-
షమీపై మరోసారి సంచలన ఆరోపణలు.. ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా స్టార్ పేసర్గా నీరాజనాలు అందుకుంటున్న మహ్మద్ షమీ కెరీర్లో ఉన్నతస్థితిలో ఉన్నాడు. గాయం వేధిస్తున్నా లెక్కచేయక వన్డే వరల్డ్కప్-2023లో అదరగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన ఘనత అతడి సొంతం. అయితే, చీలమండ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో కొంతకాలంగా ఆటకు దూరమైన అతడు.. సర్జరీ చేయించుకున్నాడు. ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఐపీఎల్-2024 మొత్తానికి అందుబాటులో లేకుండా పోయాడు ఈ గుజరాత్ టైటాన్స్ బౌలర్. ఇదిలా ఉంటే.. కెరీర్పరంగా బాగానే ఉన్న షమీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక కుదుపు వస్తూనే ఉంది. 2014లో హసీన్ జహానే అనే మహిళను పెళ్లాడాడు షమీ. ఈ జంటకు 2015లో కూతురు ఐరా జన్మించింది. కానీ.. కొంతకాలం తర్వాత ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తగా.. భర్తపై సంచలన ఆరోపణలు చేసింది హసీన్. వివాహేతర సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్, గృహ హింస అంటూ తీవ్ర ఆరోపణలతో అతడిని సుప్రీంకోర్టు గడప తొక్కించింది. అరెస్టు చేయించాలని చూసింది. అయితే, విచారణ అనంతరం షమీకి ఊరట దక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2018 నుంచి షమీ- హసీన్ విడిగా ఉంటున్నారు. అయితే, తాజాగా మరోసారి షమీని ఉద్దేశించి హసీన్ జహాన్ ఆరోపణలు గుప్పించింది. ‘‘స్టార్ అయిన నా భర్త, అతడి కుటుంబం కారణంగా నేను చేదు అనుభవాలు ఎదుర్కొన్నాను. న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కానీ ఆమ్రోహా పోలీసులు నన్ను, నా మూడేళ్ల కూతురిని టార్చర్ పెట్టారు. ప్రభుత్వం కూడా నా పట్ల అవమానకరంగా ప్రవర్తించింది. నాకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటోంది’’ అని హసీన్ జహాన్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీరును విమర్శించింది. అంతేకాదు.. మహ్మద్ షమీ యూపీ ప్రభుత్వం, పోలీసులతో కలిసి తనను హత్య చేయించేందుకు కుట్ర చేస్తాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో షమీ అభిమానులు హసీన్ జహాన్ తీరుపై మండిపడుతున్నారు. నిరాధార ఆరోపణలు చేస్తూ కాలం గడపటం మానుకుని.. కుమార్తెకు మంచి భవిష్యత్తున్నిచ్చే ఆలోచనలు చేయాలని హితవు పలుకుతున్నారు. అయితే, మరికొంత మంది నెటిజన్లు మాత్రం అనుభవించే వారికి మాత్రమే ఆ బాధ ఏమిటో తెలుస్తుందని హసీన్కు మద్దతుగా నిలుస్తున్నారు. చదవండి: ధోని ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది: టీమిండియా మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ -
షమీకి శస్త్రచికిత్స
న్యూఢిల్లీ: భారత సీనియర్ సీమర్ మొహమ్మద్ షమీ ఎడమ కాలి మడమకు లండన్లో శస్త్రచికిత్స జరిగింది. దీంతో వచ్చేనెలలో ప్రారంభమయ్యే ఐపీఎల్ సీజన్కు పూర్తిగా అతను దూరమయ్యాడు. జూన్లో జరిగే టి20 ప్రపంచకప్ కల్లా అతను కోలుకుంటాడని జట్టు వర్గాలు భావిస్తున్నాయి. 33 ఏళ్ల పేసర్ చివరిసారిగా గత ఏడాది భారత్లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో బరిలోకి దిగాడు. ‘ఆపరేషన్ సక్సెస్ అయింది. కోలుకునేందుకు కాస్త సమయం పడుతుంది. త్వరగా కోలుకొని నడవాలనుంది’ అని షమీ ‘ఎక్స్’లో ట్వీట్ చేశాడు. షమీ వేగంగా కోలుకోవాలని ఎప్పట్లాగే కెరీర్ను కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్లో ఆకాంక్షించారు. -
విభేదాలు ఉంటేనేం.. తనను చాలా మిస్సవుతున్నా: షమీ
తన కూతురు ఐరాను చాలా మిస్సవుతున్నానంటూ టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఉద్వేగానికి లోనయ్యాడు. హసీన్ జహాన్ అనుమతించినపుడు మాత్రమే బిడ్డను చూసుకునే అవకాశం వస్తుందని పేర్కొన్నాడు. ఐరా తల్లితో తనకు విభేదాలు ఉన్నా.. సొంత రక్తాన్ని మాత్రం వదులుకోలేనని ఎమోషనల్ అయ్యాడు. కాగా మోడల్ హసీన్ జహాన్ను 2014లో వివాహం చేసుకున్నాడు షమీ. ఈ దంపతులకు 2015లో కుమార్తె ఐరా జన్మించింది. అయితే, కొన్నేళ్ల క్రితం భర్త షమీపై సంచలన ఆరోపణలు చేస్తూ హసీన్ జహాన్ కోర్టును ఆశ్రయించింది. షమీ స్త్రీలోలుడని.. అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అదే విధంగా గృహహింస చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరగా విడిగా ఉంటున్నారు. కుమార్తె ఐరాను హసీన్ తనతో పాటు తీసుకువెళ్లడంతో.. షమీ కూతురికి కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా న్యూస్18తో సంభాషణ సందర్భంగా.. కూతురి ప్రస్తావన రాగా షమీ స్పందించాడు. ‘‘ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని మిస్సవుతారు కదా! కొన్నిసార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. నేను నా కూతుర్ని మిస్సవుతున్నా. ఎంతైనా తను నా రక్తం. వాళ్ల అమ్మతో విభేదాలున్నంత మాత్రాన నా కూతురిని నేను దూరం చేసుకోలేను. అయితే, నేను ఐరాతో మాట్లాడాలా? వద్దా అనేది వాళ్ల అమ్మ నిర్ణయానుసారమే ఉంటుంది. తను అనుమతిస్తేనే నేను ఐరాతో మాట్లాడగలను. అయితే, ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా తనను నేరుగా కలవలేకపోయాను. తను ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటా’’ అని షమీ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023 తర్వాత.. గాయం కారణంగా మహ్మద్ షమీ.. టీమిండియాకు దూరమయ్యాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్తో రీఎంట్రీ ఇస్తాడని భావించగా ఫిట్నెస్ సాధించకపోవడంతో ఇప్పట్లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. చదవండి: Ranji Trophy: రీ ఎంట్రీలో టీమిండియా ఓపెనర్ ధనాధన్ శతకం.. ఫోర్ల వర్షం -
హార్దిక్ వెళ్లినా నష్టం లేదు.. గిల్ కూడా వెళ్లిపోతాడు: షమీ షాకింగ్ కామెంట్స్
IPL 2024- Mohammed Shami's Blunt Verdict: రెండేళ్ల క్రితం క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ అరంగేట్రంలోనే విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్-2022 సీజన్లో ట్రోఫీ గెలిచి సత్తా చాటింది. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన కెరీర్లో తొలిసారిగా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి జట్టుకు ఈ విజయాన్ని అందించాడు. అదే విధంగా... 2023 ఎడిషన్లోనూ ఫైనల్కు చేర్చి సారథిగా తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. అయితే, ఐపీఎల్-2024 వేలానికి ముందే ముంబై ఇండియన్స్తో బేరం కుదుర్చుకుని.. అభిమానులకు ఊహించని షాకిచ్చాడు హార్దిక్ పాండ్యా. టైటాన్స్ను వీడి సొంతగూటికి వెళ్లిపోయాడు. కొత్త సారథిగా గిల్ ఆరంభం నుంచి తమతోనే ఉన్నా.. కష్టకాలంలో తనను వదిలించుకున్న ఆ ఫ్రాంఛైజీతోనే మళ్లీ దోస్తీకట్టాడు. హార్దిక్ నిర్ణయాన్ని గౌరవించిన గుజరాత్ టైటాన్స్ ముంబై చెల్లించిన మొత్తం తీసుకుని అతడిని వదిలేసింది. తమ కొత్త కెప్టెన్గా టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ పేరును ప్రకటించింది. హార్దిక్ వెళ్తే నష్టమేమీ లేదు ఈ పరిణామాలపై టీమిండియా సీనియర్ పేసర్, గుజరాత్ టైటాన్స్ కీలక బౌలర్ మహ్మద్ షమీ తాజాగా స్పందించాడు. ఈ మేరకు.. ‘‘ఎవరు జట్టును వీడి వెళ్లినా పెద్దగా ఫరక్ పడదు(నష్టమేమీ ఉండదన్న ఉద్దేశంలో). జట్టు సమతూకంగా ఉందా లేదా అన్నది మాత్రమే మనం చూడాల్సింది. హార్దిక్ ఒకప్పుడు సారథిగా ఉన్నాడు. మమ్మల్ని విజయవంతంగా ముందుకు నడిపించాడు. రెండు ఎడిషన్లలోనూ ఫైనల్కు తీసుకువెళ్లాడు. ఓసారి గెలిపించాడు కూడా! ఏదో ఒకరోజు గిల్ కూడా వెళ్లిపోతాడు అయినా.. గుజరాత్ టైటాన్స్... హార్దిక్ పాండ్యాతో జీవితకాలానికి సరిపడా ఒప్పందమేమీ కుదుర్చుకోలేదు కదా! జట్టుతో ఉండాలా, వీడి వెళ్లాలా అన్నది అతడి నిర్ణయం. ఇప్పుడు శుబ్మన్ కెప్టెన్ అయ్యాడు. సారథిగా తనకూ అనుభవం వస్తుంది. ఏదో ఒకరోజు గిల్ కూడా జట్టును వీడి వెళ్లే అవకాశం ఉంది. ఆటలో ఇవన్నీ సహజం. ఆటగాళ్లు వస్తూ.. పోతూనే ఉంటారు’’ అని న్యూస్24తో షమీ వ్యాఖ్యానించాడు. అలా చేస్తే గిల్ సక్సెస్ అవుతాడు అదే విధంగా.. కెప్టెన్గా ఉన్నపుడు జట్టుతో పాటు వ్యక్తిగత ప్రదర్శన పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని షమీ పేర్కొన్నాడు. రానున్న సీజన్లో శుబ్మన్ గిల్ సారథిగా, బ్యాటర్గా తన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తాడనే నమ్మకం ఉందని తెలిపాడు. ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టగలిగితే కెప్టెన్ పని సులువే అవుతుందని షమీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపీఎల్-2023లో 17 మ్యాచ్లు ఆడిన షమీ.. 28 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. మరోవైపు.. శుబ్మన్ గిల్ 17 మ్యాచ్లలో కలిపి 890 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. చదవండి: చరిత్రకు ఆరు పరుగుల దూరంలో కోహ్లి.. కొడితే! -
టీమిండియా యువ పేసర్కు గాయం.. ఆటకు దూరం
