటూ ఒక హోండా ఉద్యోగి భార్య వాపోయారు. తన భర్తకు వచ్చిన బోనస్లో 8 శాతం తిరిగి ఇవ్వాలంటే.. వందల డాలర్లు ఆమెపేర్కొన్నారు. అది మాకు కారు చెల్లింపు. అది మా తనఖాలో సగం, రెండు, మూడు వారాల విలువైన కిరాణా.. ఈ డబ్బు చాలా విలువైంది..చెల్లించాలంటే కష్టం మరొకరు వ్యాఖ్యానించారు. -
ఎస్యూవీల్లోకి హోండా రీఎంట్రీ: వచ్చే ఏడాది కొత్త మోడల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా కార్స్.. భారత ప్యాసింజర్ కార్ల మార్కెట్లో 50 శాతం వాటా కలిగి ఉన్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్యూవీ) విభాగంలోకి తిరిగి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా ఇక్కడి విపణిలో వ్యాపారం తిరిగి వృద్ధి బాటలోకి వస్తుందని హోండా కార్స్ ఇండియా ఆశిస్తోంది. ఎస్యూవీ విభాగంలో ఉత్పత్తుల కొరత అమ్మకాల పరిమాణం, మార్కెట్ వాటా తగ్గడానికి దారితీసింది. కొత్త ఎస్యూవీ మోడల్ అభివృద్ధి దాదాపు పూర్తి అయింది. ప్రస్తుతం ఈ కారు తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఎస్యూవీలైన సీఆర్-వి, బీఆర్-వి, మొబిలియో మోడళ్ల ఉత్పత్తిని ఇప్పటికే కంపెనీ నిలిపివేసింది. డబ్ల్యూఆర్-వి, జాజ్ ఎస్యూవీలతోపాటు నాల్గవ తరం సిటీ సెడాన్ మోడళ్లు 2023 మార్చి నుంచి కనుమరుగు కానున్నాయి. ప్రస్తుతం భారత్లో సెడాన్స్ అయిన సిటీ హైబ్రిడ్, అయిదవతరం సిటీ, కాంపాక్ట్ సెడాన్ అమేజ్ కార్ల అమ్మకాలపైనే కంపెనీ ఆధారపడింది. నిష్క్రమించే ఆలోచనే లేదు.. హోండా అంతర్జాతీయంగా 2030 నాటికి 30 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఏటా 20 లక్షల ఈ–కార్లు తయారు చేయాలన్నది సంస్థ లక్ష్యం. వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వెళ్లాలని హోండా నిర్ణయించుకుంది. భారత్తో సహా కొన్ని దేశాల్లో ప్లాంట్లు మూతపడ్డాయి. ఇప్పుడు పటిష్ట స్థితిలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. ‘నాల్గవ అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారత్ నుంచి నిష్క్రమించే ఆలోచనే లేదు. రెండు దశాబ్దాలుగా కార్య కలాపాలు సాగించాం. తప్పుకోవడానికి కారణమే లేదు. ఇక్కడ కొనసాగుతాం’ అని స్పష్టం చేసింది. -
హోండా సీబీ300ఎఫ్ బైక్ లాంచ్, ధర ఎంతంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ)తాజాగా సీబీ300ఎఫ్ బైక్ను ఆవిష్కరించింది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. డీలక్స్ ధర రూ. 2.25 లక్షలు కాగా డీలక్స్ ప్రో ధర రూ. 2.28 లక్షలుగా (ఢిల్లీలో ఎక్స్షోరూం) ఉంటుంది. బిగ్వింగ్ షోరూమ్లలో ఈ బైక్ను బుక్ చేసుకోవచ్చని హెచ్ఎంఎస్ఐ ఎండీ అత్సుషి ఒగాటా తెలిపారు. 293 సీసీ ఇంజిను, అధునాతన ఆయిల్–కూలింగ్ టెక్నాలజీ, స్మార్ట్ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టం తదితర ప్రత్యేకతలు ఈ బైక్లో ఉన్నాయి. -
మూడు మోడళ్లకు హోండా స్వస్తి
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా 2023 మార్చి నాటికి మూడు మోడళ్లకు స్వస్తి పలుకుతోంది. వీటిలో జాజ్, డబ్యుఆర్–వీ, నాల్గవతరం సిటీ ఉన్నాయి. సమాచారం ప్రకారం.. హోండా ఇండియా అక్టోబర్ 2022 తర్వాత జాజ్, మార్చి 2023 తర్వాత హోండా డబ్యుఆర్–వీ మోడళ్లతో పాటు కంపెనీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్లలో ఒకటైన- హోండా సిటీ (నాల్గవతరం ) కూడా డిసెంబర్ 2022 నాటికి ఉత్పత్తిని కూడా నిలిపివేయనుంది. దీని ప్రకారం దేశీయ మార్కెట్లో ఇకపై హోండా కేవలం సిటీ హైబ్రిడ్, అయిదవతరం సిటీ, అమేజ్ మోడళ్లను మాత్రమే విక్రయించనుంది. అలాగే ఎస్యూవీలను భారత్లో ప్రవేశపెట్టనుంది. గ్రేటర్ నోయిడా ప్లాంటును మూసివేసిన తర్వాత 2020 డిసెంబర్ నుంచి సివిక్, సీఆర్–వీ మోడళ్ల ఉత్పత్తిని హోండా కార్స్ నిలిపివేసింది. కొత్త కంపెనీల రాకతో సంస్థ మార్కెట్ వాటా క్రమంగా తగ్గుతూ వస్తోంది. చదవండి: Amazon: అమెజాన్ చరిత్రలో తొలిసారి..లక్షమంది ఉద్యోగులపై వేటు! -
మోస్ట్ పవర్ఫుల్ హోండా 2023 సివిక్ టైప్-ఆర్ ఆవిష్కారం
సాక్షి, ముంబై: హోండా కొత్త సివిక్ వాహనాన్ని లాస్ ఏంజిల్స్లో గ్లోబల్గా ఆవిష్కరించింది. ‘హెండా సివిక్ టైప్-ఆర్ 2023’ను పరిచయం చేసింది. త్వరలోనే వీటి ధరలు, ఫీచర్లు వెలుగులోకి రానున్నాయి. 30 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత శక్తివంతమైన ఆర్ బ్రాండెడ్ మోడల్ అని హోండా వెల్లడించింది. కొత్త హోండా సివిక్ టైప్ -ఆర్ 11వ-తరం సివిక్ హ్యాచ్బ్యాక్పై ఆధారపడి ఉంది. 2023 సివిక్ టైప్ R 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ను జోడించనుంది. డిజైన్ పరంగా రీడిజైన్ చేసిన బాడీవర్క్తో వస్తుంది. , రీడిజైన్ లోయర్ గ్రిల్, ఫ్రంట్ బంపర్పై ఎయిర్ వెంట్లు బానెట్ డిజైన్, మిచెలిన్ పైలట్ స్పోర్ట్ 4S టైర్లు, తేలికపాటి 19-అంగుళాల అల్లాయ్ వీల్స్తో దీన్ని రూపొందించింది. టైప్ R 10.2-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, డిజిటల్ కాక్పిట్, రెడ్ టైప్ R ట్రిమ్తో కూడిన స్పోర్ట్స్ సీట్లు , గ్రాఫిక్ ఇంజిన్ rpm డిస్ప్లే, రెవ్ ఇండికేటర్ లైట్లు, గేర్ పొజిషన్ ఇండికేటర్ లాంటి స్పెషల్ ఫీచర్లతో స్పెషల్ డిజైన్తో రానుంది. హిస్టారిక్ ఛాంపియన్షిప్ వైట్, ర్యాలీ రెడ్, బూస్ట్ బ్లూ, క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ & సోనిక్ గ్రే పెర్ల్. ఐదు రంగుల్లో ఆకర్షణీయంగా లాంచ్ కానుంది. It’s here. Get your first look at the all-new 2023 #CivicTypeR, officially unveiled in North America. Learn more: https://t.co/fAHw276zgl pic.twitter.com/iM5CznMf6W — Honda (@Honda) July 21, 2022 -
హోండా నుంచి న్యూ మోడల్ కారు
సాక్షి, హైదరాబాద్: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ కొత్త మోడల్ కారును లాంచ్ చేసింది. నాగోల్ గ్రీన్ హోండా షోరూమ్ వద్ద బుధవారం ‘ఈ–హెవ్’ మోడల్ కారును హైదరాబాద్ మెట్రోవాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు (హెచ్ఎమ్ఎస్ఎస్) ఎండీ ఎం.దానకిశోర్ లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో సీఈఓ వివేకానంద ఆర్యశ్రీ, సేల్స్ హెడ్ శ్రీధర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోండా ‘న్యూ సిటీ ఈ–హెవ్’ దేశంలో మొదటి బలమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనమని చెప్పారు. మెయిన్ స్ట్రీమ్ సెగ్మెంట్లో విప్లవాత్మక స్వీయ–ఛార్జింగ్తో అత్యంత సమర్థవంతంగా పని చేస్తోందన్నారు. గత నెల 14 నుంచి బుకింగ్ మొదలు కాగా, ఈ నెలలో అమ్మకాలను ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు. దీని పనితీరు, సామర్ధ్యం ప్రాముఖ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. (చదవండి: యూట్యూబ్ క్రియేటర్లకు గూగుల్ భారీ షాక్!) -
హోండా ఎలక్ట్రిక్ టూ వీలర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న హోండా మోటార్సైకిల్, స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ఎలక్ట్రిక్ మోడల్స్ను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. అలాగే తక్కువ ధరలో లభించే 100 సీసీ బైక్స్ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ‘ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించే ద్విచక్ర వాహనాల అభివృద్ధిలో నిమగ్నం కావాలని కృతనిశ్చయంతో ఉన్నాం. వీటికి ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీని అనుసంధానిస్తాం. ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రవేశపెట్టడంపై ప్రస్తుతం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నాం. 40 దేశాలకు భారత్ నుంచి ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేస్తున్నాం. మరిన్ని దేశాల్లో అడుగుపెడతాం. 2030 నాటికి ఏటా 10 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించాలన్నది లక్ష్యం. అంటే మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 30 శాతం ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధితో 40 లక్షల యూనిట్లు విక్రయించే అవకాశం ఉందని హోండా తెలిపింది. చదవండి: పెట్రోల్ ధరలకు విరుగుడు.. ఫ్లెక్స్ ఇంజన్తో వస్తోన్న హోండా బైక్ -
పెట్రోల్ ధరలకు విరుగుడు.. ఫ్లెక్స్ ఇంజన్తో వస్తోన్న హోండా బైక్
పెట్రోలు ధరలు సామాన్యులనే కాదు సంపన్నులను ఇబ్బంది పెడుతున్నాయి. రెండేళ్లలో లీటరు పెట్రోలు ధర రమారమి రూ.50 వంతున పెరిగింది. దీంతో పెట్రోలు వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు జనాలు మళ్లుతున్నారు. ఈ తరుణంలో మరో ఐడియాతో వచ్చింది హోండా మోటర్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా సంస్థ. పెట్రోలుతో పాటు ఇథనాల్తో నడిచే ఫ్లెక్స్ ఇంజన్ను ఉపయోగిస్తూ బైక్ను ఇండియా మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్నట్టు హోండా ప్రకటించింది. అంటే హోండా త్వరలోనే మార్కెట్లోకి తెచ్చే ఫ్లెక్స్ ఇంజన్ స్కూటర్ ఇటు పెట్రోలుతో పాటు అటు ఇథనాల్ ఇంధనంతో కూడా నడుస్తుంది. హోండా సంస్థ 2009లోనే టైటాన్ సీజీ ఫ్లెక్స్ పేరుతో ఓ బైకు విదేశీ మార్కెట్లో రిలీజ్ చేసింది. అయితే అప్పుడు పెట్రోలు ధరలు అదుపులోనే ఉండటంతో అంతగా క్లిక్ కాలేదు. ఇండియాలో సాగు రంగంలో చెరుకు బాగా ఉత్పత్తి అవుతోంది. చెరుకు పంట నుంచి బై ప్రోడక్టుగా భారీ ఎత్తున ఇథనాల్ తయారు చేసే అవకాశం ఉంది. దీంతో ఇటు రైతులకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు పెట్రోలు నుంచి ఉపశమనం కలిగించేందుకు ఫ్లెక్స్ ఇంజన్లతో కూడిన వాహనాలు తయారు చేయాలంటూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఇప్పటికే అనేక సంస్థలకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే టీవీఎస్ సంస్థ ఫ్లెక్స్ ఇంజన్తో అపాచీ ఆర్టీఆర్ 200 ఎఫ్ఐ ఈ100 బైకును మార్కెట్లోకి తెచ్చింది. ఆ తర్వాత హోండా సంస్థ నుంచి మరో బైక్ మార్కెట్లోకి రాబోతుంది. లీటరు పెట్రోలు ధరతో పోల్చినప్పుడు సగం ధరకే ఇథనాల్ లభిస్తుంది. అంతేకాక రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. చదవండి: ‘ఫ్లెక్స్ ఇంధనాల’ ఇంజిన్లపై త్వరలో ఆదేశాలు -
హోండా బంపరాఫర్..! ఆ బైక్పై ఏకంగా రూ. 10 లక్షల తగ్గింపు..!
