Necklace Road
-
సమ్మర్ జోష్..
వేసవి వచ్చిందంటే చాలు.. అందరి చూపూ నగరంలోని వినోద వేదికలు, గేమింగ్ జోన్స్ తదితర ఎంటర్టైన్మెంట్ సెంటర్ల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా విద్యార్థులకు వేసవి సెలవులు ఉండటంతో కుటుంబ సమేతంగా వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి ఏర్పాట్లను చేస్తుంటారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు వినోద వేదికలు, అడ్వెంచర్ గేమ్ సెంటర్లు వినూత్న రీతిలో ఫన్ యాక్టివిటీస్ రూపకల్పన చేయడంతో పాటు అందంగా ఆధునీకరిస్తున్నారు. గేమ్స్, వినోద–విజ్ఞాన కార్యక్రమాలు, సాహస క్రీడలు, ముఖ్యంగా వేసవిలో ఇష్టపడే వాటర్ గేమ్స్ తదితర వేదికలు సమ్మర్ హంగామాకు సంసిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా నగరంతో పాటు నగర శివార్లలోని ఈ కోవకు చెందిన వివిధ హాట్ స్పాట్స్ గురించి తెలసుకుందాం. నగరవాసులను అలరించడానికి ఎన్ని ఎంటర్టైన్మెంట్ వేదికలొచ్చినా.. ఆల్ టైం ఫేవరెట్ మాత్రం ట్యాంక్బండ్–నెక్లెస్ రోడ్. ఇక్కడి పరిసర ప్రాంతాల్లోని సందర్శనీయ ప్రాంతాలను తిలకించడానికి కుటుంబ సభ్యులతో పాటు యువత, చిన్నారులకు ప్రత్యేక గమ్యస్థానాలున్నాయి. అలా హుస్సేన్ సాగర్లో బోటింగ్తో పాటు చుట్టుపక్కల ఉన్న థ్రిల్ సిటీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, బిర్లామందిర్, ప్రసాద్ ఐమాక్స్లు ఆకర్షిస్తుంటాయి. నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ వేసవి ఎండలను చల్లబరచడానికి సిద్ధంగా ఉంటుంది. విద్యార్థులకు, యువతకు, పరిశోధకులకు విజ్ఞానాన్ని అందించే ప్రతిష్టాత్మక బిర్లా ప్లానిటోరియం వెరీ స్పెషల్. వీటితో పాటు ఈ మధ్య నిర్మించిన సెక్రటేరియట్, దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం, దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండా, అమరవీరుల స్థూపం, సైక్లింగ్ స్పాట్లు ప్రత్యేకం.ఆనందాన్ని పంచే.. మంచు.. సమ్మర్లో మండే ఎండలకు కాసింత చల్లని వాతావరణం ఉంటే చాలు అనుకుంటాం. అలాంటిది ఏకంగా మంచు ఎడారే నగరంలో పలకరిస్తే ఎలా ఉంటుంది. ఈ అనుభూతిని అందంచడానికి నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్నో సెంటర్లు ఎదురుచూస్తున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్రాటు చేసిన పెద్ద హాల్స్లో మంచు దిబ్బలు, ఐస్ స్కేటింగ్ వంటి వినూత్న కార్యక్రమాలతో అలరిస్తున్నాయి. ఇలాంటి సెంటర్లు నగరంలోని శరత్ సిటీమాల్, ట్యాంక్బండ్తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఉన్నాయి. వీనుల విందు.. విడిది కేంద్రాలు.. నగరంలో ప్రస్తుతం ప్రధాన ఎంటర్టైన్మెంట్ జోన్స్ అంటే రిసార్టులే.. విందు, విడిది, వినోదం, కాలక్షేపం, నైట్ స్టే, వాటర్ గేమ్స్ వంటి సేవలతో అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ రిసార్టుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో.. నగరానికి నలుదిక్కులా.. ఇటు శామీర్ పేట్ నుంచి అటు శంషాబాద్ వరకూ.. కొండాపూర్–గచ్చి»ౌలి నుంచి ఎల్బీనగర్ శివారు వరకూ వందల సంఖ్యలో రిసార్టులు ఉన్నాయి. ఈ తరంలో అత్యధికంగా ఔటింగ్ అంటే రిసార్టులేనని నగరవాసులు చెబుతున్నారు.సాహస క్రీడలు, వాటర్ గేమ్స్.. అనుభవాలతో పాటు అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ వేదికలైన అమ్యూజ్మెంట్ పార్కులు సైతం నగరంలో ఈ సారి వేసవికి సరికొత్త హంగులతో సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భాగంగా వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్లో ఇంటర్స్టెల్లార్ ఎక్స్పీరియన్స్తో పాటు వర్చువల్ త్రీడీ స్క్రీనింగ్ హాల్స్ అలరించనున్నాయి. ఈ మధ్యనే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అధునాతన సాంకేతికతతో పనిచేసే రైడ్లను ఆవిష్కరించింది. దీంతో పాటు థ్రిల్ సిటీ వంటి సెంటర్లు సైతం అడ్వెంచర్కు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయి.అరుదైన మొక్కలకు వేదికగా.. ప్రపంచంలోని అరుదైన మొక్కలు, ఇతర వింతలు, విశేషాలతో ఈ మధ్యనే నగరంలో ఆవిష్కృతమైన ఎక్స్పీరియం ఎకో పార్క్ ఈ వేసవికి విద్యార్థులకు మంచి సందర్శనీయ వేదికగా నిలువనుంది. వివిధ రకాల మొక్కలు, అరుదైన వృక్షాలు, పర్యావరణ సంరక్షణతో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది.గేమింగ్ జోన్స్..నగర మాల్స్.. ప్రస్తుత తరుణంలో నగరం ఎక్కడ చూసినా మాల్స్తో నిండిపోయింది. ఒకప్పుడు బంజారాహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన పెద్ద పెద్ద మాల్స్ ప్రస్తుతం అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. మాల్స్ అంటే షాపింగ్ మాత్రమే కాదు.. పిల్లలను పెద్దలను అలరించే ఎన్నో ఫన్ యాక్టివిటీస్, గేమింగ్ జోన్స్ ఇతర కాలక్షేప కేంద్రాలకు నిలయాలుగా మారాయి. ఈ వేసవికి నగరంలోని మాల్స్ సైతం హాట్ స్పాట్లుగా మారనున్నాయి. ఎంటర్టైన్మెంట్ కింగ్.. ట్రెక్కింగ్ వేసవి సెలవులను ఆస్వాదించడానికి ప్రకృతితోపాటు సాహసం తోడైతే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. దీనికి చక్కని వేదిక ్రెక్కింగ్. ఈ ట్రెక్కింగ్ ఎంజాయ్ చేయడానికి నగరవాసులు అనంతగిరి హిల్స్ వంటి ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. పలువురు ట్రెక్కింగ్ నిర్వాహకులు కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ ట్రాక్తో పాటు పలు సాహస క్రీడలతో మధుర జ్ఞాపకాలను అందిస్తున్నారు. -
సాగర తీరాన.. విరుల సరాగం
సాగరతీరాన ఎటూ చూసినా విభిన్న మొక్కల సోయగం.. దేశీ వెరైటీలు మొదలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన మొక్కలతో సందడిగా మారింది నెక్లెస్రోడ్ పీపుల్ ప్లాజా వేదికగా ఏర్పాటు చేసిన హార్టికల్చర్ షో. సాధారణ చామంతులు మొదలు ఇంపోర్టెడ్ ఆర్కిడ్స్, హోల్కోనియా వరకూ అన్నిరకాల మొక్కలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ అంటూ వినూత్న జీవనశైలికి హంగులద్దుతున్న నగరంలోని మొక్కల ప్రియులు ఈ హారీ్టకల్చర్ షోకు పరుగులు పెడుతున్నారు. ఇక్కడ 50 రూపాయలు మొదలు లక్షకు పైగా ధరల్లో మొక్కలు అందుబాటులో ఉన్నాయి. కాంక్రీట్ జంగిల్లా మారిపోతున్న నగర జీవనశైలిలో కాసింత సాంత్వన, విశ్రాంతి మొక్కలు ఎంతో అవసరం. అంతేకాకుండా పర్యావరణ సమతుల్యం, పరిరక్షణలో ఈ మొక్కలదే కీలక పాత్ర. వెరసి గత కొన్నేళ్లుగా నగర వాసులు గార్డెనింగ్, మిద్దెపంట, ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ అంటూ విభిన్న రకాలుగా మొక్కల పెంపకం పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రతి ఏటా నగరం వేదికగా నిర్వహించే హారీ్టకల్చర్ ప్రదర్శనకు ప్లాంట్ లవర్స్ తాకిడి క్రమంగా పెరుగతోంది. సాధారణ మొక్కలు మొదలు అరుదైన మొక్కలు, బోస్సాయ్ మొక్కలు, ఔషధ మొక్కలు, ఆర్నమెంటల్ తదితర మొక్కలు అమ్మకానికి వచ్చాయి. ఇందులో భోన్సాయ్, ఫైకస్ మొక్క లక్ష రూపాయలకు పైగా అమ్మకానికి రావడం విశేషం. అంతేకాదు థాయ్లాండ్ నుంచి దిగుమతి చేసిన కమేలియన్ మొక్క కూడా అక్షరాల లక్ష రూపాయలు పలకడం విశేషం. అరుదైన మొక్కలు.. ‘అరుదైన మొక్క స్టాగన్ ప్లింగ్ రకం ఈ సారి తీసుకొచ్చాం. ఇవి వాటి సైజుల ఆధారంగా 4 వందల నుంచి 8 వేల వరకూ అందుబాటులో ఉన్నాయి. డ్రిఫ్ట్ వుడ్తో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ఇంటీరియర్ మొక్కలకు పూసిన పూలు 6 నెలల వరకూ వాడిపోవు. ఇవన్నీ ఆర్కిడ్ జాతికి చెందినవి. పూణే నుంచి తీసుకొచి్చన ఈ వెరైటీ ఖరీదు 35 వేలు అని స్టాల్స్ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రత్యేకంగా గ్రూమింగ్ చేస్తాం.. మా దగ్గర సీజనల్ చామంతి ప్రత్యేకం. వీటిని కాకినాడలోని గణపతి గార్డెన్స్లో ప్రత్యేకంగా గ్రూమింగ్ చేస్తాం. దాదాపు 6 నెలలు కష్టపడితే వందల పూలతో ఒక బంతిలా తయారవుతాయి. ఇందులో 25 రకాల రంగులు అందుబాటులో ఉన్నాయి. 3 వందల నుంచి 3 వేల వరకూ అందుబాటులో ఉన్నాయి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూలతో అలరిస్తాయి. రెండు మొక్కలు తీసుకుంటే 500 వందల ఆఫర్తో అందిస్తున్నాం. – గణపతి గార్డెన్స్ నిర్వాహకులుగత మూడున్నరేళ్లుగా.. దేశవ్యాప్తంగా సేకరించిన విభిన్న మొక్కలు ఈ నర్సరీ మేళాలో అందుబాటులో ఉంచాను. ముఖ్యంగా కలకత్తా నుంచి తీసుకువచి్చన కమేలియాస్ ఈ సారి ప్రత్యేకం. అజేలియాస్ హైడ్రేంజియాస్, డేలియాస్ వంటి విభిన్న మొక్కలకు మంచి ఆదరణ పెరిగింది. డేలియాస్ పూల మొక్కల్లో అతిపెద్ద సైజు వెరైటీ మొక్కలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇవి ఏప్రిల్ వరకూ పూలతో అలరిస్తాయి. నాటు కమేలియాస్ మా ప్రత్యేకం.. పెద్దవి రూ.2900 చిన్నవి రూ.1200 వరకూ అమ్ముతున్నాను. నగరంలోని కౌకూర్ వేదికగా గత మూడన్నరేళ్లుగా మొక్కలతో పాటు కాంప్రహెన్సివ్ స్టోర్గా మార్బుల్, సిరామిక్, హుడ్, ప్లాస్టిక్ తొట్లతో సేవలందిస్తున్నాం. – పాల్ చంద్రకాంత్, స్టాల్– బీ24, 2530 రకాల ఆర్కిడ్స్.. ఇందులో 30 రకాల వరకూ అందుబాటులో ఉన్నాయి. కటేలియా, ఫాక్స్టైల్, బ్యాండ్రియం, క్రీపర్స్, ఎయిర్ ప్లాంట్స్ తదితర వెరైటీలు బాగా అమ్ముడుపోతున్నాయి. వీటిని థాయ్లాండ్ నుంచి దిగుమతి చేసుకుని, వెస్ట్ గోదావరి తణుకు వేదికగా 7 ఎకరాల నర్సరీలో పెంచుతున్నాం. 7 వందల నుంచి 2500 వరకూ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. – సంతో‹Ù. 450కు పైగా వెరైటీలు.. తెలంగాణలో అడీనియం బోన్సాయ్ మొక్కల్లో అన్ని వెరైటీలనూ అందిస్తున్నది ‘హైదరాబాద్ అడీనియం’ మాత్రమే. 450కు పైగా వెరైటీలు అందుబాటులో ఉంటాయి. బేబీ ప్లాంట్ నుంచి 30 ఏళ్ల అడీనియం మొక్కలు 250 నుంచి 50 వేల వరకూ అందుబాటులో ఉంటాయి. కేరళ నుంచి వాటర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం. ముఖ్యంగా వాటర్ లిల్లీ, తామర పూలు మా ప్రత్యేకం. అంతేకాకుండా అలోకేíÙయా, హెల్కోనియా, కొలకేషియా తదితర రకాలు ఉన్నాయి. తామరలోనే ఎనిమిది రకాలకు పైగా ఉన్నాయి. మా వద్ద 6 వందల నుంచి 7 వేల వరకూ ధరలు ఉన్నాయి.జనప నారతో బ్యాగ్స్.. ఆంక్రో పెగ్రో సైన్సెస్ అనేది మా సంస్థ. మా వద్ద హెర్బల్, ఈకో ఫ్రెండ్లీ, ఆర్గానిక్ గ్రో బ్యాగ్లు అందుబాటులో ఉన్నాయి. ఎండాకాలంలో ఇవి మొక్కలకు అధిక రక్షణ ఇస్తాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఈ బ్యాగులు చూసుకుంటాయి. ఈ బ్యాగుల్లో రెండు రోజులకు ఒకసారి నీరు పోసినా సరిపోతుంది. వీటిని జనప నారతో తయారు చేస్తాం. – ప్రదీప్ -
ఆహ్లాదం.. ఆనందం..
ఖైరతాబాద్ : వీకెండ్ వస్తే చాలు నగరవాసులు నెక్లెస్ రోడ్డుకు క్యూ కడతారు. సాయం సంధ్య వేళ కుటుంబ సమేతంగా అక్కడికి విచ్చేసిన వారంతా ఆహ్లాదంగా గడుపుతారు. దీంతోపాటు అక్కడే ఉన్న పీపుల్స్ ప్లాజాలో అన్ని సీజన్లలో వివిధ రకాల ఎగ్జిబిషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ వేదికే మధ్యతరగతి ప్రజలకు ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్గా మారింది పీపుల్స్ ప్లాజా. ఇటీవల ఇక్కడ ఏర్పాటుచేసిన వింటర్ ఉత్సవ్ మేళా అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకుంటోంది. కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసిన వారు రెండు గంటల పాటు ఉత్సాహంగా గడపుతారు. ఎంటర్టైన్మెంట్ కేంద్రంగా.. ఈ ఎగ్జిబిషన్లో ఎమ్యూజ్మెంట్ రైడ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గేమింగ్ జోన్, అన్ని రకాల ఉత్పత్తులనూ ఒకే వేదికగా వివిధ రకాల స్టాల్స్ అందుబాటులో ఉండటాయి. దీంతో వారాంతాల్లో ఇక్కడికి విచ్చేసేవారు షాపింగ్ మొదలుకుని ఎంటర్టైన్మెంట్ వంటి వివిధ రకాల అంశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం.. అబ్బురపరిచే సెల్ఫీ జోన్లలో ఫొటోలు దిగుతూ కాలక్షేపం చేస్తుంటారు. దీంతో వీకెండ్ అయితే చాలు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు భారీగా ఇక్కడికి క్యూ కడుతున్నారు. నూతన సంవత్సర వేడుకలను సైతం నగర వాసులు నెక్లెస్ రోడ్డు పొడవునా తిరుగుతూ ఎంజాయి చేస్తూ జరుపుకోవడం విశేషం. -
ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు..తమన్ మ్యూజిక్ షో అదుర్స్ (ఫొటోలు)
-
రారండోయ్ వేడుక చూద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మూడు రోజులు పాటు ట్యాంక్బండ్ ఎన్టీఆర్ మార్గ్లో నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ముగింపు వేడుకల సందర్భంగా సచివాలయంలో సాయంత్రం 5 గంటలకు కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్ఎండీఏ గ్రౌండ్లో లక్ష మంది స్వయం సహాయక సంఘాల మహిళలతో భారీ బహిరంగ సభ జరగనుంది. సాయంత్రం 7.30 గంటలకు ఎనీ్టఆర్ మార్గ్లో డ్రోన్ ప్రదర్శన, హుస్సేన్ సాగర్లో పెద్దఎత్తున బాణసంచా ప్రదర్శన, అనంతరం హెచ్ఎండీఏ మైదానంలో తమన్ నేతృత్వంలో సంగీత కచేరీ, సాంస్కృతిక ప్రదర్శన ఉంటుంది. ట్యాంక్బండ్, ఎనీ్టఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో ఫుడ్స్టాళ్లతో పాటు హస్తకళల, సాంస్కతిక, పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. బహు పసందుగా ఫుడ్ స్టాళ్లు ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లలోని పలు పసందైన వంటకాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. నగరంలో ప్రసిద్ధి చెందిన పలు బ్రాండెడ్ హోటల్స్ ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. హైదరాబాదీ బిర్యానీ, మొఘలాయి, తెలంగాణ, ఆంధ్ర వంటకాలతో పాటు బేకరీ ఐటమ్స్ చాట్, ఐస్క్రీం.. ఇలా వందకు పైగా ఫుడ్స్టాళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు తెలంగాణ వంటకాలు పాలమూరు గ్రిల్, తెలంగాణ విందు, అంకాపూర్ నాటుకోడి చికెన్, పుడ్ జాయింట్స్ను అందుబాటులోకి తెచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా నగరమంతా విద్యుత్ దీపాలంకరణతో జిగేమంటోంది. డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయం, పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపాలతో తళుక్కుమంటున్నాయి. -
నేడు నెక్లెస్ రోడ్డులో ఎయిర్ షో !
సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు నెక్లెస్ రోడ్డు వద్ద వాయుసేనకు చెందిన 9 సూర్యకిరణ్ విమానాలతో ఎయిర్ షో నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర మంత్రులు, వీవీఐపీలు, వాయుసేన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వాయుసేన గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరథి నేతృత్వంలో ఈ ప్రదర్శన జరగనుంది. అద్భుత వైమానిక విన్యాసాలు చేసే ప్రపంచంలోనే అత్యుత్తమ ఐదు బృందాల్లో ఒకటైన సూర్యకిరణ్ టీం హైదరాబాద్లో ప్రదర్శన నిర్వహిస్తుండటంతో ప్రజలు భారీగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు.ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం సచివాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు. ఎయిర్ షో అనంతరం రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహిస్తున్నందున.. నెక్లెస్ రోడ్డు, పీవీ మార్గ్లో ప్రజల కోసం ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు సచివాలయంలో నిర్వహించే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి లక్ష మంది మహిళలు హాజరవుతారని సీఎస్ చెప్పారు.అందుకోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సమీక్షలో టెలికాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, సీడీఎంఏ శ్రీదేవి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేవారి కోసం నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, గోశాల రోడ్, నిజాం కాలేజ్, పబ్లిక్ గార్డెన్స్ వద్ద పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశామని హైదరాబాద్ పోలీస్ అదనపు కమిషనర్ విక్రంజీత్ సింగ్ మాన్ తెలిపారు. కాగా, వాయుసేన గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరథి బృందం శనివారం సచివాలయంలో సీఎస్ను మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపికను బహూకరించింది. -
నెక్లెస్ రోడ్డు : బతుకమ్మ ఘాట్లో భక్తిశ్రద్ధలతో ఛట్ పూజలు (ఫొటోలు)
-
Tank Bund: చల్ మోహన రంగ
సిడ్నీ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తలపించే ట్యాంక్ బండ్..అద్భుత అందాలతో పాటు చారిత్రాత్మక వైభవాలకు ప్రతీకనగరానికి మణిహారం సాగర తీరం..చెప్పుకుంటూ పోతే మరెన్నో.. రింజిమ్..రింజిమ్..హైదరాబాద్.. రిక్షావాలా జిందాబాద్.. మూడు చక్రమలు గిరగిర తిరిగితే మోటరు కారు బలాదూర్.. అటు చూస్తే చారి్మనారు.. ఇటు చూస్తే జుమ్మా మసీదు అటు చూస్తే చారి్మనారు.. ఇటు చూస్తే జుమ్మా మసీదు ఆ వంకా అసెంబ్లీ హాలు.. ఈ వంకా జూబిలి హాలూ తళతళ మెరిసే హుస్సేనుసాగరు.. దాటితే సికింద్రబాదూ...ఇలా చెప్పుకుంటూ పోతే.. పర్యాటక ప్రాంతాలకు కొదవేలేదు.. ఎటుచూసినా ఏదో ఒక విశేషమైన ప్రాంతం చూపరులను అబ్బురపరుసూనే ఉంటాయి... వాటిల్లో ముఖ్య ఆకర్షణగా నిలిచేది.. ట్యాంక్ బండ్.. నగరాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికీ ట్యాంక్ బండ్తో అవినాభావ సంబంధం ఉంటుంది. ట్యాంక్ బండ్ ప్రారంభంలోనే ‘నగర రెజిమెంట్కు చెందిన ఆర్మీ జవాన్ల పోరాట స్ఫూర్తికి నిదర్శనం’గా ఏర్పాటు చేసిన యుద్ధనౌక స్వాగతం పలుకగా, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పార్క్ అందాలు, మహనీయుల విగ్రహాల పలకరింపుతో సాగర్లోని నీటి ఫౌంటేన్ల తుంపరల మధ్య శాంతిమయుడు గౌతమ బుద్ధుడిని తిలకిస్తూ అక్కడి అందాలను ఆస్వాదించడం భలే అనుభూతిని కలిగిస్తుంది. దీంతో పాటు మరికొన్ని ప్రాంతాల గురించి లుసుకుందాం... సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర చరిత్రకు తలమానికమైన చారి్మనార్, గోల్కొండ కోట వంటి ప్రాంతాలే కాకుండా..దేశానికే తలమానికంగా నిరి్మతమైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పార్లమెంట్ను పోలిన నిర్మాణం పైన భారీ ఎత్తులో నిరి్మతమైన ఈ విగ్రహం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడి నుంచి తిలకించినా సగర్వంగా కనిపిస్తుంది. బుద్ధుడిని స్పూర్తిగా తీసుకుని దేశం గరి్వంచదగ్గ వ్యక్తిగా ఎదిగిన అంబేద్కర్., హుస్సేన్ సాగర్లోని బుద్ధుని వెనుకనే నిరి్మంచడంతో సింబాలిక్గా నిలుస్తుంది. నగర వైభవాన్ని ప్రతిబింబించే నిర్మాణాలైన చారి్మనార్, అసెంబ్లీ భవనాల సరసన నిలిచేలా నూతనంగా నిర్మితమైన బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, కేబుల్ బ్రిడ్జి వంటివి చూపు తిప్పుకోనివ్వవు అంటే అతిశయోక్తి కాదేమో..! ఎన్.టి.ఆర్ గార్డెన్... అరుదైన బొన్సాయ్ మొక్కలు, ఆరి్టఫీషి యల్ మర్రిచెట్టులోంచి రైలు ప్రయాణం, భయపెట్టించే హంటర్ హౌస్, అబ్బురపరిచే పూల వనాలు, వింటేజ్ కార్లలో స్నాక్స్, అత్యంత ఎత్తులో నెక్లెస్ రోడ్ అందాలను చూపించే జేయింట్ వీల్, అండర్ గ్రౌండ్లో ఆటలు, ఆకట్టుకునే బొమ్మలు, ఆశ్చర్యపరిచే ఎడారి మొక్కలు, కళ్లముందు మ్యాజిక్ చేసే త్రీడి షో.. వెరసి అందరినీ అలరించే ఎన్.టీ.ఆర్ గార్డెన్. ఇక్కడే దివంగత ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ హీరో ఎన్.టీ.రామారావు సమాధిని సందర్శింవచ్చు.ప్రసాద్ ఐమాక్స్.. సినిమా, షాపింగ్, గేమింగ్, ఈటింగ్ ఇలా అన్ని రకాల నగర జీవన శైలికి అద్దం పట్టే వేదిక ఐమాక్స్. ఇందులో సినిమా చూస్తే అదో క్రేజ్లా మారేంతలా గుర్తింపు పొందింది. కొత్త సినిమాల విడుదలతో ప్రతీ శుక్రవారం ఇక్కడ సెలబ్రిటీలు, మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూలతో సందడిగా ఉంటుంది. జల్ విహార్... కేవలం నీళ్లలో ఆడే ఆటలతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ అలరిస్తుంది నెక్లెస్ రోడ్లోని జలవిహార్. రేయిన్ డ్యాన్స్, వాటర్ఫూల్స్లో ఎత్తునుంచి జారవిడిచే ఆటలతో పాటు ఇతర వాటర్ గేమ్స్ ప్రేక్షకులను బయటకు రానివ్వవు.థ్రిల్ సిటీ... ఈ మధ్యనే ప్రారంభమైన థ్రిల్ సిటీ ప్రమాదకరమైన ఆటలతో భయానకమైన వాతావరణంతో థ్రిల్లింగ్ అనుభూతిని పంచుతుంది. రోమాలను నిక్కబొడుచుకునేలా చేసే థ్రిల్లింగ్ గేమ్స్ విశేషంగా ఆకట్టుకుంటాయి.పీవీ జ్ఞాన భూమి... ఇంతకు ముందు ఎరుగని ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపించిన ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు సమాధి ఈ జ్ఞాన భూమిలో కొలువుదీరింది. దేశానికి పనిచేసిన ఏ ప్రధాన మంత్రి సమాధిని చూడాలన్నా ఢిల్లీ వెళ్లాల్సిందే. కానీ దక్షిణాది ప్రధానిగా చక్రంతిప్పిన పీవీ సమాధి మాత్రం నెక్లెస్ రోడ్లో చూడవచ్చు.సంజీవయ్య పార్క్... అనేక రంగులతో అలరించే రోస్ గార్డెన్, రంగురంగుల సీతాకోకచిలుకలను కలుసుకునే బటర్ఫ్లవర్ పార్క్, ఎత్తులో దేశంలో రెండో అతిపెద్ద జాతీయ జెండాలను ప్రత్యక్షంగా చూడాలంటే సంజీవయ్య పార్క్ వెళ్లాల్సిందే. ఎత్తులో రెండో స్థానం అయినప్పటికీ త్రివర్ణ పతాకం సైజులో మాత్రం దేశంలోనే అతిపెద్దది.ఈట్ స్ట్రీట్–ఆర్ట్ స్ట్రీట్.. ఆహార ప్రియులకు అనువైన చోటు నెక్లెస్ రోడ్లోని ఈట్ స్ట్రీట్., సాగర్ నీటి అలల అంచున కూర్చోని వివిధ డిష్లను ఆస్వాదించవచ్చు. దీని ఎదురుగానే ఉన్న వీధుల్లోని ఇళ్లను మొత్తం విభిన్న చిత్రాలతో కళాకారులు తయారు చేశారు. డాగ్ పార్క్.. ప్రతీ ఆదివారం ఉదయం నగరంలోని అన్ని రకాల కుక్కలతో వారి యజమానులు ఈ డాగ్ పార్క్కు వస్తారు. జంతు ప్రేమికులను ఇది విశేషంగా అలరిస్తుంది. సైక్లింగ్ క్లబ్.. థ్రిల్ సిటీకి ఎదురుగా ఉన్న సైక్లింగ్ క్లబ్ ఫిట్నెస్కు మంచి మార్గం. ఇందులో మొంబర్íÙప్ తీసుకుని ఎవరైనా సైక్లింగ్ చేయవచ్చు.అమరవీరుల స్మారక కేంద్రం... తెలంగాణ అమరవీరుల త్యాగాలకు శాశ్వత శ్రద్ధాంజలిగా దీపం రూపంలో నిరి్మంచిన స్మారక కేంద్రం కొత్త శోభను తీసుకొచి్చంది. ఇందులో ప్రత్యేకంగా ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేయడం అదనపు ఆకర్షణ.టూరిస్టు సర్కిల్గా ట్యాంక్బండ్ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని గుర్తుచేసేలా సాగర్ మధ్యలో ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహం నగరానికే తలమానికం. చూట్టూ ఆవరించి ఉన్న నీటి మధ్యలో ఈ బుద్ధ విగ్రహాన్ని చూడటం అద్భుతమైన అనుభూతి. ఇక్కడి బోటింగ్ సదుపాయాలు అదనపు ఆనందం.బిర్లా ప్లానిటోరియం.. విజా్ఞనం, వినూత్నం, వివేకానికి బిర్లా ప్లానిటోరియం మంచి వేదిక. విద్యార్థుల నుంచి పరిశోధకుల వరకూ అవసరమైన శాస్త్ర–సాంకేతిక, పురాతత్వ విషయాలను తెలుసుకొవచ్చు. ఇక్కడే అంతరిక్షానికి చెందిన ప్రత్యేక స్కై షో కూడా చూడవచ్చు. లుంబినీ పార్క్, బోటింగ్.. ఆటవిడుపుకు, కాలక్షేపానికి అడ్డాగా మాత్రమే కాకుండా హుస్సేన్సాగర్ అందాలను తనివితీరా చూపించే బోటింగ్ సదుపాయం లుంబినీ పార్క్ సొంతం. సాధారణ బోటింగ్, సినిమాల్లో చూపించే వేగంగా ప్రయాణించే స్పీడ్ బోట్లతో పాటు వ్యక్తిగత పారీ్టలు సైతం నిర్వహించుకునేలా లగ్జరీ బోట్లు అందుబాటులో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. -
నెక్లెస్ రోడ్లో 10వ ఇంటర్నేషనల్ యోగా డే ఉత్సవాల కర్టెన్ రైజర్ (ఫొటోలు)
-
నెక్లెస్రోడ్డులో లైట్ అండ్ సౌండ్ లేజర్షో ప్రారంభం (ఫొటోలు)
-
హైదరాబాద్ : పీపుల్స్ ప్లాజా వద్ద వింటేజ్ కార్ల ర్యాలీ (ఫొటోలు)
-
ఫార్ములా–ఈ రేసింగ్ రద్దు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో ఫార్ములా– ఈ కార్ రేసింగ్ పోటీలను (రేస్ రౌండ్ –4) రద్దు చేసినట్లు ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ ఈఓ) ప్రకటించింది. వచ్చే ఫిబ్రవరి 10వ తేదీన నెక్లెస్రోడ్డు స్ట్రీట్ సర్క్యూట్లో నిర్వహించవల సిన ఈ అంతర్జాతీయ పోటీలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్న ట్లు పేర్కొంది. ఫార్ములా–ఈ పోటీలపై గతేడాది అక్టోబర్ 30వ తేదీన ఏర్పాటు చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించింది. ఈ మేరకు తెలంగాణ పురపాలన, పట్టణా భివృద్ధి (ఎంఏయూడీ) విభాగానికి నోటీసులు ఇవ్వను న్నట్లు ఎఫ్ఈఓ తెలిపింది. తెలంగాణ సర్కా ర్ వైఖరి తమను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని ఎఫ్ఈఓ కో–ఫౌండర్, చీఫ్ చాంపియన్షిప్ ఆఫీసర్ ఆల్బర్ట్ లొంగో అన్నారు. తదుపరి పోటీలను హాంకాంగ్లో నిర్వహించను న్నట్లు తెలిపారు. ఫార్ములా–ఈ పోటీల వల్ల ఎలాంటి ప్రయోజ నం లేదని భావించడం వల్లే ప్రభుత్వం విముఖతతో ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పోటీల నిర్వహణపై ప్రభుత్వ ఉన్నతాధికారు లతో చర్చించేందుకు నిర్వాహ కులు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి సానుకూలత వ్యక్తం కాలేదని ఈ నేపథ్యంలో పోటీలను రద్దు చేసినట్లు సమాచారం. గత ఏడాది భారీ ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మోటార్ స్పోర్ట్స్ ప్రియులను విశేషంగా ఆకట్టుకొనే ఫార్ములా–ఈ పోటీలు గత సంవత్సరం ఫిబ్రవరి 10, 11 తేదీల్లో హైద రాబాద్ నెక్లెస్ రోడ్డులో జరిగాయి. ఈ పోటీల కోసం హెచ్ఎండీఏ సుమారు రూ.100 కోట్లకు పైగా వెచ్చించి స్ట్రీట్ సర్క్యూట్ నిర్మాణంతో పాటు అన్ని ఏర్పాట్లు చేసింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఈ పోటీలు జరగడంతో దేశవ్యాప్తంగా భారీఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు వేలా దిమంది మోటార్ స్పోర్ట్స్ ప్రియులు, రేసింగ్ డ్రైవర్లు హైదరాబాద్ను సందర్శించారు. ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులు ఫార్ములా–ఈ పోటీలతో పాటు అంతకంటే రెండు నెలల ముందు జరిగిన ఒక రోజు ఇండియన్ రేసింగ్ కార్ పోటీల సందర్భంగా నగ రంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నెక్లెస్రోడ్డు వైపు వచ్చే వాహనాలను నిలిపివేశారు. దీంతో ఆర్టీసీ క్రాస్రోడ్స్, హిమాయత్నగర్ మార్గాల్లో ఖైరతాబాద్ వైపు ట్రాఫిక్ స్తంభించింది. అమీర్పేట్ వైపు నుంచి లక్డీకాపూల్ వైపు వచ్చే వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఐదు రోజుల ముందు నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పోటీలపై సామాజిక మాధ్యమాల్లో పెద్దయెత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజలకు ట్రాఫిక్ నరకాన్ని చూపుతూ ఎవరి కోసం ఈ పోటీలు అంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది దుర్మార్గమైన తిరోగమన చర్య: కేటీఆర్ ఫార్ములా –ఈ రేస్కు ప్రభుత్వం వెనుకడుగు వేయడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్య క్షుడు కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గమైన, తిరోగ మన నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘హైదరాబాద్ ఇ– ప్రిక్స్ వంటివి ప్రపంచవ్యాప్తంగా మన నగరం, దేశం బ్రాండ్ ఇమేజ్ను పెంచుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో హైదరాబాద్ నగరాన్ని ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ప్రపంచానికి చాటేందుకు ఉపకరిస్తాయి. ఎలక్ట్రానిక్ వాహన రంగానికి చెందిన ఔత్సాహికులు, తయారీదారులు, స్టార్టప్లను ఆకర్షిస్తూ ఒక వారం పాటు ఈవీ సమ్మిట్ను నిర్వ హించేందుకు ఫార్ములా–ఈ రేస్ను ఒక సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం ఉపయోగించుకుంది..’ అని కేటీఆర్ పేర్కొన్నారు. సస్టైనబుల్ మొబిలిటీ సొల్యూషన్స్కు కేంద్రంగా రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి తాము తెలంగాణ మొబిలిటీ వ్యాలీని కూడా ప్రారంభించినట్లు తెలిపారు. -
టీటీఏ సేవాడేస్.. నెక్లెస్ రోడ్లో 5కే రన్!