టీమిండియా ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, టీ20 నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్, ఓపెనింగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఆటకు దూరంగా ఉన్నారు. వీళ్లంతా అఫ్గనిస్తాన్తో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్కు దూరమయ్యారు. మరోవైపు... వన్డే వరల్డ్కప్-2023 తర్వాత.. చీలమండ నొప్పితో జట్టుకు దూరమైన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో ఇంగ్లండ్తో సొంతగడ్డపై జరుగనున్న తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో అతడికి స్థానం దక్కలేదు. ఈ క్రమంలో తాజాగా టీమిండియా మరో బౌలర్ గాయపడ్డాడు. యువ పేసర్ ప్రసిద్ కృష్ణ తొడ కండరాల నొప్పితో ఆటకు దూరం కావడం గమనార్హం. కాగా సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ కర్ణాటక బౌలర్.. రెండు మ్యాచ్లు ఆడి ధారాళంగా పరుగులు ఇచ్చుకుని కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. సఫారీ గడ్డపై నిరాశాజనక ప్రదర్శన నేపథ్యంలో తిరిగి దేశవాళీ క్రికెట్పై దృష్టి సారించిన ప్రసిద్ కృష్ణ.. రంజీ ట్రోఫీ-2024లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా కర్ణాటక- గుజరాత్ మధ్య శుక్రవారం మొదలైన టెస్టులో అతడు బరిలోకి దిగాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో 14.5 ఓవర్లు బౌల్ చేసిన ప్రసిద్ రెండు వికెట్లు తీశాడు. అయితే, పదిహేనో ఓవర్ ఆఖరి బంతి వేసేపుడు తొడ కండరాల నొప్పితో విలవిల్లాడిన ఈ రైటార్మ్ పేసర్ మైదానాన్ని వీడాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు కోలుకోవడానికి సుమారు నాలుగు నుంచి ఆరు వారాల సమయం పట్టనుంది. దీంతో ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్కు అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇక ఇంగ్లండ్తో సిరీస్లో భాగంగా ఇప్పటికే తొలి రెండు మ్యాచ్లకు బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. ఇక ప్రసిద్ కృష్ణ మాత్రం గాయం కారణంగా మిగిలిన మూడు మ్యాచ్లలో ఆడకపోవచ్చు. చదవండి: Ind vs Eng: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. తల్లి త్యాగం! టీమిండియాలో ఎంట్రీ.. -
#Maldives Row: ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన.. టీమిండియా పేసర్ స్పందన
#Maldives Row- #ExploreIndianIslands: దేశ పర్యాటక రంగ వృద్ధిలో పాలుపంచుకోవాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు వీలుగా చేపడుతున్న చర్యలకు మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చాడు. కాగా ప్రధాని మోదీ ఇటీవల.. కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ను సందర్శించారు. అక్కడి ప్రకృతి అందాలను ఆవిష్కరిస్తూ సముద్ర తీరంలో తన సాహసక్రీడలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేశారు. మీలోని సాహసికుడికి సరైన గమ్యస్థానం లక్షద్వీప్ అంటూ పర్యాటకులను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. మల్దీవుల మంత్రుల నోటి దురుసుతనం ఈ నేపథ్యంలో మాల్దీవుల మంత్రి అబ్దుల్లా మాజిద్ మాల్దీవులను మరపించి లక్షద్వీప్ను పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించడానికే మోదీ ఇలాంటి చర్యకు పూనుకున్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది. తర్వాత మరియం షియునా, మాల్షా ఆయనకు మద్దతుగా భారత్ను తక్కువ చేసే విధంగా మాట్లాడటంతో వివాదం మరింత ముదిరింది. మాకేం సంబంధం లేదు దీంతో ఆ దేశ అధ్యక్షుడు మంత్రులను సస్పెండ్ చేసి వారి వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు. అయినప్పటికీ అప్పటికే బాయ్కాట్ మాల్దీవ్స్ పేరిట భారత నెటిజన్లు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జాతికి సంఘీభావంగా పలు పర్యాటక సంస్థలు మాల్దీవుల ప్రయాణ బుకింగ్స్ నిలిపివేశాయి. ప్రధాని మోదీ ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ప్రధాని మోదీకి మద్దతుగా భారత పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామంటూ అభిమానులకు పిలుపునిస్తున్నారు. ఈ విషయంపై మహ్మద్ షమీ తాజాగా స్పందించాడు. ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘మన దేశ పర్యాటకాన్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి. ఏరకంగా అయితేనేమి దేశం అభివృద్ధి చెందడమే ముఖ్యం. దేశం వృద్ధి సాధిస్తే ప్రతి ఒక్క పౌరుడికి మంచే జరుగుతుంది. ప్రధాని మన దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని శాయశక్తులా కృషి చేస్తున్నారు. మనమందరం ఆయనకు తప్పక మద్దతుగా ఉండాలి’’ అని షమీ పేర్కొన్నాడు. ఇంగ్లండ్తో సిరీస్ నాటికి కాగా వన్డే వరల్డ్కప్-2023లో టాప్ వికెట్ టేకర్(24)గా నిలిచిన మహ్మద్ షమీ గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్తో అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, ఆకాశ్ చోప్రా, సురేశ్ రైనా తదితరులు .. ‘‘భారత పర్యాటకాన్ని ప్రోత్సహించాలి’’ అంటూ ప్రధాని మోదీకి మద్దతుగా పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Afg: అఫ్గన్తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
‘అలా అయితేనే షమీ టీ20 ప్రపంచకప్ ఆడతాడు.. లేదంటే!’
అనూహ్య రీతిలో వన్డే వరల్డ్కప్-2023 ఆడే అవకాశం దక్కించుకున్న టీమిండియా వెటరన్ స్పీడ్స్టర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచి సత్తా చాటాడు. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా మూడో ఆప్షన్గా తుది జట్టులో చోటు సంపాదించిన ఈ రైటార్మ్ పేసర్.. 7 మ్యాచ్లలో కలిపి 24 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గానూ షమీ రికార్డు సృష్టించాడు. సొంతగడ్డపై ఐసీసీ టోర్నీలో ఇలా సత్తా చాటిన షమీ ప్రస్తుతం చీలమండ నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడిని సౌతాఫ్రికా పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్కు ఎంపిక చేయనట్లు తెలుస్తోంది. అదే విధంగా టెస్టు జట్టులోనూ షమీ అందుబాటులో ఉంటాడో లేదోనన్న విషయంలో సందిగ్దత ఉంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి స్వయంగా ప్రకటించింది. షమీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడని.. పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే మళ్లీ మైదానంలో దిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో షమీ అంతర్జాతీయ టీ20 భవితవ్యం గురించి ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. ‘‘వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్లో షమీ ఆడతాడా లేదా అన్నది.. అతడి ఐపీఎల్ ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది. గుజరాత్ టైటాన్స్ తరఫున అతడు గత రెండు సీజన్లలో అద్భుతంగా ఆడుతున్నాడు. మరి రానున్న ఎడిషన్లో షమీ ఎలా ఆడతాడో చూడాలి’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ‘‘మ్యాచ్ సమయంలో అతడికి గాయం కాలేదు. అయితే, మడిమ నొప్పి రాను రాను తీవ్రమైంది. ముంబైలో షమీ పలువురు డాక్టర్లను సంప్రదించాడు. తదుపరి జాతీయ క్రికెట్ అకాడమీలో అతడు పునరావాసం పొందనున్నాడు’’ సదరు వర్గాలు తెలిపినట్లు సమాచారం. ఇక బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం గాయమైతే అంత తీవ్రంగా లేదు. తన తమ్ముడు మహ్మద్ కైఫ్ విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో ఆడుతున్న మ్యాచ్ను చూడటానికి కూడా షమీ వచ్చాడు. అపుడు కాలు కాస్త ఉబ్బినట్లు కనిపించింది’’ అని పేర్కొన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన షమీ దేశవాళీ క్రికెట్లో బెంగాల్కు ప్రాతినిథ్యం వహిస్తాడన్న విషయం తెలిసిందే. చదవండి: ‘సెలక్టర్లు అతడిని మర్చిపోవద్దు.. సౌతాఫ్రికా టూర్కు పంపాల్సింది’ -
సిరాజ్, ప్రసిద్ద్ కాదు.. అతడే జూనియర్ మహ్మద్ షమీ: అశ్విన్
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ తన బౌలింగ్ స్కిల్తో అందరని అకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో ముఖేష్ వికెట్లు పడగొట్టకపోయినప్పటికీ.. తన బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్ వేసిన ముఖేష్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి ఆసీస్ జోరుకు కళ్లెం వేశాడు. చివర్ ఓవర్లో అతడు బౌన్సర్లు, యార్కర్లు వేసి ఆసీస్ బ్యాటర్లను సైలెంట్గా వుంచాడు. ఓవరాల్గా తన 4 ఓవర్ల కోటాలో ముఖేష్ 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక తిరునవంతపురం వేదికగా జరగనున్న రెండో టీ20లో కూడా సత్తాచాటాలని ముఖేష్ కుమార్ భావిస్తున్నాడు. ఈ క్రమంలో ముఖేష్ కుమార్పై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖేష్కు మహ షమీ లాంటి బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయని అశ్విన్ కొనియాడాడు. "నేను మొదట్లో మహ్మద్ సిరాజ్ జూనియర్ షమీ అవుతాడని అనుకున్నాను. కానీ ఇప్పుడు యువ పేసర్ ముఖేష్ కుమార్ను చూస్తే జూనియర్ షమీ అవుతాడని అన్పిస్తుంది. షమీ అని అందరూ ముద్దుగా 'లాలా' అని పిలుస్తారు. నేను మాత్రం షమీని లాలెట్టన్ అని పిలుస్తాను. ఎందుకంటే నాకెంతో ఇష్టమైన నటుడి మోహన్ లాల్ ముద్దుపేరు లాలెట్టన్. ముఖేష్.. షమీ బౌలింగ్ యాక్షన్ను పోలి ఉన్నాడు. అతడితో పాటు సమానమైన ఎత్తును కూడా కలిగి ఉన్నాడు. అతడితో అద్భుతంగా యార్కర్లు బౌలింగ్ చేయగలడు. బంతిపై మంచి కంట్రోల్, అద్భుతమైన బ్యాక్-స్పిన్ కలిగి ఉన్నాడు. వెస్టిండీస్లో జరిగిన సిరీస్లో అతడు బాగా బౌలింగ్ చేశాడు. బార్బడోస్లో జరిగిన ప్రాక్టీస్ గేమ్లో అత్యుత్తమంగా రాణించాడని" తన యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ పేర్కొన్నాడు. చదవండి: మంచి మనసు.. ఓ వ్యక్తి ప్రాణం కాపాడిన మహ్మద్ షమీ! వీడియో వైరల్ -
వాళ్లకు వాళ్లు తోపులనుకుంటారు.. పాక్ మాజీలపై నిప్పులు చెరిగిన షమీ
