Mohammad Shami
-
పాక్తో మ్యాచ్లో అతడిని ఆడించాల్సింది.. కానీ: గావస్కర్
బంగ్లాదేశ్పై గెలుపొంది చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)ని విజయంతో ఆరంభించింది టీమిండియా. రెండో మ్యాచ్లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో రోహిత్ సేన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)ను ఢీకొట్టింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ భారత జట్టును తొలుత ఫీల్డింగ్కు ఆహ్వానించింది.ఆ నలుగురు మళ్లీ బెంచ్ మీదేఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. బంగ్లాదేశ్తో ఆడిన తుదిజట్టునే పాక్తో మ్యాచ్లోనూ కొనసాగించింది. స్టార్ ప్లేయర్లు రిషభ్ పంత్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్కు మరోసారి మొండిచేయి చూపింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టాస్ సమయంలో స్పోర్ట్స్ ప్రజెంటర్ మయాంతి లాంగర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు.ఒక్క మార్పు చేసి ఉంటే బాగుండేది..‘‘అయినా.. వాళ్లెందుకు తుదిజట్టులో మార్పులు చేయాలి? ఇది స్లో వికెట్. అంతేగాక ప్రస్తుత ప్లేయింగ్ ఎలెవన్తోనే వారు గత మ్యాచ్ గెలిచారు. అయితే, ఒక్క మార్పు చేసి ఉంటే బాగుండేది. వరుణ్ చక్రవర్తిని పాకిస్తాన్తో మ్యాచ్లో ఆడించి ఉండాల్సింది. కానీ గత మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన మహ్మద్ షమీని ఎలా పక్కనపెట్టగలరు?అంతేగాక.. మరో పేసర్ హర్షిత్ రాణా కూడా గత మ్యాచ్లో ఎలాంటి తప్పిదాలు చేయలేదు. అందుకే టీమిండియాపాక్తో పోరులోనూ అదే జట్టుతో బరిలోకి దిగింది’’ అని సునిల్ గావస్కర్ నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ మాత్రం ఒక మార్పుతో మైదానంలో దిగింది. ఆరంభ మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడిన సమయంలో ఫఖర్ జమాన్ గాయపడగా.. భారత్తో మ్యాచ్లో సౌద్ షకీల్తో అతడి స్థానాన్ని భర్తీ చేసింది.2017లో చివరిసారిగాకాగా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్- పాకిస్తాన్ 2017లో చివరిసారిగా తలపడ్డాయి. నాడు లీగ్ దశలో టీమిండియా గెలుపొందగా.. ఫైనల్లో మాత్రం పాకిస్తాన్ భారత జట్టును ఓడించిన టైటిల్ ఎగురేసుకపోయింది. ఈ క్రమంలో దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మరోసారి చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండగా. ఆతిథ్య జట్టు హోదాలో డిఫెండింగ్ చాంపియన్గా పాక్ బరిలోకి దిగింది.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడుతోంది. ఇక ఈ మెగా టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ ట్రోఫీ కోసం తలపడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో పాకిస్తాన్పై న్యూజిలాండ్, బంగ్లాదేశ్పై భారత్, అఫ్గనిస్తాన్పై సౌతాఫ్రికా, ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా గెలుపొందాయి. పాయింట్ల పట్టికలో గ్రూప్-ఎ నుంచి న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి సౌతాఫ్రికా టాప్లో ఉన్నాయి.పాకిస్తాన్తో మ్యాచ్లో భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్సౌద్ షకీల్, బాబర్ ఆజం, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహిన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.చదవండి: షమీ చెత్త రికార్డు.. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే.. -
ఇంగ్లండ్తో ఐదో టీ20.. భారత జట్టులో కీలక మార్పులు! వారికి ఛాన్స్?
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. ఈ సిరీస్లో ఆఖరి టీ20 ఇరు జట్ల మధ్య ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ను 4-1తో ముగించాలని భారత జట్టు భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. కాగా ఇప్పటికే ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ ఇప్పటికే 3-1 తేడాతో సొంతం చేసుకుంది.ఈ క్రమంలో నామమాత్రపు మ్యాచ్ అయితే ఐదో టీ20లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. నాలుగో టీ20కు దూరమైన స్టార్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ జట్టుతో వన్డే సిరీస్కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం అతడిని ఆడించాలని జట్టు మెనెజ్మెంట్ భావిస్తోంది. ఈ విషయాన్ని భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ ధ్రువీకరించాడు.కాగా షమీ తుది జట్టులోకి వస్తే అర్ష్దీప్ సింగ్ బెంచ్కు పరిమితం కావాల్సి ఉంటుంది. మరోవైపు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వారిద్దరి స్ధానంలో రమణ్దీప్ సింగ్, హర్షిత్ రాణా తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. కాగా గత కంకషన్కు గురైన శివమ్ దూబే ప్రస్తుతం కోలుకోనున్నట్లు సమాచారం. అతడు వాంఖడే టీ20లో కూడా ఆడే సూచనలు కన్పిస్తున్నాయి.సూర్య, సంజూ మెరుస్తారా?ఇక పేలవ ఆట తీరుతో నిరాశపరుస్తున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఓపెనర్ సంజూ శాంసన్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ సిరీస్కు ముందు వరుస సెంచరీలతో సత్తాచాటిన శాంసన్.. స్వదేశంలో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ సిరీస్లో నాలుగు మ్యాచ్లు ఆడిన సంజూ కేవలం 35 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగు మ్యాచ్ల్లో కూడా బౌన్సర్ బంతులకే సంజూ ఔట్ కావడం గమనార్హం. మరోవైపు సూర్యది కూడా అదే తీరు. సూర్యకుమార్ నాలుగు మ్యాచ్ల్లో 26 పరుగులే చేశాడు. దీంతో ఈ మ్యాచ్లో వీరిద్దరూ రాణించాల్సిన అవసరముంది. కాగా బ్యాటింగ్కు అనుకూలించే వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పారే అవకాశముంది. టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది.ఐదో టీ20కు భారత తుది జట్టు(అంచనా): సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, రమణ్దీప్ సింగ్, శివమ్ దూబే, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీచదవండి: నా భార్య లైవ్ చూస్తోంది.. నేను ఆ విషయం చెప్పలేను: రోహిత్ శర్మ -
షమీకి విశ్రాంతి.. టీమిండియా రీ ఎంట్రీ అప్పుడే!
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మరికొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఈ క్రమంలో విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్లో తొలి మ్యాచ్కు ఈ బెంగాల్ బౌలర్ దూరం కానున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. వన్డే వరల్డ్కప్-2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.మోకాలు ఉబ్బిపోయింది!ఇటీవల జరిగిన దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరఫున షమీ బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో మొత్తం తొమ్మిది మ్యాచ్లు ఆడిన ఈ రైటార్మ్ పేసర్ పదకొండు వికెట్ల తీశాడు. అయితే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా షమీ మరోసారి గాయపడినట్లు సమాచారం. అతడి మోకాలు ఉబ్బిపోయినట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.అందుకే షమీని హడావుడిగా తిరిగి జట్టులోకి చేర్చుకునే పరిస్థితి లేదని.. ఆస్ట్రేలియా పర్యటనకు అతడు మొత్తంగా దూరమయ్యాడనే సంకేతాలు ఇచ్చాడు. అందుకు తగ్గట్లుగానే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్కు ప్రకటించిన బెంగాల్ జట్టులో షమీ పేరు కనిపించింది.విశ్రాంతినిచ్చాంఇక డిసెంబరు 21 నుంచి మొదలుకానున్న ఈ టోర్నీలో బెంగాల్ తొలుత ఢిల్లీ జట్టుతో తలపడనుంది. హైదరాబాద్లోని ఉప్పల్ మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్కు షమీ దూరంగా ఉండనున్నాడు. ‘‘విజయ్ హజారే ట్రోఫీలో మా తొలి మ్యాచ్కు షమీ అందుబాటులో ఉండడు. ఈ టీమిండియా వెటరన్ బౌలర్కు విశ్రాంతినిచ్చాం’’ అని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది.చాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధంఈ పరిణామాల నేపథ్యంలో షమీ ఆస్ట్రేలియా పర్యటనకు పూర్తిగా దూరమైనట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్ ఆడేందుకు అతడు ఫిట్ లేని కారణంగా.. టీమిండియా మేనేజ్మెంట్ మరికొన్నాళ్లపాటు అతడిని పక్కన పెట్టనుందట.ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందు టీమిండియా ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. అప్పుడే షమీ.. భారత జట్టులో పునరాగమనం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా మూడు టెస్టులు ముగిసే సరికి 1-1తో సమంగా ఉంది. తదుపరి మెల్బోర్న్, సిడ్నీల్లో భారత్- ఆసీస్ మధ్య మిగిలిన రెండు టెస్టులు జరుగనున్నాయి.చదవండి: భారత్తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్కు చోటు -
షమీ డబుల్ సెంచరీ
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ పొట్టి ఫార్మాట్లో 200 వికెట్ల అరుదైన మైలురాయిని అధిగమించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో షమీ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్లో షమీ 4 ఓవర్లలో 43 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. టీ20ల్లో షమీ వికెట్ల సంఖ్య ప్రస్తుతం 201గా ఉంది. షమీ 165 టీ20 మ్యాచ్ల్లో వికెట్ల డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ పొట్టి ఫార్మాట్లో 364 వికెట్లు తీశాడు. చహల్ తర్వాత కింద పేర్కొన్న బౌలర్ల 200 అంతకంటే ఎక్కువ టీ20 వికెట్లు తీశారు.పియూశ్ చావ్లా- 319భువనేశ్వర్ కుమార్-310రవిచంద్రన్ అశ్విన్-310అమిత్ మిశ్రా-285హర్షల్ పటేల్-244హర్భజన్ సింగ్-235జయదేవ్ ఉనద్కత్-234అక్షర్ పటేల్-233రవీంద్ర జడేజా-225సందీప్ శర్మ-214అర్షదీప్ సింగ్-203ఉమేశ్ యాదవ్-202మహ్మద్ షమీ-201కుల్దీప్ యాదవ్-200ఓవరాల్గా టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత డ్వేన్ బ్రావోకు దక్కుతుంది. ఈ విండీస్ ఆల్రౌండర్ పొట్టి ఫార్మాట్లో 631 వికెట్లు తీశాడు. బ్రావో తర్వాత రషీద్ ఖాన్ (615), సునీల్ నరైన్ (569) అత్యధిక టీ20 వికెట్లు తీసిన వారిలో ఉన్నారు.బరోడా, బెంగాల్ మ్యాచ్ విషయానికొస్తే.. నిన్న (డిసెంబర్ 11) జరిగిన క్వార్టర్ ఫైనల్-1లో బెంగాల్పై బరోడా 41 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన బెంగాల్ 18 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. బరోడా బౌలర్లు హార్దిక్ పాండ్యా (4-0-27-3), లుక్మన్ మేరీవాలా (3-0-17-3), అతీత్ సేథ్ (4-0-41-3) తలో చేయి వేసి బెంగాల్ పతనాన్ని శాశించారు. బెంగాల్కు గెలిపించేందుకు షాబాజ్ అహ్మద్ (55) విఫలయత్నం చేశాడు.కాగా, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో నిన్నటితో సెమీస్ బెర్త్లు ఖరారయ్యాయి. బరోడా, ముంబై, ఢిల్లీ, మధ్యప్రదేశ్ సెమీస్కు చేరాయి. డిసెంబర్ 13న జరిగే తొలి సెమీఫైనల్లో బరోడా, ముంబై.. అదే రోజు జరిగే రెండో సెమీఫైనల్లో ఢిల్లీ, మధ్యప్రదేశ్ తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్ల్లో గెలిచి జట్లు డిసెంబర్ 15న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
టీమిండియాలోకి షమీ..? ఇప్పట్లో తొందరేమీ లేదు..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం మొహమ్మద్ షమీని టీమిండియాలో చేర్చుకుంటారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ మేరకు.. ఇప్పట్లో షమీని హడావుడి జట్టులో చేర్చుకునే పరిస్థితులు లేవు.షమీ విషయంలో వేచి చేసే ధోరణిని అవళంభించాలని బీసీసీఐ భావిస్తుందట. బోర్డు ప్రస్తుత జట్టులోని బౌలర్లతో సంతృప్తిగా ఉందని సమాచారం. షమీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మరిన్ని మ్యాచ్లు ఆడాలని బీసీసీఐ కోరుకుంటుంది.కాగా, షమీ ఏడాది గ్యాప్ (గాయం) తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఓ రంజీ మ్యాచ్లో షమీ 7 వికెట్లు తీసి రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. రంజీ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన నేపథ్యంలో షమీని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేస్తారని (అప్పటికే జట్టును ప్రకటించారు) అంతా అనుకున్నారు.తొలి టెస్ట్కు ముందు బుమ్రా, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చెప్పిన మాటలు ఇందుకు బలం చేకూర్చాయి. షమీ చాలా దగ్గర నుంచి గమినిస్తున్నాము.. అతనికి సంబంధించిన వారితో నిత్యం టచ్లో ఉన్నామని బుమ్రా, మోర్కెల్ అన్నారు.ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ 295 పరుగుల భారీ తేడాతో ఆసీస్ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్లో చెలరేగిపోయారు. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి సూపర్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 104, సెకెండ్ ఇన్నింగ్స్లో 238 పరుగులకు కుప్పకూలింది. -
మంజ్రేకర్పై మండిపడ్డ మహ్మద్ షమీ.. పోస్ట్ వైరల్
భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీరుపై టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మండిపడ్డాడు. ఇతరుల కోసం జ్ఞానం వృథా చేసుకుని.. తమ గురించి ఆలోచించుకోవడం మర్చిపోవద్దంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. జోస్యం చెప్పడమే లక్ష్యంగా పెట్టుకుంటే బాబా అవతారం ఎత్తితే బాగుంటుందంటూ చురకలు అంటించాడు.నవంబరు 24, 25 తేదీల్లోఐపీఎల్-2025 మెగా వేలం నవంబరు 24, 25 తేదీల్లో జరుగనున్న విషయం తెలిసిందే. సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా జరిగే వేలంపాటకు ముందే పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను ఇప్పటికే విడుదల చేశాయి. ఆ ఐదుగురు మాత్రమేఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ రషీద్ ఖాన్(రూ. 18 కోట్లు ), శుబ్మన్ గిల్(రూ. 16.50 కోట్లు), సాయి సుదర్శన్(రూ. 8.50 కోట్లు), రాహుల్ తెవాటియా(రూ. 4 కోట్లు), షారుఖ్ ఖాన్(రూ. 4 కోట్లు)లను మాత్రమే అట్టిపెట్టుకుని.. షమీని విడిచిపెట్టింది.ఏడాది తర్వాత రీ ఎంట్రీకాగా వన్డే వరల్డ్కప్-2023లో సత్తా చాటిన షమీ.. ఆ తర్వాత చీలమండ గాయంతో ఆటకు దూరమయ్యాడు. శస్త్ర చికిత్స తర్వాత పూర్తిగా కోలుకోలేకపోయిన షమీ దాదాపు ఏడాది తర్వాత ఇటీవలే బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. బాల్తోనే గాకుండా బ్యాట్తోనూ సత్తా చాటాడు.షమీ ధర పడిపోవచ్చుఈ పరిణామాల నేపథ్యంలో మెగా వేలానికి ముందు షమీని ఉద్దేశించి కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘షమీపై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయనడంలో సందేమం లేదు. కానీ.. అతడిని గాయాల బెడద వేధిస్తోందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.అతడు కోలుకోవడానికి ఎంత సమయం పట్టిందో మనం చూశాం. కాబట్టి ఇలాంటి ఆటగాడిని కొనుగోలు చేయాలంటే.. ఫ్రాంఛైజీలు కాస్త ఆలోచిస్తాయి. ఒకవేళ ఎవరైనా షమీపై భారీగా పెట్టుబడి పెట్టిన తర్వాత.. మధ్యలోనే అతడు జట్టుకు దూరమైతే..వారికి సరైన ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండవు. అందుకే.. షమీ ధర పడిపోవచ్చు’’ అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.బాబాజీని సంప్రదించండిఇందుకు ఘాటుగా స్పందించిన షమీ ఇన్స్టా స్టోరీలో మంజ్రేకర్ వ్యాఖ్యలను షేర్ చేస్తూ.. ‘‘బాబాకీ జై! మీ భవిష్యత్తు కోసం కూడా కాస్త జ్ఞానాన్ని దాచిపెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటే బాబాజీని సంప్రదించండి’’ అంటూ సెటైర్లు వేశాడు.రూ. 6.25 కోట్లకు కొనుగోలుకాగా ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ షమీని రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ఎడిషన్లో షమీ 16 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ సైతం ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో.. రిషభ్ పంత్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డబ్బు విషయంలో సయోధ్య కుదరకపోవడంతోనే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ను విడిచిపెట్టాడని సన్నీ అంచనా వేశాడు. అయితే, పంత్ ఎక్స్ వేదికగా గావస్కర్ వ్యాఖ్యలను ఖండించాడు. తాజాగా షమీ సైతం అదే పంథాను అనుసరించాడు.చదవండి: IPL 2025 Mega Auction: అతడికి రూ. 25- 28 కోట్లు.. ఆ ఫ్రాంఛైజీ సొంతం చేసుకోవడం ఖాయం!పేసర్లకు కెప్టెన్సీ ఇవ్వాలి.. విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా -
తమ్ముడితో కలిసి అదరగొట్టిన షమీ.. ఆస్ట్రేలియా పయనం అప్పుడే!.. బుమ్రా స్థానంలో?
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ పునరాగమనంలో అదరగొడుతున్నాడు. బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ 2024-25 బరిలో దిగిన ఈ ఫాస్ట్బౌలర్ మధ్యప్రదేశ్తో మ్యాచ్తో కాంపిటేటివ్ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చీరాగానే బంతితో పాటు బ్యాట్తోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.ఇండోర్ వేదికగా బెంగాల్తో మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య మధ్యప్రదేశ్తో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 228 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ 167 పరుగులకే కుప్పకూలింది.తమ్ముడితో కలిసి అదరగొట్టిన షమీఇందులో షమీతో పాటు అతడి తమ్ముడు మహ్మద్ కైఫ్ పాత్ర కీలకం. షమీ 54 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా.. కైఫ్ రెండు వికెట్లు కూల్చాడు. ఇతరుల్లో సూరజ్ సింధు జైస్వాల్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో 61 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బెంగాల్.. 276 పరుగులకు ఆలౌట్ అయింది.ఇందులో షమీ చేసిన పరుగులు 37. కేవలం 36 బంతుల్లోనే అతడు ఈ మేర రన్స్ స్కోరు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ చిన్ననాటి కోచ్ మహ్మద్ బద్రుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షమీ త్వరలోనే ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరతాడని తెలిపాడు.రెండో టెస్టు తర్వాత షమీ భారత జట్టుతో కలుస్తాడుఈ మేరకు.. ‘‘అడిలైడ్లో రెండో టెస్టు తర్వాత షమీ భారత జట్టుతో కలుస్తాడు. అతడు రీఎంట్రీలో సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. వికెట్లు తీస్తున్నాడు. ఆసీస్ పర్యటన రెండో అర్ధ భాగంలో జట్టు అతడి సేవలు కీలకంగా మారనున్నాయి’’ అని ఇండియన్ ఎక్స్ప్రెస్తో బద్రుద్దీన్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సైతం షమీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. బుమ్రా స్థానంలో?ఇరుజట్ల మధ్య నవంబరు 22న పెర్త్ వేదికగా ఈ సిరీస్ మొదలుకానుంది. అయితే, ఆసీస్తో టెస్టులకు బీసీసీఐ జట్టును ఎంపిక చేసిన నాటికి షమీ పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. అందుకే అతడి పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే, ఇప్పుడు కాంపిటేటివ్ క్రికెట్లో షమీ సత్తా చాటుతున్నాడు కాబట్టి త్వరలోనే ఆస్ట్రేలియా విమానం ఎక్కే అవకాశం ఉంది. మరోవైపు.. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు టెస్టులకు అందుబాటులో ఉండకపోవచ్చని భారత జట్టు బౌలింగ్ మాజీ కోచ్ పారస్ మాంబ్రే పేర్కొనడం విశేషం. దీంతో బుమ్రా స్థానంలో షమీ మిగిలిన టెస్టులు ఆడతాడా అనే విశ్లేషణలు మొదలయ్యాయి.ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు బీసీసీఐ ప్రకటించిన జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: Champions Trophy: పాకిస్తాన్కు భారీ షాకిచ్చిన ఐసీసీ! -
టీమిండియాకు గుడ్న్యూస్
టీమిండియా సీనియర్ క్రికెటర్ మహ్మద్ షమీ పునరాగమనానికి ముహూర్తం ఖరారైంది. దాదాపు ఏడాది తర్వాత ఈ పేస్ బౌలర్ కాంపిటేటివ్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(CAB) ధ్రువీకరించింది. కాగా వన్డే వరల్డ్కప్-2023లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు షమీ.చీలమండ గాయానికి శస్త్ర చికిత్సఈ ఐసీసీ టోర్నీలో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా 24 వికెట్లు కూల్చి.. టీమిండియా ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, అప్పటికే గాయం వేధిస్తున్నా పంటి బిగువన నొప్పిని భరించిన ఈ బెంగాల్ పేసర్... ఈ ఈవెంట్ తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.ఆ మ్యాచ్తో రీ ఎంట్రీఈ క్రమంలో జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన షమీ.. రీ ఎంట్రీ ఎప్పటికపుడు వాయిదా పడింది. అయితే, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు జాతీయ మీడియాకు అందించిన తాజా సమాచారం ప్రకారం.. షమీ మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. రంజీ ట్రోఫీ 2024-25 తాజా ఎడిషన్లో భాగంగా మధ్యప్రదేశ్తో బెంగాల్ ఆడబోయే మ్యాచ్తో షమీ కాంపిటేటివ్ క్రికెట్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.రంజీ ఎలైట్ గ్రూప్-‘సి’లో భాగంగా బెంగాల్- మధ్యప్రదేశ్ మధ్య ఇండోర్ వేదికగా బుధవారం(నవంబరు 13) ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇక షమీ రాక గురించి బెంగాల్ అసోసియేషన్ వర్గాలు మాట్లాడుతూ.. షమీ వల్ల తమ పేస్ బౌలింగ్ అటాక్ మరింత పటిష్టమవుతుందని హర్షం వ్యక్తం చేశాయి. అతడి రాకతో జట్టులో కొత్త ఉత్సాహం నిండిందని... గొప్పగా రాణించే అవకాశం దక్కిందని పేర్కొన్నాయి.ఆసీస్ టూర్కు?కాగా రంజీ తాజా సీజన్లో బెంగాల్ జట్టు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడింది. మొత్తంగా ఎనిమిది పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఉత్తరప్రదేశ్కు చెందిన షమీ.. దేశవాళీ క్రికెట్లో బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడన్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. షమీ రంజీల్లో పూర్తిస్థాయిలో ఆడగలిగితే.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడే టీమిండియాలో అతడిని చేర్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఆసీస్ టూర్ వెళ్లిన భారత జట్టులో ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్తో పాటు ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా కూడా ఉన్నారు. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: BGT: పంత్ కాదు!.. అతడే కొత్త రాజు అంటున్న ఆస్ట్రేలియా మీడియా! -
ఆ సిరీస్ కు దూరమయ్యానని బీసీసీఐ చెప్పిందా?
-
షమీ రీ ఎంట్రీ ఖరారు!.. కానీ...
టీమిండియా సీనియర్ క్రికెటర్ మహ్మద్ షమీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది బెంగాల్ తరఫున అతడు రంజీ బరిలో దిగే అవకాశం ఉంది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రకటించిన ప్రాబబుల్స్ జట్టులో షమీకి కూడా చోటు దక్కింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ పేస్ బౌలర్ రీ ఎంట్రీ చూడబోతున్నామంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.చీలమండ గాయం.. సర్జరీవన్డే వరల్డ్కప్-2023లో టీమిండియా ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన షమీ.. ఈ ఐసీసీ టోర్నీ ముగిసిన తర్వాత జట్టుకు దూరమయ్యాడు. చీలమండ నొప్పి తీవ్రతరం కావడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో నవంబరు 19 తర్వాత అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.కోలుకున్నాడు కానీ..బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న షమీ.. ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అదే విధంగా.. ఇటీవలే బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాడు. ఈ నేపథ్యంలో.. సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీలో షమీ ఆడతాడని భావించినా.. బీసీసీఐ మాత్రం అతడికి విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత అతడిని రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం.బెంగాల్ తరఫున రంజీలోఈ క్రమంలో స్వదేశంలో సెప్టెంబరులో బంగ్లాదేశ్, అక్టోబర్లో న్యూజిలాండ్తో టీమిండియా ఆడే టెస్టు సిరీస్లకు కూడా షమీ దూరంగా ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఆ తర్వాత జరుగనున్న రంజీ ట్రోఫీలో మాత్రం షమీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు బెంగాల్ అసోసియేషన్ ప్రకటన ద్వారా తాజాగా వెల్లడైంది. ఆసీస్తో సిరీస్ ద్వారా టీమిండియాలో పునరాగమనం!బెంగాల్ తరఫున రంజీ 2024- 25 సీజన్లో ఆడేందుకు అవకాశం ఉన్న 31 మంది ఆటగాళ్ల జాబితాలో షమీ పేరు కూడా ఉండటంతో.. అతడు ఆస్ట్రేలియాతో సిరీస్ దాకా టీమిండియాకు దూరంగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు నవంబరులో ఆసీస్కు వెళ్లనున్న విషయం తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్కు చేరాలంటే టీమిండియాకు ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. అందుకే అప్పటి వరకు షమీకి కావాల్సినంత రెస్టు ఇచ్చి.. రంజీ బరిలో దింపడం ద్వారా మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించి.. ఆపై ఈ సిరీస్లో ఆడించాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: నిరాశపరిచిన శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ -
రోహిత్ చెప్పినట్టు మేము వినాల్సిందే.. లేదంటే: షమీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో సహచర ఆటగాళ్లతో ఎంత సరదాగా ఉంటాడో.. పరిస్థితిని బట్టి అంతే సీరియస్ అవుతాడు కూడా!.. ఒక్కోసారి సహనం కోల్పోయి భావోద్వేగాలను నియంత్రించుకోలేక ట్రోల్స్కు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఆటలో భాగంగానే రోహిత్ ఇలా చేస్తాడని.. కెప్టెన్గా అతడు రచించిన వ్యూహాలు అమలు చేయడంలో తాము విఫలమైతే మాత్రం ఆగ్రహానికి గురికాకతప్పదంటున్నాడు టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ.ఇటీవల జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రోహిత్ శర్మకు మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023-24 పురస్కారం లభించింది. ఈ వేడుకలో రోహిత్తో పాటు పేసర్ షమీ, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తదితర టీమిండియా క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్గా మైదానంలో రోహిత్ శర్మ ఎలా ఉంటాడన్న ప్రశ్న ఎదురుకాగా షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అప్పుడు అతడి రియాక్షన్ చూశామంటే‘‘జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి రోహిత్ స్వేచ్ఛనిస్తాడు. తనలోని ఉత్తమ గుణం అది. అయితే, ఎప్పుడైతే మేము అతడి అంచనాలు అందుకోలేకపోతామో.. అప్పుడు అతడు భావోద్వేగాలను ప్రదర్శించడం మొదలుపెడతాడు. నువ్విలా చేయాలి లేదంటే చేసి ఉండాల్సిందని ఆటగాళ్లకు చెబుతాడు.అయినప్పటికీ మన ఆట తీరులో మార్పు లేదంటే.. ఇక అతడి రియాక్షన్స్ స్క్రీన్ మీద చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే.. తను కోపంగా ఉన్నాడని మాకు అర్థమైపోతుంది. ఇక ఆపై తను ఒక్క మాట చెప్పకుండానే మాకు ఏం చేయాలో తెలిసిపోతుంది’’ అని షమీ చెప్పుకొచ్చాడు.అవును.. నా పని నేను చేస్తా!ఇక ఇందుకు బదులిస్తూ.. ‘‘మైదానంలో ఎవరి పనులు వారు సరిగ్గా చేయాలని వాళ్లకు చెప్తాను. మరి నేను కూడా నా పని చేయాలి కదా. అందుకే నేను ఫీల్డ్లో ఒక్కోసారి అలా ప్రవర్తిస్తా’’ అంటూ రోహిత్ శర్మ కెప్టెన్గా తన పనిని తాను చేస్తానంటూ చమత్కరించాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ గెలిచిన అనంతరం సెలవులు తీసుకున్న రోహిత్ శర్మ శ్రీలంక పర్యటన సందర్భంగా మళ్లీ జట్టుతో కలిశాడు. అయితే, అతడి సార థ్యంలోని భారత జట్టు 27 ఏ ళ్ల తర్వాత తొలిసారి న్డే సిరీస్ను లంకకు కోల్పోయింది. మరోవైపు.. వన్డే వరల్డ్కప్ తర్వాత చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్న షమీ ఇంకా పునరాగమనం చేయలేదు. Shreyas Iyer and Mohammed Shami talking about their captain Rohit Sharma.🥹The Captain, the leader, the legend @ImRo45 🐐 pic.twitter.com/DmXJ7YaegC— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 21, 2024 -
సియెట్ అవార్డుల ప్రధానోత్సవం.. సందడి చేసిన క్రికెట్ స్టార్స్ (ఫొటోలు)
-
రీ ఎంట్రీపై షమీ వ్యాఖ్యలు.. ముందుగా ఆ జట్టుకు ఆడతా!
భారత క్రికెట్ జట్టులో పునరాగమనం గురించి స్టార్ పేసర్ మహ్మద్ షమీ కీలక అప్డేట్ అందించాడు. టీమిండియాలోకి తిరిగి రావడం తన చేతుల్లో లేదని.. ముందుగా దేశవాళీ క్రికెట్ ఆడతానని పేర్కొన్నాడు. బెంగాల్ జట్టు తరఫున త్వరలోనే బరిలోకి దిగనున్నానని స్పష్టం చేశాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో అత్యధిక వికెట్లు వీరుడిగా నిలిచిన ఉత్తరప్రదేశ్ బౌలర్ షమీ.. గాయం కారణంగా ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు.చీలమండ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో సర్జరీ చేయించుకున్న షమీ.. దీర్ఘకాలం పాటు విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన ఈ రైటార్మ్ పేసర్.. ఫిట్నెస్పై దృష్టి సారించాడు. ఇటీవలే నెట్స్లో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు.ఈ నేపథ్యంలో.. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ నాటికి షమీ అందుబాటులోకి వస్తాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి భావిస్తోంది. సెప్టెంబరులో మొదలయ్యే ఈ సిరీస్లో షమీ తప్పక ఆడతాడని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవలి ప్రెస్మీట్లో తెలిపాడు. కాగా గాయం లేదా ఇతరత్రా కారణాల దృష్ట్యా టీమిండియాకు దూరమైన క్రికెటర్లు.. తిరిగి జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనంటూ బీసీసీఐ నిబంధన ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, పేస్ బౌలింగ్ విభాగం నాయకుడు జస్ప్రీత్ బుమ్రా వంటి ప్రధాన ఆటగాళ్లు మినహా మిగతావారందరికీ ఈ రూల్ వర్తిస్తుందని పేర్కొంది. ఫిట్నెస్, ఫామ్ నిరూపించుకునేందుకు ఇది దోహదం చేస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో షమీ సైతం డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైనట్లు అతడి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.కోల్కతాలోని ఓ కార్యక్రమంలో షమీ మాట్లాడుతూ.. ‘‘నేను ఎప్పుడు తిరిగి టీమిండియాలో ఆడతానో తెలియదు. నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాను. అయితే, టీమిండియా కంటే ముందు మీరు న్ను బెంగాల్ జెర్సీలో చూస్తారు. త్వరలోనే బెంగాల్ తరఫున 2- 3 మ్యాచ్లు ఆడతాను. ఇందుకోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాను’’ అని పేర్కొన్నాడు.గాయం ఇంతలా వేధిస్తుందని ఊహించలేదని.. టీ20 ప్రపంచకప్ ఈవెంట్ ముగిసిన తర్వాత చికిత్స చేయించుకోవాలని భావించగా.. అందుకు అవకాశం లేకుండా పోయిందని షమీ తెలిపాడు. గాయం కారణంగా ఐపీఎల్, వరల్డ్కప్ టోర్నీలకు దూరమయ్యానని విచారం వ్యక్తం చేశాడు. కాగా అక్టోబరు నుంచి రంజీ ట్రోఫీ మొదలుకానుంది. అయితే, షమీ బెంగాల్ తరఫున ఆడాలంటే బంగ్లాదేశ్తో సిరీస్కు దూరమవ్వాల్సి ఉంది. న్యూజిలాండ్తో సిరీస్నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. -
టీమిండియాకు శుభవార్త.. స్టార్ పేసర్ వచ్చేస్తున్నాడు!
