Ramayanam
-
అంతరార్థం..
ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే దాన్ని చూసిన మనం అతడు అలా చేయటం మంచిదనో లేదా చెడ్డదనో వెంటనే తీర్పుచెబుతూ ఉంటాం. అలా చేయటం తగదని శ్రీ రామకృష్ణ పరమహంస రామాయణ, మహాభారతాల నుంచి కొన్ని ఉదాహరణలు చూపారు. రామరావణ యుద్ధంలో రావణ కుంభకర్ణాది యుద్ధ వీరులంతా చనిపోయారు. రావణుని తల్లి కైకశి ప్రాణభయంతో పారిపోసాగింది.లక్ష్మణుడు అలా పారిపోతున్న ఆ వృద్ధ స్త్రీని గమనించి శ్రీరామ చంద్రునితో, ‘అన్నయ్యా! ఏమిటీ వింత? అనేక మంది పుత్రులను, బంధువులను కోల్పోయి పుత్ర శోకాన్ని అనుభవిస్తూ ఇప్పుడు స్వీయ ప్రాణ రక్షణార్థం ఈ వృద్ధురాలు ఇలా ఎందుకు పారిపోతోంది?’ అని అడిగాడు. అందుకు రాముడు ‘ఆమెనే అడిగి కారణం కనుక్కొందాం’ అన్నాడు. ‘శ్రీరాముడు అభయమిచ్చాడని తెలిపి ఆమెను గౌరవంగా నా కడకు తోడ్కొని రండి అని కొందరిని ఆమె కడకు పంపాడు. వారు అలాగే చేశారు.‘నీవు ప్రాణ భీతితో అలా పారిపోతున్నావా? నిజం చెప్పు’ అన్నాడు శ్రీరామ చంద్రుడు ఆమెతో. అప్పుడామె, ‘ఓ రామా! నేను జీవించి ఉన్నందునే నీ ఈ లీలలను తిలకించ గల్గుతున్నాను. ఈ భూమ్మీద నీవు ఇంకా జరుపబోయే లీలలను కూడా చూడగోరి ఇంకా కొంత కాలం జీవించాలని అభిలషిస్తున్నాను’ అని చెప్పింది. దీంతో సత్యమేమిటో అందరికీ తెలిసి వచ్చింది.మహాభారత ఉదాహరణ చూద్దాం. భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. శ్రీకృష్ణుడు, పంచ పాండవులు ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు. మహావీరుడైన భీష్మాచార్యుల వారి కళ్ళ నుండి అశ్రువులు స్రవించటం వారు గమనించారు. అర్జునుడు శ్రీకృష్ణునితో, ‘సఖా! ఎంత విచిత్రంగా ఉంది. కురు పితామహులైన భీష్ములు మరణ సమయంలో మాయలో పడి దుఃఖిస్తున్నా రేమిటి?’ అన్నాడు. కృష్ణుడే భీష్ముడిని దాన్నిగూర్చి అడిగాడు.అప్పుడు భీష్ముడు, ‘ఓ కృష్ణా! మరణ భయంతో నేను దుఃఖించటం లేదని నీకు బాగా తెలుసు, స్వయంగా భగవంతుడే పాండవులకు సారథిగా ఉన్నప్పటికీ వారి కష్టాలకు అంతులేకుండా ఉందే! ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడి లీలలను కించిత్తూ తెలుసుకోలేకుండా ఉన్నానే అని తలచుకొని దుఃఖిస్తున్నాను’ అన్నాడు (శ్రీ రామకృష్ణ కథామృతం–01). కాబట్టి దేన్ని చూసినా, విన్నా త్వరపడి విమర్శించ కూడదు. నిజం నిలకడ మీద తేలుతుంది. – రాచమడుగు శ్రీనివాసులు -
ఆ పాత్ర కోసం కేజీఎఫ్ హీరో సాహసం.. అదేంటో తెలుసా?
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం రామాయణం. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ చిత్రంలో రణ్బీర్కపూర్, సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ చిత్రంలో రావణుడి పాత్రలో కేజీఎఫ్ స్టార్ యశ్ కనిపించనున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా యశ్కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెగ వైరలవుతోంది. ఈ సినిమాలో రావణుడి పాత్ర కోసం యశ్ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆ పాత్ర కోసం ఏకంగా 15 కిలోల బరువు పెరగనున్నట్లు తాజా సమాచారం. దానికోసం ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. నితీశ్ తివారీ రామాయణంలో యశ్ భారీ పర్సనాలిటీతో కనిపించనున్నారు. ఈ మూవీ తర్వాత కేజీఎఫ్-3లో యశ్ నటించనున్నారు. ప్రస్తుతం టాక్సిక్ చిత్రంలో నటిస్తోన్న యశ్.. ఆ సినిమా పూర్తయ్యాకే రామాయణం సెట్స్లో అడుగుపెట్టనున్నారు. కాగా.. రామాయణం షూటింగ్ ఏప్రిల్లో ముంబైలో ప్రారంభమైంది. ఈ మూవీ కోసం దర్శకుడు నితీష్ తివారీ ముంబయి నగర శివార్లలో భారీ సెట్ను నిర్మించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుండగా.. హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తారని సమాచారం. -
రామాయణంకి ఎంతైనా కష్టపడతాను: యశ్
‘‘నమిత్, నేను కలిసి రామాయణంపై మూవీ చేస్తే బాగుంటుందని చాలా సార్లు అనుకున్నాం. కానీ, అంత పెద్ద సబ్జెక్టు తియ్యాలంటే అది మామూలు విషయం కాదు.. బడ్జెట్స్ కూడా సరిపోవు.. అందుకే నేను కూడా కో ప్రోడ్యూస్ చెయ్యాలనుకున్నాను. ఈ ‘రామాయణం’ కోసం ఎంతైనా కష్టపడతాను’’ అన్నారు ‘కేజీఎఫ్’ ఫేమ్ హీరో యశ్. ఆయన నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కలిసి రామాయణం నేపథ్యంలో ఓ సినిమా నిర్మించనున్నాయి. ఈ చిత్రానికి నితీష్ తివారి దర్శకుడు. నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘మన దేశ ప్రగతి అయిన రామాయణాన్ని తీయడంలో న్యాయం చేయగలను అనిపిస్తోంది’’ అన్నారు. కాగా నితీష్ తివారి దర్శకత్వంలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ‘రామాయణ్’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికే నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాతలనే టాక్ వినిపిస్తోంది. -
విల్లు ఎక్కు పెట్టి..!
రెండు రోజుల క్రితం రణ్బీర్ కపూర్ తలకిందులుగా నిలబడిన ఫొటో వైరల్ అయ్యింది. ఈ శీర్షాసనం ఎందుకూ అంటే.. శిక్షణలో భాగంగా. రామాయణం ఆధారంగా నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందనున్న ‘రామాయణ్’ చిత్రం కోసమే రణ్బీర్ వర్కవుట్స్ మొదలుపెట్టారు. ఈ చిత్రంలో రాముడిగా రణ్బీర్ కపూర్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం షూటింగ్ని ఆరంభించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా నియమించిన ట్రైనర్ ఆధ్వర్యంలో రణ్బీర్ కపూర్ మేకోవర్ అవుతున్నారు. ఒకవైపు ఫిజికల్ మేకోవర్ మరోవైపు యుద్ధ విద్యలు నేర్చుకుంటూ బిజీగా ఉన్నారు రణ్బీర్. మొన్న శీర్షాసనం ఫొటో వైరల్ కాగా తాజాగా విలు విద్య నేర్చుకోవడానికి రణ్బీర్ సిద్ధమవుతున్న ఫొటోలు బయటికొచ్చాయి. మేకోవర్ ట్రైనర్ వేరు... విలు విద్య నేర్పిస్తున్న ట్రైనర్ వేరు. రాముడంటే యుద్ధ విద్యల్లో సూపర్ కాబట్టి ఆ పాత్రకు న్యాయం చేయడానికి ఏమేం చేయాలో అన్నీ చేయడానికి రణ్బీర్ రెడీ అయిపోయారు. ఇక ఈ చిత్రంలో సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడిగా యశ్, కైకేయీగా లారా దత్తా నటిస్తారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. -
రామాయణం కోసం 'యష్' దిమ్మతిరిగే రెమ్యూనరేషన్
-
ఆర్థిక విజయానికి రామబాణం
కోట్లాది మంది దశాబ్దాల స్వప్నం సాకారమై, అయోధ్యలో బాలరాముడు కొలువు దీరాడు. రామాయణాన్ని గృహస్థ ధర్మానికి అద్భుతమైన నిదర్శనంగా పేర్కొంటారు. శ్రీరాముడి జీవన మార్గాన్ని పరిశీలించి చూస్తే వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో ఎలా నడుచుకోవాలనే విషయమై విలువైన పాఠాలు కనిపిస్తాయి. శ్రీరాముడిని విశ్వసించే ప్రతి ఒక్కరూ, తమ ఆర్థిక విజయానికి కావాల్సిన సూత్రాలను రామాయణం నుంచి తీసుకోవచ్చు. రాముడి వనవాసం.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళిక అవసరాన్ని గుర్తు చేస్తుంది. వ్యక్తిగత ఆర్థిక జీవితానికి ఆలోచనాత్మక ఆర్థిక ప్రణాళిక ఎంతో అవసరమని నిపుణులు తరచూ సూచిస్తుంటారు. ఆర్థిక లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం, వాటికి తగిన బడ్జెట్ కేటాయించుకోవడం, వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం వల్ల జీవితంలో అనిశ్చితులు ఎదురైనా, వాటిని సులభంగా అధిగమించొచ్చు. ఎన్ని కష్టాలు ఎదురైనా రాముడు తన బాధ్యతలను ఏనాడూ విస్మరించలేదు. అందుకే ఊహించని పరిస్థితులు ఎదురైతే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం ఎలా అన్నది రాముడి చేసి చూపించాడు. మనం కూడా ఆర్థిక ప్రణాళిక ఆధారంగా జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు సన్నద్ధత ఏర్పాటు చేసుకోవాలి. జీవితానికి తగినంత బీమా కవరేజీ, ఆరోగ్య బీమా తీసుకోవాలి. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. జీవిత లక్ష్యాలు, అందుకు కావాల్సిన మొత్తం, చేయాల్సిన పెట్టుబడి, వివిధ సాధనాల మధ్య రిస్క్ ఆధారంగా కేటాయింపులు.. వీటన్నింటికీ ఆర్థిక ప్రణాళిక మార్గం చూపిస్తుంది. ధర్మ మార్గం ధర్మం పట్ల రాముడి అచంచలమైన నిబద్ధత ఆయన జీవన గమనానికి మూలస్తంభంగా కనిపిస్తుంది. వ్యక్తిగత ఆర్థిక జీవితంలో నైతిక ఆర్థిక విధానాల ఆచరణ అవసరాన్ని ఇది తెలియజేస్తుంది. ఇదే దీర్ఘకాలంలో విజయానికి బాటలు పరుస్తుంది. నిజాయితీ, చిత్తశుద్ధి, ఆర్థిక నిర్ణయాల్లో పారదర్శకత, క్రమశిక్షణ, భావోద్వేగాల నియంత్రణ, వేగంగా ధనవంతులు కావచ్చనే ప్రచారానికి ఆకర్షితులు కాకపోవడం వంటివి ఆర్థిక విజయాలకు భరోసానిస్తుంది. ఆర్థిక విషయాల్లో ధర్మానికి కట్టుబడి ఉండడం వల్ల అది స్థిరమైన, నైతిక సంపద సృష్టికి దారితీస్తుంది. రిస్క్ నిర్వహణ రావణుడితో రాముడు సాగించిన యుద్ధం.. ధైర్యం, రిస్క్ నిర్వహణ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. వ్యక్తిగత ఆర్థిక విషయాల్లోనూ వీటి అవసరం ఎంతో ఉంది. సంపద సృష్టికి, ఆర్థిక లక్ష్యాల సాధనకు ధైర్యంగా, తమకు సరిపడే రిస్్కలను తీసుకోవాల్సిందే. రిస్్కలను మదించే విషయమై, అనిశి్చతులను అధిగమించేందుకు అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవడాన్ని మర్చిపోవద్దు. ధర్మం కోసం రాముడు యుద్ధం చేయక తప్పలేదు. అలాగే, సంపద సృష్టి కోరుకునే వారు కూడా రిస్్కతో కలసి నడవాల్సిందే. అది కూడా తాము భరించే స్థాయిలోనే రిస్్కను పరిమితం చేసుకోవాలి. పెట్టుబడికి సైతం ముప్పు ఉంటుందని ఈక్విటీలకు దూరంగా ఉండడం సరికాదు. రాబడులకు, పెట్టుబడి రక్షణకూ ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ ఒక్కదాని దృష్టితోనో పరుగులు తీయకూడదు. సరళతరం వనవాస సమయంలో రాముడి నిరాడంబర, సాధారణ జీవన శైలి.. పొదుపు ధర్మాన్ని తెలియజేస్తుంది. వ్యక్తిగత ఆర్థిక జీవితంలోనూ పొదుపుతో కూడిన జీవనశైలిని అనుసరించడం, అనవసర దుబారాని నియంత్రించడం ఆర్థిక శ్రేయస్సుకు దారి చూపుతుంది. నేడు ప్రతి ఒక్క అవసరానికీ సులభంగా రుణాలు లభిస్తున్నాయి. అవసరాలు, కోరికల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. అవసరాలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. రుణాలతో కోరికలు తీర్చుకోవడం ఆర్థిక శ్రేయస్సుకు మేలు చేయదు. పొదుపు మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి. తెలివిగా ఖర్చు చేస్తూ, పొదుపు, పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. క్రెడిట్ కార్డ్ రుణాల నుంచి త్వరగా బయటకు రావాలి. అధిక ఖర్చుకు కళ్లెం వేయాలి. సరైన అవకాశాలు, అనుకూల సమయం కోసం వేచి చూస్తూ ఈక్విటీ మార్కెట్లో వచ్చే విలువైన అవకాశాలను కోల్పోవద్దు. సహనం, పట్టుదల కష్టపడి సంపాదించిన ధనానికి రక్షణగా నిలవాలి. మార్గదర్శకం రాముడి విధేయత, తన అనుచరులతో ఉన్న బలమైన బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెట్టుబడుల విషయంలోనూ సత్సంబంధాలు ఎంతో అవసరం. పరస్పర గౌరవం, నమ్మకం, మద్దతు అనేవి ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు సాయపడతాయి. అవసరం మేరకు ఆర్థిక నిపుణుల సాయాన్ని, మద్దతును, మార్గదర్శకాన్ని తీసుకోవాలి. ఇన్వెస్టర్ రిస్్కను మదింపు వేసి, అనుకూలమైన పెట్టుబడి సాధనాలు, ఆర్థిక లక్ష్యాల సాధనకు ఆచరించాల్సి మార్గాన్ని వారు సూచిస్తారు. ఆర్థిక ప్రపంచంలో ఉండే సంక్లిష్టతలను అధిగమించేందుకు సాయపడతారు. వైవిధ్యమైన పోర్ట్ఫోలియో రాముడి సైన్యంలో కనిపించే వైవిధ్యాన్ని, తమ పెట్టుబడులకూ అన్వయించుకోవాలి. వానరాలు, ఎలుగుబంట్లు, ఉడతలు, గద్దలు ఇవన్నీ రామదండులో కనిపిస్తాయి. ఇదే మాదిరిగా పెట్టుబడుల్లోనూ వైవిధ్యం ఉండాలి. కేవలం పొదుపు, ఫిక్స్డ్ డిపాజిట్లకే (ఎఫ్డీలు) పరిమితం కాకూడదు. అన్ని ముఖ్య సాధనాల్లోకీ పెట్టుబడులు వర్గీకరించుకోవాలి. దీనివల్ల రిస్్కను తగ్గించుకోవచ్చు. రాబడులు స్థిరంగా ఉండేలా చూసుకోవచ్చు. దీన్నే అస్సెట్ అలోకేషన్ అని చెబుతారు. ఈక్విటీలు, డెట్, గోల్డ్, ఏఐఎఫ్లకు పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. నేనే సుపీరియర్ అనుకోవద్దు..! పెట్టుబడుల విషయంలో అంతా తనకే తెలుసన్న అహంకారం అస్సలు పనికిరాదు. రావణుడి పతనానికి ఇదే దారితీసింది. మెరుగైన పనితీరు చూపించని సాధనాల విషయంలో అహంకారం విడిచి పెట్టి ఆలోచించాలి. నిరీ్ణత కాలానికోసారి సమీక్షించుకుని పెట్టుబడుల్లో మార్పులు చేసుకోవాలి. అలా కాకుండా ఇన్వెస్ట్ చేసి పని అయిపోందని అనుకోవడం ఆర్థిక విజయాలకు దారితీయదు. సంపద సృష్టికి, పెట్టుబడుల మార్గంలో తప్పొప్పులను అంగీకరించాలి. దీనివల్ల నష్టాలను పరిమితం చేసుకునేందుకు వీలుంటుంది. మారుతున్న పరిస్థితులను ఆహా్వనించడం ఆర్థిక శ్రేయస్సుకు అవసరం. శ్రీరాముడి జీవితంలో పొందుపరిచిన జ్ఞానం కేవలం ఆధ్యాత్మికతకు పరిమితం కాదు. ఒక వ్యక్తి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలియచెపుతుంది. ఇన్వెస్టర్లకు విలువైన అంశాలను తెలియజేస్తుంది. రామాయణాన్ని చదవడం, అందులోని ముఖ్యమైన అంశాలను గ్రహించి, వాటిని తమ పెట్టుబడులకు అన్వయించుకోవడం వల్ల ఆర్థిక విజయాలకు మార్గాన్ని సులభం చేసుకోవచ్చు. చెడుపై మంచి విజయం సాధించడం రామాయణంలో కనిపిస్తుంది. అదే మాదిరిగా ఇన్వెస్టర్లు ఆర్థిక అవరోధాలను అధిగమించి, మంచి ఆర్థిక అలవాట్లతో, క్రమశిక్షణతో మెలగడం ద్వారా సంపద సృష్టికి చేరువకావచ్చు. హద్దులకు కట్టుబడి ఉండడం సంపద సృష్టి కోరుకునే వారు అందుకు అడ్డదారులు (షార్ట్కట్స్) వెతుక్కోకూడదు. లంకాధిపతి రావణుడు సీతమ్మ వారిని కోరుకోవడం వల్ల ఎంతటి ఉపద్రవం జరిగిందో రామాయణం చెబుతోంది. కోరికలపై నియంత్రణ అవసరమని, సన్మార్గమే శ్రేష్టమని ఇది సందేశం ఇస్తుంది. పెట్టుబడులపై రాబడుల విషయంలోనూ కోరికలను అదుపులో పెట్టుకుని వ్యవహరించాలి. తమకంటూ ఆర్థిక సరిహద్దులు ఏర్పాటు చేసుకోవాలి. ఉద్రేకంతో కూడిన నిర్ణయాలకు చోటు ఇవ్వకూడదు. టిప్స్ను అనుసరించడం కాకుండా కాల పరీక్షకు నిలిచిన బలమైన పెట్టుబడుల వ్యూహాలను అనుసరించాలి. దీనివల్ల విజయం తేలిక అవుతుంది. ఓపిక, క్రమశిక్షణ సముద్రంలో రామసేతు వారధి నిర్మాణం ఎంతో ఓపిక, పట్టుదలతో, ఎంతో మంది కృషితో, సుదీర్ఘ కాలానికి కానీ సాధ్యం కాలేదు. సందప సృష్టి కూడా అంతే. స్వల్ప కాలంలో కుబేరులు కావడం అనేది ఆచరణలో అంత సులభం కాదు. క్రమశిక్షణతో దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగించడం ద్వారానే ఇది సాధ్యపడుతుంది. సిప్ అవసరాన్ని ఇక్కడ గుర్తించాలి. సిప్ రూపంలో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూ వెళితే, చిన్న మొత్తమే దీర్ఘకాలంలో పెద్ద మొత్తంగా మారుతుంది. దీర్ఘకాలంలో సంపద సృష్టిని సిప్ సులభతరం చేస్తుంది. స్థిరత్వం, సహనం అనేవి దీర్ఘకాల ప్రయాణానికి ఎంతో అవసరం. లక్ష్మణుడి కోసం ఆంజనేయుడు సంజీవని కోసం వెళ్లడం, దాన్ని గుర్తించలేక తన చేత్తో మొత్తం సుమేరు పర్వతాన్ని పెకిలించి చేత్తో తీసుకురావడం తెలిసిందే. ప్రతీ ఇన్వెస్టర్ సంజీవని వంటి కంపెనీలను గుర్తించలేకపోవచ్చు. అలాంటప్పుడు వారి ముందున్న మార్గం మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. ఇన్వెస్టర్లు ఒక్కో కంపెనీ వారీ రిస్్కను తగ్గించుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సూచీల్లో ఇన్వెస్ట్ చేసే ప్యాసివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. అందులోని కొన్ని స్టాక్స్ బలహీన పనితీరు చూపించినా కానీ, మిగిలిన వాటి అండతో దీర్ఘకాలంలో మంచి రాబడులు సొంతం చేసుకోవచ్చు. -
అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!
అది 1973 సంవత్సరం.. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12.05 ని. కావస్తోంది. కాసేపట్లో ఉషశ్రీ ధర్మసందేహాలు కార్యక్రమం.. శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు, ఆ తరువాయి శ్రీమద్భారతం ప్రవచనం.. అంటూ ప్రకటన వినపడగానే తెలుగు లోగిళ్లు నై మిశతపోవనాలుగా మారిపోయాయి. ‘ఉషశ్రీ ఉపన్యాసాలు స్నిగ్ధ గవాక్షాలు’ అని పలువురు పెద్దలు ప్రశంసించారు. అలా ప్రారంభమైన ఆ కార్యక్రమం – 1990 సెప్టెంబరు 7 వ తేదీ ‘ఉషశ్రీ’ కన్నుమూసే వరకు కొనసాగింది. ఆకాశవాణి ద్వారా ఉషశ్రీ.. వాల్మీకి రామాయణం, కవిత్రయ భారతం, పోతన భాగవతాలను తెలుగు శ్రోతలకు వినిపించారు. శ్రోతల సందేహాలకు చమత్కారంగా సమాధానాలిచ్చేవారు. ఉషశ్రీ నేపథ్యం.. పశ్చిమగోదావరి జిల్లా కాకరపర్రు గ్రామంలో 1928, మార్చి 16న పురాణపండ రామమూర్తి, కాశీ అన్నపూర్ణ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ‘ఉషశ్రీ’ కలం పేరుతో తెలుగువారికి సుపరిచితులయ్యారు. జ్వలితజ్వాల, అమృత కలశం, మల్లెపందిరి, సంతప్తులు, ప్రేయసి – ప్రియంవద, తరాలు-అంతరాలు వంటి నవలలు, కథలు, వెంకటేశ్వర కల్యాణం వంటి యక్షగానాలు, పెళ్లాడేబొమ్మా(నవలా లేఖావళి), వ్యాసాలు, విమర్శలు, నాటికలు రాసిన ఉషశ్రీ... రామాయణభారత ఉపన్యాసాలు ప్రారంభించాక ఇక కథలు, పద్యాలు, నవలలు విడిచిపెట్టేశారు. ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా.. తుది శ్వాస విడిచేవరకు రామాయణభారతాలే ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా జీవించారాయన. శృంగేరి శారదా పీఠం ఆస్థానకవిగా సత్కారం అందుకున్నారు. ఉషశ్రీ రచించిన రామాయణ భారత భాగవతాలను తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని లక్షల కాపీలు ముద్రించింది. ఇప్పుడు తెలుగువారు గర్వించే సన్నివేశం చోటు చేసుకుంది. అదే అయోధ్యలో ఉషశ్రీ గళం. అయోధ్య అంతటా.. ఉషశ్రీ గళంలో జాలువారిన రామాయణం ఇప్పుడు అయోధ్యలో వినిపిస్తోంది. అయోధ్యను సందర్శించి, విన్నవారు ఈ సంగతిని చెప్పారు. అంతే కాకుండా దేశంలోని అనేక ఎఫ్.ఎం. స్టేషన్లు కూడా దీనిని ప్రసారం చేస్తున్నాయి. కేంద్రంలో అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న ఒకరి చొరవతో ఇది సాధ్యమైందని తెలిసింది. విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలు తమ ఎఫ్.ఎం. స్టేషన్లలో వీటిని తాజాగా ప్రసారం చేశాయి. వీటిని విన్నవారు, ఇదే స్వరాన్ని అయోధ్య ఆలయంలో కూడా విన్నామని చెబుతున్నారు. ఆటుపోట్ల నడుమ ఆ గళం.. సరిగ్గా ఐదు దశాబ్దాల క్రితం ఉషశ్రీ గళ ప్రస్థానం ఆకాశవాణి విజయవాడలో వినబడడం ప్రారంభమైంది. ధర్మసందేహాలు శీర్షికన మహాభారతంతో మొదలై, శ్రీ భాగవతం వరకూ కొనసాగింది. ఆ సమయంలో ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఉషశ్రీ గారు భౌతికంగా అదృశ్యమై 33 సంవత్సరాలు అయినా ఆ గళం ఇంకా సజీవంగా ఉండడానికి ప్రధాన కారణం ఆయన అభిమానులు. ఆ తరువాత కరోనా సమయంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉషశ్రీ కుటుంబ సభ్యులను సంప్రదించి.. రామాయణ, భారత, భాగవతాలను ప్రసారం చేసింది. ఇప్పుడు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని ఉషశ్రీ రామాయణం దేశవ్యాప్తంగా అన్ని ఎఫ్.ఎం.లలోనూ ప్రసారమవుతోంది. అయోధ్య రామాలయ పరిసరాల్లోనూ మార్మోగుతోంది. ఉత్తర భారతంలో ఉషశ్రీ రామాయణాన్ని వినిపించడం అది కూడా రాముని విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ప్రసారం చెయ్యడం తెలుగు వారందరికీ ఎంతో గర్వకారణం. -
శ్రీరాముని గుర్తుగా అక్బర్ ఏం చేశాడు?
ఆదర్శ పురుషునిగా పేరొందిన శ్రీరామునిపై మొఘల్ చక్రవర్తి అక్బర్ తన భక్తిని చాటుకున్నాడని చరిత్ర చెబుతోంది. శ్రీరాముని నాణాన్ని రూపొందించడమే కాకుండా పర్షియన్ భాషలోకి రామాయణాన్ని అనువదింపజేశాడు. మొఘలుల కాలంలో అక్బర్ చక్రవర్తిపై రాముని ప్రభావం అధికంగా ఉంది. నాటికాలంలో అక్బర్ ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రీ ప్యాలెస్లో ఎర్ర ఇసుకరాయిపై శ్రీరాముని ఆస్థానం చెక్కించాడు. అక్బర్ తల్లి హమీదా బాను బేగం ఉండే మరియమ్ మహల్లో ఒక స్తంభంపై శ్రీరాముని ఆస్థానంతోపాటు, హనుమంతుని చిత్రం కనిపిస్తుంది. అక్బర్ తల్లి హమీదా బాను బేగం రామాయణ, మహాభారత ఇతిహాసాలను అమితంగా ఇష్టపడేవారని అందుకే ఆమె నివాసభవనంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుని చిత్రాలు కనిపిస్తాయని మాజీ ఏఎస్ఐ డైరెక్టర్, పురావస్తు శాస్త్రవేత్త పద్మశ్రీ కేకే ముహమ్మద్ తెలిపారు. తన తల్లి ఆసక్తిని గమనించిన అక్బర్ రామాయణం, మహాభారతాలను పర్షియన్ భాషలోకి అనువదింపజేశారని చరిత్ర చెబుతోంది. అక్బర్ తల్లి నివాస భవనంలో శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తున్న పెయింటింగ్ కూడా కనిపిస్తుంది. -
'ప్రవచనం' కాలక్షేపం కోసం కాదు!
తూర్పుగోదావరి/రాజమహేంద్రవరం: రామకథ యథార్థ తత్త్వాన్ని తెలియచెప్పడమే లక్ష్యంగా తాను రామాయణాన్ని ప్రవచిస్తున్నానని, కాలక్షేపం కోసం కాదని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ఉద్ఘాటించారు. రాజమహేంద్రవరంలోని హిందూ సమాజంలో రుషిపీఠం మండల దీక్షగా శ్రీరామ మహాయజ్ఞం నిర్వహిస్తోంది. 42 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణ సారాన్ని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ప్రవచించి, రామభక్తులను పులకింపచేస్తున్నారు. జనవరి 23వ తేదీ వరకు రోజూ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఈ ప్రవచన మహాయజ్ఞం సాగనుంది. సీతారామలక్ష్మణుల పాదస్పర్శతో పునీతమైన గోదావరీ తీరం రామకథా ప్రవచన, స్మరణాలతో మారు మోగుతోంది. ‘రాజ’మహేంద్రి ‘రామ’మహేంద్రిగా మారింది! ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో సామవేదం ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... ఉత్తరకాండ అవాల్మీకం కాదు.. లోకంలో ఉత్తరకాండ వాల్మీకి మహర్షి విరచితం కాదనే మాట గట్టిగానే వినపడుతోంది. యుద్ధకాండలో పట్టాభిషేక సర్గలో ఫలశృతి చెప్పాక, తదనంతరం కథ ఉండదని వీరి వాదన. బాలకాండలో మహర్షి స్వయంగా చెప్పారు, షట్కాండలు రచించిన అనంతరం ఉత్తరకాండ రచించినట్లు....‘తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్భగవాన్ ఋషి’....బాలకాండలో స్పష్టంగా చెప్పారు. రామాయణంలో 24 వేల శ్లోకాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఉత్తరకాండలోని శ్లోకాలు కలుపుకుంటేనే ఈ సంఖ్య వస్తుంది. పురాణాదులలో అవతార పురుషుల ఆవిర్భావం చెప్పినట్లు, అవతార పరిసమాప్తి కూడా చెప్పడం సంప్రదాయం. రామావతార పరిసమాప్తి ఉత్తరకాండలో చూస్తాం. రామాయణంలోని కొన్ని సందేహాలకు మనకు ఉత్తరకాండలో సమాధానాలు కనపడతాయి–ఉదాహరణకు సుందరకాండలో హనుమంతుడిని చూసిన రావణుడు వచ్చినవాడు నందీశ్వరుడా అని అనుమానపడతాడు. రావణ, నందీశ్వరుల నడుమ జరిగినది మనకు ఉత్తరకాండలోనే గోచరిస్తుంది. ఉత్తరం అనే మాటకు సమాధానం అని అర్థం చెప్పుకోవచ్చు. నేటికీ చెదరని రామాయణ ప్రాధాన్యం! ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని విమర్శలు, దాడులు చేసినా రామాయణం ప్రాచుర్యం, ప్రాధాన్యం కోల్పోదు. త్రేతాయుగమైనా, కలియుగమైనా, ఏ యుగమైనా మానవధర్మం శాశ్వతమైనది. రాగద్వేషాలు, మానవ సంబంధాలు మారవు. మన స్వభావాలను తీర్చి దిద్దేది రామాయణం. ఈ భూమిపై చెట్లు, పర్వతాలు, నీరు ఉన్నంత కాలం రామాయణం ప్రచలితం కాక మానదు. ఇది బ్రహ్మవాక్కు. -
బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్.. ఆ పాత్రకు భారీగా డిమాండ్ చేసిన యశ్!
రామాయణం ఇతిహాసం ఆధారంగా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. ఈ ఏడాదిలోనే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ మరో బాలీవుడ్ డైరెక్టర్ పెద్ద సాహసానికి రెడీ అయ్యారు. రామాయణం ఆధారంగా భారీ ప్రాజెక్ట్ను ప్లాన్ చేశారు. (ఇది చదవండి: హీరోలను మించి రెమ్యునరేషన్.. ఆమె కోసం క్యూలో ఉండాల్సిందే!) ఆదిపురుష్ లాంటి ఫలితం వచ్చిన తర్వాత కూడా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ రామాయణం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. అంతే కాకుండా ఈ మూవీని భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుంది. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో రావణుడి పాత్రకు కన్నడ స్టార్, కేజీఎఫ్ హీరో యశ్ను చిత్రబృందం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం యశ్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. రావణుడి పాత్రకు దాదాపు రూ.150 కోట్లు డిమాండ్ చేశారని లేటేస్ట్ టాక్. అయితే ఇందులో నిజమెంతనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. తివారీ రామాయణం ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రం ద్వారానే యశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మరోవైపు కేజీఎఫ్-3 మూవీ కూడా చేయాల్సి ఉంది. (ఇది చదవండి: రన్ టైమ్ తగ్గించినా కలిసిరాలేదు.. టైగర్ నాగేశ్వరరావు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?) -
ఎప్పుడు పిలుస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: సాయి పల్లవి
దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న హీరోయిన్ సాయి పల్లవి. వచ్చిన అవకాశాలను కాకుండా నచ్చిన పాత్రలనే అంగీకరించి నటించే అతి కొద్దిమంది హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. ఈమె ఇప్పటివరకు లభించిన చిత్రాలన్ని అలాంటివే. గార్గీ వంటి మూవీ సక్సెస్ తర్వాత సాయి పల్లవి ఇప్పటి వరకు తెరపై కనిపించలేదు అంతకుముందు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన సాయి పల్లవి చాలా రోజులు సినిమాలేవీ లేకుండానే ఖాళీగానే ఉంది. అలా పలు అవకాశాలను తిరస్కరించిన ఈ సహజ నటికి తాజాగా భారీ బ్రహ్మాండ కథా చిత్రంలో నటించే అవకాశం వరించింది. (ఇది చదవండి: ఒకప్పుడు టాటా నానో.. ఇప్పుడు బీఎమ్డబ్ల్యూ - అట్లుంటది కిమ్ శర్మ అంటే!) అదీ పాన్ ఇండియా స్థాయిలో రామాయణం వంటి ఇతిహాసం నేపథ్యంలో రూపొందనున్న చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా సాయి పల్లవి అదృష్టమే అని చెప్పొచ్చు. అవును హిందీతో సహా పలు భాషల్లో అత్యంత భారీ బడ్జెట్లో రూపొందబోతున్న రామాయణం చిత్రంలో సాయి పల్లవి సీతగా నటించనున్నారు. ఈ చిత్రం గురించి అనధికారికంగా ఇప్పటివరకు చాలా ప్రచారం జరిగింది. కాగా నటి సాయి పల్లవి తొలిసారిగా రామాయణం చిత్రంలో సీతగా నటించబోతున్న విషయాన్ని దర్శకుడు నితీష్ తివారి తనను సీతగా ఎలా చూశారు అన్న భావనే తనను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందన్నారు. ఇది నిజంగానే తనను వరించిన అరుదైన అదృష్టంగా పేర్కొన్నారు. ఈ చిత్రం షూటింగ్కు ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఇది కచ్చితంగా తనకు సవాల్తో కూడిన పాత్ర అని పేర్కొన్నారు. ఎందరో ప్రఖ్యాత నటీమణులు పోషించిన పాత్ర అని.. వారు నటించిన దాంట్లో తాను 10 శాతం చేసిన బాగా నటించినట్లే అని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం కథ వినడానికి త్వరలోనే ముంబయికి వెళుతున్నట్లు చెప్పారు. కాగా ఇప్పటికే భారతీయ సినీ చరిత్రలో పలు రామాయణం గ్రంథాలు చిత్రాలుగా రూపొందాయని, ఇప్పటివరకు వాల్మీకి రామాయణాన్ని ఎవరు సంపూర్ణంగా తెరపై ఆవిష్కరించలేదని.. ఆ కొరతను తమ రామాయణం తీరుస్తుందనే భావనను వ్యక్తం చేశారు. కాగా ఈ రామ చరితం నేపథ్యంలో రామాయణం చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. (ఇది చదవండి: శ్రీలీల ఎవరి అమ్మాయో తెలిస్తే అంటూ షాకిచ్చిన అనిల్ రావిపూడి) -
మూడు పార్టులుగా 'రామాయణం' సినిమా.. సీతగా ఆ బ్యూటీ?