టీమిండియా పేస్ బాద్షా మొహమ్మద్ షమీ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లపై నిప్పులు చెరిగాడు. వన్డే వరల్డ్కప్ 2023 సందర్భంగా భారత పేసర్లకు ఐసీసీ ప్రత్యేక బంతులు సమకూర్చిందంటూ వారు చేసిన నిరాధారమైన ఆరోపణలపై మండిపడ్డాడు. పాక్ మాజీలు ఇలాంటి విచక్షణారహిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించాడు. మీకు మీరే తోపులనుకుంటే సరిపోదని చురకలంటించాడు. ఇకనైనా మారండ్రా బాబూ అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. కాగా, 2023 వరల్డ్కప్లో భారత పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా పేస్ త్రయం ఏకంగా 58 వికెట్లు పడగొట్టి, ప్రత్యర్ధి బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. మొహమ్మద్ షమీ 7 మ్యాచ్ల్లో 24 వికెట్లు పడగొట్టి వరల్డ్కప్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలువగా.. జస్ప్రీత్ బుమ్రా 11 మ్యాచ్ల్లో 20 వికెట్లు, మొహమ్మద్ సిరాజ్ 11 మ్యాచ్ల్లో 14 వికెట్లు నేలకూల్చారు. Mohammad Shami thrashed Hasan Raza’s theory of different balls provided by ICC to Indians.pic.twitter.com/c6StMTRTCb — Cricketopia (@CricketopiaCom) November 21, 2023 భారత పేసర్లు గతంలో ఎన్నడూ లేనట్లుగా చెలరేగడంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లలో అక్కసు కట్టలు తెంచుకుంది. భారత పేసర్లకు ఐసీసీ ప్రత్యేకమైన బంతులు సమకూర్చిందంటూ పాక్ మాజీ ఆటగాడు హసన్ రజా వివాదాస్పద ఆరోపణలు చేశాడు. ప్రత్యేక బంతుల కారణంగానే భారత పేసర్లు చెలరేగిపోయారంటూ మరికొంతమంది పాక్ మాజీలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై షమీ తాజాగా స్పందించాడు. ప్యూమా కంపెనీకి సంబంధించిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాక్ మాజీలపై నిప్పులు చెరిగాడు. పాక్ మాజీల నిరాధారమైన ఆరోపణలు బాధించాయని అన్నాడు. ఈ సందర్భంగా షమీ మాట్లాడుతూ.. నాకైతే ఇతరుల సక్సెస్ చూసి ఎప్పుడూ ఈర్ష్య కలుగదు. ఇతరుల సక్సెస్ను ఎంజాయ్ చేయగలిగినప్పుడే మంచి ప్లేయర్ అనిపించుకుంటారు. మనకు ఏది చేయాలన్నా దేవుడే చేయాలి. నేను ఇదే నమ్ముతానని అన్నాడు. కుట్ర సిద్ధాంతాల పుట్టుకకు పాకిస్తానీల అర్హతే మూలకారణమని తెలిపాడు. పాక్ మాజీలు కొందరు తమకు తామే అత్యుత్తమమని భావిస్తున్నారని, ఇతరులెవ్వరూ వారు సాధించించి సాధించలేరని ఫీలవుతారని చురకలంటించాడు. -
నిన్నటి రోజు మనది కాకుండా పోయింది: షమీ భావోద్వేగం.. పోస్ట్ వైరల్
ICC WC 2023- Mohammad Shami Post Goes Viral: వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో ఓటమిపై టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ స్పందించాడు. టోర్నీ ఆసాంతం తాము అద్బుతంగా ఆడామని.. కానీ నిన్నటి రోజు మాత్రం తమది కాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పడిలేచిన కెరటంలా తిరిగి పుంజుకుని అభిమానులను గర్వపడేలా చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం(నవంబరు 19) జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తుదిపోరులో ఆస్ట్రేలియా భారత జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అజేయ జట్టు.. ఆఖరి మెట్టుపై బోల్తా ఈ ఎడిషన్లో లీగ్ దశ నుంచి ఓటమన్నదే ఎరుగని రోహిత్ సేనకు తొలి ఓటమిని రుచి చూపించి.. ఏకంగా ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. దీంతో.. మనోళ్లు కప్ గెలుస్తారని ఆశగా ఎదురుచూసిన కోట్లాది మంది అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. సొంతగడ్డపై భారత్ను మరోసారి చాంపియన్గా చూడాలనుకున్న స్వప్నాలు చెదిరిపోయాయి. ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ ‘ఎక్స్’ వేదికగా తన భావాలు పంచుకున్నాడు. ‘‘దురదృష్టవశాత్తూ నిన్నటి రోజు మనది కాకుండా పోయింది. జట్టుకు, నాకు టోర్నీ ఆసాంతం మద్దతుగా నిలిచిన భారతీయులందరికి పేరుపేరునా కృతజ్ఞతలు. మోదీజీకి థాంక్స్ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ జీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన డ్రెస్సింగ్ రూంకి వచ్చి మాలో స్ఫూర్తిని నింపారు. మేము తిరిగి పుంజుకుంటాం’’ అని షమీ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. ప్రధాని మోదీ తనను ఆత్మీయంగా హత్తుకుని ఓదార్చుతున్న ఫొటోను జత చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా భారత పేస్ త్రయంలో కీలకమైన మహ్మద్ షమీకి ప్రపంచకప్-2023 ఆరంభ మ్యాచ్లలో ఆడే అవకాశం రాలేదు. హార్దిక్ పాండ్యా రూపంలో పేస్ ఆల్రౌండర్ అందుబాటులో ఉండటంతో షమీని పక్కనపెట్టారు. ఆరంభంలో చోటే లేదు.. హయ్యస్ట్ వికెట్ టేకర్గా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లకు తుదిజట్టులో చోటిచ్చే క్రమంలో అతడికి తుదిజట్టులో చోటు లేకుండా పోయింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్తో మ్యాచ్లో పాండ్యా గాయపడగా షమీ జట్టులోకి వచ్చాడు. లీగ్ దశలో న్యూజిలాండ్తో మ్యాచ్తో ఎంట్రీ ఇచ్చిన ఈ రైటార్మ్ పేసర్ ఐదు వికెట్ల హాల్తో మెరిశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్పై 4, శ్రీలంకపై 5, సౌతాఫ్రికాపై 2 వికెట్లు పడగొట్టాడు. ఇక న్యూజిలాండ్తో సెమీస్లో ఏకంగా రికార్డు స్థాయిలో ఏడు వికెట్లు కూల్చాడు. ఆస్ట్రేలియాతో ఫైనల్లో ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా మొత్తంగా 24 వికెట్లు తీసిన షమీ.. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలిచి అవార్డు అందుకున్నాడు. చదవండి: CWC 2023: అత్యుత్తమ జట్టు ప్రకటన.. కెప్టెన్గా రోహిత్.. ఆసీస్ హీరోకు నో ఛాన్స్ Unfortunately yesterday was not our day. I would like to thank all Indians for supporting our team and me throughout the tournament. Thankful to PM @narendramodi for specially coming to the dressing room and raising our spirits. We will bounce back! pic.twitter.com/Aev27mzni5 — 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) November 20, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: విరాట్ కోహ్లికి మూడు, షమీకి రెండు.. అవార్డుల జాబితా
CWC 2023 Winner Australia: క్రికెట్ మెగా సమరానికి తెరపడింది. భారత్ వేదికగా అక్టోబరు 5న మొదలైన వన్డే వరల్డ్కప్ పండుగ ఆదివారంతో ముగిసిపోయింది. అజేయ రికార్డుతో ఫైనల్ చేరిన టీమిండియా ట్రోఫీ గెలుస్తుందని కోటి ఆశలతో ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో రోహిత్ సేనను ఓడించి ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది. అనూహ్య విజయాలతో తుదిపోరుకు అర్హత సాధించిన ప్యాట్ కమిన్స్ బృందం విజయంతో ఈ ఐసీసీ టోర్నీని ముగించి సగర్వంగా స్వదేశానికి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. అసలు మ్యాచ్లో ఓటమిపాలైన టీమిండియా ఈ ఐసీసీ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడు, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వంటి అవార్డులు గెలుచుకుంది. ప్రపంచకప్-2023 టోర్నమెంట్లో వివిధ అవార్డులు అందుకున్న ప్లేయర్ల లిస్టు 1.ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ - విరాట్ కోహ్లీ- ఇండియా (765 పరుగులు, 1 వికెట్, 5 క్యాచ్లు) 2. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫైనల్- ట్రవిస్ హెడ్- ఆస్ట్రేలియా(137 పరుగులు, 1 క్యాచ్) 3.అత్యధిక పరుగులు- విరాట్ కోహ్లి(11 ఇన్నింగ్స్లో 765 పరుగులు) 4.అత్యధిక స్కోరు- గ్లెన్ మాక్స్వెల్(ముంబైలో అఫ్గనిస్తాన్ మీద 201 పరుగులు- నాటౌట్) 5. అత్యధిక సెంచరీలు- క్వింటన్ డికాక్- సౌతాఫ్రికా(4 శతకాలు) 6. అత్యధిక అర్ధ శతకాలు- విరాట్ కోహ్లి(6 ఫిఫ్టీలు) 7. అత్యధిక వికెట్లు- మహ్మద్ షమీ- ఇండియా(7 ఇన్నింగ్స్లో 24 వికెట్లు) 8. అత్యుత్తమ గణాంకాలు- మహ్మద్ షమీ(ముంబైలో న్యూజిలాండ్ మీద 7/57) 9. అత్యధిక సిక్సర్లు- రోహిత్ శర్మ- ఇండియా(31 సిక్స్లు) 10. అత్యధిక క్యాచ్లు- డారిల్ మిచెల్- న్యూజిలాండ్(11 క్యాచ్లు) 11. అత్యధిక అవుట్లు చేసిన వికెట్ కీపర్- క్వింటన్ డికాక్(20) 13. అత్యధిక స్ట్రైక్రేటు- గ్లెన్ మాక్స్వెల్(150.37) పూర్తి వివరాలు- ఇతర విశేషాలు ►ఈ ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా భారత స్టార్ విరాట్ కోహ్లి నిలిచాడు. కోహ్లి 11 మ్యాచ్లు ఆడి 3 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 765 పరుగులు సాధించాడు. ►ఈ ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా భారత పేసర్ మొహమ్మద్ షమీ నిలిచాడు. షమీ 7 మ్యాచ్లు ఆడి మొత్తం 24 వికెట్లు పడగొట్టాడు. షమీ మొత్తం 48.5 ఓవర్లు వేసి 257 పరుగులు ఇచ్చాడు. ►మొత్తం ప్రపంచకప్ టోర్నీలలో అత్యధిక టీమ్ స్కోరు ఈ ప్రపంచకప్లోనే నమోదైంది. శ్రీలంకతో న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 5 వికెట్లకు 428 పరుగులు సాధించింది. ►ధర్మశాలలో ఆ్రస్టేలియా (388 ఆలౌట్; 49.2 ఓవర్లలో), న్యూజిలాండ్ (50 ఓవర్లలో 383/9) జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మొత్తం 771 పరుగులు వచ్చాయి. ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో ఇదే అత్యధికం. ►ఈ ప్రపంచకప్లో అత్యధిక వ్యక్తిగత నమోదు చేసిన బ్యాటర్గా ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్వెల్ నిలిచాడు. అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మ్యాక్స్వెల్ (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్స్లు) అజేయ డబుల్ సెంచరీ సాధించాడు. ►ఈ ప్రపంచకప్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్గా భారత పేసర్ మొహమ్మద్ షమీ నిలిచాడు. న్యూజిలాండ్తో ముంబైలో జరిగిన సెమీఫైనల్లో షమీ 57 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు. ►ఈ ప్రపంచకప్లో ఒకే ఇన్నింగ్స్లో 400 అంతకంటే ఎక్కువ స్కోర్లు మూడుసార్లు నమోదయ్యాయి. శ్రీలంకపై దక్షిణాఫ్రికా (428/5), నెదర్లాండ్స్పై భారత్ (410/4), పాకిస్తాన్పై న్యూజిలాండ్ (401/6) సాధించాయి. ►వన్డే వరల్డ్కప్లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు గెల్చుకున్న మూడో భారతీయ క్రికెటర్గా విరాట్ కోహ్లి గుర్తింపు పొందాడు. గతంలో సచిన్ టెండూల్కర్ (2003లో), యువరాజ్ సింగ్ (2011లో) ఈ ఘనత సాధించారు. చదవండి: అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది! వారిద్దరికి క్రెడిట్: రోహిత్ శర్మ View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: అందరూ హీరోలే.. కానీ టీమిండియా చివరకు ఇలా!