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవా డేస్ కార్యక్రమాలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో నిర్వహించిన 5కె రన్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ 'రన్ ఫర్ హెల్త్ అంటూ' టీటీఏ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ముఖ్య అతిథి గా పాల్గొని, ప్రసంగించారు. 5కె రన్ కార్యక్రమాన్ని టీటీఏ టీమ్తో కలిసి ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ప్రారంబించారు. టీటీఏ సేవాభావం కలిగిన సంస్థ అని మాతృభూమికి సేవచేయాలనే ఆలోచన తో కదిలిన టీటీఏ సుదీర్ఘకాలం కొనసాగాలన్నారు సుధీర్ రెడ్డి. ఈ 5కె రన్ కార్యక్రమం గురించి సంస్థ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సేవా డేస్తో పాటు టీటీఏ సాధించిన విజయాలను సంస్థ అడ్వైసర్ మోహన్ రెడ్డి పటోళ్ల వివరించారు. ప్రతి రెండేళ్ల ఒకసారి చేసే టీటీఏ సేవా కార్యక్రమం.. ఇక నుంచి ప్రతి సంవత్సరం చేస్తామని సంస్థ ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మలిపెద్ది పేర్కొన్నారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల టీటీఏ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదీర్ రెడ్డితో పాటు పలువురిని శాలువాతో సన్మానించి మెమెంటోలు అందించారు. ఈ ఈవెంట్లో భాగంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందిరని ఆకట్టుకున్నాయి. జుంబా డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. కాలేజ్ స్టూడెంట్స్ నృత్య ప్రదర్శన, మణిపూర్ సంప్రదాయ కర్ర ప్రదర్శన అద్భుతంగా కొనసాగింది. ఆద్యంతం ఉత్సహబరితంగా సాగిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. (చదవండి: విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించాలి: జయంత్ చల్లా) -
ఒంటరిగా ఉన్న జంటలే టార్గెట్
సాక్షి, సిటీబ్యూరో: నెక్లెస్ రోడ్లో ఒంటరిగా ఉన్న జంటలను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న సూడో పోలీసును మధ్య మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 20 కేసులు నమోదైనట్లు డీసీపీ నితిక పంత్ బుధవారం వెల్లడించారు. జనగాంకు చెందిన మరాఠీ సృజన్ కుమార్ కొన్నేళ్ల క్రితం విశాఖలో ఎస్సైగా పని చేసిన శ్రావణిని వివాహం చేసుకున్నాడు. పైళ్లెన కొన్ని నెలలకే ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడానికి సూడో పోలీసు అవతారం ఎత్తాడు. తన భార్య పోలీసు యూనిఫాంలో ఉన్న ఫొటోను తన ఫోన్లో పెట్టుకుని తిరిగే సృజన్ తానూ డమ్మీ తుపాకీతో దిగిన వాటినీ ఇలా సేవ్ చేసుకున్నాడు. టార్గెట్ చేసిన వ్యక్తులకు వీటిని చూపిస్తూ తాను పోలీసునని బెదిరిస్తాడు. కేసు పేరు చెప్పి వారి నుంచి అందినకాడికి దండుకుంటాడు. ఇలాంటి నేరాలు చేసిన నేపథ్యంలో సృజన్పై గతంలో నగరంలో పాటు విశాఖపట్నం, వరంగల్ సహా వివిధ ప్రాంతాల్లో 18 కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఇతడు నెక్లెస్ రోడ్నే తన టార్గెట్గా మార్చుకున్నాడు. నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై తిరుగుతూ అక్కడ ఒంటరిగా, ఏకాంతంగా ఉన్న జంటలను ఎంచుకుంటాడు. ఫోన్లోని ఫొటోలు చూపించి తాను పోలీసు అని, తనతో ఠాణాకు రావాలని గద్దిస్తాడు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాల్సి ఉందని భయపెడతాడు. అలా కాకుండా ఉండాలంటే తాను కోరిన మొత్తం ఇవ్వాలని బెదిరిస్తాడు. ఇలా రెండు జంటలను బెదిరించి డబ్బు దండుకున్నాడు. ఓ జంట నుంచి రూ.20 వేలు ఫోన్ పే చేయించుకున్నాడు. మరో జంట నుంచి ఈ పంథాలో రూ.99 వేలు తీసుకున్న సృజన్.. మరుసటి రోజు రూ.4 లక్షలు వసూలు చేశాడు. వీరి ఫిర్యాదుతో సెక్రటేరియేట్ ఠాణాలో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో మధ్య మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ బి.రాజు నాయక్ నేతృత్వంలో ఎస్సైలు సీహెచ్.నవీన్కుమార్, ఎస్.సాయి కిరణ్ వలపన్ని బుధవారం నిందితుడిని పట్టుకున్నారు. విచారణ నేపథ్యంలో ఇతడిపై ఆసిఫ్నగర్లో రెండు ఎన్బీడబ్ల్యూలు పెండింగ్లో ఉన్నట్లు తేలింది. సృజన్ నుంచి రూ.1.38 లక్షల నగదు, వాహనం, ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం సెక్రటేరియేట్ పోలీసులకు అప్పగించారు. ఇతడు సూర్య, చరణ్, చెర్రీ పేర్లతోనూ చెలామణి అయినట్లు గుర్తించారు. -
సాగర తీరంలో.. కోచ్ రెస్టారెంట్
హైదరాబాద్: రెస్టారెంట్ ఆన్ వీల్స్లో భాగంగా దక్షిణమధ్య రైల్వే ఆధ్వర్యంలో నెక్లెస్రోడ్డు ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద అద్భుతమైన రైల్ కోచ్ రెస్టారెంట్ను ప్రారంభించారు. ఉత్తర, దక్షిణాది వంటకాలతో అన్ని వర్గాల పర్యాటకులను ఆకట్టుకొనేవిధంగా దీన్ని తీర్చిదిద్దారు. ఈ రెస్టారెంట్కి వెళితే కదులుతున్న ట్రైన్లో కూర్చొని నచ్చిన రుచులను ఆస్వాదిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో హుస్సేన్సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన ఈ కోచ్ రెస్టారెంట్ సందర్శకులకు సరికొత్త అనుభూతిని కలుగజేస్తుందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. టూరిస్ట్ హబ్గా నెక్లెస్రోడ్డు... ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్డు ప్రాంతాలు అంతర్జాతీయ పర్యాటక హంగులను సంతరించుకున్నాయి. ప్రతి రోజు వేలాది మంది సందర్శకులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు తరలివస్తున్నారు. వీకెండ్స్, సెలవు రోజుల్లో పర్యాటకుల రద్దీ లక్షల సంఖ్యలో ఉంటుంది. నెక్లెస్రోడ్డులో ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన కోచ్ రెస్టారెంట్ సైతం పర్యాటకప్రియులను ఆకట్టుకోనుంది. వినియోగంలో లేని ఒక కోచ్లో ఈ కొత్త రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ను ఐదు సంవత్సరాల కాలానికి నగరానికి చెందిన మెసర్స్ బూమరాంగ్ సంస్థకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఐదేళ్లపాటు వీరే నిర్వహిస్తారు. -
హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్బండ్ క్లోజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 22న సాయంత్రం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీస్ అడిషనల్ కమిషనర్ జి.సుధీర్బాబు తెలిపారు. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి నెక్లెస్ రోడ్డు రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ల మధ్య ట్రాఫిక్కు అనుమతి లేదు. పంజగుట్ట, సోమాజిగూడ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్డు రోటరీ వైపు వెళ్లేందుకు అనుమతించరు. ఈ వాహనాలను షాదాన్ కళాశాల నుంచి నిరంకారి వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలకు రోటరీ చౌరస్తా వైపునకు అనుమతి ఉండదు. బుద్ధ భవన్ నుంచి వచ్చే ట్రాఫిక్ నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్వైపు వెళ్లడానికి నల్లకుంట చౌరస్తా నుంచి మళ్లిస్తారు. లిబర్టీ, అంబేడ్కర్ విగ్రహం నుంచి వచ్చే ట్రాఫిక్ ఎన్టీఆర్ మార్గ్ వైపునకు వెళ్లడానికి అనుమతి లేదు. రాణీగంజ్, కవాడిగూడల నుంచి వచ్చే వాహనాలను ట్యాంక్బండ్ వైపు అనుమతించరు. బడా గణేష్ నుంచి ఐమాక్స్, నెక్లెస్ రోటరీ వైపు, మింట్ లేన్ వైపు వచ్చే ట్రాఫిక్ బడా గణేష్ వద్ద నుంచి రాజ్దూత్ లేన్ వైపు మళ్లింపు ఉంటుంది. తెలంగాణ అమరవీరుల స్మారక ప్రారంభోత్సవం దృష్ట్యా 22న ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్డు, లుంబినీపార్క్ మూసి ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి ఎగువ ట్యాంక్బండ్ వైపు వచ్చే ట్రాఫిక్కు అనుమతి లేదు. వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ డైవర్షన్లను గమనించి ప్రత్యామ్న్యాయ మార్గాల్లో వెళ్లాలని సుధీర్బాబు సూచించారు. చదవండి: కాంగ్రెస్లో జోష్.. పొంగులేటి ఇంటికి రేవంత్రెడ్డి -
నీరు తాగుతున్నమంత్రి శీనన్న
-
హుస్సేన్ సాగర్ : కమ్మని నీరా.. కేఫ్ లోపల ఎలా ఉందో చూసేయండి (ఫొటోలు)
-
హుస్సేన్ సాగర్ తీరాన స్టార్ హోటల్ను తలపించేలా నీరా కేఫ్ (ఫొటోలు)
-
నెక్లెస్రోడ్లో నేడు నీరా కేఫ్ ప్రారంభం
-
నెక్లెస్రోడ్లో నేడు నీరా కేఫ్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఎన్నో పోషక విలువలకు నెలవై.. పల్లె ప్రాంతాలకే అలవాలమై ‘నీరా’ జనాలు అందుకున్న అత్యుత్తమ పానీయం. తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృతి సిద్ధమైన నీరాను.. నగరవాసులకు చేరువ చేసేందుకు రంగం సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ తీరాన నెక్లెస్రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద సుమారు 20 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన నీరా కేఫ్ ఇవాళ(బుధవారం) ప్రారంభం కానుంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం నీరాకేఫ్ను ప్రారంభించనున్నారు. ఈ పానీయాన్ని ఆస్వాదించేందుకు తరలివచ్చే జనాల కోసం ప్రభుత్వం ఇక్కడ అన్ని వసతులు కల్పించింది. అదే సమయంలో.. ఇక్కడ ఏర్పాటు చేసిన పలు చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. 👉 నెక్లెస్ రోడ్డులో 2020 జులై 23న నీరాకేఫ్ను శంకుస్థాపన చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత నిర్మాణం పూర్తయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. నీరా కేఫ్లో మొత్తం 7 స్టాళ్లు ఉంటాయి. 500 మంది కూర్చునేందుకు వీలుంటుంది. రేట్లు ఎలా ఉంటాయన్నది ఇంకా తెలియాల్సి ఉంది. 👉 నగర శివారు నందన వనంలోని పదెకరాల్లో ఉన్న తాటి చెట్ల నుంచి నీరా సేకరిస్తారు. నీరా నాలుగు డిగ్రీల వద్ద సురక్షితంగా నిల్వ ఉంటుంది. తాటి, ఈత నీరా సేకరించాక దాన్ని సీసాల్లో పోసి.. ఐస్ బాక్సుల్లో నగరానికి తీసుకొస్తారు. నీరా కేఫ్లో శుద్ధి చేసి.. ప్యాకింగ్ చేసి.. విక్రయిస్తారు. 👉 నీరా కేఫ్ను.. పోష్ రెస్టారెంట్ తరహాలో తీర్చిదిద్దారు. తియ్యటి నీరాతో పాటు నోరూరించే అనేక ఆహార పదార్థాలు కూడా లభిస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఫుడ్ కోర్టు ఉంటుంది. మొదటి అంతస్తులో నీరాను అమ్ముతారు. నీరాను అక్కడే కూర్చుని తాగవచ్చు. లేదంటే టేక్ అవే సౌకర్యం కూడా ఉంది. 👉 పల్లెల్లో తాళ్లు, ఈదుల మధ్య కూర్చున్న అనుభూతి కలిగేలా... కేఫ్ చుట్టూ తాటి చెట్ల ఆకృతులు, పైకప్పును తాటాకు ఆకృతిలో రూపొందించారు. 👉 నీరా కేఫ్ నుంచి ట్యాంక్బండ్లోని బుద్ధ విగ్రహం వరకు బోటింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. కల్లుకు, నీరాకు ఎంతో తేడా ఉంది. కల్లులో ఆల్కాహాల్ శాతం ఉంటుంది. కానీ నీరాలో ఆల్కాహాల్ ఉండదు. నీరా రుచి తియ్యగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హుస్సేన్ సాగర్ తీరాన స్టార్ హోటల్ను తలపించేలా నీరా కేఫ్ (ఫొటోలు)
Neera Cafe : హుస్సేన్ సాగర్ తీరాన స్టార్ హోటల్ను తలపించేలా నీరా కేఫ్ (ఫొటోలు) -
Hyderabad: సంస్థల హెచ్చరికలు.. కానరాని ప్రేమ పక్షులు
సాక్షి, హైదరాబాద్: వలెంటైన్స్ డే.. ప్రేమ పక్షులకు ఇదో ప్రత్యేకమైన రోజు. ఎంతో ఆహ్లాదకరంగా జంటలు.. జంటలుగా వలెంటైన్స్ డేను జరుపుకొంటారు. పార్కులకు వెళ్లి ప్రేమ కబుర్లతో గడుపుతుంటారు. కానీ.. మంగళవారం నాటి వలెంటైన్స్ డే.. వెలవెలాబోయింది. పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే ఈ రోజున ప్రేమికులెవరూ బహిరంగంగా సంచరించవద్దని, పార్కుల్లో, ఇతర ప్రాంతాల్లో జంటలుగా కనిపించవద్దని.. ఒకవేళ కనిపిస్తే ‘పెళ్లి’ చేస్తామని కొన్ని సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో నగరంలోని పార్కుల్లో, లవ్ హైదరాబాద్ ఎదుట ప్రేమజంటల హడావుడి కనిపించలేదు. చదవండి: Makkah Masjid: ఎనిమిదేళ్లకు ‘గంట’ కొట్టింది! -
హైదరాబాద్ ‘ఫార్ములా’ అదిరింది
ఒకవైపు 320 కిలోమీటర్ల వేగంతో కార్లు దూసుకుపోతున్నాయి... మరోవైపు అంతే రేంజ్లో ఫ్యాన్స్ ఉత్సాహం, ఉత్కంఠ... ఒకవైపు వీఐపీ బాక్స్లో నుంచి సెలబ్రిటీలు రేస్ను ఆస్వాదిస్తుండగా... మరోవైపు గ్యాలరీల్లో ఉన్న సాధారణ అభిమానుల హోరుతో పరిసరాలు దద్దరిల్లుతున్నాయి... రెప్పపాటులో ట్రాక్పై జూమ్మంటూ జనరేషన్ ‘3’ కార్లు పరుగులు తీయగా... దాదాపు గంట పాటు హుస్సేన్ సాగర్ తీరం ప్రపంచ పటంపై కనువిందు చేసింది. న్యూయార్క్, బెర్లిన్, బీజింగ్, రోమ్, జ్యూరిక్... ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఫార్ములా ‘ఇ’ రేస్కు ఆతిథ్యం ఇస్తున్న నగరాల్లో కొన్ని. ఇప్పుడు హైదరాబాద్ కూడా వీటి సరసన చేరింది. కొత్తగా వచ్చిన క్రీడతో ‘స్ట్రీట్ సర్క్యూట్’ వద్ద అన్ని రకాలుగా కొత్త తరహా వాతావరణం కనిపించింది. ఫార్ములా ‘ఇ’ రేస్ విజయవంతమైందన్న సంకేతాన్ని చాటింది. ఈ హోరాహోరీ సమరంలో చివరకు డీఎస్ పెన్స్కే జట్టు డ్రైవర్ జీన్ ఎరిక్ వెర్నే విజేతగా నిలిచాడు. సాక్షి, హైదరాబాద్: భారత్లో తొలిసారి నిర్వహించిన ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ ఫార్ములా ‘ఇ’ బ్లాక్బస్టర్గా నిలిచింది. అటు ప్రేక్షకాదరణతో పాటు ఇటు నిర్వాహకుల వైపు నుంచి కూడా సూపర్ సక్సెస్గా ప్రశంసలందుకుంది. ఫార్ములా ‘ఇ’ 9వ సీజన్లో భాగంగా హైదరాబాద్లో శనివారం నాలుగో రేస్ ముగిసింది. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో రూపొందించిన ‘స్ట్రీట్ సర్క్యూట్’పై 22 మంది పోటీ పడిన ఈ రేస్లో డీఎస్ పెన్స్కే టీమ్కు చెందిన జీన్ ఎరిక్ వెర్నే విజేతగా నిలిచాడు. 33 ల్యాప్లతో 2.83 కిలోమీటర్లు ఉన్న ట్రాక్పై సాగిన ఈ రేస్ను వెర్నే అందరికంటే వేగంగా 46 నిమిషాల 01.099 సెకన్లలో పూర్తి చేశాడు. ఎన్విజన్ రేసింగ్ డ్రైవర్ నిక్ కాసిడీ రెండో స్థానంలో, పోర్‡్ష టీమ్ డ్రైవర్ ఫెలిక్స్ డి కోస్టా మూడో స్థానంలో నిలిచాడు. భారత్కు చెందిన మహీంద్రా టీమ్ డ్రైవర్ ఒలివర్ రోలండ్కు ఆరో స్థానం దక్కింది. 29 పాయింట్లతో పెన్స్కే ‘టీమ్ చాంపియన్’గా నిలిచింది. విజేతగా నిలిచిన జీన్ ఎరిక్కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు... రన్నరప్ నిక్ క్యాసిడీకి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్రోఫీలు అందజేశారు. ఈ సీజన్లో భాగంగా ఐదో రేస్ ఈనెల 25న దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో జరుగుతుంది. హైదరాబాద్ రేస్ విశేషాలు... ► వెర్నే రేస్ పూర్తి చేసే సమయానికి అతని కారులో 0.5 శాతం ఎనర్జీ మాత్రమే మిగిలి ఉంది. ► ఎన్విజన్ డ్రైవర్ సెబాస్టియన్ బ్యూమీ మూడో స్థానంలో నిలిచినా... ‘ఓవర్ పవర్’ ఉపయోగించినందుకు 17 సెకన్ల పెనాల్టీ విధించడంతో నాలుగో స్థానానికి పడిపోయాడు. ► మహీంద్రా టీమ్ డ్రైవర్లలో రోలండ్ ఆరో స్థానంలో, డి గ్రాసి 14వ స్థానంలో నిలిచారు. ► జాగ్వార్ టీమ్కు చెందిన ఇద్దరు డ్రైవర్లు మిచ్ ఇవాన్స్, స్యామ్ బర్డ్ ఒకరినొకరు ట్రాక్పై ‘ఢీ’ కొట్టుకున్నారు. దాంతో ఇద్దరూ రేస్ను పూర్తి చేయలేకపోయారు. ► మూడో స్థానంలో నిలిచిన మాజీ విజేత డి కోస్టాకు ఇది 100వ రేస్ కావడం విశేషం. ► పెన్స్కే టీమ్కే చెందిన డిఫెండింగ్ చాంపియన్ స్టాఫెల్ వండూర్న్ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ► 23వ ల్యాప్లో మెక్లారెన్ డ్రైవర్ జేక్ హ్యూజెస్ కారు స్టీరింగ్ జామ్ అయి ఆగిపోవడంతో సేఫ్టీ కారును తీసుకోవాల్సి వచ్చింది. చివరకు అతనూ రేస్ పూర్తి చేయలేకపోయాడు. ఓవరాల్గా ఈ రేసులో ఆరుగురు డ్రైవర్లు రేసును పూర్తి చేయలేకపోయారు. హైదరాబాద్ ‘ఇ’ రేసు ఫలితాలు (టాప్–10): 1. జీన్ ఎరిక్ వెర్నే (డీఎస్ పెన్స్కే; 46ని:01.099 సెకన్లు), 2. నిక్ క్యాసిడీ (ఎన్విజన్; 46ని:01.499 సెకన్లు), 3. ఫెలిక్స్ డి కోస్టా (పోర్‡్ష; 46ని: 02.958 సెకన్లు), 4. వెర్లీన్ (పోర్‡్ష; 46ని: 03.954 సెకన్లు), 5. సెటె కెమారా (నియో 333 రేసింగ్; 46ని: 04.622 సెకన్లు), 6. రోలండ్ (మహీంద్రా; 46ని: 08.237 సెకన్లు), 7. నార్మన్ నాటో (నిస్సాన్; 46ని: 08.417 సెకన్లు), 8. స్టాఫెల్ వాన్డూర్న్ (డీఎస్ పెన్స్కే; 46ని: 08.663 సెకన్లు), 9. లాటరర్ (అవలాంచె; 46ని: 9.802 సెకన్లు), 10. మొర్టారా (మసెరాటి; 46ని: 10.172 సెకన్లు). -
హైదరాబాద్లో ముగిసిన ఫార్ములా-ఈ రేసింగ్.. విజేత ఎవరంటే?