స్పోర్ట్స్ బైక్ ప్రియులకు ప్రముఖ టూవీలర్ దిగ్గజం హోండా బంపరాఫర్ను ప్రకటించింది. హోండా పోర్ట్ఫోలియోలోని ఫ్లాగ్షిప్ మోటార్సైకిల్ హోండా CBR1000RR-R ఫైర్బ్లేడ్ ధరలను గణనీయంగా తగ్గించింది. 2020లో హోండా CBR1000RR-R ఫైర్బ్లేడ్-2020 బైక్ను భారత్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. హోండా CBR1000RR-R ఫైర్బ్లేడ్ లాంచ్ ధర రూ. 32.68 (ఎక్స్-షోరూమ్ ధర) లక్షలుగా ఉంది. ప్రస్తుతం ఈ బైక్పై ప్రకటించిన తగ్గింపుతో ఇప్పుడు హోండా CBR1000RR-R ఫైర్బ్లేడ్ బైక్ రూ. 23.11 లక్షలకు రిటైల్ కానుంది. దాదాపు రూ. 10 లక్షల తగ్గింపును హోండా ప్రకటించింది. ధర తగ్గింపుపై హోండా ఎలాంటి ప్రకటన చేయలేదు. కంపెనీ అధికారిక బిగ్వింగ్ ఇండియా వెబ్సైట్లో హోండా CBR1000RR-R ఫైర్బ్లేడ్ బైక్ కొత్త ధరతో కన్పిస్తోంది. హోండా CBR1000RR-R ఫైర్బ్లేడ్ బైక్ రెండు కలర్ వేరియంట్లలో రానుంది. బ్లాక్, రెడ్ కలర్ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. హోండా CBR1000RR-R ఫైర్బ్లేడ్ అత్యంత శక్తివంతమైన ఫైర్బ్లేడ్ బైక్ నిలుస్తోంది. ఈ బైక్లో 1000cc, లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, DOHC, ఇన్లైన్-4 సిలిండర్ ఇంజన్ను అమర్చారు. హోండా CBR1000RR-R ఫైర్బ్లేడ్ 14,500 RPM వద్ద 214.5 hp గరిష్ట శక్తిని, 12,500 RPM వద్ద 113 Nm గరిష్ట టార్క్ను విడుదల చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో జత చేయబడింది. ఇది హోండాకు చెందిన సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC)ని కూడా పొందుతుంది. చదవండి: హల్చల్ చేస్తోన్న మారుతి సుజుకీ వ్యాగన్ఆర్ నయా మోడల్..! ధర ఎంతంటే..? -
కొత్తగా హోండా ఆఫ్రికా ట్విన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా మోటార్సైకిల్, స్కూటర్ ఇండియా ఆధునీకరించిన ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్ ను ఆవిష్కరించింది. ఎక్స్షోరూంలో ధర రూ.16 లక్షలు. డ్యూ యల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ట్రిమ్ ధర రూ.17.55 లక్షలు ఉంది. 1,083 సీసీ ఇంజిన్తో ఇది తయారైంది. 2–చానెల్ ఏబీఎస్, హోండా సెలక్టేబుల్ టార్క్ కంట్రోల్, బ్లూటూ త్ కనెక్టివిటీ వంటి హంగులు ఉన్నాయి. 2017లో భారత్లో ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్ను కంపెనీ పరిచయం చేసింది. -
కొత్త కారు కొనేవారికి బంపరాఫర్.. హోండా కార్లపై భారీగా డిస్కౌంట్!
కొత్త కారు కొనేవారికి హోండా శుభవార్త అందించింది. హోండా కంపెనీ మార్చి నెలలో కూడా తమ కార్లపై డిస్కౌంట్ అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్లు నెల చివరి వరకు అందుబాటులో ఉండనున్నాయి. హోండా అమేజ్, హోండా సిటీ 5వ జనరేషన్, హోండా సిటీ 4వ జనరేషన్, హోండా డబ్ల్యుఆర్-వీ, హోండా జాజ్ కార్లపై డిస్కౌంట్ అందిస్తుంది. కారు మోడల్ & వేరియంట్ బట్టి డిస్కౌంట్ ₹35,596 వరకు లభిస్తుంది. 5వ జనరేషన్ కాంపాక్ట్ సెడాన్ హోండా సిటీ మీద ₹35,596 అత్యధిక డిస్కౌంట్ అందిస్తుంది. ఇంతక ముందు హోండా ఇదే మోడల్ కారుపై దాదాపు ₹36,000 డిస్కౌంట్ ఇచ్చింది. హోండా సిటీ 5వ జనరేషన్ కారుపై డిస్కౌంట్ లో భాగంగా ₹10,000 వరకు నగదు డిస్కౌంట్, కారు ఎక్స్ఛేంజ్ కింద ₹5000, హోండా కస్టమర్ లాయల్టీ బోనస్ ₹5000, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ ₹7000, అలాగే ₹8000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. హోండా సిటీ 4వ జనరేషన్ కారు మీద కూడా ₹20000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. వీటిలో హోండా కస్టమర్ లాయల్టీ బోనస్ కింద ₹5000, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ కింద ₹7000, కార్పొరేట్ డిస్కౌంట్ కింద ₹8000 ఉన్నాయి. హోండా ప్రీమియం హ్యాచ్బ్యాక్ జాజ్ మీద ₹33,158 రెండవ అత్యధిక డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో రూ.10,000 వరకు నగదు డిస్కౌంట్ లేదా ₹12,158 వరకు ఎఫ్ఓసీ యాక్ససరీస్, రూ.5,000 విలువైన కారు ఎక్స్ఛేంజ్'పై డిస్కౌంట్, ₹5,000 హోండా కస్టమర్ లాయల్టీ బోనస్, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.7,000, కార్పొరేట్ డిస్కౌంట్ ₹4,000 వరకు ఉన్నాయి. హోండా సబ్ కాంపాక్ట్ ఎస్యువి డబ్ల్యుఆర్-వీ హోండా మోడల్స్ మీద దాదాపు ₹26,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ అన్ని హోండా డబ్ల్యుఆర్-వీ పెట్రోల్ వేరియంట్, గ్రేడ్'లపై చెల్లుబాటు అవుతుంది. దీనిలో ₹10,000 విలువైన కారు ఎక్స్ఛేంజ్, హోండా కస్టమర్ లాయల్టీ బోనస్ కింద ₹5,000, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ కింద ₹7,000, కార్పొరేట్ డిస్కౌంట్ ₹4,000 వరకు ఉన్నాయి. హోండా అమేజ్ సబ్ కాంపాక్ట్ సెడాన్ అన్ని వేరియెంట్ల మీద ₹15,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్'లో హోండా కస్టమర్ లాయల్టీ బోనస్ కింద ₹5,000, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ ₹6,000, కార్పొరేట్ డిస్కౌంట్ కింద ₹4,000 ఇస్తున్నట్లు తెలిపింది. ఈ జపనీస్ కార్ల తయారీసంస్థ జనవరిలో తన అమ్మకాల్లో మూడు శాతం తగ్గినట్లు పేర్కొంది. గత జనవరి నెలలో 12,149 యూనిట్లు విక్రయించినట్లు సంస్థ తెలిపింది. ఏడాది క్రితం ఇదే నెలలో కంపెనీ మొత్తం 12,552 యూనిట్లను విక్రయించింది. 2021 జనవరిలో 11,319 యూనిట్ల దేశీయ అమ్మకాలతో పోలిస్తే జనవరిలో 10,427 యూనిట్లు అమ్మినట్లు పేర్కొంది. (చదవండి: Joy E-Bike: 500 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.115 ఖర్చు..!) -
హోండా బంపరాఫర్..! ఆ బైక్పై ఏకంగా రూ. లక్ష తగ్గింపు..!
ప్రముఖ టూవీలర్ దిగ్గజం హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) మిడ్వెయిట్ అడ్వెంచర్ బైక్పై ఏకంగా రూ. లక్షకు పైగా ధరను తగ్గించింది. హోండా మోటార్స్లోని సీబీ500ఎక్స్ బైక్ ధరలను కంపెనీ సవరించింది. సవరించిన ధరలు ఇలా..! గత ఏడాది మార్చి 2021లో హోండా CB500X బైక్ హోండా భారత్ మార్కెట్లలో లాంచ్ చేసింది. ఈ మోటార్సైకిల్ ధర రూ. 1.08 లక్షల తగ్గింపును పొందింది. దీంతో రూ. 5.79 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. కొద్దిరోజుల క్రితం హోండా సీబీ500ఎక్స్ పూర్తిగా కొత్త హాంగులతో తొలుత యూరప్ మార్కెట్లలోకి వచ్చింది. ఈ మోడల్ భారత్లో త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త మోడల్ను ప్రవేశపెట్టే క్రమంలో పాత హోండా CB500X మోడల్ ధరను తగ్గించినట్లు తెలుస్తోంది. ఇంజిన్ విషయానికి వస్తే.. హోండా సీబీ500ఎక్స్ బైక్లో 471 cc సమాంతర-ట్విన్ సిలిండర్, 8-వాల్వ్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ను ఏర్పాటు చేశారు. ఇది 8,500 rpm వద్ద 47 bhp సామర్థంతో, 6,500 rpm వద్ద 43.2 Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్లో 6-స్పీడ్ గేర్బాక్స్ను జత చేశారు. ఈ బైక్ ప్రస్తుతం గ్రాండ్ ప్రిక్స్ రెడ్ మరియు మ్యాట్ గన్పౌడర్ బ్లాక్ మెటాలిక్ అనే రెండు రంగులలో అందుబాటులో ఉంది. చదవండి: స్కూటర్ల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన యహహా మోటార్స్..! -
ట్వీట్ రగడ.. క్షమాపణలు చెప్పిన హోండా, డొమినోస్
కాశ్మీర్లోని ఏర్పాటువాదులకు మద్దతు ఇస్తూ పాకిస్తాన్లోని తమ వ్యాపార డీలర్లు సోషల్ మీడియా పెట్టిన పోస్టుల వల్ల భారతీయుల మనోభావాలు దెబ్బతిన్నందుకు తాము భారత దేశానికి క్షమాపణలు తెలియజేస్తున్నాము అని డొమినోస్, ప్రముఖ జపనీస్ ఆటో మొబైల్ తయారీ సంస్థ హోండా పేర్కొన్నాయి. ఒక సోషల్ మీడియా పోస్టులో.. "మేము ఈ దేశంలో 25 సంవత్సరాలకు ఉన్నాము. ఈ దేశ ప్రజలు, సంస్కృతి, జాతీయతా స్ఫూర్తిపట్ల మాకు అత్యంత గౌరవం ఉంది. ఈ దేశ ఔన్నత్యాన్ని మేము గౌరవిస్తున్నాము. దేశం వెలుపల నుంచి డొమినోస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రచురితమైన అవాంఛనీయ సోషల్ మీడియా పోస్టులకు మేము క్షమాపణలు కోరుతున్నాం. ఒక బ్రాండ్గా మేము భారతదేశాన్ని గౌరవిస్తాము, ఈ దేశ వినియోగదారులకు & సమాజానికి వినయ, విధేయతలతో సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాము" అని డొమినోస్ కంపెనీ తెలిపింది. This is the country we have called our home for the last 25 years, and we stand here to protect its legacy forever. We respect and honour everything the country has to offer. pic.twitter.com/8II6XuLxb0 — dominos_india (@dominos_india) February 8, 2022 అదేవిధంగా, హోండా కార్ ఇండియా ట్విటర్ హ్యాండిల్స్ పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో "హోండా పనిచేసే ప్రతి దేశంలో అక్కడి చట్టాల, నిబందనలను అనుసరిస్తాము. ఆ దేశ ప్రజల మనోభావాలకు కట్టుబడి ఉంటాము. ఈ విషయంలో దేశ ప్రజలకు ఏదైనా బాధ కలిగితే మేము చింతిస్తున్నాము. తమ కంపెనీ విధానంలో భాగంగా, హోండా ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా, జాతి, రాజకీయాలు, మతం & సామాజిక సమస్యలపై ఎలాంటి వ్యాఖ్యానాలు చేయదు" అని తెలిపింది. ఈ కంపెనీలతో పాటు ఇతర ప్రపంచ స్థాయి సంస్థలు హ్యుందాయ్, సుజుకి, టయోటా, కెఎఫ్సి, పిజ్జా హట్ వంటివి కూడా దేశానికి క్షమాపణలు చెప్పాయి. ఫిబ్రవరి 5న పాకిస్తాన్ దేశంలో కాశ్మీర్ కోసం పోరాడి చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది కశ్మీరీ సంఘీభావ దినాన్ని అక్కడ జరుపుకుంటారు. అయితే, ప్రముఖ ప్రపంచ స్థాయి కంపెనీలన్ని కాశ్మీర్లోని ఏర్పాటువాదులకు మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఆ కంపెనీ ఉత్పత్తులను అన్నీ మన దేశంలో నిషేదించాలని ప్రజలు కేంద్రాన్ని కోరారు. (చదవండి: ఉచితంగా 5 నిమిషాల్లో ఈ-పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి ఇలా..!) -
మళ్లీ అదే అంధకారమా..! తెరపైకి మరోసారి Y2K సమస్య..! ప్రభావమెంతంటే..?
