Konaseema District
-
కన్న తండ్రి కర్కశత్వం.. ఇద్దరు పిల్లలను కాలువలో పడేసి..
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: రామచంద్రపురం మండలం నెలపర్తిపాడులో దారుణం జరిగింది. తండ్రి పిల్లి రాజు గణపతినగర్ లాకుల వద్ద తన ఇద్దరు పిల్లలు సందీప్, కారుణ్యలను కాలువలో పడేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో పదేళ్ల బాబు బయటపడ్డాడు. ఆరేళ్ళ పాప మృతదేహం లభ్యమైంది.తండ్రి పిల్లి రాజు ఆచూకీ కోసం పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టారు. పిల్లల తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేదా పరారయ్యాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆర్ధిక ఇబ్బందులు నేపథ్యంలోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ద్రాక్షారామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
యాన్యువల్ డేకి వెళ్లాలి డాడి లే..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోకవరం మండలం కొత్తపల్లి శివారున పెట్రోల్బంక్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో(road accident) ఉపాధ్యాయుడు(Govt School Teacher) మృతి చెందగా అటవీశాఖ ఉద్యోగిని తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం దొలిపాడుకు చెందిన వలాల చిన్నబ్బాయి (52) జగ్గంపేట మండలం గోవిందపురం జిల్లా పరిషత్ హైసూ్కల్లో 2023 నుంచి సాంఘిక శాస్తం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. కొంత కాలంగా గోకవరంలో నివాసం ఉంటూ బైక్పై వెళ్లి వస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన వెళ్తుండగా అటవీశాఖలో గార్డుగా పని చేస్తున్న రెడ్డి విజయదుర్గ లిఫ్ట్ అడగడంతో ఆమెను ఎక్కించుకుని మళ్లీ ముందుకు సాగిపోయారు. కొత్తపల్లి శివారున పెట్రోల్ బంకు సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్ను జగ్గంపేట వైపు నుంచి ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నబ్బాయి అక్కడికక్కడే మృతి చెందగా విజయదుర్గ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న గోకవరం ఎస్సై పవన్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లలను పాఠశాల వద్ద దించి.. చిన్నబ్బాయికి భార్య పార్వతి, తొమ్మిదో తరగతి చదువుతున్న మేఘవర్షిణి, ఎనిమిదో తరగతి చదువుతున్న స్నేహిత ఉన్నారు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న వారిని పాఠశాల వద్ద దించి, అనంతరం ఇంటి నుంచి బయలుదేరి కొద్దిసేపటికే ఆయన మృత్యువాతపడ్డారు. యాన్యువల్ డేకి వెళ్లాలి డాడి లే.. ఆ చిన్నారులు చదువుతున్న పాఠశాల వార్షికోత్సవం శనివారం జరగనుంది. తన పిల్లలు ఆ కార్యక్రమానికి రావాలి డాడీ అని పిలవగా నేను రాను అన్న ఆయన మాటే నిజమైందని చిన్నబ్బాయి భార్య రోదించారు. యాన్యువల్డేకి వెళ్లాలి లే డాడీ అంటూ చిన్నారులు పోలీసులు వద్ద రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోలీస్స్టేషన్ వద్ద నుంచి ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడానికి వాహనాన్ని నిలపగా భార్య, కుమార్తెలు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. ఈ క్రమంలో వారిని ఎవరూ వారించలేకపోయారు. హెల్మెట్ ఉన్నా.. బైక్ నడిపే సమయంలో చిన్నబ్బాయి హెల్మెట్ కచ్చితంగా వాడతారు. ప్రమాదం జరిగినపుడు కూడా హెల్మెట్ ధరించినప్పటికీ కారు ఢీకొట్టిన వేగానికి హెల్మెట్ ముక్కలైపోయి తలకు గట్టి దెబ్బ తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఉపాధ్యాయుడి మృతి విషయం తెలుసుకున్న సహచర ఉపాధ్యాయులు భారీగా అక్కడకు చేరుకుని విచారం వ్యక్తం చేశారు. -
మందకొడిగా మొదలై...
సాక్షి, అమలాపురం: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి ఎన్నికల పోలింగ్ ఉదయం మందకొడిగా మొదలై... మధ్యాహ్నం నుంచి జోరందుకుంది. ఓటు వేసేందుకు పట్టభద్రులు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. కూటమి పార్టీలతో పాటు పీడీఎఫ్ మద్దతుదారులు పోలింగ్ ప్రక్రియలో ఉత్సహంగా పాల్గొనడంతో అంచనాలకు మించి ఓటింగ్ నమోదయ్యింది.ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి కోనసీమ జిల్లాలో 73.37 శాతం పోలింగ్ నమోదయ్యింది. జిల్లాలో 64,471 మంది పట్టభద్ర ఓటర్లు ఉన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు జిల్లావ్యాప్తంగా 47,301 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. వీరిలో పురుషులు 27,450 మంది కాగా, 19,850 మంది మహిళులో ఓటు వేశారు. ఒక ట్రాన్స్జండర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యువకుల నుంచి వయసు మళ్లిన వారి వరకు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. రాయవరం తహసీల్దార్ కార్యాలయంలో నవ వధువులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.ఎల్.ఎన్.రాజకుమారి పరిశీలించారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని ఆమె తెలిపారు.ఉదయం అంతంత మాత్రమేజిల్లాలో పోలింగ్ ఉదయం అంతంత మాత్రంగానే సాగింది. ఉదయం 10 గంటలకు 12.74 శాతం ఓటింగ్ నమోదు కాగా, మధ్యాహ్నం 12 గంటలకు ఇది 32.36 వరకు సాగింది. మధ్యాహ్నం 2 గంటలకు 50.48 శాతం నమోదయ్యింది. తరువాత నుంచి ఓటింగ్ జోరందుకుంది. సాయంత్రం నాలుగు గంటల సమయానికి 73.37 శాతం నమోదయినట్టు జిల్లా అధికారులు తెలిపారు.రామచంద్రపురంలో వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్టీ రామచంద్రపురం కో ఆర్డినేటర్ పిల్లి సూర్య ప్రకాష్, అమలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, ఎస్కేబీఆర్ కాలేజీలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావులు, ఐ.వెంకటేశ్వరరావు, రావులపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఓటింగ్లో పాల్గొన్నారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.అడుగడుగునా అధికార దుర్వినియోగంఎన్నికల కేంద్రాల వద్ద కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల వద్ద మెప్పు కోసం ఓట్లు లేనివారు సహితం పోలింగ్ కేంద్రాలకు వెళుతూ హడావుడి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడి ఓటు వేసేందుకు వచ్చినవారిని తమ పార్టీ అభ్యర్థి నంబరు, ఓటు వేయాల్సిన నంబరులు చెబుతూ వచ్చారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, ఇతర అధికారులు ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. పి.గన్నవరం పోలింగ్ కేంద్ర ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఓటర్లకు తమ కూటమి అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించడం గమనార్హం. అంబాజీపేట జెడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు 20 మంది ఓటర్లు ఉంటే బయట కూటమి నాయకులు 200 మంది వరకు మోహరించడం విశేషం.పోలింగ్లో కొరవడిన కూటమి నేతల ఉత్సాహంకొత్త ఓటర్ల నమోదులో చూపించిన ఉత్సాహం.. పోలింగ్ విషయంలో కూటమి నాయకులు చూపించి లేక పోయారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే కూటమి నేతలు, కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల బయట హడావుడి సృష్టించారు కాని అనుకూల ఓటింగ్ వేయించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇదే సమయంలో పీడీఎఫ్ ప్రతినిధులు వ్యూహాత్మకంగా వ్యవహరించి నిశ్శబ్దంగా తమ అనుకూల ఓటింగ్ వేయించుకున్నారు. కూటమి క్యాడర్ తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ పెద్దల వద్ద మార్కులు కొట్టేసేందుకు అన్నట్టుగా పోలింగ్ కేంద్రాల వద్ద హడావుడి చేశారు. అది చూసుకుని స్థానిక ఎమ్మెల్యేలు మురిసిపోయారు. కొత్తగా తమ ఆధ్వర్యంలో నమోదు చేసిన ఓటర్ల మీద కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్తోపాటు ఆయా పార్టీల మద్దతుదారులు భారీగా ఆశలు పెట్టుకున్నా ఆ ఓటర్లు సహితం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓటింగ్లో చూపించారని సమాచారం. మొత్తం మీద పోల్ మేనేజ్మెంట్లో కూటమి పార్టీలు విఫలమయ్యాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రచారంలోనే కాకుండా పోలింగ్ రోజున కూడా పీడీఎఫ్ ప్రతినిధులు వారి అనుకూలురు చాప కింద నీరులా వ్యవహరించి తమకు అనుకూలమైన ఓటును అత్యధికంగా వేయించుకున్నారు.జిల్లాలో మొత్తం ఓటర్లు64,416 మంది ఓటర్లుజిల్లాలో 73.37 శాతం ఓటింగ్ -
పదవీ విరమణకు ఒక్క రోజు ముందు ఆగిన గుండె
రాజోలు: అగ్నిమాపకశాఖలో ఫైర్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న భైరిశెట్టి బాలకృష్ణ(62)కు పదవీ విరమణకు ఒక రోజు ముందు గుండెపోటుతో రావడంతో గురువారం మృతి చెందారు. ఒక రోజు డ్యూటీ చేస్తే చాలని ఆ తర్వాత పూర్తిగా విశ్రాంతి జీవితం గడుపుదామని అనుకునే క్షణాల్లోనే గుండెపోటు ఆయనను శాశ్వత నిద్రలోకి నెట్టేసింది. రాజోలు గాంధీనగర్లో నివాసం ఉంటున్న ఆయన ముమ్మిడివరం అగ్నిమాపక కేంద్రానికి విధులు నిర్వర్తించేందుకు మోటార్ సైకిల్పై బయలుదేరారు. ఇంటికి కూతవేటు దూరం వెళ్లేసరికి పంచాయతీ రోడ్డులో ఛాతి బరువెక్కి తీవ్రమైన గుండె నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో స్థానికులు ఆయనను రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రాజోలులో లీడింగ్ ఫైర్మన్గా విధులు నిర్వహిస్తూ మూడు నెలల క్రితం పదోన్నతిపై ముమ్మిడివరం ఫైర్ ఆఫీసర్గా బదిలీపై వెళ్లారు. వివిధ హోదాల్లో సుమారు 22 ఏళ్ల పాటు ఆయన రాజోలు అగ్నిమాపక కేంద్రంలో పని చేశారు. ఈ నెల 28న ఫైర్ఆఫీసర్గా పదవీ విరమణ చేయనున్నారు. ఆయన అన్న కుమారుడు భైరిశెట్టి రాధాకృష్ణమూర్తి ఫిర్యాదు మేరకు రాజోలు ఎస్సై రాజేష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టమ్ అనంతరం బాలకృష్ణ మృతదేహాన్ని స్వగ్రామం మామిడికుదురు మండలం కంచివారిపాలానికి తరలించారు. ఆయన మృతి పట్ల రాజోలు అగ్నిమాపక సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.డ్రైవర్ అక్రమ సస్పెన్షన్పై కొనసాగుతున్న దీక్షలుఅమలాపురం రూరల్: అమలాపురం ఆర్టీసీ డిపోలో డ్రైవర్ బీఎస్ నారాయణ అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. డ్రైవర్ నారాయణ సస్పెన్షన్ ఎత్తివేయాలని, 1/19 సర్క్యులర్ కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళ ఉద్యోగులు గురువారం రిలే దీక్షలు నిర్వహించారు. యునైటెడ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి వి. గణపతి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లా యాజమాన్యం, డిపో యాజ మాన్యం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, నారాయణపై విధించిన అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. యునైటెడ్ వర్కర్ యూనియన్ డిపో కార్యదర్శి కె.రవికుమార్, ఎన్ఎంయూ జిల్లా కార్యదర్శి గణపతి మద్దతు తెలిపారు.పీఠంలో లింగోద్భవ పూజలురాయవరం: మండలంలోని వెదరుపాక విజయదుర్గా పీఠంలో బుధవారం అర్ధరాత్రి లింగోద్భవ పూజలు ఘనంగా నిర్వహించారు. పీఠంలోని విజయదుర్గా అమ్మవారి సన్నిధిలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ పూజలు నిర్వహించారు. పీఠంలో ఉన్న ఎనిమిది ఈశ్వర బాణాలకు రాత్రి 11గంటల నుంచి శివుడు లింగరూపంలో ఉద్భవించిన సమయం వరకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, అభిషేకం, అర్చనలు తదితర పూజలు నిర్వహించారు. వేద పండితులు చీమలకొండ వీరావధాని, శ్రీనివాసావధానులు, తోలేటి నాగేంద్రశర్మ, చక్రవర్తుల మాధవాచార్యులు తదితర 18 మంది వేద పండితులు ఈ పూజలను నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి లింగోద్భవ పూజలను వీక్షించారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. రాయవరం పార్వతీ సమేత రాజేశ్వరస్వామి, అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి, సోమేశ్వరంలోని శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత సోమేశ్వరస్వామి, చెల్లూరులోని అగస్తేశ్వరస్వామి, వెంటూరులోని ఉమా సమేత సోమేశ్వరస్వామి, వెదురుపాక పార్వతీ సమేత సోమేశ్వరస్వామి, మాచవరంలో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి, పసలపూడిలో రాజరాజేశ్వరస్వామి ఆలయాల్లో లింగోద్భవ పూజలు భక్తుల శివనామస్మరణ నడుమ పురోహితులు నిర్వహించారు. -
కోనసీమ నలుచెదురులా పురాణ ప్రసిద్ధి
సాక్షి, అమలాపురం: పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. గౌతమీ చెంతన వెలసిన కోటిపల్లిలో శ్రీపార్వతీ సమేత సోమేశ్వరస్వామి, నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూ.. వృద్ధ గౌతమీ నదీపాయ చెంతన వెలసిన భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి, క్షణ కాలంలో ముక్తిని ప్రసాదించే ముక్తేశ్వరం క్షణ ముక్తేశ్వరస్వామి, అనంత కుండల ఫలాన్ని ప్రదర్శించే కుండలేశ్వరంలోని కుండలేశ్వరస్వామి, దేశంలో ఎక్కడా లేని విధంగా శివపార్వతులు ఒకే పీఠంపై కొలువైన పలివెల ఉమా కొప్పేశ్వర స్వామి ఆలయం.. ఇలా చెప్పుకొంటూపోతే పచ్చని కోనసీమ నలుచెదురులా పురాణ ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలకు కొదవేలేదు. గోదావరి సప్త నదీపాయల ప్రవాహంతో పునీతమైన కోనసీమ బుధవారం జరిగే మహా శివరాత్రిని పురస్కరించుకుని ఆధ్యాత్మిక పరవళ్లు తొక్కనుంది.పంచారామం క్షేత్రం ద్రాక్షారామంపంచారామ క్షేత్రమైన త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయం. మహిమాన్విత శివలింగ క్షేత్రాల్లో ఇదొకటి. 12వ శక్తి పీఠంగా, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు ఇక్కడ వెలిశారు. దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇక్కడ శివ లింగం 18 అడుగుల ఎత్తు ఉంటోంది. -
సెల్ఫోన్ సిగ్నల్స్కు చర్యలు తీసుకోండి
అన్నవరం: రత్నగిరిపై సెల్ఫోన్ సిగ్నల్స్ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ షన్మోహన్కు అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు గురువారం లేఖ రాశారు. సత్యదేవుని సన్నిధిలో సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా లేక డిజిటల్ చెల్లింపులకు భక్తులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 11న సాక్షి దినపత్రిక ‘సిగ్నల్ ఇవ్వు స్వామీ..!’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై ఈఓ స్పందించి, కలెక్టర్కు ఈ మేరకు లేఖ రాశారు. అన్నవరం దేవస్థానంలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఉన్నప్పటికీ త్రీజీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఆ లేఖలో తెలిపారు. అవి కూడా చాలా బలహీనంగా ఉంటున్నాయన్న విమర్శలు భక్తుల నుంచి వస్తున్నాయన్నారు. జియో, ఎయిర్టెల్, వీఐ తదితర కంపెనీల సెల్ టవర్లు లేదా బూస్టర్లు రత్నగిరిపై లేవని, అందువలన వాటి సిగ్నల్స్ కూడా చాలా వీక్గా ఉంటున్నాయని వివరించారు. భక్తులకు డిజిటల్ పేమెంట్లు, వాట్సాప్ సేవలు త్వరితగతిన అందించాలంటే సెల్ఫోన్ సిగ్నల్స్ బాగా ఉండేలా ఆయా కంపెనీలు బూస్టర్లు ఏర్పాటు చేయాలని, దీనికి దేవదాయ శాఖ నిబంధనలను అనుసరించి తాము సహకారం అందిస్తామని పేర్కొన్నారు. -
రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
-
కోనసీమ: జగ్గన్నతోట ప్రభల తీర్థంలో అపశ్రుతి
సాక్షి, కోనసీమ జిల్లా: జగ్గన్నతోట ప్రభల తీర్థం(Jagganna Thota Prabhala Theertham)లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎడ్ల బండ్లు(Bullock carts) జనంలోకి దూసుకెళ్లడంతో బాలుడు సహా ముగ్గురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కూటమి నేతల కుటుంబ సభ్యుల కోసం ఎడ్ల బండ్లు ఏర్పాటు చేశారు. జనం నడవటానికే ఖాళీ లేని చోట ఎడ్ల బండ్లను ఏర్పాటు చేయడం విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కాగా, కోనసీమలో సంక్రాంతి నుంచి మక్కనుమ తరువాత రోజు వరకూ అన్ని మండలాల్లో ప్రభల తీర్థాలు జరుగుతాయి. చిన్నా పెద్దా అన్నీ కలిపి సుమారు 84 వరకూ ప్రభల తీర్థాలు నిర్వహిస్తారని అంచనా. సంక్రాంతి రోజున జరిగే తొలి ప్రభల తీర్థం కొత్తపేటదే. కనుమ రోజున నిర్వహించే.. మొసలపల్లి శివారు జగ్గన్నతోట తీర్థానికి ప్రత్యేకత ఉంది. కనుమ రోజున జరిగే తీర్థంలో 11 గ్రామాలకు చెందిన ప్రభలు ఈ తీర్థానికి తరలివస్తాయి.మొసలపల్లి భోగేశ్వరస్వామి, గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వరస్వామి, కె.పెదపూడి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వరస్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామిలు జగ్గన్నతోటలో సమావేశమై లోక కల్యాణార్థం చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.ఇదీ చదవండి: నెమలి ‘పుంజు’ తడాఖా.. పందెంలో ‘కోటి’ గెలిచిన కోడిగంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు ప్రభలు జగ్గన్నతోటను ఆనుకుని ఉండే ఎగువ కౌశికను దాటుకుని వచ్చే తీరు నయనానందకరంగా ఉంటుంది. తీర్థానికి చాలా మంది ఇప్పటికీ గూడు బండ్లపై రావడం సంప్రదాయమే. ఈ తీర్థానికి 50 వేల మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేశారు. వాకలగరువు సోమేశ్వరస్వామి, తొండవరం ఉమా తొండేశ్వరస్వామి, గున్నేపల్లి రామలింగేశ్వరస్వామి ప్రభలు 45 అడుగులు, 43 అడుగుల ఎత్తున నిర్మిస్తారు.మామిడికుదురు శివారు కొర్లగుంటలో జరిగిన ఈ తీర్థానికి సైతం అరుదైన గుర్తింపు ఉంది. ఇక్కడ ప్రభలు పంట కాలువలు, పచ్చని పొలాల మధ్య నుంచి తరలి వస్తుంటాయి. తీర్థానికి మామిడికుదురు, నగరం, పాశర్లపూడి, ఈదరాడ, పెదపట్నం గ్రామాల నుంచి 17 ప్రభలు వస్తాయి. పెదపట్నం నుంచి 12 ప్రభలు కొర్లగుంట తీర్థానికి రావడం గమనార్హం. వీటితోపాటు అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, అయినవిల్లి, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో పలుచోట్ల ప్రభల తీర్థాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. -
రిబ్బన్ కటింగ్కి కత్తెర లేదా?.. ఎమ్మెల్యే గిడ్డి అసహనం
సాక్షి, కోనసీమ జిల్లా: అంబాజీపేట మండలంలో క్రీడోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రీడోత్సవాల కోసం అంబాజీపేట జడ్పీ హైస్కూల్లో అధికారులు అరకొర ఏర్పాట్లు చేశారు. స్కూల్ మేనేజజ్మెంట్ కమిటీకి కనీసం హెచ్ఎంకు కూడా భాగస్వాము లేకుండా క్రీడోత్సవాలు ఏర్పాటు చేయటంపై ఆయన మండిపడ్డారు.కనీసం స్వాగత ఫ్లెక్సీ ఏర్పాటు చేయకపోవడంతో పాటు, రిబ్బన్ కటింగ్కి కత్తెర కూడా సకాలంలో అందచేయలేకపోవడంతో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమకు చెబితే క్రీడోత్సవాల ఏర్పాట్లు తామే చేసుకుంటామంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, క్రీడోత్సవాల ఏర్పాట్లపై ఎంఈవోలను కూటమి నేతలు నిలదీశారు. దీంతో తూతూ మంత్రంగా ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి అలిగి వెళ్లిపోయారు. -
రాష్ట్ర పండగగా ప్రభల తీర్థం
అంబాజీపేట: మండలంలోని జగ్గన్నతోటలో ఏటా సంక్రాంతికి నిర్వహించే ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండగగా గుర్తించాలని ఏకాదశ రుద్రాలయాల అర్చకులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆయా ఆలయాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబునాయుడుకు లేఖ రాసినట్టు నిర్వాహకులు తెలిపారు. 450 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రభల ఉత్సవాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలని వారు కోరారు. వ్యాఘ్రేశ్వరం (బాలాత్రిపుర సుందరి సమేత వ్యాఘ్రేశ్వర స్వామి), కె.పెదపూడి (పార్వతీ సమేత మేనకేశ్వర స్వామి), ఇరుసుమండ (బాలాత్రిపుర సుందరి సమేత ఆనందరామేశ్వర స్వామి), వక్కలంక (అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి), నేదునూరు (సర్వమంగళా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి), ముక్కామల (బాలాత్రిపురసుందరీ సమేత రాఘవేశ్వర స్వామి), మొసలపల్లి (బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి), పాలగుమ్మి (శ్యామలాంబా సమేత చెన్నమల్లేశ్వర స్వామి), గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత వీరేశ్వర స్వామి), గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి), పుల్లేటికుర్రు (బాలాత్రిపురసుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు) జగ్గన్నతోటలో కనుమ రోజున కొలువుదీరుతారు. ఈ తీర్థానికి జాతీయస్థాయి గుర్తింపు రావడంతో 2020లో ఈ ఉత్సవానికి సంబంధించి ఏకాదశ రుద్రుల ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివకేశవ యూత్ సభ్యులకు లేఖ రాశారు. అలాగే శృంగేరి పీఠాధిపతులు మరొక లేఖను పంపించారు. రెండేళ్ల క్రితం శివకేశవ యూత్ సభ్యులు, ప్రభల నిర్వాహకులు జగన్నతోట ప్రభల తీర్ధ విశిష్టతను కేంద్ర, రాష్ట్రాలకు లేఖ ద్వారా వివరించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆంధ్రప్రదేశ్ తరఫున ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలలో ప్రభలతీర్థాన్ని కళాజాతను ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఏకాదశ రుద్ర ఆలయాలకు నిధులు మంజూరు చేసి ఈ తీర్థాన్ని రాష్ట్ర పండగగా గుర్తించాలని వారు కోరుతున్నారు. -
AP: జనసేన నేత రేవ్ పార్టీ.. యువతులతో అసభ్యకర డ్యాన్స్!
సాక్షి, కోనసీమ: న్యూ ఇయర్ వేడుకల్లో జనసేన నేతలు రెచ్చిపోయారు. వేడుకల కోసం జనసేన పార్టీకి చెందిన నాయకుడు ఏకంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో యువతులతో అసభ్యకర నృత్యాలు చేస్తూ అర్థరాత్రి హంగామా చేశారు. కోనసీమ జిల్లాలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి జరిగిన రేవ్ పార్టీ వీడియోలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.వివరాల ప్రకారం.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ నాయకుడు వేలుపూరి ముత్యాలరావు అలియాస్ ముత్తు ఆధ్వర్యంలో డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రా రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. గొల్లపుంత రోడ్లో ఉన్న బుద్ధా స్టాచ్యూ ఓం సిటీ లేఅవుట్లో రేవ్ పార్టీ జరిపారు. సమాజం తలదించుకునేలా అసభ్యకర నృత్య ప్రదర్శనలతో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. రేవ్ పార్టీలో యువతులతో అసభ్యకరంగా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ రేవ్ పార్టీకి జనసేన నాయకులు సహా మరికొందరు హాజరైనట్టు తెలుస్తోంది. ఇక, రేవ్ పార్టీలో జనసేన నాయకుడు సహా అక్కడున్న వారంతా హంగామా క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో రేవ్ పార్టీపై ఆరాతీసిన పోలీసులు.. జనసేన నాయకుడితో సహా నలుగురిపై మండపేట పీఎస్లో కేసు నమోదు చేశారు. అయితే, జనసేన నేతలపై కేసు నమోదు చేయవద్దంటూ పోలీసులపై కొందరు నేతలు ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఈ కేసుపై పోలీసులకు హెచ్చరికలు సైతం వెళ్లినట్టు తెలుస్తోంది. -
అల్లు అర్జున్ను అరెస్టు చేస్తే చంద్రబాబును ఏం చేయాలి?
సాక్షి, అమలాపురం: హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతికి అల్లు అర్జున్ కారణమని అరెస్ట్ చేస్తే.. గత గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 29 మందికి చావుకు కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్టు చేయలేదని అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ ప్రశ్నించారు. అమలాపురంలో శుక్రవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. సంధ్యా థియేటర్ దుర్ఘటన చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనికి అల్లు అర్జున్ను బాధ్యుడిని చేసి, అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు.నాడు చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదుఅమలాపురం టౌన్: రాజమహేంద్రవరంలో 2015లో జరిగిన గోదావరి పుష్కరాల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది చనిపోయారని, నాడు ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ప్రశ్నించారు. తొక్కిసలాట, మృతి కారణంగా ఇప్పుడు సినీ హీరో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం ఎంత మాత్రం సబబు కాదని స్పష్టం చేశారు. అమలాపురంలో ఆయన శుక్రవారం రాత్రి స్థానిక మీడియాతో మాట్లాడారు. నాడు పుష్కరాల్లో జరిగిన ఘోరానికి చంద్రబాబును అరెస్ట్ చేయనప్పుడు.. ఇప్పుడు అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం తప్పే అవుతుందని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఇదే విషయాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నానని చెప్పారు. ‘ఎన్నో తొక్కిసలాటలు జరుగుతాయి. ఎందరో చనిపోతూంటారు. అలాంటిచోట్లకు వెళ్లిన లెజెండ్లను అలా చేయమని ఎవరూ చెప్పరు. యాదృచ్ఛికంగా జరిగిన తొక్కిసలాటలకు వారిని బాధ్యులను చేయడం కరెక్ట్ కాదు’ అని అన్నారు. పైపెచ్చు ఆ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా ప్రకటించారని గుర్తు చేశారు. ఇలాంటి అరెస్టులను, ఘటనలను ప్రజలు సమర్థించరని హర్షకుమార్ స్పష్టం చేశారు.నేషనల్ రోలర్ స్కేటింగ్లో ప్రతిభఅంబాజీపేట: నేషనల్ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో ఇసుకపూడి శివారు పెండిపేటకు చెందిన కుంచే హన్షిత్ సిల్వర్ మెడల్ సాధించాడు. కర్ణాటక రాష్ట్రం మైసూర్లో ఈ నెల 5 నుంచి 15వ తేదీ వరకూ 62వ నేషనల్ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్– 2024 పోటీలు నిర్వహించారు. 5 నుంచి 7 ఏళ్ల వయసు బాలుర విభాగంలో హన్షిత్ పాల్గొని సిల్వర్ మెడల్ కై వసం చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు కుంచే రమేష్, శ్వేత శుక్రవారం చెప్పారు. ఇప్పటి వరకూ హన్షిత్ పలు పతకాలు సాధించాడు. 2024లో రాయపూర్లో జరిగిన ఆరేళ్ల గ్రూప్ ఓపెన్ నేషనల్స్లో గోల్డ్, బ్రాంజ్ మెడల్స్, అక్టోబర్లో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్లో జరిగిన ఓపెన్ నేషనల్స్లో సిల్వర్ మెడల్, జిల్లా స్థాయి పోటీల్లో గోల్డ్, బ్రాంజ్ మెడల్స్, నవంబర్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ నిర్వహించిన 36వ రాష్ట్ర స్థాయి పోటీల్లో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించాడు. చిన్న వయసులోనే తమ కుమారుడు జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.16న జాబ్మేళాకాకినాడ సిటీ: కలెక్టరేట్లోని వికాస కార్యాలయం ఆధ్వర్యాన ఈ నెల 16న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ కె.లచ్చారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టారస్ కంపెనీలో బీపీఓ, వరుణ్ మోటార్స్లో టీమ్ లీడర్, ఎగ్జిక్యూటివ్ సేల్స్, అడ్వైజర్, పెయింటర్ అండ్ డెంటర్, రిలయన్స్ ట్రెండ్స్లో రిటైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఇండో ఎంఐఎం, హోండాస్ మోబీస్, పానసోనిక్ అండ్ కేఐఎంఎల్ కంపెనీల్లో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన 30 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకూ జీతం, ఆయా ఉద్యోగాలను బట్టి ఇన్సెంటివ్లు, భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న వారు ఆ రోజు ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ ఆవరణలోని వికాస కార్యాలయానికి సర్టిఫికెట్ల జిరాక్సులతో హాజరు కావాలని లచ్చారావు సూచించారు. -
Konaseema: ఏపీలో ఘోర ప్రమాదం
-
కోనసీమలో ఘోర ప్రమాదం.. పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు
సాక్షి, కోనసీమ జిల్లా: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతావారిపేట వద్ద అదుపుతప్పి కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు కుమారులు గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి తండ్రి బయటపడ్డారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.నేలపూడి విజయ్ కుమార్ భార్య, పిల్లలతో విశాఖపట్నం వెళ్లి తిరిగి పోతవరం వస్తుండగా చింతావారిపేట వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో భార్య ఉమ కారు డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య అమలాపురం రూరల్ పేరూరు పంచాయతీ తలుపులపేటకు చెందిన అంబటి రాజు (22) బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆదివారం ర్రాతి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సినిమాకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన రాజు ఆదివారం రాత్రి 10 గంటలకు బ్రిడ్జి వద్దకు వచ్చి మోటారు సైకిల్ని పార్కు చేసి, చెప్పులు వదిలి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అదే సమయంలో కొంతమంది మోటారు సైకిల్ను పార్కు చేసి ఉండడాన్ని గమనించారు. సోమవారం ఉదయం వరకు మోటారు సైకిల్ బ్రిడ్జిపైనే పార్కు చేసి ఉండడంతో ప్రయాణికులు గమనించి 100కి సమాచారం ఇచ్చారు. దీంతో అల్లవరం పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారులతో గాలించగా నదిలో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని ఒడ్డుకి చేర్చారు. మృతుడు తండ్రి పాపారావు ఫిర్యాదుతో అల్లవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఏ కారణం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడో విచారణలో తెలియవలసి ఉంది. మృతుడుకి తండ్రి, తల్లి ఉన్నారు. -
కోనసీమలో ‘కోడ్’ ఉల్లంఘన
సాక్షి, అంబేద్కర్ జిల్లా: కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతోంది. సమయం దాటిన తర్వాత కూడా మద్యం విక్రయాలు కొనసాగుతున్నా.. ఎక్సైజ్శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 5వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు వైన్ షాపులు మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ వైన్ షాపులు యథేచ్ఛగా వైన్ షాపులు కొనసాగుతున్నాయి. -
కోనసీమ: వైద్య ఆరోగ్య శాఖలో మామూళ్ల కలకలం
సాక్షి, కోనసీమ జిల్లా: జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో మామూళ్ల కలకలం రేపుతోంది. ప్రతి పనికి కార్యాలయంలో మామూళ్లు వసూలు చేస్తున్నారంటూ వాట్సాప్లో మెడికల్ ఆఫీసర్లు చర్చించుకుంటున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఉన్నతాధికారులు స్పందించారు. వైద్య ఆరోగ్య శాఖ జిల్లా కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై డీఎంహెచ్వో దుర్గారావు దొర ఆరా తీశారు. శ్రీధర్ అనే క్లర్క్ మామూళ్లు వసూలు చేసినట్లు నిర్ధారణ అయ్యింది.మెడికల్ ఆఫీసర్లను డీఎంహెచ్వో తన కార్యాలయానికి పిలిపించుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఆర్లో ఎంట్రీలు నమోదు చేసేందుకు, ప్రసూతి సెలవులకు, నాలుగు నుంచి పదివేల రూపాయలు చొప్పున వసూలు చేసినట్టు సమాచారం. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎం అండ్ హెచ్వో తెలిపారు.కాగా, రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖకు అవినీతి రోగం పట్టుకుంది. లంచాలు మరిగిన కొందరు అధికారులు సొంత శాఖ ఉద్యోగులనే డబ్బు కోసం వేధింపులకు గురిచేస్తున్న వ్యవహారం ఆ శాఖలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఉన్నతాధికారుల అనుమతుల్లేకుండా జిల్లాల్లో అనధికార డిప్యుటేషన్ల్లోనూ డీఎంహెచ్వోలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అనంతపురం జిల్లాలో 20 మందికిపైగా ఉద్యోగులు డీఎంహెచ్వో కార్యాలయంలో డిప్యుటేషన్పై పనిచేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులందాయి. పనిచేయాల్సిన చోట కాకుండా జిల్లా కేంద్రంలో కొనసాగడానికి వీరు పెద్ద ఎత్తున ఓ ఉన్నతాధికారికి లంచాలు ముట్టజెప్పినట్టు విమర్శలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.గుంటూరు డీఎంహెచ్వో ఆఫీస్లోనూ అధికారుల అనుమతుల్లేకుండానే కొందరు శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు డిప్యుటేషన్పై కొనసాగుతున్నారు. అర్బన్ పీహెచ్సీల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు,చిరుద్యోగులను క్లర్కులుగా కొనసాగిస్తూ వారి ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. -
చనిపోయాడనుకున్న వ్యక్తి బతికిరావడంతో బంధువుల షాక్..
