panchayat secretary
-
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
వికారాబాద్: వికారాబాద్ జిల్లా కొడంగల్ పరిధిలోని ‘లగచర్ల కేసు’కు సంబంధించి సోమవారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాడిలో పాలుపంచుకున్నాడనే కారణంతో పోలీసులు ఓ పంచాయతీ కార్యదర్శిని అరెస్టు చేయగా, అతన్ని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11న లగచర్ల ఘటన చోటుచేసుకోగా, ఇందులో 42 మంది పాల్గొన్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మరుసటి రోజున 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.ఇందులో సంగాయిపల్లి పంచాయతీ కార్యదర్శి కావలి రాఘవేందర్ ఏ– 26గా ఉన్నాడు. అతని స్వగ్రామం లగచర్ల కాగా సంగాయిపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రిమాండ్ రిపోర్టులో అతని వృత్తి పంచాయతీ కార్యదర్శి అని కూడా పోలీసులు మెన్షన్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు తమకు తెలియజేయలేదని, శనివారం కలెక్టర్కు తెలియడంతో అతన్ని సస్పెండ్ చేశారని డీపీఓ జయసుధ తెలిపారు. ఇదిలావుండగా రిమాండ్ రిపోర్టులో తాను ఇచి్చనట్టుగా పేర్కొన్న వాంగ్మూలం వాస్తవం కాదని, మూడురోజుల క్రితం నరేందర్రెడ్డి అందజేసిన అఫిడవిట్ను న్యాయవాదులు సోమవారం కొడంగల్ కోర్టులో దాఖలు చేశారు. మరోవైపు నరేందర్రెడ్డి బెయిల్ పిటిషన్పై సోమవారం వికారాబాద్ జిల్లా కోర్టులో వాదనలు జరగగా, న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు. కస్టడీ పిటిషన్పై రేపు విచారణ నరేందర్రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్పై విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. ఇంకోవైపు లగచర్లలో ఘటనలో నిందితుల అరెస్టులు కొనసాగుతుండగానే.. పోలీసు ఉన్నతాధికారులు పరిగి డీఎస్పీ కరుణాసాగర్రెడ్డిపై వేటు వేశారు. ఆయనను డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉత్తర్వుల్లో సాధారణ బదిలీగా పేర్కొనడం గమనార్హం. కాగా కొత్త డీఎస్పీగా శ్రీనివాస్కు బాధ్యతలు అప్పగించారు. -
కాంగ్రెస్ నేతలవి పిచ్చి మాటలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘కాంగ్రెస్ నాయకులు వీఆర్ఏలను, పంచాయతీ కార్యదర్శులను రెచ్చగొట్టాలని చూశారు.. కానీ వారిని రెగ్యులరైజ్ చేశాము.. రేషన్డీలర్ల సమస్యనూ పరిష్కరించాం.. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఇంటింటికీ మంచినీరు వంటి పథకాలతో మహిళలు సీఎం కేసీఆర్కు జైకొడుతున్నారు.. ఇక ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ నాయకులు పిచ్చిగా మాట్లాడుతున్నారు’’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన బీసీ బంధు లబ్ధిదారులకు రూ.లక్ష సాయం పంపిణీ చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారానికి సంబంధించిన డబ్బులను బ్యాంకు వెబ్సైట్లపై స్వయంగా మీట నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయించారు. అనంతరం హరీశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల తీరును తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ సభలకు ప్రజలు రాకపోవడంతో వారికి ఏం చేయాలో తోచడం లేదన్నారు. ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ నాయకులు తిరిగి బ్రోకర్ల రాజ్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తారా అని నిలదీశారు. రైతులే తేల్చుకోవాలి.. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందన్న కాంగ్రెస్ కావాలో.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలంటున్న బీజేపీ కావాలో.. మూడు పంటలు పండించేలా రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కావాలో రైతులే తేల్చుకోవాలని మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. రైతుల ఉసురు పోసుకున్నది కాంగ్రెస్ పార్టీనే అని, ఆ ప్రభుత్వ హయాంలో అర్ధరాత్రి విద్యుత్ సరఫరా అయ్యేదని, ఎరువుల బస్తాల కోసం పోలీస్స్టేషన్లలో క్యూలైన్లో నిలబడాల్సిన దుస్థితి ఉండేదన్నారు. కిషన్రెడ్డి సమాధానం చెప్పాలి.. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు రావాల్సిన రూ.35 వేల కోట్లు నిలిపివేసిందని, ఆ నిధులను కేంద్రం ఎందుకు ఆపిందో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమాధానం చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్ పాల్గొన్నారు. -
ఫుల్లుగా తాగి పడుకున్న పంచాయతీ కార్యదర్శి.. మంత్రి ఆకస్మిక తనిఖీ..
లక్నో: యూపీలోని కన్నౌజ్లోని జసర్పురా సరయ్య గ్రామం పంచాయతీ కార్యాలయంలో మంత్రి అసీమ్ అరుణ్ ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారం ఆయన పంచాయతీ కార్యాలయానికి వచ్చేసరికి ప్రధాన కార్యదర్శి ఫుల్లుగా తాగి పడుకున్నాడు. మంత్రి స్వయంగా ఆ పెద్దమనిషిని లేపారు. లేచాక ఆ కార్యదర్శి చేసిన హంగామాకు చుట్టూ ఉన్నవారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. మిషన్-2024లో భాగంగా యూపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అసీమ్ అరుణ్ మొదట కన్నౌజ్లోని జసర్పురా సరయ్య గ్రామంలో పర్యటించారు. స్థానిక బీజేపీ నాయకులతో మొదట చర్చలు నిర్వహించిన మంత్రి తర్వాత వారితో కలిసి టిఫిన్ కూడా చేశారు. అనంతరం ఆ గ్రామంలోని పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయం లోపలికి వెళ్లేసరికి పంచాయతీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర కమల్ ఫుల్లుగా తాగి మంచం మీద పడుకుని హాయిగా నిద్రిస్తున్నారు. మంత్రి తన కళ్ళను తాను నమ్మలేకపోయారు. దగ్గరకు వెళ్తూ.. "ఎవరీయన..?" అనడిగారు. "ఆయన ఇక్కడి పంచాయతీ ప్రధాన కార్యదర్శి" అని అక్కడున్నవారు బదులిచ్చారు . షాకైన మంత్రి అతడిని తట్టి లేపగా గాఢ నిద్రలో ఉన్న కార్యదర్శి మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ జనం ఉండటాన్ని చూసి మత్తులోనే లేచే ప్రయత్నం చేశాడు. లేస్తూ తూలిపడబోగా అతడిని స్వయంగా మంత్రి పట్టుకుని ఊతమిచ్చారు. మొత్తానికి తేరుకున్న ఆ పెద్దమనిషిని చూస్తూ "నేను మంత్రిని" అని తనని తాను పరిచయం చేసుకుని "మీరు ఇక్కడ కార్యదర్శా..?" అని ప్రశ్నించారు. అవునన్నట్టు తల ఊపాడు సతీష్ చంద్ర. "తాగి ఉన్నావా?" అనడిగితే నేను తాగలేదని చెబుతూ మంత్రి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడు. ఒకసారి నడిచి చూపించమని మంత్రి అడగ్గా అడుగులో అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా రెండడుగులు వేశాడు. నీ పేరేంటి అనడిగితే కార్యాలయం బయట సతీష్ చంద్ర కమల్ అని ఉన్న నేమ్ ప్లేటును చూపించాడు. మరీ ఇంతలాగా తాగితే ఎలా పని చేస్తారని మంత్రి ప్రశ్నించగా కార్యదర్శి కళ్లనీళ్లు పెట్టుకుని క్షమించమని కోరాడు. ఇంతలో అక్కడున్నవారు ఇదే కార్యాలయంలో సహాయ కార్యదర్శిగా ఒక మహిళను నియమించారని ఆమే అన్ని పనులను చక్కబెడుతుందని మంత్రి అసీమ్ అరుణ్ కు వివరించారు. మంత్రి కార్యదర్శికి నాలుగు చీవాట్లు పెట్టి వారించి అక్కడినుండి వెళ్లిపోయారు. ఈ తంతు జరుగుతున్నంత సేపు అక్కడున్నవారంతా నవ్వు ఆపుకోలేకపోయారు. Intoxicated Pradhan Ji, Minister reached office 😳 WATCH .#PanchayatOffice #AseemArun #Kannauj #UttarPradesh #ViralVideo #ViralPost #ViralNews #ViralShorts #ViralReels #viralpage #AsianetNewsable pic.twitter.com/Otn8QoRCLy — Asianet Newsable (@AsianetNewsEN) July 15, 2023 ఇది కూడా చదవండి: మీ ఇంట్లో గేదెలు పాలు ఇవ్వకపోయినా మేమే కారణమా? -
పంచాయతీ కార్యదర్శినా... పాలేరునా? చావే నాకు దిక్కు!
బయ్యారం: ‘నాది మధ్యతరగతి కుటుంబం. మా కాడ ఎవరూ పెట్టుబడి పెట్టరు. కార్య దర్శినే పెట్టుకోవాలి. ఇదెక్కడి న్యాయం? ట్రాక్టర్ పర్సంటేజీలు తీసుకునేది సర్పంచ్లు. కానీ కార్యదర్శి డీజిల్ పోయించి ట్రాక్టర్ నడపాలా.. వారికి బాధ్యత లేదా? ఇది ఉద్యోగమా.. బానిస బతుకా సార్’ అంటూ ఎంఏ బీఈడీ చదివిన ఓ దివ్యాంగ పంచాయతీ కార్యదర్శి శుక్రవారం సూసైడ్నోట్ రాసి ఆత్మహత్యకు యత్నించాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నారాయణపురం పంచాయతీ కార్యదర్శిగా అదే మండలం ఇర్సులాపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఈసం వెంకటేష్ 16 నెలలుగా పనిచేస్తున్నాడు. గ్రామంలో వాడే ట్రాక్టర్కు డీజిల్ను రోజూ తన డబ్బులతోనే కొంటున్నాడు. వాటి బిల్లుల కోసం వెళ్లితే జాయింట్ చెక్ పవర్ ఉన్న సర్పంచ్, ఉప సర్పంచ్లు సంతకాల కోసం తిప్పించుకుంటున్నారు. దీంతో కలత చెందిన వెంకటేష్ ఇంటివద్ద పురుగుమందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. సూసైడ్ నోట్లో ఏముందంటే.. ‘అడిషనల్ కలెక్టర్ మేడం... కలెక్టర్ సార్.. గ్రా మంలో ఏమైనా ఖర్చులు పెట్టాల్సి వస్తే కా ర్యదర్శి పెట్టాలి అని ఏమైనా చట్టంలో ఉందా.. మేమూ మనుషులమే. మమ్మల్ని బలిపశువుల్ని చేశారు. పాలేరు కంటే ఎక్కువగా వాడుకుం టున్నారు. ఉపసర్పంచ్ సంతకం ఏమైనా రాష్ట్రపతి సంతకమా? అ, ఆ..లు రానివాళ్లు సర్పంచ్, ఉపసర్పంచ్లు అయితే మా పరిస్థితి ఏమిటి?’ అంటూ ఆవేదన వెలిబుచ్చాడు. -
Panchayat Secretary: ఉద్యోగమా.. చాకిరా?
ఆమె ఓ పంచాయతీ కార్యదర్శి. ఇద్దరు పిల్లల తల్లి. చీకటిలోనే పనులు ముగించు కున్నారు. ఈలోపు భారీ వర్షం. అయినా.. తడుస్తూనే విధులకు వెళ్లారు. కార్యాలయానికి చేరుకొని ఫొటో తీసుకుని యాప్లో అప్లోడ్ చేశారు. ఇదంతా ఎందుకంటే కేవలం అటెండెన్స్ కోసమే. సాక్షి, కరీంనగర్: ఉదయాన్నే 8 గంటలకు విధుల్లో చేరామన్న సందేశం చేరితేనే ఆ రోజు పనిచేసినట్లు లెక్క. పోనీ అంత ఉదయం వెళ్లినా.. ఎప్పుడు తిరిగి వస్తారో తెలియనంతగా పనులు. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో తీవ్ర పని ఒత్తిడి మధ్య పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు పల్లెప్రగతి యాప్ వచ్చాక వేధింపులు పెరిగిపోయాయి. ముఖ్యంగా తాము ఉదయాన్నే అది కూడా ఉదయం 8 గంటల్లోపే గ్రామపంచాయతీ కార్యాలయాన్ని చేరుకొని, కార్యాలయం కనిపించేలా సెల్ఫీ తీసుకుని దాన్ని అప్లోడ్ చేయాలి. ఏదైనా కారణం చేత కాస్త లేటైనా.. ఆ రోజు జీతం హుష్కాకి. ఇటీవల బుగ్గారంలో ఓ ఎంపీడీవో తన పరిధిలోని తొమ్మిది మంది పంచాయతీ కార్యదర్శులకు మెమో జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తాను వాట్సాప్ గ్రూపులో పెట్టిన సందేశానికి స్పందించలేదన్న కారణానికే ఆగ్రహించిన అధికారి ఏకంగా 9 మందికి మెమో జారీ చేశారు. ఈ విషయం పలువురు నెటిజన్లు మంత్రి కేటీఆర్కు, జగిత్యాల కలెక్టర్ రవి దృష్టికి తీసుకెళ్లారు. సెల్ఫీ తీసుకుంటేనే మస్టర్.. ► ఉదయాన్నే ఎనిమిది గంటలకు పంచాయతీ కార్యాలయానికి రావాలి. అక్కడ జీపీ లైవ్ లొకేషన్తోపాటు, లాంగిట్యుడ్, లాటిట్యూడ్ వివరాలు, పంచాయతీ భవనం కనిపించేలా సెల్ఫీ దిగి పల్లె ప్రగతి పీఎస్ యాప్లో అప్లోడ్ చేయాలి. ► పల్లెప్రగతి పీఎస్ యాప్.. ఎంపీవో (మండల పంచాయతీ ఆఫీసర్) అనే రెండు రకాల లాగిన్లు పంచాయతీ కార్యదర్శులకు ఉంటాయి. ప్రతీ పంచాయతీ కార్యదర్శి విధిగా రోజూ రెండు కాలువలు, రెండు రోడ్లు, ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థల భవనాలను క్లీన్ చేయించాలి. ► ఈ ఐదు పనులకు సంబంధించి ఐదు ఫొటోలు విత్ డేట్ అండ్ టైం ప్రకారం.. అప్లోడ్ చేస్తేనే ఆ రోజు పనిచేసిట్లు లెక్క. ఈ విధంగా నెలలో మొత్తం 24 పనిదినాలు ఇదే రకంగా విధులు నిర్వహించాలి. పాత ఫొటోలు అప్లోడ్ కావు. ► దీనికితోడు వీధి బల్బులు మార్చడం, ఇళ్ల నుంచి చెత్త సేకరణ వివరాలు కూడా రోజూ రిపోర్టు అప్లోడ్ చేయాలి. ► ఏ ఉద్యోగికైనా ఇంట్లో కనీస బాధ్యతలు ఉంటాయి. పిల్లలను స్కూలుకు పంపడం, మహిళలైతే ఇంట్లో వంట, పిల్లలు తదితర పనులు ఉంటాయి. కానీ.. కొత్త నిబంధన కారణంగా ఉదయాన్నే 7 గంటలకు బయల్దేరాలి. పిల్లలు నిద్రలేవక ముందే వదిలేసి రావడం చాలా బాధగా ఉందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ► పోనీ, 5 గంటలకు ఉద్యోగం ముగుస్తుందా.. అంటే అదీ లేదు. వీడియో కాన్ఫరెన్స్లు, టెలీకాన్ఫనెన్స్లు జరిగితే గంటల కొద్దీ సమయంపాటు అక్కడే ఉండాలి. అవి పూర్తయ్యాక ఏ అర్ధరాత్రో అపరాత్రో ఇల్లు చేరాలి. మళ్లీ ఉదయాన్నే విధులకు హాజరవ్వాలి. ► పంచాయతీ కార్యదర్శులపై మండలస్థాయిలో ఎంపీవో, ఎంపీడీవో, డివిజనల్ స్థాయిలో డీఎల్పీవో, ఏపీడీ, పీడీ జిల్లాస్థాయిలో ఏపీవో, డీపీవో వరకు ఇంతమంది సూపర్విజన్ ఉంటుంది. వీరందరూ ఏం పనిచెప్పినా ఎదురుచెప్పకుండా చేయాల్సిందే. ► ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి. జనన మరణ రికార్డులు, ఇంటి పన్నులవసూళ్లు, రెవెన్యూ రికార్డుల నమోదు, పరిపాలనపరమైన విధులన్నీ వీరే నిర్వహించాలి. ► పొరపాటున ఎదురుతిరిగినా, చేయలేమని చెప్పినా, టైమ్కు విధులకు రాలేకపోయినా మెమోలు జారీ చేస్తూ మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నారు. ► హరితహారం మొక్కలు పెరగకపోయినా, ఊర్లో కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకోకపోయినా, చిన్న చెత్త కనిపించినా వెంటనే మెమో జారీ చేస్తారు. ► ఇవి చాలవన్నట్లుగా గ్రామంలో సర్పించి, వార్డుమెంబర్లు, ప్రతిపక్ష నాయకులు, ఊర్లో ఉన్న పెద్దమనుషులు అంతా ప్రతీ పనికి వీరి మీదే పడుతున్నారు. ► ఈ ఉద్యోగాలు చేస్తున్న వారిలో దాదాపు 99 శాతం మంది పీజీలు చదివిన వారే. కరోనాకు ముందు ఈ ఉద్యోగాన్ని చాలామంది మానేద్దామనుకున్నారు. కానీ.. బయట కూడా పరిస్థితి బాగాలేకపోవడంతో విధిలేక ఈ కొలువులోనే కొనసాగుతున్నారు. చదవండి: 50 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి -
తెలంగాణలో 172 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులు
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్లోని పంచాయతీ రాజ్, గ్రామీణ ఉపాధి కమీషనర్ కార్యాలయం.. స్పోర్ట్స్ కోటా కింద రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ► పోస్టులు: జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ► మొత్తం పోస్టుల సంఖ్య: 172 ► అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.స్పోర్ట్స్ కోటా అర్హత సాధించి ఉండాలి. ► వయసు: 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్మెన్లకు మూడేళ్లు, పీహెచ్ అభ్యర్థులకు పదేళ్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ► జీత భత్యాలు: నెలకు రూ.28,719 వేతనం అందిస్తారు. ► ఎంపిక విధానం: రాత పరీక్షతోపాటు క్రీడలకు సంబంధించిన సర్టిఫికెట్ల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, కల్చర్, తెలంగాణ హిస్టరీ నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. అలాగే పేపర్2లో తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ 2018,రూరల్ డవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై 100 మార్కులకు 100ప్రశ్నలు అడుగుతారు.ప్రతి పేపర్లో కనీసం 35మార్కులు సాధించాల్సి ఉంటుంది.ప్రశ్న పత్రం తెలుగు,ఇంగ్లిష్, ఉర్దూల్లో ఉంటుంది. (ఐటీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా ఉద్యోగాలు!) ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 08.10.2021 ► వెబ్సైట్: https://epanchayat.telangana.gov.in/cs -
పంచాయతీ కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఫోన్
పర్వతగిరి: వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామపంచాయతీ కార్యదర్శి రమాదేవితో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. శనివారం కార్యదర్శికి ఫోన్ చేసిన సీఎం.. పంచాయతీలో గృహ నిర్మాణ రికార్డులు, అనుమతులు, నాలా కన్వర్షన్ తదితర వివరాలపై ఆరా తీశారు. ఏనుగల్ పంచాయతీలో రికార్డుల పరంగా ఎన్ని గృహాలు ఉన్నాయి? నమోదు కాని గృహాలు ఎన్ని.. తండ్రి నుంచి పిల్లలకు వారసత్వంగా వస్తే ఏ విధంగా రికార్డు చేస్తారు..? తండ్రి చనిపోతే రికార్డుల్లో నమోదు చేసే విధానం ఏమిటి.. గృహ నిర్మాణ రికార్డులు రెవెన్యూ విభాగంలో పొందుపర్చి ఉంటాయా అని కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. నాలా కన్వర్షన్ తర్వాతనే.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తనతో పాటు కుమారుడు కేటీఆర్ పేరిట ఎర్రవల్లిలో వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. ఇందులోని ఎకరన్నర స్థలంలో గృహ నిర్మాణం చేపట్టేందుకు ఉన్నతాధికారులతో ఆరా తీయగా.. నాలా కన్వర్షన్ అనంతరం గ్రామపంచాయతీ అనుమతి తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. దీంతో నాలా కన్వర్షన్ తదుపరి ఎర్రవల్లి గ్రామపంచాయతీ నుంచి అనుమతి తీసుకుని గృహ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో రైతులు తమ వ్యవసాయ భూముల్లో గృహం నిర్మించాలనుకుంటే ఇదే తరహాలో నాలా కన్వర్షన్ చేశాక నిర్మాణ అనుమతి పంచాయతీ కార్యదర్శులు ఇవ్వాలని సూచించారు. అదే విధంగా ప్రతీ గ్రామపంచాయతీలో రెవెన్యూ శాఖతో సంబంధం లేకుండా గృహ నిర్మాణాల రికార్డులను ఆన్లైన్ చేయాలని తెలిపారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ వ్యవస్థ నెమ్మదిగా ఉన్నా, భవిష్యత్లో పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తామని వివరించారు. కాగా, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ స్వగ్రామం ఏనుగల్ కావడం గమనార్హం. -
పంచాయతీ కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఫోన్
సాక్షి, వరంగల్ రూరల్ : పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవికి శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ రికార్డులపై ఆరా తీశారు. ఎమ్మార్వో ఆఫీసు, పంచాయతీ ఆఫీసుల్లో ఉండే రికార్డులను అడిగి తెలుసుకున్నారు. ఏనుగల్ గ్రామంలో ఇంటి పన్నుల నిర్వహణ, అనుమతుల జారీ, ఇళ్ల యజమానుల పేరు మార్పిడి, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పు తదితర అంశాల గురించిఅడిగి తెలుసుకున్నట్లు రమాదేవి మీడియాకు తెలిపారు. -
కార్యదర్శి, సర్పంచ్ భర్త బాహాబాహీ..
సాక్షి, రఘునాథపల్లి: అభివృద్ధి పనుల్లో జాప్యంపై సర్పంచ్ భర్త, పంచాయతీ కార్యదర్శి పరస్పరం దాడి చేసుకున్నారు. నిధులు డ్రా చేసి పనులు చేయకపోవడంపై నిలదీసినందుకు తనపై దాడి చేశాడని కార్యదర్శి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, తనపై అసత్య ప్రచారం చేస్తూ తననే దుర్భాషలాడి దాడి చేశాడని సర్పంచ్ భర్త కూడా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం భాంజీపేట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భాంజీపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీరంగరెడ్డి, సర్పంచ్ గొరిగె భాగ్య భర్త రవి మధ్య నిధుల విడుదల, తడి పొడి చెత్త వేరు చేసేందుకు సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణంలో జాప్యంపై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణం కోసం రూ.1.14 లక్షల నిధులను పంచాయతీ ఖాతా నుంచి డ్రా చేశారని, ఇప్పటికి షెడ్డు నిర్మించకపోవడంతో అధికారులు తనను ప్రశ్నిస్తున్నారని పంచాయతీ కార్యదర్శి పేర్కొన్నాడు. అధికారులకు సమాధానం చెప్పలేక సర్పంచ్ భర్త రవిని అడిగానని, దీంతో తననే ప్రశ్నిస్తావా అని చొక్కా చింపి దాడి చేశాడని కార్యదర్శి అంటున్నాడు. కాగా, ఇవే విషయాలను ప్రస్తావిస్తూ కార్యదర్శి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉంటే పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్నానని, సీసీ రోడ్డు నాణ్యత లేదని గ్రామంలో తనపై దుష్పచారం చేస్తూ కార్యదర్శి అవమానిస్తున్నాడని సర్పంచ్ భర్త రవి చెబుతున్నాడు. సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణానికి అడ్వాన్స్గా పంచాయతీ నిధులు తీసుకున్న మాట వాస్తవమేనన్నారు. ఈ విషయమై తాను నెమ్మదిగా సమాధానం చెబుతున్నా వినకుండా తననే దుర్మషలాడుతూ చేయిచేసుకోవడంతో రక్తస్రావం జరగడంతో తాను పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రవి పేర్కొన్నాడు. అయితే, సర్పంచ్ భర్త రవి, పంచాయతీ కార్యదర్శి శ్రీరంగరెడ్డి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇరువురిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కందుల అశోక్కుమార్ తెలిపారు. -
ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 425 గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రిటైర్డ్, పదోన్నతి, చనిపోయిన కార్యదర్శుల స్థానే కొత్త పోస్టులు మంజూరయ్యే వరకు.. తాత్కాలిక ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంగళవారం వెల్లడిం చింది. ఈ మేరకు జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నియామకాలు చేపట్టాలని పీఆర్ శాఖ కమిషనర్ కలెక్టర్లను ఇటీవలే ఆదేశించారు. ఈ పోస్టులకు రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ సైనికులనే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రాతిపదికన నియమించే వీరికి నెలకు రూ.15 వేల వేతనం ఇవ్వనున్నారు. ఈ నెలాఖరులోపు భర్తీ చేయనున్న ఈ పోస్టులకు కనీస విద్యార్హతగా డిగ్రీ ఉత్తీర్ణతను నిర్ణయించారు. -
దొడ్డి దారిన ఉద్యోగ భర్తీ చెల్లదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 9,335 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేట ప్పుడు రిజర్వేషన్ల నిబంధనలను అమలు చేయలేదని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–1996లోని రూల్ 22కు వ్యతిరేకంగా ఆ పోస్టులను భర్తీ చేయడంపై కోర్టు ఆక్షేపించింది. 2018లో రాష్ట్రంలోని వివిధ ప్రాం తాల్లో పంచాయతీరాజ్ శాఖ ఆ పోస్టులను భర్తీ చేసింది. అయితే అప్పటికే ఆ పోస్టులను రిజర్వేషన్ల నిబంధనలకు లోబడి భర్తీ చేయాలని హైకోర్టు ఉత్తర్వులున్నా పట్టించుకోలేదు. క్రీడలు ఇతర అన్ని కేటగిరీల రిజర్వేషన్లు 50 శాతం మించకుండా భర్తీ ఉండాలని, వంద పాయింట్ల రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని, ఏపీ సబా ర్డినేట్ రూల్స్ యాక్ట్–1996లోని 22వ నిబం ధనలను అమలు చేయాలన్న చట్ట నిబంధనలను ఉల్లంఘించి పోస్టులు భర్తీ చేశారని తప్పుపట్టింది. చట్టానికి వ్యతిరేకంగా పోస్టుల భర్తీ చేశారని దాఖలైన కోర్టు ధిక్కార వ్యాజ్యం విచారణకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్రావు హాజరయ్యారు. పూర్తి వివరాలు సమర్పిం చేందుకు 8 వారాల సమయం కావాలని ఆయన కోరారు. అందుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు అంగీకరించలేదు. అంతకు ముందు ఉన్న కమిషనర్ నీతూకుమారి ప్రసాద్కు హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. ఇదే విషయాన్ని ఆమెకు తెలియజేయాలని రఘునందన్రావును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. ఐఏఎస్లకు ఆ మాత్రం తెలియదా? ‘దొడ్డి దారిన భర్తీ చేసిన పోస్టులపై ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి. రిజర్వేషన్ల నిబంధన అమలు చేయకుండా పోస్టులను భర్తీ చేస్తే హైకోర్టు చూస్తూ కూర్చోదు. చట్ట వ్యతిరేకంగా భర్తీ చేసిన పోస్టుల్లో చేరిన వారిని ఏం చేస్తారో చెప్పండి. నియామకాలు చేసేటప్పుడు చట్ట ప్రకారం న్యాయపర అభిప్రాయాన్ని కూడా పొందిన తర్వాతే చేయాలన్నది పాలనలో అత్యంత కీలక విషయం అని ఐఏఎస్ అధికారులకు తెలియదా. చట్టాలను సరిగ్గా అమలు చేస్తే కోర్టు ధిక్కార కేసుల నమోదు అనూహ్యంగా ఉండదు. ఈ కేసులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయకపోవడం చట్టవ్యతిరేకం. చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఎవ్వరూ ఉద్యోగాలు పొందడానికి వీల్లేదు. చేసిన తప్పుల్ని ఎలా సరిదిద్దుతారో చెప్పండి. భర్తీ చేసే ముందు అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం తీసుకుని ఉంటే న్యాయపరమైన అవరోధాలు ఉండేవే కావు. తప్పులను సరిదిద్దే చర్యలు ఏం తీసుకున్నారో వచ్చే శుక్రవారం జరిగే విచారణ సమయంలో చెప్పండి’అని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఏ పనికైనా జేబు నిండాల్సిందే..