1999 చివరలో ఒక్కసారిగా టెక్ ప్రపంచాన్ని మూగబోయేలా చేసింది Y2K సమస్య. దీని కారణంగా ఎన్నో కంప్యూటర్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు మూలన పడిపోయాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ల ఉద్యోగాలకు ఎసరు పెట్టింది Y2K. తాజాగా ఇలాంటి టెక్ బగ్ ఒకటి మరోకటి వెలుగులోకి వచ్చింది. అప్డేట్ వెర్షన్తో...! Y2K కొత్త ఏడాదితో సరికొత్తగా అప్డేట్ వెర్షన్తో Y2K22 అనే కొత్త బగ్ వచ్చింది. విచిత్రంగా ఈ సమస్య కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. Y2K22 సమస్య యూకే, యూఎస్, కెనడాలో వెలుగు చూసినట్లు వార్తలు వస్తున్నాయి. హోండా, అకురా పాత కార్లలో..! హోండా, అకురా బ్రాండ్స్కు చెందిన ఆయా కారు మోడల్స్లో Y2K22 బగ్ కన్పించినట్లు తెలుస్తోంది. కొత్త ఏడాది 2022 లోకి ప్రవేశించినప్పుడు ఆయా హోండా పాత కార్లలో జనవరి 1, 2022 బదులుగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లి జనవరి 1, 2002 తేదీని చూపించినట్లు యూకేకు చెందిన ఓ నెటిజన్ ట్విటర్లో తెలిపారు. ఈ సమస్య గురించి ఆయా వాహనదారుడు హోండా సంస్థకు నివేదించాడు. ఆయా హోండా, అకురా కార్ మోడల్స్లో సమస్యను వెలుగుచూసిన యాజమానుల ప్రకారం... సమయం, తేదీని సర్దుబాటు చేయడానికి మాన్యువల్ ఓవర్రైడ్ పని చేయడం లేదని నివేదించారు. స్పందించిన కంపెనీ..! నయా Y2K22 సమస్యపై కంపెనీ స్పందిస్తూ త్వరలోనే పరిష్కారం చూపుతామని హోండా వెల్లడించింది. కార్లలోని నావీ క్లాక్ సమస్య గురించి కంపెనీ ఇంజనీర్ బృందాలకు తెలియజేసినట్లు హోండా తెలిపింది. ఈ సమస్య జనవరి 2022 నుంచి ఆగస్టు 2022 వరకు ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అది స్వయంచాలకంగా సరిదిద్దబడుతుందని వెల్లడించింది. కాగా ఈ సమస్య గురించి కంపెనీకి ముందుగానే తెలిసి ఉంటుందని సమాచారం. ప్రభావమెంత..! 2000 సంవత్సరంలో Y2K బగ్ టెక్ ప్రపంచాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టి వేసింది. ఎంతో మంది Y2K సమస్యతో తమ ఉద్యోగులను కూడా పొగోట్టుకున్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు అమెరికా ఏకంగా 100 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టింది. ఈ చిన్న బగ్ అప్పట్లో పీడకల లాగే మిగిలిపోయింది. కాగా ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన Y2K22 సమస్య ప్రభావం తక్కువేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదృష్టవశాత్తూ Y2K22 సమస్య కేవలం తప్పుడు సమయం, తేదీల్లో మాత్రమే సమస్యగా కనిపిస్తోందని తెలుస్తోంది. ఆయా కార్లలో ఇతర ఫంక్షన్లతో పాటుగా, నావిగేషనల్ సిస్టమ్స్ బాగా పనిచేస్తున్నాయని ఆయా వాహనదారులు తెలిపారు. దీంతో Y2K22 ప్రభావం చాలా తక్కువని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త ఏడాది ముందే Y2K22 సమస్యను టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మెయిల్ సేవలకు అంతరాయం కల్గించిన Y2K22 బగ్ను మైక్రోసాఫ్ట్ వెంటనే పరిష్కరించింది. My @Honda 2007 CR-V clock now useless in 2022; resets to 2:00 MST on 1/1/2002 after every startup. 32-bit signed integer overflow of yymmddHHMM? Would unsigned int fix it? This is time-critical. ;-) Thousands of us need a software update! pic.twitter.com/BSGCaxnMmx — Sumner Hushing (@_______shushing) January 4, 2022 చదవండి: కంపెనీలో ఫుడ్ సర్వ్ చేసేవాడు..! ఇప్పుడు ఆ ఒక్కటే అంబానీనే దాటేలా చేసింది...! -
2022లో కొత్త కారు కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్!
మీరు రాబోయే కొత్త సంవత్సరం 2022లో కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక షాకింగ్ న్యూస్. టాటా మోటార్స్, హోండా, రెనాల్ట్ వంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు వచ్చే ఏడాది జనవరి నుంచి వాహన ధరలను పెంచాలని చూస్తున్నాయి. ఇప్పటికే కార్ల మార్కెట్ లీడర్ మారుతి సుజుకి, ఆడీ, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు వచ్చే నెల నుంచి వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించాయి. జనవరి 2022లో ధరల పెరుగుదల అనేది మోడల్స్ బట్టి ఉంటుందని మారుతి చెప్పగా, మెర్సిడెస్ బెంజ్ పెరుగుతున్న ఇన్ పుట్ ఖర్చుల కారణంగా ఎంపిక చేసిన మోడల్స్ కార్లపై ధరల పెంపు అనేది 2 శాతం వరకు ఉంటుందని తెలిపింది. మరోవైపు, ఇన్ పుట్, కార్యాచరణ ఖర్చుల కారణంగా జనవరి 1, 2022 నుంచి అమల్లోకి వచ్చే ధరల పెరుగుదల అనేది మొత్తం మోడల్ శ్రేణిలో 3 శాతం వరకు ఉంటుందని ఆడీ తెలిపింది. ఈ ధరల పెంపు విషయంపై టాటా మోటార్స్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. "సరుకులు, ముడిపదార్థాలు, ఇతర ఇన్ పుట్ ఖర్చుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఖర్చుల పెరుగుదలను కనీసం పాక్షికంగా తగ్గించడానికి ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది" అని అన్నారు. ఈ సంస్థ దేశీయ మార్కెట్లో పంచ్, నెక్సన్, హారియర్ వంటి మోడల్ కార్లను విక్రయిస్తుంది."కమోడిటీ ధరల పెరుగుదల కారణంగా ఇన్ పుట్ ఖర్చుపై తీవ్రమైన ప్రభావం ఉంది. ఎంత వరకు ధరల పెంచాలో అనే దానిపై అధ్యయనం చేస్తున్నాము" అని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. (చదవండి: సామాన్యుడి షాక్..క్యూ కట్టిన బ్యాంకులు..!) సిటీ, అమేజ్ వంటి బ్రాండ్ల తయారీదారు చివరిసారిగా ఈ ఏడాది ఆగస్టులో వాహన ధరలను పెంచింది. ధరల పెరుగుదలను తాము కూడా పరిశీలిస్తున్నట్లు రెనాల్ట్ పేర్కొంది. ఫ్రెంచ్ కంపెనీ క్విడ్, ట్రైబ్ర్, కిగర్ వంటి మోడల్ కార్లను భారతీయ మార్కెట్లో విక్రయిస్తుంది. గత ఏడాది కాలంలో ఉక్కు, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్, విలువైన లోహాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరగడంతో కంపెనీలు ధరల పెంచాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా, ఇటీవలి కాలంలో రవాణా ఖర్చు పెరిగింది, ఇది ఒరిజినల్ ఎక్విప్ మెంట్ తయారీదారుల(ఓఈఎమ్) మొత్తం వ్యయ నిర్మాణాలను ప్రభావితం చేస్తుంది. (చదవండి: Ola Electric Car: ఓలా తొలి ఎలక్ట్రిక్ కారు వచ్చేది అప్పుడే!) -
భారత్లో హోండా మోటార్ బ్యాటరీ మార్పిడి సేవలు..
న్యూఢిల్లీ: భారత్లో విద్యుత్ వాహనాలకు బ్యాటరీ మార్పిడి సర్వీసులు అందించేందుకు జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా మోటార్ కంపెనీ ప్రత్యేకంగా అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. రూ. 135 కోట్ల మూలధనంతో హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియాను నెలకొల్పినట్లు కంపెనీ వివరించింది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ముందుగా బెంగళూరులోని ఎలక్ట్రిక్ ఆటోలకు బ్యాటరీ షేరింగ్ సర్వీసులను ప్రారంభిస్తామని, దశలవారీగా ఇతర నగరాలకు కూడా విస్తరిస్తామని పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి పరిమిత శ్రేణి, చార్జింగ్కు సుదీర్ఘ సమయం పట్టేయడం, బ్యాటరీ ఖరీదు భారీగా ఉండటం తదితర సమస్యలకు వీటితో పరిష్కారం లభించగలదని హోండా తెలిపింది. ç ఇతర సంస్థలతో కూడా కలిసి పని చేస్తామని కంపెనీ వివరించింది. -
2022లో హోండా బ్యాటరీ షేరింగ్ సేవలు
భారతదేశంలో వచ్చే ఏడాది 2022 మొదటి అర్ధభాగంలో ఎలక్ట్రిక్ ఆటో కోసం బ్యాటరీ షేరింగ్ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు హోండా మోటార్ తెలిపింది. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన హోండా మొబైల్ పవర్ప్యాక్ ఎక్స్ఛేంజర్(ఎంపీపీఈ) వ్యవస్థను వినియోగించనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం భారత్లో ప్రత్యేకంగా స్థానిక అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేస్తామని హోండా తెలిపింది. హోండా మొబైల్ పవర్ ప్యాక్ ఎక్స్ఛేంజర్-ఈ నగరాల్లో బ్యాటరీ మార్పిడి స్టేషన్లను ఇన్ స్టాల్ చేసి బ్యాటరీ షేరింగ్ సర్వీస్ అందిస్తుంది. బ్యాటరీ షేరింగ్ సేవల కోసం హోండా ఎలక్ట్రిక్ ఆటో తయారీ కంపెనీలతో కలిసి పనిచేయనుంది. మొదట ఎంపిక చేసిన నగరాల్లో ఈ సేవలను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత దశలవారీగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఒక్కో ఎంపీపీఈ 1.3 కేడబ్ల్యూహెచ్ వరకు విద్యుత్తును నిల్వ చేసుకోగలదు. ఈ బ్యాటరీలు లిథియం-అయాన్ తో తయారు చేయనున్నారు. సుమారు 50.26 వోల్టేజి గల 10.3 కిలోల బ్యాటరీని సుమారు ఐదు గంటల్లో చార్జ్ చేయవచ్చు. భారతదేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సంస్థ ప్రయత్నిస్తుందని తెలిపింది. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్లో సుమారు 20 శాతం వాటా దేశం కలిగి ఉన్నట్లు సంస్థ తెలిపింది. భారతదేశంలో 80 లక్షలకు పైగా ఆటో రిక్షాలు ఉన్నాయి. (చదవండి: ఆహా ఏమి అదృష్టం! ఏడాదిలో కోటీశ్వరులైపోయారు!) హోండా అధ్యయనం ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తులు మూడు సమస్యలను ఎదుర్కొంటున్నాయి: స్వల్ప శ్రేణి, ఎక్కువ ఛార్జింగ్ సమయం, బ్యాటరీల అధిక ఖర్చు. ఈ కొత్త ఎంపీపీఈ వ్యవస్థ ద్వారా ఈ మూడు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భావిస్తుంది. ఈ కేంద్రాల వద్ద భారీ ఎత్తున ఛార్జ్ చేసి పెట్టిన బ్యాటరీలను రిక్షాలు తీసుకొని వెళ్లొచ్చు. తమ వద్ద ఉన్న బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయిన వెంటనే దాన్ని ఎంపీపీ ఈ కేంద్రంలో ఇచ్చి అందుకు సమానమైన ఛార్జింగ్ చేసిన బ్యాటరీని పొందొచ్చు అని సంస్థ తెలిపింది. 2020 ఫిబ్రవరిలోనే ప్రయోగాత్మకంగా ఈ సేవల్ని ప్రారంభించినట్లు హోండా తెలిపింది. ఎంపీపీఈ వ్యవస్థ ద్వారా 30 ఆటోలు ఇప్పటికే 2,00,000 కిలోమీటర్లకు పైగా తిరిగినట్లు హోండా తెలిపింది. (చదవండి: రైతులకు శుభవార్త.. గ్యారంటీ లేకుండా రూ.3 లక్షల రుణం!) -
మార్కెట్లోకి సరికొత్త టీవీఎస్ బైక్ : ధర?