మళ్లీ అదే బాధ... మరోసారి అదే వేదన... చేరువై దూరమైన వ్యథ! తమ అద్భుత ఆటతో అంచనాలను పెంచి విశ్వ విజేతగా నిలిచేందుకు అన్ని అర్హతలు ఉన్న జట్టుగా కనిపించిన భారత్ విషాదంగా మెగా టోర్నీని ముగించింది. 2003లో ఆసీస్ చేతిలో ఓడిన బాధ నాటి తరానికి మాత్రమే గుర్తుంటుంది... కానీ నాలుగేళ్ల క్రితం 2019 సెమీఫైనల్లో మన ఓటమి ఇంకా అభిమానుల మదిలో తాజాగానే ఉంది. ఇప్పుడు స్వదేశంలో దానిని సరిదిద్దుకునే అవకాశం లభించింది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాపై మన ఆధిపత్యం చూస్తే భారత జట్టుపై అంచనాలు పెరిగాయి... ప్రపంచకప్నకు ఆరు నెలల ముందు నుంచి జట్టు కూర్పుపై ప్రణాళికలు, ప్రదర్శన, ఒక్కో ఆటగాడి వ్యక్తిగత ప్రదర్శనలు, వారికి అప్పగించిన వేర్వేరు బాధ్యతలు అద్భుతంగా పని చేశాయి. కోచ్గా రాహుల్ ద్రవిడ్, రోహిత్ కెప్టెన్సీ మధ్య గొప్ప సమన్వయం మెరుగైన వ్యూహాలకు బాట వేసింది. ఈ నాలుగేళ్ల కాలంలో 66 వన్డేల్లో కలిపి భారత్ 50 మంది ఆటగాళ్లను ఆడించింది. ఏ ఇతర జట్టూ ఇంత మందికి అవకాశం కల్పించలేదు. ముఖ్యంగా ప్రతీ స్థానం కోసం సరిగ్గా సరిపోయే ఆటగాళ్లను గుర్తించే ప్రయత్నం ఇందులో జరిగింది. ఆయా ఆటగాళ్ల ప్రదర్శన తర్వాత ఈ సంఖ్యను సగానికి తగ్గించి 24 మందితో ఒక జాబితా తయారైంది. ఇందులో నుంచే వరల్డ్కప్ కప్ టీమ్ ఉంటుందనే విషయంపై స్పష్టత వచ్చింది. వరల్డ్కప్నకు ఆరు నెలల ముందునుంచి చూస్తే 2023 మార్చి 1 నుంచి అక్టోబర్ 4 మధ్య భారత్ 15 వన్డేలు ఆడితే ఈ 24 నుంచే జట్లను ఎంపిక చేశారు. అనంతరం 15 మందితో వరల్డ్ కప్ టీమ్ ఎంపికైంది. వరుస అద్భుత విజయాలు వీరితోనే సాధ్యమయ్యాయి. ‘మేం జట్టుగా గెలుస్తాం...జట్టుగా ఓడతాం’... ప్రపంచకప్ మొత్తం భారత డ్రెస్సింగ్ రూమ్లో ఈ నినాదం గట్టిగా మార్మోగింది. సెమీస్ వరకు ఒక్కసారి కూడా ఓటమిని దరి చేరనీయకుండా విజయంపై విజయంపై సాధిస్తూనే టీమిండియా తమ స్థాయిని ప్రదర్శించింది. ఎదురులేని ఆటతో వరుసగా 10 మ్యాచ్లను సొంతం చేసుకొని అంచనాలను ఆకాశానికి పెంచింది. 1983 వరల్డ్కప్ అనగానే జింబాబ్వేపై కపిల్ దేవ్ 175 నాటౌట్, ఫైనల్లో కపిల్ పట్టిన రిచర్డ్స్ క్యాచ్లాంటివి ప్రత్యేకంగా కనపడతాయి. 2011లో యువరాజ్ సింగ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో పాటు ధోని కొట్టిన విన్నింగ్ సిక్సరే అందరి మనసుల్లో ముద్రించుకుపోయింది. ఈ రెండు మెగా టోర్నీల్లోనూ ఇతర ఆటగాళ్లూ తమ వంతు పాత్ర పోషించినా... టీమ్ గేమ్లో గెలవాలంటే అందరి భాగస్వామ్యం తప్పనిసరి అని ఎన్ని మాటలు చెప్పుకున్నా కొన్ని వ్యక్తిగత ప్రదర్శనలే హైలైట్ అయి అవే ప్రపంచకప్ను గెలిపించాయనే భావన కలిగిస్తాయి. కానీ ఈ టోర్నీలో మాత్రం భారత ఆటగాళ్లందరూ హీరోలే. ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు. మైదానంలోకి దిగిన ప్రతీ ఒక్కరు తమదైన ఆటతో జట్టును గెలిపించారు... జట్టు కోసం గెలుపు అవకాశాలు సృష్టించారు. జట్టుకు విజయం అందించేందుకు ఒకటో నంబర్ ఆటగాడినుంచి పదకొండో నంబర్ ప్లేయర్ వరకు ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. వ్యక్తిగతంగా చూస్తే ప్రతీ పోరులో ఒకరు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలుస్తారు. కానీ భారత జట్టుకు సంబంధించి ప్రతీ మ్యాచ్లో అందరూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్లే. ఒక బ్యాటర్ నెమ్మదించినట్లు కనిపిస్తే మరొకరు చెలరేగిపోయారు. ఒక బౌలర్ కాస్త తడబడినట్లు అనిపిస్తే నేనున్నానంటూ మరో బౌలర్ వచ్చి లెక్క సరిచేశారు. పవర్ప్లేలో పవర్ అంతా చూపిస్తే, మధ్య ఓవర్లలో మరొకరు ఇన్నింగ్స్ నడిపించారు. చివర్లో చెలరేగే బాధ్యత ఇంకొకరిది. భారత గడ్డపై పేసర్లు ఇంతగా ప్రభావం చూపించగలరని ఎవరైనా అనుకున్నారా! మన త్రయం దానిని చేసి చూపించింది. ఒక్కో బంతిని ఆడేందుకు బ్యాటర్లు పడిన తిప్పలు చూస్తే దాని పదునేమిటో తెలుస్తుంది. ఇక స్పిన్ ద్వయం ప్రత్యర్థులను పూర్తిగా కట్టి పడేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు...ఐదుగురూ వికెట్లు తీయగల సమర్థులైన బౌలర్లు ఉన్న టీమిండియాను చూసి ఎన్నాళ్లయింది? అంకెలపరంగా చూస్తే ప్రతీ ఒక్కరి పాత్ర జట్టును గెలిపించింది. 11 ఇన్నింగ్స్లలో 3 సెంచరీలు, 6 అర్ధసెంచరీలతో 765 పరుగులు చేసిన కోహ్లి తన విలువేంటో చూపించాడు. ముందుగా క్రీజ్లో కుదురుకొని తర్వాత ధాటిగా ఆడే తన శైలిని మార్చుకొని ఆరంభంలో చెలరేగి విజయానికి పునాది వేసే వ్యూహంతోనే ఆడిన కెప్టెన్ రోహిత్ కూడా 597 పరుగులు చేశాడు. శ్రేయస్ (530), రాహుల్ (452), శుబ్మన్ గిల్ (354) కూడా కీలక పరుగులు సాధించారు. ఇక బౌలింగ్లో 7 మ్యాచ్లలోనే కేవలం 10.70 సగటుతో 24 వికెట్లు తీసి మొహమ్మద్ షమీ టోర్నీని ఒక ఊపు ఊపాడు. బుమ్రా 20 వికెట్లతో తన సత్తాను చాటగా... జడేజా (16), కుల్దీప్ (15), సిరాజ్ (14) బౌలింగ్ దళం బలాన్ని చూపించారు. కానీ... కానీ... ఫైనలో పోరులో మాత్రం ఈ గణాంకాలన్నీ పనికి రాలేదు. సెమీస్ వరకు స్వేచ్ఛగా ఆడినా... వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్న ఒత్తిడి సహజంగానే వారిలో కనిపించింది. అందుకే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ఏదీ కలిసి రాలేదు. గిల్, శ్రేయస్ జోరు చూపించలేకపోగా, రాహుల్ పూర్తిగా తడబడ్డాడు. ఫైనల్లాంటి కీలక పోరులో రోహిత్ తన దూకుడు కాస్త నియంత్రించుకొని ఉంటే బాగుండేదని అనిపించినా... అతనూ విఫలమయ్యే ప్రమాదమూ ఉండేది. కోహ్లి ఒక్కడే తన స్థాయికి తగ్గ ఆటను చూపించగలిగినా అది సరిపోలేదు. జడేజా, సూర్య ఇలాంటి సమయంలో ఆదుకోలేకపోయారు. అయితే బౌలింగ్ దళం కాస్త ఆశలు కలిగించింది. ఆరంభంలో మూడు వికెట్లు తీయడం కూడా నమ్మకం పెంచింది. అయితే 240 పరుగుల స్కోరు మరీ చిన్నదైపోయింది. పది విజయాల ప్రదర్శన తర్వాత ఇలాంటి ఆట ఓటమి వైపు నిలిపింది. అయినా సరే... భారత్ ప్రదర్శనను తక్కువ చేయలేం. లీగ్ దశలో తొమ్మిది వేర్వేరు ప్రత్యర్థులతో, వేర్వేరు వేదికలపై సాగించిన ఆధిపత్యం అసాధారణం. ఆటగాళ్ల శ్రమ, అంకితభావం అన్నింటిలో కనిపించాయి. ఈ టీమ్ చాంపియన్గా నిలిచేందుకే పుట్టింది అని అనిపించింది. అయితే ఏదైనా తప్పు జరగాలని రాసి పెట్టి ఉంటే అది ఎలాగూ జరుగుతుంది. కానీ కీలక సమయంలోనే అది జరుగుతుంది. ఈ టోర్నీలో మనం ఒక్క మ్యాచ్ అయినా ఓడాలని రాసి పెట్టి ఉన్నట్లుంది. ఆ మ్యాచ్ కాస్తా ఫైనల్ మ్యాచ్ కావడమే విషాదం! –సాక్షి క్రీడా విభాగం View this post on Instagram A post shared by ICC (@icc) -
నటుడి కుమారుడికి స్టార్ క్రికెటర్ పాఠాలు.. వీడియో వైరల్!