సాక్షి, యద్దనపూడి (ప్రకాశం): మండల కేంద్రమైన యద్దనపూడి మండల పంచాయతీ తాజామాజీ కార్యదర్శి కుమారస్వామి గత ప్రభుత్వ కాలంలో అప్పటి అధికారపార్టీ నాయకుల అండదండలతో రెచ్చిపోయి ప్రవర్తించిన తీరు ప్రస్తుతం మండలంలో తీవ్ర చర్చనీయాంశమైంది. గత ఎనిమిది సంవత్సరాల్లో యద్దనపూడి పంచాయతీ కార్యదర్శిగా, రెండు సంవత్సరాలుగా ఈఓఆర్డీగా విధులు నిర్వహించిన కుమారస్వామి గత జూలై 23న ఇక్కడ నుంచి బదిలీపై పుల్లల చెరువు మండలం వెళ్లి లాబీయింగ్ ద్వారా ప్రస్తుతం బల్లికురవ మండలం కొప్పెరపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుమారస్వామి ఇక్కడ కార్యదర్శిగా విధులు నిర్వహించిన సమయంలో నాటి అధికార పార్టీ నేతల దెబ్బకు సదరు అధికారిపై నోరుమెదపలేని వారు ప్రస్తుతం ప్రభుత్వం మారటంతో ధైర్యంగా ఒక్కొక్కరు తమకు జరిగిన అన్యాయాలను బహిర్గతం చేయటం గమనార్హం. ఇదిగోండి జాబితా.. ► యద్దనపూడి గ్రామానికి చెందిన రావిపాటి లక్ష్మీకాంతమ్మ అనే వృద్ధురాలికి గత సంవత్సరం జూన్ నెలలో వృద్ధాప్య పింఛన్ మంజూరు కాగా ఆ మహిళకు పెన్షన్ ఇవ్వకుండా అదే గ్రామానికి చెందిన రావిపాటి కాంతయ్య అనే పురుషునికి గత నెల ఆగస్టు వరకు అంటే 14 నెలల పాటు పెన్షన్ ఇచ్చారు. ఇది స్థానికులను విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం సదరు మహిళ ఎంపీడీఓ కార్యాయలంలో, సీఎం పేషీలో ఫిర్యాదు చేయటంతో శుక్రవారం యద్దనపూడి వచ్చిన కుమారస్వామి స్థానిక నేతల ద్వారా ఆ మహిళతో రాజీయత్నం చేయటం గమనార్హం. ► అలాగే మండలంలో గన్నవరం గ్రామానికి చెందిన కేతినేని అంజమ్మ అనే మహిళ యద్దనపూడి గ్రామ పరిధిలో 2016లో అంజలి ఇండస్ట్రీస్ పేరుతో ఫ్యాక్టరీ స్థాపించేందుకు అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకుంది. లక్ష రూపాయలు ఇస్తేనే అప్రూవల్ ఇస్తానని చెప్పటంతో చేసేదేమి లేక రూ.30 వేల నగదును ఇచ్చింది. మరోసారి రూ.70 వేలను అంజలి ఇండస్ట్రీస్ బ్యాంకు ఖాతా నెంబరు 916020070482078 నుంచి కుమారస్వామికి చెందిన స్టేట్ బ్యాంకు ఖాతాకు జమ చేసింది. ఆ తర్వాతే అప్రూవల్ మంజూరు చేసినట్లు బాధితులరాలు వాపోయింది. ► యద్దనపూడి గ్రామంలో హౌస్ అప్రూవల్ కోసం నల్లపునేని అనీల్ వద్ద రూ.60 వేలు, ఎన్. సీతమ్మ అనే మహిళ రూ.20 వేలు, టి.బాబు వద్ద రూ.22 వేలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ► 100 శాతం అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు గతంలో రూ.1500 పెన్షన్ ఇవ్వాల్సి ఉండగా చాలామందికి రూ.1000 మాత్రమే ఇచ్చినట్లు బాధితుల ఆరోపణ. అలాగే పంచాయతీ నీటికుళాయి కనెక్షన్కు పరిమితికి మించి వసూలు చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అలాగే గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టకుండానే లక్షల రూపాయల నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఆయన బదిలీపై వెళ్లినా పూర్తిస్థాయిలో రికార్డులు కూడా సదరు పంచాయతీలకు అందజేయలేదని గ్రామస్తులు చెప్పటం గమనార్హం. ► మరణధ్రువీకరణ పత్రాల మంజూరులో రూ.3 వేల నుంచి రూ.8 వేలు వరకు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. గతంలో పర్చూరు మండలం చెరుకూరులో, చీమకుర్తిలో అవినీతి ఆరోపణలపై రెండుసార్లు సస్పెండ్ అయినప్పటికీ కుమారస్వామి తన ప్రవర్తన మార్చుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అతనిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇవన్నీ ఆరోపణలే.. కొందరు కావాలనే నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. లక్ష్మీకాంతం పింఛన్ విషయంలో పొరపాటు పడిన మాట వాస్తవమే. - పంచాయతీ కార్యదర్శి కుమారస్వామి -
కాలేజీ చదువులు
సాక్షి, అమరావతి రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఆధోగతిలో ఉన్నట్లు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరీక్షల ఫలితాల్లో తేటతెల్లమైంది. ఇటు ప్రభుత్వంలో అటు ప్రైవేట్ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఇతర డిగ్రీ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు బాగా దిగజారి పోయాయనేందుకు సచివాలయ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం నిదర్శనంగా నిలుస్తోంది. పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు బీటెక్ (కంప్యూటర్స్)తో పాటు పీజీ చేసిన వారు ఏకంగా 2,72,088 మంది పరీక్షలు రాశారు. అయితే ఇంత మంది పరీక్షలు రాస్తే ఉత్తీర్ణులైన వారి సంఖ్య చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. కేవలం 3,623 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించడం చూసి ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫలితాలు విద్యాలయాల్లో విద్యా ప్రమాణాలను ఎత్తి చూపుతున్నాయని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. డిజిటల్ అసిస్టెంట్ పరీక్షకు సంబంధించి 150 మార్కులకు గాను 60 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లు. అయితే పరీక్ష రాసిన వారిలో ఉత్తీర్ణత కేవలం 1.33 శాతమే ఉండటం విద్యా ప్రమాణాలు ఇంత దిగజారిపోయాయా అని ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 11,158 డిజిటల్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించగా ఉత్తీర్ణులైన వారు కేవలం 3,623 మంది మాత్రమే ఉండటం గమనార్హం. వార్డు శానిటేషన్ కార్యదర్శి పోస్టుల ఉత్తీర్ణత శాతం కూడా విద్యా ప్రమాణాలను ఎత్తి చూపింది. ఈ పోస్టులకు 52,334 మంది పరీక్షలు రాస్తే, కేవలం 1,474 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. డిగ్రీలు, పీజీలు చేసిన వారు పరీక్షలు రాసినప్పటికీ కనీస అర్హత మార్కులను కూడా సాధించలేకపోయారు. అంటే పరీక్షలు రాసిన వారిలో కేవలం 2.8 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. మొత్తం వార్డు శానిటేషన్ కార్యదర్శి పోస్టులు 3,648 ఉండగా 52,334 మంది పరీక్షలు రాయగా కేవలం 1,474 మందే ఉత్తీర్ణులవ్వటం గమనార్హం. అలాగే గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ పోస్టుల పరీక్షల ఉత్తీర్ణత శాతం చూస్తే అగ్రికల్చర్ బీఎస్సీ విద్యా ప్రమాణాలు దిగజారిపోయాయనే అనుమానం కలుగుతుంది. 6,714 గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ పోస్టులకు 22,622 మంది పరీక్షలు రాయగా కేవలం 6,239 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అంటే ఉత్తీర్ణత 27.57 శాతం మాత్రమే. వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శి పోస్టుల పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంది. 3,770 పోస్టులకు 12,643 మంది పరీక్ష రాయగా 2,096 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అంటే ఉత్తీర్ణత 16.57 శాతం మాత్రమే. విద్యా ప్రమాణాలు పెంచడంపై సర్కారు దృష్టి ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి ఇచ్చిన గత ప్రభుత్వాలు ఆ కాలేజీల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల గురించి పట్టించుకోలేదు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను ప్రోత్సహించిన గత ప్రభుత్వాలు ప్రభుత్వ రంగంలోని కాలేజీలను నీరుగార్చాయి. దీంతో అటు ప్రైవేట్ రంగం, ఇటు ప్రభుత్వ రంగంలోని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు నిర్వీర్యం అయినట్లు సచివాలయ ఉద్యోగుల పరీక్షల ఉత్తీర్ణత శాతం స్పష్టం చేస్తోంది. ఈ పరీక్షల ఉత్తీర్ణత శాతాలతో సంబంధం లేకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేట్ రంగంలోని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఉన్నత విద్యా సంస్థల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలను పెంచనున్నారు. -
చికిత్సపొందుతూ పంచాయతీకార్యదర్శి మృతి
నాగర్కర్నూల్: పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి స్రవంతి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి నిమ్స్లో మృతి చెందింది. నాగర్కర్నూల్ పట్టణానికి చెందిన స్రవంతి గుమ్మకొండలో పంచాయతీకార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నక్రమంలో గురువారం మధ్యాహ్నం కార్యాలయంలోనే పురుగుమందు తాగిన విషయం తెలిసిందే. స్రవంతి భర్త 8 నెలల క్రితం నాగర్కర్నూల్లో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందాడు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు -
గ్రామపంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం
నాగర్కర్నూల్/జడ్చర్ల టౌన్: పనిఒత్తిడి తట్టుకోలేక జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిన్నపల్లి గ్రామ జూనియర్ కార్యదర్శి ప్రత్యూష ఉద్యోగానికి రాజీనామా చేయగా, గురువారం నాగర్కర్నూలు జిల్లా తిమ్మా జిపేట మండలం గుమ్మకొండ జూని యర్ కార్యదర్శి స్రవంతి ఆత్మహత్యకు యత్నించింది. ‘30 రోజుల ప్రణాళిక’లో భాగంగా గురువారం తిమ్మాజిపేట మండలం గుమ్మకొండలో బడ్జెట్పై గ్రామసభ నిర్వహించారు. సభ ముగిశాక స్రవంతి కార్యాలయంలోనే పురుగుల మందు తాగింది. వెంటనే స్థానికులు స్రవంతిని తిమ్మాజిపేట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. స్రవంతి స్వస్థలం నాగర్కర్నూల్. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త ఏడు నెలల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. -
‘జూనియర్స్’ రాజీనామా
సాక్షి, కరీంనగర్: నిరుద్యోగ యువతకు జూనియర్ పంచాయతీ కార్యదర్శి కొలువు దొరికిన సంబరం లేకుండా పోతోంది. బాధ్యతల బరువు, ఒత్తిడి తట్టుకోలేక రాజీనామాకు సిద్ధం అవుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం గతంలో కార్యదర్శులకు ఉన్న చెక్పవర్ తొలగించడంతోపాటు అదనంగా హరితహారం, పారిశుధ్య నిర్వహణ, ఓడీఎఫ్, ప్రభుత్వ పథకాల అమలు బాధ్యతలు అప్పగించింది. మరో వైపు సర్పంచులు, అధికార పార్టీ నాయకులు తమ పనుల కోసం ఒత్తిళ్లు తేవడమే కాకుండా దాడులకు పాల్పడుతున్నారు. రెండువైపుల నుంచి ఒత్తిళ్లు భరించలేక కొందరు కార్యదర్శులు కొత్త ఉద్యోగాల్లో చేరగా.. మరికొందరు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. గతనెల 23న కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి పద్మపై సర్పంచు భర్త బలుసుల శంకరయ్య దౌర్జన్యం చేయడం జిల్లాలో వివాదాస్పదంగా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై కార్యదర్శులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం పనిచేసే అవకాశం లేకుండా పోతుందంటూ పలువురు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12మంది రాజీనామా.. కరీంనగర్ జిల్లాలో మొత్తం 313 గ్రామ పంచాయతీలుండగా ప్రభుత్వం ఏప్రిల్ 12న మొత్తం 205మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను కేటాయించింది. వీరిలో 197మంది మాత్రమే ఉద్యోగాల్లో చేరగా మిగతా 8మంది వివిధ కారణాలతో బాధ్యతలు చేపట్టలేదు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్లో కొందరు రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక ఉద్యోగాన్ని వదులుకుంటున్నారు. కార్యదర్శులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే ప్రభుత్వం నియమించడంతో క్షేత్రస్థాయిలో పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. విధినిర్వహణపై అవగాహన లేకపోవడంతోపాటు కొత్తపంచాయతీరాజ్ చట్టంతో బాధ్యతలు పెరగడం, పనిభారంతో ఆందోళనకు గురవుతున్నారు. మూడేళ్ల వరకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో మంచి ఉద్యోగాలు రావడంతో కార్యదర్శి ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం కార్యదర్శులకు జీతాలు సైతం చెల్లించలేదు. ఇటీవల ప్రకటించిన ఎస్సై, ఫారెస్ట్బీట్ ఆఫీసరు ఉద్యోగాలకు పలువురు కార్యదర్శులు ఎంపికయ్యారు. దీంతో వెంటనే కార్యదర్శి పోస్టులకు రాజీనామా చేసి ఆయా ఉద్యోగాల్లో చేరిపోయారు. ప్రస్తుతం జిల్లాలో 12మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ పదవులకు రాజీనామా చేశారు. త్వరలో ప్రకటించే గ్రూప్–2, కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మరికొందరు కార్యదర్శులు సైతం రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. -
సర్పంచ్కు ఆ అధికారం లేదు
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని పంచాయతీ చేసే తీర్మానాన్ని అమ లు చేయాలని నోటీసు జారీ చేసే అధికారం గ్రామ సర్పంచ్లకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీ తీర్మానాన్ని పంచాయతీ కార్యదర్శి ద్వారా అమలు చేయించాలని చట్టం చెబుతోందని, గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ప్రకారం నోటీసును నేరుగా గ్రామ సర్పంచ్ జారీ చేసే అధికారం చట్టంలో లేదని తెలిపింది. రంగారెడ్డి జిల్లా శంషా బాద్ మండలం నానాజీపూర్కి చెందిన రైతు వంగ రాఘవరెడ్డి దాఖలు చేసిన కేసులో హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ప్రహరీ నిర్మాణం వల్ల రోడ్డు మూసుకుపోతుందని, అక్రమంగా నిర్మించిన ప్రహరీని తొలగించాలని గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ప్రకా రం నోటీసును నేరుగా అక్రమ కట్టడానికి పాల్పడిన వ్యక్తికి సర్పంచ్ జారీ చేయడాన్ని తప్పుబడుతూ రాఘవరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి చేయాల్సిన విధుల్ని సర్పంచ్ చేయడం చట్ట వ్యతిరేకమని, పంచాయతీరాజ్ చట్టంలోని 32 సెక్షన్ ప్రకారం సర్పంచ్కు అధికారం పరిమితమని పిటిషనర్ తరఫు న్యాయవాది జనార్దన్రెడ్డి వాదించారు. పంచాయతీ చట్టం ప్రకారం పంచాయతీలకు అధికారం ఉంటుందని, పంచాయతీ తీర్మానం ప్రకారం సర్పంచ్ నోటీ సు ఇవ్వొచ్చని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. వాద నలు విన్న హైకోర్టు ‘పంచాయతీ శాఖ కమిషనర్ చట్టంలోని 42వ సెక్షన్ ప్రకారం గ్రామ పంచాయతీ కార్యదర్శిని నియమిస్తారు. కార్యదర్శే పంచాయతీ స్థిరచరాస్తుల రక్షణ, నిర్వహణ బాధ్యతలు నిర్వహించాలి. ఆస్తుల అంశంపై పంచాయతీ పాలకవర్గం చేసే తీర్మానాన్ని కార్యదర్శే అమలు చేయాలి. ఈ కేసులో పిటిషనర్ సర్పంచ్ నేరుగా నోటీసు ఇవ్వడాన్ని సవాల్ చేయడం సరైనదే. సర్పంచ్కు నోటీసు ఇచ్చే అధికారం లేదు’ అని స్పష్టం చేస్తూ వ్యాజ్యంపై విచారణ ముగిసినట్లుగా ప్రకటించింది. -
వనజ.. అనే నేను..!
వెనుకబాటుతనం నుంచి పురోగతి దిశగాకట్టుబాట్లు, వెలివేత నుంచి సర్పంచ్ వరకుచదువు, కుటుంబ పోషణతో పాటు ప్రజాసేవపోటీ పరీక్షల్లోనూ ప్రతిభ చాటుకుని ఉద్యోగంసంగారెడ్డికి చెందిన ఓ మహిళ ప్రస్థానం వెనుకబాటు తనం.. బాల్య వివాహం.. సామాజిక వివక్ష.. కుటుంబ పోషణ.. మహిళా పురోగతికి అవరోధాలు. వీటన్నింటినీ అధిగమిస్తూ తనను తాను ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ముందుకు సాగుతోంది ఈ ముపై ్ప నాలుగేళ్ల వనిత. సామాజిక కార్యకర్తగా, సర్పంచ్గా పనిచేసి పలువురి మన్ననలు అందుకున్న మహిళ.. ఇటీవలి పంచాయతీ కార్యదర్శుల పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకుంది. ఓ వైపు భర్తకు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూనే జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపనతో ముందుకు సాగుతున్న సంగారెడ్డి జిల్లా కల్పగూరు గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ తాలెల్మ వనజ సక్సెస్ అండ్ స్ట్రగుల్ సోరీ.. ఆమె మాటల్లోనే:‘‘మా నాయిన ఉపాధి కోసం పుల్కల్ మండలం ఇసోజిపేట నుంచి మంజీర డ్యాం కట్టే సమయంలో వలస వచ్చిండు. మేం మొత్తం నలుగురం. ఇద్దరు అక్కచెల్లెళ్లం. ఇద్దరు అన్నదమ్ములు. డ్యాం నిర్మాణం పూర్తికావడంతో మా నాయిన గంగారాం ఇక్కడే డ్యాం దగ్గర చిన్న ఉద్యోగం సంపాదించిండు. మా బాల్యమంతా మంజీర డ్యాం పరిసరాల్లోనే సాగింది. పక్కనే ఉన్న కల్పగూరు స్కూళ్లో పదో తరగతి వరకు చదివిన. స్కూల్లో చదువులో ముందున్నా.. తాగుడుకు బానిసైన మా నాయిన ఏ విషయాన్నీ పట్టించుకునే వాడు కాదు. పది తర్వాత దగ్గరలో ఉన్న సంగారెడ్డి బాలికల కాలేజీలో ఇంటర్మీడియెట్లో చేరిన. చదువు ఆగిపోతుందనుకునే సమయంలో మా బాబాయి సంగారెడ్డిలో ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ బీఎస్సీ కోర్సులో చేర్పించిండు. డిగ్రీ రెండో సంవత్సరంలో ఉండగానే కల్పగూరుకు చెందిన జనార్దన్తో పెళై్లంది. పదో తరగతి చదివిన ఆయన హైదరాబాద్లో కుష్టు వ్యాధి నిర్మూలనకు సంబంధించిన లెప్రా సొసైటీలో చిరుద్యోగం చేసేవారు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో గర్భవతిని కావడంతో కాలేజీకి వెళ్లలేక పోయా. దీంతో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో చదువు అర్ధంతరంగా నిలిచిపోయింది. బాబు పుట్టడంతో ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. లెప్రా సొసైటీ శాఖ సంగారెడ్డిలో ప్రారంభించడంతో అందులో నేనూ చేరి ఉద్యోగం చేయడం మొదలుపెట్టా. ఉద్యోగం చేస్తూనే.. తీరిక సమయాల్లో చదివి డిగ్రీ పూర్తి చేశా. ఆ వెనువెంటనే బీఈడీ ఎంట్రన్స్లో సీటు సాధించినా, మా నాన్న చనిపోవడంతో చేరలేకపోయా. మరుసటి ఏడాది పటాన్చెరులోని ఓ బీఈడీ కాలేజీలో చేరి పూర్తి చేశా. బోధన అనుభవం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఓ ప్రై వేటు స్కూల్లో టీచర్గా చేరా. సర్పంచ్గా కొత్త బాధ్యత ఓ వైపు ప్రై వేటు స్కూళ్లో టీచర్గా పనిచేస్తూనే 2012 డీఎస్సీకి ప్రిపేరయ్యా. కేవలం అరమార్కు తేడాతో ఉద్యోగాన్ని దక్కించుకోలేకపోయా. కొద్ది నెలలకే 2013లో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. మా గ్రామం కల్పగూరు సర్పంచ్ పదవిని ఎస్సీ మహిళలకు రిజర్వు చేసింది. మాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా.. చదువుకున్న అమ్మాయి సర్పంచ్ అయితే బాగుంటుందని కొందరు గ్రామస్తులు నా భర్తను సంప్రదించారు. అయితే మా సామాజిక వర్గంలోనే కొందరు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. తమ మాటను ధిక్కరించి పోటీ చేస్తే కుల బహిష్కరణ చేస్తామని తీర్మానం కూడా చేశారు. ఈ హెచ్చరికను సవాలుగా తీసుకుని పోటీలో దిగి గ్రామస్తుల మద్దతుతో సర్పంచ్గా గెలుపొందా. ఐదేళ్ల పదవీ కాలం నాకు అనేక విషయాలను నేర్పింది. గ్రామ పాలనకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు, మెటీరియల్, అధికారుల సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి. మొదట్లో గ్రామ సభల్లో కొంత తడబాటుకు గురైనా, నిబంధనలపై పట్టుచిక్కిన తర్వాత.. ఎవరితోనూ మాట పడకుండా పాలన సాగించా. భర్త చాటు భార్య అనే మచ్చ రాకుండా పనిచేయడంపైనే నా దృష్టి ఉండేది. వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన మహిళగా అక్కడక్కడా కొంత వివక్ష ఎదురైనా.. పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు. ఐదేళ్ల కాలంలో గ్రామ పంచాయతీకి కొత్త భవనం సమకూర్చడంతో పాటు, దాదాపు గ్రామం అంతా సీసీ రోడ్లు నిర్మించాం. సర్పంచ్గా పనిచేసిన ఐదేళ్ల కాలంలో 2016 ఏప్రిల్లో జంషెడ్పూర్లో ప్రధాని మోడీ మొదలుకుని, మంత్రులు, కలెక్టర్లను కలిసే అవకాశం దక్కింది. దీంతో కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన మరింత పెరిగింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కోరికను ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. సర్పంచ్గా పనిచేస్తున్న కాలంలో కొందరు ఉద్యోగుల పనితీరు అంత సంతృప్తిగా అనిపించేది కాదు. ఉద్యోగం చేయడం కూడా ఓ రకమైన సేవ అనే అవగాహన ఏర్పడింది. దీంతో సర్పంచ్గా పనిచేస్తూనే, వ్యవసాయంలో నా భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ ప్రారంభించా. సంగారెడ్డి అంబేడ్కర్ స్టడీ సర్కిల్లో జరిగే పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వో తదితర పరీక్షలకు ప్రిపేర్ అయ్యా. ఇద్దరు బాబుల బాగోగులను చూసుకుంటూనే, వీలు చిక్కినప్పుడు స్టడీ మెటీరియల్ను తిరగేసేదాన్ని. ఈ ఏడాది ఆగస్టులో సర్పంచ్గా పదవీ కాలం పూర్తయినా, గ్రామస్తుల బాగోగుల్లో నా వంతు పాత్ర పోషిస్తూనే పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాశా. సర్పంచ్గా పనిచేసిన అనుభవం పరీక్షలో ఉపయోగపడటం.. ఉద్యోగ సాధనలో కలిసి వచ్చింది. నా ప్రస్థానంలో ఇది ఒక అడుగు మాత్రమే అనుకుంటున్నా.. పీజీ చదువుతో పాటు గ్రూప్ పరీక్షలపై దృష్టి పెట్టాలన్నదే నా సంకల్పం.. రాజ్యాంగం.. అంబేడ్కర్.. ఇవన్నీ బాల్యం నుంచి వింటున్నా.. పూర్తిగా అర్థమయ్యేది కాదు.. ఆయన ఇచ్చిన శక్తి ఏంటో.. తెలిసిన కొద్దీ ఉత్సాహం పెరుగుతోంది. – కల్వల మల్లికార్జున్రెడ్డి, సాక్షి, సంగారెడ్డి -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
చీరాల(ప్రకాశం): అతని సర్వీసు అంతా అవినీతి...అక్రమాలతో చీరాల ప్రాంత ప్రజలను పీల్చుకుతిన్న ఓ తిమింగలం ఎట్టకేలకు ఏసీబీ వలలో చిక్కుకుంది. దేవాంగపురి తాజా మాజీ సర్పంచ్ పృధ్వీ చాందినీ పంచాయతీలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు విడుదల చేసేందుకు రూ.70 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కాడు. బుధవారం ఒంగోలు ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ దేవాంగపురి పంచాయతీ కార్యదర్శి వై.చెంచును రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. డీఎస్పీ వివరాల మేరకు.. దేవాంగపురి గ్రామంలో 14వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులతో గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ పృధ్వీ చాందినీ 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో రూ.18.60 లక్షలకు అభివృద్ధి పనులు చేశారు. వీటిలో రూ.15 లక్షలను గతనెల 274 తేదీన సర్పంచ్ ఖాతాకు నిధులు జమ అయ్యాయి. మిగిలిన రూ.3.60 లక్షల బిల్లులు చెల్లించాలని పంచాయతీ సెక్రటరీ వై.చెంచును చాందినీ, అతని భర్త సుబ్బారావులు పలుమార్లు పం కోరారు. అయితే తనకు లంచం ఇస్తేనే మీ బిల్లులు చెల్లింపులు చేస్తామని తేల్చి చెప్పడంతో సర్పంచ్ దంపతులు ఈనెల 6వ తేదీ ఒంగోలు ఏసీబీ ప్రభాకర్ను లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఏసీబీ అధికారులు రసాయనాలు కలిపిన నగదు రూ.70 వేలను సర్పంచ్ దంపతులకు అందించి సెక్రటరీ చెంచుకు ఇప్పించారు. ఈ నేపథ్యంలో నగదును లెక్కించుకుని చెంచు జేబులో పెట్టుకుంటుండగా డీఎస్పీ ప్రభాకర్, సీఐలు ప్రతాప్, ఎస్సై రాఘవలు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడు చెంచుపై పలు అవినీతి ఫిర్యాదులు తమకు అందాయని, ప్రజలతో పాటు సర్పంచ్లను కూడా లంచాల కోసం వే«ధిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతున్నామని తెలిపారు. పంచాయతీ పన్నులు, ప్లాన్లు, బిల్లుల చెల్లింపులకు సంబంధించి కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ కోటేశ్వరరావు రికార్డులను బీరువాలో పెట్టుకుని పరారీలో ఉన్నాడని .. ఇతనిపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన చెంచు గతంలో చినగంజాంలో పనిచేస్తూ అవినీతి, అక్రమాల్లో నేరం రుజువు కావడంతో సస్పెండ్ అయ్యాడని, రామకృష్ణాపురంలో అక్రమాలపై విచారణ జరిగినట్లు తమ విచారణలో తేలిందన్నారు. అనంతరం స్థానిక పోలీసుల సహకారంతో బీరువాను తెరచి పంచాయతీ సెక్రటరీ రికార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీకి సమాచారం ఇవ్వండి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, లంచాల కోసం వేధిస్తున్న వారి వివరాలు, అక్రమార్జనల గురించి తమకు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారిపేర్లు గోప్యంగా ఉంచడంతో పాటు వారికి అండగా ఏసీబీ ఉంటుందన్నారు. అక్రమాలపై డీఎస్పీ 9440446189, సీఐ 9440446187, ఎస్సై 833925624 నంబర్లను సంప్రదించాలన్నారు. చెంచు అక్రమాలపై ‘సాక్షి’ కథనాలు ఏసీబీ వలలో లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి చెంచు ఎక్కడ పనిచేసినా అక్రమాలకు పాల్పడటం అలవాటు. గతంలో చినగంజాంలో పనిచేస్తున్న సమయంలో సస్పెండ్ అయ్యాడు. అలానే రామకృష్ణాపురం పంచాయతీ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్న చెంచు పింఛన్లు కాజేస్తున్న వైనం పోయినోళ్ల పింఛన్లు స్వాహా’ కథనం సాక్షి ప్రచురించింది. గ్రామంలో చనిపోయిన వారి పేర్లతో మూడు నెలల పాటు రూ. 55 వేలు అక్రమంగా తీసుకోవడం, బిల్డింగ్ ప్లాన్లు మంజూరులో భారీ స్థాయిలో నగదు వసూళ్లు చేశాడు. దీనిపై రెండు సార్లు సాక్షి కథనాలు ప్రచురించగా డీపీఓ, ఈవోఆర్డీలు విచారించి చెంచుపై శాఖా పరమైన చర్యలకు సిఫార్సు చేశారు. అయినా కార్యదర్శి చెంచు లంచాలను తీసుకోవడం మానలేదు. మరోసారి ఏసీబీ అధికారులకు పట్టుబడి సస్పెండ్తో పాటు జైలుకు వెళ్లనున్నాడు. -
మరో రంగస్థలం
జిల్లాలోని కుల్లూరు పంచాయతీలో ప్రస్తుతం రంగస్థలం కథ నడుస్తోంది. పంచాయతీ ఎన్నికలు రాక ముందే అక్కడ వాతావరణం వేడెక్కింది. పంచాయతీలో ఓ ప్రజాప్రతినిధి చెప్పిందే వేదం. ఆయన చెప్పినట్లు అధికారులు, ప్రజలు వినాల్సిందే. వినకపోతే వారిపై అవినీతి, అక్రమాల పేరుతో అధికారుల చేత విచారణలు, వేదింపులకు గురి చేస్తున్నాడు. తప్పు చేయకపోయినా.. చేసినట్లు ఆధారాలు లేకపోయినా.. ఏదో ఒక విధంగా చర్యలు తీసుకునేలా అధికారులపై ఒత్తిళ్లు చేయిస్తున్నాడు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రజాప్రతినిధి చెప్పినట్లు చేయడం లేదనే అక్కసుతో అతనిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆకాశారామన్న ఫిర్యాదులు తీసుకెళ్లి జిల్లా అధికారులకు అందజేసి విచారణ పేరుతో వేదిస్తున్నారు. అధికారులు కూడా ఆకాశ రామన్న ఫిర్యాదులకు అత్యంత ప్రధాన్యం ఇచ్చి కింది స్థాయి అధికారులతో విచారణలు చేయిస్తున్నారు. విచారణలో ఎలాంటి ఆధారాలు లేదని నివేదికలు అందజేస్తే మరొక ఆకాశ రామన్న ఫిర్యాదు చేసి విచారించి చర్యలు తీసుకోమని ఒత్తిడి తెస్తున్నారు. నెల్లూరు(పొగతోట): జిల్లాలోని కలువాయి మండలంలో ఉన్న కుల్లూరు మేజర్ పంచాయతీలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి పి.వంశీకృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్(ఎఫ్ఏ)గా పని చేస్తూ కూలీలకు పనులు కల్పిస్తున్నాడు. ఉపాధి హామీ పనులు కల్పించడంలో ఈ పంచాయతీ ప్రథమ స్థానంలో ఉండడంతో ఎఫ్ఏ వంశీకృష్ణ ఎంపీడీఓ చేతులమీదుగా అవార్డు కూడా అందుకున్నారు. ఉ పాధి కూలీలకు రోజుకు రూ.200లకు పైగా వేత నం మంజూరయ్యేలా పనులు చూపిస్తున్నాడు. ఎఫ్ఏ తాను చెప్పినట్లుగా నడుచుకోలేదని ప్రజా ప్రతినిధి ఆకాశ రామన్న ఫిర్యాదులు చేయడం ప్రారంభించాడు. ఇద్దరు, ముగ్గురు కూలీలను రెచ్చగొట్టి ఎఫ్ఏపై ఫిర్యాదులు చేయించాడు. కొద్ది రోజుల తరువాత ఫిర్యాదులు చేసిన కూలీలు ఎంపీడీఓ వద్దకు వచ్చి తమకు రాజకీయాలతో సంబంధం లేదని, ఎఫ్ఏ తమకు పనులు కల్పిస్తున్నాడని, అతను అక్రమాలకు పాల్పడడం లేదని తెలిపారు.\ తమకు రావాల్సిన వేతనాలు అతను తీసుకోవడం లేదని ఎంపీడీఓకు రాతపూర్వకంగా వివరించారు. అనంతరం ఆ ప్రజాప్రతినిధి కూలీలు కాకుండా పంచాయతీ పాలక సభ్యులతో ఫిర్యాదు చేయించాడు. ఫిర్యాదు అందుకున్న అధికారులు ఆగమేఘాలపై కుల్లూరులో ఈ నెల 18వ తేదీన విచారణ చేపట్టారు. విచారణ సమయంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. గతంలో ఆధారులు లేని ఫిర్యాదుకు సంబంధించి బ్యాంక్ కార్సండెంట్ నుంచి కూలీలకు ఇవ్వాల్సిన రూ.1.20 లక్షల నగదు ఎఫ్ఏ తీసుకున్నాడని అతనితో రాయించుకుని దీనిపై క్రిమినల్ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఉపాధి పనులు చేసినందుకు బ్యాంక్ కార్సండెంట్ కూలీలకు వేతనాలు ఇవ్వాల్సిఉంది. దానితో ఎఫ్ఏకు ఎలాంటి సంబంధం ఉండదు. చేసిన పనులకు వేతనాలు ఇంత వరకు ఇవ్వలేదని కూలీలు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. ఫిర్యాదులు చేయకుండా బ్యాంక్ కార్సండెంట్ నుంచి ఎఫ్ఏ నగదు తీసుకుపోయడంటే గుడ్డిగా ఏవిధంగా కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తే పై నుంచి ఏస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయో అర్థమవుతోంది. అవినీతిని కప్పిపెట్టి.. కుల్లూరు పంచాయతీలో రోడ్లు వేయకుండా రూ.లక్షల బిల్లులు స్వాహా చేసిన పంచాయతీ కార్యదర్శిపై ఎలాంటి విచారణ చేయలేదు. పంటకుంటల బిల్లులు మంజూరు కాగానే వాటిని పూడ్చి వేసి పంటలు సాగు చేస్తున్నా వాటిపై ఎలాంటి విచారణ చేయడం లేదు. పంచాయతీ కార్యదర్శి నిధులు స్వాహా చేశారని జిల్లా అధికారులకు నాలుగు పర్యయాలు ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టలేదు. ఉపాధి టీఏకు రూ.3.50 లక్షల రికవరీ పడితే దానిని రూ.14 వేలకు తగ్గించారు. దీనిపై ఇంత వరకు విచారణ చేయలేదు. అధికారపార్టీ ప్రజాప్రతినిధి కావడంతో అధికారులు ఆయన చెప్పినట్లు చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయిన ఎఫ్ఏపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేయడం చేస్తుండడం గమనార్హం. -
రెండు నెలల్లో 9,200 పోస్టుల భర్తీ
-
ఏసీబీ వలలో తణికెళ్ల కార్యదర్శి
సాక్షి, ఖమ్మం: లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కొణిజర్ల మండలం తణికెళ్ల పంచాయతీ సెక్రటరీ ఇంటి నిర్మాణ పనుల కోసం లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. -
మరొకరు చిక్కారు
ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి చేప పడింది. ఈ నెల తొమ్మిదో తేదీన రీపోస్టింగ్ కోసం కె.జమ్మయ్య అనే ఉపాధ్యాయుడు నుంచి డీఈవో కార్యాలయంలోని సూపరింటెండెంట్ ఎ.విక్టర్ప్రసాద్ 20 వేల రూపాయలను లంచంగా తీసుకుంటూ పట్టుబడిన విషయాన్ని మరువకముందే మరో అవినీతి చేప పట్టుబడడం చర్చనీయాంశమైంది. ఈసారి పాపులేషన్ సర్టిఫికెట్ జారీకి రూ. 10 వేలు డిమాండ్ చేసి..రూ. 6 వేలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్హ్యాండెడ్గా ఎచ్చెర్ల మండలం కుశాలపురం పంచాయతీ కార్యదర్శి తెంబూరు కూర్మారావు గురువారం చిక్కారు. ఎచ్చెర్ల క్యాంపస్: కుశాలపురం పంచాయతీ (ఫరీదుపేట ఇన్చార్జి) గ్రామ కార్యదర్శి తెంబూరి కూర్మారావు ఆరు వేల రూపాయలను లంచంగా తీసుకుంటూ పంచాయతీ కార్యాలయంలోనే పట్టుబడ్డారని అవినీతి నిరో« దకశాఖ (ఏసీబీ) డీఎస్పీ కరణం రాజేంద్ర తెలిపారు. ఫరీదుపేట గ్రామానికి చెందిన యువకుడు సీపా న దిలీప్ కుమార్కు కుశాలపురం పంచాయతీ పరిధి నవభారత్ సమీపంలో స్థలం ఉంది. ఇక్కడ పేపర్ ప్లేట్లు, గ్లాస్ తయారీ పరిశ్రమ స్థాపించాలనుకున్నారు. ఇందుకోసం ఖాదీబోర్డు శాఖకు రాయితీ రుణం కోసం దరఖాస్తు చేసేందుకు పాపులేషన్ సర్టిఫికెట్ అవసరమైంది. సర్టిఫికెట్ కోసం కార్యదర్శి కూర్మారావును ఫోన్లో దిలీఫ్ సంప్రదించగా రూ. 10 వేలు డిమాండ్ చేశారు. యువకుడు కార్యదర్శి ఫోన్ సంభాషణను కూడా వాయిస్ రికార్డు చేసి ఏసీబీ అధికారులను సంప్రదించారు. కార్యదర్శికి రూ. 6 వేలు ఇచ్చేందుకు యువకుడు దిలీప్ అంగీకరించాడు. స్వీయ ధ్రువీకరణతో పాపులేషన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. గురువారం కుశాలపురంలోని పంచాయతీ కార్యాలయంలో దిలీప్ కుమార్ కార్యదర్శి కూర్మారావుకు లంచంగా ఆరు వేల రూపాయలను అందజేస్తుండగా.. అప్పటికే మాటువేసి ఉన్న ఏసీబీ శ్రీకాకుళం డీఎస్పీ కరణం రాజేంద్ర, సీఐలు రమేష్, శ్రీనివాసరావు దాడి చేసి పట్టుకున్నారు. ఏసీబీ అధికారులను గమనించిన కార్యదర్శి పంచాయతీ సహాయకుడుగా పని చేస్తున్న మెరక ప్రసాదరావు చేతిలో డబ్బులు పెట్టేప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఏసీబీ అధికారులు దాడి చేయడంతో ఆయన ప్రయత్నం విఫలమైంది. లంచంగా తీసుకున్న ఆరు వేల రూపాయలను ఏసీబీ అధికారులు కార్యదర్శి నుంచి స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేశారు. కూర్మారావును అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు తరలించామని డీఎస్పీ కరణం రాజేంద్ర చెప్పారు. చర్చనీయాంశం గ్రామ కార్యదర్శి ఏసీబీకి చిక్కడం ఎచ్చెర్ల మండలంలో చర్చనీయాంశమైంది. ఎచ్చెర్ల మండలంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఇటీవల ఏసీబీకి చిక్కారు. నాలుగు నెలల క్రితం తహసీల్దార్ కార్యాలయం వద్దే పాస్ పుస్తకం కోసం రూ. 30 వేలు లంచంగా తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ బలివాడ శ్రీహరి బాబు ఏసీబీకి చిక్కారు. అలాగే ధర్మవరం, కొయ్యాం వీఆర్వోలు అప్పారావునాయుడు, నర్సునాయుడు కూడా ఇటీవల పట్టుబడ్డారు. -
టీడీపీ కార్యకర్త బరితెగింపు!