-
రోడ్డు ప్రమాదాల నివారణకు ఐఆర్ఏడీ యాప్
అమలాపురం టౌన్: తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అందుకు అనుగుణంగా అప్రమత్తమయ్యేలా రాష్ట్ర పోలీస్ శాఖ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటా (ఐఆర్ఏడీ) యాప్ను రూపొందించి దాని అమలుకు చర్యలు చేపట్టింది. జిల్లా పోలీసు శాఖ ఈ యాప్ను వినియోగించే విధానాలపై సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చింది. ప్రతీ పోలీస్ స్టేషన్లో ఎస్సై నుంచి కానిస్టేబుల్ వరకూ ఈ యాప్పై అవగాహన కల్పిస్తోంది. ఎస్పీ బి.కృష్ణారావు ఈ నెల 16న యాప్ను ప్రారంభించారు. ఐఆర్ఏ డేట్ బేస్ నమోదు గురించి జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీసు స్టేషన్ల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఐఆర్ఏడీ రోల్ అవుట్ మేనేజర్ జీవీ రామారావు, డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డు బ్యూరో (డీసీఆర్బీ) సీఐ వి.శ్రీనివాసరావుల ఈ శిక్షణ తరగతులను పర్యవేక్షించారు.రోడ్డు ప్రమాదాల స్పాట్లను గుర్తించేది ఇలా..ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశానికి పోలీస్ దర్యాప్తు అధికారి (ఐవో) వెళ్లి అక్కడ ఐఆర్ఏడీ యాప్ ద్వారా ప్రమాద సమాచారాన్ని నమోదు చేయాలి. ఇదే స్పాట్లో గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగాయా? లేదా? అనే అంశంపై ఆ అధికారి అక్కడే అధ్యయనం చేస్తారు. ఒకవేళ అదే స్పాట్లో తరచూ ప్రమాదాలు జరుగుతుంటే ఆ విషయాన్ని యాప్లో నమోదు చేయాలి. ఈ సమాచారాన్ని ఇటు ఎస్పీ కార్యాలయానికి, అటు రాష్ట్ర పోలీస్ కార్యాలయానికి యాప్ ద్వారా పంపించాలి. యాప్లో రోడ్డు ప్రమాదాల సమాచారాన్ని నమోదు చేస్తూనే అక్కడ ఇక ముందు రోడ్డు ప్రమాదాల జరగకుండా సూచనలు, జాగ్రత్తలతో అప్రమత్తం చేసే దిశగా చర్యలు చేపడతారు. వాహనాల డ్రైవర్లకు తెలిసేలా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు బోర్డులు ఏర్పాటు చేస్తారు.అవగాహన పెంచాలికొత్తగా వచ్చిన ఐఆర్ఏడీ యాప్పై పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయి అవగాహనతో ఉండడమే కాకుండా వాహన చోదకులకు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది ఎక్కడికక్కడ రోడ్డు ప్రమాదాల నివారణ నిబంధనలపై అవగాహన కల్పించాలని ఎస్పీ కృష్ణారావు యాప్ శిక్షణ తరగతుల్లో సూచించారు. వాహన చోదకులు విధిగా హెల్మెట్లు ధరించాలని, సీటు బెల్ట్లు పెట్టుకోవాలని స్పష్టం చేశారు. వాహనాలను నిర్లక్ష్యంగా, పరధ్యానంగా నడపకుండా డ్రైవింగ్ సమయంలో పూర్తి అప్రమత్తతో ఉండాలని సూచించారు. సెల్ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ఎంత ప్రమాదకరమో వాహన చోదకులకు పోలీసు అధికారులు తరుచూ కౌన్సెలింగ్ ద్వారా తెలియజేయాలన్నారు. లైసెన్స్ను లేకుండా టీనేజ్ పిల్లలకు మోటారు సైకిళ్లు నడిపే అధికారం లేదని, తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పులు తీసుకురావాలని సూచించారు. మానవ తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం ఎంత క్షోభిస్తుందో, ఎంతటి నష్టం చేకూరుతుందో డ్రైవింగ్ చేసే వ్యక్తులకు కనువిప్పు కలిగేలా వివరించాలని ఎస్పీ కృష్ణారావు జిల్లా పోలీస్ సిబ్బందికి సూచించారు. -
మహాసేన రాజేష్పై కేసు నమోదు
సాక్షి, కోనసీమ: ఏపీలో మహాసేన రాజేష్పై పోలీసు కేసు నమోదైంది. సోషల్ మీడియాలో మహాసేన రాజేష్, ఆయన అనుచరులు వేధిస్తున్నారని మహిళ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లాలో టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్పై కేసు నమోదుచేశారు పోలీసులు. మహాసేన రాజేష్, అతడి అనుచరులు వేధిస్తున్నారని శంకరగుప్తం గ్రామానికి చెందిన శాంతి ఫిర్యాదుతో కేసు నమోదైంది. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ సందర్బంగా ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో, రాజేష్తో పాటు నలుగురు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అచ్చెన్నాయుడు సమక్షంలో కూటమి నేతల కుమ్ములాట
సాక్షి, కోనసీమ జిల్లా: అమలాపురంలో కూటమి నేతల సమావేశం రసాభాసగా మారింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలోనే కూటమి నేతలు కుమ్ములాటకు దిగారు. జనసేన నేతలను చిన్నచూపు చూస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పవన్ ఫొటో లేకపోవడంపై ఆందోళనకు దిగారు. సమావేశానికి జనసేన నేత కల్వకొలను తాతాజీ డుమ్మాకొట్టగా.. టీడీపీ నేత రమణబాబు సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.పొత్తు ధర్మాన్ని విస్మరించిన టీడీపీ.. ఓ జనసైనికుడి ఆవేదన.. వీడియో వైరల్నరసరావుపేట: కూటమి ప్రభుత్వ పొత్తు ధర్మానికి టీడీపీ నాయకులు తూట్లు పొడుస్తున్నారని, జనసైనికులను పెదగార్లపాడులో బానిసలుగా చూస్తున్నారని జనసైనికుడు ఎన్.వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన అవేదనను వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో సోమవారం పొస్ట్ చేయటంతో వైరల్గా మారింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ వరకు ఈ వీడియో చేరేలా షేర్ చేయాలని ఆయన కోరాడు.టీడీపీ నాయకులు జనసైనికులను ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో, బానిసలుగా ఎలా చూస్తున్నారో వీడియోలో వివరించాడు. ఎన్నికల వరకు తమతో ఎంతో ఉత్సాహంతో టీడీపీ నాయకులు కలిసి పనిచేశారని, అధికారం వచ్చాక టీడీపీ నేతల నిజస్వరూపం చూపిస్తున్నారని పేర్కొన్నాడు. పొత్తు ధర్మాన్ని పాటించకుండా జనసైనికులు తొత్తుల్లాగా, బానిసలుగా ఉండాలనే విధంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని వాపోయాడు.ఉపాధి అవకాశాలు కల్పించే విషయాల్లో టీడీపీ నాయకులు జనసేనని భాగస్వాములు చేయకుండా అన్ని టీడీపీ నాయకులే తీసుకుంటున్నారని అవేదన వ్యక్తం చేశాడు. ‘అసలు ఎవర్రా మీరు. మీరు వచ్చి మమ్మల్ని అడిగేది ఏందిరా’ అని టీడీపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని, పదిలో తమకు కనీసం మూడు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరితే కుదరదని నాయకులు చెబుతున్నారని పేర్కొన్నాడు. ఇది కూటమి ప్రభుత్వానికి మంచి ప్రయాణం కాదని తెలిపాడు.ఇదీ చదవండి: అధికారంలోకి వచ్చినా అవే డ్రామాలు! -
చనిపోయినా నలుగురిలో సజీవంగా నిలిచిన ఉపాధ్యాయురాలు
-
రెండు జిల్లాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుల నియామకం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ రెండు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కురసాల కన్నబాబు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా పినిపే విశ్వరూప్ నియమితులయ్యారు.జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా తన్నీరు నాగేశ్వరరావు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా మల్లాది విష్ణు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మార్గాని భరత్రామ్లను నియమించారు.కాగా, పార్టీ నేతలతో వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న(శుక్రవారం) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాల వైఎస్సార్సీపీ నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించి వారికి దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: కల్తీ.. బాబు సృష్టే -
భార్యను స్వదేశానికి తీసుకురావాలంటూ వేడుకోలు
అమలాపురం రూరల్: బెహ్రయిన్లో తన భార్య ఇబ్బందులు పడుతోందని, స్వదేశానికి తీసుకురావాలంటూ ఓ వ్యక్తి కలెక్టర్ను వేడుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం నడిపూడికి చెందిన దుక్కిపాటి పావని ఓ ఏజెంట్ ద్వారా గత నెల 25న బెహ్రయిన్లోని ఓ ఇంట్లో పని నిమిత్తం వెళ్లింది. అక్కడ అనేక అవస్థలు పడుతున్నట్లు ఆమె ఫోన్లో ఆడియో రికార్డింగ్ ద్వారా కుటుంబ సభ్యులకు సందేశం పంపింది. అక్కడికి వెళ్లినప్పటి నుంచి తిండి, నీరు లేక అలమటిస్తున్నానని ఆమె పేర్కొంది. తన ఆరోగ్యం క్షీణించిందని తనను ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకురావాలని పావని వేడుకుంది. ఈ మేరకు భార్య ఆడియో రికార్డింగ్తో భర్త దుర్గాప్రసాద్, ఇద్దరు పిల్లలతో వచ్చి సోమవారం అమలాపురం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ మహేష్ కుమార్కు ఫిర్యాదు చేశారు. తన భార్యను ఎలాగైనా తిరిగి ఇంటికి తీసుకురావాలని కలెక్టర్ను కోరారు. -
కోనసీమ జిల్లాలో జాతీయ జెండాకు అవమానం
సాక్షి, కోనసీమ జిల్లా: టీడీపీ నేతల నిర్లక్ష్యం కారణంగా కోనసీమ జిల్లాలో జాతీయజెండాకు అవమానం జరిగింది. 78వ స్వాతంత్య్య దినోత్సవం సందర్భంగా అమలాపురం రూరల్ మండలం గున్నేపల్లి అగ్రహారం పంచాయతీలో జాతీయజెండాను టీడీపీ నేతలు తిరగేసి ఆవిష్కరించారు. దీంతో వేడుకలకు హాజరైన పలువురు టీడీపీ నేతల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.స్వాతంత్ర దినోత్సవం.. ఎంతోమంది త్యాగమూర్తుల బలిదానాలకు వారి త్యాగాలకు నిదర్శనం.. అందుకే ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండాను ఎగురవేస్తూ ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఎంతో విశిష్టత కలిగిన మూడు రంగుల జెండా.. పైన కాషాయం, మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ.. ఐక్య భావానికి, విజయ గీతానికి సూచికగా నిలుస్తోంది. అలాంటి జాతీయ జెండాను టీడీపీ నేతలు అవమానించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మంత్రి కాన్వాయ్ అడ్డుకుని మందుబాబులు రచ్చ..
-
రాజమండ్రి : గోదావరి ఉగ్రరూపం..నీట మునిగిన లంక గ్రామాలు (ఫొటోలు)
-
కోనసీమ జిల్లా: ప్రేమ పేరుతో ప్రియుడి మోసం.. యువతి విన్నూత నిరసన
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: ప్రియుడితో పెళ్లి జరిపించాలని కోరుతూ యువతి వినూత్నంగా నిరసన తెలిపింది. రాజోలు మండలం పొన్నమండ గ్రామానికి చెందిన సరెళ్ల తేజస్వినిని వివాహం చేసుకుంటానని అదే గ్రామానికీ చెందిన కుక్కల స్టాలిన్ అనే యువకుడు నమ్మించి మోసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినా తనకు న్యాయం జరగలేదంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.తక్షణమే న్యాయం జరగాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తన గోడును అంబేద్కర్ విగ్రహానికి మొరపెట్టుకున్న బాధితురాలు తేజస్విని.. తనను మోసం చేసిన వ్యక్తితోనే పెళ్లి జరిపించాలని.. లేదంటే అతని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. -
కోనసీమలో భారీ వర్షాలు..నీట మునిగిన లంక గ్రామాలు (ఫొటోలు)
-
కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ కలకలం
సాక్షి,అంబేద్కర్ కోనసీమ జిల్లా : కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లిలో గ్యాస్ లీకేజీ కలకలం సృష్టిస్తోంది. ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరు బావి నుంచి గ్యాస్ ఎగిసిపడుతోంది.బోర్ బావి నుంచి 15 మీటర్ల మేర పైకి ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. -
రెచ్చిపోయిన జనసేన.. అర్ధరాత్రి విధ్వంసం..
-
నేనున్నాను.. అంబులెన్స్లో పేషెంట్కు సీఎం జగన్ భరోసా
మండపేట(డా. అంబేద్కర్ కోనసీమ జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. జననేతకు అడుగడుగునా జనం నీరాజనాలు పడుతూ మేమంతా సిద్ధం అంటూ సంఘీభావం తెలుపుతున్నారు. భానుడు భగభగమని మండిపోతున్నా జననేతను చూసి తమ మద్దతు తెలిపేందుకు ప్రజలు పోటెత్తుతున్నారు. సీఎం జగన్ బస్సుయాత్రలో ప్రతీ జంక్షన్ సైతం భారీ బహిరంగ సభల్ని తలపిస్తుండటం విశేషం. నేటి(గురువారం) మేమంతా సిద్ధం బస్సుయాత్ర 17వ రోజులో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. బస్సుయాత్ర చేపట్టిన దగ్గర్నుంచీ ఇప్పటికే ఎంతో అనారోగ్య బాధితులికి తానున్నానంటూ భరోసా ఇచ్చిన సీఎం జగన్.. ఈరోజు అంబులెన్స్లో వచ్చిన ఓ పేషెంట్కి సైతం తాను ఉన్నానంటూ మంచి మనసును చాటుకున్నారు. మండపేట నియోజకవర్గం మడికి గ్రామంలోకి సీఎం జగన్ బస్సుయాత్ర ప్రవేశించగా, ఓ అంబులెన్స్ ఆ యాత్ర మధ్యలోకి వచ్చి ఆగింది విషయం తెలుసుకున్న సీఎం జగన్.. అంబులెన్స్లో వచ్చిన పేషెంట్ను కలిశారు. అతని బంధువులతో మాట్లాడగా, సహాయం కావాలని వారు సీఎం జగన్ను కోరారు. ప్రమాదంలో గాయపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్కు మరింత సహాయం కావాలని సీఎం జగన్కు వారు విజ్ఞప్తి చేశారు. దానికి సానుకూలంగా స్పందించిన సీఎం జగన్.. అవసరమైన సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఆ పేషెంట్ బంధువులకు తానున్నాననే భరోసా ఇచ్చారు సీఎం జగన్. -
TDP సూపర్ సిక్స్.. అట్టర్ఫ్లాప్ ఫిక్స్
అధికారం కోసం ఎడాపెడా హామీలిచ్చేయడం.. ఆనక గాలికొదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇలానే 2014లో అలవి కాని హామీలు 650 వరకూ ఇచ్చేసి.. గద్దెనెక్కిన తరువాత వాటిని తుంగలో తొక్కేసిన ఆయన.. మేక వన్నె పులిలా.. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి వస్తూ సూపర్ సిక్స్ పేరిట గుప్పిస్తున్న హామీలు ఏవిధంగా నమ్ముతామని ప్రజలు పెదవి విరుస్తున్నారు. 2014 ఎన్నికల్లో రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఏ ఒక్కరూ రుణ వాయిదాలు చెల్లించవద్దని చంద్రబాబు ఢంకా బజాయించి మరీ చెప్పారు. బంగారం తనఖా పెట్టి తీసుకున్న రుణాలు కూడా చెల్లించవద్దని, తాను అధికారంలోకి రాగానే వాటిని విడిపిస్తానని గొప్పగా చెప్పారు. చంద్రబాబు మాటలు అమాయకంగా నమ్మిన చాలామంది తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదు. చివరకు రుణ భారం తడిసి మోపెడై, బ్యాంకుల నుంచి నోటీసులు కూడా అందుకుని అవమానాల పాలైన రైతులు, డ్వాక్రా మహిళలు లబోదిబోమన్నారు. తనఖా పెట్టిన బంగారం బ్యాంకుల నుంచి ఇంటికి వచ్చేస్తుందని నమ్మి మోసపోయారు. రైతులకు ‘బాబు’గారి జెల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లక్ష మందికి పైగా రైతులు సహకార, వాణిజ్య బ్యాంకుల నుంచి ఏటా రూ.3,290 కోట్ల రుణాలు తీసుకుంటారు. వారికి రూ.లక్ష వరకూ రుణమాఫీ చేస్తామని 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. చివరకు అరకొరగా రూ.25 వేల లోపు మాత్రమే చేసి, మధ్యలోనే వదిలేసి, రైతులను నిలువునా ముంచేశారు. అటువంటి చంద్రబాబు ఇప్పుడు ఇస్తున్న హామీలను ఏవిధంగా నమ్మాలని రైతులు ప్రశి్నస్తున్నారు. డ్వాక్రా మహిళలను మోసం చేశారిలా.. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు డ్వాక్రా సంఘాల మహిళలకు రుణమాఫీ ప్రకటించారు. అది నమ్మి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 1,10,336 స్వయం సహాయక సంఘాల్లోని 10,71,078 మంది మహిళలు అప్పటికి తమపై ఉన్న రూ.1,07,107 కోట్ల రుణాలు మాఫీ అయిపోతాయని సంబరపడ్డారు. తీరా గద్దెనెక్కిన తర్వాత చంద్రబాబు చిల్లిగవ్వ కూడా మాఫీ చేయకుండా దగా చేశారు. దీంతో ఆయనకు ఓట్లేసి మోసపోయామని డ్వాక్రా మహిళలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు పసుపు – కుంకుమ పేరిట ప్రతి డ్వాక్రా మహిళకు మూడు విడతలుగా (రూ.2,500, రూ.3,500, రూ.4,000) రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. తీరా దానిని కొంతమందికే పరిమితం చేశారు. అది కూడా రూ.2,500, రూ.3,500 మాత్రమే బ్యాంకుల్లో జమ చేశారు. మిగిలిన రూ.4 వేలకు చెక్కులు ఇచ్చి ఏప్రిల్ చివరిలో మార్చుకోవాలని సూచించారు. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ చెక్కులు కాస్తా చెల్లుబాటు కాకుండా పోయాయి. వాటిని మహిళలు చిత్తుకాగితాల్లా చెత్తబుట్టలో వేయాల్సి వచ్చింది. నిరుద్యోగులకు కుచ్చుటోపీ 2014 ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగం ఇచ్చేంత వరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, కొంత మందికి మొక్కుబడిగా రూ.1,000 చొప్పున వేసి చేతులు దులిపేసుకున్నారు. ఇంకా కాపులకు రిజర్వేషన్, ముస్లింలకు ప్రధాన నగరాల్లో హజ్ హౌస్లు నిర్మిస్తామంటూ ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు గాలికొదిలేశారు. ఇలా అప్పట్లో ఆయన ఇచ్చిన హామీల్లో దేనినీ నెరవేర్చకుండా ప్రజలను నిలువునా వంచించారు. చివరకు టీడీపీ అధికారి వెబ్సైట్ నుంచి నాడు ఇచ్చిన మేనిఫెస్టోను సైతం మాయం చేసేశారు. అప్పట్లో ఇన్ని మోసాలు చేసిన చంద్రబాబు.. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని జనం నిలదీస్తారనే జంకూ గొంకూ లేకుండా ఈ ఎన్నికల వేళ సూపర్ సిక్స్ పథకాలు అంటూ మరోసారి చేస్తున్న ప్రచారాన్ని నమ్మబోమని ప్రజలు స్పష్టంగా చెప్పేస్తున్నారు. కూటమిలోని జనసేన, బీజేపీల తరఫున టీడీపీ నుంచి చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలతో ఇస్తున్న నాలుగు పేజీల బుక్లెట్ను చాలామంది ఏమాత్రం చూడకుండా పక్కన పడేస్తున్నారు. చంద్రబాబు తీరుకు పూర్తి భిన్నంగా గత ఎన్నికల వేళ మేనిఫేస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం పైగా అమలు చేసిన వైఎస్సార్ సీపీకే తమ మద్దతు అని స్పష్టం చేస్తున్నారు. ఇవి చదవండి: టీడీపీలో ‘ఆడియో’ దుమారం -
కోనసీమలో జనసేనకు ఎదురుదెబ్బ
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమలో జనసేనకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేన పార్టీకి అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు రాజీనామా చేశారు. అమలాపురంలో పార్టీ అధిష్టానం చాలా అన్యాయం చేసిందని రాజబాబు మండిపడ్డారు. అమలాపురంలో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని.. జనసైనికులు, వీర మహిళల ఆశయాల మీద నీళ్లు చల్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ అమలాపురం సీటును టీడీపీకి కేటాయించారు. తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా అనైతికంగా సీటు దక్కించుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఉద్యమాలు చేసి అమలాపురంలో జనసేన జెండాను నిలబెట్టాను. టీడీపీ జెండా మోయడానికి సిద్ధంగా లేము. పవన్ కల్యాణ్ ఓ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి పార్టీ ఇంచార్జ్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నాను’’ అని రాజబాబు తెలిపారు. -
ఎన్నికల పాఠం
కోనసీమ జిల్లా: వంద శాతం పోలింగ్ కావాలంటే విద్యార్థుల పాత్ర కీలకం. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పిస్తే తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారితో ఓటు వేయిస్తారు. అందుకే విద్యార్థి దశ నుంచే సాంఘిక శాస్త్రంలో ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠం ముద్రితమైంది. ఇది ప్రజాస్వామ్యం, ఓటు హక్కు విలువను తెలియజేసేందుకు ఉపయోగపడుతుంది. ఎన్నికల వ్యవస్థ నుంచి ఓటుహక్కు వినియోగం వరకు విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యాంశం రూపొందించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల అవసరాన్ని గుర్తించి 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పడింది. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించగా, ఆ ఎన్నికల్లో 17.32 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలో ఓటర్ల సంఖ్య 92 కోట్లకు చేరింది. 6వ తరగతి నుంచి.. విద్యార్థి దశ నుంచే ఓటు హక్కు విలువ, ఎన్నికల విశిష్టతను తెలియజేసేందుకు విద్యార్థులకు పాఠ్యాంశాలను సాంఘికశాస్త్రంలో పొందుపర్చారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠశాల దశలోనే విద్యార్థులకు పరిచయం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రత్యక్ష, పరోక్ష ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు ఇలా పలు అంశాలను విద్యార్థులకు పరిచయం చేశారు. ► 6వ తరగతిలో ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రత్యక్ష, పరోక్ష ప్రజాస్వామ్య, పార్లమెంటరీ వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు, అధిక ఓటర్లు తీసుకునే నిర్ణయం, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించే ప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిని ఎన్నుకునే విధానం, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించే విధానం, నమూనా ఎన్నికల నిర్వహణ గురించి వివరించారు. మెజారిటీ పాలన, ఆర్టికల్ 326, విశ్వజనీన వయోజన ఓటుహక్కు గురించి వివరించారు. ► 7వ తరగతిలో సార్వజనీన వయోజన ఓటు హక్కు, ప్రజాస్వామ్యం, గణతంత్రం, రాజ్యాంగ రూపకల్పనా చరిత్ర, ప్రాథమిక హక్కులు, విధులు, బాధ్యతాయుతమైన పౌరసత్వం, దేశభక్తి, స్వీయ క్రమశిక్షణ, శాసనసభ్యుని ఎన్నిక, రహస్య ఓటింగ్ విధానం తదితర భావనలను విద్యార్థులకు పరిచయం చేశారు. ► 8వ తరగతిలో మనకు పార్లమెంట్ ఎందుకు అవసరం? పార్లమెంట్ ఎలా ఏర్పడుతుంది? రాజ్యాంగంలో సార్వత్రిక ఓటు హక్కు ఎలా ప్రవేశ పెట్టారు? ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం, 2004 సాధారణ ఎన్నికల నుంచి వినియోగించిన విధానం, ఈవీఎంల వినియోగించడం వల్ల 1,50,000 చెట్లను రక్షించుకోగలగడం, బ్యాలెట్ పత్రాల ముద్రణకు అవసరమయ్యే 8వేల టన్నుల కాగితం ఉపయోగపడిన అంశం తదితర విషయాలను వివరించారు. ► 9వ తరగతిలో ‘ఎన్నికల రాజకీయాలు’ అనే చాప్టర్లో భారతదేశంలో ఎన్నికలను మదింపు చేయడం, వివిధ నియోజకవర్గాల మధ్య సరిహద్దు రేఖలను నిర్ణయించడం, ఎన్నికల ఫలితాలను ప్రకటించే వరకు ఎన్నికల్లో వివిధ దశలను వివరించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరిగేలా చూడడంలో ఎన్నికల సంఘం పాత్రను వివరించారు. భారతదేశంలో ఎన్నికల విధానం, రిజర్వ్ నియోజకవర్గాలు, ఓటర్ల జాబితా, అభ్యర్థులు నామినేషన్ వేసే విధానం, విద్యార్హతలు, పోలింగ్ జరిగే విధానం, ఓట్ల లెక్కింపు తదితర విషయాలను ప్రస్తావించారు. ఎన్నికల సంఘం స్వతంత్రత గురించి వివరిస్తూనే ఎన్నికలు ప్రకటన చేసినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల సంఘం నిర్వహించే ప్రతి అంశాన్ని పాఠ్యాంశాల్లో పొందుపర్చారు. ఎన్నికల సంఘం విధులకు సంబంధించి చక్కటి ఫొటోలతో, విద్యార్థులను ఆకట్టుకునే విధంగా పాఠ్యాంశాల రూపకల్పన చేపట్టారు. -
రాష్ట్రమంతా ఒకెత్తు ఆ గ్రామం ఒకెత్తు
-
ఫొటోగ్రాఫర్ దారుణ హత్య
ఆలమూరు/మధురవాడ/పీఎం పాలెం : సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని ఈవెంట్ చేద్దామని పిలిచి, స్నేహితుడితో కలిసి ఓ ఫొటోగ్రాఫర్ను హత్య చేసిన దారుణ ఘటన ఇది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. విశాఖ మధురవాడ సమీపంలోని బక్కన్నపాలేనికి చెందిన పోతిన సాయి(21)కి ఫొటోలు, వీడియోలు తీయడం హాబీ. అతడికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం గ్రామానికి చెందిన షణ్ముఖ తేజతో సోషల్ మీడియాలో పరిచయమేర్పడింది. ఈ క్రమంలో సాయి వద్ద రూ.12.70 లక్షల విలువైన కెమేరాలు, ఇతర పరికరాలున్నాయని తేజ గుర్తించాడు. వాటిని ఎలాగైనా స్వా«దీనం చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టడంతో అతడు పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో తాను కూడా ఫొటోగ్రాఫర్నని, ఏవైనా ఈవెంట్లు ఉంటే కలసి చేద్దామని సాయిని నమ్మించాడు. రాజమహేంద్రవరంలో ఈవెంట్ ఉందని సాయిని తేజ నమ్మించాడు. సాయి గత నెల 26వ తేదీ మధ్యాహ్నం విలువైన కెమేరాలు, పరికరాలతో రైల్లో రాజమహేంద్రవరం చేరుకున్నాడు. అప్పటికే తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకకు చెందిన స్నేహితుడు వినోద్కుమార్తో తేజ రైల్వేస్టేషన్లో వేచి ఉన్నాడు. అద్దెకు తీసుకున్న కారులో సాయిని ఎక్కించుకుని, సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ సాయంత్రానికి వేమగిరి చేరుకున్నారు. పథకం ప్రకారం అక్కడే సాయిని తేజ, వినోద్కుమార్లు హత్య చేసి మృతదేహాన్ని అదే రోజు అర్ధరాత్రి 216ఎ జాతీయ రహదారిపై ఉన్న జొన్నాడ గ్రామం వరకూ వచ్చి.. అక్కడి గౌతమీ గోదావరి తీరంలో పూడ్చివేశారు. అనుమానం వచ్చిందేమో! కారులో తనను ఇష్టానుసారంగా తిప్పడం వల్లో ఏమోగానీ తేజపై సాయికి అనుమానం వచ్చింది. మధ్యలో కారు ఫొటోతో పాటు తేజ ఫోన్ నంబర్ను కూడా తన తల్లి రమణమ్మకు వాట్సాప్లో పంపాడు. ఈ నేపథ్యంలో మూడు రోజులైనా సాయి ఇంటికి రాకపోవడం, అతడి ఫోన్, తేజ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో సాయి తల్లిదండ్రులు గత నెల 29న విశాఖపట్నం పోతినమల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కారు యజమానిని ప్రశి్నంచి కొంత సమాచారం రాబట్టారు. కాగా, విశాఖ కంచరపాలేనికి చెందిన యువతితో తేజ చాటింగ్ చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. యువతిని విచారించగా.. ఈ హత్యాపన్నాగం బయట పడినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అమలాపురం సీటు కోసం సిగపట్లు
సాక్షి, అమలాపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం అసెంబ్లీ బరిలో ఈసారి టీడీపీకి అవకాశం లేదనే ప్రచారం బలంగా జరుగుతోంది. ఇక్కడ నుంచి జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే అంశంపై జనసేన పార్లమెంటరీ ఇన్చార్జి శేఖర్తోపాటు, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ల నాగ సతీష్ ఆదివారం పవన్ కళ్యాణ్ను కలిశారు. అమలాపురం ఆత్మగౌరవానికి సంబంధించిందని వదులుకోవద్దని ఆయనకు స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే సీటును జనసేనకు ఇవ్వడాన్ని టీడీపీ నేత ఆనందరావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టీడీపీ నేతలు వాసంశెట్టి సుభాష్ , గంధం పల్లంరాజు పేరుతో ఆనందరావుకు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సుభాష్, పల్లంరాజులు కోనసీమకు అంబేడ్కర్ పేరును ప్రభుత్వం పెట్టిన సమయంలో జరిగిన అల్లర్లలో నిందితులుగా ఉన్నారని, వారి పేరిట ప్రచారం చేపడితే ఉన్న కాస్త అవకాశాలనూ కోల్పోతామని టీడీపీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. -
చంద్రబాబు ఝలక్.. జనసేన కౌంటర్!