దాదాపు ఆరు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న భారత క్రికెటర్ మహ్మద్ షమీ.. ఫిట్నెస్పై దృష్టి సారించాడు. చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఈ పేస్ బౌలర్ పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతున్నాడు.ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్న షమీ.. ట్రెయినింగ్ సెషన్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఎన్సీఏ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ హెడ్ డాక్టర్ నితిన్ పటేల్, కండిషనింగ్ కోచ్ రజినీకాంత్ ఆధ్వర్యంలో పురోగోతి సాధిస్తున్నాడు.అతడు బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడువీలైనంత త్వరగా టీమిండియా రీఎంట్రీ ఇచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ఈ విషయం గురించి షమీ చిన్ననాటి కోచ్ బద్రుద్దీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. ‘‘అతడు బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయలేకపోతున్నాడు కానీ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా బాల్ రిలీజ్ చేయగలుగుతున్నాడు. ఏదేమైనా తను ఈ మాత్రం కోలుకోవడం శుభసూచకం’’ అని న్యూస్18తో పేర్కొన్నాడు.కాగా రైటార్మ్ పేసర్ మహ్మద్ షమీ స్వదేశంలో బంగ్లాదేశ్తో సిరీస్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.వికెట్ల వీరుడిగావన్డే వరల్డ్కప్-2023లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచిన షమీ.. చీలమండ గాయంతో గతేడాది నవంబరు నుంచి జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో పలు ద్వైపాక్షిక సిరీస్లతో పాటు ఐపీఎల్-2024, టీ20 ప్రపంచకప్-2024 కూడా ఆడలేకపోయాడు. ఇక గాయానికి సర్జరీ చేయించుకుని కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న తర్వాత.. ఇలా ఫిట్నెస్పై దృష్టి పెట్టాడు ఈ ఉత్తరప్రదేశ్ బౌలర్. టీమిండియా షెడ్యూల్ ఇదే ఈ ఏడాది భారత పురుషుల క్రికెట్ జట్టు స్వదేశంలో 5 టెస్టులు, 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది. సెప్టెంబరులో భారత్లో బంగ్లాదేశ్ జట్టు పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భారత్తో బంగ్లాదేశ్ 2 టెస్టులు, 3 టీ20 మ్యాచ్లు ఆడుతుంది.అక్టోబర్ 12న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో టి20 మ్యాచ్కు ఆతిథ్యమివ్వనుంది. విదేశీ టూర్ల వివరాలున్యూజిలాండ్తో సిరీస్ ముగిశాక భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించి ఐదు టెస్టులు ఆడుతుంది. ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చాక భారత జట్టు స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు టీ20 మ్యాచ్లు, మూడు వన్డేలు ఆడుతుంది.ఇక ఈ ఏడాది నవంబర్లో దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత జట్టు దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్ల టి20 సిరీస్ను ఆడుతుంది. నవంబర్ 8న డర్బన్లో జరిగే తొలి మ్యాచ్తో మొదలవుతుంది. ఆ తర్వాత పోర్ట్ ఎలిజబెత్లో 10న రెండో టి20, 13న సెంచూరియన్లో మూడో టి20, 15న జొహన్నెస్బర్గ్లో జరిగే చివరిదైన నాలుగో టీ20తో పర్యటన ముగుస్తుంది. కాగా టీమిండియా ప్రస్తుతం ప్రపంచకప్-2024తో బిజీగా ఉంది. సెమీస్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది.బంగ్లాదేశ్తో తొలి టెస్టు: సెప్టెంబరు 19–23 (చెన్నై) రెండో టెస్టు: సెప్టెంబరు 27–అక్టోబర్ 1 (కాన్పూర్) తొలి టి20: అక్టోబర్ 6 (ధర్మశాల) రెండో టి20: అక్టోబర్ 9 (న్యూఢిల్లీ) మూడో టి20: అక్టోబర్ 12 (హైదరాబాద్) న్యూజిలాండ్తో తొలి టెస్టు: అక్టోబర్ 16–20 (బెంగళూరు) రెండో టెస్టు: అక్టోబర్ 24–28 (పుణే) మూడో టెస్టు: నవంబర్ 1–5 (ముంబై) ఇంగ్లండ్తో తొలి టి20: జనవరి 22 (చెన్నై) రెండో టి20: జనవరి 25 (కోల్కతా) మూడో టి20: జనవరి 28 (రాజ్కోట్) నాలుగో టి20: జనవరి 31 (పుణే) ఐదో టి20: ఫిబ్రవరి 2 (ముంబై) తొలి వన్డే: ఫిబ్రవరి 6 (నాగ్పూర్) రెండో వన్డే: ఫిబ్రవరి 9 (కటక్) మూడో వన్డే: ఫిబ్రవరి 12 (అహ్మదాబాద్).చదవండి: షమీతో ఆమె పెళ్లి?.. స్పందించిన సానియా మీర్జా తండ్రి View this post on Instagram A post shared by 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@mdshami.11) -
షమీతో ఆమె పెళ్లి?.. స్పందించిన సానియా మీర్జా తండ్రి
భారత క్రీడా రంగంలో సానియా మీర్జా, మహ్మద్ షమీ తమకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. చిన్ననాటి నుంచే టెన్నిస్పై మక్కువ పెంచుకున్న సానియా అంతర్జాతీయ స్థాయిలో అనేక టైటిల్స్ సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారు.మరోవైపు.. టీమిండియా ప్రధాన పేస్ బౌలర్లలో ఒకడిగా ఎదిగిన మహ్మద్ షమీ భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ భారీ అభిమానగణాన్ని సొంతం చేసుకున్నాడు.ఇద్దరికీ చేదు అనుభవమేఅయితే, సానియా- షమీ వృత్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించినా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. హసీన్ జహాన్ అనే మోడల్ను పెళ్లాడిన షమీకి ఒక కూతురు ఉంది.కొన్నాళ్లపాటు సజావుగా సాగిన షమీ కాపురం.. హసీన్ సంచలన ఆరోపణల నేపథ్యంలో విచ్ఛిన్నమైంది. మరోవైపు.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ను ప్రేమించి పెళ్లాడిన సానియా మీర్జాకు కూడా చేదు అనుభవమే మిగిలింది.సానియా కెరీరీర్లో బిజీగా ఉన్న సమయంలో షోయబ్ వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని పాక్ మీడియా కథనాలు వెలువరించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరు విడిపోతున్నారనే వార్తలు గుప్పుమనగా.. నటి సనా జావెద్ను పెళ్లాడి.. సానియాతో తన బంధం ముగిసిపోయిందని చెప్పకనే చెప్పాడు షోయబ్.ఇవన్నీ అబద్దాలుకాగా సానియా కుటుంబం సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రస్తుతం సానియా మీర్జా తన కుమారుడు ఇజహాన్కు పూర్తి సమయం కేటాయించి అతడి ఆలనాపాలనా చూసుకుంటూనే వృత్తిపరంగానూ బిజీ అయ్యారు.ఇదిలా ఉంటే.. సానియా మీర్జా- మహ్మద్ షమీ గురించి కొన్నాళ్ల క్రితం వదంతులు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారంటూ కొన్ని జాతీయ మీడియా చానెళ్లలో ప్రచారం జరిగింది.ఈ విషయంపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా తాజాగా స్పందించారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇవన్నీ అబద్దాలు. ఆమె కనీసం అతడిని నేరుగా ఒక్కసారి కూడా కలవనే లేదు’’ అంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డారు.కాగా సానియా మీర్జా హజ్ యాత్రకు వెళ్తున్నట్లు ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. మరోవైపు.. వన్డే ప్రపంచకప్-2023లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన మహ్మద్ షమీ చీలమండ గాయానికి సర్జరీ చేయించుకుని.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.చదవండి: రూ. 2 కోట్ల కారు.. బాబర్ ఆజంపై సంచలన ఆరోపణలు -
నీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ సా(షా)మి
-
షమీపై మరోసారి సంచలన ఆరోపణలు.. ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా స్టార్ పేసర్గా నీరాజనాలు అందుకుంటున్న మహ్మద్ షమీ కెరీర్లో ఉన్నతస్థితిలో ఉన్నాడు. గాయం వేధిస్తున్నా లెక్కచేయక వన్డే వరల్డ్కప్-2023లో అదరగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన ఘనత అతడి సొంతం. అయితే, చీలమండ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో కొంతకాలంగా ఆటకు దూరమైన అతడు.. సర్జరీ చేయించుకున్నాడు. ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఐపీఎల్-2024 మొత్తానికి అందుబాటులో లేకుండా పోయాడు ఈ గుజరాత్ టైటాన్స్ బౌలర్. ఇదిలా ఉంటే.. కెరీర్పరంగా బాగానే ఉన్న షమీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక కుదుపు వస్తూనే ఉంది. 2014లో హసీన్ జహానే అనే మహిళను పెళ్లాడాడు షమీ. ఈ జంటకు 2015లో కూతురు ఐరా జన్మించింది. కానీ.. కొంతకాలం తర్వాత ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తగా.. భర్తపై సంచలన ఆరోపణలు చేసింది హసీన్. వివాహేతర సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్, గృహ హింస అంటూ తీవ్ర ఆరోపణలతో అతడిని సుప్రీంకోర్టు గడప తొక్కించింది. అరెస్టు చేయించాలని చూసింది. అయితే, విచారణ అనంతరం షమీకి ఊరట దక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2018 నుంచి షమీ- హసీన్ విడిగా ఉంటున్నారు. అయితే, తాజాగా మరోసారి షమీని ఉద్దేశించి హసీన్ జహాన్ ఆరోపణలు గుప్పించింది. ‘‘స్టార్ అయిన నా భర్త, అతడి కుటుంబం కారణంగా నేను చేదు అనుభవాలు ఎదుర్కొన్నాను. న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కానీ ఆమ్రోహా పోలీసులు నన్ను, నా మూడేళ్ల కూతురిని టార్చర్ పెట్టారు. ప్రభుత్వం కూడా నా పట్ల అవమానకరంగా ప్రవర్తించింది. నాకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటోంది’’ అని హసీన్ జహాన్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీరును విమర్శించింది. అంతేకాదు.. మహ్మద్ షమీ యూపీ ప్రభుత్వం, పోలీసులతో కలిసి తనను హత్య చేయించేందుకు కుట్ర చేస్తాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో షమీ అభిమానులు హసీన్ జహాన్ తీరుపై మండిపడుతున్నారు. నిరాధార ఆరోపణలు చేస్తూ కాలం గడపటం మానుకుని.. కుమార్తెకు మంచి భవిష్యత్తున్నిచ్చే ఆలోచనలు చేయాలని హితవు పలుకుతున్నారు. అయితే, మరికొంత మంది నెటిజన్లు మాత్రం అనుభవించే వారికి మాత్రమే ఆ బాధ ఏమిటో తెలుస్తుందని హసీన్కు మద్దతుగా నిలుస్తున్నారు. చదవండి: ధోని ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది: టీమిండియా మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ -
షమీకి శస్త్రచికిత్స
న్యూఢిల్లీ: భారత సీనియర్ సీమర్ మొహమ్మద్ షమీ ఎడమ కాలి మడమకు లండన్లో శస్త్రచికిత్స జరిగింది. దీంతో వచ్చేనెలలో ప్రారంభమయ్యే ఐపీఎల్ సీజన్కు పూర్తిగా అతను దూరమయ్యాడు. జూన్లో జరిగే టి20 ప్రపంచకప్ కల్లా అతను కోలుకుంటాడని జట్టు వర్గాలు భావిస్తున్నాయి. 33 ఏళ్ల పేసర్ చివరిసారిగా గత ఏడాది భారత్లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో బరిలోకి దిగాడు. ‘ఆపరేషన్ సక్సెస్ అయింది. కోలుకునేందుకు కాస్త సమయం పడుతుంది. త్వరగా కోలుకొని నడవాలనుంది’ అని షమీ ‘ఎక్స్’లో ట్వీట్ చేశాడు. షమీ వేగంగా కోలుకోవాలని ఎప్పట్లాగే కెరీర్ను కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్లో ఆకాంక్షించారు. -
విభేదాలు ఉంటేనేం.. తనను చాలా మిస్సవుతున్నా: షమీ
తన కూతురు ఐరాను చాలా మిస్సవుతున్నానంటూ టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఉద్వేగానికి లోనయ్యాడు. హసీన్ జహాన్ అనుమతించినపుడు మాత్రమే బిడ్డను చూసుకునే అవకాశం వస్తుందని పేర్కొన్నాడు. ఐరా తల్లితో తనకు విభేదాలు ఉన్నా.. సొంత రక్తాన్ని మాత్రం వదులుకోలేనని ఎమోషనల్ అయ్యాడు. కాగా మోడల్ హసీన్ జహాన్ను 2014లో వివాహం చేసుకున్నాడు షమీ. ఈ దంపతులకు 2015లో కుమార్తె ఐరా జన్మించింది. అయితే, కొన్నేళ్ల క్రితం భర్త షమీపై సంచలన ఆరోపణలు చేస్తూ హసీన్ జహాన్ కోర్టును ఆశ్రయించింది. షమీ స్త్రీలోలుడని.. అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అదే విధంగా గృహహింస చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరగా విడిగా ఉంటున్నారు. కుమార్తె ఐరాను హసీన్ తనతో పాటు తీసుకువెళ్లడంతో.. షమీ కూతురికి కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా న్యూస్18తో సంభాషణ సందర్భంగా.. కూతురి ప్రస్తావన రాగా షమీ స్పందించాడు. ‘‘ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని మిస్సవుతారు కదా! కొన్నిసార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. నేను నా కూతుర్ని మిస్సవుతున్నా. ఎంతైనా తను నా రక్తం. వాళ్ల అమ్మతో విభేదాలున్నంత మాత్రాన నా కూతురిని నేను దూరం చేసుకోలేను. అయితే, నేను ఐరాతో మాట్లాడాలా? వద్దా అనేది వాళ్ల అమ్మ నిర్ణయానుసారమే ఉంటుంది. తను అనుమతిస్తేనే నేను ఐరాతో మాట్లాడగలను. అయితే, ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా తనను నేరుగా కలవలేకపోయాను. తను ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటా’’ అని షమీ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023 తర్వాత.. గాయం కారణంగా మహ్మద్ షమీ.. టీమిండియాకు దూరమయ్యాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్తో రీఎంట్రీ ఇస్తాడని భావించగా ఫిట్నెస్ సాధించకపోవడంతో ఇప్పట్లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. చదవండి: Ranji Trophy: రీ ఎంట్రీలో టీమిండియా ఓపెనర్ ధనాధన్ శతకం.. ఫోర్ల వర్షం -
హార్దిక్ వెళ్లినా నష్టం లేదు.. గిల్ కూడా వెళ్లిపోతాడు: షమీ షాకింగ్ కామెంట్స్
IPL 2024- Mohammed Shami's Blunt Verdict: రెండేళ్ల క్రితం క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ అరంగేట్రంలోనే విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్-2022 సీజన్లో ట్రోఫీ గెలిచి సత్తా చాటింది. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన కెరీర్లో తొలిసారిగా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి జట్టుకు ఈ విజయాన్ని అందించాడు. అదే విధంగా... 2023 ఎడిషన్లోనూ ఫైనల్కు చేర్చి సారథిగా తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. అయితే, ఐపీఎల్-2024 వేలానికి ముందే ముంబై ఇండియన్స్తో బేరం కుదుర్చుకుని.. అభిమానులకు ఊహించని షాకిచ్చాడు హార్దిక్ పాండ్యా. టైటాన్స్ను వీడి సొంతగూటికి వెళ్లిపోయాడు. కొత్త సారథిగా గిల్ ఆరంభం నుంచి తమతోనే ఉన్నా.. కష్టకాలంలో తనను వదిలించుకున్న ఆ ఫ్రాంఛైజీతోనే మళ్లీ దోస్తీకట్టాడు. హార్దిక్ నిర్ణయాన్ని గౌరవించిన గుజరాత్ టైటాన్స్ ముంబై చెల్లించిన మొత్తం తీసుకుని అతడిని వదిలేసింది. తమ కొత్త కెప్టెన్గా టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ పేరును ప్రకటించింది. హార్దిక్ వెళ్తే నష్టమేమీ లేదు ఈ పరిణామాలపై టీమిండియా సీనియర్ పేసర్, గుజరాత్ టైటాన్స్ కీలక బౌలర్ మహ్మద్ షమీ తాజాగా స్పందించాడు. ఈ మేరకు.. ‘‘ఎవరు జట్టును వీడి వెళ్లినా పెద్దగా ఫరక్ పడదు(నష్టమేమీ ఉండదన్న ఉద్దేశంలో). జట్టు సమతూకంగా ఉందా లేదా అన్నది మాత్రమే మనం చూడాల్సింది. హార్దిక్ ఒకప్పుడు సారథిగా ఉన్నాడు. మమ్మల్ని విజయవంతంగా ముందుకు నడిపించాడు. రెండు ఎడిషన్లలోనూ ఫైనల్కు తీసుకువెళ్లాడు. ఓసారి గెలిపించాడు కూడా! ఏదో ఒకరోజు గిల్ కూడా వెళ్లిపోతాడు అయినా.. గుజరాత్ టైటాన్స్... హార్దిక్ పాండ్యాతో జీవితకాలానికి సరిపడా ఒప్పందమేమీ కుదుర్చుకోలేదు కదా! జట్టుతో ఉండాలా, వీడి వెళ్లాలా అన్నది అతడి నిర్ణయం. ఇప్పుడు శుబ్మన్ కెప్టెన్ అయ్యాడు. సారథిగా తనకూ అనుభవం వస్తుంది. ఏదో ఒకరోజు గిల్ కూడా జట్టును వీడి వెళ్లే అవకాశం ఉంది. ఆటలో ఇవన్నీ సహజం. ఆటగాళ్లు వస్తూ.. పోతూనే ఉంటారు’’ అని న్యూస్24తో షమీ వ్యాఖ్యానించాడు. అలా చేస్తే గిల్ సక్సెస్ అవుతాడు అదే విధంగా.. కెప్టెన్గా ఉన్నపుడు జట్టుతో పాటు వ్యక్తిగత ప్రదర్శన పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని షమీ పేర్కొన్నాడు. రానున్న సీజన్లో శుబ్మన్ గిల్ సారథిగా, బ్యాటర్గా తన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తాడనే నమ్మకం ఉందని తెలిపాడు. ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టగలిగితే కెప్టెన్ పని సులువే అవుతుందని షమీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపీఎల్-2023లో 17 మ్యాచ్లు ఆడిన షమీ.. 28 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. మరోవైపు.. శుబ్మన్ గిల్ 17 మ్యాచ్లలో కలిపి 890 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. చదవండి: చరిత్రకు ఆరు పరుగుల దూరంలో కోహ్లి.. కొడితే! -
టీమిండియా యువ పేసర్కు గాయం.. ఆటకు దూరం
టీమిండియా ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, టీ20 నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్, ఓపెనింగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఆటకు దూరంగా ఉన్నారు. వీళ్లంతా అఫ్గనిస్తాన్తో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్కు దూరమయ్యారు. మరోవైపు... వన్డే వరల్డ్కప్-2023 తర్వాత.. చీలమండ నొప్పితో జట్టుకు దూరమైన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో ఇంగ్లండ్తో సొంతగడ్డపై జరుగనున్న తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో అతడికి స్థానం దక్కలేదు. ఈ క్రమంలో తాజాగా టీమిండియా మరో బౌలర్ గాయపడ్డాడు. యువ పేసర్ ప్రసిద్ కృష్ణ తొడ కండరాల నొప్పితో ఆటకు దూరం కావడం గమనార్హం. కాగా సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ కర్ణాటక బౌలర్.. రెండు మ్యాచ్లు ఆడి ధారాళంగా పరుగులు ఇచ్చుకుని కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. సఫారీ గడ్డపై నిరాశాజనక ప్రదర్శన నేపథ్యంలో తిరిగి దేశవాళీ క్రికెట్పై దృష్టి సారించిన ప్రసిద్ కృష్ణ.. రంజీ ట్రోఫీ-2024లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా కర్ణాటక- గుజరాత్ మధ్య శుక్రవారం మొదలైన టెస్టులో అతడు బరిలోకి దిగాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో 14.5 ఓవర్లు బౌల్ చేసిన ప్రసిద్ రెండు వికెట్లు తీశాడు. అయితే, పదిహేనో ఓవర్ ఆఖరి బంతి వేసేపుడు తొడ కండరాల నొప్పితో విలవిల్లాడిన ఈ రైటార్మ్ పేసర్ మైదానాన్ని వీడాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు కోలుకోవడానికి సుమారు నాలుగు నుంచి ఆరు వారాల సమయం పట్టనుంది. దీంతో ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్కు అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇక ఇంగ్లండ్తో సిరీస్లో భాగంగా ఇప్పటికే తొలి రెండు మ్యాచ్లకు బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. ఇక ప్రసిద్ కృష్ణ మాత్రం గాయం కారణంగా మిగిలిన మూడు మ్యాచ్లలో ఆడకపోవచ్చు. చదవండి: Ind vs Eng: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. తల్లి త్యాగం! టీమిండియాలో ఎంట్రీ.. -
#Maldives Row: ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన.. టీమిండియా పేసర్ స్పందన
#Maldives Row- #ExploreIndianIslands: దేశ పర్యాటక రంగ వృద్ధిలో పాలుపంచుకోవాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు వీలుగా చేపడుతున్న చర్యలకు మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చాడు. కాగా ప్రధాని మోదీ ఇటీవల.. కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ను సందర్శించారు. అక్కడి ప్రకృతి అందాలను ఆవిష్కరిస్తూ సముద్ర తీరంలో తన సాహసక్రీడలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేశారు. మీలోని సాహసికుడికి సరైన గమ్యస్థానం లక్షద్వీప్ అంటూ పర్యాటకులను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. మల్దీవుల మంత్రుల నోటి దురుసుతనం ఈ నేపథ్యంలో మాల్దీవుల మంత్రి అబ్దుల్లా మాజిద్ మాల్దీవులను మరపించి లక్షద్వీప్ను పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించడానికే మోదీ ఇలాంటి చర్యకు పూనుకున్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది. తర్వాత మరియం షియునా, మాల్షా ఆయనకు మద్దతుగా భారత్ను తక్కువ చేసే విధంగా మాట్లాడటంతో వివాదం మరింత ముదిరింది. మాకేం సంబంధం లేదు దీంతో ఆ దేశ అధ్యక్షుడు మంత్రులను సస్పెండ్ చేసి వారి వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు. అయినప్పటికీ అప్పటికే బాయ్కాట్ మాల్దీవ్స్ పేరిట భారత నెటిజన్లు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జాతికి సంఘీభావంగా పలు పర్యాటక సంస్థలు మాల్దీవుల ప్రయాణ బుకింగ్స్ నిలిపివేశాయి. ప్రధాని మోదీ ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ప్రధాని మోదీకి మద్దతుగా భారత పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామంటూ అభిమానులకు పిలుపునిస్తున్నారు. ఈ విషయంపై మహ్మద్ షమీ తాజాగా స్పందించాడు. ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘మన దేశ పర్యాటకాన్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి. ఏరకంగా అయితేనేమి దేశం అభివృద్ధి చెందడమే ముఖ్యం. దేశం వృద్ధి సాధిస్తే ప్రతి ఒక్క పౌరుడికి మంచే జరుగుతుంది. ప్రధాని మన దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని శాయశక్తులా కృషి చేస్తున్నారు. మనమందరం ఆయనకు తప్పక మద్దతుగా ఉండాలి’’ అని షమీ పేర్కొన్నాడు. ఇంగ్లండ్తో సిరీస్ నాటికి కాగా వన్డే వరల్డ్కప్-2023లో టాప్ వికెట్ టేకర్(24)గా నిలిచిన మహ్మద్ షమీ గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్తో అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, ఆకాశ్ చోప్రా, సురేశ్ రైనా తదితరులు .. ‘‘భారత పర్యాటకాన్ని ప్రోత్సహించాలి’’ అంటూ ప్రధాని మోదీకి మద్దతుగా పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Afg: అఫ్గన్తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
‘అలా అయితేనే షమీ టీ20 ప్రపంచకప్ ఆడతాడు.. లేదంటే!’
అనూహ్య రీతిలో వన్డే వరల్డ్కప్-2023 ఆడే అవకాశం దక్కించుకున్న టీమిండియా వెటరన్ స్పీడ్స్టర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచి సత్తా చాటాడు. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా మూడో ఆప్షన్గా తుది జట్టులో చోటు సంపాదించిన ఈ రైటార్మ్ పేసర్.. 7 మ్యాచ్లలో కలిపి 24 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గానూ షమీ రికార్డు సృష్టించాడు. సొంతగడ్డపై ఐసీసీ టోర్నీలో ఇలా సత్తా చాటిన షమీ ప్రస్తుతం చీలమండ నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడిని సౌతాఫ్రికా పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్కు ఎంపిక చేయనట్లు తెలుస్తోంది. అదే విధంగా టెస్టు జట్టులోనూ షమీ అందుబాటులో ఉంటాడో లేదోనన్న విషయంలో సందిగ్దత ఉంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి స్వయంగా ప్రకటించింది. షమీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడని.. పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే మళ్లీ మైదానంలో దిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో షమీ అంతర్జాతీయ టీ20 భవితవ్యం గురించి ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. ‘‘వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్లో షమీ ఆడతాడా లేదా అన్నది.. అతడి ఐపీఎల్ ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది. గుజరాత్ టైటాన్స్ తరఫున అతడు గత రెండు సీజన్లలో అద్భుతంగా ఆడుతున్నాడు. మరి రానున్న ఎడిషన్లో షమీ ఎలా ఆడతాడో చూడాలి’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ‘‘మ్యాచ్ సమయంలో అతడికి గాయం కాలేదు. అయితే, మడిమ నొప్పి రాను రాను తీవ్రమైంది. ముంబైలో షమీ పలువురు డాక్టర్లను సంప్రదించాడు. తదుపరి జాతీయ క్రికెట్ అకాడమీలో అతడు పునరావాసం పొందనున్నాడు’’ సదరు వర్గాలు తెలిపినట్లు సమాచారం. ఇక బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం గాయమైతే అంత తీవ్రంగా లేదు. తన తమ్ముడు మహ్మద్ కైఫ్ విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో ఆడుతున్న మ్యాచ్ను చూడటానికి కూడా షమీ వచ్చాడు. అపుడు కాలు కాస్త ఉబ్బినట్లు కనిపించింది’’ అని పేర్కొన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన షమీ దేశవాళీ క్రికెట్లో బెంగాల్కు ప్రాతినిథ్యం వహిస్తాడన్న విషయం తెలిసిందే. చదవండి: ‘సెలక్టర్లు అతడిని మర్చిపోవద్దు.. సౌతాఫ్రికా టూర్కు పంపాల్సింది’ -
సిరాజ్, ప్రసిద్ద్ కాదు.. అతడే జూనియర్ మహ్మద్ షమీ: అశ్విన్
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ తన బౌలింగ్ స్కిల్తో అందరని అకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో ముఖేష్ వికెట్లు పడగొట్టకపోయినప్పటికీ.. తన బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్ వేసిన ముఖేష్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి ఆసీస్ జోరుకు కళ్లెం వేశాడు. చివర్ ఓవర్లో అతడు బౌన్సర్లు, యార్కర్లు వేసి ఆసీస్ బ్యాటర్లను సైలెంట్గా వుంచాడు. ఓవరాల్గా తన 4 ఓవర్ల కోటాలో ముఖేష్ 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక తిరునవంతపురం వేదికగా జరగనున్న రెండో టీ20లో కూడా సత్తాచాటాలని ముఖేష్ కుమార్ భావిస్తున్నాడు. ఈ క్రమంలో ముఖేష్ కుమార్పై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖేష్కు మహ షమీ లాంటి బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయని అశ్విన్ కొనియాడాడు. "నేను మొదట్లో మహ్మద్ సిరాజ్ జూనియర్ షమీ అవుతాడని అనుకున్నాను. కానీ ఇప్పుడు యువ పేసర్ ముఖేష్ కుమార్ను చూస్తే జూనియర్ షమీ అవుతాడని అన్పిస్తుంది. షమీ అని అందరూ ముద్దుగా 'లాలా' అని పిలుస్తారు. నేను మాత్రం షమీని లాలెట్టన్ అని పిలుస్తాను. ఎందుకంటే నాకెంతో ఇష్టమైన నటుడి మోహన్ లాల్ ముద్దుపేరు లాలెట్టన్. ముఖేష్.. షమీ బౌలింగ్ యాక్షన్ను పోలి ఉన్నాడు. అతడితో పాటు సమానమైన ఎత్తును కూడా కలిగి ఉన్నాడు. అతడితో అద్భుతంగా యార్కర్లు బౌలింగ్ చేయగలడు. బంతిపై మంచి కంట్రోల్, అద్భుతమైన బ్యాక్-స్పిన్ కలిగి ఉన్నాడు. వెస్టిండీస్లో జరిగిన సిరీస్లో అతడు బాగా బౌలింగ్ చేశాడు. బార్బడోస్లో జరిగిన ప్రాక్టీస్ గేమ్లో అత్యుత్తమంగా రాణించాడని" తన యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ పేర్కొన్నాడు. చదవండి: మంచి మనసు.. ఓ వ్యక్తి ప్రాణం కాపాడిన మహ్మద్ షమీ! వీడియో వైరల్ -
వాళ్లకు వాళ్లు తోపులనుకుంటారు.. పాక్ మాజీలపై నిప్పులు చెరిగిన షమీ
టీమిండియా పేస్ బాద్షా మొహమ్మద్ షమీ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లపై నిప్పులు చెరిగాడు. వన్డే వరల్డ్కప్ 2023 సందర్భంగా భారత పేసర్లకు ఐసీసీ ప్రత్యేక బంతులు సమకూర్చిందంటూ వారు చేసిన నిరాధారమైన ఆరోపణలపై మండిపడ్డాడు. పాక్ మాజీలు ఇలాంటి విచక్షణారహిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించాడు. మీకు మీరే తోపులనుకుంటే సరిపోదని చురకలంటించాడు. ఇకనైనా మారండ్రా బాబూ అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. కాగా, 2023 వరల్డ్కప్లో భారత పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా పేస్ త్రయం ఏకంగా 58 వికెట్లు పడగొట్టి, ప్రత్యర్ధి బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. మొహమ్మద్ షమీ 7 మ్యాచ్ల్లో 24 వికెట్లు పడగొట్టి వరల్డ్కప్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలువగా.. జస్ప్రీత్ బుమ్రా 11 మ్యాచ్ల్లో 20 వికెట్లు, మొహమ్మద్ సిరాజ్ 11 మ్యాచ్ల్లో 14 వికెట్లు నేలకూల్చారు. Mohammad Shami thrashed Hasan Raza’s theory of different balls provided by ICC to Indians.pic.twitter.com/c6StMTRTCb — Cricketopia (@CricketopiaCom) November 21, 2023 భారత పేసర్లు గతంలో ఎన్నడూ లేనట్లుగా చెలరేగడంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లలో అక్కసు కట్టలు తెంచుకుంది. భారత పేసర్లకు ఐసీసీ ప్రత్యేకమైన బంతులు సమకూర్చిందంటూ పాక్ మాజీ ఆటగాడు హసన్ రజా వివాదాస్పద ఆరోపణలు చేశాడు. ప్రత్యేక బంతుల కారణంగానే భారత పేసర్లు చెలరేగిపోయారంటూ మరికొంతమంది పాక్ మాజీలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై షమీ తాజాగా స్పందించాడు. ప్యూమా కంపెనీకి సంబంధించిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాక్ మాజీలపై నిప్పులు చెరిగాడు. పాక్ మాజీల నిరాధారమైన ఆరోపణలు బాధించాయని అన్నాడు. ఈ సందర్భంగా షమీ మాట్లాడుతూ.. నాకైతే ఇతరుల సక్సెస్ చూసి ఎప్పుడూ ఈర్ష్య కలుగదు. ఇతరుల సక్సెస్ను ఎంజాయ్ చేయగలిగినప్పుడే మంచి ప్లేయర్ అనిపించుకుంటారు. మనకు ఏది చేయాలన్నా దేవుడే చేయాలి. నేను ఇదే నమ్ముతానని అన్నాడు. కుట్ర సిద్ధాంతాల పుట్టుకకు పాకిస్తానీల అర్హతే మూలకారణమని తెలిపాడు. పాక్ మాజీలు కొందరు తమకు తామే అత్యుత్తమమని భావిస్తున్నారని, ఇతరులెవ్వరూ వారు సాధించించి సాధించలేరని ఫీలవుతారని చురకలంటించాడు. -
నిన్నటి రోజు మనది కాకుండా పోయింది: షమీ భావోద్వేగం.. పోస్ట్ వైరల్
ICC WC 2023- Mohammad Shami Post Goes Viral: వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో ఓటమిపై టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ స్పందించాడు. టోర్నీ ఆసాంతం తాము అద్బుతంగా ఆడామని.. కానీ నిన్నటి రోజు మాత్రం తమది కాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పడిలేచిన కెరటంలా తిరిగి పుంజుకుని అభిమానులను గర్వపడేలా చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం(నవంబరు 19) జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తుదిపోరులో ఆస్ట్రేలియా భారత జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అజేయ జట్టు.. ఆఖరి మెట్టుపై బోల్తా ఈ ఎడిషన్లో లీగ్ దశ నుంచి ఓటమన్నదే ఎరుగని రోహిత్ సేనకు తొలి ఓటమిని రుచి చూపించి.. ఏకంగా ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. దీంతో.. మనోళ్లు కప్ గెలుస్తారని ఆశగా ఎదురుచూసిన కోట్లాది మంది అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. సొంతగడ్డపై భారత్ను మరోసారి చాంపియన్గా చూడాలనుకున్న స్వప్నాలు చెదిరిపోయాయి. ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ ‘ఎక్స్’ వేదికగా తన భావాలు పంచుకున్నాడు. ‘‘దురదృష్టవశాత్తూ నిన్నటి రోజు మనది కాకుండా పోయింది. జట్టుకు, నాకు టోర్నీ ఆసాంతం మద్దతుగా నిలిచిన భారతీయులందరికి పేరుపేరునా కృతజ్ఞతలు. మోదీజీకి థాంక్స్ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ జీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన డ్రెస్సింగ్ రూంకి వచ్చి మాలో స్ఫూర్తిని నింపారు. మేము తిరిగి పుంజుకుంటాం’’ అని షమీ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. ప్రధాని మోదీ తనను ఆత్మీయంగా హత్తుకుని ఓదార్చుతున్న ఫొటోను జత చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా భారత పేస్ త్రయంలో కీలకమైన మహ్మద్ షమీకి ప్రపంచకప్-2023 ఆరంభ మ్యాచ్లలో ఆడే అవకాశం రాలేదు. హార్దిక్ పాండ్యా రూపంలో పేస్ ఆల్రౌండర్ అందుబాటులో ఉండటంతో షమీని పక్కనపెట్టారు. ఆరంభంలో చోటే లేదు.. హయ్యస్ట్ వికెట్ టేకర్గా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లకు తుదిజట్టులో చోటిచ్చే క్రమంలో అతడికి తుదిజట్టులో చోటు లేకుండా పోయింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్తో మ్యాచ్లో పాండ్యా గాయపడగా షమీ జట్టులోకి వచ్చాడు. లీగ్ దశలో న్యూజిలాండ్తో మ్యాచ్తో ఎంట్రీ ఇచ్చిన ఈ రైటార్మ్ పేసర్ ఐదు వికెట్ల హాల్తో మెరిశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్పై 4, శ్రీలంకపై 5, సౌతాఫ్రికాపై 2 వికెట్లు పడగొట్టాడు. ఇక న్యూజిలాండ్తో సెమీస్లో ఏకంగా రికార్డు స్థాయిలో ఏడు వికెట్లు కూల్చాడు. ఆస్ట్రేలియాతో ఫైనల్లో ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా మొత్తంగా 24 వికెట్లు తీసిన షమీ.. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలిచి అవార్డు అందుకున్నాడు. చదవండి: CWC 2023: అత్యుత్తమ జట్టు ప్రకటన.. కెప్టెన్గా రోహిత్.. ఆసీస్ హీరోకు నో ఛాన్స్ Unfortunately yesterday was not our day. I would like to thank all Indians for supporting our team and me throughout the tournament. Thankful to PM @narendramodi for specially coming to the dressing room and raising our spirits. We will bounce back! pic.twitter.com/Aev27mzni5 — 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) November 20, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: విరాట్ కోహ్లికి మూడు, షమీకి రెండు.. అవార్డుల జాబితా
CWC 2023 Winner Australia: క్రికెట్ మెగా సమరానికి తెరపడింది. భారత్ వేదికగా అక్టోబరు 5న మొదలైన వన్డే వరల్డ్కప్ పండుగ ఆదివారంతో ముగిసిపోయింది. అజేయ రికార్డుతో ఫైనల్ చేరిన టీమిండియా ట్రోఫీ గెలుస్తుందని కోటి ఆశలతో ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో రోహిత్ సేనను ఓడించి ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది. అనూహ్య విజయాలతో తుదిపోరుకు అర్హత సాధించిన ప్యాట్ కమిన్స్ బృందం విజయంతో ఈ ఐసీసీ టోర్నీని ముగించి సగర్వంగా స్వదేశానికి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. అసలు మ్యాచ్లో ఓటమిపాలైన టీమిండియా ఈ ఐసీసీ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడు, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వంటి అవార్డులు గెలుచుకుంది. ప్రపంచకప్-2023 టోర్నమెంట్లో వివిధ అవార్డులు అందుకున్న ప్లేయర్ల లిస్టు 1.ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ - విరాట్ కోహ్లీ- ఇండియా (765 పరుగులు, 1 వికెట్, 5 క్యాచ్లు) 2. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫైనల్- ట్రవిస్ హెడ్- ఆస్ట్రేలియా(137 పరుగులు, 1 క్యాచ్) 3.అత్యధిక పరుగులు- విరాట్ కోహ్లి(11 ఇన్నింగ్స్లో 765 పరుగులు) 4.అత్యధిక స్కోరు- గ్లెన్ మాక్స్వెల్(ముంబైలో అఫ్గనిస్తాన్ మీద 201 పరుగులు- నాటౌట్) 5. అత్యధిక సెంచరీలు- క్వింటన్ డికాక్- సౌతాఫ్రికా(4 శతకాలు) 6. అత్యధిక అర్ధ శతకాలు- విరాట్ కోహ్లి(6 ఫిఫ్టీలు) 7. అత్యధిక వికెట్లు- మహ్మద్ షమీ- ఇండియా(7 ఇన్నింగ్స్లో 24 వికెట్లు) 8. అత్యుత్తమ గణాంకాలు- మహ్మద్ షమీ(ముంబైలో న్యూజిలాండ్ మీద 7/57) 9. అత్యధిక సిక్సర్లు- రోహిత్ శర్మ- ఇండియా(31 సిక్స్లు) 10. అత్యధిక క్యాచ్లు- డారిల్ మిచెల్- న్యూజిలాండ్(11 క్యాచ్లు) 11. అత్యధిక అవుట్లు చేసిన వికెట్ కీపర్- క్వింటన్ డికాక్(20) 13. అత్యధిక స్ట్రైక్రేటు- గ్లెన్ మాక్స్వెల్(150.37) పూర్తి వివరాలు- ఇతర విశేషాలు ►ఈ ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా భారత స్టార్ విరాట్ కోహ్లి నిలిచాడు. కోహ్లి 11 మ్యాచ్లు ఆడి 3 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 765 పరుగులు సాధించాడు. ►ఈ ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా భారత పేసర్ మొహమ్మద్ షమీ నిలిచాడు. షమీ 7 మ్యాచ్లు ఆడి మొత్తం 24 వికెట్లు పడగొట్టాడు. షమీ మొత్తం 48.5 ఓవర్లు వేసి 257 పరుగులు ఇచ్చాడు. ►మొత్తం ప్రపంచకప్ టోర్నీలలో అత్యధిక టీమ్ స్కోరు ఈ ప్రపంచకప్లోనే నమోదైంది. శ్రీలంకతో న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 5 వికెట్లకు 428 పరుగులు సాధించింది. ►ధర్మశాలలో ఆ్రస్టేలియా (388 ఆలౌట్; 49.2 ఓవర్లలో), న్యూజిలాండ్ (50 ఓవర్లలో 383/9) జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మొత్తం 771 పరుగులు వచ్చాయి. ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో ఇదే అత్యధికం. ►ఈ ప్రపంచకప్లో అత్యధిక వ్యక్తిగత నమోదు చేసిన బ్యాటర్గా ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్వెల్ నిలిచాడు. అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మ్యాక్స్వెల్ (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్స్లు) అజేయ డబుల్ సెంచరీ సాధించాడు. ►ఈ ప్రపంచకప్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్గా భారత పేసర్ మొహమ్మద్ షమీ నిలిచాడు. న్యూజిలాండ్తో ముంబైలో జరిగిన సెమీఫైనల్లో షమీ 57 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు. ►ఈ ప్రపంచకప్లో ఒకే ఇన్నింగ్స్లో 400 అంతకంటే ఎక్కువ స్కోర్లు మూడుసార్లు నమోదయ్యాయి. శ్రీలంకపై దక్షిణాఫ్రికా (428/5), నెదర్లాండ్స్పై భారత్ (410/4), పాకిస్తాన్పై న్యూజిలాండ్ (401/6) సాధించాయి. ►వన్డే వరల్డ్కప్లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు గెల్చుకున్న మూడో భారతీయ క్రికెటర్గా విరాట్ కోహ్లి గుర్తింపు పొందాడు. గతంలో సచిన్ టెండూల్కర్ (2003లో), యువరాజ్ సింగ్ (2011లో) ఈ ఘనత సాధించారు. చదవండి: అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది! వారిద్దరికి క్రెడిట్: రోహిత్ శర్మ View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: అందరూ హీరోలే.. కానీ టీమిండియా చివరకు ఇలా!