తింటే గారెలే తినాలి వింటే రామాయణమే వినాలి అన్నది ఫేమస్ సామెత. రామాయణ ఇతిహాసాన్ని ఎన్నిసార్లు, ఎన్నో భాషల్లో సినిమాగా తీసినా ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది. అది ఆ పుణ్య పురుషులైన సీతారాముల చరితం విశేషం. రామాయణం గురించి విపులంగా టీవీ సీరియలే తీశారు. ఇక చిత్రాలు చాలానే వచ్చాయి. ఇకపై కూడా వస్తూనే ఉంటాయి అనడానికి మరో నిదర్శనం తాజాగా రెడీ అవుతున్న రామాయణం మూవీనే. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!) ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్, మధు మంతెన ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటికీ బండి ముందుకు కదల్లేదు. ఇప్పుడు దీని గురించి అప్డేట్ వచ్చింది. 'దంగల్' ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణాసురుడిగా 'కేజీఎఫ్' యష్ నటించనున్నట్లు టాక్. కాగా రామాయణాన్ని మూడు భాగాలుగా తీయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెడతారట. మొదటి భాగంలో సీతారాములకు సంబంధించిన సీన్స్, రెండవ భాగంలో రావణుడు సీతని లంకకు తీసుకెళ్లడం.. రామ, రావణాసురుల యుద్ధ సన్నివేశాలు ఉంటాయని ఇక మూడో భాగంలో లవకుశల పుట్టుకకు సంబంధించిన అంశాలు ఉంటాయని తెలుస్తోంది. పదేళ్ల ముందు తెలుగులో 'శ్రీరామరాజ్యం' చిత్రంలో నయనతార సీతగా మెప్పించారు. 'ఆదిపురుష్'లో కృతిసనన్ సీతగా నప్పలేదని అన్నారు. దీంతో సాయిపల్లవి సీతగా ఎలా ఉంటుందా అని ఇప్పటి నుంచే డిస్కషన్ మొదలైంది. (ఇదీ చదవండి: మెగా ఇంట మొదలైన పెళ్లి సందడి.. చిరంజీవి ట్వీట్ వైరల్!) -
మైరావణుని ప్రాణాలు తుమ్మెద రూపంలో
లంకలో రామ రావణ యుద్ధం జరుగుతోంది. వానరసేన ధాటికి, రామలక్ష్మణుల పరాక్రమానికి రాక్షస వీరులు ఒక్కొక్కరే హతమైపోయారు. చివరకు మహాబలశాలి అయిన రావణుడి సోదరుడు కుంభకర్ణుడు, దేవేంద్రుడిని సైతం జయించిన మేఘనాదుడు హతమైపోయారు. దిక్కుతోచని స్థితిలో పడ్డాడు రావణుడు. ఒంటరిగా కూర్చుని, తన మేనమామ మైరావణుడిని తలచుకున్నాడు. మైరావణుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. రావణుడి పరిస్థితి తెలుసుకున్నాడు. ‘రావణా! విచారించకు. నా మాయాజాలాన్ని దాటి రాముడైనా, దేవుడైనా అంగుళం దాటి అవతలకు పోలేరు. రామలక్ష్మణులిద్దరినీ బంధించి, రేపే వాళ్లను దుర్గకు బలి ఇస్తాను’ అని ధైర్యం చెప్పాడు. విభీషణుడికి చారుల ద్వారా సంగతి తెలిసి, సుగ్రీవుడిని, వానరులను అప్రమత్తం చేశాడు. రామలక్ష్మణులకు కట్టుదిట్టంగా కాపాడుకోవాలని చెప్పాడు. వెంటనే హనుమంతుడు తన తోకను భారీగా పెంచి, రామలక్ష్మణుల చుట్టూ రక్షణవలయంలా ఏర్పాటు చేసి, తోకపై కూర్చుని కాపలాగా ఉన్నాడు. మైరావణుడికి ఇదంతా తెలిసి, రామలక్ష్మణులను తస్కరించుకు తెమ్మని సూచీముఖుడనే అనుచరుణ్ణి పంపాడు. హనుమంతుడి వాలవలయం లోపలికి సూక్ష్మరూపంలో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. హనుమంతుడి వాల రోమాలను తాకడంతోనే అతడి ముఖం రక్తసిక్తం కావడంతో వెనుదిరిగాడు. సూచీముఖుడి వల్ల పని జరగకపోవడంతో పాషాణముఖుడిని పంపాడు. వాడు హనుమంతుడి వాలవలయాన్ని తన రాతిముఖంతో బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తే, వాడి ముఖమే బద్దలైంది. చివరకు మైరావణుడే స్వయంగా రంగంలోకి దిగాడు. మాయోపాయాలలో ఆరితేరిన మైరావణుడు హనుమంతుడి వద్దకు విభీషణుడి రూపంలో వచ్చాడు. ‘హనుమా! రామలక్ష్మణులు సురక్షితమే కదా! రాక్షసులు మాయావులు. నేనొకసారి లోపలకు పోయి రామలక్ష్మణులను చూసి వస్తాను’ అన్నాడు. హనుమంతుడు తోకను సడలించి, అతడు లోపలకు పోయేందుకు మార్గం కల్పించాడు. లోపలకు చొరబడిన మైరావణుడు రామలక్ష్మణులను చిన్న విగ్రహాలుగా మార్చి, తన వస్త్రాల్లో దాచి పెట్టుకుని ఏమీ ఎరుగనట్లు బయటకు వచ్చాడు. ‘రామలక్ష్మణులు గాఢనిద్రలో ఉన్నారు. జాగ్రత్త’ అని హనుమంతుడితో చెప్పి, అక్కడి నుంచి తన పాతాళ లంకకు వెళ్లిపోయాడు. వారిని ఒక గదిలో బంధించి, తన సోదరి దుర్దండిని వారికి కాపలాగా పెట్టాడు. కాసేపటికి విభీషణుడు వచ్చాడు. ‘హనుమా! రామలక్ష్మణులు క్షేమమే కదా! ఒకసారి లోపలకు పోయి చూద్దాం’ అన్నాడు. ‘విభీషణా! ఇందాకే కదా వచ్చి వెళ్లావు. ఇంతలోనే మళ్లీ ఏమొచ్చింది’ అడిగాడు హనుమంతుడు. హనుమంతుడి మాటలతో విభీషణుడు ఆందోళన చెందాడు. ‘హనుమా! ఇంతకుముందు నేను రాలేదు. ఇదేదో మైరావణుడి మాయ కావచ్చు. చూద్దాం పద’ అన్నాడు. ఇద్దరూ లోపల చూశారు. రామలక్ష్మణులు కనిపించలేదు. విభీషణుడికి పరిస్థితి అర్థమైంది. ‘హనుమా! మనం క్షణం కూడా ఆలస్యం చెయ్యవద్దు’ అంటూ తనతో హనుమంతుడిని పాతాళ లంకకు తీసుకుపోయాడు. కావలిగా ఉన్న దుర్దండితో విభీషణుడు ‘భయపడకు. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారో చెప్పు’ అన్నాడు. ‘రామలక్ష్మణులను తెల్లారే బలి ఇవ్వడానికి మైరావణుడు సిద్ధమవుతున్నాడు. వారు ఇదే గదిలో ఉన్నారు’ అని చూపింది. హనుమంతుడు గది తలుపులు బద్దలుకొట్టాడు. ఆ శబ్దానికి కాపలాగా ఉన్న రాక్షసభటులు పరుగు పరుగున ఆయుధాలతో అక్కడకు వచ్చారు. హనుమంతుడు భీకరాకారం దాల్చి, వారందరినీ దొరికిన వారిని దొరికినట్లే మట్టుబెట్టసాగాడు. పాతాళలంకలో రాక్షసుల హాహాకారాలు మిన్నుముట్టాయి. ఈ కలకలం విని మైరావణుడే స్వయంగా వచ్చాడు. రాక్షసులపై వీరవిహారం చేస్తున్న హనుమంతుడితో కలబడ్డాడు. మైరావణుడు తన మీద ప్రయోగించిన ఆయుధాలన్నింటినీ హనుమంతుడు తుత్తునియలు చేశాడు. చివరకు ఇద్దరూ బాహాబాహీ తలపడ్డారు. హనుమంతుడు ఎన్నిసార్లు తన పిడికిటి పోట్లతో ముక్కలు ముక్కలుగా చేసినా, మళ్లీ అతుక్కుని మైరావణుడు లేచి తలపడుతున్నాడు. హనుమంతుడు ఆశ్చర్యపడ్డాడు. ఇదంతా గమనించిన దుర్దండి ‘మహావీరా! కలవరపడకు. వీడి పంచప్రాణాలు ఐదు తుమ్మెదల రూపంలో ఉన్నాయి. ఆ తుమ్మెదలను ఈ బిలంలోనే దాచి ఉంచాడు’ అంటూ ఆ బిలాన్ని చూపించింది. బిలానికి మూసి ఉన్న రాతిని హనుమంతుడు పిడికిటి పోటుతో పిండి పిండి చేశాడు. బిలం నుంచి తుమ్మెదలు భీకరంగా ఝుంకారం చేస్తూ హనుమంతుడి మీదకు వచ్చాయి. హనుమంతుడు ఒక్కొక్క తుమ్మెదనే పట్టి, తన కాలి కింద వేసి నలిపేశాడు. ఐదు తుమ్మెదలూ అంతమొందడంతోనే, మైరావణుడు మొదలు తెగిన చెట్టులా కుప్పకూలిపోయాడు. రామలక్ష్మణులను విభీషణుడిని తన భుజాల మీద, వీపు మీద కూర్చోబెట్టుకుని హనుమంతుడు శరవేగంగా లంకలోని యుద్ధ స్థావరానికి చేరుకున్నాడు. జరిగినదంతా తెలుసుకుని సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు. హనుమంతుణ్ణి అభినందించాడు. ∙సాంఖ్యాయన (చదవండి: విఘ్నేశ్వరుని పూజ తరువాత వాయనదానం మంత్రం ) -
రాముడిగా రణ్బీర్.. రావణుడిగా యశ్?
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి.. ఇంకొన్ని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామాయణం ఆధారంగా అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా ఓ సినిమాను నిర్మించనున్నట్లుగా ప్రకటన వచ్చి దాదాపు మూడేళ్లు ముగిసింది. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. దాంతో ఈ చిత్రం నిలిచి΄ోయిందా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని, ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని నిర్మాతలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్ను ఆరంభించాలని నిర్మాతలు అనుకుంటున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్ర దర్శకుడు నితీష్ తివారి ఈ సినిమా పనులను మరింత వేగవంతం చేశారని బాలీవుడ్లో వినిపిస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట. రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, హనుమంతుడు వంటి ప్రధాన పాత్రలకు ఆర్టిస్టులను ఎంపిక చేసి, లుక్ టెస్ట్ను నిర్వహించేందుకు నితీష్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా ఆలియా భట్, రావణుడి పాత్రలో యశ్లు నటించనున్నారని, ముందు వీరి లుక్ టెస్ట్ జరుగుతుందని టాక్. మరి.. ఈ ‘రామాయణం’లో రియల్ లైఫ్ జంట ఆలియా, రణ్బీర్ సీతారాములుగా కనిపిస్తారా? ‘కేజీఎఫ్’లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో విజృంభించిన యశ్ ఈ చిత్రంలో రావణుడిగా బీభత్సం సృష్టిస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
మందు కొట్టి తీశారా?.. ఆదిపురుష్ మేకర్స్పై నటుడు ఆగ్రహం!
ప్రభాస్, కృతి సనన్ జంటగా ఆదిపురుష్ చిత్రంపై విమర్శలు ఇంకా ఆగడం లేదు. దర్శకుడు ఔం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏ మూహుర్తనా మొదలెట్టాడో ఆది నుంచి విమర్శల పాలవుతోంది. టీజర్ మొదలు సినిమా రిలీజ్ తర్వాత కూడా పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తాయి. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో కొన్ని పాత్రలు, డైలాగ్స్, కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు మాజీ నటులు మేకర్స్పై మండిపడ్డారు. ఆ తర్వాత ఆదిపురుష్ టీం తమ తప్పులను అంగీకరించిన సినిమాలో మార్పులు కూడా చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఆయనతో డేటింగ్.. నా జీవితమే నాశనమైంది: టాప్ హీరోయిన్) అయితే తాజాగా మరో నటుడు ఆదిపురుష్ మేకర్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ విందు ధారా సింగ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా హనుమంతుని పాత్రను వక్రీకరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. విందు ధారా సింగ్ చాలాసార్లు హనుమంతుడి పాత్రను తెరపై పోషించాడు. అంతే కాకుండా అతని తండ్రి, దివంగత నటుడు ధారా సింగ్, రామానంద్ సాగర్ టీవీ షో రామాయణంలో హనుమంతుడి పాత్రను కూడా పోషించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విందు ధారా సింగ్.. ఆదిపురుష్ నిర్మాతల తీరును ఎండగట్టారు. హనుమంతుడిగా నటించిన దేవదత్తా నాగేపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. హనుమంతుడు పవర్ఫుల్గా, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. ఆ పాత్రలో నటించిన దేవదత్తా నాగే హిందీలో కూడా సరిగ్గా మాట్లాడలేడు. అతడికి ఇచ్చిన డైలాగ్లతో ఆ పాత్రను మరోవిధంగా చూపారు. ఈ విషయంలో నిర్మాతలు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. హనుమంతుడి పాత్రలో తన తండ్రి ధారా సింగ్ చరిత్ర సృష్టించాడని.. ఆయన నటనకు మీరు దరిదాపుల్లోకి కూడా రాలేరని అన్నారు. విందు ధారా సింగ్ మాట్లాడుతూ.. 'వీళ్లు చేసిన పని చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది. మందు తాగి వచ్చారో కానీ.. వాళ్లు ఏం ఆలోచిస్తున్నారో కూడా వాళ్లకు తెలియదు. ఇంత భారీ బడ్జెట్తో అద్భుతమైన సినిమా తీసే గోల్డెన్ ఛాన్స్ నాశనం చేశారు. వారు తమాషా చేస్తూ కథతో ఆడుకున్నారు. అందుకే ఆదిపురుష్ తీవ్రంగా నిరాశపరిచింది.' అన్నారాయన. ఆదిపురుష్ వివాదం ఆదిపురుష్ చుట్టూ ఉన్న వివాదాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. సినిమా నిర్మాతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ గత నెలలో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముంబై పోలీసులకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ సెన్సార్ బోర్డు, చిత్ర నిర్మాతలపై తీవ్ర స్థాయిలో మడిపడింది. సెన్సార్ బోర్డ్ ఏం చేస్తోంది? మీరు భవిష్యత్ తరాలకు ఏం నేర్పాలనుకుంటున్నారు?" అని కోర్టు ప్రశ్నించింది. డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా.. ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. -
రామాయణం ఎన్నిరకాలు ? రామాయణం ఎన్నిరకాలు ?
-
‘టీవీ రాముడి’ పాదాల చెంత అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లాడిని ఉంచగానే..
‘ఆది పురుష్’ సినిమాపై జరుగుతున్న హంగామా ఇప్పట్లో చల్లారేలా లేదు. రామాయణం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను చూసినవారంతా దర్శకనిర్మాత రామానంద్సాగర్ రూపొందించిన టీవీ రామాయణాన్ని గుర్తు చేసుకుంటున్నారు. టీవీ రామాయణంలో రాముని పాత్ర పోషించిన నటుడు అరుణ్ గోవిల్ కూడా ‘ఆది పురుష్’ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రామాయణం రూపొందించినప్పుడు దానిని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దామని, అందుకే ఇప్పటికీ నాటి రామాయణం సీరియల్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందన్నారు. సోషల్ మీడియాలో ‘ఆది పురుష్’సినిమాపై స్పందించిన ఆయన గతంలో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని వివరించారు. గతంలో ఒకసారి తనను సాక్షాత్తూ శ్రీరామునిగా భావించిన ఒక మహిళ తన పాదాల చెంత అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడిని ఉంచిందన్నారు. అప్పుడు తాను అనారోగ్యంతో బాధపడుతున్న ఆ పిల్లివాడిని ఆసుపత్రికి తీసుకువెళ్లాలలని చెబుతూ, పిల్లాడి ఆరోగ్యం కోసం ప్రార్థించానన్నారు. తరువాత ఆమె తన చేతిని ఆ కుర్రాడి తలపై ఉంచాలని కోరిందన్నారు. తరువాత ఆమె ఆ పిల్లాడిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిందన్నారు. మూడు రోజుల తరువాత ఆ మహిళ తన పిల్లాడిని తీసుకుని తిరిగి సెట్కు వచ్చిందని, అప్పుడు అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారన్నారు. ఆ పిల్లాడు అనారోగ్యం నుంచి కోలుకుని ఆడుకుంటున్నాడని అరుణ్ గోవిల్ తెలిపారు. దేశంలో శ్రీరామునిపై ప్రజలకు భక్తిశ్రద్ధలు ఆ స్థాయిలో ఉంటాయని అరుణ్ గోవిల్ దీనిని ఉదహరించారు. ఏ మతానికి సంబంధించిన సినిమా రూపొందించినా, అది విలువలతో కూడి ఉండాలని ఆయన సూచించారు. దేశంలోని ప్రజలు శ్రీరాముని పాత్రను ఎంతో గొప్పగా చూస్తారని, అందుకే ఓం రౌత్ రూపొందించిన రామాయణంలో విలువలు లేవని విమర్శిస్తున్నారన్నారు. రామాయణం రూపకల్పన విషయంలో తగిన విధంగా ఆలోచించి ఉంటే, ఇన్ని విమర్శలు వచ్చేవికావని, పైగా ప్రేక్షకులు మెచ్చుకునేవారన్నారు. ఇది కూడా చదవండి: ‘ఆదిపురుష్’ హనుమంతుని కండల రహస్యం ఇదేనట! -
ప్రభాస్ 'ఆదిపురుష్'.. ఆ రెండు మినహాయిస్తే: రామాయణ నటుడు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. ఈనెల 16న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం తొలిరోజు నుంచే మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. తొలిరోజే రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కానీ అంతే అంతేస్థాయిలో విమర్శల దాడి ఎదుర్కొంది. (ఇది చదవండి: ‘ఆదిపురుష్’ చూసి నిజంగా సిగ్గుపడుతున్నా.. ఓం రౌత్కు ఇవన్నీ అవసరమా?) తాజాగా రామాయణం టీవీ సీరియల్లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహ్రీ ఆదిపురుష్ చిత్రం చూశానని తెలిపారు. అయితే ఈ చిత్రంలో రెండు అంశాలు మాత్రమే తనకు నచ్చాయని వెల్లడించారు. కానీ ఈ సినిమా చూసేందుకు ఎందుకు వచ్చానా? అనిపించిందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదిపురుష్ తనను తీవ్రంగా నిరాశపర్చిందన్నారు. సునీల్ లహ్రీ మాట్లాడుతూ.. 'నేను ఆదిపురుష్ సినిమా చూశా. ఈ చిత్రంపై నాకు చాలా ఆశలు పెట్టుకున్నా. కానీ చాలా నిరాశకు గురి చేసింది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు ఈ చిత్రం ఎవరు తీశారు? నేను ఎందుకు సినిమా చూసేందుకు వచ్చానా అనిపించింది. హనుమాన్ను ఓ వీధి భాష మాట్లాడే వారిలా చూపించారు. సినిమాలో నాకు నచ్చినవి రెండే అంశాలు బాగున్నాయి. ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ. ఈ రెండు మినహాయిస్తే ఈ మూవీ చూసిన వారికి నిరాశ తప్పదు. సినిమా థియేటర్లో నా పక్కన కూర్చున్నవారు సైతం సినిమా బాగాలేదన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ తప్పా.. చిత్రంలో ఏం లేదని అన్నారు. మరో వ్యక్తి మాట్లాడుతూ రామాయణం పేరుతో ప్రజలకు ఏం చూపిస్తున్నారంటూ మండిపడ్డారని.' తెలిపారు. (ఇది చదవండి: 'ఏజెంట్'పై ఆ నిర్మాత కామెంట్స్.. దేవుడు కాపాడాడని! ) -
ఆదిపురుష్ సినిమా చూడలేదు, నా విజ్ఞప్తి మాత్రం ఇదే!: ‘రామాయణ్’ సీత
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ టీజర్ నుంచి సినిమా రిలీజైన కూడా వివాదాలు వదలడం లేదు. మొదటి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ చిత్రంలోని హనుమంతుని డైలాగ్స్, పాత్రల వేషధారణను తప్పుబడుతున్నారు. అసలు రామాయణాన్ని వక్రీకరించారంటూ రోజు రోజుకు ఆదిపురుష్పై చిత్రబృందంపై మండిపడుతున్నారు. ఇప్పటికే శక్తిమాన్ నటుడు ముకేశ్ ఖన్నా దర్శకుడు ఔం రౌత్కు రామాయణం గురించి కొంచెం కూడా అవగాహన లేదని విమర్శించారు. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు!) తాజాగా రామాయణం సీరియల్లో సీత పాత్ర పోషించి నటి దీపికా చిక్లియా ఆదిపురుష్ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పురాణ, ఇతిహాసాలైన రామాయణంపై సినిమాలు తీయడం ఆపేయాలని దీపికా విజ్ఞప్తి చేశారు. ఆదిపురుష్పై మాట్లాడుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారమె. పాఠశాలల్లో విద్యార్థులకు పురాణాన్ని తప్పనిసరిగా బోధించాలని సూచించారు. రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణం సీరియల్లో దీపిక సీత పాత్ర పోషించింది. దీపికా మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమా గురించి నేను కామెంట్స్ చేయదలచుకోలేదు. నేను ఇంకా సినిమా చూడలేదు. కానీ నేను భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా. రామాయణం మన వారసత్వం. దీనిపై ఇక నుంచి సినిమాలు చేయకూడదనేది నా ఉద్దేశం. రామాయణంపై సినిమా చేసిన ప్రతిసారీ ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. రామాయణం మనకు చాలా పవిత్రమైనది. ఈ విషయంలో ఎవరినీ నొప్పించకూడదనుకుంటున్నా. మన విశ్వాసాన్ని మనం గౌరవించుకుందాం. రామాయణం అనేది వినోదానికి సంబంధించినది కాదు.' అని అన్నారామె. కాగా.. ఇప్పటికే దీపికా సహనటుడు అరుణ్ గోవిల్ కూడా ఆదిపురుష్ హాలీవుడ్ కార్టూన్ సినిమా అంటూ ఎద్దేవా చేశారు. కాగా.. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: చరణ్ కంటే ఉపాసన ఆస్తుల విలువే ఎక్కువా? ఎన్ని కోట్లో తెలిస్తే..) View this post on Instagram A post shared by Dipika (@dipikachikhliatopiwala) -
‘ఆదిపురుష్’ చూసి నిజంగా సిగ్గుపడుతున్నా.. ఓం రౌత్కు ఇవన్నీ అవసరమా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. ఈనెల 16న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం తొలిరోజు నుంచే మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. తొలిరోజే రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. అంతేస్థాయిలో విమర్శల పాలైంది. రోజు రోజుకు ఈ చిత్రాన్ని విమర్శించే వారి సంఖ్యం పెరుగుతోంది. తాజాగా రామాయణం టీవీ సీరియల్లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహరి ఆదిపురుష్ చిత్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా వాస్తవానికి చాలా దూరంగా ఉందని విమర్శించారు. (ఇది చదవండి: 'సలార్' కొత్త పోస్టర్లో 'కేజీఎఫ్' కనెక్షన్.. గమనించారా? ) సునీల్ లహరి మాట్లాడుతూ.. 'వాల్మీకి రామాయణం ఆధారంగా సినిమా తీస్తున్నామని డిస్క్లెయిమర్లో స్పష్టంగా చెప్పడం చాలా నిరుత్సాహానికి గురిచేసింది. అలా ఎందుకు చెప్పారని నేను నిజంగా సిగ్గుపడుతున్నా. ఇది కేవలం ఫాంటసీ అని చెప్పి.. అందుకు భిన్నంగా తీశారు. పుష్పక విమానంతో రావణుడిని చూపించలేదు. మేఘనాథ్, లక్ష్మణ్ యుద్ధాన్ని నీటిలో చూపించారు. డైలాగులు చాలా దారుణంగా ఉన్నాయి. ఏ పాత్ర క్యారెక్టరైజేషన్ కూడా స్పష్టంగా లేదు. దర్శకుడు చాలా గందరగోళంగా ఉన్నట్లు కనిపించింది. అసలు ఈ సినిమా ఎందుకు తీశాడో తెలియదు. స్పెషల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్తో మాత్రమే సినిమాని నిలబెట్టలేరు. ఎందుకంటే రామాయణం గురించి సరళంగా చెప్పాలి. హనుమంతునితో ఎలాంటి పాత్రను క్రియేట్ చేశారో.. ఎలాంటి డైలాగులు చెప్పారో అర్థం కావడం లేదు. ' అని అన్నారు. సినిమాలోని పాత్రలపై గురించి ఆయన మాట్లాడుతూ.. 'ఆదిపురుష్లో పాత్రలు చూసి నిజంగా ఆశ్చర్యపోయా. రావణుడు అత్యంత సుందరమైన దేశానికి రాజు. అలా ఎందుకు చూపించారో నాకు తెలియదు. సినిమాలో నకిలీ సీతను తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్లు కథను సింపుల్గా చెప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. నాకు ఈ సినిమాలో అన్ని పాత్రలూ అయోమయంగా కనిపించాయి. వాటిలో ఏదీ స్పష్టంగా రాలేదు. ఇది నటీనటుల తప్పు కాదు. వారి పాత్రలను స్పష్టంగా లేనందున అలా జరిగింది. ఓం రౌత్ సెన్సిబుల్ డైరెక్టర్ అనుకున్నా. ఈ సినిమా తీయడంలో ఆయన మరింత తెలివిగా వ్యవహరించాల్సింది.' అని అన్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్.. తీవ్ర విమర్శలు చేసిన నటుడు) -
‘ఆది పురుష్’ను చీల్చిచెండాడిన ‘టీవీ రాముడు’
దర్శకనిర్మాత రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణం గతంలో టీవీలో ప్రసారమై, కొన్నేళ్ల పాటు ప్రేక్షకులను అమితంగా అలరించింది. దానిలో రాముని పాత్ర పోషించి, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు అరుణ్ గోవిల్ తాజాగా విడుదలైన ‘ఆది పురుష్’ సినిమాపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించారు. హీరో ప్రభాస్ నటించిన ‘ఆది పురుష్’ జూన్ 16న భారీ స్థాయిలో విడుదలయ్యింది. ఇది మొదలు ఈ సినిమాపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరికి రాముని లుక్ నచ్చకపోగా, మరికొందరికి హనుమంతుని భాష నచ్చలేదు. మరికొందరు అభిమానులు ‘ఆది పురుష్’లో కొన్ని సీన్స్పై లెక్కలేన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అలనాడు టీవీలో ప్రసారమైన రామాయణంలో రాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ ‘ఆది పురుష్’ సినిమాపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రామాయణం భారతీయ సంస్కృతికి ప్రతిబింబమని, అయితే ఇప్పుడు ఈ రామాయణం(సినిమా) గురించి రరకాల వాదనలు వినిపిస్తున్నాయన్నారు. రామాయణ కథను, రాముని స్వరూపాన్ని మార్చి చూపించాల్సిన అవసరం లేదన్నారు. ‘ఆధ్యాత్మికతకు అపహాస్యం’ రామాయణం మనకు ఒక ఆధ్యాత్మిక మార్గం. మనకు ధైర్యన్ని అందించే ఉత్తమ గ్రంథం. దీనిని ఎవరైనా అపహాస్యం చేస్తే, స్వీకరించాల్సిన అవసరం లేదు. రామాయణాన్ని ఆధునికమని, సంప్రదాయమని విడదీయడం తగదు. సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్, ప్రెజెంటేషన్ విషయాన్ని పక్కన పెడితే, క్యారెక్టర్లను సరైన రీతిలో చూపించడం తప్పనిస అని అరుణ్ గోవిల్ పేర్కొన్నారు. రాముడు, సీత, హనుమంతుడు మొదలైన క్యారెక్టర్ల విషయంలో ఆధునికం, సంప్రదాయం అని విడదీయడం తగదు. ఈ క్యారెక్టర్ ఆద్యనంతాలు. అంటే ఎప్పటికీ ఒకేలా ఉండేవి. అందుకే అదే స్వరూపాన్ని ఈ సినిమాలో చూపిస్తే తప్పేముంది? అని ప్రశ్నించారు. ‘ఆది పురుష్’ సినిమా నిర్మాతలు దీనిని రూపొందించేముందు ఏ తరహా ప్రేక్షకులకు ఈ కథను చూపించాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ఉండాల్సిందన్నారు. ‘ఇటువంటి భాష తగదు’ ‘ఆది పురుష్’ సినిమాలో వాడిన భాషపై పలు విమర్శలు వస్తున్నాయని అరుణ్ గోవిల్ ఆరోపించారు. ‘ఆది పురుష్’ సినిమాలో గౌరవప్రదమైన భాష వాడాలని అన్నారు. రామాయణ మూల భావనను తొలగించాల్సిన అవసరం ఏమివచ్చిందన్నారు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో రామాయణాన్ని చూపించాలనుకోవడం సరైనది కాదన్నారు. ఇది కూడా చదవండి: ‘మేం తీసింది రామాయణం కాదు’ -
రామాయణంపై ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ సీరియస్
పాట్నా: రెబల్స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాపై ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. ఈ చిత్రం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని.. హిందువులకు పవిత్రమైన ఇతిహాస రామాయణాన్ని హేళన చేసేలా ఉందంటూ హిందూసేన అభ్యంతరం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఇదిలా ఉండగా.. రామాయణంపై ఆర్జేడీ ఎమ్మెల్యే రిత్లాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామాయణాన్ని మసీదులో రాశారని దనపూర్ ఆర్జేడీ ఎమ్మెల్యే యాదవ్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్గా దుమారం రేపుతున్నాయి. ఇక, యాదవ్ వ్యాఖ్యలపై జేడీ(యూ) స్పందించింది. యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని భాగస్వామ్య పార్టీ జేడీ(యూ) పేర్కొంది. యాదవ్ అంతటితో ఆగకుండా 11 ఏండ్ల ముస్లిం బాలిక భగవద్గీతను పఠించి మెడల్ను గెలుచుకున్నప్పుడు హిందుత్వవాదులు నోరుమెదపలేదని అన్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలెవరూ ఎందుకు ప్రస్తావించలేదని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. మరోవైపు.. యాదవ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. रामचरित मानस मस्जिद में लिखी गई थी, इतिहास उठाकर देखिए," RJD के विधायक रीतलाल यादव का बयान। #RitlalYadav #Ramcharitmanas pic.twitter.com/Cl1JxDlDjK — The Hint News (@TheHintNews) June 16, 2023 ఇది కూడా చదవండి: పొలిటికల్ స్టంట్.. కాంగ్రెస్కు బిగ్ ఆఫరిచ్చిన ఆప్ -
త్వరలోనే మరో రామాయణం.. రాముడు, సీతగా వారిద్దరే!
రామాయణ ఇతిహాసం ఆధారంగా ప్రభాస్ ఆదిపురుష్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. కృతిసనన్ జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 16న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రామాయణాన్ని తెరకెక్కిస్తున్నట్లు టీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ ఫిలిం మేకర్ నితేశ్ తివారీ, నిర్మాత మధు మంతెనతో కలిసి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: ఫోటోలు షేర్ చేసి ట్రోలర్స్కు గట్టిగానే రిప్లై ఇచ్చిన నటి) అయితే ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్బీర్కపూర్ను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. సీత పాత్రకు బాలీవుడ్ భామ ఆలియా భట్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తాజాగా దర్శకుడు నితేశ్ తివారీతో అలియా భట్ కనిపించడంతో ఓకే చెప్పారని సమాచారం. కానీ గతంలో సీతగా సాయిపల్లవి కనిపించనుందని వార్తలొచ్చాయి. ఇక ఈ సినిమాలో రావణుడి పాత్రకు కేజీయఫ్ హీరో యశ్ను ఓకే చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో ఈ ప్రాజెక్ట్ గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ..'నేను కొందరు నిర్మాతలతో కలిసి రామాయణాన్ని నిర్మిస్తున్నా. దాని కోసం నాలుగేళ్లుగా వర్క్ జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ తర్వాత ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉంటాయి. ఇది చాలా పెద్ద ప్రయత్నం. పూర్తవ్వడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఇండియాలోనే అతి భారీ బడ్జెట్ సినిమాగా నిలుస్తుందని'. చెప్పారు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ వాయిదా పడనుందనే వార్తలపై తాజాగా నిర్మాత మధు మంతెన స్పందించారు. ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రారంభించనున్నాం. దయచేసి ఇలాంటివి ప్రచారాన్ని నమ్మకండి అని అన్నారు. దీంతో మరో ఆదిపురుష్ రాబోతోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: అతనిపై విపరీతమైన క్రష్.. కానీ నన్ను మోసం చేశాడు: హీరోయిన్) -
Ramayana and Indian poetry: వాటిని ఎందుకు చదవాలి?