శ్రీకాకుళం: అధికార టీడీపీ కార్యకర్తల దౌర్జన్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గతంలో పలువురు ప్రభుత్వ అధికారులపై దాడిచేసిన ఘటనలు జిల్లాలో చోటుచేసుకోగా.. తాజాగా సంతకవిటి మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శిపై మండలాభివృద్ధి అధికారి సాక్షిగా ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్త దాడికి పాల్పడ్డాడు. సంతకవిటి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటూ పంచాయతీ సెక్రటరీని టీడీపీ కార్యకర్త డిమాండ్ చేయగా.. దానికి ససేమీరా అనడంతో దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధి వాసుదేవపట్నం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గురుగుబెల్లి రాజు మండలాభివృద్ధి కార్యాలయానికి వచ్చాడు. ఎంపీడీఓ జి.వేణుగోపాలనాయుడు చాంబర్లో అదే గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి వడగ గౌరీశంకరరావును పిలిపించి శ్రీకాకుళంలో జన్మించిన బిడ్డ పేరున జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వలేనని కార్యదర్శి స్పష్టం చేయడంతో ఆవేశానికి గురైన రాజు గట్టిగా కేకలు వేస్తూ కార్యదర్శిపై దాడికి దిగాడు. ఎంపీడీఓ వారిస్తున్నప్పటికీ వినకుండా గౌరీశంకరరావుపై దాడి చేశాడు. అక్కడున్నవారంతా అడ్డుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. దాడికి గురైన పంచాయతీ కార్యదర్శితోపాటు మండల పరిషత్ కార్యాలయానికి చెందిన మిగిలిన కార్యదర్శులు, ఎన్జీఓ సంఘ నాయకులు స్థానిక పోలీసుస్టేషన్కు చేరుకొని ఎస్సై ఎస్.చిరంజీవికి టీడీపీ కార్యకర్త రాజుపై ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న కార్యదర్శిపై ఎంపీడీఓ సమక్షంలో దాడికి పాల్పడడం చట్టరీత్యా నేరమని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శులు, ఎన్జీవో ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. నేడు విధుల బహిష్కరణ ఇదిలా ఉండగా పంచాయతీ కార్యదర్శిపై టీడీపీ కార్యకర్త రాజు దాడికి నిరసనగా గురువారం విధులు బహిష్కరించాలని పంచాయతీ కార్యదర్శులంతా నిర్ణయించారు. జిల్లాలోని ఎన్జీఓ సంఘ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు తమకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఉద్యోగులపై టీడీపీ కార్యకర్తలు, నేతలు దౌర్జన్యాలు చేయడం ప్రజస్వామ్యానికి విరుద్ధమని, ఇటువంటి హేయమైన చర్యను ఇంత వరకు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి దారుణం అరసవల్లి: సంతకవిటి మండలం వాసుదేవపట్నం పంచాయతీ కార్యదర్శి వి.గౌరిశంకర్పై గురుగుబిల్లి రాజు అనే వ్యక్తి భౌతికంగా దాడి చేయడం దారుణమని, ఈఘటనను తాము ముక్తకంఠంతో ఖండిస్తున్నామని జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బివి.రమణ, ఎం.భాస్కరరావులు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపీడీవో సమక్షంలోనే కార్యదర్శిపై దాడి జరిగిందని, విధుల్లో ఉన్న ఉద్యోగిపై దాడి చేయడాన్ని సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు., ఇందుకు నిరసనగా సంతకవిటి మండల పంచాయతీ కార్యదర్శులంతా మూకుమ్మడిగా సెలవు పెట్టేందుకు నిర్ణయించారని ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికైనా దాడిపై విచారణ జరిపి బాధిత కార్యదర్శికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
మళ్లీ రెచ్చిపోయిన ఎమ్మెల్యే చింతమనేని
► గ్రామ కార్యదర్శి మెడ పట్టుకుని తోసివేత సాక్షి, ఏలూరు రూరల్: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి గ్రామస్థాయి సిబ్బందిపై జులుం ప్రదర్శించారు. ఏలూరు మండలం కోటేశ్వరదుర్గాపురం గ్రామ కార్యదర్శి మెడ పట్టుకుని డ్రైనేజీపైకి తోశారు. ఎవడ్రా నీకు ఉద్యోగం ఇచ్చింది? నిన్ను ఇప్పుడే సస్పెండ్ చేయిస్తా.. అంటూ చిందులు తొక్కారు. శని వారం జరిగిన ఈ సంఘటన ఉద్యోగులతో పాటు స్థానిక నాయకులను ఉలికిపాటుకు గురి చేసింది. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఆయన కోటేశ్వరదుర్గాపురం, గుడివాకలంక, మొండికోడు గ్రామాల్లో పర్యటించారు. కోటేశ్వరదుర్గాపురంలో పంచాయతీ కార్యదర్శి గ్రామానికి సరిగా రావడం లేదని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో చింతమనేని ఆగ్రహంతో ఏయ్.. సెక్రటరీ, ఎవడ్రా నీకు ఉద్యోగం ఇచ్చింది? నేను వస్తుంటే గ్రామాన్ని శుభ్రంగా ఉంచడం కూడా తెలియదా? అంటూ కార్యదర్శి అనిల్కుమార్ మెడపట్టుకుని పక్కనే ఉన్న డ్రైనేజీ వద్దకు తోసుకెళ్లారు. చూడు డ్రైనేజీ అధ్వానంగా ఉంది... నీకు కళ్లు కనబడడం లేదా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో స్థానిక టీడీపీ నాయకులు కార్యదర్శిని పక్కకు లాగి వెనక్కి పంపారు. భీతిల్లిన కార్యదర్శి ‘సార్.. నాకు నాలుగు గ్రామాల ఇన్చార్జి ఇచ్చారు...’ అని చెప్పారు. వాస్తవానికి కార్యదర్శి అనిల్కుమార్ మేజర్ పంచాయతీలైన శనివారపుపేట, చాటపర్రు, మాదేపల్లితో పాటు కోటేశ్వరదుర్గాపురం ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. నలుగురి పని ఒక్కడు చేస్తున్నా ఎమ్మెల్యే ఇలా దూషించడం అన్యాయమని కార్యక్రమంలో పాల్గొన్న ఇతర శాఖల అధికారులు ఆవేదన వ్యక్తంచేశారు. -
గ్రూప్ 3 మెయిన్స్ ఆగస్టు 6న
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 1,055 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సంబంధించి గ్రూప్ 3 మెయిన్స్ పరీక్షను ఆగస్టు 6వ తేదీన నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. గ్రూప్ 3 ప్రిలిమ్స్ను గతనెల 23న నిర్వహించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ పరీక్షను జూలై 16న నిర్వహించాల్సి ఉంది. అయితే గ్రూప్ 2 మెయిన్స్పై వివాదం తలెత్తి దాన్ని జూలై 15, 16 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూలై 16న నిర్వహించాల్సిన గ్రూప్ 3లోని పంచాయతీ కార్యదర్శుల పోస్టుల పరీక్షను జూలై 30కి వాయిదా వేసింది. అయితే జూలై 30న ఏపీ సెట్ ఉండడంతో గ్రూప్3ని మరోరోజు నిర్వహించాలని పలువురు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. దీంతో గ్రూప్ 3 మెయిన్స్ను ఆగస్టు 6న నిర్వహించాలని నిర్ణయించింది. -
పంచాయతీలో లంచావతారం
► ప్లాన్ అప్రూవల్కు లంచం డిమాండ్ చేసిన కార్యదర్శి ► ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు ► రూ.15వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం విజయనగరం టౌన్: ఇంటి నిర్మాణానికి అనుమతికోసం లంచం డిమాండ్చేసిన ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. మండలంలోని చెల్లూరు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ, బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. చెల్లూరు పంచాయతీ పరిధిలో రామ్నగర్ లే అవుట్ ఉంది. అందులో ప్లాట్ కలిగిన రౌతు కిరణ్ అనే వ్యక్తి తన భార్య పేరున ఇంటి నిర్మాణానికి ప్లాన్ అప్రూవల్కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనుమతులు మంజూరు చేయడంలో సంబంధిత పంచాయతీ కార్యదర్శి వి.సత్యనారాయణ తాత్సారం చేస్తూ వచ్చారు. అనేకమార్లు కార్యాలయం చుట్టూ తిరిగిన కిరణ్కు ఆయన రూ. 15వేలు లంచం ఇస్తే ప్లాన్ అప్రూవల్ ఇస్తానని తెగేసి చెప్పారు. ఇక విసిగెత్తిపోయిన బాధితుడు సోమవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన డీఎస్పీ షకీలాభాను ప్రణాళిక ప్రకారం మంగళవారం మధ్యాహ్నం తాము అందించిన ఏడు రెండువేల నోట్లు, రెండు ఐదువందల నోట్లు కిరణ్ద్వారా పంచాయతీ కార్యదర్శికి అందిస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణ చేపట్టి, రికార్డులు సీజ్ చేశారు. కేసు నమోదుచేసి ఏసీబీ కోర్టుకు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ ఏడాదిలో ఇది ఏడో కేసు అవినీతిపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. లంచం డిమాండ్ చేస్తే ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఏడుకేసులు నమోదయ్యాయి. చిన్నదా, పెద్దదా అనేది కాకుండా ఏసీబీకి ఫిర్యాదు చేస్తుండటంతో ఎక్కడికక్కడే లంచావతారాల్ని ట్రాప్ చేసి పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకూ విజయనగరం మున్సిపల్ ఆర్ఐ, సాలూరు మండల ఇంజినీరింగ్ అధికారి, కురుపాం విద్యుత్ శాఖ ఏఈ, జియ్యమ్మవలస తహశీల్దార్, పార్వతీపురం కమర్షియల్ ట్యాక్స్ డీసీటీఓ, డెంకాడ మండలం మోపాడ వీఆర్ఓ ఏసీబీ వలలో చిక్కారు. తాజాగా పంచాయతీరాజ్కి చెందిన చెల్లూరు పంచాయతీ కార్యదర్శి పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ షకీలాభాను విలేకరులతో మాట్లాడుతూ ఎవరైనా అవినీతికి పాల్పడితే వెంటనే తమను ఆశ్రయించాలని కోరారు. నేరుగా కార్యాలయానికి వచ్చి పిర్యాదుచేస్తే, బాధితులకు పూర్తి రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. వివరాలు గోప్యంగా ఉంచుతామనీ, అవినీతిపరుల భరతం పడతామని తెలిపారు. -
పంచాయతీ కార్యదర్శుల ప్రిలిమ్స్ హాల్టిక్కెట్లు
మెయిన్స్కు సెంటర్ల ఆప్షన్ మార్పునకు అవకాశం అమరావతి: రాష్ట్రంలోని 1055 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న స్క్రీనింగ్ టెస్టు (ప్రిలిమ్స్) పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అభ్యర్ధులకు హాల్టిక్కెట్ల జారీ ప్రక్రియను కమిషన్ చేపట్టింది. హాల్టిక్కెట్లు కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నామని కమిషన్ కార్యదర్శి వైవీఎస్టీ సాయి తెలిపారు. ఈరోజు ఉదయం 11 గంటల తరువాత నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. హాల్టిక్కెట్లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పీఎస్సీ.ఏపీ.జీఓవీ.ఐఎన్ లేదా హెచ్టీటీపీ://ఏపీపీఎస్సీఏపీపీఎల్ఐసీఏటీఐఓఎన్ఎస్17.ఏపీపీఎస్సీ.జీఓవీ.ఐఎన్వెబ్ సైట్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఇలా ఉండగా పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసిన అభ్యర్ధులు తమ సొంత జిల్లాల్లో కాకుండా వేరే జిల్లా కేంద్రాల్లో స్క్రీనింగ్ టెస్టు రాసేలా ఆప్షన్లు ఇచ్చారు. తాము ఆ పరీక్ష రాసే జిల్లాల్లో స్థానికేతరులుగా మారిపోతామని, దీనివల్ల ఎంతో నష్టపోతామని ఆందోళన చెందారు. తాము సొంతజిల్లాల్లో పరీక్ష రాసేందుకు వీలుగా ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించాలని ఏపీపీఎస్సీకి విన్నవించారు. వీరి అభ్యర్ధనలపై ఏపీపీఎస్సీ సానుకూలంగా స్పందించింది. స్క్రీనింగ్ టెస్టులో స్థానికత అన్నది పరీక్ష కేంద్రం ఆధారంగా నిర్ణయించేది కాదని ఏపీపీఎస్సీ మంగళవారం మరో ప్రకటనలో స్పష్టంచేసింది. మెయిన్స్లో మాత్రమే స్థానికత, ఇతర రిజర్వేషన్లు అమలు కానున్నందున ఆమేరకు మెయిన్స్కు పరీక్ష కేంద్రాల మార్పునకు అవకాశం కల్పించింది. ఈనెల 24వ తేదీనుంచి 30వ తేదీ వరకు అభ్యర్ధులు తమ పరీక్ష కేంద్రాలు మార్పు చేసుకోవచ్చని కమిషన్ వివరించింది. స్క్రీనింగ్ టెస్టు ఎక్కడ రాసినా మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేసుకున్న కేంద్రమున్న జిల్లా ప్రాతిపదికన మాత్రమే స్థానికత, స్థానికేతర అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. -
లోకల్, నాన్లోకల్ సమస్య పరిష్కరించండి
ఎస్కేయూ : పంచాయితీ సెక్రెటరీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లో లోకల్–నాన్లోకల్ అంశాన్ని అస్పష్టంగా పేర్కొన్నారని ఎస్కేయూ విద్యార్థి జేఏసీ ఆరోపించింది. ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఆందోళన నిర్వహించారు. పంచాయితీ సెక్రెటరీ రాత పరీక్షలకు పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకున్న జిల్లాకే లోకల్ వర్తిస్తుందని అభ్యర్థుల సెల్ఫోన్లకు మెసేజ్ పంపారని విమర్శించారు. హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు అక్కడి పరీక్ష కేంద్రం ఎంపిక చేసుకుంటే, హైదరాబాద్ లోకల్ కింద పరిగణస్తున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లా విద్యార్థులు అనంతపురంలో పరీక్ష కేంద్రం ఎంపిక చేసుకుంటే , అనంతపురం లోకల్ కింద, కర్నూలును నాన్లోకల్ కింద చూపిస్తుండడంతో ఉద్యోగాలు దక్కకుండా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు క్రాంతికిరణ్, భానుప్రకాష్ రెడ్డి, రవినాయక్, జయచంద్రా రెడ్డి, ఎన్ఎస్యూఐ నాయకులు పులిరాజు, జీవీఎస్ చిన్న శంకర్నాయక్, సురేష్ నాయక్ , గ్రూప్–3 అభ్యర్థులు పాల్గొన్నారు. -
ఇంటిపన్నురూ.5000= రసీదు రూ.4500
రైల్వేకోడూరు: పంచాయితీ కార్యదర్శి ఇంటి పన్ను అధికంగా వసూలు చేస్తోందని విద్యానగర్ వాసులు ఈఓపీఆర్డీ సంజీవరావుకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న ఈఓపీఆర్డీను మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కె.బుడుగుంటపల్లె పంచాయితీ కార్యదర్శి లక్ష్మీదేవితో మరో వ్యక్తితో వచ్చి తమను బెదిరించి ఇంటి పన్నులు వేలలో కట్టమని డిమాండు చేస్తోందని ఆరోపించారు. రేకుల ఇంటికి కూడా వేలల్లో ఇంటి పన్ను కట్టమంటే ఎలా కట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిల్లర అంగడి ఉంటే దానికి ఇంటి పన్ను 5 వేలు అడుగుతోందని, ఇదేంటని అడిగితే అది అంతేనని కట్టక తప్పదని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బయపెడుతోందన్నారు. తీసుకున్న మొత్తంలో 5 వందలు తగ్గించుకుని బిల్లు ఇస్తోందని ఇదేంటని అడిగితే కంప్యూటర్ పనిచేయడం లేదని కుంటి సాకులు చెబుతోందని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దుస్థితి రాలేదన్నారు. ప్రతి బిల్లుకు 4 నుంచి 5 వందలు ఎక్కువగా వసూలు చేసుకుని తక్కువ మొత్తానికి బిల్లు ఇస్తోందన్నారు. కార్యదర్శి ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై ఈఓపీఆర్డీను వివరణ కోరగా కె.బుడుగుంటపల్లె పంచాయితీలో మొత్తం 925 ఇండ్లు ఉన్నాయని, ఇంటి పన్ను వసూలు డిమాండు 1.70 లక్షలు ఉందన్నారు. సరాసరి ఒక ఇంటికి 185 రూపాయులు కడితే చాలన్నారు. షాపులు, ఇతర వాటికి 500 లైసెన్సు రుసుం చెల్లిస్తే సరిపోతుందన్నారు. అలా ఎందుకు వసూలు చేసిందో తమకు తెలియదన్నారు. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. గతంలో ఆమె పింఛన్లు కూడా సక్రమంగా ఇవ్వలేదని, రాజంపేట డీఎల్పీఓ రమణ విచారణ చేపట్టిన విషయం తెలిసినదే. ఫిర్యాదు చేసిన వారిలో దామోదర్, ప్రకాష్, రత్న, కుమారి, నరసమ్మ, సుశీలమ్మ తదితరులు ఉన్నారు. -
పీఎస్ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ
కర్నూలు (రాజ్విహార్): పంచాయతీ సెక్రటరీ(పీఎస్)పోస్టులకు సంబంధించిన పరీక్షలకు సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని రీజినల్ సెంటర్ ఫర్ ఎడ్యూకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ సంస్థ డిప్యూటి డైరెక్టరు సయ్యద్ ఇందాద్ అలీ ఖాద్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, పార్శీలు అర్హులన్నారు. నెల రోజుల శిక్షణతోపాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ ఇస్తామన్నారు. బుధవారం నుంచి తమ కార్యాలయంలో దరఖాస్తులు అందిస్తామన్నారు. ఈనెల 20వ తేదీ నుంచి ఏప్రిల్ 20 వరకు శిక్షణ ఉంటుందన్నారు. అభ్యర్థులు ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు ఉస్మానియా కళాశాలలోగానీ, ఫోన్ (94945 55961, 94417 61178) ద్వారా కానీ సంప్రదించాలన్నారు. -
గుజరాత్ నుంచి కార్యదర్శికి ఆహ్వానం
వీరపునాయునిపల్లె: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న గుజరాత్లో జరిగే సదస్సులో పాల్గొనాలని తంగేడుపల్లె పంచాయతీ కార్యదర్శి సుజితకు ఆహ్వానం అందింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరయ్యే ఈ సదస్సుకు మన జిల్లా నుంచి పంచాయతీ కార్యదర్శుల్లో ఆమెను ఎంపిక చేశారు. స్వచ్చభారత్ అమలులో మంచి సేవలు అందించినందుకు గాను ఈ అవకాశం దక్కింది. తంగేడుపల్లెలో ఓడీఎఫ్ కింద 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయించడంతోపాటు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకు గాను గత జన్మభూమి గ్రామసభలో మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో సన్మానం చేశారు. గణతంత్ర వేడుకలలో కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా ప్రశంసాపత్రం అందుకున్నారు. ఆమె గుజరాత్కు వెళ్లడానికి ఆదివారం బయలుదేరారు. గర్వకారణం: ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో జరిగే సదస్సుకు మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శి సుజిత ఎంపిక కావడంపై ఎంపీపీ ప్రసాదరెడ్డి, ఎంపీడీవో మల్లికార్జునరెడ్డి, పంచాయతీ అధికారి శ్రీనివాసులరెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె మండలానికే గర్వ కారణంగా నిలిచిందని వారు కొనియాడారు. -
పంచాయతీ కార్యదర్శిపై టీడీపీ నాయకుడి దాడి
కేవీపల్లె : పింఛన్లు పంపిణీ చేయడానికి వెళ్లిన పంచాయతీ కార్యదర్శిపై టీడీపీ నాయకుడు దాడి చేసిన సంఘటన మండలంలోని తువ్వపల్లె పంచాయతీలో ఆది వారం చోటు చేసుకుంది. దీనిపై బాధితుడు కేవీపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తువ్వపల్లె పంచాయతీ కార్యదర్శి మణి ఆదివారం పింఛన్లు పంపిణీ చేయడానికి గ్రామానికి వెళ్లాడు. పెండేరివాండ్లపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు అంకమనాయుడి అవ్వకు పింఛను ఇవ్వడానికి వారి ఇంటి వద్దకు వెళ్లాడు. ఆమె పొలం వద్దకు వెళ్లిందని, సాయంత్రం వరకు ఉండి పింఛను ఇచ్చి వెళ్లాలని అంకమనాయుడు దౌర్జన్యానికి దిగాడు. అంతటితో ఊరుకోకుండా మద్యం మత్తులో నానా దుర్భాషలాడుతూ చొక్కా పట్టుకుని దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై బాధితుడు మణి కేవీపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. -
ఏసీబీ వలలో పంచాయితీ సెక్రటరీ
రాజమండ్రి: లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కాడు. తూర్పుగోదావరి జిల్లా కేశవపల్లి పంచాయతి సెక్రటరీగా పని చేస్తున్న ప్రసాద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ప్రసాద్ లంచం తీసుకుంటుండగా.. రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అదనపు వివరాల కోసం అతన్ని విచారిస్తున్నారు. -
డ్యూటీ చేయకున్నా.. జీతం డ్రా
ఏడు నెలలపాటు విధులకు డుమ్మా.. అయినా పూర్తి కాలానికి వేతనం విడుదల ఈఓపీఆర్డీ, ఎంపీడీఓ సహకారంతో పంచాయతీ కార్యదర్శి లీలలు కనీసం సెలవు పత్రం ఇవ్వని వైనం కలెక్టర్కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు విచారణ చేపట్టిన జిల్లా పంచాయతీ అధికారి మహబూబాబాద్ : ఆయనొక పంచాయతీ కార్యదర్శి.. ఉండేది విజయవాడలో.. ఉద్యోగం చేసేది మాత్రం దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో. చెప్పా పెట్టకుండా నెలల తరబడి విధులకు గైర్హాజరు కావడం ఆయన నైజం. అయినా ఆయనకు స్థానిక అధికారులు ఒక్క మెమో ఇవ్వడం కాదు కదా.. కనీసం మందలించడం కూడా చేయలేదు. డ్యూటీ తప్పించిన కాలానికి సెలవు కూడా పెట్టకుండా, ఏడు నెలల జీతం ఎత్తుకోగల నేర్పరితనం ఆయనది. స్థానిక ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ ప్రోత్సాహం, సహకారంతో గుట్టుగా చేసిన వ్యవహారం అధికారుల మధ్య వచ్చిన గొడవతో బట్టబయలైంది. అసలేం జరిగిందంటే... వి.శ్రీనివాసరావు అనే పంచాయతీ ఉద్యోగి పూర్వ నర్సింహులపేట మండలం.. ప్రస్తుత దంతలాపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు ముంగిమడుగు, రామన్నగూడెం, గుండంరాజుపల్లి గ్రామాలను కూడా ఇ¯ŒSచార్జీ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని విజయవాడ నుంచి వచ్చి వెళ్తుంటాడు. దీంతో తరుచూ విధులకు డుమ్మా కొడుతుంటాడు. ఒక్కొక్క సారి నెలల తరబడి కనిపించకుండా వెళ్తాడు. ఇలా 2015లో జనవరి, ఫిబ్రవరిలో రెండు నెలలు చెప్పాపెట్టకుండా విధులకు గైర్హాజరయ్యాడు. దీంతో ఆ గ్రామాలను వేరే పంచాయ కార్యదర్శులకు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు. తర్వాత తిరిగి రాగానే స్థానిక అధికారులు రెండు నెలల జీతం చేసి పువ్వుల్లో పెట్టి ఇచ్చారు. అలాగే మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయాడు. ఈ సారి ఏకంగా ఏడు నెలల వరకు రాలేదు. అధికారులకు లీవ్ లెటర్ కూడా ఇవ్వలేదు. దీంతో ఆ గ్రామాలను వేరే పంచాయతీ కార్యదర్శులకు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించిన ఈఓపీఆర్డీ, ఎంపీడీఓలు అతడు అబ్ స్కాండింగ్(కనిపించకుండా పోవడం)లో ఉన్నట్లు గానీ, సెలవు పెట్టినట్లుగానీ ఉన్నతాధికారులకు సమాచారమివ్వలేదు. తీరా 7 నెలల తర్వాత ఆగస్టులో మళ్లీ తానో ఉద్యోగం చేస్తు న్న విషయం గుర్తుకొచ్చి శ్రీనివాసరావు తిరిగొచ్చా డు. వచ్చి రావడంతో నే ఆయనకు ఏడు నెలల ఏరియర్స్ (రూ.1,00,097) ఎంపీడీఓ, ఈఓపీర్డీ కలిసి ఒకేసారి మంజూరు చేశా రు. ఈ వ్యవహారమంతా ఎంపీడీఓ కార్యాలయంలోని సంబంధిత సూపరిం టెండెంట్, సీనియర్ అసిస్టెంట్ సంతకాలు లేకుండా నే సాగినట్లు తెలిసింది. విధులకు హాజరు కానీ ఉద్యోగికి గైర్జాజర్ వేసి,ఉన్నతాధికారులకు నివేదించి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అతడిని ప్రోత్సహించడం అనుమానాలకు తావి స్తోంది. కాగా ఈ వ్యవహారంపై పలువురు ఈ నెల 17న గ్రీవెన్స్సెలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై జిల్లా పంచాయతీ కార్యాలయంలో కలిసిన నర్సిం హులపేట ఈఓపీఆర్డీ ఎ.గవర్రాజును ‘సాక్షి’ వివర ణ కోరగా శ్రీనివాసరావు విధులకు అప్పుడప్పుడు వచ్చివెళ్లేవాడని, అనారోగ్యంతో ఉన్నానంటే రిక్వెస్ట్ మీద జీతం చేశామని చెప్పడం గమనార్హం. కానీ అత డు రాని రోజుల్లో ఆబ్సెంట్ వేయాలి కదా అనే ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు. డీపీఓ విచారణ లో అధికారులపై వేటు పడే అవకాశం ఉంది. రిక్వెస్ట్ చేయడం వల్ల జీతం ఇచ్చాం శ్రీనివాసరావు అనారోగ్యంతో ఉండటం కారణంగానే సక్రమంగా విధులకు హాజరుకాలేదు. ఫిబ్రవరి నుంచి కుమ్మరికుంట్ల గ్రామానికి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు విధులు సక్రమంగా నిర్వహించలేదు. విధులకు డుమ్మా కొట్టాడు. దీంతో కొన్ని నెలలు పడమటిగూడెం పంచాయతీ కార్యదర్శికి కొన్ని బాధ్యతలు అధికారికంగా కాకుండా అప్పగించాం. కానీ శ్రీనివాసరావు పొరపాటు జరిగిందని రిక్వెస్ట్ చేయడం వల్ల ఆ నాలుగు నెలల వేతనాన్ని ఇచ్చాం. ప్రస్తుతం విధులకు హాజరవుతున్నారు కానీ అనారోగ్య సమస్యతో సక్రమంగా రావడం లేదు. –ఈఓపీఆర్డీ ఎ.గవర్రాజు రెగ్యులర్గా రాలేదు మహబూబాబాద్ : కుమ్మరికుంట్ల పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు రెగ్యులర్గా విధులకు హాజరుకానీ మాట నిజమే. అనారోగ్యం కారణం చెబుతూ వచ్చారు. ఆ ఉద్యోగి విధులకు డుమ్మా కొట్టడం వల్ల మరో పంచాయతీ కార్యదర్శి యాకయ్యకు ఆ బాధ్యతలు అప్పగించాం. లాంగ్ లీవ్ పెట్టకుండా అప్పుడప్పుడు సెలవు పెడుతూ విధుల కు పూర్తి స్థాయిలో హాజరుకాలేదు. మెడికల్ బిల్లులు చూపడం వలనే వేతనాలు ఇచ్చాం. ఎంపీడీఓ టి.ఉపేందర్ అధికారులను విచారిస్తున్నా కుమ్మరికుంట్ల పంచాయతీ కార్యదర్శి విషయంపై విచారణ చేపడుతున్నాం. ఈ విషయమై ఈఓపీఆర్డీ గవర్రాజును నేను వివరణ అడుగగా ఎంపీడీఓనే వేతనాలు ఇచ్చారని బదులిచ్చారు. అయితే విధులకు డుమ్మా కొట్టినట్లు మాత్రం ఆయన అంగీకరించారు. ఆ పంచాయతీ కార్యదర్శి సెలవు పెట్టలేదని కానీ అనారోగ్యంతో విధులకు హాజరుకాలేదని మాత్రమే సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. –జిల్లా పంచాయతీ అధికారి రాణిభాయి -
‘అనంత’లో అమానుషం
-
‘అనంత’లో అమానుషం
♦ పంచాయతీ కార్యదర్శి భవానీపట్ల కులవివక్ష ♦ నల్లలమ్మ ఆలయంలోకి వెళ్లకుండా టీడీపీ వర్గీయుల తాళం బ్రహ్మసముద్రం : రాష్ట్రంలో దళితుల పట్ల కొనసాగుతున్న కుల వివక్షకు మరో నిదర్శనమిది. పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పటికీ దళితురాలు కావడంతో తమ గ్రామంలోని ఆలయంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ టీడీపీ సానుభూతిపరుడొకరు అవమానించడమేగాక.. తనవారితో కలసి ఆమె లోపలకి వెళ్లకుండా ఆలయానికి తాళం వేసిన అమానుష ఘటన ఇది. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంట గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి... భైరసముద్రం గ్రామపంచాయతీ రెగ్యులర్ కార్యదర్శిగా పనిచేస్తున్న భవానీకి ముప్పులకుంట కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. విధుల్లో భాగంగా ఆమె జూలై ఆరు నుంచి ముప్పులకుంటలో స్మార్ట్ పల్స్సర్వే నిర్వహిస్తున్నారు. మూడురోజులుగా అదే గ్రామంలోని నల్లలమ్మ ఆలయంలో కూర్చుని సర్వే వివరాలు నమోదు చేస్తున్నారు. నెట్వర్క్ సిగ్నల్ అక్కడ బాగా ఉండడంతో ఆలయంలో కూర్చుంటున్నారు. రెండురోజులుగా గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు చంద్ర.. పంచాయతీ కార్యదర్శి భవానీని ‘మీదే కులం? ఎస్సీలైతే గుడిలోకి వెళ్లకూడదంటూ’ అవమానించడం మొదలుపెట్టాడు. మనోవేదనకు గురైన ఆమె ‘ఎందుకిలా మాట్లాడుతున్నారు. ప్రతిరోజూ కులం గురించి అడుగుతున్నారు. ఇలా మాట్లాడమని ఎవరు చెప్పారు?’ అని సదరు వ్యక్తిని ప్రశ్నించారు. దీంతో అతను గ్రామంలోని తన వర్గీయులకు సమాచారమివ్వగా.. వారంతా కలసి పంచాయతీ కార్యదర్శిని ఆలయంలోకి అడుగుపెట్టకుండా తాళం వేయాలని, ఆలయాన్ని శుద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సర్వేకోసం శుక్రవారం గ్రామానికెళ్లిన పంచాయతీ కార్యదర్శి భవానీ ఆలయానికి తాళం వేసుండడాన్ని గమనించి ఆరాతీశారు. విషయం తెలియడంతో కంటితడి పెడుతూ పైఅధికారులకు ఫోన్లో సమాచారమిచ్చారు. అలాగే కళ్యాణదుర్గం సీఐ మన్సూరుద్దీన్కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆయన హెడ్ కానిస్టేబుల్ రఘురాములును గ్రామానికి పంపి బాధితురాలినుంచి ఫిర్యాదు తీసుకున్నారు. కాగా దీనిపై జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ తెలిపారు. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి
సిద్ధిపేట (మెదక్) : విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి.. ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం తడ్కపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న బాలరాజు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటి విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయడానికి రూ.4 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అధికారులు లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని విచారణ చేపడుతున్నారు. -
ఏసీబీ వలలో మరో అవినీతి చేప
ఆయనో పంచాయతీ కార్యదర్శి. ఉద్యోగంలో చేరి రెండేళ్లే అయ్యింది. అయితేనేమి అవినీతిలో అందవేసిన చేయిగా ఎదిగాడు. పుడితే...లంచం...చస్తే...లంచం. చివరకు నిరుపేదలను సైతం విడిచిపెట్టలేదు. ప్రతీ పనికి లంచం రుచిమరిగాడు. ఓ వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం కోసం కార్యదర్శి చుట్టూ నాలుగు నెలలుగా తిరిగి తిరిగి వేసారిపోయి...చివరకు ఆ పత్రం కోసం రూ.2వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్తో అవినీతి చేపను వలపట్టి పటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... * పట్టుబడిన మోదుగులపేట కాంట్రాక్ట్ పంచాయతీ కార్యదర్శి * మరణ ధ్రువీకరణ పత్రానికి రూ.2 వేల డిమాండ్ * ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు * పక్కా ప్రణాళికతో పట్టుకున్న వైనం సంతకవిటి: మండలంలోని మోదుగుల పేట పంచాయతీ కార్యదర్శి గోపి రెండేళ్ళ క్రితమే విధుల్లో చేరాడు. ప్రతీ పనికి లంచం రుచిమరిగాడు. మోదుగులపేట గ్రామానికి చెందిన మజ్జి రాము తన తండ్రి మజ్జి అప్పలనాయుడు మరణ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా రూ.2 వేలు డిమాండ్ చేశాడు. మజ్జి రాము ఈ విషయంపై గ్రామ పెద్ద లు దృష్టికి సమస్యను తీసుకెళ్లగా గ్రామ పెద్దలు కార్యదర్శిని మంది లించినప్పట్టకీ ఫలితం కనిపించలేదు. ఇలా నాలుగు నెలలు గడవడంతో విసుగు చెందిన రాము చివరకు శ్రీకాకు ళం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం... రాము నుంచి వివరాలు సేకరించిన జిల్లా ఏసీబీ అధికారులు మోదుగులపేట పం చాయతీ కారదర్శిపై నెల రోజులుగా దృష్టి సారించినట్లు తెలిసింది. చివరకు పథకం రచించిన డీఎస్పీ రంగరాజు, సీఐ పి.శ్రీనివాసరావు సోమవారం బాధితుడైన రాముతో కలసి సంతకవిటి మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా రూ.2వేలతో పంచాయతీ కార్యదర్శి వద్దకు రామును పంపించారు. ఆ వెంట వారు కూడా అనుసరించారు. రాము నుంచి రూ.2 వేల రూపాయలు లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి గోపి ఏసీబీ అధికారులకు పక్కాగా పట్టుబడ్డాడు. గోపిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అక్కడి పంచాయతీ కార్యదర్శుల సమావేశ కార్యాలయంలో మరిన్ని వివరాలు సేకరించారు. విచారణ అనంతరం శ్రీకాకుళం తరలించారు. డబ్బులు ఇచ్చుకోలేకే... నా తండ్రి అప్పలనాయుడు మరణ ధ్రువీకరణ పత్రం నిమిత్తం నాలుగు నెలలుగా పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకుని తిరుగుతున్నాను. ప్రతీసారి ఏదో ఒక సాకుచెప్పి తప్పించుకునేవాడు. చివరకు తనకు రూ. 2 వేలు కావాలని పట్టుబట్టాడు. ఈ విషయం గ్రామపెద్దలకు చెప్పగా వారు మందలించడంతో నాకు హెచ్చరికలు జారీ చేసి మరింత ఎక్కువ డబ్బులు అవుతాయని అన్నాడు. ఈ డబ్బులు ఇచ్చుకోలేకే ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. ఇలాంటి లంచగొండి అధికారులను విడిచిపెట్టరాదు. - మజ్జి రాము, బాధితుడు, మోదుగులపేట -
అలా.. ఇరుక్కుపోయి..