సాక్షి, హైదరాబాద్: నెక్లెస్ రోడ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ ప్రపంచ రేసింగ్ చాంపియన్షిప్ ముగిసింది. భారత్లో తొలిసారి హైదరాబాద్ వేదికగా జరుగుతున్న రేసింగ్లో ప్రపంచస్థాయి రేసర్లు అదరగొట్టారు. శనివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ప్రారంభమైన రేసు గంటన్నర పాటు కొనసాగింది. ఫార్ములా-ఈ రేస్ వరల్డ్ ఛాంపియన్షిప్ విజేతగా జీన్ ఎరిక్ వెర్గ్నే(డీఎస్ పెన్స్కే రేసింగ్) నిలిచాడు. ఆ తర్వాత రెండో స్థానంలో నిక్ క్యాసిడీ(ఎన్విజన్ రేసింగ్), మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమి(ఎన్విజన్ రేసింగ్) ఉన్నారు. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసర్లు దూసుకెళ్లారు. కాగా జీన్ ఎరిక్ ఇప్పటికే రెండుసార్లు ఫార్ములా-ఈ ఛాంపియన్ కావడం విశేషం. తాజా విజయంతో అతను మూడోసారి ఛాంపియన్గా అవతరించాడు. 2013లో ఫార్ములా-1 రేసు తర్వాత భారత్లో జరుగుతున్న ఫార్ములా-ఈ తొలి రేసుకు మన హైదరాబాద్ వేదికైంది. దీనికి తోడు ఓవరాల్గా ఇప్పటి వరకు ఫార్ములా-ఈ రేసుకు ఆతిథ్యమిచ్చిన 27వ నగరంగా హైదరాబాద్ చోటు దక్కించుకుంది. హుసేన్సాగర్ తీరప్రాంతంలో 2.8కిలోమీటర్ల నిడివితో ప్రత్యేకంగా నిర్మించిన సర్క్యూట్పై మొత్తం 11 జట్లు, 22 మంది రేసర్లు తమ కార్లను పరుగులు పెట్టించారు. తొలిసారి ప్రవేశపెట్టిన అత్యాధునిక జెన్3 కార్లతో రేసర్లు దుమ్ములేపారు. రేసింగ్లో విదేశీ కంపెనీలు, రేసర్లదే హవా కాగా, భారత్ నుంచి మహీంద్ర రేసింగ్, టీసీఎస్ జాగ్వార్ బరిలోకి దిగడం గర్వంగా అనిపించింది. -
ఫార్ములా ఈ రేసుకు హాజరైన మంత్రి కేటీఆర్.. అసౌకర్యంపై స్పందన
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హుస్సేన్ సాగర్ తీరం వద్ద ఫార్ములా- రేసింగ్ పోటీలు సందడిగా సాగాయి. రెండో రోజు ఫార్ములా-ఈ రేసింగ్కు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకైనా ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ వేదికగా జరగడం ఆనందకరమని అన్నారు. నెక్లెస్ రోడ్డులో ఫార్ములా ఈ కార్లు వేగంగా దూసుకుపోతుంటే చూడటానికి ఎంతో బాగుందని హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఉన్న యువత, క్రీడాభిమానులు ఈ రేస్ను చూసేందుకు తరలివస్తున్నారని చెప్పారు. ఈ ఈవెంట్స్లో కొంత అసౌకర్యం కలుగుతుందన్నమాట నిజమేనన్న కేటీఆర్.. కానీ అది మన్నించి సహకరిస్తున్నందుకు నగరవాసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇంటువంటి కార్యక్రమాలతో హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని, ఈ కార్యక్రమం సవ్యంగా, సాఫీగా జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. కాగా దేశంలో తొలిసారిగా హైదరాబాద్లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫార్ములా ఈ-రేసింగ్ పోటీలను వీక్షించేందుకు సినీ, క్రీడా రంగాలకు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలిరావడంతో అభిమానుల్లో జోష్ కనిపిస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్తోపాటు శిఖర్ ధావన్, దీపక్ చాహర్, సినీనటుడు నాగచైతన్య, అఖిల్ అక్కినేని. మహేశ్ బాబు సతీమణి నమ్రత, కుమారుడు గౌతమ్, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, నారా బ్రాహ్మణి హుస్సేన్ సాగర్ తీరానికి విచ్చేశారు. చదవండి: హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసింగ్.. సెలబ్రిటీల సందడి -
Formula E : హుస్సేన్ ‘సాగర తీరం’లో రేసింగ్.. సినీ, క్రికెట్ ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసింగ్.. సెలబ్రిటీల సందడి
సాక్షి, హైదరాబాద్: నగరం వేదికగా జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక ఫార్ములా- ఈ రేస్ ఛాంపియన్షిప్లో శనివారం పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. సినీ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు హాజరయ్యారు. ఫార్ములా వన్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన ఫార్ములా-ఈ కావడంతో భాగ్యనగరం పూర్తి సందడిగా మారింది. హీరో రామ్చరణ్తో పాటు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సహా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్, స్పిన్నర్ యజ్వేంద్ర చహల్, దీపక్ చహర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కూడా రేసును వీక్షించడానికి వచ్చాడు. ప్రధాన రేసుకు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ రేసులను తిలకించిన క్రికెటర్లు సంతోషం వ్యక్తం చేశారు. నెక్లెస్ రోడ్డులో రయ్యుమని దూసుకెళ్తున్న రేసింగ్ కార్లను చూస్తుంటే ముచ్చటేస్తుందని క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రేసు ప్రారంభమైంది. మొత్తం 2.8 కిమీ స్ట్రీట్ సర్క్యూట్లో 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 రేసర్లు పోటీల్లో పాల్గొంటున్నారు. ఫార్ములా-ఈలో ప్రస్తుతం 9వ సీజన్ నడుస్తోంది. ఇందులో ఇప్పటికే మూడు రేస్లు పూర్తయ్యాయి. మెక్సికో సిటీ మొదటి రేస్కు ఆతిథ్యం ఇవ్వగా, సౌదీ అరేబియాలోని దిరియాలో తర్వాతి రెండు రేస్లు జరిగాయి. హైదరాబాద్లో జరగబోతోంది ఈ సీజన్లో నాలుగో రేస్. ప్రస్తుతం మూడు రేస్ల తర్వాత మొత్తం 76 పాయింట్లతో ఆండ్రెటీ టీమ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పోర్‡్ష (74) రెండో స్థానంలో ఉంది. Master Blaster #SachinTendulkar at #HyderabadEPrix venue pic.twitter.com/EpqSOt1xML — Sarita Avula (@SaritaTNews) February 11, 2023 He was there for the inaugural Formula 1 race 12 years ago. He is here for the first Formula E race in India @sachin_rt pic.twitter.com/ygDYTNpwuT — Bharat Sharma (@sharmabharat45) February 11, 2023 -
Formula E: నెక్లెస్రోడ్డుపై స్ట్రీట్ సర్య్కూట్.. ఫార్ములా- ఇ రేస్ వివరాలు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఫార్ములా–ఇ రేసింగ్కు భాగ్యనగరం సిద్ధమైంది. రెండు రోజుల ఈ ఈవెంట్లో భాగంగా శుక్రవారం సాయంత్రం తొలి ఫ్రీ ప్రాక్టీస్ జరుగుతుంది. పోటీల్లో పాల్గొంటున్న 11 జట్ల రేసర్లు ట్రాక్తో పాటు తమ కార్లను, వాటి పనితీరును పరీక్షించుకొని పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేందుకు ఈ ప్రాక్టీస్ను వాడుకుంటారు. అసలైన రేస్ ఎప్పుడు, ఎలా? ఇక శనివారం కూడా రెండో ఫ్రీ ప్రాక్టీస్తో పాటు ఉ.10.40నుంచి క్వాలిఫయింగ్ పోరు జరుగుతుంది. అనంతరం మ.గం. 3 గంటలకు అసలైన రేస్ ప్రారంభమవుతుంది. దాదాపు గంటన్నర పాటు సాగే ఈ రేస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హుస్సేన్ సాగర్ తీరంలో నెక్లెస్రోడ్పై ఏర్పాటు చేసిన హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ 2.83 కిలోమీటర్లు పొడవు ఉంది. ఇందులో మొత్తం 18 మలుపులు ఉన్నాయి. భారత రేసర్లు లేకపోయినా భారత్కు చెందిన రేసర్లు ఎవరూ లేకపోయినా మహీంద్ర టీమ్తో పాటు టాటా స్పాన్సర్గా ఉన్న జాగ్వార్ టీమ్పై రేసింగ్ అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. మహీంద్రా టీమ్లో రిజర్వ్ డ్రైవర్గా జెహాన్ దారువాలా ఉన్నాడు. గరిష్టంగా 322 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తి ఎలక్ట్రిక్ కార్ల మధ్య పోటీని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ‘బుక్ మై షో’లో ఈ రేసు కోసం టికెట్లు అందుబాటులో ఉన్నాయి. చదవండి: IND vs AUS: ఆసీస్ స్పిన్నర్ దెబ్బకు సూర్యకు మైండ్ బ్లాంక్.. అయ్యో ఇలా జరిగిందే!! Dasun Shanaka: అతడిని కొనేంత డబ్బు లేదు! నేనేమీ బాధపడటం లేదు! ఇండియాలో.. -
ఇదిగో సాగరతీరంలో నీరా కేఫ్
సాక్షి, హైదరాబాద్: సాగరతీరం మరింతగా పర్యాటక హంగులను సంతరించుకుంటోంది. ప్రతిష్టాత్మకమైన ఫార్ములా–ఈ పోటీల నేపథ్యంలో నెక్లెస్రోడ్డు, ట్యాంక్బండ్ పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు. దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు, సందర్శకులను ఆకట్టుకొనేవిధంగా అనేక ఏర్పాట్లు చేపట్టారు. సాగర్ జలాలపై మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్షోలతో పాటు ఈ నెలలోనే నీరా కేఫ్ను సైతం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృతిసిద్ధమైన నీరా పానీయాన్ని నగరవాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖ సుమారు రూ.10 కోట్లతో నెక్లెస్ రోడ్డు, పీపుల్స్ప్లాజా సమీపంలో ఈ కేఫ్ను నిర్మించింది. నీరాతో పాటు రెస్టారెంట్ సేవలు... తాటి, ఈత చెట్ల నుంచి తెల్లవారు జామునే సేకరించే నీరా పానీయంలోని సహజమైన పోషక విలువలు ఏ మాత్రం చెడకుండా శీతలీకరణ పద్ధతిలో నిల్వ చేసి విక్రయిస్తారు. ఇందుకోసం రెండంతస్థుల నీరా భవనంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సురక్షితంగా నిల్వ చేసేందుకు అవసరమైన అన్ని రకాల శీతలీకరణ యంత్రాలను సిద్ధం చేశారు. భువనగిరి సమీపంలోని నందనం, కడ్తాల్ సమీపంలోని ముద్విన్లో ఏర్పాటు చేసిన తాటివనం ప్రాజెక్టుల్లో నీరా కోసమే ప్రత్యేకంగా పెంచిన తాటి, ఈత చెట్ల నుంచి నీరాతో పాటు అనుబంధ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. శరీరానికి అవసరమైన ప్రొటీన్, ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ లభిస్తాయని వివరించారు. నీరాతో పాటే రెస్టారెంట్ సేవలు కూడా ఇక్కడ లభిస్తాయని చెప్పారు. ►ఈ కేఫ్లో తెలంగాణ వంటకా లన్నీ లభిస్తాయి. ►ఒకేసారి సుమారు 3 వేల మంది సందర్శించవచ్చు. ►పర్యాటక ప్రియులు, నగరవాసులు సాగరతీరంలో సేదతీరుతూ నీరాను ఆస్వాదించవచ్చు. ►తాటి, ఈత చెట్ల నుంచి సేకరించే నీరా నుంచి తయారయ్యే బెల్లం, సిరప్లు కూడా కేఫ్లో విక్రయిస్తారు. -
మొక్కలు నాటి మంచి భవిష్యత్తునిద్దాం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం మనం మొక్కలు నాటి భావితరాల వాళ్లకు మంచి భవిష్యత్తు ఇద్దా మని ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీశ్రావు పిలుపు నిచ్చారు. ఈనెల 26 నుంచి 30 వరకు నెక్లెస్రోడ్ పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్ నర్సరీ మేళా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్లో నర్సరీ మేళా బ్రోచర్ను హరీశ్ ఆవిష్కరించి మాట్లాడారు. ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ షో లో హార్టికల్చర్ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల తోటలు, ఎరువులు, ఆర్గానిక్ ఉత్పత్తులు, అగ్రికల్చర్ ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్, ఎడ్యుకేషన్, ఫుడ్ ఇండస్ట్రీ ఉత్పత్తులు ప్రదర్శిస్తారని వివరించారు. హైడ్రోఫోనిక్, టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్ వంటి నూతన టెక్నాలజీ ఈ షోలో ప్రదర్శిస్తారని, దేశవ్యాప్తంగా 150కుపైగా నర్సరీ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. ప్రధానంగా డార్జిలింగ్, హరియాణా, ముంబై, బెంగళూరు, పుణే, షిర్డీ, కడియం, చెన్నై, తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల నుంచి వచ్చిన ప్లాంట్స్ ప్రదర్శిస్తారన్నారు. మేళా ఇన్చార్జి ఖాలీద్ అహ్మద్ మాట్లాడుతూ మేళా ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. -
కేన్సర్పై అవగాహన రన్
ఖైరతాబాద్: కేన్సర్పై అవగాహన కల్పిస్తూ ఆదివారం నెక్లెస్ రోడ్డులో సూరజ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో వాక్ పర్ హోప్ పేరుతో 5కే రన్ నిర్వహించారు. ఎంఎన్జే కేన్సర్ హాస్పిటల్ వైద్యులు, బసవతారకం కేన్సర్ హాస్పిటల్, గాంధీ, ఉస్మానియా, కిమ్స్, నిమ్స్, అపోలో హాస్పిటల్స్ వైద్యులతో పాటు వివిధ విభాగాల ఉన్నత స్థాయి ఇంజనీరింగ్, సామాజిక వాదులు కుటుంబ సమేతంగా రోజు రోజుకు పెరుగుతున్న కేన్సర్కి ప్రధాన కారణం అవగాహన లేకపోవడమేనన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజ్కుమార్ మాట్లాడుతూ మొదటి దశలో కేన్సర్ను గుర్తించి సరైన చికిత్స అందిస్తే మహమ్మారి నుంచి పూర్తిగా తప్పించుకోవచ్చన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకే రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రన్లో డాక్టర్లు మధుసూదన్, డాక్టర్ విశాల్, డాక్టర్ పల్లవి, డాక్టర్ అశ్విని, సత్యనారాయణ, శ్యాంనాయక్, జగన్ యాదవ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ గందరగోళం.. తొలి రోజు ముగిసిన ఇండియన్ రేసింగ్ లీగ్
నగరంలో నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ తొలిరోజు ముగిసింది. అయితే తొలిరోజు రేసింగ్లో రెండు ప్రాక్టీస్ సెషన్స్ మాత్రమే జరిగాయి. రేసింగ్ నిర్వహణలో మరోసారి గందరగోళం నెలకొనడంతో నిర్వహకులు ఆదివారమే అన్ని పోటీలు పెట్టే యోచనలో ఉన్నారు. రేసింగ్ సమయంలో రెండు కార్లు రేస్ మద్యలో ఆగడంతో రెండు సార్లు రెడ్ ఫ్లాగ్స్ రావడం గందరగోళానికి దారి తీసింది. గతంలోలాగే మరోసారి రేస్ నిర్వహణలో ఆలస్యం కావడంతో ప్రాక్టీస్ రేస్లతోనే నిర్వాహకులు తొలిరోజును ముగించారు. ఆలస్యం కారణంగా మెయిర్ రేస్-1 జరగలేదు. దీంతో ఆదివారం అసలైన ఇండియన్ రేసింగ్ లీగ్ జరగనుంది. ఇక సాంకేతిక కారణాలతో స్పోర్ట్స్ కార్లు చాలా ఆలస్యంగా ట్రాక్ ఎక్కాయి. అయితే రేసింగ్ చూడడానికి వీక్షకులు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఆదివారం జరిగే ఇండియన్ రేసింగ్ ఫైనల్పైనే అందరి ఆసక్తి నెలకొంది. -
హైదరాబాద్లో నీరా కేఫ్ రెడీ
సాక్షి, హైదరాబాద్: తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృతి సిద్ధమైన పానీయం నీరా. నగరవాసులకు ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం నెక్లెస్ రోడ్డులో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. మొదట వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా నిర్వహించి ఆ తర్వాత డిసెంబర్ రెండో వారం నుంచి పూర్తి స్థాయిలో నీరా కేఫ్ సేవలను వినియోగంలోకి తీసుకురానున్నారు. ఈ మేరకు ఎక్సైజ్శాఖ అధికారులు ఇటీవల కేఫ్ను సందర్శించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో నెక్లెస్ రోడ్డులో రెండంతస్తుల భవనాన్ని నిర్మించారు. నీరాను సురక్షితంగా నిల్వ చేసేందుకు అన్ని రకాల శీతలీకరణ యంత్రాలను సైతం ఏర్పాటు చేశారు. పామ్ ప్రొడక్ట్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ అసోసియేషన్ (పీఆర్డీఏ) ఆధ్వర్యంలో నీరాతో పాటు అనుబంధ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ‘పానీయంలోని స్వచ్ఛతకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తాటిచెట్ల నుంచి నీరాను సేకరించడం మొదలుకొని దానిని వినియోగదారులకు చేర్చడం వరకు పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతిని పాటిస్తున్నట్లు’ పీఆర్డీఏ వ్యవస్థాపకుడు వి.సత్యగౌడ్ తెలిపారు. ‘వేదామృత్’ పేరుతో స్వచ్ఛమైన నీరా రుచులను నగరాసులకు పరిచయం చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చదవండి: Dalit Bandhu: అత్యంత పేదలకు జాబితాలో ముందు చోటు! తెలంగాణ రుచులు సైతం.. ఈ కేఫ్లో రెస్టారెంట్ సేవలు కూడా లభిస్తాయి. నీరాతో పాటు తెలంగాణ వంటకాలన్నీ లభిస్తాయి. ఒకేసారి సుమారు 3 వేల మందికి పైగా సందర్శించేందుకు అనుగుణంగా కేఫ్ను ఏర్పాటు చేశారు. ►పర్యాటక ప్రియులు, నగరవాసులు ఎక్కువగా సేదదీరే హుస్సేన్సాగర్ తీరంలోని నెక్లెస్ రోడ్డులో నీరా, తెలంగాణ వంటకాలను ఆస్వాదించవచ్చు. తాటి, ఈత చెట్ల పానీయంలోని సహజత్వాన్ని ప్రతిబింబించేవిధంగా నీరా కేఫ్ను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ►భువనగిరి సమీపంలోని నందనం, కడ్తాల్ సమీపంలోని ముద్విన్లో ఏర్పాటు చేసిన తాటివనం ప్రాజెక్టుల నుంచి హైదరాబాద్కు సరఫరా చేయనున్నారు. తాటి, ఈత చెట్ల నుంచి సేకరించే నీరా నుంచి తయారయ్యే బెల్లం, సిరప్, బుస్ట్ వంటివి కూడా కేఫ్లో విక్రయిస్తారు. పోషకాలు పుష్కలం నీరాలో పోషకాలు పుష్కలం. ప్రొటీన్, ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్ ఏ, బీ–6, బీ–12 వంటివి సమృద్ధిగా లభిస్తాయి. మొత్తం 20 అమైనో ఆసిడ్స్లో 18 అమైనో యాసిడ్స్ నీరా నుంచి లభిస్తాయి. ఈ పానీయం రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది. అన్ని విధాలుగా ఇది ఆరోగ్య ప్రదాయిని. –వి. సత్య గౌడ్, పీఆర్డీఏ -
నెక్లెస్ రోడ్డు : ఉత్సాహంగా ప్యూరథాన్ 5కే, 2 కే రన్ (ఫోటోలు)
-
Pureathon 2022: ప్రతి ఒక్కరికి రుతుక్రమంపై అవగాహన అవసరం.. అందుకే ఈ పరుగు
Menstruation Awareness 2K 5K Run: మహిళల్లో రుతుక్రమం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని డాక్టర్ మంజుల అనగాని, టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ అన్నారు. ప్యూరథాన్ పేరుతో ఈ నెల 9న పీపుల్స్ప్లాజాలో నిర్వహించబోయే అవగాహన 2కే, 5కే రన్ సన్నాహక సమావేశాన్ని బంజారాహిల్స్లోని బ్లూ ఫాక్స్ హోటల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగాని, హీరో సందీప్ కిషన్, దర్శకుడు మెహర్ రమేష్, నటి ఝన్సీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మంజుల అనగాని మాట్లాడుతూ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బహిష్టు సమయంలో బాలికలను, మహిళలను అంటరాని వారుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదన్న ఆమె.. మహిళల్లో రుతుక్రమం అనేది సర్వసాధారణమైన విషయమని ప్రతి తల్లి తమ ఇంట్లో ఉన్న భర్త, అన్న, తమ్ముడు, కుమారుడు ఇలా అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయం గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మహిళలు బహిష్టు సమయంలో సరైన రక్షణ చర్యలు లేక అనారోగ్యాల బారిన పడి మరణిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని అనగాని మంజుల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో మహిళలు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు శైలా తాళ్లూరి ముందుకు రావడం అభినందనీయం అన్నారు. రుతుక్రమం వచ్చినప్పడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన ఉదయం 6 గంటలకు నిర్వహించబోయే 2కే, 5కే రన్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ రన్లో ఆర్టీసీ ఎండి సజ్జనార్తో, రాకొండ సీపీ మహేష్భగవత్, హీరోయిన్ కీర్తి సురేష్, సినీ నటుడు సత్యదేవ్, సింగర్ సిద్ శ్రీరామ్, సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపోలో వైద్యురాలు షర్మిలా పెండ్యాల, సామాజిక వేత్త పార్వతి సుదర్శన్, ప్రేమా సుదర్శన్, ట్రాన్స్జెండర్ రచన పాల్గొన్నారు. చదవండి: Health Tips: అధిక రక్తపోటు ప్రాణాలకు కూడా ముప్పే! వీటిని తరచుగా తిన్నారంటే.. -
ఫార్ములా– ఈ పనులు రయ్..రయ్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ప్రతిష్టాత్మక ఫార్ములా– ఈ చాంపియన్ పోటీలకు భాగ్య నగరం సన్నద్ధమవుతోంది. ఎల్రక్టానిక్ కార్ల సామర్థ్యాన్ని, సత్తాను చాటే ఈ పోటీల కోసం హెచ్ఎండీఏ ట్రాక్ నిర్మాణ పనులను చేపట్టింది. నెక్లెస్ రోడ్డులో 2.8 కిలోమీటర్ల ట్రాక్ పనులను ప్రారంభించారు. డిసెంబర్ నాటికల్లా ట్రాక్ను సిద్ధం చేయడంతో పాటు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలను రూపొందించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రిక్ బ్యాటరీ కార్లు గంటకు 180 నుంచి 220 కి.మీటర్లకు పైగా వేగంతో పరుగులు తీసేవిధంగా ఈ ట్రాక్ను పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. ఫార్ములా–ఈ పోటీల నిర్వహణపై అధ్యయనం కోసం గత నెలలో హెచ్ఎండీఏ అధికారుల బృందం దక్షిణకొరియా రాజధాని సియోల్ను సందర్శించింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీ సంతోష్ నేతృత్వంలో హెచ్ఎండీఏ సీనియర్ ఇంజినీర్లు, ప్లానింగ్ అధికారులు ఆగస్టులో సియోల్లో పర్యటించారు. ప్రస్తుతం సియోల్ ట్రాక్ తరహాలోనే హైదరాబాద్లో ట్రాక్ ఏర్పాటు చేయడంతో పాటు పోటీలను నిర్వహించేందుకు తాజాగా పనులు ప్రారంభించారు. ఇదీ రూట్.. నెక్లెస్రోడ్డులోని 2.8 కి.మీ మార్గంలో ట్రాక్ ఏర్పాటు చేస్తారు. తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ గార్డెన్లోకి వెళ్లేవిధంగా ట్రాక్ను రూపొందిస్తున్నారు. ఎనీ్టఆర్ గార్డెన్లోంచి వెనక వైపు ఉన్న మింట్ కాంపౌండ్ మర్రిచెట్టు నుంచి ఐమాక్స్ థియేటర్, ఇందిరాగాంధీ విగ్రహం మీదుగా ఈ ట్రాక్ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 17 మలుపులు వచ్చేవిధంగా ట్రాక్ ప్లాన్ రూపొందించినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయంగా పేరొందిన 12 ఆటోమొబైల్ సంస్థలు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు అంచనా. ఆ సంస్థలు రూపొందించిన ఎల్రక్టానిక్ కార్ల సామర్థ్యాన్ని చాటుకొనేందుకు హైదరాబాద్ తొలిసారిగా వేదిక కానుంది. గంటకు 250 కి.మీటర్లకు పైగా వేగంతో వెళ్లే సామర్థ్యం ఉన్నప్పటికీ నగరంలో 180 కి.మీ వరకే పోటీ ఉండే అవకాశం ఉందని ఓ అధికారి వివరించారు. డిసెంబర్లో డెమో ... ఈ పోటీల్లో పాల్గొనే డ్రైవర్లు అంతర్జాతీయ ప్రమాణాల మేరకు డ్రైవింగ్లో శిక్షణ పొంది ఉంటారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఈ పోటీలకు డిసెంబర్ నాటికి ట్రాక్ను పూర్తి చేసి డెమో నిర్వహించే అవకాశం ఉంది. పోటీల్లో పాల్గొనే డ్రైవర్లు మొత్తం 40 లూప్స్ (రౌండ్స్) పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ కారు ఎంత సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేసిందనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని చాంపియన్షిప్ ఇస్తారు. నగరవాసులు పోటీలను వీక్షించేందుకు వీలుగా ట్రాక్ మార్గంలో ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేయనున్నారు. వేలాది మంది సందర్శకులు కూర్చొని చూసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉంటాయి. (చదవండి: జవహార్నగర్లో కర్చీఫ్ లేకుండా తిరగలేం) -
హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో మరో దారుణం
-
కారులో మరో కిరాతకం.. నెక్లెస్రోడ్డులో బాలికపై యువకుడి అత్యాచారం
సనత్నగర్ (హైదరాబాద్): నగరంలో మరో మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. రొమేనియా బాలికపై సామూహిక లైంగికదాడి ఘటనలో విచారణ కొనసాగుతుండగా.. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం కలకలం సృష్టిస్తోంది. ఈ అఘాయిత్యం కూడా కారులోనే జరగడం గమనార్హం. సమీకృత శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) గోల్కొండ సూపర్వైజర్ రమ్య ఈ నెల 4న హుమయూన్నగర్ పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో వివరాలు ఇలా ఉన్నాయి. కన్నేసి..కాటేశాడు: నింబోలి అడ్డకు చెందిన అనాథ బాలిక (17) మల్లేపల్లి విజయ్నగర్కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటూ స్థానికంగానే ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. హాస్టల్కు సమీపంలోని జిరాక్స్ షాపులో పనిచేసే సురేష్ (23) ఆమెపై కన్నేసి పరిచయం పెంచుకున్నాడు. బహుమతులు ఇచ్చి లోబరుచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఒక ఫోన్ను గిఫ్ట్గా ఇచ్చాడు. అప్పట్నుంచీ తరచూ ఫోన్ చేయడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న ఉదయం 9 గంటలకు కళాశాలకు వెళ్తున్నామని హాస్టల్లో చెప్పి ఆ బాలిక, ఆమె స్నేహితురాళ్లు ఇద్దరు బయటకు వచ్చారు. తమ క్లాస్మేట్ రాహుల్ పుట్టిన రోజు వేడుక కోసం నెక్లెస్ రోడ్డుకు వెళ్లారు. ఆ వేడుకకు రావాల్సిందిగా సురే‹Ùను కూడా వారు ఆహా్వనించారు. అర్ధరాత్రి 12 గంటల సమ యంలో అందరూ బర్త్ డే వేడుకల్లో నిమగ్నమై ఉండగా నీతో మాట్లాడాలంటూ ఆ బాలికను పిలిచిన సురేష్ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత మామూలుగా హాస్టల్కు వచి్చన బాలిక కొద్దిరోజుల తర్వాత నలతగా ఉండటంతో హాస్టల్ సిబ్బంది ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో సురే‹Ùపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐసీడీఎస్ సూపర్వైజర్ హుమయూన్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన హుమయూన్నగర్ పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతం రాంగోపాల్పేట పరిధిలోకి రావడంతో ఆ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. అప్పటికే హుమాయున్నగర్ పోలీసులు నిందితుడు సురే‹Ùపై ఐపీసీ 376 (2), సెక్షన్ 3 ఆర్/డబ్ల్యూ 4 పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన రాంగోపాల్పేట పోలీసులు సోమవారం సురే‹Ùను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు: బీజేపీ కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ నేత రాజాసింగ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎనీ్వఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు ధ్వజమెత్తారు. సోమవారం రాత్రి వారొక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. మైనర్ బాలికపై అత్యాచారాన్ని ఖం డించారు. హైదరాబాద్ హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు, డ్రగ్స్ దందాకు అడ్డాగా మారిందన్నారు. జూబ్లీహిల్స్లో మైనర్ బాలికపై టీఆర్ఎస్, మజ్లిస్ నాయకుల కుమారుల గ్యాంగ్ రేప్, దాష్టీకాలను మరువకముందే నెక్లెస్ రోడ్డులో మరో మైనర్ బాలికపై అత్యాచారం వెలుగు చూడటం అత్యంత బాధాకరమన్నారు. -
జలవిహార్ లో పర్యాటకుల సందడి
-
నెక్లెస్రోడ్డులో రూ.25 కోట్లతో నీరా కేఫ్
ఖైరతాబాద్ (హైదరాబాద్): దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారని ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మరుగున పడుతున్న కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో హైదరాబాద్లోని నెక్లెస్రోడ్డులో రూ.25 కోట్లతో నిర్మిస్తున్న నీరా కేఫ్ పనులను శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. తెలంగాణ ఆవిర్భావ దినం కంటే ముందే నీరా కేఫ్ను ప్రారంభించడంతోపాటు పూర్వీకుల చరిత్రను ఉట్టిపడేలా తీర్చిదిద్దుతామన్నారు. బుధవారం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. నీరాతోపాటు తాటి బెల్లం, తాటి చక్కెర తయారుచేసి ప్రత్యేక ప్యాకింగ్తో అందజేస్తామని తెలిపారు. ఆయుర్వేదిక్ డాక్టర్ల పర్యవేక్షణతోపాటు సీసీఎంబీ, సీఎస్ఐఆర్, ఐఐసీటీ వంటి సంస్థల సహకారంతో శాస్త్రీయంగా పరీక్షించి వీటి లాభాలను ప్రజలకు వివరిస్తామన్నారు. నల్లగొండ, సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి–భువనగిరి జిల్లాల్లో కూడా ఈ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఔషధ గుణాలున్న నీరా, కల్లు ఉత్పత్తికోసం ఇప్పటికే 4.25కోట్ల చెట్లను పెంచామని, రాబోయే రోజుల్లో 5 కోట్ల చెట్లు పెంచి స్వచ్ఛమైన కల్లును సీసాల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు కె.కిషోర్ గౌడ్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
Myra: సెలబ్రిటీ ర్యాంప్ వాక్.. ఫ్యాషన్ షో అదుర్స్
మహిళల్లో వచ్చే కేన్సర్లు చాలా వరకు నయం చేయగలిగేనని క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అపోలో కేన్సర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ ఆనంద్ పేర్కొన్నారు. ఆదివారం మాదాపూర్లోని హెచ్ఐసీసీలో కేన్సర్పై అవగాహన కల్పిస్తూ ‘మైరా’ పేరిట ఓ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సమాజంలో మహిళల విశిష్ట పాత్ర నేపథ్యంగా నిర్వహించిన కార్యక్రమంలో కేన్సర్ను జయించిన పిల్లలతో సెలబ్రిటీలు ర్యాంప్వాక్ చేశారు. కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేశ్రంజన్, డాక్టర్ వరప్రసాద్రెడ్డి, గగన్ నారంగ్, పుల్లెల గోపీచంద్, మాజీ మంత్రి డీకే అరుణ, శిఖా గోయల్, సినీనటి ప్రగ్యా జైస్వాల్, మధుశాలిని, పద్మశ్రీ అవార్డు గ్రహీత దీపారెడ్డి పాల్గొన్నారు. –మాదాపూర్ (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఆమె రన్.. అదిరెన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వేదికగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో 5కే, 2కే రన్ను నిర్వహించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, షీ టీమ్స్ ఐజీ స్వాతిలక్రా తదితరులు జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఉమెన్స్ డే సందర్భంగా తొలిసారి ఓ మహిళను లా అండ్ ఆర్డర్లో ఎస్హెచ్ఓగా నియమిస్తామని తెలిపారు. పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన రన్ ట్యాంక్బండ్ పైనున్న లేపాక్షి వరకు సాగి తిరిగి పీపుల్స్ ప్లాజాకు చేరింది. రన్లో కళాశాలల విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు. – ఖైరతాబాద్ ఫ్యాషన్ షో అదుర్స్ మహిళా దినోత్సవం సందర్భంగా కొండాపూర్లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో అంతర్జాతీయ ఫ్యాషన్ షో నిర్వహించారు. గ్రాండ్ ఫ్యాషన్ షోలో పలువురు మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు. – రాయదుర్గం చదవండి: Fashion Blouse Trend: డిజైన్లను బట్టి బ్లౌజ్కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ! రోజుకు రూ. 1000 వరకు వస్తున్నాయి! -
‘రన్’ అదిరిందిగా!