మళ్లీ అదే బాధ... మరోసారి అదే వేదన... చేరువై దూరమైన వ్యథ! తమ అద్భుత ఆటతో అంచనాలను పెంచి విశ్వ విజేతగా నిలిచేందుకు అన్ని అర్హతలు ఉన్న జట్టుగా కనిపించిన భారత్ విషాదంగా మెగా టోర్నీని ముగించింది. 2003లో ఆసీస్ చేతిలో ఓడిన బాధ నాటి తరానికి మాత్రమే గుర్తుంటుంది... కానీ నాలుగేళ్ల క్రితం 2019 సెమీఫైనల్లో మన ఓటమి ఇంకా అభిమానుల మదిలో తాజాగానే ఉంది. ఇప్పుడు స్వదేశంలో దానిని సరిదిద్దుకునే అవకాశం లభించింది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాపై మన ఆధిపత్యం చూస్తే భారత జట్టుపై అంచనాలు పెరిగాయి... ప్రపంచకప్నకు ఆరు నెలల ముందు నుంచి జట్టు కూర్పుపై ప్రణాళికలు, ప్రదర్శన, ఒక్కో ఆటగాడి వ్యక్తిగత ప్రదర్శనలు, వారికి అప్పగించిన వేర్వేరు బాధ్యతలు అద్భుతంగా పని చేశాయి. కోచ్గా రాహుల్ ద్రవిడ్, రోహిత్ కెప్టెన్సీ మధ్య గొప్ప సమన్వయం మెరుగైన వ్యూహాలకు బాట వేసింది. ఈ నాలుగేళ్ల కాలంలో 66 వన్డేల్లో కలిపి భారత్ 50 మంది ఆటగాళ్లను ఆడించింది. ఏ ఇతర జట్టూ ఇంత మందికి అవకాశం కల్పించలేదు. ముఖ్యంగా ప్రతీ స్థానం కోసం సరిగ్గా సరిపోయే ఆటగాళ్లను గుర్తించే ప్రయత్నం ఇందులో జరిగింది. ఆయా ఆటగాళ్ల ప్రదర్శన తర్వాత ఈ సంఖ్యను సగానికి తగ్గించి 24 మందితో ఒక జాబితా తయారైంది. ఇందులో నుంచే వరల్డ్కప్ కప్ టీమ్ ఉంటుందనే విషయంపై స్పష్టత వచ్చింది. వరల్డ్కప్నకు ఆరు నెలల ముందునుంచి చూస్తే 2023 మార్చి 1 నుంచి అక్టోబర్ 4 మధ్య భారత్ 15 వన్డేలు ఆడితే ఈ 24 నుంచే జట్లను ఎంపిక చేశారు. అనంతరం 15 మందితో వరల్డ్ కప్ టీమ్ ఎంపికైంది. వరుస అద్భుత విజయాలు వీరితోనే సాధ్యమయ్యాయి. ‘మేం జట్టుగా గెలుస్తాం...జట్టుగా ఓడతాం’... ప్రపంచకప్ మొత్తం భారత డ్రెస్సింగ్ రూమ్లో ఈ నినాదం గట్టిగా మార్మోగింది. సెమీస్ వరకు ఒక్కసారి కూడా ఓటమిని దరి చేరనీయకుండా విజయంపై విజయంపై సాధిస్తూనే టీమిండియా తమ స్థాయిని ప్రదర్శించింది. ఎదురులేని ఆటతో వరుసగా 10 మ్యాచ్లను సొంతం చేసుకొని అంచనాలను ఆకాశానికి పెంచింది. 1983 వరల్డ్కప్ అనగానే జింబాబ్వేపై కపిల్ దేవ్ 175 నాటౌట్, ఫైనల్లో కపిల్ పట్టిన రిచర్డ్స్ క్యాచ్లాంటివి ప్రత్యేకంగా కనపడతాయి. 2011లో యువరాజ్ సింగ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో పాటు ధోని కొట్టిన విన్నింగ్ సిక్సరే అందరి మనసుల్లో ముద్రించుకుపోయింది. ఈ రెండు మెగా టోర్నీల్లోనూ ఇతర ఆటగాళ్లూ తమ వంతు పాత్ర పోషించినా... టీమ్ గేమ్లో గెలవాలంటే అందరి భాగస్వామ్యం తప్పనిసరి అని ఎన్ని మాటలు చెప్పుకున్నా కొన్ని వ్యక్తిగత ప్రదర్శనలే హైలైట్ అయి అవే ప్రపంచకప్ను గెలిపించాయనే భావన కలిగిస్తాయి. కానీ ఈ టోర్నీలో మాత్రం భారత ఆటగాళ్లందరూ హీరోలే. ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు. మైదానంలోకి దిగిన ప్రతీ ఒక్కరు తమదైన ఆటతో జట్టును గెలిపించారు... జట్టు కోసం గెలుపు అవకాశాలు సృష్టించారు. జట్టుకు విజయం అందించేందుకు ఒకటో నంబర్ ఆటగాడినుంచి పదకొండో నంబర్ ప్లేయర్ వరకు ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. వ్యక్తిగతంగా చూస్తే ప్రతీ పోరులో ఒకరు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలుస్తారు. కానీ భారత జట్టుకు సంబంధించి ప్రతీ మ్యాచ్లో అందరూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్లే. ఒక బ్యాటర్ నెమ్మదించినట్లు కనిపిస్తే మరొకరు చెలరేగిపోయారు. ఒక బౌలర్ కాస్త తడబడినట్లు అనిపిస్తే నేనున్నానంటూ మరో బౌలర్ వచ్చి లెక్క సరిచేశారు. పవర్ప్లేలో పవర్ అంతా చూపిస్తే, మధ్య ఓవర్లలో మరొకరు ఇన్నింగ్స్ నడిపించారు. చివర్లో చెలరేగే బాధ్యత ఇంకొకరిది. భారత గడ్డపై పేసర్లు ఇంతగా ప్రభావం చూపించగలరని ఎవరైనా అనుకున్నారా! మన త్రయం దానిని చేసి చూపించింది. ఒక్కో బంతిని ఆడేందుకు బ్యాటర్లు పడిన తిప్పలు చూస్తే దాని పదునేమిటో తెలుస్తుంది. ఇక స్పిన్ ద్వయం ప్రత్యర్థులను పూర్తిగా కట్టి పడేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు...ఐదుగురూ వికెట్లు తీయగల సమర్థులైన బౌలర్లు ఉన్న టీమిండియాను చూసి ఎన్నాళ్లయింది? అంకెలపరంగా చూస్తే ప్రతీ ఒక్కరి పాత్ర జట్టును గెలిపించింది. 11 ఇన్నింగ్స్లలో 3 సెంచరీలు, 6 అర్ధసెంచరీలతో 765 పరుగులు చేసిన కోహ్లి తన విలువేంటో చూపించాడు. ముందుగా క్రీజ్లో కుదురుకొని తర్వాత ధాటిగా ఆడే తన శైలిని మార్చుకొని ఆరంభంలో చెలరేగి విజయానికి పునాది వేసే వ్యూహంతోనే ఆడిన కెప్టెన్ రోహిత్ కూడా 597 పరుగులు చేశాడు. శ్రేయస్ (530), రాహుల్ (452), శుబ్మన్ గిల్ (354) కూడా కీలక పరుగులు సాధించారు. ఇక బౌలింగ్లో 7 మ్యాచ్లలోనే కేవలం 10.70 సగటుతో 24 వికెట్లు తీసి మొహమ్మద్ షమీ టోర్నీని ఒక ఊపు ఊపాడు. బుమ్రా 20 వికెట్లతో తన సత్తాను చాటగా... జడేజా (16), కుల్దీప్ (15), సిరాజ్ (14) బౌలింగ్ దళం బలాన్ని చూపించారు. కానీ... కానీ... ఫైనలో పోరులో మాత్రం ఈ గణాంకాలన్నీ పనికి రాలేదు. సెమీస్ వరకు స్వేచ్ఛగా ఆడినా... వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్న ఒత్తిడి సహజంగానే వారిలో కనిపించింది. అందుకే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ఏదీ కలిసి రాలేదు. గిల్, శ్రేయస్ జోరు చూపించలేకపోగా, రాహుల్ పూర్తిగా తడబడ్డాడు. ఫైనల్లాంటి కీలక పోరులో రోహిత్ తన దూకుడు కాస్త నియంత్రించుకొని ఉంటే బాగుండేదని అనిపించినా... అతనూ విఫలమయ్యే ప్రమాదమూ ఉండేది. కోహ్లి ఒక్కడే తన స్థాయికి తగ్గ ఆటను చూపించగలిగినా అది సరిపోలేదు. జడేజా, సూర్య ఇలాంటి సమయంలో ఆదుకోలేకపోయారు. అయితే బౌలింగ్ దళం కాస్త ఆశలు కలిగించింది. ఆరంభంలో మూడు వికెట్లు తీయడం కూడా నమ్మకం పెంచింది. అయితే 240 పరుగుల స్కోరు మరీ చిన్నదైపోయింది. పది విజయాల ప్రదర్శన తర్వాత ఇలాంటి ఆట ఓటమి వైపు నిలిపింది. అయినా సరే... భారత్ ప్రదర్శనను తక్కువ చేయలేం. లీగ్ దశలో తొమ్మిది వేర్వేరు ప్రత్యర్థులతో, వేర్వేరు వేదికలపై సాగించిన ఆధిపత్యం అసాధారణం. ఆటగాళ్ల శ్రమ, అంకితభావం అన్నింటిలో కనిపించాయి. ఈ టీమ్ చాంపియన్గా నిలిచేందుకే పుట్టింది అని అనిపించింది. అయితే ఏదైనా తప్పు జరగాలని రాసి పెట్టి ఉంటే అది ఎలాగూ జరుగుతుంది. కానీ కీలక సమయంలోనే అది జరుగుతుంది. ఈ టోర్నీలో మనం ఒక్క మ్యాచ్ అయినా ఓడాలని రాసి పెట్టి ఉన్నట్లుంది. ఆ మ్యాచ్ కాస్తా ఫైనల్ మ్యాచ్ కావడమే విషాదం! –సాక్షి క్రీడా విభాగం View this post on Instagram A post shared by ICC (@icc) -
నటుడి కుమారుడికి స్టార్ క్రికెటర్ పాఠాలు.. వీడియో వైరల్!
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ హంగామా నడుస్తోంది. ప్రతిష్ఠాత్మక వన్టే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి క్రికెట్పైనే ఉంది. బాలీవుడ్, టాలీవుడ్తో పాటు రాజకీయ నాయకులు సైతం మ్యాచ్ చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు సోనూ సూద్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన చిన్న కుమారుడు అయాన్ బ్యాటింగ్ మెలకువలు నేర్చుకుంటున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వరల్డ్ కప్లో వికెట్లతో అదరగొడుతున్న షమీ నుంచి సలహాలు తీసుకుంటున్న వీడియో తెగ వైరవులవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ భవిష్యత్ టీమిండియా క్రికెటర్కు చిట్కాలు నేర్పిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో గతంలో షమీ.. అయాన్కు మూడేళ్ల క్రితం ఇలా ట్రైనింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత ప్రపంచకప్లో షమీ తన బౌలింగ్తో అదరగొడుతున్నారు. అందుకే అత్యుత్తమైన క్రికెటర్తో నా కుమారుడు అయాన్కి శిక్షణ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ అతని కోచ్ను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆదివారం జరిగే భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్ కోసం సోనూసూద్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. కాగా..సోనూ కన్నడ చిత్రం 'శ్రీమంత'లో చివరిసారిగా కనిపించారు. ప్రస్తుతం బాలీవుడ్లో 'ఫతే' షూటింగ్ను పూర్తి చేసుకున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ శక్తి సాగర్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించారు. జీ స్టూడియోస్తో కలిసి రూపొందించిన 'ఫతే' మూవీ 2024లో విడుదల కానుంది. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా నటిస్తోంది. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) -
CWC 2023: ఆ ఇద్దరూ టీమిండియా పాలిట వరం.. అంచనాలకు మించి!
ఇద్దరూ కుడిచేతి వాటం క్రికెటర్లే.. అందులో ఒకరు వికెట్ కీపర్.. మరొకరు అచ్చమైన బ్యాటర్.. ఆ ఇద్దరూ గాయాల నుంచి కోలుకుని సుదీర్ఘ విరామం తర్వాత జట్టులో పునరాగమనం చేసిన వాళ్లే.. సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023 లాంటి కీలక టోర్నీకి ముందు ఆసియా వన్డే కప్-2023 ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ ఆసియా టోర్నమెంట్తో లభించిన ‘ప్రాక్టీస్’ను వికెట్ కీపర్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే.. మరో బ్యాటర్ మాత్రం గాయం కారణంగా మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. తిరిగొచ్చిన తర్వాత.. ప్రపంచకప్ ఆరంభంలోనూ స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడి విమర్శలు మూటగట్టుకున్నాడు. అయితే, అనూహ్యంగా సెంచరీతో చెలరేగి తిరిగి గాడిలో పడ్డాడు. తనను విమర్శించిన వాళ్లకు బ్యాట్తోనే సమాధానమిస్తూ ముందుకు సాగుతున్నాడు. అద్భుత ప్రదర్శనలతో ఈ ఇద్దరూ ఇప్పుడు వరల్డ్కప్-2023 ఫైనల్లో మరింత కీలకంగా మారారు. వాళ్లెవరో కాదు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్. ఫైనల్ వరకు అజేయంగా స్వదేశంలో టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత జట్టు లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్లు గెలిచి టేబుల్ టాపర్గా సెమీస్ చేరింది. న్యూజిలాండ్తో సెమీ ఫైనల్ గండాన్ని తుదిపోరుకు అర్హత సాధించింది. అహ్మదాబాద్ వేదికగా మిగిలిన ఆ ఇంకొక్క అడుగు విజయవంతంగా పూర్తి చేసి పదేళ్ల ఐసీసీ ట్రోఫీ కరువును తీర్చాలని పట్టుదలగా ఉంది ఈ జెయింట్ కిల్లర్. ఇక్కడి వరకు సాఫీగా సాగిన టీమిండియా ప్రయాణంలో కెప్టెన్ కమ్ ఓపెనర్ రోహిత్ శర్మ, అతడి జోడీ శుబ్మన్ గిల్.. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి పాత్ర ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాపార్డర్ జబర్దస్త్గా పవర్ ప్లేలో రోహిత్ దూకుడుగా ఆరంభిస్తే.. గిల్ కాస్త ఆచితూచి ఆడి ఆ తర్వాత వేగం పెంచుతాడు. ఇక వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చే కోహ్లి.. తాను పోషించాల్సిన పాత్ర గురించి కచ్చితమైన అవగాహనతోనే మైదానంలో అడుగుపెడతాడన్న సంగతి తెలిసిందే. అయితే, అన్నివేళలా అన్నీ అనుకున్నట్లుగా జరగవు. టాపార్డర్ విఫలమైతే స్కోరు బోర్డును ముందుకు నడిపించగల బాధ్యతను మిడిలార్డర్ పూర్తిగా తీసుకోగలగాలి. ఇలాంటపుడే నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ చేసే బ్యాటర్ల అసలైన ప్రతిభ బయటపడుతుంది. మిడిలార్డర్లో పాతుకుపోయి.. తమకు తామే సాటి అన్నట్లు వన్డే వరల్డ్కప్-2023లో తమ పాత్రను చక్కగా పోషిస్తున్నారు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్. నిజానికి 2015- 19 మధ్య టీమిండియా మిడిలార్డర్లో నిలకడలేమి కొట్టొచ్చినట్లు కనిపించేది. అప్పట్లో నంబర్ 4లో కీలకమైన అంబటి రాయుడును తప్పించి త్రీడీ ప్లేయర్ పేరిట విజయ్ శంకర్ను ప్రపంచకప్-2019 జట్టుకు ఎంపిక చేశారు. కానీ అనుకున్న ఫలితాలు రాబట్టలేక సెమీస్లో ఓటమి చెంది ఇంటి బాట పట్టింది భారత జట్టు. మిడిలార్డర్లో అనిశ్చితి కారణంగా భారీ మూల్యమే చెల్లించింది. ఆ తర్వాత రాహుల్, అయ్యర్ తమ ఆట తీరుతో ఆ లోటు భర్తీ చేసే బాధ్యతను తీసుకున్నారు. గిల్ రాకతో మిడిలార్డర్కే పరిమితమైన రాహుల్.. వికెట్ కీపర్గా రాణిస్తూనే బ్యాటర్గానూ ఆకట్టుకుంటున్నాడు. వరల్డ్కప్నకు ముందు తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడి శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ కర్ణాటక బ్యాటర్.. ఆసియా కప్లో పాకిస్తాన్తో మ్యాచ్లో అజేయ శతకంతో ఫామ్లోకి వచ్చాడు. రాహుల్ సైలెంట్ కిల్లర్ ఆ తర్వాత అతడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ముఖ్యంగా వరల్డ్కప్ టోర్నీలో ఆస్ట్రేలియాతో ఆరంభ మ్యాచ్లో రోహిత్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ డకౌట్లుగా వెనుదిరిగిన వేళ.. కోహ్లి(85)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్ది జట్టును గెలిపించిన తీరు అద్భుతం. నాటి మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు రాహుల్. ప్రతి మ్యాచ్లోనూ బ్యాటర్గా తన వంతు సహకారం అందిస్తున్న ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. వికెట్ కీపర్గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అవును.. వికెట్ల వెనుక కళ్లు చెదిరే రీతిలో క్యాచ్లు అందుకోవడం సహా డీఆర్ఎస్ల విషయంలో కచ్చితత్వంతో కెప్టెన్ రోహిత్ శర్మను సైతం ఆశ్చర్యపరుస్తున్నాడు. కీలక సమయాల్లో రాహుల్ మాటను నమ్మి రోహిత్ రివ్యూలో చాలా మటుకు సక్సెస్ కావడం ఇందుకు నిదర్శనం. అయ్యర్ అద్భుత బ్యాటర్ ఇక శ్రేయస్ అయ్యర్ విషయానికొస్తే.. దాయాది పాకిస్తాన్తో మ్యాచ్లో అజేయ హాఫ్ సెంచరీ(53)తో మెరిశాడు. కానీ ఆ తర్వాత నామమాత్రపు స్కోర్లకే పరిమితమై వరుస వైఫల్యాలతో విమర్శల పాలయ్యాడు. అయితే, శ్రీలంకతో మ్యాచ్(82 పరుగులు)లో తిరిగి గాడిలో పడ్డ అయ్యర్.. సౌతాఫ్రికాతో మ్యాచ్లో 77 పరుగులు సాధించాడు. ఇక నెదర్లాండ్స్లో మ్యాచ్లో ఏకంగా 128 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత సెమీ ఫైనల్లో న్యూజిలాండ్తో మ్యాచ్లో సొంతమైదానం వాంఖడేలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 70 బంతుల్లో 105 పరుగులు చేసి వరల్డ్కప్ నాకౌట్ దశలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్లో రాహుల్ సైతం 20 బంతుల్లో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా వీరిద్దరు మిడిలార్డర్లో నిలకడగా రాణిస్తుండటం టీమిండియా పాలిట వరంలా మారింది. కీలకమైన నాలుగు, ఐదు స్థానాల్లో అయ్యర్, రాహుల్ సక్సెస్ అవుతుండటంతో బ్యాటింగ్ ఆర్డర్ మునుపెన్నడూ లేని విధంగా మరింత పటిష్టంగా కనిపిస్తోంది. ప్రతి మ్యాచ్లో 10 వికెట్లు టీమిండియా విజయాల్లో బ్యాటర్ల సంగతి ఇలా ఉంటే.. బౌలింగ్ విభాగం ముఖ్యంగా పేస్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుమ్రా, సిరాజ్ వరుస అవకాశాలు దక్కించుకుంటే.. లేట్గా ఎంట్రీ ఇచ్చినా షమీ ఎలాంటి అద్భుతాలు చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. షమీ బుల్లెట్ ఇప్పటి వరకు మూడు ఐదు వికెట్ల హాల్స్ నమోదు చేసి మొత్తంగా 23 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు షమీ. ఇక బుమ్రా 18, సిరాజ్ 13 వికెట్లతో వరుసగా ఆరు, పద్దెనిమిది స్థానాల్లో ఉన్నారు. అదే విధంగా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ సైతం తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లన్నిటిలో ఏకంగా 10 వికెట్లు తీయడాన్ని బట్టి మన బౌలర్ల ప్రదర్శన ఎలా ఉందో చెప్పవచ్చు. కోహ్లి టాప్ గన్ ఇదిలా ఉంటే.. టాప్ రన్ స్కోరర్ల జాబితాలో.. 711 పరుగులతో కోహ్లి అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఇక రోహిత్ శర్మ 550 రన్స్తో ఐదు, శ్రేయస్ అయ్యర్ 526 పరుగులతో ఏడు, కేఎల్ రాహుల్ 386 పరుగులతో పద్నాలుగవ స్థానాల్లో ఉన్నారు. -
CWC 2023 : శ్రీలంకపై 302 పరుగులతో టీమిండియా ఘనవిజయం (ఫొటోలు)
-
షమీ 5 కోహ్లి 95 భారత్ 5
1, 2, 3, 4, 5... ఐదు మ్యాచ్లు మనవే! మైదానంలోకి దిగిన ప్రతీసారి విజయం మన జట్టునే వరించింది... ఆ్రస్టేలియా, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్ లెక్క కూడా తేల్చేశాం... ఐదుసార్లూ ప్రత్యర్థి లక్ష్యాన్ని నిర్దేశిస్తే అన్నింటినీ ఛేదించేశాం... ఫలితంగా వరల్డ్ కప్లో టీమిండియా తిరుగులేని ప్రదర్శనతో మళ్లీ పైచేయి సాధించింది... టోర్నీలో ఇప్పటి వరకు అజేయంగా ఉన్న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సమరంలో రోహిత్ బృందానికే గెలుపు దక్కింది. ప్రపంచకప్లో 20 మ్యాచ్లు జరిగినా హోరాహోరీ సమరం కనిపించలేదనేవారికి ఈ మ్యాచ్ సమాధానం ఇచ్చింది. పలు మలుపులతో ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్లో 12 బంతుల ముందు భారత్ గట్టెక్కింది. 19/2 నుంచి 243/4కు చేరిన కివీస్ను 273కే పరిమితం చేసి భారత్ పైచేయి సాధించింది. గత మ్యాచ్లకు భిన్నంగా కొంత తడబడి ఆరు వికెట్లు చేజార్చుకున్నా... చివరకు ఫలితం దక్కింది. టోర్నీలో తాను ఆడిన తొలి మ్యాచ్లో షమీ 5 వికెట్లతో చెలరేగగా... కోహ్లి తనదైన శైలిలో నిలబడి పరుగులను వేటాడినా త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. ధర్మశాల: వన్డే ప్రపంచకప్లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆడిన ఐదో మ్యాచ్లోనూ గెలుపు బావుటా ఎగరేసిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. డరైల్ మిచెల్ (127 బంతుల్లో 130; 9 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీ సాధించగా, రచిన్ రవీంద్ర (87 బంతుల్లో 75; 6 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ షమీ (5/54) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని నిలువరించాడు. అనంతరం భారత్ 48 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసి గెలిచింది. విరాట్ కోహ్లి (104 బంతుల్లో 95; 8 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగగా, రోహిత్ శర్మ (40 బంతుల్లో 46; 4 ఫోర్లు, 4 సిక్స్లు), రవీంద్ర జడేజా (44 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. భారత్ తమ తర్వాతి మ్యాచ్లో ఈనెల 29న లక్నోలో ఇంగ్లండ్తో తలపడుతుంది. భారీ భాగస్వామ్యం... ఆరంభంలోనే న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాన్వే (0)ను సిరాజ్ అవుట్ చేయగా, ఈ ప్రపంచకప్లో తాను వేసిన తొలి బంతికే యంగ్ (17)ను షమీ అవుట్ చేశాడు. అయితే రచిన్, మిచెల్ మూడో వికెట్ భాగస్వామ్యం కివీస్ను కోలుకునేలా చేసింది. మరో 25 ఓవర్లపాటు వీరిద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు టోర్నీలో ప్రత్యర్థి బ్యాటర్లందరినీ కట్టడి చేసిన కుల్దీప్ బౌలింగ్లో వీరు వేగంగా పరుగులు రాబట్టారు. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రచిన్ ఇచ్చిన (షమీ బౌలింగ్లో) సునాయాస క్యాచ్ను జడేజా వదిలేశాడు! దీనిని రచిన్ సమర్థంగా వాడుకున్నాడు. ఈ క్రమంలో 56 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాత 60 బంతుల్లో మిచెల్ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఆ తర్వాతా వీరిద్దరు ధాటిని ప్రదర్శించడంతో భాగస్వామ్యం 150 పరుగులు దాటింది. 69 పరుగుల వద్ద మిచెల్ ఇచ్చిన సులువైన క్యాచ్ను బుమ్రా నేలపాలు చేశాడు. ఎట్టకేలకు రచిన్ను వెనక్కి పంపి షమీ ఈ జోడీని విడదీశాడు. లాథమ్ (5) విఫలం కాగా 100 బంతుల్లో మిచెల్ శతకాన్ని అందుకొని ప్రపంచకప్లో భారత్పై సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా నిలిచాడు. అయితే ఆ తర్వాత కివీస్ పతనం వేగంగా సాగింది. 243/4తో మెరుగైన స్థితిలో కనిపించిన జట్టు భారత బౌలర్ల ధాటికి చివరి 6 ఓవర్లలో 30 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. జడేజా అండగా... భారత్కు ఛేదనలో రోహిత్ మరోసారి అద్భుత ఆరంభాన్ని అందించాడు. బౌల్ట్, హెన్రీల బౌలింగ్లో చెలరేగి ఫోర్లు, సిక్సర్లతో దూసుకుపోయాడు. అతనికి శుబ్మన్ గిల్ (31 బంతుల్లో 26; 5 ఫోర్లు) అండగా నిలిచాడు. అయితే ఫెర్గూసన్ 7 బంతుల వ్యవధిలో వీరిద్దరిని వెనక్కి పంపాడు. ఈ దశలో కోహ్లి పట్టుదలగా నిలబడిన తీరు భారత్కు గెలుపు అవకాశాలు సృష్టించింది. శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 33; 6 ఫోర్లు), కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 27; 3 ఫోర్లు)లతో పాటు చివర్లో జడేజాతో కోహ్లి మూడు అర్ధసెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం. ఆరంభంలో నెమ్మదిగా ఆడి ఒకదశలో 47 బంతుల్లో 28 పరుగులే చేసిన కోహ్లి ఆ తర్వాత దూకుడు పెంచాడు. 60 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. సమన్వయలోపంతో సూర్యకుమార్ (2) రనౌటైన తర్వాత కోహ్లి, టోర్నీలో తొలిసారి బ్యాటింగ్కు దిగిన జడేజా జత కలిశారు. ఆ సమయంలో 16.1 ఓవర్లలో మరో 83 పరుగులు చేయాల్సి ఉంది. ఈ స్థితిలో వీరిద్దరు ప్రశాంతంగా ఆడుతూ జట్టును లక్ష్యంవైపు నడిపించారు. కివీస్ బౌలర్లు అప్పుడప్పుడు కొన్ని మంచి బంతులతో ఒత్తిడి పెంచగలిగినా... భారత్ గెలుపును ఆపలేకపోయారు. పాండ్యా, శార్దుల్ స్థానాల్లో షమీ, సూర్యకుమార్ ఈ మ్యాచ్లో జట్టులోకి వచ్చారు. ఈసారి సెంచరీ దక్కలేదు! మ్యాచ్లో ఒకవైపు భారత్ గెలుపు అవకాశాలు మెరుగవుతూ రాగా, మరోవైపు కోహ్లి సెంచరీ చేసి సచిన్ను సమం చేస్తాడా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్లో రాహుల్లాగే ఈసారి జడేజా కూడా సహకరించడంతో ఆఖర్లో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు కోహ్లి ఒక్కడే చేసి శతకానికి చేరువయ్యాడు. జట్టుకు 35, కోహ్లికి 25 పరుగులు అవసరమైనప్పుడు ఉత్కంఠ పెరిగింది. ఆపై ఈ సమీకరణం 19 పరుగులు, 18 పరుగులకు మారింది. అయితే బౌల్ట్ వేసిన 47వ ఓవర్లో కోహ్లి 6, 4 సహా 11 పరుగులు రాబట్టి 93కు చేరుకున్నాడు. ఇప్పుడు 7 పరుగులు కావాల్సి ఉండగా తొలి బంతికి కోహ్లి 2 పరుగులు తీశాడు. అయితే మూడో బంతిని భారీ సిక్సర్గా మలచి ముగించే ప్రయత్నంలో బౌండరీ లైన్కు చాలా ముందే క్యాచ్ ఇచ్చాడు. దాంతో అతను ప్రస్తుతానికి 48 సెంచరీల వద్దే నిలిచాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) అయ్యర్ (బి) సిరాజ్ 0; యంగ్ (బి) షమీ 17; రచిన్ (సి) గిల్ (బి) షమీ 75; మిచెల్ (సి) కోహ్లి (బి) షమీ 130; లాథమ్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 5; ఫిలిప్స్ (సి) రోహిత్ (బి) కుల్దీప్ 23; చాప్మన్ (సి) కోహ్లి (బి) బుమ్రా 6; సాన్ట్నర్ (బి) షమీ 1; హెన్రీ (బి) షమీ 0; ఫెర్గూసన్ (రనౌట్) 1; బౌల్ట్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 273. వికెట్ల పతనం: 1–9, 2–19, 3–178, 4–205, 5–243, 6–257, 7–260, 8–260, 9–273, 10–273. బౌలింగ్: బుమ్రా 10–1–45–1, సిరాజ్ 10–1– 45–1, షమీ 10–0–54–5, జడేజా 10–0– 48–0, కుల్దీప్ 10–0–73–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) ఫెర్గూసన్ 46; గిల్ (సి) మిచెల్ (బి) ఫెర్గూసన్ 26; కోహ్లి (సి) ఫిలిప్స్ (బి) హెన్రీ 95; అయ్యర్ (సి) కాన్వే (బి) బౌల్ట్ 33; రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సాన్ట్నర్ 27; సూర్యకుమార్ (రనౌట్) 2; జడేజా (నాటౌట్) 39; షమీ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (48 ఓవర్లలో 6 వికెట్లకు) 274. వికెట్ల పతనం: 1–71, 2–76, 3–128, 4–182, 5–191, 6–269. బౌలింగ్: బౌల్ట్ 10–0–60–1, హెన్రీ 9–0–55–1, సాన్ట్నర్ 10–0–37–1, ఫెర్గూసన్ 8–0–63–2, రచిన్ 9–0–46–0, ఫిలిప్స్ 2–0–12–0. ప్రపంచకప్లో నేడు పాకిస్తాన్ Xఅఫ్గానిస్తాన్ వేదిక: చెన్నై మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
‘శార్దూల్ ఎందుకు? సిరాజ్ను ఎందుకు ఆడిస్తున్నారు?.. అసలేంటి ఇదంతా?’
ICC WC 2023- Team India: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్కు భారత మాజీ పేసర్ శ్రీశాంత్ అండగా నిలిచాడు. మేనేజ్మెంట్ అన్నీ ఆలోచించిన తర్వాతే తుదిజట్టును ఎంపిక చేస్తుందని.. మ్యాచ్ సాగుతున్న తీరును బట్టి విమర్శలు చేయడం సరికాదని హితవు పలికాడు. కొంతమంది ‘టోపీ మాస్టర్లు’ మాత్రం అంతా తమకే తెలుసునన్నట్లు మాట్లాడతారంటూ సిరాజ్ను విమర్శించిన వారిపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై సిరాజ్ ఒక వికెట్ తీయగలిగాడు. అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో ధారాళంగా పరుగులిచ్చి పవర్ ప్లేలో మ్యాజిక్ చేయలేకపోయినప్పటికీ 6.3 ఓవర్లలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగానే బౌలింగ్ చేశాడు. అయితే, రెండో మ్యాచ్లో మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అఫ్గనిస్తాన్తో ఢిల్లీలోని అరుణ్జైట్లీ మైదానంలో బుధవారం జరిగిన మ్యాచ్లో సిరాజ్ ఏకంగా 76 పరుగులిచ్చాడు. 9 ఓవర్ల బౌలింగ్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో.. మహ్మద్ షమీని కాదని సిరాజ్ను ఎంపిక చేసి మేనేజ్మెంట్ తప్పుచేసిందంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన కేరళ మాజీ బౌలర్ శ్రీశాంత్.. ‘‘మ్యాచ్ మొదలుకావడానికి ముందు.. అసలేంటి ఇదంతా? ‘‘అయ్యో.. శార్దూల్ను ఎందుకు ఆడిస్తున్నారు? అంటూ గగ్గోలుపెట్టారు. మ్యాచ్ మొదలైన తర్వాత.. సిరాజ్ పరుగులిస్తూ ఉంటే.. ‘‘ఈరోజు సిరాజ్ను ఎందుకు ఆడిస్తున్నారు?’’ అంటూ కామెంట్లు చేశారు. వాళ్లంతా ‘టోపీ మాస్టర్లు’. ఇదిలా ఉంటే.. కెమెరా మాటిమాటికీ షమీ, అశ్విన్పైకి గురిపెట్టి చూపిస్తూనే ఉండటం దేనికి సంకేతం. యాజమాన్యం ఎంపిక చేసిన జట్టుకు మనం మద్దతుగా నిలవాలి కదా!’’ అని స్పోర్ట్స్కీడాతో చెప్పుకొచ్చాడు. కాగా అఫ్గన్తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. తదుపరి పాకిస్తాన్తో వెటరన్ స్పిన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో.. పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆడాడు. ఈ క్రమంలో అశూను కాదని శార్దూల్ను ఎందుకు ఆడిస్తున్నారంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు కెప్టెన్ రోహిత్ శర్మ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మరికొందరు సిరాజ్ను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఆసీస్ మీద 6, అఫ్గనిస్తాన్ మీద 8 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా అక్టోబరు 14న పాకిస్తాన్తో మ్యాచ్కు సిద్ధమవుతోంది. చదవండి: WC: క్యాన్సర్తో పోరాడుతూ వరల్డ్కప్ ఆడాను.. డెంగ్యూ వల్ల గిల్..: యువీ -
Ind vs Pak: అతడి బ్యాటింగ్ అంతగొప్పగా ఏమీ ఉండదు.. షమీని ఆడించండి!
ICC WC 2023- Ind vs Pak: ‘‘శార్దూల్ ఠాకూర్.. మహ్మద్ షమీ వీరిద్దరిలో ఎవరిని ఆడిస్తారనే చర్చ ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. అయితే, చాలాసార్లు మేనేజ్మెంట్ శార్దూల్ వైపే మొగ్గు చూపుతుంది. ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేస్తాడు గనుక షమీని కాదని అతడిని తీసుకుంటారని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. అయితే, అఫ్గనిస్తాన్ వంటి జట్టుతో మ్యాచ్లో కూడా నంబర్ 8లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుందా? అంటే లేదనే సమాధానం చెప్పొచ్చు. లేదంటే.. కొంతమంది బిగ్షాట్లు ఆడే ప్లేయర్లు ఉంటారు.. వాళ్లు లేకపోతే ఓటమి ఎదురవుతుందనే సందర్భాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. అంత గొప్ప బ్యాటరేమీ కాదు! కానీ.. ఇలాంటి టీమ్స్తో ఆడినపుడు లోయర్ ఆర్డర్ వరకు బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉందనుకుంటే పొరబడినట్లే! నిజానికి శార్దూల్ ఏమీ గొప్ప బ్యాటర్ కాదు. ఎనిమిదో నంబర్లో అతడు కేవలం రన్-ఏ- బాల్ ప్లేయర్ మాత్రమే. 20 బంతుల్లో 45 పరుగులు రాబట్టే రకమేమీ కాదు. అతడు అలా ఆడలేడు కూడా! ఏదేమైనా బ్యాటింగ్ ఆర్డర్లో ఎనిమిదో స్థానం వరకు డెప్త్ ఉండాలనుకుంటే వాళ్లు శార్దూల్ ఆడిస్తారు. కానీ నా అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్తో మ్యాచ్లో శార్దూల్ కంటే షమీ అవసరమే ఎక్కువగా ఉంటుంది. తదుపరి మ్యాచ్లో అతడిని తప్పక ఆడించాలి’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో చెన్నైలో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. చెపాక్లో అశ్విన్.. ఢిల్లీలో శార్దూల్ చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ‘లోకల్ స్టార్’ రవిచంద్రన్ అశ్విన్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, ఢిల్లీలో అఫ్గనిస్తాన్తో రెండో మ్యాచ్లో అశ్విన్ స్థానంలో పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను జట్టులోకి తీసుకుంది. అరుణ్జైట్లీ స్టేడియంలో అదనపు సీమర్ అవసరమన్న విశ్లేషణల నడుమ ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న శార్దూల్ వైపు మొగ్గు చూపింది. అయితే, అఫ్గనిస్తాన్పై మంచి రికార్డు ఉన్న షమీని కాదని శార్దూల్ను తీసుకోవడం సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలకు నచ్చలేదు. పాక్తో మ్యాచ్లో షమీని ఆడిస్తేనే బెటర్ ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తన యూట్యూబ్ చానెల్ వేదికగా పైవిధంగా స్పందించాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో మహ్మద్ షమీని ఆడిస్తేనే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. కాగా ఆసీస్పై 6 వికెట్లు, అఫ్గన్పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది ఫుల్జోష్లో ఉన్న టీమిండియా అక్టోబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో పోరుకు సిద్ధమవుతోంది. అహ్మదాబాద్లోని దాదాపు లక్ష సీట్ల సామర్థ్యం గల నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. ఇక పాకిస్తాన్ సైతం ఆడిన రెండు మ్యాచ్లలో విజయాలు సాధించి జోరు మీదున్న విషయం తెలిసిందే. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి చదవండి: WC 2023- Ind Vs Pak: పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు టీమిండియాకు గుడ్న్యూస్! కానీ.. -
టీమిండియా పేసర్ షమీకి భారీ షాక్! కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ నుంచి విడిగా ఉంటున్న అతడి భార్య హసీన్ జహాన్ పిటిషన్పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హసీన్ జహాన్ పిటిషన్పై విచారణ చేపట్టి నెలరోజుల్లోగా కేసును పరిష్కరించాలని పశ్చిమ బెంగాల్ సెషన్స్ కోర్టును ఆదేశించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఏళ్లకు ఏళ్లు ఈ కేసును సాగదీయడం సరికాదని ఈ సందర్భంగా అభిప్రాయపడింది. కాగా షమీపై సంచలన ఆరోపణలు చేస్తూ గృహహింస కేసు పెట్టిన హసీన్ జహాన్.. అతడి అరెస్టును అడ్డుకునే స్టేను ఎత్తివేయాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీం కోర్టు గురువారం ఆమె పిటిషన్పై విచారణ జరిపింది. కేసును సాగదీయకుండా సత్వరమే పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ సెషన్స్ కోర్టును ఆదేశించింది. కాగా షమీపై హసీన్ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో 2019, ఆగష్టు 29న అలీపూర్ అడిషినల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ సెషన్స్ కోర్టును ఆశ్రయించిన షమీ సెప్టెంబరు 9న తన అరెస్టుపై స్టే విధించాల్సిందిగా కోరాడు. అదే విధంగా తనపై ఎలాంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశాడు. ఆ తర్వాత హసీన్ ఈ విషయమై హైకోర్టును సంప్రదించగా అక్కడ చుక్కెదురైంది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇక ఇదంతా జరిగి నాలుగేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ కేసు అపరిష్కృతంగా ఉంది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ.. నెలరోజుల్లోగా కేసును పరిష్కరించాలని.. ఒకవేళ అది వీలుపడకపోతే స్టే ఆర్డర్లో మార్పులు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని సెషన్స్ కోర్టు జడ్జిని ఆదేశించింది. చదవండి: Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్ -
అతడి సేవలను సన్రైజర్స్ సరిగ్గా వాడుకోవడం లేదు! కనీస మద్దతు లేకుండా..