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ హంగామా నడుస్తోంది. ప్రతిష్ఠాత్మక వన్టే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి క్రికెట్పైనే ఉంది. బాలీవుడ్, టాలీవుడ్తో పాటు రాజకీయ నాయకులు సైతం మ్యాచ్ చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు సోనూ సూద్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన చిన్న కుమారుడు అయాన్ బ్యాటింగ్ మెలకువలు నేర్చుకుంటున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వరల్డ్ కప్లో వికెట్లతో అదరగొడుతున్న షమీ నుంచి సలహాలు తీసుకుంటున్న వీడియో తెగ వైరవులవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ భవిష్యత్ టీమిండియా క్రికెటర్కు చిట్కాలు నేర్పిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో గతంలో షమీ.. అయాన్కు మూడేళ్ల క్రితం ఇలా ట్రైనింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత ప్రపంచకప్లో షమీ తన బౌలింగ్తో అదరగొడుతున్నారు. అందుకే అత్యుత్తమైన క్రికెటర్తో నా కుమారుడు అయాన్కి శిక్షణ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ అతని కోచ్ను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆదివారం జరిగే భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్ కోసం సోనూసూద్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. కాగా..సోనూ కన్నడ చిత్రం 'శ్రీమంత'లో చివరిసారిగా కనిపించారు. ప్రస్తుతం బాలీవుడ్లో 'ఫతే' షూటింగ్ను పూర్తి చేసుకున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ శక్తి సాగర్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించారు. జీ స్టూడియోస్తో కలిసి రూపొందించిన 'ఫతే' మూవీ 2024లో విడుదల కానుంది. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా నటిస్తోంది. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) -
CWC 2023: ఆ ఇద్దరూ టీమిండియా పాలిట వరం.. అంచనాలకు మించి!
ఇద్దరూ కుడిచేతి వాటం క్రికెటర్లే.. అందులో ఒకరు వికెట్ కీపర్.. మరొకరు అచ్చమైన బ్యాటర్.. ఆ ఇద్దరూ గాయాల నుంచి కోలుకుని సుదీర్ఘ విరామం తర్వాత జట్టులో పునరాగమనం చేసిన వాళ్లే.. సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023 లాంటి కీలక టోర్నీకి ముందు ఆసియా వన్డే కప్-2023 ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ ఆసియా టోర్నమెంట్తో లభించిన ‘ప్రాక్టీస్’ను వికెట్ కీపర్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే.. మరో బ్యాటర్ మాత్రం గాయం కారణంగా మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. తిరిగొచ్చిన తర్వాత.. ప్రపంచకప్ ఆరంభంలోనూ స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడి విమర్శలు మూటగట్టుకున్నాడు. అయితే, అనూహ్యంగా సెంచరీతో చెలరేగి తిరిగి గాడిలో పడ్డాడు. తనను విమర్శించిన వాళ్లకు బ్యాట్తోనే సమాధానమిస్తూ ముందుకు సాగుతున్నాడు. అద్భుత ప్రదర్శనలతో ఈ ఇద్దరూ ఇప్పుడు వరల్డ్కప్-2023 ఫైనల్లో మరింత కీలకంగా మారారు. వాళ్లెవరో కాదు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్. ఫైనల్ వరకు అజేయంగా స్వదేశంలో టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత జట్టు లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్లు గెలిచి టేబుల్ టాపర్గా సెమీస్ చేరింది. న్యూజిలాండ్తో సెమీ ఫైనల్ గండాన్ని తుదిపోరుకు అర్హత సాధించింది. అహ్మదాబాద్ వేదికగా మిగిలిన ఆ ఇంకొక్క అడుగు విజయవంతంగా పూర్తి చేసి పదేళ్ల ఐసీసీ ట్రోఫీ కరువును తీర్చాలని పట్టుదలగా ఉంది ఈ జెయింట్ కిల్లర్. ఇక్కడి వరకు సాఫీగా సాగిన టీమిండియా ప్రయాణంలో కెప్టెన్ కమ్ ఓపెనర్ రోహిత్ శర్మ, అతడి జోడీ శుబ్మన్ గిల్.. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి పాత్ర ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాపార్డర్ జబర్దస్త్గా పవర్ ప్లేలో రోహిత్ దూకుడుగా ఆరంభిస్తే.. గిల్ కాస్త ఆచితూచి ఆడి ఆ తర్వాత వేగం పెంచుతాడు. ఇక వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చే కోహ్లి.. తాను పోషించాల్సిన పాత్ర గురించి కచ్చితమైన అవగాహనతోనే మైదానంలో అడుగుపెడతాడన్న సంగతి తెలిసిందే. అయితే, అన్నివేళలా అన్నీ అనుకున్నట్లుగా జరగవు. టాపార్డర్ విఫలమైతే స్కోరు బోర్డును ముందుకు నడిపించగల బాధ్యతను మిడిలార్డర్ పూర్తిగా తీసుకోగలగాలి. ఇలాంటపుడే నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ చేసే బ్యాటర్ల అసలైన ప్రతిభ బయటపడుతుంది. మిడిలార్డర్లో పాతుకుపోయి.. తమకు తామే సాటి అన్నట్లు వన్డే వరల్డ్కప్-2023లో తమ పాత్రను చక్కగా పోషిస్తున్నారు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్. నిజానికి 2015- 19 మధ్య టీమిండియా మిడిలార్డర్లో నిలకడలేమి కొట్టొచ్చినట్లు కనిపించేది. అప్పట్లో నంబర్ 4లో కీలకమైన అంబటి రాయుడును తప్పించి త్రీడీ ప్లేయర్ పేరిట విజయ్ శంకర్ను ప్రపంచకప్-2019 జట్టుకు ఎంపిక చేశారు. కానీ అనుకున్న ఫలితాలు రాబట్టలేక సెమీస్లో ఓటమి చెంది ఇంటి బాట పట్టింది భారత జట్టు. మిడిలార్డర్లో అనిశ్చితి కారణంగా భారీ మూల్యమే చెల్లించింది. ఆ తర్వాత రాహుల్, అయ్యర్ తమ ఆట తీరుతో ఆ లోటు భర్తీ చేసే బాధ్యతను తీసుకున్నారు. గిల్ రాకతో మిడిలార్డర్కే పరిమితమైన రాహుల్.. వికెట్ కీపర్గా రాణిస్తూనే బ్యాటర్గానూ ఆకట్టుకుంటున్నాడు. వరల్డ్కప్నకు ముందు తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడి శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ కర్ణాటక బ్యాటర్.. ఆసియా కప్లో పాకిస్తాన్తో మ్యాచ్లో అజేయ శతకంతో ఫామ్లోకి వచ్చాడు. రాహుల్ సైలెంట్ కిల్లర్ ఆ తర్వాత అతడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ముఖ్యంగా వరల్డ్కప్ టోర్నీలో ఆస్ట్రేలియాతో ఆరంభ మ్యాచ్లో రోహిత్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ డకౌట్లుగా వెనుదిరిగిన వేళ.. కోహ్లి(85)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్ది జట్టును గెలిపించిన తీరు అద్భుతం. నాటి మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు రాహుల్. ప్రతి మ్యాచ్లోనూ బ్యాటర్గా తన వంతు సహకారం అందిస్తున్న ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. వికెట్ కీపర్గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అవును.. వికెట్ల వెనుక కళ్లు చెదిరే రీతిలో క్యాచ్లు అందుకోవడం సహా డీఆర్ఎస్ల విషయంలో కచ్చితత్వంతో కెప్టెన్ రోహిత్ శర్మను సైతం ఆశ్చర్యపరుస్తున్నాడు. కీలక సమయాల్లో రాహుల్ మాటను నమ్మి రోహిత్ రివ్యూలో చాలా మటుకు సక్సెస్ కావడం ఇందుకు నిదర్శనం. అయ్యర్ అద్భుత బ్యాటర్ ఇక శ్రేయస్ అయ్యర్ విషయానికొస్తే.. దాయాది పాకిస్తాన్తో మ్యాచ్లో అజేయ హాఫ్ సెంచరీ(53)తో మెరిశాడు. కానీ ఆ తర్వాత నామమాత్రపు స్కోర్లకే పరిమితమై వరుస వైఫల్యాలతో విమర్శల పాలయ్యాడు. అయితే, శ్రీలంకతో మ్యాచ్(82 పరుగులు)లో తిరిగి గాడిలో పడ్డ అయ్యర్.. సౌతాఫ్రికాతో మ్యాచ్లో 77 పరుగులు సాధించాడు. ఇక నెదర్లాండ్స్లో మ్యాచ్లో ఏకంగా 128 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత సెమీ ఫైనల్లో న్యూజిలాండ్తో మ్యాచ్లో సొంతమైదానం వాంఖడేలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 70 బంతుల్లో 105 పరుగులు చేసి వరల్డ్కప్ నాకౌట్ దశలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్లో రాహుల్ సైతం 20 బంతుల్లో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా వీరిద్దరు మిడిలార్డర్లో నిలకడగా రాణిస్తుండటం టీమిండియా పాలిట వరంలా మారింది. కీలకమైన నాలుగు, ఐదు స్థానాల్లో అయ్యర్, రాహుల్ సక్సెస్ అవుతుండటంతో బ్యాటింగ్ ఆర్డర్ మునుపెన్నడూ లేని విధంగా మరింత పటిష్టంగా కనిపిస్తోంది. ప్రతి మ్యాచ్లో 10 వికెట్లు టీమిండియా విజయాల్లో బ్యాటర్ల సంగతి ఇలా ఉంటే.. బౌలింగ్ విభాగం ముఖ్యంగా పేస్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుమ్రా, సిరాజ్ వరుస అవకాశాలు దక్కించుకుంటే.. లేట్గా ఎంట్రీ ఇచ్చినా షమీ ఎలాంటి అద్భుతాలు చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. షమీ బుల్లెట్ ఇప్పటి వరకు మూడు ఐదు వికెట్ల హాల్స్ నమోదు చేసి మొత్తంగా 23 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు షమీ. ఇక బుమ్రా 18, సిరాజ్ 13 వికెట్లతో వరుసగా ఆరు, పద్దెనిమిది స్థానాల్లో ఉన్నారు. అదే విధంగా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ సైతం తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లన్నిటిలో ఏకంగా 10 వికెట్లు తీయడాన్ని బట్టి మన బౌలర్ల ప్రదర్శన ఎలా ఉందో చెప్పవచ్చు. కోహ్లి టాప్ గన్ ఇదిలా ఉంటే.. టాప్ రన్ స్కోరర్ల జాబితాలో.. 711 పరుగులతో కోహ్లి అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఇక రోహిత్ శర్మ 550 రన్స్తో ఐదు, శ్రేయస్ అయ్యర్ 526 పరుగులతో ఏడు, కేఎల్ రాహుల్ 386 పరుగులతో పద్నాలుగవ స్థానాల్లో ఉన్నారు. -