తప్పటడుగులేయిస్తున్న ఒత్తిళ్లు కీలక ప్రజాప్రతినిధి నిర్వాకంతో అధికారుల బలి వరుస సంఘటనలతో ఉద్యోగుల బెంబేలు అక్కడ పనిచేసేందుకు భయపెడుతున్న పరిస్థితులు ఇదేం విచిత్రమోగానీ... గత కొంతకాలంగా ఎస్.కోట నియోజకవర్గంలో పలువురు అధికారులు అనవసరంగా బలైపోతున్నారు. అక్కడి కీలక ప్రజాప్రతినిధి ఒత్తిళ్లతో తప్పటడుగులు వేసి ఉద్యోగాలకే ఎసరు తెచ్చుకుంటున్నారు. కొందరు తెలివిగా తప్పించుకుంటున్నా... ఇంకా కొందరు ఇరుక్కుపోతున్నారు. వరుస సంఘటనలతో అక్కడ పనిచేస్తే ఏదైనా ముప్పువస్తుందేమోనని బెంబేలెత్తిపోతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : శృంగవరపుకోట నియోజకవర్గంలో అధికారులు ఒకరివెనుక ఒకరు లేనిపోని చిక్కుల్లో ఇరుక్కుపోతున్నారు. అక్కడి కీలక ప్రజాప్రతినిధి ఒత్తిళ్లకు తలొగ్గి పీకమీదకు తెచ్చుకుంటున్నారు. నిన్నటికి నిన్న ఎస్కోట రైతు బజారు స్థలం కేటాయింపు తీర్మానం విషయంలో సర్పంచ్ చెక్పవర్ కోల్పోవడంతో పాటు పంచాయతీ కార్యదర్శి చార్జిమెమోను ఎదుర్కొన్నారు. సమగ్ర విచారణ తర్వాత వీరి ఉద్యోగానికి ఎసరొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎస్కోట ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో రైతుబజారుకు గతంలో కేటాయించిన స్థలంలో ఐనాక్స్ థియేటర్కు మేలు చేకూర్చేలా పంచాయతీలో రోడ్డు నిర్మాణంకోసం తీర్మానం చేయడం వెనక నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధి హస్తం ఉంది. తెరవెనుక చోటుచేసుకున్న ముడుపుల వ్యవహారం నేపథ్యంలో హుటాహుటిన పంచాయతీ కార్యవర్గ సమావేశంలో రోడ్డు కోసం తీర్మానం చేయించినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడా ప్రజాప్రతినిధి బాగానే ఉన్నారు. ఆ తీర్మానం చేసినందుకు సర్పంచ్ చెక్పవర్ కోల్పోయారు. పంచాయతీ కార్యదర్శి చార్జిమెమో అందుకున్నారు. భవిష్యత్లో ఇంకేం జరుగుతుందో తెలియడంలేదు. ఇటీవల వేపాడ మండలం వెల్దాంకు అంగన్వాడీ ఆయా పోస్టు ఖాళీ అయింది. ఆ పోస్టు కోసం తొండవరపు పుష్ప దరఖాస్తు చేశారు. వాస్తవంగా ఆమె అదే మండలంలోని వీలుపర్తి గ్రామంలో అప్పటికే రేషన్కార్డు ఆధారంగా నివాస ధ్రువీకరణ పత్రాన్ని పొందారు. ఈ పోస్టుకోసం వెల్దాంలో ఉంటున్నట్టు ఆమె మరో నివాస ధ్రువీకరణ పత్రాన్ని సంపాదించారు. ఒకసారి రేషన్ కార్డు ఆధారంగా, మరోసారి ఆధార్ కార్డు ఆధారంగా రెవెన్యూ అధికారులు ఆ పత్రాలు జారీ చేశారు. దీని వెనుక నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధి ఒత్తిడి ఉందని తెలిసింది. ఆ పోస్టుకు ప్రయత్నించి విఫలమైన ఒబ్బిన సత్యవతి అనే మహిళ దీనిపై ఫిర్యాదు చేశారు. న్యాయ స్థానాన్ని కూడా ఆశ్రయించగా సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్కు అరెస్టు వారెంట్ జారీ అవుతుందన్న అనుమానంతో ముం దస్తు బెయిల్ తెచ్చుకున్నట్టు సమాచారం. దీనిపై వారు ఆ ప్రజాప్రతినిధి వద్దకు వెళ్తే ‘మేమోదో చెబుతాం...మీరు చూసుకుని చేసుకోవాలి’అని తప్పించుకుంటున్నట్టు తెలిసింది. కొద్ది రోజుల క్రితం కొత్తవలస మండల పరిషత్ కార్యాలయంలో ప్రతీదానికి చేయి చాపుతున్నారని జిల్లా పరిషత్ సీఈఓకు ఫిర్యాదులొచ్చాయి. దీనిపై విచారణ కూడా చేపడుతున్నారు. ఈ క్రమంలో సూపరింటెండెంట్, టైపిస్టులను యుద్ధ ప్రాతిపదికన బదిలీ చేశారు. అయితే, చేయి చాపడానికి అసలు కారణం కీలక ప్రజాప్రతినిధి సోదరుడ్ని సంతృప్తి పరచడానికేనన్న వాస్తవం బయటపడింది. మొత్తానికి రాజకీయ జోక్యం నేపథ్యంలో ఇద్దరు అకస్మికంగా బదిలీపై వెళ్లిపోగా, మిగతా అధికారులపై విచారణ నడుస్తోంది. ఆ మధ్య కొత్తవలస మార్కెట్ కోసం రూ. 30లక్షలు మంజూరయ్యాయి. ఐదేసి లక్షలకొక పని చొప్పున చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఏదో ఒక సంఘానికి ఆ పనుల్ని అప్పగించాలి. నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధి సోదరుడు అక్కడ పనిచేసిన పంచాయతీరాజ్ జేఈ బాపినాయుడుపై ఒత్తిడిచేసి మొత్తం రూ. 30లక్షల పనులు తాను సూచించిన సంఘానికే ఇవ్వాలని పట్టుబట్టారు. ఒకే సంఘానికి ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవని జేఈ అభ్యంతరం వ్యక్తం చేసినా వెనక్కి తగ్గలేదు. అలాగే, ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెట్ పనులు క్వాలిటీ విషయంలో చూసీ చూడనట్టు వదిలేయాలని ఒత్తిడికి దిగారు. దీంతో అసలుకు ఎసరొచ్చేలా ఉందని ఆ జే ఈ యుద్ధ ప్రాతిపదికన బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. -
కార్యదర్శిపై సర్పంచ్ భర్త దాడి
తాడికొండ (గుంటూరు) : తప్పుడు బిల్లులు చేయడానికి నిరాకరించిన పంచాయతీ కార్యదర్శితో సర్పంచ్ భర్త దురుసుగా ప్రవర్తించి ఆమెను గాయపరిచిన సంఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ రవికుమారి భర్త మహేశ్వరరావు.. భార్య స్థానంలో అనధికారిక సర్పంచ్గా చలామణి అవుతున్నారు. ఈ క్రమంలో అధికార దుర్వినియోగానికి పాల్పడవలసిందిగా.. తాను చెప్పిన ఫైళ్లపై సంతకాలు పెట్టాల్సిందిగా.. గత కొన్ని రోజులుగా గ్రామ కార్యదర్శి కె.అనురాధపై ఒత్తిడి తెస్తున్నారు. దీనికి ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన సర్పంచ్ భర్త మల్లేశ్వరరావు చేతిలో ఉన్న ఫైల్స్ను విసురుగా ఆమె మీదకు విసిరాడు. అవి ఆమె కంటికి తగలడంతో ఆమె ముఖం వాచిపోయింది. దీంతో మండలంలోని కార్యదర్శులందరిని సంప్రదించిన అనురాధ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పంచాయతీ కార్యదర్శిపై టీడీపీ నాయకుడి దాష్టీకం
గుంటూరు: రాష్ట్రంలో అధికారులపై తెలుగుదేశం పార్టీ నాయకుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం ప్రభుత్వ ఉద్యోగిపై దాడిని మరవక ముందే.. బుధవారం గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం దేవరంపాడు పంచాయతీ కార్యదర్శి రమేశ్పై స్థానిక టీడీపీ నాయకుడు గుత్తా వెంకట్రావ్ దాడికి పాల్పడ్డాడు. మంగళవారం జరిగిన చేపల చెరువు వేలంపాటలో తనకు సహకరించలేదనే అక్కసుతో వెంకట్రావ్ రమేశ్పై దాడికి దిగినట్టు సమాచారం. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేశారు. కాగా.. ప్రభుత్వ అండదండలతోనే తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇలా దాడులకు పాల్పడితే విధులు ఎలా నిర్వర్తించాలని రెవెన్యూ ఉద్యోగులు అంటున్నారు. -
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
విజయవాడ రూరల్ (కృష్ణా జిల్లా) : ఒక వ్యాపారి నుంచి రూ. 25వేలు లంచం తీసుకుంటూ విజయవాడ అంబాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి కోటి లింగమ్మ ఏసీబీ అధికారులకు చిక్కింది. ఈ సంఘటన మంగళవారం కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగింది. గ్రామానికి చెందిన గణేష్బాబు జక్కంపూడి గ్రామంలో అల్యూమినియం పరిశ్రమ కోసం షెడ్ను నిర్మిస్తున్నాడు. షెడ్ హౌజ్ టాక్స్కు అనుమతి కోసం కార్యదర్శి రూ. 25వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో గణేష్ బాబు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం లంచం తీసుకుంటుండగా లింగమ్మను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
కందుకూరు: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకులమైలారం గ్రామ పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శి రాజేష్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ కథనం ప్రకారం.. కందుకూరు గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేష్ ఆకులమైలారం పంచాయతీకి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నాడు. గ్రామంలో భూగర్భ డ్రైనేజీ పనుల కోసం రూ.2.5 లక్షలు మంజూరయ్యాయి. దీంతో ఎంపీటీసీ కరుణశ్రీ భర్త సురేష్ నిర్మాణ పనుల కోసం తీర్మానం చేయించి ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి రాజేష్ను కోరాడు. ఇందుకు 5 శాతం కమీషన్ ఇవ్వాలని రాజేష్ డిమాండ్ చేశాడు. దీంతో సురేష్ రూ.4 వేలు ఇస్తానని అంగీకరించి.. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం మధ్యాహ్నం ఎంపీడీఓ కార్యాలయం వద్ద సురేష్ నుంచి పంచాయతీ కార్యదర్శి రాజేష్ రూ.4 వేలు తీసుకుని సూపరింటెండెంట్ కార్యాలయంలోకి వెళుతుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
రూ.5లక్షల పెన్షన్లు స్వాహా!
చింతపల్లి : చివరికాలంలో ఆసరాగా ఉంటుందని ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ను పంచాయతీ కార్యదర్శి స్వాహా చేసిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మండలంలోని బలపం పంచాయతీలో 355 మంది పింఛనుదారులకు సంబంధించి రూ.5లక్షలు కార్యదర్శి ఎస్వీజేఎస్ కుమార్ స్వాహా చేసినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఎంపీడీవో సువర్ణరాజు ఆదేశాలమేరకు విచారణ చేపట్టారు. పంచాయితీలో మొత్తం 357 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరిలో 112 మంది వితంతువులు, 11 మంది వికలాంగులు, 234 మంది వృద్ధులు. వీరికి ప్రతి నెల రూ.7.2 లక్షల పింఛనుసొమ్ము మంజూరవుతోంది. పంచాయితీ ఎన్నికల అనంతరం సర్పంచ్ సిందేరి కార్లను మావోయిస్టులు హత్య చేయడంతో కొంతకాలం పాటు ప్రత్యేక అధికారి పర్యవేక్షణ కూడా లేకుండా పోయింది. 30 నెలల క్రితం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన కుమార్ ఏకంగా 501 రోజు సెలవులోనే ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.7,20,500 నిధులను డ్రా చేసి మేలో పంపిణీకి చర్యలు చేపట్టారు. మే14న ఎంపీడీఓ కార్యాలయానికి అక్విటెన్సులు సమర్పించి రూ.5,20,500 పంపిణీ చేసినట్లు రికార్డులో చూపించారు. మిగిలిన రూ.2 లక్షలు అధికారులకు తిరిగి అప్పగించారు. దీనిపై పలువురు లబ్ధిదారులు తమకు పింఛను అందలేదంటూ ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై కార్యదర్శిని నిలదీయడంతో సెలవు పెట్టారు. లబడంపల్లి కి చెందిన కోరాబు కృష్ణపడాల్, కోరాబు సన్యాసమ్మ, వంతల కాసులమ్మతోపాటు చాలా మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసినట్లు అక్విటెన్సుల్లో వేలిముద్రలు వేసి వున్నాయి. కానీ ఇక్కడ ఎవరికి పింఛన్లు అందలేదు. అదే గ్రామానికి చెందిన గబిలంగి గంగన్నదొర మృతి చెందినప్పటికీ అతడి పేరుమీద కూడా పింఛను పంపిణీ చేసినట్లు అక్విటెన్సుల్లో నమోదు చేసివుంది. ఫిర్యాదుల మేరకు ఎంపీడీవో సువర్ణరాజు, లోతుగెడ్డ వీఆర్ఓ కృష్ణారావును పింఛన్లపంపిణీలో అవకతవకలపై వివరాలు సేకరణకు నియమించారు. ఈ విషయమై ఎంపీడీవో మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో చాలా మంది లబ్దిదారులకు ఏప్రిల్ నెలకు సంబంధించిన పింఛన్లు అందనట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని, గతంలో కూడా పింఛన్లు సక్రమంగా పంపిణీ చేశారా? లేదా అన్నదానిపై కూడా పూర్తి విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు. -
బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికెట్ జారీ!
- అసలు విషయం తెలిసి పోలీసులకు పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు - బీమా సొమ్ము కోసం పథకం? పాయకరావుపేట: తప్పుడు మరణ ధ్రువపత్రం జారీచేసిన పంచాయతీ కార్యదర్శి అసలు విషయం తెలియడంతో తిరిగి ఆ ధ్రువపత్రం ఇప్పించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం వెలుగుచూసింది. స్థానిక పాత హరిజనవాడకు చెందిన తన కుమారుడు బీజా జ్యోతిబాబు ఈ ఏడాది ఏప్రిల్14న చనిపోయాడని, డెత్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని కోరుతూ అదే నెల 17న అభిమన్యుడు అనే వ్యక్తి దరఖాస్తుచేశాడు. ఈ దరఖాస్తును పంచాయతీ ఎలక్ట్రీషియన్ శివలంక రాజు పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ పి.రత్నకుమార్స్వామికి అందజేశారు. దీనిపై పంచాయతీ బిల్లు కలెక్టర్ బత్తిన గోవిందరావు విచారణ చేసి జూనియర్ అసిస్టెంట్కు రిపోర్టు ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఏప్రిల్ 24న మరణ ధ్రువపత్రాన్ని పంచాయతీ కార్యదర్శి ఉమ్మడి వెంకట్రావు మంజూరు చేశారు. అయితే బీజా జ్యోతిబాబు బతికే ఉన్న విషయం ఇటీవల బయటపడింది. దీంతో జూనియర్ అసిస్టెంట్ పి.రత్నకుమార్స్వామి నివేదిక మేరకు తాను ఈ మరణ ధ్రువపత్రం జారీచేశానని, తప్పుడు సమాచారం ఇచ్చిన సిబ్బందిపై చర్యలు తీసుకుని మరణధ్రువపత్రం ఒరిజినల్ను తిరిగి ఇప్పించాలని పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయతీలో కాంట్రాక్టు సిబ్బంది చేస్తున్న అక్రమాలు బయటపడ్డాయి. ఇన్యూరెన్స్ కంపెనీ నుంచి సొమ్ము కాజేసేందుకు అంతా కలిసి పథకం వేశారని తెలిసింది. దీనిపై ఎస్ఐ ఎస్.ప్రసాద్ను వివరణ కోరగా, ఫిర్యాదు అందిందని, పూర్తి స్థాయిలో విచారించిన తరువాత కేసు నమోదుచేస్తామన్నారు. ఇందుకు సంబంధించి బీజా జ్యోతిబాబు, అతని తండ్రి అభిమన్యుడును విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయని, వారు ప్రస్తుతం అందుబాటులో లేరని తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
విజయవాడ : పత్రాల్లో పేరు మార్చడానికి లంచం అడిగిన పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు చిక్కింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా కోడూరు పంచాయతి పరిధిలో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గత మూడేళ్లుగా కోడూరు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న మత్స్య సరోజిని.. అదే గ్రామానికి చెందిన ఓ మహిళకు సంబంధించిన పత్రాల్లో పేరు మార్చడానికి రూ.3 వేలు లంచం డిమాండ్ చేసింది. దీంతో ఆ మహిళ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సరోజిని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
సూళ్లూరుపేట :మండలంలోని కేసీఎన్ఎన్గుంట, కుదిరి గ్రామాలకు కార్యదర్శిగా పనిచేస్తున్న ఎస్.శ్రీరామ్ ఇంటిపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తి కథనం మేరకు సూళ్లూరుపేట పట్టణానికి చెంది మస్తానయ్య కేసీఎన్ గుంట సమీపంలో 47 సెంట్ల భూమిని 2009లో అప్పటి సర్పంచ్, కార్యదర్శితో అప్రూవల్ చేయించుకుని లేఅవుట్ ప్లాట్లు విక్రయించారు. కడపట్ర, దామరాయ, కొరిడి పంచాయతీల కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీరామ్ను కేసీఎన్గుంట, కుదిరి గ్రామాలకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కేసీఎన్గుంట లేఅవుట్ విషయంలో శ్రీరామ్ మస్తానయ్యను వేధించడం ప్రారంభించారు. నిబంధనలు పాటించకుండా లేఅవుట్ వేశారని, ఇందులో నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని బెదిరిస్తూ వచ్చారని తెలిపారు. నిబంధనలకు అనుకూలంగా లే అవుట్ చేసుకోవాలని, లేదంటే క్రిమినల్ కేసులు పెడతామని చెప్పారని పేర్కొన్నారు. దీంతో మస్తానయ్య శ్రీరామ్తో బేరసారాలకు దిగారు. రూ. 3.50 లక్షలు డిమాండ్ చేశారని, చివరకు రూ. 2.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. మంగళవారం ఉదయం లక్ష రూపాయలు ఇచ్చేలా మాట్లాడుకున్నారని వెల్లడించారు. తీవ్రమైన వేధింపులకు గురైన మస్తానయ్య ఏసీబీని ఆశ్రయించారని చెప్పారు. మస్తానయ్య ఇచ్చిన డబ్బును శ్రీరామ్ బ్యాగ్లో పెట్టుకున్న వెంటనే తాము ఇంట్లోకి వెళ్లి పట్టుకున్నామని వివరించారు. దాడి చేసే సమయంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను సాక్షులుగా తీసుకొచ్చామని చెప్పారు. పట్టుబడిన నగదుతో శ్రీరామ్పై కేసు నమోదు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు ఎన్.శివకుమార్రెడ్డి, ఎం కృపానందం, సిబ్బంది పాల్గొన్నారు. -
నేటి నుంచి కరువు మండలాల్లో పంట నష్టంపై సర్వే
గ్రామస్థాయి వీఆర్వో, ఏఈఓ, పంచాయతీ సెక్రటరీలతో టీమ్ కర్నూలు(అగ్రికల్చర్): కరువు ప్రాంతాలుగా గుర్తించిన 12 మండలాల్లో శుక్రవారం నుంచి పంట నష్టంపై సర్వే మొదలు కానుంది. గ్రామస్థాయిలో వీఆర్ఓ, వ్యవసాయ విస్తరణాధికారి, పంచాయతీ సెక్రటరీ సర్వే చేయనున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు మండలాల వారీగా నమోదైన వర్షపాతం ఆధారంగా 34 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలని ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే ఇందులో కల్లూరు, కోడుమూరు, ప్యాపిలి, వెల్దుర్తి, మంత్రాలయం, నందికొట్కూరు, చాగలమర్రి, కొలిమిగుండ్ల మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా గుర్తించింది. జిల్లా కలెక్టర్ పంపిన నివేదికలో లేని గూడూరు, డోన్, కోసిగి, ఉయ్యాలవాడ మండలాలను కూడా ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా గుర్తించడం విశేషం. 12 మండలాల్లో ఈనెల 2 నుంచి సర్వే చేపట్టి 9వ తేదీకి పూర్తి చేస్తారు. తర్వాత గ్రామ పంచాయతీలో పెట్టి గ్రామసభ ఆమోదం తీసుకున్న తర్వాత డేటా ఎంట్రీ చేసి ఈనెల 16వ తేదీ నాటికి జిల్లా కేంద్రానికి నివేదికలు వచ్చేలా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాధారంపై సాగు చేసిన వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు, బ్యాంకు ఖాతా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను గ్రామస్థాయిలో సర్వే చేసే టీమ్కు ఇవ్వాల్సి ఉంది. రెండు హెక్టార్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారని జేడీఏ ఠాగూర్ నాయక్ తెలిపారు. 50 శాతం.. ఆపైన దెబ్బతిన్న పంటలను మాత్రమే నమోదు చేస్తారు. 2011, 2012 సంవత్సారాల్లో కరువు ఏర్పడినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీలో జరిగిన అవకతవకలను పరిగణనలోకి తీసుకుని ఈసారి అలాంటి వాటికి తావు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లుగా జేడీఏ వివరించారు. కరువు మండలాల్లో వర్షాభావం వల్ల పంటలను కోల్పోయిన రైతులు వెంటనే సంబంధిత గ్రామ కమిటీలకు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను అందజేయాలని తెలిపారు. జాబితాలను పంచాయతీలో పెట్టి అభ్యంతరాలు స్వీకరించి.. పరిష్కరించిన తర్వాతే డేటా ఎంట్రీ మొదలవుతుందన్నారు. కాగా జిల్లా కలెక్టర్ పంపిన నివేదికలోని 26 మండలాలను ప్రభుత్వం పక్కన పెట్టింది. వీటిని కూడా కరువు ప్రాంతాలుగా గుర్తించేలా జిల్లా కలెక్టర్ సిహెచ్.విజయమోహన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
ధర్పల్లి: లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సంజీవరావు కథనం ప్రకారం.. ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన అస్రఫ్బీ భర్త అజీజ్ జీవనోపాధి కోసం దుబాయి వెళ్లారు. ఆయన తండ్రి గోరేమియా చనిపోవడంతో ముగ్గురు కొడుకులు వేరుపడ్డారు. ఈ క్రమంలో తన భర్త వాటాకు వచ్చిన ఇంటి భాగాన్ని అజీజ్ పేరు మీదికి మార్చేందుకు అతడి భార్య అస్రఫ్బీ సెప్టెంబర్ 9న పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంది. కాగా పేరు మార్పిడి కోసం ఆమెను పంచాయతీ కార్యాలయం చుట్టూ తిప్పించుకున్న కార్యదర్శి సంధ్యారాణి చివరికి రూ. 6 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. బాధితురాలు తొలుత రూ. 2 వేలు ఇస్తానంది. ఈ నెల 17న రూ. 4 వేలకు ఇద్దరి మధ్య బేరం కుదిరింది. అయితే బాధితురాలు ఏసీబీని ఆశ్రయించింది. బుధవారం ఉదయం 10.30 గంటల వరకు డబ్బులు ఇవ్వాలని కార్యదర్శి కోరగా ఆ ప్రకారం అస్రఫ్బీ రూ.4 వేలు పంచాయతీ కార్యాలయానికి తీసుకెళ్లి ఇచ్చింది. డబ్బులను కార్యదర్శి హ్యాండ్బ్యాగ్లో పెట్టుకోగా అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. కార్యదర్శిని అరెస్టు చేసి హైదరాబాద్ ఏసీబీ స్పెషల్ బ్రాంచ్కు తరలించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్రెడ్డి, రఘునాథ్, ఖుర్షీద్ అలీ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఉత్త పుణ్యానికి పనులవుతాయా..! ఏసీబీకి పట్టుబడ్డ ధర్పల్లి పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి వ్యవహార శైలిపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. గ్రామస్తులు ఎవరైనా పనుల కోసం వెళ్తే ముక్కుపిండి డబ్బులు వసూలు చేసేవారని, పైగా ‘ఉత్త పుణ్యానికే పనులవుతాయా..’ అంటూ దబాయించేవారని పలువురు పేర్కొన్నారు. సంధ్యారాణి ఈవోపీఆర్డీగా అదనపు బాధ్యతలతో పాటు సీతాయిపేట్కు ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు మండలంలో ఏసీబీ దాడులు అధికారుల్లో చర్చనీయాంశగా మారింది. -
పంచాయతీ కార్యదర్శుల ద్వారా పింఛన్ల పంపిణీ
చిత్తూరు(సెంట్రల్): జిల్లాలో వికలాంగుల పింఛన్లకు సంబంధించి బయోమెట్రిక్ విధానంలో వేలిముద్ర లురాని వారిని గుర్తించి వారికి పంచాయతీ సెక్రటరీల ద్వారా ప్రతినెలా పింఛన్ డ్రా చేసి పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్జైన్ ఆదేశిం చారు. సోమవారం జరిగిన ప్రజావాణిలో పలువురు వికలాంగుల వేలిముద్రలు సరిపోవడం లేదని పింఛన్ ఇవ్వలేదని కలెక్టర్కు వినతిపత్రాలు అందజేశారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ వేలిముద్రలు సరిపోని వికలాంగులకు పింఛన్లు సంబంధిత సెక్రటరీలు సొంత బాధ్యత తీసుకుని అందించాలన్నారు. ప్రజావాణిలో సరిగా ఎదుగుదల లేని రమేష్ కుమార్తె గంగామాతకు గతంలో రిలీ జైన ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.25వేలను వెంటనే చెల్లిం చాల్సిందిగా సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మీ- సేవ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి జిల్లాలో మీ-సేవ ద్వారా వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలకోసం వచ్చిన దరఖాస్తులు 33వేల వరకు పెండింగ్లో ఉన్నాయని, సంబంధిత ఆర్డీవోలు, తహశీల్దార్లు సత్వరమే చర్యలు తీసుకుని పరిష్కరించాలని చెప్పారు. ప్రజావాణిలో రెవెన్యూకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా వస్తున్నాయని, వీటి పరిష్కారానికి అనుభవం కలిగిన రెవెన్యూ అధికారులతో టాస్క్ఫోర్సు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జేసీ భరత్గుప్తా, ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పంచాయతీ కార్యదర్శి నిర్బంధం
గుంకలాం (విజయనగరం రూరల్):అర్హులైన లబ్ధిదారుల పింఛన్లు తొలగించారని గుంకలాం గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. పింఛన్లు ఎందుకు తొలగించారని నిలదీస్తూ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి రమణకుమార్ను కొది సేపు నిర్బంధించారు. గ్రామ కమిటీలో ఎంపిక చేసిన జాబితా ఏమైందని కార్యదర్శిని ప్రశ్నించారు. జాబితా ఎంపికపై తన ప్రమేయం లేదని నాయకుల కనుసన్నల్లోనే జరుగుతుందని లబ్ధిదారులకు కార్యదర్శి చెప్పినా పట్టించుకోలేదు. అలాగే జన్మభూమి-మాఊరు ర్యాలీని కూడా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత నెల 19, 20 తేదీల్లో సర్పంచ్ కర్రోతు రమణమ్మ అధ్యక్షతన ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను మండల కమిటీలకు, అక్కడ నుంచి జిల్లా కమిటీలకు పంపించారు. జిల్లా కమిటీలకు పంపించిన జాబితాను సర్పంచ్ సంతకం కోసం అధికారులు పంచాయతీ కార్యదర్శి ద్వారా గురువారం పంపించారన్నారు. జాబితాను పరిశీలించిన సర్పంచ్ రమణమ్మ గ్రామ కమిటీలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు, అధికారుల పంపించిన జాబితాకు పొంతన కుదరలేదన్నారని గ్రామస్తులు తెలిపారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి రమణకుమార్ను ప్రశ్నించారు. గ్రామ కమిటీలో ఎంపిక చేసిన జాబితాపై జెడ్పీటీసీ అభ్యంతరం వ్యక్తం చేసి పేర్లు తొలగించారని తెలిపారు. దీంతో గ్రామస్తులు పంచాయతీ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. అలాగే గ్రామంలో గురువారం నిర్వహించిన స్వచ్ఛంధ్ర ప్రదేశ్ ర్యాలీని అడ్డుకున్నారు. జాబితాలో అర్హులైన 50 మంది లబ్ధిదారుల పేర్లను తొలగించేశారని, వారంతా నిరుపేదలు, వితంతులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులేనని సర్పంచ్ రమణమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. టీడీపీకి చెందిన కొందరి పేర్లు జాబితాలో ఉండటంపై వారు ధ్వజమెత్తారు. అర్హుల పేర్లు తొలగిస్తే కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఆందోళన జరుగుతున్న సమాచారాన్ని టీడీపీ ప్రజాప్రతినిధి రూరల్ పోలీస్లకు సమాచారం అందించడంతో వారు గ్రామానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆందోళన విరమించడంతో పోలీసులు వెనుదిరిగారు. -
తప్పుల తడక
ఇందూరు : జిల్లాకు మంజూరు అయిన 66 పంచాయతీ కా ర్యదర్శుల పోస్టుల భర్తీకి పంచాయతీ శాఖ అధికారులు చేసిన కసరత్తులో తీవ్రంగా త ప్పులు దొర్లాయి. కొందరి కులా ల పేర్లు మారగా, ఇంకోచోట మహిళలకు కేటాయించిన పోస్టులో మగవారు ఎంపికయ్యారు. నియామకాల విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని, అందుకే జాబితా వెల్లడిలో జాప్యం జరుగుతోందని అధికారులు చెప్పినప్పటికీ ఈ తప్పులు చోటు చేసుకోవడం గమనార్హం. తప్పులను గుర్తించినా, సరిదిద్దకుండా ఈ నెల 21న ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితాను బహిర్గతం చేశారు. పరీక్ష రాసి మెరిట్ మార్కులు సాధించినా ఉద్యోగం దక్కకపోవడంతో అనుమా నం వచ్చిన పలువురు అభ్యర్థులు మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి వచ్చారు. తమకు ఎందుకు ఫోన్ చేయలేదని సంబంధిత అధికారులను ఆ రా తీశారు. కార్యాలయం వెల్లడించిన జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో అసంతృప్తి చెంది, తమకు న్యాయం చేయాలని డీపీఓను కోరారు. ఇదీ జరిగింది పంచాయతీ అధికారులు ప్రకటించిన 66మంది అభ్యర్థుల జాబితాలో తప్పులు దొర్లాయని స్పష్టంగా కనిపిస్తోంది. ఓసీ కులానికి చెందిన బి. నవనీత అనే అభ్యర్థికి 208 మార్కులు వచ్చాయి. కానీ ఆమెను బీసీ-ఏలో చేర్చారు. రాజేశ్కుమార్ అనే అభ్యర్థి మహిళా విభాగంలో ఎంపికైనట్టు జాబితాలో చేర్చారు. దీంతో అక్కడ ఎంపిక కావలసిన జయశ్రీ అనే అభ్యర్థికి అన్యాయం జరిగింది. దీనిని బట్టి అధికారులు ఎంత నిర్లక్ష్యంగా జాబితాను తయారు చేశారో ఊహించుకోవచ్చు. జనరల్ కేటగిరీలో 19 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 6 పోస్టులు ఉన్నాయి. జనరల్ కేటగిరీ పోస్టులకు మెరిట్ మార్కులు సాధించిన మొదటి 19 మందిని ఎంపిక చేశారు. ఇందులో ఒక ఎస్సీ అభ్యర్థి కూడా ఉన్నారు. ఎస్సీ కేటగిరీలో కూడా ఆయన ఎంపిక అయినట్టు చూపించారు. రెండు కేటగిరీలలో ఒకే అభ్యర్థి ఎలా ఎంపిక అవుతాడో అధికారులకే తెలియాలి. ఫలితంగా తరువాత మెరిట్ మార్కులు కలిగిన వేల్పూర్ మండలం పడిగెల గ్రామానికి చెందిన లోలం రాజేష్కు అన్యాయం జరిగింది. వికలాంగుల కోటాలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను కార్యాలయంలో ప్రదర్శించలేదు. తమకు జరిగిన అన్యాయం విషయంలో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని బాధిత అభ్యర్థులు పేర్కొన్నారు. -
మంత్రిగారు.. చూశారా తీరు!