IPL 2023 SRH: టీమిండియా యువ సంచలనం, కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ సేవలను సన్రైజర్స్ హైదరాబాద్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుందని భారత మాజీ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ అన్నాడు. లోపం ఎక్కడ ఉందో అర్థం కావడం లేదని వాపోయాడు. కాగా నెట్ బౌలర్గా సన్రైజర్స్ జట్టులో చేరిన ఉమ్రాన్.. తన అద్భుతమైన ఆట తీరుతో అనతికాలంలోనే ప్రధాన బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. Photo Credit : IPL Website నెట్ బౌలర్గా వచ్చి..! ఏకంగా టీమిండియాలో కచ్చితమైన వేగంతో బంతులు విసిరే ఈ స్పీడ్స్టర్ ఐపీఎల్-2021 సీజన్లో కేకేఆర్తో మ్యాచ్ ద్వారా రైజర్స్ తరఫున అరంగేట్రం చేశాడు. గతేడాది 14 ఇన్నింగ్స్లో 22 వికెట్లు పడగొట్టిన అతడు.. అదే ఏడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఉమ్రాన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం ఏడు మ్యాచ్లు ఆడిన అతడు 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో ఏప్రిల్ 29 నాటి మ్యాచ్ తర్వాత అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. కెప్టెన్కే తెలియదట ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్కు ముందు రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ మాట్లాడుతూ.. ఉమ్రాన్ ఆడకపోవడం వెనుక కారణమేమిటో తెలియదని వ్యాఖ్యానించాడు. మార్కరమ్ తీరు పలు సందేహాలకు తావిచ్చింది. ఈ క్రమంలో జియో సినిమా షోలో జహీర్ ఖాన్ ఈ విషయంపై స్పందించాడు. ఉమ్రాన్ విషయంలో సన్రైజర్స్ ఎందుకిలా?! ‘‘సన్రైజర్స్ ఫ్రాంఛైజీ ఉమ్రాన్ సేవలను సరిగ్గా వాడుకోలేకపోతోంది. ఇందుకు కారణమేమిటో మాత్రం తెలియడం లేదు. యువ సీమర్లను జట్టులో ఉంచుకున్నపుడు.. వారికి అవసరమైన సమయంలో అన్ని రకాలుగా మద్దతుగా నిలబడాలి. లోపాలను సరిచేసుకునేందుకు సరైన వ్యక్తితో మార్గదర్శనం చేయించాలి. కానీ దురదృష్టవశాత్తూ ఉమ్రాన్ విషయంలో ఫ్రాంఛైజీ ఇవేమీ చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఈ సీజన్లో అతడి ఆట తీరు, పలు మ్యాచ్లకు పక్కన పెట్టిన విధానం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది’’ అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. వాళ్లిద్దరు సూపర్ ఇదిలా ఉంటే.. టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, హైదరాబాదీ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పవర్ ప్లేలో అద్భుతాలు చేస్తున్నారని జహీర్ కొనియాడాడు. పెద్దగా కష్టపడకుండా బ్యాటర్లను తిప్పలు పెడుతూ అనుకున్న ఫలితాలు రాబడుతున్నారంటూ షమీ, సిరాజ్లను కొనియాడాడు. కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 13 మ్యాచ్లలో 23 వికెట్లు తీసిన షమీ.. పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. ఇక సిరాజ్ 13 మ్యాచ్లలో 17 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్రైజర్స్ ఆర్సీబీతో మ్యాచ్లోనూ ఓడిపోయి పదో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: రూ. 8 కోట్లు పెడితే మధ్యలోనే వదిలివెళ్లాడు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు! ఇది క్రికెట్ షోనా? లేదంటే.. అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ..! సిగ్గుండాలి! -
నక్క తోక తొక్కిన వార్నర్..
ఐపీఎల్ 16వ సీజన్లో మంగళవారం గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా మొదలైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీకి షమీ తొలి ఓవర్లో వార్నర్కు చుక్కలు చూపించాడు. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వార్నర్ నక్క తోక తొక్కినట్లున్నాడు. ఓవర్ తొలి బంతిని వైడ్ వేసిన షమీ ఆ తర్వాత బంతిని మాత్రం అద్బుతంగా వేశాడు. మిడిల్ స్టంప్ అయిన బంతి ఆఫ్స్టంప్ను తాకుతూ కీపర్ సాహా చేతుల్లోకి వెళ్లింది. కానీ బెయిల్స్ ఇంచు కూడా కదల్లేదు. దీంతో వార్నర్ బతికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ తర్వాత వార్నర్ 32 బంతుల్లో 37 పరుగులు చేసి అల్జారీ జోసెఫ్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. pic.twitter.com/ujy9abVzAX — Guess Karo (@KuchNahiUkhada) April 4, 2023 -
వింతగా ప్రవర్తించిన టీమిండియా అభిమానులు..
అహ్మదాబాద్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆట తొలి రెండు రోజులు ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చూపించింది. ఉస్మాన్ ఖవాజా 180 పరుగులతో టీమిండియాపై కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడగా.. కామెరాన్ గ్రీన్ డెబ్యూ టెస్టు శతకంతో చెలరేగాడు. వెరసి ఆస్ట్రేలియా సిరీస్లో తొలిసారి 400 పరుగులు మార్క్ను చేరుకుంది. టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడంలో చెమటోడ్చారు. ఆ తర్వాత కూడా టెయిలెండర్లు ప్రతిఘటించడంతో 480 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ ఆరు వికెట్లతో చెలరేగాడు. ఇక రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. మూడోరోజు ఆట టీమిండియాకు కీలకం కానుంది. ఇక రెండోరోజు ఆటలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్కు హాజరైన అభిమానులు కాస్త వింతగా ప్రవర్తించారు. రెండో రోజు చివరి సెషన్లో సూర్యకుమార్ కనిపించగానే సూర్య.. సూర్య అంటూ గట్టిగా అరిచారు. ఆ తర్వాత మహ్మద్ షమీ కనిపించగానే షమీ.. జై శ్రీరామ్.. షమీ.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అయితే షమీ దీనిని పెద్దగా పట్టించుకోకుండా అభివాదం చేశాడు. ముస్లిం, హిందులకు ప్రతీకగానే జై శ్రీరామ్ నినాదాలు చేసినట్లు ఒక అభిమాని వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గర్వంగా చెప్పుకున్నాడు. ఇక షమీ పీటర్ హ్యాండ్స్కోబ్తో పాటు మార్నస్ లబుషేన్ వికెట్లు సాధించాడు. ముఖ్యంగా పీటర్ హ్యాండ్స్కోబ్ను ఔట్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఆసీస్ ఇన్నింగ్స్ 71 ఓవర్ వేసిన షమీ బౌలింగ్లో నాలుగో బంతిని హ్యాండ్స్కాంబ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే మంచి లైన్ అండ్ లెంగ్త్లో పడ్డ బంతి బ్యాట్ను మిస్స్ అయి ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. Shami Ko Jai Shree Ram 🚩 pic.twitter.com/rwVg1yMEaz — Gems of Shorts (@Warlock_Shabby) March 9, 2023 చదవండి: రెండోరోజు ఆట ముగింపు.. కోహ్లి చర్య వైరల్ 'బ్యాటర్గా విఫలం.. ఓటములకు పూర్తి బాధ్యత నాదే' -
షమీ చెవులు పిండిన అశ్విన్.. ఫోటో వైరల్
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదలైన రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆట తొలిరోజునే టీమిండియా బౌలర్లు మంచి ప్రదర్శన కనబరచడంతో ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యేలా కనిపిస్తోంది. అయితే తొలి టెస్టుతో పోలిస్తే ఆసీస్ బ్యాటర్లు కాస్త ప్రతిఘటించారు తప్ప మరోసారి స్పిన్ ఉచ్చులో పడిపోయారు. జడేజా, అశ్విన్లకు తోడు షమీ కూడా రాణించడంతో ఆస్ట్రేలియా పరుగులు చేసినప్పటికి వికెట్లు కోల్పోయింది. ఈ సంగతి పక్కనబెడితే ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ను షమీ దక్కించుకున్నాడు. 10 పరుగులు చేసిన నాథన్ లియోన్ అతని బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. షమీ ఖాతాలో ఇది మూడో వికెట్. సెలబ్రేషన్ సమయంలో షమీ వెనుక వచ్చి నిల్చున్న అశ్విన్ గుడ్ బౌలింగ్ యార్ అంటూ చెవులు పిండాడు. అయితే అశ్విన్ కాస్త గట్టిగా పిండాడనుకుంటా.. నొప్పితో షమీ మొహం మారిపోయింది. అయితే ఇదంతా సరదాగా చేయడంతో టీమిండియా క్రికెటర్ల మధ్య నవ్వులు విరపూశాయి. ఇక రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా స్పిన్నర్లు జడేజా, అశ్విన్లతో పాటు షమీ కూడా చెలరేగడంతో ఆసీస్ తొలిరోజునే తన ఇన్నింగ్స్ను ముగించాల్సి వచ్చింది. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా 81 పరుగులు చేయగా.. పీటర్ హ్యాండ్స్కోబ్ 72 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. షమీ నాలుగు వికెట్లతో చెలరేగగా.. అశ్విన్, జడేజాలు చెరొక మూడు వికెట్లు తీశారు. Ouch 😅 #INDvAUS #RavichandranAshwin #MohammedShami pic.twitter.com/WTDjCMB4Zk — CricTelegraph (@CricTelegraph) February 17, 2023 చదవండి: పుజారా వందో టెస్టు.. కుటుంబం మొత్తం స్టేడియంలో 'చేసేయాల్సింది ఒక పనైపోయేది..' -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. 108 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్
రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. మహ్మద్ షమీ (3/18), మహ్మద్ సిరాజ్ (1/10), శార్దూల్ ఠాకూర్ (1/26), హార్ధిక్ పాండ్యా (2/16), కుల్దీప్ యాదవ్ (1/29), వాషింగ్టన్ సుందర్ (2/7) విజృంభించడంతో 34.3 ఓవర్లలోనే కివీస్ను ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. తొలి వన్డే సెంచరీ హీరో బ్రేస్వెల్ ఈ మ్యాచ్లోనూ చెలరేగేలా కనిపించినప్పటికీ.. అతన్ని షమీ బోల్తా కొట్టించాడు. కివీస్ ఇన్నింగ్స్లో ఫిన్ అలెన్ (0), డెవాన్ కాన్వే (7), హెన్రీ నికోల్స్ (2), డారిల్ మిచెల్ (1), టామ్ లాథమ్ (1), ఫెర్గూసన్ (1), బ్లెయిర్ టిక్నర్ (2) విఫలమయ్యారు. కాగా, హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 3 మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
కివీస్ దారుణ ఆటతీరు.. చెత్త రికార్డు నమోదు
రాయ్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ దారుణ ఆటతీరును ప్రదర్శిస్తోంది. తొలి వన్డేలో పోరాడిన జట్టేనా ఇప్పుడు ఆడుతుంది అన్న తరహాలో కివీస్ బ్యాటింగ్ సాగుతుంది. ప్రస్తుతం 22 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. గ్లెన్ పిలిప్స్ 20, మిచెల్ సాంట్నర్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్లో సెంచరీతో ఆకట్టుకున్న మైకెల్ బ్రాస్వెల్ ఈ మ్యాచ్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. టీమిండియా బౌలర్ల దాటికి కివీస్ టాపార్డర్ కకావికలమైంది. మహ్మద్ షమీ తన పేస్ పదును చూపిస్తూ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, పాండ్యా, శార్దూల్ ఠాకూర్లు తలా ఒక వికెట్ తీశారు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ వన్డేల్లో ఒక చెత్త రికార్డు నమోదు చేసింది. టీమిండియాతో వన్డేలో 15 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన కివీస్కు ఇదే అత్యల్పం. ఇంతకముందు 2001లో శ్రీలంకతో మ్యాచ్లో 18 పరుగులకు ఐదు వికెట్లు, 2010లో బంగ్లా తో మ్యాచ్లో 20 పరుగులకు ఐదు వికెట్లు, 2003లో ఆస్ట్రేలియాపై 21 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. చదవండి: రోహిత్ శర్మ.. ఇంత మతిమరుపా! -
9 పరుగులకే మూడు వికెట్లు.. కష్టాల్లో కివీస్
టీమిండియాతో రెండో వన్డేలో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. తొమ్మిది పరుగులకే మూడో వికెట్లు కోల్పోయింది. టీమిండియా బౌలర్లు సిరాజ్, షమీలు నిప్పులు చెరిగే బంతులతో కివీస్ బ్యాటర్లను వణికించారు. పిచ్పై ఉన్న పచ్చికను బాగా ఉపయోగించుకున్న షమీ తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫిన్ అలెన్కు క్లీన్బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో మహ్మద్ సిరాజ్ రెండు పరుగులు చేసిన హెన్రీ నికోల్స్ గిల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత మరుసటి ఓవర్లో షమీ బౌలింగ్లో డారిల్ మిచెల్(1) కాట్ అండ్ బౌల్డ్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం కివీస్ 8 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసింది. లాథమ్ 1, కాన్వే 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
Ind Vs SL: అందుకే ఆ రనౌట్ అప్పీలు వెనక్కి తీసుకున్నాం: రోహిత్ శర్మ
India vs Sri Lanka, 1st ODI- Rohit Sharma: శ్రీలంకపై భారీ గెలుపుతో వన్డే సిరీస్ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. గువహటి వేదికగా తొలి వన్డేలో రోహిత్ సేన పర్యాటక లంకపై 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ 83, మరో ఓపెనర్ 70 పరుగులతో చెలరేగగా.. విరాట్ కోహ్లి సెంచరీ(113)తో మెరవడం హైలైట్గా నిలిచాయి. సెంచరీకి రెండే పరుగుల దూరంలో ఇదిలా ఉంటే.. భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకను గెలిపించేందుకు ఆ జట్టు సారథి దసున్ షనక శాయశక్తులా ప్రయత్నించాడు. భారత గడ్డపై తొలి సెంచరీ(108 .. నాటౌట్) సాధించి సత్తా చాటాడు. అయితే, లంక ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన భారత పేసర్ మహ్మద్ షమీ... సెంచరీకి రెండే పరుగుల దూరంలో ఉన్న షనక (98 వద్ద) రనౌట్(మన్కడింగ్) చేశాడు. నిజానికి ఇది అవుటే! కానీ కెప్టెన్ రోహిత్... షమీ దగ్గరకొచ్చి వారించాడు. అందుకే వెనక్కి తీసుకున్నాం వెంటనే షమీ అంపైర్తో అప్పీల్ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో షనక ఐదో బంతికి ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకోగలిగాడు. ఈ విషయంపై స్పందించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ నిర్ణయానికి గల కారణాన్ని వెల్లడించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘షమీ రనౌట్ చేశాడని నాకు తెలియదు. షనక 98 పరుగుల వద్ద ఉన్న సమయంలో తను ఎందుకు అప్పీలు చేశాడో తెలియదు. ఏదేమైనా.. షనక అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తనను మరీ ఇలా అవుట్ చేయాలనుకోవడం భావ్యం కాదు కూడా! మేము అలా అనుకోలేదు! హ్యాట్సాఫ్ షనక. తను నిజంగా అత్యద్భుతంగా ఆడాడు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. తన విషయంలో వెనక్కి తగ్గినా పర్లేదనుకున్నామని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా షనక విషయంలో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిన హిట్మ్యాన్పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అతడిని కొనియాడుతూ.. ‘‘లవ్ యూ భాయ్’’ అని పోస్టులు పెడుతున్నారు. ఇండియా వర్సెస్ శ్రీలంక తొలి వన్డే స్కోర్లు: ఇండియా- 373/7 (50) శ్రీలంక- 306/8 (50) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: విరాట్ కోహ్లి చదవండి: WTC: భారత్తో సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. మూడున్నరేళ్ల తర్వాత అతడి రీ ఎంట్రీ IND vs SL: వారెవ్వా.. సిరాజ్ దెబ్బకు బిత్తరపోయిన లంక బ్యాటర్ Captain @ImRo45 explains why he withdrew the run-out appeal at non striker’s end involving Dasun Shanaka.#INDvSL @mastercardindia pic.twitter.com/ALMUUhYPE1 — BCCI (@BCCI) January 10, 2023 -
ఇంగ్లండ్తో మ్యాచ్.. అడవి బాట పట్టిన టీమిండియా క్రికెటర్
టి20 ప్రపంచకప్లో బుమ్రా స్థానంలో ఎంపికైన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అంచనాలకు మించి రాణించాడు. ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఆరు ఎకానమీతో ఆరు వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబరిచాడు. మిడిల్ ఓవర్లలో హార్దిక్ పాండ్యాతో కలిసి బౌలింగ్ పంచుకుంటున్న షమీ కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టుకు బ్రేక్ అందిస్తున్నాడు. ఇక సూపర్ -12 దశ మ్యాచ్లు ముగియగా.. టీమిండియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్లు సెమీ ఫైనల్ చేరుకున్నాయి. బుధవారం న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య తొలి సెమీస్ జరగనుండగా.. రెండో సెమీస్ టీమిండియా, ఇంగ్లండ్ల మధ్య గురువారం(నవంబర్ 10న) జరగనుంది. ఈ నేపథ్యంలో సెమీస్ మ్యాచ్లకు కాస్త విరామం దొరకడంతో మహ్మద్ షమీ ఆస్ట్రేలియా అడవి బాట పట్టాడు. అడ్వెంచరస్ ప్రయాణాలను బాగా ఇష్టపడే షమీ ఖాళీ సమయం దొరికితే చాలు ఒక్కడే అడవుల్లోకి వెళ్లి ప్రకృతిని ఆస్వాధించడం అలవాటు చేసుకున్నాడు . తాజాగా ఆసీస్ అడవుల్లో చక్కర్లు కొట్టిన షమీ దానికి సంబంధించిన ఫోటోలను తన ట్విటర్లో పంచుకున్నాడు. ''అడవిలో వైఫై కనెక్షన్ ఉండకపోవచ్చు.. కానీ మీకు బెస్ట్ కనెక్షన్ దొరుకుతుందని నేను ప్రామిస్ చేయగలను'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. There's no Wi-Fi in the forest, but I promise you'll find a better connection. #mdshami #mdshami11 #naturephotography #india #australia pic.twitter.com/1JRZn1I5NT — Mohammad Shami (@MdShami11) November 8, 2022 చదవండి: అరివీర భయంకరులైన ఇంగ్లండ్ బ్యాటర్లను టీమిండియా బౌలర్లు అడ్డుకోగలరా..? -
బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆస్ట్రేలియాకు బయల్దేరనున్న ట్రిపుల్ 'ఎస్'
టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతూ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. అయితే, అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత సెలెక్షన్ కమిటీ రకరకాల వడపోతలు పట్టి అంతిమంగా ముగ్గురు పేర్లను ఫైనల్ చేసింది. షమీ, సిరాజ్, శార్ధూల్లలో (ట్రిపుల్ ఎస్) ఒకరు బుమ్రా స్థానాన్ని భర్తీ చేస్తారని టీమిండియా యాజమాన్యం డిసైడ్ చేసింది. దీంతో ఈ ముగ్గురు టీమిండియాను కలిసేందుకు ఇవాళో రేపో ఆస్ట్రేలియాకు బయల్దేరనున్నారు. వీరితో పాటు స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికైన శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్లు కూడా ఆస్ట్రేలియా విమానమెక్కనున్నారు. మరో స్టాండ్ బై ప్లేయర్ దీపక్ చాహర్కు గాయం తిరగబెట్టడంతో అతను ఆస్ట్రేలియాకు వెళ్లే దారులు దాదాపుగా మూసుకుపోయాయి. మరోవైపు నెట్ బౌలర్లుగా ఎంపికైన ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్ వీసా సమస్యల కారణంగా భారత్లోనే ఉండిపోయారు. వీసా ఇష్యూస్ క్లియర్ అయితే ఈ ఇద్దరు కూడా ఆస్ట్రేలియాకు బయలుదేరతారు. ఇదిలా ఉంటే, బుమ్రా స్థానంలో తుది జట్టులో ఎవరుంటారనే అంశం టీమిండియా అభిమానులను తెగ వేధిస్తుంది. కొందరేమో షమీనే అందుకు అర్హుడని అభిప్రాయపడుతుంటే.. మరికొందరేమో సిరాజ్కు ఆస్ట్రేలియాలో బౌన్సీ పిచ్లపై మంచి సక్సెస్ రేట్ ఉంది కాబట్టి అతన్నే ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. ఇంకొందరేమో శార్ధూల్కు ఓటేస్తున్నారు. మరోపక్క టీమిండియా రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న హర్షల్ పటేల్ ఫామ్ లేమి సమస్య అటు సెలక్టర్లను ఇటు అభిమానులను తెగ కలవరపెడుతుంది. ఇప్పటికే బుమ్రా దూరమై నైరాశ్యంలో ఉన్న వీరికి.. హర్షల్ సమస్య మరో తలనొప్పిగా మారింది. ఇన్ని సమస్యల నడుమ టీమిండియా వరల్డ్కప్లో ఎలా నెట్టుకొస్తుందో వేచి చూడాలి. -
ఫిట్నెస్ టెస్టులో క్లియరెన్స్.. ఆస్ట్రేలియాకు షమీ
టి20 ప్రపంచకప్ 2022 ప్రారంభానికి ముందు టీమిండియా గుడ్న్యూస్. టీమిండియా ఫ్రంట్లైన్ పేసర్ మహ్మద్ షమీ ఫిట్నెస్ టెస్టులో పాసైనట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో షమీకి ఫిట్నెస్ టెస్టు నిర్వహించారు. ఫిట్నెస్ నిరూపించుకోవడంతో షమీ ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నాడు. టి20 ప్రపంచకప్కు మరో రెండు వారాలు సమయం ఉండడంతో షమీ తుదిజట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ను ముగించుకున్న శ్రేయాస్ అయ్యర్, సిరాజ్, రవి బిష్ణోయిలు కూడా షమీతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. ఇక వెన్నునొప్పితో మేజర్ టోర్నీకి దూరమైన బుమ్రా స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై బీసీసీఐ తర్జన భర్జన పడుతున్న వేళ షమీ ఫిట్నెస్ టెస్టులో పాసవ్వడం ఊరట కలిగించింది.అయితే బుమ్రా స్థానంలో ఇంకా ఎవరిని రీప్లేస్ చేయకపోవడంతో ఉత్కంఠ మాత్రం అలానే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో షమీ అయితేనే బుమ్రా స్థానంలో కరెక్టని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. హర్ష్దీప్, భువనేశ్వర్ కుమార్లు మంచి ప్రదర్శన చేస్తున్నప్పటికి హర్షల్ పటేల్ మాత్రం ఇంకా గాడిన పడలేదు. దీంతో ఫ్రంట్ లైన్ బౌలర్గా షమీ టీమిండియా బౌలింగ్ను నడిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా షమీ బౌలింగ్ ఆస్ట్రేలియా పిచ్లకు సరిగ్గా సరిపోతుంది. షమీ ఫిట్నెస్ టెస్టు క్లియర్ చేయగా.. దీపక్ చహర్ మాత్రం ఇంకా ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. దక్షిణాఫ్రికాతో తొలి టి20 సందర్భంగా గాయపడిన చహర్ బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలోనే ఉన్నాడు. ఎలాగూ దీపక్ చహర్ టి20 ప్రపంచకప్కు రిజర్వ్ ప్లేయర్గానే ఉండడంతో షమీ తుది జట్టులో ఉండడం ఖాయం. చహర్ ఫిట్నెస్ నిరూపించుకున్న తర్వాతే ఆస్ట్రేలియా బయలుదేరనున్నాడు. మరో బౌలర్ మహ్మద్ సిరాజ్ ఉన్నప్పటికి అతన్ని నమ్మలేని పరిస్థితి. అయితే ఆస్ట్రేలియాలో సిరాజ్కు మంచి రికార్డు ఉండడం అతనికి సానుకూలాంశం. అయితే షమీ ఈ ఏడాది ఒక్క టి20 మ్యాచ్ కూడా ఆడలేదు. టి20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని బుమ్రాకు సపోర్ట్గా షమీని కూడా రిజర్వ్ ప్లేయర్గా ఎంపిక చేశారు. ప్రాక్టీస్ కోసం షమీని ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ కోసం జట్టులోకి తీసుకున్నారు. కానీ షమీ కరోనా బారిన పడడంతో ఆసీస్ సిరీస్తో పాటు దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్కు కూడా దూరం కావాల్సి వచ్చింది. తాజాగా ఫిట్నెస్ టెస్టులో పాసైన షమీ.. ఆస్ట్రేలియాలో నేరుగా ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. ఏది ఏమైనా షమీ ఫిట్నెస్ టెస్టులో పాసయ్యి ఆస్ట్రేలియాకు రానుండడంతో టీమిండియా బౌలింగ్లో బలం పెరిగినట్లే. చదవండి: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. కొత్త నిబంధన అమల్లోకి 'మెడల్స్ అక్కడే వదిలేసి రమ్మంటారా?'.. స్టార్ స్విమ్మర్కు అవమానం -
బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు.. మహ్మద్ షమీ? దీపక్ చాహర్?
టీ20 ప్రపంచకప్-2022కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. అయితే బుమ్రా రిప్లేస్మెంట్ లేకుండానే భారత జట్టు ఆస్ట్రేలియాకు పయనమైంది. ఇప్పటి వరకు ఇంకా బుమ్రా స్థానాన్ని బీసీసీఐ భర్తీ చేయలేదు. ఆక టీ20 ప్రపంచకప్లో పాల్గొనే ఆయా దేశాలు తమ జట్లలో మార్పులు చేసుకునేందుకు ఆదివారం(ఆక్టోబర్9) వరకు మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని బీసీసీఐ ఆదివారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా బుమ్రా స్థానం కోసం ముఖ్యంగా ఇద్దరు పేసర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒకరు వెటరన్ పేసర్ మహ్మద్ షమీ కాగా.. మరొకరు యువ పేసర్ దీపక్ చాహర్. కాగా టీ20 ప్రపంచకప్కు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో వీరిద్దరికి చోటు దక్క లేదు. చాహర్, షమీకి స్టాండ్బై ఆటగాళ్లగా సెలక్టర్లు ఎంపికచేశారు. అయితే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్కు ఎంపికైన షమీ.. కొవిడ్ బారిన పడడంతో దూరమయ్యాడు. ఇక దీపక్ చహర్ ఆస్ట్రేలియా సిరీస్కు ఎంపికైనప్పటికీ కేవలం బెంచ్కే పరిమితమయ్యాడు. అనంతరం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లో మాత్రం దీపక్ అదరగొట్టాడు. కాగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు ముందు దీపక్ చాహర్ కాలికి స్వల్ప గాయమైంది. దీంతో అతడు వన్డే సిరీస్కు దూరమయ్యాడు. అయితే చాహర్ గాయం అంతతీవ్రమైనది కాదు అని బీసీసీఐ అదికారి ఒకరు పేర్కొన్నారు. ఇక షమీ, చాహర్ ప్రస్తుతం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నారు. వీరిద్దరూ పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించే పనిలో పడ్డారు. అయితే బుమ్రా స్థానంలో అనుభవం ఉన్న షమీనే ఎంపిక చేస్తారని క్రికెట్ విశ్లేషుకులు అభిప్రాయనపడుతున్నారు. చదవండి: Ind vs SA : రెండో వన్డేకు వర్షం ముప్పు.. మ్యాచ్ జరిగేనా? -
కరోనా బారిన షమీ... ఆస్ట్రేలియాతో టి20 సిరీస్కు దూరం
భారత జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ కరోనా వైరస్ బారిన పడ్డాడు. దాంతో ఈనెల 20 నుంచి ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్ల టి20 సిరీస్కు షమీ దూరమయ్యాడు. షమీ స్థానంలో మరో పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ను భారత జట్టులో ఎంపిక చేశారు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈనెల 20న మొహాలీలో జరిగే తొలి మ్యాచ్తో సిరీస్ మొదలవుతుంది. ఇప్పటికే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్ జట్టులోని ఇతర ఆటగాళ్లు శనివారం సాయంత్రం చండీగఢ్కు చేరుకున్నారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టి20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో షమీకి చోటు లభించలేదు. ఈ మెగా ఈవెంట్కు షమీని స్టాండ్బైగా ఎంపిక చేశారు. -
షమీ ప్రపంచ కప్లో ఆడతాడు.. బీసీసీఐ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు
వచ్చే నెల 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం 15 మంది సభ్యులు, నలుగురు స్టాండ్ బై ఆటగాళ్లతో కూడిన భారత బృందాన్ని ఇదివరకే ప్రకటించిన విషయం తెలసిందే. అయితే ఈ జట్టు ఎంపికపై అభిమానులతో పాటు పలువురు సీనియర్లు, మాజీ, విశ్లేషకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటం కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మరింది. కొందరు సంజూ శాంసన్ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తుంటే.. మరికొందరు మహ్మద్ షమీని 15 మంది సభ్యుల బృందంలోకి తీసుకోకపోవడంపై పెదవి విరుస్తున్నారు. ఈ విషయంపై తాజాగా ఓ బీసీసీఐ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహ్మద్ షమీకి 15 మంది సభ్యుల బృందంలోని వచ్చేందుకు దారులు మూసుకుపోలేదని, త్వరలో జరుగనున్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్ల్లో హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రాలలో ఎవరు విఫలమైనా వారి ప్లేస్లో మహ్మద్ షమీ ఫైనల్ 15లోకి వస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. సమాంతరంగా ఈ సిరీస్ల్లో షమీ సైతం రాణించాల్సి ఉంటుందని, ఇది జరిగితే షమీ ప్రపంచ కప్లో ఆడటం ఖాయమని అన్నాడు. షమీని స్టాండ్ బై ఆటగాడిగా ఎంపిక చేయడంపై సదరు సెలెక్టర్ స్పందిస్తూ.. 10 నెలల పాటు పొట్టి ఫార్మాట్కు (జాతీయ జట్టుకు) దూరంగా ఉన్న కారణంగా షమీని తుది జట్టులోకి (15 మంది సభ్యుల బృందం) తీసుకోలేదని వివరణ ఇచ్చాడు. షమీ జట్టుకు దూరంగా ఉన్నసమయంలో హర్షల్ పటేల్ అద్భుతంగా రాణించాడు కాబట్టే అతనికి అవకాశం దక్కిందని పేర్కొన్నాడు. కాగా, షమీని స్టాండ్ బైగా ఎంపిక చేయడంలో కెప్టెన్ రోహిత్ శర్మ హస్తం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 14 మంది పేయర్లని ఏకాభిప్రాయంతో ఎంపిక చేసిన సెలెక్టర్లు.. 15వ ఆటగాడి ఎంపికను హిట్మ్యాన్కు వదిలేసినట్లు తెలుస్తోంది. 15వ బెర్త్ కోసం షమీ, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మధ్య పోటీలో, కెప్టెన్ ..అశ్విన్కే ఓటు వేసినట్లు ప్రచారం జరుగుతుంది. టీ20 వరల్డ్ కప్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహాల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్ స్టాండ్ బై ప్లేయర్లు: మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహార్ -
ఇండియా పేరు మార్చండి.. ప్రధాని మోదీకి క్రికెటర్ షమీ ‘భార్య’ అభ్యర్థన
భారత స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సంబురాలు మిన్నంటిన వేళ.. టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ సోషల్మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భర్త షమీతో విభేదాల కారణంగా గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న జహాన్.. దేశం పేరు మార్చాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను అభ్యర్ధిస్తూ ఇన్స్టాలో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. View this post on Instagram A post shared by hasin jahan (@hasinjahanofficial) వాడుకలో ఉన్న ఇండియా పేరుతో దేశానికి దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదని, అంచేత దేశం పేరును ఇండియా అని కాకుండా ‘భారత్’ లేదా ‘హిందుస్తాన్’ అని సంబోదించేలా తగు సవరణలు చేపట్టాలని మోదీ, షాలను కోరింది. జహాన్ నిన్న (ఆగస్ట్ 14) ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘మన దేశం మనకు గర్వకారణం. ఐ లవ్ భారత్. మన దేశం పేరు ‘భారత్’ లేదా ‘హిందుస్తాన్’ అని ఉండాలి. గౌరవనీయులైన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు నాదొక విజ్ఞప్తి. ప్రస్తుతం వాడుకలో ఉన్న ‘ఇండియా’ పేరు మార్చి ‘భారత్’ లేదా ‘హిందుస్తాన్’ అని పెట్టండి. వీటితో మనకు దక్కాల్సిన గుర్తింపు దక్కుతుంది..’ అని రాసుకొచ్చింది. వీడియోలో జహాన్ మరో ఇద్దరితో కలిసి ప్రముఖ బాలీవుడ్ గీతం ‘దేశ్ రంగీలా’ పాటకు నృత్యం చేస్తూ కనిపిస్తుంది. జహాన్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో ఉంది. జహాన్ చేసిన ఈ ప్రతిపాదన కొత్తదేమీ కాకపోయినప్పటికీ.. దేశం డైమండ్ జూబ్లీ స్వాతంత్రోత్సవ సంబురాలు చేసుకుంటున్న వేళ ఈ ప్రతిపాదన రావడం అందరిని ఆకర్షిస్తోంది. కాగా, జహాన్.. మహ్మద్ షమీపై లైంగిక వేధింపులతో పాటు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసి కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. చదవండి: Independence Day: భారతీయుడినైనందుకు గర్విస్తున్నా.. జై హింద్: కోహ్లి -
Asia Cup: అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు.. నేనైతే: టీమిండియా మాజీ కెప్టెన్
Asia Cup 2022- India Squad Announced: ఆసియా కప్-2022 టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి స్థానం లేకపోవడం పట్ల టీమిండియా మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ విస్మయం వ్యక్తం చేశాడు. ఒకవేళ తానే గనుక ప్రస్తుత సెలక్టన్ టీమ్ చైర్మన్ అయి ఉంటే కచ్చితంగా షమీకి జట్టులో చోటు ఇచ్చేవాడినని ఈ మాజీ సెలక్టర్ పేర్కొన్నాడు. నలుగురు స్పిన్నర్లను తీసుకునే బదులు ఈ వెటరన్ పేసర్ను ఎంపిక చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. స్టార్ల పునరాగమనం! కాగా ఆగష్టు 27న ఆరంభం కానున్న ఆసియా కప్-2022 ఈవెంట్ నేపథ్యంలో బీసీసీఐ సోమవారం భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తంగా 15 మంది సభ్యులతో కూడిన జట్టులో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి సహా.. ఇన్నాళ్లు గాయంతో దూరమైన వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పునరాగమనం చేశాడు. ఇక స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి సహా స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజకు కూడా చోటు దక్కింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరం కాగా భువనేశ్వర్ కుమార్ సహా యువ ఫాస్ట్ బౌలర్లు అర్ష్దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్లు జట్టులో స్థానం సంపాదించారు. ఈ నేపథ్యంలో జట్టు ఎంపికపై స్టార్ స్పోర్ట్స్ షోలో చిక్కా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కచ్చితంగా అతడికి జట్టులో స్థానం ఉండేది! ఈ మేరకు.. ‘‘నా జట్టులో అయితే షమీకి కచ్చితంగా చోటు ఉంటుంది. నేను గనుక ఇప్పటి సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉండి ఉంటే అతడిని ఎంపిక చేసేవాడిని. రవి బిష్ణోయిని పక్కన పెట్టి షమీకి చోటిచ్చేవాడిని. నిజానికి అక్షర్ పటేల్ కూడా జట్టులో ఉండాల్సింది. అయితే, అశ్విన్- అక్షర్ పటేల్లలో ఎవరంటే సీనియర్కే నా ఓటు’’ అని శ్రీకాంత్ పేర్కొన్నాడు. మహ్మద్ షమీ(PC: BCCI) ఏదేమైనా జట్టు ఎంపిక బాగానే ఉందని.. ఇది టీ20 వరల్డ్కప్-2022 టోర్నీకి బ్లూ ప్రింట్ లాంటిదని చిక్కా అభిప్రాయపడ్డాడు. కేవలం అక్షర్ పటేల్ విషయంలోనే తాను చింతిస్తున్నానన్న శ్రీకాంత్... ఆస్ట్రేలియా పిచ్లపై రాణించగల ఈ బౌలింగ్ ఆల్రౌండర్కు ప్రపంచకప్ జట్టులో స్థానం లభించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. దీపక్ హుడా సైతం బ్యాట్, బాల్తో రాణించగలడని.. అందుకే జట్టులో స్థానం దక్కిందని అభిప్రాయపడ్డాడు. అప్పుడు అలా.. ఐపీఎల్-2022లో ఇలా! గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో మహ్మద్ షమీ.. ఆరు వికెట్లు తీశాడు. ఐపీఎల్-2022లో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్కు ఆడిన షమీ.. అరంగేట్ర సీజన్లోనే జట్టు విజేతగా నిలవడంలో కీలకంగా వ్యవహరించాడు. మొత్తంగా 16 మ్యాచ్లు ఆడిన షమీ 20 వికెట్లతో సత్తా చాటాడు. కానీ ఆ తర్వాత భారత జట్టు తరఫున అతడికి పొట్టి ఫార్మాట్ ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఈ ఫార్మాట్ షమీకి సూట్ కాదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్ ఈవెంట్కు షమీ ఎంపిక కాకపోవడం గమనార్హం. ఆసియా కప్-2022కు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్(వికెట్ కీపర్), దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్. చదవండి: Hardik Pandya: టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్గా..! కచ్చితంగా సిద్ధమే.. టీ20 ప్రపంచకప్ టోర్నీలో.. CWG 2022: కోవిడ్ అని తేలినా టీమిండియాతో ఫైనల్ మ్యాచ్ ఆడిన ఆసీస్ ఆల్రౌండర్ -
T20 WC: అతడు మరీ అంత బ్యాడ్ ఛాయిస్ కాదు! ప్రపంచకప్ జట్టులో ఉంటే..