సాక్షి అమలాపురం: ఓ వైపు జనసేనతో పొత్తు ఉందని చెబుతారు..మరోవైపు తమ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిస్తారు..ఇదీ బాబు మార్కు మిత్ర ధర్మం. రానున్న ఎన్నికల్లో టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఉందని ఇరు పార్టీల అధినేతలూ ప్రకటించారు. కానీ సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక ఇప్పటివరకూ కొలిక్కి రాలేదు. అయినప్పటికీ టీడీపీ చేపట్టిన ‘రా.. కదలి రా’ సభల్లో మాత్రం తమపార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ చంద్రబాబు పిలుపునివ్వడం జనసేన నేతలకు, ఆశావహులకు మింగుడుపడడం లేదు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు ‘రా... కదలిరా..’ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అసెంబ్లీ, పార్లమెంటరీ జనసేన ఇన్చార్జీలు, నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుతం వారు ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్నారు. వాస్తవానికి సభలో టీడీపీ కార్యకర్తలకన్నా జన సైనికుల సందడే అధికంగా ఉంది. ఇంతమంది ఉన్న సభలో చంద్రబాబు.. మండపేట నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వేగుళ్ల జోగేశ్వరరావును మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆ సమయంలో జనసేన మండపేట ఇన్చార్జి వేగుళ్ల లీలాకృష్ణ అక్కడే ఉన్నారు. సభలో తమ అభ్యర్థి జోగేశ్వరరావు అని బాబు ప్రకటించడంతో లీలాకృష్ణతో పాటు జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. బాబు పక్కనే ఉన్న గంటి హరీష్ను మాత్రం పార్లమెంట్కు పంపాలని బాబు పిలుపునివ్వకపోవడం గమనార్హం. ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారు? సీట్ల సర్దుబాటు ఖరారు కాకున్నా.. చంద్రబాబు ఏకపక్షంగా తమ పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించడం చూసి, జనసేన ఆశావహులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ అధినేత పవన్కళ్యాణ్ ప్రమేయం లేకుండా ఇలా ఏకపక్షంగా జోగేశ్వరరావును మళ్లీ గెలిపించండంటూ చంద్రబాబే పిలుపునివ్వడంపై జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. పొత్తు ధర్మానికి విరుద్ధంగా బాబు ప్రవర్తించడంతో టీడీపీ కార్యక్రమాలకు కార్యకర్తలెవ్వరూ వెళ్లవద్దంటూ జనసేన నియోజకవర్గ ఇన్చార్జి లీలాకృష్ణ ఆదేశించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. లీలాకృష్ణ తానలా చెప్పలేదన్నా.. జనసేన అనుకూల సోషల్ మీడియాలో టీడీపీపై సెటైర్లు కొనసాగుతూనే ఉన్నాయి. చాలాచోట్ల టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు తమదే సీటు అంటూ ప్రచారం చేస్తుండడం కూడా జనసేన ఇన్చార్జిలకు మింగుడు పడడంలేదు. ‘మా పార్టీ అధినేత పొత్తుకు వెళ్లినట్టు లేదు.. కాళ్ల బేరానికి వెళ్లినట్టుంది’ అంటూ సగటు జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
Prabhala Teertham 2024 Photos: కోనసీమ జిల్లాలో కన్నుల పండువగా ప్రభల తీర్థం (ఫొటోలు)
-
కోనసీమ జిల్లా: టీడీపీ నేతలకు అంగన్వాడీల ఝలక్
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: అమలాపురంలో టీడీపీ నేతలకు అంగన్వాడీలు ఝలక్ ఇచ్చారు. ధర్నాలో ఉన్న అంగన్వాడీలకు మద్దతు పలికేందుకు వచ్చిన టీడీపీ నేతలను పొమ్మంటూ అంగన్వాడీలు తెగేసి చెప్పారు. తమను గుర్రాలతో తొక్కించి, తమపై దాష్టీకం ప్రదర్శించిన చంద్రబాబు మద్దతు తమకు అవసరం లేదని తేల్చి చెప్పడంతో అంగన్వాడీల రియాక్షన్కు టీడీపీ నాయకులు బిత్తరపోయారు. ఏం మాట్లాడాలో తెలియక 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఎందుకు గుర్తు చేస్తారంటూ టీడీపీ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా వదిలిపెట్టని అంగన్వాడీలు... మీ మద్దతు మాకు అవసరం లేదంటూ మొహం మదే చెప్పేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు బిక్క మొహంతో వెనుదిరిగారు. ఇదీ చదవండి: అంగన్వాడీల సమస్యలపై సర్కారు సానుభూతి -
కోనసీమ ‘ప్రభ’
సాక్షి, అమలాపురం: కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ప్రభల తీర్థం. ఇది సంక్రాంతి పండుగ వేళ జరుపుకోవడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ. దేశ రాజధాని న్యూఢిల్లీలో గతేడాది అట్టహాసంగా జరిగిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర శకటంపై కొలువుదీరిన ఈ ప్రభల తీర్థం భారతీయుల మనస్సులను గెలిచాయి. కోనసీమ ‘ప్రభ’ను నలుదిక్కులా చాటి చెప్పాయి. వివరాల్లోకి వెళితే...డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగే ప్రభల తీర్థాలకు ఐదు శతాబ్దాల చరిత్ర ఉంది. అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట తీర్థానికి జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. తీర్థం జరిగే ప్రాంతంలో గుడి, గోపురాలు ఉండవు. కౌశిక నదిని ఆనుకుని ఉన్న కొబ్బరి తోటలో ఈ తీర్థం జరగడం ఇక్కడి ప్రత్యేకత. తీర్థం జరిగే ప్రాంతం చుట్టూ ఉన్న రెండు నియోజకవర్గాల పరిధిలోని మూడు మండలాలకు చెందిన పదకొండు ప్రభలు ఇక్కడకు వస్తాయి. ఇక్కడ జరిగే ప్రభల తీర్థం లోక కల్యాణార్థం అని భక్తుల విశ్వాసం. పెద్దాపురం సంస్థానా«దీశుడు రాజా వత్సవాయి జగన్నాథరాజు (జగ్గన్న) హయాంలో తొలిసారిగా 17వ శతాబ్ధంలో ఈ తీర్థాన్ని ప్రారంభించారని చెబుతారు. మహారాజుకు పరమేశ్వరుడు స్వప్నంలో సాక్షాత్కరించి ప్రభల తీర్థం నిర్వహించమని కోరారంటారు. అప్పటి నుంచి ఇక్కడ తీర్థం జరుగుతోందని భక్తుల విశ్వాసం. మరో కథలో.. 17వ శతాబ్దంలో పరమ శివభక్తుడు, ఏకసంధాగ్రాహి అయిన విఠలా జగ్గన్న ఇక్కడున్న కౌశిక నది చెంతన శివ పూజ చేసేవారు. ఇందుకు పెద్దాపురం సంస్థానాధీశుడు అభ్యంతరం చెప్పడంతో హైదరాబాద్ నిజాం నవాబును తన ప్రతిభతో మెప్పించి ఇప్పుడు తీర్థం జరిగే జగ్గన్నతోట వద్ద 8 పుట్లు (64 ఎకరాలు) భూమిని దానంగా పొందారని చెబుతారు. ఈ కారణంగానే ఇది జగ్గన్నతోటగా పేరొందిందని నమ్మకం. ప్రభల తీర్థాలు జరిగేదెక్కడంటే.. జగ్గన్నతోటతో పాటు కొత్తపేట సెంటర్, అవిడి డ్యామ్ సెంటర్, కాట్రేనికోన, మామిడికుదురు మండలం కొర్లగుంట వంటి చోట్ల పెద్ద తీర్థాలు జరుగుతాయి. ఇవికాకుండా జిల్లా వ్యాప్తంగా 84 వరకూ తీర్థాలు నిర్వహిస్తారు. 60 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తున ప్రభలు ఉంటాయి. ప్రభలు తయారు చేయడాన్ని యజ్ఞంగా భావిస్తారు. తాటి శూలం, టేకు చెక్క, పోక చెట్ల పెంటిలు, మర్రి ఊడలు, వెదురు బొంగులతో మూడు రోజులపాటు శ్రమించి ప్రభలు తయారు చేస్తారు. రంగురంగుల నూలుదారాలు (కంకర్లు), కొత్త వ్రస్తాలతో అందంగా తీర్చిదిద్దుతారు. ప్రభపై పసిడి కుండ ఉంచి చుట్టూ నెమలి పించాలు, జేగంటలు వేలాడదీస్తారు. వరి కంకుల కుచ్చులు, గుమ్మడి, ఇతర కూరగాయలు, పెద్దపెద్ద పూల దండలతో ప్రభకు వేలాడదీస్తారు. వీటిని భక్తులు తమ భుజస్కంధాలపై ఉంచి కిలోమీటర్ల కొద్దీ మోసుకు వస్తారు. కొబ్బరి తోటలు, వరిచేలు, పంట కాలువల మీదుగా సాగే ప్రభల యాత్ర చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. జాతీయస్థాయిలో గుర్తింపు గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివ కేశవ యూత్ సభ్యులు ఈ తీర్థ విశేషాలను ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తూ 2020లో మెయిల్ చేశారు. దీంతో మోదీ తీర్థాన్ని అభినందిస్తూ తిరిగి సందేశం పంపించారు. గతేడాది ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో రాష్ట్ర ప్రభుత్వ శకటంపై జగ్గన్నతోట తీర్థాన్ని ప్రదర్శించారు. దీంతో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. గతేడాది ప్రముఖ సినీ నటుడు నాగార్జున నటిస్తున్న ఒక సినిమాలో విజువల్స్ కోసం ప్రభల తీర్థాన్ని చిత్రీకరించారు. యువత ప్రభల తీర్థాలపై పలు లఘు చిత్రాలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఈ తీర్థానికి పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. దీంతో ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేసి, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మకర సంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ కాలంలో ప్రభలను ఊరి పొలిమేర దాటిస్తే ఊరుకు మంచిదనేది ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసమని అర్చకుడు చంద్రమౌళి కామేశ్వరశాస్త్రి తెలిపారు. -
Konaseema: ‘ఏపీలో సామాజిక విప్లవం.. సీఎం జగన్ చేతల్లో చూపించారు’
సాక్షి, కోనసీమ జిల్లా: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర 40వ రోజుకు చేరుకుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో మల్కిపురంలో బస్సు యాత్ర సాగింది. మలికిపురంలోని కేఎస్ఎన్రాజు నివాసంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం రెండు గంటలకు శివకోడు లాకుల నుండి బస్సుయాత్ర ప్రారంభమైంది. మలికిపురం ప్రధాన సెంటర్లో నిర్వహించిన బహిరంగలో మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, విశ్వరూప్, ఎంపీలు అనురాధ, మోపిదేవి తదితరులు హాజరయ్యారు. మలికిపురంలో సామాజిక సాధికార సభ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం జగన్: మంత్రి విశ్వరూప్ సభలో మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధి సీఎం జగన్ హయాంలోనే జరిగిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం నెరవేర్చారన్నారు. సామాజిక సాధికారతను సీఎం జగన్ చేతల్లో అమలు చేసి చూపించారని, రాష్ట్రంలో సామాజిక విప్లవం నడుస్తోందని మంత్రి అన్నారు. 2024లో జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఉంది. అంబేద్కర్ స్ఫూర్తితో నడుస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్. అభివృద్ధి చదువు ద్వారానే సాధ్యమవుతుందన్న అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టిన నాయకుడు. బీసీ, ఎస్సీ ఎస్టీల మైనార్టీల ఆత్మ గౌరవాన్ని గుర్తించిన వ్యక్తి జగన్’’ అని మంత్రి కొనియాడారు. చంద్రబాబు బీసీలను బానిసలుగా చూసేవాడు: మంత్రి వేణు మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, రాజోలు నియోజకవర్గం నాకు పుట్టిల్లు. ఇక్కడ నేతలు కృష్ణంరాజు, జక్కంపూడిల సహకారంతో ఎదిగాను. వైఎస్సార్, సీఎం జగన్ నాకు రాజకీయంగా గుర్తింపునిచ్చారు. చంద్రబాబు బీసీలను బానిసలుగా చూసేవాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల ఆత్మగౌరవం గుర్తించిన వ్యక్తి సీఎం జగన్ మాత్రమే. అబద్ధం 14 ఏళ్ల పాటు పాలించింది.. జగన్ అనే నిజం వెలుగులోకి వచ్చి ప్రజల సమస్యలు తీర్చింది’’ అని మంత్రి వేణు పేర్కొన్నారు. వారు తలెత్తుకుని జీవించగలుగుతున్నారు: మోపిదేవి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ, పేదల సమస్యల గురించి మాట్లాడే నాయకులను మాత్రమే గతంలో చూశాం.. సమస్యలను పరిష్కరించి, చేతల్లో అభివృద్ధిని చూపిన నాయకుడు సీఎం జగన్ మాత్రమే. అంబేద్కర్ ఆలోచన విధానాలను అక్షరాల అమలు చేసిన నాయకుడు సీఎం జగన్. చిన్న వర్గాలకు చెందిన బీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు చెందిన అనేక మందికి సీఎం జగన్ మార్కెట్ చైర్మన్లుగా, దేవాలయాలు చైర్మన్లుగా పదవులిచ్చి సమాజంలో గౌరవం కల్పించారు’’ అని ఎంపీ చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు తలెత్తుకుని జీవించగలుగుతున్నారంటే అది వైఎస్ జగన్ వల్లే సాధ్యమైంది. ఈ వర్గాలకు నిజమైన సాధికారత చేకూరింది. ఎవరి దగ్గర చేయి చాచకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు వాళ్ల కాళ్లపై వాళ్లు జీవించగలిగే పరిస్థితిని జగన్ కల్పించారు. దేశంలోని అత్యున్నతమైన రాజ్యసభ పదవులు నలుగురు బీసీలకు జగన్ కట్టబెట్టారు. చంద్రబాబు తన పార్టీలో డబ్బున్న వారికి రాజ్యసభ స్థానాలు అమ్ముకుంటాడు. 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు బీసీలకు చిన్నపాటి రాజకీయ హోదా కూడా చంద్రబాబు ఇవ్వలేకపోయాడు. 2024లో కూడా సీఎంగా జగనే రావాలి’’ అని మోపిదేవి పేర్కొన్నారు. ఇదీ చదవండి: Volunteer Jobs: ఏపీ బాటలో తెలంగాణ! -
స్పెయిన్ అబ్బాయి.. కోనసీమ అమ్మాయి
మలికిపురం: స్పెయిన్ అబ్బాయి.. కోనసీమ అమ్మాయి దిండి రిసార్ట్స్లో ఇరు కుటుంబాల నడుమ సంప్రదాయబద్ధంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన సంజనా కోటేశ్వరి స్పెయిన్లో ఉద్యోగం చేస్తోంది. అదే దేశంలో ఓ బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్న రొసిజ్ఞాని, సంజనా మనసులు కలిశాయి. ఇరుకుటుంబాల నుంచి గ్రీన్సిగ్నల్ రావడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి 3.36 గంటలకు (తెల్లారితే గురువారం) దిండి రిసార్ట్స్లో వీరి వివాహం ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. స్పెయిన్ నుంచి వరుడు, వరుడి తల్లిదండ్రులు, మేనత్త, సోదరి, బావతో పాటు 40 మంది బంధువులు ఈ నెల 1న దిండి రిసార్ట్స్కు చేరుకున్నారు. ఆ రోజు నుంచి తెలుగు సంప్రదాయాల ప్రకారం వివాహ ఘట్టాలను శాస్త్రోక్తం గా జరిపించారు. పెళ్లికి హాజరైన స్పెయిన్ మహిళలు నిండైన చీరలు, మగవారు కుర్తా పైజమా వంటి సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. వధువు సంజనా కోటేశ్వరి చిన్నాన్న, అంబాజీపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సీఈవో కుంపట్ల అయ్యప్పనాయుడు. ఆయనే స్థానికంగా పెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
అమెరికాలో ఘోర ప్రమాదం.. ఏపీ ఎమ్మెల్యే బంధువుల దుర్మరణం
కన్సాస్, సాక్షి: అమెరికా సంయుక్త రాష్ట్రం కన్సాస్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వాసులుగా తెలుస్తోంది. అయితే.. జాన్సన్ కౌంటీ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీ కొట్టాయి. మృతి చెందిన వాళ్లు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులుగా తేలింది. టెక్సాస్ నుంచి డల్లాస్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సతీష్ చిన్నాన్న నాగేశ్వరరావు, ఆయన భార్య ,కుమార్తె మనవడు, మనమరాలు, మరో బంధువు అక్కడికక్కడే మృతి చెందారు. నాగేశ్వరరావు అల్లుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
నేడు ఎమ్మిగనూరు, మండపేటలో సామాజిక సాధికార యాత్ర
సాక్షి, తాడేపల్లి: ఏపీ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని ఆత్మీయంగా పలకరించేందుకు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు చేపట్టిన యాత్ర నేడు ఎమ్మిగనూరు, మండపేటలో సాగనుంది. కర్నూలు జిల్లా: ఎమ్మినూరులో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగనుంది. మండల పరిషత్ కార్యాలయంలో 3.30 గంటలకు ముఖ్య నేతలతో ముఖాముఖి అనంతరం.. 4.30కుఎద్దుల మార్కెట్ నుండి సోమప్ప సర్కిల్ మీదుగా వైఎస్సార్ సర్కిల్కు వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు బస్టాండ్ ఎదుట బహిరంగ సభ జరగనుంది. మంత్రులు అంజాద్ భాష, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, మా జీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ , ఎంపీ. సంజీవ్ కుమార్, తదితరులు హాజరుకానున్నారు. కోనసీమ జిల్లా మండపేటలో ఎమ్మెల్సీ తీట త్రిమూర్తులు ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు తాపేశ్వరంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం మండపేటలోని పూలే విగ్రహం నుంచి కలువ పువ్వు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు కలువు పువ్వు సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రి జోగి రమేష్, ఎంపీలు పిల్లి సుభాస్ చంద్రబోస్, మార్గాని భరత్, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ, తదితరులు హాజరుకానున్నారు. ఇదీ చదవండి: ఏపీ ఎన్నికలకు కసరత్తు.. నేడు, రేపు ఈసీ సమీక్ష -
సామాజిక న్యాయం సీఎం జగన్ చేసి చూపించారు: మంత్రి కారుమూరి
సాక్షి, కోనసీమ జిల్లా: కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగింది. మధ్యాహ్నం రావులపాలెంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుండి బైకు ర్యాలీ ప్రారంభమైంది. ఎనిమిది కిలోమీటర్లు మేర బస్సు యాత్ర సాగింది. సాయంత్రం కొత్తపేటలో జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడారు. సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించారని మంత్రి కారుమూరు నాగేశ్వరావు అన్నారు. అన్ని వర్గాలకు రాజ్యాంగ బద్ధమైన పదవులు ఇచ్చారన్నారు. టీడీపీ-జనసేన పొత్తుపై మంత్రి మాట్లాడుతూ, పైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిశారని కిందిస్థాయిలో ఏ ఒక్క కార్యకర్త కలవలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేరుగా ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని, ఇంతకంటే ఏం కావాలని పేద వర్గాలు అంటున్నాయని మంత్రి పేర్కొన్నారు. జైలు ఊచలు లెక్కపెట్టిన చంద్రబాబు.. కంటి ఆపరేషన్ అని చెప్పి బయటకు వచ్చాడు. ఇప్పుడు గుండెకాయ రోగం వచ్చిందట అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, నాడు -నేడు వంటి కార్యక్రమాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాల పిల్లలు అభివృద్ధిని సూచిస్తున్నాయి. ఎంతోమందికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి డాక్టర్లు, ఇంజనీర్లు చేసిన ఘనత వైఎస్సార్కు దక్కుతుంది. ఆయనకంటే నాలుగు అడుగులు ఎక్కువ వేసిన ఘనత ఆయన కుమారుడు జగన్కే దక్కుతుందని మంత్రి కారుమూరి అన్నారు. నాడు నేడుతో మారిన స్కూళ్ల రూపురేఖలు: మార్గాని భరత్ మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ తీసుకొచ్చారని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రాష్ట్రంలో పేద వర్గాల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.. మరి చంద్రబాబు మనవడిని ఎక్కడ చదివిస్తున్నాడో చంద్రబాబు చెప్పాలి. నాడు-నేడుతో ఏడున్నర దశాబ్దాల స్కూళ్ల పరిస్థితిని సీఎం జగన్ మార్చేశారని మార్గాని పేర్కొన్నారు. చదవండి: జగ్గంపేటలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చ -
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర.. 15వ రోజు షెడ్యూల్ ఇలా..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర 15వ రోజుకు చేరుకుంది. సామాజిక సాధికార యాత్ర నేడు విజయనగరం, కోనసీమ జిల్లాలో జరుగనుంది. విజయనగరంలో ఎమ్మెల్యే కంభాల జోగులు ఆధ్వర్యంలో బస్సుయాత్ర ప్రారంభం కానుంది. అలాగే, కోనసీమ జిల్లా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగనుంది. విజయ నగరం రాజాంలో బస్సుయాత్ర ఇలా.. ►విజయనగరం జిల్లా రాజాంలో ఎమ్మెల్యే కంభాల జోగులు ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►ఉదయం 11:30 గంటలకు బొద్దాంలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్న వైఎస్సార్సీపీ నేతలు ►మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్సార్సీపీ నేతల ప్రెస్ మీట్ ►మధ్యాహ్నం 12.30 గంటలకు బైక్ ర్యాలీ ప్రారంభం ►భోజన విరామం అనంతరం పాలకొండ రోడ్డులోని జెజె ఇన్నోటెల్ వరకు ర్యాలీ, బస్సు యాత్ర. ►మధ్యాహ్నం మూడు గంటలకు రాజాంలో బహిరంగ సభ. కోనసీమ జిల్లా కొత్తపేటలో ఇలా.. ►కోనసీమ జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►మధ్యాహ్నం ఒంటి గంటకు రావులపాలెంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ►మధ్యాహ్నం రెండు గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుండి బైకు ర్యాలీ ప్రారంభం ►ఎనిమిది కిలోమీటర్లు జరుగనున్న బస్సు యాత్ర ►సాయంత్రం నాలుగు గంటలకు కొత్తపేట సెంటర్లో బహిరంగ సభ -
అమలాపురంలో స్టూడెంట్స్ మధ్య గ్యాంగ్ వార్
-
లే‘టేస్ట్’ ట్రెండ్..!
మండపేట: నాటుకోడి... కౌజుపిట్ట... కొర్రమీను... ఇదీ ఇప్పుడు ట్రెండ్.. అటు రెస్టారెంట్లలో అందరి దృష్టి వీటిపైనే ఉంటోంది. ఇటు పెంపకంలోనూ వీటిపైనే యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. కొందరు ఉద్యోగం చేస్తూనే తమకున్న ఆసక్తి మేరకు కొద్దిపాటి స్థలంలో గేదెలు, ఆవులు, నాటుకోళ్లు, కౌజుపిట్టలు, కొర్రమీను చేపలు వంటివి ఒకేచోట పెంచుతూ అదనపు ఆదాయం పొందుతున్నారు. ఇదే తరహాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం పాలతోడు గ్రామానికి చెందిన పిల్లా విజయ్కుమార్ కేవలం ఆరు సెంట్ల స్థలంలో నాటుకోళ్లు, కౌజుపిట్టలు, కొర్రమీను చేపలను ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతున్నాడు. నెలకు రూ.40వేల వరకు ఆదాయం పొందుతున్నాడు. డిప్లొమా సివిల్ ఇంజినీరింగ్ చదివిన విజయ్కుమార్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో సివిల్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. చిన్నతనం నుంచి పశుపోషణ, కోళ్ల పెంపకంపై ఆసక్తి కలిగిన అతను తన సొంతూరులో ఆరు సెంట్ల స్థలంలో నాలుగేళ్ల కిందట మూడు గేదెలు, రెండు ఆవులతో డెయిరీఫాం, నాటుకోళ్ల పెంపకం ప్రారంభించాడు. డెయిరీఫాం బాగానే ఉన్నా కార్మికుల సమస్యతో దానిని మధ్యలోనే ఆపేశాడు. అనంతరం కోళ్ల పెంపకంపై దృష్టి పెట్టాడు. భీమవరం నుంచి మేలుజాతి కోడిపుంజులు, పెట్టలను తీసుకువచ్చి గుడ్లు ఉత్పత్తి చేయించి ఆర్గానిక్ తరహాలో పెంచడం ప్రారంభించాడు. ఆ తర్వాత హోటళ్లలో కౌజుపిట్టలకు మంచి గిరాకీ ఉందని గుర్తించి... రెండేళ్లుగా వాటిని కూడా పెంచుతున్నాడు. అంతటితో ఆగకుండా గతంలో ఏర్పాటుచేసిన డెయిరీ ఫాంలో పశువుల కోసం నిర్మించిన నీటి తొట్టెలలో ఏడాది నుంచి కొర్రమీను చేపల పెంపకం ప్రారంభించాడు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూనే వారానికి ఒకసారి ఒకసారి వచ్చి అన్నీ చూసుకుని వెళతాడు. ఆయనకు కుటుంబ సభ్యులు సాయం చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోల ఆధారంగా ఎప్పటికప్పుడు మెళకువలు తెలుసుకుంటూ కోళ్లు, చేపలు, కౌజుపిట్టల పోషణ చేస్తున్నాడు. యూట్యూబ్లో చూసి గుడ్లను పొదిగించేందుకు ఇన్వర్టర్పై పని చేసే ఇంక్యుబేటర్ను సొంతంగా ప్లేవుడ్తో తయారు చేసుకున్నాడు. దానిలోనే కోడిగుడ్లు, కౌజుపిట్ట గుడ్లు పొదిగిస్తున్నారు. ఆదాయం బాగుంది నాటుకోళ్లు, కౌజుపిట్టలు, కొర్రమీనుల పెంపకం లాభసాటిగా ఉంది. వీటిని పూర్తి ఆర్గానిక్ పద్ధతుల్లో పెంచుతాం. గుడ్ల ఉత్పత్తికి వినియోగించే కోడి పుంజు రూ.75 వేలు కాగా, పెట్ట రూ.25 వేలు చొప్పున భీమవరంలో కొనుగోలు చేశా. ప్రస్తుతం వందకు పైగా కోళ్లు, 2,500 నుంచి 3,000 వరకు కౌజుపిట్టలు, 1,000 నుంచి 1,200 వరకు కొర్రమీను చేపలు పెంచుతున్నాం. మేత, ఇతర ఖర్చులు పోనూ ప్రతి నెలా రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వస్తోంది. – పిల్లా విజయ్కుమార్, పాలతోడు, మండపేట మండలం -
కోనసీమ: పిడుగు పాటుతో కుంగిన భూమి
సాక్షి, మామిడికుదురు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం బి.దొడ్డవరం గ్రామంలో పిడుగుపాటుకు భూమి కుంగిపోయింది. గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి భారీ ఉరుములు, మెరుపులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చిమ్మ చీకట్లో అకస్మాత్తుగా సుబ్రహ్మణ్యస్వామి ఆలయ సమీపంలో ప్రధాన రహదారి పక్కన పిడుగులు పడ్డాయి. సోమవారం ఉదయం లేచి చూసేసరికి పిడుగు పడిన చోట భూమి కుంగిపోయిందని ఆ గ్రామ సర్పంచ్ రామశివ సుబ్రహ్మణ్యం చెప్పారు. చదవండి: ఏపీలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు -
కోనసీమ జిల్లా: ఎమ్మెల్యే చిట్టిబాబుకు అస్వస్థత
మామిడికుదురు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి ఎమ్మెల్యే అస్వస్థతకు గురికావడంతో వెంటనే రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఎంఆర్ఐ స్కాన్ చేసిన వైద్యులు చిట్టిబాబు మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించారు. వెంటనే అంబులెన్సులో హైదరాబాద్ కిమ్స్కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు ఎమ్మెల్యే తనయుడు వికాస్ తెలిపారు. చదవండి: బాబు ష్యూరిటీనా.. నమ్మేదెలా? -
చంద్రబాబూ.. నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు: ఎమ్మెల్సీ తోట
సాక్షి, కోనసీమ జిల్లా: ప్రభుత్వంపై చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన మండపేటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసింది చంద్రబాబేనని ధ్వజమెత్తారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను ఇతర రాష్ట్రాలు అభినందించాయి. కరోనా సమయంలోనూ సంక్షేమం ఆగలేదన్నారు. ‘‘ఏరోజైనా చంద్రబాబు పేదవాడికి సెంటు ఇళ్ల స్థలం ఇచ్చారా?. పేదవాడి సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది మహానేత వైఎస్సార్. ఉచిత విద్యుత్పై మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదు. గడపగడపకూ వెళ్లి సీఎం జగన్ సంక్షేమ పాలన గురించి అడగండి. చంద్రబాబు తన వయసుకు తగ్గట్టు మాట్లాడాలి’’ అని తోట హితవు పలికారు. చదవండి: చంద్రబాబు కొత్త డ్రామా.. సానుభూతి కోసం ఇంతకు దిగజారాలా? ‘‘మండపేటలో టీడీపీ నేతల అవినీతి గురించి అందరికీ తెలుసు. ఎవరు ఏం దోచుకున్నారో చర్చకు నేను సిద్ధం. ఇసుకను ఎవరు దోచేసుకున్నారో ప్రజలే చెబుతారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఒక్కొక్క కుటుంబానికి లక్షలాది రూపాయలు లబ్ధి చేకూరింది. ఆనాడు పెన్షన్లు మీ హయాంలో ఎలా వచ్చాయి.. ఇప్పుడు ఎలా వస్తున్నాయి. ఇప్పుడు వలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ అందుతోంది. వలంటీర్లు గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. వలంటీర్లు ప్రజలకు అద్భుతమైన సేవ చేస్తున్నారు. ఐఏఎస్ అధికారులకు కూడా లేని అనుభవం క్షేత్రస్థాయిలో వాలంటీర్లకు ఉంది’’ అని తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. -
మీరు దేశానికే ఆదర్శం
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమలాపురం : ‘మన అక్కచెల్లెమ్మలు దేశానికే ఆదర్శం. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన పల్లెల నుంచే సాధికారతతో ఆవిర్భవించాలి. అందుకే మహిళా పక్షపాత ప్రభుత్వంగా వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. దేశంలో మరే రాష్ట్రంలో అమలు చేయనటువంటి వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత.. తదితర పథకాల ద్వారా ప్రతి అడుగు అక్క చెల్లెమ్మల కోసమే వేస్తున్నాం. ఈ నాలుగేళ్ల కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పంతో ఖర్చుకు వెనుకాడకుండా నిర్ణయాలు తీసుకున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9.48 లక్షల డ్వాక్రా సంఘాల్లోని కోటి ఐదు లక్షల 13 వేల 365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన వడ్డీని వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వరుసగా నాలుగో ఏడాది శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వేదికగా కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా రూ.1,353.76 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటేనే మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయని చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.4,969 కోట్లు లబ్ధి కలిగించామన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నారా వారిది నారీ వ్యతిరేక చరిత్ర గత చంద్రబాబు ప్రభుత్వంలో అంతా మోసమే. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు 2014 – 2019 మధ్య రూ.14,205 కోట్లు చెల్లించకుండా మోసం చేసి అక్కచెల్లెమ్మలను నడిరోడ్డు మీద పడేశాడు. దీనికి తోడు సున్నా వడ్డీ పథకాన్ని సైతం 2016 అక్టోబర్ నుంచి రద్దు చేసి వారిని మరింతగా కష్టాల్లోకి నెట్టాడు. దీంతో ఏ, బి గ్రేడ్లలో ఉన్న సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్కు దిగజారిపోయాయి. రూ.3,036 కోట్లు ఎదురు వడ్డీ కట్టాల్సి వచ్చింది. మొత్తంగా అప్పులన్నీ తడిసి మోపెడై 2019 ఏప్రిల్ నాటికి రూ.25,571 కోట్లకు ఎగబాకాయి. బాబు చేసిన మోసానికి 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి అక్కచెల్లెమ్మలు తీసుకున్న రుణాలలో 18.36 శాతం మొండి బకాయిలుగా తేలాయి. అదీ నారా వారి నారీ వ్యతిరేక చరిత్ర. ఇప్పుడు మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం అక్కచెల్లెమ్మల కోసం తోడుగా నిలబడింది. వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, చేయూతతో ప్రతి అడుగులోనూ తోడుగా నిలబడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నాం. ఫలితంగా ఈ రోజు పొదుపు సంఘాలలో మొండి బకాయిలు కేవలం 0.3 శాతం మాత్రమే. 99.67 శాతం రికవరీ రేటుతో మన అక్కచెల్లెమ్మలు దేశానికి ఆదర్శంగా నిలిచారు. తేడా మీరే చూడండి. అప్పుల ఊబి నుంచి బయటకు తెచ్చాం మనందరి ప్రభుత్వానికి ముందు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు దాదాపు 90 లక్షలు ఉన్నారు. మనపై నమ్మకం పెరగడం వల్ల ఈ రోజు ఆ సంఖ్య 1.16 కోట్లకు పెరిగింది. అంటే 25 లక్షలకుపైగా పెరిగారు. సున్నా వడ్డీతో పాటు రూ.3 లక్షల వరకు రుణం అతి తక్కువ వడ్డీకే ఇప్పిస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వంలో 12–14 శాతం వడ్డీ వసూలు చేశారు. మనం దానిని 9.5 నుంచి 8.5 శాతం వరకు తగ్గించగలిగాం. ఇవన్నీ ఒక ఎత్తయితే 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాలకు ఉన్న రుణాలు రూ.25,571 కోట్లు. ఆ రుణాల మొత్తాన్ని నాలుగు విడతల్లో వారి చేతికే ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 3 పర్యాయాలు రూ.19,178 కోట్లు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా వారి చేతుల్లో పెట్టి వారిని అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకొచ్చాం. పలు విధాలా భరోసా ♦ జగనన్న అమ్మ ఒడి ద్వారా 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో రూ.26,067 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45–65 వయసున్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన 26.39 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.14,219 కోట్లు అందించాం. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1518 కోట్లు, వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద 4.39 లక్షల మందికి రూ.1257 కోట్లు సాయం అందించాం. ♦ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో రూ.5,000 కోట్లు సాయం చేశాం. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా విద్యా దీవెన ద్వారా 26.99 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ పిల్లల చదువులకు అయ్యే ఖర్చు పూర్తిగా వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నాం. ఇందుకోసం రూ.10,636 కోట్లు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాం. ♦ పిల్లల భోజన, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన పథకం ద్వారా 25.17 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,275 కోట్లు ఇచ్చాం. ఈ పథకం కింద డిగ్రీలు, ఇంజనీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్న పిల్లలకు ఏడాదికి రూ.20 వేలు, పాలిటెక్నిక్ చదువుతున్న పిల్లలకు రూ.15 వేలు, ఐటీఐ చదువుతున్న పిల్లలకు రూ.10 వేలు రెండు దఫాల్లో ఇస్తున్నాం. ఇలాంటి పథకాలు దేశంలోనే ఎక్కడా లేవు. సొంత గూడు కోసం 30 లక్షల ఇళ్ల పట్టాలు ♦ చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా నా అక్కచెల్లెమ్మల పేరిట 30 లక్షల ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చాం. ఒక్కో ఇంటి స్థలం విలువ ఏరియాను బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఉంది. అంతటితో ఆగక 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టాం. ఇళ్ల నిర్మాణం పూర్తయితే ఒక్కో దాని విలువ రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఈ ఒక్క పథకం ద్వారా రెండు మూడు లక్షల కోట్లు అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టినట్లయింది. ♦ వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా 35.70 లక్షల మంది గర్భిణులు, బాలింతలు.. ఆరేళ్ల వయసు వరకు ఉన్న పిల్లలకు మంచి చేస్తున్నాం. వీరి కోసం గతంలో రూ.400 కోట్లు ఖర్చు చేస్తే గొప్ప అనుకునే పరిస్థితి ఉండేది. ఈ రోజు మనం ఏటా రూ.2 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకానికి ఇంతవరకు రూ.6,141 కోట్లు వెచ్చించాం. సూర్యోదయానికి ముందే.. ♦ దేశంలో ఎక్కడా కనీ వినీ ఎరుగని విధంగా సచివాలయ, వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. ఒకటో తారీఖున సూర్యోదయానికి ముందే అది ఆదివారమైనా, సెలవు దినమైనా సరే చిక్కటి చిరునవ్వుతో తలుపులు తట్టి, అవ్వా గుడ్మార్నింగ్ అని చెబుతూ పింఛన్ ఇచ్చేలా మనవడు, మనవరాళ్లను మీ ఇంటికి పంపిస్తున్నాను. ♦ గతంలో వెయ్యి రూపాయలు పింఛన్ ఇస్తే గొప్ప అనే పరిస్థితి నుంచి మీ బిడ్డ హయాంలో రూ.2,750కి పెంచాం. వైఎస్సార్ పెన్షన్ కానుక కోసం నాలుగేళ్లలో మీ బిడ్డ చేసిన ఖర్చు రూ.75 వేల కోట్లు. ఇందులో నా అవ్వలు, అక్కచెల్లెమ్మలకు మహిళా పక్షపాత ప్రభుత్వంగా రూ.49,845 కోట్లు వెచ్చించాం. ♦ రూపాయి లంచం, వివక్షకు తావు లేకుండా ఈ నాలుగేళ్లలో నేరుగా రూ.2,31,123 కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయడం ఒక చరిత్ర. ♦ నా అక్కచెల్లెమ్మలు రాజకీయంగా ఎదగాలని నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లోనూ సగభాగం ఇచ్చేలా చట్టం చేసి అమలు చేస్తున్నాం. వారి భద్రత కోసం దిశ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను తీసుకొచ్చాం. దిశ యాప్ను 1 కోటి 24 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఆపద వేళ పది నిమిషాల్లో సాయం అందేలా చూస్తున్నాం. ఇప్పటిదాకా ఇలా రాష్ట్రంలో 30,369 మందిని కాపాడగలిగాం. అక్కచెల్లెమ్మలతో మాటామంతి సీఎం జగన్ వేదిక వద్ద డ్వాక్రా మహిళలు తయారు చేసిన వస్తువుల ప్రదర్శనను పరిశీలించారు. అక్కచెల్లెమ్మలతో ఆప్యాయంగా మాట్లాడారు. మహిళలు చేస్తున్న వ్యాపార కార్యకలాపాలను కలెక్టర్ హిమాన్షు శుక్లా సీఎంకు వివరించారు. ఆ సమయంలో దూరంగా ఉన్న మంత్రి విశ్వరూప్ను దగ్గరకు పిలిపించుకుని పక్కన కూర్చోబెట్టుకుని, అందరితో కలిసి గ్రూపు ఫొటో దిగారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు చెల్లుబోయిన వేణు, జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, ఎంపీలు పిల్లి సుబాష్ చంద్రబోస్, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, చింతా అనూరాధ, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ సతీ‹Ùకుమార్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రూ.20 లక్షల రుణం.. రూ.80 వేల వడ్డీ రాయితి అన్నా.. గతంలో మాలాంటి పేదోళ్లకు అప్పు పుట్టేది కాదు. పుట్టినా రూ.5 నుంచి రూ.10 వరకు వడ్డీలు కట్టేవాళ్లం. మీరు సీఎం అయ్యాక వైఎస్సార్ సున్నా వడ్డీ ప«థకం ద్వారా నాలాంటి డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని అప్పు వస్తోంది. నేను ఆర్థి కంగా నిలదొక్కుకుని సొంతంగా వ్యాపారం చేసుకునే ధైర్యాన్ని కలిగించావు. నేను రూ.20 లక్షల వరకు రుణం, రూ.80 వేల వరకు వడ్డీ రాయితీ పొందాను. ఈ రోజు నేను జిరాక్స్ సెంటర్, టిఫిన్ సెంటర్తో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మీ పథకాలతో నాలుగేళ్లలో మా కుటుంబం రూ.3 లక్షలకు పైగా లబ్ధి పొందింది. మీ మేలు ఎప్పటికీ మరువం. – దుర్గా భవాని, ఉప్పలగుప్తం, భీమనపల్లి మండలం మేనమామగా నిరూపించుకున్నారు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నన్నెంతగానో ఆదుకుంది. గతంలో ఏదైనా వ్యాపారం చేయాలంటే అప్పులతో భయమేసేది. మీ వల్ల నేను ఈ రోజు పాల వ్యాపారం చేస్తూ నెలకు రూ.7వేలు సంపాదిస్తున్నాను. ఇంటికి కొడుకులా, మా బిడ్డలకు మేనమామగా ఉంటానని చెప్పిన మీ మాట అక్షరాలా నిజమని నిరూపించారు. విద్యా ప«థకాల ద్వారా నా కుటుంబం రూ.2.40 లక్షల వరకూ లబ్ధి పొందింది. మీరు తెచ్చిన వలంటీర్ల వ్యవస్థ సేవలు మరువలేనివి. – పి.ధనక్ష్మి, బండార్లంక, అమలాపురం రూరల్ మండలం -