ప్రముఖ బైక్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ మార్కెట్లలోకి మరో కొత్త రైడర్ స్పోర్ట్స్ బైక్ ప్రవేశపెట్టింది. దీని ధర ₹77,500(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ కొత్త టీవీఎస్ బైక్ 125 సీసీ సింగిల్ సిలిండర్ తో వచ్చింది. ఇది బజాజ్ పల్సర్ 125, ది హోండా సీబీ షైన్ ఎస్పీ బైక్లకు పోటీగా 2021 టీవీఎస్ రైడర్ నిలవనుంది. 2021 టీవీఎస్ రైడర్ బైక్ ఎల్ఈడీ డీఆర్ఎల్(డే టైమ్ రన్నింగ్ ల్యాప్స్), అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్స్, మోనో షాక్, ఎల్ఈడీ ల్యాంప్స్తో వచ్చింది. ఈ బైక్లో డిజిటల్ రివర్స్ డిస్ప్లే కూడా ఉంది. స్పోర్టీ లూక్తో 2021 టీవీఎస్ రైడర్ మరింత ఆకర్షణీయంగా ఉంది. రైడర్ టీవీఎస్ స్మార్ట్ క్సోనెక్ట్ వేరియెంట్ తో 5 అంగుళాల టిఎఫ్ టీ క్లస్టర్ తో వస్తుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ అసీస్ట్ అందిస్తుంది. దీనిలో మరింత భద్రత కోసం సీబీబిఎస్ ఆప్షన్ ఇచ్చారు. మోటార్ సైకిల్ 124 సీసీ, సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 11.32 హెచ్పీ శక్తిని, 11.2 ఎన్ఎం టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫైవ్ స్పీడ్ సూపర్-స్లిక్ గేర్బాక్స్ కలిగిన ఈ బైక్ ఈ సెగ్మెంట్లో అత్యంత శక్తిమంతమైనది. ఎకో, పవర్ అనే రెండు రైడింగ్ మోడ్స్ తో వచ్చిన ఇదే మొట్టమొదటి మోటార్ సైకిల్.(చదవండి: దేశంలో ఈ నగరాల మధ్య తొలి ఎలక్ట్రిక్ హైవే!) -
బజాజ్ పల్సర్125కు పోటీగా టీవీఎస్ నుంచి అదిరిపోయే బైక్..!
ప్రముఖ బైక్ల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ మార్కెట్లలోకి మరో కొత్త బైక్ను రిలీజ్ చేయనుంది. కంపెనీ నుంచి రాబోయే బైక్ను టీవీఎస్ తన సోషల్మీడియా ఖాతాలో టీజ్ చేసింది.‘ 2021 టీవీఎస్ రైడర్’ బైక్ను ఈ నెల 16 న అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ బైక్ 125 సీసీ ఇంజన్ సెగ్మెంట్లో రానుందని తెలుస్తోంది. బజాజ్ పల్సర్ 125, ది హోండా సీబీ షైన్ ఎస్పీ బైక్లకు 2021 టీవీఎస్ రైడర్ పోటీగా నిలవనుంది. చదవండి: కియా కా కమాల్... రికార్డు సృష్టిస్తోన్న ఆ మోడల్ కారు అమ్మకాలు టీజర్లో భాగంగా 2021 టీవీఎస్ రైడర్ బైక్కు ముందుభాగంలో ఎల్ఈడీ డీఆర్ఎల్(డే టైమ్ రన్నింగ్ ల్యాప్స్), అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్స్, మోనో షాక్, ఎల్ఈడీ ల్యాంప్స్తో రానున్నట్లు తెలుస్తోంది. బైక్కు డిజిటల్ రివర్స్ డిస్ప్లే కూడా రానుంది. స్పోర్టీ లూక్తో 2021 టీవీఎస్ రైడర్ మరింత ఆకర్షణీయంగా ఉండనుంది. ఈ బైక్ ధర (ఎక్స్-షోరూమ్) సుమారు రూ. 80,000 నుంచి 90,000 మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది. (ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో ఉంచే అవకాశం ఉంది . చదవండి: సెడాన్ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం -
పలు కార్లపై బంపర్ ఆఫర్ను ప్రకటించిన హోండా..!
పండుగల సీజన్ దగ్గరలో ఉండడంతో కొత్త కస్టమర్లను ఆకర్షించడం కోసం పలు కార్ల తయారీ కంపెనీలు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ కార్ల కంపెనీ హోండా కార్ల అమ్మకాలు పెంచేందుకుగాను పలు కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పలు మోడల్ కార్లపై సుమారు రూ. 57 వేల వరకు డిస్కౌంట్లను హోండా తన కస్టమర్లకు అందించనుంది. హోండా అమేజ్, జాజ్, ఆల్-న్యూ సిటీ సెడాన్, డబ్ల్యూఆర్వీ మోడల్ కార్లపై డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని హోండా ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: Honda U Go Electric Scooter: హోండా యు-గో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంతో తెలుసా? హోండా అమేజ్ మోడల్ కొనుగోలుపై సుమారు గరిష్టంగా రూ. 57, 044 తగ్గింపును ప్రకటించింది. అమేజ్ 2021 ఫేస్లిఫ్ట్ మోడల్పై గరిష్టంగా రూ.18,000 వరకు ప్రయోజనాలను అందించనుంది. ఇందులో లాయల్టీ బోనస్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వరుసగా రూ. 5,000, రూ. 9,000, రూ. 4,000గా ఉన్నాయి. హోండా జాజ్ మోడల్ పై సుమారు రూ.39.947 డిస్కౌంట్తో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. హోండా డబ్ల్యూఆర్శీ మోడల్పై సుమారు రూ. 39, 998 డిస్కౌంట్ను అందించనుంది. అంతేకాకుండా కార్ ఎక్స్చేంజ్పై సుమారు పదివేల వరకు తగ్గింపును హోండా తన కస్టమర్లకు అందించనుంది. ఫిఫ్త్ జనరేషన్ హోండా సిటీ సెడాన్ మోడళ్లపై సుమారు రూ. 37,708 తగ్గింపును ఇవ్వనుంది. కొనుగోలుదారులు కారు ఎక్స్చేంజ్పై సుమారు రూ. 5,000 విలువైన డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ కార్లపై హోండా లాయల్టీ బోనస్, కార్ ఎక్స్చేంజ్ బోనస్, కార్పోరేట్ డిస్కౌంట్ రూపంలో ఆయా మోడళ్లపై హోండా డిస్కౌంట్లను అందించనుంది. చదవండి: ఆకాశంలో ఒక్కసారిగా పేలిపోయిన రాకెట్....! -
ఎలక్ట్రిక్ వాహన ప్రయాణం భళా!
ఓలా అంటే స్పానిష్ భాషలో ‘హలో’ అని అర్థం. క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లకు హలో చెబుతోంది. ఒక దశాబ్దం కంటే స్వల్పకాల వ్యవధిలోనే ఓలా తన వ్యాపారాన్ని వినూత్న రీతిలో విస్తరించింది. (అద్దంలో నా ముఖం చూసుకోవడం మానేశాను..) ఓలాను 2010లో నెలకొల్పారు. 2012లో దాని క్రియాశీల క్యాబ్ సేవలు ప్రారంభమైనాయి. మార్కెట్లోకి ప్రవేశించే సమయంలో, ప్రయాణీకులకు మూడు ఉచిత రైడ్లను అందించింది. ఈ తరహా ఉచిత వ్యూహం భారతీయ మధ్యతరగతిని టాక్సీల వైపు ఆకర్షించింది. రవాణాలో సౌలభ్యం, ప్రయాణీకులకు భద్రత, సకాలంలో గమ్యానికి చేర్చడం, ధర అంచనాలను సులభతరం చేసే సాంకేతిక పరిజ్ఞానంతో అతి స్వల్పకాలంలోనే ప్రయాణీకుల నమ్మ కాన్ని గెలుచుకుంది. ఓలా యాప్పై ట్రావెల్ సర్వీస్ ప్రొవైడర్గా అద్భుతమైన నిబద్ధతను చూపి, కారు ఎక్కాలనే అనేకమంది భారతీయుల వాంఛను నెరవేర్చింది. అలాగే దేశవ్యాప్తంగా ఉపాధిని సృష్టిం చింది. 2018 నాటికి, సంస్థకు పది లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు. వారి ప్రోత్సాహకాలు వినియోగ దారుల రేటింగ్, ఫీడ్బ్యాక్పై నిర్ణయమయ్యేవి. ఇంతేకాకుండా కొంత డిపాజిట్ మొత్తాన్ని డ్రైవర్ల నుండి సేకరించి, వారికి క్యాబ్స్ని ఫైనాన్స్ రూపంలో కట్టబెట్టింది. ఈ తరహా మోడల్లో డ్రైవర్లకు వాహనాలను ఏర్పాటు చేయడం రిస్క్తో కూడుకున్నది. అయినప్పటికీ, సాహసం చేసి బీమాలో తన ఉనికిని చాటుకుంది. మరో వైపు ప్రారంభ ఫిన్టెక్ సంస్థగా ఓలా మనీని ఉపయోగించి, వివిధ ఆర్థికసేవలను నిర్వహించింది. కృత్రిమ మేధస్సు సాయంతో విని యోగదారుల అసాధారణమైన ప్రవర్తనా మార్పులను గమనిస్తూ, మెరుగైన సేవలు అందిస్తోంది. అయితే తదుపరి ఊబర్తో పోటీ మూలంగా ధరల యుద్ధం, క్యాబ్ వాహనాల పెరుగుదల, ప్రోత్సాహ కాలలో కోత, ఇంకా డ్రైవర్లకు సంబంధించిన సమస్య లతో కష్టాలను మూటగట్టుకుంది. కరోనా మహ మ్మారి, లాక్డౌన్లు సంస్థను మరింత సంక్షోభంలోకి నెట్టాయి. గత్యంతరం లేక కొంతమంది పూర్తికాల ఉద్యోగులను తొలగించింది. మహమ్మారి కారణంగా భద్రత కోసం వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగి, క్యాబ్లు, ఆటోలవైపు వినియోగదారులు ముఖం చాటేయడంతో మరింత నష్టం వాటిల్లింది. (చదవండి: ఈ విద్యావిధానం దేశానికే ఆదర్శం) అయితే తన తదుపరి ఎత్తుగడగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆవిష్కరిస్తూ ఆటోమోటివ్ రంగంలోకి ప్రవేశించింది. తద్వారా పర్యావరణ పరిరక్షణ, సమర్థత, ఉపాధి కల్పనకు పూనుకుంటోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను రిజర్వ్ చేసుకోవడానికి ప్రారంభ ధరను రూ. 499గా నిర్ణయించింది. ఈ బుకింగ్ ధర ఒక సాధారణ మొబైల్ రీఛార్జ్ ప్లాన్కు సమానం. ఇది ఆటోమోటివ్ రంగంలో ఓలా తెచ్చిన విప్లవాత్మక మార్పు. సగటున నెలవారీగా కోటి మంది వినియోగదారులు గనుక 499 చెల్లిస్తే, అడ్వాన్సుల రూపంలో వడ్డీ లేని డబ్బు అందుతుంది. దీనివలన భారీగా రుణభారం తగ్గుతుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమలో సింహభాగం రుణాలుగా ఉంటుంది. కస్టమర్ డిపాజిట్ల రూపంలో ఓలా దీనికి స్వస్తి పలుకుతోంది. ఒక్క కారు కూడా సొంతంగా లేకుండానే ఓలా క్యాబ్స్ విజయవంతమైంది. దీనికి విరుద్ధంగా, ఎలక్ట్రిక్ స్కూటర్లను ఓలా తయారు చేస్తుండటం మూలాన వాటిని సరుకుగా చూపాల్సి ఉంటుంది. ఇది ఓలా వ్యాపార నిర్వహణ మోడల్లో చాలా పెద్ద మార్పు. ఇంకా, టెక్నాలజీ రంగం నుండి తయారీ రంగానికి మారుతుండటం దేశంలో మొదటిసారిగా ఓలా చేస్తున్న సాహసం. ట్యాక్సీ వ్యాపారంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు లేరు. కానీ ఇప్పుడు వారు ఈ కొత్త నమూనాలో పెద్ద శ్రామిక శక్తిని కలిగి ఉంటారు. ఓలా ట్యాక్సీ ప్రారంభంలో పెద్దగా పోటీ ఎదుర్కో లేదు. దానివల్ల ఫస్ట్–మూవర్ ప్రయోజనాన్ని పొందింది. కానీ ఇప్పుడు హీరో, బజాజ్, హోండా, ఇంక అనేక అభివృద్ధి చెందుతున్న సంస్థలతో పోటీ పడాలి. ఏదేమైనా, భారత ప్రజలు ఇంధనం కోసం తక్కువ ఖర్చు చేయాలని అనుకుంటున్న తరుణంలో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. అనేక భారతీయ కంపెనీలు తయారీ రంగం నుండి టెక్నాలజీ వైపునకు మారాయి. దీనికి భిన్నంగా ఓలా తన బ్రాండ్ని, టెక్నాలజీని పణంగా పెట్టి ధైర్యంగా ఆటోమోబైల్ దిగ్గజ సంస్థలకు సవాల్ విసురుతోంది. ఒక దశాబ్దం క్రితం టాటా నానో ఫలితాన్ని దేశం చవిచూసింది. ఇప్పుడు ఓలా తన హైటెక్ ఫీచర్ ఎలక్ట్రిక్ స్కూటర్తో ఆటోమోటివ్ పరిశ్రమకు అఘాతం కలిగించే సాహసం చేస్తోంది. ఈ స్కూటర్ విజయవంతమైతే గనుక భారీ ఉపాధి సృష్టి జరుగుతుంది, ఎగుమతులు పెరుగుతాయి, పర్యావరణ పరిరక్షణలో సాయపడుతుంది, ఇంధనం ఆదా అవుతుంది. అంతేకాకుండా భారతీయ సిలికాన్ వ్యాలీని నిర్మించడానికి దేశంలోని యువ పారిశ్రామికవేత్తలలో కావాల్సిన ఉత్సాహాన్ని నింపుతుంది. 75వ భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు ప్రత్యేకమైనవి. ఒలింపిక్స్లో బంగారు, వెండి, కాంస్య పతకాలతో మువ్వన్నెల జెండాను క్రీడాకారులు రెప రెపలాడించిన రోజే, ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆవిష్కరించింది. మున్ముందు బ్రాండ్ విలువ పరంగా ఓలా తదుపరి కోలాగా మారే అవకాశం ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు. - డాక్టర్ మైలవరం చంద్రశేఖర్ గౌడ్ వ్యాసకర్త సహాయ ఆచార్యులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, హైదరాబాద్ -