మనిషి జీవితంలో సంతరించుకోవలసిన గొప్ప గుణాలను గురించి గురజాడ అప్పారావుగారు ఒకచోట ఇలా అన్నారు... ‘‘ ఈవియుదియ్యని మాటయు భావంబున జేయతగిన పనితెలియుటయున్ ఠీవియగు ధైర్యభావము రావు సుమీ యొకని వలన రావలె తనతోన్’’... ఈవియు .. అంటే త్యాగం. మనిషి తనకుతాను సుఖపడితే తప్పుకాదు. మనిషి త్యాగంతో గొప్పవాడు అవుతాడు. ఇతరుల గురించి ఆలోచించి, వాళ్ళను కష్టాల్లోంచి పైకి తీసుకురావడానికి.. తాను ఎంత శక్తిని వినియోగించుకోగలడో, అంత శక్తినీ, ఏ విధమైన గుర్తింపునీ కోరకుండా అది తన కర్తవ్యం అన్న భావనతో ప్రేమ భావనతో చేయదగిన వ్యక్తి ఎవరున్నారో ఆయన త్యాగశీలి. అటువంటి మహానుభావులు ఎందరో పుట్టకపోతే అసలీ దేశానికి స్వాతంత్య్రం ఎలా సిద్ధించి ఉండేది? మన దగ్గర విషయమే తీసుకుంటే... బెజవాడ గోపాలరెడ్డి గారు పుట్టుకతో శ్రీమంతుడయినా దేశంకోసం చాలా శ్రమించాడు, చివరకు జైళ్ళకు కూడా వెళ్ళాడు. ఆయనకేం కర్మ! అలాగే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆరోజుల్లో లక్షల సంపాదన ఉన్న న్యాయవాద వృత్తిని వదిలి దేశంకోసం సర్వస్వం ధారపోశారు. స్వాతంత్య్రోద్యమ విశేషాలను, సందేశాలను ప్రజలకు చేరవేయడానికి తన స్వార్జితంతో ‘స్వతంత్ర’ పత్రిక నడిపారు. లక్షలు ఖర్చుపెట్టారు... అటువంటి వారిది త్యాగమయ జీవితం. అంటే... త్యాగం మనిషిని శాశ్వతమైన కీర్తికి అర్హుణ్ణి చేస్తుంది. తియ్యని మాటలు మాట్లాడడం ఒక మంచి సంస్కారం. తిరస్కరించవలసి వచ్చిన సందర్భాల్లోనూ ఎదుటివారిని నొప్పించకుండా మృదువుగా మాట్లాడగలగాలి. హనుమ నూరు యోజనాల సముద్రాన్ని దాటిపోతున్నప్పుడు మార్గమధ్యంలో మైనాకుడు తన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలని కోరితే... కటువుగా తిరస్కరించలేదు. ‘‘నాయనా! రామకార్యం మీద పోతున్నాను. వేళ మించిపోతోంది. నీవు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను పుచ్చుకున్నట్లే...’’ అంటూ మృదువుగా చేతితో స్పృశించి వెళ్ళాడు తప్ప... ఎక్కడా కటువుగా మాట్లాడలేదు. రామాయణ భారతాది కావ్యాలు ఎందుకు చదవాలంటే... మాట మధురంగా ఉండడం కోసం, సంస్కారవంతమైన వాక్కు తయారవడం కోసం, మాట పదిమందికి పనికొచ్చేదిగా ఉండడం కోసం చదువుకుంటారు. ఎవ్వరికీ ఉపకారం చేయలేకపోవచ్చు. మనం చెప్పే ఓదార్పు మాటలు ఎదుటి వాళ్ళకు స్వాంతన కలిగిస్తాయి. చెడు మార్గంలో ఉన్న వాళ్లను మంచిమార్గం వైపు మళ్ళిస్తాయి. భావంబున చేయదగిన పనిచేయుటయున్... భావం మనోగతం. తాను ఏ పనిచేయాలో ఆ పనినే మనసు తనకు జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆ వ్యక్తి గొప్ప శీలవంతుడవుతాడు. అటువంటి సౌశీల్యం ఉండాలి. ఠీవియగు ధైర్య భావము... ఠీవి అంటే వైభవం.. పిరికితనం చూపకుండా తెగువ, పోరాట పటిమ చూపే సందర్భంలో కాకుండా... ఇక్కడ ధైర్యం అంటే... ఎంత కష్టం కలిగినా ఓర్చుకుని నిలబడి ప్రయత్నాన్ని కొనసాగించి కృతకృత్యులు కావడం.. ఆయన ధైర్యశాలి. ఆ ధైర్యం వైభవోపేతం... ఇటువంటి గొప్పగుణాలు జన్మతః లేకపోయినా ప్రతివారూ ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. -
గురువాణి: పాతకొత్తల గొడవ మనకెందుకు!!!
అభ్యుదయం అంటే సమాజానికి మేలు చేయడం. మనుషులలో మంచి గుణాలు ఏర్పడితే అది అభ్యుదయానికి కారణమవుతుంది. మేలు జరగడానికి పాతదా కొత్తదా అని కాదు... పాతదంతా మంచీ కాదు, కొత్తదంతా చెడూ కాదు. అలాగే పాతదంతా చెడూ కాదు, కొత్తవన్ని మంచివీ కావు. రామాయణ భారతాల్లో అన్నీ ఉన్నాయండీ అని కొత్త వాఙ్మయం దేనికండీ అనడం మంచిదికాదు. కొత్తగా వచ్చిన గ్రంథాలలో ఎన్నో మంచి విషయాలుంటాయి. ‘‘పురాణమిత్యేవ న సాధు సర్వం/ నా చాపి కావ్యం నవమిత్యవద్యమ్/ సంతః పరీక్ష్యాన్యతరత్ భజంతే/ మూఢఃపరప్రత్యయనేబుద్ధిః’’ అంటారు మాళవికాగ్నిమిత్రంలో మహాకవి కాళిదాసు. అంటే పాతకాలానికి సంబంధించినది కాబట్టి ఇందులో ఏదీ పనికొచ్చేదీ, మంచిదీ ఉండదు – అనకూడదు. పాతవన్నీ చెడ్డవని ఎలా సిద్ధాంతీకరిస్తారు! ఈ రచన ఇప్పుడు కొత్తగా వచ్చింది, వీటిలో మన మేలు కోరేవి ఏం ఉంటాయి, వీటిని మనం ఆదరించక్కరలేదు... అని చెప్పడమూ కుదరదు. వివేకవంతులు ఏం చేస్తారంటే... అందులో ఏదయినా మంచి చెప్పారా.. అని పరిశీలిస్తారు. జీవితాలకు అభ్యున్నతిని కల్పించే మాటలు ఏవయినా వాటిలో ఉన్నాయా... అని చూస్తారు. కానీ ఎవరో ఏదో చెప్పారని తన స్వంత బుద్ధిని ఉపయోగించకుండా, మంచీ చెడూ విచారణ చెయ్యకుండా వాటినే అనుకరిస్తూ, అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మూఢుల లక్షణం. ..అంటున్నాడు కాళిదాసు. మనకు పనికొచ్చే విషయాలు ఎన్ని ప్రతిపాదింపబడ్డాయి.. అన్నదానిని పరిశీలించడం నిజమైన అభ్యుదయం. దాని విషయానికొస్తే అది పాతదా, కొత్తదా అని కాదు ఆలోచించాల్సింది, అందులో మంచి ఏముంది, ఇందులో మంచి ఏముంది? అని అంతకన్నా దాటి ఇక పరిశీలన చేయవలసిన అవసరం నాబోటివాడికి అక్కర లేదు. నా వరకు నాకు కావలసినది – అది ఎవరు రాసింది అయినా పాత కాలపుదయినా, కొత్తకాలపుదయినా, ఇప్పుడు సమాజంలో ఉన్న వ్యక్తులు రాసినది అయినా, పాతకాలంలో రుషుల వాఙ్మయం అయినా... అందులో అభ్యుదయానికి చెప్పబడిన మంచి విషయాలు ఏమున్నాయి? అనే. వాటిని స్వీకరించి, జీర్ణం చేసుకుని బాగుపడడానికి ప్రయత్నం చేయడం వరకే. పాతకాలంలో కూడా ఆదరణీయం కానివి, అంగీకారయోగ్యం కానివి, సమాజానికి ఉపయుక్తం కానివి ఎన్నో ఉండవచ్చు. అంతమాత్రం చేత పాతకాలంలో ఉన్న వాఙ్మయంలో పనికొచ్చేవి ఏవీ లేవు.. అని చెప్పడం సాధ్యం కాదు. ‘పురాణమిత్యేవ న సాధు సర్వం ...’ ఇది... ఆకాలంలో కాళిదాసు చెప్పిన మాట. ఈ మాట ఇప్పటికి పనికి రాదా!!! ఇది నేర్చుకుంటే అభ్యుదయం కాదా!!! ఇది నేర్చుకున్నవాడి జీవితం ... చేత దీపం పట్టుకుని నడుస్తున్న వాడిలా ఉండదా? పువ్వు పువ్వు లోంచి తేనెబొట్టు స్వీకరించిన తేనెటీగకాడా !!! అందువల్ల మంచి విషయాలు స్వీకరించడం ప్రధానం కావాలి. అవి ప్రాచీన వాఙ్మయం నుంచి కావచ్చు, కొత్తగా వెలువడుతున్న గ్రంథాలనుంచి కావచ్చు. వ్యక్తులందరూ అలా స్వీకరించాలి, మంచి గుణాలు అలవర్చుకోవాలి, ఆ వ్యక్తుల సమూహమే సమాజ అభ్యుదయానికి కారణమవుతుంది. ఎవరో ఏదో చెప్పారని తన స్వంత బుద్ధిని ఉపయోగించకుండా, మంచీ చెడూ విచారణ చెయ్యకుండా వాటినే అనుకరిస్తూ, అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మూఢుల లక్షణం అంటున్నాడు కాళిదాసు. -
భక్త కోటికి తారక మంత్రం.. తర తరాలుగా వెంటాడే ఆనందపు కానుక ఈ వేడుక
శ్రీరామ చంద్రమూర్తి జీవిత కథే రామాయణం. ఆ రామాయణాన్ని అనుసరిస్తే చాలు మనం ఎలా వ్యవహరించాలో అర్ధం అయిపోతుంది. ఎలా ఉండకూడదో ఎలా నడుచుకోకూడదో కూడా తెలిసిపోతుంది. మనకి కర్తవ్య బోధ చేస్తూ దారి చూపిస్తూ ముందుకు తీసుకెళ్లే కాంతి బాటే రామాయణం. అందుకే యుగాలు గడిచినా ఇప్పటికీ రామనామమే భక్తకోటికి తారక మంత్రంగా ఉండిపోయింది. ఎన్ని యుగాలు దాటినా అదే మంత్రం లోకాన్ని ముందుకు నడిపిస్తుంది. రామ రాజ్యం రావాలంటే రాముడు చూపిన బాటలో ధర్మాన్ని ఆచరించడమొక్కటే మార్గం అంటారు ఆధ్యాత్మిక వేత్తలు. రామరాజ్యం యావత్ ప్రపంచానికే ఆదర్శ రాజ్యం ఏ రాజ్యం అయితే సుభిక్షంగా ఉంటుందో ప్రజలంతా ఏ చీకూ చింతా లేకుండా సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారో ఏ రాజ్యంలో అయితే ప్రజలు మానసిక క్షోభలు పడకుండా మనశ్శాంతిగా ఉంటారు ఏ రాజ్యంలో అయితే ప్రజలు ఆకలి దప్పులు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారో దాన్ని రామరాజ్యం అంటారు. ధర్మం నాలుగు పాదాల మీద నడిచేదే రామరాజ్యం. అందుకే రాముడి పాలనలో అందరూ పిల్లా పాపలతో హాయిగా జీవించారు. వన వాసం పూర్తి చేసుకుని తండ్రి మాటను దక్కించాడు. సత్య నిష్ఠ పాటించాడు. తిరిగి అయోధ్య చేరి రాజ్యాధికారం చేపట్టాడు. పాలకులు ప్రజల అభిప్రాయాలను గౌరవించాలన్న సూత్రాన్ని రాముడు పాటించాడు. తన రాజ్యంలో ఓ మామూలు మనిషి తన సతీమణి సీత గురించి చేసిన వ్యాఖ్యలకు కూడా గౌరవం ఇచ్చాడు. సీత గురించి తనకు తెలిసినా ప్రజల నుండి ఓ విమర్శ వచ్చినపుడు పాలకుడిగా తాను జవాబుదారుగా ఉండాలనుకున్నాడు రాముడు. అందుకే గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతోన్నా.. కడలి అంతటి దుఖాన్ని దిగమింగుకుని సీతను అడవుల్లో వదిలి రావల్సిందిగా తమ్ముడు లక్ష్మణుణ్నే ఆదేశించాడు రాముడు. అందులో ఓ మంచి పాలకుడు ఎలా వ్యవహరించాలన్న నీతి ఉంది. అది పాలకులందరికీ ఆదర్శమే అంటారు మేధావులు. అధికారం తమ చేతుల్లో ఉంది కదా అని ప్రజల మాటలు పట్టించుకోకుండా ఉంటే అది ధర్మ బద్ధమైన పాలన అనిపించుకోదని రాముడు అనుకున్నాడు కాబట్టే సీతను అడవులకు పంపాడు. సీతారాముల జీవన యానమే రామాయణం. అది పరమ పవిత్రం. తర తరాలకూ ఆదర్శనీయం. అందుకే అది నిత్య పారాయణ గ్రంధం కూడా. రామాయణాన్ని ఒక్కసారి చదివితే చాలు తెలీని ఆనందం ఆవహించేస్తుంది. ఒక్క సారి చదివితే మళ్లీ మళ్లీ చదవాలనిపించేలా ఉంటుంది. చదువుతున్న కొద్దీ కొత్తగానే ఉంటుంది. అదే సమయంలో మధురంగా అమృతంలా ఉంటుంది. అందుకే యుగాల తరబడి రామాయణం కల్పవృక్షంలా వెలుగుతూనే ఉంది. శ్రీరామ నవమి అంటే లోకానికి పండగ. జనులందరికీ పండగ. సీతారాముల కళ్యాణం అంటే అదో వేడుక. తర తరాలుగా వెంటాడే ఆనందపు కానుక. -
‘ఇంటింటి రామాయణం’ మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
లంక ప్రభుత్వంలో దిగ్గజ క్రికెటర్ జయసూర్యకు కీలక బాధ్యతలు
Sanath Jayasuriya Appointment As Srilanka Tourism Envoy: రాజకీయ అనిశ్చితి, ఆర్ధిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంక, మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పలాయనం తర్వాత ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దుకునే పనిలో పడింది. రణిల్ విక్రమసింఘే నేతృత్వంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్థంభమైన పర్యాటక రంగానికి పునరుత్తేజం తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ఆ దేశ మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్యకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. జయసూర్యను టూరిజం ప్రచారకర్తగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సనత్ టూరిజం ప్రచారకర్తగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కొలంబోలోని భారత రాయబారి గోపాల్ బాగ్లేని కలిసి, దేశంలో టూరిజం అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీలంకలోని హిందూ ఆలయాలు, ఇతర హిందూ పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తామని, వాటికి ప్రాచుర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, రామాయణానికి సంబంధించి దేశంలో ఉన్న పర్యాటక ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. శ్రీలంక జీడీపీలో టూరిజం వాటా దాదాపు 12 శాతం ఉంది. చదవండి: త్వరలోనే స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ -
ఇలాంటి రూమర్స్ ఎలా వస్తాయో అర్థం కావట్లేదు: హీరోయిన్
స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ నటించిన సినిమా 'లాల్ సింగ్ చద్దా' ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీ అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరీనా కపూర్ తనపై వచ్చిన పుకార్లపై స్పందించింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న రామాయణం సినిమాలో కరీనా సీత పాత్రకు ఎంపికయ్యిందని, అయితే ఈ పాత్ర కోసం ఆమె అక్షరాలా రూ. 12కోట్లు డిమాండ్ చేసిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రూమర్స్పై కరీనా స్పందిస్తూ.. నాకు ఎలాంటి ఆఫర్ రాలేదు. అలాంటప్పుడు నేనెలా డిమాండ్ చేస్తా? ఇలాంటి వార్తలు ఎలా బయటకు వస్తాయో కూడా అర్థం కావడం లేదు. సోషల్ మీడియా వచ్చాక ఎవరికి నచ్చింది వాళ్లు రాసేసుకుంటున్నారు. కాస్త నిజాలు తెలుసుకొని రాస్తే బావుంటుంది అంటూ ఘాటుగా బదులిచ్చింది. -
నిందగా మారిన గణచిహ్నం
హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రాల్లో 1983 నాటి ‘కిసీ సే న కెహనా (ఎవరితో చెప్పొద్దు)’ ప్రసిద్ధ హాస్యచిత్రం. అందులో ‘హనీమూన్’ హోటల్ బోర్డును ‘హనుమాన్’గా మార్చారని హీరోయిన్తో అంటాడు హీరో. అలా హనుమాన్ను వ్యాపారీకరించడాన్ని దర్శకుడు చూపించారు. ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ ఈ సినిమా స్క్రీన్ షాట్ను చూపి, ‘2014 ముందు హనీమూన్, 2014 తర్వాత హనుమాన్’ అని 4 ఏళ్ల క్రితం ట్వీటారు. ఇది మత భావాలను రెచ్చగొట్టే అంశంగా మారింది. భగవాన్ హనుమాన్ను కోతి అని అవమానించారని జుబేర్పై అభియోగం. పురాణాల్లో రాక్షసులు, దేవగణాలు, యక్షులు, రామాయణంలో వానరులు వారి గణచిహ్నాలతో పేర్కొనబడ్డ స్థానిక జాతుల మానవ సమూహాలు. గణచిహ్నాలను రూపాలకు అన్వయించారు. ‘కపి’ పదాన్ని కోతి అని అనువదించారు. సవరులు, శబరులు, ఇతర ఆదివాసీ తెగలవారు రామాయణంలో వానరులుగా పేర్కొనబడ్డారు. వీరు వాలం (తోక) గల నరులు. తోకలాంటి వస్త్రం ధరించే నరులు. వెనుక పొడవుగా వేలాడే గోచీని కట్టుకునేవారు. ఈ గోచీ పురుషులకు మాత్రమే పరిమితం. వాలి భార్య తార, సుగ్రీవుని భార్య రుమాదేవి, ఆంజనేయుని తల్లి అంజనీ దేవి వగైరా వానర జాతి స్త్రీలకు తోకలుండవు. వానరులు, వానర రాజ్యాల గురించి రామాయణం చాలా విషయాలు చెప్పింది. వాటిని కల్పిత, ఉద్దేశపూరిత వక్రీకరణలకు గురిచేశారు. వానరులంటే కోతులని ప్రచారం చేశారు. రాముడు కూడా యుద్ధంలో వానరులు మానవరూపాల్లో ఉండరాదన్నాడు. హరిరూపంలో ఉండాలన్నాడు. హరి అంటే విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, యముడు, సింహం, గుర్రం, పాము, కోతి, కప్ప అని అర్థాలు. ఆటవికుల ద్వేషులు కోతి అన్న అర్థాన్ని స్థిరీకరించారు. వానరజాతికి కోతిచేష్టలు అంటగట్టి వినోదించారు. వానరులను కోతులను చేసి ఆంజనేయుని అవమానించింది ఆర్య జాత్యహంకారులే. మతవాదులు వారి వారసులు. హేతుబద్ధ ఆలోచనలను ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత సామాజిక శాస్త్రవేత్తలదీ, విజ్ఞులదీ! (క్లిక్: ప్రశ్నించినవారికి నిర్బంధమా?) – సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి, గుంటూరు -
ప్రభాస్ ‘నో’ చెప్పి ఉంటే ఆదిపురుష్ ఉండేది కాదు
‘‘మీ మనసు స్వచ్ఛంగా ఉంటే మీరు ప్రతి విషయాన్ని స్వచ్ఛంగా చూస్తారు. నా మనసు, ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు తప్పులు చేస్తామనే భయం ఉండదు. అందుకే రామాయణం లాంటి చరిత్రను భయం లేకుండా ‘ఆదిపురుష్’గా తెరకెక్కించాను’’ అన్నారు దర్శకుడు ఓం రౌత్. రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతీ సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, ఇతర పాత్రల్లో పేరున్న నటీనటులతో ఓం రౌత్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ చిత్రం ‘ఆదిపురుష్’. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘రాముడి జీవితం నాకు ఆదర్శం’’ అన్నారు ఓం రౌత్. శ్రీరామ నవమి సందర్భంగా ‘సాక్షి’తో ఓం రౌత్ ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు ఈ విధంగా... ► రాముడి గురించి రెండున్నర గంటల్లో చెప్పడం సాధ్యమా? ఓం రౌత్: కచ్చితంగా సాధ్యం కాదు. జీవితంలో ఎలా నడుచుకోవాలనేది చెప్పడానికి రాముడు మంచి ఉదాహరణ. ఆయన్ను ‘మర్యాద పురుషోత్తమ్’ అంటారు. మంచి లక్షణాలున్న రఘురాముడి గురించి చెప్పడానికి ఒక్క సినిమా సరిపోదు. అందుకే రాముడి జీవితంలోని ఒక అధ్యాయాన్ని తీసుకుని, ‘ఆదిపురుష్’ చేశాను. ► మీరు ‘ఆదిపురుష్’ తీయడానికి 30 ఏళ్ల క్రితం రామానంద్ తీసిన ‘రామాయణ్’ సీరియల్ ఆదర్శం అనుకోవచ్చా? రాముడిని అర్థం చేసుకునే ప్రాసెస్ నా చిన్నప్పుడే మొదలైంది. నా గ్రాండ్ పేరెంట్స్ ద్వారా రామాయణం విన్నాను. అలాగే రామానంద్ సాగర్ ‘రామాయణ్’ కొన్ని విశేషాలు తెలియజేసింది. రాముడి గురించి మాట్లాడిన ప్రతిసారీ నాకు కొత్త విషయం తెలుస్తుంది. రామాయణం ఆధారంగా జపనీస్ డైరెక్టర్ యుగో సాకో తీసిన జపనీస్ సినిమా చూశాక నాకూ సినిమా తీయాలనే ఆలోచన కలిగింది. అది యానిమేషన్ మూవీ. 2000లో ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆ సినిమా చూశాను. రాముడి గురించి విదేశీయులు అంత ఆకట్టుకునేలా తీస్తే భారతీయులమైన మనం ఎందుకు తీయకూడదనిపించింది. కరోనా లాక్డౌన్లో ‘ఆదిపురుష్’ స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాను. ► 40ఏళ్ల వయసులో... అది కూడా దర్శకుడిగా తక్కువ సినిమాల అనుభవం ఉన్న మీకు రామాయణం లాంటి పెద్ద సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయడం అంటే చిన్న విషయం కాదేమో? నా చిన్నప్పుడే రఘురాముడికి ఇన్స్పైర్ అయ్యాను. రాముడి జీవన విధానాన్ని ప్రపంచం మొత్తం ఆచరిస్తే బాగుంటుందనే ఆలోచన నా చిన్నప్పుడే నాకు కలిగింది. రాముడి క్వాలిటీస్ నన్ను అంతగా ఆకట్టుకున్నాయి. చిన్నప్పటినుంచీ రాముడంటే ఆరాధనాభావం ఉంది. అయినప్పటికీ రాముడి సినిమా అంటే చిన్న విషయం కాదు. కానీ ఆ పాత్ర మీద పెంచుకున్న మమకారం ‘ఆదిపురుష్’ తీసేలా చేసింది. నేటి తరానికి రాముడి గురించి తెలియాలి. ► ‘యంగ్ రెబల్ స్టార్’ ఇమేజ్ ఉన్న ప్రభాస్ని సాత్వికంగా కనిపించే రాముడి పాత్రకు తీసుకోవాలని ఎందుకనిపించింది? తీక్షణంగా ఉండే ప్రభాస్ కళ్లు, తన ఫిజిక్ రాముడి పాత్రకు సూటబుల్. మన కళ్లు మన హృదయానికి ప్రతిబింబాలు అంటారు. మనసులో ఉన్న భావాలను కళ్లు పలికిస్తాయి. అలా ప్రభాస్ తన కళ్లల్లో కరుణ రసాన్ని చూపించగలుగుతారని పూర్తిగా నమ్మి, తనే ఈ పాత్ర చేయాలనుకున్నాను. అలాగే రాముడిలో ఉండే లక్షణాల్లో ‘పరాక్రమ వీర’ ఒకటి. రెబల్ ఇమేజ్తో ప్రభాస్ ఆ వీరత్వాన్ని చూపించగలరని నమ్మాను. ఈ క్యారెక్టర్ గురించి చెప్పి, ‘వి’ షేప్ బాడీ బాగుంటుందన్నాను. ఫిజిక్ని అలానే మలచుకున్నారు. అలాగే హిందీ భాష మీద కూడా ప్రభాస్ పట్టు సాధించారు. ► ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకోకపోయి ఉంటే.. ఈ సబ్జెక్ట్ గురించి ప్రభాస్కి చెప్పడానికి వెళ్లే ముందు కాదనరనే నమ్మకంతో వెళ్లాను. సినిమా గురించి చెప్పగానే ‘ఓకే.. చేస్తాను’ అన్నారు. ఒకవేళ ప్రభాస్ ఒప్పుకోకపోయి ఉంటే ‘ఆదిపురుష్’ ఉండేది కాదు... తీసేవాడిని కాదు. నిజానికి ఈ ప్రాజెక్ట్ చేయడానికి నన్ను ఆ ‘ఆల్మైటీ’ (దేవుడు)యే ఎన్నుకున్నాడని నా నమ్మకం. నన్నే కాదు.. నటీనటులు, టెక్నికల్ టీమ్ అందర్నీ ఆ దేవుడే ఎంపిక చేసి, ఈ ప్రాజెక్ట్ చేయించాడని నమ్ముతున్నాను. ► మూడు సీన్లు విని, ప్రభాస్ ఈ సినిమా చేస్తానని అన్నారట.. అవును.. నిజమే. ఈ కథ చెప్పాలనుకున్నప్పుడు ప్రభాస్తో నాకంతగా పరిచయం లేదు. కథ చెప్పడానికి ఫోన్ చేశాను. మూడు సీన్లు విని, ప్రభాస్ ఇంప్రెస్ అయ్యారు. ఆ తర్వాత నేను ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి పూర్తి కథ చెప్పాను. ► ‘ఆదిపురుష్’ని దేవుడే తీయించాడని చెప్పారు. మీకు భక్తి ఎక్కువ అని తెలుస్తోంది.. మీరు సెంటిమెంట్స్ని నమ్మితే ఈ సినిమా షూటింగ్ మొదటి రోజే ‘ఫైర్ యాక్సిడెంట్’ జరిగినందుకు అప్సెట్ అయ్యారా? భయపడ్డారా? ఏమాత్రం భయపడలేదు.. అప్సెట్ అవ్వలేదు. నిజానికి పెద్ద ఘటనే జరిగింది. నా టీమ్ చేసిన హార్డ్వర్క్ (సెట్ వర్క్) వృథా అయిందని బాధపడ్డాను. అయితే ఆ దేవుడు మా పక్షాన ఉన్నాడు. చాలా త్వరగానే సెట్ పూర్తి చేసి, షూటింగ్ పూర్తి చేసేలా చేశాడు. జీవితంలో కష్టాలు వస్తాయి... పోతాయి. వాటిని తట్టుకుని ముందుకు సాగిపోవాలి. ఇంకో విషయం ఏంటంటే... సెట్ మాత్రమే పాడయింది తప్ప, మా టీమ్లో ఉన్న ఎవరికీ ఏమీ కాలేదు. అందుకే దేవుడు మా పక్షాన ఉన్నాడని అంటున్నాను. ► ప్రభాస్ మంచి భోజనప్రియుడు.. తన టీమ్కి విందులు ఇవ్వడం ఆయన అలవాటు.. మరి మీ టీమ్కి? ప్రభాస్తో వర్క్ చేయడం నాకో మంచి అనుభూతి. ఇంటి ఫుడ్ తెప్పించి, అందరికీ ఇచ్చేవారు. షూటింగ్ సమయంలో టేస్టీ ఫుడ్స్ చాలానే లాగించాం (నవ్వుతూ). ఇంకో విషయం ఏంటంటే.. షాట్ గ్యాప్లో కూడా ఫుడ్ గురించి మాట్లాడుకునేవాళ్లం. రేపు ఏం తిందాం అని కూడా ముందు రోజు చర్చించుకునేవాళ్లం. ► ఫైనల్లీ.. మీ జీవితంపై రాముడి ప్రభావం? అది చెప్పడానికి మాటలు చాలవు. మనందరం ఉదయం నిద్ర లేచేటప్పుడు ‘మంచి జరగాలి’ అనుకుంటాం. ఆ మంచి ఎక్కడ్నుంచి వస్తుంది? మన నమ్మకంలోంచి పుట్టుకొస్తుంది. ఆ నమ్మకం ఎక్కడ నుంచి వస్తుంది? మనం నమ్మిన రఘురాముడి నుంచి వస్తుంది. రాముడి నుంచి మానవత్వం నేర్చుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. ‘ఆదిపురుష్’తో ప్రేక్షకులను వేల ఏళ్లు వెనక్కి తీసుకెళుతున్నా అన్నారు.. మీరు చేసిన రీసెర్చ్ గురించి? నిజానికి రామాయణం గురించి ప్రపంచం చాలానే రాసింది. మన కళ్ల ముందు బోలెడంత మెటీరియల్ ఉంది. ఎక్కువ టైమ్ కేటాయించి, అవి స్టడీ చేస్తే చాలు. నేను ఎక్కువ టైమ్ కేటాయించి, అన్నీ స్టడీ చేశాను. ముఖ్యంగా ఆర్కిటెక్చర్ బుక్స్ చదివాను. అప్పటి కట్టడాలు ఎలా ఉండేవి? డిజైన్లు ఎలా ఉండేవి? అనే విషయాల మీద అవగాహన పెంచుకున్నాను. వేల ఏళ్ల క్రితం నాటి కథను మోడ్రన్ టెక్నాలజీతో చూపిస్తున్నాను. నేను నమ్మిన కథను నిజాయితీగా తెర మీద చూపించే ప్రయత్నం చేశాను. ఒక బలమైన కథకు విజువల్ ఎఫెక్ట్స్ ఓ సాధనంలా ఉపయోగపడతాయి తప్ప కేవలం వాటితోనే సినిమాని నడిపించాలనుకోకూడదని నా అభిప్రాయం. అందుకే కథ బాగా రాసుకుని, దాన్ని స్క్రీన్కి ట్రాన్స్ఫార్మ్ చేశాను. ఆ కథ ఎలివేట్ కావడా నికి వీఎఫ్ఎక్స్ వాడాను. -
అందరి బంధువయా రామయ్యా
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో విష్ణుమూర్తి ఏడవ అవతారంగా త్రేతాయుగంలో జన్మించాడు. యుగాలు గడిచినా ఆ మహనీయుని పుట్టినరోజును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పద్నాలుగేళ్లు అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందంటారు. శ్రీ సీతారాముల కల్యాణం కూడా ఈ రోజునే జరిగింది. అందుకు గుర్తుగా ఈనాడు దేశమంతటా సీతారామ కల్యాణాన్ని తమ ఇంటిలో పెళ్లేనేమో అన్నంత శ్రద్ధాభక్తులతో సంబరంగా జరుపుకుంటారు. అయితే మానవుడిగా పుట్టిన రాముడు దేవుడిగా ఇన్ని కోట్ల గుండెల్లో కొలువై ఉండటానికి కారణం క్లిష్ట పరిస్థితులలోనూ ఆయన అనుసరించిన ధర్మమే. ఈ శ్రీరామ నవమి పర్వదినాన మనం రాముడి ధర్మనిరతిని గురించి తలచుకుందాం. రామ రసాంబుధిలో ఓలలాడదాం. రాముడు మన నిత్యజీవితంలో మమేకమైన వాడు. తెల్లవారి లేస్తే రామ శబ్దం వినకుండా ఉండలేము. శ్రీరామ అని లేకుండా శుభలేఖ లేదు. శ్రీరామ అని రాయకుండా ఇదివరకటి రోజుల్లో ఉత్తరం రాసేవాళ్లు కాదు. ఇద్దరి మధ్య సఖ్యత చెడితే, నీకు నాకు రామ్ – రామ్ అంటారు. నచ్చని విషయం చెబితే ‘రామ రామ’ అంటారు. రాముడు మంచి బాలుడు అంటారు. రామబంటు అంటారు, ఆకలి వేస్తే ఆత్మారాముడు అల్లరి చేస్తున్నాడంటారు. ఈ విధంగా అందరి జీవనంతో విడదీయరానిదిగా మారిపోయింది రామ శబ్దం. రాముణ్ణి ఎందుకు తలచుకుంటున్నామంటే... ఆయన జీవితం చాలా వరకు సమస్యలతోనే కూడుకుంది. అయితే ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా, ఎన్ని విధాలైన కష్టాలు వచ్చినా ఒక్కసారి కూడా ధర్మాన్ని తప్పలేదు. శరణన్న శత్రువును కూడా క్షమించి వదిలిపెట్టిన ఉదార మనస్తత్వం ఆయనది. ఆయన ధర్మాన్ని అనుసరించడం కాదు... ఆయన అనుసరించిన మార్గమే ధర్మంగా మారింది. అదే మానవుడిగా పుట్టిన వాడిని మహనీయుణ్ణి చేసింది. చివరికి దేవుణ్ణి చేసింది. అందుకే ఆయన అనుసరించిన మార్గం రామాయణ మహాకావ్యంగా రూపు దిద్దుకుంది. తరతరాలుగా పఠనీయ కావ్యంగా.. పారాయణ గ్రంథంగా మారిపోయింది. మూర్తీభవించిన ధర్మస్వరూపం శ్రీరాముడు ధర్మజ్ఞుడు. తల్లిదండ్రులు, గురువులు, సోదరులు, సహధర్మచారిణి, సేవకులు, స్నేహితులు, సన్నిహితులు, ప్రజలు, రుషులు, రాక్షసులు, పశుపక్ష్యాదులు... ఇలా ఎవరితో ఏ విధమైన ధర్మాన్ని అనుసరించాలో అన్ని ధర్మాలు తెలిసిన వాడు, ఆచరించినవాడు. అందుకే మారీచుడి వంటి రాక్షసుడు కూడా రావణునితో ‘రాముడంటే ఎవరనుకున్నావ్, సాక్షాత్తూ నడిచొచ్చే ధర్మస్వరూపమే’అని అన్నాడంటే ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. తార చెప్పింది రాముడు ధర్మజ్ఞుడని. రాముడు ఎన్నడూ ధర్మాన్ని అతిక్రమించలేదు. ధర్మాన్ని విడువ లేదు అందాల రాముడు పురుషులను కూడా మోహింప చేసేంతటి అందమైన రూపం శ్రీరాముడిది. మునులు రాముణ్ణి ఎంతగానో ఆరాధించారు. అభిమానించారు. ప్రేమించారు. రాముణ్ణి చూడకుండా హనుమ క్షణం కూడా ఉండలేకపోయేవాడట. ముక్కు, చెవులు కోయించుకున్న శూర్పణఖ, అన్నగారైన రావణుడి దగ్గరకి వెళ్లి శ్రీరాముని సౌందర్యాన్ని వర్ణిస్తుంది. అదేపనిగా పొగుడుతుంది. సౌశీల్యవంతుడు ఎదుటివారిని ముందుగా తానే చిరునవ్వుతో పలకరించే సౌశీల్యం రామునిది. పడవ నడిపే గుహుడు, రామునికి ప్రాణమిత్రుడు. కేవలం నిషాద రాజ్యానికి రాజు అయిన గుహుడు ఎక్కడ? చక్రవర్తి అయిన రాముడెక్కడ? అదేవిధంగా సుగ్రీవుణ్ణి ఆదరించాడు. విభీషణుడికి ఆశ్రయం ఇచ్చాడు. రాజనీతిజ్ఞుడు రాజనీతిలోనూ, వ్యూహ రచనలోనూ రామునికి మించిన వారులేరని పేరు. ప్రజలకు ఏమి కావాలో రాముడికి తెలిసినంతగా వేరెవరికీ తెలియదేమో అన్నంతగా ఆయన కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచింది. అందుకే ఇప్పటికీ రామరాజ్యాన్ని, రాముడి పాలననీ తలచుకుంటారు. శ్రీరామ నవమి నాడు ఆచరించ వలసినవి... రామనవమి పర్వదినాన ప్రతి ఒక్కరినీ కొన్ని పనులు చేయమంటుంది శాస్త్రం. 1 . సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తల స్నానం చేసి, ఇంట్లో సీతారాముల వారిని భక్తి, శ్రద్ధలతో పూజించాలి. 