సీఎం జగన్కు జేజేలు.. పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
-
దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం మరెక్కడా లేదు: సీఎం జగన్
Updates.. సీఎం జగన్ ప్రసంగం ►దేవుడి దయతో ఈ రోజు మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాం ►అక్క చెల్లెమ్మల సాధికారిత కోసం అడుగులు వేశాం ►మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేశాం ►కోటి 5 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి కలుగుతుంది. ►గత ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలను మోసం చేశారు. ►బాబు హయాంలో 14వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టారు. ►మహిళలను గత ప్రభుత్వం రోడ్డున పడేసింది ►గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం చెల్లించాం ►1,05,13,365 మంది పొదుపు మహిళలకు లబ్ధి ►రూ.1353.76 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ ►ఇప్పటివరకు అందించిన మొత్తం సాయం 4969.05 కోట్లు ►పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీ భారం పడకూడదు ►మహిళల జీవనోపాధి మెరుగుపడేలా బ్యాంకులతో ఒప్పందాలు ►మహిళలను మోసం చేసిన చరిత్ర నారా వారిదే ►మన ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడే ప్రభుత్వం ►వడ్డీ మాఫీ చేయకుండా చంద్రబాబు మోసం చేశారు ►చంద్రబాబు అరాచకాలను తలుచుకుంటే బాధనిపిస్తుంది ►2016లో సున్నా వడ్డీ పథకాన్ని చంద్రబాబు రద్ధు చేశారు ►అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది. ►మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేశాం. ►దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం మరెక్కడా లేదు. ►లబ్దిదారులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఎంతో లబ్ధిచేరుకుంది. గతంలో జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగే వాళ్లం. కానీ, ఇప్పుడు ఒక్క బటన్ నొక్కడంతో నేరుగా మా ఖాతాల్లోకి నిధులు జమ అవుతున్నాయి. పాదయాత్రలో అక్కచెల్లెలమ్మల బాధ చూసి మీరు మాకోసం ఎంతో చేస్తున్నారు. వాలంటీర్లపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలను సైతం లబ్ధిదారులు ఖండించారు. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. జగనన్న మా కోసం ఎంతో చేస్తున్నారని తెలిపారు. ► పొదుపు సంఘాల మహిళలతో సీఎం జగన్ ఫొటో దిగారు. ► స్టాళ్లను పరిశీలించిన సీఎం జగన్. ఈ క్రమంలోనే మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను కూడా సీఎం పరిశీలించారు. ► అమలాపురం చేరుకున్న సీఎం జగన్. ► సాక్షి, అమలాపురం/అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లిలో పర్యటిస్తున్నారు. ► ఈ సందర్భంగా నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బును సీఎం జగన్ జమ చేస్తారు. ► అమలాపురంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా నగదు జమ చేస్తారు. ► రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ► వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ఇప్పటివరకు అందించిన మొత్తం సాయం రూ.4,969.05 కోట్లు అవుతుంది. ► పేద అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పిస్తూ.. వారు చేస్తున్న వ్యాపారాలకు ఊతమిచ్చేలా సున్నా వడ్డీకే రుణాలు అందించి, వారి జీవన ప్రమాణాలను ప్రభుత్వం మెరుగుపరుస్తున్న సంగతి తెలిసిందే. ► ఈ క్రమంలో బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీ భారం పడకుండా వారి తరపున ఆ భారాన్నీ వైఎస్సార్ సున్నా వడ్డీ కింద నేరుగా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. ► అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా.. వారి జీవనోపాధి మెరుగుపడేలా బహుళజాతి దిగ్గజ కంపెనీలు, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాలతో సుస్థిర ఆర్థికాభివృద్ధికి వైఎస్ జగన్ ప్రభుత్వం బాటలు వేసింది. ► ప్రభుత్వం చొరవ తీసుకుని బ్యాంకులతో మాట్లాడి వడ్డీరేట్లు తగ్గింపచేయడంతో అక్కచెల్లెమ్మలపై రూ.1,224 కోట్ల మేర వడ్డీ భారం తగ్గింది. దీంతో ఏటా రూ.30 వేల కోట్లకు పైగా రుణాలు అందుకుని.. వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటూ.. రుణాల రికవరీలో సైతం 99.67 శాతంతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి అక్కచెల్లెమ్మలు ఆర్థిక పరిపుష్టిని సాధించారు. ► ప్రభుత్వ సహకారంతో పశువుల కొనుగోలు, కిరాణా దుకాణాలు, వస్త్ర వ్యాపారాల వంటివి చేసుకుంటున్న 16,44,029 మంది అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.7,000 నుంచి రూ.10,000ల వరకు అదనపు ఆదాయం. అమూల్తో ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటర్ పాలపై రూ.20 వరకు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. ► కార్యక్రమం అనంతరంఅమలాపురానికి వచ్చి.. అక్కడి నుంచి తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వరద బాధితులను పరామర్శించి భరోసా ఇచ్చిన సీఎం వైఎస్ జగన్
-
గత పాలన..ఇప్పటి పాలన
-
వరదల వల్ల నష్టపోయిన ప్రతి బాధితుడికీ సాయం అందిస్తున్నామన్న ఏపీ సీఎం వైఎస్ జగన్..ఇంకా ఇతర అప్డేట్స్
-
వాలంటీర్లు తోడుగా… బాధిత కుటుంబాలకు వద్దకు సీఎం జగన్
గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో రెండోరోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, పి.గన్నవరం లంక గ్రామాల్లో పర్యటించారు. మంగళవారం సాయంత్రం 4 గంటవరకూ ఆయా గ్రామాల్లో ముమ్మరంగా పర్యటించారు. వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు. రివెట్మెంట్ నిర్మాణంపై సీఎం ప్రకటన ముమ్మిడివరం నియోజకవర్గంలో గురజాపులంకలో ప్రారంభమైన సీఎం పర్యటన తర్వాత కూనలంక, లంక ఆఫ్ ఠానేలంక గ్రామాల్లో సాగింది. ఆతర్వాత సీఎం దీనికి సమీపంలోనే ఉన్న పి.గన్నవరం నియోజకవర్గం కిందకు వచ్చే కొండకుదురులంక, పొట్టిలంక గ్రామాల్లో పర్యటించారు. కూనలంక, లంక ఆఫ్ ఠానేలంక, కొండకుదురు లంకల్లో సీఎం వరద బాధితులనుద్దేశించి మాట్లాడారు. గురజాపులంక, కూనలకం, కొండకుదరు లంకల్లో గోదావరి వరద వల్ల తీవ్రంగా కోతకు గురవుతున్న పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఆవాసాలున్న ప్రాంతాల్లో భూమి కోతకు గురికాకుండా రివిట్మెంట్ (స్టోన్ పిచ్చింగ్) చేయిస్తామని ప్రకటించారు. ప్రాథమికంగా దీనికోసం రూ.150 కోట్లు అవుతుందని అంచనా వేసినప్పటికీ, రూ.200 కోట్లైనా ఖర్చు చేయడానికి వెనుకాడమన్నారు. రెండు నెలల్లోగా పనులు ప్రారంభించాల్సింది అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వరదలు కారణంగా పంట నష్టపోయిన వారికి ఈ నెలాఖరులోగా పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. లంక గ్రామాల్లో కలియ దిరుగుతూ… గురజాపులంక నుంచి కొండకుదరు లంక వరకూ కూడా ప్రతిచోటా వరద బాధితులను సీఎం కలుసుకున్నారు. గుజాపులంక, లంక ఆఫ్ ఠానే లంక, కొండకుదరు లంకలో దాదాపుగా అన్ని కుటుంబాలనుకూడా సీఎం కలుసుకున్నారు. లంక ఆఫ్ ఠాణే లంకలో రోడ్డుకు ఇరువైపులా అన్ని కుటుంబాలో వారు మమేకం అయ్యారు. గత ఏడాది జులైలో నీళ్లు ఎంతవరకూ వచ్చాయి. ఈ ఏడాది నీళ్లు ఎంతవరకూ వచ్చాయో చూపించేలా అధికారులు ఇదివరకే మార్కింగ్ వేశారు. వీటిని సీఎం స్వయంగా పరిశీలించారు. వరదల సమయంలో ప్రభుత్వం నుంచి వచ్చిన సహాయం అందిందా? లేదా? రేషన్ సహా రూ.2వేల రూపాయలు ఆర్థిక సహాయం, ఇల్లు ధ్వంసమైన వారికి రూ.10వేల రూపాయల ఆర్థిక సహాయంపై బాధితులనుంచి ఆరాతీశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి లోటు పాటు లేదని, అన్ని సకాలానికే అందాయని, మనుషులతో పాటు పశువులను కూడా బాగా చూసుకున్నారని వారంతా చెప్పారు. ఈ వరదల్లోనే కాకుండా కిందట వరదల్లో కూడా అత్యంత వేగంగా స్పందించి ఆదుకున్నారని బాధితులంతా సీఎంతో అన్నారు. మరో ముప్ఫైఏళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ వృద్ధులు ఆశీర్వదించారు. రైతులకు పరామర్శ లంక గ్రామాల్లో వరదల కారణంగా కూరగాయలు పండిస్తున్న పలువురు రైతులు నష్టపోయారు. అంతేకాకుండా కొబ్బరితోటల్లో అంతరపరంటలుగా సాగుచేస్తున్న కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. గురజాపులంకలో బొక్కా నాగేశ్వర్రావుకు చెందిన పంటపొలాన్ని పరిశీలించారు. వరదల కారణంగా దెబ్బతిన్న మిరప, బెండ పంటలను సీఎం చూశారు. అలాగే శ్రీనివాసరావు, లంకాలువలో వడగానిరెడ్డి గాంధీ పొలాన్నికూడా సీఎం పరిశీలించారు. సంబంధిత రైతులతో మాట్లాడి వరద ప్రభావాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి విపత్తులు వస్తున్న సమయంలో ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై వారు హర్షం వ్యక్తంచేశారు. విపత్తులను ఆపలేకున్నా, దెబ్బతిన్న రైతును నిలబెట్టడంతో ముఖ్యమంత్రి చేస్తున్న చొరవ ప్రశంసనీయమని, వైయస్సార్ బాటలో నడుస్తూ రైతులకు మేలు చేస్తున్నారని వారు సీఎంతో అన్నారు. నెలాఖరులోగా పంట నష్టపరిహారాన్ని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం ప్రకటించగానే వారు హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరా వరద సహాయంపై బాధితులనుంచి వివరాలు తెలుసుకుంటూనే మరోవైపు ప్రభుత్వ పథకాల అమలు తీరుపైనా ముఖ్యమంత్రి ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా వృద్ధులకు పెన్షన్ అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సూర్యోదయానికి ముందే వాలంటీర్ల వచ్చి తమ చేతిలో పెడుతున్నారని వారంతా బదులిచ్చారు. పెన్షన్ పంపిణీలో మంచి మార్పులు తీసుకు వచ్చి, బాసటగా నిలబడ్డారంటూ వారు సంతృప్తివ్యక్తంచేశారు. మహిళలకు అందుతున్న పథకాలపైనా కూడా సీఎం ఆరా తీశారు. ఆసరా, చేయూత, విద్యాకానుక, వసతి దీవెన లాంటి పథకాలు అందుతున్న తీరు, అర్హుల ఎంపిక తదితర అంశాలపైనా కూడా సీఎం ప్రశ్నలు వేశారు. లంకఆఫ్ ఠానే లంక సహా కొన్ని గ్రామాల్లో కుటుంబ సభ్యుల అనారోగ్యం సమస్యలతో ఇబ్బంది పెడుతున్న కొందరు మహిళలకు సహాయంపై అధికారులకు ఆదేశిస్తూనే వారికి స్వయం ఉపాధి కల్పించాలని అధికారులను ఆదేశించారు. వాలంటీర్లు తోడుగా… బాధిత కుటుంబాలకు వద్దకు సీఎం గురజాపు లంక, లంక ఆఫ్ ఠానే లంక, కొండకుదరు లంక తదితర లంక గ్రామాల్లో సీఎం పర్యటనలో వాలంటీర్లు దగ్గరుండి ఆయా కుటుంబాలను పరిచయం చేశారు. వరద సహాయం సరిగ్గా అందిందా లేదా? అన్నది వారి సమక్షంలోనే సీఎం తెలుసుకున్నారు. లంక ఆఫ్ ఠానే లంక రామాలయం పేట వీధిలో మహిళా వాలంటీర్ బేబీ సీఎంతో పాటుగా ఆయా కుటుంబాల సందర్శనలో ఉన్నారు. వివిధ కుటుంబాలకు అందుతున్న ప్రభుత్వ పథకాలపై వాలంటీర్ ద్వారా ముఖ్యమంత్రి సమాచారం తెలుసుకున్నారు. అవన్నీ సజావుగానే అందుతున్నాయని సీఎంకు లబ్ధిదారులు తెలిపారు. లంక ఆఫ్ ఠాణే లంకలో జయ లక్ష్మి మహిళ తన పెన్షన్ కాజూరు వద్ద ఉందని, తాను ఇక అక్కడకు వెళ్లని, లంక ఆఫ్ ఠాణే లంకు మార్పించాలంటూ సీఎంను కోరగా, వెంటనే వాలంటీర్ను పిలిపించి ఆమేరకు దరఖాస్తు చేసి, మార్పించాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని మహిళా వాలంటీర్ సీఎంకు తెలిపారు. పాఠాలు బాగా చెప్తున్నారా? విద్యా కానుక అందిందా? లంక గ్రామాల్లో పర్యటన సందర్భంగా పలువురు చిన్నారులు సీఎంను కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు, మార్పులపై వారికి ప్రశ్నలు వేశారు. గురజాపు లంక, లంక ఆఫ్ ఠాణే లంకలో ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. విద్యాకానుక కింద పుస్తకాలు, అన్నిరకాల వస్తువులు వచ్చాయా? లేవా? పాఠాలు బాగా చెప్తున్నారా? లేదా? పాఠశాలలో పరిస్థితులు బాగున్నాయా? లేవా? అంటూ బడిపిల్లలకు పలు ప్రశ్నలు సంధించారు. అన్ని బాగున్నాయి.. మామయ్యా అంటూ వారంతా సీఎంకు సమాధానం ఇచ్చారు. అక్కడున్న పిల్లలకు ముఖ్యమంత్రి చాక్లెట్లు ఇచ్చారు. ఓఎన్జీసీ, జీపీసీఎల్ డ్రిల్లింగ్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలు ఇవాళ సీఎం పర్యటించిన ప్రాంతాల్లో ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ కూడా ప్రభుత్వం కోట్ల రూపాయల పరిహారం అందించిన విషయాన్ని లంక గ్రామాల ప్రజలు మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం తమకు పరిహారాన్ని ఇచ్చారంటూ సీఎంతో పలువురు తమ సంతోషాన్ని పంచుకున్నారు. -
కోనసీమ వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
పంట నష్టం ఎంత ఉంటే అంత పరిహారం అందిస్తాం: సీఎం జగన్
-
కోనసీమకు చేరుకున్న సీఎం జగన్
-
గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి: సీఎం జగన్
తోటరాముడివారిపేటలో బాధితులకు సీఎం జగన్ భరోసా ►బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటాం ►పంట నష్టం జరిగిన వెంటనే లెక్కలు కట్టి సాయం అందిస్తున్నాం ►పేదలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ►ఇళ్లు దెబ్బతింటే సాయం అందించాలని ఆదేశించాం ►ఏ ఒక్కరూ సాయం అందలేదనకూడదు వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన కొనసాగుతోంది. గురజపులంక, కూనలంకలో పర్యటిస్తున్న సీఎం.. వరద బాధితులను పరామర్శిస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని సీఎం జగన్ అన్నారు. ‘‘గతంలో పేపర్లో ఫొటోలు వస్తే చాలు అనుకునేవారు.. కానీ ఇప్పుడు ఇలా కాదు, వారం రోజులు జిల్లా కలెక్టర్లకు సమయం ఇచ్చాం. వరద బాధితులందరికీ సాయం అందించాలని ఆదేశించాం. నేనే స్వయంగా వచ్చి వరద బాధితులను కలుస్తా అని చెప్పా. రెండు రోజులుగా వరద బాధితులతో మాట్లాడుతున్నాను’’ అని సీఎం పేర్కొన్నారు. ►వరద సాయం అందని ఇళ్లు లేదు: సీఎం జగన్ ►పంట నష్టం జరిగితే ఆర్భీకేల్లో నమోదు చేసుకోవాలి ►రెండురోజుల్లో ఆర్భీకే కేంద్రాల్లో వరద బాధితుల జాబితా ►నెలలోపే పంట నష్ట సాయం ►గతంలో ఎప్పుడూ ఇలా పారదర్శకంగా, వేగంగా అందించలేదు ►అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్ముడివరం మండలంలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన. ►ముమ్ముడివరం మండలంలో గురజపులంక, రామాలయపేట గ్రామాలలో కాలినడనక తిరుగుతూ.. వరద నష్టం, సహాయక చర్యలపై నేరుగా ప్రజలతో మమేకమైన సీఎం జగన్. ►ప్రతి గడప వద్దకూ వెళ్లి వరద సహాయంపై నేరుగా ప్రజలనుంచే తెలుసుకుంటూ... వారి విజ్ఞప్తులను స్వీకరించిన ముఖ్యమంత్రి. ►గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం జగన్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. గురజపులంకకు సీఎం చేరుకున్నారు. కాసేపట్లో వరద బాధితులను కలవనున్నారు. ►గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం జగన్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం రాజమహేంద్రవరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి అర్ట్స్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఆర్ట్స్ కళాశాల వద్ద హెలికాప్టర్లో బయలుదేరి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గురజపులంక చేరుకుంటారు. గ్రామంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం రామాలయపేటకు రోడ్డు మార్గానికి చేరుకుని, అక్కడ వరద బాధితులతో మాట్లాడతారు. అక్కడి నుంచి అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడతారు. అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో గురజపు లంక గ్రామానికి చేరుకుంటారు. తర్వాత హెలికాప్టర్లో తాడేపల్లికి వెళతారు. ►కాగా, గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ తొలి రోజు సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద బాధితులను పరామర్శించిన అనంతరం సీఎం వైఎస్ జగన్ సోమవారం సాయంత్రం 6.24 గంటలకు హెలికాప్టర్లో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడ సీఎం వైఎస్ జగన్కు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్కు చేరుకొన్నారు. రాత్రి అక్కడే బస చేశారు. బాధితులకు అండగా.. హెలిపాడ్ నుంచి గెస్ట్ హౌస్కు వచ్చే మార్గంలో సీఎం వైఎస్ జగన్ను చూసేందుకు ప్రజలు బారులు తీరారు. రోడ్లకు ఇరువైపులా నిలుచొని ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. సీఎం జగన్ వారికి అభివాదం చేశారు. దారిలో ఇద్దరు అనారోగ్య బాధితులను పలకరించారు. వారి సమస్య విని తక్షణం సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ మాధవిలతను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్ ఆ కుటుంబాలకు వైద్య సేవల నిమిత్తం ఒక్కొక్కరికీ రూ. లక్ష సాయం అందజేశారు. -
కోనసీమ జిల్లాలోని వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
-
రేపు, ఎల్లుండి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు(సోమవారం), ఎల్లుండి(మంగళవారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. అల్లూరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. కాగా, ఈ సందర్భంగా వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. రేపు(సోమవారం) అల్లూరి జిల్లా కూనవరం, వీఆర్పురం వదర బాధితులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. అనంతరం.. కుక్కునూరు మండలం గొమ్ముగూడెం సందర్శనకు వెళ్లనున్నారు. అలాగే, రాత్రికి రాజమండ్రి ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో అధికారులతో సీఎం జగన్ సమావేశం అవుతారు. ఎల్లుండి(మంగళవారం) కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తానేలంక, రామాలయంపేటలో వరద బాధితులతో సీఎం జగన్ మాట్లాడనున్నారు. అలాగే, అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురు సందర్శనకు వెళ్లనున్నారు. ఇది కూడా చదవండి: ‘పోలీసులపై జరిగిన దాడి పవన్కు కనిపించడం లేదా?’ -
మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే: నటుడు సుమన్
అంబాజీపేట(కోనసీమ జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేయడంతో మరోసారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని సినీనటుడు సుమన్ చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పుల్లేటికుర్రులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు, తమ అభిమానులు తెలిపిన అభిప్రాయాల మేరకు మరోసారి వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకొచ్చి వైఎస్ జగన్ని ముఖ్యమంత్రి చేయనున్నారన్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పట్టించుకోలేదని వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే సముచిత న్యాయం జరిగిందని వారే చెబుతున్నారని తెలిపారు. నవరత్న పథకాలను 95 శాతం అమలు చేసి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. చదవండి: అసలేం జరిగింది? మెగా ఫ్యామిలీకి దూరంగా అన్నా లెజినోవా? -
నిసిగ్గుగా చందబ్రాబు, లోకేష్ శవ రాజకీయాలు.. ఇదీ అసలు వాస్తవం..
సాక్షి, అమరావతి: రాజకీయంగా ఉనికిని కోల్పోతున్న తమ పార్టీని బతికించుకునేందుకు టీడీపీ దిగజారి వ్యవహరిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మృతిపై చంద్రబాబు, లోకేష్ నిసిగ్గుగా శవరాజకీయాలకు తెరలేపారు. ఆ యువకుడి మృతికి వైఎస్సార్సీపీ నేతల ప్రమేయం ఉందంటూ అసత్య ఆరోపణలు చేస్తూ.. ఆత్మహత్యకు లింకు పెట్టే కుట్రకు బీజం వేశారు. అసలేం జరిగింది? తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్యాం.. జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలంటే ప్రాణం. వయస్సు 23 సంవత్సరాలు. శ్యామ్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని కొప్పిగుంట గ్రామం. ఇటీవల చింతలూరు గ్రామానికి వెళ్లిన శ్యామ్ అక్కడే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. తన అభిమాని శ్యాం మరణించినందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తెర లేచిన శవరాజకీయం ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. తెలుగుదేశం, జనసేన రకరకాల కుట్రలు చేస్తున్నాయి. ఎక్కడ లేని క్రైం అంతా ఏపీలోనే జరుగుతున్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా.. ఏది జరగకపోయినా.. దాన్ని అధికార పార్టీపై రుద్ది రాజకీయ లబ్ది పొందాలన్నది టిడిపి కుట్రగా మారింది. ఏ క్రైం జరిగినా.. దానికి YSRCPకి అంటగట్టే ప్రయత్నం జరుగుతోంది. తాజాగా శ్యామ్ చనిపోయాడని తెలియగానే.. తెలుగుదేశం రంగంలోకి దిగింది. ఒక వ్యక్తి బాధతో, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే.. దాన్ని అడ్డం పెట్టుకుని శవరాజకీయాలు చేయడానికి ఏకంగా చంద్రబాబు, లోకేష్ రంగంలోకి దిగారు. చంద్రబాబు నిర్వాకం ఇది శ్యాం మరణం వార్త తెలియగానే, చంద్రబాబు దానికి రాజకీయ రంగు పులిమేశారు. ఇది వైఎస్సార్ సిపి పనేనంటూ నిందలు మోపారు. Deeply saddened by the tragic and untimely demise of Shyam in Chintaluru, EG District. The suspicious circumstances surrounding his death are alarming. I strongly urge for a thorough investigation into this matter, ensuring justice is served. It has been alleged that YSRCP… pic.twitter.com/55bpR9cgvR — N Chandrababu Naidu (@ncbn) June 27, 2023 తానా.. తందానా.. తనయుడి కూత ఇది తండ్రి చంద్రబాబు బాటలోనే లోకేష్ నడిచారు. వెంటనే ఓ ట్వీటేశాడు. తన ఆస్థాన విద్వాంసులు రాసిచ్చిన నాలుగు వ్యాఖ్యలను జోడించారు. Pained to learn about the suspicious death of unemployed youngster Shyam. Deepest condolences to his family & friends. A thorough investigation without any bias is needed, even if it involves YCP leaders as alleged by locals. We will fight until justice is delivered to Shyam… pic.twitter.com/C8OvdExVWD — Lokesh Nara (@naralokesh) June 27, 2023 తెలుగుదేశం శవరాజకీయం శ్యాం మృతిపై తీవ్ర ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు తమకు శ్యాం పంపించిన వీడియోలను పోలీసులకు అందించారు. శ్యాం ఆత్మహత్య చేసుకునేముందు ఏం జరిగిందన్నది ఈ వీడియోల్లో స్పష్టంగా ఉంది. శవాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం తండ్రీ కొడుకులు రాజకీయాలు చేయడంతో వైఎస్సార్సీపీ స్పందించింది. ఇది ఎన్నికల సమయం, రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి కొంత మంది రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు అని చెప్పుకునే నటులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి విష ప్రచారాలు భవిష్యత్తులో ఇంకా చాలా చేస్తారు. రాష్ట్ర ప్రజలు గమనించాలంటూ వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. YSRCP ఏం చెప్పింది? సుసైడ్ చేసుకోబోయే ముందు శ్యామ్ మాట్లాడిన వీడియో! శ్యామ్ ఆత్మ కి శాంతి చేకూరాలి, ఈ విషాధ సమయంలో శ్యామ్ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి మరియు శ్యామ్ తోటి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికి మా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాం 🙏🏻 శ్యామ్ కుటుంబ సభ్యులకి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా… pic.twitter.com/DANeXVEgCm — YSR Congress Party (@YSRCParty) June 27, 2023 ఎన్టీఆర్ అభిమాని మృతిని టీడీపీ అవకాశంగా తీసుకుని నీచ రాజకీయాలు చేస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాని మరణం పట్ల గౌరవంగా, పద్ధతిగా సానుభూతి తెలిపారు. శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన అని, ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసు మనసు కలచివేస్తోందని, ప్రభుత్వం దీనిపై తక్షణమే దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
త‘లుక్’మనేలా
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (రుడా) అడుగులు వేస్తోంది. ఆయా గ్రామాల్లో అందివస్తున్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజా ప్రయోజన, ఆరోగ్య రక్షణ, ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పే పనులకు ప్రాధాన్యం ఇస్తోంది. మొక్కల పెంపకం, సంరక్షణతో పాటు గ్రామాల పేర్లను సూచించే నేమ్బోర్డులను అ«దునాతనంగా రూపొందించి ఏర్పాటు చేస్తోంది. 66 పనులకు రూ.26.84 కోట్ల నిధులు వ్యయం చేస్తోంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని కొన్ని పనులు పురోగతిలో ఉండగా.. మరికొన్ని టెండరు దశలో ఉన్నాయి. రాజమహేంద్రవరాన్ని ఇప్పటికే సుందరంగా తీర్చిదిద్దిన రుడా తన పరిధిలోని గ్రామాలకు పట్టణ శోభను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పనులను రుడా వీసీ బాలస్వామి ఎప్పటికప్పుడు పర్యవేక్షిన్నారు. సుందరీకరణ పనులు ఇలా.. రుడా పరిధిలో నిర్వహించే పనుల్లో సుందరీకరణ, వాకింగ్ ట్రాక్లు, రివిట్మెంట్తో కూడిన వాటర్ బాడీ, బీచ్ ఫ్రంట్ నిర్వహణ పనులకు మొదటి ప్రాధాన్యత కల్పి స్తున్నారు. నియోజకవర్గాల వారీగా మచ్చుకుకొన్ని పరిశీలిస్తే.. అనపర్తి: బలభద్రపురంలో రూ.1.65 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రివిట్మెంట్తో కూడిన వాటర్ బాడీ పనులు పూర్తి చేసింది. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా నీటితో కూడిన పార్క్, వాకింగ్ ట్రాక్, ప్రజలు సేదతీరేందుకు పచ్చదనం పెంపొందించే పనులు ప్రారంభించింది. కొవ్వూరు: గోష్పాద క్షేత్రం సమీపంలోని కొవ్వూరు కట్ట వెంబడి రివర్ ఫ్రంట్ రూపుదిద్ది భక్తులకు స్వాంతన కలిగించేందుకు కృషి చేస్తున్నారు. పచ్చదనం పెంపొందించి అందులో వివిధ జంతువుల నమూనా విగ్రహాలు వరద నీటికి తట్టుకునే స్థాయిలో తయారు చేస్తున్నారు. ఇందుకు రూ.కోటి వెచి్చంచనున్నారు. రూ.32.86 లక్షలతో అధునాతన విద్యుత్ స్తంభాలు, దీపాలు అమర్చనున్నారు. ‘ఐ–లవ్ కొవ్వూరు’ చిహ్నాన్ని సెల్ఫీ పాయింట్గా ఆధునీకరించనున్నారు. గోపాపురం: దేవరపల్లి మెయిన్ రోడ్ నుంచి గోపాలపురం వరకు రూ.50 లక్షలతో సెంట్రల్ లైటింగ్ పనులు పురోగతిలో ఉండగా.. మరో మరికొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి. నిడదవోలు: చిన్న కాశీ రేవు నుంచి గూడెం గేటు వరకు రహదారి నిర్మాణానికి రూ.కోటి వెచి్చంచనున్నారు. రాజమహేంద్రవరం సిటీ: నగరంలో రూ.30 లక్షలతో జగనన్న ఉమెన్స్ హెవెన్, రూ.12 లక్షలతో ఆజాద్చౌక్, ఎల్ఈడీ లైట్లు, రూ.6 లక్షలతో పుష్కరఘాట్ వద్ద దుస్తులు మార్చుకునే గది నిర్మాణం పూర్తయింది. రూ.37.50 లక్షలతో జీఎన్టీ రోడ్డులో మొక్కల పెంపకం, కుండీలు, మొక్కల నిర్వహణ, రూ.2 కోట్లతో హెవలాక్ బిడ్జి వద్ద రంగుల విద్యుత్ దీపాలు, రూ.2 కోట్లతో కంబాలచెరువు పార్కులో మ్యుజికల్ ఫౌంటేన్ పనులు పురోగతిలో ఉన్నాయి. మరికొన్ని టెండరు దశలో ఉన్నాయి. రాజమహేంద్రవరం రూరల్: శాటిలైట్ సిటీ డి–బ్లాక్ వద్ద రూ.50 లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం, రూ.38.50 లక్షలతో కోలమూరు వద్ద అప్పన్నచెరువు పార్క్ అభివృద్ధి, రూ.47.50 లక్షలతో ధవలేశ్వరం పాంచాయతీలో ఓపెన్ జిమ్, వాకింగ్ట్రాక్ పనులు టెండరు దశలో ఉన్నాయి. కోనసీమజిల్లా: ఆత్రేయపురం వార్ఫ్ రోడ్డు వద్ద రూ.1.50 కోట్లతో రివర్ ఫ్రంట్, రూ.31 లక్షలతో రావులపాలెం జంక్షన్ వద్ద క్లాక్టవర్ అభివృద్ధికి టెండర్లు ఆహా్వనిస్తున్నారు. వాడపల్లి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం రూ.41.70 లక్షల వ్యయంతో ఆధ్యాతి్మకను సూచించే త్రిశంకు ఆకారంలో విద్యుత్ దీపాలు అమర్చే పనులు పురోగతిలో ఉన్నాయి. రావులపాలెం: కొమర్రాజులంక గ్రామంలో రూ.50 లక్షలతో పార్క్, వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి టెండర్లు ఆహ్వానిస్తున్నారు. విస్తృతంగా సుందరీకరణ పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దేశానికి అనుగుణంగా రుడా పరిధిలోని ప్రాంతాల్లో సుందరీకరణ, ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నాం. స్థానికఎమ్మెల్యేల అభ్యర్థనల మేరకు, రుడా నిబంధనలకు అనుగుణంగా పనులు చేపడుతున్నాం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగడం లేదన్న ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయి. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో చేపడుతున్న పనులను చూసైనా బుద్ధి వస్తుందని భావిస్తున్నాం. –మేడపాటి షర్మిలారెడ్డి, చైర్పర్సన్ రుడా రాజానగరంలో ‘జిమ్’దాబాట్ రాజానగరం నియోజకవర్గంలో గాదరాడ, బూరగపూడి, శ్రీరంగపట్నం గ్రామాల్లో రూ.20.30 లక్షల వ్యయంతో యువతకు ఫిట్నెస్ పెంపొందించే జిమ్ల నిర్మాణం పూర్తయింది. విమాన ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు ఎయిర్పోర్ట్ రోడ్డు వెంబడి ఉన్న సెంట్రల్ లైటెనింగ్ పోల్స్కు రూ.55 లక్షలతో ఎల్ఈడీ మోటిఫ్ ఏర్పాటు. రూ.2 కోట్లతో కోరుకొండ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్స్టాప్ పునరుద్ధరణకు మార్గం సుగమం కానుంది. పుణ్యక్షేత్రం వద్ద బర్డ్స్ పార్క్, ‘ఐ లవ్ రాజానగరం’, గ్రామ పేరు సూచించే సైన్బోర్డు పనులు టెండరు దశలో ఉన్నాయి. -
వైద్యురాలి ఊపిరితిత్తుల మార్పిడికి సీఎం జగన్ చేయూత
సాక్షి, అమలాపురం: అనారోగ్యంతో బాధపడుతున్న వైద్యాధికారి పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఔదార్యం చూపింది. దెబ్బతిన్న ఊపిరితిత్తులు, అవయవ మార్పిడి కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.30 లక్షలు మంజూరు చేసింది. ఈ విషయాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా శనివారం విలేకరులకు తెలిపారు. వివరాల ప్రకారం.. జిల్లాలోని కె.గంగవరం మండలం పేకేరు పీహెచ్సీ వైద్యాధికారిగా కాలే యేసు దేవీకుమారి పదేళ్లుగా పని చేస్తున్నారు. ఆమె రెండో దశలో కోవిడ్ బారినపడి కోలుకున్న తర్వాత అరుదైనవ్యాధి సోకడంతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. దీనికి కొంతకాలం నుంచి ఆమె చికిత్స పొందుతున్నారు. కానీ ఊపిరితిత్తులు 85శాతం దెబ్బతినడంతో నెల రోజుల క్రితం హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్సలు చేసినా ఫలితం లేకపోవడంతో ఊపిరి తిత్తులు మార్పిడి చేయాలని వైద్యులు చెప్పారు. అదే సమయంలో సీఎం వైఎస్ జగన్ ఈ నెల 7వ తేదీన జిల్లాలోని రాజోలు నియోజకవర్గ పర్యటనకు వచ్చారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా చొరవతో డాక్టర్ యేసు దేవీకుమారి భర్త, కొత్తపేట మండలం అవిడి పీహెచ్సీ వైద్యాధికారి పి.రవికుమార్... సీఎం జగన్ను కలిసి తన భార్యకు వైద్యం కోసం సహాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు లెటర్ ఆఫ్ క్రెడిట్ ప్రాతిపదికన అవయవ మార్పిడి జరిగిన తర్వాత నేరుగా యశోద ఆస్పత్రికి చెల్లించే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.30 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సీఎం సాయం మరువలేం చాలా సంతోషంగా ఉంది. నా భార్య ప్రాణాలు నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సాయం మరువలేం. నా భార్య అనారోగ్య సమస్యను కలెక్టర్ హిమాన్షు శుక్లా దృష్టికి తీసుకువెళ్లాను. డీఎంహెచ్వో ద్వారా కలెక్టర్ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సీఎం జగన్ వద్దకు కలెక్టర్ తీసుకువెళ్లి నాతోపాటు ఆయన కూడా సమస్యను వివరించారు. తర్వా త మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ స్వయంగా సీఎం వద్దకు ఫైల్ తీసుకువెళ్లారు. వీరందరి కృషితో నా భార్య ఊపిరితిత్తుల మార్పిడికి ఈ సాయం అందింది. – డాక్టర్ రవికుమార్, వైద్యాధికారి, అవిడి పీహెచ్సీ, కొత్తపేట మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇది కూడా చదవండి: Andhra Pradesh:భూ చిక్కుముడులకు చెక్ -