స్టైలిష్ లుక్తో హోండా సీబీ 200 ఎక్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తాజాగా కొత్త సీబీ200ఎక్స్ అడ్వెంచరర్–టూరర్ మోడల్ను భారత్లో ఆవిష్కరించింది. గురుగ్రాం ఎక్స్షోరూంలో ధర రూ.1.44 లక్షలు. వచ్చే నెల నుంచి అందుబాటులో ఉంటుంది. 17 హెచ్పీ పవర్, 16 ఎన్ ఎం టార్క్తో 184 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్కూల్డ్ ఇంజన్ను పొందుపరిచారు. 5 స్పీడ్ గేర్ బాక్స్, ఎల్ఈడీ లైటింగ్, పూర్తి స్థాయి డిజిటల్ లిక్విడ్ క్రిస్టల్ మీటర్, స్ప్లిట్ సీట్, డ్యూయల్ పర్పస్ టైర్స్, యూఎస్డీ ఫోర్క్స్, ఫ్యూయల్ ట్యాంక్ మౌంటెడ్ కీ వంటి హంగులు ఉన్నాయి. చదవండి : కంటి చూపుతో కాదు కత్తితో.. -
నీ లుక్ అదిరే, సరికొత్త ఫీచర్లతో విడుదలైన సెడాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న హోండా కార్స్ ఇండియా కొత్త అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారును విడుదల చేసింది.ఢిల్లీ ఎక్స్షోరూంలో ధరలు వేరియంట్నుబట్టి రూ.6.32 లక్షల నుంచి రూ.11.15 లక్షల మధ్య ఉంది.పెట్రోల్, డీజిల్ పవర్ట్రెయిన్స్లో వేరియంట్లను ప్రవేశపెట్టింది.పెట్రోల్ 1.2 లీటర్, డీజిల్ 1.5 లీటర్లో ఇంజన్ను రూపొందించింది. వేరియంట్నుబట్టి పెట్రోల్ అయితే 18.6 కిలోమీటర్లు, డీజిల్ 24.7 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది ఎనిమిదేళ్లలో అమేజ్ శ్రేణిలో ఇప్పటి వరకు దేశంలో కంపెనీ 4.5 లక్షల యూనిట్ల కార్లను విక్రయించింది. ఇందులో 68 శాతం వాటా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి సమకూరిందని కంపెనీ ప్రెసిడెంట్ గాకు నకనిశి ఈ సందర్భంగా తెలిపారు. 40% మంది కస్టమర్లు తొలిసారిగా అమేజ్ను సొంతం చేసుకున్నారని చెప్పారు. దక్షిణాఫ్రికా, నేపాల్, భూటాన్కు సైతం భారత్ నుంచి అమేజ్ కార్లు ఎగుమతి అవుతున్నాయని వివరించారు. చదవండి: ప్రైవేట్ ట్రైన్స్, రూ.30వేల కోట్ల టెండర్లను రిజెక్ట్ చేసిన కేంద్రం -
హోండా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరిపోయింది!
'యు-జీవో' పేరుతో తక్కువ ధరలో హోండా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను పట్టణ రైడింగ్ ప్రియుల కోసం డిజైన్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. లైట్ వెయిట్ ఈ-స్కూటర్ రెండు వెర్షన్లలో తీసుకొనివచ్చారు. యు-జీవోల స్టాండర్డ్ మోడల్ 1.2కెడబ్ల్యు హబ్ మోటార్ తో వస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 53 కిలోమీటర్లు. లోయర్ స్పీడ్ మోడల్ 800కెడబ్ల్యు హబ్ మోటార్, 1.2కెడబ్ల్యు గరిష్ట పవర్ తో పనిచేస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 43 కిలోమీటర్లు. అదనంగా, రెండు మోడల్స్ 1.44కెడబ్ల్యుహెచ్ సామర్థ్యం కలిగిన 48వీ, 30ఎహెచ్ గల లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తాయి. కొత్త ఈ-స్కూటర్ లో ఉన్న లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేలో రైడర్ వేగం, దూరం, ఛార్జ్ వంటి కీలకమైన సమాచారంతో పాటు ఇతర వివరాలు కనిపిస్తాయి. ముందు భాగంలో ట్రిపుల్ బీమ్ ఎల్ఈడి హెడ్ లైట్, ప్రధాన క్లస్టర్ చుట్టూ ఎల్ఈడి డిఆర్ఎల్ స్ట్రిప్ ఉంది. యు-జీవో 12 అంగుళాల ఫ్రంట్, 10 అంగుళాల రియర్ అలాయ్ చక్రాలతో వస్తుంది. దీనిలో 26 లీటర్ల అండర్ సీట్ స్టోరేజీ కెపాసిటీ ఉంది. ఇతర ఈ-స్కూటర్లతో పోలిస్తే దీని ధర చాలా తక్కువ. యు-జీవో బేస్ మోడల్ ధర 7,499 ఆర్ఎంబి(సుమారు రూ. 85,342), ప్రామాణిక మోడల్ ధర 7,999 ఆర్ఎంబి(సుమారు రూ. 91,501)గా ఉంది. ప్రస్తుతానికి జపనీస్ ఆటోమేకర్ చైనా మార్కెట్ కోసం యు-జివోను మాత్రమే తీసుకొచ్చింది. సంస్థ త్వరలో తన ఈ-స్కూటర్ ను ఇతర మార్కెట్లకు పరిచయం చేయనున్నట్లు పేర్కొంది. హోండా యు-జీవో భారతీయ మార్కెట్లో విడుదల అయితే రాబోయే ఓలా ఈ-స్కూటర్ వంటి వాటితో పోటీ పడుతుంది. అయితే, విడుదలపై కంపెనీ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. -
ఎలక్ట్రిక్ బైక్ ఐడియా.. భలే ఉంది కదూ!
ఒంటెద్దు బళ్లు చూశాం గాని, ఒంటిచక్రం బండేమిటి? ఇదేదో సర్కస్ వ్యవహారం కాబోలనుకుంటున్నారా? ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న వాహనం అచ్చంగా ఒంటిచక్రం బండి. ఇది మోనోవీల్ ఎలక్ట్రిక్ బైక్. హోండా కంపెనీకి చెందిన డిజైనర్ నాషో ఆల్ఫోన్సో గార్షియా దీనికి రూపకల్పన చేశాడు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే నగరాల్లో ఇరుకిరుకు సందుల్లో కూడా తేలికగా ప్రయాణాలు సాగించడానికి ఈ వాహనం భేషుగ్గా ఉపయోగపడుతుందని గార్షియా చెబుతున్నాడు. దీనిని నడపడం పెద్దకష్టమేమీ కాదు. ఇందులో కాళ్లు మోపడానికి ఉండేచోటులో నిలుచుని, స్టార్ట్ చేస్తే చాలు. పడిపోతుందేమోననే భయం అక్కర్లేదు. ఇది పూర్తిగా సెల్ఫ్బ్యాలెన్సింగ్ వాహనం. హోండా సంస్థ ప్రస్తుతానికి దీనిని నమూనాగా మాత్రమే తయారు చేసింది. దీనిపై మరిన్ని పరీక్షలు విజయవంతమైతే, పూర్తిస్థాయి ఉత్పాదన ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. -
టాప్గేర్లో వాహనాల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో సుస్థిరత, వినియోగదారుల విశ్వాసం పెరగడంతో ఈ జూలైలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి ప్రధాన వాహన కంపెనీల విక్రయాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. వ్యాధి సంక్రమణ రేటు భారీగా తగ్గుముఖం పట్టడంతో పాటు సెమి–కండెక్టర్ల సరఫరాను ఆటంకాలను ఆధిగమించి హోండా, నిస్సాన్, ఎంజీ మోటార్స్, స్కోడా కంపెనీలు అమ్మకాల్లో మెరుగైన వృద్ధిని సాధించాయి. దేశీయ వాహన దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ గతేడాది జూలైలో 1,01,307 వాహనాలను విక్రయించగా, ఈ ఏడాది జూలైలో 39 శాతం వృద్ధితో 1,41,238 వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ మోటార్ ఈ జూలైలో 48,042 వాహనాలను అమ్మింది. గతేడాది ఇదే జూలైలో విక్రయించిన 38,200 వాహనాలతో పోలిస్తే ఇది 26 శాతం అధికం. కంపెనీ జూలై2021 జూలై2020 వృద్ధి/క్షీణత మారుతీ సుజుకీ 1,41,238 1,01,307 39 హ్యుందాయ్ మోటార్స్ 48,042 38,200 26 టాటా మోటార్స్ 30,185 15,012 101 ఎంజీ మోటార్స్ 4225 2105 100 నిస్సాన్ 4,259 784 443 స్కోడా ఆటో 3,080 922 234 హోండా కార్ప్ 6,055 5,383 12 ద్విచక్రవాహనాలు హీరో మోటోకార్ప్ 5,20,104 4,54,398 (–)13 రాయల్ ఎన్ఫీల్డ్ 44,038 40,334 9 -
వచ్చేస్తున్నాయ్! ఆగస్టులో రయ్రయ్మంటూ...
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశమంతా ఆగస్టులో ఆజాదీ కా అమృత్ వేడుకలకు ముస్తాబవుతోంది. మరోవైపు ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఓలా స్కూటర్ కూడా ఇదే నెలలో డెలివరీకి రెడీ అవుతోంది. ఓలాతో పాటు ఈ నెలలో రిలీజ్ కాబోతున్న ముఖ్యమైన వెహికల్స్ గురించి క్లుప్తంగా ఓలా పెరిగిన పెట్రోలు ధరలతో జనమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు చూస్తున్నారు. దీంతో లక్ష ప్రీ బుకింగ్స్ సాధించి ఓలా రికార్డు సృష్టించింది. పది రంగుల్లో వంద కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈ స్కూటర్ రాబోతుందని అంచనా. ఇంకా తేది ఖరారు కానప్పటికీ ఆగస్టులోనే ఓలా స్కూటర్ రోడ్లపై పరుగులు పెడుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 సక్సెస్ ఫుల్ మోడల్ క్లాసిక్ 350కి మరిన్ని హంగులు జోడించి న్యూజెనరేషన్ మోడల్ని ఆగస్టులో మార్కెట్లోకి తెస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ తెస్తోంది. న్యూ ఇంజన్, ఫ్రేమ, టెక్నాలజీ, అధునాత ఫీచర్లను రాయల్ఎన్ఫీల్డ్ జోడించింది. ఇప్పటి వరకు ఉపయోగించిన ఇంజన్ స్థానంలో మెటియోర్ 350లో వాడే ఇంజన్ను ఆర్ఈ తెచ్చింది. సీటు, లైటు, హ్యాండిల్ బార్, పెయింట్ స్కీం, డిస్క్ బ్రేకుల్లో మార్పులు చేసింది. బీఎండబ్ల్యూ సీ 400 జీటీ బీఎండబ్ల్యూ మోటారడ్ నుంచి సరికొత్త సీ 400 జీటీ మ్యాక్సీ స్కూటర్ని మార్కెట్లో ప్రవేశపెట్టబోతుంది. ఈ ప్రీమియం మోడల్ స్కూటర్ ధర రూ. 5 లక్షల దగ్గర ఉండవచ్చని అంచనా. సింపుల్వన్ ఎమర్జింగ్ మార్కెట్గా భావిస్తోన్న ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది సింపుల్ వన్ స్కూటర్. ఆగస్టు 15న ఈ స్కూటర్ ఇండియా మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టీవీఎస్ ఐక్యూబ్, అథర్లకు పోటీగా ఇది మార్కెట్లోకి వస్తోంది. హోండా హర్నెట్ 2.0 బేస్డ్ ఏడీవీ ఈ నెలలో హార్నెట్ 2.0 ఏడీవీ మోడల్ రిలీజ్ చేసేందుకు హోండా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. హోండాకి చెందిన రెడ్ వింగ్ లైన్ డీలర్షిప్ ద్వారా ఇవి మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ బైకు ధర రూ.1.20 నుంచి 1.50ల మధ్య ఉండవచ్చు. -
హోండా నుంచి ఎలక్ట్రిక్ బైక్!