CWC 2023 : శ్రీలంకపై 302 పరుగులతో టీమిండియా ఘనవిజయం (ఫొటోలు)
-
షమీ 5 కోహ్లి 95 భారత్ 5
1, 2, 3, 4, 5... ఐదు మ్యాచ్లు మనవే! మైదానంలోకి దిగిన ప్రతీసారి విజయం మన జట్టునే వరించింది... ఆ్రస్టేలియా, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్ లెక్క కూడా తేల్చేశాం... ఐదుసార్లూ ప్రత్యర్థి లక్ష్యాన్ని నిర్దేశిస్తే అన్నింటినీ ఛేదించేశాం... ఫలితంగా వరల్డ్ కప్లో టీమిండియా తిరుగులేని ప్రదర్శనతో మళ్లీ పైచేయి సాధించింది... టోర్నీలో ఇప్పటి వరకు అజేయంగా ఉన్న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సమరంలో రోహిత్ బృందానికే గెలుపు దక్కింది. ప్రపంచకప్లో 20 మ్యాచ్లు జరిగినా హోరాహోరీ సమరం కనిపించలేదనేవారికి ఈ మ్యాచ్ సమాధానం ఇచ్చింది. పలు మలుపులతో ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్లో 12 బంతుల ముందు భారత్ గట్టెక్కింది. 19/2 నుంచి 243/4కు చేరిన కివీస్ను 273కే పరిమితం చేసి భారత్ పైచేయి సాధించింది. గత మ్యాచ్లకు భిన్నంగా కొంత తడబడి ఆరు వికెట్లు చేజార్చుకున్నా... చివరకు ఫలితం దక్కింది. టోర్నీలో తాను ఆడిన తొలి మ్యాచ్లో షమీ 5 వికెట్లతో చెలరేగగా... కోహ్లి తనదైన శైలిలో నిలబడి పరుగులను వేటాడినా త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. ధర్మశాల: వన్డే ప్రపంచకప్లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆడిన ఐదో మ్యాచ్లోనూ గెలుపు బావుటా ఎగరేసిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. డరైల్ మిచెల్ (127 బంతుల్లో 130; 9 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీ సాధించగా, రచిన్ రవీంద్ర (87 బంతుల్లో 75; 6 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ షమీ (5/54) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని నిలువరించాడు. అనంతరం భారత్ 48 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసి గెలిచింది. విరాట్ కోహ్లి (104 బంతుల్లో 95; 8 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగగా, రోహిత్ శర్మ (40 బంతుల్లో 46; 4 ఫోర్లు, 4 సిక్స్లు), రవీంద్ర జడేజా (44 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. భారత్ తమ తర్వాతి మ్యాచ్లో ఈనెల 29న లక్నోలో ఇంగ్లండ్తో తలపడుతుంది. భారీ భాగస్వామ్యం... ఆరంభంలోనే న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాన్వే (0)ను సిరాజ్ అవుట్ చేయగా, ఈ ప్రపంచకప్లో తాను వేసిన తొలి బంతికే యంగ్ (17)ను షమీ అవుట్ చేశాడు. అయితే రచిన్, మిచెల్ మూడో వికెట్ భాగస్వామ్యం కివీస్ను కోలుకునేలా చేసింది. మరో 25 ఓవర్లపాటు వీరిద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు టోర్నీలో ప్రత్యర్థి బ్యాటర్లందరినీ కట్టడి చేసిన కుల్దీప్ బౌలింగ్లో వీరు వేగంగా పరుగులు రాబట్టారు. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రచిన్ ఇచ్చిన (షమీ బౌలింగ్లో) సునాయాస క్యాచ్ను జడేజా వదిలేశాడు! దీనిని రచిన్ సమర్థంగా వాడుకున్నాడు. ఈ క్రమంలో 56 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాత 60 బంతుల్లో మిచెల్ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఆ తర్వాతా వీరిద్దరు ధాటిని ప్రదర్శించడంతో భాగస్వామ్యం 150 పరుగులు దాటింది. 69 పరుగుల వద్ద మిచెల్ ఇచ్చిన సులువైన క్యాచ్ను బుమ్రా నేలపాలు చేశాడు. ఎట్టకేలకు రచిన్ను వెనక్కి పంపి షమీ ఈ జోడీని విడదీశాడు. లాథమ్ (5) విఫలం కాగా 100 బంతుల్లో మిచెల్ శతకాన్ని అందుకొని ప్రపంచకప్లో భారత్పై సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా నిలిచాడు. అయితే ఆ తర్వాత కివీస్ పతనం వేగంగా సాగింది. 243/4తో మెరుగైన స్థితిలో కనిపించిన జట్టు భారత బౌలర్ల ధాటికి చివరి 6 ఓవర్లలో 30 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. జడేజా అండగా... భారత్కు ఛేదనలో రోహిత్ మరోసారి అద్భుత ఆరంభాన్ని అందించాడు. బౌల్ట్, హెన్రీల బౌలింగ్లో చెలరేగి ఫోర్లు, సిక్సర్లతో దూసుకుపోయాడు. అతనికి శుబ్మన్ గిల్ (31 బంతుల్లో 26; 5 ఫోర్లు) అండగా నిలిచాడు. అయితే ఫెర్గూసన్ 7 బంతుల వ్యవధిలో వీరిద్దరిని వెనక్కి పంపాడు. ఈ దశలో కోహ్లి పట్టుదలగా నిలబడిన తీరు భారత్కు గెలుపు అవకాశాలు సృష్టించింది. శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 33; 6 ఫోర్లు), కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 27; 3 ఫోర్లు)లతో పాటు చివర్లో జడేజాతో కోహ్లి మూడు అర్ధసెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం. ఆరంభంలో నెమ్మదిగా ఆడి ఒకదశలో 47 బంతుల్లో 28 పరుగులే చేసిన కోహ్లి ఆ తర్వాత దూకుడు పెంచాడు. 60 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. సమన్వయలోపంతో సూర్యకుమార్ (2) రనౌటైన తర్వాత కోహ్లి, టోర్నీలో తొలిసారి బ్యాటింగ్కు దిగిన జడేజా జత కలిశారు. ఆ సమయంలో 16.1 ఓవర్లలో మరో 83 పరుగులు చేయాల్సి ఉంది. ఈ స్థితిలో వీరిద్దరు ప్రశాంతంగా ఆడుతూ జట్టును లక్ష్యంవైపు నడిపించారు. కివీస్ బౌలర్లు అప్పుడప్పుడు కొన్ని మంచి బంతులతో ఒత్తిడి పెంచగలిగినా... భారత్ గెలుపును ఆపలేకపోయారు. పాండ్యా, శార్దుల్ స్థానాల్లో షమీ, సూర్యకుమార్ ఈ మ్యాచ్లో జట్టులోకి వచ్చారు. ఈసారి సెంచరీ దక్కలేదు! మ్యాచ్లో ఒకవైపు భారత్ గెలుపు అవకాశాలు మెరుగవుతూ రాగా, మరోవైపు కోహ్లి సెంచరీ చేసి సచిన్ను సమం చేస్తాడా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్లో రాహుల్లాగే ఈసారి జడేజా కూడా సహకరించడంతో ఆఖర్లో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు కోహ్లి ఒక్కడే చేసి శతకానికి చేరువయ్యాడు. జట్టుకు 35, కోహ్లికి 25 పరుగులు అవసరమైనప్పుడు ఉత్కంఠ పెరిగింది. ఆపై ఈ సమీకరణం 19 పరుగులు, 18 పరుగులకు మారింది. అయితే బౌల్ట్ వేసిన 47వ ఓవర్లో కోహ్లి 6, 4 సహా 11 పరుగులు రాబట్టి 93కు చేరుకున్నాడు. ఇప్పుడు 7 పరుగులు కావాల్సి ఉండగా తొలి బంతికి కోహ్లి 2 పరుగులు తీశాడు. అయితే మూడో బంతిని భారీ సిక్సర్గా మలచి ముగించే ప్రయత్నంలో బౌండరీ లైన్కు చాలా ముందే క్యాచ్ ఇచ్చాడు. దాంతో అతను ప్రస్తుతానికి 48 సెంచరీల వద్దే నిలిచాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) అయ్యర్ (బి) సిరాజ్ 0; యంగ్ (బి) షమీ 17; రచిన్ (సి) గిల్ (బి) షమీ 75; మిచెల్ (సి) కోహ్లి (బి) షమీ 130; లాథమ్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 5; ఫిలిప్స్ (సి) రోహిత్ (బి) కుల్దీప్ 23; చాప్మన్ (సి) కోహ్లి (బి) బుమ్రా 6; సాన్ట్నర్ (బి) షమీ 1; హెన్రీ (బి) షమీ 0; ఫెర్గూసన్ (రనౌట్) 1; బౌల్ట్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 273. వికెట్ల పతనం: 1–9, 2–19, 3–178, 4–205, 5–243, 6–257, 7–260, 8–260, 9–273, 10–273. బౌలింగ్: బుమ్రా 10–1–45–1, సిరాజ్ 10–1– 45–1, షమీ 10–0–54–5, జడేజా 10–0– 48–0, కుల్దీప్ 10–0–73–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) ఫెర్గూసన్ 46; గిల్ (సి) మిచెల్ (బి) ఫెర్గూసన్ 26; కోహ్లి (సి) ఫిలిప్స్ (బి) హెన్రీ 95; అయ్యర్ (సి) కాన్వే (బి) బౌల్ట్ 33; రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సాన్ట్నర్ 27; సూర్యకుమార్ (రనౌట్) 2; జడేజా (నాటౌట్) 39; షమీ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (48 ఓవర్లలో 6 వికెట్లకు) 274. వికెట్ల పతనం: 1–71, 2–76, 3–128, 4–182, 5–191, 6–269. బౌలింగ్: బౌల్ట్ 10–0–60–1, హెన్రీ 9–0–55–1, సాన్ట్నర్ 10–0–37–1, ఫెర్గూసన్ 8–0–63–2, రచిన్ 9–0–46–0, ఫిలిప్స్ 2–0–12–0. ప్రపంచకప్లో నేడు పాకిస్తాన్ Xఅఫ్గానిస్తాన్ వేదిక: చెన్నై మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
‘శార్దూల్ ఎందుకు? సిరాజ్ను ఎందుకు ఆడిస్తున్నారు?.. అసలేంటి ఇదంతా?’