కోనసీమ జిల్లా: వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమలో 200 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి చేరారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నం శాంతినగర్ మన్నా కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి చేరారు. మంత్రి విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్, ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ పాల్గొన్నారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అల్లవరం వాసులు అన్నారు. చదవండి: జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రాకు ఏపీ ప్రభుత్వం సత్కారం -
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పైప్లైన్ గ్యాస్ లీక్
-
కోనసీమ: నూతన వధువరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, కత్తిమండ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో ఉన్నారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కత్తిమండ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు శ్రీతన్మయి, వెంకట్రామ్లను ఆశీర్వదించిన సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. -
రేపు సీఎం జగన్ కోనసీమ జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకలో భాగంగా సీఎం జగన్ రేపు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయం నుంచి బయలుదేరి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం చేరుకుంటారు. అక్కడి నుంచి కత్తిమంద గ్రామంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
కోనసీమలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు దుర్మరణం
సాక్షి, కోనసీమ జిల్లా: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. వేగంగా వెళ్తున్న కారుని లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదం ముమ్మడివరంలో జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారని, సదరు బాధితులను గుర్తించే ప్రక్రియ చేపట్లినట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: సమస్యల పరిష్కారానికి కృషి) -
పేలాలు వేరుకోడానికి వచ్చావా చంద్రబాబూ..?: మంత్రి వేణు
సాక్షి,రామచంద్రాపురం(కోనసీమ జిల్లా): ప్రతిపక్షనేతగా ఓదార్పునిస్తున్నావా..పేలాలు ఏరుకుంటున్నావా చంద్రబాబూ.. అంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘ఇళ్లు కాలితే దానిపై పేలాలు వేరుకున్నట్లు చంద్రబాబు రైతులకు ఇబ్బంది వస్తే ఒక షో నిర్వహించాలని బయలుదేరాడు. రైతులకు కొంచెం ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. దీనికి ఒక షో నిర్వహించాలని చంద్రబాబు బయలుదేరడం విడ్డూరం’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు. ‘‘14 ఏళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల్ని అత్యంత దారుణంగా వంచించిన నాయకుడిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతాడు. ప్రజలు కష్టం వచ్చినప్పుడు కన్పించని వ్యక్తి.. ప్రజలు తిరస్కరించిన వ్యక్తి చంద్రబాబు. తనకు అనుకూలంగా ఉన్న చానళ్లలో ప్రచారం కోసం చంద్రబాబు ఒక డ్రామా చేస్తున్నాడు. తీరా అదంతా పూర్తిగా అట్టర్ ప్లాప్ అయ్యింది. నిన్న ఉదయం నుంచి ఆయన ఈ డ్రామాను రక్తికట్టించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. రామచంద్రాపురం వస్తే నీ వెనుక వచ్చిన వాళ్లు ఎంత మంది అనేది ఆత్మపరిశీలన చేసుకో.. రెండు జిల్లాల నుంచి నాయకులను రప్పించాడు. ఆయన సెక్యూరిటీ, మీడియా కలిపితే 200 మంది కూడా కన్పించలేదు’’ అని మంత్రి వేణు అన్నారు. నష్టపోయిన రైతుకు అండగా ఉంటున్నాం: ఏడయ్యా నీ శాసనసభ్యుడు అంటున్నావు..1వ తేదీన వర్షం వస్తే నీ నాయకుడు, కార్యకర్త ఎక్కడా కన్పించలేదు. నేను మంత్రిని...ధాన్యపు రాశుల వద్దకు వెళ్లి వెంటనే అధికారులను అప్రమత్తపరిచి ఏ రైతు ఆందోళన చెందవద్దని చెప్పాను. ముఖ్యమంత్రి గారు సమీక్షించారు..రాష్ట్రంలో పండిన ప్రతి ఒక్క గింజనూ కొనుగోలు చేస్తారు అని బరోసా ఇచ్చాను. తడిసినా, రంగు మారినా కొనే బాద్యత మాది అని స్పష్టంగా చెప్పాను. ఎడయ్యా మంత్రి.. ఎక్కడున్నాడు అంటున్నావు.. నేను తిరిగిన విషయం నా రైతులకు తెలుసు. ఇక్కడే నీ ప్లాప్ షో ప్రారంభం అయ్యింది. నేను కాళ్ళు పట్టుకుంటాడు అన్నావు..నేను నీలా కృతజ్ఞత హీనుడిని కాదు. చదవండి: కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నా కులంలో గొప్పవ్యక్తి చనిపోతే, నా కుటుంబంలో నష్టాన్ని భర్తీ చేసిన నా నాయకుడి వద్ద నేను వంగాను.. నీలాగా పిల్లనిచ్చి, రాజకీయ జీవితం ఇచ్చిన వ్యక్తిని రాత్రికి రాత్రి పొడిచేసిన కృతజ్ఞతాహీనుడిని కాదు. రైతుల వద్దకు వెళ్లి ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఓదార్పు ఇవ్వాలి. రైతుల వద్దకు వెళ్లి ఆత్మహత్యలు అంటూ ఏకరువు పెడుతున్నావు. రైతులు సుఖంగా ఉండటం చంద్రబాబుకు ఇష్టం లేదు. వ్యవసాయం దండగ అన్న ఒక చరిత్ర హీనుడు చంద్రబాబు. వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తానంటే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నాడు. చంద్రబాబు నోటి నుంచే ఉచిత విద్యుత్ గొప్పది అని చెప్పించిన వ్యక్తి వైఎస్సార్. జగన్ సమర్ధుడు కాబట్టే నిన్ను అందరి కాళ్లూ పట్టిస్తున్నాడు.. జగన్ అసమర్ధుడు అంటున్నాడు. సమర్ధుడు కనుకే నిన్ను నీ కొడుకును అందరి కాళ్లూ పట్టిస్తున్నాడు. జగన్ సమర్ధుడు కనుకనే నువ్వు పవన్ కళ్యాణ్, రజనీకాంత్ కాళ్లు పట్టుకుంటున్నావు. జగన్ అహంకారి అంటున్నావు. ప్రజలకు సేవ చేయడానికి అతను అహంకారంతోనే పనిచేస్తారు. రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి చంద్రబాబు ఎప్పుడూ శాశ్విత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో రైతుల కోసం ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేశారు. కావాలంటే నువ్వు వెళ్లి చూడు. పండిన పంటను ఏం చేస్తావో సాయంత్రంలోగా చెప్పు అంటూ ఘీంకరిస్తున్నాడు. ముఖ్యమంత్రి సమీక్ష చేసి ప్రతి గింజెను కొనాలనిచెప్పిన మాట వినలేదా..? ఎకరాకు 50 బస్తాల ధాన్యం పండటానికి కారణం ముఖ్యమంత్రి గారు కాదా..?. జూన్ 1న సాగునీరు విడుదల చేసింది ముఖ్యమంత్రి గారు కాదా..?. సకాలంలో సేంద్రియ ఎరువులు అందించారు.. వర్షాలను నువ్వేమన్నా ఆపేయగలవా.? వర్షం వెలిసిన తర్వాత పంట నష్టం అంచనాలు వేస్తారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నీకు కనీస జ్ఞానం కూడా లేదా..? గత ఏడాది వరదొస్తే ఒక్కో రైతుకు రూ.10 లక్షలకు పైగా పరిహారం వచ్చిన రైతులున్నారు. కౌలు రైతులపై నీకు ఇప్పుడు ప్రేమ పుట్టిందా..? చదవండి: చంద్రబాబువన్నీ డ్రామాలే.. దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వే చంద్రబాబు.. దరిద్రుడు అంటావా..ఏం పదం అది..ఆయన 5 కోట్ల మంది ఎన్నుకున్న ముఖ్యమంత్రి అని మరిచావా.? నువ్వు పాలనలో ఉంటేనే దరిద్రం వస్తుంది..కరువు నీకు కేరాఫ్ అడ్రస్ నువ్వు..దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వే నీ వయసు, చూపు తగ్గిపోయింది.. ట్రాక్టర్లలో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే కనిపించడం లేదు. కొనుగోలు చేస్తున్న ప్రాంతంలో టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు కోసం వెళ్లి ధాన్యాన్ని తొక్కి పడేశారు. ఈ ప్రభుత్వం రైతును అన్ని విధాల ఆదుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోంది. మిల్లర్లు ఐపీ పెడితే మాట్లాడలేని నువ్వు ఈ రోజు దళారీలు లేకుండా కొనుగోలు చేస్తుంటే కన్పించడం లేదా..?. ఈ జిల్లాలో మునిగిన పంట 475 ఎకరాలు..34456 మెట్రిక్ టన్నుల ధాన్యం మునిగింది. దాన్ని ప్రతి గింజా మేం కొనుగోలు చేస్తూనే ఉన్నాం. ములాఖత్కు వచ్చి మొసలి కన్నీరు ఎందుకు..?: రాజమండ్రిలో టీడీపీ నాయకుడు జైలుకు వెళ్తే చంద్రబాబు ములాఖత్ కోసం వచ్చాడు. పనిలో పనిగా రైతులను మళ్లీ మోసం చేద్దాం..మొసలి కన్నీరు కార్చి కొంగ జపం చేద్దామని ఈ తతంగం చేస్తున్నాడు. చక్కగా ఎండి ఉన్న ధాన్యం, తడవని ధాన్యం, జగననన్న కాలనీలో ఎండబెట్టుకున్న ధాన్యాన్ని రైతులు అమ్ముకుంటుంటే అక్కడకు వెళ్లి కొనుగోలు చేయడం లేదని చెప్పడానికంటే గుడ్డితనం ఉంటుందా..? నీ నాటకాలు ఎవరికి తెలియదు చంద్రబాబూ..? నువ్వు మాట్లాడితే వక్తిత్వ హననం చేయాలని బాబాయ్ చంపావ్ అంటున్నాడు. ముఖ్యమంత్రి రావాలా నీకు..? మేం నీకులాగా షో చేయలేదు. మాట్లాడితే తిత్లీ తుఫాను వచ్చింది.. నేను రాజమండ్రిలో పడుకున్నాను అంటున్నాడు. ఈ రోజు నువ్వు చేస్తున్న తంతు వల్ల రైతులకు నష్టమే తప్ప లాభం ఉండటం లేదు. ఏ రైతు పండించిన పంటకూ ఇబ్బంది కలుగకుండా మేం అండగా నిలుస్తున్నాం. ఏ ధాన్యాన్నైనా కొనుగోలు చేయమని మిల్లర్లకు కూడా చెప్పాం. నీ హయాంలో ఏనాడైన సంచులు పంచావా..?: ఎవడో ఒక పాత సంచి తీసుకొచ్చి ఇస్తే దాన్ని చూపించి సంచులు లేవు అంటున్నాడు. ఆయన హయాంలో ఏనాడైనా సంచులు పంపిణీ చేయలేదు. మేం చేస్తున్నట్లు నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బు వేశావా..? 1.52 లక్షల మందికి బీమా అందించాం. ఈ జిల్లాలోని అందరు రైతులకు బీమా పే చేశాం. వాస్తవాలు ఇలా ఉంటే ఇన్సూరెన్స్ కట్టలేదని ఆరోపిస్తాడు. కనీస వాస్తవాలు కూడా తెలుసుకోవడం లేదు. రైతులు చనిపోతే వారి శవాల వద్దకు వచ్చి రాజకీయాలు చేద్దామనుకుంటున్నాడు. శవ రాజకీయాలు మానేయ్ చంద్రబాబూ..నిన్ననే మండపేటలో ఒకరికి కాలు పోయింది. నువ్వు దరిద్రుడివై ఉండి మా ముఖ్యమంత్రిని అంటున్నావు. ఇప్పటికైనా చంద్రబాబూ ప్రజల్ని హింసించకు. నీ కొడుకును అధికారంలోకి తేవాలనే నీ కాంక్ష నెరవేరదు. ఏ పంట సీజన్లో పంటకు నష్టం వాటిల్లితే అదే సీజన్లో రైతులకు నష్టపరిహారం ఇచ్చే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. ఇన్ పుట్ సబ్సిడీ ఎప్పుడైనా ఇచ్చావా చంద్రబాబూ.. అలా చేయకుండా ఇప్పుడొచ్చి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. -
మామిడికుదురు మండలం పాశర్లపూడిలో భారీ అగ్ని ప్రమాదం
-
వెరైటీ పుచ్చకాయలు
-
కోనసీమ జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, కోనసీమ జిల్లా: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మహిళతో సహా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం మూలస్థానం జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ కారు రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, ఒక మహిళతో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుంది. క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక, ప్రమాదం జరిగిన సమయంలోనే మరో కారు.. బైక్పై వెళ్తున్న వ్యక్తిపైకి దూసుకెళ్లింది. -
కన్నీరు పెట్టిస్తున్న ఘటన.. ‘మాయమైపోతున్నడమ్మా’
రాయవరం(కోనసీమ జిల్లా): ‘‘మాయమైపోతున్నడమ్మా...మనిషన్న వాడు...మచ్చుకైనా లేదు చూడు మానవత్వం ఉన్నవాడు’’.. అంటూ తెలంగాణ ప్రజాకవి అందెశ్రీ రాసిన గేయం రాయవరం మండలం మాచవరం సమీపంలో జరిగిన హత్యోదంతాన్ని గుర్తుకు తెస్తోంది. గత నెల 24న కొవ్వూరి సత్యవేణి (54) హత్యకు గురైన విషయం విదితమే. మాచవరం శివారు దేవుడు కాలనీకి చెందిన ఇద్దరు అవివాహిత సోదరులు ఆమెపై తొలుత అత్యాచారం చేసి, ఆనక హత్య చేశారు. ఈ ఘటన హతురాలి కుటుంబాన్నే కాదు హత్యకు పాల్పడిన వారి కుటుంబాన్ని కూడా చిన్నాభిన్నం చేసింది. గతంలో దేవుడు కాలనీకే చెందిన అన్నదమ్ములు నల్లమిల్లి ఉమామహేశ్వరరెడ్డి, నల్లమిల్లి వెంకట సత్యనారాయణరెడ్డిలు సత్యవేణిపై అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని ఆమె బయట పెట్టడంతో అన్నదమ్ములు ఆమెపై కక్ష పెంచుకుని, ఈ దురాఘతానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఆ సోదరుల తల్లి నల్లమిల్లి పద్మ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల విచారణలో వాస్తవాలు బయట పడడంతో అన్నదమ్ములు కటకటాల పాలయ్యారు. దాంతో వారి కుటుంబం రోడ్డున పడింది. హతురాలి కుమారుడి మూగ వే(రో)దన.. హతురాలు సత్యవేణి భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఇరువురు కుమారులు. పెద్ద కుమారుడు కిరణ్కుమార్రెడ్డి దుబాయ్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. మూగ, చెవిటి వాడైన చిన్న కుమారుడు ఉమామహేశ్వరరెడ్డిని తల్లి సత్యవేణి కంటికిరెప్పలా కాపాడుకుంటోంది. తల్లి సత్యవేణి హత్యకు గురైన విషయం ఉమామహేశ్వరరెడ్డికి తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. 15 రోజులుగా తల్లి కనిపించకపోవడంతో అతడు ఆహారం తీసుకోవడం లేదు. అమ్మ వస్తుందని చెప్పినా వినకుండా ఒంటరిగా గదిలోనే గడుపుతున్నాడు. ఉమామహేశ్వరరెడ్డిని ఎలా ఊరడించాలో తెలియక తాతయ్య ద్వారంపూడి గంగరాజు మదనపడుతున్నాడు. చదవండి: ‘నాన్న.. అమ్మను కొట్టకు బాగా చూసుకో.. నేనింక బ్రతకను..’ కఠినంగా శిక్షించాలి కొవ్వూరు సత్యవేణిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పీడీఎస్యూ పూర్వపు జిల్లా అధ్యక్షుడు బి.సిద్ధు డిమాండ్ చేశారు. మానవత్వం మరచి అత్యాచారం చేసి మహిళలను హతమార్చిన నిందితులను దిశ చట్టం ప్రకారం ప్రభుత్వం 21 రోజుల్లో శిక్షించాలని అన్నారు. కొవ్వూరి సత్యవేణి కుటుంబసభ్యులను సిద్ధు పరామర్శించారు. -
త్వరలోనే కోనసీమ అల్లర్ల కేసు ముగింపు: ఎంపీ మిథున్రెడ్డి
సాక్షి, కాకినాడ జిల్లా: త్వరలోనే అమలాపురం అల్లర్ల కేసుకు ముగింపు పలుకుతామని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కో-ఆర్డినేటర్, ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘కొద్దిరోజుల కిందట మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్.. సీఎం జగన్ను కలిశారు. అల్లర్ల కేసులో కొందరు అమాయకుల పేర్లు ఉన్నాయని, దీనివల్ల యువత భవిష్యత్తు పాడవుతుందని సీఎంకు వివరించారు. వారిపై నమోదైన కేసులను ఉపసంహరించాలని కోరారు’’ అని మిథున్రెడ్డి వెల్లడించారు. చదవండి: ‘ఎన్టీఆర్ను ఆ విధంగా నమ్మించారు.. స్వెట్టర్లు అమ్మే వ్యక్తి రాయబారి అయ్యారు’ -
కోనసీమ జిల్లా : వైభవంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం (ఫొటోలు)
-
ఢిల్లీకి కోనసీమ ‘ప్రభ’.. ప్రభుత్వానికి కోనసీమ వాసుల కృతజ్ఞతలు
కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్ ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ‘డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ’ తన సంస్కృతి సంప్రదాయాలతో మరోసారి జాతీయస్థాయి ఖ్యాతినార్జించనుంది. అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే తీర్థానికి వచ్చే ఏకాదశ రుద్రుల ప్రభల నమూనా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని కర్తవ్యపథ్లో రాష్ట్ర శకటంపై కొలువుదీరనుంది. –సాక్షి అమలాపురం తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన సంక్రాంతి పండుగ కనుమ రోజు జరిగే జగ్గన్నతోట తీర్థానికి 11 గ్రామాలకు చెందిన ప్రభలు వస్తాయి. ప్రభ మీదనే పరమేశ్వరుని ఉత్సవ విగ్రహాలు ఉంచి ఊరేగింపుగా తీర్థాలకు తీసుకువస్తారు. దీనికి 450 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రభలపై పరమేశ్వరుని ప్రతిరూపాలు ఇక్కడకు వచ్చి లోక కళ్యాణార్థం చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అరుదైన గుర్తింపు గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివ కేశవ యూత్ సభ్యులు ఈ తీర్థ విశేషాలను దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తూ 2020లో మెయిల్ చేశారు. మోదీ తీర్థం ప్రాశస్త్యాన్ని అభినందించారు. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్కు వెళ్లే రాష్ట్ర ప్రభుత్వ శకటంపై జగ్గన్నతోట తీర్థానికి వచ్చే ఏకాదశ రుద్రులను ప్రదర్శనకు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించినట్టయ్యింది. ప్రభుత్వ నిర్ణయానికి కోనసీమ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమలోని పంట కాలువలు, వరి చేలు, కొబ్బరి తోటలు, రహదారుల మీదుగా ఊరేగే ప్రభలు ఈ ఏడాది ఢిల్లీలోని గణతంత్ర దినోత్సవ పరేడ్లో రాష్ట్ర శకటంపై ఊరేగనున్నాయి. చదవండి: రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్లో ఏపీ ప్రభల తీర్థ శకటం ముచ్చట గొల్పుతున్న ఏకాదశ రుద్రులు పరేడ్ శకటంపై ఉంచే ప్రభలను తాటి శూలం, టేకు చెక్క, మర్రి ఊడలు, వెదురు బొంగులతో సంప్రదాయ బద్ధంగా తయారు చేశారు. రంగు రంగుల నూలుదారాలు (కంకర్లు), కొత్త వస్త్రాలు, నెమలి పింఛాలతో అలంకరించారు. శకటానికి మూడు వైపులా మూడు చొప్పున తొమ్మిది చిన్న ప్రభలు, శకటం మధ్యలో రెండు పెద్ద ప్రభలు నిర్మించారు. కొబ్బరి చెట్లు, మేళతాళాలు, గరగ నృత్యకారులు, వేదపండితులు, పల్లకీ, దానిని మోస్తున్న కార్మికుల బొమ్మలు, తీర్థానికి గూడెడ్ల బండ్ల మీద వచ్చే వారి నమూనాలతో శకటాన్ని తీర్చిదిద్దారు. వరి కుచ్చులు, గుమ్మడి కాయలు, ఇతర కూరగాయలతో అలంకరించారు. గరగ ప్రదర్శనకు అవకాశం పరేడ్లో ప్రదర్శనకు అంబాజీపేట మండలం ముక్కామలకు చెందిన పసుపులేటి నాగబాబు గరగ బృందం ఎంపికైంది. ఈ బృందంలో సుమారు 24 మంది ఉన్నారు. గతంలో నాగపూర్ కల్చరల్ సెంటర్ ద్వారా ఈ బృందం 15 సార్లు పరేడ్లో పాల్గొంది. అయితే ఈసారి ప్రభల తీర్థం శకటం ప్రదర్శన సందర్భంగా ఈ బృందానికి నేరుగా పాల్గొనే అవకాశం లభించింది. మన ప్రాంతానికి దక్కిన గుర్తింపు ప్రభల తీర్థం అంటే మన సంప్రదాయం. రిపబ్లిక్ డే పరేడ్లో ఏకదశ రుద్రుల కొలువు దీరడం అంటే అది మన తీర్థానికి, మన ప్రాంతానికి దక్కిన గుర్తింపు. ఆ తీర్థంలో మాది ముఖ్యపాత్ర కావడం మా పూర్వ జన్మసుకృతం. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – పూజ్యం శ్రీనివాస్, అర్చకుడు స్వతంత్రంగా తొలిసారి గతంలో పలుమార్లు రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్నాం. రాష్ట్రపతులు శంకర్ దయాళ్ శర్మ, వెంకటరామన్, అబ్దుల్ కలాం, ప్రతిభాపాటిల్, ప్రధానులు రాజీవ్గాంధీ, పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్ ముందు మా ప్రదర్శన జరిగింది. కోనసీమ ప్రభలు పరేడ్కు వెళుతున్నందున స్వతంత్రంగా తొలిసారి మా బృందం ప్రదర్శనకు సిద్ధమైంది. – పసుపులేటి నాగబాబు, గరగ బృందం గురువు -
స‘లక్ష’ణంగా త్రివర్ణ శోభితం!
ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 5 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా రంగులు అద్ది ఔరా అనిపిస్తున్నాడు. పొడవైన బాసుమతి రకం బియ్యాన్ని ఎంచుకుని వాటికి రంగులు దిద్ది.. వాటిని చార్టులపై అంటించాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పురోహితుడు పెద్దింటి రామచంద్రశ్రీహరి(రామం). గతంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నెలా 15 రోజుల్లో 3 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా రంగులను అద్ది రికార్డు సృష్టించాడు. తాజాగా సుమారు రెండు నెలల్లో 5 లక్షల బియ్యం గింజలపై రంగులు అద్దడం ద్వారా తన రికార్డును తానే బ్రేక్ చేసినట్టు చెబుతున్నాడు. ఇప్పటికే ఈ అంశం పలు రికార్డు సంస్థల దృష్టికి వెళ్లినట్టు తెలిపాడు. -
ఘుమఘుమలాడే కోనసీమ వంటకాలు
-
కోనసీమ జిల్లాలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
-
కోససీమ జిల్లా కొత్తపేటలో ఘనంగా ప్రభల ఊరేగింపు
-
AP: పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి పాదపూజ
రామచంద్రపురం(కోనసీమ జిల్లా): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పాదాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శనివారం కడిగారు. దుశ్శాలువాలు, పూలమాలలు, నూతన వ్రస్తాలతో ఘనంగా సత్కరించారు. వీరితో పాటు పోలీసులు, వైద్యులను కూడా సన్మానించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతకు భోగి, స్వేచ్ఛతకు సంక్రాంతి, సేవకు గుర్తుగా కనుమ పండుగ జరుపుకొంటారని తెలిపారు. చదవండి: పెళ్లయిన ఆ జంటలు.. ఇక ప్రత్యేక కుటుంబాలు -
సంక్రాంతి సంబరాల్లో అపశ్రుతి.. స్కూల్లో భోగి మంటలు అంటుకుని..
సాక్షి, కోనసీమ జిల్లా: ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలోని ఒక ప్రైవేట్ స్కూల్లో సంక్రాంతి సంబరాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గొల్లవిల్లిలోని ఒక ప్రైవేట్ స్కూల్లో భోగి మంటలు వేశారు. ఆ మంటలు అంటుకుని ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన విద్యార్థులను మంత్రి విశ్వరూప్, ఎంపీ అనురాధ, కలెక్టర్ హిమాన్షు శుక్లా పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. చదవండి: నాపై భర్త, అతడి ప్రియురాలి హత్యాయత్నం.. ఆత్మహత్య చేసుకుంటా.. -
సీఎం జగన్ను కలిసిన చిన్నారి హనీ, తల్లిదండ్రులు
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన చిన్నారి హనీ, తల్లిదండ్రులు కలిశారు. అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి చికిత్స కోసం గతంలో కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న సీఎంను హనీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబులు కలిశారు. దీంతో అప్పటికప్పుడే చిన్నారి చికిత్స కోసం సీఎం జగన్ రూ.1 కోటి మంజూరు చేశారు. చిన్నారి హనీ చికిత్సకు అవసరమైన ఖరీదైన ఇంజక్షన్లతో పాటు నెలకు రూ.10వేలు పెన్షన్ కూడా ప్రభుత్వం అందిస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో చికిత్స అందుకుంటూ చిన్నారి హనీ ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంది. అయితే ఈ రోజు హనీ పుట్టినరోజు సందర్భంగా సీఎం జగన్ను కలిసి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపగా, సీఎం చిన్నారిని ఆశీర్వదించారు. చదవండి: (‘సీఎం జగన్ మాటిచ్చారు.. నెరవేర్చారు’) -
అందాల పోటీల్లో కేశనపల్లి గిత్తకు ప్రథమ స్థానం
మలికిపురం: రాష్ట్ర స్థాయిలో జరిగిన అందాల పోటీలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామం అడబాల లక్ష్మీనారాయణ (నాని)కి చెందిన పుంగనూరు గిత్త ప్రథమ స్థానం పొందింది. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా పెదతాడేపల్లిలో జరిగిన ఈ పోటీలలో ఈ గిత్తకు రూ.30 వేల బహుమతి లభించింది. మంత్రి కొట్టు సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోసేన్రాజు, ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు చేతుల మీదుగా లక్ష్మీనారాయణ బహుమతి అందుకున్నారు. దేశీయ గోజాతి సంవర్ధక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఎత్తు 13 అంగుళాలు.. పొడవు 19 అంగుళాలు మలికిపురం మండలంలోని పడమటిపాలెం గ్రామంలో సోమవారం అరుదైన పుంగనూరు గిత్త దూడ జన్మించింది. పెద్దిరెడ్డి సత్యనారాయణ మూర్తికి చెందిన పుంగనూరు ఆవుకు ఈ దూడ జన్మించింది. దీని ఎత్తు 13 అంగుళాలు, పొడవు 19 అంగుళాలు ఉంది. పుంగనూరు దూడలన్నీ సాదారణంగా ఇదే సైజులో జన్మిస్తాయి. (క్లిక్ చేయండి: మండ పీతకు మంచి డిమాండ్.. 4 లక్షల ఆదాయం!) -
‘సీఎం జగన్ మాటిచ్చారు.. నెరవేర్చారు’
సాక్షి అమలాపురం: ‘మాట తప్పరు.. మడమ తిప్పరు’ అనే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. అల్లవరం మండలం నక్కా రామేశ్వరానికి చెందిన చిన్నారి కొప్పాడి హనీ కాలేయానికి గాకర్స్ వ్యాధి సోకి బాధపడుతోంది. అరుదైన ఈ వ్యాధికి రూ.కోటి ఖరీదైన వైద్యం అందించేందుకు సీఎం హామీ ఇచ్చారు. దానిని అమలు చేసి చూపించారు. అక్కడితో ఆగలేదు.. ఆ పాప ఆలనాపాలనా కోసం నెలకు రూ.10 వేల చొప్పున పింఛన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. అక్టోబర్లో తొలి ఇంజెక్షన్ హానీకి ప్రతి 15 రోజులకు ఒకసారి రూ.74 వేలు విలువ చేసే సెరిజైమ్ ఇంజెక్షన్ చేయాల్సి ఉంది. తొలి విడతగా రూ.10 లక్షలతో 13 ఇంజెక్షన్లు తెప్పించారు. మరో రూ.40 లక్షలతో 52 ఇంజెక్షన్లు తెప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. అక్టోబర్ 2వ తేదీన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, అమలాపురం మునిసిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి స్థానిక ఏరియా ఆస్పత్రిలో తొలి ఇంజెక్షన్ అందజేశారు. ప్లకార్డు చూసి... స్పందించిన సీఎం గత ఏడాది జూలై 26న గోదావరి వరదల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోనసీమలో పర్యటించారు. బాధితులను పరామర్శించి గంటిపెదపూడిలోని హెలీప్యాడ్ వద్దకు తిరిగి వెళుతున్న సీఎం జగన్కు ‘సీఎం గారూ.. మా పాపకు వైద్యం అందించండి’ అని ప్లకార్డు పట్టుకుని హనీ తల్లిదండ్రులు కనిపించారు. వారిని తన వద్దకు పిలిపించుకున్న సీఎం వైఎస్ జగన్ హనీకి వచి్చన కష్టం వివరాలు తెలుసుకుని పాప వైద్యానికి తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. నెలవారీ రూ.పది వేల పింఛన్ రూ.కోటి విలువైన వైద్యానికి అంగీకరించడమే కాదు... హనీ ఆలనాపాలనా చూసేందుకు నెలకు రూ.10 వేల చొప్పున పింఛన్ అందేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జనవరి నెల నుంచి ఆ బాలికకు పింఛన్ అందిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన కలెక్టర్ శుక్లా తొలి పింఛన్ను హనీ కుటుంబ సభ్యులకు అందజేశారు. సీఎం జగన్ ఆదేశాలతో హనీకి అమలాపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉచితంగా విద్యను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. -
ఫొటోగ్రాఫర్ హత్య వెనుక ‘టీడీపీ’ నేత హస్తం?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన మండపేటలో ఫొటోగ్రాఫర్ను పీక నులిమి చంపేశారు. నూతన సంవత్సర వేడుకల వేళ మండపేట బైపాస్ రోడ్డులోని ఒక లే అవుట్లో ఆ ఫొటోగ్రాఫర్ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తీరా తీగ లాగితే డొంక కదిలింది. అనుమానితులను పోలీసులు తమదైన శైలిలో విచారించారు. పోస్టుమార్టం నివేదికలో ఫొటోగ్రాఫర్ను హత్య చేసినట్టుగా నిర్ధారించారు. ఈ హత్య వెనుక పట్టణంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసులో కీలక నిందితునిగా ఉన్న అతడి అనుచరుడు పరారీలో ఉండటం ఇందుకు బలం చేకూరుస్తోంది. అసలు ఈ హత్యకు, ఆ మాజీ ప్రజాప్రతినిధికి మధ్య సంబంధం ఏమిటి, హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో పోలీసు దర్యాప్తు సాగుతోంది. మండపేటకు చెందిన ఫొటోగ్రాఫర్ కొనిజాల సురేష్ (28) డిసెంబర్ 31వ తేదీ రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు స్నేహితులతో కలిసి వెళ్లి శవమై తేలాడు. తొలుత పట్టణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహంపై ఉన్న గాయాల ఆధారంగా నాలుగు రోజులుగా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మండపేట బైపాస్ రోడ్డులోని ఓ లే అవుట్లో ఆ రోజు నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఇందులో పట్టణ టీడీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి కారు డ్రైవర్తో కలిసి సురేష్ పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ డ్రైవర్తో పాటు మరికొందరిని తమదైన శైలిలో విచారించి, సురేష్ హత్యకు గురైనట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ హత్యతో సంబంధం ఉన్న మరికొందరు అనుమానితుల పేర్లను సేకరించారు. వారిలో సదరు మాజీ ప్రజాప్రతినిధి ప్రధాన అనురుడు కూడా ఉన్నాడని నిర్ధారించుకున్నారు. అతడితో పాటు మరికొందరు పరారీలో ఉండటంతో వారి కోసం రెండు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. హతుడు సురేష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి కుటుంబ సభ్యులు ఆ మాజీ ప్రజాప్రతినిధి ఇంట్లో పని చేసేవారనే విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. మాజీ ప్రజాప్రతినిధితో పాటు మరికొందరు అనుమానితుల పేర్లు విచారణలో పోలీసులకు చెప్పినట్టుగా హతుని సోదరుడు ఫోన్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం సంచలనమైంది. విచారణలో వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలు, అనుమానితుల కాల్డేటా వివరాలు సేకరించి పరిశీలిస్తున్నారు. హత్య విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచీ రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి మండపేట వచ్చి అనుమానితులను విచారిస్తున్నారు. జిల్లా ఎస్పీ సు«దీర్కుమార్రెడ్డి కేసు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. శుక్రవారం వచ్చిన పోస్టుమార్టం నివేదికలో సురేష్ మెడ భాగంలో ఎముకలు విరిగి ఉన్నట్టు నిర్ధారణ అయింది. చదవండి: కానిస్టేబుల్ నిర్వాకం.. యువతితో 4 ఏళ్ల ప్రేమ.. బర్త్డే పేరుతో! దీంతో అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. పరారీలో ఉన్న అనుమానితులు దొరికితే మాజీ ప్రజాప్రతినిధి పాత్రపై స్పష్టత వస్తుందని పోలీసులు అంటున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ సమగ్రంగా విచారణ చేస్తున్నామని మండపేట టౌన్ సీఐ పి. శివగణేష్ చెప్పారు. కేసులోని ప్రధాన నిందితులను ఆధారాలతో సహా పట్టుకుంటామని అన్నారు. -
యువరైతు ప్లాన్ సక్సెస్.. పచ్చని తోటలో ఎర్ర బెండలు!
ఆలమూరు: వ్యవసాయంపై మక్కువ పెంచుకున్న ఆ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకున్న రెండున్నర ఎకరాల భూమిలో పూలు, కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఓ అరెకరం పొలంలో మాత్రం వినూత్నంగా ఎర్రబెండలు సాగుచేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకకు చెందిన భీమాల రాఘవేంద్ర.. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా జిల్లాలో మరెక్కడా లేని ఎర్రబెండ సాగుకు శ్రీకారం చుట్టారు. ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే శీతాకాలంలోనే దీనిని సాగుచేయాలన్న ఉద్యాన శాస్త్రవేత్తలు ఇచి్చన సలహాతో గత నవంబర్ చివరి వారంలో సాగు చేపట్టాడు. ముదురు ఆకుపచ్చ రంగు స్థానంలో ఎండు మిరప రంగును పోలి ఉన్న ఎర్ర బెండకాయలను ఆయన పండిస్తున్నాడు. విత్తనాలను వారణాశిలోని నేషనల్ సీడ్ కార్పొరేషన్ నుంచి ఆన్లైన్లో తెప్పించి.. అరెకరంలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టాడు. సాధారణ రకం బెండ 60 రోజుల్లో కోతకు వస్తుంది. కానీ ఎర్రబెండ మాత్రం 40 రోజుల్లోనే దిగుబడినిస్తోంది. అది కూడా సాధారణ పంట కంటే 20 శాతం అధికంగా. పచ్చ బెండ మాదిరిగా ఈ ఎర్ర బెండలో జిగురు లేదు. ఆకృతి కూడా ఆకర్షణీయంగా ఉండటంతో శాకాహారులు అమితంగా ఇష్టపడుతున్నారు. అయితే కూర వండాక ఎర్రబెండ ఆకుపచ్చ రంగుకు మారడం విశేషం. పుష్కలంగా పోషకాలు - విటమిన్ సీ, ఏ, బీతో పాటు ఫోలాసిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. - కాల్షియం, ఫైబర్ సమృద్ధిగా ఉన్నాయి. కేలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. - కంటి చూపును మెరుగుపరచి, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. - ఎర్ర రక్తకణాల సంఖ్యను, రోగ నిరోధక శక్తిని వృద్ధి చేస్తాయి. - ఎర్రబెండలో ఉండే ఫోలేట్ గర్భిణులకు ప్రయోజనకరంగా ఉంటుంది. - మధుమేహాన్ని అదుపులో ఉంచడం, బరువు తగ్గేందుకు సాయపడుతుంది. ప్రత్యేకతను చాటుకోవాలనే.. సహజ పంటలకు భిన్నంగా నూతన వంగడాల్ని ఈ ప్రాంత ఉద్యాన రైతులకు పరిచయం చేసి, తద్వారా వ్యవసాయ రంగంలో ప్రత్యేకతను చాటుకోవాలనే ఉద్దేశంతోనే ఎర్రబెండ సాగు చేశాను. ఆశించిన దానికంటే దిగుబడి ఎక్కువగా వచ్చింది. మార్కెట్లో గిట్టుబాటు ధర కూడా లభిస్తోంది. ఉద్యాన శాఖ రాయితీలిస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – బి.రాఘవేంద్ర, రైతు. -
ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు.. ఆ ఇంట్లో అసలేం జరిగిందంటే..
రాజోలు(కోనసీమ జిల్లా): మరో మహిళతో సన్నిహితంగా ఉండటం సహించలేని ఓ వివాహిత తన ప్రియుడిపై బ్లేడుతో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజోలు మండలం తాటిపాకకు చెందిన వివాహితకు తన బావ అయిన మలికిపురం మండలం గూడపల్లికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. అతడికి వివాహమైన ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ నెల 17వ తేదీ రాత్రి ఇంట్లో ఎవరూ లేరంటూ అతడిని ఆమె ఇంటికి పిలిచింది. ఇంట్లో ఉన్న తన కుమారుడిని వివాహిత మరో రూములో పడుకోబెట్టి గడియ పెట్టింది. సన్నిహితంగా ఉన్న సమయంలో అతడికి, ఆ వివాహితకు మధ్య వివాదం తలెత్తింది. మరో మహిళతో చనువుగా ఉంటున్నాడంటూ ఆగ్రహించిన ఆమె అప్పటికే తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న బ్లేడుతో అతడి మర్మావయవాన్ని కోసేసింది. అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడిన అతడు బంధువుల సహకారంతో రాజోలు ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. బాధితుడిని మెరుగైన వైద్యం కోసం అమలాపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ శస్త్రచికిత్స చేయడంతో అతడు కోలుకుంటున్నాడని బంధువులు తెలిపారు. అతడిపై దాడి చేసిన వివాహితపై రాజోలు పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: పెళ్లయి పిల్లలు ఉన్న తండ్రి.. మరో వివాహిత వెంటపడి.. భర్త ఎదుటే.. -
పచ్చి కొబ్బరితో పాలు, ఆయిల్.. రోజుకు రెండు స్పూన్లు తీసుకుంటే..