వెబ్డెస్క్: ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి వచ్చేందుకు జపాన్ ఆటోమోబైల్ దిగ్గజ కంపెనీ హోండా సన్నాహకాలు చేస్తోంది. జపాన్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతోన్న హోండా బెన్లే మోడల్ని ఇండియాకి తీసుకురానుంది. అరాయ్లో టెస్టింగ్ హోండా సంస్థ 2019లో బెన్లే ఎలక్ట్రిక్ బైక్లను రూపొందించింది. అక్కడ ప్రస్తుతం బెన్లే సిరీస్లో నాలుగు బైక్లు రిలీజ్ అయ్యాయి. ఇదే బైక్ను ఇండియా మార్కెట్లో ప్రవేశపెట్టే ఆలోచనలో హోండా సంస్థ ఉంది. ఈమేరకు పూణేలో ఉన్న ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (అరాయ్)లో ఈ బైక్కు టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. డెలివరీకి తగ్గట్టుగా ఇండియాలో ఎలక్ట్రిక్ బైక్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ బైకులకు మంచి మార్కెట్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఇండియాలో ఈ కామర్స్ రంగం జోరుమీదుంది. హోండా బెన్లే బైక్ డిజైన్ సైతం డెలివరీ సర్వీసులకు అనుకూలంగా ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయడుతున్నాయి. మరోవైపు ఈ బైకులకు కీలకమైన బ్యాటరీ విషయంలోనూ హోండా ముందు చూపుతో వ్యవహరిస్తోంది. సులువుగా బ్యాటరీ మార్చుకునేలా బైక్ డిజైన్లో మార్పులు చేర్పులు చేస్తోంది. -
రూ.6.80 లక్షల బైక్ లాంచ్ చేసిన హోండా
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) నేడు దేశంలో సిబి500 ఎక్స్ని రూ.6.87 లక్షల(ఎక్స్షోరూమ్, గురుగ్రామ్) ధరతో విడుదల చేసింది. ఈ మోడల్ కోసం కంపెనీ బుకింగ్ కూడా ప్రారంభించింది. ఈ కొత్త మోడల్ నీ కంపెనీకి చెందిన బిగ్వింగ్ డీలర్షిప్స్ ద్వారా దేశవ్యాప్తంగా విక్రయించనున్నారు. ప్రయాణికులకు మరిచిపోలేని అనుభూతిని అందించేందుకు ఈ ప్రీమియం బైక్ను తీసుకొచ్చినట్లు కంపెనీ ఎండీ, ప్రెసిడెంట్, సీఈవో అత్సుషి ఒగాటా ఓ ప్రకటనలో తెలిపారు. హోండా సీబీ 500ఎక్స్ లో ట్విన్ సిలిండర్ 471 సీసీ లిక్విడ్ కూల్ ఇంజిన్ అమర్చారు. ఈ ట్విన్-సిలిండర్ ఇంజన్ 47 బిహెచ్పి గరిష్ట శక్తిని, 43.2 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్బాక్స్ ఉంది. డైమండ్ ఆకారంలో ఉన్న స్టీల్-ట్యూబ్ ఫ్రేమ్ ఆధారంగా కొత్త సిబి 500 ఎక్స్కు టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక భాగంలో హోండా ప్రో-లింక్ మోనోషాక్ 9-స్టెప్ స్ప్రింగ్ ప్రీలోడ్ సస్పెన్షన్ లభిస్తుంది. ముందు భాగంలో 310 ఎంఎం డిస్క్ ఉండగా, వెనుక వైపు 240 ఎంఎం డిస్క్ ఉంది. డ్యూయల్-ఛానల్ ఎబిఎస్ కూడా ఉంది. హోండా సిబి 500ఎక్స్లో ఎల్ఇడి హెడ్ల్యాంప్, టెయిల్ లాంప్, నెగటివ్-డిస్ప్లే ఎల్సిడి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, అప్స్వీప్ట్ ఎగ్జాస్ట్, అసిస్ట్/స్లిప్పర్ క్లచ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. ఈ బైక్ గ్రాండ్ ప్రిక్స్ రెడ్, మ్యాటీ గన్ పౌడర్ బ్లాక్ మెటాలిక్ రంగుల్లో లభించనుంది. చదవండి: మారుతి సుజుకి బంపర్ అఫర్ -
హోండా డబ్ల్యూఆర్-వీ ఫేస్లిఫ్ట్ లాంచ్
సాక్షి, ముంబై: ప్రముఖ ఆటో సంస్థ హోండా తన డబ్ల్యూఆర్-వీ మోడల్ 2020 ఫేస్లిఫ్ట్ వెర్షన్ కారును భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ధరలు 8.50 లక్షల నుండి ప్రారంభమై 10.99 లక్షల రూపాయల వరకు (అన్ని ధరలు,ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ సంవత్సరం ఏప్రిల్లో ప్రారంభించాలనుకున్నా కరోనావైరస్ మహమ్మారితో ఆలస్యమైందని జపాన్ కార్ మేకర్ వెల్లడించింది. రిఫ్రెష్ స్టైలింగ్, కొత్త ఫీచర్లతో బీఎస్-6 ఫార్మాట్లో అప్ డేట్ చేసింది. పెట్రోలు, డీజిల్ ఇంజీన్లతో ఎస్ వీ, వీక్స్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే ఇది లభ్యం కానుంది. హోండా డబ్ల్యూఆర్-వీ డిజైన్, ఫీచర్లు బీఎస్ 6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా 1.5 లీటర్ డీజిల్, 1.2 పెట్రోల్ ఇంజిన్లను అమర్చింది. డీజిల్ వెర్షన్ వాహనం 99 పీఎస్ పవర్, 200 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. పెట్రోల్ వాహనమైతే 89 పీఎస్ పవర్, 200 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6- స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. సరికొత్త ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లైట్లతో కూడిన డే టైమ్ రన్నింగ్ లైట్లు, రీడిజైన్డ్ టెయిల్ ల్యాంప్స్ లాంటివి జోడించింది. 7.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫొటైన్మెంట్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, సన్ రూఫ్, రేర్ ఏసీ వెంట్స్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ బ్రేకింగ్ వ్యవస్థ, రేర్ పార్కింగ్ సెన్సార్లు, మల్టీ వ్యూ రేర్ పార్కింగ్ కెమెరా లాంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక మార్కెట్లో పోటీ విషయానికి వస్తే..మారుతీ సుజుకీ విటారా బ్రెజా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్ యూవీ 300, ఫోర్డ్ ఎకో స్పోర్ట్, హ్యుండాయ్ వెన్యూ లాంటివి ప్రధానంగా గట్టిపోటీ ఇవ్వనున్నాయి. -
హోండాకు మరో షాక్ : ఉత్పత్తి నిలిపివేత
సాక్షి, న్యూఢిల్లీ: కరోనావైరస్, లాక్డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాన్ని ఎదుర్కొన్న జపాన్ కార్ల తయారీ సంస్థ హోండాకు తాజాగా సైబర్ ఎటాక్ షాక్ తగిలింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక కర్మాగారాలను ప్రభావితం చేసింది. దీంతో ఈ దాడి నుంచి కోలుకునేందుకు ఇండియా, బ్రెజిల్ హోండా ప్లాంట్లలో కార్యకలాపాలను నిలిపివేసింది. అంతర్గత సర్వర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ ఎటాక్ జరిగిందని, కంపెనీ సిస్టంల ద్వారా వైరస్ వ్యాపించిందని కంపెనీ ప్రతినిధి బుధవారం వెల్లడించారు. దీంతో భారతదేశం, బ్రెజిల్లోని మోటార్సైకిల్ ప్లాంట్లను మూసి వేశామన్నారు. అయితే టర్కీలోని కార్ల తయారీ ప్లాంట్ వద్ద బుధవారం తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలను పరిశీలిస్తున్నామని ఆమె చెప్పారు. అయితే దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా హోండా వ్యాపారంపై పరిమితంగానే ఉంటుందన్నారు. (ఎట్టకేలకు ఆనంద్ మహీంద్రా సాధించారు) సైబర్ దాడి కారణంగా యుఎస్ లో ఐదు సహా, మొత్తం11 హోండా ప్లాంట్లను ప్రభావితం చేసినట్టు సమాచారం. అయితే యుఎస్ ప్లాంట్లు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాయి. కాగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా హోండాతో సహా గ్లోబల్ వాహన తయారీదారులు ఇప్పటికే సంక్షోభంలో పడ్డాయి. గత నెలలో హోండా నికర లాభంలో 25.3 శాతం క్షీణతను నమోదు చేసింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు ఆరు శాతం తగ్గాయి. (పీఎన్బీ : మూడు ఆడి కార్లు, విమర్శలు) -
హోండా ఫోర్జా 300 డెలివరీలు ప్రారంభం
ముంబై: ప్రముఖ స్కూటర్ తయారీ కంపెనీ హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తన ఫ్లాగ్షిప్ ప్రీమియం మిడ్–సెగ్మెంట్ ద్విచక్ర వాహనం ‘ఫోర్జా 300’ డెలివరీలను ప్రారంభించింది. సంస్థకు చెందిన బిగ్ వింగ్ వ్యాపార విభాగం.. తొలి విడత కింద నాలుగు స్కూటర్లను కస్టమర్లకు మంగళవారం అందజేసింది. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ఐ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యాద్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ.. ‘వినియోగదారుల నుంచి వచ్చిన విశేష స్పందన చూసి డెలివరీలను ఆరంభించాం. యూరో–5 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వెర్షన్ను 2021 ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి తీసుకుని వస్తాం’ అని వెల్లడించారు. నూతనతరం అవసరాలకు తగిన స్కూటర్ను అందించడంలో భాగంగా ప్రీమియం మిడ్–సెగ్మెంట్ డెలివరీలను ప్రారంభించినట్లు సంస్థ ప్రెసిడెంట్, ఎండీ మినోరు కటో అన్నారు. -
హోండా డియో బీఎస్-6 లాంచ్
సాక్షి, ముంబై: హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) కొత్త హోండా డియోను విడుదల చేసింది, భారత్ స్టేజ్ 6(బిఎస్ 6) ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేసిన కొత్త హోండా డియో స్కూటర్ను లాంచ్ చేసింది. కొత్త డిజైన్, కొత్తఫీచర్లతో లాంచ్ చేసిన దీని ప్రారంభ ధరను రూ. 59,990గా ఉంచింది. కొత్త హోండా డియోకు 6 సంవత్సరాల వారంటీ ( 3 సంవత్సరాల ప్రామాణిక వారంటీ 3 సంవత్సరాల అదనపు ఐచ్ఛిక వారంటీ కూడా) అందిస్తోంది. మొత్తం ఏడు కొత్త రంగులలో స్టాండర్డ్, డీలక్స్ అనే రెండు వేరియంట్లలో లభ్యం మవుతోంది. 110 సీసీ ఇంజన్, మెరుగైన స్మార్ట్ పవర్ (ఇఎస్పి)తో నడిచే హోండా ఎకో టెక్నాలజీ (హెచ్ఇటి) తో పాటు, కొత్త డిజైన్ను, కొత్త ఫీచర్లను న్యూ వేరియంట్లో జోడించింది. దీని ఇంజీన్ 8,000 ఆర్పిఎమ్ వద్ద 7.68 బీహెచ్పీ పవర్ను, 5,250 ఆర్పిఎమ్ వద్ద 8.79 ఎన్ఎమ్ గరిష్ట్ టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. 2020 హోండా డియోలో కొత్త సిగ్నేచర్ ఎల్ఇడి పొజిషన్ లాంప్, మోడరన్ టెయిల్ లాంప్ డిజైన్, స్ప్లిట్ గ్రాబ్ రైల్స్, కాంబీ బ్రేక్ సిస్టం(సీబీఎస్) కొత్త బాడీ గ్రాఫిక్లతో కొత్త హోండా డియోకు పుల్ డిజిటల్ స్పీడోమీటర్, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ ప్రధాన ఫీచర్లు. ధరలు 2020 హోండా డియో బిఎస్ 6 మోడల్ స్టాండర్డ్ వేరియంట్ ధర : 59,990 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) మాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్, కాండీ జాజీ బ్లూ, స్పోర్ట్స్ రెడ్ , వైబ్రెంట్ ఆరెంజ్ ఇలా నాలుగు రంగు ఎంపికలలో లభిస్తుంది. హోండా డియో డీలక్స్ వేరియంట్ ధర రూ.63,340 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) మాట్టే సాంగ్రియా రెడ్ మెటాలిక్, డాజిల్ ఎల్లో మెటాలిక్ , మాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్ అనే మూడు రంగు ఎంపికలలో లభిస్తుంది. -