ICC WC 2023- Team India: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్కు భారత మాజీ పేసర్ శ్రీశాంత్ అండగా నిలిచాడు. మేనేజ్మెంట్ అన్నీ ఆలోచించిన తర్వాతే తుదిజట్టును ఎంపిక చేస్తుందని.. మ్యాచ్ సాగుతున్న తీరును బట్టి విమర్శలు చేయడం సరికాదని హితవు పలికాడు. కొంతమంది ‘టోపీ మాస్టర్లు’ మాత్రం అంతా తమకే తెలుసునన్నట్లు మాట్లాడతారంటూ సిరాజ్ను విమర్శించిన వారిపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై సిరాజ్ ఒక వికెట్ తీయగలిగాడు. అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో ధారాళంగా పరుగులిచ్చి పవర్ ప్లేలో మ్యాజిక్ చేయలేకపోయినప్పటికీ 6.3 ఓవర్లలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగానే బౌలింగ్ చేశాడు. అయితే, రెండో మ్యాచ్లో మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అఫ్గనిస్తాన్తో ఢిల్లీలోని అరుణ్జైట్లీ మైదానంలో బుధవారం జరిగిన మ్యాచ్లో సిరాజ్ ఏకంగా 76 పరుగులిచ్చాడు. 9 ఓవర్ల బౌలింగ్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో.. మహ్మద్ షమీని కాదని సిరాజ్ను ఎంపిక చేసి మేనేజ్మెంట్ తప్పుచేసిందంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన కేరళ మాజీ బౌలర్ శ్రీశాంత్.. ‘‘మ్యాచ్ మొదలుకావడానికి ముందు.. అసలేంటి ఇదంతా? ‘‘అయ్యో.. శార్దూల్ను ఎందుకు ఆడిస్తున్నారు? అంటూ గగ్గోలుపెట్టారు. మ్యాచ్ మొదలైన తర్వాత.. సిరాజ్ పరుగులిస్తూ ఉంటే.. ‘‘ఈరోజు సిరాజ్ను ఎందుకు ఆడిస్తున్నారు?’’ అంటూ కామెంట్లు చేశారు. వాళ్లంతా ‘టోపీ మాస్టర్లు’. ఇదిలా ఉంటే.. కెమెరా మాటిమాటికీ షమీ, అశ్విన్పైకి గురిపెట్టి చూపిస్తూనే ఉండటం దేనికి సంకేతం. యాజమాన్యం ఎంపిక చేసిన జట్టుకు మనం మద్దతుగా నిలవాలి కదా!’’ అని స్పోర్ట్స్కీడాతో చెప్పుకొచ్చాడు. కాగా అఫ్గన్తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. తదుపరి పాకిస్తాన్తో వెటరన్ స్పిన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో.. పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆడాడు. ఈ క్రమంలో అశూను కాదని శార్దూల్ను ఎందుకు ఆడిస్తున్నారంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు కెప్టెన్ రోహిత్ శర్మ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మరికొందరు సిరాజ్ను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఆసీస్ మీద 6, అఫ్గనిస్తాన్ మీద 8 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా అక్టోబరు 14న పాకిస్తాన్తో మ్యాచ్కు సిద్ధమవుతోంది. చదవండి: WC: క్యాన్సర్తో పోరాడుతూ వరల్డ్కప్ ఆడాను.. డెంగ్యూ వల్ల గిల్..: యువీ -
Ind vs Pak: అతడి బ్యాటింగ్ అంతగొప్పగా ఏమీ ఉండదు.. షమీని ఆడించండి!
ICC WC 2023- Ind vs Pak: ‘‘శార్దూల్ ఠాకూర్.. మహ్మద్ షమీ వీరిద్దరిలో ఎవరిని ఆడిస్తారనే చర్చ ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. అయితే, చాలాసార్లు మేనేజ్మెంట్ శార్దూల్ వైపే మొగ్గు చూపుతుంది. ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేస్తాడు గనుక షమీని కాదని అతడిని తీసుకుంటారని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. అయితే, అఫ్గనిస్తాన్ వంటి జట్టుతో మ్యాచ్లో కూడా నంబర్ 8లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుందా? అంటే లేదనే సమాధానం చెప్పొచ్చు. లేదంటే.. కొంతమంది బిగ్షాట్లు ఆడే ప్లేయర్లు ఉంటారు.. వాళ్లు లేకపోతే ఓటమి ఎదురవుతుందనే సందర్భాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. అంత గొప్ప బ్యాటరేమీ కాదు! కానీ.. ఇలాంటి టీమ్స్తో ఆడినపుడు లోయర్ ఆర్డర్ వరకు బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉందనుకుంటే పొరబడినట్లే! నిజానికి శార్దూల్ ఏమీ గొప్ప బ్యాటర్ కాదు. ఎనిమిదో నంబర్లో అతడు కేవలం రన్-ఏ- బాల్ ప్లేయర్ మాత్రమే. 20 బంతుల్లో 45 పరుగులు రాబట్టే రకమేమీ కాదు. అతడు అలా ఆడలేడు కూడా! ఏదేమైనా బ్యాటింగ్ ఆర్డర్లో ఎనిమిదో స్థానం వరకు డెప్త్ ఉండాలనుకుంటే వాళ్లు శార్దూల్ ఆడిస్తారు. కానీ నా అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్తో మ్యాచ్లో శార్దూల్ కంటే షమీ అవసరమే ఎక్కువగా ఉంటుంది. తదుపరి మ్యాచ్లో అతడిని తప్పక ఆడించాలి’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో చెన్నైలో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. చెపాక్లో అశ్విన్.. ఢిల్లీలో శార్దూల్ చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ‘లోకల్ స్టార్’ రవిచంద్రన్ అశ్విన్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, ఢిల్లీలో అఫ్గనిస్తాన్తో రెండో మ్యాచ్లో అశ్విన్ స్థానంలో పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను జట్టులోకి తీసుకుంది. అరుణ్జైట్లీ స్టేడియంలో అదనపు సీమర్ అవసరమన్న విశ్లేషణల నడుమ ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న శార్దూల్ వైపు మొగ్గు చూపింది. అయితే, అఫ్గనిస్తాన్పై మంచి రికార్డు ఉన్న షమీని కాదని శార్దూల్ను తీసుకోవడం సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలకు నచ్చలేదు. పాక్తో మ్యాచ్లో షమీని ఆడిస్తేనే బెటర్ ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తన యూట్యూబ్ చానెల్ వేదికగా పైవిధంగా స్పందించాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో మహ్మద్ షమీని ఆడిస్తేనే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. కాగా ఆసీస్పై 6 వికెట్లు, అఫ్గన్పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది ఫుల్జోష్లో ఉన్న టీమిండియా అక్టోబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో పోరుకు సిద్ధమవుతోంది. అహ్మదాబాద్లోని దాదాపు లక్ష సీట్ల సామర్థ్యం గల నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. ఇక పాకిస్తాన్ సైతం ఆడిన రెండు మ్యాచ్లలో విజయాలు సాధించి జోరు మీదున్న విషయం తెలిసిందే. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి చదవండి: WC 2023- Ind Vs Pak: పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు టీమిండియాకు గుడ్న్యూస్! కానీ.. -
టీమిండియా పేసర్ షమీకి భారీ షాక్! కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ నుంచి విడిగా ఉంటున్న అతడి భార్య హసీన్ జహాన్ పిటిషన్పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హసీన్ జహాన్ పిటిషన్పై విచారణ చేపట్టి నెలరోజుల్లోగా కేసును పరిష్కరించాలని పశ్చిమ బెంగాల్ సెషన్స్ కోర్టును ఆదేశించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఏళ్లకు ఏళ్లు ఈ కేసును సాగదీయడం సరికాదని ఈ సందర్భంగా అభిప్రాయపడింది. కాగా షమీపై సంచలన ఆరోపణలు చేస్తూ గృహహింస కేసు పెట్టిన హసీన్ జహాన్.. అతడి అరెస్టును అడ్డుకునే స్టేను ఎత్తివేయాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీం కోర్టు గురువారం ఆమె పిటిషన్పై విచారణ జరిపింది. కేసును సాగదీయకుండా సత్వరమే పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ సెషన్స్ కోర్టును ఆదేశించింది. కాగా షమీపై హసీన్ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో 2019, ఆగష్టు 29న అలీపూర్ అడిషినల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ సెషన్స్ కోర్టును ఆశ్రయించిన షమీ సెప్టెంబరు 9న తన అరెస్టుపై స్టే విధించాల్సిందిగా కోరాడు. అదే విధంగా తనపై ఎలాంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశాడు. ఆ తర్వాత హసీన్ ఈ విషయమై హైకోర్టును సంప్రదించగా అక్కడ చుక్కెదురైంది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇక ఇదంతా జరిగి నాలుగేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ కేసు అపరిష్కృతంగా ఉంది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ.. నెలరోజుల్లోగా కేసును పరిష్కరించాలని.. ఒకవేళ అది వీలుపడకపోతే స్టే ఆర్డర్లో మార్పులు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని సెషన్స్ కోర్టు జడ్జిని ఆదేశించింది. చదవండి: Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్ -
అతడి సేవలను సన్రైజర్స్ సరిగ్గా వాడుకోవడం లేదు! కనీస మద్దతు లేకుండా..