జంతువుల పాలతో తయారైన ఉత్పత్తుల కన్నా మొక్కల ద్వారా తయారయ్యే పాలు (ప్లాంట్ బేస్డ్ మిల్క్) ఆరోగ్యదాయకమైనవే కాకుండా పర్యావరణహితమైనవి కూడా అన్న అవగాహన అంతకంతకూ ప్రాచుర్యం పొందుతున్నది. ఈ కోవలోనిదే కొబ్బరి పాల ఉత్పత్తి. పచ్చి కొబ్బరి పాలతో తయారయ్యే వర్జిన్ నూనె, యోగర్ట్ (పెరుగు) వంటి ఉత్పత్తులకు ఐరోపా తదితర సంపన్న దేశాల్లో ఇప్పటికే మంచి గిరాకీ ఉంది. కొబ్బరి పాల ఉత్పత్తుల మార్కెట్ ఈ ఏడాది 84 కోట్ల డాలర్లకు చేరనుంది. వచ్చే ఆరేళ్లలో 105 కోట్ల డాలర్లు దాటుతుందని ‘గ్లోబ్ న్యూస్వైర్’ అంచనా. మన దేశంలోనూ (ముఖ్యంగా కేరళ, తమిళనాడుల్లో) వాణిజ్య స్థాయిలో కొబ్బరి పాల ఉత్పత్తి జరుగుతోంది. ఈ నేపధ్యంలో డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తొలి కొబ్బరి పాలు, వర్జిన్ కొబ్బరి నూనె ఉత్పత్తి యూనిట్ ప్రారంభం కావటం ఆహ్వానించదగిన పరిణామం. రాష్ట్రంలో కొబ్బరి అధికంగా పండించే కోనసీమలోనూ కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు పెద్దగా లేవనే చెప్పవచ్చు. కేవలం కాయర్ (కొబ్బరి పీచు) ఆధారిత పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. ఈ లోటును భర్తీ చేస్తూ కొబ్బరి పాలను, దాని నుంచి వర్జిన్ కోకోనట్ ఆయిల్ తయారీ తొలి పరిశ్రమను నెలకొల్పారు అభ్యుదయ రైతు గుత్తుల ధర్మరాజు(39). డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చెందిన ధర్మరాజు ఎంటెక్ చదువుకున్నారు. 13 ఏళ్లపాటు చమురు, సహజవాయువు రంగంలో ఇంజినీర్గా సేవలందించారు. రెండేళ్ల క్రితం ముమ్మిడివరంలో ఆయన రూ. 1.5 కోట్ల పెట్టుబడితో ‘కోనసీమ ఆగ్రోస్’ పేరుతో పరిశ్రమను నెలకొల్పారు. ‘వెల్విష్’ పేరు మీద వర్జిన్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి పాలను ఉత్పత్తి చేస్తున్నారు. కొబ్బరి పాలు, వర్జిన్ కోకోనట్ ఆయిల్తో పాటు పాలు తీసిన కొబ్బరి పిండిని విక్రయిస్తున్నారు. ముమ్మిడివరంతోపాటు అమలాపురం, రాజమహేంద్రవరాల్లో సొంతంగానే ప్రత్యేక దుకాణాలు తెరిచి కొబ్బరి పాలు, వర్జిన్ ఆయిల్లకు సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ రిటైల్గా అమ్ముతున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో వెల్కం డ్రింకుగా కొబ్బరి పాలను అందించే ట్రెండ్కు శ్రీకారం చుట్టారాయన. రోజుకు 250 లీటర్ల కొబ్బరి పాల ఉత్పత్తి పచ్చి కొబ్బరి ముక్కలతోపాటు కొద్దిగా నీరు కలిపి మిక్సీ పట్టి కొబ్బరి పాలను తయారు చేసి కొబ్బరి అన్నం తదితర వంటలు చేస్తుండటం మనకు తెలిసిందే. పచ్చి కొబ్బరి పాల నుంచి శుద్ధమైన, ఆరోగ్యదాయకమైన పారిశ్రామిక పద్ధతుల్లో తయారు చేస్తారు. దీన్నే వర్జిన్ కోకోనట్ ఆయిల్గా పిలుస్తారు. పక్వానికి వచ్చిన కొబ్బరి కాయను పగల గొట్టి, చిప్పల నుంచి కొబ్బరిని వేరు చేస్తారు. కొబ్బరికి అడుగున ఉన్న ముక్కుపొడుం రంగు పలుచని పొరను తీసి వేసి గ్రైండర్ల ద్వారా కొబ్బరి పాలను తయారు చేస్తారు. పది కేజీల (సుమారు 28) కొబ్బరి కాయల నుంచి 1.5 లీటర్ల పాలు.. ఆ పాల నుంచి ఒక లీటరు వర్జిన్ నూనెను ఉత్పత్తి చేస్తున్నట్లు ధర్మరాజు చెప్పారు. ఆయన నెలకొల్పిన పరిశ్రమకు రోజుకు 5 వేల కొబ్బరికాయల నుంచి పాలను, నూనెను తయారు చేసే సామర్థ్యం ఉంది. మార్కెట్ అవసరం మేరకు ప్రస్తుతం రోజుకు 3 వేల కాయలతో 250 లీటర్ల పాలు తీస్తారు. పాల నుంచి 125–150 లీటర్ల వర్జిన్ కొబ్బరి నూనె వస్తుంది. కొబ్బరి పాలలో 60% నూనె, 40% నీరు ఉంటాయి. ఈ పాలను సెంట్రీఫ్యూగర్స్లో వేసి వేగంగా (18.800 ఆర్పీఎం) తిప్పినప్పుడు నూనె, నీరు వేరవుతాయి. వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇలా ఉత్పత్తి అవుతుంది. ఈ క్రమంలో ఎటువంటి రసాయనాలూ వాడరు. చిక్కటి కొబ్బరి పాలు లీటరు రూ.250లకు విక్రయిస్తున్నారు. ఈ పాలను నేరుగా తాగకూడదు. 3 రెట్లు నీరు కలిపి తాగాలి. 1:3 నీరు కలిపిన కొబ్బరి పాలు లీటరు రూ.100కు, గ్లాస్ రూ.30కు అమ్ముతున్నారు. వర్జిన్ కోకోనట్ ఆయిల్ కేజీ అమ్మకం ధర రూ.450. ఇది రెండేళ్ల వరకు నిల్వ ఉంటుంది. ఉప ఉత్పత్తుల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. 3 వేల కాయల కొబ్బరి నుంచి పాలు తీసిన తర్వాత 75 కిలోల లోఫాట్ కొబ్బరి పొడి వస్తుంది. దీని ధర కిలో రూ. 125–150. కొబ్బరి చిప్పలు కూడా వృథా కావు. వీటితో తయారయ్యే యాక్టివేటెడ్ కార్బన్కు కూడా మంచి ధర వస్తుందన్నారు ధర్మరాజు. – నిమ్మకాయల సతీష్ బాబు, సాక్షి అమలాపురం. పాల వినియోగం ఇలా ► కొబ్బరి పాలను సాధారణ పాలు వినియోగించినట్టే వాడుకోవచ్చు. టీ, కాఫీలతోపాటు పాయసం, మిఠాయిలు తయారు చేసుకోవచ్చు. విదేశాల్లో ఐస్క్రీమ్ల, సౌందర్య సాధనాల తయారీలో కూడా కొబ్బరి పాల వినియోగం ఎక్కువ. ► కొబ్బరి పాలను నీరు కలపకుండా నేరుగా తీసుకోకూడదు. దీనిలో 60 శాతం ఆయిల్ ఉంటుంది. మిగిలిన 35 శాతం నీరు. 1:3 పాళ్లలో నీరు కలిపి వాడుకోవాలి. ఒక గాసు కొబ్బరి పాలలో మూడు గ్లాసుల నీరు, కొంత పంచదార కలిపి రిటైల్ ఔట్లెట్లో అమ్ముతున్నారు. పుష్కలంగా పోషకాలు ► కొబ్బరి పాలల్లో పుష్కలంగా పీచు, పిండి పదార్థాలతో పాటు.. విటమి¯Œ –సీ, ఇ, బి1, బి3, బి4, బి6లతోపాటు ఇనుము, సెలీనియం, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, పొటాసియం, జింక్, సోడియం ఉన్నాయి. ∙కొబ్బరి పాలు వీర్యపుష్ఠిని కలిగిస్తాయి. అలసటను నివరించి శరీరానికి బలం చేకూరుస్తాయి. బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఎలక్ట్రోలైట్స్ను బ్యాలెన్స్ చేయడంతోపాటు గుండె జబ్బులను నివారిస్తాయి. ∙రక్తహీనతను నివారించడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చంటి పిల్లలకు తల్లి పాలు చాలకపోతే కొబ్బరి పాలు తాపవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆదరణ పెరుగుతోంది కొబ్బరి పాలకు ప్రజాదరణ పెరుగుతోంది. రిటైల్ అమ్మకాలు పెరగడంతోపాటు శుభ కార్యక్రమాలకు వెల్కం డ్రింక్గా కూడా అమ్మకాలు పెరిగాయి. ముమ్మిడివరం, అమలాపురం, రాజమహేంద్రవరాల్లో రిటైల్ ఔట్లెట్లు ఏర్పాటు చేశాం. వాకర్లు ఎక్కువగా సేవిస్తున్నారు. వర్జిన్ కోకోనట్ ఆయిల్ పసిపిల్లలకు మసాజ్ చేయడానికి చాలా అనువైనది. దీన్ని రోజుకు రెండు స్పూన్లు తీసుకుంటే.. మహిళల్లో హార్మోన్ అసమతుల్యత ఉపశమిస్తున్నట్లు మా వినియోగదారులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాంలలో బేబీ మసాజ్ అయిల్గా కోకోనట్ వర్జిన్ ఆయిల్కు మంచి మార్కెట్ ఉంది. ఒడిదొడుకులున్నప్పటికీ మంచి భవిష్యుత్తు ఉన్న రంగం ఇది. – గుత్తుల ధర్మరాజు (85559 44844), కొబ్బరి పాల ఉత్పత్తిదారు, ముమ్మిడివరం, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. కొబ్బరి పాలు.. కొత్త ట్రెండ్.. పశువులలో వచ్చే కొన్ని రకాల వ్యాధుల ప్రభావం వాటి పాల మీద ఉంటుంది. ఇది స్వల్పమోతాదే కావచ్చు. అలాగే, పశువుల పొదుగు పిండడం ద్వారా పాలను సేకరించడం ఒక విధంగా వాటిని హింసించడమేనని భావించే వారి సంఖ్య కూడా పెరిగింది. వీరు మొక్కల నుంచి వచ్చే పాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొబ్బరి పాలు వీరికి మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఇదొక కొత్త ట్రెండ్. కొబ్బరి తెగుళ్ల ప్రభావం పాల మీద ఉండదు. కొబ్బరి పాలు ఆరోగ్యానికి చాలా మేలు. కానీ, ఏదైనా మితంగా తీసుకోవాలి. – డాక్టర్ బి.శ్రీనివాసులు, అధిపతి, డా.వై.ఎస్.ఆర్. ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట. ∙కోనసీమ ఆగ్రోస్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న వర్జిన్ కోకోనట్ ఆయిల్ -
మరణంలోనూ ఒకరికొకరు తోడుగా.. ఒకే సమాధిలో ఇద్దరికీ శాశ్వత విశ్రాంతి
రామచంద్రపురం రూరల్: మండలంలోని ఏరుపల్లికి చెందిన బూసి ధర్మరాజు(82), బూసి వీరమ్మ (72)లది 56 ఏళ్ల అన్యోన్య దాంపత్యం. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె, పెద్ద అల్లుడు కాలం చేశారు. చిన్న కుమార్తె గొల్లపల్లి పార్వతి హసన్బాద గ్రామ సర్పంచ్గా పని చేశారు. ఆమె భర్త గొల్లపల్లి సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తూ ఇటీవల మృతి చెందారు. 56 ఏళ్ల వైవాహిక జీవితంలో ధర్మరాజు, వీరమ్మ ఏనాడూ ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేదు. కుమార్తెల ఇళ్లకు వెళ్లేటప్పుడు కూడా ఇద్దరూ కలిసే వెళ్లి వచ్చేవారు. గ్రామంలో ఒకరికొకరు తోడుగా జీవించేవారు. ధర్మరాజు ఎనిమిది పదుల వయస్సులోనూ సైకిల్ తొక్కుకుంటూ కుమార్తె ఇంటికి వెళ్లేవారు. ఇంటిలోకి కావాల్సిన సరుకులు తానే స్వయంగా తెచ్చుకునేవారు. వీరమ్మ కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటూ ఇంటి పనులు మొత్తం తానే చక్కబెట్టుకునేది. కొంతకాలంగా ధర్మరాజుకు కాస్త ఆయాసం వస్తూ ఉండేది. దీంతో భర్తకు వేడి మంచినీళ్లు ఇవ్వడం వీరమ్మకు అలవాటుగా మారింది. గురువారం రాత్రి 12 గంటల సమయంలో భర్తకు వేడి నీళ్లు ఇద్దామని పిలవగా స్పందించలేదు. చుట్టుపక్కల వారిని లేపి చూపించగా, వారు పరిశీలించి ధర్మరాజు మృతి చెందాడని చెప్పారు. దీంతో ఆమె రోదిస్తూ కూర్చుంది. చుట్టుపక్కల వారు కుమార్తెల కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. సుమారు 2 గంటల పాటు ఏడుస్తూ కూర్చున్న వీరమ్మ వెక్కిళ్లు వచ్చి, వాంతి చేసుకుని ప్రాణాలు విడిచిపెట్టింది. నాలుగు రోజుల క్రితం మునిమనవడితో కులాసాగా గడిపిన ఆ వృద్ధ దంపతులు ఒకే రోజు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శుక్రవారం ఉదయం క్రిస్టియన్ పద్ధతిలో ఇద్దరినీ ఒకే సమాధిలో పూడ్చి పెట్టారు. కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్ మల్లిమొగ్గల శ్రీధర్, మాజీ సర్పంచ్లు సాక్షి వేణు, చిల్లా గోపాలకృష్ణ, గ్రామస్తులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. చదవండి: పోలీస్ స్టేషన్లో ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య -
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రూపుదిద్దుకున్న సూపర్స్టార్ కృష్ణ విగ్రహం
-
కోనసీమ జిల్లా: అంకంపాలెంలో మహిళలపై తేనెటీగల దాడి
-
కోనసీమ జిల్లాలో మహిళలపై తేనెటీగల దాడి
సాక్షి, కోనసీమ జిల్లా: ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో తేనెటీగల దాడిలో 25 మంది గాయపడ్డారు. అందులో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం. వన భోజనాలు కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని రావులపాలెం ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. చదవండి: రూమ్కు తీసుకెళ్లి రోల్డ్గోల్డ్ ఉంగరం తొడిగి.. పెళ్లయిపోయిందని నమ్మించి.. -
రూమ్కు తీసుకెళ్లి రోల్డ్గోల్డ్ ఉంగరం తొడిగి.. పెళ్లయిపోయిందని నమ్మించి..
కొత్తపేట(కోనసీమ జిల్లా): ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు చేసినట్టు అదనపు ఎస్సై డి.శశాంక శనివారం తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. మండలంలోని వానపల్లి శివారు రామ్మోహనరావుపేటకు చెందిన 14 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని కొంతకాలంగా నమ్మించాడు. ఈ నెల 10న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒకసారి శారీరకంగా కలిశాడు. మళ్లీ 12న బాలిక స్కూల్లో ఉండగా వెళ్లి తన ఫ్రెండ్ బర్త్డేకు పలివెల వెళ్లివద్దామని చెప్పి తీసుకువెళ్లాడు. అక్కడ ఒక రూములో రోల్డ్గోల్డ్ ఉంగరం తీసి, బాలిక వేలుకు తొడిగి, పెళ్లయిపోయిందని నమ్మించి, మరోసారి శారీరకంగా కలిశాడు. వారి బాగోతం ఆ బాలిక పెద్దలకు తెలియడంతో ఆ యువకుడు ముఖం చాటేశాడు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని అదనపు ఎస్సై తెలిపారు. చదవండి: ప్రియుడితో కుమార్తె పరార్.. తల్లిదండ్రుల ఆత్మహత్య -
నాలుగేళ్లుగా నాన్న కోసం.. సముద్రంలో దారి తప్పి పాకిస్థాన్లో బందీలుగా..
అమలాపురం టౌన్: అది 2018 నవంబర్ 29వ తేదీ. మంగళూరు సముద్ర తీరం నుంచి 22 మంది మత్స్యకారులతో అరేబియా సముద్రంలో చేపల వేటకు బోటు బయలుదేరింది. వీరిలో 20 మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారు. మిగిలిన ఇద్దరూ మన జిల్లా వారు. వారు చేపల వేట సాగిస్తున్న బోటు అనుకోకుండా పాకిస్థాన్ సముద్ర జలాల్లోకి అనుకోకుండా ప్రవేశించింది. చదవండి: హరిపురం ఘటనపై విస్తుపోయే వాస్తవాలు.. చక్రం తిప్పిన టీడీపీ నేత! అలా ఆ దేశ సముద్ర సరిహద్దు గస్తీ పోలీసులకు ఈ 22 మంది మత్స్యకారులూ పట్టుబడ్డారు. ఆ దేశంలో బందీలుగా మారిపోయారు. ఆ 22 మందిలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 20 మంది గుర్తింపు కార్డులూ సక్రమంగా ఉండటంతో ఆ దేశ చెర నుంచి కొద్ది నెలలకే విడుదలయ్యారు. మన జిల్లాలోని ఐ.పోలవరం మండలం పశువుల్లంకకు చెందిన పెమ్మాడి నారాయణరావు, కాట్రేనికోన మండలం గచ్చకాయలపొరకు చెందిన మూదే అన్నవరం ఇంకా ఆ దేశంలో బందీలుగానే మగ్గిపోతున్నారు. వీరికి వేట బోట్ల పరంగా గుర్తింపు కార్డులు లేకపోవడంతో నాలుగేళ్లుగా కరాచీ జైలులో మగ్గుతున్నారు. వారి కోసం కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. హిందీలో ఉత్తరాలు రాయిస్తూ.. ఆధార్ కార్డులో తప్ప నారాయణరావు, అన్నవరం ఫొటోలు తీయించుకున్న సందర్భాలు కూడా అంతగా లేవు. దీంతో వారి పాత ఫొటోలనే చూసుకుంటూ ఆయా కుటుంబ సభ్యులు తమ వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. నారాయణరావు, అన్నవరం ఉత్తరాలు రాసేంత అక్షరాస్యులు కూడా కారు. నారాయణరావు మాత్రం హిందీ భాషలో ఎవరితోనో చాటుగా ఉత్తరం రాయించి చివర సంతకాలు చేసి పోస్టు చేయిస్తున్నాడు. అప్పుడప్పుడూ వస్తున్న ఆ ఉత్తరాలను ఇక్కడ హిందీ భాష తెలిసున్న వారితో చదివించుకుని, అతడి కుటుంబీకులు కొంత తృప్తి పడుతున్నారు. మరో మత్స్యకారుడు అన్నవరం నుంచి అతడి కుటుంబీకులకు అటువంటి ఉత్తరాలు వచ్చిన దాఖలాలు లేవు. ఇటీవల అన్నవరం ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటోందని, అతడి పరిస్థితి చూస్తే బాధనిపిస్తోందని తోటి బందీ నారాయణరావు తన కొడుకు దుర్గాప్రసాద్కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. అన్నవరానికి కుమార్తె మాత్రమే ఉంది. ఆమె ముమ్మిడివరం మండలం కొత్తలంకలో ఉంటోంది. ఆమె కూడా తన తండ్రి కోసం తల్లడిల్లుతోంది. రెడ్క్రాస్ సొసైటీ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు రాష్ట్ర రెడ్క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న ‘రిలేషన్ ఫ్యామిలీ లింక్స్’ కార్యక్రమంలో భాగంగా పాక్లో బందీ అయిన నారాయణరావుతో కోనసీమలోని అతడి కుటుంబీకులకు ఉత్తరం రాయించి, ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ ద్వారా ఇక్కడి వారికి అందే ఏర్పాటు చేసింది. అలాగే నారాయణరావు కుమారుడు దుర్గాప్రసాద్ కూడా తన తండ్రికి రాసిన ఉత్తరాన్ని రెడ్క్రాస్ సొసైటీ పాక్ చెరలో ఉన్న నారాయణరావుకు పంపించే ఏర్పాటు చేసింది. నారాయణరావుకు భార్య, కుమారుడు దుర్గా ప్రసాద్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లయ్యాయి. దుర్గా ప్రసాద్ కుటుంబం ఉపాధి నిమిత్తం సొంతూరు పశువుల్లంక నుంచి హైదరాబాద్కు వలస వెళ్లింది. అక్కడే అతడు వడ్రంగి మేస్త్రీగా జీవనం సాగిస్తున్నాడు. ఆ దేశం నుంచి తండ్రి రాసిన ఉత్తరం చూసి, ఉద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమవుతున్నాడు. పాక్ చెర నుంచి తమ వారిని విడిపించి, తమకు అప్పగించాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్కు, ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. ఎదురు చూస్తున్నాను నాన్న నారాయణరావు సముద్రంలో బోట్లపై ఇతర రాష్ట్రాల్లోకి కూడా వెళ్లి కొన్ని రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చేవాడు. 2018లో వెళ్లిన నాన్న నెలలు గడస్తున్నా ఇంటికి చేరుకోలేదు. ఆరా తీస్తే పాకిస్థాన్కు బందీగా చిక్కుకుపోయాడని ఆరు నెలల తర్వాత తెలిసింది. చాలా బాధపడ్డాం. అప్పటి నుంచీ నాలుగేళ్లుగా నాన్న కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. చాలా ఇబ్బందులు పడుతూ అప్పుడప్పుడు నాన్న మాత్రం అక్కడి నుంచి ఉత్తరాలు రాస్తున్నాడు. ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నాను. తగిన ఆధారాలు సమర్పించాను. – పెమ్మాడి దుర్గాప్రసాద్, పాక్ బందీ నారాయణరావు కుమారుడు, వడ్రంగి మేస్త్రి, హైదరాబాద్ -
తమ్ముళ్లతో బాబు బంతాట.. ఇన్చార్జ్లకు పొగ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉరుము ఉరిమి మంగళం మీద పడిన చందంగా చంద్రబాబు తీరు ఉందని తెలుగు తమ్ముళ్లు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన తప్పులన్నీ చేసేసి, ఇప్పుడు నిందలు తమపై నెట్టేస్తున్నారని ఆ పార్టీ ముఖ్య నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గడచిన ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆ పార్టీకి ఒకప్పటి కంచుకోటలు వైఎస్సార్సీపీ ముందు నిలవలేక కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. మూడేళ్లుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గాల్లో టీడీపీ ఉనికి కోసం పాకులాడే దయనీయ స్థితికి చేరుకుంది. పార్టీ రహితంగా అర్హతే ప్రామాణికంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మ్యానిఫెస్టోను 95 శాతం అమలు చేయడంతో ప్రధాన ప్రతిపక్షం విలవిలలాడుతోంది. దీంతో నానా యాతనా పడుతున్న ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలకు అధినేత చంద్రబాబు నుంచి సరైన దన్ను లభించడం లేదు. ఓటమికి తప్పంతా తమదే అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించడం వీరికి ఇబ్బందిగా పరిణమించింది. కాకినాడలో కాక జిల్లాలోని పలు నియోజకవర్గ ఇన్చార్జిలకు పొగబెడుతున్నారని టీడీపీ క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. కొన్నిచోట్ల ఉన్న ఇన్చార్జిలనూ మార్చేస్తే మరికొన్నిచోట్ల నాథుడు లేని పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సగానికి సగం నియోజకవర్గాల్లో గత ఎన్నికల కంటే టీడీపీ పరిస్థితి మరింత దిగజారిపోయిందనే నివేదికలు ఆ పారీ్టకి మింగుడుపడటం లేదు. జంట నియోజకవర్గాలైన కాకినాడ సిటీ, కాకినాడ రూరల్లో మూడు గ్రూపులు, ఆరు వర్గాలు అన్నట్టు పార్టీ ముక్కలైంది. నగరంలో పార్టీ వర్గాలుగా విడిపోవడానికి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఒంటెద్దు పోకడలే కారణమని సుంకర వర్గం ఆరోపిస్తోంది. కొండబాబు, మాజీ మేయర్ సుంకర పావని వర్గాల మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి. కొండబాబుకు ఉద్వాసన పలికి, ఇన్చార్జిగా పావనిని నియమించారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయడంతో వర్గపోరు ఇటీవల రచ్చకెక్కింది. కాకినాడ రూరల్ టీడీపీలోనూ రెండు వర్గాలు నడుస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్షి్మ, సత్తిబాబు దంపతుల నిర్వాకంతో పార్టీ ఖాళీ అయిపోయిందని వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. ఇదంతా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వర్గం చేస్తున్న దు్రష్పచారమని సత్తిబాబు వర్గం అంటోంది. చినరాజప్ప ప్రోద్బలంతో జెడ్పీటీసీ పేరాబత్తుల రాజశేఖర్, పెంకే శ్రీనివాసబాబా ఇన్చార్జి కోసం చేస్తున్న ప్రయత్నాలతో ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి.\ ‘తూర్పు’లో కీచులాటలు రాజానగరంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తీరుపై ఇటీవల చంద్రబాబు తలంటేశారు. ‘బంగారం లాంటి నియోజకవర్గాన్ని పాడు చేశావ్, అ«ధికారంలో ఉండగా అనుభవించి ఇప్పుడు గాలికొదిలేస్తావా?’ అని చీవాట్లు పెట్టిన విషయం ఆ పార్టీ అనుకూల మీడియాలోనే బహిర్గతమైంది. దీంతో పార్టీని పట్టించుకోని పెందుర్తిని పక్కన పెట్టాలనే వాదనను నేతలు తెరపైకి తీసుకువచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సిటీపై ఇప్పటికీ ఆశ తగ్గక పోవడంతో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో విభేదాలు కొనసాగుతున్నాయి. సిటీలో ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. పార్టీ సీనియర్ గన్ని కృష్ణ మూడో వర్గం ఎలానూ ఉండనే ఉంది. గోపాలపురంలో ఇన్చార్జి మార్పు పెను ప్రకంపనలనే సృష్టిస్తోంది. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును పక్కన పెట్టి మద్దిపాటి వెంక్రటాజుకు బాధ్యతలు అప్పగించడంతో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. వెంకటేశ్వరరావుకు జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ముప్పిడి, వెంకట్రావుల మధ్య తాడేపల్లిగూడెంలో జరిగిన పార్టీ జిల్లా సమావేశంలో వైషమ్యాలు రచ్చకెక్కి చివరకు ఆ పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరింది. బాబు సైతం వెంకట్రాజుకు మద్దతు తెలపడంతో నియోజకవర్గంలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీని గ్రూపు తగదాలు వెంటాడుతున్నాయి. మాజీ మంత్రి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కేఎస్ జవహర్ కొవ్వూరులోనే ఉంటున్నా స్థానికంగా నిర్వహించే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇక్కడి నాయకులు చక్రం తిప్పుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత అడ్రస్ లేకుండా పోవడాన్ని క్యాడర్ ప్రశ్నిస్తోంది. ఎస్సీలకు రిజర్వ్ అయిన ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం నుంచి ద్విసభ్య కమిటీని నియమించడాన్ని జవహర్ వర్గం వ్యతిరేకిస్తోంది. కోనసీమ జిల్లాలో దిక్కెవరు? డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు దాదాపు పొగ పెట్టినట్టేనని భావిస్తున్నారు. ఆనందరావును మాజీ హోంమంత్రి చినరాజప్ప వర్గం మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. ఆయనకు ప్రత్యామ్నాయంగా చినరాజప్ప వర్గం పరమట శ్యామ్ను ఇన్చార్జిని చేయాలనే ప్రయత్నాలు ఆ పార్టీలో అగ్గి రాజేశాయి. పి.గన్నవరంలో పారీ్టకి కేరాఫ్ అడ్రస్ లేకుండా పోయింది. మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి మృతి అనంతరం ఇక్కడ టీడీపీ చుక్కాని లేని నావలా మారింది. ఎస్సీలకు రిజర్వ్ అయిన ఈ నియోజకవర్గం బాధ్యతలను ప్రస్తుతానికి టీడీడీ మాజీ సభ్యుడు డొక్కా నాథ్బాబు చూస్తున్నారు. ఇన్చార్జి పదవి కోసం రాజమహేంద్రవరంలో స్థిరపడిన మందపాటి కిరణ్కుమార్ వెంపర్లాడటాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. స్థానికేతరులకు ఇస్తే తాడోపేడో తేలుస్తామంటూ డజను మంది మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్లు వారం వారం భేటీ అవుతున్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా దాదాపు పి.గన్నవరం పరిస్థితే కనిపిస్తోంది. టీడీపీ ఇక్కడ ఖాళీ అయిపోవడంతో కొత్తపేట నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఇక్కడ ఉనికి కోసం టీడీపీ ఆపసోపాలు పడుతోంది. -
పెద్ద మనసు చాటుకున్న సీఎం జగన్
అమలాపురం రూరల్(కోనసీమ జిల్లా): తలసేమియా వ్యాధితో బాధపడుతోన్న బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నారాయణపేటకు చెందిన బాలుడు దంగేటి యశ్వంత్(7) చికిత్సకు సీఎం వైఎస్ జగన్ సహాయం అందించారు. బాలుడు హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యానికి రూ.22 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. చదవండి: ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? శుక్రవారం గోకవరం మండలం గుమళ్లదొడ్డిలో ఇథనాల్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు వచ్చిన సీఎంను గోదావరి సెంట్రల్ డెల్టా బోర్టు చైర్మన్ కుడుపూడి వెంకటేశ్వరబాబు కలిశారు. బాలుడు తండ్రి ఆర్థిక పరిస్థితిని విన్నవించారు. దీనిపై చలించిన సీఎం వెంటనే స్పందించారు. సీఎం సహాయ నిధి నుంచి రూ. 22 లక్షలు మంజూరు చేస్తున్నట్లు సంతకం చేసి కార్యదర్శి జవహర్రెడ్డికి అందజేశారు. -
Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే బిక్కిన మృతి
సాక్షి, రాజోలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బిక్కిన గోపాలకృష్ణారావు (83) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన స్వగ్రామం తాటిపాకలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. 1972లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రాజోలు నుంచి అప్పటి దేవదాయ శాఖ మంత్రి రామలింగరాజుపై పోటీ చేసి గోపాలకృష్ణారావు గెలుపొందారు. అగ్రికల్చరల్ బీఎస్సీ చదివిన ఆయన తాటిపాక గ్రామంలోనే ఉంటూ వ్యవసాయంపై ఆసక్తి చూపుతూ పలు పంటలు పండించేవారు. 1950వ దశకంలో తాటిపాక సర్పంచ్గా కూడా బాధ్యతలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గోపాలకృష్ణారావు మృతి పట్ల రాజోలు ప్రస్తుత ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ ఏవీ సూర్యనారాయణరాజు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యేలు అల్లూరు కృష్ణంరాజు, మానేపల్లి అయ్యాజీ వేమా, పాముల రాజేశ్వరీదేవి సంతాపం వ్యక్తం చేశారు. -
విద్యార్థులకు కరెంట్ షాక్ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
కాట్రేనికోన/సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతుకుర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం విద్యుదాఘాతానికి గురై యడ్ల నవీన్ (7) అనే మూడో తరగతి విద్యార్థి మృత్యువాత పడ్డాడు. ఈ ప్రమాదంలో మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో చిట్టిమేను వివేక్ (3వ తరగతి), తిరుపతి ఘన సతీష్కుమార్ (4వ తరగతి)లను అత్యవసర వైద్యం నిమిత్తం అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన మరో ఇద్దరు 3వ తరగతి విద్యార్థులు మొల్లేటి నిఖిల్, బొంతు మహీధరరెడ్డిలకు దొంతుకుర్రులోనే ప్రాథమిక వైద్యం అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పాఠశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న సచివాలయ భవనం శ్లాబ్ కోసం ఇనుప ఊచలను కట్ చేసేందుకు కటింగ్ మెషీన్ తీసుకొచ్చారు. దాని తీగ ఊచలకు తగలడం.. అదే సమయంలో విద్యార్థులు తాగునీటి కోసం ఆ ఇనుప ఊచలపై నుంచి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఇక సతీష్కుమార్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్, జిల్లా ఏఎస్పీ కె.లతామాధురి పరామర్శించి, పరిస్థితిని సమీక్షించారు. మృతిచెందిన విద్యార్థి నవీన్ కుటుంబీకులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. గాయపడిన విద్యార్థుల తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. బాధితులకు అండగా ఉండండి : సీఎం విద్యార్థులకు కరెంట్ షాక్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతిచెందిన బాలుడి కుటుంబానికి శుక్రవారం ఆయన రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని సూచించారు. -
అమరావతి పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్
సాక్షి, కోనసీమ: అమరావతి పేరిట చేపట్టిన పాదయాత్రకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బ్రేకులు పడ్డాయి. శనివారం ఉదయం రామచంద్రాపురం వద్ద అమరావతి యాత్ర నిలిచిపోయింది. హైకోర్టు ఆదేశాల మేరకు యాత్రలో పాల్గొన్న వారు.. గుర్తింపు కార్డులు ధరించి యాత్ర చేసుకోవాలని పోలీసులు సూచించారు. అయితే గుర్తింపు కార్డులు చూపించని నేపథ్యంలో యాత్ర నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో.. నాలుగు రోజులపాటు పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇవ్వాలనే నిర్ణయానికి యాత్రికులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అమరావతి పాదయాత్ర విషయంలో ఏపీ హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పాదయాత్రలో కేవలం 600 మంది మాత్రమే ఉండాలని, డీజీపీకి అందచేసిన జాబితాలో ఉన్న వ్యక్తులే పాల్గొనాలని స్పష్టం చేసింది. పాదయాత్రకు సంఘీభావం తెలపాలనుకునే వ్యక్తులు ఇరువైపులా ఉండి మద్దతు తెలపవచ్చని, అయితే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్రలో పాల్గొనడానికి వీల్లేదని ఆదేశించింది. ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీనివల్ల అసాంఘిక శక్తులతో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారంటూ పిటిషనర్లు వ్యక్తం చేస్తున్న ఆందోళన తొలగిపోతుందని పేర్కొంది. -
భర్త కోసం భార్య మౌన పోరాటం
మండపేట(కోనసీమ జిల్లా): తన భర్తతో కాపురానికి పంపాలని కోరుతూ వివాహిత పదిరోజులుగా అత్తవారి ఇంటి వద్ద మౌన పోరాటం చేస్తోంది. అత్తమామలు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోవడంతో ఆరుబయట గుమ్మం వద్ద దీక్ష నిర్వహిస్తోంది. మండలంలోని ద్వారపూడికి చెందిన ఉలిసి లక్ష్మీశైలజకు అదే గ్రామానికి చెందిన నామాల రంగారావు తనయుడు మోహన్ శ్యాం శరణ్తో 2020 డిసెంబర్లో వివాహమైంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న శరణ్కు వివాహ సమయంలో ఐదు కుంచాల పొలం, ఆడపడుచు కట్నంగా రూ.ఐదు లక్షలు, వివాహ ఖర్చుల నిమిత్తం రూ. ఐదు లక్షలు, 20 కాసుల బంగారం అందజేసినట్టు శైలజ తండ్రి రామకృష్ణ తెలిపారు. చదవండి: నరబలి కేసు: ఆ 26 మంది మహిళల ‘మిస్సింగ్’ వెనుక షఫీ హస్తం? వివాహం అనంతరం శరణ్ జీతం రెట్టింపు కావడంతో తమ కుమార్తెపై వేధింపులు మరింత ఎక్కువయ్యాయన్నారు. పెళ్లి జరిగి రెండేళ్లు కావస్తుండగా నెల రోజులు కూడా తమ కుమార్తెను అత్తింటి వారి వద్ద ఉంచుకోలేదని, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న భర్త వద్దకు పంపకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు గ్రామ పెద్దల ద్వారా వివరించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తతో మాట్లాడకుండా తన వద్ద నుంచి ఫోన్ తీసేసుకున్నారని శైలజ విలపించింది. తన మానసిక స్థితి సరిగా లేదంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తన భర్తతో కాపురానికి పంపాలని కోరుతూ అత్తవారి ఇంటి వద్ద దీక్ష చేపట్టినట్టు బాధితురాలు వివరించింది. తాను రావడంతో అత్తమామలు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారని లక్ష్మీశైలజ తెలిపింది. ఈ విషయమై శైలజ మామ నామాల రంగారావును ఫోన్లో వివరణ కోరగా శైలజ తల్లిదండ్రులు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. శైలజ ఆత్మహత్యాయత్నానికి పాల్పడతానని పలుమార్లు బెదిరించిందని, ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే ఎవరు బాద్యత వహిస్తారన్నారు. రూరల్ ఎస్ఐ బి. శివకృష్ణను సంప్రదించగా అత్తింటి వారిపై ఫిర్యాదు చేసేందుకు శైలజ నిరాకరించిందన్నారు. ఇరువర్గాల వారికి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. -
లాడ్జిలో వ్యభిచారం.. వేర్వేరు రూమ్ల్లో రెండు జంటలు.. షాకిచ్చిన పోలీసులు
రామచంద్రపురం(కోనసీమ జిల్లా): పట్టణంలోని ఎస్ఎస్ గ్రాండ్ లాడ్జిలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో సీఐ వి.శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసులు దాడి చేసి వేరు వేరు రూమ్లలో వ్యభిచారం చేస్తున్న ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. లాడ్జి యజమాని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, లాడ్జిలో పనిచేసే వీరబాబును అరెస్టు చేసినట్లు రామచంద్రపురం ఎస్ఐ డి.సురేష్బాబు గురువారం విలేకరులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. చదవండి: కోడి గుడ్డు తింటే ఏం జరుగుతుందో తెలుసా? -
గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్.. హనీ వైద్యం కోసం రూ.కోటి మంజూరు
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): ఓ చిన్నారి ప్రాణాలకు సీఎం వైఎస్ జగన్ శ్రీరామరక్షలా నిలిచారు. ఆమెకు సోకిన అరుదైన వ్యాధి వైద్యానికి లక్షలాది రూపాయల ఖర్చును జీవితాంతం భరిస్తానని భరోసా ఇచ్చారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తమ పాలిట దైవంలా వచ్చి తమ బిడ్డకు ప్రాణం పోశారంటూ ఆ నిరుపేద తల్లిదండ్రులు సీఎం జగన్కు చేతులెత్తి దండం పెడుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేశ్వరానికి చెందిన మూడేళ్ల కొప్పాడి హనీ.. కాలేయానికి సంబంధించిన అరుదైన వ్యాధి ‘గాకర్స్’ బారిన పడింది. తల్లిదండ్రులు రాంబాబు, నాగలక్ష్మి నిరు పేదలు. తండ్రి ఇంటింటా ప్రభుత్వ రేషన్ వాహనాన్ని నడుపుకుంటూ, తల్లి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు, కుమార్తె హనీ ఉన్నారు. హనీకి 15 రోజులకోసారి రూ.1.25 లక్షల విలువైన సెరిజైమ్ అనే ఇంజెక్షన్ చేయాల్సి ఉంది. అమెరికాలోని ఈ ఇంజెక్షన్ తయారీ సంస్థ డిస్కౌంట్ పోను రూ.74 వేలకు దీనిని అందిస్తోంది. ఇంత ఖర్చు చేయడం ఆ కుటుంబం వల్ల కావడం లేదు. ప్లకార్డు చూసి.. స్పందించిన సీఎం జగన్ కుమార్తెను ఎలా దక్కించుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆపద్బాంధవుడిలా కనిపించారు. గత జూలై 26న సీఎం జగన్ కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనకు వచ్చారు. లంకల్లో వరద పరిస్థితులను పరిశీలించాక పి.గన్నవరం మండలం గంటి పెదపూడిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు కాన్వాయ్తో వెళుతున్నారు. ‘సీఎం గారూ.. మా పాపకు వైద్యం అందించండి’ అనే అభ్యర్థనతో ప్లకార్డు పట్టుకుని.. హెలిప్యాడ్ సమీపాన కుమార్తెతో కలిసి తల్లిదండ్రులు నిలుచున్నారు. ఆ ప్లకార్డు చూసి ఆగిన సీఎం జగన్.. ఆ చిన్నారి వ్యాధి గురించి విని చలించిపోయారు. పాప ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చయినా జీవితాంతం వైద్యం చేయిస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఆదేశించారు. తొలి విడతగా రూ.10 లక్షలతో 13 ఇంజెక్షన్లు సీఎం ఆదేశాల మేరకు చిన్నారి వైద్యానికి తొలి విడతగా రూ.10 లక్షల విలువైన 13 ఇంజెక్షన్లను అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక ముందు కూడా దాదాపు రూ.40 లక్షలతో మరో 52 ఇంజెక్షన్లు తెప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రిలో కలెక్టర్ సమక్షంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ పద్మశ్రీరాణి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి భరతలక్ష్మి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకరరావులు.. హనీకి ఆదివారం ఉదయం తొలి ఇంజెక్షన్ చేశారు. బాలిక తల్లిదండ్రులకు కలెక్టర్ శుక్లా ధైర్యం చెప్పారు. చిన్నారి వైద్యానికి సీఎం జగన్ రూ.కోటి కేటాయించారని తెలిపారు. చదువుతో పాటు పౌష్టికాహారం, పెన్షన్ను కూడా ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. చిన్నారికి ప్రభుత్వం సరఫరా చేసిన మందుల కిట్ను వారికి అందించారు. దేశంలో మొత్తం 14 మంది.. రాష్ట్రంలో తొలి బాధితురాలు హనీకి వచ్చిన కాలేయ సంబంధిత గ్రాకర్ వ్యాధి అత్యంత అరుదైనది. దేశంలో ఈ తరహా బాధితులు 14 మందే ఉండగా.. రాష్ట్రంలో హనీ తొలి బాధితురాలు. కాలేయ పనితీరులో జరిగే ప్రతికూల పరిస్థితులు, జన్యుపరమైన లోపాల వల్ల ఈ అరుదైన వ్యాధి సోకుతుంది. లివర్ హార్మోన్ల రీప్లేస్మెంట్ థెరపీ ద్వారా చిన్నారికి వైద్యం అందిస్తున్నారు. లివర్లో ఉండే ఎంజైమ్ బీటా గ్లూకోసైడేజ్ లోపించడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. వీరికి జీవితాంతం వైద్యం అవసరం. అయితే హనీ చిన్న వయస్సులో ఉన్నందున పదేళ్ల పాటు ప్రతి నెలా రెండు ఇంజెక్షన్ల చొప్పున ఇస్తే.. ఆరోగ్యం కుదుట పడే అవకాశముందని వైద్యులు భావిస్తున్నారు. పేదోడి కోసం ఓ ముఖ్యమంత్రి ఇంతలా పరితపిస్తారా.. ఈ రోజే తొలి ఇంజెక్షన్ ఇచ్చారు. మా పాపకు ప్రాణం దానం చేసిన సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఆ రోజు కాన్వాయ్లో సీఎం జగనన్న మమ్మల్ని చూసి ఆగడం.. మా పాప అనారోగ్యం గురించి తక్షణమే స్పందించి కలెక్టర్కు చెప్పడం, ఇప్పుడు రూ.లక్షల విలువైన వైద్యం అందించడం చూస్తుంటే.. ఓ సీఎం ఇంతలా ఓ పేదవాడి కోసం తపిస్తారా.. అని ఆశ్చర్యమేస్తోంది. మా బిడ్డను ఆదుకుని మాపాలిట దైవంలా నిలిచిన జగనన్నకు చేతులెత్తి దండాలు పెడుతున్నాం. – తల్లిదండ్రులు రాంబాబు, నాగలక్ష్మి -
కనిపెంచిన తండ్రి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. దేవుడా ఎంత శిక్ష వేసావయ్యా
రాయవరం(కోనసీమ జిల్లా): ఒక రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. తండ్రిని, భర్తను పోగొట్టుకున్న కుమార్తె ఒక వైపు, భర్తను, అల్లుడిని పోగొట్టుకున్న తల్లి మరొకవైపు చేస్తున్న ఆర్తనాదాలు చూపరులను కంట తడి పెట్టించాయి. రాయవరం మండలం పసలపూడి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జంధ్యం సుబ్రహ్మణ్యం మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. అదే ప్రమాదంలో గాయపడిన సుబ్రహ్మణ్యం అల్లుడు మాచవరం గ్రామ వలంటీర్ విడియాల మోహన్గాంధీ(26) గురువారం కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చదవండి: స్కూల్ బస్ మిస్.. బైక్లో తీసుకెళ్తుండగా కనిపెంచిన తండ్రిని, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను దూరం చేసి దేవుడా.. ఎంత శిక్ష వేసావయ్యా అంటూ మోహన్గాం«ధీ భార్య విజయదుర్గా భవాని బోరున విలపిస్తుంది. ఇక తనకు దిక్కెవరు అంటూ ఆమె విలపించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఆస్పత్రి నుంచి భర్త క్షేమంగా వస్తాడనుకున్నంతలోనే చావు కబురు వినాల్సి వచ్చిందంటూ ఆమె ఆవేదన చెందింది. ఇదిలా ఉంటే వారం రోజుల క్రితమే శస్త్ర చికిత్స చేయించుకుని ఒక పక్క భర్త సుబ్రహ్మణ్యం, మరో పక్క అల్లుడు మోహన్గాం«దీని కోల్పోయిన సుబ్రహ్మణ్యం భార్య వెంకటలక్ష్మి మౌనంగా రోదిస్తుంది. మృతుడు మోహన్గాంధీకి నిత్య, చైతన్య వర్షిణి చిన్నారులున్నారు. మోహన్గాంధీ తండ్రి శ్రీనివాస్ తాపీ మే్రస్తిగా పనిచేస్తూ గతేడాది భవనంపై నుంచి పడి పోవడంతో మంచానికే పరిమితమయ్యాడు. గత నెలలో శస్త్ర చికిత్స చేయించుకున్న మృతుడు మోహన్గాంధీ తల్లి అరుణ నడవలేని స్థితిలో ఉంది. సౌమ్యుడిగా ఉంటూ అందరితో కలుపుగోలుగా ఉండే మోహన్గాంధీ మరణం గ్రామంలో ప్రతి ఒక్కరినీ కలచివేసింది. రోజు వ్యవధిలో మామాఅల్లుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
ముమ్మడివరం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-లారీ ఢీ
సాక్షి, కోనసీమ: జిల్లాలోని ముమ్మడివరం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లిపాలెం వద్ద లారీ-ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆర్టీసీ బస్సులో ప్రయాణీకులతో పాటుగా స్కూల్క్కు వెళ్తున్న విద్యార్థులు కూడా ఉన్నారు. మరోవైపు.. ప్రమాదంలో లారీ కేబిన్లో చిక్కుకున్న డ్రైవర్ను బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. -
బంధువు కాదు.. కామాంధుడు.. మహిళకు లైంగిక వేధింపులు
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): వరుసకు సోదరుడైన పి.గణేష్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని రాజోలు మండలం శివకోడుకు చెందిన బాధిత మహిళ అమలాపురంలోని ఎస్పీ కార్యాలయానికి గురువారం వచ్చి ఫిర్యాదు చేసింది. దళిత బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్ కొంకి రాజామణి, మానవ హక్కుల వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాసరావులతో కలిసి బాధితురాలు ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఏఎస్పీ లతా మాధురికి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. చదవండి: సంతోషం.. సరదా కబుర్లు.. అంతలోనే ఘోరం.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసు స్టేషన్లో నిందితుడు గణేష్పై దిశ కేసు నమోదైందని రాజామణి తెలిపారు. అయిన్పటికీ రాజోలు పోలీసులు నిందితుడిపై చర్యలు తీసుకోవడం లేదని వారు ఏఎస్పీకి వివరించారు. నిందితుడిపైనా... కేసు పట్ల సరిగా స్పందించని పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని తాము ఏఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు రాజామణి, శ్రీనివాసరావు అమలాపురంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. -
మరణం అంచున నరకయాతన! ఒక్క అడుగు ముందుకైనా, వెనుకనైనా..