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్-2022 నేపథ్యంలో భారత జట్టులో మహ్మద్ షమీకి స్థానం కల్పిస్తే బాగుంటుందని టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్తో పాటు షమీ కూడా జట్టులో ఉండేందుకు అన్ని అర్హతలు కలిగి ఉన్నాడని పేర్కొన్నాడు. వరల్డ్కప్ టోర్నీలో అనుభవజ్ఞులైన ఈ పేస్ త్రయంతో బరిలోకి దిగితే మెరుగైన ఫలితాలు పొందవచ్చని అభిప్రాయపడ్డాడు. ప్రయోగాలు చేస్తున్న టీమిండియా! ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16న పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే జట్టు ఎంపికపై బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్లో దూకుడైన బ్యాటింగ్తో ముందుకు సాగుతామన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా పలు ప్రయోగాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశాడు. ముఖ్యంగా హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్ వంటి ఫాస్ట్ బౌలర్లను మెగా ఈవెంట్కు సన్నద్ధం చేసే క్రమంలో ప్రయోగాలకు వెనుకాడబోమని సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో షమీకి అవకాశం ఇవ్వాలంటూ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. మహ్మద్ షమీ(PC: BCCI) ఐపీఎల్లో అదరగొట్టిన షమీ! అయినా.. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో షమీ.. ఆరు వికెట్లు(ఎకానమీ 9.57) పడగొట్టాడు. ఇక ఐపీఎల్-2022లో భాగంగా కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్కు అతడు ప్రాతినిథ్యం వహించాడు. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన షమీ 20 వికెట్లు పడగొట్టాడు. కానీ ఆ తర్వాత టీమిండియా తరఫున టీ20ల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఈ ఫార్మాట్ షమీకి సూట్ కాదన్న అభిప్రాయాలూ ఉన్నాయి. మరింత మెరుగయ్యాడు! ఈ నేపథ్యంలో పార్థివ్ పటేల్ క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ ప్రదర్శనతో దినేశ్ కార్తిక్ టీమిండియా తరఫున పునరాగమనం చేశాడు. నిజానికి మహ్మద్ షమీ కూడా ఐపీఎల్లో అదరగొట్టాడు. గుజరాత్ టైటాన్స్కు ట్రోఫీ అందించాడు. గత ప్రపంచకప్ మ్యాచ్ కంటే ఇప్పుడు మరింత మెరుగయ్యాడు. కాబట్టి అతడు ఈసారి మరీ అంత బ్యాడ్ ఛాయిస్ ఏమీ కాదు’’ అని అభిప్రాయపడ్డాడు. బుమ్రా, భువీ, అర్ష్దీప్తో పాటు 31 ఏళ్ల షమీని మేనేజ్మెంట్ ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్-2022లో అదరగొట్టిన 37 ఏళ్ల దినేశ్ కార్తిక్ భారత జట్టులో రీఎంట్రీ ఇచ్చి.. ఫినిషర్గా స్థానం సుస్థిరం చేసుకునే పనిలో పడ్డాడు. చదవండి: Suryakumar Yadav: ఇదే కొనసాగితే సూర్య కెరీర్ నాశనమవడం ఖాయం! తగ్గేదేలే అంటున్న రోహిత్! -
Ind Vs Eng: నన్ను నా పని చేసుకోనివ్వు.. నువ్వు నోర్ముయ్: అంపైర్ వార్నింగ్!
India Vs England 5th Test: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్కు టీమిండియాతో రీషెడ్యూల్డ్ టెస్టులో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఒకే ఓవర్లో 35 పరుగులు ఇచ్చిన బ్రాడ్.. చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. టెస్టుల్లో ఇలా ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బ్రాడ్ చెత్త రికార్డు సాధించిన బౌలర్గా రికార్డుకెక్కాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా బ్రాడ్ ఈ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. ఇదే మ్యాచ్లో మూడో రోజు ఆటలో భాగంగా బ్రాడ్కు మరో చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన స్టువర్ట్ బ్రాడ్ను టీమిండియా బౌలర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తమ షార్ట్ డెలివరీలతో తెగ ఇబ్బంది పెట్టారు. దీంతో బ్రాడ్ అంపైర్కు పదేపదే ఫిర్యాదు చేశాడు. ఇందుకు స్పందించిన అంపైర్.. ‘‘నన్ను అంపైరింగ్ చేసుకోనివ్వు. నువ్వు బ్యాటింగ్ చేయ్! ఓకే! లేదంటే నువ్వు మళ్లీ ఇబ్బందుల్లో పడతావు. ఒక్క ఓవర్కే ఇలానా! బ్రాడీ..! బ్రాడీ! నువ్వు బ్యాటింగ్ చెయ్! అలాగే కాస్త ఆ నోరు మూసెయ్’’ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తొలి ఇన్నింగ్స్లో 5 బంతులు ఎదుర్కొన్న బ్రాడ్.. ఒకే ఒక పరుగు తీసి సిరాజ్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే మూడో రోజు వరకు టీమిండియా ఆధిక్యం కనబరచగా.. నాలుగో రోజు పట్టు సాధించిన ఆతిథ్య ఇంగ్లండ్ ఐదో రోజు విజయం దిశగా దూసుకుపోతోంది. చదవండి: Jasprit Bumrah: బుమ్రాకు కెప్టెన్సీ.. సాహసోపేతమైన నిర్ణయం! బహుశా అందుకేనేమో! Richard Kettleborough#FromYorkshire pic.twitter.com/SIIczXE4UQ — Sɪʀ Fʀᴇᴅ Bᴏʏᴄᴏᴛᴛ (@SirFredBoycott) July 4, 2022 An incredible day that leaves us with a chance of making history 🙏 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/QvDmaK20tp — England Cricket (@englandcricket) July 5, 2022 -
వారెవ్వా బెయిర్ స్టో! ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా మూడో సెంచరీ!
11 ఓవర్లు ముగిసేసరికి 44 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన ఇంగ్లండ్ను స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో ఆదుకున్నాడు. భారీ స్కోరుతో ఆదిత్య జట్టును బెంబేత్తించిన ప్రత్యర్థికి తన ఫామ్ను కొనసాగిస్తూ కొరకరాని కొయ్యగా మారాడు. 119 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. బిల్లింగ్స్తో కలిసి 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన బెయిర్ స్టో తాజా సెంచరీతో పలురికార్డులు సాధించాడు. 2016 అనంతరం టీమిండియాపై అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. అయితే, 55 వ ఓవర్ మొదటి బంతికి షమీ బౌలింగ్లో బెయిర్ స్టో (140 బంతుల్లో 106; ఫోర్లు 14, సిక్సర్లు 2) కోహ్లికి ఫస్ట్ స్లిప్లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జట్టును కష్ట సమయంలో ఆదుకున్న అతడికి సహచర ఆటగాళ్లు స్టాండింగ్ ఓవెషన్ ఇచ్చారు. సెంచరీల వరద గత రెండు టెస్టు మ్యాచుల్లోనూ బెయిర్ స్టో పరుగుల వరద పారించాడు. ట్రెంట్ బ్రిడ్జ్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 8 మరియు 136 పరుగులు చేశాడు. అదే న్యూజిలాండ్తో హెడింగ్లీలో జరిగిన మ్యాచ్లో 162 మరియు 71 పరుగులతో చెలరేగిపోయాడు. ఎడ్జ్బాస్టన్లో భారత్తో మ్యాచులోనూ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బెయిర్ స్టోకి టెస్టుల్లో ఇది 11వ సెంచరీ కావడం విశేషం. వరుసగా మూడు టెస్టుల్లో 100 పరుగులు చేసిన ఇంగ్లండ్ 15 వ ఆటగాడిగా బెయిర్ స్టో రికార్డు నెలకొల్పాడు. క్లార్క్ తర్వాత బెయిర్ స్టో! ఐదో స్థానంలో లేదా అంతకంటే తక్కువ స్థానంలో ఒక క్యాలెండర్ ఇయర్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా బెయిర్ స్టో నిలిచాడు. 2012లో ఆస్ట్రేలియా ఆటగాడు మైకేల్ క్లార్క్ ఐదు సెంచరీలు చేశాడు. -
షమీని ఎదుర్కోలేక జట్టు మారిన పుజారా..
మనం ఇంటిదగ్గర ఆడుకునే క్రికెట్లో అవతలి జట్టులో ఎవరైనా వ్యక్తి తక్కువైతే మన జట్టులో నుంచి ఒక వ్యక్తిని అక్కడ సర్దుబాటు చేయడం చూస్తుంటాం. ఇలాంటివి గల్లీ క్రికెట్లో ఎక్కువగా ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే లీస్టర్షైర్, టీమిండియాల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో జరిగింది. టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా వార్మప్ మ్యాచ్లో రెండు జట్ల తరపున బ్యాటింగ్కు వచ్చాడు. మొదట లీస్టర్షైర్కు ప్రాతినిధ్యం వహించిన పుజారా తొలి ఇన్నింగ్స్లో షమీ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయి డకౌట్గా వెనుదిరిగాడు. కాగా పెవిలియన్ వెళ్తున్న పుజారాను వెనుక నుంచి హగ్ చేసుకొని వింత సెలబ్రేషన్ చేసుకున్నాడు. అయితే మహ్మద్ షమీని ఎదుర్కోవడం కష్టంగా ఉందని భావించాడేమో రెండో ఇన్నింగ్స్లో మాత్రం టీమిండియా తరపున బ్యాటింగ్కి వచ్చాడంటూ అభిమానులు పేర్కొన్నారు. కానీ అసలు సంగతి అది కాదు. వార్మప్ మ్యాచ్ నాలుగు రోజులే కావడం.. రోజు వర్షం కురుస్తుండడంతో ఆటకు అంతరాయం ఏర్పడుతుంది. మూడో రోజు ఆటలో కూడా ఉదయం పూట వర్షం అడ్డుపడింది. దీంతో బ్యాటింగ్ ప్రాక్టీస్కు అంతరాయం కలిగింది. ఒకవేళ నాలుగో రోజు లీస్టర్షైర్ తరపున ఆడితే వర్షం వల్ల పుజారాకు బ్యాటింగ్ అవకాశం రాకపోవచ్చని టీమిండియా భావించింది. అందుకే పుజారాను టీమిండియా తరపున బ్యాటింగ్కు దించింది.అయితే పుజారా మరోసారి విఫలమయ్యాడు. 22 పరుగులు చేసి సాయి కిషోర్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా రెండో ఇన్నింగ్స్లో భారీగానే పరుగులు రాబడుతుంది. జట్టులో ప్రతీ ఒక్క బ్యాట్స్మన్ తలా ఇన్ని పరుగులు చేశారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి 98 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే సెంచరీ చేస్తాడనుకున్న కోహ్లి అర్థసెంచరీతోనే సరిపెట్టాడు. ఇక ఓపెనర్గా ప్రమోషన్ పొందిన కోన శ్రీకర్ భరత్ 43 పరుగులు చేసి ఆకట్టుకోగా.. గిల్ 38, హనుమ విహారి 20 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ 28 పరుగులు చేశాడు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 52, రవీంద్ర జడేజా 22 పరుగులతో ఆడుతున్నారు. చదవండి: తొలిసారి రంజీ ట్రోఫీ అందుకోనున్న మధ్యప్రదేశ్..! కోపం వస్తే మాములుగా ఉండదు.. మరోసారి నిరూపితం -
పుజారా డకౌట్.. షమీ వింత సెలబ్రేషన్
కౌంటీల్లో వరుస సెంచరీలో దుమ్మురేపిన చతేశ్వర్ పుజారా డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా లీస్టర్షైర్తో వార్మప్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా లీస్టర్షైర్కు ప్రాతినిధ్యం వహించిన టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ మహ్మద్ షమీ బౌలింగ్లో సున్నాకే క్లీన్బౌల్డ్ అయ్యాడు. షమీ వేసిన గుడ్లెంగ్త్ డెలివరీకి పుజారా వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. పుజారా, షమీ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు.ఆ తర్వాత పెవిలియన్కు వెళ్తున్న పుజారా వైపు పరిగెత్తుకొచ్చిన షమీ వెనుక నుంచి అతన్ని గట్టిగా హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజును 246/8తో ముగించిన టీమిండియా.. లీస్టర్షైర్లోని మిగతా టీమిండియా ఆటగాళ్లకు ప్రాక్టీస్ అవకాశం ఇవ్వడం కోసం అదే స్కోరు వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశారు. అయితే ఉదయం సెషన్లో లీస్టర్షైర్ రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ సామ్ ఇవన్స్, పుజారాలు ఔటయ్యాకా.. మరో ఓపెనర్ లుయిస్ కింబర్(31), జోయ్ ఎవిసన్(22) ఇన్నింగ్స్ను కాసేపు నడిపించారు. వీరిద్దరు ఔట్ కాగా.. ప్రస్తుతం లీస్టర్షైర్ 4 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 16, రిషి పటేల్ 13 పరుగులతో ఆడుతున్నారు. ☝️ | 𝐏𝐮𝐣𝐚𝐫𝐚 𝐛 𝐒𝐡𝐚𝐦𝐢. A second wicket for Shami. He dismisses his @BCCI teammate, as Pujara drags on. Evison joins Kimber (28*). 🦊 LEI 34/2 𝐋𝐈𝐕𝐄 𝐒𝐓𝐑𝐄𝐀𝐌: https://t.co/APL4n65NFa 👈 🦊 #IndiaTourMatch | #LEIvIND | #TeamIndia pic.twitter.com/ANf2NfhUAy — Leicestershire Foxes 🏏 (@leicsccc) June 24, 2022 చదవండి: Virat Kohli: రూట్ మ్యాజిక్ ట్రిక్ను అనుకరించబోయి బొక్కబోర్లా! రోహిత్ శర్మకు ఏమైంది..? అక్కడ కూడా తీరు మారలేదు..! -
IPL 2022: గెలిచి నిలిచిన రోహిత్.. సై అంటున్న పంజాబ్.. షమీ సెలబ్రేషన్స్!
IPL 2022 Trending Videos: ఈద్ సందర్భంగా చెన్నై సూపర్కింగ్స్ ఫ్రాంఛైజీ తమ ఆటగాళ్ల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సహా మొయిన్ అలీ, రాబిన్ ఊతప్ప, డ్వేన్ బ్రావో, అంబటి రాయుడు తదితర క్రికెటర్లు తమ కుటుంబాలతో కలిసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై షేర్ చేసింది. EIDhu Namma Kondattam! 💛 Celebrating the festivities the SuperKings way🦁#Yellove #WhistlePodu 🦁 pic.twitter.com/HecryvhKVn — Chennai Super Kings (@ChennaiIPL) May 3, 2022 ఇక దీనితో పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఇతర ఐపీఎల్ జట్ల మరికొన్ని ఫొటోలు, వీడియోలు మీకోసం.. సహచర ఆటగాళ్లతో కలిసి రంజాన్ సెలబ్రేట్ చేసుకున్న షమీ గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ షమీ సహచర క్రికెటర్లతో కలిసి రంజాన్ పండుగ జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్తో కలిసి ఫొటోలు దిగాడు. Eid Mubarak #Eid_Mubarak #mshami11 @rashidkhan_19 @RGurbaz_21 pic.twitter.com/ziFWauCyip — Mohammad Shami (@MdShami11) May 3, 2022 జిమ్లో చెమటోడుస్తున్న ఆర్సీబీ ఆటగాళ్లు కోచ్ శంకర్ బసు మార్గదర్శనంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు జిమ్లో కఠిన వర్కౌట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్క ఆటగాడికి తన అవసరాలకు తగ్గట్టుగా ఫిట్నెస్ సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు బసు పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Royal Challengers Bangalore (@royalchallengersbangalore) సహచర ఆటగాళ్లను ఓడించిన రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ క్రికెటర్ల ఆట విడుపు వీడియోను ఫ్రాంఛైజీ షేర్ చేసింది. బ్రెవిస్, బాసిల్ థంపి, ఆర్యన్ తదితరులతో కలిసి గేమ్ ఆడిన రోహిత్ వాళ్లందరినీ ఎలిమినేట్ చేసి తాను విజేతగా నిలిచాడు. View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) గుజరాత్తో పోరు సిద్ధమవుతున్న పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్కు పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. నెట్స్లో తీవ్రంగా చెమటోడుస్తున్నారు. Lines drawn, game 🔛 ⚔️#SaddaPunjab #PunjabKings #IPL2022 #ਸਾਡਾਪੰਜਾਬ #GTvPBKS pic.twitter.com/e6NhX0rFqw — Punjab Kings (@PunjabKingsIPL) May 3, 2022 వైరల్ అవుతున్న తిలక్ వర్మ ప్రాంక్ వీడియో సహచర ఆటగాళ్లు డెవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్, రిలే మెరిడిత్లను ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ సరదాగా ఆటపట్టించాడు. పేస్ట్ బిస్కట్లు తినిపించి వారిని బోల్తా కొట్టించాడు. View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) చదవండి👉🏾Rinku Singh: తొమ్మిదో క్లాస్లో చదువు బంద్.. స్వీపర్, ఆటోడ్రైవర్.. ఆ 80 లక్షలు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: కెప్టెన్వి అని అహంకారమా? నీకసలు అర్హతే లేదు!
IPL 2022 SRH Vs GT: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. హార్దిక్లో నాయకుడి లక్షణాలు లేవని, జట్టు సభ్యుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం సరికాదని విమర్శిస్తున్నారు. అసలు కెప్టెన్సీ చేయడానికి అతడు అర్హుడే కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి ఆగ్రహావేశాలకు కారణం లేకపోలేదు. ఐపీఎల్-2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్ సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ ఆడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాండ్యా బృందం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన సన్రైజర్స్ ఆది నుంచి దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(42)తో కలిసి కెప్టెన్ కేన్ విలియమ్సన్(57) హైదరాబాద్కు అదిరిపోయే ఆరంభం అందించాడు. ముఖ్యంగా విలియమ్సన్ గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వన్డౌన్లో వచ్చిన రాహుల్ త్రిపాఠి సైతం విలియమ్సన్కు తోడుగా నిలబడ్డాడు. ఈ క్రమంలో 13వ ఓవర్లో స్వయంగా రంగంలోకి దిగిన హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. ఓవర్ రెండు, మూడో బంతుల్లో విలియమ్సన్ వరుస సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత సన్రైజర్స్కు వరుసగా రెండు, ఒక పరుగు వచ్చాయి. ఈ క్రమంలో స్ట్రైక్ తీసుకున్న త్రిపాఠి అప్పర్ కట్ షాట్ ఆడాడు. అది కాస్త డీప్ థర్డ్ మ్యాన్ దిశగా బంతి దూసుకుపోయింది. అయితే, అక్కడే ఉన్న మహ్మద్ షమీ క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు. అతడు కాస్త ముందుకు వస్తే వికెట్ దొరికే అవకాశం ఉండేది. కానీ వెనక్కి జరిగిన షమీ బంతిని అందుకుని బ్యాటర్కు ఎక్కువ పరుగులు దొరకకుండా అడ్డుకట్ట వేశాడు. దీంతో క్యాచ్ మిస్ అయినా, సన్రైజర్స్కు ఒకే ఒక్క పరుగు వచ్చింది. అయితే, షమీ క్యాచ్ డ్రాప్ చేయడంతో హార్దిక్ పాండ్యా సహనం కోల్పోయాడు. అతడి మీదకు అరుస్తూ అసహనం ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో హార్దిక్ను ఉద్దేశించి.. ‘‘సన్రైజర్స్ జట్టులో అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి వంటి వాళ్లు క్యాచ్లు వదిలేశారు. అయినా కేన్ విలియమ్సన్ సంయమనం పాటించాడు. కానీ నువ్వు.. టీమిండియాలో సీనియర్ అయిన షమీ మీదకు అరుస్తావా? కెప్టెన్ అయ్యానని అహంకారమా? తను క్యాచ్ పట్టకపోయి ఉండవచ్చు.. పరుగులు సేవ్ చేశాడు కదా! అసలు నీకు కెప్టెన్గా ఉండే అర్హత లేదు. షమీ భారత జట్టుకు చేసిన సేవ గురించి నీకేం తెలుసు? భావోద్వేగాలు సహజమే.. కానీ మరీ ఇంత అతి పనికిరాదు. ధోనితో పోటీ పడతా అన్నావు కదా! అతడు మిస్టర్ కూల్ అన్న విషయం గుర్తుపెట్టుకో’’ అంటూ ఘాటు కామెంట్లు చేస్తున్నారు. అయితే, మరికొంత మంది మాత్రం.. ‘‘కీలక సమయంలో ఇలా క్యాచ్లు జారవిడిస్తే.. అక్కడ ఉన్నది సీనియరా, జూనియరా అని చూడరు. జట్టుకు నష్టం జరుగుతుందంటే ఎవరైనా ఇలాగే స్పందిస్తారు. అయితే, హార్దిక్ కాస్త ఓపిక పట్టాల్సింది’’ అని అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ 8 వికెట్ల తేడాతో ఓడి తొలి పరాజయం నమోదు చేసింది. Dear Hardik, you are a terrible captain. Stop taking it out on your teammates, particularly someone as senior as Shami. #IPL #IPL2022 #GTvsSRH pic.twitter.com/9yoLpslco7 — Bodhisattva #DalitLivesMatter 🇮🇳🏳️🌈 (@insenroy) April 11, 2022 Can’t believe Hardik Pandya just insulted senior player and an Indian legend Mohd. Shami for not taking the risky catch and preferred to save the boundary. Hardik’s temper tantrums during tight situations have been outright cringe. #GTvsSRH #IPL2022 pic.twitter.com/yAyMmFkRwS — glowred (@glowred) April 11, 2022 Shami should have gone for that catch! Also, Hardik is not a good leader. #IPL2022 #GTvsSRH — Compulsive #PBKS fan 🥲 (@manwithcam590) April 11, 2022 -
Ind Vs Sa: నాలుగో రోజు ముగిసిన ఆట..
Ind Vs Sa 1st Test- Day 4 Updates నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 94పరుగులు చేసింది. ప్రొటీస్ విజయానికి 211 పరుగుల దూరంలో ఉండగా.. టీమిండియా విజయానికి 7 వికెట్ల దూరంలో ఉంది. 7:46 PM: 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన కీగన్ పీటర్సన్ సిరాజ్ బౌలింగ్లో పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్ 24, వాండర్ డుసెన్ 1 క్రీజులో ఉన్నారు. 6:51 PM: 305 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న సౌతాఫ్రికా టీ విరామ సమయానికి వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి 9 వికెట్ల దూరంలో ఉంటే.. సౌతాఫ్రికా గెలవాలంటే మరో 283 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం డీన్ ఎల్గర్ 9, కీగన్ పీటర్సన్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. 5:53 PM: టీమిండియా తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో 174 పరుగులుకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్లో పెద్దగా పరుగులు చేయలేకపోయింది. రిషబ్ పంత్ 34 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కేఎల్ రాహుల్ 23, అజింక్యా రహానే 20 పరుగులు చేశారు. ప్రొటీస్ బౌలర్లలో రబాడ 4, మార్కో జాన్సెన్ 3, ఎంగిడి 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని టీమిండియా దక్షిణాఫ్రికా ముందు 305 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 5:34 PM: రవిచంద్రన్ అశ్విన్(20) రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 47 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. పంత్ 28, షమీ 0 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా 290 పరుగుల ఆధిక్యంలో ఉంది. 4:41 PM: 16 పరుగులు చేసిన పుజారా ఎన్గిడి బౌలింగ్లో డికాక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 109 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. రహానే 20, పంత్ 2 పరుగులతో ఆడుతున్నారు. 4:26 PM: విరాట్ కోహ్లి(18) రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. మార్కో జాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ 32వ ఓవర్ తొలి బంతికి కోహ్లి డికాక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. పుజారా 16, రహానే 5 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా ఓవరాల్గా 224 పరుగులు ఆధిక్యంలో ఉంది. 3: 30 PM: లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 79/3. 209 పరుగుల ఆధిక్యం. కోహ్లి 18 పరుగులు, పుజారా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. 2: 55 PM: కేఎల్ రాహుల్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్లో రాహుల్ పెవిలియన్ చేరాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి, ఛతేశ్వర్ పుజారా క్రీజులో ఉన్నారు. 2: 36 PM: 20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 50/2 (20) 2: 00 PM: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా రబడ బౌలింగ్లో మల్దర్కు క్యాచ్ ఇచ్చి శార్దూల్ ఠాకూర్ అవుటయ్యాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా క్రీజులో ఉన్నారు. స్కోరు: 34/2 1: 58 PM: 12 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 30/1 1: 40 PM రివ్యూ వేస్ట్ చేసుకున్న ప్రొటిస్ మార్కో జాన్సెన్ బౌలింగ్లో బంతి శార్దూల్ ప్యాడ్లను తాకినట్టుగా కనిపించడంతో ప్రొటిస్ అప్పీలు చేయగా అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. ఈ క్రమంలో రివ్యూకు వెళ్లిన ఎల్గర్ బృందానికి నిరాశే మిగిలింది. బంతి ఎక్కువ ఎత్తు నుంచి వెళ్లడంతో శార్దూల్ను నాటౌట్గా ప్రకటించారు. దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య తొలి టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆట ఆరంభమైంది. మూడో రోజు ఆట ముగిసే సరికి 146 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన... ఒక వికెట్ నష్టానికి 16 పరుగుల వద్ద ఆటను ప్రారంభించింది. కేఎల్ రాహుల్, శార్దూల్ ఠాకూర్ క్రీజులో ఉన్నారు. ఇక మయాంక్ అగర్వాల్ మంగళవారం నాటి ఆటలో మార్కో జాన్సెన్ బౌలింగ్లో వికెట్ కీపర్ డికాక్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. తుదిజట్లు: భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), వియాన్ మల్దర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి. Good Morning from SuperSport Park 🌞 Huddle Talk 🗣️ done ☑️ We are all set for Day 4 action to get underway 💪#TeamIndia | #SAvIND pic.twitter.com/gsGz51PoOD — BCCI (@BCCI) December 29, 2021 -
కోహ్లి భాయ్ నువ్వు ఎక్కడున్నా రాజువే.. అందుకే నువ్వంటే మాకు ఇష్టం!
Ind Vs Sa 1st Test- Virat Kohli: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. తొలి రోజు కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ... ఆధిక్యం మనదే.. గెలుపు సులువే అంటూ అభిమానుల ఆనందం.. కానీ రెండో రోజు ఆట చూద్దామనుకుంటే వరుణుడు ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లాడు.. వర్షం తగ్గకపోవడంతో ఆటను రద్దు చేశారు.. ఇక మూడో రోజైనా మనోళ్ల మెరుపులు చూడాలని భావించిన వాళ్లకు ఆరంభంలోనే తీవ్ర నిరాశ... లుంగి ఎన్గిడి, కగిసో రబడ దెబ్బ మీద దెబ్బ కొట్టారు. వరుసగా వికెట్లు కూల్చి 272 పరుగుల స్కోరు వద్ద ఆటను ఆరంభించిన భారత జట్టును 50 పరుగుల వ్యవధిలోనే ఆలౌట్ చేశారు. పంత్, అశ్విన్, శార్దూల్, షమీ తదితరులు పట్టుమని పది పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరారు. అయిపోయింది... అంతా అయిపోయింది అంటూ ఉసూరుమన్న అభిమానుల్లో.. సరిగ్గా అప్పుడే జోష్ నింపారు టీమిండియా బౌలర్లు. ప్రొటిస్ జట్టుకు చుక్కలు చూపిస్తూ... పదునైన బంతులు సంధిస్తూ వరుసగా వికెట్లు పడగొట్టారు. మరి వీరి అద్భుత ప్రదర్శన చూసిన అభిమానులకే కాదు.. కెప్టెన్ విరాట్ కోహ్లికి ముచ్చటేసినట్లుంది. అందుకే మైదానంలోనే స్టెప్పులేస్తూ... బౌలర్ల విజయాన్ని ఆస్వాదించాడు. ఆటను పూర్తిగా ఎంజాయ్ చేస్తూ జట్టును ప్రోత్సహించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ‘‘విరాట్ భాయ్... నువ్వు అందరిలాంటి కెప్టెన్ కాదు... ఎక్కడున్నా కింగ్వే. నీ దూకుడే కాదు.. ఆటను ఎంజాయ్ చేసే విధానం కూడా మాకు ఇష్టం. అందుకే నువ్వు ప్రత్యేకమైనవాడివి’’అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా మూడో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 16 పరుగులు చేసి... 146 పరుగుల ఆధిక్యంలో ఉంది. చదవండి: Ind Vs Sa- Mohammed Shami: అంతా మా నాన్న వల్లే.. ఈ క్రెడిట్ ఆయనదే.. షమీ భావోద్వేగం Rishab Pant: ఏకకాలంలో ధోని, సాహా రికార్డు బద్దలుకొట్టిన పంత్ Virat Kohli dancing to the tune. India is having a great day on field ❤😻🥳🥳... ~Virat and his dance steps are pure bliss to watch 😁❤️@imVkohli pic.twitter.com/ZocAuhYw3y — Lavanya Jessy (@LavanyaJessy) December 28, 2021 -
టీమిండియా విజయం.. ఐదు ఆసక్తికర విషయాలు
IND Vs AFG Intresting Facts.. టి20 ప్రపంచకప్లో భాగంగా అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా విజయాన్ని సాధించి భోణీ కొట్టింది. సెమీస్ అవకాశాలు దాదాపు కోల్పోయినప్పటికీ ఈ మ్యాచ్లో టీమిండియాకు తప్పక విజయం కావాలి. అలాంటి కీలకమైన మ్యాచ్లో 66 పరుగుల తేడాతో అఫ్గాన్పై విజయాన్ని అందుకుంది. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా రెండు వందల మార్క్ను దాటింది. ఈ టి20 ప్రపంచకప్లో 200 స్కోరును కొట్టిన తొలి జ్టటుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. కాగా టీమిండియా టి20 ప్రపంచకప్లో రెండు వందల మార్క్ను దాటడం ఇది రెండోసారి. ఇంతకముందు 2007 టి20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో యువరాజ్ దెబ్బకు టీమిండియా 218 పరుగుల స్కోరును నమోదు చేసింది. అయితే అఫ్గాన్తో మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులు అందుకున్నారు. వాటిని ఒకసారి పరిశీలిద్దాం. చదవండి: T20 WC 2021: సెమీస్ చేరడం కష్టమే.. కానీ అదొక్కటే దారి విరాట్ కోహ్లి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టి20 మ్యాచ్ల్లో టాస్ ఓడిపోవడం ఇది 30వ సారి. కాగా విండీస్ మాజీ కెప్టెన్ కార్లోస్ బ్రాత్వైట్ కూడా టి20ల్లో 30సార్లు టాస్ ఓడిపోయాడు. అయితే కోహ్లి టాస్ ఓడినా విజయాల శాతంలో కోహ్లి 37.5శాతంతో.. బ్రాత్వైట్ను(36.67%) అధిగమించాడు. ఇక 2020 నుంచి చూసుకుంటే కోహ్లి 41 మ్యాచ్ల్లో 31సార్లు టాస్ ఓడిపోవడం విశేషం. రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్: టీమిండియా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్లు అరుదైన రికార్డు అందుకున్నారు. అఫ్గాన్తో జరిగిన మ్యాచ్లో ఈ ఇద్దరు తొలి వికెట్కు 140 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. టి20 ప్రపంచకప్లో ఏ వికెట్కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇక టి20 ప్రపంచకప్ల్లో ఇంతవరకు టీమిండియాకు నాలుగు సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి. అంతేకాదు టి20ల్లో టీమిండియాకు 23 సెంచరీ భాగస్వామ్యాలు ఉంటే అందులో 12 సార్లు రోహిత్ శర్మ ఉండడం మరో విశేషం. చదవండి: Virat Kohli- Rohit Sharma: కోహ్లిపై రోహిత్, అశ్విన్ ప్రశంసల వర్షం; అస్సలు ఊహించలేదన్న విరాట్ రిషబ్ పంత్- హార్దిక్ పాండ్యా అఫ్గానిస్తాన్తో మ్యాచ్లో హిట్టర్స్ రిషబ్ పంత్(27 పరుగులు), హార్దిక్ పాండ్యా(35 పరుగులు) దుమ్మురేపారు. ఓపెనర్లు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఈ ఇద్దరు కేవలం 21 బంతుల్లోనే 63 పరుగులు చేశారు. తక్కువ బంతుల్లో(18).. 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఈ జంట ధోని.. యువరాజ్ రికార్డును బ్రేక్ చేశారు. 2007 టి20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో మ్యాచ్లో ధోని- యువరాజ్ ద్వయం 19 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇదే మ్యాచ్లో యువరాజ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహ్మద్ షమీ తన ఏడున్నర సంవత్సరాల కెరీర్లో షమీ ఆడిన టి20 మ్యాచ్ల సంఖ్య 15. ఇక అఫ్గాన్తో మ్యాచ్లో షమీ 4-0-32-3తో టి20 కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు సాధించాడు. ఇంతకముందు 2014లో బర్మింగ్హమ్లో 4 ఓవర్లు వేసిన షమీ 3 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ అఫ్గానిస్తాన్తో మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ(47 బంతుల్లో 74 పరుగులు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. కాగా టి20 ప్రపంచకప్లో రోహిత్ శర్మ 50 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇది ఏడోసారి. ఓవరాల్గా 11వ స్థానంలో ఉన్న రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎక్కువసార్లు అందుకున్న జాబితాలో షాహిద్ అఫ్రిది, మహ్మద్ హఫీజ్లతో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఇక అఫ్గానిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ(13 సార్లు), టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(12 సార్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. చదవండి: T20 WC 2021 IND Vs AFG: ఎట్టకేలకు గెలిచాం.. ఆపై నిలిచాం -
వారిని క్షమించు.. జట్టును కాపాడుకో.. కోహ్లికి బాసటగా నిలిచిన రాహుల్ గాంధీ
Rahul Gandhi Tweets In Support Of Virat Kohli: టీ20 ప్రపంచకప్-2021లో దాయాది పాకిస్థాన్ చేతిలో ఘోర పరాజయం అనంతరం భారత పేసర్ మహ్మద్ షమీని టార్గెట్ చేస్తూ.. కొందరు దురభిమానులు సోషల్మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రస్తుత, మాజీ క్రికెటర్లతో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం షమీకి అండగా నిలిచాడు. అయితే, కోహ్లి.. షమీకి అండగా నిలబడటాన్ని జీర్ణించుకోలేని కొందరు దుర్మార్గులు విరుష్క దంపతుల గారాలపట్టి వామికను ఉద్దేశించి సోషల్మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. Dear Virat, These people are filled with hate because nobody gives them any love. Forgive them. Protect the team. — Rahul Gandhi (@RahulGandhi) November 2, 2021 ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టీమిండియా కెప్టెన్కు బాసటగా నిలిచారు. కోహ్లి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ట్విటర్ వేదికగా స్పందించారు. 'డియర్ విరాట్.. కొందరు మనుషులు పూర్తిగా ద్వేషంతో నిండిపోయి ఉంటారు. ఎందుకంటే వారికి ఎవ్వరూ ప్రేమను పంచరు. వాళ్లను క్షమించు. జట్టును కాపాడుకో' అంటూ మంగళవారం ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. కాగా, అభం శుభం తెలియని చిన్నారి వామికను టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని నెటిజన్లు ఖండిస్తున్నారు. ఆటగాళ్లు రాణించకపోతే వారి కుటుంబసభ్యులను దూషించడం, వారిని టార్గెట్ చేయడం మంచిది కాదని హితవు పలుకుతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోహ్లికి అండగా నిలబడటాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ అంశంపై మహిళా కమీషన్ ఇవాళ ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపింది. కేసుకు సంబంధించిన పురోగతిపై ఆరా తీసింది. నిందితులను త్వరలోనే పట్టుకోవాలని ఆదేశించింది. కోహ్లి కుటుంబానికి బెదిరింపులు వచ్చినట్లు మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా సుమోటో కేసు నమోదైంది. చదవండి: Virat Kohli- Vamika: కోహ్లి కూతురిపై విషం చిమ్మిన నెటిజన్.. ఛీ ఇంతకు దిగజారుతారా? -
T20 WC 2021 IND Vs PAK: షమీని టార్గెట్ చేయడం వెనుక పాక్ కుట్ర..!
Pakistan Behind Shami Trolling: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్, పాక్ల మధ్య మ్యాచ్ ముగిసి రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఏదో ఒక వార్త సోషల్మీడియాలో హాట్ టాపిక్గా నడుస్తూనే ఉంది. తాజాగా షమీపై ట్రోలింగ్కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. పొట్టి ప్రపంచకప్లో భాగంగా భారత్-పాక్ల మధ్య అక్టోబర్ 24న జరిగిన హై ఓల్టేజ్ పోరులో పాక్ 10 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమైన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ(3.5 ఓవర్లలో 43 పరుగులు)ని టార్గెట్ చేస్తూ కొందరు దురభిమానులు సోషల్మీడియా వేదికగా తీవ్ర పదజాలంతో ట్రోలింగ్కు దిగారు. అయితే, ఈ ట్రోలింగ్ పాకిస్థాన్ నుంచే మొదలైందని తాజా పరిశోధనలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ ట్రోల్స్ అన్నీ పాక్కు చెందినవారే చేశారని, మత విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ఈ చర్యలకు పాల్పడ్డారని ఆధారాలతో సహా బహిర్గతమైంది. ఇందుకు సంబంధించి పలు ఇన్స్టాగ్రామ్ ఖాతాలను సైతం గుర్తించారు. వాటి నుంచే షమీపై విష ప్రచారం మొదలైందనట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. కాగా, ఈ విషయమై షమీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, రాజకీయ నాయకులు, ప్రముఖులు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. చదవండి: De Kock: తగ్గేదేలే అన్నాడు.. ఇప్పుడేమో దిగొచ్చాడు..! -
'ఆటగాళ్లను గౌరవించండి..' షమీకి మద్దతుగా నిలిచిన పాక్ ఓపెనర్
Pak Opener Mohammad Rizwan Tweets In Support Of Shami: టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియా పాక్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న అనంతరం భారత పేసర్ మహ్మద్ షమీని టార్గెట్ చేస్తూ కొందరు దురభిమానులు సోషల్మీడియా వేదికగా మాటల దాడికి దిగిన సంగతి తెలిసిందే. పాక్ చేతిలో ఓటమికి షమీనే కారణమని, అతడు పాక్కు అమ్ముడుపోయాడని, షమీని పాక్కు తరిమికొట్టాలంటూ భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ షమీకి మద్దతుగా నిలిచాడు. ట్విటర్ వేదికగా ఓ అద్భుతమైన మెసేజ్ని షేర్ చేశాడు. The kind of pressure, struggles & sacrifices a player has to go through for his country & his people is immeasurable. @MdShami11 is a star & indeed of the best bowlers in the worldPlease respect your stars. This game should bring people together & not divide 'em #Shami #PAKvIND pic.twitter.com/3p70Ia8zxf— Mohammad Rizwan (@iMRizwanPak) October 26, 2021 దేశం కోసం ఆడుతున్నప్పుడు ప్రతి ఆటగాడు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటాడని.. ఈ క్రమంలో ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేస్తాడని పేర్కొన్నాడు. షమీ ప్రపంచపు అత్యుత్తమ బౌలర్లలో ఒకడని.. అలాంటి ఆటగాడిని గౌరవించుకోవాలి కాని దూషించకూడదని హితవు పలికాడు. క్రికెట్ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావాలి కాని, విభజించకూడదంటూ షమీ ఫోటోను పోస్ట్ చేస్తూ ట్వీటాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్మీడియాను షేక్ చేస్తుంది. షమీకి అండగా నిలిచి అద్భుతమైన మెసేజ్ను షేర్ చేసిన రిజ్వాన్పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇదే విషయమై భారత ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు షమీకి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా, పాక్తో జరిగిన మ్యాచ్ టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో 3.5 ఓవర్లు బౌల్ చేసిన షమీ ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. చదవండి: టీమిండియాపై పాక్ గెలుపు.. సంబురాలు చేసుకున్న టీచర్ తొలగింపు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Mohammad Shami: పాక్ అభిమానికి స్ట్రాంగ్ వార్నింగ్..!
Mohammad Shami Confronts Pakistani Fan After Champions Trophy Defeat Vs Pak: టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియా పాక్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న అనంతరం భారత పేసర్ మహ్మద్ షమీని టార్గెట్ చేస్తూ కొందరు దురభిమానులు సోషల్మీడియా వేదికగా మాటల దాడికి దిగిన సంగతి తెలిసిందే. పాక్ చేతిలో ఓటమికి షమీనే కారణమని, అతడు పాక్కు అమ్ముడుపోయాడని, షమీని పాక్కు తరిమికొట్టాలంటూ భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే షమీకి ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, రాజకీయ నాయకులు, టీమిండియా అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో షమీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇందులో షమీ పాక్ అభిమానికి వార్నింగ్ ఇస్తూ కనిపిస్తాడు. Those calling @mdshami11 a #gaddar after the #IndiaVsPak match, please watch this 2017 video, when after losing to Pakistan, only Shami had the courage to confront the bullying Pakistani. #IndvsPak #shami #Kohli #ICCT20WorldCup #RohithSharma pic.twitter.com/8ixvhbJadP — निंदाTurtle (@Tawishz) October 25, 2021 వివరాల్లోకి వెళితే.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో టీమిండియా ఓటమి అనంతరం భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్కు వెళ్తున్న సందర్భంగా ఓ పాక్ అభిమాని గ్యాలరీలో నుంచి టీమిండియా ఆటగాళ్లందరినీ ఉద్దేశించి పరుష పదజాలంతో దూషణకు దిగాడు. ఈ దూషణ పర్వాన్ని భారత ఆటగాళ్లంతా గమనించిప్పటికీ.. మౌనంగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లిపోయారు. అయితే ఆ మాటలు విన్న షమీ మాత్రం స్పందించాడు. సదరు పాక్ అభిమానిపైకి దూసుకెళ్లి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే కెప్టెన్ ధోని షమీని సముదాయించి లోపలికి తీసుకెళ్లాడు. ఈ వీడియోను ఓ అభిమాని సోషల్మీడియాలో పోస్టు చేస్తూ దేశం పట్ల షమీకి ఉన్న అంకితభావం ఇదంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియా వైరలవుతుంది. దీంతో షమీకి భారీ ఎత్తున నెటిజన్ల మద్దతు లభిస్తుంది. గతంలో షమీ టీమిండియా తరఫున సాధించిన ఘనతలను షేర్ చేస్తూ అండగా నిలుస్తున్నారు. చదవండి: IND Vs PAK: షమీపై నెటిజన్ల దాడి.. ఖండించిన టీమిండియా మాజీలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
భారత్ ఓటమికి మహమ్మద్ షమీని టార్గెట్ చేశారు: ఒవైసీ
-
39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా టెయిలెండర్లు..
లండన్: భారత టెయిలండర్లు మహమ్మద్ షమీ(70 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్), జస్ప్రీత్ బుమ్రా(64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో ఈ ఇద్దరు పేసర్లు చెలరేగి బ్యాటింగ్ చేశారు. 209 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న భారత్ను అద్భుత పోరాట పటిమతో విన్నింగ్ ట్రాక్పై నిలబెట్టారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్కు అజేయమైన 89 పరుగులు జోడించి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చారు. ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లండ్ గడ్డపై భారత్ తరఫున 9వ వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా చరిత్రకెక్కారు. 39 ఏళ్ల కిందట 1982లో ఇదే వేదికగా జరిగిన మ్యాచ్లో భారత దిగ్గజాలు కపిల్ దేవ్-మదన్ లాల్ 9వ వికెట్కు 66 పరుగులు జోడించారు. ఇప్పటివరకు ఇంగ్లండ్ గడ్డపై భారత్ తరఫున తొమ్మిదో వికెట్కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యంగా ఉండింది. 39 ఏళ్ల తర్వాత ఈ రికార్డును షమీ, బుమ్రా జోడి అధిగమించడం విశేషం. ఇదిలా ఉంటే, టీమిండియా నిర్దేశించిన 272 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు కేవలం 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. టీమిండియా పేసర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. తొలి ఓవర్లోనే బుమ్రా ఓపెనర్ రోరి బర్న్స్ ను డకౌట్ చేయగా, రెండో ఓవర్లో షమీ మరో ఓపెనర్ సిబ్లీని డకౌట్గా పెవిలియన్కు పంపాడు. అనంతరం ఇషాంత్ హసీబ్ హమీద్(9), బెయిర్స్టో(2)ను పెవిలియన్కు పంపి ఇంగ్లండ్ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ప్రస్తుతం కెప్టెన్ జో రూట్(33) క్రీజ్లో పాతుకుపోయాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 205 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. చదవండి: షమీ, బుమ్రాలకు లభించిన ఘన స్వాగతం చూస్తే ఔరా అనాల్సిందే..! -
షమీ కూతురు డ్యాన్స్.. మురిసిపోయిన క్రికెటర్
లండన్: టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ గారాలపట్టి ఐరా డ్యాన్స్తో దుమ్మురేపింది. ఈ సందర్భంగా తన కూతురు డ్యాన్స్ను చూసి మురిసిపోయిన షమీ '' సూపర్ బేబీ '' అంటూ కామెంట్ చేశాడు. షమీ తన భార్య హసీన్ జహాన్తో ఉన్న వైవాహిక గొడవల నేపథ్యంలో తన కూతురు ఐరాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీలుచిక్కినప్పుడల్లా తన కూతురుతో ఆనందంగా గడుపుతున్నాడు. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో బిజీగా ఉన్న షమీ తన కూతురును చాలా మిస్ అవుతున్నట్లు ఇటీవలే తెలిపాడు. ఈ సందర్భంగానే ఐరా డ్యాన్స్ను తన ఇన్స్టాలో పంచుకున్నాడు. ఇక కివీస్తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే షమీ బౌలర్గా మాత్రం సక్సెస్ అయ్యాడు. మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో షమీ నాలుగు వికెట్లు తీశాడు. కాగా మ్యాచ్ సందర్భంగా మైదానంలోనే టవల్ చుట్టుకొని అభిమానులను అలరించిన వీడియో వైరల్గా మారింది. ఇక ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. View this post on Instagram A post shared by Mohammad Shami , محمد الشامي (@mdshami.11) -
టీమిండియాకు మరో ఎదురు దెబ్బ
అడిలైడ్: తొలి టెస్టులో ఘోర ప్రదర్శనకు తోడు భారత్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రధాన పేసర్ మొహమ్మద్ షమీ మణికట్టు గాయంతో సిరీస్లోని మిగిలిన మూడు టెస్టులకు దూరమయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో కమిన్స్ బంతిని ఆడే క్రమంలో షమీ చేతికి గాయమైంది. అతను బ్యాటింగ్ చేయలేక వెంటనే నిష్క్రమించాడు. మ్యాచ్ తర్వాతి జరిపిన స్కానింగ్లో షమీ మణికట్టుకు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అతని స్థానంలో తదుపరి మ్యాచ్ల్లో నవదీప్ సైనీ లేదా హైదరాబాద్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. -
బీకేర్ ఫుల్.. మరిన్ని బౌన్సర్లు దూసుకొస్తాయి
సిడ్నీ : టీమిండియాతో జరగనున్న నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ఆసీస్ యువ ఆటగాడు విల్ పుకోవిస్కిపై జట్టు మేనేజ్మెంట్ మంచి అంచనాలు ఉండేవి. డేవిడ్ వార్నర్ గైర్హాజరీలో పుకోవిస్కి రాణిస్తాడని ఆశలు పెట్టుకుంది. కానీ అనూహ్యంగా టీమిండియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో కార్తిక్ త్యాగి వేసిన బౌన్సర్ విల్ పుకోవిస్కి హెల్మెట్ భాగాన్ని బలంగా తాకింది. (చదవండి : 'ఐదు రోజులు ఒక్కపాటనే వినిపించారు') దీంతో కొన్ని నిమిషాల పాటు మొకాళ్లపై నిల్చుండిపోయిన పుకోవిస్కి.. తర్వాత ఫిజిమో సూచన మేరకు 23 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. వెంటనే మెడికల్ టీమ్ను సంప్రదించగా.. గాయం తీవ్రత అంతగా లేదని తేల్చి చెప్పింది. మరోవైపు ఆసీస్ మేనేజ్మెంట్ డిసెంబర్ 17 నుంచి ఆరంభం కానున్న మొదటి టెస్టుకు అందుబాటులో ఉంటాడని స్పష్టం చేసింది. అయితే పుకోవిస్కి ఆడడంపై ఇంకా అనుమానాలు తొలిగిపోలేదు. ఈ నేపథ్యంలో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ పుకోవిస్కిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఇలాంటివి జరుగుతాయని నేను ముందే ఊహించా. సాధారణంగానే ఆసీస్ పిచ్లు పేసర్లకు స్వర్గధామంగా ఉంటాయి.ఒకవేళ బ్యాట్స్మన్ మైదానంలోకి దిగాడంటే.. దేశం, రాష్ట్రం, క్లబ్.. ఇలా దేనికి ప్రాతినిధ్యం వహించినా బౌన్సర్లు ఆడాల్సిందే. రానున్న టెస్టు సిరీస్లో పుకోవిస్కి ఆడితే ఇలాంటి బౌన్సర్లు మరిన్ని రానున్నాయి.. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. నాకు తెలిసి టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ బౌన్సర్లు వేయడంలో దిట్ట.. అతని నుంచి మంచి బౌన్సర్లను ఇదివరకే చూశా' అంటూ తెలిపాడు. కాగా అడిలైడ్ వేదికగా డిసెంబర్ 17 నుంచి ఆసీస్తో మొదటి డే నైట్ టెస్టు మ్యాచ జరగనుంది. (చదవండి : త్యాగి బౌన్సర్.. ఆసీస్కే ఎందుకిలా?) -
'నటరాజన్ రాకతో షమీకి కష్టమేనా'
కాన్బెర్రా : ఆసీస్తో శుక్రవారం కాన్బెర్రా వేదికగా జరిగిన తొలి టీ20లో టి. నటరాజన్ మరోసారి అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు వేసి 30 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. నిన్న జరిగిన టీ20లో జడేజా స్థానంలో కాంకషన్గా వచ్చిన చహాల్ మ్యాచ్ విన్నర్గా నిలిచినా.. నటరాజన్ బౌలింగ్ను తీసిపారేసిదిగా కనిపించదు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ నటరాజన్ ప్రదర్శపై ప్రసంశలు కురిపించాడు. నటరాజన్ రాకతో టీ20 ఫార్మాట్లో మహ్మద షమీకి కష్టమేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (చదవండి : టీమిండియా ‘కాంకషన్’ రైటా... రాంగా!) సోనీసిక్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ మాట్లాడుతూ.. ' టీ20 స్పెషలిస్ట్గా తుది జట్టులోకి వచ్చిన నటరాజన్ తొలి మ్యాచ్లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. నా దృష్టిలో మహ్మద్ షమీ స్థానాన్ని నటరాజన్ భర్తీ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇక పొట్టి ఫార్మాట్లో షమీ స్థానం పదిలంగా ఉంటుందా అన్న అనుమానం కలుగుతుంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో నటరాజన్ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. మరో పేసర్ బుమ్రాకు సరిజోడిగా కనిపిస్తున్నాడు. పైగా వీరిద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంది.' అంటూ తెలిపాడు. (చదవండి : కోహ్లి.. ఇదేం వ్యూహం?) ఐపీఎల్ 13వ సీజన్లో ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చిన నటరాజన్ను ఆసీస్ పర్యటనకు ఎంపిక చేశారు. ఐపీఎల్లో సన్రైజర్స్ తరపున 16 వికెట్లు తీసిన నటరాజన్ యార్కర్ల స్పెషలిస్ట్గా ముద్ర వేశాడు. ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా అతని ప్రదర్శనను పొగడ్తల్లో ముంచెత్తాడు. ఆసీస్తో జరిగిన మూడో వన్డేతో అరంగేట్రం చేసిన నటరాజన్ మార్నస్ లబుషేన్ వికెట్ తీసి మెయిడెన్ వికెట్ తీశాడు. శనివారం జరిగిన టీ20లో ఆసీస్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ను అవుట్ చేసి తొలి టీ20 వికెట్ తీసిన నటరాజన్ తర్వాత ఓపెనర్ డీ ఆర్సీ షాట్తో పాటు మిచెల్ స్టార్క్ను పెవిలియన్ చేర్చి భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. -
షమీ భార్య జహాన్కు వేధింపులు
కోల్కతా: టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ నుంచి విడిపోయి కూతురుతో కలిసి వేరుగా ఉంటున్న హసీన్ జహాన్ను వేధిస్తున్న ఓ వ్యక్తిని ఎట్టకేలకు అరెస్టు చేశారు. కోల్కతాకు చెందిన ఓ 25 ఏళ్ల వ్యక్తి జహాన్కు తరచు ఫోన్ కాల్స్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఆ క్రమంలోనే భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. దీనిపై గతంలోనే పోలీసులకు జహాన్ ఫిర్యాదు చేయగా అతన్నిఅరెస్ట్ చేశారు. ‘ ఆ వ్యక్తి పదే పదే కాల్ చేయడంతో జహాన్ సాయం కోరింది. దానిలో భాగంగా అతనిపై ఫిర్యాదు చేసింది. భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. (కోహ్లిని ఊరిస్తున్న తొలి క్రికెటర్ రికార్డు) ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు గురి చేశాడు. ఫోన్ చేసిన ప్రతీసారి ఆమెను తిట్టేవాడు. ఆ కాల్స్ను ఎత్తకపోతే ఫోన్లు చేస్తూనే ఉండేవాడు. ఆ వేధింపులు భరించలేక మమ్మల్ని ఆశ్రయించింది. మంగళవారం రాత్రి అతన్ని అరెస్ట్ చేశాం. దర్యాప్తు కొనసాగుతోంది’ అని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. రెండేళ్ల క్రితం షమీపై గృహ హింస కేసు పెట్టిన హసీన్.. అతను అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడని మీడియా ముందు చెప్పడమే కాకుండా మ్యాచ్ ఫిక్సింగ్కి పాల్పడుతున్నాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించింది. దాంతో.. షమీపై విచారణ జరిపించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతడ్ని నిర్దోషిగా తేల్చగా.. ప్రస్తుతం ఈ ఇద్దరూ విడిగా ఉంటున్నారు. ప్రస్తుతం షమీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. (ఐసీసీ అవార్డుల నామినేషన్లో కోహ్లి డామినేషన్) -
‘ఆరు యార్కర్లు వేయాల్సిందే’
దుబాయ్: రెండు సూపర్ ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్పై పంజాబ్ విజయంలో పేసర్ మొహమ్మద్ షమీ కూడా కీలకపాత్ర పోషించాడు. తొలి సూపర్ ఓవర్ వేసిన అతను వరుస యార్కర్లతో రోహిత్, డికాక్లను ఇబ్బంది పెట్టడంతో కేవలం ఐదు పరుగులే వచ్చాయి. దాంతో ‘టై’ కావడంతో ఫలితం రెండో సూపర్ ఓవర్కు వెళ్లింది. తన బౌలింగ్ వ్యూహంపై షమీకి ముందే స్పష్టత ఉన్నట్లు కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు. ‘సూపర్ ఓవర్ కోసం సాధారణంగా ఎవరూ సిద్ధంగా ఉండరు. అలాంటి సమయంలో బౌలర్ ధైర్యాన్ని, అతని నమ్మకాన్ని మనం నమ్మాలి. తాను ఆరు బంతులు కూడా యార్కర్లుగా వేసేందుకు షమీ సిద్ధంగా ఉన్నాడు. అతను చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనిలాంటి సీనియర్లు మ్యాచ్లు గెలిపించడం ఎంతో అవసరం’ అని రాహుల్ అన్నాడు. టోర్నీలో సూపర్ ఓవర్లో ఒకసారి ఓడిన తాము ఈసారి మ్యాచ్ గెలవడం సంతోషమే అయినా... ఇది పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్లు అతను వ్యాఖ్యానించాడు. తీవ్ర నిరాశలో రోహిత్... మరోవైపు ఈ పరాజయం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను తీవ్రంగా నిరాశపర్చింది. మ్యాచ్ తర్వాత ప్రసారకర్తలతో మాట్లాడేందుకు రాని రోహిత్, ఆ తర్వాత మీడియా సమావేశానికి కూడా పొలార్డ్ను పంపించాడు. ‘మేం గెలవాల్సిన మ్యాచ్ను ఓడిపోయామనే విషయాన్ని ఒప్పుకుంటాను. కానీ ఇదేమీ జీవితంలో అతి పెద్ద సమస్య కాదు. దీనిని మరచి ముందుకు సాగాలి. పరాజయం తర్వాత రోహిత్ బాగా బాధపడుతున్నాడని నాకు తెలిసింది. అయితే అతనో పోరాటయోధుడు అనే విషయం మరచిపోవద్దు’ అని కీరన్ పొలార్డ్ వెల్లడించాడు. నాకు కోపం తెప్పించింది: గేల్ రెండో సూపర్ ఓవర్లో సిక్సర్తో చెలరేగి గెలిపించిన క్రిస్ గేల్ మాట్లాడుతూ...అసలు మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లడమే తనకు నచ్చలేదని అన్నాడు. పంజాబ్ రెగ్యులర్ టైమ్లోనే మ్యాచ్ను గెలవాల్సిందని అభిప్రాయపడిన అతను, తాను ఒత్తిడికి లోను కాలేదని స్పష్టం చేశాడు. ‘సూపర్ ఓవర్లో ఆడే సమయంలో నేనేమీ ఒత్తిడికి లోను కాలేదు. అయితే అలాంటి స్థితికి మ్యాచ్ రావడమే నాకు ఆగ్రహం కలిగించింది. నిజానికి సూపర్ ఓవర్లో మొదటి బాల్ ఎవరు ఆడాలని మయాంక్ అడిగితే ఆశ్చర్యపోయా. ఎప్పుడైనా ‘బాస్’ ఆడాల్సిందేనని, తొలి బంతిని సిక్స్ కొడతాను చూడని కూడా అతనితో చెప్పా’ అని గేల్ వెల్లడించాడు. -
'షమీ భార్యకు భద్రత కల్పించండి'
కోల్కత : టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ నుంచి విడిపోయి కూతురుతో కలిసి వేరుగా ఉంటున్న హసీన్ జహాన్కు భద్రత కల్పించాలంటూ కలకత్తా హైకోర్టు సిటీ పోలీసులను ఆదేశించింది. ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఇటీవల రామ్ మందిర్ నిర్మాణానికి భూమి పూజ జరగ్గా.. హిందువులకి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ వివాదం రేపింది. దీనిపై సోషల్ మీడియా కొందరి నుంచి తనకు వేధింపులు వస్తున్నాయని.. తన కూతురుకు,తనకు ప్రాణహాని ఉందని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో తనకు భద్రత కల్పించాలంటూ కలకత్తా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. (చదవండి : చిట్టితల్లి నిన్ను చాలా మిస్సవుతున్నా) తాజాగా కలకత్తా హైకోర్టు మంగళవారం హసీన్ పిటీషన్ను పరీశీలించింది. హసీన్ తరపు లాయర్ ఆశిష్ చక్రవర్తి.. ఆమెకు సోషల్మీడియాలో వచ్చిన బెదిరింపులతో పాటు పోలీసులకు అందించిన ఫిర్యాదును రిపోర్టు రూపంలో కోర్టుకు సమర్పించారు. హసీన్ తనకు బెదిరింపులు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉద్దేశపూర్వకంగానే పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. కాగా సీనియర్ న్యాయవాది అమితేష్ బెనర్జీ చక్రవర్తి వాదనలను తోసిపుచ్చుతూ.. హసీన్ జహాన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉందని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ దేబాంగ్సు బసక్.. హసీన్ జహాన్ ఆస్తికి, ఆమె జీవితానికి ఎటువంటి హాని జరగకుండా రక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందంటూ మంగళవారం తెలిపారు. అంతేగాక హసీన్ ఫిర్యాదుతో తీసుకున్న చర్యలను రిపోర్టు రూపంలో కోర్టుకు అందించాలంటూ పోలీసులను ఆదేశించింది. కాగా కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు అనంతరం జస్టిస్ పేర్కొన్నారు. కాగా రెండేళ్ల క్రితం షమీపై గృహ హింస కేసు పెట్టిన హసీన్.. అతను అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడని మీడియా ముందు చెప్పడమే కాకుండా మ్యాచ్ ఫిక్సింగ్కి పాల్పడుతున్నాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించింది. దాంతో.. షమీపై విచారణ జరిపించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతడ్ని నిర్దోషిగా తేల్చగా.. ప్రస్తుతం ఈ ఇద్దరూ విడిగా ఉంటున్నారు. షమీ ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ ఆడేందుకు దుబాయ్లో ఉన్నాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపున షమీ మ్యాచ్లు ఆడుతున్నాడు. (చదవండి : మాకు రక్షణ కల్పించండి: షమీ భార్య) -
‘ఐపీఎల్ ప్రాక్టీస్తో ఆసీస్లో రాణిస్తాం’
దుబాయ్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా భారత్ క్రికెటర్లకు మంచి ప్రాక్టీస్ లభించనుందని టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తెలిపాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడనున్నాడు. రెండు నెలల తర్వాత ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా టూర్కు ఐపీఎల్ ఎంతో లాభించనుందని తెలిపాడు. ఆసీస్తో టీ 20 సిరీస్, 4టెస్ట్ మ్యాచ్లు, వన్డే మ్యాచ్లను టీమిండియా ఆడనుంది. అయితే ఐపీఎల్లో ఆసీస్ ఆటగాళ్లు పాల్గొంటున్నందున తమకెంతో ఉపయోగపడనుందని షమీ తెలిపాడు. కాగా ఆసీస్ జట్టును ఎదుర్కొవడానికి నిరంతరం టీమ్ ఆటగాళ్లు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నాడు. అయితే ఐపీఎల్ తరువాత ఆసీస్ టూర్కు సమయం ఎక్కువ లేదనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తు ఐపీఎల్ తక్కువ ఓవర్ల లీగ్ కాబట్టి ఆటగాళ్లపై ఒత్తిడి ఉండదని అభిప్రాయపడ్డాడు. కాగా పేస్, సీమ్, రిథమ్లు కలగలిపిన షమీ తన బౌలింగ్ను పదునుపెట్టే పనిలో పడ్డాడు. లాక్డౌన్ సమయంలోను ఉత్తర్ప్రదేశ్లోని తన స్వస్థలంలో ఉన్న ఫామ్ హౌజ్లో షమీ ప్రాక్టీస్ చేశాడు. (చదవండి: సరిగ్గా ఏడాది క్రితం.. వరల్డ్కప్లో) -
మన పేస్కు మరో రెండేళ్లు ఎదురేలేదు
న్యూఢిల్లీ: టెస్టుల్లో భారత విజయవంతమైన పేస్ బలగానికి మరో రెండేళ్లు ఎదురేలేదని టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నారు. ఇషాంత్ శర్మ, షమీ, ఉమేశ్ యాదవ్, బుమ్రాలతో కూడిన భారత జట్టు రెండేళ్లుగా ఇంటాబయటా విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే రెండేళ్ల వరకూ కూడా ఈ దళానికి ఢోకాలేదని భరత్ చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు, ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ దాకా వాళ్ల పేస్ పదును కొనసాగుతుందని చెప్పారు. ఆ తర్వాత వెటరన్ పేసర్లు రిటైరైనా బుమ్రా దూకుడు అలాగే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
'ఆత్మహత్య చేసుకోవాలని మూడుసార్లు అనుకున్నా'
ఢిల్లీ : వ్యక్తిగత, క్రికెట్ కెరీర్ సంబంధిన సమస్యలు, మానసిక వేదన కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ చెప్పాడు. టీమిండియా ఓపెనర్ రోహిత్శర్మతో ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా మాట్లాడిన షమీ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 2018 ప్రారంభంలో తన భార్య హసిన్ జహాన్ షమీ, అతడి సోదరుడిపై సెక్షన్ 498ఏ కింద గృహ హింస కేసు పెట్టింది. ఇది జరిగిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదంలో షమీ గాయపడ్డాడు. ఆ సమయంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను, ఒత్తిడిని షమీ ఇప్పుడు వెల్లడించాడు. (అజహర్... తీన్మార్) 'నా భార్బ గృహ హింస కేసు పెట్టడంతో కుటుంబ సమస్యలు ప్రారంభమయ్యాయి.. అప్పుడే నాకు యాక్సిడెంట్ అయింది. ఐపీఎల్కు మరో 10-12రోజులు ఉందనగా ఆ ప్రమాదం జరిగింది. అలాగే నా వ్యక్తిగత విషయాలు మీడియాలో నడిచాయి. ఒకవేళ నా కుటుంబం మద్దతు లేకపోతే నేను క్రికెట్ కెరీర్ను కోల్పోతానేమో అని ఆలోచించా. ఆ సమయంలో తీవ్ర వ్యక్తిగత సమస్యల కారణంగా మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన మూడుసార్లు వచ్చింది. మేం 24వ అంతస్తులో ఉండేవాళ్లం. నేను అక్కడి నుంచి దూకేస్తానేమోనని మా కుటుంబ సభ్యులు భయపడేవారు. నా సోదరుడు నాకు చాల మద్దతుగా నిలిచాడు. ఆ సమయంలో 24గంటలు నాతో పాటే ఉండి నన్నుకంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆ బాధ నుంచి బయటపడి క్రికెట్పై దృష్టి సారించాలని నా తల్లిదండ్రులు చెప్పేవారు. వారు నా మంచి కోసమే చెబుతున్నారని భావించి దెహ్రాదూన్ అకాడమీలో ట్రైనింగ్ ప్రారంభించి చాలా శ్రమించానంటూ' పేర్కొన్నాడు. 2015 ప్రపంచకప్ తర్వాత గాయం నుంచి కోలుకునేందుకు 18నెలల సమయం పట్టడంతో తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురయ్యానని, అప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందన్నాడు. తన కుటుంబం మద్దతుగా నిలువకపోయి ఉంటే ఆత్యహత్య చేసుకొని ఉండేవాడినేమోనని మహ్మద్ షమీ తెలిపాడు. -
ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నాం
న్యూఢిల్లీ: విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ హఠాన్మరణం పట్ల దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తనకు ఎంతో ఇష్టమైన నటుల్లో ఒకరైన ఇర్ఫాన్ ఖాన్ ఇంత త్వరగా కన్నుమూయడం బాధ కలిగించిందని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ పేర్కొన్నారు. ఆయన నటన చిరస్మరణీయమని అన్నారు. ఇర్ఫాన్ కుటుంబానికి సంతాపం తెలిపారు. ఇర్ఫాన్ ఖాన్ అసాధారణ నటుడని, ఆయనకు మరణం లేదని టీమిండియా బౌలర్ మహ్మద్ షమి ట్వీట్ చేశాడు. చనిపోయే వరకు అద్భుతమైన తన నటనతో అందరినీ అలరించారని గుర్తు చేసుకున్నాడు. మన కాలపు అత్యుత్తమ నటులలో ఒకరైన ఇర్ఫాన్ ఖాన్ మరణం గురించి భయంకర వార్త విన్నందుకు బాధగా ఉందని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అన్నారు. ఈ కష్ట సమయంలో ఇర్ఫాన్ ఖాన్ కుటుంబానికి భగవంతుడు తట్టుకునే శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు. ఇర్ఫాన్ ఖాన్ను ఇంత తొందరగా కోల్పోతామని అనుకోలేదని, ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నామని నటి రవీనా టాండన్ పేర్కొన్నారు. ప్రతిభావంతుడైన సహ నటుడిని మరణం బాధించిందన్నారు. దేశం గొప్ప నటుడిని కోల్పోయిందని అకాలీదళ్ నాయకుడు, ఢిల్లీ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మజీందర్ సిర్సా పేర్కొన్నారు. ‘భారత్ అద్భుతమైన ప్రతిభ కలిగిన నటుడిని, మంచి మనిషిని కోల్పోయింది. దేవుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాల’ని ఆయన ట్వీట్ చేశారు. ఇర్ఫాన్ మరణం.. మహేశ్ సంతాపం -
గాయంతోనే ఆడాను!
న్యూఢిల్లీ: ధోని నాయకత్వంలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి 2015 వన్డే ప్రపంచ కప్లో భారత జట్టు సెమీఫైనల్ చేరగలిగింది. సెమీస్లో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో 95 పరుగులతో ఓడి నిష్క్రమించింది. ఈ కీలక మ్యాచ్లో ప్రధాన పేసర్ మొహమ్మద్ షమీ తప్పనిసరి పరిస్థితుల్లో బరిలోకి దిగాల్సి వచ్చింది. ఈ టోర్నీ ఆరంభంనుంచే మోకాలి గాయంతో బాధపడుతూ మ్యాచ్లు ఆడుతూ వచ్చిన షమీ సెమీస్లో ఆడటం తన వల్ల కాదన్నా... ధోని భరోసా ఇవ్వడంతో ఆడాల్సి వచ్చింది. మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్తో జరిగిన ఇన్స్టగ్రామ్ సంభాషణలో అతను ఈ విషయం చెప్పాడు. ‘సెమీస్కు ముందు ఇక నా వల్ల కాదంటూ జట్టు సహచరులతో చెప్పేశాను. నొప్పి చాలా ఉందని చెప్పాను కానీ టీమ్ మేనేజ్మెంట్ గాయం తగ్గుతుందని నమ్మింది. మహి భాయ్ నాలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఇది సెమీస్ కాబట్టి మరో బౌలర్ను ఆడించలేమని చెప్పారు. తొలి ఐదు ఓవర్లలో 16 పరుగులే ఇచ్చాను. ఫించ్, వార్నర్లను ఇబ్బంది పెట్టగలిగినా వికెట్ మాత్రం దక్కలేదు. ఇంజక్షన్ తీసుకున్నా పరిస్థితి మెరుగు కాలేదు. ఇక బౌలింగ్ చేయలేనని ధోనికి చెప్పేశాను. అయితే అతను మాత్రం నీపై నమ్మకముంది. పార్ట్టైమర్ అయినా ఎలాగూ పరుగులిస్తాడని అన్నాడు. అలాంటి స్థితిలో నేను ఎప్పుడూ ఆడలేదు. ఆ మ్యాచ్ తర్వాత నా కెరీర్ ముగిసిపోతుందని చాలా మంది చెప్పారు. కానీ అదృష్టవశాత్తూ అలా జరగలేదు’ అని షమీ వెల్లడించాడు. ఈ మ్యాచ్లో 10 ఓవర్లలో 60కు మించకుండా పరుగులు ఇస్తే చాలని షమీకి ధోని లక్ష్యం విధించగా...షమీ 68 పరుగులు ఇచ్చాడు. మిగిలిన ఇద్దరు పేసర్లు మోహిత్ (75), ఉమేశ్ (72)లతో పోలిస్తే మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. అయితే ఈ గాయం షమీ కెరీర్కు నిజంగానే బ్రేకులు వేసింది. మోకాలి గాయానికి శస్త్ర చికిత్స కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు ఆటకు దూరం కావాల్సి వచ్చింది. -
సూపర్ షమీ... భళా బుమ్రా...