IPL 2023 SRH: టీమిండియా యువ సంచలనం, కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ సేవలను సన్రైజర్స్ హైదరాబాద్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుందని భారత మాజీ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ అన్నాడు. లోపం ఎక్కడ ఉందో అర్థం కావడం లేదని వాపోయాడు. కాగా నెట్ బౌలర్గా సన్రైజర్స్ జట్టులో చేరిన ఉమ్రాన్.. తన అద్భుతమైన ఆట తీరుతో అనతికాలంలోనే ప్రధాన బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. Photo Credit : IPL Website నెట్ బౌలర్గా వచ్చి..! ఏకంగా టీమిండియాలో కచ్చితమైన వేగంతో బంతులు విసిరే ఈ స్పీడ్స్టర్ ఐపీఎల్-2021 సీజన్లో కేకేఆర్తో మ్యాచ్ ద్వారా రైజర్స్ తరఫున అరంగేట్రం చేశాడు. గతేడాది 14 ఇన్నింగ్స్లో 22 వికెట్లు పడగొట్టిన అతడు.. అదే ఏడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఉమ్రాన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం ఏడు మ్యాచ్లు ఆడిన అతడు 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో ఏప్రిల్ 29 నాటి మ్యాచ్ తర్వాత అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. కెప్టెన్కే తెలియదట ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్కు ముందు రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ మాట్లాడుతూ.. ఉమ్రాన్ ఆడకపోవడం వెనుక కారణమేమిటో తెలియదని వ్యాఖ్యానించాడు. మార్కరమ్ తీరు పలు సందేహాలకు తావిచ్చింది. ఈ క్రమంలో జియో సినిమా షోలో జహీర్ ఖాన్ ఈ విషయంపై స్పందించాడు. ఉమ్రాన్ విషయంలో సన్రైజర్స్ ఎందుకిలా?! ‘‘సన్రైజర్స్ ఫ్రాంఛైజీ ఉమ్రాన్ సేవలను సరిగ్గా వాడుకోలేకపోతోంది. ఇందుకు కారణమేమిటో మాత్రం తెలియడం లేదు. యువ సీమర్లను జట్టులో ఉంచుకున్నపుడు.. వారికి అవసరమైన సమయంలో అన్ని రకాలుగా మద్దతుగా నిలబడాలి. లోపాలను సరిచేసుకునేందుకు సరైన వ్యక్తితో మార్గదర్శనం చేయించాలి. కానీ దురదృష్టవశాత్తూ ఉమ్రాన్ విషయంలో ఫ్రాంఛైజీ ఇవేమీ చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఈ సీజన్లో అతడి ఆట తీరు, పలు మ్యాచ్లకు పక్కన పెట్టిన విధానం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది’’ అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. వాళ్లిద్దరు సూపర్ ఇదిలా ఉంటే.. టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, హైదరాబాదీ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పవర్ ప్లేలో అద్భుతాలు చేస్తున్నారని జహీర్ కొనియాడాడు. పెద్దగా కష్టపడకుండా బ్యాటర్లను తిప్పలు పెడుతూ అనుకున్న ఫలితాలు రాబడుతున్నారంటూ షమీ, సిరాజ్లను కొనియాడాడు. కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 13 మ్యాచ్లలో 23 వికెట్లు తీసిన షమీ.. పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. ఇక సిరాజ్ 13 మ్యాచ్లలో 17 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్రైజర్స్ ఆర్సీబీతో మ్యాచ్లోనూ ఓడిపోయి పదో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: రూ. 8 కోట్లు పెడితే మధ్యలోనే వదిలివెళ్లాడు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు! ఇది క్రికెట్ షోనా? లేదంటే.. అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ..! సిగ్గుండాలి! -
నక్క తోక తొక్కిన వార్నర్..
ఐపీఎల్ 16వ సీజన్లో మంగళవారం గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా మొదలైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీకి షమీ తొలి ఓవర్లో వార్నర్కు చుక్కలు చూపించాడు. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వార్నర్ నక్క తోక తొక్కినట్లున్నాడు. ఓవర్ తొలి బంతిని వైడ్ వేసిన షమీ ఆ తర్వాత బంతిని మాత్రం అద్బుతంగా వేశాడు. మిడిల్ స్టంప్ అయిన బంతి ఆఫ్స్టంప్ను తాకుతూ కీపర్ సాహా చేతుల్లోకి వెళ్లింది. కానీ బెయిల్స్ ఇంచు కూడా కదల్లేదు. దీంతో వార్నర్ బతికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ తర్వాత వార్నర్ 32 బంతుల్లో 37 పరుగులు చేసి అల్జారీ జోసెఫ్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. pic.twitter.com/ujy9abVzAX — Guess Karo (@KuchNahiUkhada) April 4, 2023 -
వింతగా ప్రవర్తించిన టీమిండియా అభిమానులు..
అహ్మదాబాద్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆట తొలి రెండు రోజులు ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చూపించింది. ఉస్మాన్ ఖవాజా 180 పరుగులతో టీమిండియాపై కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడగా.. కామెరాన్ గ్రీన్ డెబ్యూ టెస్టు శతకంతో చెలరేగాడు. వెరసి ఆస్ట్రేలియా సిరీస్లో తొలిసారి 400 పరుగులు మార్క్ను చేరుకుంది. టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడంలో చెమటోడ్చారు. ఆ తర్వాత కూడా టెయిలెండర్లు ప్రతిఘటించడంతో 480 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ ఆరు వికెట్లతో చెలరేగాడు. ఇక రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. మూడోరోజు ఆట టీమిండియాకు కీలకం కానుంది. ఇక రెండోరోజు ఆటలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్కు హాజరైన అభిమానులు కాస్త వింతగా ప్రవర్తించారు. రెండో రోజు చివరి సెషన్లో సూర్యకుమార్ కనిపించగానే సూర్య.. సూర్య అంటూ గట్టిగా అరిచారు. ఆ తర్వాత మహ్మద్ షమీ కనిపించగానే షమీ.. జై శ్రీరామ్.. షమీ.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అయితే షమీ దీనిని పెద్దగా పట్టించుకోకుండా అభివాదం చేశాడు. ముస్లిం, హిందులకు ప్రతీకగానే జై శ్రీరామ్ నినాదాలు చేసినట్లు ఒక అభిమాని వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గర్వంగా చెప్పుకున్నాడు. ఇక షమీ పీటర్ హ్యాండ్స్కోబ్తో పాటు మార్నస్ లబుషేన్ వికెట్లు సాధించాడు. ముఖ్యంగా పీటర్ హ్యాండ్స్కోబ్ను ఔట్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఆసీస్ ఇన్నింగ్స్ 71 ఓవర్ వేసిన షమీ బౌలింగ్లో నాలుగో బంతిని హ్యాండ్స్కాంబ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే మంచి లైన్ అండ్ లెంగ్త్లో పడ్డ బంతి బ్యాట్ను మిస్స్ అయి ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. Shami Ko Jai Shree Ram 🚩 pic.twitter.com/rwVg1yMEaz — Gems of Shorts (@Warlock_Shabby) March 9, 2023 చదవండి: రెండోరోజు ఆట ముగింపు.. కోహ్లి చర్య వైరల్ 'బ్యాటర్గా విఫలం.. ఓటములకు పూర్తి బాధ్యత నాదే' -
షమీ చెవులు పిండిన అశ్విన్.. ఫోటో వైరల్
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదలైన రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆట తొలిరోజునే టీమిండియా బౌలర్లు మంచి ప్రదర్శన కనబరచడంతో ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యేలా కనిపిస్తోంది. అయితే తొలి టెస్టుతో పోలిస్తే ఆసీస్ బ్యాటర్లు కాస్త ప్రతిఘటించారు తప్ప మరోసారి స్పిన్ ఉచ్చులో పడిపోయారు. జడేజా, అశ్విన్లకు తోడు షమీ కూడా రాణించడంతో ఆస్ట్రేలియా పరుగులు చేసినప్పటికి వికెట్లు కోల్పోయింది. ఈ సంగతి పక్కనబెడితే ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ను షమీ దక్కించుకున్నాడు. 10 పరుగులు చేసిన నాథన్ లియోన్ అతని బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. షమీ ఖాతాలో ఇది మూడో వికెట్. సెలబ్రేషన్ సమయంలో షమీ వెనుక వచ్చి నిల్చున్న అశ్విన్ గుడ్ బౌలింగ్ యార్ అంటూ చెవులు పిండాడు. అయితే అశ్విన్ కాస్త గట్టిగా పిండాడనుకుంటా.. నొప్పితో షమీ మొహం మారిపోయింది. అయితే ఇదంతా సరదాగా చేయడంతో టీమిండియా క్రికెటర్ల మధ్య నవ్వులు విరపూశాయి. ఇక రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా స్పిన్నర్లు జడేజా, అశ్విన్లతో పాటు షమీ కూడా చెలరేగడంతో ఆసీస్ తొలిరోజునే తన ఇన్నింగ్స్ను ముగించాల్సి వచ్చింది. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా 81 పరుగులు చేయగా.. పీటర్ హ్యాండ్స్కోబ్ 72 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. షమీ నాలుగు వికెట్లతో చెలరేగగా.. అశ్విన్, జడేజాలు చెరొక మూడు వికెట్లు తీశారు. Ouch 😅 #INDvAUS #RavichandranAshwin #MohammedShami pic.twitter.com/WTDjCMB4Zk — CricTelegraph (@CricTelegraph) February 17, 2023 చదవండి: పుజారా వందో టెస్టు.. కుటుంబం మొత్తం స్టేడియంలో 'చేసేయాల్సింది ఒక పనైపోయేది..' -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. 108 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్
రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. మహ్మద్ షమీ (3/18), మహ్మద్ సిరాజ్ (1/10), శార్దూల్ ఠాకూర్ (1/26), హార్ధిక్ పాండ్యా (2/16), కుల్దీప్ యాదవ్ (1/29), వాషింగ్టన్ సుందర్ (2/7) విజృంభించడంతో 34.3 ఓవర్లలోనే కివీస్ను ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. తొలి వన్డే సెంచరీ హీరో బ్రేస్వెల్ ఈ మ్యాచ్లోనూ చెలరేగేలా కనిపించినప్పటికీ.. అతన్ని షమీ బోల్తా కొట్టించాడు. కివీస్ ఇన్నింగ్స్లో ఫిన్ అలెన్ (0), డెవాన్ కాన్వే (7), హెన్రీ నికోల్స్ (2), డారిల్ మిచెల్ (1), టామ్ లాథమ్ (1), ఫెర్గూసన్ (1), బ్లెయిర్ టిక్నర్ (2) విఫలమయ్యారు. కాగా, హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 3 మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
కివీస్ దారుణ ఆటతీరు.. చెత్త రికార్డు నమోదు
రాయ్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ దారుణ ఆటతీరును ప్రదర్శిస్తోంది. తొలి వన్డేలో పోరాడిన జట్టేనా ఇప్పుడు ఆడుతుంది అన్న తరహాలో కివీస్ బ్యాటింగ్ సాగుతుంది. ప్రస్తుతం 22 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. గ్లెన్ పిలిప్స్ 20, మిచెల్ సాంట్నర్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్లో సెంచరీతో ఆకట్టుకున్న మైకెల్ బ్రాస్వెల్ ఈ మ్యాచ్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. టీమిండియా బౌలర్ల దాటికి కివీస్ టాపార్డర్ కకావికలమైంది. మహ్మద్ షమీ తన పేస్ పదును చూపిస్తూ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, పాండ్యా, శార్దూల్ ఠాకూర్లు తలా ఒక వికెట్ తీశారు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ వన్డేల్లో ఒక చెత్త రికార్డు నమోదు చేసింది. టీమిండియాతో వన్డేలో 15 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన కివీస్కు ఇదే అత్యల్పం. ఇంతకముందు 2001లో శ్రీలంకతో మ్యాచ్లో 18 పరుగులకు ఐదు వికెట్లు, 2010లో బంగ్లా తో మ్యాచ్లో 20 పరుగులకు ఐదు వికెట్లు, 2003లో ఆస్ట్రేలియాపై 21 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. చదవండి: రోహిత్ శర్మ.. ఇంత మతిమరుపా!
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మానసిక వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ వడ్డాది
300 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతుల పంపిణీ
పేరంటాలమ్మ తిరునాళ్లు
ప్రాణం తీసిన ఈత సరదా
టీడీపీ నాయకులపై అట్రాసిటీ కేసు
రేపు ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ మెగా లోన్ మేళా
దాత సహకారంతో నిర్మాణం
సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్
మహిళల స్వయం సమృద్ధికి పనికల్పన : డీఈఓ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష షురూ
తప్పక చదవండి
- MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
- కవితపై ఈడీ చార్జిషీట్.. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- వారి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్న పాయల్ రాజ్పుత్
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- సానుకూల సంకేతాలు
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement