Riyan Parag
-
చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్టైమ్ రికార్డు
సౌరాష్ట్ర వెటరన్ క్రికెటర్ షెల్డన్ జాక్సన్(Sheldon Jackson) సరికొత్త చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీ(Ranji Trophy) టోర్నీలో అత్యధిక సిక్సర్లు(Highest Six Hitter) బాదిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. అసోంతో మ్యాచ్ సందర్భంగా షెల్డన్ జాక్సన్ ఈ ఘనత సాధించాడు. కాగా దేశవాళీ ఫస్ట్క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్ రెండో దశ పోటీలు జనవరి 23న మొదలయ్యాయి.ఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-డిలో ఉన్న సౌరాష్ట్ర.. తొలుత ఢిల్లీతో తలపడి పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో తమ రెండో మ్యాచ్లో గురువారం అసోంతో రాజ్కోట్ వేదికగా రెండో మ్యాచ్ మొదలుపెట్టింది. ఇందులో టాస్ గెలిచిన ఆతిథ్య సౌరాష్ట్ర తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.అదిరిపోయే ఆరంభంఈ క్రమంలో ఓపెనర్లు హర్విక్ దేశాయ్, చిరాగ్ జైనీ అదిరిపోయే ఆరంభం అందించారు. వికెట్ కీపర్ బ్యాటర్ హర్విక్ శతకంతో చెలరేగాడు. 181 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లతో రాణించి.. 130 పరుగులు చేశాడు. మరోవైపు.. చిరాగ్ 78 బంతుల్లోనే 80 పరుగులతో సత్తా చాటాడు.144వ సిక్సర్ఇక వన్డౌన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా కూడా బ్యాట్ ఝులిపించగా.. నాలుగో స్థానంలో వచ్చిన షెల్డన్ జాక్సన్ కూడా కాసేపు అలరించాడు. మొత్తంగా 86 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 48 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లతో పాటు ఒక సిక్సర్ ఉంది. కాగా రంజీల్లో జాక్సన్కు ఇది 144వ సిక్సర్.ఆల్టైమ్ రికార్డుఈ క్రమంలోనే 38 ఏళ్ల షెల్డన్ జాక్సన్ రంజీల్లో ఆల్టైమ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. రంజీ చరిత్రలో అత్యధిక సిక్స్లు బాదిన క్రికెటర్గా అరుదైన ఘనత సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ నమన్ ఓజా పేరిట ఉండేది. అతడు రంజీల్లో 143 సిక్సర్లు కొట్టాడు. తాజాగా షెల్డన్ జాక్సన్ నమన్ ఓజాను అధిగమించాడు.పటిష్ట స్థితిలో సౌరాష్ట్రఇక సౌరాష్ట్ర- అసోం మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సరికి సౌరాష్ట్ర 90 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని.. కేవలం మూడు వికెట్ల నష్టానికి 361 పరుగులు సాధించింది. గురువారం ఆట పూర్తయ్యేసరికి ఛతేశ్వర్ పుజారా 95, అర్పిత్ వసవాడ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా అర్ధ శతకానికి రెండు పరుగుల దూరంలో ఉన్న వేళ షెల్డన్ జాక్సన్.. టీమిండియా యువ సంచలనం రియాన్ పరాగ్ బౌలింగ్లో బౌల్డ్ కావడం గమనార్హం.అద్బుతమైన రికార్డులు ఉన్నాఇదిలా ఉంటే.. రంజీల్లో షెల్డన్ జాక్సన్కు అద్బుతమైన రికార్డు ఉంది. సౌరాష్ట్ర తరఫున ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటి వరకు 6600కు పైగా పరుగులు సాధించాడు. తద్వారా సితాన్షు కొటక్, ఛతేశ్వర్ పుజారా తర్వాత సౌరాష్ట్ర తరఫున ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్గా కొనసాగుతున్నాడు.ఇప్పటి వరకు షెల్డన్ జాక్సన్ ఖాతాలో 21 ఫస్ట్క్లాస్ సెంచరీలు ఉండటం విశేషం. 2019-20 సీజన్లో సౌరాష్ట్ర తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. నాటి టోర్నీలో 809 పరుగులతో రాణించి సౌరాష్ట్ర ట్రోఫీ సొంతం చేసుకోవడంలో జాక్సన్ కీలక పాత్ర పోషించాడు. సెమీ ఫైనల్తో కలిపి మొత్తంగా నాడు మూడు శతకాలు బాదాడు.ఇటీవలే గుడ్బైఅంతేకాదు.. 2022-23లో రెండోసారి సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ గెలిచినపుడు కూడా.. జాక్సన్ 588 రన్స్ చేశాడు. సెమీస్ మ్యాచ్లో ఏకంగా 160 పరుగులతో చెలరేగడం విశేషం. అయితే, అతడికి ఒక్కసారి కూడా టీమిండియా తరఫున ఆడే అవకాశం రాలేదు. ఇక పరిమిత ఓవర్ల ఆటలోనూ మెరుగైన రికార్డు కలిగి ఉన్న షెల్డన్ జాక్సన్ ఇటీవలే వైట్బాల్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 86 మ్యాచ్లు ఆడిన షెల్డన్ జాక్సన్ 2792 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది శతకాలు, 14 అర్ధ శతకాలు ఉన్నాయి.చదవండి: ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు.. టీమిండియాను వెనక్కి నెట్టి టాప్లోకి! -
IND VS SA T20 Series: శివమ్ దూబే, రియాన్ పరాగ్కు ఏమైంది..?
సౌతాఫ్రికాతో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును నిన్న (అక్టోబర్ 25) ఎంపిక చేశారు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే ఈ జట్టు ఎంపిక జరిగినప్పటికీ.. ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన సిరీస్లలో జట్టుతో పాటు ఉన్న శివమ్ దూబే, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్ దక్షిణాఫ్రికాతో సిరీస్కు ఎంపిక కాలేదు. వీరిని ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.మయాంక్ యాదవ్, శివమ్ దూబే గాయాల బారిన పడటంతో వారిని పరిగణలోకి తీసుకోలేదని చెప్పిన బీసీసీఐ.. రియాన్ పరాగ్ భుజం సమస్య కారణంగా సెలెక్షన్కు అందుబాటులో లేడని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం రియాన్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిపోర్ట్ చేసినట్లు తెలిపింది. ఫామ్లో ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయని అంశాన్ని పక్కన పెడితే.. జట్టులో రెండు అనూహ్య ఎంపికలు జరిగాయి.బౌలింగ్ ఆల్రౌండర్ రమన్దీప్ సింగ్, పేస్ బౌలర్ విజయ్కుమార్ వైశాఖ్ ఊహించని విధంగా జట్టులోకి వచ్చారు. వీరిద్దరికి చోటు దక్కుతుందని ఎవరు ఊహించలేదు. ఇవి మినహా మిగతా జట్టు ఎంపిక అంతా ఊహించిన విధంగానే జరిగింది. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగనుండగా.. వికెట్కీపర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మ ఎంపికయ్యారు. కాగా, దక్షిణాఫ్రికా సిరీస్తో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం కూడా భారత జట్టును నిన్ననే ప్రకటించారు.దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టు: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్, విజయ్ కుమార్ వైశాఖ్, అవేశ్ ఖాన్, యశ్ దయాళ్సౌతాఫ్రికాతో టీ20 సిరీస్..తొలి మ్యాచ్- నవంబర్ 8 (డర్బన్)రెండో మ్యాచ్- నవంబర్10 (గ్వెకెర్బా)మూడో మ్యాచ్- నవంబర్ 13 (సెంచూరియన్)నాలుగో మ్యాచ్- నవంబర్ 15 (జోహనెస్బర్గ్)చదవండి: ఆ్రస్టేలియా పర్యటనకు నితీశ్ కుమార్ రెడ్డి -
రియాన్ పరాగ్ ఓవరాక్షన్.. షాకిచ్చిన అంపైర్(వీడియో)
ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో భారత యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ వింత బౌలింగ్ యాక్షన్తో అందరిని ఆశ్యర్యపరిచాడు. కొత్త బౌలింగ్ యాక్షన్ను ప్రయత్నించి నవ్వుల పాలయ్యాడు.అసలేం జరిగిందంటే?బంగ్లా ఇన్నింగ్స్ 11వ ఓవర్ బౌలింగ్ చేసేందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పార్ట్ టైమ్ స్పిన్నర్ రియాన్ పరాగ్ చేతికి బంతి అందించాడు. అయితే ఈ మ్యాచ్లో రియాన్ వేసిన మొదటి బంతినే బంగ్లా బ్యాటర్ మహ్మదుల్లా భారీ సిక్సర్గా మలిచాడు.తద్వారా పరాగ్ కాస్త నిరాశచెందాడు. ఈ క్రమంలో కొత్తగా ఏదైనా ప్రయత్నించి బంగ్లా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. దీంతో లసిత్ మలింగ స్టైల్లో బౌలింగ్ చేయాలని ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. ఆ ఓవర్లో నాలుగో బంతిని రియాన్.. మహ్మదుల్లాకు స్లింగ్లింగ్ డెలివరీగా సంధించాడు. అతడి బౌలింగ్ యాక్షన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతడి బౌలింగ్ యాక్షన్పై అనుమానం వచ్చిన ఫీల్డ్ అంపైర్ మధన్ గోపాల్ థర్డ్ అంపైర్ను సంప్రదించాడు. రిప్లేలో బ్యాక్ఫుట్ నో బాల్గా తేలింది. డెలివరీ సంధించే క్రమంలో పరాగ్ బ్యాక్ ఫుట్ ట్రామ్లైన్ వెలుపల ఉంది. అందుకునే థర్డ్ అంపైర్ బ్యాక్ఫుట్ నో బాల్గా ప్రకటించాడు. దీంతో మహ్మదుల్లాకు ఫ్రీ హిట్ లభించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. What was that Riyan Parag ? 🤣🤣#INDvsBAN pic.twitter.com/JAOTn2mLZM— sajid (@NaxirSajid32823) October 9, 2024 -
రాణించిన రియాన్ పరాగ్
సాక్షి, అనంతపురం: యువ ఆటగాడు రియాన్ పరాగ్ (101 బంతుల్లో 73; 5 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించడంతో భారత్ ‘సి’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ చివరి రౌండ్ మ్యాచ్లో భారత్ ‘ఎ’ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ జట్టు రెండో ఇన్నింగ్స్లో 64 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. శాశ్వత్ రావత్ (53; 4 ఫోర్లు, ఒక సిక్సర్), కుమార్ కుషాగ్ర (40 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్), కెపె్టన్ మయాంక్ అగర్వాల్ (34) సత్తాచాటారు. భారత్ ‘సి’ బౌలర్లలో అన్షుల్ కంబోజ్, గౌరవ్ యాదవ్, మానవ్ సుతార్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 216/7తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘సి’ జట్టు చివరకు 234 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ పొరెల్ (82), పులకిత్ నారంగ్ (41) ఆకట్టుకున్నారు. భారత్ ‘ఎ’ బౌలర్లలో అవేశ్ ఖాన్, అఖీబ్ ఖాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా... చేతిలో 4 వికెట్లు ఉన్న భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని ఓవరాల్గా 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. కుమార్ కుషాగ్రతో పాటు తనుశ్ కోటియాన్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. స్కోరు వివరాలు భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 297; భారత్ ‘సి’ తొలి ఇన్నింగ్స్: 234; భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: ప్రథమ్ సింగ్ (సి) రుతురాజ్ గైక్వాడ్ (బి) గౌరవ్ యాదవ్ 11; మయాంగ్ అగర్వాల్ (బి) అన్షుల్ కంబోజ్ 34; తిలక్ వర్మ (సి) రుతురాజ్ గైక్వాడ్ (బి) అన్షుల్ కంబోజ్ 19; రియాన్ పరాగ్ (సి) రుతురాజ్ గైక్వాడ్ (బి) గౌరవ్ యాదవ్ 73; శాశ్వత్ రావత్ (బి) మానవ్ సుతార్ 53; కుమార్ కుషాగ్ర (నాటౌట్) 40; షమ్స్ ములానీ (సి) అన్షుల్ కంబోజ్ (బి) మానవ్ సుతార్ 8; తనుశ్ కోటియాన్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు: 19; మొత్తం (64 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 270. వికెట్ల పతనం: 1–35, 2–73, 3–94, 4–199, 5–209, 6–234, బౌలింగ్: అన్షుల్ కంబోజ్ 16–3–52–2; గౌరవ్ యాదవ్ 14–0– 60–2; విజయ్కుమార్ వైశాఖ్ 6–0–36–0; పులకిత్ నారంగ్ 8–1–30–0; మానవ్ సుతార్ 20–0–75–2. -
టీమిండియా ప్లేయర్లు విఫలం.. 36 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఇండియా-సి
దులీప్ ట్రోఫీ 2024లో ఇవాళ (సెప్టెంబర్ 19) మూడో రౌండ్ మ్యాచ్లు మొదలయ్యాయి. తొలి మ్యాచ్లో ఇండియా-డి, ఇండియా-బి తలపడుతుండగా.. రెండో మ్యాచ్లో ఇండియా-ఏ, ఇండియా-సి జట్లు పోటీపడుతున్నాయి. ఈ రెండు మ్యాచ్లు అనంతపురం ఆర్డీటీ స్టేడియమ్స్లో జరుగుతున్నాయి.టీమిండియా ప్లేయర్లు విఫలంఇండియా-సితో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-ఏ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. టీమిండియా ప్లేయర్లు మయాంక్ అగర్వాల్ (6), తిలక్ వర్మ (5), రియాన్ పరాగ్ (2) తక్కువ స్కోర్లకే ఔట్ కావడంతో ఆ జట్టు 36 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. లంచ్ విరామం సమయానికి ఇండియా-ఏ స్కోర్ 67/5గా ఉంది. షాశ్వత్ రావత్ (20), షమ్స్ ములానీ (19) ఇండియా-ఏని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్, అన్షుల్ కంబోజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.అర్ద సెంచరీల దిశగా పడిక్కల్, శ్రీకర్ భరత్ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-డి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. లంచ్ విరామం సమయానికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 98 పరుగులు చేసింది. ఓపెనర్లు దేవ్దత్ పడిక్కల్ (44), శ్రీకర్ భరత్ (46) అర్ద సెంచరీల దిశగా సాగుతున్నారు.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఇండియా-సి తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇండియా-బి ఏడు, ఇండియా-ఏ ఆరు పాయింట్లతో రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన ఇండియా-డి సున్నా పాయింట్లతో చిట్టచివరి స్థానంలో ఉంది. చదవండి: ఆండ్రీ రసెల్ విధ్వంసం.. నైట్ రైడర్స్ ఖాతాలో మరో విజయం -
నువ్విక మారవా?.. ఇలా అయితే టెస్టుల్లో చోటు కష్టమే!