-
పీపుల్స్ ప్లాజాలో నర్సరీ మేళా.. టిక్కెట్ ధర ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 28 వరకు నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో 11వ గ్రాండ్ నర్సరీ మేళాను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఖాలిద్ అహ్మద్ జమీర్ తెలిపారు. మినిస్టర్ రోడ్లోని భరణి కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో న్యాయవాది శ్రీనివాసరావు, నిర్వాహకులు జావిద్ అహ్మద్లతో కలిసి వివరాలు వెల్లడించారు. 24న ఉదయం 9 గంటలకు మంత్రి హరీష్రావు ఈ మేళాను ప్రారంభిస్తారని చెప్పారు. ఈ మేళాలో అగ్రికల్చర్, హార్టికల్చర్కు సంబంధించిన మొక్కలు, రకరకాల పాట్స్, సీడ్స్, ఆర్గానిక్, ఇనార్గానిక్కు సంబంధించినవి లభిస్తాయని చెప్పారు. (క్లిక్: హైదరాబాదీలకు శుభవార్త.. బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు) వివిధ రకాల గార్డెనింగ్కు చెందిన పద్ధతులైన వెర్టికల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్, కిచన్ గార్డెనింగ్కు చెందిన రకరకాల మొక్కలతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్లో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినవి ఇక్కడ లభిస్తాయని చెప్పారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9గంటల వరకు ప్రవేశం ఉంటుందన్నారు. ప్రవేశ రుసుము రూ.20 మాత్రమేనని చెప్పారు. ఈ సందర్భంగా నర్సరీ మేళా బ్రోచర్ను ఆవిష్కరించారు. (క్లిక్: జీ+2 పర్మిషన్ తీసుకుని.. అయిదారు అంతస్తులు వేసారా?) -
24 నుంచి గ్రాండ్ నర్సరీ మేళా: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: గ్రాండ్ నర్సరీ మేళాకు నెక్లెస్ రోడ్ గ్రౌండ్స్ ముస్తాబవుతోంది. ఈ నెల 24 నుంచి 28 వరకు నిర్వహించే ఈ మేళాకు సంబంధించిన బ్రోచర్ను వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్రావు శనివారం మిని స్టర్స్ క్వార్టర్స్లో ఆవిష్కరించారు. 5 రోజుల పాటు జరిగే ఈ మేళాలో మొక్కలు, మొక్కల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల తోటలు, ఎరువులు, ఆర్గానిక్ ఉత్పత్తులు, అగ్రి కల్చర్ లో ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్, ఎడ్యుకేషన్, ఫుడ్ ఇండస్ట్రీ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్ వంటి నూతన టెక్నాలజీని ప్రదర్శించనున్నారు. 120కు పైగా నర్సరీ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మెడిసినల్ ప్లాంట్స్ కిచెన్, అవుట్ డోర్, ఎక్సోటిక్, బల్బ్, సీడ్, సీడ్ లింక్స్, ఇండోర్, ఆడినియం, బోన్సా య్, క్రీపర్స్, ఫ్లవర్స్, ఇంపోర్టెడ్ ప్లాంట్స్ అం దుబాటులో ఉంటాయి. డార్జిలింగ్, కోల్కతా, ఢిల్లీ, హరియాణా, ముంబై, బెంగళూరు, పుణే, షిర్డి, చెన్నై, తెలంగాణ, ఆంధ్ర ప్రాం తాల ప్లాంట్స్ ప్రదర్శిస్తారు. నెక్లెస్ రోడ్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. రూ. 50 నుంచి రూ.3 లక్షల వరకు మొక్కలు లభ్యమవుతాయని మేళా ఇన్చార్జి ఖలీద్ అహ్మ ద్ తెలిపారు. మేళాను మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు. -
నెక్లెస్ రోడ్లో పతంగులతో యువత సందడి
-
హైదరాబాద్: నగరవాసులకు తీపి కబురు
సాక్షి, బంజారాహిల్స్: నగరవాసులకు తీపి కబురు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నర్సరీ మేళా వచ్చేస్తోంది. ప్రకృతి ప్రియులకు చేరువలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ఆలిండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షో పేరుతో పదో గ్రాండ్ నర్సరీ మేళా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ ఈ నర్సరీ మేళాను నిర్వహిస్తోంది. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ప్రవేశ రుసుము రూ.20. చదవండి: పేరుకి కోటీశ్వరులు.. మరి అందులో కక్కుర్తి ఎందుకో ► ఈ మేళాలో వివిధ రకాల మొక్కలు, వివిధ ప్రాంతాల అరుదైన జాతులను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా గార్డెనింగ్ మెథడ్స్, టెర్రస్ గార్డెనింగ్, వరి్టకల్ గార్డెనింగ్, హైడ్రోపోనిక్, కిచెన్ గార్డెనింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ► దేశవ్యాప్తంగా వివిధ జాతుల మొక్కలను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. తాజా సాంకేతిక పరిజ్ఞానంతో మొక్కల పెంపకంపై అవగాహన కలిగించనున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ మేళాలో వందస్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. నర్సరీ ప్లాంట్లు కూడా వివిధ రాష్ట్రాలకు చెందిన నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ► గ్జోటిక్ ప్లాంట్స్, బోన్సాయ్, అడనీయం, ఇండోర్, అవుట్డోర్, హై క్వాలిటీ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ ప్లాంట్స్, మెడిసినల్ అండ్ ఆక్సిజన్ ప్యూరిఫయింగ్ ప్లాంట్స్, ఆర్గానిక్ మొక్కలు, సేంద్రీయ ఎరువులు, సెరామిక్ అండ్ ఫైబర్ ప్లాంట్ స్టాండ్స్, హై క్వాలిటీ సీడ్స్, బల్బ్సŠ, టూల్స్, దేశీయ, అంతర్జాతీయ ఎక్విప్మెంట్ ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. కోవిడ్ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఈ మేళా జరుగుతోంది. -
నెక్లెస్ రోడ్లో ఆకట్టుకుంటోన్న వినూత్న బాటిల్ డస్ట్బిన్
సాక్షి, బంజారాహిల్స్: నెక్లెస్ రోడ్...నిత్యం వేలాది మంది నగర వాసులు, పర్యాటకులతో కళకళలాడుతూ ఉండే మార్గం. అయితే, ఇక్కడికి వచ్చే పర్యాటకులు తాము తాగే వాటర్ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. దీని ద్వారా పారిశుధ్యం సమస్య తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సైతం స్పందించి ప్రజలను ఈ విషయంలో చైతన్యపరచాలని ఆదేశించారు. దీంతో ఖాళీ బాటిళ్లను డస్ట్బిన్లో మాత్రమే వేయాలని చైతన్య పరిచే విధంగా జీహెచ్ఎంసీ అధికారులు వాటర్ బాటిల్ మాదిరిగా ఐరన్తో చేసిన పెద్ద బాటిల్ నమూనాను నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేశారు. ఈ వినూత్న బాటిల్ డస్ట్బిన్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. -
Photo Feature: స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్.. సెల్ఫీ టైమ్
కరోనా నుంచి అధిక ముప్పు ఎదుర్కొంటున్న ఆటో, క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి తెలంగాణలో వ్యాక్సిన్లు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. కాగా, హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డుకు దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టారు. -
పీవీ నర్సింహారావు వ్యక్తి కాదు ఒక శక్తి..
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 16వ వర్థంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు బుధవారం ఉదయం నివాళులు అర్పించారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద అంజలి ఘటించారు. పీవీ కుమార్తె వాణి, కుమారుడు పీవీప్రభాకర్ రావు హోంమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ, పీవీ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కేశవరావు (కేకే), ఎమ్మెల్సీ కవిత తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ‘పీవీ వ్యక్తి కాదు ఒక శక్తి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా పీవీ ఆలోచనలు సూచనలు మన వెంట ఉన్నాయి. శత జయంతి ఉత్సవాలు సీఎం కేసీఆర్, ఎంపి కేకే ఆధ్వర్యంలో గొప్పగా జరుగుతున్నాయి. దేశానికి దిక్సూచి పీవీ. ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మంచి పరిణామం. ‘దేశానికి ఒక దిక్సూచి పీవీ నర్సింహారావు. భారత దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు. శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి. పీపీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఎంపీ కేకే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన చేసిన సంస్కరణలు, ఆలోచనలు తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఎన్నారైలు కోరుతున్నారు. మేం కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. పీవీ పేరుతో ఒక తపాల బిళ్లను విడుదల చేయాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. -
నీరా... గౌడ అస్తిత్వానికి ప్రతీక
సాక్షి,హైదరాబాద్ : రాష్ట్రంలోని గౌడ సామాజికవర్గ అస్తిత్వానికి ప్రతీకగా నీరా కేఫ్ ఉంటుందని రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ను ప్రోత్సహించడంతో పాటు వృత్తి నైపుణ్యాలు మరుగున పడిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన అన్నా రు. గురువారం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రులు వి.శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గౌడ సంఘాల ప్రతినిధులతో కలిసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ, గీత వృత్తిపై రాష్ట్రంలో రెండులక్షలకు పైగా ఆధారపడి ఉన్నారని, ఈ వృత్తిపై ఉన్న రూ.16 కోట్ల పన్నును రద్దు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని అన్నారు. ఈ నీరా కేఫ్ ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో పాపులర్ డ్రింక్గా నీరా ఉండబోతోందని చెప్పారు. ప్రతి వృత్తిలో అందరూ సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని, నేత, గీత, గొల్ల, ముదిరాజ్ ఇలా ప్రతి వృత్తిని కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. అన్ని కుల వృత్తుల సంక్షేమమే ధ్యేయం గా పనిచేస్తామని అన్నారు. ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ, ఎన్నో కులాలకు గీత వృత్తి మూలాధారంగా ఉందని, ఈ వృత్తిపై గత ప్రభుత్వాలు పన్ను వసూలు చేసి గీత కార్మికులను జెండాలు మోసే వారిగానే చూశాయని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న పోరాడినా రద్దు కాని వృత్తి పన్నును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దు చేశారని గుర్తు చేశారు. దశాబ్దాల నుంచి గీత వృత్తిపై ప్రభుత్వాలు పన్ను వసూలు చేస్తే గీత వృత్తికి పన్నుతో పాటు బకాయిలను రద్దు చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం నీరా పాలసీ తెచ్చిందన్నారు. కేసీఆర్ తర్వాత మనసున్న నాయకుడు కేటీఆర్ అని, వందల కోట్ల విలువైన భూమి నీరా కేఫ్ స్టాల్కు ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పువ్వా డ అజయ్ కుమార్, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావు గౌడ్ల తో పాటు పలువురు గౌడ సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, తలసాని, ఇతర ప్రజా ప్రతి నిధులు నీరా పానీయాన్ని సేవించారు. -
నెక్లెస్ రోడ్డులో 'నీరా కేఫ్' కు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్ : నెక్లెస్రోడ్డులో కొత్తగా నిర్మించనున్న 'నీరాకేఫ్'కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా తెలంగాణ వంటలకు ప్రాధాన్యం కల్పించేలా నీరా కేఫ్ను తిర్చిదిద్దనున్నారు. తెలంగాణలో మొట్టమొదటగా ఏర్పాటుకానున్న నీరా కేఫ్ను దాదాపు 3 కోట్లతో నిర్మించనున్నట్లు అంచనా. ఈ కేఫ్లో 10 స్టాల్స్తో సహా 250 మంది కూర్చొనే సిట్టింగ్ కెపాసిటీ ఉంండనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సోమేష్ కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, సీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు. -
నేడు నెక్లెస్రోడ్లో నీరాకేఫ్కు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్కు నేడు శంకుస్థాపన జరగనుందని, గీత కార్మికుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచేందుకే ఈ కేఫ్లను ఏర్పాటు చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. గత ప్రభుత్వాలు గౌడ వృత్తిదారులు కట్టే పన్నును మాత్రమే చూశాయని, వారి సంక్షేమాన్ని మరిచాయని మంత్రి విమర్శించారు. మంత్రి కేటీఆర్ చేతుల మీదు గా జరిగే ఈ నీరాకేఫ్ శంకుస్థాపనకు మంత్రులు శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్యాదవ్ కూడా హాజరవనున్నారు. శంకుస్థాపన ఏర్పాట్లను బుధవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆ శాఖ అధికారులు, గౌడ సంఘాలనేతలతో కలిసి పరిశీలించారు. -
కార్నివాల్ ప్రారంభించిన హంసా నందిని
-
సిద్దిపేటకు నెక్లెస్ రోడ్డు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట మినీ ట్యాంక్ బండ్ కోమటి చెరువుపై ప్రత్యేకంగా నెక్లెస్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం కలెక్టరేట్లో సిద్దిపేటలో నిర్మించనున్న ఈ రోడ్డు నిర్మాణంపై ప్రముఖ అర్కిటెక్ట్ సంవాద్ ప్రధాన్ రూపొందించిన విజన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఆయన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జిల్లా అదికారులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేటలో నిర్మించనున్న నెక్లెస్ రోడ్డు ఆరేళ్ల పిల్లాడి నుంచి అరవై ఏళ్ల ముసలి వరకు ఆరోగ్యం, ఆహ్లాదం, ఆనందం కలిగేలా విజన్కు అనుగుణంగా నిర్మాణం ఉండాలని, తన డ్రీమ్ ప్రాజెక్టుపై రూపకల్పన చేసి, సిద్దిపేట నెక్లెస్ రోడ్డు అంటే రోల్ మోడల్గా నిలిచేలా ఉండాలని అధికారిక వర్గాలను ఆదేశించారు. కలెక్టర్తో మాట్లాడుతున్న మంత్రి హరీశ్రావు నిర్మాణం వచ్చే సంవత్సరం మార్చి నెలలోపు పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజెంటేషన్లో చిన్నా, పెద్దలకు సరదాగా గడిపేందుకు అన్ని రకాల సౌకర్యాలు ఉండాలని, అక్కడక్కడా ఎత్తు వంపులతో మంచి అనుభూతి కలిగించేలా ఉండాలన్నారు. నెక్లెస్ రోడ్డు సుందరీకరణలో భాగంగా ఏ,బీ,సీ,డీ,ఈ జోన్లుగా విభజించనున్నామన్నారు. చెరువు కట్ట కిలోమీటర్ ఉండగా, నిర్మించే నెక్లెస్ రోడ్డు ఒకటిన్నర కిలోమీటర్ ఉండనుందన్నారు. అదేవిదంగా పాత, కొత్త కట్టలను కలుపుతూ రెండున్నర కిలోమీటర్లు రింగు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మొత్తంగా ఈ ప్రాజెక్టును రూ.25 కోట్లతో నిర్మించనున్నట్లు, మొదటగా సీ, డీ జోన్ల పనులు యుద్ధప్రాతిపాదికన ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ లక్ష్మణ్, మున్సిపల్ ఇంజనీర్లు మహేశ్, తదితరులు పాల్గొన్నారు. -
జైపాల్రెడ్డి అంత్యక్రియలు అక్కడే..!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి(77) అనారోగ్య కారణాలతో ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు నెక్లెస్ రోడ్డులోని పీవీ నరసింహారావు ఘాట్ పక్కన నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. సోమవారం ఉదయం 9 గంటలకు జూబ్లిహిల్స్లోని జైపాల్రెడ్డి స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సందర్శకుల దర్శనార్థం గాంధీభవన్లో మాధ్యాహ్నం రెండు గంటల వరకు పార్థీవ దేహాన్ని అక్కడే ఉంచుతారు. పీవీ ఘాట్ పక్కన అంత్యక్రియలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జైపాల్రెడ్డి భౌతిక కాయానికి ఎంపీ రేవంత్రెడ్డి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం పీవీ ఘాట్ వద్ద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. (చదవండి : కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్రెడ్డి కన్నుమూత) -
నెక్లెస్ రోడ్డు ఘటన.. యువకుడు మృతి
సాక్షి, హైదరాబాద్ : నెక్లెస్రోడ్డులో రెండ్రోజుల కిత్రం జరిగిన గొడవలో ప్రియుడి(మోబిన్) చేతిలో గాయపడ్డ సాయి సాగర్ (21) శనివారం మృతిచెందాడు. పోలీస్స్టేషన్లోనే సాయి సాగర్పై మోబిన్ పిడి గుద్దులతో ఎటాక్ చేశాడని, సీసీ పుటేజ్ ఇవ్వకుండా పోలీసులు అతనికి సపోర్ట్ చేస్తున్నారని మృతుడి స్నేహితులు అంటున్నారు. ఇప్పటికే మోబిన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతనిపై 16 కేసులు నమోదు అయినట్లు, మిర్యాలగూడలో కేసులతో పాటుగా పీడీ యాక్ట్లో మోబిన్ అరెస్టయ్యాడు. బర్త్డే పార్టీ చేసుకోవడానికి నెక్లెస్రోడ్డుకు వెళ్లిన సాయి సాగర్ స్నేహితుల బృందం.. అక్కడి ఓ ప్రేమజంటతో వాగ్వాదానికి దిగారు. దీంతో రెండు వర్గాలకు చెందిన నలుగురు యువకులను రాంగోపాల్ పేట పోలీసులు స్టేషన్కు తరలించారు. అయితే, అప్పటివరకు బాగానే ఉన్న సాయిసాగర్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అయితే చికిత్స పొందుతున్న సాయి సాగర్ మృతి చెందాడు. సాయి సాగర్కు ఇరవై రోజుల కిత్రమే వివాహమైనట్లు స్నేహితులు పేర్కొన్నారు. చదవండి : నెక్లెస్ రోడ్డులో ఘర్షణ.. చితకబాదిన ప్రేమ జంట..! -
నెక్లెస్ రోడ్డులో ఘర్షణ.. చితకబాదిన ప్రేమ జంట..!
సాక్షి, హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డు వద్ద గురువారం తెల్లవారుజామున పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రెండు వర్గాలకు చెందిన నలుగురు యువకులను రాంగోపాల్ పేట పోలీసులు స్టేషన్కు తరలించారు. అయితే, అప్పటివరకు బాగానే ఉన్న మంగల్హాట్కు చెందిన సాయిసాగర్ (21) అనే యువకుడు అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అతడిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. పుట్టిన రోజు వేడుక చేసుకుంటున్న ఓ జంట పట్ల ముగ్గురు యువకులు అసభ్యంగా మాట్లాడారని.. ప్రతిగా ఆ జంట యువకులను చితకబాదినట్టు సమాచారం. ప్రేమికుల దాడిలో గాయపడిన సాయిసాగర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. పోలీసులు చితకబాదడంతోనే తమ కొడుకు అనారోగ్యానికి గురయ్యాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సాయిసాగర్ను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పరామర్శించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుకు మాత్రమేనని నిందితులపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలకు పోలీసులే బాధ్యత వహించాలని అన్నారు. ఓ వర్గానికి కొమ్ముకాస్తూ సాయిసాగర్పై దాడిచేశారని ఆరోపించారు. -
దుర్గంధమయంగా హుస్సేన్సాగర్
సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక హుస్సేన్సాగర్ కంపు కొడుతోంది. నెక్లెస్ రోడ్లో సేదతీరేందుకు వచ్చే సందర్శకులకు దుర్గంధం స్వాగతం పలుకుతోంది. దీంతో కొందరు తలనొప్పి, వాంతులు, కళ్లు తిరగడం తదితర సమస్యలతో బాధపడుతుండగా... మరికొందరు కళ్ల మంటలు, చర్మంపై దురద రావడం లాంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఘన వ్యర్థాలు, గుర్రపు డెక్కతో నిండిన సాగర జలాల్లోని బ్యాక్టీరియా.. కూకట్పల్లి, బాలానగర్ నాలా నుంచి వచ్చి చేరుతున్న పారిశ్రామిక రసాయన జలాల్లోని సల్ఫేట్ను గ్రహిస్తుండడంతో రసాయనిక చర్య జరిగి దుర్గంధం వెలువడుతుండడంతోనే ఈ దుస్థితి తలెత్తింది. ప్రస్తుతం జలాశయం నీటిలో కరిగిన ఆక్సిజన్ శాతం సున్నాకు చేరుకోవడం ఆందోళనకలిగిస్తోంది. ఇక హుస్సేన్సాగర్ను ప్రక్షాళన చేయాలన్న సర్కార్ సంకల్పం అటకెక్కింది. ఆర్భాటంగా ప్రారంభించిన ‘మిషన్’ గాడి తప్పింది. దశాబ్ద కాలంగా సాగర్ ప్రక్షాళనకు సుమారు రూ.326 కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం. సాగర జలాల్లో ఆక్సిజన్ శాతం పెంచేందుకు రెండేళ్ల క్రితం కెనడాకు చెందిన ఎజాక్స్ కంపెనీ చేసిన ప్రయోగం సైతం విఫలమవడం గమనార్హం. ప్రక్షాళన పనుల్లో ఇప్పటి వరకు పూర్తయ్యింది గోరంతే. మిగిలిన పనుల పూర్తి అడుగుకో తడబాటులా మారింది. కాగా కూకట్పల్లి నాలా మళ్లింపు పనులను పూర్తి చేసినట్లు ప్రకటించినప్పటికీ... ఈ నాలా నుంచి పారిశ్రామిక వ్యర్థాలు జలాశయంలోకి నేటికీ చేరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు దశాబ్దాలుగా బల్క్డ్రగ్, ఫార్మా కంపెనీలు వెదజల్లిన గరళాన్ని తన గర్భంలో దాచుకున్న జలాశయం అట్టడుగున గడ్డకట్టుకుపోయిన ఘన వ్యర్థాల తొలగింపు పనులను తాత్కాలికంగా నిలిపివేయడంతో ప్రక్షాళనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరుణంలో జలాశయం ఉపరితల భాగంలో తెట్టులా పేరుకున్న వ్యర్థాల తొలగింపునకు విదేశాల్లో వినియోగించే ఎనిమిది కాళ్ల ఎక్స్కావేటర్ను వినియోగిస్తున్నప్పటికీ ఇవన్నీ పైపై మెరుగులేనన్న వాదనలు వినిపిస్తుండడం గమనార్హం. జలాశయం ప్రక్షాళన పర్వంలో ప్రస్తుతానికి సాధించింది గోరంతేనని... చేయాల్సిన పనులు కొండంత ఉన్నాయని పర్యావరణ వాదులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పీవీ జ్ఞానభూమి నుంచి కిమ్స్ ఆస్పత్రి మార్గంలో సాగరజలాల్లో ఘన వ్యర్థాలు గుట్టలుగా పోగుపడడం ప్రస్తుత సాగర్ దుస్థితికి అద్దం పడుతోంది. ‘మిషన్ హుస్సేన్సాగర్’లోచేపట్టాల్సిన పనులివీ... ♦ జలాశయం నీటి నాణ్యత మెరుగుపరచడం, జలాశయంలోకి ఘన వ్యర్థాలు చేరకుండా చర్యలు. ♦ దశాబ్దాలుగా జలాశయం అడుగున బెడ్లా ఏర్పడిన ఘన వ్యర్థాలను డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా తొలగించడం. ♦ నాలుగు నాలాల నుంచి చేరుతున్న మురుగు నీటిని దారి మళ్లించడం. ♦ జలాశయం, దాని పరిసరాల్లో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం. ♦ జలాశయం నీటిని ల్యాండ్స్కేపింగ్, గార్డెనింగ్అవసరాలకు వాడుకునే స్థాయిలో నీటి నాణ్యతను మెరుగుపరచాలి. ♦ హుస్సేన్సాగర్ వద్దనున్న 20 ఎంఎల్డీ ఎస్టీపీ ఆధునికీకరణ, సామర్థ్యం పెంపు. ♦ హుస్సేన్సాగర్ చుట్టూ రింగ్సీవర్ మెయిన్స్ నిర్మించి మురుగునీరు జలాశయంలో చేరకుండా చూడడం. ♦ శుద్ధి చేసిన నీరు మాత్రమే జలాశయంలోకి ప్రవేశించే ఏర్పాటు. ♦ జలాశయంలో ఆక్సిజన్ శాతం పెంచేందుకు ఏరియేషన్ వ్యవస్థ ఏర్పాటు. సాగర మథనం సాగుతోందిలా.. ప్రధానంగా కలుస్తోన్న నాలాలు: కూకట్పల్లి, పికెట్, బుల్కాపూర్, బంజారా నాలాలు. ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు: 2006లో రూ.270 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, ఘన వ్యర్థాల తొలగింపు. 2014: రూ.56 కోట్లతో కూకట్పల్లి నాలా డైవర్షన్ పనులు. 2015: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎనిమిది కాళ్ల ఎక్స్కావేటర్తో వ్యర్థాల తొలగింపు. 2017: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సాగర జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ఎజాక్స్ కంపెనీ శాటిలైట్ ఆధారిత టెక్నాలజీ వినియోగం. (ఈ ప్రయోగం ఉచితంగానే చేశారు) హుస్సేన్సాగర్ ప్రక్షాళనకు దశాబ్ద కాలంలో చేసిన వ్యయం: సుమారు రూ.326 కోట్లు. బయో రెమిడియేషన్తో సత్ఫలితాలు బయో రెమిడియేషన్తో హుస్సేన్సాగర్లో ఆర్గానిక్ వ్యర్థాలు, దుర్వాసన తొలగించేందుకు హెచ్ఎండీఏ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. బెంగళూర్కు చెందిన నాకాఫ్ సంస్థ ఈ పనులు చేపట్టింది. ప్రధానంగా ఈ సంస్థ పర్యావరణహితమైన బ్యాక్టీరియా, ఇతర సాంకేతిక విజ్ఞానంతో సాగర్ను శుద్ధి చేస్తోంది. ఈ బ్యాక్టీరియాతో నీటిలో దుర్వాసనతో పాటు ఈ–కోలి, పాథోజెనిక్ బ్యాక్టీరియాను తొలగించడంతో పాటు సాగర్లో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ), బయోలాజికల్ ఆక్సిజన్ (బీఓడీ) డిమాండ్, కరిగిన ఘన వ్యర్థాలు(టీడీఎస్), కరిగిన రేణువులు (టీఎస్ఎస్), నీటిలో కరిగిన ఆక్సిజన్ శాతాన్ని పీసీబీ ప్రమాణాల మేరకు ఉండేలా చూస్తున్నాయి. – అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ -
నెల్లూరులో నెక్లెస్ రోడ్డు నిర్మాణం పేరుతో భారీ అవినీతి
-
ఫిబ్రవరి 10న ‘రన్ ఫర్ గ్రీన్’
-
గోల్డెన్ వాక్
-
రన్ ఫర్ అవేర్నెస్
-
జడల బొమ్మాళి
బీటెక్ చదువుతున్న హ్యాపీ డేస్ అవి. కొత్తగా ఓపెన్ చేసిన ప్రసాద్స్ ఐమాక్స్ లోని స్కేరీ హౌస్ కి వెళ్లాలని కొద్ది రోజులుగా మా హాస్టల్ బ్యాచ్ అందరి కోరిక. మా గ్యాంగ్లో మేము మొత్తం పదిమందిమి. చిన్నపాటి ఆనందాలకి కూడా తెగ సంబరపడిపోయే బ్యాచ్ మాది. సరదా అయినా, షికారు అయినా అందరం కలిసే వెళ్ళేవాళ్ళం. మొత్తానికి అనుకున్న ప్లాన్ ప్రకారం ఒక ఆదివారం నెక్లెస్ రోడ్లోని ఈట్ స్ట్రీట్కి వెళ్ళాము. అప్పుడే రిలీజ్ అయిన ఆనంద్ మూవీ ఎఫెక్టేమో! స్టీమ్దోశ, ఫిల్టర్ కాఫీ మాకు ఒక క్రేజీ కాంబినేషన్. ఈట్ స్ట్రీట్లో టిఫిన్ అయ్యాక, ప్రసాద్స్ ఐమాక్స్ వెళ్లాము. అద్దాలతో మెరిసిపోతోంది ఐమాక్స్. షాపింగ్ మాల్స్ అంటే ఇలా వుంటాయని అప్పుడప్పుడే తెలుసుకుంటున్న మాకు అది మరో ప్రపంచంలా కనిపించింది. కళ్ళు జిగేలుమనేలా చుట్టూ షాప్ ఔట్లెట్స్. మాల్ మొత్తం సుమారు ఒక గంటన్నర పాటు తిరిగి మా ఫైనల్ డెస్టినేషన్ అయిన స్కేరీ హౌస్ దగ్గరకు చేరుకున్నాం. అప్పటికే చాలా పెద్ద క్యూ ఉంది అక్కడ. ఒకపక్క నవ్వులు, మరోపక్క కేకలు అరుపులతో మొత్తం హడావుడిగా ఉంది. ఎక్కువ ఆలస్యం చేయకుండా చకచకా టికెట్స్ తీసుకొని మేము కూడా క్యూలో నిలుచున్నాం. అప్పటి వరకు ధైర్యంగా వున్నా, హౌస్ లోపలి నుంచి వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్కు, కేకలకు మా అందరిలో ఏదో మూల కొంచెం భయం మొదలైంది. అలా క్యూలో అరగంట గడిచింది. లోపలికి వెళ్ళడానికి మా ముందు ఇంకా రెండు బ్యాచులు మిగిలి ఉన్నాయి. అంతలో మానస ‘వామ్మో! నాకు మస్తు భయం ఐతాందే. నా వల్ల కాదు. నే డ్రాప్ ఐతా..’ ఏడుపు గొంతుతో అంది. దానికి అసలే భయం ఎక్కువ. ఏదో మేనేజ్ చేసి ఇంత దూరం లాక్కొచ్చాము. దాని మాటలకి రాధిక, శిల్ప కూడా వంతపాడారు. ‘ఒసేయ్ ఎంకి! లోపల ఉన్నవన్నీ స్పెషల్ ఎఫెక్ట్స్. మనుషులే దయ్యాల్లాగా ఉత్తుత్తి యాక్షన్. అంతా మనల్ని భయపెట్టడానికేనే’ ధైర్యం నూరిపోసింది లచ్చి. మృదుల, కన్య కూడా మానసని ఒప్పించడానికి వాళ్ల వంతు తంటాలు పడ్డారు. ఎలాగోలా మొత్తానికి మానసని ఒప్పించారు. మా మాటల్లో పడి క్యూ కదులుతున్న సంగతి కూడా మర్చిపోయాం. లోపలికి వెళ్లాల్సిన నెక్ట్స్ట్ బ్యాచ్ మాదే. డోర్ దగ్గర పొడుగ్గా ఒకతనునల్ల చొక్కా, నల్ల టోపీ వేసుకుని ఉన్నాడు. ‘లోపట మస్తు భయమేస్తదా ?‘‘గట్టిగ అరిస్తే జర సౌండ్ తగ్గించున్రి భయ్యా!!’..‘ఏ చోట ఎక్కువ భయం ఏస్తది ?’ ఇలా రాధిక కురిపించిన ప్రశ్నల వర్షానికి జవాబు అన్నట్టుగా స్కేరీ హౌస్ డోర్ తెరిచి లోపలికి వెళ్ళమన్నట్టుగా సైగ చేశాడు అతను. సగం ధైర్యం, సగం భయంతో మేము ఒకరి చేయి ఇంకొకరం గట్టిగా పట్టుకుని లోపలికి వెళ్ళాము. డోర్ మూసుకుంది. అంతా మసక మసకగా ఉంది. అక్కడక్కడా లాంతరు వెలుగు మిణుకుమంటోంది. అంతలో ఎక్కడ నుంచి ప్రత్యక్షమయ్యాడో ఒకడు వికృతంగా నవ్వుతూ మాకు ఎడమ వైపున్న గోడను చూపించాడు. గోడపై ఏదో రాసుంది. మాకు ఆలోచించేంత సమయం ఇవ్వకుండా ఆ హౌస్ కథ అని వివరించాడు. అతను రక్త చరిత్ర రేంజ్ లో కథ చెప్తున్నా మాకు మాత్రం వినిపిస్తున్న సౌండ్ ఎఫెక్ట్స్కి చెమటలు పట్టేశాయి. ఒక్కసారిగా అరిచింది శ్రుతి. తన పక్కనే ఉన్న నా చేయి నలిపినంత పని చేసింది. ‘ఎ..ఎ... ఎముకల గూడు..’ వణుకుతూ అంది.ఆలస్యం చేయకుండా అక్కడ్నుంచి రైలు పెట్టెలులా ముందుకు కదిలాం. ఎదురుగా ఒక పెద్ద చెట్టు. దానిపై అస్థి పంజరాలు వేలాడుతున్నాయి. చెట్టు కింద ఒక ముసలివాడు పడుకుని మూలుగుతున్నాడు. మేము ముందుకు వెళ్లాలంటే అతన్ని దాటే వెళ్ళాలి. మా అందరిలోకల్లా కొద్దో గొప్పో ధైర్యం కొంచెం ఎక్కువున్న లచ్చి ముందుకు నడిచింది. అలా నడిచిందో లేదో, అతడు గబుక్కున లేచి కూర్చుని మంచంతో పాటు ముందుకు జరుగుతూ మమ్మల్ని అడ్డగించబోయాడు. నాకైతే పై ప్రాణం పైనే పోయినంత పనైంది. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నాం. లోపలికి వెళుతున్నకొద్దీ చీకటి మమ్మల్ని మంచుపొరలా కమ్మేసింది. తలో, ‘ఏయ్ వదులు... నా కాలు వదులు’ అంటూ హర్షిత కేక. తన కాలు ఎవరో పట్టుకున్నారు. భయంతో వాణ్ణి ఒక తన్ను తన్ని ఉరుకో ఉరుకు. అప్పటివరకు ఒకరినొకరం అంటి పెట్టుకునివున్న మేమంతా కూడా చెల్లా చెదురు అయిపోయాం. ఎక్కడ ఉన్నామో తెలియని అయోమయంలో ఉన్న నాకు, చేతికి ఏదో జుట్టులా తగిలేసరికి క్షణం పాటు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. మూసిన కళ్లు మూసినట్టే ఉన్నాయి. ఎటు కదలాలన్నా భయం. ధైర్యం కూడబలుక్కుని అక్కణ్ణుంచి పరుగులు తీశాను. చీకటిలో ఎటు వెళ్తున్నానో కూడా తెలియలేదు. ఎలాగోలా చివరకు ఒక తలుపు దగ్గరకు వచ్చాను. అది మూసి ఉంది. అంతలో, ఎక్కడ్నుంచి ఊడిపడ్డాడో, మర్రి ఊడల్లాంటి జడలతో ఒకడు భయపెడుతూ ఎదురొచ్చాడు. ఎటు వెళ్లాలో అర్థంకాక గట్టిగా కేకలు పెట్టాన్నేను. అంతలో వెనుక నుంచి సూపర్ వుమన్లా లచ్చి వాడిని ఒక్క ఉదుటున పట్టేసింది. వాడు వదిలించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ కుదరలేదు. లచ్చి ఉడుం పట్టుకి వాడికి భయం వేసిందేమో...‘వదలవమ్మా తల్లే! నీకు దణ్ణం ఎడతా! నెక్ట్స్ బ్యాచ్ వచ్చేలోపు నే పోవాల. నా కొంప ముంచకు..’ అని గింజుకున్నాడు. ఒక్కసారిగా మమ్మల్ని కమ్మేసిన చీకటి పొరలు తొలగి వెలుతురు కనిపించింది. ఎగ్జిట్ డోర్ ఓపెన్ అయ్యిందని మాకు అర్థమయ్యేలోపు మేము స్కేరీ హౌస్ బయట వున్నాం. ఒక్కొక్కరుగా మా వాళ్ళందరూ బయటకి వచ్చారు. లచ్చి తన చేతిలో చింపిరి ఊడల జడ పట్టుకుని ఉంది.‘ఎక్కడ వాడు.. ఎక్కడ?’ అంటూ అటూ ఇటూ వెతికింది. దాన్ని అలా చూసి అందరం నవ్వాము. స్కేరీ హౌస్ బయట ఉన్నామని దానికి అర్థమవడానికి కొంత సమయం పట్టింది. లోపల జరిగింది మా వాళ్ళకి చెప్పా. అప్పటివరకు మాలో ఉన్న భయమంతా మా నవ్వులకి ఆవిరైపోయింది. లచ్చికి మేము పెట్టిన ‘జడల బొమ్మాళి’ అన్న పేరు, సోనీ కెమెరాలో బంధించిన ఆ క్షణాలు... ఎప్పుడు తలుచుకున్నా భలే నవ్వొస్తుంది. – సుచిత్రారెడ్డి -