బీఎస్-6 : హోండా అమేజ్.. సరికొత్తగా
సాక్షి, న్యూఢిల్లీ: కార్ల తయారీ సంస్థ హోండా తన పాపులర్ మోడల్ కారు హోండా అమేజ్లో కొత్త వెర్షన్ను తీసుకొచ్చింది. బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తొలి మోడల్కారు ‘అమేజ్ 2020’ని లాంచ్ చేసింది. దీని ప్రారంభధరను. 6.09 లక్షలుగా(ఎక్స్ షోరూం, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. 1.5 లీటర్ల ఐ-డీటెక్ డీజిల్ ఇంజీన్, 1.2 లీటర్ల ఇంజన్లీతో మాన్యువల్, సీవీటీ రెండు వెర్షన్లలోనూ ప్రారరంభించింది. హ్యుందాయ్ ఆరా, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, టాటా టిగోరేకి గట్టి పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. -
హోండా బీఎస్-6 బైక్ ‘ఎస్పీ 125’ లాంచ్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తాజాగా భారత్ స్టేజ్ (బీఎస్)–6 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న సరికొత్త బైక్ను దేశీ మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఎస్పీ 125’ పేరిట విడుదలైన ఈ అధునాతన బైక్ ప్రారంభ ధర రూ. 72,900. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా నూతన ఉద్గార నిబంధనలు అమలుకానున్న నేపథ్యంలో సీబీ షైన్ ఎస్పీ 125 మోటార్ సైకిల్ స్థానాన్ని భర్తీ చేయడానికి ఈ బైక్ను తెచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మినోరు కటో మాట్లాడుతూ.. ‘125 సీసీ విభాగంలో సాంకేతికత, శైలి, పనితీరు పరంగా కొత్త మోడల్ మరింత మెరుగుపడింది. మునుపటి మోడల్తో పోలిస్తే ధర 11 శాతం పెరగ్గా, మైలేజీ 16 శాతం పెరిగింది’ అని చెప్పారు. ఈ విభాగంలో 80 లక్షల యూ నిట్లు అమ్ముడుపోగా, మార్కెట్ వాటా 39% గా ఉందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యాద్విందర్ సింగ్ గులేరియా చెప్పారు. -
ధంతేరస్ : కార్లపై భారీ డిస్కౌంట్లు
సాక్షి, ముంబై: ధంతేరస్ సందర్భంగా కొత్త కారును కొందామని ప్లాన్ చేస్తున్నారా. లేదంటే ప్రస్తుత కారును మార్పిడి చేసి కొత్త కారును ఇంటికి తెచ్చుకోవాలని యోచిస్తున్నారా? అయితే ఇది మంచి సమయం త్వరపడండి. ధనత్రయోదశి సందర్భంగా ప్రముఖకార్ల కంపెనీలుపండుగ సీజన్ను సద్వినియోగం చేసుకోవటానికి, అమ్మకాలను మెరుగుపరచడానికి భారీ ఆఫర్లు అందిస్తున్నాయి. హోండా, మారుతి సుజికి, టాటా మోటార్స్ తమ టాప్ మోడల్ కార్లపై వినియోగదారులకు పలు ప్రయోజనాలు అందిస్తున్నాయి. ముఖ్యంగా డిస్కౌంట్ ఆఫర్లు, ఎక్స్టెండెడ్ వారంటీ, ఎక్స్జేంజ్ బోనస్తో పాటు భారీ ఆఫర్లను అందిస్తోంది. హోండా ఆఫర్లు హోండా అమేజ్, జాజ్, సిటీ ఇలా ఏడు మోడల్స్కార్లపై ధరలను తగ్గించింది. రూ.9.78 లక్షల కారుపై 42వేల దాకా డిస్కౌంట్.రూ. 12వేల రూపాయల విలువైన ఎక్స్టెండెడ్ వారంటీ (4 వ & 5 వ సంవత్సరం). రూ .30,000 విలువైన కార్ల మార్పిడిపై అదనపు తగ్గింపు. రూ .16 వేల విలువైన హోండా కేర్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం (మూడేళ్లు) ఉచితం. హోండా జాజ్లో రూ .25 వేల వరకు డిస్కౌంట్ రూ .25 వేల విలువైన కార్ ఎక్స్ఛేంజ్లో అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. హోండా జాజ్ అసలు ధర రూ .9.41 లక్షలు. హోండా సిటీ: రూ. 32,000 ఆఫర్, కార్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ .30,000 అదనపు తగ్గింపు. అసలు ధరరూ .14.16 లక్షలు హోండా బిఆర్-విలో, కంపెనీ మొత్తం 1,10,000 రూపాయల వరకు డిస్కౌంట్ను అందిస్తుంది, ఇందులో నగదు తగ్గింపు (రూ .33,500), కార్ ఎక్స్ఛేంజ్ (రూ .50,000) ఇతరాలు (రూ .26,500) ఉన్నాయి. హోండా సివిక్ 250,000 రూపాయల వరకు తగ్గింపుతో లభిస్తుంది. డిస్కౌంట్ తరువాత, కారు కొత్త ధర 17.94 లక్షలు. ఈ కారు అసలు ధర. రూ .22.35 లక్షల కారు. హోండా సివిక్ విత్ పెట్రోల్ ఇంజన్ (విసివిటి) రూ .200,000 వరకు నగదు తగ్గింపుతో లభిస్తుంది. హోండా సివిక్ (విఎక్స్ సివిటి, జెడ్ఎక్స్ సివిటి) మోడళ్లలో రూ .75,000 వరకు నగదు తగ్గింపు లభిస్తుంది. మారుతి సుజుకి : మారుతి సుజుకి తన కార్లపై అధిక డిస్కౌంట్లను అందిస్తోంది. విటారా బ్రెజ్జా (డీజిల్) రూ .45,000 నగదు తగ్గింపు, 5 సంవత్సరాల వారంటీ రూ .20,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, రూ .10వేల కార్పొరేట్ డిస్కౌంట్ను అందిస్తుంది. మొత్తం రూ .96,100 వరకు తగ్గింపు. మారుతి సుజుకి డిజైర్ (డీజిల్) : రూ .83,900 వరకు ఆఫర్ కాంప్లిమెంటరీ 5 సంవత్సరాల పొడిగించిన వారంటీ, ఎక్స్ఛేంజ్ బోనస్ , కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. మారుతి సుజుకి డిజైర్ (పెట్రోల్ వెర్షన్ అన్ని వేరియంట్లలో) 55,000 రూపాయల వరకు ఆఫర్. దీంతోపాటు చాలా సంవత్సరాలుగా కంపెనీ బెస్ట్ సెల్లర్ అయిన మారుతి సుజుకి స్విఫ్ట్, పెట్రోల్ వేరియంట్కు రూ .50 వేలు, డీజిల్ వేరియంట్కు రూ .77,600 వరకు, డీజిల్ వెర్షన్ కోసం కాంప్లిమెంటరీ ఎక్స్టెండెడ్ వారంటీ ప్యాకేజీతో పాటు ఆఫర్లను అందిస్తోంది. మారుతి సుజుకి ఆల్టో, ఆల్టో కె 10, సెలెరియోలపై వరుసగా రూ .60 వేలు రూ. 55వేలు, రూ .60వేల వరకు ప్రయోజనాలు ఉన్నాయి, ఇందులో ఎక్స్ఛేంజ్ , కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. టాటా మోటార్స్ కొత్త టాటా కారు కోసం తమ పాత కార్లను మార్పిడి చేసుకోవాలనుకునే వారికి డిస్కౌంట్లను అందిస్తోంది. కార్పొరేట్ ఉద్యోగుల కోసం కంపెనీ నిర్దిష్ట పథకాలను ప్రారంభించింది. టాటా హెక్సా కొనుగోలుపై రూ .1.65 లక్షల వరకు ఆఫర్. టాటా నెక్సాన్ రూ .87,000 వరకు తగ్గింపు టాటా టియాగో , టాటా టియాగో ఎన్ఆర్జి రెండూ రూ .70 వేలదాకా ఆఫర్స్ . టాటా టైగర్పై 1.17 లక్షల రూపాయల తగ్గింపు టాటా హారియర్ 65,000 రూపాయల వరకు ఆఫర్ -
తొలి బీఎస్-6 యాక్టివా125 లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశపు రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన మొట్ట మొదటి బీఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తొలి వాహనాన్ని విడుదల చేసింది. బీఎస్ 6 నిబంధనలకు అనుగుణంగా యాక్టివా వెర్షన్ను బుధవారం తీసుకొచ్చింది. మూడు వేరియంట్లలో తీసుకొచ్చిన ఈ స్కూటర్ ప్రారంభ ధరను రూ .67,490 గా నిర్ణయించింది. ఈ నెల చివరి నాటికి కొత్త స్కూటర్లు రోడ్లపైకి రావడం ప్రారంభిస్తాయని, దశలవారీగా దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు హోండా తెలిపింది. తమ కొత్త యాక్టివా 125 బిఎస్-6 తో, పరిశ్రమలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో, తదుపరి విప్లవానికి లీడర్గా నిలుస్తుందని హోండీ సీఎండీ మినోరు కటో చెప్పారు. -
1.6 మిలియన్ల హోండా కార్లు రీకాల్
వాషింగ్టన్: హోండా కంపెనీ భారీ ఎత్తున కార్లను రీకాల్ చేయనున్నట్టు ప్రకటించింది. ఎయిర్ బ్యాగ్ లోపాలకారణంగా అమెరికాలో 1.6 మిలియన్ వాహనాలను రీకాల్ చేస్తామని హోండా శుక్రవారం తెలిపింది. యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయించిన గడువుకు ఆరు నెలల ముందే ఈ రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. లోపభూయిష్ట టకాటా ఎయిర్ బ్యాగ్లను రీప్లేస్ చేస్తామని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ కార్లను, అమెరికాలో దాదాపు 12.9 మిలియన్ల హోండా, అకూరా ఆటోమొబైల్స్ కార్లను రీప్లేస్ చేశామని పేర్కొంది. కాగా 2013 నుండి తకాటా ఎయిర్బ్యాగ్లలోని లోపాలతో సంభవించిన ప్రమాదాల్లో సుమారు 20 మంది మరణించారు. దీంతో అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ సీరియస్గా స్పందించింది. -
బీఎస్–6 వాహనాల క్యూ!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో బీఎస్–6 ప్రమాణాల అమలు గడువు దగ్గర పడుతుండటంతో వాహన కంపెనీలు కొత్త మోడళ్ల ఆవిష్కరణలను వేగవంతం చేశాయి. ఒకదాని వెంట ఒకటి బీఎస్–6 వేరియంట్లను సిద్ధం చేస్తున్నాయి. వాహన కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే భారత్ స్టేజ్–6 ప్రమాణాలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీనికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ కోసం ఆటోమొబైల్ సంస్థలు రూ.70– 80 వేల కోట్లను వెచ్చిస్తున్నాయి. మరోవైపు బీఎస్–4తో పోలిస్తే బీఎస్–6 వాహనం మోడల్నుబట్టి 15 శాతం వరకు ఖరీదు కానుంది. ద్విచక్ర వాహన కంపెనీ హోండా బీఎస్–6 వేరియంట్ యాక్టివా–125 స్కూటర్ను ఆవిష్కరించింది. స్కూటర్స్ విభాగంలో ఇదే తొలి బీఎస్–6 వాహనం. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ ఐస్మార్ట్ బైక్ బీఎస్–6 ధ్రువీకరణ దక్కించుకుంది. ఐషర్ ప్రో 2000 సిరీస్ లైట్ డ్యూటీ ట్రక్ను విడుదల చేసింది. లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ నాలుగు వేరియంట్లలో లాంగ్ వీల్ బేస్ ఈ–క్లాస్ సెడాన్తోపాటు ఎస్–క్లాస్ 350డీ మోడల్ను ప్రవేశపెట్టింది. టయోటా కిర్లోస్కర్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ గ్లాంజాను విడుదల చేసింది. బీఎస్–6తో మూడు నాలుగు నెలల్లో పెట్రోల్, డీజిల్ వెహికిల్స్ను ప్రవేశపెడతామని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా చెప్పారు. మారుతి సుజుకి ఇండియా బాలెనో, ఆల్టో మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇతర మోడళ్లను ప్రస్తుతం పరీక్షిస్తోంది. డెడ్లైన్లోగా అన్ని మోడళ్లను బీఎస్–6 ప్రమాణాలతో ప్రవేశపెడతామని బజాజ్ ఆటో తెలిపింది. మోపెడ్స్ విభాగంలో ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్న టీవీఎస్.. బీఎస్–6 వేరియంట్ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. భారత్ స్టేజ్ ప్రమాణాలు.. భారత్లో బీఎస్–1 ప్రమాణాలు 2000 సంవత్సరంలో అమల్లోకి వచ్చాయి. 