టీమిండియా యువ బ్యాటర్ రియాన్ పరాగ్ దులిప్ ట్రోఫీ-2024లో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇన్నింగ్స్ను మెరుగ్గా ఆరంభిస్తున్నా.. వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. నిర్లక్ష్య ఆట తీరుతో వికెట్ పారేసుకుంటున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కాగా అసోంకు చెందిన ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ రెడ్బాల్ టోర్నీలో ఇండియా-‘ఎ’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.తొలి మ్యాచ్లో ఇలాతాజా ఎడిషన్లో భాగంగా ఇండియా-‘ఎ’ తొలుత బెంగళూరు వేదికగా ఇండియా-‘బి’తో మ్యాచ్ ఆడింది. ఇందులో రియాన్ చేసిన స్కోర్లు 30, 31. ఇక ప్రస్తుతం అనంతపురంలో ఇండియా-‘ఎ’ తమ రెండో మ్యాచ్ ఆడుతోంది. ఇందులో భాగంగా ఇండియా-‘డి’ జట్టుతో తలపడుతోంది. మ్యాచ్లో జట్టు పటిష్ట స్థితిలో ఉన్నప్పటికీ.. విశ్లేషకులు మాత్రం రియాన్ పరాగ్ ఆట తీరుపై పెదవి విరుస్తున్నారు.వేగం పెంచి వికెట్ సమర్పించుకున్నాడుతొలి ఇన్నింగ్స్లో 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 37 పరుగులు చేసిన రియాన్.. మంచి జోష్లో కనిపించాడు. అయితే, కాస్త ఆచితూచి ఆడాల్సిన చోట వేగం పెంచి వికెట్ సమర్పించుకున్నాడు. అర్ష్దీప్ బౌలింగ్లో దేవ్దత్ పడిక్కల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ పాత కథే పునరావృతం చేశాడు.ఇండియా-‘ఎ’ శతక ధీరుడు, ఓపెనర్ ప్రథమ్ సింగ్(122) అవుట్కాగా.. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు రియాన్ పరాగ్. తిలక్ వర్మ(111 నాటౌట్)తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పే అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పరిమిత ఓవర్ల మాదిరే దూకుడుగా ఆడి మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. Century for Pratham Singh 💯6⃣, 4⃣, 4⃣What a way to get your maiden Duleep Trophy hundred 👏#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/EmmpwDJX1Q— BCCI Domestic (@BCCIdomestic) September 14, 2024భారీ స్కోర్లుగా మలచలేకపోయాడుఇండియా-‘డి’ స్పిన్నర్ సౌరభ్ కుమార్ బౌలింగ్లో వరుస బౌండరీలు బాది.. అతడి చేతికే చిక్కి పెవిలియన్ చేరాడు. 31 బంతుల్లో 20 పరుగుల వద్ద ఉండగా.. అనవసరపు షాట్కు పోయి సబ్స్టిట్యూట్ ఫీల్డర్ ఆదిత్య థాకరేకు సులువైన క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్పై విమర్శల వర్షం కురుస్తోంది. ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్కు మాత్రమే రియాన్ పనికివస్తాడు. సంప్రదాయ క్రికెట్లోనూ ప్రతీ బంతికి దూకుడు ప్రదర్శిస్తానంటే కుదరదు. నిజానికి.. బంగ్లాదేశ్తో సిరీస్కు ముందు తనను తాను నిరూపించుకునేందుకు రియాన్కు మంచి అవకాశం వచ్చింది. ఇన్నింగ్స్ను ఘనంగా ఆరంభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు.టెస్టు జట్టులో చోటు దక్కాలంటే కాస్త ఓపిక కూడా ఉండాలి’’ అని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. శనివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఇండియా-‘ఎ’ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇండియా-‘డి’కి 426 పరుగుల భారీ లక్ష్యం విధించింది.చదవండి: 'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ'20(31) Riyan parag gifted his wicket after settled#riya #parag #riyanparang #DuleepTrophy2024 #cricket #IPL2025 #ipl #test pic.twitter.com/lMGSUBQZna— mzk (@Zuhaib006) September 14, 2024 -
రాణించిన రియాన్ పరాగ్.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన శ్రీలంక
కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా శ్రీలంక నామమాత్రపు స్కోర్కే (248/7) పరిమితమైంది. కెరీర్లో తొలి వన్డే ఆడుతున్న రియాన్ పరాగ్ బంతితో రాణించాడు. రియాన్ 9 ఓవర్లలో 54 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు. శివమ్ దూబే నాలుగు ఓవర్లు వేసి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. మహ్మద్ సిరాజ్ ధారళంగా పరుగులు సమర్పించుకుని ఓ వికెట్ తీశాడు. సిరాజ్ 9 ఓవర్లలో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు.తృటిలో సెంచరీ చేజార్చుకున్న అవిష్కటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఓపెనర్లు పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 89 పరుగులు జోడించారు. అవిష్క నాలుగు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు.రాణించిన కుసాల్ మెండిస్అవిష్క ఫెర్నాండో ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన కుసాల్ మెండిస్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన కుసాల్ ఏడో వికెట్గా వెనుదిరిగాడు. ఆఖర్లో కమిందు మెండిస్ (23 నాటౌట్) వేగంగా పరుగులు సాధించడంతో శ్రీలంక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లంక ఇన్నింగ్స్లో అసలంక 10, సధీర సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు. -
శ్రీలంకతో రెండో వన్డే.. భారత తుది జట్టు ఇదే! పరాగ్ అరంగేట్రం?
కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే టై అయిన సంగతి తెలిసిందే. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ను భారత్ టైగా ముగించింది. విజయానికి ఒక్క పరుగు కావాల్సిన నేపథ్యంలో భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ టై అయింది. అయితే తొలి వన్డేలో చేసిన చిన్న చిన్న తప్పిదాలను రెండో వన్డేలో పునరావృతం చేయకూడదని భారత జట్టు యోచిస్తోంది. ఆదివారం కొలంబో వేదికగా జరగనున్న రెండో వన్డేలో మాత్రం ఎలాగైనా గెలిచి సిరీస్ ఆధిక్యంలోకి వెళ్లాలని టీమిండియా వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్లో భారత జట్టు ఓ కీలక మార్పుతో బరిలోకి దిగనున్నట్లుట్లు తెలుస్తోంది. కొలంబో వికెట్ స్పిన్కు అనుకూలిస్తున్న నేపథ్యంలో ఆల్రౌండర్ రియాన్ పరాగ్కు ఛాన్స్ ఇవ్వాలని భారత జట్టు మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. పేస్ ఆల్రౌండర్ శివమ్ దూబే స్ధానంలో పరాగ్ తుది జట్టులో వచ్చే అవకాశముందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. రిషబ్ పంత్కు మరోసారి నో ఛాన్స్..?ఇక ఈ మ్యాచ్కు కూడా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ బెంచ్కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. వన్డేల్లో పంత్ కంటే కేఎల్ రాహుల్కు మంచి రికార్డు ఉండడంతో అతడి వైపే జట్టు మెనెజ్మెంట్ మొగ్గు చూపుతున్నట్లు వినికిడి.వన్డేల్లో రాహుల్కు 50పైగా సగటు ఉంది. అయితే దాదాపు 8 నెలల తర్వాత భారత జట్టులోకి రాహుల్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి వన్డేలో రాహుల్ తన మార్క్ను చూపించలేకపోయాడు. టైగా ముగిసిన మ్యాచ్లో రాహుల్ 31 పరుగులు చేసి ఔటయ్యాడు.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ -
IND vs SL 3rd T20: తడబడిన భారత బ్యాటర్లు.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే?
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమిత మైంది. లంక బౌలర్ల దాటికి భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. శ్రీలంక బౌలర్లలో మహేష్ థీక్షణ మూడు వికెట్లతో సత్తాచాటగా.. హసరంగా రెండు, విక్రమసింఘే, ఆసితా ఫెర్నాండో చెరో వికెట్ పడగొట్టారు.భారత బ్యాటర్లలో శుబ్మన్ గిల్(39) టాప్ స్కోరర్గా నిలవగా.. రియాన్ పరాగ్(26), వాషింగ్టన్ సుందర్(25) పరుగులతో పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ వరుసగా రెండో మ్యాచ్లోనూ డకౌట్గా వెనుదిరిగాడు.కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్లో తన మార్క్ను చూపించలేకపోయాడు. ఇక ఇప్పటికే సిరీస్ను 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
'సంజూకు కాదు.. ఆ కుర్రాడికే టీమిండియాలో ఛాన్స్లు ఎక్కువ'
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో సొంతం చేసుకుంది. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, హెడ్కోచ్గా గౌతం గంభీర్ తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో బెంచ్కే పరిమితమైన శాంసన్కు.. రెండో టీ20లో ఆడే ఛాన్స్ లభించింది. గిల్ స్ధానంలో ఓపెనర్గా వచ్చిన శాంసన్.. గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు.ఈ క్రమంలో భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో శాంసన్ కంటే యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్కే ఎక్కువ అవకాశాలు దక్కుతాయని పఠాన్ జోస్యం చెప్పాడు. కాగా లంకతో జరిగిన తొలి రెండు మ్యాచ్ల్లోనూ రియాన్ భారత జట్టులో భాగమయ్యాడు. మొదటి మ్యాచ్లో బ్యాటింగ్లో విఫలమై పరాగ్.. బౌలింగ్లో మాత్రం 3 వికెట్లతో సత్తాచాటాడు. రెండో మ్యాచ్లోనూ తన 4 ఓవర్ల బౌలింగ్ కోటాను ఈ అస్సాం ఆల్రౌండర్ పూర్తి చేశాడు."భారత జట్టులో రియాన్ పరాగ్కు ఎక్కువగా అవకాశాలు లభిస్తాయి. ఎందుకంటే టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లలో ఎవరికి బౌలింగ్ చేసే సామర్థ్యం లేదు. అదే అతడికి బాగా కలిసిస్తోందని" ఎక్స్లో పఠాన్ రాసుకొచ్చాడు. ఐపీఎల్-2024లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో పరాగ్కు భారత జట్టులో చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పరాగ్ను ఎక్స్ ఫ్యాక్టర్ అని కొనియాడాడు. -
అతడెందుకు దండగ అన్నారు.. కట్చేస్తే! గంభీర్ ప్లాన్ సూపర్ సక్సెస్
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 43 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లెయింగ్ ఎలెవన్లో ఎంపిక చూసి మొదట అందరూ షాక్కు గురయ్యారు. అందుకు కారణం.. జింబాబ్వే సిరీస్లో దారుణంగా విఫలమైన రియాన్ పరాగ్కు ఈ మ్యాచ్ తుది జట్టులో చోటివ్వడమే.ఫామ్లో ఉన్న ఆల్రౌండర్లు శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్లను పక్కన పెట్టి మరి పరాగ్కు ఛాన్స్ ఇచ్చిన జట్టు మెనెజ్మెంట్ చాలా మంది అగ్రహం వ్యక్తం చేశారు. కానీ పరాగ్కు తుది జట్టులో ఛాన్స్ ఇవ్వడం వెనక హెడ్కోచ్ గౌతం గంభీర్ మాస్టర్ మైండ్ దాగి ఉందని మ్యాచ్ ఆఖరిలో అందరికి ఆర్దమైంది.ఈ మ్యాచ్లో రియాన్ను పార్ట్టైమ్ బౌలర్గా ఉపయోగించాలని గంభీర్ ముందే నిర్ణయించుకున్నాడంట. అందుకే పరాగ్కే తొలి ప్రాధన్యతను గౌతీ ఇచ్చాడు. అయితే గౌతీ ప్లాన్ సూపర్ సక్సెస్ అయిందే అనే చెప్పుకోవాలి. బ్యాటింగ్లో విఫలమైన రియాన్ పరాగ్.. బౌలింగ్లో మాత్రం సత్తాచాటాడు. వికెట్ కాస్త స్పిన్కు అనుకూలించడంతో లంక ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసేందుకు పరాగ్ను కెప్టెన్ సూర్యకుమార్ తీసుకువచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని పరాగ్ వమ్ము చేయలేదు. తన వేసిన తొలి ఓవర్లో కీలకమైన వికెట్ను భారత్కు అందించాడు.ఓవరాల్గా ఈ మ్యాచ్లో కేవలం 1.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన ఈ అస్సాం ఆల్రౌండర్.. 5 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. దీంతో గంభీర్ మాస్టర్ మైండ్ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదే కదా గౌతీ మార్క్ అంటే పోస్ట్లు పెడుతున్నారు. Riyan Parag can Bowl Off Spin + Leg Spin just like Great Sachin Tendulkar used to Bowl 👏🏻That's a Great News for Team India 🇮🇳 #INDvSL #RiyanParagpic.twitter.com/P0VjcDKEkf— Richard Kettleborough (@RichKettle07) July 28, 2024 -
రింకూ కాదు!.. టీమిండియా ఎక్స్ ఫ్యాక్టర్ అతడే: సూర్య
శ్రీలంకతో సిరీస్ సందర్భంగా టీమిండియా టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. పొట్టి ఫార్మాట్లో భారత్ను నంబర్ వన్గా నిలపడంతో పాటు టీ20 ప్రపంచకప్ అందించిన రోహిత్ శర్మ వారసత్వాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. కొత్త కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనంలో జూలై 27న రెగ్యులర్ కెప్టెన్ హోదాలో తన తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. జట్టులో అతడే కీలకంఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ టీమిండియా యువ క్రికెటర్పై ప్రశంసలు కురిపించాడు. జట్టులో అతడే కీలకం(ఎక్స్ ఫ్యాక్టర్) కాబోతున్నాడంటూ సదరు ఆటగాడి నైపుణ్యాలను కొనియాడాడు. సూర్య ప్రశంసించిన క్రికెటర్ మరెవరో కాదు అసోం ఆల్రౌండర్ రియాన్ పరాగ్. దేశవాళీ క్రికెట్తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆకట్టుకుంటున్న ఈ రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు ఇటీవలే టీమిండియాలో అరంగేట్రం చేశాడు.జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ సందర్భంగా శుబ్మన్ గిల్ కెప్టెన్సీలోని జట్టుకు ఎంపికైన రియాన్ పరాగ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ టూర్లో మూడు మ్యాచ్లు ఆడి కేవలం 25 పరుగులే చేశాడు. అయినప్పటికీ ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ను సెలక్టర్లు శ్రీలంక పర్యటనకు ఎంపిక చేశారు. అతడే ఎందుకంటూ విమర్శలుఅంతేకాదు వన్డే జట్టులోనూ తొలిసారిగా చోటిచ్చారు. జింబాబ్వే సిరీస్లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ, అద్భుతంగా రాణించిన రుతురాజ్ గైక్వాడ్ వంటి వాళ్లను పక్కనపెట్టి రియాన్ను సెలక్ట్ చేయడం విమర్శలకు దారితీసింది. అయితే, ఆల్రౌండర్ ప్రతిభ కారణంగానే అతడికి జట్టులో చోటు దక్కాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పూర్తిగా మారిపోయాడుఈ నేపథ్యంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రియాన్ పరాగ్కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘‘అన్ని రకాల క్రీడల్లో ట్రోలింగ్ అనేది కామన్. అయితే, దానిని మనం ఎలా అధిగమిస్తామన్నదే ముఖ్యం. రియాన్ పరాగ్ ప్రతిభావంతుడు. జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నపుడే.. ఏ జట్టులోనైనా అతడొక ఎక్స్ ఫ్యాక్టర్ అవగలడని అంచనా వేశాను. ఇప్పుడు తను పూర్తిగా మారిపోయాడు. విమర్శల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాడు. గత రెండేళ్లుగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. ఇప్పుడు అతడు మా జట్టుతో ఉండటం సంతోషం’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. కాగా రియాన్ పరాగ్ విఫలమైనప్పుడల్లా అతడిపై నెట్టింట తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక లంకతో మొదటి టీ20లో మాత్రం రియన్కు తుదిజట్టులో చోటు దక్కే ఛాన్స్ లేదు! -
చేసింది 25 పరుగులే.. అయినా టీమిండియాలో ఛాన్స్! అస్సలు కారణమిదే?
శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్లకు టీమిండియా సిద్దమైంది. లంక పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్లు ఆడనుంది. జూలై 27 జరగనున్న తొలి టీ20తో భారత పర్యటన ప్రారంభం కానుంది. ఈ సిరీస్తో భారత కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్గా గౌతం గంభీర్ల ప్రస్ధానం మొదలు కానుంది. ఇప్పటికే ఆతిథ్య దేశానికి చేరుకున్న భారత జట్టు గంభీర్ నేతృత్వంలో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే శ్రీలంకతో టీ20, వన్డేలకు భారత జట్టులో యువ ఆటగాడు రియాన్ పరాగ్కు చోటు దక్కడం అందరిని ఆశ్యర్యపరిచింది.జింబాబ్వే టీ20 సిరీస్తో అరంగేట్రం చేసిన పరాగ్.. తన మార్క్ను చూపించలేకపోయాడు. దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినప్పటకి సెలక్టర్లు ఏ ప్రాతిపాదికన అతడిని లంక టూర్కు ఎంపిక చేశారని పెద్ద ఎత్తున ఇప్పటికి చర్చనడుస్తోంది. కాగా తాజాగా ఇదే విషయంపై టైమ్స్ ఆఫ్ ఇండియా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. శ్రీలంకతో వైట్బాల్ సిరీస్లకు తొలుత హైదరాబాదీ తిలక్ వర్మను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావించారట. కానీ తిలక్ వర్మ గాయపడటంతో పరాగ్ను అతడి స్ధానంలో పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం."పరాగ్ చాలా టాలెంటడ్. అతడికి అద్భుతమైన ఆల్రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఆఫ్ ది ఫీల్డ్, ఆన్ ది ఫీల్డ్ తన వైఖరిని కూడా మార్చుకున్నాడు. చాలా విషయాల్లో అతడు మెరుగయ్యాడు. ఇప్పడు అతడి ఆట తీరు పూర్తిగా మారిపోయింది. క్రీజులో నిలదొక్కకునే ప్రయత్నం చేస్తున్నాడు. పరాగ్ అద్భుతమైన ఫీల్డర్ కూడా. అయితే సెలక్టర్ల దృష్టిలో పరాగ్ కంటే ముందు తిలక్ వర్మ ఉండేవాడు. కానీ అతడి గాయపడటం రియాన్కు మార్గం సుగమమైందని" బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో వెల్లడించాయి. కాగా జింబాబ్వే సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన పరాగ్ కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మొహమ్మద్. సిరాజ్.భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ప్టెన్), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్. సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
రియాన్ పరాగ్ బెస్ట్ ఎమోషనల్ మూమెంట్
-
జింబాబ్వేతో తొలి టీ20.. ముగ్గురు మొనగాళ్ల అరంగేట్రం
భారత తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలన్న యువ క్రికెటర్లు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ కల ఎట్టకేలకు నేరవేరింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20తో వీరిద్దరూ అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. అదే విధంగా ఇప్పటికే టెస్టు క్రికెట్లో భారత తరపున డెబ్యూ చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రవ్ జురెల్.. ఇప్పుడు ఈ మ్యాచ్తో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. వీరిముగ్గురూ భారత తత్కాలిక హెడ్ కోచ్ వీవీయస్ లక్ష్మణ్, సపోర్ట్ స్టాప్ చేతుల మీదగా డెబ్యూ క్యాప్ను అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఈ ముగ్గురు ఆటగాళ్లు ఐపీఎల్-2024లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో విధ్వంసం సృష్టించాడు.ఐపీఎల్ చరిత్రలోనే సన్రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో అభిషేక్ది కీలక పాత్ర. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 32.27 సగటుతో 484 పరుగులు చేశాడు. మరోవైపు పరాగ్ కూడా తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన పరాగ్ 52.09 సగటుతో 573 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్తాన్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పరాగ్ నిలిచాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడికి పిలుపునిచ్చారు.ఇక జురెల్ విషయానికి వస్తే.. ఇప్పటికే టెస్టుల్లో తన ఏంటో నిరూపించుకున్న ఈ రాజస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్, ఇప్పుడు టీ20ల్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. టీ20ల్లో ఫినిషర్గా జురెల్కు మంచి రికార్డు ఉంది. -
జింబాబ్వేతో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే? విధ్వంసకర వీరుల ఎంట్రీ
విశ్వవిజేతలగా నిలిచిన అనంతరం భారత జట్టు తొలి టీ20 సిరీస్కు సిద్దమైంది. జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్కు సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో భారత జట్టుకు యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్ హీరోలు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, సాయిసుదర్శన్, తుషార్ దేశ్పాండే, హర్షిత్ రానాలకు తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కింది. జూలై 6న హరారే వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఈమ్యాచ్ కోసం గిల్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే హరారేకు చేరుకుంది. తొలి పోరు కోసం తీవ్రంగా యంగ్ టీమిండియా శ్రమించింది. ఈ క్రమంలో తొలి టీ20లో ఆడే భారత తుది జట్టుపై ఓ లూక్కేద్దం.అభిషేక్, పరాగ్ ఎంట్రీ..ఈ మ్యాచ్తో ఎస్ఆర్హెచ్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశముంది. అతడు కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి భారత ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.అదే విధంగా ఫస్ట్డౌన్లో రుతురాజ్ గైక్వాడ్ను బ్యాటింగ్ దింపే ఆలోచనలో జట్టు మెనెజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అభిషేక్తో పాటు రియాన్ పరాగ్ కూడా డెబ్యూ చేయనున్నట్లు సమాచారం. అతడు మిడిలార్డర్లో బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్కు చోటు దక్కే అవకాశముంది. ఫినిషర్గా రింకూ సింగ్ ఎలాగో ఉంటాడు.ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బౌలర్లగా రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖాలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ల స్ధానాలు దాదాపు ఖాయమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.భారత తుది జట్టు(అంచనా): అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్,రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖాలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ -
నా కల నెరవేరింది.. పాస్ పోర్ట్, ఫోన్ కూడా మర్చిపోయా: పరాగ్
టీ20 ప్రపంచకప్-2024 విజయం తర్వాత తొలి విదేశీ పర్యటనకు టీమిండియా సిద్దమైంది. జూలై 6 నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ల టీ20ల సిరీస్లో భారత జట్టు తలపడనుంది. అయితే ఈ సిరీస్కు సీనియర్ ఆటగాళ్లను విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. యువ భారత జట్టును జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసింది. ఈ జట్టుకు స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్-2024లో అదరగొట్టిన రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, తుషార్ దేశ్పాండే, హర్షిత్ రానాలకు భారత సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. ఇక ఇప్పటికే ఈ సిరీస్ కోసం శుబ్మన్ గిల్ సారథ్యంలోని యంగ్ ఇండియా టీమ్ జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది.పాస్ పోర్ట్ కూడా మర్చిపోయా?ఇక తొలిసారి భారత జట్టు నుంచి పిలుపురావడంపై రాజస్తాన్ రాయల్స్ యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ స్పందించాడు. "భారత జట్టుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్నాను. ఇండియన్స్ జెర్సీ వేసుకోవడం వేరే ఫీల్. ఆ భావనను మాటల్లో వర్ణించలేను. అస్సా నుంచి వచ్చిన నేను భారత్కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించాలని కలలు కన్నాను. నా కలను ఎన్నాళ్లకు నెరవేర్చుకోగలిగాను. ఈ ఉత్సాహంలో పాస్పోర్టు, నా ఫోన్లు మరిచిపోయా. వాటిని పోగొట్టుకోలేదు కానీ ఎక్కడ పెట్టానో గుర్తుకు రాలేదు. అయితే సరైన సమయంలో నాకు మళ్లీ దొరికాయి. చిన్నప్పటి నుంచి ఇలాంటి ప్రయాణం చేయాలని కలలు కన్నా.ఇప్పటికే నేను చాలా మ్యాచ్లు విదేశాల్లో ఆడాను. కానీ భారత్ జెర్సీ ధరించి ప్రయాణించడం వేరు. జింబాబ్వేతో ప్రత్యేక అనుబంధం ఉంటుందని బీసీసీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరాగ్ పేర్కొన్నాడు. -
జింబాబ్వేతో టీ20 సిరీస్.. భారత జట్టు ఇదే! ఐపీఎల్ హీరోలకు చోటు
జింబాబ్వేతో టీ20 సిరీస్కు భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. అజిత్ అగార్క్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ సోమవారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలను వెల్లడించింది.ఈ సిరీస్కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ టూర్లో భారత జట్టుకు యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు.అదే విధంగా ఈ సిరీస్కు భారత జట్టులో ఐపీఎల్లో హీరోలకు చోటు దక్కింది. ఐపీఎల్-2024లో అదరగొట్టిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, ఎస్ఆర్హెచ్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్, సీఎస్కే పేసర్ తుషార్ దేశ్ పాండేలకు సెలక్టర్లు తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పించారు.నితీష్ కుమార్ ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన నితీష్ కుమార్ రెడ్డి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఈ ఆంధ్ర ఆటగాడు ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన నితీష్ కుమార్ 33.67 సగటుతో 303 పరుగులతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా ఫస్ట్క్లాస్ క్రికెట్లోనూ అద్బుతంగా రాణిస్తుండడంతో సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు.అభిషేక్ శర్మఐపీఎల్-2024లో అభిషేక్ శర్మ సైతం సంచలన ప్రదర్శన కనబరిచాడు. అభిషేక్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్గా ట్రావిస్ హెడ్తో కలిసి భీబత్సం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే సన్రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో అభిషేక్ది కీలక పాత్ర. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 32.27 సగటుతో 484 పరుగులు చేశాడు. టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ గైడెన్స్లో రాటుదేలుతున్న అభిషేక్ శర్మ.. దేశీవాళీ క్రికెట్లో సైతం అదరగొడుతున్నాడు.రియాన్ పరాగ్..ఇక ఆస్సాం స్టార్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ సైతం ఐపీఎల్-2024లో అదరగొట్టాడు. ఓవరాక్షన్ స్టార్ అని అందరితో విమర్శలు ఎదుర్కొన్న పరాగ్.. ఈ ఏడాది సీజన్లో మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. రాజస్తాన్ రాయల్స్కు ప్రాతనిథ్యం వహిస్తున్న పరాగ్ తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన పరాగ్ 52.09 సగటుతో 573 పరుగులు చేశాడు.ఈ క్రమంలో అతడికి టీ20 వరల్డ్కప్ జట్టులోకి చోటు దక్కుతుందని భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని ఎంపిక చేయలేదు. ఇప్పుడు జింబాబ్వే సిరీస్కు సీనియర్లు దూరం కావడంతో సెలక్టర్లు పరాగ్కు అవకాశమిచ్చారు. తుషార్ దేశ్పాండే..ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుషార్ దేశ్పాండే కూడా తన బౌలింగ్తో అందరని ఆకట్టుకున్నాడు. గత రెండు సీజన్ల నుంచి దేశ్పాండే మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు.ఐపీఎల్-2024లో 13 మ్యాచ్లు ఆడిన దేశ్పాండే 17 వికెట్లు పడగొట్టాడు. కేవలం ఐపీఎల్లో మాత్రం దేశీవాళీ క్రికెట్లో కూడా ముంబై తరపున దేశ్పాండే రాణిస్తున్నాడు. -
శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. జింబాబ్వే టీ20 సిరీస్కు ఐపీఎల్ హీరోలు
ఐపీఎల్ 2024 విన్నింగ్ కెప్టెన్ (కేకేఆర్) శ్రేయస్ అయ్యర్ జులై, ఆగస్ట్ నెలల్లో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది. వివిధ కారణాల చేత టీ20 వరల్డ్కప్ జట్టుకు ఎంపిక కాని శ్రేయస్.. లంకతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు అందుబాటులో ఉంటాడని సమాచారం.మరోవైపు ఐపీఎల్ 2024 హీరోలు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి, విజయ్కుమార్ వైశాఖ్, యశ్ దయాల్ జులై 6 నుంచి జింబాబ్వేతో జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఎంపికయ్యే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరందరూ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.వీరితో పాటు టీ20 వరల్డ్కప్కు ట్రావెలింగ్ రిజర్వ్లుగా ఎంపికైన శుభ్మన్ గిల్, ఆవేశ్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ కూడా జింబాబ్వే సిరీస్కు ఎంపికవుతారని తెలుస్తుంది. జింబాబ్వే పర్యటనకు హార్దిక్ పాండ్యా కెప్టెన్, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్గా ఎంపికవుతారని ప్రచారం జరుగుతుంది. జింబాబ్వే సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా లాంటి సీనియర్లకు విశ్రాంతినిస్తారని సమాచారం. జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024తో బిజీగా ఉంది. మెగా టోర్నీలో భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. సూపర్-8లో టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్లతో తలపడనుంది. -
ఇలా అయితే.. టీమిండియాలో ఛాన్స్ రానేరాదు!