ఆలమూరు: మరణానికి కేవలం ఒకే ఒక్క అడుగు దూరం ఉండి కొన్ని గంటల పాటు నరక యాతన అనుభవించి.. ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. కోనసీమ జిల్లా రావులపాలెం ఇందిరా కాలనీకి చెందిన చిర్రా ప్రదీప్కుమార్ రాజమహేంద్రవరంలోని ఓ ప్రయివేటు కంపెనీలో హోమ్గార్డ్. బుధవారం విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వస్తుండగా గౌతమీ గోదావరి కొత్త వంతెనపై వాహనాన్ని తప్పించబోయి రైలింగ్ పక్కన ఉన్న కాంక్రీట్ గోడను ఢీకొట్టి గోదావరిలో జారి పోయాడు. అదృష్టవశాత్తు గోదావరి నదికి, వంతెన పైభాగానికి మధ్యనున్న చెక్కబల్లపై పడ్డాడు. తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో ప్రదీప్కుమార్ హెల్మెట్ ధరించడం వల్ల బలమైన గాయాలు కాలేదు. గాయాలు తట్టుకోలేక, మరో పక్క గోదావరిలో పడిపోతానన్న భయంతో ఆర్తనాదాలు చేశాడు. ఆ అరుపులు విన్న ప్రయాణికులు వెంటనే పోలీసులకు, హైవే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. క్రేన్ను తెప్పించి పోలీసులు కిందకు దిగి తాడు సాయంతో అతన్ని పైకి తీసుకొచ్చారు. వెంటనే ఎన్హెచ్ 16 అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించాక.. రావులపాలెంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రదీప్కుమార్ ఒక్క అడుగు ముందుకైనా, వెనుకనైనా పడి ఉంటే.. నీటిలో మునిగి ప్రాణాలు పోయేవని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు, హైవే సిబ్బంది సకాలంలో స్పందించకున్నా పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు. -
కోనసీమ జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం
సాక్షి, రావులపాలెం (కోనసీమ జిల్లా): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాల్పులు కలకలం రేగింది. రావులపాలేనికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి సత్యనారాయణరెడ్డి ఇంటికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. వారిని చిన్న కుమారుడు ఆదిత్యరెడ్డి చూసి ఎవరంటూ ప్రశ్నించారు. దీంతో ఆయనపై కాల్పులు జరిపి దుండగులు పరారయ్యారు. కాల్పుల్లో ఆదిత్యరెడ్డి చేతికి గాయాలయ్యాయి. ఆదిత్యరెడ్డి ఎదురు తిరగడంతో గన్, బ్యాగ్ వదిలి దుండగులు పరారయ్యారు. దుండగులు వదిలి వెళ్లిన బ్యాగ్లో నాటు బాంబులు లభ్యమయ్యాయి. చదవండి: ఆ వెబ్సైట్ను చూస్తుండగా వాట్సాప్కు వీడియో.. తీరా చూస్తే అందులో.. -
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లాలో కాల్పులు
-
AP: సచివాలయ ఉద్యోగుల ఔదార్యం
మండపేట(కోనసీమ జిల్లా): వయసు తక్కువగా ఉండటంతో పింఛన్ ఆగిపోయిన మహిళ దీనస్థితిని చూసి చలించిపోయి ఏడాదిన్నరగా ప్రతి నెల రూ.2,000 చొప్పున తమ జీతం నుంచి సాయం అందిస్తూ ఔదార్యాన్ని చాటుకున్నారు కోనసీమ జిల్లా మండపేటలోని 3వ వార్డు సచివాలయ ఉద్యోగులు. తాజాగా, ఆమెకు రూ.2,500 పింఛన్ మంజూరు కాగా, గురువారం అందించారు. గతంలో నిర్వహించిన వెరిఫికేషన్లో మండపేటకి చెందిన పి.రాజమ్మకు వయసు తక్కువగా ఉండటంతో పింఛన్ ఆగిపోయింది. చదవండి: స్ఫూర్తి సముదాయం.. ఒకేచోట అన్ని భవనాలు పునరుద్ధరించేందుకు సచివాలయ అడ్మిన్ సెక్రటరీ జి.శ్రీసత్యహరిత పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కాకినాడ డీఆర్డీఏ అధికారుల వద్దకు పంపినా సాంకేతిక కారణాలు అడ్డంకిగా మారాయి. నిరుపేద అయిన రాజమ్మ దీనస్థితిని చూసి చలించిపోయిన హరిత, మహిళా కానిస్టేబుల్ విజయలక్ష్మి, వెల్ఫేర్ సెక్రటరీ గణేష్ ప్రతి నెల తమ జీతం నుంచి రూ.2,000 మొత్తాన్ని ఏడాదిన్నరగా ఆమెకు అందజేస్తూ వచ్చారు. సాంకేతిక లోపాలు సరిజేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడంతో ఆగస్ట్ నుంచి రాజమ్మకు కొత్త పింఛన్ మంజూరైంది. తనకు ఇంతకాలం సాయం అందించి ఆదుకోవడంతోపాటు పింఛను మంజూరు చేయించిన సచివాలయ ఉద్యోగులకు రాజమ్మ కృతజ్ఞతలు తెలిపింది. -
రాజోలు తాటిపాక సెంటర్ లో పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహం
-
నేత్రదానం.. ఎవరు చేయొచ్చు?.. కార్నియా ఎన్ని గంటల్లోపు...
సాక్షి, తూర్పుగోదావరి: వ్యక్తి మరణించిన తర్వాత కళ్లను దానం చేస్తే.. ఆ కళ్లు మరొకరి జీవితంలో వెలుగును ప్రసాదిస్తాయి. దాతల కళ్లు పునర్జన్మను సంతరించుకుని అంధకారాన్ని పారదోలే కాంతిపుంజంగా మారుతాయనడంలో సందేహం లేదు. ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అంటారు. అంతటి ప్రధానమైన కళ్లను మరణించాక మట్టిపాలు చేసేకంటే, దానం చేయడం ఉత్తమం. ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకూ జాతీయ 37వ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. నేత్ర దానం ప్రాధాన్యం, ఆవశ్యతకను ప్రజలందరికీ తెలియజేయడం, ఔత్సాహికులకు దిశానిర్దేశం చేయడం ఈ పక్షోత్సవాల ముఖ్యోద్దేశం. కార్నియాల అవసరానికి, సేకరణకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూరించడానికి ఈ సందర్భంగా ప్రయత్నిస్తారు. కార్నియా ద్వారా అంధత్వానికి గురి కాకుండా ప్రజలను అప్రమత్తం చేయడం. ప్రజలను నేత్రదానానికి సన్నద్ధం చేయడం కూడా ఈ పక్షోత్సవాల్లో లక్ష్యాల్లో కొన్ని. కార్నియా దెబ్బతిని చూపు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతున్నా.. నేత్రదానం చేసే వారి సంఖ్య మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదు. ఈ వ్యత్యాసం ఏడాదికేడాదీ పెరుగుతోంది. నేత్ర దానానికి ముందుకు వచ్చిన వారిలో కొందరు మృత్యువాత పడిన సమయానికి వారి కళ్లను దానం చేయలేకపోతున్నారు. కొందరు బాధ, దుఃఖంలో మర్చిపోతే, మరికొందరి కళ్లను బంధువులు, కుటుంబ సభ్యులు మూఢనమ్మకాలతో దానం చేయడానికి ఇష్టపడడం లేదు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ లెక్కల ప్రకారం 2017 నుంచి ఇప్పటి వరకూ 2,611 మంది నుంచి కార్నియాలు సేకరించగా, 2,267 మందికి అమర్చారు. ఇది మరింత పెరగాలని, నేత్రదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 40 శాతం మందికి కార్నియా సమస్యలు ►కంటి ముందు నల్లటి భాగాన్ని కప్పి ఉంచే పొరను కార్నియా అంటారు. ఏటా వందల మంది కార్నియా అంధులుగా మారుతున్నారు. ►వీరిలో 35 శాతం మంది యువతీ యువకులు, ఐదు శాతం చిన్నపిల్లలే. ►విటమిన్–ఎ లోపం, పౌష్టికాహార లేమి, ప్రమాదాలు, గాయాలు, శస్త్రచికిత్సలతో వచ్చే ఇన్ఫెక్షన్లతో కార్నియా అంధత్వం వస్తుంది. ►దీర్ఘకాలిక కాంటాక్ట్ లెన్స్ వాడే వారిలో కూడా కార్నియా అంధత్వం ఏర్పడే అవకాశముంది. ►కార్నియా అంధత్వానికి కార్నియా మార్పిడే మార్గం. ఆరు గంటల్లో సేకరించాలి మనిషి మరణిస్తే ఆరు గంటల్లోగా శరీరం నుంచి కార్నియాను సేకరించాలి. నేత్రదానం అనేది 15–20 నిమిషాల్లో పూర్తయ్యే సామాన్య ప్రక్రియ. మరణించిన వారి నుంచి కేవలం కార్నియాను మాత్రమే తీసుకుంటారు. మొత్తం కంటిని కాదనే విషయాన్ని గమనించాలి. చాలా మందిలో కన్ను మొత్తాన్ని తీసుకుంటారన్న అపోహ ఉంది. అది అవాస్తవం. నేత్రదానం తర్వాత ఎలాంటి వికృతం ఉండదు. ఎందుకంటే కళ్లను తొలగించిన వెంటనే సహజమైన కన్నుల మాదిరిగా కనిపించే కృత్రిమ కన్నులను వెంటనే మృతదేహానికి అమరుస్తారు. దీనివలన అంతిమ సంస్కారాలకు ఇబ్బంది ఉండదు. ముందుగా ఐ బ్యాంక్ వారికి సమాచారం ఇవ్వాలి. వారు వచ్చేలోగా నేత్ర దాత రెండు కనురెప్పలను మూసివేసి, దూది లేదా మెత్తటి వస్త్రాన్ని వాటిపై కప్పి ఉంచాలి. మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్సులో పెట్టినా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యాన్ గాలి కింద మృతదేహాన్ని ఉంచరాదు. ఆర్కే ద్రావకంలో సేకరించిన కార్నియాను భద్రపర్చి 28 రోజుల్లోగా వాడుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన వారు మొదలు.. 18 ఏళ్లు నిండిన వారు వయస్సుతో సంబంధం లేకుండా నేత్రదానం చేయొచ్చు. ఏ వయస్సు వారైనా, కంటి అద్దాలు ధరించిన వారైనా, షుగర్ వ్యాధిగ్రస్తులు, అధిక రక్తపోటు ఉన్న వారైనా మరణానంతరం నేత్రదానం చేయొచ్చు. ప్రమాదవశాత్తూ, గుండె జబ్బులు తదితర దీర్ఘకాలిక జబ్బులతో మరణించిన వారు, సహజ మరణం పొందిన వారు నేత్రదానం చేసేందుకు అర్హులు. ఎవరు అనర్హులంటే.. క్యాన్సర్తో బాధపడుతున్న వారు, హెచ్ఐవీ, కామెర్లు, కుష్ఠు వ్యాధి, రుబెల్లా, సిఫిలిస్ వంటి వ్యాధిగ్రస్తులు, కరోనా పాజిటివ్, హెపటైటిస్ ఉన్న వారు నేత్రదానానికి అనర్హులు. పాము, కుక్క కాటు వల్ల మరణించిన వారు, కంటి పాపపై తెల్లని మచ్చలు, కంటిలో నీటి కాసుల వ్యాధి ఉన్న వారు కూడా అనర్హులు. అవగాహన కల్పిస్తున్నాం కలెక్టర్ హిమాన్షు శుక్లా నేతృత్వంలో నేత్రదానంపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. మృతి చెందిన ప్రతి ఒక్కరి కళ్లకు సంబంధించిన కార్నియాను తీసుకుని అమరిస్తే ఇద్దరికి చూపు వస్తుంది. నేత్రదానానికి ప్రజలు ముందుకు వస్తున్నా.. మృతి చెందిన సమయంలో పలు కారణాలతో నేత్రాల సేకరణపై సమాచారం ఇవ్వడం లేదు. మరికొందరు ముందస్తు సమాచారం ఇవ్వకున్నా, మృతి తర్వాత మరో ఇద్దరికి చూపునివ్వాలని కళ్లను దానం చేస్తున్నారు. – డాక్టర్ మల్లికార్జునరాజు, జిల్లా ప్రోగ్రాం మేనేజర్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, అమలాపురం కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ జరిగే ఆస్పత్రులివే.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవల ద్వారా కాకినాడ శ్రీకిరణ్ కంటి ఆస్పత్రి, రాజమహేంద్రవరం గౌతమీ నేత్రాలయంలో కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. అలాగే కాకినాడ నయన, రాజమహేంద్రవరం అకిరా ఆస్పత్రుల్లో కూడా కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ద్వారానే కార్నియాలను గత పదేళ్లుగా సేకరిస్తున్నారు. -
గల్ఫ్ వల.. విలవిల.. 4 నెలలుగా జైలులో మగ్గిపోతున్న మహిళలు
సాక్షి, కోనసీమ(అమలాపురం): గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పిస్తామంటూ మాయమాటలు చెప్పి, అమాయక మహిళలపై కొందరు ఏజెంట్లు వల విసురుతున్నారు. వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి నకిలీ వీసాలతో విమానాలు ఎక్కిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ తనిఖీల సమయంలో ఆ అమాయక మహిళలు నకిలీ వీసాలతో పోలీసులకు పట్టుబడి జైళ్లపాలవుతున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది మహిళలు మోసపోయిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. వీరిలో జిల్లాకు చెందిన మహిళలు ముగ్గురు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. అయితే మరింత మంది జిల్లా మహిళలు అక్కడి జైలులో చిక్కుకున్నారని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. మోసపోయారిలా.. ఉప్పలగుప్తం మండలం కూనవరానికి చెందిన రాంబాబు అనే ఏజెంటు గల్ఫ్లో ఉపాధి కల్పించే పేరుతో అమాయకులపై వల విసిరాడు. గల్ఫ్లో ఉపాధి పొందడం ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందన్న ఆశతో పలువురు అతడికి రూ.లక్షలు సమర్పించుకున్నారు. అతడి ద్వారా వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది మహిళలు గత మే నెలలో గల్ఫ్కు బయలుదేరారు. వీరిలో మన జిల్లా మహిళలూ ఉన్నారు. వారికి ఏజెంటు రాంబాబు వీసాలు ఇచ్చి, గల్ఫ్కని చెప్పి, తొలుత హైదరాబాద్ పంపించాడు. అక్కడ రాజు అనే వ్యక్తి వారిని శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానం ఎక్కించాడు. ఆ విమానం కేరళ రాష్ట్రం కొచ్చి ఎయిర్పోర్టుకు చేరింది. అక్కడ చేసిన తనిఖీల్లో ఈ 30 మంది మహిళల వీసాలూ నకిలీవని ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. గత మే 8వ తేదీన వారిని అరెస్టు చేశారు. అప్పటి నుంచీ ఆ మహిళలు అక్కడి జైళ్లలోనే మగ్గుతున్నారు. ఏజెంట్ తమను మోసగించినట్టు గుర్తించిన బాధితులు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగాన్ని ఆశ్రయించారు. అరెస్టయిన 30 మంది మహిళల్లో ఐదుగురికి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ బెయిల్ ఇప్పించింది. మిగిలిన 25 మంది మహిళలనూ విడిపించేందుకు చర్యలు చేపట్టాలని హ్యూమన్ రైట్స్ మహిళా విభాగం వైస్ చైర్పర్సన్ ఎన్.భవాని సారథ్యంలోని ప్రతినిధులు, బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో విజ్ఞాపన అందించారు. దీనిపై కలెక్టర్ శుక్లా, జిల్లా ఎస్పీ సీహెచ్ సుధీర్కుమార్రెడ్డి తక్షణమే స్పందించారు. సంబంధిత ఏజెంటుపై చర్యలు తీసుకోవడంతో పాటు, కేరళ జైలులో ఉన్న మహిళలను విడిపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గోదావరి జిల్లాల వారే ఎక్కువ కేరళలో జైలు పాలైన వారిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. దడాల వెంకటలక్ష్మి (బందనపూడి, కాజులూరు మండలం), గీతారాణి (చల్లపల్లి, ఉప్పలగుప్తం మండలం), శాంతి (తాడికోన, అల్లవరం మండలం), లక్ష్మణరావు (ఆదుర్రు, మామిడికుదురు మండలం), రేలంగి జానకి (రామచంద్రపురం), గెల్లా మంగాదేవి (సుంకరపాలెం, తాళ్లరేవు మండలం), యలమంచిలి పార్వతి (దేవగుప్తం, అల్లవరం మండలం), గుబ్బల శ్రీలక్ష్మి (రావులపాలెం), ఇనగల శిరీష (కోరుకొండ), కోడి బేబీ (నిడదవోలు శివారు సుబ్బరాజుపేట) తదితరులున్నారు. కేరళకు అధికారుల బృందం ఏజెంట్ల మోసాలు, నకిలీ వీసాలు, మహిళల అరెస్టు తదితర అంశాలపై కలెక్టర్, ఎస్పీ చర్చించుకుని, కేరళలో అరెస్టయిన మహిళలను విడిపించేందుకు చర్యలు చేపట్టారు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా ఎస్పీతో కోనసీమ జిల్లా ఎస్పీ సుధీర్కుమార్రెడ్డి ఫోనులో మాట్లాడారు. నకిలీ వీసాల విషయమై కొన్ని కేసులు నమోదైనట్టు ఎర్నాకుళం ఎస్పీ బదులిచ్చారు. అక్కడి జైళ్లలో చిక్కుకున్న జిల్లా మహిళలను విడిపించేందుకు కోనసీమ నుంచి ఒక పోలీసు అధికారి, ఒక ఐసీడీఎస్ అధికారితో కూడిన బృందాన్ని కేరళకు ఎస్పీ పంపించారు. నిలువునా మోసపోయాం నకిలీ వీసాలతో ఏజెంటు రాంబాబు, హైదరాబాద్లో రాజు అనే వ్యక్తుల చేతిలో తాము నిలువునా మోసపోయామని రావులపాలేనికి చెందిన బాధిత మహిళ శ్రీలక్ష్మి వాపోయింది. కలెక్టరేట్ వద్ద ఆమె విలేకర్లతో తన గోడు వెళ్లబోసుకుంది. కొచ్చి ఎయిర్పోర్టులో అరెస్టయిన 30 మంది మహిళల్లో శ్రీలక్ష్మి ఒకరు. అక్కడ జైలులో ఉండగా శ్రీలక్ష్మి భర్త చనిపోయాడు. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ బెయిల్ ఇప్పించి, విడిపించడంతో ఆమె స్వగ్రామం రావులపాలెం చేరుకుంది. కొచ్చి జైలులో తాను రెండు వారాలు ఉన్నానని.. డబ్బులు లేక.. సరైన తిండి, నిద్ర లేక నరకం చూశామని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ పడిన అవçస్థలను హ్యూమన్ రైట్స్ మహిళా ప్రతినిధులతో కలిసి కలెక్టర్కు శ్రీలక్ష్మి వివరించింది. ఐదుగురికి బెయిల్ ఇప్పించాం కొచ్చి విమానాశ్రయంలో నకిలీ వీసాలతో పట్టుబడి అరెస్టయిన 30 మంది మహిళల్లో ఐదుగురికి బెయిల్ మంజూరయ్యేలా మా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ మహిళా విభాగం కృషి చేసింది. బెయిలో పొందిన వారిలో శ్రీలక్ష్మి (రావులపాలెం), పార్వతి (అల్లవరం మండలం దేవగుప్తం), జానకి (రామచంద్రపురం), మంగాదేవి (యానాం), సౌజన్య (ఏలూరు) ఉన్నారు. ఇంకా కొంత మంది మహిళలు కేరళ రాష్ట్ర జైలులో ఉన్నట్లు మాకు సమాచారం వచ్చింది. – నల్లబోతుల భవాని, ఏపీ రాష్ట్ర వైస్ చైర్మన్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వుమెన్ సెల్, రాజమహేంద్రవరం ఏజెంట్లపై చర్యలు గల్ఫ్లో ఉపాధి పేరుతో మహిళలను మోసగిస్తున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. కేరళలో నకిలీ వీసాలతో అరెస్టయిన జిల్లా మహిళలున్నారన్న ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నాం. అక్కడ జిల్లా మహిళలు ముగ్గురు మాత్రమే ఉన్నారని తెలిసింది. వీరిలో ఒకరు బెయిల్పై వచ్చారు. మిగిలిన ఇద్దరినీ విడిపించేందుకు అక్కడికి ప్రత్యేక బృందాన్ని పంపించాం. – సీహెచ్ సుధీర్కుమార్రెడ్డి, జిల్లా ఎస్పీ -
మండపేటలో విద్యార్థిని హల్చల్..