‘సాగర్ దుర్గంధం భరించలేకున్నాం’
సాక్షి,హైదరాబాద్: నెక్లెస్ రోడ్డుపై వెళుతూ కారు అద్దాలు మూసుకున్నప్పటికీ హుస్సేన్సాగర్ నుంచి వచ్చే దుర్వాసన భరించలేనిదిగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. మురికినీరు శుద్ధికి ఏర్పాటు చేసిన శుద్ధి కేంద్రాలు కొన్ని చోట్ల పనిచేస్తున్నట్లు కనిపించడం లేదంది. గతంలో చెరువుల్లో నీరు ఎంత పరిశుభ్రంగా ఉండేదో ఆ స్థితికి చెరువులను తీసుకొచ్చినప్పుడే వాటిని పరిరక్షించినట్లని తెలిపింది. జంట నగరాల్లో చెరువుల శుద్ధికి జియో ట్యూబ్ టెక్నాలజీని ఉపయోగించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి పరిధిలోని మల్కం చెరువును ఆక్రమణల నుంచి కాపాడాలని కోరుతూ ఐపీఎస్ అధికారి అంజనాసిన్హా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్, మత్స్యకారుడు సుధాకర్లు కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను సీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. -
ఎల్డర్స్.. రైడర్స్
-
'షూ'ట్ కేసు
గజ దొంగలు పోలీసులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు.ఈ దొంగ ఏకంగా కావేరీ నీళ్లు తాగించాడు.ఇతని చేతిలో విద్యను చూస్తే చోరత్వాన్ని ఒక కళగా ఎందుకు చెబుతారో అర్థమవుతుంది.తాళాలు పగలగొట్టడంలో ఉన్న లాఘవం కష్టపడి పని చేయడంలో లేదు.అందుకే దొరికిపోయాడు. జైల్లో కార్పొరేషన్ నీళ్లు తాగుతున్నాడు.దొంగతనానికి అలవాటు పడిన తోడేలు పదే పదే తిరిగి వస్తుంది.2017 ఫిబ్రవరి 19. మధ్యాహ్నం.హైదరాబాద్. బండిమెట్.‘సబ్మెరైన్ మీద తెలుగులో తీసిన ఫస్ట్ సినిమా అట. పదండి వెళ్దాం’ అని కుటుంబాన్ని మేట్నీకి బయల్దేరదీశాడు రత్నాకర్.మల్టీప్లెక్స్లో చూపించాలని కాస్త ఇంటి ఆడపిల్లలకు కాలక్షేపంగా ఉంటుందని నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్న ప్రసాద్స్కు తీసుకువెళ్లాడు. భార్యా ఇద్దరు కూతుళ్లు సినిమాను ఎంజాయ్ చేశారు.సాయంత్రం ఏడు గంటలకు అందరూ తిరిగి వచ్చారు. గేటు తీసుకుని లోనికి అడుగుపెడుతుంటే గుండె ఝల్లుమంది.తాళం విరగ్గొట్టి ఉంది. తలుపులు ఓరగా వేసి ఉన్నాయి.అంతే. అందరూ ఒక్కసారిగా లోపలకు అడుగు పెట్టారు.‘చోరీ... చోరీ జరిగింది’ అని మెల్లగా గొణిగాడు రత్నాకర్ షాక్లో పెదాలు కదిలిస్తూ. ‘మొత్తం 55 తులాలు ఎస్.ఐ.గారు. పిల్లల పెళ్లిళ్ల కోసం నోరూ కడుపూ కట్టుకుని దాచాం. అన్నీ పోయాయి’ అని ఏడుస్తూ ఉంది రత్నాకర్ భార్య. పెళ్లికెదిగిన ఆడపిల్లలు ఈ హఠాత్ పరిణామంతో బిక్కచచ్చి ఉన్నారు. రత్నాకర్ సాయం ఆశిస్తున్నట్టుగా ఎస్.ఐ వైపు చూస్తున్నాడు. ‘కంగారు పడకండి. దొంగల్ని పట్టుకుంటాం’ అన్నాడు ఎస్.ఐ.పోలీసులు ఇలాగే చెప్తారు... వాళ్లు దొంగను పట్టి రికవరీ చేయకపోతే కుటుంబం చాలా కష్టాల్లో పడుతుంది అని అందరూ బెంబేలెత్తుతున్నారు.ఇరుగూ పొరుగూ కూడా పోగయ్యారు.విశాలంగా ఉన్న వీధి అది. మధ్యాహ్నం పూట కావడంతో పెద్దగా సంచారం లేదు. అందుకని దొంగ పని సులువయ్యింది. ఎవరి కంటా పడకుండా చోరీ చేసుకు వెళ్లాడు.‘మీకు ఎవరిమీదైనా అనుమానం ఉందా?’ అడిగాడు ఎస్.ఐ.లేదన్నట్టు తలాడించాడు రత్నాకర్.‘సిసి కెమెరాల ఫుటేజ్ మొత్తం తీయండి’ అన్నాడు పోలీసులతో. పోలీసులు సిసి కెమెరాల ఫుటేజ్ మీద దృష్టి పెట్టారు.రత్నాకర్ ఇంటి సమీపంలో ఉన్న సిసి కెమెరాల ఫీడ్ పరిశీలించారు. అనుమానితుడి కదలికలు రికార్డు అయ్యాయి. ఆ రోజు మధ్యాహ్నం 2.12 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి దయానంద్ ఇంట్లోకి ప్రవేశించినట్లు, 2.23 నిమిషాలకు బయటకు వచ్చినట్లు రికారై్డంది. ‘అంటే 11 నిమిషాలే అతడు లోపల ఉన్నాడా’ అన్నాడు ఎస్.ఐ.‘అవును సార్’ అన్నాడు కానిస్టేబుల్.‘కేవలం 11 నిమిషాల్లో గ్రిల్స్, తలుపులు, బీరువా పగులగొట్టి ఉడాయించాడంటే ఇతను ప్రొఫెషనల్’ అన్నాడు ఎస్.ఐ.ఘటనాస్థలిని మరోసారి పరిశీలించారు. గేటు దగ్గర బీడీముక్క కనిపించింది. దాని మీద ‘శివాజీ బీడీ’ అని లేబుల్ ఉంది.‘సార్.. ఈ బీడీలు కేవలం కర్ణాటకలోనే లభిస్తాయి. మన ప్రాంతంవి కావు’ అన్నాడు కానిస్టేబుల్.దీంతో నేరం చేసిన వ్యక్తి కర్నాటక వాడై ఉంటాడని అర్థమైంది. కాని ఈ ఒక్క క్లూతో దొంగను పట్టుకోవడం సాధ్యం కాదు. దొంగను వెతకాలి. అందుకని మరిన్ని సిసి కెమెరాల ఫుటేజీని పరిశీలించే పనిలో పడ్డారు. వేట మొదలైంది.చోరీ జరిగిన బండిమెట్ దగ్గరి నుంచి చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న కెమెరాల ఫుటేజ్ను అంగుళం కూడా వదలకుండా జల్లెడ పట్టారు పోలీసులు.రత్నాకర్ ఇంట్లో అడుగుపెట్టిన మనిషి ట్యాంక్బండ్ వైపు వెళ్లినట్టు గుర్తించారు. అతడిని గుర్తు పట్టడం ఒక విధంగా సులువైంది. ఆ సులువుకు కారణం అతడు వేసుకున్న బూట్లు. నల్లగా ఎత్తుగా బరువుగా ఉన్న ఆ బూట్ల వల్ల అతడు ఈడ్చినట్టుగా నడుస్తున్నాడు. మనిషి పొట్టివాడు కావడం వల్ల పొడవు కనిపించడానికి అతడా షూలను ఉపయోగిస్తుండొచ్చని పోలీసులు అనుకున్నారు. ట్యాంక్బండ్ వద్ద నిందితుడు ఓ ఆటోడ్రైవర్తో సంభాషించినట్లు రికార్డు అయ్యింది.‘ఆ ఆటోనంబర్ జూమ్ చేసి డ్రైవర్ని పట్టుకొని రండి’ అన్నాడు ఎస్.ఐ.అందుకు రెండు రోజులు పట్టింది. డ్రైవర్ పేరు యాదయ్య.‘ఇతను నీ ఆటో ఎక్కాడా?’ అనడిగాడు ఎస్.ఐ.‘లేదు సార్. శివాజీ బీడీ కహా మిలేగా అని అడిగాడు. ఆ బీడీలను నేను వినలేదు. తెలియదని చెప్పాను’‘తెలుగు మాట్లాడలేదా?’‘హిందీయే మాట్లాడాడు. కాని అది హైదరాబాదీ హిందీ కాదు’ అన్నాడు.వెంటనే పోలీసులు నిందితుడి ఫొటోను కర్ణాటక పోలీసులకు పంపారు. ఎలాంటి వివరాలు దొరకలేదు. ఐదేళ్ళ కాలంలో నగరంలో నమోదైన ఈ తరహా నేరాలు, అరెస్టు అయిన నిందితుల ఫొటోలతో పోల్చి చూసినా దర్యాప్తు ముందుకు కదల్లేదు. ‘ఈ దొంగ కావేరీ నీళ్లు తాగించేదాకా వదిలిపెట్టేట్టు లేడే’ అని ఒక కానిస్టేబుల్ విసుక్కున్నాడు. రత్నాకర్ గతంలో ఆ ప్రాంతంలో ఓ టైపు ఇన్స్టిట్యూట్ నిర్వహించాడు. అదే ప్రాంతానికి చెందిన రాజు అక్కడ టైపు రైటింగ్ నేర్చుకోవడంతో వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. మార్కెట్ ప్రాంతంలో వ్యాపారం చేస్తున్న రాజు దగ్గరకు రోజూ వచ్చే రత్నాకర్ తన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి మాట్లాడటంతో పాటు సీసీ కెమెరాల నుంచి సేకరించిన ఫొటోలు, చోరీ సమయంలో దొంగ ధరించిన బూట్ల గురించి చెప్పేవాడు. రాజు ఆ ఫొటోల సెట్ ఒకటి తన దగ్గర పెట్టుకున్నాడు. బూట్ల గురించి పదే పదే చర్చ వచ్చేది కాబట్టి ఆ బూట్లను కూడా గుర్తు పెట్టుకున్నాడు. ఓపక్క పోలీసుల దర్యాప్తు సాగుతుండగానే 2017 మే 3న నిందితుడు రాజుకే తారసపడ్డాడు.కోళ్లకు మరిగిన తోడేలు పదే పదే అక్కడికే వచ్చినట్టుగా దొంగతనాలకు అలవాటు పడ్డ దొంగ మళ్లీ సిటీకి వచ్చాడు. ఫిబ్రవరిలో చోరీ చేసి వెళ్లినవాడు మళ్లీ జూన్లో వచ్చాడు. నాంపల్లిలోని ఓ లాడ్జిలో బస చేసి అనువైన ఇళ్ళను వెతుక్కుంటూ సికింద్రాబాద్ ప్రాంతానికి వచ్చాడు. క్లాక్టవర్ వద్ద ఉన్న రాజు ఇతణ్ణి చూశాడు.పొట్టిగా ఉన్న మనిషి... పొడుగ్గా కనిపించడానికి వేసుకున్న మందమైన బూట్లు.. అవే కదలికలు... ఫుటేజ్లో చూసిన పోలికలు..రాజు ఆలస్యం చేయలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.కానిస్టేబుల్ లక్ష్మణ్ మఫ్టీలో క్షణాల్లో అక్కడకు చేరుకున్నాడు.‘ఎక్కడా?’ అడిగాడు లక్ష్మణ్.రాజు చూపించాడు.‘సడన్గా పట్టుకుంటే వాడు పారిపోయే ప్రమాదం ఉంది. లేదా మన మీద అటాక్ చేయవచ్చు’ అన్నాడు కానిస్టేబుల్.క్షణాల్లో ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు.కానిస్టేబుల్ సీసీ కెమెరాల్లో నమోదైన ఫొటోని తీసుకొని దొంగ దగ్గరకు వెళ్లాడు.‘మిస్టర్. ఇతన్ని మీరెక్కడైనా చూశారా. ఇతను చనిపోయాడు. ఇన్సూరెన్స్ వచ్చింది. ఆ డబ్బులు ఇవ్వాలి’ అన్నాడు.‘ఇది నేనే. నేను చనిపోవడం ఏంటి’ అన్నాడు దొంగ.‘ఒక్కసారి ఇన్సూరెన్స్ ఆఫీసుకు వస్తే క్లారిటీ వస్తుంది’ అని స్కూటర్ ఎక్కించుకున్నాడు.ఆ స్కూటర్ నేరుగా పోలీస్ స్టేషన్కు దారి తీసింది.దొంగను క్షణాల్లో పోలీసులు చుట్టుముట్టారు. గజదొంగ మహ్మద్ ఇక్బాల్ జిలానీది కర్ణాటకలోని హుబ్లీ. ఆ ప్రాంతంలో 35 నేరాలు చేసి, ఏడు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయి ఉండటంతో ఎనిమిదేళ్ళుగా పరారీలో ఉన్నాడు. 2000లో హుబ్లీ నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్కు మకాం మార్చి అక్కడా చోరీలు చేశాడు. అప్పుడప్పుడు హైదరాబాద్లోని నాంపల్లి దర్గాకు వచ్చి వెళ్ళే నేపథ్యంలో సిటీతో పరిచయం ఏర్పడింది. వృత్తిరీత్యా టైర్లకు పంక్చర్లు వేసే ఇతగాడు తన ప్యాంటు లోపల పంక్చర్ రాడ్ పెట్టుకుని సంచరించేవాడు. దాంతోనే నిమిషాల్లో ఎలాంటి తాళమైనా పగులకొట్టేవాడు. రాజు ఇచ్చిన సమాచారంతోనే ఇక్బాల్ను అరెస్టు చేసి మొత్తం 55 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. రాజుతోపాటు పోలీసు సిబ్బందినీ సన్మానించిన పోలీసులు... ప్రతి పౌరుడూ రాజు మాదిరిగా బాధ్యతతో వ్యవహరిస్తే ‘సేఫ్ సిటీ’ ఎంతో దూరం ఉండదని వ్యాఖ్యానించారు. – శ్రీరంగం కామేష్, సిటీబ్యూరో (హైదరాబాద్) -
నెక్లెస్రోడ్డులో మెగా మారథాన్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఇవాళ తెల్లవారుజామున పుల్ మారథాన్ ప్రారంభమయింది. నెక్లెస్ రోడ్డు నుంచి గచ్చిబౌలికి 42 కొలోమీటర్ల పుల్ మారథాన్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రారంభించారు. పుల్ మారథాన్లో 26దేశాలకు చెందిన వేలాది మంది రన్నర్స్ పాల్గొన్నారు. హప్ మారథాన్ జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్ ప్రారంభించారు. దాదాపు 6,500 మంది హాఫ్ మారథాన్లో పాల్గొన్నారు. హైదరాబాద్ రన్నర్స్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో ఈ మారథాన్ జరుగుతోంది. -
తెలంగాణ ఫుడ్ఫెస్టివెల్
-
మురికిగుంటలో పడి చిన్నారి మృతి
-
నెక్లెస్రోడ్డులో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన
-
హైదరాబాద్ సిటీ కలర్స్ ఆధ్వర్యంలో పింకథాన్ రన్
-
నెక్లెస్రోడ్లో షీటీమ్స్ ఆధ్వర్యంలో 10కె రన్
-
ఏరియల్ షో అదుర్స్
-
డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ 5కె రన్
-
నెక్లెస్రోడ్డులో ‘ఫ్రీడం వాక్’
హైదరాబాద్: రెయిన్బో హోమ్స్ ఆధ్వర్యంలో బాలికలను సంరక్షించాలంటూ ఫ్రీడం వాక్ నిర్వహించారు. నెక్లెస్రోడ్డులోని పీపుల్స్ ప్లాజా దగ్గర శనివారం ఉదయం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెయిన్బో హోమ్స్ సంస్థ చిన్నారుల విద్య కోసం దేశవ్యాప్తంగా చేస్తున్న సేవలను కొనియాడారు. హైదరాబాద్ ఇంఛార్జ్ కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ కాలకృత్యాలకు ఆరుబయటకు వెళ్లకుండా మరుగుదొడ్లను వినియోగించుకోవాలన్నారు. రుబెల్లా వ్యాధి టీకాలను త్వరలో అన్ని విద్యాసంస్థలకు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా 70 మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. -
జాయ్ రైడ్లో అపశ్రుతి
హైదరాబాద్: నగర పర్యటకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాఫ్టర్ జాయ్ రైడ్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పర్యాటకుల కోసం కేటాయించిన ప్రత్యేక హెలికాఫ్టర్ గురువారం నెక్లెస్ రోడ్ సమీపంలో పక్కకు ఒరిగింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నెక్లెస్ రోడ్డులో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ
-
నెక్లెస్ రోడ్లో డ్రగ్స్కు వ్యతిరేక ఆంధోళనలు
-
సిటీలో చిన్నడవి
హుస్సేన్ సాగర్ తీరం అడవి అందాలు సంతరించుకోనుంది. బల్క్ ప్లాంటేషన్ (పెద్దమొత్తంలో మొక్కలు నాటడం) పద్ధతిలో నెక్లెస్ రోడ్ ప్రాంతంలో మూడెకరాల విస్తీర్ణంలో 30 వేల మొక్కలు నాటేందుకు రంగం సిద్ధమైంది. ఈ మహత్కార్యాన్ని చేపట్టేందుకు ‘ఫారెస్ట్ ఇన్ సిటీస్’ కాన్సెప్ట్తో బెంగళూర్కు చెందిన ‘సే ట్రీస్’ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు హెచ్ఎండీఏతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. – సాక్షి, సిటీబ్యూరో ♦ బల్క్ ప్లాంటేషన్ పద్ధతిలో మూడెకరాల్లో 30వేల మొక్కల పెంపకం ♦ ‘ఫారెస్ట్ ఇన్ సిటీస్’ కాన్సెప్ట్తో ముందుకొచ్చిన ‘సే ట్రీస్’ సంస్థ సంజీవయ్య పార్కుకు ఆనుకొని పీవీ ఘాట్కు ఎదురుగా ఉన్న మూడెకరాల స్థలంలో అడవిని తలపిం చేలా మొక్కలు నాటుతామని ‘సే ట్రీస్’ బృందం హెచ్ఎండీఏ అధికారులకు తెలిపింది. పీవీ ఎక్స్ప్రెస్వే పిల్లర్ల పై వర్టికల్ గార్డెనింగ్పై అధ్యయనం చేసిన బృందం.. ‘ఫారెస్ట్ ఇన్ సిటీస్’ కాన్సెప్ట్ను అధికారులకు వివరిం చింది. సొంత నిధులతో మొక్కలు నాటి, రెండేళ్లు నిర్వహణ బాధ్యతలూ చూసుకుంటామంది. ఆకట్టుకునే అడవి అందాలు... ‘సిటీజనులు అడవి అందాలు చూసే భాగ్యాన్ని కల్పించేందుకు మావంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే దేశంలోని వివిధ నగరాల్లో ఈ విధానానికి శ్రీకారం చుట్టాం. బల్క్ ప్లాంటేషన్ పద్ధతిలో వివిధ రకాల మొక్కలను దగ్గరదగ్గరగా నాటాలనుకుంటున్నామ’ని సంస్థ వలంటీర్ ప్రశాంత్ తెలిపారు. రెండేళ్ల నిర్వహణ అనంతరం మొక్కలు బాగా పెరిగాక ప్రజలకు ఇందులోకి అనుమతి ఉంటుందని అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు పేర్కొంటున్నారు. ఇది పూర్తయి తే సిటీలో ‘చిన్నడవి’ తయారైనట్టే. దీంతో సిటీలో వేడితో పాటు కాలుష్యం కొంతమేర తగ్గే అవకాశం ఉంది. ఓఆర్ఆర్ ప్రాంతంలోనూ... అవుటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)లోని నాలుగు ప్రాంతాల్లోనూ ఈ విధానం అమలు చేయాలని అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు యోచిస్తున్నారు. ఈ మార్గంలో చిన్నపాటి అడవిని రూపొందిస్తే ప్రయాణికులకు ఆహ్లాదభరిత వాతావరణం అందించినట్టే. నానక్రామ్గూడ–కోకాపేట, పటాన్చెరు, బొంగళూరు, శామీర్పేట–ఘట్కేసర్ ప్రాంతాల్లోని ఇంటర్ఛేంజ్ల వద్ద ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా అమలుచేసే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. -
పార్కులు కిటకిట
►వేసవి సెలవులతో ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు, సంజీవయ్య పార్కులకు క్యూ ►సాధారణ రోజుల్లో 10 వేల మంది సందర్శన ►ఆదివారం 26 వేల మందికి పైగా వచ్చారన్న అధికారులు సిటీబ్యూరో: నగరంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పార్కులకు సందర్శకుల తాకిడి పెరిగింది. వేసవి సెలవులు రావడంతో పిల్లలతో కలిసి తల్లిదండ్రులు వీకెండ్ శని, ఆదివారాల్లో నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్యపార్కు, హుస్సేన్సాగర్ తీరంలోని ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కుల దారిపడుతున్నారు. సాయంత్రం వేళల్లో ఐదు గంటల తర్వాత పార్కులు కళకళలాడుతున్నాయి. గత సోమవారం నుంచి గురువారం వరకు ఈ పార్కుల్లో ప్రతిరోజూ పదివేల మంది సందర్శకులు వస్తే శనివారం 17 వేల మంది, ఆదివారం మాత్రం దాదాపు 26 వేలకుపైగా మంది వచ్చారని పార్కుల పర్యవేక్షకులు తెలిపారు. ఈ ఆదివారం ఎన్టీఆర్ గార్డెన్కు 11,326 మంది, లుంబినీ పార్కుకు 10,925 మంది, సంజీవయ్య పార్కుకు 2,582 మంది సందర్శకులు వచ్చారన్నారు. లేజర్ షోను 1,698 మంది వీక్షించారని తెలిపారు. ఈ ఒక్కరోజే దాదాపు రూ.ఆరు లక్షలకు పైగా ఆదాయం కేవలం ఎంట్రీ టికెట్ల రూపంలో లభించిందన్నారు. లుంబినీ పార్కుకు వచ్చిన సందర్శకులు పిల్లలతో కలిసి బోటింగ్ చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. జెండా వచ్చాక పెరిగిన సందర్శకులు... నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కులో గతేడాది జూన్లో దేశంలోనే అతి పెద్దదైన జాతీయ జెండాను ఆవిష్కరించాక పర్యాటకుల సందడి పెరిగింది. అంతకుముందు ప్రతిరోజూ 500 నుంచి 600 మంది సందర్శకులు వస్తే ఇప్పుడూ ఆ సంఖ్య రెట్టింపైంది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు జిల్లాల నుంచి వచ్చిన సందర్శకులు హుస్సేన్సాగర్ తీరంలో రెపరెపలాడుతున్న ఈ జాతీయ జెండాను వీక్షించేందుకు మక్కువ చూపెడుతున్నారు. దీనికితోడు రోజ్ గార్డెన్ కూడా ఉండటంతో వేసవిలో సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. -
లవ్కు నో ఎంట్రీ
నిత్యం వందలాది ప్రేమ జంటలతో కళకళలాడే ఇందిరాపార్కు వాలంటైన్ డే నాడు మాత్రం వెలవెలబోయింది. సాధారణ రోజులల్లో ఇక్కడి ప్రతి చెట్టు, పుట్ట వద్ద జంటలే ప్రేమ కబుర్లలో మునిగితేలేవారు. మంగళవారం పార్కు నిర్వాహకులు, పోలీసులు సైతం ప్రేమ జంటలకు అనుమతిని నిరాకరించి, బందోబస్తు ఏర్పాటు చేయడంతో పార్కు కళతప్పింది. – కవాడిగూడ జంటలు లేవాయె.. నిత్యం ప్రేమ జంటలతో నిండిపోయే బంజారాహిల్స్లోని జలగం వెంగళరావు పార్కు సైతం మంగళవారం కళ తప్పింది. పార్కుల్లో తిరిగే ప్రేమ జంటలకు పెళ్లి చేస్తామంటూ భజరంగ్దళ్ హెచ్చరికల నేపధ్యంలో జంటలు ఇటువైరు వచ్చేందుకు సాహసించలేదు. – బంజారాహిల్స్ వాలంటైన్ డేను పురస్కరించుకుని మంగళవారం పార్కులు కళ తప్పితే.. నెక్లెస్ రోడ్డు మాత్రం ప్రేమ జంటలతో కళకళలాడింది. అక్కడి పచ్చికపై కూర్చుని కబుర్లాడుకుని.. సెల్ఫీలు దిగారు. కేక్ కట్చేసుని, బహుమతులు ఇచ్చిపుచ్చుకుని ఆనందం పంచుకున్నారు. -
'ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగించాలి'
-
'ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగించాలని కోరుకుంటున్నా'
హైదరాబాద్ : నేడు జరగుగుతున్న పోలీస్ మారథాన్ రన్ దేశానికే ఆదర్శమని గవర్నర్ నరసింహన్ తెలిపారు. ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఫస్ట్ ఇండియన్ పోలీస్ మారథన్ మెమోరియల్ రన్ను నరసింహన్ ప్రారంభించారు. అనంతరం నరసింహన్ మాట్లాడుతూ... ఫ్రెండ్లీ పోలీసింగ్ను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ రన్లో డీజీపీ అనురాగ్ శర్మ, పోలీసు ఉన్నతాధికారులతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రన్లో యువతి, యువకులు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
నెక్లెస్ రోడ్డులో స్వచ్ఛ భారత్ రన్
-
నెక్లెస్ రోడ్డులో స్వచ్ఛ భారత్ రన్
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో ఆదివారం ఉదయం స్వచ్ఛ భారత్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రన్ను దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీందర్ గుప్తా ఈ రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్లో దాదాపు వెయ్యి మందికి పైగా రైల్వే ఉద్యోగులు ఈ పాల్గొన్నారు. -
నెక్లెస్రోడ్లో 3కే వాక్
హైదరాబాద్: ఓమ్నీ ఆస్పత్రి, ఆసియా స్వచ్ఛంద సంస్ధ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని నెక్లెస్రోడ్లో ఏర్పాటు చేసిన 3కే వాక్ను పంచాయతి రాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాకారం కావాలంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెళ్లిచూపులు ఫేమ్ హీరో విజయ్ దేవరకొండతో పాటు పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొన్నారు. -
నెక్లెస్ రోడ్డుపై గొయ్యి.. తప్పిన ప్రమాదం
-
నెక్లెస్ రోడ్డుపై గొయ్యి.. తప్పిన ప్రమాదం
హైదరాబాద్ : నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలోని నెక్లెస్ రోడ్డుపై గొయ్యి పడింది. దీంతో ఆ ప్రాంతంలో రోడ్డు భారీగా కుంగిపోయింది. అధికారులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గొయ్యిను పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అటు వైపు వాహనదారులు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేసి మరమ్మతు పనులను ప్రారంభించారు. -
'రన్ ఫర్ రియో' ప్రారంభించిన పద్మారావు
హైదరాబాద్ : ఒలంపిక్స్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు దేశం గర్వించే విధంగా పతకాలు గెలవాలని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి టి. పద్మారావు అన్నారు. రియో ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం నగరంలోని నక్లెస్ రోడ్డులో 'రన్ ఫర్ రియో' పరుగును నిర్వహించారు. దీనిని మంత్రి పద్మారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
హెచ్ఎండీఏ నిర్వాకంతో నష్టపోతున్నాం
హిమాయత్నగర్: నెక్లెస్రోడ్లో ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు తాము అన్ని ఏర్పాట్లు చేసుకున్నా హెచ్ఎండీఏ అధికారులు పట్టించుకోవటం లేదని నిర్వాహకులు పేర్కొన్నారు. హెచ్ఎండీఏ నిర్వాకం వల్ల తాము రూ.కోట్లు నష్టపోయే పరిస్థితి ఉందని సీపీఐ నగర కార్యదర్శి డాక్టర్ కె.సుధాకర్కు శనివారం వివరించారు. ఈ నెల 15నుంచి 17వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉందని, అయితే తేదీ దగ్గర పడినా ఆ స్థలాన్ని ఖాళీ చేయించకుండా హెచ్ఎండీఏ కాలయాపన చేసిందని నిర్వాహకులు పృథ్వితేజ్, గుణశేఖర్, జయదీప్, శ్రీదివ్య, ప్రసన్న, అభినయ, శివాని, సనా, ప్రణబ్, భార్గవ్, భవ్యలు తెలిపారు. దీనికి సంబంధించిన నగదును కూడా తాము ముందే చెల్లించామన్నారు. హెచ్ఎండీఏ ఏఓకు ఫోన్ చేస్తే స్పందన లేదన్నారు. కనీసం ఇప్పటికైనా స్థలాన్ని కేటాయిస్తే తరువాత ఫెస్టివల్ ఏర్పాటు చేస్తామని, సమస్య పరిష్కారానికి కృషిచేయాలని సుధాకర్ను కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే లోకాయుక్తాను ఆశ్రయించి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేలా సహకరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. -
5కే రన్ను ప్రారంభించిన నగర మేయర్
స్వచ్ఛతలో దేశంలో 19వ స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరాన్ని మొదటి స్థానానికి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. స్వచ్ఛ సాగర్ పేరుతో నెక్లెస్రోడ్పై ఏర్పాటు చేసిన రన్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని పలు ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ రోజు 5కే, 10కే రన్ లు, సైక్లింగ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్ జండా ఊపి రన్ను ప్రారంభించగా.. శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి సైక్లింగ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ను స్వచ్ఛంగా పచ్చదనంగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని అన్నారు. -
సరదా కోసం వెళితే చితకబాదారు
రాంగోపాల్పేట్ (సికింద్రాబాద్): ఆటవిడుపు కోసం తన బంధువులతో కలిసి నెక్లెస్రోడ్లోని జలవిహార్కు వెళ్లిన ఓ యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది చితకబాదారు. గదిలో బంధించి తీవ్రంగా కొట్టడంతో గాయాలపాలయ్యాడు. ఈ ఘటన రాంగోపాల్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాటిగడ్డకు చెందిన ఇంతియాజ్ అనే సాప్ట్వేర్ ఇంజనీర్ తన కుటుంబ సభ్యులు 10 మందితో కలసి శనివారం మధ్యాహ్నం నెక్లెస్రోడ్లోని జలవిహార్కు వెళ్లాడు. 9వ తరగతి చదివే ఇంతియాజ్ అక్క కుమారుడైన మహ్మద్ సమీర్ అక్కడ స్విమ్మింగ్పూల్లో ఉండే మ్యాట్రైడ్కు వెళ్లాడు. అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డు బింటూ అతన్ని అనుమతించలేదు. 45 కేజీల బరువుకు పైబడి ఉన్న వాళ్లను మాత్రమే అనుమతిస్తామని సెక్యూరిటీ గార్డు చెప్పాడు. దీంతో వారి మధ్య గొడవ జరుగుతుండగానే బింటూ సోదరుడు మహ్మద్ జుబేర్ (18) ఇక్కడికి చేరుకుని సెక్యూరిటీగార్డుని ప్రశ్నించడంతో... అతడు మరింత ర్యాష్గా ప్రవర్తించాడు. సెక్యూరిటీ సిబ్బంది జుబేర్ను పక్కనే ఉన్న గదిలోకి తీసుకువెళ్లి చితకబాది వదలి పెట్టారు. అనంతరం జుబేర్ అక్కడే ఉన్న కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపాడు. ఇంతియాజ్ రాంగోపాల్పేట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నగరంలో హెలీ టూరిజం
హైదరాబాద్ : మార్చి 1వ తేదీ నుంచి హైదరాబాద్లో హెలీ టూరిజం సేవలు ప్రారంభం కానున్నాయి. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నెక్లెస్ రోడ్లో హెలీ టూరిజంను ప్రారంభించనున్నారు. గగన తలం నుంచి నగరంలోని పర్యాటక ప్రాంతాలను తిలకించేలా సరికొత్త ప్యాకేజీని రూపొందించారు. ఇండ్ వెల్ ఏవియేషన్ సంస్థ ఆధ్వర్యంలో హెలికాప్టర్ సర్వీసులు ఈ సేవలను అందించనున్నాయి. -
నెక్లెస్రోడ్లో రేసర్ల పనిపట్టిన పోలీసులు
హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్డులో బైక్ రేసర్లపై పోలీసులు మరోసారి కొరడా ఝుళిపించారు. ఆదివారం తెల్లవారుజామున సెంట్రల్ జోన్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా నెక్లెస్ రోడ్లో 70 మంది యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు 102 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 20 రేసింగ్ బైక్లు కాగా, మైనర్లు నడుపుతున్న 51 బైక్లు కూడా ఉన్నాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న బైక్లు.. సరైన పత్రాలు లేనివి 31 బైక్లు ఉన్నాయి. మైనర్ల తల్లిదండ్రులను పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. కాగా, సెంట్రల్ జోన్ పోలీసులు చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ ఆపరేషన్ను వీడియో చిత్రీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. -
నెక్లెస్ రోడ్డులో డ్రైవింగ్ సూపర్..