సూటిగా.. సుత్తి లేకుండా మాట్లాడటం తనకు అలవాటు అంటున్నాడు రాజస్తాన్ రాయల్స్ యువ క్రికెటర్ రియాన్ పరాగ్. టీ20 ప్రపంచకప్-2024కు ఎంపిక చేసిన జట్టులో తనకు స్థానం లేదని.. కాబట్టి మ్యాచ్లు చూసి సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం తనకు లేదంటున్నాడు.కాగా అసోం ఆల్రౌండర్ రియాన్ పరాగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో గత ఐదేళ్లుగా రాజస్తాన్ ఫ్రాంఛైజీ తరఫున ఆడుతున్నాడు. క్యాష్రిచ్ లీగ్ కెరీర్ ఆరంభంలో సరిగ్గా ఆడకపోయినా మేనేజ్మెంట్ అతడికి వరుస అవకాశాలు ఇచ్చింది. అయినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక విమర్శల పాలయ్యాడు.ఈ క్రమంలో ఒకానొక సమయంలో జట్టులో స్థానం కోల్పోయిన రియాన్ పరాగ్.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి తనను తాను నిరూపించుకున్నాడు. అదే జోరును ఐపీఎల్-2024లోనూ కొనసాగించి.. విమర్శకులకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడు.తాజా ఐపీఎల్ ఎడిషన్లో 14 ఇన్నింగ్స్ ఆడిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. ఏకంగా 573 పరుగులతో దుమ్ములేపాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో విరాట్ కోహ్లి(741), రుతురాజ్ గైక్వాడ్(583) తర్వాతి స్థానంలో నిలిచాడు.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 ద్వారా రియాన్ పరాగ్ టీమిండియా తరఫున అరంగేట్రం చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ 22 ఏళ్ల బ్యాటింగ్ ఆల్రౌండర్ను సెలక్టర్లు పరగణనలోకి తీసుకోలేదు. అనుభవం లేని రియాన్ పరాగ్ను కనీసం స్టాండ్బై ప్లేయర్గా కూడా ఎంపిక చేయలేదు.ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ స్పందిస్తూ.. ఏదో ఒక రోజు సెలక్టర్లు తనను టీమిండియాకు ఎంపిక చేయక తప్పదని.. ఇది తాను అహంభావంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నానంటూ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈసారి వరల్డ్కప్ టోర్నీని చూడాలనే ఆసక్తి తనకు ఏమాత్రం లేదంటూ కుండబద్దలు కొట్టాడు.టీమిండియాకు మద్దతుగా నిలిచే ‘భారత్ ఆర్మీ’తో రియాన్ మాట్లాడుతున్న క్రమంలో.. ఈసారి వరల్డ్కప్ సెమీ ఫైనలిస్టులు ఎవరు అనుకుంటున్నారనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడం అంటే పక్షపాత ధోరణితో మాట్లాడినట్లే అవుతుంది.నిజానికి నేను ఈసారి అసలు వరల్డ్కప్ మ్యాచ్ చూడాలనే అనుకోవడం లేదు. ఫైనల్లో ఎవరు గెలిచారు? ట్రోఫీ ఎవరు అందుకున్నారని మాత్రమే చూస్తాను. ఒకవేళ నేను ప్రపంచకప్ టోర్నీలో గనుక ఆడుతూ ఉన్నట్లయితే.. కచ్చితంగా ఈ టాప్-4 వగైరాల గురించి పట్టించుకునేవాడిని’’ అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘రియాన్ పరాగ్ మరో ఇషాన్ కిషన్ లేదా శ్రేయస్ అయ్యర్ అవడం ఖాయం. ఇలాంటి ఆటిట్యూడ్ ఉంటే నీకు ఛాన్సులెలా వస్తాయి? ఓవరాక్షన్ స్టార్ అనే బిరుదు సార్థకం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నావా ఏంటి?’’ అని విమర్శిస్తున్నారు.కాగా బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించారనే కారణంతో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పిస్తూ ఇటీవల బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
త్వరలోనే టీమిండియాలో నా ఎంట్రీ: ఐపీఎల్ స్టార్
తాను త్వరలోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేయడం ఖాయమంటున్నాడు రియాన్ పరాగ్. సెలక్టర్లు ఏదో ఒకరోజు తనను జాతీయ జట్టుకు ఎంపిక చేయక తప్పదని.. ఈ విషయంలో పూర్తి నమ్మకంతో ఉన్నానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.అసోంకు చెందిన 22 ఏళ్ల బ్యాటింగ్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్. కుడిచేతి వాటం కలిగిన బ్యాటర్ అయిన ఈ యంగ్స్టర్.. రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ కూడా! ఐపీఎల్లో గత ఐదేళ్లుగా రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.అయితే, ఆరంభంలో నామమాత్రపు స్కోర్లకే పరిమితమై విమర్శలు ఎదుర్కొన్న రియాన్ పరాగ్ ఈ ఏడాది మాత్రం అద్భుతంగా రాణించాడు. దేశవాళీ క్రికెట్లో సూపర్ ఫామ్ అందుకున్న అతడు .. ఐపీఎల్-2024లోనూ దానిని కొనసాగించాడు.రాజస్తాన్ తరఫున 14 ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 573 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో విరాట్ కోహ్లి(741), రుతురాజ్ గైక్వాడ్(583) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.సీజన్ ఆసాంతం మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకుని రాజస్తాన్ను ప్లే ఆఫ్స్ చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు రియాన్ పరాగ్. ఇక దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లోనూ పరుగుల వరద పారిస్తున్న ఈ అసోం ఆటగాడు త్వరలోనే టీమిండియాకు ఎంపిక కానున్నాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో పీటీఐతో మాట్లాడిన రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఏదో ఒకరోజు వాళ్లు నన్ను సెలక్ట్ చేయక తప్పదు కదా! నేను టీమిండియాకు ఆడతాననే నమ్మకం నాకుంది.ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా నేను లెక్కచేయను.నేను పరుగులు సాధించని సమయంలోనూ ఇదే తరహా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. నాపై నాకున్న నమ్మకం అది.ఇదేమీ నేను అహంభావంతో చెబుతున్న మాట కాదు. పదేళ్ల వయసులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి మా నాన్న, నేను ఇదే అనుకున్నాం. ఏదేమైనా ఏదో ఒకరోజు కచ్చితంగా జాతీయ జట్టుకు ఆడటమే మా ధ్యేయం అని ఫిక్సైపోయాం’’ అని రియాన్ పరాగ్ ధీమా వ్యక్తం చేశాడు.వచ్చే ఆరునెలల కాలంలో కచ్చితంగా టీమిండియా తరఫున తాను అరంగేట్రం చేసే అవకాశం ఉందని రియాన్ నమ్మకంగా చెప్పాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ సందర్భంగా ఐపీఎల్-2024లో దుమ్ములేపిన రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా తదితరులు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. -
SRH vs RR: ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం?: టీమిండియా దిగ్గజం ఫైర్
రాజస్తాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ ఆట తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ మండిపడ్డాడు. ప్రతిభ ఉంటే సరిపోదని.. దానిని ఎలా వినియోగించుకోవాలో కూడా తెలిసి ఉండాలంటూ చురకలు అంటించాడు.ఐపీఎల్-2024లో ఆది నుంచి వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ రాయల్స్.. ఆ తర్వాత వరుస ఓటములతో విమర్శలు మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ సంజూ శాంసన్ సేన స్థాయికి తగ్గట్లు రాణించడం లేదని విశ్లేషకులు పెదవి విరిచారు.ఎలిమినేటర్ మ్యాచ్లో విశ్వరూపంఅలాంటి సమయంలో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో అద్భుత ఆట తీరుతో రాజస్తాన్ తిరిగి సత్తా చాటింది. అహ్మదాబాద్లో బుధవారం నాటి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.విలువైన ఇన్నింగ్స్ ఆడిన రియాన్ఈ విజయంలో రియాన్ పరాగ్ కీలక పాత్ర పోషించాడు. 26 బంతుల్లో 36 విలువైన పరుగులు జోడించి జట్టును గెలుపు తీరాలకు చేర్చడంలో సహకారం అందించాడు. అయితే, మరో కీలకమైన మ్యాచ్లో మాత్రం ఒత్తిడిలో అతడు చిత్తయ్యాడు.మరో కీలక మ్యాచ్లో మాత్రం విఫలంసన్రైజర్స్ హైదరాబాద్లో శుక్రవారం నాటి క్వాలిఫయర్-2లో రియాన్ పరాగ్ పూర్తిగా విఫలమయ్యాడు. లక్ష్య ఛేదనలో రాజస్తాన్ తడబడుతున్న వేళ నాలుగో నంబర్లో బ్యాటింగ్కు వచ్చిన 22 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. 10 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులే చేశాడు.రాజస్తాన్ ఇన్నింగ్స్లో 12వ ఓవర్ వేసిన రైజర్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో మొదటి బంతిని ఎదుర్కొనే క్రమంలో.. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. అనవసరపు షాట్కు యత్నించి బంతిని గాల్లోకి లేపగా.. అభిషేక్ శర్మ క్యాచ్ పట్టాడు.Shahbaz Ahmed has put Sunrisers Hyderabad on 🔝🧡#RR in deep trouble and in search of something special in Chennai! Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #SRHvRR | #Qualifier2 | #TheFinalCall pic.twitter.com/8sGV8fzxcZ— IndianPremierLeague (@IPL) May 24, 2024 దీంతో రియాన్ పరాగ్ తడ‘బ్యాటు’ అంతటితో ముగిసిపోయింది. అతడు అవుటైన తీరుకు రాజస్తాన్ కోచ్ సంగక్కర షాక్లో ఉండిపోగా.. కామెంటేటర్ సునిల్ గావస్కర్ తీవ్ర స్థాయిలో విమర్శించాడు.ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం?‘‘ఎలా ఉపయోగించుకోవాలో తెలియనపుడు నీకు ఎంత ప్రతిభ ఉంటే ఏం లాభం? అసలు ఇలాంటి షాట్ ఎలా ఆడతావు? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. అపారమైన ప్రతిభ.. కానీ దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు. ఇంకొన్ని బంతుల వరకు పరుగులు రానంత మాత్రాన ఏం మునిగిపోతుంది? ఆ తర్వాత మళ్లీ పుంజుకోవచ్చు కదా!’’ అంటూ గావస్కర్ లైవ్ కామెంట్రీలోనే రియాన్ పరాగ్పై ఫైర్ అయ్యాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో రియాన్ పరాగ్ 16 మ్యాచ్లలో కలిపి 573 పరుగులు సాధించాడు.చదవండి: Kavya Maran Viral Reaction Video: దటీజ్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. తండ్రిని హత్తుకుని చిన్నపిల్లలా! -
రాజస్తాన్ను చిత్తు చేసిన చెన్నై.. ప్లే ఆఫ్స్ రేసులో మున్ముందుకు
ఐపీఎల్ - 2024 ప్లే ఆఫ్స్ రేసులో చెన్నై సూపర్ కింగ్స్ మరో ముందడుగు వేసింది. రాజస్తాన్ రాయల్స్ ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకువచ్చింది.చెపాక్ వేదికగా రాజస్తాన్తో ఆదివారం తలపడిన చెన్నై టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. పేసర్ సిమర్జీత్ సింగ్ ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్ (21) వికెట్లు పడగొట్టి శుభారంభం అందించాడు.వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ సంజూ శాంసన్(15)ను కూడా వెనక్కి పంపి రాజస్తాన్ టాపార్డర్ను దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ రియాన్ పరాగ్(35 బంతుల్లో 47 నాటౌట్) పోరాడగా.. ధ్రువ్ జురెల్(18 బంతుల్లో 28) అతడికి సహకారం అందించాడు. మిగతా వాళ్లు చేతులెత్తేయగా నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్ 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన చెన్నైకి ఓపెనర్ రచిన్ రవీంద్ర(18 బంతుల్లో 27) మెరుపు ఇన్నింగ్స్తో శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఆచితూచి ఆడాడు. 41 బంతులు ఎదుర్కొని 42 పరుగులు మాత్రమే చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో డారిల్ మిచెల్(22) ఫర్వాలేదనిపించగా.. మొయిన్ అలీ(10), శివం దూబే(18), రవీంద్ర జడేజా(5) విఫలమయ్యారు. ఏడో స్థానంలో వచ్చిన సమీర్ రజ్వీ ధనాధన్ ఇన్నింగ్స్(8 బంతుల్లో 15)తో చెన్నై సూపర్ కింగ్స్ను విజయతీరాలకు చేర్చాడు.సొంతమైదానంలో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన చెన్నై ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు వెళ్లింది. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన సిమర్జీత్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇదిలా ఉంటే కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచిన విషయం తెలిసిందే. -
IPL 2024: అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్న చిచ్చరపిడుగులు వీళ్లే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పలువురు ఆటగాళ్లు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్నారు. బ్యాటర్ల విషయానికొస్తే.. రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ సీజన్లో అన్ క్యాప్డ్ ప్లేయర్గా బరిలోకి దిగి మెరుపులు మెరిపిస్తున్నాడు. రియాన్ ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడి 58.43 సగటున 159.14 స్ట్రయిక్రేట్తో 409 పరుగులు చేసి నాలుగో లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు.అన్క్యాప్డ్ ప్లేయర్గా బరిలోకి దిగిన ఇరగదీస్తున్న మరో బ్యాటర్ అభిషేక్ శర్మ. ఈ ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ఈ సీజన్లో అదిరిపోయే ప్రదర్శనలతో అంచనాలకు అందని రీతిలో రెచ్చిపోతూ తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అభిషేక్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో అదిరిపోయే స్ట్రయిక్రేట్తో 315 పరుగులు చేశాడు.వద్దనుకున్న ఆటగాడే గెలుపు గుర్రమయ్యాడు..ఈ ఐపీఎల్ సీజన్లో ఓ ఆటగాడు ప్రత్యేకించి అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు. శశాంక్ సింగ్ అనే పంజాబ్ మిడిలార్డర్ బ్యాటర్ ఈ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ సీజన్లో శశాంక్ మెరుపు స్ట్రయిక్రేట్తో 288 పరుగులు చేసి తన జట్టు సాధించిన ప్రతి విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. శశాంక్ను ఈ సీజన్ వేలంలో పంజాబ్ పొరపాటున సొంతం చేసుకుందని ప్రచారం జరిగింది. పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా మరో శశాంక్ అనుకుని ఈ శశాంక్ను సొంతం చేసుకుందని సోషల్మీడియా కోడై కూసింది. అంతిమంగా చూస్తే ఈ వద్దనుకున్న ఆటగాడే పంజాబ్ సాధించిన అరకొర విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.ఈ సీజన్లో రఫ్ఫాడిస్తున్న మరో ప్లేయర్ ప్రభ్సిమ్రన్ సింగ్. ప్రభ్సిమ్రన్ ఈ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు స్ట్రయిక్రేట్తో 221 పరుగులు చేశాడు. అన్క్యాప్డ్ ప్లేయర్గా బరిలోకి దిగి సంచలనాలు సృష్టిస్తున్న మరో బ్యాటర్ నితీశ్కుమార్ రెడ్డి. ఈ ఎస్ఆర్హెచ్ మిడిలార్డర్ బ్యాటర్ ఏ అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు ఇన్నింగ్స్లతో తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. నితీశ్ ఈ సీజన్ లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సన్రైజర్స్ పాలిట గెలుపు గుర్రమయ్యాడు. వీళ్లే కాక చాలామంది అన్క్యాప్డ్ బ్యాటర్లు ఈ సీజన్లో ఇరగదీస్తున్నారు.బౌలర్ల విషయానికొస్తే.. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి బంతితో సత్తా చాటుతున్న వారిలో సన్రైజర్స్ పేసర్ నటరాజన్ ముందు వరుసలో ఉన్నాడు. నటరాజన్ గతంలో అద్భుతంగా రాణించినప్పటికీ.. గత కొన్ని సీజన్లలో ఇతని ప్రదర్శన సాధారణ స్థాయికి పడిపోయింది. దీంతో ఈ సీజన్కు ముందు ఇతనిపై ఎలాంటి అంచనాలు లేవు. అండర్ డాగ్గా బరిలోకి దిగిన నట్టూ.. ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతను సెకెండ్ లీడింగ్ వికెట్టేకర్గా కొనసాగుతున్నాడు. అన్క్యాప్డ్ ప్లేయర్లుగా బరిలోకి దిగి ఇరగదీస్తున్న బౌలర్లలో మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్, సందీప్ శర్మ, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ నట్టూ తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. వీరంతా ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి తమతమ జట్ల పాలిట గెలుపు గుర్రాలయ్యారు. -
‘నాకు దక్కలేదు.. సంజూ భయ్యాను మాత్రం సెలక్ట్ చేశారు’
‘‘నేను చాలా విషయాల్లో మెరుగుపడాలి. ప్రస్తుతం నేను నా అత్యుత్తమ ఫామ్లో లేను. ఒకవేళ ఫామ్లో ఉండి ఉంటే గనుక కచ్చితంగా మ్యాచ్ను విజయంతో ముగించేవాడిని.నా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాను. అవి మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటాను. ఇది నా అత్యుత్తమ ఇన్నింగ్సేనా అంటే కానేకాదు. ఒకవేళ సెంచరీ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.మ్యాచ్లో ఓడిపోయిన జట్టుగా మిగిలిపోవడం నిరాశకు గురిచేస్తుంది. ఈరోజు మ్యాచ్లో మేము ఆఖరి వరకు పోరాడగలిగాం. ఓటమిని తలచుకుంటూ కూర్చుంటే ముందుకు సాగలేం.రెండు- మూడు ఓవర్లలో చేసిన తప్పుల కారణంగా మ్యాచ్ రూపంలో భారీ మూల్యమే చెల్లించాం. టీ20 అంటేనే ఇలా ఉంటుంది. కాబట్టి తదుపరి మ్యాచ్పై దృష్టి సారించే క్రమంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాం’’ అని రాజస్తాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ అన్నాడు.కాగా ఐపీఎల్-2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో రాజస్తాన్ గురువారం తలపడింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది.నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది.రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ వృథాఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన వేళ రైజర్స్ సీనియర్ భువనేశ్వర్ కుమార్ రోవ్మన్ పావెల్ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపడంతో రాజస్తాన్ కథ ముగిసిపోయింది.ఫలితంగా ఈ మ్యాచ్లో రాజస్తాన్ కష్టాల్లో కూరకుపోయి ఉన్నవేళ.. 77 పరుగులతో రాణించిన రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ వృథాగా పోయింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం రియాన్ పరాగ్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా వరల్డ్కప్-2024కు ప్రకటించిన జట్టులో రిజర్వ్ ప్లేయర్గా అయినా పరాగ్కు చోటు దక్కుతుందని అతడి అభిమానులు ఆశపడ్డారు. అయితే, బీసీసీఐ మాత్రం 22 ఏళ్ల ఈ అసోం బ్యాటింగ్ ఆల్రౌండర్కు అప్పుడే పిలుపునిచ్చేందుకు సిద్ధంగా లేనట్లు స్పష్టం చేసింది. సంజూ భయ్యాకు చోటు దక్కడం సంతోషంఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ‘‘గతేడాది అసలు నేను ఐపీఎల్ పోటీలోనే లేను. కానీ ఈసారి నా గురించి ఏవో వదంతులు కూడా వినిపిస్తున్నాయి. నా గురించి అందరూ చర్చించుకునే స్థాయికి వచ్చాను.నా గురించి గళం వినిపిస్తున్న వారికి ధన్యవాదాలు. అయితే, నేను మాత్రం ఇప్పుడే వాటి(టీమిండియాలో చోటు) గురించి ఆలోచించడం లేదు. మా జట్టు నుంచి వరల్డ్కప్ టీమ్లో చోటు దక్కించుకున్న వారికి అభినందనలు. ముఖ్యంగా సంజూ భయ్యాకు చోటు దక్కడం చాలా చాలా సంతోషంగా ఉంది’’ అని రియాన్ పరాగ్ పరిణతితో కూడిన వ్యాఖ్యలు చేశాడు.ఇక సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో 49 బంతుల్లో 77 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. ఈ సీజన్లో 409 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్-2024లో 400 పరుగుల మార్కు అందుకున్న తొలి అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు.చదవండి: SRH: కావ్యా మారన్ వైల్డ్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్ -
వరల్డ్కప్కు సెలక్ట్ చేయలేదు.. ఆ కసి మొత్తం చూపించేశాడు
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో పరాగ్ విధ్వంసం సృష్టించాడు. 202 పరుగుల లక్ష్య చేధనలో ఎస్ఆర్హెచ్ బౌలర్లకు పరాగ్ చుక్కలు చూపించాడు. ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడిన రాజస్తాన్ను పరాగ్ తన ఇన్నింగ్స్తో మ్యాచ్లో నిలిపాడు. పరాగ్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్తో కలిసి రెండో వికెట్కు 135 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 49 బంతులు ఎదుర్కొన్న పరాగ్.. 8 ఫోర్లు, 4 సిక్స్లతో 77 పరుగులు చేశాడు.అతడి ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీ20 వరల్డ్కప్కు సెలక్ట్ చేయలేదన్న కసి మొత్తం ఈ మ్యాచ్లో చూపించాడని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పరాగ్ అద్బుత ప్రదర్శన కనబరుస్తుండడంతో భారత వరల్డ్కప్ జట్టులో చోటు దక్కుతుందని భావించారు. కానీ సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోలేదు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన పరాగ్ 409 పరుగులు చేశాడు.ఎస్ఆర్హెచ్ చేతిలో ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్ ఓటమి పాలైంది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(67), రియాన్ పరాగ్(77) హాఫ్ సెంచరీలతో పోరాట పటిమ కనబరిచారు.ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. నటరాజన్, కమ్మిన్స్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. If you are one of those who trolled Riyan Parag during his tough time then you need to say sorry to him.He is slapping all of us with his exceptional performance.He is the finisher along with Rinku Singh who will bring the ICC trophy in future for Indiapic.twitter.com/Mk0IRvtfhJ— Sujeet Suman (@sujeetsuman1991) May 2, 2024 -
టీ20 వరల్డ్కప్లో ఓపెనర్లగా కోహ్లి, రోహిత్.. జైశ్వాల్కు నో ఛాన్స్?
టీ20 వరల్డ్కప్-2024కు మరో 54 రోజుల్లో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్లు సంయుక్తంగా అతిథ్యం ఇవ్వనున్నాయి. జూన్ 2న డల్లాస్ వేదికగా యూనైటడ్ స్టేట్స్, కెనడా మధ్య జరగనున్న మ్యాచ్తో ఈ పొట్టి ప్రపంచకప్ షురూ కానుంది. అయితే ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లు తమ పూర్తి వివరాలను మే1 లోపు ప్రకటించాలని ఐసీసీ ఆయా జట్లకు ఇప్పటికే డెడ్లైన్ విధించింది. దీంతో ఆయా దేశాల క్రికెట్ బోర్డుల తమ జట్లను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) కూడా ఈ మెగా ఈవెంట్కు పంపే తమ జట్టును సిద్దం చేసే పనిలో పడింది. అయితే తొలుత 20 మంది సభ్యులతో కూడిన ప్రిలిమనరీ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో నుంచి మే 25లోపు 15 మంది సభ్యుల పేర్లను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ షార్ట్ లిస్ట్ చేయనున్నట్లు సమాచారం. రియాన్ పరాగ్కు ఛాన్స్.. అయితే ఐపీఎల్-2024లో దుమ్ములేపుతున్న రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్కు టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. మిడిలార్డర్లో అద్బుతంగా రాణిస్తుండడంతో పరాగ్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు వినికిడి. పరాగ్ ప్రస్తుతం తన కెరీర్లోనే అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. రాజస్తాన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన పరాగ్.. 63.60 సగటుతో 318 పరుగులు చేశాడు. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 వరల్డ్కప్లో భారత ఇన్నింగ్స్ను కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ప్రారంభించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో శుబ్మన్ గిల్ను బ్యాకప్ ఓపెనర్గా ఎంపిక చేసి.. మరో యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ను రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో ఉంచాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కాగా ఐపీఎల్-2024లో జైశ్వాల్ దారుణ ప్రదర్శన కనబరిస్తున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన జైశ్వాల్17.29 సగటుతో 121 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ క్రమంలోనే అతడిపై వేటు వేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ క్యాష్ రిచ్లీగ్లో అదరగొడుతున్న సీఎస్కే ఆల్రౌండర్ శివమ్ దూబేకు సైతం వరల్డ్కప్లో చోటు దక్కే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మెగా ఈవెంట్కు భారత జట్టను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏప్రిల్ 30న ప్రకటించే అవకాశముంది. -
T20 WC: దుమ్ములేపుతున్నాడు.. సెలక్టర్లు అతడిని గుర్తుంచుకోవాలి!
ఐపీఎల్-2024 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 24 మ్యాచ్లు పూర్తి కాగా.. రాజస్తాన్ రాయల్స్ ఐదింట నాలుగు విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పాత కథనే పునరావృతం చేస్తూ ఐదింటి నాలుగు పరాజయాలతో ప్రస్తుతం అట్టడుగున పదో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్ పూర్తైన దాదాపు ఐదు రోజుల వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్-2024 ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పదిహేడో సీజన్ ప్రదర్శన ఆధారంగా టీమిండియా ఎంపిక జరుగనుందన్న నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాటల్లో వరుస హాఫ్ సెంచరీలు బాదుతున్న యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ను గుర్తుపెట్టుకోవాలని సెలక్టర్లకు సూచించాడు. కాగా అసోం ఆల్రౌండర్ రియాన్ పరాగ్ దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపిన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్లో గత 15 ఇన్నింగ్స్లో పరాగ్ ఏకంగా 170.7 స్ట్రైక్రేటుతో 771 పరుగులు సాధించాడు. 15 ఇన్నింగ్స్లో పది హాఫ్ సెంచరీలు వరుసగా 45 (19), 61(34), 76*(37), 53*(29), 77(39), 72(36), 57*(33), 50*(31), 12(10), 8(10), 43(29), 84*(45), 54*(39), 4(4), 76(48) పరుగులు స్కోరు చేశాడు. ఇందులో ఏకంగా పది హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘అతడిపై సెలక్షన్ కమిటీ ఓ కన్నేసి ఉంచాలి. ఇక అతడేమో తన పనిని ఇలాగే చేసుకుపోతూ ఉంటే మంచిది’’ అని రియాన్ పరాగ్ మున్ముందు కూడా ఇలాగే దూసుకుపోవాలని ఆకాంక్షించాడు. అసోం తరఫున దేశవాళీ క్రికెట్లో కాగా అసోంలోని గువాహటిలో 2001లో జన్మించిన రియాన్ పరాగ్ బ్యాటింగ్ ఆల్రౌండర్. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ హిట్టింగ్లో దిట్ట. అలాగే రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్ కూడా! ఇక దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో రాణిస్తున్న రియాన్ పరాగ్ ఇంత వరకు టీమిండియాకు సెలక్ట్ కాలేదు. రాజస్తాన్ తరఫున దుమ్ములేపుతూ అయితే, ఐపీఎల్-2024లో మాత్రం అతడి ప్రదర్శన సెలక్టర్లను ఆకర్షించేలా ఉంది. రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రియాన్ పరాగ్ ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్లో కలిపి 261 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 84 నాటౌట్. ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం రియాన్ పరాగ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తాజాగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లోనూ పరాగ్ అదరగొట్టిన విషయం తెలిసిందే. 48 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 76 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్లో రాజస్తాన్ గుజరాత్ చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. Caution ⚠ It's Riyan Parag demolition on display 🔥💥#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/dzKuPfTS0Q — JioCinema (@JioCinema) April 10, 2024 చదవండి: సంజూ శాంసన్కు భారీ జరిమానా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రాయల్స్కు టైటాన్స్ షాక్