2005లో బీఎస్–2, బీఎస్–3 2010లో వచ్చాయి. ఇప్పుడున్న బీఎస్–4 ప్రమాణాలు 2017 ఏప్రిల్లో మొదలయ్యాయి. దేశంలో కాలుష్యం అంతకంతకూ పెరుగుతుండడంతో బీఎస్–5కు బదులుగా బీఎస్–6 ప్రమాణాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీఎస్–4 వాహనం 50 పీపీఎం (పార్ట్స్ పర్ మిల్లియన్) సల్ఫర్ను విడుదల చేస్తే, బీఎస్–6 వెహికల్ విషయంలో ఇది 10 పీపీఎం ఉంటుంది. డీజిల్ కార్లలో నైట్రోజన్ ఆక్సైడ్స్ 70 శాతం వరకు తగ్గితే, పెట్రోల్ కార్లలో 25 శాతం తగ్గుతుంది. బీఎస్–4 కోసం ఇప్పటికే భారీగా ఖర్చు చేసిన తయారీ సంస్థలు అతి తక్కువ కాలంలోనే నూతన టెక్నాలజీ కోసం పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. భారీ పెట్టుబడులతో... భారత్ స్టేజ్–6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను అభివృద్ధి చేసేందుకు, విడిభాగాలను స్థానికంగా తయారు చేసేందుకై ప్యాసింజర్ వెహికల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు రూ.35,000– 40,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ఇక్రా వెల్లడించింది. అలాగే ద్విచక్ర వాహన తయారీ సంస్థల నుంచి రూ.15,000 కోట్ల వరకు పెట్టుబడులు ఉండొచ్చని సమాచారం. మొత్తంగా వాహన పరిశ్రమ రూ.70–80 వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ చెబుతోంది. బీఎస్–6 గ్రేడ్ ఫ్యూయెల్స్ కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.28,000 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. బీఎస్–6 నూతన సాంకేతిక పరిజ్ఞానం కోసం రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు మహీంద్రా ప్రకటించింది. హోండా మోటార్సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా రూ.800 కోట్లు వెచ్చిస్తోంది. 2019–20లో విస్తరణ నిధులు రూ.1,500 కోట్లు ఉండొచ్చని హీరో మోటోకార్ప్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పనున్న కొత్త ప్లాంటుతోపాటు బీఎస్–6 అప్గ్రెడేషన్కు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు కంపెనీ సీఎఫ్వో నిరంజన్ గుప్తా తెలిపారు. ఫోర్స్ మోటార్స్ రూ.250 కోట్లు వెచ్చిస్తోంది. వచ్చే మూడేళ్లకుగాను యమహా ఇండియా రూ.100 కోట్లు ఖర్చు చేయనుంది. -
హోండా నుంచి కొత్త ‘సీఆర్–వీ’
న్యూఢిల్లీ: జపనీస్ వాహన దిగ్గజం హోండా... సరికొత్త ప్రీమియం ఎస్యూవీని మంగళవారం భారత మార్కెట్లోకి విడుదలచేసింది. సీఆర్–వీ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ కారు మొత్తం మూడు వేరియంట్లలో లభ్యమవుతోంది. టూవీల్ డ్రైవ్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.28.15 లక్షలు, డీజిల్ ధర రూ.28.15 లక్షలు కాగా, ఆల్వీల్ డ్రైవ్ ధర రూ.30.65 లక్షలుగా నిర్ణయించింది. -
హోండా గోల్డ్ వింగ్ ధర రూ.26.85 లక్షలు
బెంగళూరు: ఈ ఏడాది ఫిబ్రవరి ఆటో ఎక్స్పోలో సందడి చేసిన హోండా గోల్డ్ వింగ్ మోటార్సైకిల్ డెలివరీ ప్రారంభమయ్యింది. క్యాండీ ఆర్డెన్ట్ రెడ్ కలర్ టూరర్ల డెలివరీ మంగళవారం నుంచి ప్రారంభించామని హోండా మోటార్స్ అండ్ స్కూటర్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యాద్విందర్ సింగ్ గులెరియా తెలిపారు. అత్యంత శక్తివంతమైన ఈ టూరర్ నూతనంగా అభివృద్ధిపరిచిన సిక్స్–సిలెండర్ ఇంజిన్, సెవెన్ స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్స్మెషీన్ను కలిగి ఉందని ఆయన వివరించారు. దీని ధర రూ.26.85 లక్షలు. -
హోండా ఫోర్జా 125 డబుల్ పవర్తో
సాక్షి,ముంబై: హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ సరికొత్త యాక్టివాను లాంచ్ చేయనుంది. హోండా స్కూటర్లతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన హోండా ఇపుడు కొత్త అప్డేటెడ్ స్కూటర్ను తీసుకు రానుంది. హోండా ఫోర్జా 125 లో న్యూ జనరేషన్ టూవీలర్ ను ఆవిష్కరించనుంది. తమ తాజా స్కూటర్ దాదాపు హోండా యాక్టివాకు డబుల్ పవర్ కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. రెండు ఫుల్ ఫేస హెల్మెట్స కొత్త వెర్షన్ ఫోర్జా సీటు కింద సరిపోతుందని, స్మార్ట్ కీ ఆపరేటెడ్ 45 లీటర్ టాప్ బాక్స్ సామర్ధ్యం పెరుగుతుందని చెబుతోంది. హోండా ఫోర్జా డిజైన్ , ఎలక్ట్రానిక్ డివైజ్ లో మార్పులతోపాటు మరికొన్ని హంగులతో మార్కెట్ లోకి విడుదల చేయనుంది. అయితే ఇంజిన్, చాసెస్ లో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా ఉంచింది. ఒకసారి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయిస్తే 486 కి.మీ. ప్రయాణించవచ్చని హోండా కంపెనీ చెబుతోంది. హోండా ఫోర్జాకు 125 సీసీ కెపాసిటీ సింగిల్ ఇంజిన్ అమర్చారు. 8750 ఆర్పీఎం వద్ద 14.75 బీహెచ్పీని, 8250 ఆర్పీఎం వద్ద 12.5 ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. డిజిటల్ డిస్ప్లేతోపాటు అనలాగ్ స్పీడోమీటర్, టాకోమీటర్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో పొందుపర్చింది. ఇంకా కొత్త తరం హోండా ఫోర్జాలో అడ్జెస్టబుల్ విండ్ స్క్రీన్ , ఎల్ ఈ డీ ఇండికేటర్స్ , క్లస్టర్, అనలాగ్ స్పీడో మీటర్ అదనంగా జోడించింది. హ్యాండిల్ బార్ ను అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవచ్చని కంపెనీ చెబుతోంది. 125సీసీ స్కూటర్ సెగ్మెంట్లో హోండాకు యాక్టివా , గ్రాజియా పాపులర్ మోడల్స్. అయితే మ్యాక్సీ-స్కూటర్ డిజైనర్ కలిగి ఉన్నది మాత్రం హోండా ఫోర్జా. అలాగే యాక్టివా పోలిస్తే యాక్టివా 125 8.5 బీహెచ్పీ అని అందిస్తోంటే...ఫోర్జా 14.75 పవర్ను అందిస్తుంది. కాగా యూరప్లో చాలా పాపులర్ అయిన ఈ స్కూటర్ 2015లో సుమారు 30వేల యూనిట్లను విక్రయించిందట కంపెనీ. అయితే ధర వివరాలు, ఎపుడు లాంచ్ చేసేది అధికారికంగా వెల్లడించలేదు. -
హోండా కొత్త యాక్టివా 5జీ.. మార్కెట్లోకి
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్ సైకిల్స్ అండ్ హోండా స్కూటర్స్ ఇండియా కొత్త స్కూటర్ను లాంచ్ చేసింది. యాక్టివా వారసత్వాన్ని కొనసాగిస్తూ, హోండా యాక్టివా ను సరికొత్తగా విడుదల చేసింది. ఆటో ఎక్స్పో-2018 లో ప్రారంభించిన యాక్టివా 5జీని కొత్తగా అప్గ్రేడ్ చేసి మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ప్రామాణిక మోడల్ ధర రూ. 52,460 (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) గా నిర్ణయించింది. డీలక్స్ వెర్షన్ ధర రూ. 54,325(ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) గా ఉంది. స్కూటర్ల కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయనీ, డెలివరీలు వెంటనే ప్రారంభించాలని నిర్ణయించినట్టు హోండా ఒక ప్రకటనలో తెలిపింది. హోండా యాక్టివా 5జీ కొత్త అవతార్లో మార్పుల విషయానికి వస్తే.. కొత్త ఎల్ఈడా హెడ్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ డేలైట్స్ను పొందుపర్చింది. డీలక్స్ వెర్షన్లో కొత్త డిజిటల్ అనలాగ్మీటర్, 3 డీ ఎంబ్లమ్ను జోడించింది. 110 సీసీ నాలుగు-స్ట్రోక్ ఇంజిన్, 8బీహెచ్పీ పవర్, 9ఎన్ఎం టార్క్, గంటకు గరిష్టంగా 83 కి.మీ వేగం. సీవీటీ గేర్బాక్స్, రియర్ మోనోషాక్, కాంబీ బ్రేక్ సిస్టం,10-అంగుళాల అల్లాయ్ వీల్స్ విత్ 90/100 ట్యూబ్ లెస్ టైర్లు ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. డాజిల్ ఎల్లో, పర్ల్ స్పార్టన్ రెడ్ రంగుల్లో ఈ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. -
ఏవియేషన్ షోలో హోండా జెట్ప్లేన్ ప్రదర్శన
-
22,834 హోండా కార్లు వెనక్కు
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 22,834 కార్లను హోండా రీకాల్ చేసింది. ముందు సీట్లో కూర్చొనే ప్యాసింజర్కు అవసరమైన ఎయిర్బ్యాగ్ సిస్టమ్లో లోపాలు ఉన్నట్లు గుర్తించి వాటిని సవరించేందుకు వెనక్కు పిలిచింది. తకాటా కార్పొరేషన్ ఈ బ్యాగ్లను అమర్చనుంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 2013లో తయారు చేసిన హోండా సిటీ, జాజ్, అక్కార్డ్వంటి హోండా కార్లన్నింటిని రీకాల్ చేసింది. కొత్తగా అమర్చనున్న తకాటా ఎయిర్ బ్యాగ్లను ఉచితంగా అందించనున్నామని, తమ వినియోగదారుల నుంచి ఇందుకోసం ఎలాంటి వసూళ్లు చేయడం లేదని హోండా తెలిపింది. -
హోండా గ్రాజియా@ రూ. 57,897
ముంబై: దేశీ దిగ్గజ స్కూటర్ల తయారీ కంపెనీ ‘హోండా’ తాజాగా ‘గ్రాజియా’ పేరిట కొత్త ఆటోమేటిక్ స్కూటర్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. 8 అధునాత ఫీచర్లతో విడుదలైన ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.57,897(ఢిల్లీ ఎక్స్షోరూమ్). ఇది తన ఫ్లాగ్షిప్ మోడల్ ‘యాక్టివా’కు అడ్వాన్స్డ్ వెర్షన్లాంటిదని హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మినోరు కటొ చెప్పారు. ఈ నూతన స్కూటర్కు 125 సీసీ హెచ్ఈటీ ఇంజిన్ను అమర్చినట్లు కంపెనీ తెలిపారు. దీన్లో 8 అధునాత ఫీచర్లు ఉన్నాయని, వీటన్నింటికి కంపెనీ పేరిట పేటెంట్ ఉందని చెప్పారాయన. సెల్ఫోన్ చార్జర్ సౌకర్యం కూడా ఉంది. అయితే.. డిస్క్ బ్రేక్, చార్జీంగ్ సౌకర్యం హైఎండ్ మోడల్స్లో మాత్రమే ఉంటాయి. వీటి ధరల శ్రేణి రూ.57,827– రూ.62,269 మధ్య ఉంది. ఇక అన్ని మోడళ్లలోను ఆల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్, లీటరుకు 50 కిలోమీటర్లకుపైగా మైలేజ్, 3 స్టెప్ ఎకో–స్పీడ్ ఇండికేటర్, ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, సీట్ ఓపెనర్ స్విచ్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని మినోరు వివరించారు. ప్రధానంగా యువతను, పట్టణ కస్టమర్లను లక్ష్యంగా పెట్టుకొని కంపెనీ ఈ మోడల్ను ఆవిష్కరించింది. గ్రాజియా వల్ల సంస్థ అమ్మకాల్లో 20 శాతం వృద్ధి నమోదవుతుందని హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) వై.యస్.గులెరియా ధీమా వ్యక్తంచేశారు.