చారిత్రక హైదరాబాద్ సకల సంస్కృతుల నిలయం. ఐటీలో మేటి. నాన్న ఉద్యోగరీత్యా ఇక్కడికి బదిలీ కావడంతో సిటీతో విడదీయరాని బంధం ఏర్పడింది. ఇంటర్ నుంచి ఇక్కడే చదువుకున్నా. నేను ఢిల్లీ, బెంగళూర్, కోల్కతా, చెన్నై.. ఇలా ఎన్నో నగరాలు పర్యటించాను. కానీ అక్కడ దొరకని ఆత్మీయత మన సిటీలో దొరుకుతుంది. సాయంసంధ్య వేళ.. లైట్ల వెలుగులో నెక్లెస్ రోడ్డులో డ్రైవింగ్ చేయడమంటే చాలా ఇష్టం. హైదరాబాద్ బిర్యానీ అంటే పడిచస్తా. కాస్మొపాలిటన్ సిటీ అంటే హైదరాబాదే. ఏ నగరంలోనూ కనిపించని భిన్న సంస్కృతులు ఇక్కడ చూడొచ్చు. ఇదొక మినీ ఇండియా. - నందిత, సినీనటి -
నెక్లెస్రోడ్లో 5కే రన్
రహదారి భద్రత, హెల్మెట్ వినయోగం పై అవగాహన కోసం ఓ స్వచ్ఛంద సేవ సమితి వారు ఏర్పటు చేసిన 5 కే రన్ శనివారం ఉదయం ఉత్సాహంగా సాగింది. నెక్లెస్రోడ్ నుంచి ప్రారంభమైన ఈ పరుగును మంత్రి పట్నం మహేందర్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్తో పాటు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 5కే రన్ లో పెద్ద సంఖ్యలో యువత పరుగు తీశారు. -
పోలీసుల అదుపులో 250 మంది బైక్ రేసర్లు
నెక్లెస్ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున బైక్ రేసింగ్లకు పాల్పడిన 250 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 250 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కావడంతో పోటాపోటీగా విపరీతమైన వేగంతో బైక్లు నడుపుతుండడంతో రామ్గోపాల్పేట, లేక్ పోలీసులు సంయుక్తంగా డ్రైవ్ నిర్వహించారు. సైఫాబాద్ ఏసీపీ సురేందర్, అడిషినల్ ఇన్స్పెక్టర్ జానయ్య, లేక్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, 50 మంది సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి... నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్, లేక్ పోలీస్ స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకూ ఈ కార్యక్రమం జరిగింది. అదుపులో తీసుకున్న 250 మందిలో 100 మంది మైనర్లు ఉన్నారు. వీరికి కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. -
మాజీ ప్రధాని పివికి ఘన నివాళి
-
మాజీ ప్రధాని పివికి ఘన నివాళి
హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు 11వ వర్ధంతి సంస్మరణ సభ బుధవారం నెక్లెస్ రోడ్డులోని పి.వి.జ్ఞానభూమిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు నాయిని నరసింహరెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతోపాటు పివి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పివి చిత్ర పటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దేశ ప్రధానిగా పివి అందించిన సేవలను వారు ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం పి.వి.జ్ఞానభూమిలో ప్రార్థనలు, భజనలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అందులోభాగంగా రక్తదాన శిబిరాన్ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం పివి నరసింహరావు ఛాయ చిత్రాలను ప్రదర్శించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
10కే రన్ను ప్రారంభించిన మిల్కాసింగ్
-
10కే రన్ను ప్రారంభించిన ఫ్లయింగ్ సిక్
-
10కే రన్ను ప్రారంభించిన ఫ్లయింగ్ సిక్
హైదరాబాద్: హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు పరిసరాలు ఆదివారం ఉదయం సినీ తారలు, ప్రముఖులతో కలర్ఫుల్గా మారాయి. 10కే రన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10కే రన్ను ఫ్లయింగ్ సిక్ మిల్కాసింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్జోన్ డీసీపీ కమలహాసన్ రెడ్డి, సినీ నిర్మాత డి.సురేష్బాబుతో పాటు పలువురు పాల్గొన్నారు. 10కే రన్తో పాటు 5కే , ఓపెన్ 10కే రన్లను కూడా నిర్వహించారు. ఈ రన్లో నగర వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
చార్మి@2కే వాక్
హైదరాబాద్ : వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం నెక్లెస్రోడ్డులో ఏర్పాటు చేసిన 2కె వాక్ను సినీనటి చార్మీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ జనాభాలో సగం మందికి మరుగుదొడ్లు లేకపోవడం దారుణమన్నారు. మరుగుదొడ్ల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కంట్రోలర్ పీసీ గుప్తాతో పాటు సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
ఘనంగా గాంధీ జయంతి
-
హుస్సేన్ సా‘డర్’!
సిటీబ్యూరో హుస్సేన్సాగర్ అందాలను వీక్షిస్తూ... ట్యాంక్బండ్పై కాసేపు అలా సరదాగా గడపాలనుకుంటున్నారా... బోటు షికారు సైతం చేయాలనుకుంటున్నారా...అయితే మీరు తప్పకుండా ఓ ఖర్చీఫ్ లేదా నాప్కిన్ టవల్ లేదా స్కార్ఫ్ను వెంట తీసుకెళ్లండి. లేదంటే ముక్కుపుటాలదిరే దుర్గంధానికి మీరు ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేక వెనుదిరుగుతారు. సాగర్ శుద్ధిని ప్రభుత్వం గాలికి వదిలేయడంతో చారిత్రక హుస్సేన్ సాగర్ మురికి కూపంగా మారింది. ప్రక్షాళన పేరిట కొంతమేర నీటిని బయటికి వదిలివేయడంతో ఇప్పుడు వ్యర్థాలు బయటకు తేలి తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నాయి. ముఖ్యంగా నెక్లెస్ రోడ్డు వైపు సాగర్ నీటిపై అక్కడక్కడా ‘ఆల్గే’ ఛాయలు కన్పిస్తున్నాయి. ఇది సాగర్ అంతటికీ విస్తరిస్తే ఇక ముక్కు మూసుకోకుండా అక్కడ సంచరించడం అసాధ్యమే. బోట్ షికారుకు వెళ్లి వచ్చిన పర్యాటకులు సాగర్ లోపల భరించరాని దుర్వాసన ఉందంటూ పెదవి విరుస్తున్నారు. బోట్ దిగగానే కొందరు వాంతులు చేసుకొన్న సంఘటనలూ ఉన్నాయి. నెక్లెస్ రోడ్లో పరిస్థితి మరీ దారుణం. పలు ప్రాంతాల నుంచి వచ్చే నాలాలు సాగర్లో కలిసే చోట పేరుకుపోయిన చెత్తాచెదారం వల్ల దుర్వాసన గుప్పుమంటోంది. దీంతో నెక్లెస్ రోడ్కు వెళ్లాలంటేనే నగర వాసులు హడలిపోతున్నారు. కూకట్పల్లి నాలా నుంచి సాగర్లో చేరుతున్న రసాయన వ్యర్ధాలను అడ్డుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి అని తెలుస్తోంది. ఏదిఏమైనా క్రమక్రమంగా హుస్సేన్సాగర్ పరిసరాల్లో ఆహ్లాదకర వాతావర ణం దూరమవుతోంది. దీనిపై అధికారులను వివరణ కోరితే సాగర్ తీరంలో అసలు దుర్వాసనే లేదంటూ కొట్టిపారేయడం గమనార్హం. -
యూత్.. హుషార్...
-
నెక్లెస్ రోడ్లో 5kవాక్!
-
పోలీసుల అదుపులో 75 మంది యువకులు
-
బైక్ రేసింగ్లు: పోలీసుల అదుపులో 75 మంది యువకులు
హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డులో నగర పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న 75 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. అలాగే బైక్లను కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సదరు యువకుల తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్కి పిలిపించారు. వారి సమక్షంలో యువకులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. సెలవు దినాలలో గండిపేట పరిసర ప్రాంతంలో గతంలో యువకులు బైక్ రేసింగ్లకు పాల్పడుతుండేవారు. దాంతో స్థానికులు ఫిర్యాదుతో గండిపేట తదితర ప్రాంతాలను పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువకులు బైక్ రేసింగ్ కోసం నెక్లెస్ రోడ్డును ఎంచుకున్నారు. అయితే ఈ రేసింగ్ల వల్ల ఉదయపు నడక కోసం నెక్లెస్ రోడ్డులో వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో పోలీసులు నెక్లెస్ రోడ్డులో తనిఖీలు నిర్వహించారు. ఇటీవలే పోలీసులు నెక్లెస్ రోడ్డులో తనిఖీలు నిర్వహించి... వందమందికి పైగా యువకులను అరెస్ట్ చేసి... బైక్లు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. -
నెక్లెస్ రోడ్డులో బైక్ రేసింగ్లు: పోలీసుల దాడి
-
నెక్లెస్ రోడ్డులో బైక్ రేసింగ్లు: పోలీసుల దాడి
హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్డులో బైక్ రేసింగులకు పాల్పడుతున్న యువతపై పోలీసులు ఆదివారం దాడులు చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో యువకులను పోలీసులు అదుపులోకి తీసున్నారు. అనంతరం వారిని గోపాలపురం పోలీసు స్టేషన్కు తరలించారు. అలాగే వారి వద్ద ఉన్న మొత్తం 300 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. యువకులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో యువకులు భారీ సంఖ్యలో నెక్లెస్ రోడ్డుకు చేరుకుని బైక్ రేసింగులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. బైక్ రేసింగులపై నెక్లెస్ రోడ్డులోని పాదచారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. -
హడావుడి ఫుల్.. అభివృద్ధి నిల్
సాక్షి ప్రతినిది, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్ పాలకవర్గం ఏర్పడి నేటికి ఏడాది పూర్తయింది. అయితే ఎక్కడా అభివృద్ధి పనులు జరిగిన దాఖలాలు కనిపించలేదు. కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. అయితే పాలకపక్షం అనుకున్న పనుల్లో ఒక్కటైతే సాధించగలిగారని... అది కమిషనర్ చక్రధర్బాబుని బదిలీ చేయించడమంటున్నారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అత్యధిక డివిజన్లను దక్కించుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీడీపీ దొడ్డిదారిన మేయర్, మరికొందరు కార్పొరేటర్లను లాక్కుని పీఠం మాదేనని చెప్పుకున్నారు. ఇదేమి అన్యాయం అని పలువురు ప్రశ్నిస్తే.. నగర అభివద్ధి కోసమే పార్టీ మారానని మేయర్ అజీజ్ సాకులు చెప్పుకొచ్చారు. అదేవిధంగా టీడీపీ నేతలు సైతం అదే చెప్పి అపవాదు నుంచి బయటపడేందుకు యత్నించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది.. అదేవిధంగా సీఎం చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన నారాయణ మున్సిపల్ మంత్రిగా ఉన్నారని.. ఈ దెబ్బతో నెల్లూరు రూపురేఖలు మారిపోతాయని అంతా భావించారు. ఇదే క్రమంలో అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ప్రకటనలతో హడావుడి చేస్తూ జనాన్ని మభ్యపెట్టారు. ఏదీ స్మార్ట్సిటీ..? భారత దేశంలోనే నెల్లూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు.. ఇటు రాష్ట్రమంత్రి నారాయణతో పాటు సాక్షాత్తు సీఎం చంద్రబాబే ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. అందులోభాగంగా నెల్లూరును ‘స్మార్ట్ సిటీ’ చేస్తామన్నారు. అదే విధంగా ‘నుడా’గా మారుస్తామన్నారు. ఇకపోతే దర్గామిట్టలోని స్వర్ణాల చెరువు చుట్టూ ‘నెక్లెస్ రోడ్డు’ను నిర్మిస్తామని ప్రకటనలు చేశారు. వీటిలో ఇప్పటివరకు ఏ ఒక్కటీ తెరపైకి రాలేదు. స్మార్ట్సిటీ లేదని తేలిపోయింది. నుడా ప్రతిపాదన కూడా అదేదారిలో దాటవేస్తారా?లేదా? అనేది తెలియాల్సి ఉంది. నెక్లెస్ రోడ్డు ప్రతిపాదనలకే పరిమితమైంది. అదేవిధంగా నగరంలో పారిశుధ్యం గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. స్వచ్ఛనెల్లూరును ప్రారంభించినా ఆ దిశగా పాలకవర్గం కృషిచేసిన దాఖలాలు లేవు. ఎక్కడ వేసిన చెత్త అక్కడే నిల్వ ఉంది. అదేవిధంగా మురికి కాలువల్లో పూడికతీతను పట్టించుకోలేదు. అరకొరగా తీసి.. పూర్తిస్థాయిలో పూడిక తీస్తున్నట్లు లెక్కలు చూపి నిధులు నొక్కేస్తున్నట్లు విమర్శలున్నాయి. నగరమంతా దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో దోమల ఉత్పత్తి పెరిగిపోయింది. వాటి నివారణకు ఫాగింగ్ చేయాల్సి ఉన్నా.. పాలకవర్గం పట్టించుకోలేదు. దీంతో సిటీ ఎమ్మెల్యే అనిల్కుమార్యాదవ్ సొంత నిధులతో నగరంలో పలుచోట్ల ఫాగింగ్ చేయిస్తున్నారు. అధికారపార్టీ నేతల్లో మాత్రం చలనలేకపోవటం గమనార్హం. పడకేసిన పాలన కార్పొరేషన్లో పాలన సైతం పడకేసింది. పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ప్రతి మూడునెలలకొకసారి కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సి ఉంది. తమ తప్పులను ప్రతిపక్ష పార్టీ నేతలు ఎక్కడ నిలదీస్తారోనని భయంతో కౌన్సిల్ సమావేశాలు పెట్టేందుకు భయపడుతున్నారు. ఇప్పటివరకు నాలుగు సమావేశాలు నిర్వహించాల్సి ఉంటే.. కేవలం రెండింటికే పరమితమయ్యారు. అదేవిధంగా కీలకమైన స్టాండింగ్ కమిటీ ఎన్నికైనా.. ఇప్పటివరకు ఎటువంటి సమావేశాలు నిర్వహించకపోవటం గమనార్హం. దీంతో నగర అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. ఇకనైనా నగర అభివృద్ధిపై దృష్టిసారించాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
నెక్లెస్ రోడ్డులో 'వాక్ ఇన్ ద డార్క్'
-
డాగ్స్ spot
ఆదివారం వస్తోందంటే వాటికి పండుగే. ఎంచక్కా టామీతో కులాసాగా షికార్లు కొట్టొచ్చని పప్పీ... జూలీతో జాలీగా ఎంజాయ్ చేయొచ్చని జాకీ.. తెగ ఆరాటపడుతుంటాయి. మనం ఆదివారం కోసం ఎదురు చూడటంలో అర్థం ఉంది. మరి స్కూలు, ఆఫీసు ఎరుగని శునకాలు కూడా ఆ రోజు కోసం ఎందుకంత ఆరాటంగా ఎదురుచూస్తున్నాయంటే మాత్రం.. దానికో కారణం ఉంది. ఎవ్రీ సండే వాటి యజమానులతో కలసి.. అందంగా ముస్తాబై నెక్లెస్రోడ్లోని జలవిహార్కు ఎదురుగా ఉన్న చిన్నపార్క్కు వచ్చేస్తాయి. ఇవే కాదు నగరం నలుమూలల నుంచి ఎన్నో శునకాలు ఈ ‘డాగ్స్ స్పాట్’కు చేరుకుంటాయి. ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు తోటి కుక్కలతో ఆటలాడుకుంటాయి... సరదాగా పోట్లాడుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మస్తీ మజా చేసేస్తాయి. ..:: వాంకె శ్రీనివాస్ గాంధీనగర్కు చెందిన సన్నీ ఓ రోజు తన డ్యూక్ (కుక్క)ను పట్టుకుని నెక్లెస్రోడ్ మీదుగా వెళ్తున్నాడు. అదే టైంలో ఓ పెద్దాయన రాందాస్తో సన్నీకి పరిచయమైంది. వీరిద్దరూ ఇక్కడ ముచ్చట ్లలో ఉండగానే.. రాందాస్ చేతిలో ఉన్న మరో కుక్క (బాండ్), డ్యూక్తో సరదాగా ఆటలాడుకుంది. ఈ సీన్ ఇద్దరిలో కొత్త ఆలోచనకు నాంది పలికింది.ప్రతి ఆదివారం నెక్లెస్రోడ్కు కుక్కలను జాగింగ్కు తీసుకురావాలని అందులో కోరారు. మీ పెట్స్కు ఇంతకన్నా మంచి వీకెండ్ గిఫ్ట్ మరొకటి మీరివ్వలేరని ప్రచారం చేశారు. ప్రతివారం కుక్కలు కలుస్తుండటం వల్ల వాటి ప్రవర్తనలో మార్పు కూడా వస్తుందని అప్పీల్ చేశారు. పోటీగా ఆటలు.. సన్నీ అండ్ రాందాస్ ఆలోచన సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మొదట రెండు కుక్కలతో మొదలైన సండే సందడి.. ఇప్పుడు 70 శునకాలకు చేరుకుంది. సిటీ శివారు ప్రాంతాల నుంచి కూడా పెట్ లవర్స్ తమ శునకాలను తీసుకుని నెక్లెస్ రోడ్కు చేరుకుంటున్నారు. దీంతో ప్రతి ఆదివారం లాబ్రీడర్, జర్మన్ షెఫర్డ్, బిగిల్, పగ్, రాడ్విల్లర్.. ఇలా వివిధ జాతుల కుక్కలు నెక్లెస్ రోడ్లో ఆడిపాడేసుకుంటున్నాయి. తోటి శునకాలతో కలసి పోటీ పడిమరీ పరిగెత్తుతున్నాయి. మూడు గంటల పాటు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాయి. ఫ్యామిలీ అనుబంధం... ఇక్కడికి వచ్చిన శునకాలే కాదు.. వాటిని తమ వెంట తీసుకుని వచ్చిన యజమానులకూ కొత్త పరిచయాలు సరికొత్త ఆనందాన్ని పంచుతున్నాయి. మొదటి వారం ముఖ పరిచయంతో వెనుదిరుగుతున్న పెట్ లవర్స్.. రెండు, మూడు వారాలు అయిపోయే సరికి మంచి మిత్రులుగా మారుతున్నారు. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లి పలకరించుకునే స్థాయికి చేరుకుంటోంది వీరి స్నేహం. అంతేకాదు, అలా వాళ్ల ఇంటికి వెళ్లేటప్పుడు తమ కుక్కను కూడా వెంటబెట్టుకుని మరీ వెళ్తున్నారు. ఇక ఎవ్రీ సండే కుక్కలు చేసే విన్యాసాలతో రిలీఫ్ అవుతున్నారు వాటి ఓనర్లు. ‘కుక్కలు లేనివారు కూడా ఎందరో ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ అవి చేస్తున్న ఫీట్లు చూసి.. వారూ కుక్కలను పెంచుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మరికొందరు మేలుజాతి కుక్కల సమాచారం తెలుసుకుంటున్నార’ని చెబుతున్నారు సన్నీ. మొత్తానికి సిటీలో కొత్తగా మొదలైన డాగ్ స్పాట్ శునకాలకే కాదు, వాటి యజమానులకు కూడా సరికొత్త జాలీ స్పాట్గా మారిపోయింది. -
నెక్లస్ రోడ్లో పింక్ధాన్ పేరుతో 10కె రన్
-
సబల
మగువంటే పువ్వులా సున్నితమే కాదు... అవసరమైతే రాళ్లను పిండి చేసేంత సబలగానూ అవతారమెత్తగలదు ! నెక్లెస్రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఆదివారం నిర్వహించిన మహిళా దినోత్సవంలో బాలిక కరాటే విన్యాసం ఇది. ‘నా రక్షణ.. నా బాధ్యత’పై విమెన్ ఆఫీసర్స్ గ్రూప్1 తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10కె సైక్లింగ్, 5కె, 3కె రన్ నిర్వహించారు. అడిషనల్ సీపీ (క్రైమ్) స్వాతి లక్రా, జాతీయ పోలీస్ అకాడమీ డెరైక్టర్ అరుణాబహుగుణతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యాలయాలు, ఇళ్లు, రోడ్లపై మహిళలకు ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో చెబుతూ పోలీస్ అకాడమీ ట్రైనీ ఐపీఎస్లు ప్రదర్శించిన స్ట్రీట్ ప్లే ఆకట్టుకుంది. పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమైన రన్... జలవిహార్ మీదుగా తిరిగి పీపుల్స్ ప్లాజాకు చేరుకుంది. ఖైరతాబాద్ -
ఆకట్టుకుంటున్న చిరుధాన్యాల ప్రదర్శన
-
అభిమానుల క్రికెట్ సంబరాలు
-
నెక్లెస్రోడ్డులో వెంకటస్వామి స్మారకం
హెచ్ఎండీఏను ఆదేశించిన సీఎం కేసీఆర్తో మాజీ ఎంపీ వివేక్ భేటీ సాక్షి,హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామిని భావితరాలు స్మరించుకునేలా రాజధానిలో స్మారక నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఆయన దేశానికి సేవచేసిన దళిత నాయకుడిగా, పేదల కోసం జీవించిన ఉన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారని సీఎం అన్నారు. ఆయన గౌరవాన్ని పెంచే విధంగా స్మారకాన్ని నిర్మిస్తామని చెప్పారు. బుధవారం సచివాలయంలో వెంకటస్వామి కుమారుడు, మాజీ ఎంపీ జి.వివేక్ కలిసిన సందర్భంగా ఈ అంశంపై అధికారులతో సీఎం మాట్లాడారు. నెక్లెస్రోడ్డులో స్థలం సేకరించాలని, సభలు నిర్వహించుకోడానికి వీలుగా నిర్మాణం ఉండాలని, అందులో వెంకటస్వామి విగ్రహం కూడా ఉండాలని సీఎం ఆదేశించారు. నిర్మాణ బాధ్యతలను హెచ్ఎండీఏకు అప్పగించారు. వచ్చే జయంతిని ఇందులోనే నిర్వహించేలా త్వరగా నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. తెలంగాణలో భాగ్యరెడ్డి వర్మ కూడా దళితుల కోసం ఎంతో పాటుపడ్డారని, ఆయన చరిత్ర కూడా అందుబాటులో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంకటస్వామి విషయంలో అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. టీఆర్ఎస్లో చేరిక ఊహాగానాలే: వివేక్ టీఆర్ఎస్లో చేరి వరంగల్ ఎంపీ సీటుకు జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం ఊహాగానాలేనని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. ఒకవేళ ఆ ప్రతిపాదన వస్తే టీఆర్ఎస్లో చేరతారా అన్న ప్రశ్నకు బదులివ్వకుండా ముందుకుసాగారు. -
మనసుదోచె..