197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది... చివర్లో 4 ఓవర్లలో 59 పరుగులు చేయాల్సిన దశలో గెలుపు అసాధ్యంగా అనిపించింది. కానీ తర్వాతి నాలుగు ఓవర్లలో వరుసగా 17, 7, 20, 17 పరుగులు సాధించిన టైటాన్స్ అనూహ్య విజయాన్ని అందుకుంది. అప్పటి వరకు నియంత్రణతో బౌలింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ పేలవ బౌలింగ్, వ్యూహ వైఫల్యంతో చేజేతులా మ్యాచ్ను కోల్పోయి ఈ సీజన్లో తొలి ఓటమిని ఎదుర్కొంది. జైపూర్: వరుస విజయాలతో అజేయంగా దూసుకుపోతున్న రాజస్తాన్ రాయల్స్కు బ్రేక్ పడింది. బుధవారం జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో రాయల్స్పై గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్స్లు), సామ్సన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (44 బంతుల్లో 72; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా, సాయి సుదర్శన్ (29 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో టైటాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. శతక భాగస్వామ్యం... గత మూడు మ్యాచ్లలో వైఫల్యాల తర్వాత ఈసారి యశస్వి (19 బంతుల్లో 24; 5 ఫోర్లు) కాస్త మెరుగైన ప్రదర్శన కనబర్చగా, గత మ్యాచ్లో సెంచరీ చేసిన బట్లర్ (8) విఫలమయ్యాడు. పవర్ప్లేలో రాజస్తాన్ 43 పరుగులే చేయగా... ఈ దశ నుంచి సామ్సన్, పరాగ్ భారీ భాగస్వామ్యం రాయల్స్ను పటిష్ట స్థితికి చేర్చింది. ఇద్దరూ వేగంగా పరుగులు సాధించారు. పరాగ్ 34 బంతుల్లో, సామ్సన్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నారు. ఎట్టకేలకు 19వ ఓవర్లో పరాగ్ను అవుట్ చేసి మోహిత్ ఈ జోడీని విడదీశాడు. అయితే ఉమేశ్ వేసిన చివరి ఓవర్లో సామ్సన్, హెట్మైర్ (13 నాటౌట్) చెరో సిక్స్ బాదడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. గిల్ కెప్టెన్ఇన్నింగ్స్... భారీ ఛేదనలో టైటాన్స్కు సుదర్శన్, శుబ్మన్ గిల్ దూకుడైన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. వీరిద్దరు తొలి వికెట్కు 64 పరుగులు జోడించినా... అందుకు 50 బంతులు తీసుకున్నారు. రాయల్స్ కట్టుదిట్టమైన బౌలింగ్తో వీరి పరుగుల వేగాన్ని నిరోధించింది. బౌల్ట్ తొలి 2 ఓవర్లలో 8 పరుగులే ఇవ్వగా... అవేశ్ బౌలింగ్లో 14 పరుగులు రాబట్టడంతో టైటాన్స్ స్కోరు పవర్ప్లే ముగిసే సరికి 44 పరుగులకు చేరింది. అయితే కుల్దీప్ సేన్ ఒక్కసారిగా గుజరాత్ను దెబ్బ తీశాడు. తన బౌలింగ్లో 6 పరుగుల వ్యవధిలో అతను సుదర్శన్, వేడ్ (4), మనోహర్ (1)లను వెనక్కి పంపించాడు. ఈ దశలో కెపె్టన్ గిల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 35 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయ్ శంకర్ (16) ప్రభావం చూపలేకపోగా... 28 బంతుల్లో 65 పరుగులు చేయాల్సిన స్థితిలో గిల్ వెనుదిరగడంతో టైటాన్స్ ఆశలు సన్నగిల్లాయి. అయితే కీలక సమయంలో రషీద్ ఖాన్ (11 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు), రాహుల్ తెవాటియా (11 బంతుల్లో 22; 3 ఫోర్లు) ఆట జట్టును గెలిపించింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) వేడ్ (బి) ఉమేశ్ 24; బట్లర్ (సి) తెవాటియా (బి) రషీద్ 8; సామ్సన్ (నాటౌట్) 68; పరాగ్ (సి) శంకర్ (బి) మోహిత్ 76; హెట్మైర్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–32, 2–42, 3–172. బౌలింగ్: ఉమేశ్ 4–0–47–1, జాన్సన్ 4–0–37–0, రషీద్ 4–0–18–1, నూర్ 4–0–43–0, మోహిత్ 4–0–51–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 35; గిల్ (స్టంప్డ్) సామ్సన్ (బి) చహల్ 72; వేడ్ (బి) కుల్దీప్ 4; మనోహర్ (బి) కుల్దీప్ 1; విజయ్ శంకర్ (బి) చహల్ 16; తెవాటియా (రనౌట్) 22; షారుఖ్ (ఎల్బీ) (బి) అవేశ్ 14; రషీద్ ఖాన్ (నాటౌట్) 24; నూర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–64, 2–77, 3–79, 4–111, 5–133, 6–157, 7–195. బౌలింగ్: బౌల్ట్ 2–0–8–0, అవేశ్ 4–0–48–1, మహరాజ్ 2–0–16–0, అశి్వన్ 4–0–40–0, చహల్ 4–0–43–2, కుల్దీప్ సేన్ 4–0–41–3. ఐపీఎల్లో నేడు ముంబై X బెంగళూరు వేదిక: ముంబై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2024 RR VS GT: శివాలెత్తిన సంజూ శాంసన్
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (ఏప్రిల్ 10) జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో శాంసన్ శివాలెత్తిపోయి మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. 31 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ.. ప్రస్తుత సీజన్లో మూడో అర్దశతకాన్ని నమోదు చేశాడు. తొలుత లక్నోతో జరిగిన మ్యాచ్లో 52 బంతుల్లో అజేయమైన 82 పరుగులు చేసిన సంజూ.. ఆతర్వాత ఆర్సీబీపై 42 బంతుల్లో 69.. తాజాగా గుజరాత్పై 38 బంతుల్లో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సీజన్లో భీకరఫామ్లో ఉన్న సంజూ.. 5 మ్యాచ్ల్లో 157.69 స్టయిక్రేట్తో 82 సగటున 246 పరుగులు చేసి, విరాట్ (316), రియాన్ల (261) తర్వాత సీజన్ మూడో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. గుజరాత్తో మ్యాచ్లో సంజూతో పాటు రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్లో యశస్వి 24, బట్లర్ 8, హెట్మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. టార్గెట్ 197.. ఆచితూచి ఆడుతున్న గుజరాత్ రాజస్థాన్ నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 30/0గా ఉంది. సాయి సుదర్శన్ (19), శుభ్మన్ గిల్ (11) క్రీజ్లో ఉన్నారు. -
పిచ్చెక్కించిన రియాన్ పరాగ్.. మరో సుడిగాలి ఇన్నింగ్స్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రియాన్ పరాగ్ భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో రియాన్ మూడో హాఫ్ సెంచరీతో మెరిశాడు. గుజరాత్తో ఇవాళ (ఏప్రిల్ 10) జరుగుతున్న మ్యాచ్లో రియాన్ 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో మెరుపు అర్దశతకం బాదాడు. రియాన్ హాఫ్ సెంచరీ మార్కును సిక్సర్తో అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 48 పరుగులు ఎదుర్కొన్న రియాన్.. 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 76 పరుగులు చేసి ఔటయ్యాడు. RIYAN PARAG ON FIRE IN IPL 2024. 🤯👌 pic.twitter.com/fincAlQBPh— Johns. (@CricCrazyJohns) April 10, 2024 ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రియాన్ చేసిన స్కోర్ల వివరాలు.. 43(29) vs LSG 84*(45) vs DC 54*(39) vs MI 4 (4) vs RCB 76 (48) vs GT ఈ సీజన్లో రియాన్ 5 మ్యాచ్ల్లో 158.18 స్ట్రయిక్రేట్తో 87 సగటున 261 పరుగులు చేసి విరాట్ కోహ్లి (316) తర్వాత సీజన్ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. రియాన్, సంజూ మెరుపులు.. రాజస్థాన్ భారీ స్కోర్ మ్యాచ్ విషయానికొస్తే.. రియాన్ పరాగ్తో పాటు సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపులు మెరిపించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్లో యశస్వి 24, బట్లర్ 8, హెట్మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. -
#Riyan Parag: 'అతడొక సంచలనం.. సూర్యకుమార్లా ఆడుతున్నాడు'
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్ల్లో అదరగొట్టిన పరాగ్.. సోమవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సంజూ శాంసన్, బట్లర్, జైశ్వాల్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట పరాగ్ సత్తాచాటాడు. తన అద్బుత ఇన్నింగ్స్తో రాజస్తాన్ను పరాగ్ గెలిపించాడు. ఈ మ్యాచ్లో 39 బంతులు ఎదుర్కొన్న పరాగ్ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన పరాగ్.. 181 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో పరాగ్పై రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. పరాగ్ తన ఆట తీరుతో సూర్యకుమార్ యాదవ్ను గుర్తు చేస్తున్నడంటూ బాండ్ కొనియాడాడు."పరాగ్ అద్బుతమైన ఆటగాడు. అతడు తన ఆట తీరుతో సూర్యకుమార్ యాదవ్ను గుర్తు చేశాడు. సూర్య ముంబై ఇండియన్స్లోకి కొత్తగా వచ్చినప్పుడు ఈ తరహా ప్రదర్శనే చేసేవాడు. పరాగ్కు మంచి బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతడు కేవలం 22 ఏళ్ల వయస్సుకే అద్బుతమైన టాలెంట్ను సంపాందించుకున్నాడు. కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది.ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు అతడు దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అందుకే అతడికి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చాం. దేవ్దత్ పడిక్కల్ను వదులుకోవడంతో పరాగ్ ఆ స్ధానంలో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. అతడి నుంచి ఈ తరహా ప్రదర్శన కోసం మేము ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాము.రాజస్తాన్ అతడిపై పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు ప్రతిఫలం పొందుతుంది. మిగిలిన సీజన్లో కూడా రియాన్ తన ఫామ్ను కొనసాగించాలని ఆశిస్తున్నానని" క్రిక్ట్రాకర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాండ్ పేర్కొన్నాడు. -
#Riyan Parag: 'అతడొక సంచలనం.. సూర్యకుమార్లా ఆడుతున్నాడు'
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్ల్లో అదరగొట్టిన పరాగ్.. సోమవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సంజూ శాంసన్, బట్లర్, జైశ్వాల్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట పరాగ్ సత్తాచాటాడు. తన అద్బుత ఇన్నింగ్స్తో రాజస్తాన్ను పరాగ్ గెలిపించాడు. ఈ మ్యాచ్లో 39 బంతులు ఎదుర్కొన్న పరాగ్ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన పరాగ్.. 181 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో పరాగ్పై రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. పరాగ్ తన ఆట తీరుతో సూర్యకుమార్ యాదవ్ను గుర్తు చేస్తున్నడంటూ బాండ్ కొనియాడాడు. "పరాగ్ అద్బుతమైన ఆటగాడు. అతడు తన ఆట తీరుతో సూర్యకుమార్ యాదవ్ను గుర్తు చేశాడు. సూర్య ముంబై ఇండియన్స్లోకి కొత్తగా వచ్చినప్పుడు ఈ తరహా ప్రదర్శనే చేసేవాడు. పరాగ్కు మంచి బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతడు కేవలం 22 ఏళ్ల వయస్సుకే అద్బుతమైన టాలెంట్ను సంపాందించుకున్నాడు. కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు అతడు దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అందుకే అతడికి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చాం. దేవ్దత్ పడిక్కల్ను వదులుకోవడంతో పరాగ్ ఆ స్ధానంలో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. అతడి నుంచి ఈ తరహా ప్రదర్శన కోసం మేము ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాము. రాజస్తాన్ అతడిపై పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు ప్రతిఫలం పొందుతుంది. మిగిలిన సీజన్లో కూడా రియాన్ తన ఫామ్ను కొనసాగించాలని ఆశిస్తున్నానని" క్రిక్ట్రాకర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాండ్ పేర్కొన్నాడు. -
IPL 2024: సునామీలా దూసుకొస్తున్న రియాన్ పరాగ్
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఇటీవలికాలంలో పొట్టి ఫార్మాట్లో చెలరేగిపోతున్నాడు. గత 12 టీ20 ఇన్నింగ్స్ల్లో ఏకంగా 9 హాఫ్ సెంచరీలతో విధ్వంసం సృష్టించాడు. ఈ మధ్యలో రియాన్ చేసిన స్కోర్లపై లుక్కేస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఈ విధ్వంసకర ఆటగాడు గత 12 ఇన్నింగ్స్ల్లో 178.72 స్ట్రయిక్రేట్తో 107.83 సగటున 647 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు చూస్తే రియాన్ పొట్టి ఫార్మాట్పైకి సునామీలా దూసుకొస్తున్నట్లనిపిస్తుంది. రియాన్ తన ఫామ్ను ఇలాగే కొనసాగిస్తే టీ20 ఫార్మాట్ను శాశించడం ఖాయం. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో 3 మ్యాచ్ల్లో 160కిపైగా స్ట్రయిక్రేట్తో 181 సగటున రెండు హాఫ్ సెంచరీల సాయంతో 181 పరుగులు చేసిన రియాన్.. దిగ్గజ విరాట్ కోహ్లితో కలిసి సీజన్ లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు. ముంబై ఇండియన్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించిన రియాన్.. ప్రస్తుత సీజన్లో వరుసగా 43 (29), 84 నాటౌట్ (45), 54 నాటౌట్ (39) స్కోర్లు చేశాడు. ముంబైతో మ్యాచ్లో సహచరులంతా తక్కువ స్కోర్లకే ఔటైతే రియాన్ ఒక్కడే నిలదొక్కుకుని మెరుపు ఇన్నింగ్స్తో మెరిశాడు. ఈ ఇన్నింగ్స్లో అతను 5 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు బాదాడు. గత 12 ఇన్నింగ్స్ల్లో రియాన్ పరాగ్ చేసిన స్కోర్లు ఇలా ఉన్నాయి. 61(34), 76*(37), 53*(29), 77(39), 72(36), 57*(33), 50*(31), 12(10), 8(10), 43(29), 84*(45), 54*(39) ముంబైతో మ్యాచ్ విషయానికొస్తే.. రియాన్తో పాటు ట్రెంట్ బౌల్ట్ (4-0-22-3), చహల్ (4-0-11-3) సత్తా చాటడంతో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై చెత్త ప్రదర్శన చేసి నిర్ణీత ఓవర్లలో కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై ఇన్నింగ్స్లో రోహిత్ సహా ముగ్గురు (నమన్ ధీర్, డెవాల్డ్ బ్రెవిస్) గోల్డెన్ డకౌట్లయ్యారు. తిలక్ వర్మ (32), హార్దిక్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ముంబై ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బౌల్ట్ (4-0-22-3), చహల్ (4-0-11-3), బర్గర్ (4-0-32-2), ఆవేశ్ ఖాన్ (4-0-30-1) అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైని వణికించారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్.. 15.3 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. రియాన్ పరాగ్ (54 నాటౌట్) మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. యశస్వి (10), బట్లర్ (13) మరోసారి నిరాశపరిచారు. సంజూ శాంసన్ 12, అశ్విన్ 16 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ 3 వికెట్లు పడగొట్టగా.. మఫాక తన మొట్టమొదటి ఐపీఎల్ వికెట్ దక్కించుకున్నాడు. -
IPL 2024 : రాజస్తాన్ ‘హ్యాట్రిక్’ విజయం (ఫొటోలు)
-
ఒంటి చేత్తో మలుపు తిప్పిన రియాన్ పరాగ్
-
డ్యాన్స్తోనూ ఇరగదీసిన రియాన్ పరాగ్.. అదిరిపోయే వీడియో..!