2. వడపప్పు, పానకం, పాయసంలాంటి పదార్థాలతో రాముడికి నివేదన చేసి అందరికీ పంచి పెట్టాలి. 3. రోజంతా శ్రీరామ నామం స్మరిస్తూ ఉండటం. 4. శక్తి కొలదీ దానధర్మాలు చేయాలి. ఎందుకంటే రామనవమి తిథి లాంటి మహా పర్వదినం నాడు చేసే ఏ పుణ్యకర్మయినా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. 5. రామనవమి నాడు పగలు ఉపవాసం, రాత్రికి జాగరణ చెయ్యమంటారు పెద్దలు. కాబట్టి ఆరోగ్యం సహకరించినంత వరకు పాలు, పండ్లు లాంటి సాత్వికమైన ఆహారం తీసుకుని రామనామాన్ని స్మరిస్తూ, వీలయితే రాత్రికి జాగరణ చెయ్యడం మంచిది. 6. దగ్గర్లోని రామాలయానికి వెళ్లి, భగవద్దర్శనం చేసుకోవాలి. అవకాశం ఉంటే సీతారాములవారి కల్యాణోత్సవాన్ని కన్నులారా వీక్షించడం.. లేదా టీవీలలో చూపించే ప్రత్యక్ష ప్రసారాలను అయినా భక్తి భావంతో చూడాలి. 7. వీలయితే రామాయణ పారాయణం లేదా శ్రవణం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అందరూ భక్తిశ్రద్ధలతో రామనవమి ఉత్సవాన్ని జరుపుకోవాలని, రామచంద్ర ప్రభువు చల్లని చూపులు మనందరి మీదా ప్రసరించాలని కోరుకుందాం. శ్రీ రామ జయ రామ జయ జయ రామ! విష్ణు సహస్ర నామంతో సమానం కైలాసంలో ఒక రోజు పార్వతీదేవి పరమశివుడిని విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి ఈశ్వరుడు ‘ఓ పార్వతీ! నేను నిరంతరం ఆ ఫలితం కోసం జపించేది ఇదే సుమా!’ అని చెప్పి ఈ శ్లోకంతో మంత్రోపదేశం చేశాడు . శ్లో : శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ! సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే !! ఈ శ్లోకం మూడుసార్లు స్మరించినంత మాత్రానే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు. భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ‘రామ’ అంటే రమించడం అని అర్థం కాబట్టి మనం ఎప్పుడూ హృదయాలలో శ్రీరాముని స్మరిస్తూ ఉండాలి. ‘రా’ అనే అక్షరం పలకగానే నోరు తెరుచుకుని మనలోపల ఉన్న పాపాలు అన్నీ బయటకు వచ్చి రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. ‘మ’ అనే అక్షరం ఉచ్చరించినప్పుడు నోరు మూసుకుంటుంది కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మానవుల శరీరాలలోకి ప్రవేశించలేవు. భద్రగిరి రామయ్య భద్రోభద్రయా అంటూ వేదం ఉపదేశించిన సుభద్రకరమైన భద్రబీజాక్షరాలకు సాకారం– భద్రాచల రాముడు. త్రేతాయుగంలో రాముడు తన అవతార లక్ష్యాన్ని జయప్రదంగా నిర్వహించాడు. ద్వాపరయుగం తరవాత, ఈ కలియుగాన భద్రుడనే భక్తుడి కోసం భద్రకరమూర్తిగా వైకుంఠం నుంచి తరలి వచ్చి భద్రాద్రి రాముడిగా భద్రగిరిపై కొలువయ్యాడు. భవబంధాల్ని సునాయాసంగా అధిగమించడానికి భద్రాచల రాముణ్ని సేవించాలని బ్రహ్మాండ పురాణోక్తి. శ్రీరాముడు నెలకొన్న భద్రగిరి– తెలుగువారి అయోధ్యాపురి. శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు తనను సేదతీర్చిన, శిలారూపంలో ఉన్న భద్రుణ్ని అనుగ్రహించాడంటారు. వసంత నవరాత్రి ప్రయుక్తంగా భద్రాచల శ్రీసీతారామ చంద్రస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రానందకరంగా జరుగుతాయి. వసంత రుతుశోభకు నవ్యసౌకుమార్యాన్ని ఆపాదించే సీతారామ కల్యాణోత్సవం నవనవోన్మేషం... మధురాతి మధురం. ‘సీతమ్మ మా అమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి’ అనే ప్రేమాస్పద అనుభూతితో భక్తుల హృదయం ఉప్పొంగుతుంది. కంచర్ల గోపన్న భక్తరామదాసుగా శ్రీరామసేవా దీక్షను స్వీకరించాడు. ప్రతి సంవత్సరం శ్రీరామ జన్మదినోత్సవమైన శ్రీరామనవమి నాడు శ్రీసీతారాములకు తిరుకల్యాణ మహోత్సవాన్ని జరిపించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. సిరికల్యాణ తిలకంతో, మణిమయ బాసికాలతో ఆణిముత్యాలే తలంబ్రాలుగా జాలువారే ముగ్ధమోహనమైన, మనోరంజకమైన సీతారాముల పెళ్ళి వేడుక జగదానందకారకమై భాసిస్తుంది. శ్రీరామనవమి మరుసటి రోజు దశమినాడు శ్రీరామ పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ధర్మానికి నిలువెత్తు రూపమైన రాముడు చూపిన మార్గంలో పయనిస్తామని, ధర్మనిర్వహణలో సదా మమేకమవుతామని భక్తులు ప్రతినబూనడమే శ్రీరామ పట్టాభిషేక వేడుకలోని అంతరార్థం. రామాయణంలో ఏముంది? రామాయణం ఓ విలువల ఆయనం.. విలువైన కావ్యం. వేదతుల్యమైన రామాయణం సామాజిక అభ్యున్నతికి ఉపకరించే సూత్రాల్ని నిర్దేశించింది. సత్యం, ధర్మం అనే రెండు చక్రాల జీవనరథంలో ఎలా ముందుకు పయనించాలో రామాయణం చాటిచెప్పింది. ఏడు కాండలు, ఐదువందల అధ్యాయాలు, ఇరవైనాలుగువేల పద్యాల మహాకావ్యం. అధ్యాయాన్ని ‘సర్గ’ అంటారు. పద్యాన్ని ‘శ్లోకం’ అంటారు. పేరుకు మాత్రమే రామకథ కానీ.. అందులో రకరకాల పాత్రలు కనిపిస్తాయి. నదులూ, పర్వతాలూ, అడువులూ, వివిధ దేశాలూ, అనేకానేక లోకాలూ కథాక్రమంలో ప్రస్తావనకు వచ్చాయి. భిన్న జాతుల మనుషుల్నీ, వృక్షాల్నీ, పశుపక్ష్యాదుల్ని పరిచయం చేశాడు వాల్మీకి. ఎంతోమంది రాజులు తారసపడతారు. వారి వంశాలూ తెలుస్తాయి. విజ్ఞాన సర్వస్వం రామాయణంలో భూగోళం ఉంది, జీవ–జంతుశాస్త్రాలు ఉన్నాయి. ఇక మంచిచెడుల విషయానికొస్తే ఇది అచ్చమైన విలువల వాచకం. యుద్ధ వ్యూహాలూ, రణ తంత్రాలూ ఉన్నాయి. వాటిని నేటి రాజకీయాలకు అన్వయించుకుని రాజనీతి శాస్త్రానికో, ప్రజాపరిపాలన శాస్త్రానికో అనుబంధంగా చేర్చుకోవచ్చు. సీతాన్వేషణలో భాగంగా వాల్మీకి విశ్వాన్ని కూడా వర్ణించాడు కాబట్టి, అంతరిక్ష శాస్త్రంగానూ పరిగణించుకోవచ్చు. మొత్తంగా రామాయణం సమగ్ర విజ్ఞాన సర్వస్వం! సకల శాస్త్రాల సారం వాల్మీకి మహర్షి రామాయణాన్ని శ్రీరామపట్టాభిషేకానికో, రావణ సంహారానికో పరిమితం చేయలేదు. సకల వేదాల సారాన్నీ, ఉపనిషత్తుల రహస్యాల్నీ ఒడుపు గా ఇమిడ్చాడు. వ్యక్తిధర్మం, రాజధర్మం, పుత్రధర్మం... అన్నింటికీ మించి మానవ ధర్మం – రామకథలో అంతర్లీనం. అద్భుతమైన భావ వ్యక్తీకరణలు! రాముడు అరణ్యవాసానికి వెళ్లిపోగానే దశరథుడు దుఃఖంలో మునిగిపోతాడు. అనారోగ్యం కబళిస్తుంది. చూపు మందగిస్తుంది. ఆ విషాదకర సన్నివేశంలో కౌసల్యతో ఓ మాట అంటాడు ‘రాముడు నా కనుపాప. తనతోపాటు నా చూపూ వెళ్లిపోయింది’. హనుమంతుడు అశోక వృక్షం మీద వాలే సమయానికి సీతాదేవి ‘వక్కలైన విశ్వాసంలా ఉంది’ అంటాడు వాల్మీకి. ఎంత గొప్ప వ్యక్తీకరణ? ఆ వర్ణనలూ అంతే. రావణుడు అపహరించే సమయానికి పసుపు పచ్చని చీరలో ఉంది సీతాదేవి. ఆకాశంలో పుష్పక విమానం ఎగిరిపోతుంటే.. ఆ గాలికి చీర కొంగు రెపరెపలాడుతున్నది. పక్కనే నల్లగా అంతెత్తున రావణుడు. ఆ దృశ్యం ఏదో పర్వతం మీద మంటలు అంటుకున్నట్టుగా ఉందట. ఎంత గొప్ప వర్ణన! తెలుగులో గొప్ప రచనలు చేయాలనుకునేవారు రామాయణం చదివితే చాలు... అద్భుతమైన వాక్యాలు... అంతకన్నా అద్భుతమైన వర్ణనలు దొరుకుతాయి. కలం ముందుకెళుతుంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి కన్నుమూత
-
ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మహామహోపాధ్యాయ, పౌరాణిక సార్వభౌమ, అభినవ వ్యాస బిరుదాంకితులు, ప్రముఖ పురాణ వేదశాస్త్ర పండితులు, ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి (96) శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ అశోక్నగర్లోని తన నివాసంలో కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న చంద్రశేఖర శాస్త్రి స్వస్థలం గుంటూరు జిల్లా క్రోసూరు. ఆయనకు భార్య సీతారామ ప్రసన్నలక్ష్మి, ఆరుగురు కుమారులు రామకృష్ణ, వీరరాఘవశర్మ, రామనాథ్, రామారావు, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, ఇద్దరు కుమార్తెలు ఆదిలక్ష్మి, సరస్వతి ఉన్నారు. చంద్రశేఖర శాస్త్రి భాతిక కాయానికి శనివారం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లాది కన్నుమూతపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం జగన్ దిగ్భ్రాంతి చంద్రశేఖర శాస్త్రి మరణంపట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వేదాలు, ఇతిహాసాలు, పురాణాలను అవపోసన పట్టిన మహా పండితుడు ఆయనని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీవ్రంగా బాధించింది: కిషన్రెడ్డి మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం చెందడంపై కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్రంగా బాధించిందని కిషన్రెడ్డి పేర్కొన్నారు. -
ఘనంగా వాల్మికీ జయంతి వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం, తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల తెలుగు విభాగము, మలేషియా తెలుగు సంఘాలు సంయుక్తంగా వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాయి. అందులో భాగంగా సుందరకాండ నవగ్రహ అనుగ్రహ దీక్ష అనే అంశంపై వర్చువల్ సదస్సు నిర్వహించారు. సుమారు 20 దేశాలకు చెందిన వారు ఈ వేడుకల్లో భాగమయ్యారు. సమాజ శ్రేయస్సు కొరకు ఉచితంగా నిర్వహించిన ఈ దీక్షా కార్యక్రమానికి తితిదే ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యఅతిధి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకి రామాయణం మానవాళికి మార్గనిర్దేశనమన్నారు. త్రేతాయుగం నాటి రామాయణాన్ని నేడు ప్రతి ఒక్కరూ అనుసరించేలా మహర్షి వాల్మీకి రచించారని చెప్పారు. విశిష్టఅతిధిగా హాజరైన ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రామాయణమే మానవ జీవన పారాయణమన్నారను. భారతీయ సనాతధర్మం విశిష్టతను రామయణం ద్వారా వాల్మీకి మహర్షి జాతికి తెలియజేశారన్నారు. -
రామాయణం నీతి నేటికీ ఆదర్శనీయమే
మన దేశంలో రాముడు కోట్లాదిమందికి దేవుడు, రామనామాన్ని ఎందరో మంత్రంగా జపిస్తారు. రామాయణం నిజంగానే జరిగిందని చెప్పే ఆధారాలను చరిత్రకారులు చూపిస్తారు. మన దేశంలోనే కాక ఇంకా కొన్ని దేశాలలో కొంత భిన్నమైన రామాయణ కథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆదికవి వాల్మీకి రామాయణం అన్నింటికి మూలం. రామాయణం ఇంత ప్రాచుర్యం పొందడానికి, రామనామం ఇంత గొప్ప ప్రభావం చూపడానికి కారణాలు ఏమిటి? మానవ జీవితాన్ని ప్రభావితం చేసే కొన్ని జీవన విధానాలను, జీవిత విలువలను రామాయణం చెప్తున్నది. అవి ఈనాటికీ అందరికీ ఆదర్శం. అందుచేతనే ఈ నాటికి రామాయణం కథ ఎందరి మీదనో ప్రభావం చూపుతున్నది. రామాయణం మానవజీవితానికి, సమస్త మానవాళికి, సర్వకాలాలకు, సర్వ దేశాలకు ఉపయోగపడే శాశ్వత సత్యాలను, జీవన విధానాలను మనకు చెప్తున్నది. రామాయణాన్ని విమర్శించే వారు ఇది వర్ణాశ్రమ ధర్మాన్ని కులవివక్షతను చూపుతుందని విమర్శిస్తారు. కానీ వాల్మీకి రామాయణంలో అడుగడుగునా అన్ని వర్గాల వారిని పిలిచి సంప్రదించినట్లు ఉంది. రామ పట్టాభిషేకానికి నాలుగు వర్ణాల వారిని ఆహ్వానించినట్లు ఉంది. అదీగాక రాముడు, గుహుని ఆతి థ్యాన్ని స్వీకరించాడు. మాతంగ మహర్షి (ఒక చండాల స్త్రీ కుమారుడు) ఆశ్రమాన్ని దర్శిస్తాడు. ఆ ఆశ్రమంలోని శబరి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. ఆ విధంగ రాముడు ఎక్కడ కుల వివక్షతను చూపలేదు. ప్రపంచంలో ఎన్నో రామాయణ కథలు ఉన్నాయి. భిన్నమైన కథలున్నాయి. వాల్మీకి రామాయణంలో ఒకచోట రాముడు జాబాలి వాదనను తిరస్కరిస్తూ ‘బుద్ధుడు దొంగ వంటి వాడు అతడు చెప్పినది నాస్తిక వాదం అని’ అయోధ్య కాండలో రాముడు అన్నట్లు ఉంది. బుద్ధుడు క్రీస్తుపూర్వం 623 సంవత్సరంలో జన్మించాడు. క్రీ.పూ. 483లో సమాధి చెందాడు. ఇక రామాయణం ఎప్పుడు జరిగింది? రాముడు క్రీ.పూ. 5114 సంవత్సరంలో జన్మించాడని కొందరు లెక్కలు వేశారు. ఢిల్లీ చాప్టర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అన్ వేదాస్ డైరెక్టర్ సరోజ్ బాల రామాయణం, భారతాలు జరిగినవనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని రామాయణ కాలం క్రీ.పూ. 7000 సంవత్సరాలలోపు జరిగిందని అంచనా వేశారు. ఏది ఏమైనా గౌతమబుద్ధుని కంటే కనీసం 1000–700 సంవత్సరాల కంటే ముందే రాముడు ఉన్నాడని చరిత్రకారులు చెప్తున్నారు. రాముడు బుద్ధుని కంటే ముందే అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. దశావతారాల ప్రకారం కూడా రామావతారం, కృష్ణావతారం తర్వాతనే బుద్ధావతారం అని చెప్తారు. అందుచేత రాముడు బుద్ధుడు దొంగ వంటివాడు అని చెప్పడం కచ్చితంగా జరగలేదని చెప్పవచ్చు. ఎందుకంటే రామాయణం జరిగిన ఎన్నో వందల సంవత్సరాల తరువాతనే బుద్ధుడు జన్మించాడు అంటే రాముడు బుద్ధుడు దొంగ వంటివాడు అనడం కచ్చితంగా ప్రక్షిప్తమని చెప్పవచ్చు. అలాగే శంబుకుని కథ ప్రక్షిప్తం అని పండితుల, విజ్ఞుల అభిప్రాయం. రామాయణం ప్రకారం రావణాసురుడు బ్రాహ్మణుడు, వేదాలు చదివిన వాడు. గొప్ప శివ భక్తుడు. అతడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని అధికారానికి, సంపదలకు, భార్యలకు కొదవలేదు. కానీ శూర్పణఖ తప్పుడు సలహాతో కామప్రేరితుడై సీతను అపహరించి వినాశనాన్ని కొనితెచ్చుకున్నాడు. రామాయణాన్ని రచించిన వాల్మీకి మొదట బోయవాడు. రాముడు గుహుని, శబరిల ఆతిథ్యాన్ని స్వీకరించడం, సుగ్రీవునితో స్నేహం చేయడం, జటాయువుకు దహన సంస్కారాలు చేయడం ఈవిధంగా ఏ కోణంలో చూసినా రామాయణం కులతత్వాన్ని, వర్ణ వివక్షతను సమర్థించదు. ఏ గ్రంథమైనా, ఏ మహానుభావుని చరిత్ర అయినా ఏ పురాణ కథ అయినా అందులోని నీతి ఏమిటి. అది మానవులకు ఇచ్చే సందేశం ఏమిటి? అనే విషయాలను గమనించాలి. అందులోని మంచిని స్వీకరించాలి. రాముడు దేవుడు కాదని ఎవరైనా వాదిం చినా, రామాయణంలోని నీతిని, జీవన విధానాలను తప్పుపట్టలేడు కదా. గురువుల, పెద్దల సలహా పాటించాలి, ఆడిన మాటకు కట్టుబడి ఉండాలి, తండ్రి మాటను గౌరవించాలి, భర్త కష్టాల్లో పాలు పంచుకోవాలి, అన్నదమ్ములు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ధర్మ మార్గాన్ని అనుసరించాలి. పరస్త్రీలపై కన్ను వేయరాదు. ఇది రామాయణం బోధించిన ప్రధాన జీవన విధానాలు. ఇలాంటి జీవన విధానాలు ప్రపంచ మానవాళికి ఆదర్శం కాదా? జస్టిస్ బి. చంద్రకుమార్ విశ్రాంత న్యాయమూర్తి మొబైల్ : 79974 84866 -
మహేశ్ సినిమాలో హృతిక్ రోషన్!
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మహేశ్బాబు, హృతిక్ రోషన్ స్టార్డమ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటిది ఈ ఇద్దరూ స్క్రీన్న్ షేర్ చేసుకుంటే ఈ ఇద్దరి హీరోల అభిమానులకు పండగే. ఆ ప్రాజెక్ట్ ఎంత భారీగా ఉంటుందో ఊహించుకోవచ్చు. మహేశ్, హృతిక్ కలిసి ఓ సినిమా చేయనున్నారనే టాక్ ఇప్పుడు బీ టౌన్లో బలంగా వినిపిస్తోంది. రామాయణం ఆధారంగా ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి, ‘మామ్’ ఫేమ్ రవి ఉడయార్ సంయుక్త దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని దాదాపు రెండు సంవత్సరాల క్రితం ప్రకటన వచ్చింది. అప్పటి ప్రకటన ప్రకారం ఈ త్రీడీ రామాయణానికి అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా, మధు మంతెన నిర్మాతలు. ఏడాది క్రితం ఈ సినిమా ప్రీ ప్రొడక్ష¯Œ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత ఈ సినిమా గురించిన అప్డేట్స్ పెద్దగా తెరపైకి రాలేదు. రామాయణం బ్యాక్డ్రాప్లో ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ సినిమాను ఎనౌన్స్ చేయడమే ఇందుకు కారణం అనే టాక్ బాలీవుడ్లో వినిపించింది. కానీ అలాంటిది ఏమీ లేదని.. నితీష్, రవి ఉడయార్ స్క్రిప్ట్పై వర్క్ చేస్తూనే ఉన్నారని... ఈ సినిమాను మూడు భాగాలుగా తీయాలనుకుంటున్నారని బీ టౌన్లో ఇప్పుడు చెప్పుకుంటున్నారు. అంతేకాదు... ఈ సినిమాలోని రాముడి పాత్రకు మహేశ్బాబును, రావణుడి పాత్రకు హృతిక్ రోషన్ను సంప్రదించారట దర్శకుడు నితీష్. మరి... మహేశ్, హృతిక్ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? వెయిట్ అండ్ సీ. చదవండి: అక్షయ్ కుమార్ క్షేమంగా ఉన్నారు : ట్వింకిల్ ఖన్నా కరోనా కలకలం: దిల్ రాజు ఎంత పనిచేశావ్.. -
మహేశ్ ‘రామాయణం’.. సీతగా స్టార్ హీరోయిన్!
రామాయణం ఇతిహాసంపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఈ మహాకావ్యం నేపథ్యంలో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ ఇతిహాసం నేపథ్యంలోనే ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నాడు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావసణుడిగా నటిస్తున్నాడు. సీతగా కృతి సనన్ నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో 3డీ టెక్నాలజీలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి పోటీగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెన కలిసి రామాయణాన్ని 3డి ఫార్మాట్ లో తీయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ‘దంగల్’ దర్శకుడు నితీష్ తివారీ, ‘మామ్’ దర్శకుడు రవి ఉడయార్ దర్శకత్వం వహించనున్నారట. వాస్తవానికి రామాయణం ఇతీహాసం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు మధు మంతెన, అల్లు అరవింద్ గతంలో అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నామని, మొదటి భాగాన్ని 2021లో విడుదల చేస్తామని చెప్పారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు ప్రభాస్ ‘ఆదిపురుష్’ చేస్తున్న తరుణంలో మరోసారి ఈ ప్రాజెక్టు వార్తల్లో నిలిచింది. మహేశ్తో ఈ ప్రాజెక్టుని తెరకెక్కించాలని నిర్మాతలు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు గురించి ఆయనతో చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో సీతగా దీపికా పదుకోన్, రావణుడ హృతిక్ రోషన్ నటించబోతున్నట్లు టాక్. మరి మహేశ్ రామాయణం ఎప్పడు పట్టాలెక్కుతుందో చూడాలి. -
మీటూ కేసు : రామాయణం ప్రస్తావన
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ వేసిన పరువు నష్టం దావా కేసు నుంచి జర్నలిస్టు ప్రియారమణికి విముక్తి లభించింది. 2018లో మీటూ ఉద్యమం నేపథ్యంలో ఎంజే అక్బర్ తనని లైంగికంగా వేధించారంటూ ప్రియారమణి చేసిన ఆరోపణలపై అక్బర్ కోర్టుకెక్కారు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. అయితే ప్రియారమణికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ ఎంజే అక్బర్ వేసిన దావాను ఢిల్లీ కోర్టు బుధవారం కొట్టేసింది. లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళలకి దశాబ్దాల తర్వాత కూడా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ వేదికలోనైనా తనకు జరిగింది వెల్లడించే హక్కు ఉందని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాంజే స్పష్టం చేశారు. తీర్పుని వెలువరించే సమయంలో న్యాయమూర్తి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘంలో హోదా ఉన్న వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడలేదని చెప్పలేమని అన్నారు. ‘‘లైంగిక వేధింపులపై తమ గళం విప్పిన మహిళల్ని శిక్షించలేము. ఒక వ్యక్తి పరువు తీశారని ఫిర్యాదులు వచ్చినా మహిళల్ని శిక్షించడానికి వీల్లేదు. మహిళల మర్యాదని పణంగా పెట్టి సంఘంలో మరో వ్యక్తి పరువుని కాపాడలేము’’ అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ‘‘లైంగిక వేధింపులతో మహిళల ఆత్మగౌరవం, మర్యాదకి భంగం వాటిల్లుతుంది. తనపై జరిగిన నేరంతో ఆమె తీవ్రమైన మానసిక సమస్యలనెదుర్కొంటుంది. నాలుగు గోడల మధ్య జరిగిన ఘటనలపై ఒక్కోసారి ఆమె పెదవి విప్పలేకపోవచ్చు. ఒక్కో సారి ఆమెకి అన్యాయం జరిగిందని కూడా బాధితురాలికి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే లైంగిక వేధింపులకు గురైన మహిళలు దశాబ్డాల తర్వాత కూడా బయట ప్రపంచానికి వెల్లడించవచ్చు’’ అని మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు.‘‘లైంగిక వేధింపులతో బాధితురాలు ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటుందో సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి కూడా మిగిలిన వారిలాగే మన సమాజంలో కలిసిపోతారు. అతనికీ కుటుంబం, బంధువులు, స్నేహితులు ఉంటారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలోనే ఉంటారు. ఈ విషయాన్ని అందరూ గ్రహించుకోవాలి’’ అని మేజిస్ట్రేట్ రవీంద్రకుమార్ వ్యాఖ్యానించారు. మహిళల్ని గౌరవించాలంటూ రామాయణ, మహాభారతం వంటి పవిత్ర గ్రంథాలు రాసిన నేలపై వారి పట్ల జరుగుతున్న అకృత్యాలు సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు. మహిళలు ఇక మాట్లాడాలి ఢిల్లీ కోర్టు వెలువరించిన తీర్పు పట్ల ప్రియారమణి హర్షం వ్యక్తం చేశారు. తన గెలుపు మరెందరో మహిళల్ని పెదవి విప్పేలా ప్రోత్సహిస్తుందని ప్రియారమణి వ్యాఖ్యనించారు. ‘‘నేను చేస్తున్న పోరాటం నా ఒక్కదాని కోసం కాదు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలందరి తరఫున పోరాడుతున్నాను. కేవలం మాట్లాడానని నన్ను ఈ కేసులోకి లాగారు. ఒక బాధితురాలినైన నన్ను ముద్దాయిగా బోనులో నిలబెట్టారు. సమాజంలో పలుకుబడి ఉందని, శక్తిమంతులమని బావించే మగవాళ్లు బాధిత మహిళల్ని కోర్టుకీడ్చడానికి ఇకపై ముందు వెనుక ఆలోచిస్తారు’’ అని ప్రియారమణి అన్నారు. ఈ కేసులో తాను విజయం సాధించేలా శ్రమించిన తన లాయర్లకి ప్రియారమణి ధన్యవాదాలు తెలిపారు. -
రామాయణ, భారతాలపై ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన బాల్యంలో రామాయణం, మహాభారతం వంటి హిందూ ఇతిహాస కథలను వింటూ పెరిగానని గుర్తు చేసుకున్నారు. ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకంలో తన బాల్య స్మృతులను నెమరువేసుకున్నారు. చిన్నతనం అంతా ఇండోనేషియాలో రామాయణ, భారతాలను వింటూ గడిపానని.. ఆ కారణంగా భారతదేశానికి తన మనసులో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు."ప్రపంచ జనాభాలో ఆరవ వంతు, రెండువేల విభిన్న జాతి సమూహాలు, ఏడు వందలకు పైగా భాషలతో మాట్లాడే ప్రజలతో (భారతదేశం) పరిపూర్ణ పరిమాణం కారణంగా భారత్కు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది" అని ఒబామా తన తాజా పుస్తకంలో భారతదేశంపై తనకు గల ఇష్టాన్ని చెప్పుకొచ్చారు. 2010లో తన అధ్యక్ష పర్యటనకు ముందు వరకు తాను భారతదేశానికి వెళ్ళలేదని.. కాకపోతే ఆ దేశం గురించి తన మదిలో ఎప్పుడు ఓ ప్రత్యేక స్థానం ఉందన్నారు ఒబామా. "నా బాల్యంలో కొంత భాగం ఇండోనేషియాలో రామాయణం మహాభారతం పురాణ హిందూ కథలు వింటూ గడపడం వల్లనో.. తూర్పు మతాల పట్ల నాకున్న ఆసక్తి కారణంగానో.. పాకిస్తానీ, భారతీయ కళాశాల స్నేహితుల బృందం కారణంగా కావచ్చు. వారి వల్ల నాకు పప్పు, కీమా వండటం అలవాటయ్యింది. బాలీవుడ్ సినిమాలకు ఆకర్షితుడిని అయ్యాను" అని ఒబామా తన పుస్తకంలో రాసుకొచ్చారు. (చదవండి: అపరిపక్వత, సౌందర్యం, చిత్తశుద్ధి!) అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (2009 – 2017) రాసుకున్న జ్ఞాపకాల దొంతర ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో తన బాల్యంతోపాటు రాజకీయంగా ఎదిగిన వైనం వంటి పలు అంశాలు ఉన్నాయి. 2008లో అధ్యక్ష పదవి కోసం నడిపిన చారిత్రక ఎన్నికల ప్రచారం వివరాలు, అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ 768 పేజీల పుస్తకంలో పొందుపరిచారు. అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒబామా ప్రస్థానాన్ని రెండు భాగాలుగా ప్రచురించనుంది. తొలి భాగమైన ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ ఈ రోజు విడుదల అయ్యింది. (ప్రామిస్డ్ ల్యాండ్: ‘సారా పాలిన్ ఎవరు?’) -
మన సంప్రదాయాలకు వాల్మీకీ రామాయణం ఆదర్శం
సింగపూర్ : మన సంస్కృతీ, సాంప్రదాయాలకు వాల్మీకి రామాయణం ఆదర్శమని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. టీటీడీ పద్మావతి డిగ్రీ, పీజీ కళాశాల, సింగపూర్ తెలుగు సమాజం సంయుక్త ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి సందర్భంగా ‘వాల్మీకి రామాయణ సందేశం‘ అంతర్జాతీయ అంతర్జాల సదస్సు నిర్వహించారు. ఉపన్యాసకులుగా ఇండోనేషియా నుంచి రామాయణ హరినాథ్ రెడ్డి వ్యవహరించారు. ముఖ్య అతిథిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక శ్రీ పద్మావతి అతిథి గృహం వేదికగా అంతర్జాల సదస్సును అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. రామాయణ సందేశం నేటి సమాజానికి ఆవశ్యకమని స్పష్టం చేశారు. భగవంతుడు స్వయంగా మానవునిగా అవతరించారని, ఎలా జీవించాలనే చూపారని తెలిపారు. త్రేతాయుగం నాటి శ్రీ రామ చంద్రుడు కుటుంబ ధర్మం, పితృ వాక్ పరిపాలన, రాజ్య పాలన వంటివి గొప్పగా చేపట్టి చక్కటి సందేశాన్ని ఇచ్చారన్నారు. నేటి యువత తప్పక వాల్మీకి రామాయణం ద్వారా ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని ఆకాంక్షించారు. శ్రీరాముని గుణగణాలను విద్యార్థులు అలవర్చుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహదేవమ్మ అన్నారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి జయంతి నాడు ఆయన రాసిన రామాయణం వినడం పుణ్యఫలం అన్నారు. వాల్మీకి రామాయణ సందేశం ఉపన్యాసకులు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ధర్మప్రవర్తనా పరుడైన శ్రీ రాముని చరిత్ర వింటేనే జన్మ తరిస్తుందన్నారు. సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రామాయణ విశిష్టతను తెలియజేసేందుకు తాము చేపట్టిన కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని అన్నారు. ఈ అంతర్జాతీయ అంతర్జాల సదస్సుకు దాదాపు 25 దేశాల నుంచి ప్రతినిధులు వెబినార్ కు హాజరయ్యారు. ఇందులో ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, పిలిప్పైన్, ఇండోనేషియా, యుఎస్ఎ తదితర దేశాలు ఉన్నాయి. వేల సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ఈ వెబినార్ లో పాల్గొన్న ప్రతినిధులకు టీటీడీ ఈ సర్టిఫికెట్ ను అందజేయనుంది. -
తమ్ముడా! నువ్వు చెప్పిందే నిజం...