పంచాయతీ కార్యదర్శుల నియామకాల్లో జాప్యం నెలలు గడుస్తున్నా పోస్టింగ్ ఆర్డర్లులివ్వని వైనం {పజావాణిలో డీఆర్వోకు విన్నవించిన అభ్యర్థులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి స్పందించాలని వినతి ఉద్యోగం కోసం వారెంతో శ్రమించారు. ప్రభుత్వం పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గి పంచాయతీ కార్యదర్శి కొలువు కొట్టారు. కానీ వారికి ఆ ఆనందమే మిగలకుండాపోయింది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకుండా అధికారులు నెలల తరబడి తాత్సారం చేస్తున్నారు. కొందరి విద్యార్హతలపై అనుమానం ఉంద ని, విచారణ తర్వాతే అందరికీ పోస్టింగ్ అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ, నిజామాబాద్, మెదక్, వరంగల్ జిల్లాల్లో అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సొంత జిల్లాలో మాత్రం పోస్టింగుల్లో జాప్యం కావడం గమనార్హం. జిల్లాలో ఖాళీగా ఉన్న 88 పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసేందుకు గతేడాది చివరలో అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23న రాత పరీక్ష నిర్వహించింది. మార్చిలో ఫలితాలు వెలువడ్డారుు. రెండువారాల లోపు ఎంపికైన అభ్యర్థుల విద్యార్హత ధ్రువీకరణపత్రాలు పరిశీలించి వారికి పోస్టింగ్లు ఇవ్వాలి. జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా ఉపాధికల్పనాధికారులతో కూడిన ఎంపిక కమిటీ జూన్, జూలైలో మూడుసార్లు అభ్యర్థుల విద్యార్హత సర్టిఫికెట్లను పరిశీలించింది. ఈ నెల 3న తుది పరిశీలన జరిగింది. ఇందులో 14 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లపై అనుమానం వ్యక్తం చేసిన అధికారులు ప్రక్రియను అక్కడే నిలిపేశారు. అనుమానిత అభ్యర్థుల సర్టిఫికెట్లు తీసుకుని.. వారు ఏ సమయంలో ఎక్కడ చదివారని విచారణ చేయాలని నిర్ణయించారు. కానీ.. ఇంతవరకు విచారణ మొదలే కాలేదు. దీంతో సర్టిఫికెట్లు సరిగా ఉన్న 74 మంది అభ్యర్థులు తమకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలంటూ జిల్లా పంచాయతీ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. 14 మంది అనుమానిత అభ్యర్థుల సర్టిఫికెట్లు సరిగా ఉన్నాయని తేలిన తర్వాతే అందరికీ ఒకేసారి ఉత్తర్వులు ఇస్తామని, అప్పటివరకు వేచి ఉండాలని అధికారులు లింకుపెట్టారు. ఆ తర్వాత కూడా నియామక ప్రక్రియ నిలిచిపోవడంతో అభ్యర్థులు పలుమార్లు డీపీవోను కలిసి పోస్టింగ్ ఆర్డర్ల కోసం మొరపెట్టుకున్నారు. అయినా స్పందన లేకపోవడంతో సోమవారం ప్రజావాణిలో డీఆర్వో వీరబ్రహ్మయ్యకు విన్నవించారు. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి కుమారస్వామి వివరణ ఇస్తూ.. 14మంది అభ్యర్థుల విద్యార్హతలపై అనుమానం ఉందని, క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన తర్వాత అందరికీ ఒకేసారి పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తామని చెప్పారు. అభ్యర్థులు చింతించాల్సిన అవసరం లేదన్నారు. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
వెంకటాపురం : వాటర్ప్లాంట్ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ వెంకటాపురం పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబట్టాడు. ఈ సంఘట న గణపురం మండల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకు వద్ద బుధవారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. మండలంలోని రామాంజాపూర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న తడుక శ్రీనివాస్ కొన్ని నెలల నుంచి వెంకటాపు రం పంచాయతీ కార్యద ర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే గణపురం మండల కేం ద్రంలో నివాసముంటున్న శ్రీనివాస్ రోజు రెండు గ్రామాల్లో పాలన కార్యక్రమాలను చూస్తున్నాడు. కాగా, మండల కేంద్రంలోని తాళ్లపాడు శివారులో పంబిడి మాధవరావు అనే వ్యక్తి ఇటీవల వాటర్ప్లాంట్ను నిర్మించుకుంటున్నాడు. అయితే ప్లాంట్ నిర్మాణానికి అనుమతి కావాలని సంబంధిత పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్కు అతడు జూన్ 18న దరఖాస్తు చేసుకున్నాడు. కాగా, ప్లాంట్కు అనుమతి ఇవ్వాలంటే తనకు రూ.10 వేలు ఇవ్వాలని శ్రీనివా స్.. మాధవరావును డిమాండ్ చేశాడు. అయితే తన వద్ద అంత డబ్బులేదని చెప్పడంతో కనీసం రూ.5 వేలైనా ఇవ్వాలని కోరాడు. దీంతో కార్యదర్శి వేధిం పులు భరించలేని మాధవరావు కుమారుడు శ్రీధర్రావు జూన్ 30న ఏసీబీ అధికారులను ఆశ్రయిం చాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం శ్రీధర్రా వు కార్యదర్శికి ఫోన్ చేసి డబ్బులు ఇస్తానని చెప్పా డు. దీంతో ఆయన గణపురం ఆంధ్రాబ్యాంకు వద్ద కు రమ్మని చెప్పాడు. ఈ క్రమంలో శ్రీధర్రావు ఏసీ బీ అధికారులతో కలిసి బ్యాంకు వద్దకు వెళ్లి శ్రీనివాస్కు రూ.5వేలు ఇస్తుండగా వారు అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం వెంకటాపురం పంచాయతీ కార్యాలయానికి వెళ్లి రికార్డులు పరిశీలించి శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో సీఐ రాఘవేందర్రావు, సిబ్బంది జనార్ధన్, రాజయ్య పాల్గొన్నారు. అవినీతిపరుల సమాచారం ఇవ్వండి : ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ సాయిబాబా ప్రజలకు సూచించా రు. పంచాయతీ కార్యాలయంలో ఆయన విలేకరుల తో ఉద్యోగులు లంచం అడిగితే 94404 46146 ఫోన్చేసి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. -
అడిగింది జననపత్రం.. ఇచ్చింది మరణ పత్రం!
మార్కాపురం, బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం కావాలని తల్లితండ్రులు కోరితే... ఓ పంచాయతీ కార్యదర్శి మాత్రం మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమ్మనపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మేకల అరుణ, ఆదామ్ దంపతులకు గత ఏప్రిల్ 6న మార్కాపురం ఏరియా వైద్యశాలలో ఆడపిల్ల పుట్టింది. బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకుగాను జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటూ గ్రామ కార్యదర్శిని కోరారు. అదిగో..ఇదిగో అంటూ వారం రోజులపాటు కాలం గడిపిన కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు అదే నెల 19వ తేదీన వారికి ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. నిరక్షరాస్యులైన వారు ఆ పత్రం ఆధారంగా బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేసుకోగా.. ఐకేపీ అధికారులు వారి దరఖాస్తును తిరస్కరించారు. తాము తెచ్చింది జనన ధ్రువీకరణ పత్రం కాదని.. మరణ ధ్రువీకరణ పత్రమని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు అవాక్కయ్యారు. దీనిపై గ్రామ కార్యదర్శిని నిలదీయడంతో పొరపాటు అయిపోయిందంటూ జారుకున్నాడు. జనన ధ్రువీకరణ పత్రం కావాలని అడిగితే.. ఎటువంటి విచారణ చేయకుండానే పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై ఎంపీడీవో రాజేష్ను వివరణ కోరగా.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
పంచాయతీ కార్యదర్శిపై పోలీసుల దాడి
పెద్దేముల్, న్యూస్లైన్: ఓ పంచాయతీ కార్యదర్శిపై పొలీసులు దాడి చేశారు. ఈ సంఘటన ఆదివారం పెద్దేముల్ మండల పరిధిలోని తట్టెపల్లిలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా తట్టెపల్లి పంచాయతీ కార్యదర్శి రాజేందర్ మధ్యాహ్నం 12 గంటల సమయంలో గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్ వద్ద ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్లాలని పోలీసులు ఆయనకు తెలిపారు. తాను పంచాయతీ కార్యదర్శినని రాజేందర్ చెప్పినా వినకుండా ఆయనపై దాడి చేశారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఉండాలని ఆయనను పోలీసులు తోసి వేశారు. దీంతో రాజేందర్ మండల ఎన్నికల అధికారి శివనాగిరెడ్డితో పాటు ఇన్చార్జి ఎంపీడీఓ జర్నప్పకుకు ఫిర్యాదు చేశారు. ఉదయం నుంచి తాను పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నానని, అప్పుడు అభ్యంతరం చెప్పని పోలీసులు దాడి చేయడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శిైపై దాడి చేసిన పోలీసులు అనంతరం ఆయనకు క్షమాపణ చెప్పినట్లు తెలిసింది. జైరాం తండాలో ఓటర్ల ఆందోళన జైరాం తండాలో పోలింగ్ ఆలస్యమవుతోందని ఓటర్లు మధ్యాహ్నం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగులు, వృద్ధులు ఓట్లు వేస్తుండడంతో ఆలస్యం జరిగిందని అధికారులు ఓటర్లకు నచ్చజెప్పడంతో సమస్య సద్దుమణిగింది. -
పంచాయతీ కార్యదర్శి కటాఫ్ 240-250?
మొత్తం 2,677 పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-4) ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఏపీపీఎస్సీ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 23న పరీక్ష నిర్వహించింది. ఇటీవల విడుదలైన వీఆర్వో పరీక్ష ఫలితాల్లో వందకు వంద మార్కులు రావడంతో పంచాయతీ కార్యదర్శి పరీక్ష కటాఫ్పై రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి ప్రశ్నపత్రాల తీరుతెన్నులు, కటాఫ్ అంచనాలపై నిపుణుల విశ్లేషణ.. పంచాయతీ కార్యదర్శి పరీక్షకు 8.14 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 71 శాతం మంది హాజరయ్యారు. ఉదయం జరిగిన పేపర్-1 (జనరల్ స్టడీస్)కు 71.21 శాతం మంది హాజరుకాగా, మధ్యాహ్నం జరిగిన పేపర్-2 (గ్రామీణాభివృద్ధి)కు 70.83 శాతం మంది హాజరయ్యారు. పేపర్-1లో వచ్చిన మూడు ప్రశ్నలు స్వల్ప తేడాతో రెండో పేపర్లోనూ వచ్చాయి. అవి.. 1.బెరి బెరి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? (పేపర్-1); బి-విటమిన్ లోపం వల్ల సంక్రమించే వ్యాధి? (పేపర్-2). 2.ఏ కమిటీ సూచనల ఆధారంగా నాబార్డ్ను స్థాపించారు? (పేపర్-1); నాబార్డ్ సంస్థను ఏ కమిటీ సిఫార్సుల మేరకు స్థాపించారు? (పేపర్-2). 3.భారతదేశ ఏ రెండు రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను మొదట ప్రవేశపెట్టారు? (పేపర్-1); రాజస్థాన్తో పాటుగా మొట్టమొదట పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభమైన మరో రాష్ట్రం? (పేపర్ 2). పేపర్ 1 (జీఎస్): జనరల్ స్టడీస్ పేపర్లో ఐదారు ప్రశ్నలు తప్ప, మిగిలిన ప్రశ్నలన్నీ తేలిక నుంచి మధ్యస్థాయి (Easy to Moderate) కాఠిన్యత ఉన్నవే. చాలా వరకు ప్రశ్నలు నేరుగా వచ్చాయి. భారతదేశ మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు?; సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది?; చంద్రునిపై కాలు పెట్టిన మొదటి వ్యోమగామి ఎవరు? వంటి ప్రశ్నలు ఈ కోవకు చెందుతాయి. ఇందులో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ విభాగం నుంచి ఏకంగా 37 ప్రశ్నలు వచ్చాయి. వర్తమాన వ్యవహారాల నుంచి 19 ప్రశ్నలు వచ్చాయి. జనరల్ నాలెడ్జ్ విభాగం నుంచి సింహ భాగం ప్రశ్నలు (దాదాపు 42) వచ్చాయి. గ్రూప్స్, జేఎల్ వంటి పోటీ పరీక్షలకు పకడ్బందీగా సిద్ధమవుతున్న వారు జీఎస్ పేపర్లో 135 వరకు స్కోర్ చేస్తారనడంలో సందేహం లేదు. విపత్తుల నిర్వహణ విభాగం నుంచి ఎనిమిది ప్రశ్నలు వచ్చాయి. ఈ ప్రశ్నలు గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన వివిధ పరీక్షల్లో పదేపదే వచ్చినవే. ఉదా: సార్క్ విపత్తు నిర్వహణ కేంద్రం ఎక్కడ ఉంది? 1) కటక్ 2) న్యూఢిల్లీ 3) విశాఖపట్నం 4) మదురై జవాబు: 2 ఉదా: ఏ సంవత్సరంలో విపత్తు నిర్వహణ చట్టాన్ని భారత్లో చేశారు? 1) 2003 2) 2004 3) 2005 4) 2006 జవాబు: 3 పేపర్ 2 (గ్రామీణాభివృద్ధి): పరీక్షకు సంబంధించిన పేపర్-2 (గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంత సమస్యలు) సిలబస్లో అయిదు అంశాలను పేర్కొన్నారు. అయితే ప్రశ్నపత్రం రూపకల్పనలో వీటికి సమ ప్రాధాన్యం ఇవ్వలేదు. అకౌంటింగ్కు సంబంధించి 28 వరకు ప్రశ్నలు వచ్చాయి. ఇవి ఇంటర్, డిగ్రీలో కామర్స్ చదువుకున్న వారు మాత్రమే సమాధానాలు గుర్తించేలా ఉన్నాయి. పేపర్-1 బాగా రాసి, ఉత్సాహంగా పేపర్-2కు హాజరైన వారు ఇందులోని అకౌంటింగ్ ప్రశ్నల సంఖ్య, అడిగే తీరును చూసి నిరాశచెందారు. పదాలు పూర్తిగా కొత్తవి కావడంతో, ప్రశ్నను సైతం అర్థం చేసుకోలేని స్థితిలో ఉండటంతో కామర్స్ నేపథ్యం లేని అభ్యర్థులు నిరుత్సాహానికి గురయ్యారు. ఉదా: జంట పద్దు విధానంలో ఖాతా పుస్తకాల నమోదు, నిల్వలు తేల్చడంలో దొర్లిన అంకగణిత కచ్చితత్వాన్ని కనుక్కోవడానికి ఈ కింది దాన్ని తయారు చేస్తారు? 1) నగదు పుస్తకం 2) చిట్టా 3) అంకణా 4) బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ జవాబు : 3 ఉదా: రూ.5 వేలు జీతాల చెల్లింపు అంకణాలో క్రెడిట్ వైపు చూపారు. అప్పుడు అంకణాలోని డెబిట్ వైపు 1) రూ.5 వేలు తగ్గుతుంది 2) రూ.5 వేలు అధికంగా చూపుతుంది 3) రూ.10 వేలు తగ్గుతుంది 4) రూ.10 వేలు అధికంగా చూపుతుంది. జవాబు: 3 పంచాయతీరాజ్ హవా! అందరూ ఊహించినట్లుగానే పేపర్-2లో పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి అధిక ప్రశ్నలు వచ్చాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ- రాజ్యాంగం; స్థానిక సంస్థల నిర్మాణం- విధులు తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడిగారు. ఉదా:1)పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్ని సంవత్సరాల కొకసారి ఎన్నికలు జరపాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తుంది? 2)మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏ మూడు ఉన్నాయి? గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాల్లో ప్రధానమైన వ్యవసాయం- అనుబంధ రంగాల గురించి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఒకే అంశానికి సంబంధించి నాలుగైదు ప్రశ్నలు వచ్చాయి. విటమిన్లకు సంబంధించి సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ ఏది?; ‘ఎ’ విటమిన్ ఆహారంలో లోపిస్తే దెబ్బతినే అవయవం ఏది?; సి విటమిన్ ఏ ఆహార పదార్థాలలో ఎక్కువగా లభిస్తుంది? బి విటమిన్ లోపం వల్ల సంక్రమించే వ్యాధి ఏది? అనే ప్రశ్నలు వచ్చాయి. వ్యవసాయం, అనుబంధ రంగాల విప్లవాలపై ఆరు ప్రశ్నలు వచ్చాయి. వీటిలో హరిత విప్లవానికి సంబంధించి రెండు, శ్వేత విప్లవం నుంచి రెండు, నీలి విప్లవం నుంచి ఒకటి, యెల్లో విప్లవం నుంచి ఒకటి ప్రశ్నలు వచ్చాయి. కటాఫ్ అంచనా పేపర్-1లో 130-135 మార్కులు తెచ్చుకునే అవకాశముంది. అదే విధంగా రెండో పేపర్లో 110-115 మార్కులు స్కోర్ చేయొచ్చు. దీన్నిబట్టి మొత్తంమీద కటాఫ్ 240-250 (300 మార్కులకు) ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు మార్కులు సాధించిన వారు పోటీలో నిలిచేందుకు అవకాశముందంటున్నారు. ఇంటర్ పాఠ్యపుస్తకాల్లోనివే అకౌంటింగ్ ప్రాథమిక అంశాల విభాగంలో వచ్చిన ప్రశ్నల్లో చాలా వరకు ఇంటర్మీడియెట్ కామర్స్ తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్నవే. అయిదారు ప్రశ్నలు సీబీఎస్ఈ 11, 12 తరగతి పుస్తకాల్లో ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ స్థాయిలో కామర్స్ చదువుకున్న వారికి ఈ విభాగం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. - కురుహూరి రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ. డేటా ఇంటర్ప్రిటేషన్, అకౌంటింగ్ కీలకం! పోటీ పరీక్షల ప్రశ్నపత్రం ఎప్పుడూ సమతూకంగా ఉండాలి. ఏదో ఒక విభాగం వారికి ప్రయోజనం చేకూరేలా ఉండకూడదు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీని అర్హతగా నిర్దేశించారు. అలాంటప్పుడు అందరినీ దృష్టిలో ఉంచుకొని ప్రశ్నపత్రాన్ని రూపొందించాలి. కానీ, పరీక్షలో ఏకంగా 28 ప్రశ్నలు అకౌంటింగ్కు సంబంధించినవి ఉన్నాయి. అవి కూడా జనరల్గా కాకుండా పూర్తిగా టెక్నికల్గా ఉన్నాయి. కామర్స్ నేపథ్యమున్న విద్యార్థులు మాత్రమే వాటికి సమాధానాలు రాయగలరు. అదే విధంగా సిలబస్లో ‘సమకాలీన సమాజంలో సామాజిక ఉద్రిక్తతలు, ఘర్షణలు- అణగారిన వర్గాల సమస్యలు’ అంశాన్ని పేర్కొన్నారు. కానీ, ఈ విభాగం నుంచి చాలా తక్కువ ప్రశ్నలు వచ్చాయి. మొత్తంమీద పేపర్-1లో డేటా ఇంటర్ప్రిటేషన్, పేపర్-2లో అకౌంటింగ్లో మంచి స్కోర్ చేసిన వారు తుది జాబితాలో నిలిచే అవకాశముంది. - బి.కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-1 స్టడీసర్కిల్. డిగ్రీ అర్హతతో గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల జనరల్ స్టడీస్ పేపర్తో పోల్చితే ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి పేపర్-1 భిన్నంగా ఉంది. దాదాపు అన్ని ప్రశ్నలూ నేరుగా వచ్చాయి. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. పేపర్-1లో 140 మార్కుల వరకూ స్కోర్ చేయొచ్చు. ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తప్పనిసరిగా స్టాండర్డ్ జీకేపై పట్టు సాధించాలి. - ఎన్.విజయేందర్రెడ్డి, జనరల్ అవేర్నెస్ ఫ్యాకల్టీ. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలన్న కోరిక ఉన్నప్పటికీ చాలా మంది.. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ గురించి ఆలోచిస్తారు. అయితే నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో లక్ష్యాన్ని సాధించే దిశగా సాగిపోవాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో విజేతల జాబితాలో చోటు లభిస్తుంది. ఎక్కువ మంది గ్రూప్స్ను లక్ష్యంగా పెట్టుకుంటారు. కొత్త నోటిఫికేషన్లు రావడానికి మరికొన్ని నెలలు ఆగాల్సి ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రిపరేషన్ను కొనసాగించేందుకు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఇలా చేస్తే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా పోటీలో ముందువరుసలో ఉండొచ్చు. ఎన్ని గంటలు చదవాలి: ప్రిపరేషన్కు ఎవరెన్ని గంటలు కేటాయించాలనేది వారివారి చేతుల్లోనే ఉంటుంది. వివిధ ఉద్యోగాల్లో ఉన్నవారు, ఫ్రెషర్స్ తమకు అందుబాటులో ఉన్న సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. జనరల్ స్టడీస్ పట్టుపట్టాలి: డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఎంపీడీవో, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, డీఎల్, జేఎల్ వంటి ఉన్నత స్థాయి పోస్టుల నుంచి జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, హాస్టల్ వార్డెన్, కానిస్టేబుల్ వంటి ఉద్యోగాల వరకు నిర్వహించే పరీక్షల్లో జనరల్ స్టడీస్ కీలకపాత్ర పోషిస్తుంది. గ్రూప్స్తో పాటు వివిధ పోస్టులకు నిర్వహించే పరీక్షల్లో జీఎస్కు ప్రత్యేక పేపర్ ఉంటుంది. ఓ ప్రణాళిక ప్రకారం చదివితే ఇందులో అత్యధిక మార్కులు సంపాదించవచ్చు. జీఎస్లో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్స్, మెంటల్ ఎబిలిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, కరెంట్ అఫైర్స్లకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు ఆరు నుంచి పదో తరగతి వరకు సైన్స్, సోషల్ పాఠ్యపుస్తకాలను చదివి, సొంతంగా నోట్స్ రూపొందించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ నోట్స్ను చదివిన తర్వాత ఇతర ఏ ప్రామాణిక మెటీరియల్ను అయినా త్వరగా చదివేందుకు, తేలిగ్గా అర్థం చేసుకునేందుకు అవకాశముంటుంది. అప్డేట్.. అసలైన ఆయుధం: ఏ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులైనా సిలబస్లోని విషయాలకు సంబంధించి తాజా సమాచారాన్ని తెలుసుకోవడం (అప్డేట్) ప్రధానం. దీనికోసం ఒకట్రెండు దిన పత్రికలు చదువుతూ సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. పోటీ పరీక్షల డిస్క్రిప్టివ్ పేపర్లలో అత్యధిక మార్కులు సాధించాలంటే రైటింగ్ స్కిల్స్ చాలా ముఖ్యం. దీనికోసం అభ్యర్థులు తక్కువ సమయంలో ఎగ్జామినర్ ఆశించిన సమాధానం రాయాలంటే ఇప్పటి నుంచే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. దీనికోసం రోజులో కొంత సమయాన్ని కేటాయించాలి. -
పంచాయతీ కార్యదర్శి పరీక్ష ప్రశాంతం
కరీంనగర్ సిటీ, న్యూస్లైన్ : జిల్లాలో పంచాయతీ కార్యదర్శి రాతపరీక్ష ఆదివారం చిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 57,721మంది అభ్యర్థులకుగాను ఉదయం పేపర్-1 పరీక్షకు 39,668 మంది, మధ్యాహ్నం పేపర్ 2కు 39,571 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తంగా 68.56 శాతం అభ్యర్థుల హాజరుఉన్నట్లు కలెక్టర్ వీరబ్రహ్మయ్య తెలిపారు. కేంద్రాల వద్ద హడావుడి రాతపరీక్ష సందర్భంగా అన్ని కేంద్రాల వద ్ద అభ్యర్థులు, వారి సంబంధీకుల హడావుడి కనిపించింది. గృహిణులు పరీక్ష రాయడానికివెళ్లగా.. వారి భర్తలు పిల్లలతో కేంద్రం బయట నిరీక్షించారు. అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సు సర్వీసులు నడిపింది. అభ్యర్థులతో జిల్లా కేంద్రం కిటకిటలాడింది. జిల్లా కలెక్టర్ వీర్రహ్మయ్య పర్యవేక్షణలో జిల్లా కోఆర్డినేట్ అధికారి సత్యవతి, డీపీవో కుమారస్వామిలు, జిల్లా అధికారులు పరీక్షాకేంద్రాలను సందర్శించి పరిశీలించారు. హాల్టికెట్లో ఒక చోట.. పరీక్షా కేంద్రం మరో చోట అధికారుల అనాలోచిత నిర్ణయంతో పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల కేంద్రంలో ఈ గందరగోళం నెలకొంది. వావిలాలపల్లిలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో పరీక్షాకేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు అభ్యర్థుల హాల్టికెట్లలో పొందుపరిచారు. ఆదివారం ఉదయం పరీక్ష సమయానికి వెళ్లే సరికి పరీక్ష ఇక్కడ కాదు.. ఆదర్శనగర్లోని ఎస్ఆర్ బాలుర జూనియర్కళాశాల అంటూ కళాశాల సిబ్బంది చెప్పారు. దీంతో అభ్యర్థులు హడావుడిగా ఆదర్శనగర్కు పరుగులు పెట్టారు. కాస్త ఆలస్యంగా వ చ్చిన అభ్యర్థులు, రెండు కేంద్రాలు తిరగడంతో మరింత ఆలస్యం జరిగింది. దీంతో పరీక్షా కేంద్రంలోనికి పోలీసులు అనుమతించలేదు. తమకు కేంద్రం తప్పుగా ఇచ్చారని, ఎందుకు అనుమతించరంటూ అభ్యర్థులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు సూపరింటెండెంట్ వచ్చి అభ్యర్థులను అనుమతించారు. చివరినిమిషంలో పరీక్షా కేంద్రం మారిందని తెలియడంతో చాలా ఒత్తిడికి గురయ్యామని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ప్రశాంతంగా పంచాయతీ
విజయనగరం కలెక్టరేట్, న్యూస్లైన్: సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షలు. ఏ పొరపాటు జరిగినా జిల్లా పరువు పోతుందని భావించి న అధికారులు పంచాయతీ సెక్రటరీ పరీక్షలను పక్కా ప్రణాళికతో విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించా రు. పేపర్ల పంపిణీ సమయంలో కూడా ఎటువంటి గందరగోళమూ తలెత్తలేదు. జిల్లా వ్యాప్తంగా 117 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 30వేల 67 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా ఉదయం జరిగిన పేపర్-1 కు 22,403 మంది అభ్యర్థులు హాజరవ్వగా, 7664 మంది గైర్హాజరయ్యారు.74.51 శాతం మంది పరీక్ష రాశారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పేపర్-2 పరీక్షకు 22,270 మంది మాత్రమే హాజరయ్యారు. 7979 మంది గైర్హాజరయ్యారు.74.07 శాతం మంది పరీక్ష రాశారు. డిగ్రీ అర్హతతో జరిగిన ఈ పరీక్షల పట్ల అభ్యర్థుల్లో ఆసక్తి ఎక్కువగానే కన్పించింది. ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపడంతో ఎటువంటి అవకతవకలూ జరగలేదు. దీంతో జిల్లా యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. జాయింట్ కలెక్టర్ బి.రామారావు జేఎన్టీ యూ, ఆంధ్రాయూనివర్సిటీ క్యాంపస్, బీసెంట్ హైస్కూల్ కేంద్రాల్లో జరిగిన పరీక్షలను పరిశీలించారు. ఇదిలా ఉండగా గ్రామీణాభివృద్ధి అంశంలో జరిగి న పేపర్-2లో పలు అంశాలు క్లిష్టంగా ఉండడంతో తికమక పడ్డామని అభ్యర్థులు కొందరు అభిప్రాయ పడ్డారు. నిరుద్యోగులపై ఆర్టీసీ భారం? విజయనగరం అర్బన్: ‘అదునుచూసి కత్తికి పదును పెట్టాలి..’ అన్న చందంగా మారింది ఆర్టీసీ వ్యవహారం. పీకల లోతు నష్టాల్లో మునిగిన ఆర్టీసీ ఆదాయం కోసం ప్రయాణికుల డిమాండ్ చూసి ప్రత్యేక సర్వీసుల పేరుతో అప్పడప్పుడు అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. జిల్లాలో ఆదివారం నిర్వహించిన పంచాయతీ కార్యదర్శు ల పోస్టుల పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు పెంచిన అదనపు చార్జీలు ఆర్థిక భారాన్ని మోపాయి. పరీక్షా కేంద్రాలున్న జిల్లా, మండల కేంద్రాల నుంచి అభ్యర్థుల ఆసరాను అదునుగా చేసుకుని ఆర్టీసీ ఏకంగా 40 శాతం అదనపు చార్జీలు పెంచింది. దీంతో రెగ్యులర్గా ఉండే చార్జీలు కాస్తా ప్రత్యేక బస్సుల ఏర్పాటుతో భారం పెరిగింది. ప్రత్యేకం పేరుతో వేసిన సర్వీసులపై రూ.15 ఉన్న టిక్కెట్ను రూ. 20కు రూ.30 ఉన్న చార్జీని రూ. 40కి పెంచుతూ వసూలు చేశారు. జిల్లాలోని 117 కేంద్రాలలో అభ్యర్థులు పరీక్షలు రాశారు. ప్రతి కేంద్రానికి అన్ని ప్రాంతాల నుంచి అభ్యర్థులను కేటాయించడంతో రవాణా రద్దీ అనివార్యమైంది. ఎక్స్ ప్రెస్చార్జీలే..!: ఆర్టీసీ అధికారులు ఆదివారం నిర్వహించిన బస్సు సర్వీసులపై ప్రత్యేకంగా చార్జీలను పెంచలేదని ఆర్టీసీ నెక్ రీజియన్ అధికారులు చెబుతున్నారు. సర్వీసుల ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం కాబట్టి అన్ని సర్వీసుల్లోనూ ఎక్స్ప్రెస్ చార్జీలను వసూలు చేశామని చెప్పారు. -