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్తో సత్తా చాటిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్.. ఆన్ ఫీల్డ్లో తన ప్రవర్తన చేత బాగా పాపులరైన విషయం తెలిసిందే. రియాన్ మైదానంలో తాను ఏమి సాధించినా డ్యాన్స్లు చేస్తూ.. విచిత్ర హావభావాలు పలికిస్తూ.. డ్రెస్సింగ్ రూమ్కు ఇంకేదైనా సందేశాన్ని పంపిస్తూ సెలబ్రేట్ చేసుకుంటాడు. He was trolled badly in previous seasons for having self confidence and today he converted his words into action, Riyan Parag is here to rule. Missed his dance though @ParagRiyan ❤️pic.twitter.com/higJiikEQ7 — Yashvi (@BreatheKohli) March 28, 2024 ఇటీవలికాలంలో అతను చేసిన కొన్ని స్టంట్స్ సోషల్మీడియాలో బాగా వైరలయ్యాయి. దేశవాలీ టోర్నీలో సెంచరీ చేసిన అనంతరం నా స్థాయి ఇది కాదని సైగలు చేయడం, ఐపీఎల్లో హాఫ్ సెంచరీ అనంతరం డ్యాన్స్ చేయడం వంటివి జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. వీటి వల్ల చాలా పాపులరైన రియాన్.. ఓవరాక్షన్ స్టార్ అన్న అపవాదు కూడా తెచ్చుకున్నాడు. అయితే రియాన్ ఇటీవలికాలంలో బ్యాట్తో సమాధానం చెబుతూ ఆ ముద్రను చెరిపి వేసుకుంటున్నాడు. Sir Shubman Gill and Riyan parag dance 🥵😍 pic.twitter.com/SPIGnZtfDF — Pratheep (@Classypratheep) March 28, 2024 రియాన్ తాజా ప్రదర్శన (ఢిల్లీపై మెరుపు ఇన్నింగ్స్) నేపథ్యంలో జనాల్లో అతనిపై నెగిటివిటీ పోయి హీరో ఒపీనియన్ వస్తుంది. రాత్రికిరాత్రి రాజస్థాన్ ఫ్యాన్స్ రియాన్ను హీరోలా చూడటం మొదలుపెట్టారు. నిన్న రాత్రి నుంచి సోషల్మీడియాలో ఎక్కడ చూసినా రియానే కనిపిస్తున్నాడు. ఇతనికి సంబంధించిన పాత వీడియోలు, ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో పాత వీడియో ఒకటి హల్చల్ చేస్తుంది. ఇందులో రియాన్ డ్యాన్స్తో ఇరగదీస్తాడు. ఈ వీడియోలో రియాన్ డ్యాన్స్తో ఇరగదీస్తుంటే శుభ్మన్ గిల్ అతన్ని ఎంకరేజ్ చేస్తుంటాడు. ఫాస్ట్ బీట్ ఉండే ఓ ట్యూన్కు రియాన్ ప్రొఫెషనల్ డ్యాన్సర్లా స్టెప్పులేశాడు. ఈ వీడియో చూస్తే రియాన్పై ఇంప్రెషన్ ఇంకాస్త పెరుగుతుంది. మొత్తానికి రియాన్ బ్యాట్తోనే కాకుండా డ్యాన్స్తోనూ ఇరగదీశాడు. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి. ఇదిలా ఉంటే, ఢిల్లీతో నిన్న జరిగిన మ్యాచ్లో రియాన్ (45 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోవడంతో రాయల్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఢిల్లీ 173 పరుగులకే పరిమితై సీజన్లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. రాయల్స్ ఇన్నింగ్స్లో రియాన్తో పాటు అశ్విన్ (29; 3 సిక్సర్లు), జురెల్ (20; 3 ఫోర్లు) ఆకట్టుకున్నారు. ఢిల్లీ విషయానికొస్తే.. నామమాత్రపు ఛేదనలో డేవిడ్ వార్నర్ (49) పర్వాలేదనిపించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (44 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ బౌలర్లు బర్గర్ (3-0-29-2), చహల్ (3-0-19-2), ఆవేశ్ ఖాన్ (4-0-29-1) రాణించారు. -
నోర్జేకు చుక్కలు చూపించిన రియాన్ పరాగ్.. కాళరాత్రిలా మార్చేశాడు..!
ఓవరాక్షన్ స్టార్ అని పేరున్న రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్.. తనపై వేసిన ఆ ముద్ర తప్పని నిరూపించుకుంటున్నాడు. తరుచూ అతి చేష్టలతో వార్తల్లో నిలిచే పరాగ్.. గత కొంతకాలంగా ఓవరాక్షన్ తగ్గించుకుని ఆటపై దృష్టి పెడుతున్నాడు. ఈ క్రమంలో సక్సెస్ రుచి చూస్తున్నాడు. ఇటీవలికాలంలో అతని ప్రదర్శనలు అదిరిపోతున్నాయి. ఫార్మాట్ ఏదైనా రియాన్ చెలరేగిపోతున్నాడు. గతకొంతకాలంగా భీకర ఫామ్లో ఉన్న పరాగ్.. తన ఫామ్ను ఐపీఎల్లోనూ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్తో ఆడిన తొలి మ్యాచ్లో 43 పరుగులతో అలరించిన పరాగ్.. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్లో 45 బంతులు ఎదుర్కొన్న అతను.. 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. Riyan Parag at one point 26(26) and he smashed 24*(8) and he completed his fifty in 34 balls. - RIYAN PARAG, THE STAR. ⭐ pic.twitter.com/X1uHZRpQ7F — CricketMAN2 (@ImTanujSingh) March 28, 2024 పరాగ్ మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగడంతో రాజస్థాన్ ఢిల్లీని మట్టికరిపించింది. మ్యాచ్ మొత్తానికి రియాన్ మెరుపు ఇన్నింగ్సే హైలైట్గా నిలిచింది. మరి ముఖ్యంగా రియాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నోర్జే చుక్కలు చూపించిన తీరు విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది. ఈ ఓవర్లో రియాన్ వరుసగా 4, 4, 6, 4, 6, 1 పరుగులు చేసి 25 పరుగులు పిండుకున్నాడు. రియాన్ దెబ్బకు నోర్జేకు నిన్నటి రాత్రి కాళరాత్రిలా మారింది. RIYAN PARAG SMASHED 25 RUNS IN THE FINAL OVER AGAINST NORTJE. 🔥🤯 - The Madman of Rajasthan Royals.pic.twitter.com/5bg7riHxY2 — Johns. (@CricCrazyJohns) March 28, 2024 నోర్జేను బహుశా ఏ బ్యాటర్ రియాన్లా చితబాది ఉండడు. రియాన్ ధాటికి నోర్జే 4 ఓవర్లలో ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. రియాన్ నోర్జేకు చుక్కలు చూపిస్తున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. He was trolled badly in previous seasons for having self confidence and today he converted his words into action, Riyan Parag is here to rule. Missed his dance though @ParagRiyan ❤️pic.twitter.com/higJiikEQ7 — Yashvi (@BreatheKohli) March 28, 2024 ఒకనాడు ఓవరాక్షన్ స్టార్ అన్న నోళ్లే ఇప్పుడు రియాన్ను పొగుడుతున్నాయి. రాజస్థాన్ అభిమానులు రియాన్కు జేజేలు పలుకుతున్నారు. ఈ ఒక్క ఇన్నింగ్స్తో రియాన్ ఓవర్నైట్ హీరో అయిపోయాడు. రాయల్స్ మున్ముందు పరాగ్ నుంచి ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తుంది. కాగా, డీసీతో మ్యాచ్లో రియాన్ రెచ్చిపోవడంతో రాయల్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఢిల్లీ 173 పరుగులకే పరిమితై సీజన్లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. రాయల్స్ ఇన్నింగ్స్లో రియాన్తో పాటు అశ్విన్ (29; 3 సిక్సర్లు), జురెల్ (20; 3 ఫోర్లు) ఆకట్టుకున్నారు. ఢిల్లీ విషయానికొస్తే.. నామమాత్రపు ఛేదనలో డేవిడ్ వార్నర్ (49) పర్వాలేదనిపించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (44 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ బౌలర్లు బర్గర్ (3-0-29-2), చహల్ (3-0-19-2), ఆవేశ్ ఖాన్ (4-0-29-1) రాణించారు. -
ఢిల్లీ క్యాపిటల్స్పై రాజస్తాన్ మెరుపు విజయం (ఫొటోలు)
-
పరాగ్ ప్రతాపం
జైపూర్: సొంతగడ్డపై రాజస్తాన్ రాయల్స్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. టాపార్డర్ చేతులెత్తేసిన వేళ రియాన్ పరాగ్ (45 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్స్లు) ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లందరినీ చితగ్గొట్టాడు. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై గెలిచింది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రియాన్ పరాగ్ ఒంటిచేత్తో స్కోరుబోర్డును హోరెత్తించాడు. ఖలీల్, ముకేశ్, నోర్జే, అక్షర్, కుల్దీప్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసి ఓడింది. డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్స్లు), ట్రిస్టన్ స్టబ్స్ (23 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. బర్గర్, చహల్ చెరో 2 వికెట్లు తీశారు. పరాగ్ మెరుపులతో.... రాజస్తాన్ ఆదిలోనే కష్టాల్లో పడింది. 7.2 ఓవర్లలో జట్టు స్కోరు 36/3. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (5) రెండో ఓవర్లో, కెప్టెన్ సంజూ సామ్సన్ (15) ఆరో ఓవర్లో పెవిలియన్ చేరారు. పవర్ప్లేలో వీళ్లిద్దరి వికెట్లు కోల్పోయిన రాయల్స్ 31 పరుగులే చేసింది. కాసేపటికే బట్లర్ (11)కు కుల్దీప్ ముగింపు పలికాడు. ఈ దశలో రియాన్ పరాగ్ ఇన్నింగ్స్కు అంత తానై నడిపించాడు. చెత్తబంతుల్ని బౌండరీలతో శిక్షించాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బ్యాటింగ్ ప్రమోషన్లో వచ్చిన అశ్విన్ (19 బంతుల్లో 29; 3 సిక్స్లు) చూడచక్కని సిక్స్లతో అలరించాడు. నాలుగో వికెట్కు 54 పరుగులు జతచేసిన అశ్విన్, పరాగ్ జోడీ ఇన్నింగ్స్ను నిలబెట్టింది. అశ్విన్ అవుటయ్యాక 15వ ఓవర్లో రాజస్తాన్ వంద పరుగుల మైలురాయిని చేరుకుంది. ఆ ఓవర్ ముగిసేసరికి రాజస్తాన్ జట్టు స్కోరు 108/4. ఇలాంటి స్థితి నుంచి 180 పైచిలుకు స్కోరు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. 34 బంతుల్లో పరాగ్ అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత పరాగ్ బ్యాట్ విధ్వంసమే చేసింది. దీంతో ధ్రువ్ జురెల్ (12 బంతుల్లో 20; 3 ఫోర్లు)తో పరాగ్ ఐదో వికెట్కు 23 బంతుల్లోనే 52 పరుగులు చకచకా జోడించాడు. ఆ తర్వాత హెట్మైర్తో కలిసి ఆరో వికెట్కు 16 బంతుల్లోనే 43 పరుగులు జతచేశాడు. నోర్జే వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో పరాగ్ వరుసగా 4, 4, 6, 4, 6, 1లతో 25 పరుగులు దంచుకున్నాడు. దీంతో చివరి 5 ఓవర్లలో రాజస్తాన్ 77 పరుగుల్ని అవలీలగా సాధించింది. బర్గర్ దెబ్బ... వార్నర్తో ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన మిచెల్ మార్‡్ష (12 బంతుల్లో 23; 5 ఫోర్లు) బౌండరీలతో రెచ్చిపోయాడు. కానీ అంతలోనే ఇంపాక్ట్ బౌలర్ నాండ్రె బర్గర్... మార్‡్షతో పాటు రికీ భుయ్ (0)ని మూడు బంతుల వ్యవధిలో అవుట్ చేసి ఢిల్లీని కష్టాల్లో పడేశాడు. ఈ దశలో వార్నర్ సిక్స్లు, ఫోర్లతో లక్ష్యానికి తగ్గ రన్రేట్తో క్యాపిటల్స్ ఇన్నింగ్స్ను ధాటిగా నడిపించాడు. 11 ఓవర్లదాకా 93/2 స్కోరుతో ఢిల్లీ పటిష్టస్థితిలో ఉంది. కానీ తర్వాతి ఓవర్లో ఫిఫ్టీకి పరుగు దూరంలో ఉన్న వార్నర్... సందీప్ శర్మ కళ్లు చెదిరే క్యాచ్కు నిష్క్రమించాడు. కాసేపటికే కెపె్టన్ రిషభ్ పంత్ (26 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్)ను స్పిన్నర్ చహల్ వెనక్కి పంపాడు. ఇంపాక్ట్గా వచ్చి న పొరెల్ (9) కూడా చహల్ బౌలింగ్లో బోల్తా పడ్డాడు. బౌల్ట్ క్యాచ్ వదిలేయడంతో 14 పరుగుల స్కోరువద్ద బతికిపోయిన స్టబ్స్ తర్వాత వరుస రెండు బంతుల్లో భారీ సిక్స్లు కొట్టాడు. అక్షర్ (13 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్) పరిస్థితులకు తగ్గట్లు ఆడలేకపోయాడు. దీంతోపాటు డెత్ ఓవర్లలో సందీప్, అవేశ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఈ సీజన్లో జరిగిన 9 మ్యాచ్ ల్లోనూ హోమ్ టీమ్ నెగ్గడం విశేషం. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (బి) ముకేశ్ 5; బట్లర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 11; సామ్సన్ (సి) పంత్ (బి) ఖలీల్ 15; పరాగ్ (నాటౌట్) 84; అశ్విన్ (సి) స్టబ్స్ (బి) అక్షర్ 29; జురెల్ (బి) నోర్జే 20; హెట్మైర్ (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1–9, 2–30, 3–36, 4–90, 5–142. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–24–1, ముకేశ్ 4–0–49–1, నోర్జే 4–0–48–1, అక్షర్ పటేల్ 4–0–21–1, కుల్దీప్ 4–0–41–1 ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) సందీప్ (బి) అవేశ్ ఖాన్ 49; మార్‡్ష (బి) బర్గర్ 23; రికీ భుయ్ (సి) సామ్సన్ (బి) బర్గర్ 0; పంత్ (సి) సామ్సన్ (బి) చహల్ 28; స్టబ్స్ (నాటౌట్) 44; అభిõÙక్ పొరెల్ (సి) బట్లర్ (బి) చహల్ 9; అక్షర్ పటేల్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–30, 2–30, 3–97, 4–105, 5–122. బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 3–0–29–0, బర్గర్ 3–0–29–2, అశ్విన్ 3–0–30–0, అవేశ్ ఖాన్ 4–0–29–1, చహల్ 3–0–19–2, సందీప్ 4–0–36–0. -
అన్న నీవు ఓవరాక్షన్ స్టార్ కాదు.. ఇక సూపర్ స్టార్వే! వీడియో వైరల్
రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ తన ఐపీఎల్ కెరీర్లోనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్-2024లో భాగంగా జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో పరాగ్ విధ్వంసం స`ష్టించాడు. ఢిల్లీ బౌలర్లను పరాగ్ ఊచకోత కోశాడు. 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన రాజస్తాన్ను పరాగ్ తన అద్భుత ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన రియాన్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన అన్రిజ్ నోర్జే బౌలింగ్లో పరాగ్ ఏకంగా 25 పరుగులు రాబట్టాడు. అందులో 3 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. కేవలం 45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్లతో 84 పరుగులు చేశాడు. ఐపీఎల్లో అతడికి ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం . అంతేకాకుండా ఇది పరాగ్కు 17 ఇన్నింగ్స్ల తర్వాత వచ్చిన హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 2019లో ఐపీఎల్లో రాజస్తాన్ తరపున డెబ్యూ చేసిన రియాన్ పరాగ్.. ఇప్పటివరకు 56 మ్యాచులు ఆడాడు. వాటిల్లో 727 పరుగులు చేశాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే పరాగ్ ఎప్పుడూ తన ఆటతో కంటే తన వింత చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో ఎక్కేవాడు. కానీ ఇప్పుడు ఆటతో కూడా అందరిని ఆకట్టుకుకుంటున్నాడు ఈ అస్సాం ఆల్రౌండర్. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన తొలి మ్యాచ్లోనూ 43 పరుగులతో అదరగొట్టాడు. ఓవరాల్గా రెండు మ్యాచ్లు 127 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పరాగ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పరాగ్ 2.O అంటూ కొనియాడుతున్నారు. https://t.co/b25Pi3Z0SU pic.twitter.com/hLnVRxlfBw — IndianPremierLeague (@IPL) March 28, 2024 -
అలా అయితే తొలి బంతికే అవుటయ్యే వాడిని!