ప్రాక్టీస్ పోరులో మన బ్యాట్స్మెన్ విఫలమయ్యారని ఆందోళన చెందిన చోట మన పేస్ బౌలర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటారు. ఎర్ర బంతితో ఎప్పటిలాగే షమీ చెలరేగిపోగా, పరిమిత ఓవర్ల సిరీస్లో పదును చూపించలేకపోయిన బుమ్రా కూడా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను పడగొట్టాడు. టెస్టు తుది జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్న ఉమేశ్, సైనీలకు కూడా వికెట్లు దక్కాయి. మొత్తంగా ప్రాక్టీస్ మ్యాచ్లో మన పేసర్లకు సరైన సాధన లభించింది. తొలి ఇన్నింగ్స్ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకొన్న మన ఓపెనర్లు రెండో ఇన్నింగ్స్లో చక్కటి బ్యాటింగ్ చూపించడం కూడా ఊరటే. హామిల్టన్: ప్రాక్టీస్ మ్యాచ్లో తొలి రోజు బ్యాటింగ్లో విఫలమైన భారత జట్టు రెండో రోజు బౌలింగ్లో సత్తా చాటింది. ఫలితంగా న్యూజిలాండ్ ఎలెవన్ తమ తొలి ఇన్నింగ్స్లో 74.2 ఓవర్లలో 235 పరుగులకే ఆలౌటైంది. భారత్కు 28 పరుగుల ఆధిక్యం లభించింది. కివీస్ తరఫున హెన్రీ కూపర్ (68 బంతుల్లో 40; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... రచిన్ రవీంద్ర (67 బంతుల్లో 34; 7 ఫోర్లు), డరైల్ మిషెల్ (65 బంతుల్లో 32; 5 ఫోర్లు), టామ్ బ్రూస్ (34 బంతుల్లో 31; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో మొహమ్మద్ షమీ 17 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా...బుమ్రా, ఉమేశ్, సైనీ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 7 ఓవర్లలో 59 పరుగులు చేసింది. పృథ్వీ షా (25 బంతుల్లో 35 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ అగర్వాల్ (17 బంతుల్లో 23 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్) క్రీజ్లో ఉన్నారు. ఓవరాల్గా భారత్ ఆధిక్యం 87 పరుగులకు చేరింది. కూపర్ మినహా... న్యూజిలాండ్ ఎలెవన్ తరఫున ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు కాలేదు. రెండో రోజు కూడా బౌన్స్, స్వింగ్కు అనుకూలించిన పిచ్ను భారత బౌలర్లు చక్కగా ఉపయోగించుకున్నారు. బుమ్రా తన రెండో ఓవర్లోనే యంగ్ (2)ను అవుట్ చేసి శుభారంభం అందించగా, సీఫెర్ట్ (9)ను షమీ వెనక్కి పంపించాడు. ఈ దశలో రవీంద్ర, అలెన్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా అది ఎక్కువ సేపు సాగలేదు. మరో ఎండ్లో కూపర్ మాత్రం కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. ఐదో వికెట్కు కూపర్, బ్రూస్ కలిసి 51 పరుగులు జోడించడమే కివీస్ జట్టులో పెద్ద భాగస్వామ్యం. వీరిద్దరు 20 పరుగుల వ్యవధిలో వెనుదిరగ్గా... సీనియర్ ఆటగాడు నీషమ్ (1)ను చక్కటి బంతితో షమీ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్ మొత్తం కలిసి 74 పరుగులు జోడించడంతో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. ఓపెనర్ల జోరు... తొలి ఇన్నింగ్స్లో విఫలమైన భారత ఓపెనర్లు ఈసారి ఎలాంటి తప్పూ చేయలేదు. దూకుడైన షాట్లతో పృథ్వీ షా, మయాంక్ వేగంగా పరుగులు రాబట్టారు. రెండో రోజు చివరకు వచ్చేసరికి పిచ్ కాస్త నెమ్మదించి బ్యాటింగ్కు అనుకూలంగా మారడం కూడా వీరికి కలిసొచ్చింది. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్లో తామిద్దరిని అవుట్ చేసిన కుగ్లీన్ బౌలింగ్లో విరుచుకుపడిన వీరిద్దరు 3 ఓవర్లలోనే 34 పరుగులు బాదారు. భారత్ ఇన్నింగ్స్ 8.42 రన్రేట్తో సాగడం విశేషం. తొలి ఇన్నింగ్స్లాగే మరో సారి ఓపెనర్లుగా పృథ్వీ, మయాంక్లనే పంపడం చూస్తే తొలి టెస్టులో వీరిద్దరినే ఆడించే ఆలోచనతో టీమ్ మేనేజ్మెంట్ ఉన్నట్లు కనిపిస్తోంది. అదే జరిగితే టెస్టు అరంగేట్రం కోసం శుబ్మన్ గిల్ మరికొంత కాలం వేచి చూడక తప్పదు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 263; న్యూజిలాండ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: యంగ్ (సి) పంత్ (బి) బుమ్రా 2; రవీంద్ర (సి) పంత్ (బి) ఉమేశ్ 34; సీఫెర్ట్ (సి) పంత్ (బి) షమీ 9; అలెన్ (బి) బుమ్రా 20; కూపర్ (సి) మయాంక్ (బి) షమీ 40; బ్రూస్ (బి) సైనీ 31; మిషెల్ (సి) పృథ్వీ షా (బి) ఉమేశ్ 32; నీషమ్ (బి) షమీ 1; క్లీవర్ (బి) సైనీ 13; కుగ్లీన్ (నాటౌట్) 11; సోధి (సి) పుజారా (బి) అశ్విన్ 14; ఎక్స్ట్రాలు 28; మొత్తం (74.2 ఓవర్లలో ఆలౌట్) 235. వికెట్ల పతనం: 1–11; 2–36; 3–70; 4–82; 5–133; 6–155; 7–161; 8–204; 9–213; 10–235. బౌలింగ్: బుమ్రా 11–3–18–2; ఉమేశ్ 13–1–49–2; షమీ 10–5–17–3; సైనీ 15–2–58–2; అశ్విన్ 15.2–2–46–1; జడేజా 10–4–25–0. భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (బ్యాటింగ్) 35; మయాంక్ అగర్వాల్ (బ్యాటింగ్) 23; ఎక్స్ట్రాలు 1; మొత్తం (7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 59 బౌలింగ్: టిక్నెర్ 3–0–19–0; కుగ్లీన్ 3–0–34–0; జాన్స్టన్ 1–0–6–0. -
‘రోహిత్ శర్మ ప్రమాదకారి’
హామిల్టన్: న్యూజిలాండ్తో బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడంతో మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. హైటెన్షన్ మ్యాచ్లో భారత జట్టు విజయాన్ని అందుకుని సిరీస్ సొంతం చేసుకోవడం పట్ల హర్షాన్ని వెలిబుచ్చారు. చివరి నిమిషంలో మ్యాచ్ను మలుపు తిప్పిన మహ్మద్ షమీ, సూపర్ సిక్సర్లతో విన్నింగ్ షాట్లు కొట్టిన రోహిత్ శర్మను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం రోహిత్ శర్మకే సాధ్యమని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. చివరి ఓవర్లో 4 బంతులకు 2 పరుగులు మాత్రమే ఇచ్చి షమీ ఊహించని ప్రదర్శన చేశాడని ప్రశంసించాడు. న్యూజిలాండ్ గడ్డపై టి20 సిరీస్ గెలిచి టీమిండియా చరిత్ర సృష్టించిందని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. ప్రపంచంలోనే తానెందుకు ప్రమాదర బ్యాట్స్మనో రోహిత్ శర్మ మరోసారి తన ఆటతో చూపించాడని వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్ చాలా కాలం గుర్తుండిపోతుందన్నాడు. హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ కూడా రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించారు. క్రికెట్లో ఉన్నత నాణ్యమైన ఆటకు ఈ మ్యాచ్ ఉదహరణగా నిలుస్తుందని బ్రదీనాథ్ ట్వీట్ చేశాడు. న్యూజిలాండ్ ఓడినప్పటికీ ఆకట్టుకుందని, విలియమ్సన్ బాగా పోరాడాడని పేర్కొన్నాడు. (చదవండి: టీమిండియా ‘సూపర్’ విజయం) Aisa lagta hai apunich Bhagwan hai ! So fit for #RohitSharma the way he has made impossible tasks possible. But defending 2 runs of 4 balls was an unbelievable effort from Shami. Yaadgaar hai yeh jeet #NZvIND pic.twitter.com/7HD4qXN4Me — Virender Sehwag (@virendersehwag) January 29, 2020 Rohit hai tho mamla hit hai @ImRo45 great T20 series win.. congratulations team india 🇮🇳 @BCCI #INDvsNZ — Harbhajan Turbanator (@harbhajan_singh) January 29, 2020 Great game of cricket and @ImRo45 was ice cool to take us home in the super over. #indvsnz — Ashwin Ravichandran (@ashwinravi99) January 29, 2020 -
మెరుగైన ఫలితాల కోసం కష్టపడాలి: కోహ్లి
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి యువతకు ప్రేరణ కలిగించే అంశాలను సోషల్ మీడియాలో తరుచుగా పోస్ట్ చేస్తుంటాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లలో అద్భుత ఫోమ్ను కొనసాగిస్తున్న విరాట్ తాజాగా ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్లో ఫోస్ట్ చేశాడు. ఫిట్నెస్ కోసం జిమ్ చేస్తున్న దృష్యాలను ఫోస్ట్ చేశాడు. ఏ పని చేసినా ఏదో కష్టపడాలని కాకుండా మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలని తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కోహ్లిని ఆదర్శంగా తీసుకొని మహ్మద్ షమీ ఫిట్నెస్ సాధించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్లో తొలి టీ20 సిరీస్ను కైవసం చేసుకోవాలని టీమిండియా తీవ్రంగా కృషి చేస్తుంది. View this post on Instagram Putting in the work shouldn't be a choice, it should be a requirement to get better. #keeppushingyourself A post shared by Virat Kohli (@virat.kohli) on Jan 27, 2020 at 3:35pm PST ఈ మధ్య కాలంలో టీమిండియా ఆటగాళ్లు మెరుగైన ఫిట్నెస్ను సాధించారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ స్పందిస్తూ..ఆటగాళ్లు తమ ప్రదర్శనను మెరుగు పరిచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఆటగాళ్లు సిక్సులను సులభంగా బాదుతున్నారని కొనియాడారు. చదవండి: కోహ్లికి నాకు కొన్ని పోలికలు నిజమే: బాలీవుడ్ నటి -
ఆ టేస్ట్ షమీకి లేదు: సాహా
న్యూఢిల్లీ : భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా టెస్టు ఫార్మాట్లో బెస్ట్ వికెట్కీపర్గా ఇప్పటికే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. వికెట్ల వెనుక వేగంగా కదులుతూ బంతి కోసం అతను చేసే విన్యాసాలు అందరిని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో సాహా పలుమార్లు డైవ్ చేస్తూ క్యాచ్లు అందుకున్న సంగతి ఎవరు మరిచిపోలేరు. అయితే సాహా ఆటలో ఎంత చురుకుదనం ప్రదర్శిస్తాడో మైదానం బయట అంతే చలాకీగా ఉంటాడు. తాజాగా ఈఎస్పీఎన్ నిర్వహించిన ఇంటర్యూలో వృద్ధిమాన్ సాహా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ప్రస్తుత టీమిండియా జట్టులో సంగీతం మీద అవగాహన లేకుండా ఎవరైనా ఉన్నారా అని సాహాను అడగగా.. అతను తడుముకోకుండా మహ్మద్ షమీ పేరు వెల్లడించాడు. ప్రస్తుత టీమిండియా జట్టులో అందరికి సంగీతం మీద అంతో ఇంతో ఇష్టం ఉంది. కానీ షమీకి మాత్రం సంగీతం మీద ఏ మాత్రం అవగాహన లేదన్నాడు. అయితే మైదానంలో మాత్రం షమీ తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పతిప్పలు పెడుతూ వికెట్లను కొల్లగొడుతాడని తెలిపాడు. ఈ సందర్భంగా రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్లో తాను, పుజారా కలిసి ఆస్ట్రేలియన్స్పై స్లెడ్జింగ్కు దిగామని గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ల స్లెడ్జింగ్నే తాము కాపీ కొట్టామని సాహా పేర్కొన్నాడు. కోల్కతాలో బంగ్లాతో జరిగిన పింక్ బాల్ టెస్టులో ఉమేశ్ యాదవ్ వేసిన ఓవర్లో ఓపెనర్ షాదమన్ ఇస్లామ్ క్యాచ్ను అందుకోవడం ద్వారా సాహా టెస్టుల్లో భారత్ తరపున 100 డిస్మిల్స్ చేసిన ఐదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో సాహా ప్రదర్శనకు ముగ్దుడైన కెప్టెన్ విరాట్ కోహ్లి 'ప్రస్తుత ఉపఖండపు పరిస్థితుల్లో సాహా ఒక ఉత్తమ వికెట్ కీపర్' అంటూ అప్పట్లో ప్రశంసలతో ముంచెత్తాడు. -
పేస్ బౌలింగ్ సూపర్
సాక్షి క్రీడా విభాగం: ‘స్పిన్ పరీక్ష కోసం సన్నద్ధమై వస్తే సిలబస్లో లేని విధంగా భారత పేస్ బౌలర్లు మాకు పరీక్ష పెట్టారు’... అదో రకమైన వైరాగ్యంతో దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ దాదాపుగా ఇదే మాట చెప్పాడు. భారత జట్టు సొంతగడ్డపై టెస్టులు, సిరీస్లు నెగ్గడం కొత్త కాదు. మన బ్యాట్స్మెన్ పరుగుల వరద పారించడం కూడా మొదటి సారి కాదు. మనం భారీ స్కోర్లు సాధించిన తర్వాత స్పిన్నర్లు చెలరేగిపోయి టపటపా వికెట్లు పడగొట్టడం రొటీన్గా జరిగిపోయేదే. కానీ ఈ సారి విజయానికో విశేషం ఉంది. సఫారీలపై మన గెలుపులో భారత పేస్ బౌలర్లు కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ మన పేసర్లను ఎదుర్కోవడంలో ఎంత ఇబ్బంది పడ్డారో కనిపించింది. సిరీస్లో మన ఫాస్ట్ బౌలర్లు షమీ, ఉమేశ్, ఇషాంత్ కేవలం 17.50 సగటుతో వికెట్లు పడగొడితే రబడ, ఫిలాండర్లాంటి పదునైన పేసర్లతో కూడిన దక్షిణాఫ్రికా జట్టు మరీ ఘోరంగా 70.20 సగటుతో వికెట్లు తీసిందంటే మన సత్తా అర్థమవుతోంది. మనం సొంతగడ్డపై ఆడుతున్నామని అనుకున్నా... అనుకూలంగా ఉన్న పిచ్లపై కూడా ఏమీ చేయలేని సఫారీలతో పోలిస్తే మన బౌలింగ్ ఎంత పదునుగా ఉందో ఇది చూపిస్తోంది. షమీ 3 టెస్టుల్లో 13, ఉమేశ్ 2 టెస్టుల్లో 11 వికెట్లు పడగొట్టారు. ఇషాంత్ 2 వికెట్లే తీసినా ప్రత్యర్థి బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెంచడంలో సఫలమయ్యాడు. స్పిన్నర్లు తీసిన 32 వికెట్లతో పోలిస్తే పేసర్లు 26 వికెట్లతో చేరువగా రావడం సాధారణంగా భారత్లో కనిపించని దృశ్యం. ఉమేశ్ యాదవ్ మాటల్లో చెప్పాలంటే ‘ఆరంభంలో బంతి మెరుపు పోయేలా చేసి స్పిన్నర్లకు అప్పగించడం, ఆ తర్వాత ఎప్పుడో చివర్లో రివర్స్ స్వింగ్ కోసం ప్రయత్నించడం ఇప్పటి వరకు కనిపించేది. కానీ మన బౌలింగ్లో పేస్, బౌన్స్ ఉంటే భారత్లో కూడా సఫలం కావచ్చని మేం రుజువు చేశాం’ అనేది అక్షర సత్యం. భారత పిచ్లపై ఎలా బౌలింగ్ చేయాలో తమకు అర్థం అయిందని, దాని కోసం ఎంతో సాధన చేశామని షమీ చెప్పుకొచ్చాడు. తమ ఫిట్నెస్గా అద్భుతంగా మారడం కూడా అందుకు ఒక కారణమని అతను విశ్లేషించాడు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్పై మన ఫాస్ట్ బౌలర్లు ఇంతగా ఆధిపత్యం కనబర్చడం ఎప్పుడూ చూడలేదని మాజీ క్రికెటర్లు కూడా చాలా మంది అభిప్రాయ పడ్డారు. ఇక ఈ సిరీస్లో నంబర్వన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఉండి ఉంటే ఏం జరిగేదే ఊహించగలమా! వీరితో పాటు కొంత కాలంగా నిలకడగా మన విజయాల్లో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్ కూడా మరో కీలక బౌలర్. రాబోయే రోజుల్లో ఈ ఐదుగురితో కూడిన మన పేస్ దళంనుంచి మరిన్ని అద్భుతాలు, ముఖ్యంగా విదేశాల్లో నిలకడైన విజయాలు కచ్చితంగా వస్తాయని ఆశించవచ్చు. ‘షమీ, ఉమేశ్ స్ట్రయిక్రేట్ చూస్తే భారత్లో గతంలో ఏ పేసర్లూ ఇలా బౌలింగ్ చేయలేదని అర్థమవుతోంది. ముఖ్యంగా స్టంప్స్పైకి, బ్యాట్స్మెన్ ప్యాడ్లపైకి వీరు బంతులు సంధించిన తీరు నిజంగా అద్భుతం. ఇది మన దూకుడుకు మంచి సంకేతం. బ్యాట్స్మెన్పై ఒత్తిడి కొనసాగిస్తూ వీరు వికెట్లు తీయగలిగారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన పేసర్లు బౌలింగ్ చేసే సవాల్కు సిద్ధంగా ఉంటున్నారు. వికెట్ తీయాల్సిందే అన్నట్లుగా బంతిని అడిగి మరీ తీసుకుంటున్నారు.’ –విరాట్ కోహ్లి ఏ పిచ్ అయినా ఒకటే పిచ్లు ఎలా పోతే మాకేంటి? జొహన్నెస్బర్గ్ అయినా మెల్బోర్న్ అయినా ముంబై అయినా మ్యాచ్ ఫలితంపై పిచ్ ప్రభావం లేకుండా చూడటమే మా ఉద్దేశం. ఇంత అద్భుతమైన బ్యాటింగ్ లైనప్, 20 వికెట్లు తీయగల బౌలర్లు ఉన్నప్పుడు ఈ విజయాలు వస్తూనే ఉంటాయి. మా జట్టు ఫెరారీ కారు తరహాలో దూసుకుపోతుంది. సాధారణంగా భారత్లో విజయం సాధించినప్పుడు ఒకరో, ఇద్దరికో గుర్తింపు లభిస్తుంది. కానీ ఈసారి ఆరేడుగురు ఆ జాబితాలో ఉన్నారు. షాబాజ్ నదీమ్ ఈ స్థాయికి చేరేందుకు ఎంతో శ్రమించాడు. అతను తన సొంత ప్రేక్షకుల సమక్షంలో మ్యాచ్ను ముగించడం సంతోషంగా ఉంది. ప్రతీ బంతిని కచ్చితత్వంతో వేయడం అతని అనుభవానికి నిదర్శనం. –రవిశాస్త్రి, భారత కోచ్ 1932లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన భారత్ ఇప్పటివరకు మొత్తం 538 టెస్టులు ఆడింది. ఇందులో 155 మ్యాచ్ల్లో గెలిచింది. 165 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 217 టెస్టులు ‘డ్రా’ చేసుకుంది. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. 87 ఏళ్ల తమ టెస్టు చరిత్రలో ఓవరాల్గా కనీసం రెండు అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్లతో జరిగిన సిరీస్లను భారత్ ‘క్లీన్స్వీప్’ చేయడం ఇది 14వసారి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. భారత్ క్లీన్స్వీప్ సిరీస్ల జాబితా -
షమీ ‘పేద్ద’ క్రికెటర్లా ఫీలవుతాడు: భార్య
కోల్కత : టీమిండియా పేస్ బౌలర్ మొహమ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అతని భార్య హసీన్ జహాన్ దాఖలు చేసిన గృహహింస పిటిషన్పై విచారణ చేపట్టిన అలీపూర్ కోర్టు షమీతో పాటు ఆయన సోదరుడు హసీద్ అహ్మద్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 15 రోజుల్లోగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు 15 రోజుల గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హసీన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు. ఏడాది కాలంగా న్యాయం కోసం వేచిచూస్తున్నా. ఎట్టకేలకు మంచి నిర్ణయం వెలువడింది. (చదవండి : షమీపై అరెస్ట్ వారెంట్) తనంత బలవంతుడు లేడన్నట్టుగా షమీ మితిమీరి ప్రవర్తిస్తాడు. తానో పేద్ద క్రికెటర్లా ఫీలవుతాడు. నేను బెంగాల్కు చెందినదాన్ని కాకున్నా.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాకుండా వేరే ఎవరున్నా నేను క్షేమంగా ఉండేదాన్ని కాదు. ఉత్తరప్రదేశ్లో ఉన్నప్పుడు అమ్రోహ పోలీసులు నన్నూ, నా కూతుర్ని వేధింపులకు గురిచేశారు. దేవుని దయవల్ల అక్కడ నుంచి క్షేమంగా బయటపడ్డాం’ అన్నారు. ఇక జసీన్ ఫిర్యాదు మేరకు షమీపై మార్చిలో వరకట్నం, లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. నెలకు రూ.7 లక్షలు భరణంగా ఇవ్వాలని జసీన్ డిమాండ్ చేసింది. వీరి వివాహం 2014లో జరిగింది. -
షమీ.. యువర్ ఇంగ్లీష్ బహుత్ అచ్చా!
మౌంట్మాంగనీ : న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో 5 వన్డేల సిరీస్.. రెండు వన్డేలు మిగిలి ఉండగానే 3-0తో కోహ్లిసేన వశమైంది. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన మహ్మద్ షమీ(3/41)కి మ్యాన్ఆఫ్ ది మ్యాచ్ వరించింది. అయితే షమీ ఈ అవార్డు అందుకునే సమయంలో ఓ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. ఎప్పుడూ హిందీలో మాట్లాడే షమీ.. ఈ సారి ఇంగ్లీష్లో మాట్లాడి ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్లో కూడా మ్యాన్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచిన షమీ.. ఆ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లి సాయం తీసుకున్నాడు. షమీ హిందీలో మాట్లాడగా.. కోహ్లి ఇంగ్లీష్లోకి అనువదించాడు. నిన్న కూడా షమీ వెంట కోహ్లి వచ్చినప్పటికి.. అతనికి అవకాశం ఇవ్వకుండా ఇంగ్లీష్లో అదరగొట్టాడు. షమీ ఇంగ్లీష్కు ముగ్ధుడైన కామెంటేటర్, న్యూజిలాండ్ మాజీ పేసర్ సిమన్ డౌల్ ‘షమీ యువర్ ఇంగ్లీష్ బహుత్ అచ్చా.. అభినందనలు’ అని హిందీలో కితాబిచ్చాడు. దీంతో అక్కడ నవ్వులు పూసాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇంతకీ సంభాషణ ఏంటంటే.. న్యూజిలాండ్లో ఎదురుగాలుల్లో బౌలింగ్ చేయడం ఎలా ఉందని షమీని సిమన్ ప్రశ్నించారు. దీనికి షమీ ధైర్యం చేసి ఇంగ్లీష్లో ‘నిజానికి ఎదురుగాలుల్లో బౌలింగ్ చేయడం చాలా కష్టం. కానీ సాధ్యమయ్యేదే. మరో ఎండ్ నుంచి భువనేశ్వర్ సాయం అందించాడు. సరైన ప్రదేశాల్లో బంతులను సంధించడమే ముఖ్యం’ అని షమీ చెప్పుకొచ్చాడు. -
షమీ.. యువర్ ఇంగ్లీష్ బహుత్ అచ్చా!
-
కివీస్ ప్యాకప్
నేపియర్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. కుల్దీప్ (4/39), షమీ(3/19), చహల్( 2/43), కేదార్ జాదవ్(1/17)లు చెలరేగటంతో 38 ఓవర్లలో 157 పరుగులకే ఆతిథ్య జట్టు ఆలౌటైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్కు ఆ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. ఓపెనర్లు గుప్టిల్(5), మున్రో(8)లను మహ్మద్ షమీ తన వరుస ఓవర్లలో క్లీన్బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన లాథమ్(11), రాస్ టేలర్(22) లను చహల్ పెవిలియన్కు పంపించాడు. విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు తనదైన శైలిలో సారథి విలియమ్సన్ రాణించాడు. టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ.. మెల్లిగా స్కోర్ను పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే వన్డే కెరీర్లో 36వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రాస్ టేలర్తో 34 పరుగులు, నికోలస్తో 31 పరుగుల భాగస్వామ్యాన్ని విలియమ్సన్ నమోదు చేశాడు. నికోలస్(12) క్రీజులో నిలదొక్కుకున్నాడని అనుకున్న తరుణంలో.. జాదవ్ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ అద్భుత క్యాచ్కు వెనుదిరిగడు. సాన్ట్నర్(14)ను షమీ వికెట్ల ముందు దొరకపుచ్చుకున్నాడు. ముగించిన కుల్దీప్ కివీస్ పతనాన్ని మహ్మద్ షమీ ఆరంభించగా.. కుల్దీప్ ముగించాడు. ప్రమాదకరంగా మారుతున్న విలియమ్సన్(64)ను ఔట్ చేసిన ఈ లెఫ్టాండర్ బౌలర్.. అనంతరం టెయిలెండర్ల భరతం పట్టాడు. బ్రాస్వెల్(7), ఫెర్గుసన్(0), బౌల్ట్(1) వికెట్లను పడగొట్టి కివీస్ ఇన్నింగ్స్ను ముగించాడు. దీంతో టీమిండియా ముందు 158 పరుగుల లక్ష్యాన్ని కివీస్ నిర్దేశించింది. -
భువీ, బుమ్రా వచ్చేశారు
న్యూఢిల్లీ: టీమిండియా పేస్ బౌలింగ్ ప్రధాన అస్త్రాలైన భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా వెస్టిండీస్తో జరుగనున్న మిగతా మూడు వన్డేలకు జట్టులోకి వచ్చారు. సెలక్షన్ కమిటీ గురువారం జట్టును ప్రకటించింది. ఇందులో ఉమేశ్ యాదవ్ చోటు కాపాడుకోగా... మొహమ్మద్ షమీని తప్పించారు. ఈ ఒక్క మార్పు మినహా మిగతా జట్టును యథాతథం గా కొనసాగించారు. గాయం నుంచి కోలుకున్నా కేదార్ జాదవ్ను పరిగణనలోకి తీసుకోలేదు. మొదటి రెండు వన్డేలకు భువీ, బుమ్రాలకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. జాదవ్కు చోటు లేదు! ప్రస్తుత సిరీస్లో అనుకూల పిచ్లపై బ్యాట్స్మెన్ చెలరేగుతుండటంతో ఇరు జట్ల బౌలర్లు చేసేదేమీ లేకపోతోంది. ముఖ్యంగా హిట్టింగ్కు పేరుగాంచిన విండీస్ బ్యాట్స్మెన్ను మన పేసర్లు, స్పిన్నర్లు అనుకున్నంతగా కట్టడి చేయలేకపోతున్నారు. రెండు వన్డేల్లో కలిపి ఉమేశ్ 142, షమీ 140 పరుగులిచ్చారు. అయితే, తొలి మ్యాచ్లో విఫలమైన షమీ... విశాఖపట్నంలో మెరుగ్గా (1/59) బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్లలో యార్కర్లతో పరుగులు నిరోధించాడు. ఈ విషయంలో ఉమేశ్ కంటే మెరుగైన షమీని తప్పించడం ఆశ్చర్యకరంగా ఉంది. మరోవైపు బౌలింగ్ ఇలాగే ఉంటే వన్డే సిరీస్ నెగ్గడం కష్టమని భావించారో, ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో పెట్టు కుని పూర్తి స్థాయి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం అనుకున్నారో కాని భువీ, బుమ్రాల విశ్రాంతిని ముగించారు. ఇక, ఫిట్నెస్ సంతరించుకుని గురువారం దేవధర్ ట్రోఫీలో భారత్ ‘ఎ’ తరఫున బ్యాట్తో రాణించి, ఐదు ఓవర్లు కూడా వేసిన జాదవ్ను తీసుకోకపోవడమూ కొంత చర్చకు తావిచ్చింది. నన్నెందుకు తీసుకోలేదో?: జాదవ్ విండీస్తో తదుపరి మూడు వన్డేలకు ఎంపిక చేయకపోవడంపై సెలక్షన్ కమిటీ నుంచి తనకెలాంటి సమాచారం లేదని ఆల్రౌండర్ కేదార్ జాదవ్ పేర్కొన్నాడు. ఢిల్లీలో దేవధర్ ట్రోఫీ ఆడుతోన్న అతడిని... టీమిండియాలోకి తీసుకోకపోవడం గురించి మీడియా అడగ్గా ‘ఈ విషయం మీ ద్వారా ఇప్పుడే తెలిసింది. నన్నెందుకు ఎంపిక చేయలేదో ఆలోచించాల్సి ఉంది. జట్టుతో లేను కాబట్టి వారి ప్రణాళికలేమిటో నాకు తెలియదు’ అని వ్యాఖ్యానించాడు. తాను పూర్తిగా కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్తో ఉన్నట్లు తెలిపాడు. గాయాల నుంచి కోలుకున్నట్లు ఎన్సీఏ ప్రకటిస్తేనే ఏ టోర్నీ అయినా ఆడిస్తారని అన్నాడు. గురువారం భారత్ ‘ఎ’ తరఫున ఫిరోజ్షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్ ఆడిన జాదవ్... 25 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ను ముగ్గురు జాతీయ సెలక్టర్లు వీక్షించడం గమనార్హం. కేదార్ జాదవ్ గాయాల చరిత్రే కారణం: ఎమ్మెస్కే కేదార్ జాదవ్ను టీమిండియాలోకి తీసుకోకపోవడానికి అతడి గాయాల చరిత్రే కారణమని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. ‘గతంలో కోలుకొని జట్టులోకి వచ్చిన వెంటనే జాదవ్ గాయాలకు గురయ్యాడు. ఇటీవల ఆసియా కప్లో కూడా అదే జరిగింది. దీంతో పాటు దేవధర్ ట్రోఫీలో భారత్ ‘ఎ’ గురువారం నెగ్గి ఉంటే... అతడికి ఫైనల్ రూపంలో మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉండేది. అప్పుడు తన ఫిట్నెస్పై మేం పూర్తి భరోసాకు వచ్చేవాళ్లం. నాలుగో వన్డేకు భారత జట్టులోకి అదనపు ఆటగాడిగా తీసుకునేవాళ్లమేమో. జట్టు ఎంపిక సందర్భంగా మేం ఓ పద్ధతి అనుసరిస్తున్న తీరును ఆటగాళ్లు అర్థం చేసుకోవాలి’ అని ఎమ్మెస్కే పేర్కొన్నారు. -
నాలుగు వికెట్లు కోల్పోయిన విండీస్
గువాహటి : భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన విండీస్కు భారత పేసర్ మహ్మద్ షమీ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ హెమరాజ్ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హోప్తో కీరన్ పావెల్ దాటిగా ఆడటంతో విండీస్ 10 ఓవర్లకు వికెట్ నష్టపోయి 59 పరుగులు చేసింది. ఈ క్రమంలో కీరన్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రమాదకరంగా మారిన కీరన్ను యువ బౌలర్ ఖలీల్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు. దీంతో రెండో వికెట్కు నమోదైన 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే షమీ హోప్ను.. చహల్ సామ్యుల్ను ఔట్ చేయడంతో విండీస్ 114 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో హెట్మెయిర్(42), రోవ్మన్ పావెల్(7)లున్నారు. -
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 152/5
సౌతాంప్టన్ : భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీ విరామ సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. 6/0 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ను భారత బౌలర్ల దెబ్బతీశారు. భారత పేసర్ల దాటికి ఇంగ్లండ్ 122 పరుగులకే కీలక ఐదు వికెట్లు కోల్పోయింది. వరుస వికెట్లు పోతున్నా జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన జోరూట్(48)ను మహ్మద్ షమీ సూపర్ ఫీల్డింగ్తో రనౌట్ చేశాడు. మిగతా బ్యాట్స్మెన్లో జెన్నింగ్స్(36) మినహా అందరూ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. బెన్ స్టోక్స్ 20(79), జోస్ బట్లర్ 22(39) పరుగులతో క్రీజులో ఉన్నారు. షమీకి రెండు వికెట్లు దక్కగా.. ఇషాంత్, బుమ్రాలకు తలో వికెట్ దక్కింది. -
హార్దిక్ పాండ్యా స్థానంలో షమీ
లార్డ్స్ మైదానంలో గురువారం వెస్టిండీస్తో తలపడే ఐసీసీ వరల్డ్ ఎలెవన్ జట్టు నుంచి భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తప్పుకున్నాడు. అనారోగ్యం కారణంగా దూరమైన అతని స్థానంలో పేసర్ మొహమ్మద్ షమీకి చోటు లభించింది. మరో భారత ఆటగాడు దినేశ్ కార్తీక్తో కలిసి షమీ బరిలోకి దిగుతాడు. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ను కూడా ఎంపిక చేశారు. కరీబియన్ దీవుల్లో హరికేన్ కారణంగా దెబ్బ తిన్న స్టేడియాల పునరుద్ధరణకు నిధుల సేకరణ నిమిత్తం ఐసీసీ ఈ మ్యాచ్ను నిర్వహిస్తోంది. -
షమీ బీసీసీఐని మోసం చేశాడు
కోల్కతా: భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ, అతని భార్య హసీన్ జహాన్ల వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇప్పటికే అతనిపై అనేక ఆరోపణలు చేసిన హసీన్ తాజాగా మరో బాంబు పేల్చింది. షమీ తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్)లను మోసం చేశాడంటూ మళ్లీ వార్తల్లో నిలిచింది. తన అసలు వయసు కంటే ఎనిమిదేళ్లు తక్కువగా చూపించే ధ్రువపత్రాలతో అందర్నీ మోసం చేశాడని సోషల్ మీడియా ఫేస్బుక్ ద్వారా బయట పెట్టింది. దీనికి సంబంధించి షమీ ఫొటో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ను పోస్ట్ చేసింది. అయితే కొద్ది సేపటికే ఆ పోస్ట్ను తొలగించింది. ప్రస్తుత రికార్డుల ప్రకారం షమీ పుట్టిన సంవత్సరం 1990 కాగా... జహాన్ షేర్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్లో 1982గా ఉంది. ‘షమీ నకీలీ జనన ధ్రువీకరణ పత్రాలతో తన పుట్టిన సంవత్సరం 1990గా చూపిస్తూ ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నాడు. అతను బీసీసీఐ, క్యాబ్లతో పాటు ప్రజలను కూడా వంచించాడు. ఈ తప్పుడు పత్రాలతోనే అం డర్–22 టోర్నీల్లో పాల్గొన్నాడు. దీనివల్ల అర్హులైన 22 ఏళ్ల వయసు గల క్రికెటర్లు నష్టపోయారు’ అని ఆమె పేర్కొంది. -
‘షమీ బీసీసీఐని మోసం చేశాడు’
కోల్కతా : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ, అతని భార్య హసీన్ జహాన్ల వ్యవహారం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా లేదు. ఇప్పటికే ఇతర మహిళలతో షమీకి సంబంధాలున్నాయని, మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని, తనని మానసికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన జహాన్ తాజాగా అతని పుట్టిన రోజు తేది తప్పంటూ మరో ఆరోపణతో వార్తల్లో నిలిచారు. షమీ పుట్టిన రోజు విషయంలో బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్)లను మోసం చేశాడని, నకిలీ బర్త్ డే సర్టిఫికేట్లతో వివిధ కెటగీరిల జాతీయ, రాష్ట్రీయ టోర్నీల్లో పాల్గొన్నాడని ఆరోపిస్తూ.. షమీ డ్రైవింగ్ లైసెన్స్ ఫొటోను రుజువుగా జోడిస్తూ తన ఫేస్బుక్ పేజీలో ఓ పోస్ట్ చేశారు. అయితే కొద్ది సేపటికే ఈ పోస్ట్ను తొలిగించారు. ప్రస్తుతం ఉన్న రికార్డుల ప్రకారం షమీ పుట్టిన సంవత్సరం 1990గా ఉండగా జహాన్ షేర్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్లో 1982గా ఉంది. జహాన్ చేసిన పోస్ట్.. ‘‘ఫ్రెండ్స్.. మహ్మద్ షమీ తన పుట్టిన రోజు తేదీ విషయంలో నకీలీ ధృవీకరణ పత్రాలతో 1990 గా చూపిస్తూ ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నాడు. అతను బీసీసీఐ, క్యాబ్తో పాటు ప్రజలను మోసం చేశాడు. ఈ తప్పుడు పత్రాలతో అండర్-22 క్రికెట్ టోర్నీలో ఆడాడు. ఈ చర్యతో నిజమైన 22 ఏళ్ల క్రికెటర్ నష్టపోయాడు’’ అని జహాన్ పేర్కొన్నారు. ఇక ఇప్పటికే జహాన్.. షమీ, అతని కుటుంబ సభ్యులపై గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేశారు. దీంతో కోల్కతా పోలీసులు విచారణ కూడా చేపట్టారు. అంతేగాకుండా షమీ నుంచి భరణం ఇప్పించాలని జహాన్ కోర్టును కూడా ఆశ్రయించారు. ఇక షమీ ఈ సీజన్ ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. హసీన్ జహాన్ షేర్ చేసిన షమీ డ్రైవింగ్ లైసెన్స్ -
క్రికెటర్ షమీకి నోటిసులు
-
నెలకు రూ.10 లక్షలు ఇప్పించండి
కోల్కతా: భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ తన జీవనాధారం కోసం రూ. 10 లక్షల భరణం ఇప్పించాలని అలీపూర్ కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. ప్రస్తుతం ఆమె పెట్టిన గృహహింస కేసును విచారిస్తున్న ఈ కోర్టు... షమీతో పాటు అతని కుటుంబసభ్యులంతా 15 రోజుల్లోగా కోర్టులో స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. హసీన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ‘హసీన్ జహాన్కు షమీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కేసులు వేసిన తర్వాత రూ. లక్ష చెక్ ఇచ్చినా అది బౌన్స్ అయింది. దీంతో ఆమె వద్ద ఇప్పుడు చిల్లి గవ్వ లేదు’ అని అన్నారు. హసీన్ తన ఇంటి ఖర్చులు, వ్యక్తిగత అవసరాల కోసం రూ. 7 లక్షలు, కుమార్తె ఐరా ఖర్చుల కోసం మరో రూ. 3 లక్షలు భరణంగా ఇప్పించాలని కోర్టును ఆశ్రయించిందని లాయర్ చెప్పారు. -
షమీకి మరో షాకిచ్చిన జహాన్
కోల్కతా : ఓ వైపు టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భార్యకోసం పరితపిస్తుంటే.. ఆమె మాత్రం అతన్ని మరింత ఇబ్బందుల్లో నెట్టడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా హసీన్ జహాన్ షమీపై మరో కేసు దాఖలు చేసింది. మంగళవారం కోల్కతాలోని అలీపూర్ కోర్టులో గృహహింస చట్టం 2005 కింద ఆమె పిటిషన్ వేసింది. ఈ పిటిషన్లో తనకు, తన కూతురి పోషణకు.. షమీ భరణం చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరింది. తమ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోకుండా షమీ బ్యాంకులకు సూచనలిచ్చాడని జహాన్ ఆరోపించింది. ఇటీవల తాను చెక్ సాయంతో డబ్బుతీసుకోవాలని ప్రయత్నించానని, కానీ డబ్బులు రాలేదని ఆమె పేర్కొంది. ఈ నేపథ్యంలోనే భరణం కోసం కోర్టుకెక్కినట్లు తెలిపింది. గతంలో షమీ ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని, తనను మానసికంగా వేధించాడని, ఫిక్సింగ్కు పాల్పడ్డాడని జహాన్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గృహ హింస చట్టం కింద షమీతో పాటు, అతని కుటుంబ సభ్యులపై కోల్కతా పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. అంతటితో ఆగని ఆమె షమీని ఐపీఎల్లో ఆడనివ్వద్దని బీసీసీఐ అధికారులకు కూడా విజ్ఞప్తి చేసింది. తొలుత వార్షిక వేతనాల్లో కాంట్రాక్టు ఇవ్వని బీసీసీఐ ఫిక్సింగ్ ఆరోపణల విచారనంతరం గ్రేడ్ బీ కాంట్రాక్టును పునరుద్దరించింది. జహాన్ విన్నపాన్ని తోసిపుచ్చిన బీసీసీఐ షమీకి ఐపీఎల్లో ఆడే అవకాశం కూడా కల్పించింది. ప్రస్తుతం షమీ ఢిల్లీ డేర్ డేవిల్స్ జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆదివారం కింగ్స్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో సైతం పాల్గొన్నాడు. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓడిన విషయం తెలిసిందే. -
జహాన్.. ఐ మిస్ యూ: షమీ
మొహాలీ : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈ సారి ఏ ఆరోపణలో లేకుంటే కేసుల విషయంలో కాదు. భార్యపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ తన మంచి మనసును చాటుకున్నాడు.తన వివాహమై నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అతని భార్య హసీన్ జహాన్కు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఇన్స్టాగ్రమ్లో పోస్ట్ చేశాడు. అయితే ఆ సమయాన జహాన్ తన దగ్గర లేనందుకు బాధపడుతూ.. ఆవేదన చేందాడు. ‘నాలుగో పెళ్లి రోజు సందర్భంగా నా భార్యకు ఈ కేకు.. మిస్ యూ జహన్’ అనే క్యాప్షన్తో కేకు ఫొటోను షేర్ చేశాడు. అయితే ఈ పోస్ట్పై షమీ అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నీ నాశనం కోరుకున్న ఆమెను ఇంకా ఎలా కోరకుంటావ్ భాయ్ అంటూ కొందరు షమీని ప్రశ్నిస్తున్నారు. ఇంత మంచి మనసున్న వ్యక్తిని బాధపెట్టాలని ఎలా అనిపించింది వదినా అని జహాన్ ఉద్దేశించి కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక షమీ ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని, తనని మానసికంగా వేధించాడని, ఫిక్సింగ్కు పాల్పడ్డాడని అతనిపై జహాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గృహ హింస కింద కోల్కతా పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగని జహాన్ షమీని ఐపీఎల్లో ఆడనివ్వద్దని బీసీసీఐ అధికారులకు కూడా విజ్ఞప్తి చేశారు. 4th Marriage anniversary cake for my bebo miss you 🎂💋💋 A post shared by Mohammad Shami (@mdshami.11) on Apr 7, 2018 at 6:43am PDT -
బీసీసీఐ జోక్యం చేసుకోదు
ముంబై: క్రికెటర్ల వ్యక్తిగత, వైవాహిక విషయాల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జోక్యం చేసుకోదని తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా స్పష్టం చేశారు. తనను కలిసిన పేసర్ మొహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్కు ఇదే విషయాన్ని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. షమీ తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని ఇటీవల హసీన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పలు కేసులు మోపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బోర్డు నుంచి కూడా ఒత్తిడి తేవాలని భావించిన ఆమె ఖన్నాను వ్యక్తిగతంగా కలిసింది. కానీ ఆయన మాత్రం వ్యక్తిగత వ్యవహారాల్లో బోర్డు ఎంతమాత్రం కలుగజేసుకోదని, కుటుంబ పరిధిలోనే సమస్యను పరిష్కరించుకోవాలని ఆమెకు సూచించినట్లు తెలిపారు. త్వరలో జరిగే ఐపీఎల్, అనంతరం జరిగే ఇంగ్లండ్ సిరీస్లో షమీ రాణించాలని ఆశిస్తున్నట్లు ఖన్నా తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో షమీకి గాయాలు
డెహ్రాడూన్: భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు. శనివారం రాత్రి డెహ్రాడూన్ నుంచి న్యూఢిల్లీకి కారులో తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో అతని తలకు గాయాలయ్యాయి. దీంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ‘తలకు దెబ్బ తగలడంతో కుట్లు పడ్డాయి. గాయం చిన్నదే. కంగారు పడాల్సిన పనిలేదు. ఓ రోజు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది’ అని వైద్యులు తెలిపారు. భార్య హసీన్ జహాన్ ఆరోపణల నేపథ్యంలో గత రెండు వారాలుగా వార్తల్లో నిలిచిన షమీ ప్రస్తుతం ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. వచ్చే నెల 7 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్–11లో షమీ ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున బరిలో దిగనున్నాడు. -
షమీ దుబాయ్కి వెళ్లాడు: బీసీసీఐ
కోల్కతా: పేసర్ మొహమ్మద్ షమీ ఫిబ్రవరి 17, 18 తేదీల్లో దుబాయ్లోని ఓ హోటల్లో ఉన్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం స్పష్టం చేసింది. కోల్కతా పోలీసులు అడిగిన వివరాల మేరకు బీసీసీఐ ఈ విషయాన్ని నిర్ధారించింది. షమీ భార్య హసీన్ జహాన్ ఆరోపణల నేపథ్యంలో ఈ అంశంపై దృష్టి సారించిన కోల్కతా పోలీసులు గత నెలలో షమీ ఎక్కడెక్కడికి వెళ్లాడనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో షమీ గత నెల షెడ్యూల్ వివరాలను కోరారు. మరోవైపు ఈ మొత్తం అంశంలో మూడో వ్యక్తి హస్తం ఉందని షమీ ఆరోపించాడు. ‘ఇది హసీన్ పని కాదు. డబ్బు కోసం ఆడుతున్న నాటకం అయి ఉండొచ్చు’ అని అన్నాడు. -
‘వివాహితుడితో ఏ మహిళైనా హోటల్కు వెళ్తుందా’
కోల్కతా: భారత క్రికెటర్ మహమ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ సోమవారం అలిపోర్ కోర్టు మేజిస్ట్రేట్కు వాంగ్మూలం ఇచ్చారు. తన భర్త షమీపై వివాహేతర సంబంధాల కేసులో హసిన్ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు సంబంధించిన వాంగ్మూలాన్ని ఆమె కోర్టులో ఇచ్చారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె నేరుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసానికి వెళ్లారు. కాళీఘాట్లోని సీఎం నివాసానికి వెళ్లి.. మమతను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అభ్యర్థనను అధికారులకు అందజేశారు. భర్తకు వ్యతిరేకంగా తాను జరుపుతున్న పోరాటానికి సీఎం మమత మద్దతుగా నిలువాలని ఆమె కోరారు. తన భర్తకు చాలా వివాహేతర సంబంధాలు ఉన్నాయని, తనను చంపాడానికి కూడా షమీ ప్రయత్నించాడని ఆమె మీడియాతో అన్నారు. పాకిస్థానీ యువతి అలీషబాతో తన షమీకి వివాహేతర సంబంధం ఉందని, ఆమె తన వైవాహిక జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తోందని అన్నారు. ‘అలీషబా షమీ స్నేహితురాలు కాదు. అభిమానీ కాదు. ఏ మహిళ అయినా వివాహమైన వ్యక్తితో హోటల్లో గడుపుతుందా? అతని గదికి వెళ్లి.. అతని పడకగదిని పంచుకుంటుందా? నా వైవాహిక జీవితాన్ని నాశనం చేయాలనే కుట్రతోనే ఆమె హోటల్కు వచ్చింది’ అని హసిన్ మీడియాతో తెలిపింది. మరోవైపు పాక్ యువతి అలీషబా మాట్లాడుతూ.. షమీ ఒక క్రికెటర్గా తనకు తెలుసునని, ఒక అభిమానిగా ఆయనను కలిసేందుకు మాత్రమే హోటల్కు వెళ్లానని వివరణ ఇచ్చారు. -
ఏసీయూ నివేదిక తర్వాతే!