పంచాయతీ కార్యదర్శి పరీక్షలకు 73.50 శాతం హాజరు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్లైన్: పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష జిల్లాలో ప్రశాంతం జరిగింది. సుమారు 73.50 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 209 పోస్టులకు మొత్తం 34,482 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కేంద్రంతోపాటు ఏడు పట్టణ ప్రాంతాల్లోని 102 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం జరిగిన పేపర్-1 పరీక్షకు 25,459 మంది హాజరు కాగా 9,023 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపరు-2 పరీక్షకు 25,353 హాజరు కాగా 9,129 మంది గైర్హాజరయ్యారు. ఈ పోస్టులకు 34,477 మంది దరఖాస్తు చేసినట్లు అధికారులు ఇంతకుముందు పలు సందర్భాల్లో ప్రకటించినా.. తీరా పరీక్ష సమయానికి మరో ఐదుగురు పెరిగారు. జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్, జిల్లా పంచాయతీ అధికారి టి.వెంకటేశ్వరరావు, ఏపీపీఎస్సీ పరిశీలకురాలు(ఏసీ) పి.సుశీల తదితరులు పలు పరీక్ష కేంద్రాలను సందర్శించి, పరీక్షలు జరిగిన తీరును పరిశీలించారు. పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఒక అభ్యర్థి స్క్రైబ్ సహయంతో పరీక్ష రాశారు. పాలకొండ నవోద య కేంద్రంలో ఒక అభ్యర్థి సొమ్మసిల్లి పడిపోగా అక్కడే ప్రథమ చికిత్స చేశారు. పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన శ్రీకాకుళం, టెక్కలి, పలాస, పాలకొండ, ఆమదాలవలస, రణస్టలం, పాతపట్నం పట్టణాలు రద్దీగా మారాయి. రెండు పూటలూ పరీక్ష ఉండటంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాల రద్దీ, హడావుడి కనిపించింది. మధ్యాహ్నం కూడా పరీక్ష ఉండటంతో అభ్యర్థులు, వారి తో వచ్చిన వారు ఆయా కేంద్రాల్లోనే భోజనాలు చేశా రు. దీంతో హోటళ్లు, మెస్లు, టిఫిన్ స్టాల్స్ కిటకిటలాడాయి. చాలామంది భోజనాలు, టిఫిన్లు దొరక్క ఇబ్బంది పడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పరీక్ష ముగిసిన తర్వాత తిరిగి వెళ్లేందుకు బస్సులు, ఆటోల కోసం ఎగబడటంతో ఆదివారమైనా అవి కిటకిటలాడాయి. -
మార్చి 24న ‘పంచాయతీ’ ర్యాంకింగ్ జాబితాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 2,677 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షల జనరల్ ర్యాంకింగ్ జాబితాలను మార్చి 24న జిల్లా కలెక్టర్లకు పంపించనున్నట్టు ఏపీపీఎస్సీ తెలిపింది. రెవెన్యూ జిల్లా యూనిట్గా పోస్టుల భర్తీ ఉంటుందని, 80 శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. రిజర్వేషన్ ఆధారంగా రోస్టర్ పాయింట్ల ద్వారా ప్రతిభాక్రమాన్ని అనుసరించి పోస్టుల ఎంపికను ఆయా జిల్లాల కలెక్టర్లు లేదా, జిల్లా ఎంపిక కమిటీ చేపడుతుందని పేర్కొంది. -
పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష ప్రశాంతం
సాక్షి, గుంటూరు :అధికార యంత్రాంగం పక్కా ఏర్పాట్లతో జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఎనిమిది మండలాల్లోని 95 సెంటర్లలో జంబ్లింగ్ విధానంలో పరీక్ష సజావుగా జరిగింది. 61.9 శాతం హాజరుతో సుమారు 19, 927 మంది పరీక్ష రాసినట్లు కలెక్టర్ ప్రకటించారు. 32,176 మంది పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. జెడ్పీలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడంతో పాటు 95 మంది పర్యవేక్షకుల్ని, 85 మంది లెజైన్ అధికారుల్ని నియమించడంతో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తలేదు. బస్టాండ్, రైల్వే స్టేషన్, ముఖ్య కూడళ్లలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటుచేశారు. 23 మంది అంధ అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు సహాయకుల్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో 26 పోస్టులు భర్తీకి ఏపీపీఎస్సీ ఈ పరీక్ష నిర్వహించింది. ఆయా పరీక్షా సెంటర్లలో మొత్తం వీడియోతో చిత్రీకరించారు. ఆదివారం సాయంత్రానికి పరీక్ష కేంద్రాల నుంచి జవాబు పత్రాలు పటిష్ట బందోబస్తు నడుమ జిల్లా పరిషత్కు చేరాయి. ఆదివారం రాత్రికి జవాబు పత్రాలను ఏపీపీఎస్సీకి పంపేందుకు జెడ్పీ అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ గుంటూరు సిటీ: జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శి పోస్టులకు జరిగిన రాత పరీక్షలను ఆదివారం కలెక్టర్ ఎస్.సురేష్కుమార్ సందర్శించారు. గుంటూరులోని సెయింట్ ఇగ్నేషియస్ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలు, ఎల్ఈఎం ఉన్నత పాఠశాలను సందర్శించి, పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. విద్యార్థులు ఓఎంఆర్ పత్రాలు పూర్తిచేసిన విధానాన్ని గమనించారు. అభ్యర్థుల కోసం కేంద్రాల్లో ఉన్న ఏర్పాట్లపై చీఫ్ సూపరింటెండెంట్లను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 2వ పేపరు పరీక్ష ఉన్నందున, అభ్యర్థులకు కావలసిన ఆహార సౌకర్యాలపై దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు. సెయింట్ ఇగ్నేషియస్ బాలుర ఉన్నత పాఠశాలలో పెదకాకాని మండలం నంబూరు గ్రామానికి చెందిన అంధుడు ఎల్.వెంకట్రావు ఒకరిసాయంతో పరీక్ష రాస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖాధికారి డి.ఆంజనేయులు, పరీక్ష కోఆర్డినేటర్, జెడ్పీ సీఈవో సుబ్బారావు, చీఫ్ సూపరింటెండెంట్లు జూలియమ్మ, హరిప్రసాద్, ఎన్.ప్రభుదాసు ఉన్నారు. -
పంచాయతీ కార్యదర్శుల రాతపరీక్ష ప్రారంభం
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఉదయం పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష ప్రారంభం అయ్యింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలపై పరీక్ష నిర్వహిస్తారు. 2,406 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు 8.15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 2,677 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. జవాబు పత్రాల మూల్యాంకనం తరువాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను మార్చి 24వ తేదీన జిల్లా కలెక్టర్లకు ఏపీపీఎస్సీ పంపుతుంది. పోస్టుల భర్తీ రెవెన్యూ జిల్లా యూనిట్గా జరుగుతుంది. 80 శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. రిజర్వేషన్ ఆధారంగా రోస్టర్ పాయింట్ల ద్వారా ప్రతిభాక్రమాన్ని అనుసరించి పోస్టుల ఎంపికను జిల్లా కలెక్టర్ లేదా జిల్లా ఎంపిక కమిటీ గానీ చేపడుతుంది. -
పంచాయతీ కార్యదర్శి పోస్టుల పరీక్ష నేడు
ఒంగోలు, న్యూస్లైన్: పంచాయతీ కార్యదర్శుల పరీక్షకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 83 సెంటర్లలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు పరీక్షల కోఆర్డినేటర్, జిల్లా పరిషత్ సీఈవో ఎ.ప్రసాద్ తెలిపారు. స్థానిక సీఎస్ఆర్ శర్మకాలేజీతో పాటు పలు సెంటర్లను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన చీఫ్ సూపరింటెండెంట్లతో ఫోన్లో మాట్లాడారు. ప్రతిసెంటర్లో ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇచ్చినట్లు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలు శర్మ కాలేజీ సెంటర్లోని ఇన్విజిలేటర్ల శిక్షణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓఎంఆర్ షీట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సెల్ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని, ఇన్విజిలేటర్లు కూడా తమ వద్ద ఉంచుకోరాదన్నారు. ఓఎంఆర్ షీట్లను పూర్తిచేసే విషయమై అభ్యర్థులకు క్షుణ్ణంగా వివరించాలని సూచించారు. పరీక్ష ప్రారంభమైన పది నిమిషాల వరకే అభ్యర్థులను అనుమతించాలని స్పష్టం చేశారు. తాగునీటి సౌకర్యం, లైటింగ్ వసతులు అన్నీ సక్రమంగానే ఉన్నట్లు తెలిపారు. అభ్యర్థుల అవసరాలకు తగినట్లు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరారు. 93 పోస్టులకు 33,466 మంది... జిల్లాలో 93 పంచాయతీ కార్యదర్శి పోస్టుల కోసం 33,466 మంది పరీక్షలు రాస్తున్నారు. ఉదయం 10 నుంచి గం.12.30 వరకు మొదటి పేపరు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు రెండో పేపరు ఉంటాయి. -
ఆర్టీసీ చార్జీల పెంపు
మంచిర్యాల టౌన్, న్యూస్లైన్ :పంచాయతీ కార్యదర్శి పరీక్ష ఆదివారం.. అయితే పరీక్షలు రాసే అభ్యర్థులకు మాత్రం ఒక రోజు ముందే పరీక్ష రాసినట్లుగా తయారైంది. ఆర్టీసీ బస్సుల కోసం ముందుగానే బస్టాండ్కు చేరుకుని టికెట్లు బుకింగ్ చేసుకుని మరీ పరీక్షకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతవరకు బాగున్నా అసలు సమస్య ఇక్కడే ప్రారంభమైంది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల ఆసరాను అదనుగా చేసుకుని ఆర్టీసీ ఏకంగా 50 శాతం అదనపు చార్జీలతో అభ్యర్థులపై ఆర్థిక భారం మోపింది. దీంతో రెగ్యులర్గా ఉండే చార్జీలు కాస్త ప్రత్యేక బస్సుల ఏర్పాటుతో తడిసి మోపడవుతున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్కు వెళ్లే బస్సులకు వాస్తవానికి ఇతర రోజుల్లో చార్జీలు వేరేలా ఉంటాయి. కానీ పరీక్షలకు ప్రత్యేకంగా బస్సులు నడుపుతుండటంతో ఈ చార్జీలు వారిపై మోపుతూ ఆర్టీసీ ఆదాయానికి మార్గం సుగమం చేసుకున్నారు. ఇప్పటికే శనివారం నిర్మల్కు 7, ఆదిలాబాద్కు 9 బస్సులకు సంబంధించి ముందస్తు టికెట్లు ఇవ్వడంతో అభ్యర్థులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. ఈ బస్సులన్నీ కూడా ఆదివారం ఉదయం 4 గంటల నుంచి నిర్మల్, ఆదిలాబాద్ మార్గాలకు బయలుదేరుతాయి. పరీక్షా కేంద్రాలు సుదూర ప్రాంతాల్లో ఉండటంతో ఆదివారం పరీక్షా కేంద్రాలకు గంట ముందు చేరుకోకుంటే నష్టపోవాల్సి వస్తుందని.. ఒక రోజు ముందుగానే అభ్యర్థులు వచ్చారు. దీంతో మంచిర్యాల బస్టాండ్ శనివారం ఇటు ప్రయాణికులతో పాటు అటు పరీక్షకు వచ్చిన అభ్యర్థులతో కిటకిటలాడింది. తడిసిమోపెడు... ఆర్టీసీ అధికారులు మూకుమ్మడి ప్రణాళికతో ప్రత్యేక బస్సుల చార్జీలు పెంచేశారు. ప్రస్తుతం నిర్మల్కు రూ.117 ఉన్న చార్జీ అభ్యర్థులకు మాత్రం రూ.176గా నిర్ణయించారు. అంటే రూ.59 పెంచారు. అలాగే ఆదిలాబాద్కు ప్రస్తుతం రూ.129 చార్జి కాగా అభ్యర్థులకు రూ.194 చార్జి చేశారు. అదనంగా రూ. 65 ఎక్కువ చేసి వసూలు చేస్తున్నారు. 16 బస్సులకు రిజ్వేషన్ ‘ఫుల్’... మంచిర్యాల బస్టాండ్ నుంచి నిర్మల్కు 7, ఆదిలాబాద్ మార్గాల్లో 9 బస్సులను వేశారు. వీటికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంతో ఆ బస్సుల్లో రిజర్వేషన్ కోసం గంటలోపు టిక్కెట్లను బుకింగ్ చేసేసుకున్నారు. రిజర్వేషన్లు ఫుల్ కావడంతో నిర్మల్కు 4, ఆదిలాబాద్కు 4 బస్సులను అదనంగా వేశారు. ఈ బస్సులు కూడా ఉదయం 4 గంటలకు బస్టాండ్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచారు. ఇదిలా ఉంటే.. సుదూర ప్రాంతాల్లో ఉన్న పరీక్షా కేంద్రాలకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో కొంత మంది అభ్యర్థులు గ్రూపులుగా ఏర్పడి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. -
నేడు పంచాయతీ కార్యదర్శి రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2,677 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఈనెల 23వతేదీన రాత పరీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. 2,406 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు 8.15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల వరకు కూడా అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలపై పరీక్ష నిర్వహిస్తారు. జ వాబు పత్రాల మూల్యాంకనం తరువాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను మార్చి 24వ తేదీన జిల్లా కలెక్టర్లకు ఏపీపీఎస్సీ పంపుతుంది. పోస్టుల భర్తీ రెవెన్యూ జిల్లా యూనిట్గా జరుగుతుంది. 80 శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్ కేటగిరీలో భర్తీచేస్తారు. రిజర్వేషన్ ఆధారంగా రోస్టర్ పాయింట్ల ద్వారా ప్రతిభాక్రమాన్ని అనుసరించి పోస్టుల ఎంపికను జిల్లా కలెక్టర్ లేదా జిల్లా ఎంపిక కమిటీ గానీ చేపడుతుంది. ఈ జాగ్రత్తలు పాటించాలి: ఓఎంఆర్ జవాబు పత్రంలో బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్తోనే పరీక్ష రాయాలి. పెన్సిల్తో రాయకూడదు. వైట్నర్ను ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించడానికి వీల్లేదు. ఉపయోగిస్తే మూల్యాంకనం చేయరు. పౌడర్, రబ్బరు, బ్లేడ్ వినియోగించినా మూల్యాంకనం చేయరు. ఓఎంఆర్ ఒరిజినల్ జవాబు పత్రాన్ని ఇన్విజిలేటర్కు ఇవ్వాలి. డూప్లికేట్ జవాబు పత్రాన్ని మాత్రమే అభ్యర్థి తీసుకెళ్లాలి. -
నేడే పంచాయతీ కార్యదర్శి పరీక్ష
సంగారెడ్డి డివిజన్, న్యూస్లైన్: గ్రామ పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఆదివారం నిర్వహించను న్న ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 31,255 మంది అభ్యర్థులు హాజ రుకానున్నారు. అభ్యర్థుల ఇబ్బం దులు దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాగం సంగారెడ్డి, పటాన్చెరు, రామచంద్రాపురంలలో 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో 182 పంచాయతీ కార్యదర్శి పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, ఒక్కో పోస్టుకు 171 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అభ్యర్థులంతా పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలనీ, సమయం దాటాక ఎవరినీ అనుమతించమని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా పరీక్షా కేంద్రాల్లోకి క్యాలిక్యులేటర్లు, మొబైల్ఫోన్లు ఇతరాత్ర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమన్నారు. రెండు విడతలుగా పరీక్ష పంచాయతీ కార్యదర్శి రాత పరీక్ష రెండు విడతలుగా ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి విడతగా పేపర్- 1 జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్- 2 రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అనే అంశంపై పరీక్ష ఉంటుంది. పకడ్బందీగా ఏర్పాట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చే శాం. సంగారెడ్డి, పటాన్చెరు, రామచంద్రాపురంలలో 82 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. పరీక్ష నిర్వహణ కోసం సిబ్బంది నియమించటంతోపాటు రెం డు విడతలుగా వారికి శిక్షణ ఇచ్చాం. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించం -ఆశీర్వాదం, జడ్పీ సీఈఓ, పరీక్ష నిర్వహణ సమన్వయకర్త సమయం పేపర్ ఉదయం 10 నుంచి 12.30 పేపర్ 1- జనరల్ స్టడీస్ మధ్యాహ్నం 2 నుంచి 4.30 పేపర్ 2-రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ -
పంచాయతీ కార్యదర్శి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
పరీక్షకు హాజరుకానున్న 52,688 మంది అభ్యర్థులు 160 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ 2,200 మంది ఇన్విజిలేటర్ల నియూమకం కలెక్టర్ కిషన్ వెల్లడి జిల్లా పరిషత్, న్యూస్లైన్ : పంచాయతీరాజ్ శాఖలో ని పంచాయతీ సెక్రటరీ(గ్రూప్-4) పోస్టుల భర్తీ కో సం ఏపీపీఎస్సీ ఆదివారం నిర్వహిస్తున్న రాత పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. పరీక్ష నిర్వహణలో పాల్గొ నే అధికారులకు ఒక రోజు శిక్షణ కా ర్యక్రమం జిల్లా పరిషత్ కార్యాలయం లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీ సెక్రటరీ పోస్టుల కోసం 52,688 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని, ఇందు కోసం జిల్లా కేంద్రంలో 160 పరీక్షా కేంద్రాల ను ఏర్పాటు చేశామన్నారు. 32 రూ ట్లుగా విభజించి ప్రతి రూట్కు ఒక లైజన్ ఆఫీసర్ను నియమించామని, ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక సూపరిం టెండెంట్, ఒక లైజన్ ఆఫీసర్ ఉంటారని వివరిం చారు. 2200 మంది ఇన్విజిలేటర్లను, 20 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలి పారు. పరీక్ష కేం ద్రాలతో పాటు ప్ర శ్నాపత్రాల రవాణాకు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకు, పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ కోత లేకుం డా చూడాలని ఎన్పీడీసీఎల్ అధికారులకు, కేంద్రాలకు బస్ సర్వీసుల సౌకర్యం కల్పిం చాలని ఆర్టీసీ అధికారులకు సూచించి నట్లు తెలిపారు. అవగాహన కల్పించాలి పరీక్ష రాసే అభ్యర్థులకు ఓఎంఆర్ షీ టలో హాల్టికెట్లు నింపడంపై అభ్య ర్థులకు ఇన్విజిలేటర్లు అవగాహన కల్పించాలని పరీక్షల సమన్వయ అధికారి, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు సూచించారు. ఓఎంఆర్ షీట్లు నింపిన తర్వాత డూప్లికేట్ తీసుకెళ్లేలా పరిశీ లన చేయాలన్నారు. ఇటీవల జరిగిన పరీక్షల్లో 10శాతం మంది బార్ కోడిం గ్ తప్పుగా నింపడం వల్ల అభ్యర్థుల జవాబు పత్రాలు వాల్యుయేషన్ జరగలేదని ఏపీపీఎస్సీ గుర్తించిందన్నా రు. ఇలాంటి పొరపాట్లు జరగకుండా పరీక్ష కేంద్రాల్లో నమూ నా ఓఎంఆర్ షీట్లను అతికిస్తున్నామన్నారు. -
గ్రామాభివృద్ధికి
1. దేశంలో పేదరికం ఏర్పడడానికి ప్రధాన కారణాలు? 1) నిరుద్యోగం 2) నిరక్షరాస్యత 3) జనాభా వేగంగా పెరగడం 4) పైవన్నీ 2. {పజారోగ్యాన్ని ఏ జాబితాలో పొందు పర్చారు? 1) కేంద్ర జాబితా 2) ఉమ్మడి జాబితా 3) రాష్ర్ట జాబితా 4) కేంద్ర, ఉమ్మడి జాబితా 3.ఆంధ్రప్రదేశ్లో జననీ సురక్షా యోజనను ఎప్పుడు ప్రారంభించారు? 1) 2004 అక్టోబరు 2 2) 2004 నవంబరు 1 3) 2005 జనవరి 26 4) 2005 నవంబరు 1 4. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ)ను ఎప్పుడు ప్రారంభించారు? 1) 1986 నవంబరు 1 2) 1987 నవంబరు 1 3) 1989 నవంబరు 1 4) 1983 నవంబరు 1 5. రాష్ర్ట ప్రభుత్వం ‘శుభం’ అనే ప్రచార కార్యక్రమాన్ని కింది వాటిలో ఏ అంశంపై చేపడుతుంది? 1) రైతులకు పంటలపై అవగాహన కల్పించడానికి 2) {పభుత్వ పథకాలు ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి 3) {పజలకు ఎయిడ్సపై అవగాహన కల్పించడానికి 4) బాలికా సురక్షా కార్యక్రమానికి 6. వీటిలో విశ్వగ్రహీత ఏది? 1) A+ 2) B+ 3) AB+ 4) O+ 7. పెర్టుసిస్ (కోరింత దగ్గు) దేని వల్ల సంభవిస్తుంది? 1) బ్యాక్టీరియా 2) వైరస్ 3) ప్రోటోజోవా 4) క్రిములు 8. స్థిర కారకాలను నిరంతరంగా ఉపయో గించడం వల్ల కలిగేది? 1) లుప్తత 2) లాభం 3) తరుగుదల 4) పెట్టుబడి ప్రయోజనం 9.అమృతహస్తం పథకాన్ని 2012, డిసెంబరు 4వ తేదీన రంగారెడ్డి జిల్లాలో ఏ ప్రాంతం నుంచి ప్రారంభించారు? 1) చేవెళ ్ల 2) రాజేంద్రనగర్ 3) శంషాబాద్ 4) తాండూర్ 10.రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దా రుల కు నగదు రహిత వైద్యం కల్పించే ఉ ద్యోగ శ్రీ పథకాన్ని ఎప్పుడు ప్రారంభి ంచారు? 1) 2013 నవంబరు 1 2) 2013 నవంబరు 19 3) 2013 డిసెంబరు 5 4) 2013 డిసెంబరు 21 11. జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1) 2006 2) 2005 3) 2004 4) 1980 12. ఒక ఆర్డినెన్స గరిష్ట కాల పరిమితి? 1) ఆరు నెలలు 2) ఆరు నెలల మూడు వారాలు 3) ఆరు నెలల ఆరు వారాలు 4) కచ్చితమైన కాలం లేదు 13. పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళల వాటా? 1) 1/3 2) 2/3 3) 1/4 4) 1/2 14. ఎంపీటీసీ సభ్యులు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? 1) ఎంఆర్వో 2) ఎంపీడీవో 3) ఆర్డీవో 4) బీడీవో 15. {V>Ð]l$çసభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? 1) వీఆర్వో 2) పంచాయతీ సెక్రటరీ 3) ఎంపీడీవో 4) సర్పంచ్ 16. సాధారణంగా ఎన్ని రోజులకు ఒకసారి పంచాయతీ సమావేశం అవుతుంది? 1) 15 రోజులు 2) 30 రోజులు 3) 90 రోజులు 4) 180 రోజులు 17. సహకార సంఘాలపై అధ్యయనం చేయడానికి 2004లో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యక్షుడు? 1) వైద్యనాథన్ 2) మోహన్ కందా 3) రామచెన్నారెడ్డి 4) జయతీఘోష్ 18. 1956లో గిరిజన సహకార సంఘాన్ని ఎక్కడ ప్రారంభించారు? 1) హైదరాబాద్ 2) విజయవాడ 3) విశాఖపట్నం 4) ఆదిలాబాద్ 19. {V>Ò$× సహకార పరపతి వ్యవస్థకు, నాబార్డకు మధ్య అనుసంధాన కర్తగా పనిచేసే సంస్థ? 1) డీసీసీబీ 2) ఆప్కాబ్ 3) ఆప్కో 4) ఏదీకాదు 20. దేశంలో సంపూర్ణ పారిశుధ్యానికి సంబం ధించింది? 1) పురా 2) భారత్ నిర్మాణ్ 3) నిర్మల్ భారత్ అభియాన్ 4) సేఫ్టీ 21. కింది వాటిలో రూబియోలా అనే వ్యాధి? 1) తట్టు 2) ఆటలమ్మ 3) గవద బిళ్లలు 4) కోరింత దగ్గు 22. శస్త్ర చికిత్స నిమిత్తం ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్లే వ్యక్తికి ఇవ్వాల్సిన విటమిన్? 1) ఎ 2) బి 3) డి 4) కె 23. చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ఏ విటమిన్ అవసరం ? 1) ఎ 2) బి 3) డి 4) ఇ 24. వెట్టిచాకిరి నిర్మూలన చట్టం చేసిన సంవత్సరం? 1) 1951 2) 1975 3) 1976 4) 1986 25. సంస్థ ప్రాథమిక పుస్తకం ఏది? 1) చిట్టా 2) ఆవర్జా 3) ఖాతాల పట్టీ 4) నగదు ఖాతా 26. మూలధనం దేనికి సమానం? 1) అప్పులు-మూలధనం 2) ఆస్తులు-అప్పులు 3) లాభాలు 4) బుక్ కీపింగ్ 27. నగదు రూపంలోకి మార్చుకోగలిగిన ఆస్తులను ఏమంటారు? 1) స్థిరాస్తులు 2) చరాస్తులు 3) భౌతిక ఆస్తులు 4) ద్రవ్యపర ఆస్తులు 28. వేతనాల చెల్లింపులను ఏ విధంగా పరిగణించవచ్చు? 1) ఖర్చు 2) రాబడి 3) అప్పు 4) పైవన్నీ 29. గుడ్విల్, పేటెంట్లు, ట్రేడ్ మార్కులు, కాపీరైట్స్ మొదలైనవి? 1) కనిపించే స్థిరాస్తులు 2) కనిపించని స్థిరాస్తులు 3) రాయల్టీలు 4) రాబడి వ్యయాలు 30. మధుమేహ వ్యాధి లక్షణాలు ఏవి? 1) ఆకలి 2) అధిక మూత్ర విసర్జన 3) అధిక దాహం 4) పైవన్నీ 31. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు? 1) 1994 2) 1995 3) 1996 4) 1998 32. క్షయ వ్యాధి శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది? 1) ఊపిరితిత్తులు 2) పేగులు 3) శ్వాస వ్యవస్థ 4) నాడీ వ్యవస్థ 33. అస్పృశ్యతను ఒక పాపంగా వర్ణించిన వారు? 1) అంబేద్కర్ 2) గాంధీ 3) నెహ్రూ 4) థామస్ మన్రో 34.షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ను ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేశారు? 1) 338 2) 338 (ఎ) 3) 340 4) 340(ఎ) 35. డ్వాక్రా పథకానికి ప్రారంభంలో ఆర్థిక సహా యం అందించిన అంతర్జాతీయ సంస్థ? 1) యూఎన్ఓ 2) ఐఎంఎఫ్ 3) ప్రపంచ బ్యాంకు 4) యూనిసెఫ్ 36. చిట్టాలో ఉండే వరుసల సంఖ్య? 1) 3 2) 5 3) 7 4) 11 37. డిపాజిట్లపై వడ్డీని పాస్బుక్లో ఏ వైపు రాస్తారు? 1) క్రెడిట్ వైపు 2) డెబిట్ వైపు 3) ఆవర్జాలో 4) వాస్తవిక ఖాతాలో 38. తాగేనీటిలో ఫ్లోరిన్ గరిష్టంగా ఎంత పరిమాణంలో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది? 1) 1.0 పీపీఎం 2) 1.25 పీపీఎం 3) 1.5 పీపీఎం 4) 2.0 పీపీఎం 39. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో శిశు మరణాల రేటు(ప్రతి 1000కి)? 1) 23 2) 33 3) 43 4) 123 40. జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చిహ్నం ఏమిటీ? 1) హస్తం 2) నాగలి 3) ఉదయించే సూర్యుడు 4) గడియారం 41. గవర్నర్ను తొలగించడానికి ఏ పద్ధతిని అనుసరిస్తారు? 1) అవిశ్వాస తీర్మానం 2) అభిశంసన తీర్మానం 3) తొలగింపు తీర్మానం 4) పైవేవీ కావు 42. ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్(మార్క ఫెడ్)ను 1957లో ఎక్కడ ప్రారంభించారు? 1) వైజాగ్ 2) విజయవాడ 3) హైదరాబాద్ 4) గుంటూరు 43. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక చేనేత సహకార సంఘాలు కలిగిన జిల్లా? 1) కరీంనగర్ 2) కర్నూలు 3) కడప 4) కృష్ణా 44. అంటరానితనాన్ని నిషేధించే అధికరణ? 1) 16 2) 17 3) 19 4) 15(4) 45. భారత రాజ్యాంగంలో పొందుపర్చిన స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలను ఏ దేశం నుంచి తీసుకున్నారు? 1) ఫ్రాన్స 2) సౌత్ ఆఫ్రికా 3) యూఎస్ఏ 4) యూఎస్ఎస్ఆర్ 46. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక శాతం షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జనాభా ఉన్న రాష్ర్టం? 1) మధ్యప్రదేశ్ 2) మేఘాలయ 3) మణిపూర్ 4) మిజోరాం 47. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అత్యధిక శాతం ఎస్సీ జనాభా ఉన్న జిల్లా? 1) గుంటూరు 2) ప్రకాశం 3) నెల్లూరు 4) విజయనగరం 48. 1961లో చేసిన వరకట్న నిషేధ చట్టాన్ని పునరుద్ధరణ చేసిన సంవత్సరం? 1) 1991 2) 2005 3) 2006 4) 2009 49. 15వ లోక్సభకు ఎన్నికైన మహిళా ఎంపీల సంఖ్య? 1) 48 2) 52 3) 57 4) 59 50. మహిళలపై జరిగే శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక వేధింపులు అన్నీ గృహ హింస కిందకు తీసుకువస్తూ గృహహింస నిరోధక చట్టాన్ని 2005లో పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1) 2006 అక్టోబర్ 2 2) 2006 అక్టోబర్ 26 3)2006 నవంబర్ 14 4) 2006 నవంబర్ 19 51. భారతీయ మహిళా బ్యాంకు (బీఎంబీ)ను 2013 నవంబర్ 19న ఎక్కడ ప్రారంభించారు? 1) న్యూఢిల్లీ 2) చెన్నై 3) ముంబై 4) కోల్కత్తా 52. శిశువులు, మహిళల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రారంభించిన పథకాలు? 1) సబల 2) ఉజ్జ్వల 3) స్వాధార్ షెల్టర్స హోమ్స్ 4) అన్నీ 53. వీటిలో ఆర్థిక హక్కు కానిది? 1) ఆస్తి హక్కు 2) వృత్తి వ్యాపార హక్కు 3) పని హక్కు 4) ఓటు వేసే హక్కు 54. అతిసారానికి ప్రధాన కారణం? 1) ఈకొలి బ్యాక్టీరియా 2) బ్రూసెల్లా అబార్టస్ 3) బ్రూసెల్లా ఆంత్రాసిస్ 4) మైకో బ్యాక్టీరియం 55. రాష్ట్రంలో 9, 10వ తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రీమెట్రిక్ ఉపకార వేతనాల కోసం ప్రారంభించిన పథకం? 1) రాజీవ్ విద్యాదీవెన 2) రాజీవ్ అభ్యుదయ యోజన 3) ఇందిరమ్మ కలలు 4) ఇందిరమ్మ విద్యాదీవెన 56. పుట్టిన పిల్లలకు 30 రోజుల్లోగా అవస రమైన వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందించడానికి 2011 అక్టోబరు 23న ప్రారంభించిన పథకం? 1) రాజీవ్ ఆరోగ్యశ్రీ 2) జననీ శిశు సంరక్షణ పథకం 3) స్వాదార్ షెల్టర్ హోమ్స్ 4) ఏవీకావు 57. 2000 జూన్ 15న ప్రారంభించిన వెలుగు పథకం లక్ష్యం? 1) స్వయం సహాయక మహిళలకు గ్యాస్ కనెక్షన్ 2) {V>Ò$× పేదలకు గ్యాస్ కనెక్షన్ 3) ఇంటింటికీ ఎల్పీజీ గ్యాస్ అందించడం 4) పేదరిక నిర్మూలన 58. సమాజంలో వెనుకబడి ఉన్న షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి 1998లో ప్రారంభించిన పథకం? 1) ఆదరణ 2) చేయూత 3) ముందడుగు 4) చైతన్యం 59. 1999లో మైనార్టీల అభివృద్ధి కోసం రాష్ర్ట ప్రభుత్వం రోష్ని పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో రెండో అధికార భాషగా దేన్ని గుర్తించారు? 1) హిందీ 2) ఉర్దూ 3) బెంగాలీ 4) మరాఠీ 60. మహారాష్ర్టలో పాలేగావ్ సిద్ధి అనే గ్రామంలో అన్నా హజారే అనే సామాజిక వేత్తను ఆదర్శంగా తీసుకుని మన రాష్ర్టంలో ప్రారంభించిన పథకం? 1) రైతు బజార్లు 2) దీపం 3) విద్యావలంటీర్లు 4) వాటర్షెడ్స 61. పట్టణాల్లోని వృద్ధులకు చేయూత ఇవ్వడానికి 2010 నవంబర్ 1న ప్రారంభించిన పథకం? 1) చేయూత 2) చైతన్యం 3) ఆసరా 4) పైవన్నీ 62. 1997 జనవరి 1న దక్షిణ కొరియాలోని సైమల్ అన్డంగ్ అనే పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని జన్మభూమి కార్యక్రమాన్ని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దీన్ని ఎన్ని విడతలుగా నిర్వహించారు? 1) 7 2) 9 3) 11 4) 19 63. బడికి వెళ్లలేని గ్రామీణ పేద పిల్లల ఇళ్ల వద్దకే విద్యను తీసుకెళ్లేందుకు 2010 నవంబర్ 23న ప్రారంభించిన పథకం? 1) విద్యావాహిని పథకం 2) రాజీవ్ విద్యాదీవెన 3) ఆసరా 4) కిశోర్ బాలిక పథకం 64. {పస్తుతం ఆశ్రమ పాఠశాల స్థితిగతులను మె రుగుపర్చడానికి ఏర్పాటు చేసిన పథకం? 1) దిశ 2) భవిత 3) పునాది 4) రూపాంతర 65. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో గ్రామీణ జనాభా శాతం? 1) 68.8 శాతం 2) 71.8 శాతం 3) 65.5 శాతం 4) 66.5 శాతం 66. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో జనాభా శాతం? 1) 68.8 శాతం 2) 71.8 శాతం 3) 65.5 శాతం 4) 66.5 శాతం 67. ఏ వయసు మధ్య ఉన్న వారిని ఉత్పాదక వయోవర్గంగా భావిస్తారు? 1) 15-58 2) 15-60 3) 18-60 4) 15-50 68. 2009-10 అంచనాల ప్రకారం దేశంలో అత్యధిక పేదరికం ఉన్న రాష్ర్టం? 1) ఒడిశా 2) బీహార్ 3) చత్తీస్గఢ్ 4) జమ్మూ, కాశ్మీర్ 69. ఏ వయసు మధ్య ఉన్న వారిని మానవ వన రులు లేదా కార్మిక శక్తి అని పేర్కొంటారు? 1) 15-60 2) 15-35 3) 18-60 4) 18-58 70. 2009-10 లెక్కల ప్రకారం భారతదేశంలో నిరుద్యోగిత రేటు ఎంత శాతం? 1) 8.8 2) 7.7 3) 6.6 4) 5.5 సమాధానాలు 1) 4; 2) 3; 3) 4; 4) 1; 5) 3; 6) 3; 7) 1; 8) 3; 9) 4; 10) 3; 11) 4; 12) 3; 13) 4; 14) 2; 15) 4; 16) 2; 17) 1; 18) 3; 19) 2; 20) 3; 21) 1; 22) 4; 23) 4; 24) 3; 25) 1; 26) 2; 27) 2; 28) 1; 29) 2; 30) 4; 31) 3; 32) 1; 33) 2; 34) 2; 35) 4; 36) 2; 37) 1; 38) 3; 39) 3; 40) 4; 41) 4; 42) 2; 43) 3; 44) 2; 45) 1; 46) 4; 47) 2; 48) 3; 49) 4; 50) 2; 51) 3; 52) 4; 53) 4; 54) 1; 55) 1; 56) 2; 57) 4; 58) 3; 59) 2; 60) 4; 61) 3; 62) 4; 63) 1; 64) 4; 65) 1; 66) 4; 67) 2; 68) 2; 69) 1; 70) 3; (మిగతా ప్రశ్నలు రేపటి ‘విద్య’లో) -