రెండో రోజు ఆకట్టుకున్న ‘హార్టీ’ షో నగరంలోని నెక్లెస్ రోడ్డులోగల పీపుల్స్ ప్లాజాలో కొనసాగుతోన్న తెలంగాణ తొలి ‘ఉద్యాన ప్రదర్శన-2015’ రెండో రోజైన మంగళవారం సందర్శకులతో కిటకిటలాడింది. ప్రదర్శనలోని కూరగాయలు, పండ్లు, పూల స్టాళ్లను పరిశీలించారు. తమ ఫ్లాట్లల్లో మొక్కలను పెంచుకునే విధానంపై నగర వాసులు మక్కువ చూపారు. డెలియా, గ్లాడిబ్లెస్, కోరియంటల్ లివీ, గ్రాఫీకలి కొనియాలుతో వివిధ పూల మొక్కల కొనుగోలు చేసేందుకు క్యూ కట్టారు. ఆర్టిఫిషియల్ ప్లాంటింగ్ ఫ్లవర్స్ కూడా సందర్శకులను ఆకర్షించాయి. థాయిలాండ్ ఫ్లవర్స్, వాటర్ పెబెల్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు ఎక్కువగా వర్టికల్ గార్డెన్ సాగు విధానాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆడినియమ్స్, టబ్ క ల్టివేషన్, హెల్త్ఫుడ్-హెల్త్ హైదరాబాద్ పేరిట స్టాల్స్లో ఉంచిన కొత్తిమీర, పాల ఆకు, టమోటా-చుక్కాకు, చిక్కుడు, కాకర, కరివేపాకు సాగు విధానంపై ఆరా తీశారు. - సాక్షి, సిటీబ్యూరో -
రెండో రోజు ఆకట్టుక్ను‘హార్టీ’ షో
-
‘హార్టీ’ షో అదుర్స్
అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ తొలి ఉద్యాన ప్రదర్శన నెక్లెస్రోడ్డులో వెల్లివిరిసిన పచ్చదనం అడుగడుగునా ‘తెలంగాణ’ ప్రత్యేకతలు తొలిరోజు జనం కిటకిట సందర్శన వేళలు... ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. ఎప్పటి వరకు: ఈ నెల 30వ తేదీ వరకు. ప్రవేశం: ఉచితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ఉద్యాన ప్రదర్శన- 2015 (హార్టికల్చర్ షో) సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా ఇందుకు వేదికైంది. ప్రాంగణ ప్రధాన ద్వారాన్ని కాకతీయ తోరణంగా అద్భుతంగా తీర్చిదిద్దారు. అలనాటి తీపిగుర్తులు గొలుసుకట్టు చెరువులు, కల్చర్, వ్యవసాయం వంటి ప్రధాన అంశాలను నేటి తరానికి గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం, హార్టికల్చర్, చెరువుల అభివృద్ధికి చేపడుతున్న పథకాలకు అనుగుణంగా ఉద్యాన ప్రదర్శనను అద్యంతం తీర్చిదిద్దారు. మిషన్ కాకతీయను అందిరికి తెలిసేలా చేసి సక్సెస్ అయ్యారు. తొలిరోజే ప్రదర్శన ప్రాంగణం జన జాతరను తలపించింది. హరిత తెలంగాణను చాటేలా ప్రదర్శనలో ఉంచిన బిందు, తుంపర సేద్యం పరికరాలు చూపరులను కట్టిపడేశాయి. వందలాది రకాల కూరగాయలు, పండ్లు, మొక్కలు, తీగ మొక్కలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. ప్రదర్శనలో 100 స్టాల్స్, చుట్టూ 60 నర్సరీల స్టాల్స్, డిపార్ట్మెంట్స్ స్టాల్స్తో కలిపి మొత్తం 160 స్టాల్లలో గ్రీన్ హౌస్, థీమ్ పెవిలియన్లు ఏర్పాటు చేశారు. రోజుకు సుమారు లక్షమంది సందర్శించే వీలుంది. ఉద్యాన రంగానికి సంబంధించిన కొత్త పోకడలపై సెమినార్లు, వర్క్షాప్లు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ను అందమైన గార్డెన్ సిటీగా రూపొందించడానికి ఈ ప్రదర్శనతో పాటుగా ఒక గార్డెన్ ఫెస్టివల్ కూడా ఉద్యాన శాఖ నిర్వహించటం విశేషం. - ఏం ఉన్నాయి... పసుపు రంగు కర్బుజా ప్రదర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్టాల్స్లో ఉంచినవి నిమిషాల్లో పోటీపడి జనాలు కొనుగోలు చేశారు. సోలార్ సిస్టమ్స్, పసుపు కొమ్ములు ఉడికించే కడాయిలు, క్లాసిక్ నర్సరీ, రీసైక్లింగ్ వస్తువుల్లో మొక్కల పెంపకం, వివిధ దేశాలకు చెందిన బోస్సాయ్, శాశ్వత పందిరి నిర్మాణంతో కూరగాయల సాగు. బెంగుళూరు క్యాప్సికమ్స్, గ్రీన్వాల్ పద్ధతి, టేబుల్ ఫవర్స్, ఖమ్మం జిల్లా హార్టికల్చర్ ఏడీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఉంచిన స్టాల్స్లో ఆయిల్పామ్ గెల, పెద్ద రాచ గుమ్మడి కాయలు, 8 రకాల విత్తగొలిపే కోకోనట్స్(టెంకాయలు), ఎన్ఐడీ ఆధ్వర్యంలో వివిధ రకాల తేనె బాటిల్స్, వివిధ రకాల విత్తనాల పాకెట్స్ తదితరాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఖమ్మం, నల్లగొండ జిల్లాలకే ప్రత్యేకం... ఆయిల్ఫామ్ గెలలు. ఇవి ఖమ్మం, నల్గొండ జిల్లాలకే ప్రత్యేకం. ఖమ్మంలో 13 వేల హెక్టార్లలో సాగు చేశారు. ఇవి 40 సంవత్సరాల వరకు పంట దిగుబడిని ఇస్తాయి. ఇది మంచి లాభదాయక పంట అని ఖమ్మం జిల్లా ఉద్యాన శాఖ ఏడీ సూర్యనారాయణ తెలిపారు. అలాగే రాచ గుమ్మడి కాయలు మంచి అదాయాన్ని ఇస్తాయని చెప్పారు. ఇవి నగరంలోని ఉన్నవారు కూడా పెంచుకోవచ్చన్నారు. ప్రతి ఏడాది మొక్కలు కొంటాం ప్రతి ఏడాది హార్టికల్చర్ షోకు వస్తాం. మొక్కలు, పూల చెట్లు కొంటాను. ఎక్కడ దొరకని రకాలు ఇందులో ఉంచుతారు. మధ్యతరగతి ప్రజలకు కూడా ఈ ప్రదర్శన బాగా ఉపకరిస్తుంది. అయితే గతంలో కన్నా ఈసారి రేట్లు కొంచెం ఎక్కువ అని పిస్తోంది. ప్రభుత్వం ఇలాంటివి మరిన్ని నిర్వహించాలి. - శశికళ, టీచర్ అవగాహన కోసం వస్తా... ప్రభుత్వం నిర్వహించే ఉద్యాన ప్రదర్శనకు ప్రతి సంవత్సరం వస్తా. కొత్త కొత్త రకాల పరికరాలు, చాలా రకాల కూరగాయల విత్తనాలు గురించి తెలుస్తాయి. ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇక్కడ నిర్వహించే సెమినార్స్ ఉపయోగకరంగా ఉంటాయి. పది ఏకరాల భూమిలో ఇక్కడి నుంచి తీసుకెళ్లే బీర, టమోటా విత్తనాలు వేస్తూ ఉంటాను. - ఎరువ భూపతి రెడ్డి, రైతు, తొగుట మండలం, మెదక్ జిల్లా పూలతో అమరవీరుల స్థూపం తెలంగాణ అమరవీరుల స్థూపం నమూనాను అందమైన రంగురంగుల పూలతో అద్భుతంగా రూపొందించారు. దాని పక్కనే తెలుగుతల్లి విగ్రహం, జమ్మి చెట్టు, పాలపిట్ట, తంగేడు పూల చెట్లు ఉంచారు. ఇవి చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. -
నింగీ.. నేలా ఒక్కటై
రంగు రంగుల పతంగులు ఆకాశంలో హరివిల్లునల్లాయి... మేఘాలను తాకుతున్నట్టుగా తమ సొగసైన నాట్యంతో చూపరులను కట్టిపడేశాయి.... సంక్రాంతి పర్వదినం సందర్భంగా నెక్లెస్రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో పతంగుల పండుగ వైభవంగా ప్రారంభమైంది. కార్యక్రమాన్ని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, గ్రేటర్ బీజేపీ అధ్యక్షుడు వెంక ట్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్రెడ్డి, ప్రేమ్సింగ్రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట జరిగిన పతంగుల పండుగలో విదేశీ విద్యార్థులు పాల్గొని ఆనందించారు. -ఖైరతాబాద్ -
భాగ్యనగరిలో ‘న్యూ’జోష్..
-
చల్ల గాలి.. వెచ్చటి చెలి కౌగిలి!
-
మంచి ‘రోజ్’లెప్పుడో!
ప్రారంభం కాని రోజ్గార్డెన్ సిటీబ్యూరో: హుస్సేన్సాగర్ తీరాన అందమైన ‘రోజా పూల’ లోకాన్ని సృష్టించింది మహా నగరాభివృద్ధి సంస్థ. అయితే.. ఆ సుందర ప్రపంచాన్ని వీక్షించే అవకాశం జనానికి దొరకడం లేదు. నెక్లెస్ రోడ్లోని దామోదర సంజీవయ్య పార్కులో 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.2.5 కోట్ల వ్యయంతో హెచ్ఎండీఏ గులాబీ నందన వనాన్ని (రోజ్ గార్డెన్) అద్భుతంగా తీర్చిదిద్దింది. వివిధ రంగుల్లో 612 రకాల ‘రోజా’లకు ఇక్కడ చోటు కల్పించారు. దేశవాళీ, హైబ్రీడ్లో దాదాపు అన్ని రకాల గులాబీలు ఈ గార్డెన్లో కొలువుదీరాయి. ప్రధానంగా హైబ్రీడ్ టీన్, ఫ్లోరిబండాస్, రాంబ్లర్స్, క్రిపర్స్, స్క్రాబ్రోజ్స్, మినేజర్స్, గ్రౌండ్ కవర్ రోజెస్, మినీ ఫ్లోరిబండాస్ రకాలుకనువిందు చేస్తున్నాయి. సుమారు 12వేల మొక్కలతో అలరారుతోన్న రోజ్గార్డెన్లో ఇంజినీరింగ్ అధికారులు అందమైన ల్యాండ్ స్కేప్ను తీర్చిదిద్దడం అదనపు హంగుగా మారింది. దీని నిర్మాణం పూర్తయి 6 నెలలు గడుస్తున్నా అధికారికంగా ప్రారంభించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సాయంత్ర వేళల్లో సేదదీరేందుకు సంజీవ య్య పార్కుకు వచ్చే సందర్శకులు రోజ్ గార్డెన్ ఎంట్రీ ప్లాజా వరకు వెళ్లి... లోనికి అనుమతించకపోవడంతో ఉస్సూరుమంటూ వెనుదిరుగుతున్నారు. ప్రశంసలు... రాజధాని నగరంలో అద్భుతమైన రోజ్గార్డెన్ను ఆవిష్కరించిందన్న కీర్తిని హెచ్ఎండీఏ దక్కించుకొంది. ‘ఇంటర్నేషనల్ రోజ్ గార్డెన్ సొసైటీ’ ప్రతినిధులు ఇటీవల ఈ గార్డెన్ను సందర్శించి హెచ్ఎండీఏపై ప్రశంసల జల్లు కురిపించారు. భారతదేశంలోనే ఇదో ‘బెస్ట్ గార్డెన్’గా ప్రత్యేక గుర్తింపునిచ్చారు. ల్యాండ్ స్కేప్ పార్కుకు అదనపు హంగును అద్దిందని కొనియాడారు. ఈ గార్డెన్లో అందమైన గులాబీలతో పాటు వాటర్ ఫాల్స్, ఫౌంటెన్లు, శిల్పాలు, వాక్ వేలు వంటివి మరింత శోభను తీసుకొస్తున్నాయి. ప్రారంభానికి సిద్ధం ‘రోజ్ గార్డెన్ ప్రాంభించేందుకు అన్ని ఏర్పాటు చేశాం. మొక్కదశలో పూలు రానందున ఎలా ప్రారంభించాలన్న మీమాంస తలెత్తింది. దీంతో ప్రారంభోత్సవాన్ని కొద్దికాలం వాయిదా వేశాం. ఇప్పుడు మొక్కలు ఏపుగా పెరిగి పూర్తిస్థాయిలో పూలు ఉన్నాయి.త్వరలో ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నాం. అధికారికంగా ప్రారంభించాకే సందర్శకులను అనుమతిస్తాం. - వి.కృష్ణ, బుద్ధపూర్ణిమ ఓఎస్డీ భవితవ్యం ఏమిటి? ఆకాశహర్మ్యాలతో హుస్సేన్సాగర్ ప్రాంతాన్ని అంతర్జాతీయ నగరాలకు ధీటుగా తీర్చిదిద్దే ప్రాజెక్టుకు అందరి నుంచీ ప్రశంసలు అందుతున్నాయి. నెక్లెస్ రోడ్లోని సంజీవయ్య పార్కులో గల 96 ఎకరాల విస్తీర్ణంలోనూ అద్భుతమైన నిర్మాణాలకు అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే... ఇప్పటికే రూ.2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన రోజ్గార్డెన్ (గులాబీ తోట) భవితవ్యం ఏమిటన్నది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. నిర్మాణం పూర్తయి 6నెలలు గడిచినా ఇంతవరకు అధికారికంగా ప్రారంభించకపోవడం సందేహాలకు తావిస్తోంది. -
బైక్ రేసర్ల దూకుడుకు పోలీసుల బ్రేక్!
-
నెక్లెస్ రోడ్డులో తనిఖీలు... బైకులు సీజ్
హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్డులో నగర పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 60 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ బైక్లను పోలీసు స్టేషన్కు తరలించారు. నెక్లెస్ రోడ్డులో బైక్ రేసింగ్ చేస్తూ తమకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని మార్నింగ్ వాకర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అదికాక ఆదివారం సెలవు దినం కావడంతో బైక్ రేసింగ్ చేసేందుకు పెద్ద సంఖ్యలో యువకులు ఈ రోజు తెల్లవారుజామునే నెక్లెస్ రోడ్డు చేరుకున్నారు. గతంలో నగర శివార్లులోని గండిపేటలో యువకులు భారీ ఎత్తున బైకు రేసింగ్లు నిర్వహించేవారు. దీంతో స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తమ తనిఖీలను ముమ్మురం చేశారు. దాంతో బైక్ రేసింగ్లకు యువకులు నెక్లెస్ రోడ్డును ఎంచుకున్నారు. -
హైదరాబాద్ 10k రన్
-
‘ట్రావెల్ మార్ట్’ అదుర్స్
-
నెక్లెస్ రోడ్లో 10కె రన్ ప్రారంభం
-
నెక్లెస్ రోడ్డులో 10 కే రన్ ప్రారంభం
హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్డులోని పీపుల్ ప్లాజాలో 10కే రన్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఈ రన్ను భారత మాజీ అథ్లెట్ల మిల్కా సింగ్ ప్రారంభించారు. ఈ రన్లో వేలాది మంది యువతియువకులు పాల్గొన్నారు. నగరంలో 12వ సారి 10 కే రన్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ టెన్కే రన్ ఫౌండేషన్ వెల్లడించింది. 10 కే రన్ విజేతలకు రూ. 30 లక్షల ప్రైజ్ మనీ అందజేస్తామని తెలిపింది. 10 కే రన్ నేపథ్యంలో నెక్లెస్ రోడ్డులో పోలీసులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ రోడ్డులో ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ అంక్షలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. -
జెంటిల్మెన్స్ WIT... లేడీస్ ఫేవRIGHT హైదరాబాద్!
కేవలం కబుర్లు చెప్పి, మసిపూసి మారేడుకాయ చేసి భార్యను ఆకట్టుకోవడం హైదరాబాద్లోనే సాధ్యం. అలా మహిళలను ఆకట్టుకునేందుకు అనువైన నగరం హైదరాబాద్.మీరిప్పటికిప్పుడు మీ భార్యకు మెళ్లో గొలుసు కొనిపెట్టలేరు. కానీ ఉపాయాన్ని కనిపెట్టి, అపాయాన్ని కప్పెట్టగలరు. ఎలా..? అలా ఆమెను అలా షికారుకు తీసుకెళ్తారు. ఎక్కడికీ...? ‘‘వచ్చే ఏడాది ఈ పాటికి నేను చేయించాలనుకుంటున్న చోటికి నిన్ను ఇవాళ్ల కాస్త షికారు తిప్పుతాను. కానీ ప్రస్తుతానికి మాత్రం జస్ట్ తీసుకెళ్లగలనంతే. ఆ ఆభరణం తాలూకు రోడ్డే మన నెక్లెస్ రోడ్డు’’ అంటారు గడుసుగా. ఇలా మహిళల కోసం రోడ్డు పేరు పెట్టిన నగరం ఏదైనా ఉందా? ఒకవేళ అచ్చతెనుగులో ఏ కాసుల పేరు రోడ్డనో, ఏ వడ్డాణాల వీధనో పెడితే కాస్త ఎబ్బెట్టుగానైనా ఉండవచ్చు. కానీ నెక్లెస్ రోడ్డు అనే మాటలో ఏ ఎబ్బెట్టు లేదని బెట్ చేయవచ్చు. అప్పుటికీ ఆమె బెట్టు తగ్గించుకోకుండా ఇప్పటికి మరి బంగారం ఏమీ లేదా? అంటే... మీ బడ్జెట్కు తగ్గట్టు... ‘‘అలాగైతే ఈ సారికి ఔటర్ ‘రింగ్’రోడ్డులో ఉన్న రింగుతో సరిపెట్టుకోలేవా?’’ అంటూ మరో ల్యాండ్మార్కు పేరు చెప్పి సముదాయిస్తే చాలు... సరిపెట్టుకోగల సాధ్వీమణులు ఉండరంటారా? ఒక్క ‘నెక్లెస్’ రోడ్డూ, ఔటర్ ‘రింగు’ రోడ్డూ... అన్న మాటేముంది?... అటు ఇటుగా దాదాపూ అన్ని రోడ్ల పరిస్థితీ అంటే...! ‘మోతీ’నగర్కు తీసుకెళ్లి... ‘‘అరెరె పేరును బట్టి ముత్యాలు దొరుకుతాయేమోనని తీసుకొచ్చా. కానీ ఇక్కడ కాదట. పెరల్స్ మార్కెట్ పంజాగుట్ట అట’’ అంటూ నాలుక కరచుకోవచ్చు. లేదా ‘‘బంగారం ఇప్పించాల్సిందే’’ అంటూ పట్టుబట్టిన లలనామణిని... ‘‘ఇక తప్పుతుందా పద.. నిన్ను వెంటనే తీసుకెళ్తా ‘కంచన్’బాగ్’’ అంటూ గబగబా రెక్కపట్టుకుని లాక్కెళ్లాలి. తీరా తీసుకెళ్లాక ‘‘అరె... కంచన్బాగ్ అంటే బంగారపు ఉద్యానవనాలు కాదా? మరి ఇక్కడ దొరకదా బంగారం?’’ అంటూ ఆశ్చర్యం అతిగా నటించవచ్చు. అలా అన్నీ అతివలకు అతిఇష్టమైన రోడ్ల పేర్లే ఇక్కడ. ‘‘గాజులు కొనుక్కుంటా... కాస్త రేపు లాడ్ బజార్కు వెళ్దామా’’ అంటూ భార్య గోముగా అడిగిందనుకోండి. గడుసు మగమారాజులకు అది ఇష్టం లేదనుకోండి. ‘‘గాజుల కోసం వెళ్లాలంటే గాజుల రామారం వెళ్తే సరి. అనవసరంగా లాడ్బజార్కు ఎందుకు? లాడ్ బజార్ అంటే... రేపు గారాబం చేయాలనుకున్నప్పుడు నిన్న తీసుకెళ్లాల్సిన మార్కెట్కదా’’ అంటూ గాజులు సవరిస్తూ చెప్తే సరి. ఆ చమత్కారానికి మగువ లొంగిపోయిందా... ఆ పూటకు కరుసు వాయిదా. పరుసు కాయిదా. మగ చమత్కారాలు పసిగట్టి వాళ్లకు బుద్ధి చెప్పడానికి... ‘‘పదండి అలా మల్లేపల్లి వరకు వెళ్లి మల్లెపూలు కొనుక్కొద్దాం’’ అంటూ ఆమె అందనుకోండి. అవ్వాళ అదేంటీ... మన వీధి మలుపు చివర్లో చిన్న బల్ల చెక్క దగ్గరే కదా మల్లెపూలు దొరికేది’’ అంటూ అప్పుడు మీరు పరాకు నటించడానికి వీల్లేదు. మల్లెపూలు కొనకపోయినా మల్లేపల్లి వెళ్లాల్సిందే. లేదంటే రేపు బోరుకొడుతోంది. తగ్గడానికి బోరబండ తీసుకెళ్లమని ఆమె మళ్లీ బలవంతం చేయవచ్చు. ఇంతటి చమత్కారపూరిత మైన వీధులూ, రోడ్ల పేర్లు హైదరాబాద్కు ఎందుకు వచ్చాయి? ఎందుకు వచ్చాయంటే ఏం చెబుతాం. నవాబుగారి కొడుకు యువరాజా వారు ‘భాగ్మతి’ అనే అమ్మాయిని ప్రేమించినందుకు... ఆమె పేరిట ఈ ‘భాగ్య’నగరాన్ని నిర్మించాట్ట. ఇక ఆమెకు ‘హైదర్’మహల్ అని పేరు పెట్టి ఈ మహానగరానికంతా ఆమె పేరే ఉండేలా చూశాట్ట. ఇలా తాను వలచిన మగువకు నగరం పేరు పెట్టి ఆనందించి, ఆమెనూ ఆనందింపజేశాట్ట. మహానగర ఆవిర్భావం, నామకరణంలోనే ఈ ‘జీన్స్’ ఉంటే ఇక రోడ్లూ, వీధుల పేర్లకు పెట్టే పేర్లిలా ఉండక వేరేలా ఉండే అవకాశం ఉందా? ఇప్పిస్తామంటూ తప్పించుకు తిరగడానికి మగపురుషులకు తగినంత అవకాశముండుగాక. అందుకే... సరసులైన పాలకులతో పాటు... గడుసువారైన భర్తలూ... సాధ్వీమణులున్న నగరం ఇలా మహిళలకు ఇష్టమైన పేర్లతో వర్ధిల్లుగాక. - యాసీన్ -
భువి నిండుగ...విరి పండుగ
బతుకమ్మ సంబరాలకు సన్నాహాలు ముస్తాబవుతున్న పూల గోపురాలు జిల్లాల వైభవాన్ని చాటే శకటాలు సిద్ధం పది వేల బతుకమ్మల తయారీ కూకట్పల్లిలో కొలువుదీరనున్న 17 అడుగుల బతుకమ్మ భాగ్యనగరి పూలతో సింగారించుకుంటోంది. వీధులన్నీ విరి తోటలవుతున్నాయి. వాడలన్నీ వర్ణరంజితమవుతున్నాయి. ఇళ్ల ముందర బతుకమ్మలు కొలువుదీరుతున్నాయి. బతుకమ్మ ఒడిలో ఒదిగిపోవాలని పూలు పోటీ పడుతున్నాయి. ఆబాలగోపాలం ఆటపాటలలో మునిగి తేలుతున్నారు. తెలంగాణ వైభవానికి దర్పణం పట్టేలా ఈ వేడుక లు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సాక్షి, సిటీబ్యూరో/కూకట్పల్లి: పూల పండుగకు మహానగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తెలంగాణ బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. తంగేడు, చామంతి, తీరొక్క రంగుల్లో ముంచి పేర్చిన గడ్డిపూలు, మందారాలు, బంతిపూలతో తీర్చిదిద్దే పూల గోపురాలు తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక సౌరభాలను గుభాళించనున్నాయి. బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్డు, ఎల్బీ స్టేడియం ప్రాంతాలను అందమైన విద్యుద్దీపాలతో అలంకరించారు. మరికొద్ది గంటల్లో వేలాది బతుకమ్మలతో, లక్షలాది మంది మహిళలతో భాగ్యనగరంలో మహాద్భుతమైన పూల జాతర ఆవిష్కృతం కానుంది. మరోవైపు రాష్ర్టంలోని పది జిల్లాల వైభవాన్ని చాటిచెప్పే శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సద్దుల బతుకమ్మ సంబురాలను కన్నుల పండువగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వ సన్నద్ధమవుతోంది. 10 వేల పూల గోపురాలు బతుకమ్మ వేడుకలకు ఎల్బీ స్టేడియం, ఎగ్జిబిషన్ గ్రౌండ్, ట్యాంక్బండ్ ప్రాంతాలను అందంగా అలంకరించారు. ట్యాంక్బండ్ పైన స్వాగత వేదికలను తీర్చిదిద్దారు. కొన్ని చోట్ల ఉప వేదికలను ఏర్పాటు చేశారు. ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున బతుకమ్మలను తయారు చేస్తున్నారు. ఇందుకోసం వేలాది మందిని నియమించారు. ఇప్పటికే వేలాది బతుకమ్మల తయారీ పూర్తయింది. 10 వేల బతుకమ్మలను వేడుకల కోసం సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవయ్య, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రాజీవ్ సాగర్లు ఎల్బీ స్టేడియంలో బతుకమ్మల తయారీని పర్యవేక్షిస్తున్నారు. బతుకమ్మలకు కావలసిన తంగేడు, గునుగు పూలను శుద్ధి చేసి పేరుస్తున్నారు. మరోవైపు కడియం, బెంగుళూరు నుంచి 35 వేల టన్నుల బంతిపూలను తెప్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా కానుగూరు నుంచి వచ్చిన ఐ.నాగరాజు బృందం, నగరానికి చెందిన అనిత బృందాలు బతుకమ్మల తయారీలో నిమగ్నమయ్యాయి. పండుగ సందర్భంగా హుస్సేన్ సాగర్లో అరగంట పాటు లేజర్షోను ఏర్పాటు చేయనున్నారు. శకటాలు సిద్ధం మరోవైపు వివిధ జిల్లాల చరిత్ర, సంస్కృతులను చాటే శకటాలను ఎగ్జిషన్ గ్రౌండ్లో సిద్ధం చేశారు. ఆ ప్రాంతాల విశిష్టతను తెలిపే ఆకర్షణీయమైన చిత్రాలు, నినాదాలతో శకటాలను రూపొందించారు. బుధవారం సాయంత్రం రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి బీపీ ఆచార్య, సమాచార కమిషనర్ చంద్రవదన్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్. కవితాప్రసాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ను సందర్శించి, శకటాల తయారీని పరిశీలించారు. ముంబైకి చెందిన విజ్క్రాఫ్ట్ ప్రతినిధులు శకటాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు.‘ఒక్కొక్క శకటంతో పాటు సుమారు 40 మంది కళాకారుల చొప్పున మొత్తం 2 వేల మంది ప్రదర్శనలిస్తారని’ కవితాప్రసాద్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో 25 వేల మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇన్చార్జ్ జేసీ సంజీవయ్య తెలిపారు. కూకట్పల్లిలో 17 అడుగుల బతుకమ్మ ఏటా బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహిస్తోన్న కూకట్పల్లిలో ఈ ఏడాది కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి పూలు తెప్పిస్తున్నారు. నిజమాబాద్, మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట, నర్సాపూర్ తదితర ప్రాంతాల నుంచి పూలను తరలిస్తున్నారు. ఆడపిల్ల పుట్టడం శుభసూచకంగా భావించే సత్సంప్రదాయానికి బతుకమ్మ వేడుక ప్రతీక. ఆ సంప్రదాయాన్ని గత 17 ఏళ్లుగా పాటిస్తూ, తమ ఇంట్లో పుట్టిన ఆడపిల్లలకు ప్రతీకగా వేడుకలు నిర్వహిస్తోన్న గుండాల చ ంద్రమ్మ కుటుంబం ఈసారి 17 అడుగుల బతుకమ్మను తయారు చేస్తోంది. ‘తమకు ఐదుగురు కుమారులని...అమ్మాయిలు లేరనే బెంగ ఉండేదని.. తమ కొడుక్కి కూతురు పుట్టిన సంతోషంతో బతుకమ్మను అంచెలంచెలుగా పెంచుతున్నటు’్ల చంద్రమ్మ చెప్పారు. -
ఓ పార్కు కావాలి!
పెట్డాగ్స్ కూ ఓ పార్కు ఉంటే ఎంత బాగుంటుంది! బెంగళూరులో ఇలాంటి సౌకర్యం ఉందట. పెంపుడు కుక్కలన్నింటినీ తెచ్చి వాటి యజమానులు అక్కడ గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తారట. ఎంచక్కా నెలకోసారి అవి ఇదిగో ఇలా ఆడేసి పాడేసి ఎంజాయ్ చేసేసి వెళ్లిపోతాయి. ఎప్పుడూ నాలుగు గోడల మధ్య ‘భౌభౌ’ మంటూ బోరుమనకుండా.. ఇలాంటివి వాటిని రీఫ్రెష్ చేస్తాయనేది పెట్ లవర్స్ మాట. ఆదివారం నెక్లెస్ రోడ్డులో తమ పెంపుడు శునకాలతో సహా వచ్చిన వాటి యజమానులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
గ్రాండ్ మారథాన్..