సాక్షి, అంబేద్కర్ కోనసీమ: జిల్లాలో 9వ తరగతి విద్యార్థిని హల్చల్ చేసింది. పాఠశాల భవనం పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఎంతో రిస్క్ చేసి పోలీసులు ఆమెను కాపాడారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. మండపేట శశిస్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని.. సోమవారం సాయంత్రం పాఠశాల భవనం 5వ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. కాగా, పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చేయనే కారణంగా ఆమె.. ఆత్మహత్యాయత్నం చేయబోయింది. దీంతో, హుటాహుటిన ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో పాఠశాల సిబ్బంది, పోలీసులు.. ఆమె వద్దకు వెళ్లి మార్కుల విషయం సముదాయించి.. చాకచక్యంగా ఆమెను పట్టుకుని కిందకు దించారు. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
‘ఎమర్జెన్సీ సైరన్ అండ్ టైమర్’
కొత్తపేట: రోడ్డు ప్రమాదాలు రెప్పపాటులో జరిగిపోతున్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరింత మంది క్షతగాత్రులవుతున్నారు. అటువంటి ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారణకు ‘ఎమర్జెన్సీ సైరన్ అండ్ టైమర్’ను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన వీవీవీ సత్యనారాయణరాజు తయారు చేశారు. రావులపాలెం ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న ఆయన తన ఆలోచనతో దీనిని రూపొందించారు. ప్రమాదాలు జరగకుండా వాహన డ్రైవర్తో పాటు ప్రయాణికులను అప్రమత్తం చేసే ఈ ‘ఎమర్జెన్సీ సైరన్ అండ్ టైమర్’ గురించి ఆయన ‘సాక్షి’కి వివరించారు. తయారు చేసే విధానం ఎలక్ట్రానిక్ పరికరాలతో ఎమర్జెన్సీ సైరన్ అండ్ టైమర్ను తయారు చేశారు. దానికి పైన బ్లాక్ బటన్ అమర్చారు. అది టైమర్. ఎడమవైపు కింద రెడ్ స్విచ్ ఉంటుంది. అది సైరన్ మోగడానికి ఉపయోగించారు. కుడివైపున కింద ప్రెస్ బటన్. అది ప్రెస్ చేశాక సైరన్కు పవర్ వెళ్లకుండా నిలిపివేస్తుంది. పరికరానికి బ్యాటరీ ద్వారా సప్లయి ఇచ్చారు. మూడు రకాలుగా ఉపయోగం ఈ పరికరానికి బ్యాటరీ సప్లయి ఇచ్చిన తరువాత పవర్ సైరన్ ఆఫ్, ఆన్ స్విచ్కు వెళుతుంది. ఈ స్విచ్ ఆన్ చేయగానే సైరన్ మోగుతుంది. బస్సులో వైర్లు, షార్ట్ సర్క్యూట్ జరిగి పొగ గాని మంటలు గాని వచ్చినప్పుడు ఈ స్విచ్ ద్వారా డ్రైవర్ సైరన్ మోగించి ప్రయాణికులను అప్రమత్తం చేయవచ్చు. బస్ లేదా ఇతర వాహనం నుంచి కిందకు దించి వారి ప్రాణాలు కాపాడవచ్చు. డ్రైవర్కు అనారోగ్యం కారణంగా లేదా గుండెపోటు వంటివి వస్తే బస్ను కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఈ స్విచ్ ఉపయోగించి ఎమర్జెన్సీ సైరన్ మోగించడం ద్వారా ప్రయాణికులను అలర్ట్ చేయవచ్చు. దూర ప్రాంత సర్వీసు బస్సులలో డ్రైవర్కు తెల్లవారు జామున నిద్రవచ్చి అదుపు తప్పడం, బ్రిడ్జిలపై నుంచి నదులలో, లోయల్లో పడి ప్రాణనష్టం జరుగుతుంది. అటువంటి ప్రమాదాలు జరగకుండా పవర్నాబ్ (స్విచ్) ఆన్ చేసి ఉంచగా దానిలో గల టైమర్ నిమిషానికి 6 సెకన్ల చొప్పున బల్బు వెలుగుతూ, ఆరుతూ డ్రైవర్ను అప్రమత్తం చేస్తుంది. దానితో డ్రైవర్ దానిని గమనించి ప్రెస్ బటన్ నొక్కుతాడు. బల్బు నిమిషం పాటు ఆఫ్ అవుతుంది. ఒకవేళ డ్రైవర్ ఆ బల్బును గమనించకపోతే (నిద్రపోతే) సైరన్ మోగి డ్రైవర్ను అలెర్ట్ చేస్తుంది. ప్రయాణికులు కూడా గమనించి డ్రైవర్ వద్దకు వచ్చి అప్రమత్తం చేయవచ్చు. ఈ విధంగా ‘ఎమర్జెన్సీ సైరన్ అండ్ టైమర్’ ప్రమాదాల నివారణకు దోహదపడుతుంది. ప్రమాదాలు చూసి.. ఆలోచించి.. తాను ఆర్టీసీ డ్రైవర్గా అనేక రోడ్డు ప్రమాదాలు చూశాను. వీటిని ఏదో రకంగా అరికట్టాలనే ఉద్దేశంతో డ్రైవర్, ప్రయాణికులను అప్రమత్తం చేసే ‘ఎమర్జెన్సీ సైరన్ అండ్ టైమర్’ను రూపొందించాను. దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలకు రూ.3 వేలు అయ్యింది. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్లపై చర్యలు తీసుకుంటున్నారు. కానీ ప్రమాదాల నివారణకు పైవిధంగా ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. ప్రమాదాలు అరికట్టేందుకు చిన్న పరికరాలతో సైరన్ అండ్ టైమర్ వంటివి ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలి. –వీవీవీ సత్యనారాయణరాజు, ఆర్టీసీ డ్రైవర్, రావులపాలెం డిపో -
నేలతల్లికి.. గోదావరి గాయం
సాక్షి అమలాపురం: గోదావరి చేస్తున్న గాయానికి పెద్ద ఎత్తున భూములు కోతకు గురవుతున్నాయి. వరద ఉధృతికి విలువైన సాగు భూములు నదీగర్భంలో కలిసిపోతున్నాయి. జూలైలో వచ్చిన రికార్డు స్థాయి వరద.. ఈ నెలలో వచ్చిన వరదలకు లంక గ్రామాల్లోని కొబ్బరి తోటలు, విలువైన ఉద్యాన పంటలు పండే భూములు నదీకోతకు గురవుతున్నాయి. డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 17 మండలాల్లో 93 లంక గ్రామాలుండగా, సుమారు 25 గ్రామాల్లో నదీకోత తీవ్రత అధికంగా ఉంది. మిగిలిన గ్రామాల్లో సైతం నదీకోతకు భూములు కొట్టుకుపోతున్నాయి. బంగారు భూములు గోదావరి మధ్య ఏర్పడిన సహజసిద్ధమైన లంకలంటే బంగారం పండే భూములు. ఏటా వరదలకు మేటలుగా పడే ఒండ్రు మట్టి వల్ల ఇక్కడ పంటల దిగుబడి అధికం. ఇతర ప్రాంతాల్లో కన్నా లకంల్లో కొబ్బరి దిగుబడి అధికం. కాయ సైతం పెద్దగా ఉంటుంది. ఇక్కడి కొబ్బరికి ఇతర ప్రాంతాల్లో పండే కాయకన్నా రూ.2 అధికంగా వస్తుంది. కొబ్బరితో పాటు కోకో, అరటి, కంద, పసుపు, అల్లం, కూరగాయల వంటి ఉద్యాన పంటలతో పాటు పువ్వులు, నర్సరీలు, మొక్కజొన్న, అపరాల వంటి వ్యవసాయ పంటలు సాగవుతుంటాయి. దీర్ఘకాలికం మినహా మిగిలిన పంటలు ఆగస్టు వరదల సమయానికే చేతికి వచ్చేలా సాగు చేస్తుంటారు. దశాబ్దాల కాలంగా ఇంతటి విలువైన వందల ఎకరాల భూములు నదీగర్భంలో కలిసిపోవడంతో లంక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోత ఇక్కడ అధికం జిల్లాలోని ఆలమూరు, రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, పి.గన్నవరం, మామిడికుదురు, అంబాజీపేట, అయినవిల్లి, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, అల్లవరం, కె.గంగవరం, కపిలేశ్వరపురం మండలాల్లో నదీకోత అధికంగా ఉంది. గోదావరి మధ్యన ఉన్న లంక గ్రామాల్లోనే కాకుండా ఏటిగట్లు, నదీగర్భానికి మధ్య ఉన్న భూములు సైతం పెద్ద ఎత్తున కోతకు గురవుతున్నాయి. కె.గంగవరం మండలం శేరిలంక, ముమ్మిడివరం మండలం కమిని, వలసతిప్ప, సలాదివారిపాలెం గ్రామాలు కూడా కోతకు గురవుతున్నాయి. ఇక్కడ ఇళ్లు కూడా కొట్టుకుపోతున్నాయి. ఇక్కడ గత దశాబ్దకాలంలో సుమారు 2 వేల ఎకరాల భూములు కొట్టుకుపోయాయని అంచనా. ఇది మామిడికుదురు మండలం పెదపట్నంలంక వద్ద పరిస్థితి. కల్పవృక్షాలను ఇలా నదీమతల్లి ఇలా కబళించేస్తోంది. ఇక్కడ కొబ్బరి దిగుబడి సంఖ్యలోను, పరిమాణంలోను ఎక్కువ. ఈ గ్రామాన్ని ఆనుకుని ఉన్న బి.దొడ్డవరం, పెదపట్నం, అప్పనపల్లిలో సైతం నదీ కోత తీవ్రంగా ఉంది. దొడ్డవరాన్ని ఆనుకుని బోట్లకూరు అనే గ్రామం మొత్తం నదిలో కలిసిపోయింది. ఈ గ్రామాల్లో సుమారు 600 ఎకరాల భూమి నదిలో కొట్టుకుపోయింది. పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, ఉడుమూడిలంక, బూరుగులంక, అరిగెలవారిపేట వశిష్ట నది మధ్యలో దీవిలా ఉంటాయి. ఉధృత నదీ కోతకు ఈ దీవికి అన్నివైపులా సాగు భూమి కోతకు గురవుతోంది. జిల్లా పరిధిలోని వశిష్ట ఎడమగట్టు వైపు నది చిన్నపాయలా ప్రవహిస్తున్నా.. వంపు తిరిగినందున ఇటు లంక భూమికి కోత పెట్టడంతో పాటు ఏటిగట్టును సైతం బలహీనపరుస్తోంది. గడచిన పదేళ్లలో ఈ నాలుగు గ్రామాల్లో సుమారు 100 ఎకరాలకు పైగా భూమి గోదావరిలో కలిసిపోయిందని అంచనా. రక్షణకు అడ్డంగా కన్జర్వెన్సీ యాక్టు కోత నివారణకు గ్రోయిన్లు, రిటైనింగ్ వాల్స్ నిర్మించాలని లంక గ్రామాల రైతులు కోరుతున్నారు. అయితే మద్రాస్ కన్జర్వెన్సీ యాక్టు–1884 దీనికి ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ యాక్టు ప్రకారం నదీ ప్రవాహానికి అడ్డంగా నిర్మాణాలు చేయకూడదు. ఈ నిబంధన వల్ల ప్రభుత్వం ఏటిగట్లను ఆనుకుని ఉన్న లంక ప్రాంతాల్లో గ్రోయిన్లు, రిటైనింగ్ వాల్స్ కడుతున్నా.. లంక మధ్య ప్రాంతాల్లో మాత్రం నిర్మించలేకపోతోంది. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2008లో రూ.110 కోట్లతో వీటిని నిర్మించారు. ఈ నిర్మాణాలు జరిగిన చోట నదీ కోత ఉండకపోవడం విశేషం. -
వెర్రి తలకెక్కి.. శ్మశానంలో బర్త్డే పార్టీ.. చివరికి ట్విస్ట్
అమలాపురం రూరల్(కోనసీమ జిల్లా): ఆ ఐదుగురూ స్నేహితులు.. వారిలో ఒకరి పుట్టిన రోజు.. వెర్రి తలకెక్కిన వారు.. ఆ వేడుకలను వెరైటీగా వల్లకాటిలో ఏర్పాటు చేసుకున్నారు. పూటుగా తాగారు. కేక్ కట్ చేసి, వేడుకలు జరుపుకొంటున్న సమయంలో వారి మధ్య మాటామాటా పెరిగింది. తన్నులాటకు దారి తీసింది. ఈ నేపథ్యంలో నలుగురు మిత్రులు కలిసి మరొకరిని చాకుతో తీవ్రంగా గాయపరిచారు. చదవండి: రంగు మారిన విశాఖ సాగర తీరం.. ఎందుకిలా? అమలాపురం రూరల్ మండలం కామనగరువులో గురువారం రాత్రి జరిగిన ఈ ఘర్షణ వివరాలను పట్టణ సీఐ ఎస్సీహెచ్ కొండలరావు శుక్రవారం తెలిపారు. కామనగరువుకు చెందిన పందిరి శివశంకర్, బొంతు నవీన్, మరో ముగ్గురు స్నేహితులు. నవీన్ పుట్టిన రోజు వేడుకలను అమలాపురం నల్ల వంతెన సమీపంలోని శ్మశానంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసుకున్నారు. మద్యం తాగి, వేడుకలు జరుపుకొంటున్న సమయంలో వారి మధ్య మొదలైన వాగ్వాదం.. తీవ్ర రూపు దాల్చింది. శ్మశానంలోనే కొద్దిపాటి ఘర్షణకు దిగిన వారు.. తరువాత ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. శివశంకర్ కామనగరువులోని తన ఇంటికి వెళ్లి నిద్రకు ఉపక్రమించాడు. ఇంతలో మిగిలిన నలుగురు స్నేహితులూ అతడి ఇంటికి వచ్చి, శివశంకర్ను బయటకు తీసుకు వెళ్లి దాడి చేశారు. అతడి శరీరంపై పలుచోట్ల చాకుతో పొడిచి, పరారయ్యారు. గాయపడిన శివశంకర్ కేకలు వేయడంతో అక్కడకు వచ్చిన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బొంతు నవీన్తో పాటు మిగిలిన ముగ్గురు స్నేహితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ కొండలరావు తెలిపారు. -
యువతిపై అత్యాచారం.. సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపెడతానంటూ..
కపిలేశ్వరపురం(కోనసీమ జిల్లా): వడ్లమూరుకు చెందిన మాకన రాజేష్ తనపై అత్యాచారం చేశాడంటూ అదే గ్రామానికి చెందిన 31 ఏళ్ళ యువతి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అంగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిర్యాది 2018 నుంచి విజయవాడలోని ఓల్డేజ్ హోంలో కూలీగా పనిచేస్తుంది. చదవండి: పెళ్లి రోజున కొత్త చీర కొనలేదని.. కోపంతో భార్య ఏం చేసిందంటే? తనను ప్రేమించాలంటూ నిందితుడు రాజేష్ వేధించేవాడని, తరువాత తన సమ్మతి లేకుండా శారీరకంగా అనుభవించాడని, పెళ్ళి ప్రస్తావన తీసుకురాగా తిరస్కరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో సన్నిహితంగా ఉండగా తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అంగర పోలీసులు తెలిపారు. -
తృటిలో తప్పిన పెద్ద పడవ ప్రమాదం
పి.గన్నవరం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో పెద్ద పడవ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ సీజన్లో గోదావరికి రెండోసారి వరదలు వచ్చిన నేపథ్యంలో.. మానేపల్లి నుంచి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న శివాయలంకలోని వరద బాధితులకు సర్పంచ్ పితాని చంద్రకళ భర్త నరసింహారావు రోజూ పడవపై వాటర్ టిన్నులు తీసుకువెళ్లి అందిస్తున్నారు. ఇదేవిధంగా నరసింహారావు, వలంటీర్లు కౌరు నందు, షేక్ రెహ్మాన్, చిన్నం రవీంద్ర 40 వాటర్ టిన్నులు తీసుకుని ఆదివారం శివాయలంకకు బయల్దేరారు. ఆ పడవలో కౌరు శ్రీను, పుచ్చకాయల సత్యనారాయణ, పడవ నడిపే వ్యక్తులు మల్లాడి ఏడుకొండలు, రామకృష్ణ ఉన్నారు. ఏటిగట్టు నుంచి 300 మీటర్ల దూరం వెళ్లేసరికి కేబుల్ టీవీ మెయిన్ లైన్ వైరు పడవకు అడ్డం పడింది. దానిని తప్పించే క్రమంలో అదుపుతప్పిన పడవ వైనతేయ గోదావరి నదిలో బోల్తా పడింది. ఆ ప్రాంతంలో నది సుమారు 10 అడుగుల లోతు ఉంది. అందులో ఉన్న 8 మంది అతికష్టం మీద సమీపంలోని మెరక ప్రాంతంలోని రోడ్డు పైకి చేరుకుని వరద నీటిలో నిలుచున్నారు. విషయం తెలుసుకున్న సచివాలయ సిబ్బంది హుటాహుటిన మరో పడవను పంపించి, నదిలో చిక్కుకున్న వారిని ఒడ్డుకు తరలించారు. వలంటీర్ రవీంద్ర నదిలో మునిగి నీరు తాగడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆ ప్రాంతంలో వరద ప్రవాహం పెద్దగా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. -
విద్యార్థినితో చనువుగా తిరిగి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
మండపేట(కోనసీమ జిల్లా): పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు వంచించాడన్న మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై బుధవారం పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పెదకాలువ వంతెన వద్ద నివసిస్తున్న దుర్గారావు కుమార్తె స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుకుంటోంది. వారి ఇంటి సమీపంలో నివసిస్తున్న గ్రంధి రాజేష్ ప్రేమ పేరిట విద్యార్థిని వెంటపడేవాడు. చదవండి: వేరే అమ్మాయితో పెళ్లి.. నా చావుకు కారణం ఫణిబాబే ఈ విషయాన్ని విద్యార్థిని తండ్రి పెద్దల దృష్టికి తీసుకెళ్లి రాజేష్ను మందలించారు. అయినా వినకుండా మాయమాటలు చెప్పి విద్యార్థినితో చనువుగా తిరిగేవాడు. ఇటీవల రాజేష్తో పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని బుధవారం ఇంట్లో ఉన్న థైరాయిడ్ మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు విద్యార్థినిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతోంది. ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు పట్టణ ఎస్ఐ ఎం.అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేరే అమ్మాయితో పెళ్లి.. నా చావుకు కారణం ఫణిబాబే
అయినవిల్లి(కోనసీమ జిల్లా): ఓ యువతి ఆత్మహత్యకు కారణమైన యువకుడిని అరెస్టు చేసి బుధవారం కోర్టుకు తరలించినట్లు స్థానిక ఎస్సై ఎస్.నాగేశ్వరరావు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి... అయినవిల్లి మండలం కె.జగన్నాథపురానికి చెందిన పాటి మాధవి (26) అదే గ్రామానికి చెందిన వల్లపురెడ్డి ఫణిబాబు 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరు అమలాపురం సాయిబాబా ఆలయంలో ఉంగరాలు మార్చుకున్నారు. కొన్ని రోజులుగా మాధవి ఫోన్ నంబర్ను ఫణిబాబు బ్లాక్ లిస్టులో పెట్టాడు. ఫణిబాబు అతని తల్లిదండ్రులు మరో యువతితో పెళ్లి నిశ్చయించారు. చదవండి: గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ? విషయం తెలుసుకున్న మాధవి తనను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఫణిబాబును హెచ్చరించింది. మాధవి మే 18 తేదీన కె.జగన్నాథఫురంలోని చెరువులోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు ఆమెను రక్షించారు. అప్పట్లో ఫణిబాబుపై అయినవిల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 6న ఫణిబాబుకు అన్నవరంలో వేరే అమ్మాయితో పెండ్లి జరుగుతుందని తెలిసి మనస్థాపానికి గురైన మాధవి 5వ తేదీ రాత్రి ఇంట్లో చున్నితో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నా చావుకు కారణం ఫణిబాబు, అతని కుటుంబ సభ్యులు కారణమని సూసైడ్ నోట్లో పేర్కొంది. దీనిపై మృతురాలి తల్లి పార్వతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం నిందితుడు ఫణిబాబును అరెస్టు చేసి అమలాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టుకు తరలించగా జడ్జి వై.శ్రీలక్ష్మి 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. -
CM YS Jagan: గడప గడపకూ మనలో ఒకడై..
వరదలు వచ్చినప్పుడే నేను కూడా ఇక్కడకు వచ్చి ఉంటే కలెక్టర్లు, అధికారులంతా నా చుట్టూనే తిరిగేవారు. టీవీ చానళ్లలో నేను బాగా కనిపించేవాడిని. నా ఫొటోలూ బాగా వచ్చేవి. కానీ ప్రజలకు మంచి జరిగేది కాదు. అందుకే వరదల పరిస్థితి పూర్తిగా చూసిన తరువాత వారం రోజులు గడువు ఇచ్చా. ప్రతి బాధితుడికీ సాయం అందించాలని చెప్పా. పశువులకు సైతం మంచి చేసే విధంగా.. వాటికి కూడా నోరు ఉంటే మెచ్చుకునే విధంగా.. బాగా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చా. నేరుగా బాధితుల ఇళ్ల వద్దకు వచ్చి సాయం అందిందో లేదో అడుగుతానని అప్పుడే చెప్పా. అందుకే ఇన్ని రోజులు వేచి చూసి ఇప్పుడు మీ ముందుకు వచ్చా. ముంపు బారిన పడ్డ వారిని రక్షించడం, పునరావాసం కల్పించడం, సాయం అందించడంపై దృష్టి పెట్టాలే కానీ డ్రామాలు అనేవి ఉండకూడదు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే వచ్చేసి ఫొటోలకు ఫోజులిచ్చి చంద్రబాబులా పబ్లిసిటీ కోసం పాకులాడకూడదు. – వరద బాధితులతో సీఎం జగన్ కోనసీమ నుంచి సాక్షి ప్రతినిధి: వరద ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా, నిరంతరం శ్రమించిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు కలసికట్టుగా పని చేసి అందరికీ తక్షణ సాయం అందించారని చెప్పారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా బాగా పని చేశారని అభినందించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వరద బాధిత లంక గ్రామాల్లో సీఎం మంగళవారం పర్యటించారు. పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో వరద ముంపునకు గురైన గంటి పెదపూడిలంక, అరిగెలవారిపాలెం, ఉడుమూడిలంక, బూరుగులంక, నున్నవారిబాడవ, మేకలపాలెం గ్రామాల్లో పర్యటించి బాధితులను కలుసుకున్నారు. అందరికీ అన్ని రకాలుగా సాయం అందిందా?.. లేదా? అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తమకు సాయం అందిందని బాధితులంతా చేతులు పైకి ఎత్తి తెలియచేశారు. పర్యటనలో సీఎం ఏమన్నారంటే.. అరిగెలవారిపాలెంలో వరద బాధితులతో మాట్లాడుతున్న సీఎం జగన్ 15 రోజుల్లో నష్టం అంచనాలు.. ఈరోజు మన పరిపాలనలో ఎన్నో మార్పులు తెచ్చాం. అవి మీరు చూస్తూనే ఉన్నారు. ఇది మీ ప్రభుత్వం. మీకోసం.. పని చేస్తున్న ప్రభుత్వం. కలెక్టర్ నుంచి వలంటీర్ల వరకు అధికార యంత్రాంగం అంతా వరదల్లో ఎంతో సమర్థంగా పని చేయబట్టే ఈరోజు అందరికీ సాయం అందింది. ఇప్పుడిప్పుడే ఉధృతి తగ్గుముఖం పడుతోంది. మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించారు. వరదల వల్ల జరిగిన నష్టాలపై వచ్చే 15 రోజుల్లో అధికారులు అంచనాలు తయారు చేయడం పూర్తి చేస్తారు. అది ఇల్లైనా పంటలైనా వేటినీ విడిచిపెట్టరు. రెండు మూడు నెలల్లో బాధితులందరికీ నష్ట పరిహారం అందిస్తాం. ఈ సీజన్లో జరిగిన నష్టాలకు సీజన్ ముగియకుండానే పరిహారం అందించే ఏర్పాటు చేస్తాం. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క బాధితుడికీ అన్యాయం జరగదు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా జి.పెదపూడిలంకలో దెబ్బతిన్న పంటను పరిశీలిస్తున్న సీఎం జగన్ పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పర్యటనలో సీఎం వెంట మంత్రులు జోగి రమేష్, పినిపే విశ్వరూప్, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృçష్ణ, ఎంపీలు చింతా అనురాధ, పిల్లి సుభాష్ చంద్రబోస్, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు, రాపాక వరప్రసాద్, పొన్నాడ సతీష్కుమార్, జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, పోతుల సునీత, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి, వరదలపై కోనసీమ ప్రత్యేకాధికారి మురళీధర్రెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా, పీఆర్ ఈఎన్సీ సుబ్బారెడ్డి తదితరులున్నారు. గంటి పెదపూడి వద్ద గోదావరిపై బ్రిడ్జి లంక గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న గంటి పెదపూడి వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మాణ బాధ్యత నాకు వదిలేయండి. వంతెన లేక మీరు పడుతున్న బాధలను ప్రతి గ్రామంలోనూ చెప్పారు. అన్నీ ఆలకించా. ఆ వంతెన నిర్మాణ పనులను మరో నెలన్నరలో ప్రారంభిస్తాం. సీఎం పర్యటన సాగిందిలా మంగళవారం ఉదయం 10.30 గంటలకు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండల జి.పెదపూడికి సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ నుంచి వశిష్ట నదిపై పంటు దాటి జి.పెదపూడి లంక వెళ్లారు. లంక గ్రామాల్లో వర్షం పడడంతో రోడ్లు బురదమయమయ్యాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సీఎం బాధితుల వద్దకు వెళ్లి పరామర్శను కొనసాగించారు. 11.05 గంటలకు: జి.పెదపూడి దీవిలోకి అడుగుపెట్టిన సీఎం సుమారు 3.35 గంటల పాటు బాధితుల మధ్యనే గడిపి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి బాధితుడికి తన గోడు చెప్పుకునే అవకాశం ఇచ్చారు. మీకు సాయం అందిందా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 2.50 వరకు స్వయంగా పరిశీలించారు. షెడ్యూల్లో లేకపోయినప్పటికీ స్థానికుల కోరిక మేరకు బూరుగులంకలో పర్యటించారు. పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో పలు గ్రామాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం రాజమండ్రి చేరుకున్నారు. రాత్రి సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం అక్కడే ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సీఎం బస చేశారు. -
‘వరద ప్రాంతాల్లో సీఎం జగన్లా మరే ముఖ్యమంత్రి పర్యటించలేదు’
సాక్షి, అమరావతి: వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాగా మరే సీఎం పర్యటించలేదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో మంగళవారం పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా నారాయణ స్వామి మాట్లాడుతూ.. ట్రాక్టర్, పడవలు, బురదలో సీఎం జగన్ పర్యటించారని ప్రశంసలు కురిపించారు. రామోజీరావు, రాధాకృష్ణ, ఎల్లో మీడియా మనిషి జన్మ ఎత్తితే దీనిని చూపించాలని సవాల్ విసిరారు. చంద్రబాబుకి మానవత్వం లేదని, రోజూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని నారాయణ స్వామి విమర్శించారు. చంద్రబాబు, ఎల్లో మీడియాకు కులపిచ్చి తప్ప వేరే ఆలోచన లేదని మండిపడ్డారు. ఎల్లో పత్రికలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఎక్కడ లేదని స్పష్టం చేశారు. టీడీపీనే కల్తీ పార్టీ అని, ఎన్టీఆర్ పార్టీ తీసుకున్న కల్తీ నాయకుడు చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. ‘టీడీపీ ఆఫీసు ఓ బార్లా తయారైపోయింది. టీడీపీ నేతలు తాగి మాట్లాడుతున్నట్టు వాగుతున్నారు. కల్తీ నిరూపించమంటే నిరూపించలేకపోతున్నారు. గతంలో మద్యం షాపులన్నీ టీడీపీ నేతలు పెట్టుకున్నవే. ఇప్పుడు ప్రభుత్వం బెల్టు షాపులను పూర్తిగా తొలగించింది. మద్యం వినియోగం గతం కంటే బాగా తగ్గింది’ అని నారాయణ స్వామి తెలిపారు. చదవండి: వాలంటీర్లు బాగా పనిచేశారు.. సీఎం జగన్తో వరద బాధితులు -
ఆసక్తికర సన్నివేశం.. చంటిబిడ్డకు పెన్ను గిఫ్ట్గా ఇచ్చిన సీఎం జగన్
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోనసీమలోని లంక గ్రామాల పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వరద బాధితులను పరామర్శిస్తున్న క్రమంలో సీఎం జగన్ ఓ 8 నెలల పిల్లవాడిని ఎత్తుకున్నారు. ముఖ్యమంత్రి జేబులోని పెన్నుతో బుడ్డోడు ఆడుకున్నాడు. ఇంతలో ఆ పెన్ను పొరపాటున జారి కింద పడింది. అనంతరం పెన్నుపై పిల్లవాడి ముచ్చటను చూసిన సీఎం జగన్.. ఆ ఖరీదైన పెన్ను అతనికి గిఫ్ట్గా ఇచ్చారు. దీంతో బాబు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. పెదపూడి లంక గ్రామంలో ఈ ఘటన జరిగింది. చదవండి: అంబేద్కర్ కోనసీమ వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన -
సీఎం జగన్ కోనసీమ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం
-
వాలంటీర్లు బాగా పనిచేశారు.. సీఎం జగన్తో వరద బాధితులు
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: వరద నష్టంపై అంచనాలు పూర్తికాగానే ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం అందిస్తామని తెలిపారు. గతంలో ఏనాడూ లేని విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పుచ్చకాయలవారి పేట, ఊడుమూడి లంకలో వరద బాధితులను నేరుగా కలిసి పరామర్శించారు. వరద బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. శిబిరాల్లో బాగా చూసుకున్నారా అంటూ బాధితులను సీఎం అడిగారు. శిబిరాల్లో తమను బాగా చూసుకున్నారని వరద బాధితులు సీఎం జగన్కు తెలిపారు. వాలంటీర్లు బాగా పనిచేశారని అన్నారు. మీ కలెక్టర్కు ఎన్ని మార్కులు వేయొచ్చని గ్రామస్తులను సీఎం అడిగి తెలుసుకున్నారు. వరదలు రాగానే ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తక్షణ సహాయ కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. వెంటనే అధికారులందరినీ క్షేత్రస్థాయిలోకి పంపామని, ఎవరూ ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. చదవండి: వరద బాధితులందరికీ అండగా ఉంటాం: సీఎం జగన్ -
వరద బాధితులందరికీ అండగా ఉంటాం: సీఎం జగన్
సాక్షి, కోనసీమ: వరద బాధితులందరికీ అండగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. మంగళవారం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా.. అరిగెలవారి పేటలో పర్యటిస్తున్న ఆయన.. బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. ‘‘ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కనపెట్టాలి. వరదల్లో నేను వచ్చి ఉంటే అధికారులు నా చుట్టూ తిరిగేవాళ్లు. అందుకే అధికారులకు వారం టైం ఇచ్చి నేను ఇక్కడికి వచ్చా. మీ అందరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది’’ అని ఆయన బాధితులతో పేర్కొన్నారు. అంతేకాదు జి. పేదపూడి లంక వద్ద వంతెన నిర్మిస్తామని సీఎం జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సీజన్ ముగియక ముందే వరద నష్టం అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. ఇదిలా ఉంటే.. వర్షంలోనూ సీఎం జగన్ ఆగకుండా తన పర్యటనను కొనసాగిస్తుండడం విశేషం. బాధితులందరికీ సాయం ఎలా అందుతోంది?.. అధికారులు, వలంటీర్ల పని తీరుపై స్వయంగా ఆయనే అడిగి తెలుసుకుంటూ కాలినడకనే ముందుకెళ్తున్నారు. -
కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(మంగళవారం) కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి 11 గంటలకు పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారు. చదవండి: చంద్రబాబు ఏం చేశాడో తెలుసా?.. వాస్తవాలు చెప్పిన మంత్రి అంబటి ఆ తర్వాత అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు, అక్కడి నుంచి ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుని అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో సమావేశం అనంతరం సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరద ప్రభావం అనంతరం తీసుకున్న సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి అక్కడే బస చేస్తారు. -
వరద సహాయక చర్యల్లో గంగ పుత్రుల పాత్ర కీలకం
-
చంద్రబాబు కోనసీమ జిల్లా పర్యటనలో అపశృతి
-
చంద్రబాబు పర్యటనలో అపశ్రుతి
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమ జిల్లా చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. రాజోలు మండలం సోంపల్లి దగ్గర బోటు దిగుతుండగా బరువు ఎక్కువై నీటిలో బోల్తా కొట్టింది. దీంతో బోటులో ఉన్న టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నీటిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన మత్స్యకారులు.. అందర్నీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. చదవండి: పలు రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం: సీఎం జగన్ లైఫ్ జాకెట్లు లేకుండా.. అధికారులు చెప్పినా టీడీపీ నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. లైఫ్ జాకెట్లు లేకుండా బోటులో ప్రయాణించారు. చంద్రబాబుతో సహా సేఫ్టీ చర్యలను టీడీపీ నేతలు పాటించలేదు. దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ,రాధాకృష్ణ, అంగర రామ్మోహన్, మంతెన రామరాజు నీటిలో పడిపోయారు. -
సీసాల పడవ.. భలే ఉందిరా బుల్లోడా!
అమలాపురం రూరల్: వరద నీటిలో వెళ్లేందుకు బాధితులు తాత్కాలికంగా అరటి బొందలు, కలపతో తెప్పలు తయారు చేసుకోవడం పరిపాటి. కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం గున్నేపల్లి అగ్రహారం గ్రామ శివారు దొమ్మేటివారిపాలెంలో వరద నీటిలో చిన్న పిల్లల కోసం వారి కుటుంబీకులు ఖాళీ డ్రింక్ బాటిల్స్తో చిన్న తెప్పలను తయారు చేశారు. వాటిపై పిల్లలు కూర్చుని వీధుల్లోనే తిరుగుతున్నారు. వీడని ముంపు గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుతుండటంతో కొన్ని లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. అయితే కొన్ని గ్రామాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. వివిధ పనులపై స్థానికులు పడవల పైనే రాకపోకలు సాగిస్తున్నారు. మరోపక్క ప్రభుత్వ యంత్రాంగం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. ప్రజారోగ్యం, పారిశుధ్యం తదితర అంశాలపై దృష్టి సారించింది. వరదల కారణంగా పొలాలతో అన్ని ప్రాంతాలు నీట మునగిపోవడంతో పశువుల మేతకు ఇబ్బంది వచ్చింది. దీంతో రైతులు పడవలపైనే పశువుల కోసం గడ్డిని తరలిస్తున్నారు. (క్లిక్: నిర్విఘ్నంగా.. నిర్విరామంగా.. అర్ధరాత్రి నుంచే వంటావార్పు) -
వరద బాధితులకు అండగా జగనన్న ప్రభుత్వం
-
నిర్విఘ్నంగా.. నిర్విరామంగా.. అర్ధరాత్రి నుంచే వంటావార్పు
సాక్షి అమలాపురం: రోజూ అర్ధరాత్రి ఒంటి గంటకే అమలాపురం తహసీల్దార్ కార్యాలయం తలుపులు తెరచుకుంటున్నాయి. ఎదురుగా ఖాళీ స్థలంలో వేసిన టెంట్లలో వంటావార్పు పనులు ఆరంభమవుతున్నాయి. వారికి రెవెన్యూ ఉద్యోగులు సహకారం అందిస్తున్నారు. రాత్రి మూడు గంటలకల్లా సచివాలయ సిబ్బంది, వలంటీర్లు అక్కడకు చేరుకుని అల్పాహారాన్ని ప్యాకింగ్ చేస్తున్నారు. 5 గంటలకు సచివాలయ మహిళా ఉద్యోగులు, వలంటీర్లు వచ్చి ప్యాకింగ్లో సహాయం చేస్తున్నారు. అలా మొదలవుతున్న పనులు సాయంత్రం 4గంటల వరకూ నిర్విఘ్నంగా సాగుతూనే ఉన్నాయి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను వంటవారు తయారు చేయడం.. వీరు ప్యాకింగ్ చేయడం.. వెంటనే సచివాలయ సిబ్బంది, వలంటీర్లు వాటిని ఆయా ప్రాంతాలకు పంపిణీ చేయడం జరుగుతోంది. ఒక్కో షిఫ్టుకు 50 నుంచి 60 మంది వరకూ వస్తున్నారు. ఉదయం అల్పాహారం అందించేందుకు తెల్లవారకుండానే వరద బాధితుల ఇళ్లకు పరుగులు తీస్తున్నారు. వలంటీర్ల సేవలు మరువలేం.. కోనసీమ జిల్లా అమలాపురం, మామిడికుదురు, పి.గన్నవరం మండలాల పరిధిలోని వరద బాధితులకు జిల్లా యంత్రాంగం ఈ విధంగా వంటలు చేయించి ప్రతిరోజూ అందిస్తోంది. పి.గన్నవరం, మామిడికుదురు మండలాల్లో 18 వేల మందికి ఆహార ప్యాకెట్లు అందిస్తున్నట్టు జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు ‘సాక్షి’కి తెలిపారు. ఉదయం అల్పాహారంగా ఇడ్లీ లేదా బజ్జీ, మధ్యాహ్నం అన్నంతో పాటు పప్పు, కూరగాయలతో చేసిన మరో కూర, సాంబారు అందిస్తున్నారు. వీటిని ప్యాకింగ్ చేయడం, బాధితులకు అందజేయడంలో కీలకంగా పని చేస్తున్న సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు అటు ఉన్నతాధికారుల నుంచి, ఇటు బాధితుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ‘వంట చేయడం సులువైన పనే. కానీ వాటిని శ్రద్ధగా, పాడవకుండా ప్యాకింగ్ చేయడం ఇబ్బందికరం. వరద ముంపులో వాటిని పంపిణీ చేయడం కష్టతరం. ఈ విషయంలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల సేవలను మరువలేం’ అని అమలాపురం తహసీల్దార్ శ్రీవల్లి అన్నారు. ఇదీ చదవండి: సీఎం జగన్కు అత్యంత ప్రీతిపాత్రులు వలంటీర్లు -
కోనసీమ లంక గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరం
-
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరద బీభత్పం ( ఫొటోలు)
-
బిక్కుబిక్కుమంటున్న కోనసీమ లంక గ్రామాలు
-
పడవలో వచ్చిన పెళ్లికూతురు
మామిడికుదురు: కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఎంతో అట్టహాసంగా ఊరేగింపుగా పెళ్లికి వెళ్లాలని చేసుకున్న ప్లాన్ వర్షాల దెబ్బకు విఫలమైంది. ఊహించని రీతిలో ఎదురైన వరద బెడద ఆడ పెళ్లివారిని నానా తంటాలు పెట్టింది. వరద నీరు వారి గ్రామాన్ని పూర్తిగా చుట్టుముట్టేయటంతో చేసేది లేక పెళ్లికుమార్తె పడవలో వెళ్లి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంక లంకపేటకు చెందిన నల్లి ప్రశాంతికి, మలికిపురం మండలం కేశనపల్లికి చెందిన గంటా అశోక్కుమార్తో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం ముహూర్తంగా నిర్ణయించారు. కానీ పెదపట్నంలంకను గోదావరి వరద చుట్టు ముట్టింది. రోడ్లు ముంపు బారిన పడటంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అష్టకష్టాలు పడి పెళ్లి కుమార్తెను అతి ముఖ్యులతో కలిసి పడవపై అప్పనపల్లి కాజ్వే వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి కారులో కేశనపల్లికి చేరుకున్నారు. ముహూర్త సమయానికి కాస్త ఆలస్యమైనా పెళ్లి వేదిక వద్దకు చేరుకోగలిగారు. అనంతరం పెద్దలు పెళ్లి ప్రక్రియ పూర్తి చేశారు. -
ఎస్డీఆర్ఎఫ్ ఆపన్నహస్తం
సాక్షి, అమరావతి: గోదావరి వరద బాధితులకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. ప్రాణనష్టం లేకుండా చూసేందుకు అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నాయి. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. వరద తీవ్రత దృష్ట్యా 150 మంది సభ్యులతో కూడిన 5 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు కింద ఏడు ముంపు మండలాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడంతోపాటు ఏలూరు, అల్లూరి, కోనసీమ జిల్లాల్లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నాయి. అల్లూరి జిల్లాలోని కూనవరం, వీఆర్ పురం, రాజుపేట ఎస్సీ కాలనీ, ఏలూరు జిల్లాలోని సుడిగుమ్మరీపగుమ్మ, కోనసీమ జిల్లాలోని టేకుల సెట్టిపాలెం, వీరవల్లిపాలెం, కొట్టిలంక, గుంజరామేక తదితర గ్రామాల ప్రజలను గురువారం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పోలవరం ముంపు మండలాల పరిధిలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే 30 మంది విద్యార్థులకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు భద్రత కల్పించాయి. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి ఆహారం పంపిణీ చేశాయి. -
వరద నీటిలోనే పెళ్లికూతురి వివాహ ప్రయాణం
-
ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి వేణుగోపాలకృష్ణ
-
వరద నీటిలో మంత్రి వేణు పడవ ప్రయాణం.. ముమ్మరంగా సహాయక చర్యలు
సాక్షి, కోనసీమ జిల్లా: గోదావరి ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా సహాయక చర్యలను ప్రభుత్వం చేపట్టింది. కోటిపల్లిలో ముంపునకు గురైన ప్రాంతాల్లో స్వయంగా పడవలో వెళ్లి బాధితులకు బియ్యం, కందిపప్పును మంత్రి వేణుగోపాలకృష్ణ అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అత్యవసర మందులు, తాగునీరు, కిరోసిన్ అందుబాటులో ఉంచామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పెద్ద ఎత్తున సహాయక చర్యలు అందిస్తున్నామని మంత్రి వేణు పేర్కొన్నారు. చదవండి: బాబు పాపాలు.. పోలవరానికి శాపాలు గౌతమీ గోదావరి వరద తీవ్రతతో రామచంద్రాపురం నియోజకవర్గ పరిధిలో కే గంగవరం మండలంలో పలు లంకలు, కోటిపల్లి ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. లంకలతో పాటు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. ఇళ్ల మధ్యకు వరద నీరు చేరుకోవడంతో పడవలపైన రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరడుగుల మేర వరద నీరు నిలిచిపోవడంతో పాటు సమీపంలోనే గౌతమి గోదావరి ఉండటంతో మరో రెండు మూడు రోజులు పాటు ఇబ్బందులు తప్పేలా లేవని స్థానికులు చెబుతున్నారు. -
కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
-
గోదావరి ఉధృతికి కొట్టుకుపోయిన పడవ