విపత్తు నిర్వహణ - విజయ సూత్రాలు
ఓ విపత్తు.. పచ్చని పల్లెను ఆబగా కబళిస్తుంది! నింగికేసే నిచ్చెనలా ఠీవిగా నిలబడిన నిలువెత్తు భవనాన్ని నేలకూలుస్తుంది! భూకంపం రూపంలో బతుకులను బుగ్గి చేసేవి కొన్నయితే.. వరదల రూపంలో విరుచుకుపడి, ప్రళయం సృష్టించేవి మరికొన్ని.. ఈ నేపథ్యంలో ప్రజల బాగోగులతో ముడిపడిన విపత్తుల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శికి అవగాహన అవసరం. అందుకే ఈ ఉద్యోగాల నియామకాలకు జరిగే పరీక్ష సిలబస్లో విపత్తుల నిర్వహణ (Disaster Managemen్ట)ను చేర్చారు. ఇందులో అధిక మార్కుల సాధనకు వ్యూహాలు.. ఎన్. విజయేందర్ రెడ్డి జనరల్ అవేర్నెస్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. మొత్తం 2,677 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 23న పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. 150 మార్కులకుండే పేపర్-1 జనరల్ స్టడీస్ సిలబస్లో ఏడు అంశాలను పేర్కొన్నారు. దీంట్లో ఏడో అంశంగా విపత్తుల నిర్వహణ ఉంది. ఈ విభాగం నుంచి 15-20 ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 తదితర పరీక్షల జనరల్ స్టడీస్ పేపర్లలో విపత్తుల నిర్వహణపై ప్రశ్నలు వస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శి పరీక్షలో వచ్చే ప్రశ్నలు కూడా ఇదే తరహాలో ఉంటాయని భావించవచ్చు. ఏ విభాగాల నుంచి వస్తాయి? విపత్తులు ఎలా సంభవిస్తాయి? విపత్తులు- రకాలు. విపత్తులు సంభవించినప్పుడు స్పందించాల్సిన విధానం. విపత్తులు- నివారణ. నివారణ సాధ్యం కానప్పుడు వాటి ప్రభావాన్ని ఎలా తగ్గించాలి? పునర్నిర్మాణ, పునరావాస కార్యక్రమాలు. ఆస్తి, ప్రాణ నష్టం నివారణ తదితర అంశాలపై ప్రశ్నలు వస్తాయి. పాత ప్రశ్నపత్రాలు కీలకం: వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించి గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే చాలా ప్రశ్నలు వచ్చినవే వస్తున్నాయి. అందువల్ల అభ్యర్థులు తప్పనిసరిగా పాత ప్రశ్నపత్రాలను సేకరించి, ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ప్రశ్నల క్లిష్టత, ప్రశ్నలు అడిగే విధానం అవగతమవుతుంది. ఉ్ఠ: 1.సునామి అనే మాట ఏ భాష నుంచి వచ్చింది? జవాబు: జపనీస్ 2:జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎక్కడ ఉంది? జవాబు: న్యూఢిల్లీ 3:జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ చైర్మన్ ఎవరు? జవాబు: ప్రధానమంత్రి సహజసిద్ధ విపత్తులు: సహజసిద్ధమైన విపత్తులలో వరదలు, హరికేన్లు, తుపానులు, భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనం, కరువు, సునామీ తదితరాల గురించి తెలుసుకోవాలి. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి క్షుణ్నంగా చదవాలి. దాదాపు అన్ని ప్రశ్నలు వీటి కేంద్రంగానే వస్తున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ), దాని చైర్మన్, బాధ్యతలు, విధుల గురించి ప్రశ్నలు వస్తాయి. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కూడా విపత్తు నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగాలను ఏర్పాటు చేశారు. ఈ యంత్రాంగాల నిర్మాణం, బాధ్యతలు తదితరాల గురించి తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో సంభవించిన విపత్తులపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. 2004, డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ, దాని ప్రభావం వల్ల నష్టపోయిన దేశాలు (ఇండోనేషియా, శ్రీలంక, ఇండియా, థాయిలాండ్, మాల్దీవులు మొదలైనవి..), ప్రాణ నష్టం (2,30,000) వంటి విషయాలను చదవాలి. 2013లో సంభవించిన ఫైలిన్, హెలెన్, లెహర్ వంటి తుపానులు, ఉత్తరాఖండ్ వరదలపై దృష్టిసారించాలి. వివిధ విపత్తుల గురించి చదివేటప్పుడు ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకొని అధ్యయనం చేయాలి. విపత్తులు- ఉపశమన చర్యలు: విపత్తు నిర్వహణ అనేది వివిధ కార్యక్రమాల సమాహారం. విపత్తుకు ముందు, విపత్తు సమయంలో, విపత్తు అనంతరం చేపట్టే కార్యక్రమాలను కలిపి సంయుక్తంగా విపత్తు నిర్వహణ అనొచ్చు. విపత్తు తీవ్రతను తగ్గించేందుకు చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు. ఈ చర్యల్లో ప్రజలు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలకూ భాగస్వామ్యం ఉంటుంది. వీటికి సంబంధించి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఒక విపత్తు కచ్చితంగా ఏ తేదీన సంభవించింది? ఎంతమంది మరణించారు? వంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. విద్యార్థులు వివిధ విపత్తులను గురించి అధ్యయనం చేసేటప్పుడు ఈ దిశగా కూడా ప్రిపరేషన్ కొనసాగించాలి. దేశంలో రకరకాల విపత్తులకు ప్రత్యేకంగా నోడల్ మంత్రిత్వశాఖలు ఉన్నాయి. ఈ విభాగం నుంచి ఒకట్రెండు ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల ఈ విభాగాన్ని తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ఉదాహరణకు జీవ విపత్తులకు సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తోంది. పెద్ద ఎత్తున సంభవించే ప్రకృతి సిద్ధ విపత్తులు: భూకంపాలు, సునామీలు, వరదలు, తుపానులు, కరువులు. ........................................................ భారీ ఎత్తున సంభవించే మానవపూరిత విపత్తులు: యుద్ధాలు, రసాయన విస్ఫోటనాలు, కాలుష్యం, అణు ప్రమాదం, అడవుల నిర్మూలన (Deforestation). ........................................................ స్వల్ప ప్రకృతి సిద్ధ విపత్తులు: చలిగాలులు (Cold wave) ఉరుములతో కూడిన తుపానులు, వడగాలులు (Heat wave). ........................................................ స్వల్ప మానవ పూరిత విపత్తులు: రోడ్డు, రైలు ప్రమాదాలు, కొట్లాటలు, విషపూరిత ఆహారం (Food poisoning), పారిశ్రామిక విస్ఫోటనం, అగ్నిప్రమాదాలు. రిఫరెన్స బుక్స్ సీబీఎస్ఈ 8, 9 తరగతుల పాఠ్యపుస్తకాల్లోని విపత్త నిర్వహణ అంశాలు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) అధికారిక వెబ్సైట్:www.ndma.gov.in కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్: www.mha.nic.in నమూనా ప్రశ్నలు 1.ప్రపంచ విపత్తు నివేదికను ఎవరు తయారు చేస్తారు? ఎ) ప్రపంచ బ్యాంకు బి) అంతర్జాతీయ రెడ్క్రాస్, రెడ్ క్రిసెంట్ సి) ఐఎంఎఫ్ డి) యునెటైడ్ నేషన్స్ 2.ఆంధ్రప్రదేశ్లో విపత్తు నిర్వహణ కేంద్రమేది? ఎ)ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ బి)ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ సి)నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ డి)మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ 3.భూకంపాలకు సంబంధించిన పరిశోధనలు, వనరులు, నెట్వర్క్ ఉన్న సంస్థ ఏది? ఎ)అస్సాం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ, గువహటి బి)యశ్వంత్రావ్ చవాన్ అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్- పుణె సి)అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ సెంటర్, కోల్కతా డి)డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్- భోపాల్ 4.ఆసియా విపత్తు తగ్గింపు కేంద్రం ఎక్కడుంది? ఎ) బ్యాంకాక్ బి) మనీలా సి) జకార్తా డి) కోబ్ (జపాన్) 5.భారత వాతావరణ శాఖ ప్రకారం కరువు అంటే? ఎ)సామాన్య వర్షపాతంలో 75 శాతం కంటే తక్కువగా ఉంటే బి)50శాతం కంటే వర్షపాతం తగ్గితే తీవ్రమైన కరువు సి)1 అండ్ 2 డి)ఏదీకాదు 6.విపత్తు నిర్వహణ ప్రక్రియ ఏది? ఎ) నిర్మూలన, రక్షిత చర్యలు బి) సమాయత్తత సి) ఉపశమన చర్యలు డి) పైవన్నీ 7.ఐఎస్డీఆర్ అంటే ఏమిటి? ఎ) ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ రీసెర్చ్ బి) ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ సి) ఇండియన్ స్పేస్ డెవలప్మెంట్ రీసెర్చ్ డి) ఇండియన్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ 8.విపత్తు నిర్వహణ ఖర్చుకోసం ఏ నిధి నుంచి గ్రహిస్తారు? ఎ) ప్రణాళికా వ్యయం బి) సంఘటిత నిధి సి) ప్రణాళికేతర ఖర్చులు డి) ఇతర నిధులు 9.ఎపి సెంటర్ అనే పదం దేనికి సంబంధించిది? ఎ) భూకంపాలు బి) తుఫాన్లు సి) వరదలు డి) రసాయన ప్రమాదాలు 10.జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఉపాధ్యక్షుడు? ఎ) చిదంబరం బి) శశిధర్రెడ్డి సి) శరద్పవార్ డి) ఫరూక్ అబ్దుల్లా 11.కింది వాటిలో జీవ సంబంధ విపత్తు ఏది? ఎ) వడగండ్ల వాన బి) ఖనిజ సంబంధ మంటలు సి) అంటు వ్యాధులు డి) చమురు సంబంధ విపత్తులు 12.పదో పంచవర్ష ప్రణాళిక ప్రకారం ఏ విపత్తుల వల్ల అధిక మరణాలు సంభవించాయి? ఎ) వరదలు, వేగవంతమైన గాలులు బి) భూకంపాలు సి) కరువులు డి) భూపాతాలు సమాధానాలు: 1) బి 2) ఎ 3) ఎ 4) డి 5) సి 6) డి 7) బి 8) బి 9) ఎ 10) బి 11) సి 12) ఎ -
నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు
ఏలూరు, న్యూస్లైన్ : జిల్లాలో చిరు ఉద్యోగి మొదలు ఉన్నతాధికారి వరకు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ సిద్ధార్థజైన్ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేపల చెరువు బహిరంగ వేలాన్ని నిర్వహించిన కామవరపుకోట మండలం కళ్లచెరువు పంచాయతీ కార్యదర్శి వై.రఘునాథరావును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా పంచాయతీ అధికారి అల్లూరి నాగరాజువర్మతో ఈ విషయంపై చర్చించారు. కళ్లచెరువు గ్రామంలో రజకులకు కేటాయించాల్సిన 2 ఎకరాల చెరువును గ్రామ కార్యదర్శి బహిరంగ వేలం ఎందుకు వేశాడని ప్రశ్నించారు. గ్రామ కార్యదర్శి తప్పు చేస్తే జంగారెడ్డిగూడెం డివిజినల్ పంచాయతీ అధికారి సాయిబాబాకు నిబంధనలు తెలియవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను పాటించని సాయిబాబాకు మెమో జారీ చేయాలని డీపీవోను ఆదేశించారు. బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన ఉద్యోగులు ఇష్టానుసారం వ్యవహరిస్తే సహించబోనని కలెక్టర్ స్పష్టం చేశారు. డీపీవో నాగరాజువర్మ మాట్లాడుతూ కళ్లచెరువు గ్రామంలో రజకులకు కేటాయించాల్సిన 2 ఎకరాల చెరువును 2013 ఆగస్టు 12న గ్రామ కార్యదర్శి మూడేళ్లకు బహిరంగ వేలం నిర్వహించారని, దీనివల్ల 1.55 లక్షలు లీజుకు ఇచ్చినట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. తక్షణమే ఈ విషయంపై తగు చర్యలు తీసుకుని నివేదిక సమర్పిస్తానని చెప్పారు. బోద వ్యాధి నివారణ మాత్రల పంపిణీపై సమీక్ష జిల్లాలో మంగళవారం నిర్వహించే జాతీయ ఫైలేరియా దినోత్సవం సందర్భంగా బోదవ్యాధి నివారణ మందు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో బోద వ్యాధి నివారణపై ప్రచార కార్యక్రమం అమలుపై ఆయన సమీక్షించారు. ఈ నెల 28న జిల్లాలోని ప్రతి ఒక్కరికీ ముందు జాగ్రత్త చర్యగా బోదవ్యాధి నివారణ మాత్రలను పంపిణీ చేయాలని డీఎంహెచ్వో డాక్టర్ టి.శకుంతలను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 7,580 మంది బోదవ్యాధితో బాధ పడుతున్నారన్నారు. గతేడాది 16 మంది వ్యాధిబారిన పడ్డారన్నారు. వైద్య విద్యానపరిషత్ కో-ఆర్డినేటర్ డాక్టర్ శంకరరావు, జిల్లా మలేరియా నివారణాధికారి డాక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీకి వచ్చే నెల రెండో తేదీన నిర్వహించే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ సిద్ధార్థజైన్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఉద్యోగాల కోసం 55 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని వారందరికీ రాత పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మెరిట్ ప్రాతిపదికపై పోస్టుల భర్తీ జరుగుతాయన్నారు. అజ్జమూరు సర్పంచ్కు అభినందనలు వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు ముందు జాగ్రత్త చర్యగా సొంత ఖర్చులతో గ్రామంలో పూడుకుపోయిన చెరువు తవ్వటానికి ముందు కు వచ్చిన ఆకివీడు మండలం అజ్జమూరు సర్పంచ్ బచ్చు సరళ కుమారిని కలెక్టర్ సిద్థార్ధజైన్ అభినందించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలిసి చెరువు పునరుద్ధరణకు సహకరించాలని ఆమె కోరారు. వెంట నే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీసీఎల్ సమీక్షకు కలెక్టర్ పయనం రాష్ట్ర భూ పరిపాలనా కమిషనర్ (సీసీఎల్) మహంతి మంగళవారం నిర్వహించే సమీక్ష సమావేశానికి కలెక్టర్ సిద్ధార్థజైన్ సోమవారం హైదరాబాద్కు పయనమయ్యారు. కలెక్టర్ తిరిగి బుధవారం జిల్లాకు చేరుకోనున్నారు. -
పద్దుల పని పడితే అకౌంటింగ్ తేలికే!
పంచాయతీ కార్యదర్శి 2,677 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 23న నిర్వహించే పరీక్షకు లక్షల మంది హాజరు కానున్నారు. పరీక్షకు సంబంధించిన పేపర్-2లో నిర్దేశించిన అకౌంటింగ్ సిలబస్ పూర్తిగా కొత్తది. దీంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో అకౌంటింగ్లోని ప్రాథమిక అంశాలపై స్పెషల్ ఫోకస్.. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో నిర్దేశించిన విధులను పంచాయతీ కార్యదర్శి నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ విధుల్లో గ్రామ పంచాయతీ తీర్మానాలను అమలు చేయడం, పంచాయతీ విధించే పన్నులను వసూలు చేయడం వంటివి ఉన్నాయి. ఈ తరుణంలో పంచాయతీ కార్యదర్శికి ఖాతాల నిర్వహణపై అవగాహన ఉండాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే సిలబస్లో అకౌంటింగ్ విభాగాన్ని చేర్చారు. 150 మార్కులకున్న పేపర్-2 సిలబస్లో ఐదు విభాగాలున్నాయి. వీటిలో ఐదో విభాగం ‘అకౌంటింగ్తో సంబంధమున్న ప్రాథమిక అంశాలు’. దీన్నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయో కచ్చితంగా చెప్పలేంగానీ గరిష్టంగా 30 ప్రశ్నలు రావొచ్చు. ఆ.ఇౌఝ, క.ఇౌఝ పూర్తిచేసిన వారికి ఈ విభాగం అనుకూలం. అయితే మిగిలిన వారు కొంత కష్టపడితే పూర్తిస్థాయి మార్కులు పొందొచ్చు. ఈ కింది అంశాలను అర్థం చేసుకుంటే అకౌంటింగ్కు సంబంధించిన విషయాలు తేలిగ్గా అర్థమవుతాయి. అకౌంటింగ్- ప్రాథమిక అంశాలు అకౌంటింగ్: అమెరికన్ అకౌంటింగ్ అసోసియేషన్ ప్రకారం.. ‘‘వ్యవహారాలను గుర్తించి, కొలచి, ఆర్థికపరమైన సమాచారం అందజేయడం ద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి సహకరించే ప్రక్రియే అకౌంటింగ్. బుక్ కీపింగ్: బుక్ కీపింగ్.. అకౌంటింగ్లో అంతర్భాగం. ఇది వ్యవహారాలను పుస్తకాల్లో నమోదుచేసి, వాటిని నిర్వహించేందుకు సంబంధించినది. బుక్ కీపింగ్లో చేసే పనులు: వ్యవహారాలను, సంఘటనలను గుర్తించడం. గుర్తించిన వ్యవహారాలను, సంఘటనలను సాధారణంగా ఉపయోగించే కొలమానంలో కొలవడం. గుర్తించిన, కొలచిన వ్యవహారాలను వాటి అనుబంధ ఖాతా పుస్తకాల్లో కాలక్రమంలో నమోదు చేయడం. నమోదు చేసిన వ్యవహారాలను, సంఘటనలను ఆవర్జాలో వర్గీకరించడం. అకౌంటింగ్ లాభాలు: ఒక ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభం లేదా నష్టాన్ని నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. సంస్థ ఆర్థిక స్థితిని తెలుసుకోవచ్చు. సంస్థ ఖాతా పుస్తకాల నిర్వహణ ద్వారా చట్టపరమైన నిబంధనను అమలు చేయొచ్చు. వ్యాపార కార్యక్రమాల ప్రణాళికల తయారీకి, నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. అకౌంటింగ్ విభాగాలు: 1. ఆర్థిక అకౌంటింగ్. 2. కాస్ట్ అకౌంటింగ్. 3. యాజమాన్య అకౌంటింగ్. అకౌంటింగ్ భావనలు: అందరికీ ఆమోదయోగ్యమైన అకౌంటింగ్ ప్రమేయాలను అకౌంటింగ్ భావనలుగా చెప్పొచ్చు. అవి: వ్యాపార అస్తిత్వ భావన, ద్రవ్య కొలమాన భావన, వ్యయ భావన, గతిశీల సంస్థ భావన, ద్వంద్వ భావన, అంశాల భావన, వసూలు భావన. వ్యాపార వ్యవహారాలను రెండు విధాలుగా నమోదు చేస్తారు. అవి.. ఒంటి పద్దు విధానం, జంట పద్దు. ఒంటి పద్దు విధానం: వ్యవహారాల నమోదు అశాస్త్రీయంగా, అసంపూర్తిగా ఉంటుంది. ఇందులో ఓ వ్యవహారానికి సంబంధించి రెండు అంశాలకు బదులు ఒక అం శం మాత్రమే (డెబిట్ లేదా క్రెడిట్) నమోదు చేస్తారు. జంట పద్దు విధానం: ఈ విధానాన్ని ఇటలీకి చెందిన లుకాపాసియాలో కనుగొన్నారు. ప్రతి వ్యవహారంలోనూ ఒక ఖాతాకు డెబిట్, మరో ఖాతాకు క్రెడిట్ చేస్తారు. ఇదే జంట పద్దు సూత్రం. ఖాతాలు- రకాలు: జంట పద్దు విధానంలోని వ్యవహారాలన్నింటినీ మూడు ఖాతాలుగా విభజించవచ్చు. అవి.. 1. వ్యక్తిగత ఖాతాలు. 2. వాస్తవ ఖాతాలు. 3. నామమాత్రపు ఖాతాలు. చిట్టా: ఇదొక పుస్తకం. ఇందులో వ్యాపార వ్యవహారాలను వాటి కాలానుగుణంగా నమోదు చేస్తారు. అన్ని వ్యవహారాలను తొలుత చిట్టాలో రాస్తారు. అందుకే దీన్ని తొలి పద్దు పుస్తకంగా పేర్కొంటారు. ఆవర్జా (లెడ్జర్): అకౌంటింగ్ చక్రంలోని రెండో దశ ఆవర్జా. ఇది వ్యక్తిగత, వాస్తవిక, నామమాత్రపు ఖాతాలకు సంబంధించిన వ్యవహారాల ఖాతాలను రాసే పుస్తకం. చిట్టాలో రాసిన అన్ని డెబిట్, క్రెడిట్ అంశాలన్నీ ఆవర్జాలో సంబంధిత ఖాతాలకు బదిలీ అవుతాయి. ఈ బదిలీ ప్రక్రియనే ఆవర్జా నమోదని అంటారు. ఆవర్జాను తుది పుస్తకమని పేర్కొంటారు. సహాయక చిట్టాలు: వ్యాపార వ్యవహారాలను, వాటి స్వభావాన్ని బట్టి వేర్వేరు పుస్తకాల్లో రాస్తారు. ఈ ప్రత్యేక పుస్తకాలనే సహాయక చిట్టాలంటారు. వీటిలో వివిధ రకాలున్నాయి. అవి.. కొనుగోలు చిట్టా, అమ్మకాల చిట్టా, కొనుగోలు వాపసుల చిట్టా, అమ్మకాల వాపుసుల చిట్టా, నగదు చిట్టా, వసూలు హుండీల చిట్టా, చెల్లింపు హుండీల చిట్టా, అసలు చిట్టా. బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక సాధారణంగా వ్యాపార సంస్థలు ఈ కింద పేర్కొన్న వాటి కోసం బ్యాంకులో ఖాతాను తెరుస్తాయి. అవి.. దొంగతనం అరికట్టడం, ఉద్యోగులు నిధులను దుర్వినియోగం చేయకుండా చూసేందుకు, చెల్లింపులు జరిపినట్లు సాక్ష్యాల కోసం, దూరప్రాంతాల్లో ఉన్నవారికి చెల్లింపులకు, వారి నుంచి వసూలుకు ఖాతాలు ఉపయోగపడతాయి. ఓవర్ డ్రాఫ్ట్: కొన్నిసార్లు వ్యాపార సంస్థకు తన బ్యాంకు ఖాతాలో ఉన్న నిల్వ కంటే ఎక్కువ మొత్తం అవసరమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఓవర్డ్రాఫ్ట్ రూపంలో బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటుంది. ఈ పరిస్థితిలో సంస్థకు బ్యాంకు రుణదాత అవుతుంది. ఈ రుణంపై సంస్థ వడ్డీ చెల్లించాలి. ఓవర్డ్రాఫ్ట్ అంటే వసూళ్ల కంటే చెల్లింపులు ఎక్కువగా ఉండటం. ముగింపు లెక్కలు: ఏడాది చివర్లో సంస్థ.. తన ఆర్థిక పరిస్థితిని ఆస్తి, అప్పుల పరంగా తెలుసుకునేందుకు ముగింపు లెక్కల్ని తయారు చేస్తుంది. లాభనష్టాలను తెలుసుకునేందుకు వర్తకపు, లాభనష్టాల ఖాతాను, ఆస్తి, అప్పుల స్థితిగతులను తెలుసుకునేందుకు ఆస్తి, అప్పుల పట్టీని తయారు చేస్తుంది. వ్యాపార ఫలితాలు అంటే ఒక సంవత్సర కాలంలోని లాభాలు లేదా నష్టాలు. వీటిని లాభనష్టాల ఖాతాను తయారు చేసి తెలుసుకుంటారు. వాటినే ఆదాయపు పట్టిక అంటారు. ముగింపు లెక్కల వల్ల లాభాలు: 1.వ్యాపారపు ఆర్థిక ఫలితం (లాభమా? నష్టమా?) తెలుస్తుంది. 2.వ్యాపారపు ఆర్థిక పరిస్థితి (ఆస్తులు, అప్పులు) తెలుస్తుంది. 3.వ్యాపార ద్రవ్యత్వ పరిస్థితిని, ఆర్థిక పటిష్టతను గుర్తించవచ్చు. 4.పన్నులను లెక్కించేందుకు ఉపయోగపడుతుంది. తరుగుదల ఓ సంస్థ తాను దీర్ఘకాలం మనుగడలో ఉంటుందని భావిం చి తన వ్యవహారాలను నమోదు చేస్తుంది. దీన్నే గతిశీల సంస్థ భావన అంటారు. దీన్ని అనుసరించి సంస్థ ఆస్తులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి.. 1. స్థిరాస్తులు (భవనాలు, యంత్రాలు, ఫర్నిచర్ తదితరాలు). 2. చరాస్తులు (రుణగ్రస్తులు, సరుకు, వసూలు హుండీలు తదితరాలు). ఆస్తి విలువ క్రమేపీ తగ్గడాన్ని తరుగుదల అని అంటాం. తరుగుదల స్థిరాస్తులలోనే ఉంటుంది. అందువల్ల తరుగుదల అనే పదాన్ని స్థిరాస్తులకు సంబంధించి మాత్రమే ఉపయోగించాలి. తరుగుదలకు కారణాలు: అరుగు, తరుగు; లుప్తత; భౌతిక శక్తులు; కాలగమనం; ఉద్గ్రహణ. ఆస్తుల తరుగుదలను ఏర్పరిచేందుకు వివిధ పద్ధతులు అమల్లో ఉన్నాయి. కానీ, వివిధ పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు తరుగుదలను ఏర్పరిచేందుకు సాధరణంగా రెండు ముఖ్యమైన పద్ధతులను ఉపయోగిస్తాయి. అవి.. 1. స్థిర వాయిదా పద్ధతి. 2. తగ్గుతున్న నిల్వల పద్ధతి. స్థిర వాయిదాల పద్ధతి: ఈ పద్ధతిలో ప్రతి సంవత్సరం ఆస్తి కొన్న ఖరీదుపై ఒక స్థిరమొత్తం లేదా కొంత శాతాన్ని ఆస్తి విలువ నుంచి తగ్గిస్తారు. ఆస్తి కొన్న ఖరీదుపై తరుగుదలను ఏటా లెక్కించడం వల్ల, అన్ని సంవత్సరాలకు తరుగుదల, మొత్తాలు స్థిరంగా ఉంటాయి. అందుకే దీన్ని స్థిరవాయిదాల పద్ధతి అంటారు. తగ్గుతున్న నిల్వల పద్ధతి: ఈ పద్ధతిలో మొదటి ఏడాది ఆస్తి కొన్న ఖరీదుపై తరుగుదలను లెక్కిస్తారు. మిగిలిన సంవత్సరాల్లో ఆస్తి తగ్గుతున్న నిల్వలపై మాత్రమే తరుగుదలను లెక్కిస్తారు. అందుకే దీన్ని నిల్వల పద్ధతిగా పేర్కొంటారు. కన్సైన్మెంట్ ఖాతాలు: టోకు వర్తకుడు, ఉత్పత్తిదారులు తమ వస్తువులను సౌకర్యవంతంగా, లాభదాయకంగా అమ్మాలంటే ఓ ప్రతినిధి అవసరం. ప్రతినిధి.. వర్తకుడు పంపిన సరుకును అమ్మి, తన సేవలకుగాను కొంత కమిషన్ పొందుతాడు. ఇలా ఒక ప్రాంతంలో ఉన్న వర్తకుడు తన సరుకులను వేరొక ప్రాంతంలో ఉన్న ప్రతినిధికి కమిషన్ మీద అమ్మకానికి పంపడాన్ని కన్సైన్మెంట్ అంటారు. సరుకు పంపే వ్యక్తిని కన్సైనర్ అని, సరుకు పొందిన వ్యక్తిని కన్సైనీ అని అంటారు. ఏజెంట్ ద్వారా సరుకులను అమ్మే విధానాన్ని కన్సైన్మెంట్ వ్యాపారంగా పేర్కొనవచ్చు. కమిషన్: కన్సైనర్.. తన సరుకులను అమ్మినందుకుగాను కన్సైనీకి చెల్లించిన ప్రతిఫలమే కమిషన్. ఇది ప్రధానంగా మూడు రకాలు. 1. సాధారణ కమిషన్. 2. అదనపు కమిషన్. 3. డెల్ క్రెడరీ కమిషన్. ముఖ్యాంశాలు వ్యాపారంలో వ్యాపారస్తుడు పెట్టుబడి పెట్టిన మొత్తం మూలధనం. నగదు లేదా సరుకులను యజమాని సొంతానికి వాడుకుంటే వాటిని సొంతవాడకాలు అంటారు. తొలి పద్దు పుస్తకాన్ని చిట్టా అంటారు. ఖాతాల సంపుటిని ఆవర్జాగా పేర్కొంటారు. వ్యాపార వ్యవహారాలను చిట్టా నుంచి ఆవర్జాకు బదిలీ చేయడాన్ని నమోదు అంటారు. మూలధనం, అప్పులను కలిపి ఆస్తులుగా వ్యవహరిస్తారు. ఆస్తులు, అప్పులకు మధ్యగల తేడా మూలధనం. మూలధనం వ్యక్తిగత ఖాతాకు చెందినది. నగదు వాస్తవిక ఖాతాకు చెందినది. జీతాలు నామమాత్రపు ఖాతాకు చెందినది. సహాయక చిట్టాలు ఎనిమిది రకాలు. రుణదాత రుణగ్రస్థునికి ఇచ్చే డిస్కౌంట్ నగదు డిస్కౌంట్. వర్తకుడు, కొనుగోలుదారునికి అమ్మకపు ధరపై ఇచ్చే తగ్గింపును వర్తకపు డిస్కౌంట్లు అంటారు. వర్తకపు డిస్కౌంటును ఖాతాపుస్తకాల్లో నమోదు చేయకూడదు. చిట్టా, ఆవర్జాగా ఉపయోగపడే పుస్తకాన్ని నగదు పుస్తకమని అంటారు. ఓవర్ డ్రాఫ్టు పద్ధతిలో నగదు పుస్తకంలో క్రెడిట్ నిల్వ చూపుతుంది. పాస్బుక్ క్రెడిట్ నిల్వ చూపే పద్ధతి అనుకూల నిల్వ పద్ధతి. మూలధన అంశాలను ఆస్తి, అప్పుల పట్టీలో నమోదు చేస్తారు. రాబడి అంశాలను లాభనష్టాల ఖాతాలో నమోదు చేస్తారు. ఫర్నిచర్ కొనుగోలును సాధారణ ఖర్చుల ఖాతాకు డెబిట్ చేయడాన్ని సిద్ధాంతపరమైన తప్పులు అంటారు. కన్సైనీ, కన్సైనర్కు పంపే నివేదికను అకౌంట్ సేల్స్ అంటారు. కన్సైన్మెంట్ ఖాతా నామమాత్రపు ఖాతాకు చెందినది. అకౌంటింగ్ సూత్రం ప్రకారం నమోదు చేయని వ్యవహారాలను సిద్ధాంతరపరమైన తప్పులుగా పేర్కొంటారు. వ్యవహారాలను పూర్తిగా నమోదు చేయకుండా వదిలేసిన తప్పులు ఆకృతి తప్పులు. కన్సైనీ ఖాతా వ్యక్తిగత ఖాతాకు చెందినది. ఆస్తి జీవితకాలం పూర్తయిన తర్వాత మిగులు విలువను తుక్కు విలువ లేదా అవశేషపు విలువ అని అంటారు. అసాధారణ నష్టాన్ని కన్సైన్మెంట్ ఖాతాలో క్రెడిట్ వైపున వేస్తారు. ఆస్తి విలువ మాత్రమే కాకుండా ఆస్తి ధరపై వడ్డీని కూడా పరిగణనలోకి తీసుకునే పద్ధతిని వార్షిక పద్ధతి అంటారు. కురుహూరి రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ హైదరాబాద్. -
ఇచ్చినట్లే ఇచ్చి!