న్యూఢిల్లీ: పీకల్లోతు కేసుల్లో ఇరుక్కున్న పేసర్ మొహమ్మద్ షమీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి సెంట్రల్ కాంట్రాక్టు రావాలన్నా, ఈ సీజన్లో ఐపీఎల్ ఆడాలన్నా అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) నుంచి క్లీన్చిట్ కావాల్సిందేనని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. బీసీసీఐ నియమావళిలోని క్రికెటర్ల ఎథిక్స్ కోడ్ ప్రకారం కేవలం అవినీతి, అనుచిత ఆర్థిక వ్యవహారాల్లో మాత్రమే బోర్డు జోక్యం చేసుకుంటుంది. వ్యక్తిగత, వైవాహిక అంశాలు బోర్డు పరిధిలోకి రావని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఏసీయూ చీఫ్ నీరజ్ కుమార్... షమీ భార్య హసీన్ జహాన్ పేర్కొన్న ఆర్థిక లావాదేవీపైనే విచారణ జరుపుతామని ఆయన చెప్పారు. తన భర్త పాకిస్తానీ ప్రియురాలికి, మొహమ్మద్ భాయ్కి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయని హసీన్ ఆరోపించింది. బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ ఈ అంశంపై విచారణ జరిపి వారంలోగా నివేదిక ఇవ్వాలని ఏసీయూ హెడ్ నీరజ్ కుమార్ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏసీయూ షమీకి క్లీన్చిట్ ఇస్తే సెంట్రల్ కాంట్రాక్టుతో పాటు ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్కు ఆడే అవకాశమిస్తామని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా చెప్పారు. -
కోర్టు బయట పరిష్కరించుకుంటాం: షమీ
న్యూఢిల్లీ: తన భార్యతో తలెత్తిన వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ తెలిపాడు. తన భర్త మోసగాడని, పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని షమీ భార్య హసీన్ జహాన్ కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గృహహింస, హత్యాయత్నం కింద షమీపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ‘ఈ సమస్యపై చర్చించి పరిష్కరించుకోవడం మినహా చేసేదేమీ లేదు. కోర్టు వెలుపల పరిష్కారం కనుగొనడమే నాకు, నా పాపకు, నా కెరీర్కు ప్రయోజనకరం. కోల్కతాకు వెళ్లి నా భార్యతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా’ అని మీడియాతో షమీ అన్నాడు. మరోవైపు అతని భార్య కూడా వివాద పరిష్కారానికే మొగ్గుచూపుతోంది. ‘నేను అతని అనుచిత స్క్రీన్ షాట్స్, వాట్సాప్ మెసేజ్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాకే షమీ నిజ స్వరూపమేంటో బయటపడింది. అయితే ఇప్పటికీ అతను నిజాయతీగా తన తప్పులను సరిదిద్దుకుంటానంటే మా అనుబంధాన్ని కొనసాగించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. సయోధ్యపై ఆలోచిస్తాను’ అని హసీన్ తెలిపింది. ‘అతని ఫోన్ నాకు దొరకడం, అందులో అభ్యంతరకర ఫొటోలు, చాటింగ్లు ఉండటం వల్లే షమీ మిన్నకుండిపోయాడు. లేదంటే ఇప్పటికే విడాకులిస్తానని కోర్టుకెక్కేవాడు’ అని ఆమె చెప్పింది. మరోవైపు ఇప్పటికే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును కోల్పోయిన షమీకి ఐపీఎల్–11 సీజన్ కూడా చేజారే ప్రమాదముంది. అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు షమీని ఆడించాలా వద్దా? అనే అంశంపై బోర్డు అనుమతి కోరింది. బీసీసీఐ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు ఢిల్లీ ఫ్రాంచైజీ సీఈఓ హేమంత్ దువా వెల్లడించారు. -
ఆ మొబైల్లోనే అన్ని ఆధారాలు: షమీ భార్య
సాక్షి, కోల్కత్తా : భార్య హసీన్ జహాన్ చేస్తున్న సంచలన ఆరోపణలతో టీమిండియా పేసర్ షమీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగిన షమీ తేరుకునే అవకాశం లేకుండా రోజుకో విషయాన్ని బయటపెడుతున్నారు హసీన్. తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ, అతను మ్యాచ్ ఫిక్సర్ అంటూ ఆరోపణలు చేసిన హసీన్ తాజాగా మరో బాంబు పేల్చారు. షమీ వద్ద ఉన్న సెల్ఫోన్ గనుక తాను తీసుకుని ఉండకపోతే అతను ఉత్తరప్రదేశ్కు పారిపోయి తప్పించుకునే మార్గాల కోసం అన్వేషించేవాడని ఆరోపించారు. ఆ మొబైల్లోనే తన భర్త దోషి అని నిరూపించడానికి కావాల్సిన ఆధారాలున్నాయని, అందుకే షమీ నోరు విప్పటం లేదని తెలిపారు. తన నివాసంలో వుమన్ గ్రీవెన్స్ సెల్తో సమావేశమైన హసీన్ తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. షమీ, అతని కుటుంబ సభ్యులు తనని మానసికంగా, శారీరకంగా హింసించారని, షమీకి ఎంతో మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలున్నాయని వాంగ్మూలంలో ఆరోపించారు. ‘తన తప్పును ఒప్పుకొని ఇకనైనా మారాలని ఎన్నోసార్లు చెప్పి చూశాను. కానీ అతను మారలేదు. ఇప్పుడు కూడా తనకు సంబంధించిన మొబైల్ నా దగ్గర ఉందన్న ఒకే ఒక కారణం చేత విడాకులిచ్చే సాహసం చేయలేకపోయాడు’ అని విలేకరులతో తెలిపారు. తనపై వస్తున్నవన్నీ కేవలం ఆరోపణలేనని వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆధారాలతో సహా బయటపెట్టినప్పటికీ మీడియా కూడా అతన్ని ఏమీచేయలేక పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాని, అతను తప్పులు అంగీకరించినట్లయితే మరో అవకాశం ఇస్తానని తెలిపారు. మరోవైపు షమీ ఎఎన్ఐతో మాట్లాడుతూ తనపై కుట్ర జరుగతోందని, తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించాలనుకోవడంలేదని, విచారణకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. విచారణను వేగవంతం చేయాలని కోరారు. దీనిపై జహాన్ స్పందిస్తూ.. నిజానిజాలేమిటో విచారణలో నిగ్గు తేలతాయని పేర్కొన్నారు. తాను చేసిన ఆరోపణలతో పాటు ఫిర్యాదుకు కట్టుబడి ఉన్నట్లు ఆమె మరోసారి స్పష్టం చేశారు. -
ఆ ఆరోపణలపై విచారణ చేపట్టండి: షమీ
-
ఆ ఆరోపణలపై విచారణ చేపట్టండి: షమీ
సాక్షి, స్పోర్ట్స్ : తన భార్య చేసిన ఆరోపణలపై వెంటనే విచారణ చేపట్టాలని టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ డిమాండ్ చేశాడు. ఆదివారం ఏఎన్ఐతో మాట్లాడుతూ..‘రోజు రోజుకి నాపై ఆరోపణలు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి వీటిపై మాట్లాడదలుచుకోలేదు. ఆ ఆరోపణలపై వెంటనే విచారణ చెపట్టాలని మాత్రమే కోరుతున్నాను. బీసీసీఐపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ కేసు విచారణ అనంతరం వారే నిర్ణయం తీసుకుంటారనే విషయంలో నాకు ఎలాంటి టెన్షన్ లేదు.’ అని షమీ తెలిపాడు. ఇక భార్య హసిన్ జహాన్ ఆరోపణలతో బీసీసీఐ వార్షిక వేతనాల కాంట్రాక్టుల్లో షమీ స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. షమీ వివాహేతర సంబంధాలను హసిన్ జహాన్ సోషల్ మీడియాలో బయటపెట్టడం దగ్గరి నుంచి మొదలైన ఈ వ్యవహారం రోజు రోజుకో ఓ మలుపు తిరుగుతోంది. చివరకు శుక్రవారం ఆమె కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రసవత్తరంగా మారింది. గృహ హింస చట్టం ,అత్యాచార యత్నం, వేధింపులు, వివాహేతర సంబంధాలకు సంబంధించిన పలు సెక్షన్ల కింద ఈ క్రికెటర్పై కేసులు నమోదయ్యాయి. అయితే హసిన్ రోజుకో కొత్త ఆరోపణతో మీడియా ముందుకు వస్తున్నారు. తన సోదరుడితో శృంగారంలో పాల్గొనాలని షమీ తనపై ఒత్తిడి తెచ్చేవాడని ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదైన అనంతరం మీడియాకు దూరంగా ఉన్న షమీ తాజాగా ఎఎన్ఐతో మాట్లాడారు. -
సోదరుడితో షమీ రేప్ చేయించబోయాడు
సాక్షి, ముంబై : టీమిండియా పేసర్ షమీ వ్యవహారం పూట పూటకు కొత్త మలుపు తిరుగుతోంది. భార్య హసిన్ జహాన్ షమీపై సంచలన ఆరోపణలకు దిగారు. తన సోదరుడితో శృంగారంలో పాల్గొనాలని షమీ తనపై ఒత్తిడి తెచ్చేవాడని హసిన్ చెబుతున్నారు. ‘ఓరోజు హసీబ్(షమీ సోదరుడు) ఉన్న గదిలోకి షమీ నన్ను తోసేసి గదికి బయట గడి వేశాడు. లోపల హసిబ్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అత్యాచారం చెయ్యబోయాడు. నేను గట్టిగా కేకలు వేయటంతో షమీ కంగారుపడి తలుపులు తెరిచాడు’ అని జహాన్ మీడియాకు తెలిపారు. షమీ కుటుంబ సభ్యులంతా తనపై దాడులకు పాల్పడే వారని ఆమె అంటున్నారు. అంతేకాదు షమీతో జరిపిన ఫోన్ సంభాషణలను కూడా ఆమె మీడియాకు వినిపించారు. అందులో పలువురు మహిళలతో తనకు సంబంధం ఉన్నట్లు అతని నోటి నుంచే చెప్పటం ఉంది. షమీ వివాహేతర సంబంధాలు బయటపెట్టడం దగ్గరి నుంచి మొదలైన ఈ వ్యవహారం శుక్రవారం ఆమె కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రసవత్తరంగా మారింది. గృహ హింస చట్టం ప్రకారం షమీపై కేసు నమోదు అయ్యింది. అత్యాచార యత్నం.. వేధింపులు... వివాహేతర సంబంధాలు తదితర ఆరోపణలు అతనిపై ఉన్నాయి. అయితే హసిన్ ఆరోపణలు చేస్తోందంటూ షమీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
క్రికెటర్ షమీ చుట్టూ కేసుల ఉచ్చు
-
నా భర్త మ్యాచ్ ఫిక్సర్!
కోల్కతా: తన భర్తకు పలువురు అమ్మాయిలతో అక్రమ సంబంధాలున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేసిన టీమిండియా పేసర్ మహ్మద్ షమి భార్య హసీన్ జహాన్..గురువారం మరో బాంబు పేల్చింది. తన భర్త ఒక మ్యాచ్ ఫిక్సర్ అని వెల్లడించారు. పలు మ్యాచ్ల్లో షమీ ఫిక్సింగ్ పాల్పడ్డాడని జహార్ ఆరోపించింది. 'షమి నాతోపాటు దేశాన్నీ మోసగించగలడు. దుబాయ్లో అలీ సబా అనే పాకిస్థాన్ అమ్మాయి నుంచి డబ్బు తీసుకున్నాడు. అందుకు నా వద్ద ఆధారాలున్నాయి. ఇంగ్లండ్కు చెందిన మహ్మద్ భాయ్ సూచన మేరకు అతడు ఆ సొమ్ము స్వీకరించాడు. మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే ఆ డబ్బు తీసుకున్నాడు. ఒకవేళ కాకపోతే ఆ డబ్బు ఎందుకు తీసుకున్నాడో షమి వెల్లడించాలి. మహ్మద్ భాయ్ ఎవరో షమీ చెప్పాలి. అతనితో షమీకి ఏమిటి సంబంధం. భాయ్ అనే వ్యక్తి ఏమి చేస్తాడో ప్రపంచానికి చెప్పు' అని జహాన్ డిమాండ్ చేసింది. గతనెల దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జట్టు సభ్యులంతా భారత్ వచ్చేయగా షమి దుబాయ్లో ఆగిన విషయాన్ని జహాన్ ఈ సందర్బంగా వెల్లడించారు. ఆ క్రమంలోనే ఎయిర్పోర్ట్లో పాక్కు చెందిన మహిళను కలుసుకున్నాడుని, ఫిబ్రవరి 18న ఆమెతో కలిసి అతడు ఓ హోటల్లో చెక్ ఇన్ అయినట్లు తెలిపింది. వీటిపై తాను నిలదీస్తే ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరింపులకు పాల్పడ్డాడని జహాన్ పేర్కొన్నారు. -
'ఓసారి షమీ సూసైడ్కు యత్నించాడు'
న్యూఢిల్లీ: ఒకానొక సందర్బంలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఆత్మహత్యకు యత్నించిన విషయాన్ని అతని భార్య హసీన్ జహాన్ తాజాగా వెలుగులోకి తెచ్చారు. అదొక షాకింగ్ ఘటనగా పేర్కొన్న జహాన్..ఒక అమ్మాయితో కుటుంబ సభ్యులు పెళ్లి వద్దన్నందుకే షమీ అలా చేశాడని ఆమె పేర్కొన్నారు. షమీకి పలువురు మహిళలతో సంబంధాలున్నాయని, తనపై గృహ హింసకు పాల్పడుతున్నాడని తెలిపిన ఆమె బుధవారం సాయంత్రం కోల్కతా పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షమీకి సంబంధించిన విషయాల్ని జహాన్ బయటపెట్టారు. 'మేమిద్దరం 2012లో తొలిసారి కలుసుకున్నాం. అంతకుముందు షమి సమీప బంధువుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమెతో ఐదు సంవత్సరాల ప్రేమాయణాన్ని షమీ సాగించాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. కానీ, ఆ అమ్మాయి కుటుంబసభ్యులు షమితో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన షమి ఆత్మహత్యకు యత్నించాడు' అని జహాన్ తెలిపారు. 'షమి కోసం నేను అన్ని చేశా. నా మోడలింగ్ కెరీర్, ఉద్యోగం వదులుకున్నా. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి నన్ను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు' అని జహాన్ పేర్కొన్నారు. -
భార్యతో పాటు బీసీసీఐ షాకిచ్చింది!
సాక్షి, న్యూఢిల్లీ: అసలే భార్య హసిన్ జహాన్ చేసిన తీవ్ర ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీకి బీసీసీఐ సైతం భారీ షాకిచ్చింది. ఓ వైపు భారత క్రికెటర్ల కాంట్రాక్టు ప్యాకేజీలు భారీగా పెంచుతూ బీసీసీఐ ప్రకటన చేయగా.. షమీని మాత్రం తప్పించింది. తాజా కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితాలో ఏ కేటగిరిలోనూ బౌలర్ షమీ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గాయాలబారిన పడుతున్నా నిలకడైన ప్రదర్శనతో కీలక సిరీస్లకు షమీ ఎంపికయ్యేవాడు. కానీ నేడు పునరుద్ధరించిన తాజా కాంట్రాక్టులో మాత్రం షమీకి మొండిచేయి లభించింది. వ్యక్తిగతంగానే కాదు, వృత్తిగతంగానూ షమీకి బుధవారం ఏమాత్రం కలిసిరాలేదు. తన భర్త షమీకి చాలామంది యువతులు, మహిళలతో వివాహాతేర సంబంధాలున్నాయంటూ ఆయన భార్య హసిన్ జహాన్ ఈ క్రికెటర్కు షాకిచ్చారు. అతడో శృంగార పురుషుడని వ్యాఖ్యానించిన జహాన్.. విడాకులు ఇవ్వాలంటూ తనను షమీ కుటుంబం వేధిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ వైవాహిక బంధాన్ని తెంచుకునే ప్రసక్తే లేదని, భర్తను కోర్టుకు లాగుతానని జాతీయ మీడియాకు తెలిపారు. భర్త సంబంధాలు కొనసాగిస్తున్న కొందరు యువుతులు, మహిళల వివరాలు, ఫోన్ నెంబర్లను ఆమె సోషల్ మీడియాలో సైతం పోస్టు చేయడం కలకలం రేపింది. కాగా, కెరీర్ పరంగా తనను దెబ్బతీసేందుకు కొందరు ఈ కుట్ర పన్నారని.. భార్య తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నాడు క్రికెటర్ షమీ. ‘షమీని ఏ దురుద్దేశంతోనూ కాంట్రాక్టు జాబితా నుంచి తప్పించలేదు. క్రికెటర్ల కాంట్రాక్టులు రూపొందించిన రోజే షమీ భార్య అతడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే షమీ భార్య ఆరోపణలకు, షమీ కాంట్రాక్ట్ నిర్ణయానికి ఎలాంటి సంబంధం లేదు. మా నిర్ణయం తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉండొచ్చునని కూడా చర్చించుకున్నామని’ బీసీసీఐ సభ్యుడొకరు వివరించారు. -
మరో బాంబు పేల్చిన షమీ భార్య
కోల్కతా: టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భార్య హసినా జహాన్ మరోసారి బాంబు పేల్చారు. తన భర్తతో వైవాహిక బంధాన్ని తెంచుకోబోనని, అతడిని కోర్టు మెట్లు ఎక్కిస్తానని అన్నారు. అతడిని మార్చేందుకు చాలా ప్రయత్నించానని ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు. తనను చిత్రహింసలకు గురిచేశాడని, భార్యగా ఏనాడు చూడలేదని వాపోయారు. అతడో శృంగార పురుషుడని ఘాటుగా వ్యాఖ్యానించారు. తన చివరిశ్వాస వరకు భర్తతో కలిసేవుంటానని, అతడికి విడాకులు ఇవ్వబోనని స్పష్టం చేశారు. తన భర్త చేసిన అకృత్యాలకు సంబంధించిన ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయని, వీటితో అతడిని కోర్టుకు లాగుతానని ప్రకటించారు. కాగా, చాలా మంది యువతులతో షమీకి వివాహేతర సంబంధాలున్నాయని అంతకుముందు జహాన్ ఆరోపించారు. తన భార్య చేసిన ఆరోపణలను షమీ తోసిపుచ్చాడు. -
పేసర్ షమీకి పితృ వియోగం
కాన్పూర్: భారత క్రికెట్ జట్టు పేసర్ మొహమ్మద్ షమీకి పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి తౌసీఫ్ అలీ గురువారం గుండెపోటుతో మరణించారు. దీంతో ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటూ భారత టి20 జట్టుతో పాటే కాన్పూర్లో ఉన్న షమీ హుటాహుటిన స్వస్థలం అమ్రోహాకు వెళ్లాడు. ఈనెల 5నే షమీ తండ్రికి తొలిసారి గుండెపోటు రాగా అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
వైస్ కెప్టెన్ రహానేపై వేటు
ముంబై: ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ముంబై టెస్టుకు ముందురోజు టీమిండియాలో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. సిరీస్లో పేలవఫామ్ కొనసాగిస్తున్న వైస్ కెప్టెన్ అజింక్య రహానేపై వేటు పడింది. ముంబైలో రేపు(గురువారం) ప్రారంభం కానున్న నాలుగో టెస్టు, చెన్నైలో జరిగే ఐదో టెస్టుకూ రహానే దూరం కానున్నాడు. ఫామ్ లేమి కారణంగానే అతడిని రెండు టెస్టులకు పక్కన పెట్టాలని సెలక్షన్ కమిటీ భావించింది. అయితే రహానే కుడిచేతి చూపుడువేలుకు గాయమైనందున విశ్రాంతి ఇస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. గాయం తీవ్రత తక్కువగా ఉన్నా రహానే ఫామ్ లేమి వల్లే నాలుగో టెస్టుకు దూరమయ్యాడు.రహానే స్థానంలో మనీశ్ పాండే చోటు దక్కించుకున్నాడు. బౌలింగ్ విభాగంలో ఒక మార్పు చేయనున్నట్లు ప్రకటనలో బీసీసీఐ వెల్లడించింది. ప్రధాన పేసర్ మహమ్మద్ షమీ ముంబై టెస్టుకు దూరం కానున్నాడు. మోకాలి సమస్య వల్ల షమీ ఇబ్బంది పడుతున్నట్లు టీమిండియా ఫిజియో తెలిపాడు. షమీ స్థానంలో కొత్త పేసర్ శార్దూల్ ఠాకూర్ జట్టులోకి రానున్నాడు. మనీశ్ పాండే ఈ రంజీ సీజన్లో రెండు మ్యాచులలో కలిపి 188 పరుగులు చేయగా, మరోవైపు పేసర్ శార్దూల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 45 మ్యాచ్లు ఆడి 155 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే జట్టులో మనీశ్ స్థానం పర్మినెంట్ చేయాలనే ఉద్దేశంతోనే టెస్టుల్లో అతడికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ గాయాలతో ఇప్పటికే టెస్ట్ సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. -
'విరాట్ కోహ్లి ఫార్ములా సరైనదే'
సెయింట్ లూసియా:ఇటీవల కాలంలో ఐదుగురు స్పెషలిస్టు బౌలర్ల ఫార్ములాను అనుసరిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి పేసర్ మొహ్మద్ షమీకి మద్దతు పలికాడు. గత టెస్టు మ్యాచ్లో స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగినా వెస్టిండీస్పై విజయం సాధించలేకపోవడంపై పలు విమర్శలు తలెత్తని నేపథ్యంలో షమీ స్పందించాడు. విరాట్ కోహ్లి అవలంభించే స్పెషలిస్టు బౌలర్ల థియరీలో ఎటువంటి తప్పిదం లేదన్నాడు. ఇలా చేయడం వల్ల బౌలర్ల ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నాడు. దాంతో జట్టు బౌలింగ్ విభాగం కూడా మరింత బలపడుతుందన్నాడు. 'ఐదుగురు స్పెషలిస్టులో విరాట్ ఫార్ములా సరైనదే. ఒక ఫాస్ట్ బౌలర్ ఎక్కువ సమయం బౌలింగ్ చేసే సమయంలో విశ్రాంతి కూడా అవసరం. ఆ క్రమంలో స్పెషలిస్టు బౌలర్ల థియరీ ఉపయెగపడుతుంది. ఈ విధానంలో బౌలర్లపై అదనపు భారం కూడా తగ్గే అవకాశం ఉంది' అని షమీ తెలిపాడు. చాలా కాలం అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న తాను తిరిగి గాడిలో పడటం నిజంగా సంతోషకరమన్నాడు. అయితే పూర్తి ఫిట్నెస్తో జట్టులోకి వచ్చిన తరువాత మళ్లీ గాయాల బారిన పడుకూడదని అనుకుంటున్నట్లు షమీ పేర్కొన్నాడు. మంగళవారం నుంచి ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో గ్రాస్ ఐస్లెట్లోని డారెన్ స్యామీ స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్ చేస్తుంది. -
పింక్ బాల్కే నా ఓటు..
కోల్కతా: భారత్లోని పరిస్థితులపై పింక్ బాల్ మనుగడ ఎలా ఉండబోతుందో అనే సందేహాలపై ఫాస్ట్ బౌలర్ మొహ్మద్ షమీ సానుకూల స్పందన తెలియజేశాడు. అనుకూన్న దాని కంటే పింక్ బాల్తో బౌలింగ్ చేయడం చాలా అనుకూలంగా ఉందన్నాడు. ఈడెన్ గార్డెన్ స్టేడియంలో మోహన్ బగాన్, భవానీపూర్ క్లబ్ల మధ్య సూపర్ లీగ్ ఫైనల్ ను డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ గా నిర్వహిస్తున్నారు. ఇందులో మోహన్ బగాన్ జట్టు తరుపున ప్రాతినిథ్యం వహించిన షమీ ఐదు వికెట్లతో రాణించాడు. దీనిపై తన స్పందన తెలియజేసిన షమీ.. ఉపఖండ పరిస్థితులకు పింక్ బంతి అనుకూలంగానే ఉంటుందన్నాడు. పింక్ బంతితో బాగా స్వింగ్ రాబట్టినట్లు పేర్కొన్నాడు. ఆ బంతి నుంచి అంత స్వింగ్ ముందుగా ఊహించలేదన్నాడు. 'డే అండ్ నైట్ మ్యాచ్ల్లో తెలుపు బంతైనా, పింక్ బంతైనా కొంత వరకూ దృష్టి సమస్య ఉంటుంది. అయితే పింక్ బాల్కే నా ఓటు. పింక్ బంతి చాలా మెరుగ్గా ఉంది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో కూడా స్వింగ్ కావడం అనుకూలాంశం. ఒక బౌలర్ ఇంతకన్నా ఏమీ కోరుకోడు. అటు బ్యాట్స్మెన్, ఇటు బౌలర్ల చాలెంజ్లో పింక్ బంతి ప్రధాన పాత్ర పోషిస్తుంది. రివర్స్ స్వింగ్ కూడా అవుతుంది. నేను రివర్స్ స్వింగ్ చేశా'అని షమీ తెలిపాడు. -
'పింక్ బాల్' టెస్టులో షమీ!
కోల్కతా: భారత్ లో నిర్వహించే తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ లో భాగంగా రేపటినుంచి ఈడెన్గార్డెన్స్లో భవానీపూర్ క్లబ్, మోహన్ బగాన్ జట్ల మధ్య జరుగనున్న సూపర్ లీగ్ టోర్నీ ఫైనల్లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ పాల్గొంటున్నాడు. అతనితో పాటు వృద్ధిమాన్ సాహా కూడా పింక్ బాల్ టెస్టుకు సిద్ధమయ్యాడు. శనివారం నుంచి నాలుగురోజుల పాటు జరుగనున్న ఈ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ పై షమీ ఉత్సుకత చూపిస్తున్నాడు. 'కేవలం బంతి రంగు మాత్రమే మారిన టెస్టు మ్యాచ్ కచ్చితంగా సరికొత్త సవాల్. పింక్ బంతుల టెస్టు మ్యాచ్ కు మనం తొందరగా అలవాటు పడాలి. ఎంతో భవిష్యత్తు ఉందని నిపుణుల చెబుతున్న పింక్ బాల్తో ఆడటం కోసం ఆతృతగా ఉన్నా'అని షమీ తెలిపాడు. ఫ్లడ్ లైట్ల కాంతిలో బ్యాట్మెన్కు బౌలర్ కు మధ్య జరిగే పోరాటంలో బంతి ఎంతవరకూ స్వింగ్ అవుతుందో లేదో చూడాలని ఉందన్నాడు. ఈ మ్యాచ్ 2.30నుంచి రాత్రి 9 వరకు స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. -
షమీ సత్తా చూపిస్తాడా?
► వార్మప్లో ఆకట్టుకున్న పేసర్ ► బౌన్సర్లు, యార్కర్లతో దూకుడు ► పూర్తి ఫిట్గా ఉంటే తుది జట్టులోకి సాక్షి క్రీడావిభాగం మొహమ్మద్ షమీ భారత జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడి దాదాపు సంవత్సరం అయింది. ముందుగా మోకాలి గాయంతో జట్టుకు దూరమైన అతను మెరుగైన తర్వాత రెండేసి దేశవాళీ వన్డే, టి20 మ్యాచ్లు ఆడి ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. దాంతో ఆసీస్ పర్యటనకు వెళ్లాడు. అక్కడ మైదానంలోకి దిగనే లేదు, కండరాల గాయంతో మళ్లీ అవుట్. పూర్తి ఫిట్గా లేకపోయినా టి20 ప్రపంచకప్లోగా కోలుకుంటాడనే నమ్మకంతో సెలక్టర్లు అతడిని జట్టులోకి ఎంపిక చేశారు. కెప్టెన్ ధోని గట్టిగా మద్దతు పలకడం కూడా అందుకు కారణం. ఒక రకమైన జూదంగా అందరూ అభివర్ణించినా ధోని, షమీని కోరుకున్నాడు. కొత్త బంతితో ఆరంభంలో వికెట్, చివరి ఓవర్లలో బ్యాట్స్మెన్ను కట్టడి చేయడంలో అతని నైపుణ్యంపై కెప్టెన్కు అపార నమ్మకం ఉంది. బౌన్సర్లు, యార్కర్లతో కెప్టెన్ తనపై నమ్మకం ఉం చిన ప్రతీసారి షమీ దానిని నిలబెట్టుకున్నాడు. తుది జట్టులో మార్పు లేకుండా వరుస విజయాలతో టీ మిండియా దూసుకుపోతున్నా... షమీ ఫిట్గా ఉంటే నెహ్రాను పక్కన పెడతామని ధోని బహిరంగంగానే వ్యాఖ్యానించడం విశేషం. మరి టి20 వరల్డ్ కప్లో అతను ఏ మాత్రం ప్రభావం చూపించగలడు, తొలి మ్యాచ్కు 100 శాతం పూర్తి ఫిట్గా ఉండగలడా! కొనసాగిన ప్రాక్టీస్... ఫిట్నెస్ను పరీక్షించుకునే క్రమంలో ఇటీవల షమీ తీవ్రంగా సాధన చేశాడు. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో భారత మహిళల క్రికెట్ జట్టుకు అతను బౌలింగ్ చేశాడు. ఇతర పురుష జట్లు ఆడిన మ్యాచ్లలో కూడా అతను పాల్గొన్నాడు. అందులో ప్రధానంగా ఆరంభ ఓవర్లలో బౌలింగ్ చేయడం, డెత్ ఓవర్లలో పరుగులు నిరోధించడం లేదా చిన్న లక్ష్యాన్ని కాపాడుకునే సమయంలో ప్రధాన పేసర్గా పాత్ర... ఇలాంటి పరిస్థితులు సృష్టించుకొని మరీ ఆయా మ్యాచ్లలో బౌలింగ్ చేశాడు. ఈ ప్రయత్నంలో మళ్లీ గాయాలకు లోను కాకుండా చాలా జాగ్రత్త పడాల్సి వచ్చింది. షమీ బౌలింగ్పై ఎవరికీ సందేహాలు లేవు. వరల్డ్ కప్ సమయానికి ఫిట్ కావడమే అతనికి కీలకంగా మారింది. ఆ ప్రయత్నంలో ఇప్పుడతడు దాదాపు పూర్తి ఫిట్గా మారాడు. ఆకట్టుకున్న బౌలింగ్... వెస్టిండీస్తో తొలి వార్మప్ మ్యాచ్లో షమీ మెరుగైన ప్రదర్శనే కనబర్చాడు. 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు అద్భుతం కాకపోవచ్చు కానీ ఏడాది కాలంగా ఫిట్నెస్ గాయాలతో బాధపడి పునరాగమనం చేసిన బౌలర్ నుంచి ఇది మంచి ప్రదర్శనే. ఈ మ్యాచ్లో ఆరంభంనుంచే అతను నిలకడగా బౌన్సర్లు, యార్కర్లు విసిరాడు. బౌలింగ్ చేస్తున్నంతసేపు అతను ఏ దశలోనూ ఇబ్బందికి లోను కాలేదు. చక్కటి రనప్తో పాటు ఆకట్టుకునే యాక్షన్తో మంచి లయ కనబర్చాడు. షమీ తమ జట్టు ప్రధాన బౌలర్ అని, సహజంగానే అతనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయని సహచరుడు రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ‘గాయాల నుంచి కోలుకొని, ఇంత కాలం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చి రాణించడం అంత సులువు కాదు. బౌలర్లకైతే మరీ కష్టం. కానీ షమీ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అతను అన్ని రకాల బంతులు వేశాడు. మళ్లీ భారత జట్టు తరఫున ఆడుతున్నానని పట్టుదల అతనిలో కనిపించింది. దీని కోసం అతను తీవ్రంగా శ్రమించిన తీరు అభినందనీయం’ అని రోహిత్ ప్రశంసించాడు. పటిష్ట ప్రత్యర్థి అయిన దక్షిణాఫ్రికాతో కూడా మొహమ్మద్ షమీ మెరుగైన ప్రదర్శన చేస్తే ఇక ప్రధాన టోర్నీలో అతను పునరాగమనం చేయడం ఖాయం. -
మహ్మద్ షమీ అవుట్!
న్యూఢిల్లీ: ఆసియాకప్కు ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగలింది. గత కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న భారత పేసర్ మహ్మద్ షమీకి నిర్వహించిన ఫిట్ నెస్ పరీక్షల్లో విఫలం చెందడంతో ఆసియాకప్ కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) శుక్రవారం ధృవీకరించింది. అతని స్థానంలో మరో పేసర్ భువనేశ్వర్ కుమార్ కు జట్టులో స్థానం కల్పిస్తూ భారత సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. మహ్మద్ షమీ ఎడమ కాలి గాయం ఇంకా పూర్తిగా నయం కాలేకపోవడంతో జట్టు నుంచి అతన్ని తొలగిస్తున్నట్లు బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసియా కప్, వరల్డ్ టీ 20లకు జట్టు ఎంపికలో భాగంగా ఫిబ్రవరి ఐదో తేదీ నాటికే షమీ ఫిట్ నెస్ నిరూపించుకోలేకపోయినా అతని జట్టులో స్థానం కల్పించారు. కాగా, అతనికి తాజాగా ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించినా విఫలం చెందడంతో ఆసియాకప్ కు దూరం కావాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా వరల్డ్ టీ 20 జట్టులో షమీ పాల్గొనడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పదేపదే గాయాల బారిన పడుతున్న షమీ.. ఆస్ట్రేలియా టూర్ నుంచి కూడా ఇలా అర్థాంతరంగా వైదొలిగిన సంగతి తెలిసిందే. -
షమీ ఫిట్... భువీ డౌట్!
పెర్త్: భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ మోకాలి గాయంనుంచి పూర్తిగా కోలుకున్నాడు. వెస్టిండీస్తో శుక్రవారం జరిగే మ్యాచ్కు అతను అందుబాటులో ఉంటాడని జట్టు మేనేజ్మెంట్ ప్రకటించింది. గాయం కారణంగా షమీ యూఏఈతో మ్యాచ్ ఆడని విషయం తెలిసిందే. మంగళవారం ఇక్కడి మర్డోక్ యూనివర్సిటీ మైదానంలో జరిగిన భారత ప్రాక్టీస్ సెషన్లో షమీ చురుగ్గా పాల్గొన్నాడు. బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా చేశాడు. అయితే మరో పేసర్ భువనేశ్వర్ కుమార్ ఫిట్నెస్పై మరోసారి సందేహం నెలకొంది. చీలమండకు పెద్దగా ప్లాస్టర్లు చుట్టుకొని అతను ప్రాక్టీస్లో కనిపించాడు. అయితే గాయం తగ్గలేదా, లేక ముందు జాగ్రత్తగా అలా చేశాడా అనేదానిపై స్పష్టత లేదు.