వినేవాడయితే ఒక్క మాట చాలు...జీవితాలు మారిపోతాయి. వినడమన్నది అలవాటు లేకపోతే ఎంత మంది వచ్చి ఎన్ని మాటలు చెప్పినా అవి వారి జీవితంలో ప్రయోజకత్వాన్ని ఇవ్వవు. సీతమ్మ కనబడకపోతే–రామచంద్ర మూర్తి కోపాన్ని పొంది...‘‘ఈ వేళ నేను నా రాచబాణంతో ఆకాశాన్నంతటినీ కప్పేస్తాను.. పంచభూతాల్లో ఏ ఒక్క భూతం కూడా కదలదు. యథాకాలో యథామృత్యుర్ యథాజరా యథా విధిః నిత్యం న ప్రతిహ్నం యంతే.. .ఓ లక్ష్మణా! ఏమనుకుంటున్నాయో.. వృద్ధాప్యాన్ని ఎలా దాటలేరో, మృత్యువును ఎలా జయించలేరో, కాలాన్ని ఎలా అధిగమించలేరో ఈ వేళ నన్నలా దాటలేరెవ్వరూ.. సమస్త బ్రహ్మాండాలన్నీ లయం చేస్తాను... ’’ అని హూంకరించాడు. వెంటనే లక్ష్మణుడు వచ్చి కాళ్ళమీద పడ్డాడు. చదవండి: పహిల్వాన్ గర్వభంగం ‘‘అన్నయ్యా! ఏమిటీ కోపం!!! సీతమ్మ కనబడలేదనీ.. అడిగితే నీకు బదులివ్వలేదని సమస్త భూతములను లయం చేసేస్తావా? చంద్రేలక్ష్మీ, ప్రభాసూర్యే, గతిర్వాయుః.. భువి క్షమ.. ఉత్తమమ్ యశః,...చంద్రుడు అంటే కాంతి, భువి అంటే క్షమ, వాయువు అంటే కదులుతుంది...నువ్వంటే ఏమిటి...గొప్ప కీర్తి..రాముడంటే ఓర్పు, క్షమ, వింటాడు. గురువులు ఏది చెప్పారో దాన్ని ఆచరణాత్మకం చేస్తాడు...అని కీర్తి నీకు...సీతమ్మ జాడ చెప్పలేదని అందర్నీ చంపేస్తావా...??? ఎవడెత్తుకెళ్ళాడో వాడిని చంపాలి అన్నయ్యా...ఓర్చుకో..’’ అన్నాడు లక్ష్మణుడు. చదవండి: వారి మాట సలహా కాదు, శాసనం ఆ.. మహా చెప్పొచ్చావులే...ఆశ్రమంలో ఉండి వదినను కనిపెట్టుకుని ఉండరా అంటే ఉండకుండా వచ్చేసావ్.. అసలు నీవల్లే వచ్చిపడిందీ కష్టమంతా..కాబట్టి నీ మాట అస్సలు వినను...’’ అనవచ్చు రాముడు. కానీ అలా అనలేదు...‘‘తమ్ముడా! నీవు చెప్పింది సత్యం. ఎవడు అపహరించాడో వాణ్ణి సంహరిస్తా. ఈ బ్రహ్మాండాలను లయం చేయను’’ అంటూ వెళ్ళిపోయాడు. మాట విన్నాడు కాబట్టి అంత కీర్తిమంతుడయ్యాడు. లక్ష్మణుడి మాట వినకుండా రాముడు బ్రహ్మాండాలను లయం చేసుంటే... మొట్టమొదట ఎవరు తలదించుకుని ఉండేవారంటే... వశిష్ఠ విశ్వామిత్రులు. ఇటువంటి అయోగ్యుడికి మేమింత ధనుర్వేదాన్నిచ్చాం. చిన్న కష్టం వచ్చేటప్పటికి బ్రహ్మాండాలను లయం చేసేసాడు. ఓర్పు లేనివాడికి మేమా విద్య ఇవ్వకుండా ఉండాల్సింది.ఇవ్వడమే మేము చేసిన తప్పు’’ అని తలదించుకోవాల్సి వచ్చేది. చెప్పిన మాట రాముడు విన్నాడు కాబట్టి వశిష్ఠవిశ్వామిత్రులు పొంగిపోయారు. నిజంగా రాముడికి యుద్దంలో కష్టమొస్తే అగస్త్యుడు పరుగుపరుగున వచ్చాడు. ఆదిత్య హృదయం ఉపదేశం చేసాడు. పాత్రత దేనివలన నిలబడుతుంది... అంటే చెప్పిన మంచి మాట వినడం వలన. మాటలు ఎన్నయినా సారభూయిష్టమైన ఒక్క మాట చాలు. సాలగ్రామం ఎక్కడో ఉండదు. రాళ్ళకుప్పల్లో వెతికితేనే దొరుకుతుంది. అలా ఒక మంచి మాట కోసం ఒక పుస్తకాన్నంతటినీ చదవాలి. ఒక్క మంచి మాట కోసం ఎన్ని మంచి మాటలయినా వినాలి. వాటిలో సారవంతమయిన ఒక్క మంచి మాటను జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలి. దాన్ని అనుష్టాన పర్యంతంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా ‘నా అంతటి వాడను నేను . నాకు వాళ్ళు చెప్పేదేమిటి? నాకు వాడు చెప్పొచ్చేవాడా? వాడు చెప్పడం, నేను వినడమా...???’ అని అహంకార పూరిత వ్యక్తిత్వంతో ఉండేవాడు జీవితంలో ఎప్పటికీ వృద్ధిలోకి రాలేడు. అలా కాకుండా గురువుగారు ఆ మాట ఎందుకన్నారో.. అయినా నా మంచికేగా చెప్పింది..అని స్వీకరించినవాడు ధన్యాత్ముడు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఎప్పుడు ఏది చేయాలో అప్పుడే చేయాలి
కాలం భగవంతుని స్వరూపం. ఈ సష్టిలో అత్యంత బలమైనది కాలమే. కాలానికి సమస్త జీవరాశీ వశపడవలసిందే. కాలానికి లొంగకుండా బతకగలిగినది ఈ సష్టిలో ఏదీ లేదు. అందుకే శ్రీ రామాయణంలో కాలం గురించి చెబుతూ...‘‘కాలోహి దురతి క్రమః’’ అంటారు మహర్షి. అంటే ..కాలాన్ని దాటడం, తనకు వశం చేసుకోవడం, దాన్ని కదలకుండా చేయగలగడం...లోకంలోఎవరికీ సాధ్య పడదు–అని. సాధారణ సిద్ధాంతంలో అందరూ కాలానికి వశపడవలసిందే. కాలంలో పుడతారు, కాలంలో పెరుగుతారు, కాలంలోనే శరీరాన్ని విడిచి పెడతారు. అందరూ కాలానికి వశపడి ఉంటారు. కానీ ఎవడు భగవంతుడిచ్చిన జీవితం అనబడే ఈ శరీరంతో ఉండగలిగిన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడు తన శరీరాన్ని విడిచి పెట్టేసిన తరువాత కూడా కీర్తి శరీరుడిగా నిలబడిపోతాడు. ఆయనకి కీర్తే శరీరం అవుతుంది. ఆయన కాలంతో సంబంధం లేకుండా యుగాలు దాటిపోయినా కూడా కొన్ని కోట్ల మందికి ప్రేరణగా అలా నిలబడిపోతాడు. అందుకే మనుష్యుని జీవితంలో అన్నిటికన్నా అత్యంత ప్రధానమైనదిగా చెప్పబడేది – కాలం విలువను గుర్తించడం. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఎవడు కాలం విలువని గుర్తించలేడో ఎవడు కాలాన్ని సద్వినియోగం చేసుకోలేదో వాడు కాలగర్భంలో కలిసిపోతాడు. ఆ జీవితం ఏ విధంగా కూడా ఉపయోగకరం కాదు. తనను తాను ఉద్ధరించుకోవడానికిగానీ, మరొకరిని ఉద్ధరించడానికిగానీ పనికిరాడు. కాలం విలువ తెలిసి ఉండాలి. అందుకే రుషులు కాలాన్ని అనేక రకాలుగా విభాగం చేసారు. సంవత్సరాన్ని ఒక ప్రమాణం చేసారు. దాన్ని ఉత్తరాయనం, దక్షిణాయనంగా విడదీసారు. దక్షిణాయనం అంతా భగవంతుడిని ఉపాసన చేయవలసిన కాలంగా నిర్ణయించారు. మళ్ళీ దాన్ని నెలగా, దాన్ని శుక్ల, కష్ణ పక్షాలుగా, పక్షంలో ఒక రోజును తిథిగా దాన్ని పగలు, రాత్రిగా విభజించారు. ఎన్ని విభాగాలుగా చేసినా దాని ప్రయోజనం – ఆ కాలాన్ని, దాని వైభవాన్ని ఎన్ని రకాలుగా మనిషి గుర్తించగలడో గుర్తించి, దాని చేత మనిషి సమున్నతమైన స్థానాన్ని పొందగలుగుతాడు. కాలంలో ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పనిని అప్పడు చేసినవాడు తాను ఆశించిన స్థితిని పొందుతాడు. శ్రీ రామాయణంలో ఒక మాటంటారు...సత్పురుషులయిన వాళ్ళు కోపానికి వశులుకారు–అని. కానీ వాళ్ళు కూడా కోపాన్ని పొందుతారు. ఎవర్ని చూస్తే కోపం వస్తుంది? కేవలం ఒక పనిని గొప్పగా చేయడం కాదు. ఏ పని ఎప్పుడు చేయాలో ఆ పనిని అప్పుడు చేసినవాడు ధన్యుడు. అలా కాకుండా ఒక పనిని చేయవలసినప్పుడు కాకుండా వేరొక సమయంలో చేసిన వాడు, ఆలస్యం చేసిన వాడు, సమయానికి చేయనివాడెవడో వాడిని చూస్తే సత్పురుషులకు కోపం వస్తుంది. అంటే కాల విభాగం లో ఎప్పుడు ఏ పని చేయాలో తెలుసుకుని అప్పుడు ఆ పని చేయవలసి ఉంటుంది. సాక్షాత్ భగవంతుడు అవతారం తీసుకుని నరుడిగా రామచంద్రమూర్తిగా వచ్చినా.. ఆయనను నిద్ర లేపాల్సి వస్తే ఆ కాలము నందు అతను చేయాల్సిన పనిని విశ్వామిత్రుడు గురువుగా జ్ఞాపకం చేయాల్సి వచ్చింది...‘‘కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికమ్...’’ అని. -
స్టార్ మాలో రామాయణం
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, బంధాలలోని గొప్పతనాన్ని, విలువలతో కూడిన జీవన విధానాన్ని చెప్పే ఇతిహాసం రామాయణం. తండ్రిమాటను జవదాటని కుమారుడు...ఆ కుమారునిపై అవాజ్యమైన ప్రేమను కురిపించే తండ్రి, పతి బాటలలోనే సతి అనే ఇల్లాలు... ఇలా ఎన్నో బంధాలు, మరెన్నో జీవనసత్యాలను తెలియజేసే మహోన్నత పౌరాణిక గాథ రామాయణం. భారతీయ జీవనగమనంలో అంతర్భాగమైన ఈ పుణ్యగాథ నేటి తరానికి మార్గనిర్ధేశకం. టెలివిజన్ చరిత్రలో ఓ సంచలనంగా 1980లలో రామానంద్ సాగర్ తీసిన రామయణ్ గాథను ఇప్పుడు తెలుగులో స్టార్ మా ఛానెల్ ప్రసారం చేయబోతుంది. అంతర్జాతీయంగా ఓ పౌరాణిక గాధకు అత్యధిక వీక్షణ రేటింగ్ తెచ్చుకోవడం ద్వారా గిన్నీస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్న రామాయణ్ను లాక్డౌన్ కాలంలో పునః ప్రసారం చేశారు. అయితే హిందీ భాషలో ఉండటం, భావం అర్థం అయినా భాష అర్థంగాక పోవడం వంటి సమస్యలను కొంతమంది అభిమానులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యలకు తగిన పరిష్కారం అందిస్తూనే రామానంద్ సాగర్ తీసిన 'రామాయణ్' సీరియల్ను స్టార్ మా ఛానెల్ తెలుగులో ప్రసారం చేయబోతుంది. ఈ సీరియల్ కోసం తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు అనకాపల్లికి చెందిన వృద్ధురాలు సావిత్రమ్మ. తన యుక్త వయసులో తాను ఈ సీరియల్ను దూరదర్శన్లో ఆదివారం పూట వీక్షించేవారమంటూ, అప్పట్లో ఇంటిల్లిపాది ఈ సీరియల్నూ క్రమం తప్పకుండా చూసేవారమని, మరలా ఇన్నాళ్లకు లాక్డౌన్లో మరలా ప్రసారం చేయడం చూశామన్నారు. భాష అర్థంగాకపోవడం కొంత సమస్యగా ఉండేది కానీ ఇప్పుడు స్టార్ మా వారు తెలుగులో ప్రసారం చేస్తున్నారని తెలిసి చాలా సంతోషంగా ఉందన్నారు. ఆమెనే మాట్లాడుతూ భారతీయ జీవనశైలికి ప్రతిరూపం రామాయణం. కనుమరుగవుతున్న కుటుంబ బంధాల వేళ పరమ పవిత్రమైన రామాయణ మహాకావ్యం మనందరికీ జీవనముక్తి మార్గం చూపడమే కాదు బంధాలను ఎలా నిలుపుకోవాలో కూడా చూపుతుందన్నారు. ఈ ధారావాహిక సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతి రోజూ సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతుంది. -
‘రెండు గంటల మాటలు.. పెళ్లి చేసుకుందాం’
.‘రామాయణ్’ (1987) టీవీ సీరియల్లో సీతగా నటించి, అప్పటి తరానికి అభిమాన తారగా మిగిలిపోయారు దీపికా. అప్పట్లో ఆమెను అసలు పేరుతో కాకుండా ‘సీత’ అనే చాలామంది పిలిచేవారు. ఆ పాత్రను అంత అద్భుతంగా చేశారు దీపికా. టీవీ రామాయణంలోని సీతమ్మ.. దీపికా చికాలియా మొదటిసారి అతడిని 1983 నాటి తన తొలిచిత్రం ‘సున్ మేరీ లైలా’ షూటింగ్ లో చూశారు. మళ్లీ 1991 ఏప్రిల్ 28న అతడిని చూశారు. ఆరోజు అతడి పక్కన ఇద్దరికీ తెలిసిన వాళ్లెవరో ఉన్నారు. ఆ ఎవరో వెళ్లిపోయాక వీళ్లిద్దరే ఉన్నారు. రెండు నిమిషాలు మాట్లాడుకున్నారు. తర్వాత రెండు గంటలు మాట్లాడుకున్నారు! ఏం మాట్లాడుకున్నారో దీపికా చికాలియా చెప్పడం లేదు కానీ, పెళ్లి చేసుకుందామని ఆ రెండు గంటల్లోనే ఇద్దరూ డిసైడ్ అయిపోయారట. లాక్డౌన్ తీరిక ఇంటర్వ్యూలో ఈ సంగతి బయట పెట్టారు చికాలియా. ఆమె భర్త హేమంత్ టోపీవాలానే ఆనాటి ’అతడు’.. (సరోజినీ నాయుడుగా..) -
రామాయణంపై మిమ్స్.. నటుడిపై నెటిజన్ల ఫైర్
టివి నటుడు కరణ్వీర్ బోహ్రా ఇటీవల రామాయణంలోని ఓ సన్నివేశాన్ని షేర్ చేసి విమర్శల పాలయ్యాడు. రామయణంలోని ఓ యుద్ధ సన్నివేశాన్ని జూమ్ చేసి వారు యుద్ధానికి బదులుగా గార్బా ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు అంటూ ఫన్నీ మిమ్స్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో నెటిజన్లు ఆయనపై విమర్శల జల్లు కురిపించారు. అంతేగాక దీనికి బ్యాక్రౌండ్లో ‘లవ్యాత్రి’ సినిమాలోని ‘చోగడ’ పాట జోడించాడు. అంతేగాక ‘ఉద్యోగానికి మీరు తగినంత జీతం తీసుకోనప్పుడు’ అనే క్యాప్షన్తో షేర్ చేస్తూ.. @gameofthrones మాదిరిగా వారు ఏ పురాణ యుద్ధాన్ని సృష్టించారో మేము ఆలోచించాము అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చాడు. (కుక్కకు డాక్టరేట్ ఇచ్చిన వర్జీనియా వర్శిటీ) మన సంస్కృతికి అద్దం పట్టే పవిత్ర రామయాణాన్ని హాస్యాస్పదం చేసిన కరణ్పై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘ఇది మన సంస్కృతినే అగౌరవపరిచినట్లు’,‘ఇలాంటి వ్యక్తులే వారి స్వంత సంస్కృతిని పరిహాస్యం చేస్తారు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. మరికొందరు ఆయన దీనికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో కరణ్ తన పోస్టుకు వివరణ ఇస్తూ.. ‘నేను మన సంస్కృతిని కానీ దేవుళ్లను అగౌరవ పరచలేదు. ఎందుకంటే నేను హిందూ భక్తుడిని. అంతేగాక ఆధ్యాత్మిక భావన కలిగిన వ్యక్తిని కూడా. ఈ పోస్టు వెనకాల ఉన్న ఓ వ్యక్తి యుద్ధంలో పాల్గొనాల్సింది పోగా బదులుగా డ్యాన్స్ చేసినందుకు అతడిని ఉద్దేశిస్తూ ఈ పోస్టు చేశాను’ అని పేర్కొన్నాడు. (ఆయన సోదరుడు షమాస్ కూడా కారణం: అలియా) View this post on Instagram I had to post this 🤣🤣🤣🤣 and we used to think, what an epic war they created, just like @gameofthrones A post shared by Karanvir Bohra (@karanvirbohra) on May 13, 2020 at 11:31am PDT -
ఒక్కరోజులోనే ఆ సీరియల్కు 50 మిలియన్ వ్యూస్
సాక్షి, ఢిల్లీ : ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఇప్పటికే సినిమాలు, సీరియళ్లు, వీడియోగేమ్లు, అమెజాన్ప్రైమ్లు..అబ్బో చాలానే వచ్చేశాయి. అయినప్పటికీ మన భారతీయులకు రామాయణ, మహాభారతం లాంటి పౌరాణిక గాధలపై మమకారం ఏమాత్రం తగ్గలేదు. అప్పటికీ, ఇప్పటికీ అదే ఆదరణ, అదే భక్తి వాత్సల్యం. దీనికి నిదర్శనమే ఇప్పుడు దూరదర్శన్ ఛానెల్కు లభిస్తున్న రేటింగ్. ప్రస్తుతం దూరదర్శన్లో ప్రసారమవుతున్న రామాయణ్, మహాభారత్ సీరియల్స్.. రేటింగ్స్లో దుమ్ముదులిపే రికార్డులను సాధిస్తుంది. 33 ఏళ్ల క్రితం ప్రసారమైన ఈ సీరియల్స్..లాక్డౌన్ పుణ్యమా అని మళ్లీ టెలికాస్ట్ అయ్యాయి. రామానంద్సాగర్, బిఆర్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన రామాయణ్, మహాభారత్ సీరియళ్లకు భారీ ఆదరణ లభిస్తోంది. దూరదర్శన్లో ప్రసారమవుతున్న ఈ సీరియల్స్ మొదటి నాలుగు ఎపిసోడ్లకు 170 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు బార్క్ ఇండియా తెలిపింది. వీటిలో ఆదివారం ప్రసారమైన ఒక్క ఎపిసోడ్కే 5కోట్ల వ్యూయర్షిప్ నమోదైంది.దేశ చరిత్రలోనే సీరియల్స్కు ఈ రేంజ్లో వ్యూయర్షిప్ రావడం ఇదే మొదటిసారి.దీంతో డీడీ ఛానల్ వ్యూయర్షిప్ అమాంతం పెరిగింది. దీంతో డీడీ ఛానల్కి మునుపెన్నడూ లేనంతగా 650 శాతం లాభాల్లో దూసుకుపోయింది. దీనిపై దూదర్శన్ సీఈవో శశి శేఖర్ మాట్లాడుతూ.."దూరదర్శన్ వీక్షకులందరికీ చాలా ధన్యవాదాలు. భారతదేశం అంతటా అత్యధిక వీక్షించిన ఛానెల్ ఇదే. మీ అందరి మద్దతుకు కృతఙ్ఞతలు. ఇంట్లోనే ఉండండి. సురక్షితంగా ఉండండి "అంటూ ట్వీట్ చేశారు. A Big Thank You to all the viewers of Doordarshan - per @BARCIndia the most viewed channel during week 13 is @DDNational across India. With your support Public Broadcaster has helped India Stay Home, Stay Safe as we fight back #COVID-19 pandemic. — Shashi Shekhar (@shashidigital) April 9, 2020 మార్చి 28న రీ టెలికాస్ట్ అయిన ఈ సీరియల్స్..పాత రికార్డులను బద్దలుకొడుతూ కొత్త రికార్డులను సెట్చేసింది. పైగా దీని ద్వారీ ఈ తరం వారికి పౌరణిక గాధలపై అవగాహన ఏర్పడే మంచి అవకాశం లభించింది. -
నా పేరుతో ట్విటర్లో నకిలీ ఖాతా: గోవిల్
తన అసలు ప్రొఫైల్ ఫొటోతో సోషల్ మీడియా నకిలీ ఖాతా ఉందని నటుడు అరుణ్ గోవిల్ అభిమానులకు స్పషం చేశాడు. ఈ విషయాన్ని తన అసలు ట్విటర్ ఖాతాలో వీడియో ద్వారా గురువారం వెల్లడించారు. ‘కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నేను ఇచ్చిన సందేశాన్ని చూసిన ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్లో కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో ఆయన నా పేరుపై ఉన్న నకిలీ ట్విటర్ ఖాతాకు ట్యాగ్ చేశారు. అప్పుడే తెలిసింది నా పేరుపై నకిలీ ట్విటర్ అకౌంట్ ఉందని’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు. అంతేగాక తన పేరుపై ఉన్న నకిలీ ఖాతాను ఫాలో అవుతున్న అభిమానులు వెంటనే అన్ఫాలో కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. (ఎక్తా కపూర్పై విరుచుకుపడ్డ ‘శక్తిమాన్’ హీరో) नमस्कार भाइयों एवं बहनो, एक आवश्यक सूचना आपको इस विडीओ के माध्यम से देना चाहता हूँ । आशा करताहूँ आप अवश्य समर्थन करेंगे !@realarungovil से विनती करें कि वो ऐसा ना करें ! pic.twitter.com/k7k9j8eWvi — Arun Govil (@arungovil12) April 6, 2020 కాగా రామనంద సాగర్ నిర్మించిన రామాయణంలో రాముడి పాత్ర పోషించాడు గోవిల్. రాముడి పాత్రతో ఆయన మంచి పేరు తెచ్చున్నారు. ప్రేక్షకుల నుంచి కూడా ఆయనకు అదరణ లభించింది. తన పేరుపై నకిలీ ఖాతా @realarungovil పేరుతో ఉందని.. తన అసలు ఖాతా @arungovil12 అని కూడా చెప్పారు. ఇక కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో సినిమాలకు, సీరియల్స్కు సంబంధించిన షూటింగ్లు ఆగిపోవడంతో సిరియల్స్ను పునఃప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మహభారతం’, ‘శక్తిమాన్’, ‘రామయణం’ కూడా మళ్లీ ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలో తన ‘రామాయణాన్ని’ కూడా ప్రజలు తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నట్లు గోవిల్ పేర్కొన్నారు. (‘నా భార్యకు హెల్ప్ చేస్తున్న జానీ సార్’) -
టీవీ చానళ్లకు పెరిగిన వీక్షకులు
ముంబై : లాక్డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. చాలామంది టీవీ చూస్తూ కాలం గడిపేస్తున్నారు. దేశంలో వారం రోజుల్లో టీవీ వీక్షణం రికార్డు స్థాయిలో 37 శాతం పెరిగినట్లు బ్రాడ్కాస్టు ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) గురువారం ప్రకటించింది. లాక్డౌన్ కొనసాగినంత కాలం టీవీ వీక్షణం ఇదే స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని బార్క్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ లుల్లా చెప్పారు. నాన్–ప్రైమ్టైమ్లోనూ వీక్షకుల సంఖ్య భారీగా పెరుగుతోందని తెలిపారు. ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో.. వారి కాలక్షేపం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా పలు సీరియల్స్ను ప్రసారం చేస్తోన్న విషయం తెలిసిందే. రామాయణం, శక్తిమాన్ వంటి ప్రజల ఆధరాభిమానాలను పొందిన సీరియల్స్ బుల్లితెరపై మరోసారి సందడి చేస్తున్నాయి. దీంతో ప్రజలంతా సాధారణంగానే టీవీలకు అతుక్కుపోతున్నారు. -
రామాయణం
-
జయహో రామాయణమ్
వాల్మీకి రామాయణం ఇరవై నాలుగువేల శ్లోకాల గ్రంథం. ఆ మహర్షి ఇందులో కనీసం ఒక్క వాక్యాన్ని కానీ, పదాన్ని కానీ వ్యర్థంగా వాడలేదు. ఎవరి మెప్పుకోసమో రాయలేదు. ధర్మానికి, అధర్మానికి గల వ్యత్యాసాన్ని వర్ణించాడు. కుటుంబ విలువల ఔన్నత్యాన్ని, ఆవశ్యకతను గురించి వివరించాడు. ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటే మానవుడైనా, మహనీయుడిగా మన్ననలందుకుంటాడో అనేదానికి ఉదాహరణగా ఆ మర్యాదా పురుషోత్తముడైన రాముని గురించి రమణీయ వర్ణన చేశాడు. అయోధ్యా నగరం గురించి గొప్పగా చెప్పినట్లే, లంకానగర వైభోగం గురించీ అంతే అందంగా చెప్పాడు. కాకపోతే అయోధ్యానగర రాజుల పరిపాలన ఎంత ధర్మబద్ధంగా ఉంటుందో, అక్కడి ఇళ్లు, వాకిళ్లు ఎంత పరిశుభ్రంగా ఉంటాయో, ప్రజలు అతి కాముకత్వం, అధర్మం, లోభం, అవిద్య వంటి వాటికి దూరంగా ఎంత సుఖ సంతోషాలతో జీవిస్తారో చెబితే, లంకానగరంలో వీధులు ఎంత సువిశాలమైనవో, సౌధాలు ఏవిధంగా సువర్ణశోభితాలుగా ఉన్నాయో వివరించాడు. అయోధ్యానగర వాసుల ధర్మబద్ధ జీవన విధానం గురించి, లంకానగర వాసుల విచ్చలవిడితనాన్ని గురించీ వర్ణించాడు. ఇక్కడే మనకు వాల్మీకి మహర్షి రచనా చాతుర్యం కనిపిస్తుంది. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం రాముడు ఎంత కష్ట పడ్డాడో, ఆ రాముడి మార్గంలో నడవడానికి సీతాలక్ష్మణులు ఎంత ఇష్టపడ్డారో, పుత్ర వియోగాన్ని తాళలేక దశరథుడు ఎలా కుప్పకూలిపోయి మరణించాడో, నాటి ఆచారం ప్రకారం తమ పతిదేవుడితో పాటు సహగమనానికి సిద్ధపడిన కౌసల్యాదేవిని పద్నాలుగేళ్ల అరణ్యవాసానంతరం నీ కుమారుడు రాముడిని రాజుగా చూసుకోవడానికైనా ప్రాణాలతో నిలిచి ఉండాలంటూ మునులు, దేవతలు మంచి మాటలు చెప్పి, ఆమెలో ఆశలు నూరిపోసి ఆమె ప్రయత్నాన్ని నివారించడంలోనే వాల్మీకి అభ్యుదయ భావనలను అర్థం చేసుకోవచ్చు. అడవులకు వెళ్లేటప్పుడు కూడా ఆయుధాలను విడనాడని రామునితో ఆ విషయాన్ని నేరుగా కాకుండా ఆయుధాలను కలిగి ఉండటం వల్ల సాధుజీవులలో సైతం హింసాత్మక భావనలు కలగడాన్ని గురించి కథ రూపంలో సీతమ్మ చెప్పడం, ఆమె మాటలను మెచ్చుకుంటూనే తాను ఆయుధాలను ఎందుకు కలిగి ఉండాలో రాముడు వివరించడం భార్యాభర్తల మధ్య ఉండవలసిన అవగాహనను తెలియజేస్తుంది. అతిబలవంతుడైన అన్న వాలికి జడిసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న సుగ్రీవుడికి ఆయన సచివుడు, సలహాదారు అయిన హనుమ– కాసేపటిలో చక్రవర్తి కావలసి ఉండీ, పితృవాక్పాలన కోసం రాజ్యాన్ని తృణప్రాయంగా త్యజించి, అడవులలో తిరుగుతూ ఉండగా... ప్రాణానికి ప్రాణమైన భార్యను ఎవరు అపహరించారో తెలియక తల్లడిల్లిపోతున్న రామునికీ మైత్రి కుదిర్చి రాముడి కోసం సముద్ర లంఘనం చేసి మరీ సీతాన్వేషణ చేసి, ఆమె క్షేమసమాచారాలను రామునికి చేరవేసిన హనుమ నిస్వార్థం, త్యాగశీలత, సముద్రానికి ఓర్పుతో, నేర్పుతో సమయస్ఫూర్తితో వారధి కట్టి లంకను చేరి, అపారమైన సైన్యసంపదతో, శౌర్యపరాక్రమాలు కలిగిన పుత్ర భ్రాతృ బలగంతో వరబలం గల రాక్షస రావణుడి పదితలలనూ అతి సామాన్యుడైన మానవుడు తెగటార్చాడంటే అందుకు రాముని ధర్మానువర్తనమే కారణం. రామాయణ పఠనమంటే మనలోని దుర్లక్షణాలను దునుమాడటం, మంచి లక్షణాలను, త్యాగబుద్ధిని, సహన శీలతనూ, ధార్మిక, యుక్తాయుక్త వివేచననూ పెంపొందించుకోవడమే. ప్రస్తుతం అందరకూ సెలవులు కాబట్టి అందుబాటులో ఉన్న వివిధ మాధ్యమాల ద్వారా ఉషశ్రీ, శ్రీరమణ, ఉప్పలూరి కామేశ్వరరావు వంటి వారు సరళంగా రచించిన రామాయణమనే చెరకుగడను నమిలి అందులోని మాధుర్యాన్ని మనం అనుభవించి, మన వారసులకు ఆ తీపిని చవిచూపించేందుకు ప్రయత్నిద్దాం. ప్రతి సంవత్సరం భద్రాద్రిలోనూ, దేశమంతటా అంగరంగవైభవంగా శ్రీరామ నవమి సంబరాలు, సీతారామ కల్యాణ ఉత్సవాలు జరిపించడం ఆనవాయితీ. లక్షలాది మంది స్వయంగా వీక్షించి తరించేవారు. దురదృష్టవశాత్తూ ఈ సంవత్సరం అటువంటి అవకాశం లేనప్పటికీ, అర్చకులు కల్యాణ క్రతువును నిర్వహించడంలో లోటేమీ ఉండదు కాకపోతే మన మనో నేత్రాలతో బుల్లితెరల ముందు కూర్చుని ఆ వేడుకలను స్వయంగా తిలకించడంతో సరిపెట్టుకుందాం. ఈ క్లిష్ట పరిస్థితులలో పండుగ ఎలా జరుపుకోవాలి? పొద్దున్నే నిద్రలేచి తలస్నానం చేసి, ఇంట్లో సీతారాముల వారిని భక్తి, శ్రద్ధలతో పూజించచడం, వడపప్పు, పానకం, పాయసంలాంటి పదార్ధాలను నివేదించిశ్రీరామ నామం స్మరిస్తూ ఉండడం, శక్తి కొలది దాన ధర్మాలు చేయడం. – డి.వి.ఆర్. భాస్కర్ -
కరోనా : ప్రజల ముందుకు రామాయణం
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ సంస్కృతికి మూలస్తంభ గ్రంథాల్లో ఒకటైన రామాయణం మరోసారి భారతీయులను అలరించనుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా హిందువులు ఎంతో ఆసక్తిగా వీక్షించే రామాయణం సీరియల్ను మరోసారి టీవీల్లో ప్రసారం చేయాలని కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రసారశాఖమంత్రి ప్రకాశ్ జవడేకర్ శుక్రవారం ట్విటర్ వేదికగా ప్రకటించారు. (చైనాను అధిగమించిన అమెరికా) ‘ ఎంతో సంతోషంగా ఉంది.. ప్రజల డిమాండ్ మేరకు రామాయణాన్ని మరోసారి టీవీల్లో ప్రచారం చేస్తున్నాం. మార్చి 28 (శనివారం) నుంచి ఈ సీరియల్ ప్రారంభం కాబోతుంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 9 నుంచి 10 గంటల వరకు డీడీ నేషనల్ (దూరదర్శన్) చానల్లో ప్రసారం కానుంది’ అని కేంద్రమంత్రి తెలిపారు. కాగా తొలిసారి రామయణం సీరియల్ 1987 నుంచి 1988 మధ్య కాలంలో దూరదర్శన్లో ప్రసారమైన విషయం తెలిసిందే. ఈ సీరియల్ ఇండియన్ టెలివిజన్ రేటింగ్స్లో ఓ సంచలనంగా నిలిచింది. ఎంతోమంది ఆదరాభిమానాలను సొంతం చేసుకుని టెలివిజన్ రంగంలో ఓ మైలురాయిగా నిలిచింది. Happy to announce that on public demand, we are starting retelecast of 'Ramayana' from tomorrow, Saturday March 28 in DD National, One episode in morning 9 am to 10 am, another in the evening 9 pm to 10 pm.@narendramodi @PIBIndia@DDNational — Prakash Javadekar (@PrakashJavdekar) March 27, 2020 -
శరమ... ఒక మెరుపు
శరమ రాక్షస స్త్రీ. విభీషణుడి భార్య. శరూషుడు అనే గంధర్వుడి కుమార్తె. రామాయణంలో కొద్దిసేపు కనపడుతుంది. కానీ ఒక పెద్ద మెరుపు. విభీషణుడు ఎప్పుడూ ధర్మాన్ని ఆశ్రయించి ఉంటాడు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురూ చతుర్ముఖ బ్రహ్మని ఉద్దేశించి తపస్సు చేసారు. బ్రహ్మ ప్రత్యక్షమవగానే ఒక్కొక్కడు ఒక్కొక్క వరం కోరాడు. ‘‘మనసు ఎప్పుడూ ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించి ఉండుగాక!’’ అని విభీషణుడు కోరగా బ్రహ్మ తథాస్తన్నాడు. అందుకే తప్పు చేస్తున్నావని చెప్పినా వినని రావణుడు రాజ్యబహిష్కారం విధిస్తే, విభీషణుడు ధర్మాత్ముడయిన రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళిపోయాడు. అప్పుడు విభీషణుడి భార్య ఏం చేయాలి .. ఆమె కూడా ఆయన వెంటే వెళ్ళిపోవాలి. కానీ ఆమె వెళ్ళలేదు. భర్తమీద ప్రేమ లేక కాదు, భర్తతో కలిసి వెళ్ళాలని తెలియక కాదు. తన భర్తకు దూరమైన మరొక స్త్రీ దుర్మార్గుడైన రాక్షసుడు రావణుడివల్ల కష్టాలు పడుతుంటే, ఊరడించడానికి మనిషి లేకపోతే అది మహా పాపం–అని భర్తతో వెళ్లిపోవడం కన్నా, ఇక్కడే ఉండిపోతానని ప్రాణాలకు తెగించి ఉండిపోయింది. యుద్ధం ప్రారంభమవుతుందనగా రావణుడు సీతమ్మ దగ్గరకు వెళ్లాడు...‘‘సీతా! నిన్న రాత్రి రామ లక్ష్మణులు పలువురు వానరులతో కలిసి వచ్చి సముద్రపు ఒడ్డున విడిది చేసారు. నా సేనాధిపతి ప్రహస్తుడు సైన్యంతో వెళ్ళి నిద్రపోతున్న రాముని శిరస్సును కోసేశాడు. మిగిలిన వానరులందరూ పారిపోయారు. లక్ష్మణుడు కూడా పారిపోయాడు. రాముడి శిరస్సును నా సైన్యం తీసుకొచ్చింది... ఇదిగో చూడు’’ అని ఒక రాక్షసుడిని పిలిచి తల అక్కడ పెట్టు అన్నాడు. ఇంద్రజాల మహిమ ఎంత గొప్పగా ఉందంటే సీతమ్మ కూడా దిగ్భ్రమ చెందింది. ‘‘చూసావా ధనుస్సు. ఈ కోదండం పట్టుకునే కదా నన్ను సంహరిస్తాడన్నావు... ఈ రాముణ్ణి నమ్ముకునే కదా నా పాన్పు చేరలేదు. రాముడి తల తెగిపోయింది. ఇప్పుడు నిన్ను రక్షించే వారెవరు’’ అన్నాడు. సీతమ్మ గుండెలు బాదుకుని ఏడుస్తోంది. ఆ సమయంలో తన కష్టం చెప్పుకోవడానికి ఒక్కళ్ళు కూడా లేరక్కడ. అంత శోకంలో ఎవరికయినా మనసు పనిచేస్తుందా... తను కనబడితే చంపేస్తాడని తెలిసినా సరే, నిర్భయంగా శరమ ఆకాశంలో నిలబడింది. రావణుడు చూడలేదు. ఈలోగా ఎవరో వచ్చి రమ్మంటే రావణుడు అటు వెళ్ళాడు. ఆమెను చేరిన శరమ ‘‘అమ్మా సీతమ్మా ! బెంగపెట్టుకోకు. అదంతా రావణుడి మాయ... నేనిప్పుడు ఆకాశగమనం చేసి రామచంద్రమూర్తిని చూసి వచ్చాను. అయినా రాముడికి విశ్వామిత్రుడి వరం ఉంది కదా. ఆయనకు శ్రమ ఉండదు, జ్వరముండదు. నిద్రపోతున్న ఆయనను ఎవరూ సంహరించలేరు... అటువంటిది ఈ ధూర్తు్తడు ప్రహస్తుడు చంపగలడా... నన్ను నమ్ము... రాముడు పరమ సంతోషంగా ఉన్నాడు’’ అంది. అయినా ఊరడిల్లని సీతమ్మ రావణుడు ఏం చేస్తున్నాడో చూసి రమ్మంది. వెళ్ళి వచ్చిన శరమ ‘‘అమ్మా ఇప్పుడు విను. అవిగో నగారాలు మోగుతున్నాయి...అవిగో భేరీల శబ్దాలు.. యుద్ధసంరంభం జరుగుతున్నది. నిజంగా రావణుడు చెప్పినదే నిజమయితే రాముడు నిహతుడు అయిన తరువాత ఇంకా యుద్ధం ఏముంటుంది? అమ్మా నన్ను నమ్ము. ఉపశాంతికోసం నీ భర్త విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యక్ష దైవమయిన సూర్యుణ్ణి ఉపాసించు’’ అంటూ ఎలా చేయాలో ఉపదేశించింది. అంతటి త్యాగమూర్తులు ఈ దేశ స్త్రీలు. ఇవి కాల్పనిక కథలు కావు. ఇతిహాసాలు. పరమ సత్యాలు. -