కర్నూలు(అర్బన్), న్యూస్లైన్: జిల్లాలో 98 గ్రామ పంచాయతీ పోస్టులను భర్తీ చేస్తామని గత ఏడాది ఆగస్టు 14న ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసింది. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులుగా ప్రకటించడంతో 11,221 మంది నిరుద్యోగులు అష్టకష్టాలకోర్చి దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ,ఎస్టీలు మినహాయించి మిగిలిన వర్గాలకు చెందిన నిరుద్యోగులందరూ రూ.50లకు డీడీ తీయాలనే నిబంధన విధించారు. పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలలోనే ప్రభుత్వం ఒక మెలిక పెట్టింది. ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిన జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. డిగ్రీ పాస్ అయినట్లయితే 25 మార్కులను వెయిటేజీగా ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన డిగ్రీ ఉత్తీర్ణులైన కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులే ఎక్కువ పోస్టులను దక్కించుకునే వీలుంది. అయినప్పటికీ డిగ్రీలో 85 శాతానికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వేలాది మంది నిరుద్యోగులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే తమనే రెగ్యులర్ చేయాలని జిల్లాలోని కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులు పలువురు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దీంతో గత ఏడాది అక్టోబర్లోనే ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని ట్రిబ్యునల్ స్టెటస్కో ఇచ్చింది. కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్కు సంబంధించి తాజాగా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు జీపీ(గవర్నమెంట్ ప్లీడర్) కేశవరావు ఈ నెల 3న పంచాయతీరాజ్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఓఏ నెంబర్ 8212/2013 మేరకు ఒక లేఖను రాశారు. ఎట్టకేలకు ఆ ప్రతులు జిల్లా అధికార యం త్రాంగానికి చేరాయి. ఈ నెల 20న జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్రెడ్డి కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శుల్లో 96 మందిని రెగ్యులర్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం కాంట్రాక్ట్ పంచాయతీ కార్యదర్శులకు సంతోషం కలిగించినా.. ఎన్నో ఆశలతో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్నారు. తాము చెల్లించిన మొత్తాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పోస్టుల భర్తీకి అందిన దరఖాస్తులను అబియెన్స్లో ఉంచుతామని డీపీవో శోభాస్వరూపరాణి తెలిపారు. -
సర్కారు కొలువే లక్ష్యం
కర్నూలు(విద్య), న్యూస్లైన్: కానిస్టేబుల్ నుంచి వీఆర్ఏ, వీఆర్వో, పంచాయతీరాజ్ సెక్రటరీ, బ్యాంక్ క్లర్క్.. పోస్టు ఏదైనా పోటీ అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో శిక్షణ పొందితే గానీ పోటీపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని పరిస్థితి నెలకొంది. దీంతో కర్నూలు, నంద్యాలలలోని కోచింగ్ సెంటర్లు అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో వీఆర్ఓ, వీఆర్ఏ రాతపరీక్ష ఫిబ్రవరి రెండో తేదీన జరగనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం నాటికి దాదాపు 58వేల మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. 105 వీఆర్వో పోస్టులకు గాను 554వేల మంది దరఖాస్తు చేసుకోవడాన్ని ప్రభుత్వ ఉద్యోగాలపై నిరుద్యోగులకు ఉన్న మక్కువ ఏపాటిదో తెలిసిపోతోంది. ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఉండటంతో దరఖాస్తుల సంఖ్య 60వేలు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మీ-సేవ కేంద్రాల్లో ఫీజు చెల్లించేందుకు ఈనెల 12వ తేదీ చివరి రోజు కాగా 13వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇంటర్ అర్హత ఉన్న ఈ పోస్టులకు అంతకుమించి అర్హత ఉన్న పలువురు అభ్యర్థుల మనోభావాలను ‘న్యూస్లైన్’ తెలుసుకునే ప్రయత్నం చేసింది. -
పంచాయతీ కార్యదర్శి కొలువు సాధనకు గెలుపు వ్యూహాలు
ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులను పంచాయతీ కార్యదర్శి పోస్టుల రూపంలో మరో అవకాశం పలకరించింది. దీంతో అభ్యర్థులు ఉత్సాహంగా పరీక్షకు సిద్ధమవుతున్నారు. అయితే పరీక్షకు చాలా తక్కువ సమయం ఉండటం, సిలబస్.. ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల సిలబస్తో కొంత భిన్నంగా ఉండటంతో అభ్యర్థులకు పటిష్ట ప్రిపరేషన్ ప్రణాళిక అవసరమైంది. ఈ నేపథ్యంలో గెలుపు వ్యూహాలపై ఫోకస్.. పంచాయతీ కార్యదర్శి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీరాజ్ సబార్డినేట్ సర్వీసులో క్షేత్రస్థాయిలో కీలక ఉద్యోగం.. గతంలో ఉన్న వీడీవో ఉద్యోగాన్ని పేరుమార్చి, ఆపై హోదాను పెంచి పంచాయతీ కార్యదర్శిగా మార్చారు. మొత్తం 2,677 పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్- 4) పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తిచేసిన వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. పరీక్ష విధానం: పేపర్ {పశ్నలు మార్కులు సమయం 1.జనరల్ స్టడీస్ 150 150 150 ని. 2.గ్రామీణాభివృద్ధి (ఏపీకి ప్రాధాన్యం) 150 150 150 ని. పరీక్ష ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఉంటాయి. రాత పరీక్ష మార్కుల ఆధారంగా తుది ఎంపిక. పేపర్-1 జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ సిలబస్లో మొత్తం ఏడు అంశాలను పేర్కొన్నారు. అవి: 1. జాతీయ, అంతర్జాతీయ ప్రధాన సంఘటనలు. 2. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు. 3. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- సమకాలీన పరిణామాలు. 4. ఆధునిక భారత దేశ చరిత్ర (జాతీయోద్యమానికి ప్రత్యేక ప్రాధాన్యం. 5. భారత్- ఆర్థికాభివృద్ధి. 6. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రెటేషన్. 7. విపత్తు నిర్వహణ. ఉద్యోగ నియామక పోటీ పరీక్షల్లో జీఎస్ ఉమ్మడిగా ఉంటుంది. అయితే ఈ పరీక్షకు సంబంధించిన జీఎస్లో కొన్ని అంశాలను మాత్రమే ప్రస్తావించారు. జాగ్రఫీ, జనరల్ సైన్స్ను స్పృశించలేదు. అందువల్ల ఆయా విభాగాలను ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కొత్త ఆవిష్కరణలపై దృష్టిసారించాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ, అగ్రికల్చర్ టెక్నాలజీ తదితర అంశాలను చదవాలి. అంతర్జాతీయ సదస్సులు, వివిధ దేశాలతో భారత్ ఒప్పందాలు, ప్రధాన సంఘటనలు, పురస్కారాలు వంటి వాటిని అధ్యయనం చేయాలి. ఉదాహరణ: 2014 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది? జవాబు: కుటుంబ వ్యవసాయ సంవత్సరం ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పనిచేసే సూపర్ కంప్యూటర్ తియాన్హె-2ను అభివృద్ధి చేసిన దేశం? జవాబు: చైనా ఆధునిక భారత దేశ చరిత్ర: సిలబస్లో భారత జాతీయోద్యమానికి ప్రాధాన్యం ఇస్తూ ఆధునిక భారత దేశ చరిత్రను పేర్కొన్నారు. కనుక కొంత భారం తగ్గినట్లే! ఐరోపా దేశాల వలస స్థాపన, స్థావరాలు, ఆధిపత్య పోరాటాలు, బ్రిటిష్ సామ్రాజ్య వ్యాప్తి, కర్ణాటక యుద్ధాలు, ఆంగ్లో- మరాఠా యుద్ధాలు, బ్రిటిష్ కంపెనీ పరిపాలన, ఆర్థిక విధానాలు- సంస్కరణలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. భారత జాతీయోద్యమం అత్యంత ప్రధాన అంశం. సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి స్వాతంత్య్రం వచ్చినంత వరకు జరిగిన మహోన్నత పోరాటాలు చాలా ఉన్నాయి. జాతీయ కాంగ్రెస్ స్థాపన, మితవాదులు, అతివాదులు; స్వదేశీ ఉద్యమం; మహాత్మాగాంధీ ప్రవేశం; సహాయ నిరాకరణ; శాసనోల్లంఘన ఉద్యమం; క్విట్ ఇండియా ఉద్యమం; రాజ్యాంగ రచన తదితర అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఉదాహరణ: భారత దేశానికి వ్యాపార ప్రయోజనాలకై వచ్చిన మొట్టమొదటి, చిట్టచివరి దేశాలు? జవాబు: పోర్చుగల్, ఫ్రాన్స్ అన్ని రౌండ్టేబుల్ సమావేశాలకు హాజరైన వారు? జవాబు: బి.ఆర్.అంబేద్కర్ భారత ఆర్థిక వ్యవస్థ- అభివృద్ధి: స్వాతంత్య్రం తర్వాత భారత దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందన్న అంశంపై ప్రధానంగా ప్రశ్నలు వస్తాయి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, పంచవర్ష ప్రణాళికలు, అభివృద్ధి పథకాలు, మౌలిక వసతులు, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, రవాణా, పన్నులు, ఎగుమతులు- దిగుమతులు, బ్యాంకింగ్ వంటి వాటికి సంబంధించిన సమకాలీన అంశాలపై దృష్టిసారించాలి. విపత్తు నిర్వహణ: ప్రకృతిపరంగా మానవాళి ఎదుర్కొంటున్న అనేక వైపరీత్యాలపై, ముఖ్యంగా వరదలు, సునామీలు, కరువులు, భూకంపాలు, తుఫాన్లు తదితర అంశాలపై అభ్యర్థులకున్న ప్రాథమిక అవగాహనను పరిశీలిస్తారు. విపత్తులు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి?; పునరావాస కార్యక్రమాలు; ఆస్తి, ప్రాణ నష్టం నివారణ; జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తదితర అంశాలపై ప్రశ్నలు వస్తాయి. విపత్తులు- సమకాలీన పరిణామాలను అభ్యర్థులు తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. సీబీఎస్ఈ 8, 9 తరగతులలో నిర్దేశించిన సిలబస్కు అనుగుణంగా చదవితే సరిపోతుంది. అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రెటేషన్: ఈ తరహా ప్రశ్నలు ఎక్కువగా బ్యాంకు పరీక్షల్లో వస్తుంటాయి. పంచాయతీ కార్యదర్శులు తమ విధి నిర్వహణలో భాగంగా అనేక విషయాలను త్వరితగతిన ఆకళింపు చేసుకొని, విశ్లేషించాల్సి ఉంటుంది. ఇచ్చిన డేటాను పరిశీలించి, సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల పరీక్షలో కొన్ని గణాంకాలు ఇచ్చి, వాటి నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చో అడిగే అవకాశం ఉంది. పేపర్ 2 గ్రామీణాభివృద్ధి- సమస్యలు పంచాయతీ కార్యదర్శులు నిర్వర్తించే విధులను దృష్టిలో ఉంచుకొని, ఈ పేపర్ సిలబస్ను నిర్దేశించారు. ఈ పోస్టును ఆశిస్తున్న అభ్యర్థికి తెలిసి ఉండాల్సిన అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజారోగ్యంపై అవగాహన ఉండాలి కాబట్టి అంటువ్యాధులు ప్రబలినపుడు సత్వరం తీసుకోవాల్సిన చర్యలు; అంటు వ్యాధులు- కారణాలు; పారిశుద్ధ్యం వంటి అంశాలను,సమకాలీన అంశాలకు జోడిస్తూ చదవాలి. హైస్కూల్ స్థాయి పుస్తకాలలోని ప్రజారోగ్యం అంశాలను చదవాలి. ప్రస్తుతం ప్రజారోగ్యానికి సంబంధించి అమలవుతున్న పథకాల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. సంక్షేమ పథకాలు: గ్రామీణ సమాజంలో అణగారిన, నిర్లక్ష్యానికి గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళల సంక్షేమంపై దృష్టిసారించాలి. ఆయా వర్గాలకు రాజ్యంగ, చట్టపరమైన రక్షణల గురించి తెలుసుకోవాలి. సంక్షేమ, అభివృద్ధి పథకాలు- వాటి ప్రాముఖ్యతను లోతుగా అధ్యయనం చేయాలి. సామాజిక ఒత్తిళ్లు, సంఘర్షణ కారణాలు, పరిష్కార మార్గాలపై అవగాహన పెంపొందించుకోవాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, నిరుద్యోగం, ప్రభుత్వ పథకాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ స్వభావం; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు; పంచాయతీరాజ్ వ్యవస్థ; అధికార వికేంద్రీకరణ; 73వ రాజ్యాంగ సవరణ ప్రాముఖ్యత తదితర అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంస్థలు, వాటి నేపథ్యం; పరపతి సౌకర్యాలు వంటి అంశాలను కూడా చదవాలి. అకౌంటింగ్- మౌలికాంశాలు: పరీక్షలో నిర్దేశించిన అకౌంటింగ్ విభాగం పూర్తిగా కొత్తది. ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ నిర్వహించిన ఏ పోటీపరీక్షల సిలబస్లోనూ ఈ విభాగం లేదు. పంచాయతీ ఖాతాల నిర్వహణపై అవగాహన పెంపొందించుకోవడానికి సిలబస్లో అకౌంటింగ్ అంశాలను పేర్కొన్నారు. అభ్యర్థులు అకౌంటింగ్ భావనలు, సంప్రదాయాలు, బుక్ కీపింగ్, ఒంటిపద్దు, జంటపద్దు, క్యాష్బుక్, లెడ్జర్ వంటి అంశాలపై ప్రాథమిక అవగాహన పెంపొందించుకోవాలి. అభ్యర్థులు ఇంటర్మీడియెట్ స్థాయి కామర్స్ పాఠ్యపుస్తకంలోని అకౌంటింగ్ చాప్టర్లను చదివితే సరిపోతుంది. జనరల్ స్టడీస్ ప్రత్యేకత! ఏ పోటీ పరీక్ష అయినా జీఎస్ పేపర్లో సాధారణంగా భారతదేశ చరిత్ర; రాజకీయ వ్యవస్థ; ఆర్థిక వ్యవస్థ; భారత భౌగోళికాంశాలు; శాస్త్రసాంకేతిక అంశాలు; జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలు; జనరల్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అంశాలుంటాయి. అయితే ఆయా ఉద్యోగ నియామకాలనుబట్టి సంబంధిత అంశాలపై ప్రత్యేకంగా పరీక్షకు రూపకల్పన చేస్తారు. ఈ క్రమంలోనే పంచాయతీ కార్యదర్శి విధులకు సంబంధించి అభ్యర్థులకున్న అవగాహనను పరీక్షించేందుకు పేపర్-2లో ప్రత్యేక అంశాలను పొందుపరిచారు. అందువల్ల జీఎస్ పేపర్లోని పాలిటీని పేపర్-2లో ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని కూడా పేపర్-2లోనే పేర్కొన్నారు కాబట్టి జీఎస్లో దాని ప్రస్థావన అవసరం లేదు. సిలబస్లో ప్రపంచ భౌగోళికాంశాలను పేర్కొనలేదు. అయినా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం వంటి అంశాలను భారత భౌగోళికాంశాలకు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితులకు అన్వయించి, అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మొత్తంమీద రెండు, మూడు అంశాలను మినహాయిస్తే పంచాయతీ కార్యదర్శి పరీక్ష జీఎస్కూ, ఇతర ఏపీపీఎస్సీ పరీక్షల జీఎస్కూ చెప్పుకోదగ్గ గుణాత్మక తేడా కనిపించలేదు. అభ్యర్థులు జీఎస్ పేపర్లో ఎక్కువ మార్కులు సాధించాలంటే విస్తృత అధ్యయనం అవసరం. జిల్లాల వారీగా పోస్టుల వివరాలు జిల్లా పోస్టులు మహబూబ్నగర్ 350 ఆదిలాబాద్ 241 శ్రీకాకుళం 209 అనంతపురం 202 విజయనగరం 201 మెదక్ 182 కర్నూలు 164 విశాఖపట్నం 155 నల్లగొండ 133 వరంగల్ 106 చిత్తూరు 104 ప్రకాశం 95 కరీంనగర్ 88 నెల్లూరు 86 ఖమ్మం 83 తూర్పుగోదావరి70 నిజామాబాద్ 66 రంగారెడ్డి 57 గుంటూరు 26 కడప 26 పశ్చిమ గోదావరి 25 కృష్ణా 8 మొత్తం 2,677 పంచాయతీ కార్యదర్శి విధులు: పంచాయతీ కార్యదర్శిగా విధులు చేపట్టిన వారు అంచెలంచెలుగా ఎదిగి, ఎంపీడీవో స్థాయికి చేరుకోవచ్చు.ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం(1994), 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992)లో నిర్దేశించిన విధులను పంచాయతీ కార్యదర్శి నిర్వర్తించాలి. సర్పంచ్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సమావేశాలను ఏర్పాటు చేయాలి. సమావేశాల మినిట్స్ తయారు చేయాలి. గ్రామ పంచాయతీ తీర్మానాల అమలు బాధ్యత. గ్రామ పంచాయతీ విధించే పన్నుల వసూలు. ప్రజారోగ్యం, తాగునీటి సరఫరా, గ్రామ పంచాయతీ ఆస్తుల పరిరక్షణ. వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు. గ్రామ పంచాయతీకి, ప్రభుత్వానికి అనుసంధాన కర్తగా వ్యవహరించాలి. పంచాయతీ ఉద్యోగులపై పర్యవేక్షణ బాధ్యత వంటి విధులను నిర్వర్తించాలి. ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: జనవరి 4, 2014. ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: జనవరి20, 2014. దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 22, 2014. పరీక్ష తేదీ: ఫిబ్రవరి 23, 2014. బి. కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-1 స్టడీ సర్కిల్, హైదరాబాద్ -
బాబోయ్.. ఇదేం ‘పంచాయితీ’
సాక్షి, సంగారెడ్డి: నిరుద్యోగుల భవిష్యత్తుతో సర్కారు చెలగాటమాడుతోంది. పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్-4) పోస్టుల భర్తీలో సర్కార్ అవలంబించిన ద్వంద్వ ప్రమాణాలు నిరుద్యోగులకు శాపంగా మారాయి. ఖాళీ పోస్టుల సంఖ్యను విడగొట్టి రెండు వేర్వేరు నియామక ప్రకటనలు జారీ చేయడంతో నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తోంది. జిల్లాలో 1,066 గ్రామ పంచాయతీలుంటే 514 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్కు ఒక్కో పంచాయతీ కార్యదర్శి పోస్టు మంజూరు చేశా రు. ప్రస్తుతం 318 పంచాయతీ కార్యదర్శులు మాత్రమే పనిచేస్తుండగా అందులో 208 మంది కాంట్రాక్టు ఉద్యోగులే. 110 మంది మాత్రమే రెగ్యూలర్ పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. దాదాపు 504 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం ఈ పోస్టులను విభజించి రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేయడం నిరుద్యోగుల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఏళ్ల తరబడి కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న 208 మంది కార్యదర్శులను నేరుగా క్రమబద్ధీకరిస్తే ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను సైతం క్రమబద్ధీకరించాల్సివస్తుందనే భావనతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. గత అక్టోబర్ 31న కలెక్టర్ 210 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేశారు. పదో తరగతి మార్కులపై వెయిటేజీ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోడానికి నిరుద్యోగులందరికీ అందరికీ అవకాశం ఇచ్చినా కాంట్రాక్టు కార్యదర్శులకు 75 మార్కులను అదనపు వెయిటేజీగా కేటాయించారు. ఏకంగా 15,434 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాంట్రాక్టు కార్యదర్శులను క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతోనే ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రభుత్వ వైఖరీ స్పష్టం చేస్తోంది. ఈ నియామకు ప్రక్రియపై అభ్యంతరాలు తెలుపుతూ 90 మంది కాంట్రాక్టు కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంతో ఈ భర్తీ ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయింది. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) సోమవారం జిల్లాలో మరో 182 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయడంతో నిరుద్యోగులు మళ్లీ రెండో సారీ దరఖాస్తు చేసుకోక తప్పడం లేదు. రాత పరీక్ష ఆధారంగా ఈ పోస్టుల భర్తీ జరగనుంది. జనవరి 4 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఒక వేళ ఎవరైనా అభ్యర్థులకు రెండు చోట్లా కొలువు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై తర్వాత ఆలోచిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. -
కొలువుల భర్తీ అరకొరే
సాక్షి ప్రతినిధి, కాకినాడ : పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సోమవారం తాజా నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఏడెనిమిదేళ్లుగా ఈ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు అరకొరగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం నిరాశనే మిగిల్చింది. జిల్లాలో 724 క్లస్టర్ పంచాయతీల్లో 300 క్లస్టర్లలో మాత్రమే కార్యదర్శులున్నారు. మిగిలిన 424 క్లస్టర్లలో బిల్లు కలెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లే కార్యదర్శుల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడుతోందంటే నిరుద్యోగులంతా ఎంతో సంతోషించారు. తీరా నోటిఫికేషన్ వెలువడి జిల్లాలో భర్తీచేసే పోస్టుల లెక్క తేలేసరికి ఉసూరుమంటున్నారు. జిల్లాలో ఉన్న కార్యదర్శుల ఖాళీలకు, ఇప్పుడు భర్తీ చేసే పోస్టుల సంఖ్యకు భారీవ్యత్యాసం ఉండటంతో నిరాశ చెందుతున్నారు. అయిదింట ఒక వంతే.. గత నెలలో పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ కార్యదర్శుల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ రకంగా భర్తీచేసే పోస్టులు 68 వరకు ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్న 62 మంది కార్యదర్శులకు పోస్టులు ఇచ్చే కసరత్తు జరుగుతోంది. మిగిలిన ఆరు పోస్టులకు 13,400 పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం మీద ఆ నోటిఫికేషన్ ప్రకారం భర్తీ అయ్యే 68 పోస్టులను మినహాయిస్తే మరో 356పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. సోమవారం విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2,200 పోస్టులను భర్తీ చేయనుండగా వాటిలో జిల్లాకు 70 పోస్టులు మాత్రమేవస్తాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరో 286 పోస్టులు ఖాళీగానే ఉండిపోనున్నాయి. అంటే పోస్టుల్లో అయిదింట ఒక వంతు మాత్రమే భర్తీ చేస్తున్నారన్న మాట. ఎంపికలో కొత్త విధానానికి నిరసన కాగా ఈ పోస్టుల భర్తీకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ను వర్తింపచేయనున్నారు. మొత్తం 70 పోస్టుల్లో బీసీలకు 15, ఎస్సీలకు 30, ఎస్టీలకు నాలుగు, ఓసీలకు 21 కేటాయించే అవకాశం ఉందని అధికారుల అంచనా. 33 శాతం రిజర్వేషన్ ప్రకారం మహిళలకు 23 పోస్టులు కేటాయించనున్నారు. కాగా, గత నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం డిగ్రీలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న అభ్యర్థులకు పోస్టింగ్లు ఇచ్చే ఏర్పాటు జరుగుతోంది. ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్ ప్రకారం కార్యదర్శుల పోస్టులకు ఫిబ్రవరి నెలలో రాతపరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలను ఖరారు చేయనున్నారు. అరకొరగా పోస్టులను భర్తీ చేయనుండడమే కాక ఈ కొత్త విధానాన్ని అమలు చేయడమేమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. -
పంచాయతీ కార్యదర్శులకు ‘పవర్’
సాక్షి, కొత్తగూడెం : గ్రామ సభల నిర్వహణకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం జీఓ నంబర్ 791 జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం కార్యదర్శులు గ్రామ సభలకు హాజరుకాని మండలస్థాయి అధికారులపై జిల్లా స్థాయి అధికారులకు నివేదికలు ఇవ్వవచ్చు. ప్రణాళికా బద్ధంగా నిర్వహించేందుకు.. జిల్లా వ్యాప్తంగా 758 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రస్తుతం పాలకవర్గాలు ఏర్పడడంతో పంచాయతీల వారిగా అభివృద్ధి పనులు, ఆదాయ, వ్యయాలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. గతంలో గ్రామ సభల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం, ఆశించిన ప్రయోజనం లేకపోవడంతో ఈసారి సభలను ప్రణాళికా బద్ధంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నవంబర్ 7న జీఓ నంబర్ 791ని జారీ చేసింది. గతంలో గ్రామ సభలకు మండలస్థాయి అధికారులు రాకున్నా కొనసాగించేవారు. దీంతో గ్రామ సమస్యలు అపరిష్కృతంగానే ఉండేవి. అలాగే ఏయే అధికారులు సభలకు హాజరయ్యారనే సమాచారం ఉన్నతాధికారు వద్ద కూడా లేకుండా పోతోంది. ఈ జీఓ ప్రకారం ప్రధాన శాఖల మండల స్థాయి అధికారులు ఏడాదిలో నాలుగు సార్లు నిర్వహించే గ్రామ సభలకు విధిగా హాజరు కావాలి. గ్రామాల్లో తాగునీటి సమస్య, డ్రెయినేజీ, రోడ్లు తదితర విషయాలపై చర్చించడం, ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలి. సభలకు హాజరు కాని ఆయా అధికారులపై పంచాయతీ కార్యదర్శులు జిల్లా పంచాయతీ అధికారికి ప్రతి గ్రామ సభకు సంబంధించి నివేదిక అందజేయాలి. చిక్కులు తప్పవా..? ఇప్పటి వరకు గ్రామ సభలను నామ మాత్రంగా నిర్వహించిన పంచాయతీ కార్యదర్శులు ఈ జీఓతో ఇబ్బందులు తప్పవని చర్చించ ుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 161 మంది పంచాయతీ కార్యదర్శులున్నారు. ఒక్కో కార్యదర్శి నాలుగు నుంచి ఐదు గ్రామ పంచాయతీల వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఇప్పటికే ఇది తమకు తలకు మించిన భారమని వారు భావిస్తున్నారు. అయితే ఈ జీఓతో గ్రామసభలకు రాని మండల స్థాయి అధికారులపై రిపోర్టు చేస్తే ఏ సమయంలో తమకు మండలస్థాయి అధికారులు ఏకు మేకవుతారోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలపై సీరియస్గా స్పందిస్తే క్షేత్రస్థాయిలో తమకు ఇబ్బందులు తప్పవంటున్నారు. పంచాయతీల్లో గతంలో అస్తవ్యస్తంగా ఉన్న ఆడిట్ను ఎలా పూర్తి చేయాలని ఇప్పుడు కార్యదర్శులు తల పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ జీఓ రావడం తమ మెడకు పరోక్షంగా ఉచ్చు బిగుసుకుంటున్నట్లేనని ఆందోళన చెందుతున్నారు. -
కార్యదర్శుల భర్తీకి మరో నెలరోజులు
కరీంనగర్ సిటీ, న్యూస్లైన్ : పంచాయతీ కార్యదర్శుల పో స్టుల భర్తీకి మరో నెలరోజుల సమయం పట్టనుంది. వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 92 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను రాత, మౌ ఖిక పరీక్ష లేకుండా నేరుగా భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ జారీచేశారు. 92 పోస్టులకు 13,837 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు 150 మంది పోటీ పడుతున్నారు. డిగ్రీలో సాధించిన మార్కులు, ఏడాదికో మార్కు చొప్పున వెయిటేజీ మార్కుల ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. ఇప్పటికే కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న కార్యదర్శులు 87 మందికి పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పిస్తారు. అంటే ఒక్కొక్కరికి అదనంగా 25 వెయిటేజీ మార్కులు కలపనున్నారు. దీంతో 87 మంది కాంట్రాక్ట్ పంచాయతీ కార్యదర్శుల్లో ఎక్కువ మందికి అవకాశం లభించనుంది. కేవలం పది పోస్టులకోసం 13 వేల మందికి పైగా నిరుద్యోగులు పోటీపడుతున్నారు. ఇప్పటివరకు అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిశీలన పూర్తైంది. ప్రస్తుతం దరఖాస్తులను కంప్యూటరైజేషన్ చేసే పని చేపడుతున్నారు. వేలాది దరఖాస్తులు రావడంతో సుమారు పదిహేను రోజుల పాటు కంప్యూటరైజేషన్ ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం మార్కులు, వెయిటేజీని కలిపి రిజర్వేషన్ ప్రకారం మెరిట్ జాబితా ప్రకటిస్తామని డీపీవో కుమారస్వామి తెలిపారు. మొత్తంగా పోస్టుల భర్తీకి నిరుద్యోగులు మరో 20 రోజులు ఎదురుచూడాల్సిందే.