ఉత్సాహంగా సాగిన రన్ యువతదే పైచేయి విజేతగా నిలిచిన హర్యానా రైతు బిడ్డ హాఫ్ మారథాన్లో నెగ్గిన బాబూరామ్ 5కే రన్ విన్నర్గా కార్మికుడి కొడుకు సాక్షి, సిటిబ్యూరో: నగరంలో ఆదివారం నిర్వహించిన ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ సక్సెస్ అయింది. అన్ని వర్గాల వారు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. పరుగులో పాల్గొనేందుకు భారీగా తరలిరావడంతో నిర్వాహకులు సైతం ఆనందంలో మునిగిపోయారు. ఏటా ఇలాంటి రన్ నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. ఫుల్ మారథాన్ (42.195 కిలోమీటర్లు) సాగిందిలా... నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం ఐదు గంటలకు నగర పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, రాజ్భవన్ రోడ్డు, శ్రీనగర్ కాలనీ బస్స్టాప్, కేబీఆర్ పార్కు, దస్పల్లా హోటల్, హైటెక్ సిటీ, అస్కెండస్ సర్కిల్, క్వాలిటీ ఇన్ సర్కిల్, ఐఐఐటీ జంక్షన్, విప్రో సర్కిల్, పోలారిస్ బిల్డింగ్, గోపన్నపల్లి జంక్షన్, హెచ్సీయూ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగిసింది. హాఫ్ మారథాన్ (21.1 కిలోమీటర్లు)... నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైంది. ఎన్టీఆర్ గార్డెన్, రాజ్భవన్, శ్రీనగర్ కాలనీ బస్స్టాప్, న్యూ దస్పల్లా హోటల్, హైటెక్ సిటీ, అస్కెండస్ సర్కిల్, క్వాలిటీ ఇన్ సర్కిల్, ఐఐఐటీ జంక్షన్, గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగిసింది. 5 కే రన్... గచ్చిబౌలి స్టేడియం నుంచి ట్రిపుల్ ఐటీ కూడలి, ఇన్ఫోసిస్, విప్రో సర్కిల్ మీదుగా క్యూసిటీ నుంచి తిరిగి గచ్చిబౌలి స్టేడియం వరకు కొనసాగింది. ఇందులో ఐటీ కంపెనీలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రన్ను ప్రారంభించిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సినీ నటులు రానా, సునీల్, నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ మహంతి పరుగులు తీశారు. సత్తాచాటిన యువత.. ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్లో యువత సత్తా చాటింది. 42.195 కిలోమీటర్లు పురుషుల ఫుల్మారథాన్ను హర్యానాలోని మహేందర్గడ్కు చెందిన 25 ఏళ్ల కరన్ సింగ్ 2 గంటల 24 నిమిషాల 57 సెకన్లలో పరుగెత్తాడు. ఈ ఏడాది జనవరిలో ముంబై మారథాన్లో ఇండియన్ మెన్స్ ఫుల్ మారథాన్ విజేతగా నిలిచిన కరన్ అదే స్ఫూర్తితో హైదరాబాద్ మారథాన్లోనూ సత్తా చాటాడు. ఇంటర్ వరకు చదువుకున్న హర్యానాలోని విలేజ్ దానిమనియాలికి చెందిన ఈ యువకుడు ప్రస్తుతం పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ యూనిట్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇతని తండ్రి శ్రీవికారమ్ రైతు. తల్లి సంతోషిణి గృహిణి. అథ్లెట్ కావడమే తన లక్ష్యమని కరన్సింగ్ తెలిపారు. ఇదే ఫుల్మారథాన్లో 2 గంటల 26 నిమిషాల 26 సెకన్లతో పుణె ఆర్మీకి చెందిన వీఐ డంగ్ ఐ, 2 గంటల 28 నిమిషాల 23 సెకన్లతో మూడో స్థానంలో రాజేశ్పాల్ సింగ్ నిలిచారు. మెన్ హాఫ్ మారథాన్లో.. మెన్ హాఫ్ మారథాన్లో హైదరాబాద్లోని ‘ఆర్మీ ఆర్టిలరీ సెంటర్’లో సోల్జర్గా పనిచేస్తున్న బాబూరామ్ గంటా 9 నిమిషాల 50 సెకన్లలో 21.1 కిలోమీటర్లను ఛేదించి విజేతగా నిలిచారు. జమ్మూకాశ్మీర్కు చెందిన ఈయన హైదరాబాద్లోని ఆర్మీ ఆర్టిలరీ సెంటర్లో సోల్జర్గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచే రన్నింగ్ అంటే ఇష్టమని చెబుతున్నారు. మూడేళ్లుగా నగరంలోని ఆర్మీ ఆర్టిలరీ సెంటర్లోనే రన్నింగ్ ప్రాక్టీసు చేస్తున్నారు. గతేడాది హైదరాబాద్ మారథాన్లో పాల్గొన్నారు. మంగళూరు నిఫ్ట్ హాఫ్ మారథాన్లో రన్ చేసి ప్రథమ స్థానంలో నిలిచారు. ఇదే స్ఫూర్తితో ఈసారి జరిగిన హైదరాబాద్ మారథాన్లో విజేతగా నిలబడ్డారు. దీనికి తమ స్నేహితుల సహకారం కూడా ఉందని చెబుతున్నారు. కాగా గంటా 13 నిమిషాల 52 సెకన్లలో నంజుడప్ప, గంటా 18 నిమిషాల 19 సెకన్లలో సతీశ్ కుమార్ రన్ చేసి మూడో స్థానంలో నిలిచారు. 5కే రన్లో.. 5 కే రన్లో కేరళకు చెందిన సందీప్ విజేతగా నిలిచారు. కేరళకు చెందిన ఈయన డిగ్రీ వరకు చదువుకున్నారు. 1,500 మీటర్ల మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్లో పాల్గొన్నారు. మారథాన్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. తొలి ఈవెంట్లోనే విజేతగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని సందీప్ చెబుతున్నారు. మహిళ విజేతలు వీరే... మహిళల ఫుల్మారథాన్లో షామిలీ సింగ్, రశ్మి, ఎం.సుధ వరుసగా మూడు స్థానాల్లో నిలిచారు. ఉమెన్ హాఫ్ మారథాన్ను జ్యోతి గెలిచింది. సీమ, కేఎం రంజన రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. కార్పొరేట్ ట్రోఫీ యూహెచ్జీ కైవసం... ఈ ఈవెంట్లో యూనెటైడ్ హెల్త్ గ్రూపు కంపెనీకి చెందిన 800 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. మారథాన్లో ఎక్కువ మంది ఉద్యోగులు పాల్గొన్నందుకు కార్పొరేట్ ట్రోఫీని యూహెచ్జీ కైవసం చేసుకుంది. ‘కేర్’ వైద్య సేవలు హ్యాపెనింగ్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్కు కేర్ ఆస్పత్రుల ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించినట్టు ఆ ఆస్పత్రి మీడియా మేనేజర్ ఎం.శివశంకర్ తెలిపారు. వైద్య సేవల్లో భాగంగా రన్ ప్రారంభమైన నెక్లెస్ రోడ్ నుంచి రన్ ముగిసిన గచ్చిబౌలి స్టేడియం వరకు ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక పాయింట్ చొప్పున ఏర్పాటు చేసి రన్లో పాల్గొన్న వారికి పెయిన్ రిలీఫ్ స్ప్రేలతోపాటు వారికి కావాల్సిన గ్లూకోస్లను అందించినట్టు చెప్పారు. మొబైల్ సర్వీసులను కూడా అందించినట్టు తెలిపారు. -
నవోత్సాహం
సాక్షి, సిటీబ్యూరో : దశాబ్దాల కల సాకారమైంది. అనేక పోరాటాలు, వందల మంది త్యాగాలు ఫలించాయి. ఆదివారం అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు నగరమంతా ‘జై తెలంగాణ’ నినాదాలు, బాణసంచా మోతలతో మార్మోగింది. తారాజువ్వలు చీకట్లను చీల్చుకుని ఆకాశంలో కనువిందు చేశాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు నగరంలో అంబరాన్నంటాయి. ట్యాంక్బండ్, నెక్లస్రోడ్, గన్పార్క్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, క్లాక్టవర్లు జనంతో కిక్కిరిసి పోయాయి. ట్యాంక్బండ్ సహా మొత్తం 120 కేంద్రాల్లో కళాకారులు తమ ఆటాపాటలతో ధూం..ధాం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ కార్యాలయాల్లో నాయకులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. సికింద్రాబాద్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మల్కాజిగిరి, ఉప్పల్, అంబర్పేట్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేర్లింగంపల్లి, పంజగుట్ట, బేగంపేట్ తదితర కూడళ్లన్నీ తెలంగాణ వాదులతో కిక్కిరిసి పోయాయి. బస్తీలు, కాలనీల్లో యువకులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. కేకులు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అంబరమంటిన సంబురాలు ట్యాంక్బండ్పై రసమయి బాలకిషన్, నెక్లెస్రోడ్డులోని పీపుల్స్ప్లాజాలో గాయకుడు సాయిచంద్, గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద ప్రొఫెసర్ కోదండరామ్, గాయకుడు గద్దర్, విమలక్క, అంద్శైఅమరులకు నివాళులర్పించి, ఆ తర్వాత తమ ఆటా పాటలతో ధూం..ధాం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీభవన్లో తెలంగాణ సంబురాలు నిర్వహించారు. అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి దానం, వీహెచ్, మాజీ ఎంపీ అంజన్కుమార్యాదవ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం గాంధీభవన్ నుంచి గన్పార్క్ వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. టీఆర్ఎస్ కార్యాలయంలో నాయిని నర్సింహారెడ్డి సహా పలువురు నేతలు వేడుకలు నిర్వహించారు. పెద్దెత్తున బాణసంచా కాల్చారు. ‘జై తెలంగాణ, జై కేసీఆర్’.. నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. తెలంగాణ ఉద్యమకారులు గన్పార్కు వద్ద ఆటాపాట నిర్వహించారు. కళాకారులు ధూంధాం నిర్వహించి సంబరాలు జరిపారు. గన్పార్కు వద్ద హాజరైన వారిలో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అమర వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. టీఎన్జీవో అధ్యక్షులు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు విఠల్, స్వామిగౌడ్, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, టీఆర్ఎల్డీ నాయకులు చెరుకూరి శేషగిరిరావు, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రావు, రాపోలు జ్ఞానేశ్వర్, హెచ్ఎం టీవీ సీఈఓ రాంచంద్రమూర్తి, ఎమ్మార్పీఎస్ (దండోరా) రాష్ట్ర అధ్యక్షులు వై. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టపాకాయలు, బాణసంచాలు పేల్చి కార్యకర్తలు సంబరాలు జరిపారు. డీసీపీ కమలాసన్ రెడ్డి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. చిన్నపెద్దా తేడా లేకుండా కుటుంబ సమేతంగా వేలాదిమంది తెలంగాణ వాదులు ట్యాంక్బండ్కు చేరుకున్నారు. ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం, ట్యాంక్బండ్, జీహెచ్ఎంసీ ఆఫీసు, నెక్లెస్రోడ్డు, సంజీవయ్య పార్కు, లోయర్ ట్యాంక్బండ్, ఇందిరాపార్కు పరిసరాలు తెలంగాణ వాదులతో కిక్కిరిపోయాయి. సరిగ్గా 12 గంటల తర్వాత ఈలలు, చప్పట్లు, కేరింతలు, జై తెలంగాణ నినాదాలు, భారీ బాణసంచాతో నవ తెలంగాణకు స్వాగతం పలికారు. కేక్లు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. రాంనగర్ చౌరస్తాలో ముషీరాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో ధూంధాం జరిగింది. ముషీరాబాద్ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, టీఆర్ఎస్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి, ముఠాగోపాల్, గ్రేటర్ జేఏసీ చైర్మన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు, విద్యార్థులంతా ఆర్ట్స్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. కాలేజీపై తెలంగాణ జెండా ఎగరేశారు. బాణసంచా కాల్చారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు. శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఇటు ఎన్సీసీ నుంచి అటు తార్నాక, మాణికేశ్వరి నగర్, ఇఫ్లూ వర్సిటీ తదితర ప్రాంతాల మీదుగా బైక్ర్యాలీలు నిర్వహించారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐజేయూ నాయకులు శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్, సోమసుందర్, నరేందర్, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాణసంచా కాల్చి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం
తెలంగాణ అవతరణ వేళ.. నగరం గులాబీమయం అంబరమంటే సంబురాలకు ఏర్పాట్లు సర్వత్రా ‘ఆవిర్భావ’ సందడి సకల జనులూ అదే ధ్యాసలో.. దశాబ్దాల ఎదురుచూపులు ఫలించే తరుణం.. ఏళ్ల తరబడి సాగిన సుదీర్ఘ పోరాటానికి చరమగీతం పాడే సమయం.. కోట్లాదిమంది స్వప్నం సాకారమయ్యే క్షణం.. తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరిస్తున్న వేళ.. అంబరమంటే సంబురానికి తెర లేవనుంది.. ఆ అపురూప దృశ్యాన్ని ‘నభూతో.. నభవిష్యతి’ అన్న రీతిలో జరుపుకోవడానికి నగరం సంసిద్ధమవుతోంది. ఎక్కడ చూసినా విద్యుల్లతలు.. వెలుగుజిలుగులు.. భారీ హోర్డింగులు.. ఎత్తై కటౌట్లు.. రంగుల హంగులు.. నింగికెగసే బెలూన్లు.. ఉత్సవ వేదికలు.. డీజేలు.. బాజాలు.. వెరసి పండగ వాతావరణం ప్రతిబింబించేలా సిటీని తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ర్యాలీలు, ధూంధాంలు.. ఉత్సవాలు, జెండా ఆవిష్కరణలు చేపట్టేందుకు వివిధ సంఘాలు సిద్ధమవుతుండగా.. అవతరణ దినోత్సవాన్ని మధురస్మృతిగా పదిల పరుచుకునేందుకు వివాహాల వంటి శుభకార్యాలు ఆ రోజే చేసుకునే హడావుడిలో పలువురు తలమునకలై ఉన్నారు. వెరసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భారీ స్థాయిలో కసరత్తు జరుగుతోంది. సాక్షి, సిటీబ్యూరో : ‘గ్రేటర్’లో పార్టీలకతీతంగా తెలంగాణప్రాంత వాసులంతా తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ ఉత్సవాల్లో భాగస్వాములవుతుండగా, హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) సైతం ఉత్సవ ఏర్పాట్లలో ఉత్సాహంగా పాలుపంచుకుంటోంది. ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్డు, పీపుల్స్ప్లాజా, గన్పార్కు, పరేడ్ గ్రౌండ్.. ఇలా ఉత్సవాలకు వేదికలు కానున్న పలు ప్రాంతాల వద్ద విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. వివిధ మార్గాల్లో రహదారులను తీర్చిదిద్దడంతోపాటు, పచ్చదనం పెంపు, డివైడర్లకు రంగులు తదితర కార్యక్రమాల్లో నిమగ్నమైంది. ఆదివారం రాత్రి నుంచి వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహించనుంది. పలు ప్రాంతాలు విద్యుద్దీప కాంతులతో వెలుగుపూలు విరజిమ్మనున్నాయి. జీహెచ్ఎంసీలోని సెల్ఫ్హెల్ప్ గ్రూప్ మహిళలు సైతం ఈ వేడుకల్లో భాగస్వాములవుతున్నారు. జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల అధికారులకు ఆయా బాధ్యతలు అప్పగించారు. వీరు రహదారులు, పారిశుధ్యం, పచ్చదనం, వీధిదీపాలు, వేదికల ఏర్పాటు తదితర కార్యక్రమాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆహారపొట్లాలు, మంచినీటి సరఫరా వంటి కార్యక్రమాలకూ ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో అవతరణ ఉత్సవాలు నిర్వహించనున్నారు. తెలుగుతల్లి జంక్షన్, అబిడ్స్ జీపీఓ, రాజ్భవన్ రోడ్డు, సీఎం క్యాంపు కార్యాలయం, బంజారాహిల్స్ చెక్పోస్టు, ట్యాంక్బండ్, సికింద్రాబాద్ క్లాక్టవర్, శిల్పారామం, చార్మినార్, అసెంబ్లీ, సచివాలయం, పరేడ్గ్రౌండ్ ఇంకా.. ఇంకా పలు ప్రాంతాలు విద్యుల్లతలతో వెలుగులు పంచనున్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ సీనియర్ అధికారులతో కలిసి శనివారం రాత్రి నందినగర్, బంజారాహిల్స్, గన్పార్క్, లేక్వ్యూ గెస్ట్హౌస్, హైదరాబాద్ పబ్లిక్స్కూల్ తదితర ప్రాంతాల్లో రహదారులు.. వీధిదీపాల ఏర్పాట్లు తదితర పనుల్ని తనిఖీ చేశారు. సంబంధిత అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. వివిధ జేఏసీల ఆధ్వర్యంలోనూ... వివిధ జేఏసీల ఆధ్వర్యంలోనూ గ్రేటర్లోని వివిధ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి గ్రేటర్లోని వివిధ ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు, ధూంధాంలు, బతుకమ్మలు, గాల్లోకి బెలూన్లు, బాణసంచా వెలుగులు ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఫైర్డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీపుల్స్ప్లాజాలో కనీవినీ ఎరుగని రీతిలో వెలుగుపూల బాణసంచా కాల్చనున్నారు. సోమవారం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక నగరంలోని దాదాపు 50 ప్రాంతాల్లోనూ బాణసంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేశారు. కూకట్పల్లిలో బతుకమ్మలు, బెలూన్లు.. బాణసంచా తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వరదల నుంచి ఎందరినో కాపాడిన ఉస్మానియా ఆస్పత్రిలోని చింతచెట్టు వద్ద సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మధురస్మృతిగా మల్చుకునే ప్రయత్నంలో.. ఇవన్నీ ఒక ఎత్తు కాగా.. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాన్ని మరపురాని మధురస్మృతిగా మిగుల్చుకునేందుకు కొందరు నిశ్చితార్ధాలు చేసుకుంటుండగా, మరికొందరు పెళ్లిళ్లకు సిద్ధమయ్యారు. ప్రసవ సమయం దగ్గర పడిన మహిళలు కొందరు జూన్ రెండో తేదీన శిశువులకు జన్మనిచ్చేందుకు ముహూర్తాలు ఖరారు చేసుకున్నారు. ఇలా అన్ని వర్గాలవారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉత్సవాన్ని మరచిపోని జ్ఞాపకంగా పదిల పరచుకునేందుకు, ఘనంగా నిర్వహించుకునేందుకు సంసిద్ధులై ఉన్నారు. ఆనంద ఘడియల్ని ఆస్వాదించేందుకు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం..
సాక్షి, హైదరాబాద్ : దశాబ్దాల ఎదురుచూపులు ఫలించే తరుణం.. ఏళ్ల తరబడి సాగిన సుదీర్ఘ పోరాటానికి చరమగీతం పాడే సమయం.. కోట్లాదిమంది స్వప్నం సాకారమయ్యే క్షణం.. తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరిస్తున్న వేళ.. అంబరమంటే సంబరానికి తెర లేవనుంది.. ఆ అపురూప దృశ్యాన్ని ‘నభూతో.. నభవిష్యతి’ అన్న రీతిలో జరుపుకోవడానికి నగరం సంసిద్ధమవుతోంది. ఎక్కడ చూసినా విద్యుల్లతలు.. వెలుగుజిలుగులు.. భారీ హోర్డింగులు.. ఎత్తై కటౌట్లు.. రంగుల హంగులు.. ఉత్సవ వేదిక లు.. డీజేలు.. బాజాలు.. వెరసి పండగ వాతావరణం ప్రతిబింబించేలా సిటీని తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ర్యాలీలు, ధూంధాంలు, ఉత్సవాలు, జెండా ఆవిష్కరణలు చేపట్టేందుకు వివిధ సంఘాలు సిద్ధమవుతుండగా.. ఆవిర్భావ దినాన్ని మధురస్మృతిగా పదిల పరుచుకునేందుకు వివాహాల వంటి శుభకార్యాలు ఆ రోజే చేసుకునే హడావుడిలో కొందరు తలమునకలై ఉన్నారు. వెరసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వైభవంగా నిర్వహించేందుకు భారీ కసరత్తు జరుగుతోంది. ‘గ్రేటర్’ ఏర్పాట్లు పార్టీలకతీతంగా తెలంగాణ వాసులంతా ఉత్సవాల్లో భాగస్వాములవుతుండగా, హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) సైతం ఉత్సవ ఏర్పాట్లలో ఉత్సాహంగా పాలుపంచుకుంటోంది. ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్డు, పీపుల్స్ప్లాజా, గన్పార్కు, పరేడ్ గ్రౌండ్.. ఇలా ఉత్సవాలకు వేదికలు కానున్న పలు ప్రాంతాల వద్ద విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. వివిధ మార్గాల్లో రహదారులను తీర్చిదిద్దడంతోపాటు, పచ్చదనం పెంపు, డివైడర్లకు రంగులు తదితర కార్యక్రమాల్లో నిమగ్నమైంది. ఆదివారం రాత్రి నుంచి వారం పాటు ఉత్సవాలు నిర్వహించనుంది. పలు ప్రాంతాలు విద్యుద్దీప కాంతులతో వెలుగుపూలు విరజిమ్మనున్నాయి. జీహెచ్ఎంసీలోని సెల్ఫ్హెల్ప్ గ్రూప్ మహిళలు సైతం ఈ వేడుకల్లో భాగస్వాములవుతున్నారు. జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల అధికారులకు ఆయా బాధ్యతలు అప్పగించారు. వీరు రహదారులు, పారిశుధ్యం, పచ్చదనం, వీధిదీపాలు, వేదికల ఏర్పాటు తదితర కార్యక్రమాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆహారపొట్లాలు, మంచినీటి సరఫరా వంటి కార్యక్రమాలకూ ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో అవతరణ ఉత్సవాలు నిర్వహించనున్నారు. తెలుగుతల్లి జంక్షన్, అబిడ్స్ జీపీఓ, రాజ్భవన్ రోడ్డు, సీఎం క్యాంపు కార్యాలయం, బంజారాహిల్స్ చెక్పోస్టు, ట్యాంక్బండ్, సికింద్రాబాద్ క్లాక్టవర్, శిల్పారామం, చార్మినార్, అసెంబ్లీ, సచివాలయం, పరేడ్గ్రౌండ్ ఇంకా.. ఇంకా పలు ప్రాంతాలు విద్యుల్లతలతో వెలుగులు పంచనున్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ సీనియర్ అధికారులతో కలిసి శనివారం రాత్రి నందినగర్, బంజారాహిల్స్, గన్పార్క్, లేక్వ్యూ గెస్ట్హౌస్, హైదరాబాద్ పబ్లిక్స్కూల్ తదితర ప్రాంతాల్లో రహదారులు.. వీధిదీపాల ఏర్పాట్లు తదితర పనుల్ని తనిఖీ చేశారు. సంబంధిత అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. వివిధ జేఏసీల ఆధ్వర్యంలోనూ... వివిధ జేఏసీల ఆధ్వర్యంలోనూ గ్రేటర్లోని వివిధ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి గ్రేటర్లోని వివిధ ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు, ధూంధాంలు, బతుకమ్మలు, గాల్లోకి బెలూన్లు, బాణసంచా వెలుగులు ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఫైర్డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీపుల్స్ప్లాజాలో కనీవినీ ఎరుగని రీతిలో వెలుగుపూల బాణసంచా కాల్చనున్నారు. సోమవారం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమా ణం చేశాక నగరంలోని దాదాపు 50 ప్రాంతాల్లోనూ బాణసంచా కాల్చేందుకు ఏర్పా ట్లు చేశారు. కూకట్పల్లిలో బతుకమ్మలు, బెలూన్లు.. బాణసంచా తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వరదల నుంచి ఎందరినో కాపాడిన ఉస్మానియా ఆస్పత్రిలోని చింతచెట్టు వద్ద సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మధురస్మృతిగా మల్చుకునే ప్రయత్నంలో.. ఇవన్నీ ఒక ఎత్తు కాగా.. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాన్ని మరపురాని మధురస్మృతిగా మిగుల్చుకునేందుకు కొందరు నిశ్చితార్ధాలు చేసుకుంటుండగా, మరికొందరు పెళ్లిళ్లకు సిద్ధమయ్యారు. ప్రసవ సమయం దగ్గర పడిన మహిళలు కొందరు జూన్ రెండో తేదీన శిశువులకు జన్మనిచ్చేందుకు ముహూర్తాలు ఖరారు చేసుకున్నారు. ఇలా అన్ని వర్గాలవారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉత్సవాన్ని మరచిపోని జ్ఞాపకంగా పదిల పరచుకునేందుకు, ఘనంగా నిర్వహించుకునేందుకు సంసిద్ధులై ఉన్నారు. ఆనంద ఘడియల్ని ఆస్వాదించేందుకు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. -
నెక్లెస్రోడ్డులో ఆకట్టుకున్న ఫ్లాష్మాబ్
-
బిట్స్ ఫిలానీ ఆధ్వర్యంలో10కే రన్
-
నెక్లెస్రోడ్లో 10కే రన్
-
పవర్ స్టార్....... హార్ట్ వాక్
-
పవన్ కళ్యాణ్... హార్ట్వాక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం నగరంలోని నెక్లస్ రోడ్డులో సందడి చేశారు. హృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే హార్ట్ వాక్ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ, మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ శ్రీనివాస్లతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ప్రారంభించిన 5కే హార్ట్ వాక్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో యువతి, యువకులు నెక్లస్ రోడ్డుకి తరలివచ్చారు. చిన్నారుల్లో పెరుగుతున్న గుండె జబ్బులపై అవగాహన కల్పించేందుకే ఈ హార్ట్వాక్ను ఏర్పాటు చేసినట్లు ఫౌండేషన్ వెల్లడించింది. -
పర్యావరణ రక్షణకు పరుగు
-
రూ.1.75 కోట్లతో.. స్థిరాస్తి ప్రదర్శన!
సాక్షి, హైదరాబాద్: ఈనెల 28 నుంచి మార్చి 2వ తేదీ వరకు నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో భారత డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ ప్రాపర్టీ షో జరగనుంది. ఇందుకు సంబంధించిన తాజా వివరాల్ని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ జైవీర్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. ఆయనేమన్నారంటే.. సుమారు 150 మంది డెవలపర్లు వంద స్టాళ్లలో 200లకు పైగా ప్రాజెక్ట్లను ఈ ప్రదర్శనలో ఉంచుతారు. వీరితో పాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నిర్మాణ సామాగ్రి తయారీ సంస్థలు.. ఇలా నిర్మాణ రంగానికి సంబంధించిన అన్ని విభాగాల వారూ ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. రూ.1.75 కోట్ల పెట్టుబడితో నిర్వహించే మూడు రోజుల ప్రదర్శనకు సుమారు రూ. 60 వేల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. సందర్శకులకు, నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక జట్లను ఏర్పాటు చేశాం. నెక్లెస్ రోడ్ అన్ని వర్గాల వారికీ అనుకూలమైన ప్రాంతం కాబట్టే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాం. ఈ ప్రాంతంలో పార్కింగ్కూ ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఏటా క్రెడాయ్ ప్రాపర్టీ షోకు రాష్ట్ర ముఖ్యమంత్రే ముఖ్య అతిథిగా హాజరయ్యే వారు. కానీ ఈసారి సీఎం కిరణ్ రాజీనామా చేయడంతో గవర్నర్ను అతిథిగా ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా ఆయన కూడా వచ్చే అవకాశం దాదాపు కనిపించట్లేదు. మా వంతుగా అయితే ముమ్మర ప్రయత్నాలే చేస్తున్నాం. ఒకవేళ గవర్నర్ రానిపక్షంలో గృహ నిర్మాణ మంత్రిని ఆహ్వానిస్తాం. ప్రస్తుతం హైదరాబాద్లో 50 వేల ఇళ్లు నిర్మాణ దశలో, సుమారు 5 వేల ఇళ్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి కాబట్టి నగరవాసులు సొంతింటిని ఎంపిక చేసుకోవడానికి ఇదే సరైన సమయం. సీమాంధ్ర ప్రాంతంలో రాజధానిని ప్రకటించినప్పటికీ అభివృద్ధి చెందడానికి ఎంతలేదన్నా రెండేళ్ల సమయం పడుతుంది. కాబట్టి ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకే పెట్టుబడిదారులు మొగ్గుచూపుతారు. మెట్రో రైల్, ఔటర్ రింగ్ రోడ్, హెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్, ఐటీఐఆర్ ప్రాజెక్ట్.. ఇవన్నీ హైదరాబాద్కు కలిసొచ్చే అంశాలు. -
సరికొత్త అడుగులు
-
జోయాలుక్కాస్లో మహారాణి నెక్లెస్
నెక్లెస్ అంటే.. సాధారణంగా మెడలో ఆరు నుంచి తొమ్మిది అంగుళాల వరకు పొడవుతో వేసుకుంటారు. అదే లాంగ్ చైన్ అయితే మరికొంత పొడవు ఉంటుంది. అది 12 నుంచి 15 అంగుళాల వరకు పొడవుంటుంది. అదే రాణులు, మహారాణులు ధరించే నెక్లెస్లు అయితే ఎంత పొడవుండాలి? ఇంకెంత బరువుండాలి? సరిగ్గా ఇదే కాన్సెప్ట్తో ప్రముఖ నగల దుకాణం జోయాలుక్కాస్ వాళ్లు ఓ భారీ నెక్లెస్ను రూపొందించారు. దీని బరువు.. అక్షరాలా మూడున్నర కిలోలు!! 22 క్యారట్ల 916 గోల్డ్తో రూపొందించిన ఈ నెక్లెస్ను రాష్ట్రంలో తొలిసారిగా ప్రదర్శించారు. దీన్ని 180 రోజుల పాటు శ్రమించి కేరళలో రూపొందించినట్లు షోరూం ప్రతినిధి ఒకరు ఈ సందర్భంగా తెలిపారు. చెన్నైలోని జోయాలుక్కాస్ షోరూమ్లో మూడు మహారాణి నెక్లెస్లను విక్రయించినట్లు ఆయన చెప్పారు. ఇంతకీ మన రాష్ట్రంలో ఇంత పెద్ద నెక్లెస్ను తొలిసారిగా ధరించే భాగ్యం ఎవరికి దక్కిందా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. విజయవాడ నగరంలోని జోయాలుక్కాస్ షో రూమ్లో ఈ నెక్లెస్ అందుబాటులో ఉంది. 2009లో మిస్ విజయవాడగా ఎంపికైన కూచిపూడి నృత్య కళాకారిణి వీణ ఎంజీ రోడ్డులోని షోరూమ్లో ఈ నెక్లెస్ను ధరించి, లాంఛనంగా ప్రారంభించారు. -
మరో మణిహారం మెట్రో
మోడల్ బోగీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి 2015 మార్చి నాటికి పట్టాలపైకి రైలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి మెట్రోరైలు మరో మణిహారం అని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అభివర్ణించారు. కొరియాలోని హ్యుండాయ్ రోటన్ కంపెనీ నుంచి దిగుమతి చేసుకున్న మెట్రోరైలు నమూనా కోచ్(బోగీ)ను బుధవారం నెక్లెస్రోడ్డులోని పీవీ జ్ఞానఘాట్ వద్ద ప్రజల సందర్శనార్థం సీఎం ఆవిష్కరించారు. అనంతరం డ్రైవర్ సీట్లో కూర్చుని ఎలక్ట్రానిక్ యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.14 వేల కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు తొలిదశ 2015 మార్చి 31వ తేదీ నాటికి ప్రారంభమవుతుందని తెలిపారు. పీవీ ఎక్స్ప్రెస్ వే, ఔటర్ రింగ్రోడ్డుతో పాటు మెట్రోరైలు నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరుస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ ఎమ్డీ ఎన్వీఎస్ రెడ్డి ఈ కోచ్ విశేషాలను వివరించారు. ‘ఇది పూర్తి ఎయిర్ కండిషన్డ్ బోగీ. ప్రారంభంలో ఒక్కో రైలుకు మూడు బోగీలు ఉంటాయి. ఒక్కో రైల్లో వెయ్యిమంది వరకు ప్రయాణించవచ్చు. ప్రయాణీకుల సంఖ్య పెరిగిన కొద్దీ గరిష్టంగా ఆరు బోగీలు ఏర్పాటుచేస్తాం. నిలుచుని ప్రయాణించేవారికి ఎక్కువ స్థలం కేటాయించినందువల్ల ఒక్కో రైలులో 126 మంది కూర్చుని వెళితే, 848 మంది నిలుచుని ప్రయాణించాల్సి ఉంటుంది. రైలు సరాసరి వేగం గంటకు 33 కిలోమీటర్లు. గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ప్యాసింజర్ అడ్రస్ సిస్టమ్ ద్వారా రైల్వేస్టేషన్ సమీపిస్తున్న విషయాన్ని, ఎటువైపు తలుపులు తెరుచుకుంటాయనే వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అన్ని కోచ్లలో సీసీటీవీలుంటాయి..’ అని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ కోచ్ను నెలరోజులపాటు ప్ర జల సందర్శనార్థం నెక్లెస్ రోడ్డులో ఉంచుతామని, ఆ తరువాత అందరికీ అందుబాటులో ఉండేలా మరోస్థానంలో ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. మంత్రులు దానం నాగేందర్, ముఖేష్గౌడ్, కాసు వెంకటకృష్ణారెడ్డి, ఎల్ అండ్ టీ ఎమ్డీ గాడ్గిల్, హ్యుండాయ్ ప్రతినిధులు పాల్గొన్నారు. బోగీలో ఉండే సౌకర్యాలివే... 24 రూట్ మ్యాప్లు ఫుల్ ఏసీ 12 ఎల్సీడీ టీవీలు మొబైల్, ల్యాప్టాప్ చార్జింగ్ సాకెట్లు వైఫై, ఇంటర్నెట్ సదుపాయం సీసీటీవీలతో నిరంతర నిఘా బోగీలో బ్యాటరీ బ్యాక్అప్ ఫుల్ నిరంతరాయంగా ఎల్ఈడీ కాంతులు అగ్నిప్రమాదాల నివారణకు ఉపకరణాలు, ఆక్సీజన్ సిలిండర్లు వికలాంగులు, వృద్ధులు కూర్చునేందుకు అనువైన సీట్లు ఆటోమేటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్, ఆపరేషన్, పర్యవేక్షణ ఎమర్జెన్సీలోఆటోమేటిక్గా మోగే అలారం సమీపించే స్టేషన్ పేరును తెలుగు, హిందీ, ఇంగ్లిష్లో తెలిపే ప్యాసింజర్ అడ్రస్ సిస్టం న్యుమాటిక్ ఎమర్జెన్సీ ఎయిర్బ్రేక్ వ్యవస్థతో కుదుపులు లేని ప్రయాణం బ్రేకులు వేసినపుడు విద్యుత్ ఉత్పత్తి జరిగి బోగీకి ఉపయోగపడుతుంది.