రమణీయ శ్రీ రామాయణం
అన్నిటికీ వాల్మీకి రామాయణమే మూలం, ఆధారం. అన్ని రామాయణాలతో పాటు ఇదీ మరొక్క రామాయణం. ఇందులో నా సొంత కవిత కొంచెం కూడా లేదు. ఉన్నదంతా వాల్మీకి కవితా సౌందర్యమే. – ముళ్లపూడి శ్రీదేవి,ముళ్లపూడి వేంకటరమణ సతీమణి బాపు రమణలు రామభక్తులు. బొమ్మలతో, అక్షరాలతో రాముడి ఋణం కొంతైనా తీర్చుకుని వెళ్లిన జంట. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ముళ్లపూడి వెంకటరమణ సతీమణి ముళ్లపూడి శ్రీదేవి. ఎన్నటికైనా వాల్మీకి ఉపమానాలను ఒక పుస్తకంగా తేవాలని నాలుగు దశాబ్దాల క్రితమే ఆలోచన చేశారు రమణగారు. అప్పుడు సాధ్యపడలేదు. ఇప్పటికి ఆ ఆలోచన ఆచరణలోకి వచ్చింది. ‘రమణీయ శ్రీ రామాయణం’ పేరున ఈ పుస్తకాన్ని శ్రీదేవి ఈరోజు ఆవిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా తన మనసులోని మాటలను సాక్షితో పంచుకున్నారు ముళ్లపూడి శ్రీదేవి. ఇది ముళ్లపూడి వెంకటరమణగారి కోరిక. అంటే రమణగారు నాకు కలలో కనిపించి రామాయణం రాయమన్నారని కాదు నేను చెప్పేది. రమణగారి చిన్న వయస్సులో – అంటే ఇంకా ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడని రోజుల్లో – వాల్మీకి రామాయణాన్ని శ్రీనివాస శిరోమణి తెలుగులో వచనానువాదం చేస్తున్నారు. అది ఆంధ్ర పత్రికలో ఆదివారం సారస్వతానుబంధంలో ప్రచురింపబడేది. తెలుగువారంతా ఆ రామాయణాన్ని ఇష్టంగా భక్తిగా చదివారు. ఆ రోజుల్లో శిరోమణి గారి దగ్గర వెంకటరమణ గారు సహాయకుడిగా పనిచేశారు. ఆ సందర్భంగా అనువాదం కోసం ఎన్నో రామాయణాలు పరిశీలించారు. వాల్మీకి మహర్షి కవిత్వం, ఆయన శైలి, ఆయన భక్తి ఆకళింపు చేసుకున్నారు. రామాయణమన్నా, రాముడన్నా భక్తి తాత్పర్యాలు ఏర్పడ్డాయి. ఆ ఇష్టంతోనే రమణగారు ‘సీతాకల్యాణం’ కథ రాశారు. ‘ఉపమా కాళిదాసస్య’ అని లోకోక్తి. ‘ఉపమా వాల్మీకస్య’ అని రమణగారు అంటారు. వాల్మీకి మహర్షి కథ చెప్పే పద్ధతి చాలా సరళంగా ఉంటుంది. కథ చెప్పేటప్పుడు అలంకారాలు ఎక్కువగా ఉపయోగించడు. కథ సూటిగా సాగిపోతుంది. వర్ణనల విషయంలో మాత్రం వాల్మీకి ఉపమాలంకారాన్ని విరివిగా ఉపయోగించాడు. ఆయా సమయాలలో సందర్భానుసారంగా ఒకటిరెండు ఉపమానాలు చెప్పి ఊరుకోడు. ఒకదాని వెంట మరొకటిగా పుంఖానుపుంఖంగా ఉపమా లంకారాలు గుప్పిస్తాడు. పాఠకుడిని ఊపిరి తిప్పుకోనివ్వడు. వాల్మీకి ప్రయోగించిన ఈ పద్ధతి రమణగారిని ఎక్కువగా ఆకర్షించింది. రమణగారి కథల్లో కూడా ఈ ఉపమానాల ప్రయోగం తరచుగా కనిపిస్తుంది. విశేషమైన ఈ ప్రయోగాన్ని పాఠకులకు అందించాలని రమణగారి కోరిక. వాల్మీకి చెప్పిన రామకథను మళ్లీ చెప్తూ, సందర్భానుసారంగా వచ్చిన ఉపమానాలను యథాతథంగా అమర్చటం సముచితంగా ఉంటుందని నాకు అనిపించింది. నాకు తోచిన పద్ధతిలో రామాయణం చెప్పటానికి పూనుకున్నాను. ఇంత ప్రయత్నానికీ మూలకారణం ముళ్లపూడి వెంకటరమణగారే. రామాయణం ఒక కొత్త ఉద్దేశంతో చెప్పడానికి ప్రయత్నించాను. అన్నిటికీ వాల్మీకి రామాయణమే మూలం, ఆధారం. అన్ని రామాయణాలతో పాటు ఇదీ మరొక్క రామాయణం. ఇందులో నా సొంత కవిత కొంచెం కూడా లేదు. ఉన్నదంతా వాల్మీకి కవితా సౌందర్యమే. రమణగారు వాల్మీకి రామాయణంలోని ఉపమానాలను అందరికీ ప్రత్యేకంగా చెప్పాలని ఆశించారు. వాల్మీకి ఎంత గొప్పగా, ఎంత అందంగా వాడాడో చెప్పాలనుకున్నారు. ఎలా చెబితే బాగుంటుందా అని ఆచార్య డా. బేతవోలు రామబ్రహ్మం, మహామహోపాధ్యాయ డా. పుల్లెల శ్రీరామచంద్రుడు వంటి పెద్దలను అడిగారు. అందరూ ఆలోచన బావుందన్నారు. కానీ ఎలా రాయాలో చెప్పలేదు. దానితో రమణ గారు ఈ అంశాన్ని పుస్తకంగా తీసుకురాలేదు. అప్పట్లో వాల్మీకి ఉపమానాలను నా స్వదస్తూరితో రాసి ఉంచాను. అందువల్ల అది నా మనసులో ఉండిపోయింది. నేను ప్రతి ఉపమానానికి అంకెలు వేసి పెట్టుకున్నాను. మా అమ్మాయి సలహా మేరకు కార్యరూపంలోకి దిగాను. వాల్మీకి ఎప్పుడు, ఏ సందర్భంలో, ఏ అర్థంలో ఉపమానాలు చెప్పారో వివరంగా రాసి, నా బ్లాగులో పెట్టాను. మొత్తం రెండు సంవత్సరాల పాటు రాశాను. నేను పూర్తిచేసిన మరునాడు తిరుపతిలో ఉండే కథాప్రపంచం పబ్లిషర్ కిరణ్ ఈ పుస్తకం ప్రచురిస్తానన్నాడు. రామాయణం రాస్తూ నా ఒంటరితనాన్ని దూరం చేసుకోవడమే కాదు, నా మనసులో నాతోనే ఉన్న రమణ గారి కోరిక నెరవేర్చాను’ అని ముగించారు ముళ్లపూడి శ్రీదేవి. – డా. వైజయంతి పురాణపండ -
‘బాబర్, ఔరంగజేబుగా పేరు మార్చుకో’
సాక్షి, ముంబై: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తన పేరు మార్చుకుంటే మంచిదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సూచించారు. రామాయణ, మహాభారతాలు మొత్తం హింసతో నిండి ఉన్నాయని ఏచూరి చేసిన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందూ ధర్మపై నమ్మకం లేనప్పుడు ఆయనకు సీతారాం అనే పేరేందుకని .. బాబర్, చెంగిఛ్ఖాన్, ఔరంగజేబుగా పేరు మార్చుకుంటే బాగుంటుందని వ్యంగ్యంగా సలహా ఇచ్చారు. రాముడిపై నమ్మకం లేని వారు ఈ దేశంలో ఉండడానికి అనర్హులని సంజయ్ వ్యాఖ్యానించారు. ‘హిందువులు హింసాత్మకంగా ఉంటారనడంలో ఆయన ఉద్దేశం ఏంటి? రామాయణం, మహాభారతాలు ఒకటే సందేశాన్ని ఇస్తున్నాయి. ఎప్పటికైనా చెడు మీద మంచి గెలుస్తుందనేదే దాని సందేశం. రాముడు, కృష్ణుడు, అర్జునుడు అంతా సత్యానికి సంకేతాలు. రామాయణ, మహాభారతాల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు.. రేపు పాకిస్తాన్ మీద భారత సైనికుల పోరాటం కూడా హింసాత్మకం అంటారు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ను ఎదుర్కోవడం కూడా హింసేనా?’ అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. హిందువులను ఎటాక్ చేయడమే ఆయన విధానమని.. ఆ విధంగా తనను తాను సెక్యులర్గా గుర్తింపు పొందాలని తాపత్రయం పడుతున్నారని సంజయ్ అన్నారు. ఇదిలావుండగా ఏచూరి వ్యాఖ్యలు తమ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయంటూ.. యోగా గురువు రామ్దేవ్ బాబా హరిద్వార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏచూరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భోపాలో ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న సీతారం ఏచూరి పలు వివాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రామాయణ ,మహభారతం లు రెండు కూడ యుద్దాలతోపాటు హింసాత్మక ఘటనలతో నిండి ఉన్నాయని అన్నారు. హిందు ప్రచార వాదులు చెబుతున్నట్టుగా హిందువులు హింసను ప్రోత్సహించే వారు కాదని చెప్పగలరా అని ఏచూరి ప్రశ్నించారు. మరోవైపు హిందువుల ఓట్ల కోసం బీజేపీ ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కోన్న సాధ్విని పోటిలోకి దింపిందని ఏచూరి ఆరోపించారు. -
కనుడు.. కనుడు..రామాయణ గాథ..
సాక్షి, హైదరాబాద్: రామాయణాన్ని తపాలా బిళ్లల ద్వారా చెప్తే ఎలా ఉంటుంది.. కాస్త ఆశ్చర్యంగా ఉన్నా తపాలాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ఇదే ప్రయత్నం చేశారు. రామాయణ గాథను ఆది నుంచి అంతం వరకు తపాలా బిళ్లల ద్వారా కళ్ల ముందుకు తెస్తున్నారు. పైగా అవన్నీ 20 వివిధ దేశాలు వివిధ సందర్భాల్లో ముద్రించిన రామాయణ ఇతివృత్తంతో కూడిన పోస్టల్ స్టాంపులు కావటం విశేషం. కొన్నేళ్ల పాటు శ్రమించి వాటిని సేకరించిన ఆయన పూర్తి రామాయణ గాథను వాటి రూపంలో నిక్షిప్తం చేశారు. ఆయన కృషికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. బుధవారం అధికారికంగా నిర్వాహకులు ఈ విషయాన్ని ప్రకటించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గుమ్మడవల్లి గ్రామానికి చెందిన వెన్నం ఉపేందర్ ఈ ఘనత సాధించారు. 450 స్టాంపులు.. 80 ఏ–4 పేజీలు! తమిళనాడులోని మదురైలో పోస్టుమాస్టర్ జనరల్గా పనిచేస్తున్న ఉపేందర్ కొన్నేళ్లుగా రామాయణ ఇతివృత్తంపై వివిధ దేశాలు ముద్రించిన తపాలా బిళ్లలను సేకరించటం ప్రారంభించారు. ఇప్పటివరకు ఆయన 450 స్టాంపులను సమీకరించారు. వాటిని వరుసగా పేరిస్తే ఏ–4 సైజులో ఉండే 80 కాగితాలకు సరిపోతున్నాయి. ఇదే ప్రపంచ రికార్డుగా ఉంది. అంతకుముందు 16 ఏ–4 సైజు షీట్లకు సరిపడా సంఖ్యలో రామాయణ స్టాంపులు సేకరించిన ఇజ్రాయెల్కు చెందిన మెల్లమ్ అనే వ్యక్తి పేరిట రికార్డు ఉంది. తన వద్ద ఉన్న స్టాంపులతో పలు ప్రదర్శనల్లో రామాయణ గాథను వివరించిన ఉపేందర్ పలు పురస్కారాలు సొంతం చేసుకున్నారు. గత డిసెంబర్లో హైదరాబాద్లో జరిగిన జాతీయ స్థాయి ప్రదర్శనలో ఆయన బంగారు పతకం సైతం సాధించారు. జూన్, జూలైలలో సిడ్నీ, సింగపూర్లలో జరగనున్న అంతర్జాతీయ ప్రదర్శనలో పాల్గొంటున్నట్టు ఉపేందర్ తెలిపారు. ఆగ్నేయాసియా దేశాల్లోనే ఎక్కువ రామాయణ ఇతివృత్తంపై ఉపేందర్ 450 స్టాంపులు సేకరిస్తే అందులో భారత్కి చెందినవి 15కు మించిలేవు. ఎక్కువగా ఆగ్నేయాసియా దేశాలవే ఎక్కువగా ఉన్నాయి. కంబోడియా, ఇండోనేసియా, మలేసియా, థాయ్లాండ్, సింగపూర్ దేశాలు పెద్ద సంఖ్యలో రామాయణ ఇతివృత్తంపై తపాలా బిళ్లలను విడుదల చేశాయి. పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, మయన్మార్లతో పాటు జర్మనీలాంటి కొన్ని యూరప్ దేశాలు కూడా రామాయణ ఘట్టాలపై స్టాంపులు విడుదల చేశాయి. వీటన్నింటిని ఉపేందర్ సేకరించారు. రామాయణం ఏం చెప్తోంది... రామాయణం ప్రస్తుత సమాజానికి ఏం చెప్తోంది.. విదేశాల్లో రామాయణానికి ఇస్తున్న ప్రాధాన్యం.. మొత్తంగా రామాయణ గాథను స్టాంపుల ద్వారా వివరిస్తున్నట్టు ఉపేందర్ తెలిపారు. మలేసియాలో హికాయత్ సేరి రామా పేరుతో రామాయణాన్ని వివరిస్తున్నారని, అక్కడ ప్రధాని ప్రమాణ స్వీకార సమయంలో ఇప్పటికీ రామ పాదాలను ఉంచుతున్నారని, కొన్ని దేశాల్లో రాజులను రామ–1, రామ–2గా పిలుచుకుంటున్నారని.. ఇలాంటి ఎన్నో విషయాలు స్టాంపుల ద్వారా వెల్లడవుతున్నాయని ఆయన చెప్పారు. రామాయణ గాథను వివరించటంతోపాటు స్టాంపుల ద్వారా జనం ముందుకు తీసుకెళ్తున్నందుకు సంతోషంగా ఉందని.. త్వరలోనే ఇది గిన్నీస్ దృష్టికి వెళ్లనుందని అన్నారు. ఉపేందర్ -
యత్ర నార్యస్తు పూజ్యంతే
అరుంధతిని వివాహమాడాడు వశిష్ఠుడు. వివాహ కాలంలో అరుంధతి నక్షత్రం చూపుతారు. అది ఒక స్త్రీకి భారతీయ సంస్కృతి ఇచ్చిన స్థానం. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు చరిస్తారు, ఎక్కడ స్త్రీలను పూజించరో అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదు అంటోంది మన సంస్కృతి. త్రిమూర్తులకు మూలమైన ఆదిపరాశక్తి స్త్రీ. ప్రకృతిని స్త్రీరూపంగా చెప్పాయి వేదాలు. మాతృదేవోభవ అని తల్లిని ప్రత్యక్ష దైవంగా పూజించమన్నారు ఋషులు. ఋగ్వేదంలోని దేవీ సూక్తం, స్త్రీని విశ్వశక్తిగా చెప్పింది. మన ఉపనిషత్తులు, శాస్త్రాలు... స్త్రీని సాధికారత కలిగిన స్వరూపంగా పేర్కొన్నాయి. ఋగ్వేదం స్త్రీ ఔన్నత్యాన్ని ప్రశంసించింది. ‘నేను మహారాణిని, సంపదను సేకరిస్తాను, ఆలోచిస్తాను, తొలి వందనం స్వీకరిస్తాను, అందువల్లే భగవంతుడు నన్ను ప్రతి ఇంట్లోను నెలకొల్పాడు. నా కారణంగానే ఇంటిల్లిపాదీ ఆహారం తీసుకుంటారు, గాలి పీలుస్తారు, వింటారు, మాట్లాడతారు’ అంటుంది స్త్రీ. దేవీ సూక్తం స్త్రీని అగ్రస్థానాన నిలబెట్టింది. బ్రహ్మమానసపుత్రిక దేవి అని, ఆమె నుంచే ప్రకృతి, పురుషుడు ఉద్భవించారని చెబుతోంది. ఉపనిషత్తులకు సంబంధించిన చర్చలలో గార్గి, మైత్రేయి వంటి వారు పాల్గొని విజయం సాధించారు. భవభూతి ఉత్తర రామచరితలో ఆత్రేయి... దక్షిణ భారత దేశం నుంచి ఉత్తర భారతానికి ప్రయాణించిందని, భారతీయ వేదాంతం చదివిందని ప్రస్తావించాడు. శంకరాచార్యునితో ఉభయభారతి జరిపిన చర్చలో వేదాల ప్రస్తావన తెస్తుంది. ఇతిహాసాలు... రామాయణంలో సీతను అత్యున్నతంగా చూపాడు వాల్మీకి. వేదకాలంలో ఏ పురుషుడూ ఎంత కోపం వచ్చినా స్త్రీని ఒక్క మాట కూడా పరుషంగా పలికేవాడు కాదని, తన సంతోషం, సౌఖ్యం, ఆనందం, సుగుణవంతుడిగా నిలబడటం కోసం భార్య మీదే ఆధారపడేవాడని తెలుస్తోంది. ఋషులు సైతం స్త్రీలు లేకుండా సంతానాన్ని సృజియించలేమని పలికారు. (ఆదిపర్వం మహాభారతం). మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో కూతురు కొడుకుతో సమానమని భీష్ముడు అంటాడు.శివపార్వతుల సంవాదంలో స్త్రీలకు ఏయే బాధ్యతలు ఉంటాయని శివుడు పార్వతిని ప్రశ్నిస్తాడు. మంచితనంతో పాటు, మృదు భాషణం, సత్ప్రవర్తన, మంచి లక్షణాలు కలిగి ఉండాలి స్త్రీలు అంటుంది పార్వతి. భారతీయ సంప్రదాయంలో భగవంతుడంటే ఒక అతీత శక్తి అని అర్థం. స్త్రీ రూపం కాని, పురుష రూపం కాని భగవంతునికి లేదు. పంచభూతాలలో నీరు, భూమి ఈ రెండింటినీ స్త్రీస్వరూపంగానే భావించి, భూమాత, నదీ మాత అని వారిని గౌరవంగా, ఆప్యాయంగా పిలుచుకున్నారు. భారతీయ సంప్రదాయం స్త్రీకి పెద్దపీట వేసి గౌరవించింది. స్త్రీలు వేదాలు చదవాలని చెప్పింది. బ్రహ్మచర్యంలో ఉన్న యువతి పట్టా పుచ్చుకుని, తనకు సరైన వరు ని ఎంచుకోవాలని అధర్వ వేదం చెబుతోంది. వరుడిని ఎంచుకునే హక్కు వధువుదే. అందుకే స్వయంవరం ప్రకటించి, వచ్చిన వారిలో నుంచి తనకు నచ్చినవారిని ఎంచుకుంటుంది వధువు. – డా. వైజయంతి పురాణపండ -
గడియారం శ్రీరామ అంది
సకల సద్గుణాల వల్ల రాముడు దేవుడయ్యాడు ప్రతి గుణం ఒక రామాయణం నలుగురిని నడిపించేది రామాయణం అందరినీ చూసేలా చేసింది అందరినీ నడిపించింది రామానందసాగర్ రామాయణం బుల్లితెరపై ప్రత్యక్షమైన ఇంటింటా రామాయణం. టైమ్ మిషన్లో మూడు దశాబ్దాల వెనక్కి వెళితే ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఓ అందమైన దృశ్యం కళ్లకు కడుతుంది. టీవీ ఉన్న ప్రతి ఇల్లు నిండుకుండలా కనిపిస్తుంది. భక్తిగా చేతులు జోడించి టీవీ తెరకు కళ్లప్పగించే జతల జతల కళ్లు రామరసాన్ని గ్రోలుతూ పారవశ్యం చెందుతుండటం చూస్తాం. ఆ అద్భుతాన్ని చవి చూపినవాడు రామానంద్ సాగర్. 78 ఎపిసోడ్లలో రామాయణాన్ని దృశ్యీకరించిన బుల్లితెర వాల్మీకి ఇతడు. జనవరి 25, 1987లో ప్రారంభమైన ఈ సీరియల్ జులై 31, 1988 వరకు వచ్చింది. అప్పట్లో ఈ సీరియల్ టీవీలో ఓ విప్లవం. ఈ సీరియల్ వచ్చే సమయంలో ప్రజారవాణా సదుపాయాలన్నీ స్తంభించిపోయేవి. రైళ్లు, బస్సులు, ఇంటర్ సిటీ ట్రక్కులు.. జనం లేక వెలవెలబోయేవి. ఊళ్లలో సమూహాలుగా టీవీసెట్స్ ముందు చేరిపోయేవారు. టీవీల ముందు కొబ్బరికాయలు కొట్టి, అగరొత్తులు వెలిగించేవారు. పువ్వులు జల్లి నీరాజనాలు పలికేవారు. నిజానికి ఇది ఒక కార్యక్రమమే. కానీ పిల్లా జెల్లాతో కలిసి కుటుంబం అంతా ఈ సిరియల్ని వీక్షించింది. సీరియల్ పూర్తయ్యాక సత్యమే పలకాలనే వాగ్డానాలు చేసుకునేవారు. పిల్లలు ఇంటి గడప దాటి బయటకు వెళ్లాలన్నా తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకునేవారు. రామాయణంతో టీవీ అలా ప్రతి ఒక్కరినీ కథలో లీనమయ్యేలా చేస్తూ విద్యాభ్యాసం చేయించింది. అఫ్కోర్స్ అప్పటికి ఇప్పటిలా వందల చానెల్స్ లేవు. కానీ, రామాయణం ఇంకా జీవించడానికి తాను కూడా ఉడతసాయం చేశానని బుల్లితెర ఒళ్లంతా కళ్లు చేసుకొని ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటుంది. పాలసంద్రం నుంచి పట్టాభిషేకం వరకుసీరియల్ స్టార్ట్ అవడమే..పాల సముద్రం మీద శేష శయనుడైన నారాయణుడు, భర్త పాదాలు వత్తుతూ లక్ష్మీదేవి.. బ్రహ్మాది దేవతలంతా .. ‘శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం..’ అంటూ స్తుతిస్తున్న సన్నివేశంతో రామాయణం మొదలవుతుంది. యోగనిద్రలో ఉన్న నారాయణుడు కనులు తెరిచి విషయం ఏంటని అడుగుతాడు. రావణాసురుడి ఆగడాలకు అంతులేదు. అధర్మమే అంతటా పరిఢవిల్లుతోంది. పాప నాశనం చేసి, ధర్మసంస్థాపన చేయండి.. అని వేడుకుంటారు. తాను ఇచ్చిన వరాలను దుర్వినియోగం చేస్తున్న రావణాసురుడిని నిలువరించాల్సిన అత్యావశ్యకం వచ్చిందని చెపుతాడు శివుడు. సత్యమే గెలుస్తుందని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సూర్యచంద్రులు ఉండేంతవరకు ఆ ధర్మం అందరికీ మార్గదర్శకం కావాలని కోరుకుంటారు. రావణుడి అహంకారాన్ని మట్టుపెట్టేందుకు తాను జన్మిస్తానని వరమిస్తాడు నారాయణుడు. సత్యమేవ జయతే అంటారు దేవగణం. అక్కడి నుంచి రాముడు పుట్టడం,విద్యాభ్యాసం, వివాహం, వనవాసం మీదుగా కథ నడుస్తూ సీతాదేవి అపహరణ, రావణాసుర సంహారం, తిరిగి అయోధ్యనగర ప్రవేశం, పట్టాభిషేకంతో కథ ముగుస్తుంది. ఈ సీరియల్ మొత్తానికి కీలక పాత్రధారులు దశరథుడు, అతని ముగ్గురు భార్యలు, వీరితో పాటు దుష్టవనితగా పేరొందిన మంధర మొదటి ఎపిసోడ్లోనే కనిపిస్తారు. యజ్ఞం చేయగా వచ్చిన పాయసాన్ని దశరథుని ముగ్గురు రాణులు సేవిస్తారు. విష్ణువు రాముడిగా, ఆదిశేషుడు లక్ష్మణుడిగా, శంఖుచక్రాలు భరత, శత్రుఘ్నులుగా జన్మిస్తారు. ఇక రెండవ ఎపిసోడ్లో రామలక్ష్మణ, భరత శత్రుఘ్నుల విద్యాభ్యాసం గురుకులంలో జరుగుతుంది. అక్కడే పెరిగి పెద్దవుతారు. అక్కడితో సీరియల్ని భక్తిగా చూసే ప్రేక్షకుల హృదయాలు రామ రామ అంటూ రామ జపం చేస్తూ కథలో లీనమయ్యాయి. బుల్లితెర వాల్మీకి ప్రయాణం రామానంద్ సాగర్ దాదాపు వందేళ్ల క్రితం కశ్మీరీ ధనిక కుటుంబంలో పుట్టారు. రచయితగా ఎన్నో మారుపేర్లతో రచనలు చేశాడు. ఒకానొక సమయంలో ముంబయ్కి అతని కుటుంబం వలస వచ్చింది. సినిమా మీద వ్యామోహంతో పృథ్వీ థియేటర్లో పృథ్వీరాజ్ కపూర్ దగ్గర అసిస్టెంట్గా చేరాడు. 1950లో సాగర్ ఆర్ట్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ కంపెనీని నిర్మించాడు. కొన్ని పదుల సంఖ్యలో సినిమాలు అతని ప్రొడక్షన్ నుండి వచ్చాయి. ఆ తర్వాత అతని దశ, దిశ మార్చింది మాత్రం బుల్లితెరనే. అంతకాలం అతనొక విద్యార్థి. రామాయణంతో అతనిలోని మేధావి ప్రపంచానికి కనిపించాడు. తనలో సాంకేతికæ పరిజ్ఞానం ఏ మాత్రం లేదని చెప్పుకునే రామానంద సాగర్ రామాయణాన్ని బుల్లితెర మీద చూపించడంలో మాత్రం అపార ప్రతిభను కనబరిచాడని విమర్శకుల మెప్పును పొందారు. పట్టాభిషేకం తర్వాత...? రామానంద్ సాగర్ వాల్మీకి రామాయణ్, తులసీదాస్ రామచరిత మానస్లను తన సీరియల్కి మూలకథగా ఎంచుకున్నాడు. రామరాజ్య స్థాపనకు ముందు అంటే రాముడు పట్టాభిషేకం వరకు తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన రామాయణాలలో సీతను రాముడు వదిలేయడం, లవకుశుల చాప్టర్లను ఇందులో తీసుకోలేదు. ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో రామానంద్ సాగర్ తనయుడు ప్రేమ్సాగర్ మాట్లాడుతూ– ‘చాలామంది రచయితలు రాముడు సీతను వదిలేసినట్టు రాశారు. ‘కానీ, నా రాముడు అలా కాదు’ అనేవాడు నాన్న. ఆ తర్వాత ప్రత్యేకంగా లవ–కుశ సీరియల్ తీయాలనుకున్నాడు. కానీ, అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది’ అని చెప్పారు. పౌరాణికాలకు దారిచూపిన సీరియల్ రామాయణం తర్వాత సాగర్ ఇండస్ట్రీ నుంచి శ్రీ కృష్ణ, లవ్ ఔర్ కుష్, అలిఫ్ లైలా.. వంటి సీరియల్స్ వచ్చాయి. అంతేకాదు, రామాయణ్ ప్రేరణతో పౌరాణిక ఇతివృత్తంతో సీరియల్స్ రూపొందించడానికి టీవీ ఒక మాధ్యమంగా సాగింది. లెక్కలేనన్ని పౌరాణిక సీరియల్స్ ఆ తర్వాతి కాలంలో బుల్లితెరమీద బొమ్మకట్టాయి. ఆ తర్వాత వచ్చిన రామాయణాలకు రామానంద్ సాగర్ రామాయణమే పెద్ద బాలశిక్ష అయ్యింది. అలాగే, సాగర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నుంచి 2008లో మరో రామాయణం వచ్చింది. ఆ తర్వాత 2015లో మరో రామాయణ్ సీరియల్ టీవీలో వచ్చింది. అయితే, 1986లో తీసిన రామాయణ్ 2015లో వచ్చిన రామాయణ్ సీరియల్ను చూస్తే రూపకల్పనలో ఎన్నో తేడాలు కనిపిస్తాయి. పూజలందుకున్న నటీనటులు రామాయణ్ సీరియల్లో రామ పాత్రధారి ‘అరుణ్ గోవిల్’ రూపం, వాయిస్ ఆ సీరియల్కే పెద్ద ఎస్సెట్గా మారింది. చూపులకు ప్రశాంతంగా కనిపిస్తూ వీనులకు విందు చేసే రాముడి పాత్రధారి పలుకులు విన్న వారి కళ్లు ఆర్ధ్రమయ్యేవి. ఆ తర్వాత అతను ఎక్కడకు వెళ్లిన ప్రజలు అరుణ్గోవిల్ను రాముడిగా కొలిచారు. సీత క్యారెక్టర్ గురించి మాటల్లో చెప్పలేం. వాల్మీకి రామాయణంలోని సీత తమ నట్టింటికే నడిచి వచ్చిందన్నంత తన్మయత్వం చెందారు ప్రేక్షకులు. ఇప్పటివరకు వచ్చిన సీత క్యారెక్టర్లలో ఎవరు ది బెస్ట్ అని కళ్లు మూసుకొని వెతికితే ‘దీపికా చిఖాలియా’ రూపమే నిలుస్తుంది. ఈ సీరియల్లోని కొన్ని ఎపిసోడ్స్ చూస్తే ఆమె కళ్లతో పలికించిన భావాలు ప్రేక్షకుల మనసు నుంచి చెదిరిపోవు. ఆమె ఒక అందమైన మహారాణి మాత్రమే కాదు తన తండ్రితోపాటు ప్రతి ఒక్కరికీ సాయం చేసే స్వభావం కలదిగా ఉంటుంది. ఇక ఆ తర్వాత చెప్పుకోదగిన పాత్ర హనుమాన్. ఇప్పటిదాకా వచ్చిన రామాయణ్ సీరిస్లలో హనుమాన్ పాత్రధారులను గమనిస్తే సాగర్ రామాయణ్లో హనుమాన్గా నటించిన ‘దారాసింగ్’ అపరమేధావిలా కనిపిస్తాడు. హనుమాన్ అంటే దారాసింగ్ మాత్రమే అనేలా మెప్పించాడు. ఇక రాముడికి దీటైనది రావణాసురుడి పాత్ర. సీరియళ్లు, సినిమాలలో చాలామంది రావణాసురుడి పాత్ర పోషించారు. వారంతా మంచి నటులే. అయితే, ‘అరవింద్ త్రివేది’ రావణుడి పాత్రకోసమే పుట్టాడేమో అనిపించేలా ఉంటుంది. ఒక సీరియల్లోని నటీనటులు రాజకీయంగా ఎదగడం అనేది రామాయణం నుంచే మొదలైంది. అరుణ్గోవిల్ను మొదట బిజెపీ, తర్వాత కాంగ్రెస్ పార్టీలు తమ ఎన్నికల ప్రచారానికి వాడుకున్నాయి. దీపికా చిఖాలియా (సీత), అరవింద్ త్రివేది(రావణుడు) ఇద్దరూ ఎంపీలుగా ఓ వెలుగు వెలిగారు. రామాయణం విన్నా, కన్నా జన్మ తరిస్తుందని చెబుతారు పెద్దలు. అలా రామాయణం తీసి జన్మ చరితార్ధం చేసుకున్నది రామానంద్సాగర్ అయితే, ఆ ధారావాహికను కన్నులారా వీక్షించిన ప్రతి గుండే చరితార్థమే అయ్యింది. రంగుల రామాయణం రామానంద్సాగర్ బుల్లితెరకు రామాయణం ఇస్తే దానికి ఊపిరిలూదినవారు కంపోజర్ రవీందర్ జైన్. ఆ తర్వాత చెప్పుకోదగినవి కాస్ట్యూమ్ కలర్స్. దేశ ప్రజలకు అప్పుడప్పుడే కలర్ టెలివిజన్ చేరువవుతోంది. ఈ చిన్న తెరమీద గులాబీ, ఎరుపురంగులతో షోని బ్లాస్ట్ చేశాడు దర్శకుడు. ఇండియన్ టీవీలో మొట్టమొదటి బ్లాక్బస్టర్, అత్యంత ఎక్కువ ప్రజాదరణ పొందిన పౌరాణిక షోగా రామాయణం వరల్డ్ లిమ్కా బుక్ రికార్డ్స్లో చోటు చేసుకుంది. -
ప్రతినాయక పాత్రల ‘ప్రతిధ్వండి’
రామాయణం ఆధారంగా ఎన్నోనాటక ప్రదర్శనలు రూపొందాయి.కానీ తొలిసారి రామాయణంలోని ప్రతినాయక పాత్రలతో ‘ప్రతిధ్వండి రామాయణం’ ప్రదర్శించనున్నారు. రామాయణంలోని ప్రతినాయక పాత్రలైన మందర, కైకేయి, శూర్పణక, రావణ, సూత్రధార్ల ఆధారంగా కథక్, కూచిపూడి, మోహినీయాట్టం, భరతనాట్యం శైలుల్లో ఈ నాటక ప్రదర్శనకొనసాగుతుంది. దీపాంజలి స్కూల్ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కూచిపూడి, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం 6:30గంటలకు రవీంద్రభారతిలోప్రదర్శించనున్న ఈ నాటకవిశేషాలివీ... సాక్షి, సిటీబ్యూరో : ‘ఏడాది క్రితం అంతర్జాతీయ కళాకారిణి గోపికావర్మ నాకు ఫోన్ చేసి రామాయణంలోని ప్రతినాయక పాత్రలు మందర, కైకేయి, çశూర్పనక, రావణ, సూత్రధార్లపై ‘ప్రతిధ్వండి రామాయణం’ పేరుతో నృత్యరూపకం చేస్తే ఎలా ఉంటుందని అడిగారు. నేను వెంటనే చేద్దామన్నాను. వాల్మీకి, తులసి తదితర రామాయణ గ్రంథాలను పరిశోధించి నృత్యరూపకం రూపొందించామ’ని చెప్పారు ప్రముఖ నృత్యగురువు దీపికారెడ్డి తెలిపారు. ‘దీపికారెడ్డి దీని గురించి నాతో చెప్పగానే ఒప్పేసుకున్నాను. నాకు సూర్పనక పాత్ర కేటాయించార’ని చెప్పారు కేరళకు చెందిన ప్రముఖ నృత్యగురువు దీపికావర్మ. ‘రామాయణంలోని ప్రతినాయక పాత్రల్లో చాలా రసాలు ఉన్నాయి. నేను మందర పాత్రకు సరిపోతానని దీపికారెడ్డి చెప్పగానే సరేనన్నాను’ అని చెప్పారు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఉమా డోగ్రా. రామాయణంలోని ముఖ్యమైన రావణ పాత్రను భరతనాట్య శైలిలో ప్రదర్శిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు ప్రముఖ నృత్యగురువు దీపక్ మజుందార్. ‘దీపికారెడ్డి ఫోన్ చేసి ‘ప్రతిధ్వండి’ గురించి చెప్పారు. అందులో ‘సూత్రధార్’ పాత్రకు నేను సరిపోతానన్నారు. ఇక వెంటనే ఒప్పేసుకున్నాను’ అని చెప్పారు యాంకర్ ఝాన్సీ. ఈ పాత్రలకు అనుగుణంగా స్రిప్ట్ రాయించుకున్న తాము... రిహార్సల్స్ చేసి నాటక ప్రదర్శనకు సిద్ధమయ్యామని కళాకారులు తెలిపారు. -
శూర్పణఖ పాత్రలో సమంత
టాలీవుడ్ లో టాప్ స్టార్గా వెలుగొందుతున్న స్టార్ హీరోయిన్ సమంత ప్రయోగానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరుకు సోషల్ సినిమాలు మాత్రమే చేసిన సామ్ త్వరలో ఓ పౌరాణిక పాత్రలో నటించేందుకు ఓకె చెప్పారట. అది కూడా నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో అని తెలుస్తోంది. పలు యానిమేషన్ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న భార్గవ్.. రామాయణం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. శూర్పణఖ ప్రధాన పాత్రగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సమంత లీడ్ రోల్లో నటించనున్నారు. ముందుగా ఈ పాత్రకు కాజల్ను తీసుకోవాలని భావించినా ప్రస్తుతం సమంత పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. -
కత్తి మహేష్పై క్రిమినల్ కేసు
హైదరాబాద్, బంజారాహిల్స్: హిందువుల మనోభావాలు దెబ్బతినేలా టీవీ చర్చల్లో మాట్లాడిన సినీ విశ్లేషకుడు కత్తి మహేష్పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. గత జూన్ 29న బంజారాహిల్స్లోని ఓ తెలుగు న్యూస్ ఛానెల్లో జరిగిన చర్చావేదికలో పాల్గొన్న కత్తి మహేష్ రామాయణంలో రాముడు సీతపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని అదే రోజు యూసుఫ్గూడ సమీపంలోని రహ్మత్నగర్కు చెందిన గడ్డం శ్రీధర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు న్యాయ సలహా అనంతరం శుక్రవారం కత్తి మహేష్పై ఐపీసీ సెక్షన్ 295(ఏ), 505(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మనస్సాక్షినే నమ్ముతాను..
‘ఎంజీఆర్ సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత కూడా మా మధ్య స్నేహం కొనసాగింది. ఇద్దరం వేరు వేరు పార్టీలకు నాయకులమైనప్పటికీ స్నేహితుల్లా మసలుకున్నాం. ఎంజీఆర్ తర్వాత, ఆ పార్టీ నాయకత్వం మమ్మల్ని ద్వేషించడం మొదలెట్టింది. కామరాజ్ – నేనూ దోస్తులమే. మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి భక్తవత్సలంతోనూ స్నేహం చేశాను. ఆర్ వెంకటరామన్ ఇప్పటికీ నా స్నేహితుడే (2007 నాటికి). తమిళనాడులో ఏఐఏడీఎంకే అని పిలవబడే పార్టీని మినహాయిస్తే, మిగిలిన వారితో మాకు మంచి స్నేహమే వుంది’ అని 2007లో ఓ వార్తా ్తసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరుణ చెప్పారు. - ‘నా మనస్సాక్షినే నేను నమ్ముతాను. నా దైవం అదొక్కటే’ అంటారు కరుణ. - సంకీర్ణ ప్రభుత్వామనేది తాత్కాలిక ఏర్పాటు. సంకీర్ణం కారణంగా మేం కొన్ని డిమాండ్లు సాధించుకోగలిగాం. తమిళ భాషకు ప్రాచీన ప్రతిపత్తి లభిస్తుందని మేమెప్పుడూ అనుకోలేదు. చివరికి అది కూడా సంకీర్ణం వల్లే సాకారమైంది’ అని ఓ ఇంటర్వ్యూలో వివరించారు కరుణానిధి. - కేంద్రంలో తాను కలసిన వ్యక్తుల్లో వీపీ సింగ్ను గొప్ప మనిషిగా భావిస్తారు కరుణ. వీపీ చేపట్టిన సామాజిక సంస్కరణలు, రిజర్వేషన్లు, మండల్ కమిషన్ ఏర్పాటు వంటి అంశాలు తమ స్నేహానికి వారధి వేశాయంటారు. - కరుణతో వాజ్పేయ్ బాగుండేవారు. ‘మా బంధం గట్టిగా ఉండడానికి మురసోలి మారన్ ఒకానొక కారణం’ అని కరుణ ఒక సందర్భంలో చెప్పారు. (వాజ్పేయ్ ప్రభుత్వంలో మారన్ కేబినెట్ మంత్రి పనిచేశారు. ఇప్పుడు లేరు)) ఈ నేతలిద్దరూ ఎమర్జెన్సీ కాలంలో ఒకే వేదికపై ప్రసంగాలు చేశారు. రాముడు నాకు శత్రువు కాదు.. వాల్మీకి రామాయణాన్నీ, తులసీ రామాయణాన్నీ చదివాను. పలు రామాయణాల్లో మాదిరిగానే తులసీ రామాయణంలో సీత రాముడి చెల్లెలు. వాల్మీకి రామాయణంలో మాత్రం ఆమె రాముడికి భార్య. ఆర్యులు – ద్రవిడుల మధ్య జరిగిన యుద్ధం ఆధారంగా రామాయణాన్ని రచించారు. రాముడు ఓ కల్పిత పాత్ర. జవహర్లాల్ నెహ్రూ కూడా రాముణ్ణి నాయకుడిగానే చూశారు. దేవుడిగా కాదు. సి. రాజగోపాలచారి రచించిన ‘చక్రవర్తి తిరుమగల్’ పుస్తకం ప్రకారం – రాముడు యువరాజు. దేవుడు కాదు. రాముడికి నేను శత్రువును కాను. ముస్లింలు / క్రైస్తవులు పండుగల వేళ ఆహ్వానిస్తే వెళతాం. అలాగే హిందువులూ ఆహ్వానిస్తే ఎందుకెళ్లం? అందులో తప్పేం లేదు కదా!.. – 2007లో కరుణానిధి ఇచ్చిన ఇంటర్వ్యూల నుంచి కళానిధి చిన్నతనంలో చదువు పట్ల ఆసక్తి వుండేది కాదని కరుణ తన ఆత్మకథలో రాసుకున్నారు. నాటకం, కవిత్వం, తమిళ సాహిత్యం వైపే ఆయన మనసు మళ్లుతుండేదట. కరుణ తండ్రి ముత్తువేలు.. చనిపోవడానికి ఒక నెల ముందు కరుణానిధి మాటలు రాసిన‘రాజకుమారి’ సినిమా చూడాలనుకున్నారట. కానీ అప్పటికే ఆయన కంటి చూపుకు దూరమయ్యారు. కనీసం కొడుకు రాసిన మాటలైనా విందామనుకున్నారాయన. దీంతో తిరువారూర్లో ఓ థియేటర్కు తీసుకుపోయారు. ‘రచయితగా నేను ఎదిగిన తీరును చూసి ఆయన ఎంతో సంబరపడ్డారు’ అని ఆత్మకథలో చెప్పారు కరుణ. -(సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఇదీ సీపీఎం రామాయణం
సాక్షి, న్యూఢిల్లీ : పౌరాణిక రామాయణ గ్రంధాన్ని ఆరెస్సెస్ లాంటి శక్తులు రాజకీయాల కోసం ఉపయోగించుకోకుండా అందుబాటులో ఉన్న వివిధ రామాయణాల పట్ల రాష్ట్ర ప్రజలకు చైతన్యం కల్పించడం కోసం సీపీఎం పార్టీ సభ్యులు ఎక్కువగా ఉన్న ‘కేరళ సంస్కత సంస్థ’ జూలై 15వ తేదీ ఆదివారం నుంచి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు వివిధ రామాయణాలపై చర్చా గోష్ఠిలు, సదస్సులు నిర్వహించనుంది. వాల్మీకి, కబీర్, తులసిదాస్తోపాటు పలువురు రాసిన రామాయణాలతోపాటు ప్రాంతాల వారిగానున్న రామాయణాలన్నింటిని ఈ కార్యక్రమాల్లో విశ్లేషిస్తారు. జాతీయ, ప్రాంతీయ రామాయణాలను కలుపుకొని మలయాళంలో ప్రస్తుతం 29 రామాయణాలు అందుబాటులో ఉన్నాయి. అందులో కేరళ ప్రాంతానికి చెందిన ఆద్యమ రామాయణం కూడా ఉంది. మలయాళం క్యాలెండర్ ప్రకారం జూలై 15వ తేదీన రామాయణం మాసం ప్రారంభమైంది. అదే రోజున రామాయణ కార్యక్రమాన్ని సీపీఎం ప్రారంభించడం పట్ల విమర్శలు వెల్లువెత్తగా, అది యాధశ్చికంగా జరిగిందని, అయినా రామాయణంపైనే తాము అవగాహనా కార్యక్రమాన్ని చేపడుతున్నప్పుడు ఆ రోజున ప్రారంభిస్తే మాత్రం తప్పేమిటని పార్టీ సీనియర్ నాయకులు అచ్యుతానందన్ లాంటి వారు ప్రశ్నిస్తున్నారు. ఆరెస్సెస్ లాంటి శక్తులు రామాయణాన్ని సంకుచిత స్వభావంతో చూపించడమే కాకుండా అదే స్వభావాన్ని ప్రజలకు రుద్దేందుకు ప్రయత్నిస్తోందని పార్టీ సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అన్న భారతీయ సంస్కతి రామాయణం లాంటి ఇతిహాసాల్లో ప్రతిబింబిస్తుందా, లేదా? ఇన్ని రామాయణాలు ఏ కారణంగా పుట్టుకొచ్చాయో ప్రజల ముందుకు తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని తాము అన్నారు. ఈ కార్యక్రమంలో తాము కూడా పాల్గొంటున్నప్పటికీ ‘కేరళ సంస్కత సంస్థ’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోందని వారు చెప్పారు. సంస్కత సంస్థ ఓ లౌకిక సంస్థ అందులో లౌకికవాదులు, మేథావులు, పండితులు, టీచర్లు, విద్యార్థులు ఉన్నారని వారు తెలిపారు. సంస్థ రాష్ట్ర కన్వీనర్ టీ. తిలక్రాజ్ పదవీ విరమణ చేసిన సంస్కత టీచరు. ఆయన సీపీఎం టీచర్స్ విభాగానికి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కూడా. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) జాతీయ మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర సీపీఎం కమిటీ సభ్యుడు డాక్టర్ వి. శివదాసన్ కూడా ఈ సంస్కత సంస్థలో సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇది వరకు మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులపై నిర్వహించిన అవగాహనా కార్యక్రమాలు విజయవంతం అవడం, వాటికి లక్షలాది మంది ప్రజలు రావడంతో ఇప్పుడు రామాయణంపై కూడా చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని డాక్టర్ శివదాసన్ వివరించారు. రామాయణ, మహాభారతంల పేరిట ప్రజల్లో విద్వేషాలు తీసుకరావడం ద్వారా రాష్ట్రంలో బలపడేందుకు హిందూత్వ శక్తులు ప్రయత్నిస్తుంటే తాము అవే రామాయణ, భారతాలు చెబుతున్న బహుళత్వంలో భిన్నత్వాన్ని చెబుతున్న హిందూ ఇజం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సీపీఎం నాయకులు వివరించారు. హిందూత్వ శక్తులను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో సీపీఎం కార్యకర్తలు ‘ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, యోగా స్టడీ సెంటర్ పేరిట యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
కత్తి మహేశ్ను హీరో చేసిందెవరు?
సాక్షి, న్యూఢిల్లీ : రామాయణంలోని పాత్రల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఎలాంటి నేర చరిత్రలేని ఓ దళితుడిని తెలంగాణ పోలీసులు నగర బహిష్కారం చేయడం బహూశ దేశంలోనే మొదటి సారి కావచ్చు. పైగా రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినిమా విశ్లేషకుడు కత్తి మహేశ్, ఆయన వ్యాఖ్యలకు నిరసనగా పాద యాత్ర జరుపుతానంటూ హెచ్చరిక చేసిన పరపూర్ణానంద స్వామి పట్ల పరస్పరం భిన్నంగా వ్యవహరించడం కూడా తెలంగాణ పోలీసులకే చెల్లింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు వివరణ ఇచ్చుకునేందుకు వీలుగా కత్తి మహేశ్కు ఎలాంటి న్యాయపరమైన నోటీసులు ఇవ్వని పోలీసులు (పిలిపించి మాట్లాడారే తప్ప), మత మార్పిడిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పరిపూర్ణానంద స్వామికి మాత్రం నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా తొలుత స్వామిని గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసులు, కత్తి మహేశ్ను మాత్రం నగర బహిష్కారం చేశారు. పోలీసుల నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వక పోవడమే కాకుండా ప్రతిపాదిత నిరసన పాద యాత్రను మానుకోనని మొండికేయడంతోనే స్వామినీ కూడా నగర బహిష్కారం చేశారు. సమన్యాయం చాటుకునేందుకే అలాచేసి ఉండవచ్చు. కత్తి మహేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు నిక్కచ్చిగా ఆయన తన సొంత అభిప్రాయంగానే చెప్పారు. అది ఆయన భావ ప్రకటనా స్వేచ్ఛ. ఆయన అభిప్రాయంతో ఎవరైనా విభేదించవచ్చు. విమర్శించవచ్చు. అంతేగానీ శిక్షించే అధికారం చట్టానికే లేదు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులకు ఇంకెక్కడిది? ఆ మాటకొస్తే రామాయణంపై అందులోని పాత్రలపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఎంతో మంది సాహిత్యవేత్తలు, మేథావులు రామాయణాన్ని విమర్శించారు. అలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. ప్రముఖ తెలుగు మహిళా సాహితీవేత్త రంగనాయకమ్మ ‘రామాయణం ఓ విష వృక్షం’ అని ఓ గ్రంధమే రాశారు. దక్షిణాదిలో ద్రావిడ ఉద్యమానికి ఆద్యుడు పెరియార్ ఈవీ రామస్వామి రామాయణంలోని అన్ని పాత్రలను విశ్లేషిస్తూ దశరథుడు, రాముడు, లక్ష్మణుడు, సీత, కౌసల్యా.. తదితర పాత్రలన్నింటిని విమర్శించారు. రాముడు, లక్ష్మణుడు శూర్పనకను అవమానించిన కారణంగానే అందుకు ప్రతీకారంగానే రావణాసురుడు సీతనుఎత్తుకు పోయాడని, అమెను కనీసం ముట్టుకోలేదంటూ రావణాసురుడిని సమర్థించారు. రామాయణాన్ని ఆయన విశ్లేషిస్తూ పెరియార్ రామస్వామి రాసిన ‘ఈవీ రామస్వామీస్ రీడింగ్ ఆఫ్ ది రామాయణ’ అనే పుస్తకాన్ని తమిళయన్లు పవిత్ర గ్రంధంగా పూజిస్తున్నారు. పెరియార్ రామస్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి దేవుడిలా కొలుస్తున్నారు. ఆయన ప్రారంభించిన ద్రావిడ ఉద్యమం పేరు దాదాపు అన్ని రాజకీయ పార్టీల పేర్లలో మిలితమై ఉంటుంది. ఇటు పెరియార్ రామస్వామి పుస్తకాన్నిగానీ, తెలుగునాట రంగనాయకమ్మ రాసిన ‘రామాయణం విషవృక్షం’ పుస్తకాన్ని ఎందుకు నిషేధించలేదు? ఆక్స్ఫర్డ్ ఇండియా పేపర్బ్యాక్స్ ప్రచురించిన ‘మెనీ రామయాణాస్’ చదివితే ఇంకేమైనా ఉందా? ఇంకా దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛను నిషేధించలేదు కనుక, ఈ పుస్తకాలను కూడా నిషేధించలేదు. ఈ నేపథ్యంలోనే కత్తి మహేశ్కు నగర బహిష్కార శిక్ష సబబా, కాదా? అన్న చర్చ వస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యల వల్ల కత్తి మహేశ్కు వచ్చిన పబ్లిసిటీ ఏమోగానీ నగర బహిష్కరణ శిక్ష ద్వారా ఆయనకు వచ్చిన పాపులారిటీ చాలా ఎక్కువ. మహేశ్ వర్సెస్ పరిపూర్ణానంద స్వామి ఎపిసోడ్లో స్వామి బహిష్కరణను తీవ్రంగా ఖండించిన స్థానిక బీజేపీ నాయకులు మాట వరుసకు కూడా కత్తి బహిష్కారాన్ని ఖండించలేదు. కేంద్రంలో ఇటీవల అస్తమానం భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు మాత్రం ఈ ఎపిసోడ్పై స్పందించడం లేదు. అదే నెట్ఫిక్స్లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ ‘సాక్రెడ్ గేమ్స్’ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని విమర్శించారంటూ ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. గాంధీ, నెహ్రూలు వారికి దేవుళ్లతో సమానం కనుక వారికి కోపం వచ్చి ఉంటుంది. హిందువులను కించపరిచే డైలాగులు ఉన్నాయంటూ సాక్రెడ్ గేమ్స్పై ఆరెస్సెస్ వారు కూడా కోర్టుకెళ్లారు. అది వేరే విషయం. -
అమోఘం: కత్తి మహేష్ నోట శ్రీరాముడి శ్లోకం!
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ఇటీవల శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కత్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేయడంతో కత్తిపై హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేశారు. దీంతో ఆయన ఆంధ్రప్రదేశ్కి వెళ్లిపోయారు. పోలీసుల అనుమతి లేకుండా హైదరాబాద్లో అడుగుపెట్టడానికి వీళ్లేదని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కత్తి దీనిపై న్యాయబద్ధంగా పోరాడటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. శ్రీరాముడిని దూషించిన నోటితోటే ఆయనను పొగుడుతూ శ్లోకాలతో కూడిన ఓ పాటను కత్తి మహేష్ పాడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కత్తి మహేష్ రాముడి పాటను స్పష్టంగా పాడుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దాదాపు ఒక నిమిషం పాటు ఉన్న ఈ వీడియోలో ఆయన నోటి వెంట రాముని పాట తప్ప ఇంకేమీ లేకపోవడం విశేషం. అయితే కత్తి నోట ఈ శ్లోకం రావడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. పశ్చత్తాపంతో రాముడిని స్మరించుకున్నాడా..? లేదంటే శ్రీ రాముడికి తాను వ్యతిరేకిని కాదని చెప్పడానికి పాడాడా..? భయంతో పాడుతున్నాడా.? భక్తితో పాడుతున్నాడా.? లేక వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నారా.? అనేది అర్థం కావడంలేదని నెటిజన్లు అంటున్నారు. -
16 రోజుల యాత్ర స్పెషల్ ట్రైన్
న్యూఢిల్లీ : రైల్వేశాఖ రామాయణంలో ప్రస్తావించిన ప్రముఖ ప్రదేశాలన్నింటిని ఒకే యాత్రలో సందర్శించుకునే ఆవకాశాన్ని కల్పిస్తోంది. అందుకోసం నవంబర్ 14న ప్రత్యేక పర్యాటక రైలు ‘శ్రీరామాయణ ఎక్స్ప్రెస్’ ను నడపనున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది. హిందూ చరిత్రలో రామాయణానిది ప్రత్యేక స్థానం. అందుకే రాముని జీవితంతో సంబంధం ఉన్న ప్రధాన ప్రాంతాలను యాత్రికులు సందర్శించుకునేలా ఈ స్పెషల్ ట్రైన్కు రూపకల్పన చేసింది. ఢిల్లీలో ప్రారంభమై తొలుత అయోధ్యలోని గర్హి రామ్కోట్, కనక్ భవన్ ఆలయాల సందర్శన తర్వాత నందిగ్రామ్, సీతామర్హి, జనక్పూర్, వారణాసి, ప్రయాగ్, శ్రింగ్వర్పూర్, చిత్రకూట్, హంపీ, నాసిక్ల మీదుగా రామేశ్వరం చేరుకుంటుంది. ఈ స్పెషల్ ట్రైన్లో 800మంది ప్రయాణించవచ్చు. 16 రోజుల పాటు యాత్ర కొనసాగుతోంది. ఒక్కో వ్యక్తికి 15,120 రూపాయలు వసూలు చేయనున్నారు. అందులోనే భోజన సదుపాయం, ధర్మశాలలతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు.వాటి కోసం ప్రత్యేక టూర్ మేనేజర్ను అందుబాటులో ఉంచుతారు. ఇందుకు సంబంధించిన బుకింగ్ త్వరలో ఐఆర్సీటీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు రైల్వేశాఖ తెలిపింది. రామాయణ యాత్రను ఐఆర్సీటీసీ రెండు ప్యాకేజ్లుగా విభజించింది. ఒకటి భారత్లో ఢిల్లీ నుంచి రామేశ్వరం వరకు కాగా, మిగిలినది శ్రీలకంలో సాగనుంది. యాత్రికులను విమానంలో శ్రీలంకు తీసుకెళుతారు. ఈ పర్యటనలో భాగంగా కండీ, నువారా ఎలియా, కొలంబో, నీగోమ్బోలను సందర్శించవచ్చని రైల్వేశాఖ తెలిపింది. శ్రీలంక 5 రోజుల పర్యటనకై ప్రత్యేంగా 47,600 రూపాయలతో ప్యాకేజ్ రూపొందించింది. ఈలోపే రామాయణంలోని ప్రధాన ప్రదేశాలను సందర్శించేలా ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 9 వరకు మరో ప్రత్యేక రైలును నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అది త్రివేండ్రం నుంచి ప్రారంభమవుతోందని తెలిపింది. -
‘అభినవ’ పురాణాలు
బీజేపీతో ఏకీభవించని వారితో నేను ఏకీభవించను. కారణం– మన భారతీయ సంప్రదాయానికీ ఆధునిక జీవనానికీ నిచ్చెనలు వేస్తున్న ఒకే ఒక పార్టీ బీజేపీగా నేను భావిస్తాను. ‘మనవాళ్లు ఉత్త వెధవాయిలోయ్!’ అని గిరీశం తొందరపడి తీర్పునిచ్చాడు కానీ అతను కాని బీజేపీలో ఉంటే తన మనస్సు మార్చుకునేవా డని నా గట్టి నమ్మకం. ఇందుకు గట్టి ఉదాహరణ నాకు ఇటీవలే ఉత్త రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ మాటల్లో దొరి కింది. ఆయన లాకాయి లూకాయి మంత్రి కాడు. ఉప ముఖ్యమంత్రి. ఆయన అన్నారు కదా మన జర్న లిజం పురాణ కాలం నుంచే ప్రారంభమైందని నొక్కి వక్కాణించారు. అంతేకాదు, ఇందుకు బలమైన ఉదా హరణలు ఇచ్చారు. మొదటి ఉదాహరణ: మన భగవద్గీత. ధృతరా ష్ట్రుడితో ఎలా చెప్పాడయ్యా సంజయుడు? చూసింది చూసినట్టు ఒక్క అక్షరం పొల్లు పోకుండా 700 శ్లోకా లను వినిపించాడు. మహా భారత యుద్ధం పంచ రంగులతో ఆయన దివ్య దృష్టికీ కనిపించడానికీ ఈనాటి మన ఐపాడ్లకీ చాలా దగ్గర సంబంధం ఉన్నదని సంజయుని కథనిబట్టి మనం అర్థం చేసు కోవాలి. అలాగే పురాణాల్లో అనాదిగా వస్తున్న పాత్ర– నారదుడు. ఆయన ఎక్కడ పడితే అక్కడికి– ఆయా కారణాలకి చటుక్కున వెళ్లే టెక్నిక్కీ నేటి ‘గూగుల్’కీ పోలికలు లేవా? అని ఆయన బహిరంగ సభలో ప్రశ్నించారు. ‘మీ దిక్కుమాలిన గూగుల్ ఇవాళ ప్రారంభమైంది. కానీ భారతదేశంలో గూగు ల్– పురాణకాలంలో–మహాభారతం రోజుల నాటికే ప్రారంభమైందని’ ఆయన బల్ల గుద్దారు. మనం రెండుసార్లు ‘క్లిక్’ నొక్కితే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లి ఆయా సమా చారాల్ని తెలుసుకోవచ్చు. అది ఇవాళ్టి మాట. కానీ నారదుడు ‘నారాయణ, నారాయణ’ అని రెండుసార్లు అనడం ద్వారా– ఇటు ‘పారిజాతాపహరణా’న్ని, అటు ‘కృష్ణార్జున యుద్ధాన్ని’ నిర్వహిం చిన గొప్పతనాన్ని మరచిపోతున్నాం– అని వాక్రుచ్చారు. అలాగే రామాయణంలో మహాసాధ్వి సీత ‘టెస్ట్ ట్యూబ్’ నుంచి పుట్టిందని సోదాహరణంగా వివరిం చారు. ఆ లెక్కన ద్రోణుడు యజ్ఞాలు చేసే దోనెలో అతని వీర్యం పడగా పుట్టాడని పురాణం. యజ్ఞాల వేళల్లో వీర్యానికి ఏం అగత్యమున్నదో మనకు తెలీదు, ఏమైనా మన పురాణాల నిండా అడ్డమైన వాళ్లూ అడ్డమైన పద్ధతుల్లో పుట్టారు. ఈ విధానాలకీ, ఆధునిక జీవన విధానానికీ ఒక సాపత్యాన్ని వెదికిన సెకండరీ, హయ్యర్, సైన్స్ సాంకేతిక శాఖల మంత్రి గారి ‘ఆలోచనా సరళి’ని కొట్టి పారేయడానికి వీలు లేదు. ఇవన్నీ చాలా గొప్ప పరిశీలనలుగా నేను భావి స్తున్నాను. ఈ లెక్కన స్టీవ్ జాబ్స్ ఏ శూద్రక మహర్షో, బిల్ గేట్స్ కిందటి జన్మలో ఏ శుక మహర్షో అయి ఉంటారని నాకు గట్టి నమ్మకం. లేకపోతే– ఇంతగా ప్రపంచాన్నంతటినీ ఆకర్షించగల ప్రయోగా లను చెయ్యలేరు. నాకు మొదటినుంచీ శ్రీనాథుడిమీద ఈ నమ్మకం ఉండేది. నిజానికి ‘ఆధునిక కవులలో అద్భుతమైన పాత్రికేయుడు శ్రీనాథుడు’ అనే విషయం మీద పరిశోధన జరగాలని నా గట్టి నమ్మకం. ఆయన ‘కాశీఖండము’, ‘భీమ ఖండము’ వంటి మహా రచనలు చేస్తూనే– ఆంధ్ర దేశ మంతా తిరిగి– ఆయా ప్రాంత ఆహార విశేషాల గురించి చెప్పుకుపోయాడు. ఏమైనా కొన్ని తరాలు, శతాబ్దాలు, మళ్లీ మాట్లాడితే యుగాల కిందటి వాస్తవాలను మనకి పంచిన ఘనత బీజేపీది కాక ఇంకెవరికి ఉంటుంది? అని నాకు గర్వపడాలనిపిస్తుంది. మరి మన మహా భారతంలో విమానాలు న్నాయి. వాటిని మన ‘ఎయిర్ ఇండియా’ విమానా లతో పోల్చవచ్చునేమో. కాలదోషం పట్టి వాటిని ప్రస్తుతం ఎవరూ కొనుగోలు చెయ్యడం లేదు. అలాగే హఠాత్తుగా ఆడవారుగా మారిపోయిన మగ వారూ, మగవారిగా మారిపోయిన ఆడవారూ, నపుంసకులూ ఉన్నారు. మన కాలంలో వారు ఎవరో పోల్చవలసిన అవసరం బీజేపీ నాయకులకి ఉంది. ఏమైనా డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని కాల దన్నేలాగ– మన సంస్కృతికీ, పౌరాణిక సంస్కృతికీ నిచ్చెనలు వేయగలిగిన ఆలోచనా పటిమ, స్వదేశీ అభిమానం ఉన్న పార్టీగా నేను బీజేపీని గుర్తిస్తు న్నాను. రాబోయే ఎన్నికలలో తప్పనిసరిగా నా ఓటు బీజేపీకి వెయ్యబోతున్నానని ఇప్పుడే హామీని ఇస్తు న్నాను. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
సీతాదేవి ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ
లక్నో/అహ్మదాబాద్/న్యూఢిల్లీ: రామాయణంలోని సీతాదేవి కృత్రిమ పద్ధతుల్లో జన్మించిన బిడ్డ (టెస్ట్ ట్యూబ్ బేబీ) అని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, దినేశ్ శర్మ (బీజేపీ) వ్యాఖ్యానించారు. నోటిని అదుపులో పెట్టుకోవాలని దినేశ్ను బీజేపీ వర్గాలు హెచ్చరించాయి. గురువారం రాత్రి ఓ సభలో ఆయన మాట్లాడుతూ ‘లంక నుంచి రాముడు పుష్పక విమానంలో తిరిగొచ్చాడని మనకందరికీ తెలుసు. రామాయణ కాలంలోనే విమానాలు ఉన్నాయని దీని ద్వారా నిరూపితమవుతోంది. సీతాదేవి తల్లి గర్భం నుంచి జన్మించలేదు. జనకుడు పొలం దున్నుతుండగా భూమిలో ఓ పాత్ర నుంచి సీతాదేవి ఉద్భవించింది. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం ఆ రోజుల్లో ఉంది’ అని దినేశ్ అన్నారు. నీచ రాజకీయాల కోసం సీతాదేవిని బాధితురాలిగా మార్చొద్దని బీజేపీని కాంగ్రెస్ కోరింది. సీతను ఎత్తుకెళ్లింది రాముడే! సీతను శ్రీరాముడు ఎత్తుకెళ్లాడట..! గుజరాత్ పాఠ్యపుస్తకంలో ఇది ప్రచురితమైంది. ఈ తప్పిదాన్ని ఆలస్యంగా గుర్తించిన విద్యాశాఖ సిబ్బంది సరిదిద్దుకునే పనిలో పడ్డారు. కాళిదాసు రచించిన ‘రఘువంశం’లోని ఓ ఘట్టం 12వ తరగతిలో పాఠ్యాంశంగా ఉంది. గుజరాతీలో సరిగ్గానే ఉన్నప్పటికీ ఇంగ్లిష్ మీడియం పుస్తకాల్లో మాత్రం.. ‘సీతను రాముడు ఎత్తుకుపోయిన ఆ ఘటనను లక్ష్మణుడు రాముడికి వర్ణించి చెప్పిన తీరు హృదయానికి హత్తుకునేలా ఉంటుంది..’అని ఉంది. ఈ తప్పు ఇంగ్లిష్లోకి అనువాద సమయంలో జరిగింది. -
ఆసక్తి కలిగిస్తున్న ‘రామాయణ–2020’
సాక్షి, సిటీబ్యూరో : రామాయణాన్ని వర్తమాన పరిస్థితులకు అన్వయం చేస్తూ, చిన్నారులకు చక్కగా అర్థమయ్యేలా పదకొండున్నరేళ్ల బాలుడు మాస్టర్ విక్రమ్ నాగరాజన్ రచించిన ‘రామాయణ–2020’ పుసక్తం చిన్నారుల్లో ఆసక్తి రెకేత్తిస్తోంది. ఆధునిక ప్రపంచానికి రామాయణాన్ని ఎలా అన్వయం చేసుకోవాలో ఈ పుస్తకంలో వివరించడం విశేషం. ఈ పుస్తకాన్ని చమన్న పబ్లికేషన్స్ ప్రచురించింది. వెల రూ.315. పుస్తక రచయిత విక్రమ్ నాగరాజన్ ప్రస్తుతం అమెరికాలో ఆరో తరగతి చదువుతున్నారు. ఇతనికి గణితం, జాగ్రఫీ, జువాలజీ, చరిత్ర, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తదితర అంశాల్లోనూ ఆసక్తి ఉందని పబ్లికేషన్స్ నిర్వాహకులు ఎం.పట్టాభిరామ్ తెలిపారు. పుస్తక కాపీలకు చమన్న పబ్లికేషన్స్, కేరాఫ్ ఎం.పట్టాభిరామ్, 4ఎఫ్, ముస్సోరీహిల్ కౌంటీ, నిజాంపేట్ మెయిన్ రోడ్, హైదరాబాద్–500090, 9502196347 నెంబర్లో సంప్రదించాలని కోరారు. -
‘కాంగ్రెస్ త్రీ ఇడియట్స్’ వివాదం
భోపాల్ : మధ్యప్రదేశ్లో ఈ మధ్య మార్ఫింగ్ వీడియోలు బాగా ప్రచారం అవుతున్నాయి. ఇవి సినీ ప్రముఖులు, మరేవరివో సంబంధించినవి కావు. రాజకీయ నాయకులకు సంబంధించినవి. రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ను రామాయణంలోని అంగదునిగా చూపిస్తూ, కాంగ్రెస్ పార్టీ నాయకులను రావణాసురునితో పోలుస్తూ మార్ఫింగ్ చేసిన వీడియోను ఒక దాన్ని పోస్టు చేశారు. ప్రస్తుతం అది వైరల్గా మారింది. ఈ వ్యవహారం ఇంకా సద్దుమణగకముందే ఇదే తరహా మార్ఫింగ్ వీడియో మరొకటి ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాధ్, మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాలను హిందీ సినిమా ‘త్రీ ఇడియట్స్’ పాత్రలుగా మార్ఫింగ్ చేశారు. వీరు ముగ్గురు ‘త్రీ ఇడియట్స్’ సినిమాలోని ‘ఆల్ ఇజ్ వెల్’ పాటకు కాలు కదుపుతున్నట్లు ఉన్న వీడియోను పోస్టు చేశారు. ఈ పేరడి వీడియోపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేయగా, బీజేపీ ఎప్పట్లానే ఈ వివాదానికి దూరంగా ఉంది. ఈ వీడియో గురించి బీజేపీ నేత రాజినీష్ అగర్వాల్ ‘ఈ పేరడీ వీడియోలతో మాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ చర్యకు పాల్పడినవారి మీద కాంగ్రెస్ పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చు. మాకు ఎటువంటి అభ్యంతరం లేద’ని తెలిపారు. దీని గురించి కాంగ్రెస్ నేత మానక్ అగర్వాల్ ‘మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వానికి బీటలు వారుతున్నాయి అందుకే వారు ఇలాంటి వికారమైన పనులు చేస్తున్నార’ని అన్నారు. ఇదిలావుండగా నిన్ననే బీజేపీ ఐటీ సెల్ ముఖ్య అధికారి అయిన శివరాజ్ సింగ్ దబి తన ట్విటర్లో శివరాజ్ సింగ్ చౌహన్ను అంగదునిగా చూపిస్తూ రూపొందించిన రామాయణం మార్ఫింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ పేరడీ వీడియోల గురించి కాంగ్రెస్ నాయకులు మధ్యప్రదేశ్ సైబర్ సెల్లో ఫిర్యాదు చేశారు. -
చంద్రబాబు వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు
-
చంద్రబాబు వాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు
-
పోతన రామాయణం రాశారు: చంద్రబాబు
సాక్షి, కడప: బమ్మెర పోతన మహాకవి తెలుగువారందరికీ సుపరిచితులు. ఆయన రచించిన ‘శ్రీమదాంధ్ర భాగవతం’లోని పద్యాలు, కీర్తనలు తెలుగువారికి కంఠతా వస్తాయి. ఇప్పటికీ తేనెలొలుకు ఆ తెలుగు పద్యాలు తెలుగువారి నోట జాలువారుతుంటాయి. అలాంటి బమ్మెర పోతన విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు జారారు. వైఎస్ఆర్ జిల్లా ఒంట్టిమిట్టలో బమ్మెర పోతన రామాయణం రాసి.. అక్కడి కోదండరామస్వామికి అంకితమిచ్చేశారని అనేశారు. ఒంటిమిట్టలో శుక్రవారం శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘కోదండరామస్వామి దేవాలయం.. ఒక చరిత్ర కలిగిన దేవాలయం. ఒక చరిత్ర ఉండే దేవాలయం ఇది. ఆ చరిత్రను ఇంకా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోని ఈ టెంపుల్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడ చూస్తే ఆ రోజు బమ్మెర పోతన ఇక్కడనే రామాయణం రాసి.. ఈ దేవునికి అంకితం చేసిన విషయం కూడా మనమందరం గుర్తుపెట్టుకోవాలి’ అని చెప్పుకొచ్చారు. అయితే, చంద్రబాబు బమ్మెర పోతన విషయమై చేసిన వ్యాఖ్యలపై తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహిత్యవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బమ్మెర పోతన ‘వీరభద్ర విజయము’, ‘భోగినీ దండకము’, ‘భాగవతము’, ‘నారాయణ శతకము’ వంటి రచనలు చేశారు. ఆయన రామాయణాన్ని రచించలేదు. ఈ నేపథ్యంలో భాగవతం రాసిన పోతనను రామాయణం రాశారని చంద్రబాబు పేర్కొనడం విమర్శలకు తావిస్తోంది. ఇది చంద్రబాబుకు ఉన్న జ్ఞానం అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. (వీడియో టీటీడీ సౌజన్యంతో) -
మూడు ముత్యాలు
రామకథలో ప్రతి ఘట్టం ఒక ముత్యం. ప్రతి ముత్యం ఒక రామాయణం. ఈ శ్రీరామ నవమికి.. హనుమంతుడు మోసుకొచ్చిన మూడు ముత్యాల పర్వతాలు మీకోసం. హిమాలయాలలో నిద్రిస్తున్న హనుమంతుడికి మెడలోని ముత్యాలహారం చేతికి తగలగానే మెలకువ వచ్చింది! ‘నేడు నా రామయ్య తండ్రి కల్యాణం, నా సీతారాములు ముత్యాల తలంబ్రాలు పోసుకునే రోజు. రామనామం జపిస్తూ భద్రాద్రికి బయలుదేరతాను’ అనుకుంటూ రామనామ స్మరణతో భద్రాద్రి చేరుకున్నాడు. కల్యాణం కనులారా వీక్షించి పరవశించిపోయాడు హనుమంతుడు. కల్యాణం పరిసమాప్తి తర్వాత ఆ దంపతులతో మాట్లాడసాగాడు హనుమంతుడు. నాటి గాథ (ఒకటో ముత్యం) ‘‘నీ పట్టాభిషేక సమయంలో నువ్వు సీతమ్మ చేతికి ఒక ముత్యాల హారం ఇచ్చి, ‘జానకీ! ఈ హారాన్ని నీకు ఇష్టమైన వారికివ్వు’ అన్నావు. సీతమ్మ ఆ హారాన్ని అందుకుని సింహాసనం దిగి, విభీషణ, జాంబవంత సుగ్రీవ, అంగదాది వానరులను ఒక్కొక్కరినీ దాటుకుంటూ నా దగ్గరకు రాగానే నిలబడిపోయింది. ‘మారుతీ! ఈ హారానికి నీవు మాత్రమే అర్హుడవు’ అంటూ నా చేతికి అందించింది. అక్కడున్నవారంతా హర్షధ్వానాలు చేశారు. నేను సిగ్గుతో ముడుచుకుపోతూ, ‘తల్లీ! అంతా రాముని మహిమ వల్లే!’ అన్నాను. ఇదంతా నాటి గాథ’’ అన్నాడు హనుమ. నేటి సందేహం (రెండో ముత్యం) ‘‘తండ్రీ! నీ వెంటే ఉండి, నీ అడుగులో అడుగులు వేసిన నాకు, నువ్వంటే ఏమిటో తెలుసు. ఇతరులు నిన్ను శంకిస్తుంటే నా మనసుకి కష్టంగా ఉంది. మా సీతమ్మ తల్లి రావణుని చెరలో ఉండి వచ్చిన తరవాత, నువ్వు ఆమెను అనుమానించావని అందరూ అనుకుంటున్నారు’’ అంటుండగానే... సీతమ్మ అందుకున్నారు. ‘‘హనుమా! రాముడు నాకు భర్త మాత్రమే కాదు, కోట్లమందికి ప్రభువు. ఆయనను ఎవ్వరూ వేలెత్తి చూపకూడదు. అందుకే నాకుగా నేను చితి పేర్చుకున్నాను’’ అని చెప్పింది. రాముడు, ‘‘హనుమా! ఎవరి ఆలోచనలు వారివి. వారి కళ్లకు నా ప్రవర్తన అలా కనిపించిందేమో, వారు అలా అనుకోవడంలో తప్పులేదేమో’’ అన్నాడు. రేపటి సందేశం (మూడో ముత్యం) ‘‘రామా! నిన్ను తొలిసారి చూసినప్పుడే నువ్వేమిటో అర్థమైందయ్యా. సీతమ్మను వెతుకుతూ మా కిష్కింధకు వచ్చావు. సీతమ్మ జాడ అడిగావు. నేను నగల మూటను చూపించాను. నువ్వు ఒక నగను చేతిలోకి తీసుకుని కంట తడిపెట్టి, పక్కనే ఉన్న సౌమిత్రితో, ‘తమ్ముడూ! నా కళ్లకు కన్నీళ్లు అడ్డపడుతున్నాయి. నగలు గుర్తించలేకపోతున్నాను. మీ వదినగారి నగలను గుర్తించవయ్యా’ అన్నావు. అమ్మ అంటే నీకు ఎంత ప్రేమయ్యా. అంతేనా, నీ తమ్ముడు నీకు తగ్గ అనుజుడు. ఆయనకు నగలు చూపితే, సీతమ్మ కాలి మంజీరాలు మాత్రమే గుర్తుపట్టగలిగాడు. ఎంత ఉత్తములయ్యా మీరు’’ అన్నాడు హనుమ. ఏటేటా కల్యాణం ‘‘చివరగా ఒక్క మాట తండ్రీ.. ఎన్ని యుగాలు గడిచినా, దాంపత్యానికి చిహ్నంగా నా తల్లి సీతమ్మను, నా తండ్రి రామయ్యనే చెప్పుకుంటారు. అది నాకెంతో సంతోషం. నాడు మీ కల్యాణం చూడలే కపోయామని ఎవ్వరూ బాధపడక్కర్లేదు. ఏటేటా మీ కల్యాణం చూస్తూనే ఉంటాం’’ అని, సీతారాముల ఆశీస్సులు తీసుకుని హిమాలయాలలో తపస్సు కోసం నిష్క్రమించాడు హనుమంతుడు. – వైజయంతి -
రామాయణం
-
అందుకే రామాయణం జీవన పారాయణం
మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. ఈ నాటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పారాయణ చేసే గ్రంథం రామాయణం. ఎందుకంటే, రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణంలో ముందుగా చెప్పవలసింది సీత గురించే. భర్తపై ఒక స్త్రీకి ఎంతటి ప్రేమానురాగాలు ఉండాలో, భార్యగా భర్త పట్ల ఏ ధర్మాన్ని అనుసరించాలో సీత నుంచి తెలుసుకోవచ్చు. రేపే తన భర్తకు అయోధ్యానగరానికి రాజుగా పట్టాభిషేకం. తానేమో మహారాణి. తెల్లారేసరికి భర్త వచ్చి, ‘నేను రాజును కావడం లేదు, పైగా నా తండ్రి నన్ను అడవులకి వెళ్లమన్నాడు, అదీ కూడా ఒకటి కాదు, రెండు పద్నాలుగేళ్లపాటు వనవాసం చే యాలి’ అని చెప్పాడు. అయినా సరే, సీతమ్మ పెదవి విప్పి ఒక్క పొల్లుమాట మాట్లాడలేదు. ఆధునిక కాలంలో లాగా ‘నువ్వు ఉట్టి చేతగాని భర్తవి’ అంటూ ఆడిపోసుకోలేదు. ఒక దేశానికి రాకుమార్తె అయి వుండి కూడా పుట్టింటికి వెళ్ళిపోతానని అనలేదు. వద్దు వద్దు అంటున్నా కానీ, తన భర్తనే అనుసరించింది. ఆయనతో కలసి అరణ్యవాసం చేసింది, అనేక కష్టాలు పడింది. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడుగా, నీడగా నిలవాలని చెప్పకనే చెప్పింది. అదే సీత ఇచ్చే సందేశం. లక్ష్మణుడి వంటి సోదరుడిని మనం చరిత్రలో ఎక్కడా చూసి ఉండం. చరిత్ర ప్రారంభం నుంచి పరిశీలిస్తే రాజ్యం కోసం సొంత సోదరుల్నే కడతేర్చిన వారిని చూసి ఉంటాము. కన్నతండ్రినే ఆస్తికోసం కిరాతకంగా హతమార్చినవారిని ఇప్పుడు మనం చూస్తున్నాం. అటువంటిది అన్నగారి కోసం రాజభోగాల్ని వదిలి, కూడా వెళ్ళిన లక్ష్మణుడి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మిగతా ఇద్దరు సోదరులు భరతుడు, శతృఘ్నుడు కూడా అన్నగారు లేని రాజ్యం తమకెందుకని సింహాసనంపై పాదుకలు వుంచి పరిపాలన చేశారు. ఇటువంటి అన్నదమ్ముల అనుబంధం ఎక్కడయినా వుంటుందా? ఇక స్వామి భకిక్తి సిసలైన నిదర్శనం హనుమంతుడు. కాస్త ఎక్కువ జీతం ఇస్తే చాలు వెంటనే వుద్యోగం మారిపోయే ఈ రోజుల్లో హనుమంతుని వంటి నిస్వార్థ పరుడు, స్వామిభక్తి పరాయణుడి గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది వుంటారు? ఒకసారి తన ప్రభువుగా అంగీకరించిన తరువాత, తనకు రాముడు అప్పజెప్పిన పనిని పూర్తి చెయ్యలేకపోయానే మరలా నా స్వామికి నా ముఖం ఎలా చూపించను? అని ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడతాడు హనుమ. అంతేగాని యజమాని చూడడం లేదు కాబట్టి ఈ పని పూర్తి చేసేసాను అని అబద్ధం చెప్పలేదు. రామ రావణ యుద్ధం జరిగినప్పుడు కూడా యుద్ధమంతా తానే అయి నడిపించాడు హనుమ. అంతటి శక్తిమంతుడయి ఉండి కూడా ఎప్పుడూ తనవల్లే ఇదంతా జరుగుతుందని గొప్పలు చెప్పుకోలేదు. తన హృదయంలో కొలువయి వున్న రామనామం వల్లనే తనకింత బలం వచ్చిందని వినమ్రంగా చెపుతాడు హనుమ. అటువంటి సేవకుడిని మనమెప్పటికయినా ఎక్కడైనా చూడగలమా? ఒక పరాయి స్త్రీని ఆశపడితే ఎంతటి విషమ పరిస్థితులని ఎదుర్కోవలసి వస్తుందో అన్నదానికి ఉదాహరణ రావణుడు. అవడానికి అసురుడైనా ఎంతో విద్వాంసుడు, మహా శివభక్తుడు. అయినా ఒక స్త్రీని బలాత్కరించబోయి యావత్ లంకానగరానికే ముప్పుని కొని తెచ్చుకున్నాడు. చివరికి తన ప్రాణాలనే కోల్పోయాడు. కామాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే మనిషి ఎంత పతనమవుతాడో చెప్పడానికి రావణుడే ఒక ఉదాహరణ.సీతాదేవి నగలమూట దొరికినప్పుడు రాముడు నీళ్ళు నిండిన కళ్ళతో ‘లక్ష్మణా, ఇవి మీ వదినగారి నగలేనా చూడవయ్యా‘ అని అడిగితే, దానికి లక్ష్మణుడు ‘‘నేను వీటిలో వదినగారి కాలి మట్టెల్ని మాత్రమే గుర్తుపట్టగలను’’ అని చెప్పాడు. అంటే ఎప్పుడూ తన తల్లి లాంటి వదినగారి పాదాల వంక తప్ప పైకి కూడా చూడలేదన్న మాట. అదీ ఒక వదినకీ, మరిదికీ వుండవలసిన గౌరవం. ఇక రాముడి గురించి చెప్పాల్సి వస్తే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. తండ్రికి మంచి తనయుడిగా, ఇల్లాలికి మంచి భర్తగా, సోదరులకి మంచి అన్నయ్యగా, సేవకుడికి మంచి యజమానిగా, స్నేహితుడికి మంచి స్నేహితుడిగా, శతృవుకి తగ్గ ప్రత్యర్థిగా... ఇలా రాముడి ప్రతి మాట, ప్రతి కదలిక, ప్రతి సంఘటన మనకి ఒక సందేశాన్నిస్తూనే వుంటాయి. స్ఫూర్తిని నింపుతూనే వుంటాయి. వ్యక్తిగా ఆయన అనుసరించిన మార్గం మానవ సమాజంలో వున్న ప్రతీ వ్యక్తికీ దేశ, కాల, మత, కుల ప్రసక్తి లేకుండా అనుసరణీయం.ఎన్ని కష్టాలు ఎదురయినా తాను నమ్మినదాన్ని ఆచరణలో పెట్టినవాడే చరిత్రలో ధీరోదాత్తుడిగా మిగిలిపోతాడు. రాముడి జీవితంలో ఆయన ఆచరించి చూపిన సద్గుణాల్లో కొన్నయినా ఆచరించగలిగితే ఈనాడు మానవాళి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల నుంచి బయట పడగలుగుతుంది. అందుకే రామాయణం ఒక మహత్తర కావ్యం అయింది. రాముడు పుట్టడం మానవుడుగానే పుట్టాడు. కానీ, పెరగడం దైవిక లక్షణాలతో పెరిగాడు. ఆయన అనుసరించిన ఆదర్శాలన్నీ మానవ సాధ్యమైనవి కావు. మహిమలు చూపకపోతేనేం, మనిషిగా మన్ననలు అందుకున్నాడు. శత్రువుల నోట కూడా ధర్మస్వరూపుడన్న ప్రశంసలు పొందినవాడు. ఆయన అనుసరించింది ధర్మం కాదు, ధర్మమే ఆయనను అనుసరించింది అన్నట్లుగా ప్రవర్తించాడు. తన నడవడికతో పరాక్రమంతో, ధర్మానుసరణతో, సుపరిపాలనతో దేవుడిగా జనం గుండెల్లో గూడు కట్టుకున్నాడు. -
మహాబలి
బాహుబలి చూస్తిరా? అంతకంటే పెరియ (పెద్ద) సినిమా చూస్తరా? బాహుబలి కంటే మహాబలి లాంటి సినిమాలు ఇండియాలో హాల్చల్ చేయబోతున్నాయి. బోట్లలో నింపినా సరిపోవు. అన్ని దుడ్లు... మునుగుతాయా? తేలతాయా? చూస్తమా? వెయ్యి కోట్ల భీముడు భీముడు బలవంతుడా లేక బాహుబలినా! అయినా ఆ పోలికేంటి? భీముడు రియల్ క్యారెక్టర్. బాహుబలి రీల్ క్యారెక్టర్ కదా అనుకుంటున్నారా? కరెక్టే. అయితే ఈ ఇద్దరి బలానికి పోలిక పెట్టింది రీల్ వైజ్గానే. బడ్జెట్ వైజ్గా ఎవరు పెద్ద అంటే. నిన్న మొన్నటి వరకూ ‘బాహుబలి’ పెద్ద. ఇప్పుడు భీముడే బిగ్. ‘బాహుబలి’ రెండు పార్ట్స్ బడ్జెట్ దాదాపు 300 కోట్లు. మరి భీముడికి అయ్యే బడ్జెట్ ఎంతో తెలుసా? 1000 కోట్లండి బాబు. వీఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో జ్ఞానపీuŠ‡ అవార్డుగ్రహీత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రాసిన బుక్ ఆధారంగా ‘మహాభారతం’పై ఈ సినిమా తీయడానికి బీఆర్ శెట్టి అనే బిలియనీయర్ రెడీ అయ్యారు. భీముడి క్యారెక్టర్ చుట్టూ తిరిగే ఈ సినిమాకయ్యే బడ్జెట్ 1000 కోట్లు. టైటిల్ రోల్ని మోహన్లాల్ చేయబోతున్నారు. కర్ణుడి పాత్రలో నాగార్జున కనిపిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ విషయం తెలియడానికి ఇంకా టైమ్ పడుతుంది. మోహన్లాల్ మాత్రం భీముడిగా కనిపించడానికి రెడీ అవుతున్నారు. ‘‘రెండు పార్ట్స్గా సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మొదటి పార్ట్ను విడుదల చేసిన, నెక్ట్స్ 90 డేస్ తర్వాత సెకండ్ పార్ట్ను రిలీజ్ చేస్తాం’’ అని వాసుదేవన్ నాయర్ అన్నారు. యూనిట్ అనుకున్నట్లుగానే ఈ సినిమా సెట్స్పైకి వెళితే.. దేశంలో 1000కోట్లతో నిర్మించిన తొలి సినిమా ఇదే అవుతుంది. వెయ్యి కోట్లా? తీసినవాళ్లు, కొన్నవాళ్లు ‘సేఫ్’ అవుతారా? అంటే.. టూ పార్ట్స్, మల్టీస్టారర్, మల్టీ లాంగ్వేజెస్లో రిలీజ్.. మునిగే చాన్సే లేదని ఊహించవచ్చు. 500 కోట్ల రామాయణం రామబాణానికి తిరుగులేదంటారు. అందుకే భీముడు గదతో బాక్సాఫీసు దగ్గరకు వస్తుంటే.. విల్లును ఎక్కుపెట్టి నేనూ వస్తున్నా అంటున్నాడు రాముడు. రామాయణం అంటే సీతను అడవులపాలు చేసిన రాముడు అని ఈతరం వారు అనుకుంటారు. కొందరకి అది కూడా తెలియకపోవచ్చు. ఇలాంటి టైమ్లో రామాయణం వస్తే? అబ్బో.. బడ్జెట్ బోలెడంత అవుతుంది. అయినా ఓకే అంటూ అల్లు అరవింద్ రామాయణం ఆధారంగా సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. మధు మంతెన, నమిత్ మల్హోత్రాలతో కలిసి త్రీ పార్ట్స్గా ఆయన ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. రాముడు ఎవరంటే రామ్చరణ్ అట. అంతేకాదు.. మెగా కాంపౌండ్కి చెందిన హీరోలు కీలక పాత్రల్లో కనిపిస్తారని టాక్. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఇలాంటి వార్తలు హల్చల్ చేస్తుంటాయి. ఇంతకీ రాముడు ఎప్పుడు కెమెరా ముందుకు వస్తాడు? దర్శకుడు ఎవరనేది ప్రస్తుతానికి నో క్లారిటీ. ‘‘రామాయణం వంటి సినిమాను నిర్మించాలంటే ఎంతో బాధ్యతగా ఉండాలి. బిగ్ స్రీన్పై చూపించడం అంత ఈజీ కాదు. అందుకే పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నాం’’ అని అల్లు అరవింద్ అప్పట్లో అన్నారు. సో... 500 కోట్లు వర్కవుట్ అవుతుందా అంటే... త్రీ పార్ట్స్ బాస్. పైగా పర్ఫెక్ట్ ప్లానింగ్ కూడా. రాముడికి తిరుగుండకపోవచ్చు. 300 కోట్ల కర్ణుడు కర్ణుడి దానగుణం ఎంత గొప్పది? ప్రాణాలనైనా తృణప్రాయంగా ఇచ్చేంత గొప్పది. మరి కురుక్షేత్ర రణరంగంలో దుష్టులైన కౌరవుల వైపు ఎందుకు ఉండాల్సి వచ్చింది? పాండవులకు కర్ణుడు ఎందుకు వ్యతిరేకం అయ్యారంటే చరిత్ర తెలుసుకోవాలి. మలయాళ దర్శకుడు ఆర్. ఎస్. విమల్ ఆ పని మీదే ఉన్నారు. విక్రమ్ టైటిల్ రోల్లో ఆయన ‘మహావీర్ కర్ణ’ అనే సినిమా తీయబోతున్నారు. 300 కోట్ల రూపాయలతో యునైటెడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ‘‘రెండేళ్లుగా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నా. కొన్ని సీన్లు రీ–రైట్ కూడా చేశా. తమిళ్, హిందీ భాషల్లో తీసి, మిగతా భాషల్లో డబ్ చేయాలనుకుంటున్నాం. ఇంటర్నేషనల్ లెవల్లో యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ని తీసుకోబోతున్నాం’’ అన్నారు విమల్. డైరెక్టరే చెప్పేశారుగా.. ఇంటర్నేషనల్ లెవల్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అని.. ఇంకేం? బొమ్మ మునిగే చాన్సే లేదు. 400 కోట్ల రోబో ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్ రికార్డుల గురించి చెప్పుకోవాలంటే ప్రజెంట్ బాహుబలి, దంగల్ వసూళ్ల నుంచి స్టార్ట్ చేయాలి. ‘‘హలో... ఫ్యూచర్లో మా గురించి కూడా చెప్పుకుంటారు’’ అంటున్నారు ‘2.0’ టీమ్. ‘రోబో’కి సీక్వెల్గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రిలీజ్ డేట్స్లో కాస్త అయోమయంగా ఉన్నా కలెక్షన్స్ విషయంలో ఫుల్ క్లారిటీతో దూసుకెళ్లేలా మార్కెట్ను రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే వంద కోట్లకు పైగా శాటిలైట్ రైట్స్ను దక్కించుకున్నారు. రజనీకాంత్, అక్షయ్కుమార్, అమీజాక్సన్ ముఖ్యతారలుగా సుమారు 400 కోట్ల బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇండియన్ సినిమాల్లో ఇప్పటికి ఇది హయ్యస్ట్ బడ్జెట్ మూవీ. ఆల్రెడీ శాటిలైట్, ఇతర హక్కుల రూపంలో 150 కోట్లు వచ్చేశాయట. రోబో మునిగే చాన్సే లేదు. టోటల్ కలెక్షన్స్ మిగతా సినిమాలకు షాక్ ఇస్తాయేమో! వెయిట్ అండ్ సీ. 250 కోట్ల సంఘమిత్ర బాక్సాఫీసుపై యుద్ధం చేయడానికి భీముడు, రాముడు, కర్ణుడు రెడీ అవుతున్నారు. వీళ్లతో పాటు తలపడటానికి ఓ రాణి రెడీ అవుతోంది. పేరు... సంఘమిత్ర. 250కోట్ల ఖర్చుతో దండయాత్రకు రెడీ అవుతున్నారు సంఘమిత్ర. లేడీని నమ్మి 250 కోట్లు ఖర్చుపెడుతున్నారా? అంటే.. హలో... ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘డర్టీ పిక్చర్’, ‘క్వీన్’.. ఇలా చాలా సిన్మాలున్నాయి. ఒకట్రెండు మినహా అన్నీ ఆల్మోస్ట్ లాభాలు తెచ్చినవే. ఆ ఒకటీ రెండూ సినిమాలూ ‘భేష్’ అనిపించుకున్నాయి. ఇక.. ‘సంఘమిత్ర’ గురించి చెప్పాలంటే.. ముందు శ్రుతీహాసన్ ఒప్పుకుని ఆ తర్వాత తప్పుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులకు సీన్లోకి దిశా పాట్నీ వచ్చారు. సుందర్. సి దర్శకత్వంలో తేనాండాళ్ ఫిలమ్స నిర్మిస్తున్న ఈ సినిమాలో జయం రవి, ఆర్య కీలక పాత్రలు చేయనున్నారు. ఎప్పుడో అనౌన్స్ చేసినా ఇంకా ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడంతో సంఘమిత్ర దండయాత్రకు స్టార్టింగ్ ప్రాబ్లమా? అనే డౌట్స్ వచ్చాయి. సినిమా లేట్ అవుతున్నది స్టార్టింగ్ ప్రాబ్లమ్ వల్ల కాదని, ప్రిపరేషన్ ప్లాన్ వల్ల అని అంటున్నారు చిత్రబృందం. ‘‘ప్రీ–ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. స్క్రిప్ట్కి చాలా టైమ్ పట్టింది. చిన్న చిన్న మార్పులు చేస్తున్నాం. గ్రాఫిక్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఏప్రిల్ లేదా మేలో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అని సుందర్ సి. స్పష్టం చేశారు. ఇది ట్రైలింగ్వుల్ మూవీ. పెట్టిన పెట్టుబడిని ‘సంఘమిత్ర’ సునాయాసంగా లాగేస్తుంది సారూ. సోనమ్ భారతం బీటౌన్లో మహాభారతం సినిమాపై మోస్ట్ ఇంట్రస్టెడ్ యాక్టర్ ఎవరంటే.. ఆమిర్ ఖాన్ అని చెప్పేయొచ్చు. మరి.. యాక్ట్రస్ విషయానికొస్తే సోనమ్ కపూర్. భారతంలో నటించడానికి ఆమిర్ ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు సోనమ్ కపూర్ అయితే ఏకంగా ఈ నేపథ్యంలో వచ్చిన పుస్తకాల రైట్స్ కూడా కొనేశారు. మహాభారతంపై ‘ఆర్యావతార క్రానికల్స్’ అనే టైటిల్తో మూడు పార్ట్స్గా బుక్ రచించారు ఉదయశంకర్. అందులో ఫస్ట్ పార్ట్ ‘గోవింద’ రైట్స్ను సోనమ్ కపూర్ కొన్నారు. దీంతో మహాభారతంపై సినిమా తీయడానికి సోనమ్ రెడీ అయ్యారన్న వార్తలు వచ్చాయి. ‘‘మహాభారతం గొప్ప కథ. ఇందులో ఏ క్యారెక్టర్ చేస్తానో ప్రస్తుతం నాకు తెలీదు’’ అని సోనమ్ పేర్కొన్నారు. సో.. ఈ సినిమా సెట్స్పైకి వెళితే బడ్జెట్ రెండు వందల కోట్ల పైనే ఉంటుందని ఊహించవచ్చు. 200 కోట్లకు దగ్గరగా.. ఆల్రెడీ విడుదలకు సిద్ధమైన చిత్రాల్లో ‘పద్మావత్’ బడ్జెట్ దాదాపు 180 కోట్లు అని బాలీవుడ్ టాక్. దీపికా పదుకోన్ ముఖ్య పాత్రలో సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే పలు వివాదాలు, పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా రిలీజయ్యాక ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. రెండో ఇండియన్ @ 180 కోట్లు శంకర్ దర్శకత్వంలో కమల్హాసన్ నటించిన ‘భారతీయుడు’ అప్పట్లో ఓ సంచలనం. ఆ చిత్రానికి సీక్వెల్గా ‘భారతీయుడు 2’ ని ప్లాన్ చేస్తున్నారు. కమల్ నటిస్తారు. శంకర్ తెరకెక్కిస్తారు. ‘దిల్’ రాజు తీస్తారనే వార్త వచ్చింది. అయితే ‘దిల్’ రాజు తప్పుకున్నారు. ఫస్ట్ పార్ట్ నిర్మించిన ఎ.యం. రత్నం నిర్మించడానికి రెడీగా ఉన్నారట. ఇక, శంకర్ ప్లాన్ చేయడం, కమల్ డేట్స్ లాక్ చేయడమే ఆలస్యం. ఈ చిత్రానికి 180 కోట్లు బడ్జెట్ అవుతుందట. ‘భారతీయుడు’పై ఉన్న క్రేజ్ సీక్వెల్కి వర్కవుట్ అవు తుంది. సో.. రెండో భారతీయుడు వసూళ్లు ఇరగదీస్తాడని అంచనా వేయొచ్చు. -
రామాయణంపై తపాలా బిళ్లలు
నారాయణవనం: సీతారామ చరిత్రను తెలిపే రామాయణం తపాలా బిళ్లలను భారత తపాలా శాఖ దీపావళి సందర్భంగా విడుదల చేసిందని స్థానిక ఉప తపాలా కార్యాలయ అధికారి ఓబుల్రెడ్డి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీరామ చరిత్రను ప్రతిబింబించే రీతిలో 11 తపాలా బిళ్లలతో కూడిన పోస్టర్ను రూ.65కు మండలంలోని అన్ని తపాలా కార్యాలయాల్లో పొందవచ్చన్నారు. అరుదైన పౌరాణిక చిత్రాలను దాచుకోవచ్చని అన్నారు. ఈ బిళ్లలను శుభ సందర్భాల్లో ఆత్మీయులు, సన్నిహితులకు పంపే తపాలా కవర్లపై అంటించి పంపుకోవచ్చనని చెప్పారు. -
కృతజ్ఞత... కృతఘ్నత
బ్రహ్మహత్య చేసినవాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసినవాడికి, ఏదైనా ఒక వ్రతం చేస్తానని నీళ్ళు ముట్టుకుని సంకల్పించి ఆ వ్రతం చేయనివాడికి కూడా నిష్కృతి ఉందేమో గానీ ఉపకారం పొంది, దానిని స్మరించని వాడు, ఉపకారికి నమస్కరించని వాడు కృతఘ్నుడు. వాడి జీవితానికి మాత్రం నిష్కృతి లేదు.. అంటాడు లక్ష్మణుడు రామాయణంలోని కిష్కింధకాండలో. అది ఏ సందర్భంలో అని ఉంటాడు..? సీతాన్వేషణలో సాయం చేస్తానని మాట ఇచ్చి, రామబాణంతో తన అన్న వాలిని సంహరింపజేసిన సుగ్రీవుడు, వాలి మరణం తర్వాత కిష్కింధకు పట్టాభిషిక్తుడై, ఆనందోత్సాహాలలో తేలిపోతూ, విందువినోదాలలో మునిగి తేలుతూ, రాముడికిచ్చిన మాటను పక్కన పెడతాడు. అప్పుడు లక్ష్మణుడు ఎంతో కోపంతో, ఆవేదనతో సుగ్రీవుని ఉద్దేశించి పలికిన పలుకులివి. ఇది ఎప్పుడో రామాయణ కాలంలో లక్ష్మణుడు, సుగ్రీవుని ఉద్దేశించిన చెప్పినదే అయినా, ఇప్పటికీ, ఎప్పటికీ వర్తిస్తుంది. కొందరుంటారు... అవతలి వారి నుంచి ఉపకారం పొందుతారు. వారినుంచి ఆ సాయం అందేవరకు కాళ్లావేళ్లా పడతారు. తమ అవసరం తీరిన తర్వాత ఇక ఆ సంగతి గుర్తుపెట్టుకోరు సరికదా, ఎదురయినా చూడనట్టుంటారు. కనీసం పలకరించరు. అది చాలా తప్పు. ఎదుటివారు చేసిన ఉపకారానికి మనం తగిన ప్రత్యుపకారం చేయలేకపోవచ్చు, కానీ కృతజ్ఞతాభావం లేకపోవడం ఎంతో తప్పు. అలాంటివారికి అంతకు పదింతల అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. -
గుణం.. శీలం... స్నేహం
ఆత్మీయం రామాయణం కేవలం కథ కాదు... అందులోని విషయాలు నిత్యజీవితంలో ఎంతగానో ఉపయోగ పడతాయి. రామరావణ సంగ్రామ సమయంలో విభీషణుడు రాముని శరణుకోరి వచ్చినప్పుడు లక్ష్మణుడు విభీషణుడిని నమ్మవద్దని, ఇక్కడికి కేవలం గూఢచారిగానే వచ్చాడని అంటాడు రాముడితో. కాని విభీషణుడు వచ్చి పలికిన పలుకులు విన్న తరవాత లక్ష్మణుడు తన తప్పు తెలుసుకుంటాడు. తొందరపాటు వద్దనీ, ఇతరులను అనవసరంగా నిందించవద్దనీ హితవు పలుకుతాడు రాముడు. అంతేకాదు, రాముడు ఎందరితోనో స్నేహం చేశాడు. వానర రాజయిన సుగ్రీవునితో, పడవలు నడుపుకుంటూ, చేపలు పడుతూ కాలక్షేపం చేసే గుహునితో, శత్రురాజయిన రావణుని తమ్ముడు విభీషణునితో, హనుమతో, నిషాద రాజుతో... ఇలా ఒకరనేమిటి... ప్రతివారితోటీ రామునికి గల మైత్రీ బంధం ఆచరణీయం. శబరి ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆమె యోగశక్తికి శ్రీరాముడు ఆనందపడిన ఘట్టం చూసినా రాముడు గుణానికిచ్చిన ప్రాధాన్యత బోధపడుతుంది. గుణం, శీలం ఉన్నవారిని ఉన్నతంగా చూడగలగడమే రాముని లక్షణం. ఇటువంటి విషయాలను గ్రహించగల వివేకం అందరికీ ఉండాలని రామాయణం చెబుతోంది. ఇలా మన నిత్యజీవితంలో ఆదర్శంగా నడవడానికీ లోక కల్యాణానికి వినియోగపడే రీతిలో బతకడానికి అవసరమయిన అనేకానేక ధర్మసూక్ష్మాలు, నీతివాక్యాలూ రామాయణ సాగరంలో దొరికే ముత్యాలు.