గత సీజన్లో ఏడు మ్యాచ్లు ఆడి కేవలం 78 పరుగులు.. ఆట కంటే కూడా అతి చేష్టలతోనే వార్తల్లో ఉంటాడంటూ ఘాటు విమర్శలు.. ఇక సోషల్ మీడియాలో అయితే ‘ఓవరాక్షన్’ స్టార్ అనే ట్యాగ్తో జరిగే ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. మీరు ఊహించిన పేరు నిజమే.. రియాన్ పరాగ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడీ అసోం ఆల్రౌండర్. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన రియాన్.. రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్. నిజానికి రాజస్తాన్ రాయల్స్ జట్టులో రియాన్కు వచ్చినన్ని అవకాశాలు మరెవరికీ రాలేదు. అయినా.. వాటిని సద్వినియోగం చేసుకోలేక విమర్శలు మూటగట్టుకున్నాడతడు. అయితే, ఈ ఏడాది దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన రియాన్.. ఐపీఎల్-2024లోనూ శుభారంభం అందుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రియన్ పరాగ్.. కెప్టెన్ సంజూ శాంసన్(82 నాటౌట్)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 29 బంతుల్లోనే ఒక ఫోర్, మూడు సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేశాడు. Fine Hitting On Display 💥 Sanju Samson brings up his 5️⃣0️⃣#RR 119/2 after 13 overs Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 Follow the match ▶️ https://t.co/MBxM7IvOM8#TATAIPL | #RRvLSG pic.twitter.com/MTywnipKwl — IndianPremierLeague (@IPL) March 24, 2024 సంజూతో కలిసి 59 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. తద్వారా లక్నోపై రాజస్తాన్ విజయంలో తానూ భాగమయ్యాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. కెప్టెన్ సంజూ శాంసన్ వల్లే తన ఇన్నింగ్స్ సాఫీగా సాగిందని కృతజ్ఞతలు తెలిపాడు. ‘‘ప్రాక్టీస్ చేసే సమయంలో కొత్తగా నేర్చుకున్న కొన్ని షాట్లను ఇక్కడ ట్రై చేస్తానని సంజూ భయ్యాతో చెప్పాను. తనతో కలిసి బ్యాటింగ్ చేస్తున్నపుడు ‘ప్లీజ్ భయ్యా.. ఒక్కటంటే ఒక్క షాట్ కొడతా’ అని బతిమిలాడాను. కానీ భయ్యా మాత్రం.. ‘వద్దు.. వద్దు.. ఈ రోజు వికెట్ అంత అనుకూలంగా లేదు’ అని నన్ను వారించాడు. ఒకవేళ భయ్యా అలా చెప్పి ఉండకపోతే హడావుడిలో వికెట్ పారేసుకునేవాడినేమో. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకున్న షాట్లను సరైన పద్ధతిలో అమలు చేయలేకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుంది. భయ్యా జాగ్రత్తలు చెప్పకపోయి ఉంటే తొలి బంతికే అవుటయ్యే వాడిని’’ అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు. కాగా జైపూర్లో లక్నోతో ఆదివారం జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో గెలుపొందిన రాజస్తాన్ ఐపీఎల్-2024ను విజయంతో ఆరంభించింది. చదవండి: #HardikPandya: హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్.. మండిపడ్డ రోహిత్! పక్కనే అంబానీ.. -
RR Vs LSG: అన్న ఇది నీవేనా.. మేము అస్సలు ఊహించలేదు! వీడియో వైరల్
ఐపీఎల్లో గత కొన్ని సీజన్లగా తన ఆట తీరుతో విమర్శలు మూటగట్టుకుంటున్న రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఎట్టకేలకు బ్యాట్ను ఝులిపించాడు. ఐపీఎల్-2024లో భాగంగా జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో పరాగ్ అదరగొట్టాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన పరాగ్ తన అద్బుతమైన ఇన్నింగ్స్తో అందరని ఆకట్టుకున్నాడు. కెప్టెన్ సంజూ శాంసన్తో కలిసి తన జట్టుకు భారీ స్కోర్ను అందించాడు. 29 బంతులు ఎదుర్కొన్న రియాన్.. ఒక ఫోర్, 3 సిక్స్లతో 43 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అన్న ఇది నీవేనా.. అస్సలు ఊహించలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా 2019లో ఐపీఎల్లో రాజస్తాన్ డెబ్యూ చేసిన రియాన్ పరాగ్.. ఇప్పటివరకు 55 మ్యాచులు ఆడాడు. వాటిల్లో 643 పరుగులు స్కోర్ చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ సంజూ శాంసన్ (52 బంతుల్లో 82 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. శాంసన్తో పాటు రియాన్ పరాగ్ (43) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు పడగొట్టగా.. రవి బిష్ణోయ్, మోహ్సిన్ ఖాన్ తలా వికెట్ పడగొట్టారు. 𝙋𝙖𝙧𝙖𝙜 𝙥𝙤𝙬𝙚𝙧 💪#RRvLSG #TATAIPL #IPLonJioCinema #IPL2024 #JioCinemaSports pic.twitter.com/lzqzCLqBfY — JioCinema (@JioCinema) March 24, 2024 -
శతక్కొట్టిన బెంగాల్ మంత్రి.. చెలరేగిన షమీ తమ్ముడు
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా అసోం జట్టుపై బెంగాల్ ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుని.. ఏకంగా ఇన్నింగ్స్ 162 పరుగుల తేడాతో రియాన్ పరాగ్ సేనను మట్టికరిపించింది. గువాహటి వేదికగా శుక్రవారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన అసోం తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బెంగాల్ 405 పరుగులకు ఆలౌట్ అయింది. అనుస్తుప్ మజుందార్(125), కెప్టెన్, బెంగాల్ క్రీడా శాఖా మంత్రి మనోజ్ తివారి(100) శతకాలకు తోడు.. లోయర్ ఆర్డర్లో కరణ్ లాల్(52), సూరజ్ సింధు జైస్వాల్(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో ఈ మేరకు భారీ స్కోరు నమోదు చేసింది. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన అసోం.. బెంగాల్ బౌలర్ల దెబ్బకు 103 పరుగులకే చాపచుట్టేసింది. దినేశ్ దాస్(50), సాహిల్ జైన్(40) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం 5 పరుగులు కూడా చేయలేకపోయారు. ఇక కెప్టెన్ రియాన్ పరాగ్ ఆబ్సెంట్ హర్ట్(0)గా వెనుదిరిగాడు. బెంగాల్ బౌలర్లలో పేసర్ మహ్మద్ కైఫ్(మహ్మద్ షమీ తమ్ముడు) నాలుగు వికెట్లతో చెలరేగగా.. సూరజ్ సింధు జైస్వాల్ మూడు, అంకిత్ మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ అసోంను ఫాలో ఆన్ ఆడించగా.. రెండో ఇన్నింగ్స్లో 140 పరుగులకే ఆలౌట్ అయి భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఈసారి సూరజ్ సింధు జైస్వాల్ 5 వికెట్లతో చెలరేగగా... అంకిత్, కరణ్ లాల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈసారీ రియాన్ ఆబ్సెంట్ హర్ట్గా వెనుదిరిగాడు. ఇక ఆదివారమే ముగిసిన ఈ మ్యాచ్లో బ్యాట్, బాల్తో అదరగొట్టిన సూరజ్ సింధు జైస్వాల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇదిలా ఉంటే.. టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తమ్ముడు మహ్మద్ కైఫ్.. తన అన్నలాగే సొంతరాష్ట్రం ఉత్తరప్రదేశ్కు కాకుండా బెంగాల్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది అరంగేట్రం చేసిన అతడు ఇప్పటికే అద్భుత ప్రదర్శనలతో తనదైన ముద్ర వేయడం విశేషం. చదవండి: శివమ్ దూబే మెరుపు శతకం -
వరుసగా రెండో మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన రియాన్ పరాగ్
రంజీ ట్రోఫీ 2024 ఎడిషన్లో అస్సాం కెప్టెన్ రియాన్ పరాగ్ పరుగుల వరద పారిస్తున్నాడు. సీజన్లో వరుసగా రెండో సెంచరీతో చెలరేగిపోయాడు. చత్తీస్ఘడ్తో జరిగిన తొలి మ్యాచ్లో కేవలం 87 బంతుల్లోనే 11 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 155 పరుగులు చేసిన రియాన్.. కేరళతో జరుగుతున్న మ్యాచ్లో 104 బంతుల్లో బాధ్యతాయుతమైన శతకం బాదాడు. రియాన్ చేసిన ఈ రెండు శతకాలు తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు చేసినవే కావడం విశేషం. చత్తీస్ఘడ్తో జరిగిన మ్యాచ్లో ఫాలో ఆన్ ఆడే సమయంలో శతక్కొట్టిన రియాన్.. కేరళతో జరుగుతున్న మ్యాచ్లో తన జట్టు 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో సెంచరీతో ఆదుకున్నాడు. చత్తీస్ఘడ్పై రియాన్ చేసిన సెంచరీ రంజీ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ (56 బంతుల్లో) కాగా.. కేరళపై చేసిన సెంచరీ అతని కెరీర్లో చిరకాలం గుర్తుండిపోయేది. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ తొలి ఇన్నింగ్స్లో 419 పరుగులకు ఆలౌటైంది. సచిన్ బేబి సెంచరీతో (131) సత్తా చాటగా.. కున్నుమ్మల్ (83), కృష్ణ ప్రసాద్ (80), ప్రేమ్ (50) అర్ధసెంచరీలతో రాణించారు. అస్సాం బౌలర్లలో ముక్తర్ హుసేన్, రాహుల్ సింగ్ చెరో 3 వికెట్లు, సిద్దార్థ్ శర్మ 2, ఆకాశ్సేన్ గుప్తా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ రియాన్ పరాగ్ (116) బాధ్యతాయుతమైన సెంచరీతో తన జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే రియాన్ మినహా అస్సాం ఇన్నింగ్స్లో ఎవరూ రాణించకపోడంతో ఆ జట్టు మరోసారి కష్టాల్లో పడింది. 212 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 207 పరుగులు వెనుపడి ఉంది. రాహుల్ హజారికా (9), సిద్దార్థ్ శర్మ (0), సుమిత్ (4), గోకుల్ శర్మ (12), సాహిల్ జైన్ (17) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. రిషవ్ దాస్ 31 పరుగులు చేశాడు. ఆకాశ్సేన్ గుప్తా (6), ముక్తర్ హుస్సేన్ (6) క్రీజ్లో ఉన్నారు. -
రియాన్ పరాగ్ సుడిగాలి శతకం
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా ఛత్తీస్ఘడ్తో జరుగుతున్న మ్యాచ్లో అస్సాం సారధి రియాన్ పరాగ్ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్లో అతను మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 56 బంతుల్లోనే సుడిగాలి శతకం బాదాడు. జట్టు కష్టాల్లో (ఫాలో ఆన్) ఉన్నప్పుడు రియాన్ ఆడిన ఈ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకటిగా కీర్తించబడుతుంది. రియాన్ మెరుపు శతకం సాయంతో అస్సాం దారుణ ఓటమి బారి నుంచి తప్పించుకుని, 21 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. ప్రస్తుతం ఆ జట్టు స్కోర్ 6 వికెట్ల నష్టానికి 189 పరుగులుగా ఉంది. అస్సాం ఇన్నింగ్స్లో (సెకెండ్) రిషవ్ దాస్ 17, రాహుల్ హజారికా 39, సుమిత్ సుమిత్ 16, బిషల్ రాయ్ 8, దెనిశ్ దాస్ 0, ఆకాశ్సేన్ గుప్తా 3 పరుగులు చేసి ఔట్ కాగా.. రియాన్, కునాల్ క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు సౌరభ్ ముజుందార్ 5 వికెట్లతో చెలరేగడంతో అస్సాం తొలి ఇన్నింగ్స్లో159 పరుగులకే కుప్పకూలి ఫాలో ఆన్ ఆడుతుంది. రవి కిరణ్ 3, వాసుదేవ్ ఓ వికెట్ పడగొట్టారు. అస్సాం తొలి ఇన్నింగ్స్లో దెనిశ్ దాస్ (52) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్ఘడ్.. కెప్టెన్ అమన్దీప్ దేశాయ్ సెంచరీతో (116) కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్లో 327 పరుగులకు ఆలౌటైంది. శశాంక్ సింగ్ (82), అశుతోష్ (58) అర్ధసెంచరీలతో రాణించారు. అస్సాం బౌలర్లలో ముక్తర్ హుస్సేన్, మ్రిన్మోయ్ దత్తా, ఆకాశ్సేన్ గుప్తా, రాహుల్ సింగ్, కునాల్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు. -
విధ్వంసం సృష్టించిన రియాన్ పరాగ్
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా చత్తీస్ఘడ్తో జరుగుతున్న మ్యాచ్లో అస్సాం సారధి, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడైన రియాన్ పరాగ్ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్లో అతను విధ్వంసం సృష్టించాడు. 40 బంతులు ఎదుర్కొన్న రియాన్.. 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే కుప్పకూలిన అస్సాం ఫాలో ఆన్ ఆడుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ ఆ జట్టు పేలవ ప్రదర్శన చేస్తుంది. రియాన్ పరాగ్ తన జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి, 3 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుంది. అస్సాం సెకెండ్ ఇన్నింగ్స్లో రిషవ్ దాస్ 17, రాహుల్ హజారికా 39, సుమిత్ సుమిత్ 16, బిషల్ రాయ్ 8, దెనిశ్ దాస్ 0 పరుగులు చేసి ఔట్ కాగా.. రియాన్, ఆకాశ్సేన్ గుప్తా (3) క్రీజ్లో నిలిచారు. అంతకుముందు సౌరభ్ ముజుందార్ 5 వికెట్లతో చెలరేగడంతో అస్సాం తొలి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోర్కే కుప్పకూలింది. రవి కిరణ్ 3, వాసుదేవ్ ఓ వికెట్ పడగొట్టారు. అస్సాం తొలి ఇన్నింగ్స్లో దెనిశ్ దాస్ (52) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కెప్టెన్ అమన్దీప్ దేశాయ్ సెంచరీతో (116) కదంతొక్కడంతో చత్తీస్ఘడ్ తొలి ఇన్నింగ్స్లో 327 పరుగులకు ఆలౌటైంది. శశాంక్ సింగ్ (82), అశుతోష్ (58) అర్ధసెంచరీలతో రాణించారు. అస్సాం బౌలర్లలో ముక్తర్ హుస్సేన్, మ్రిన్మోయ్ దత్తా, ఆకాశ్సేన్ గుప్తా, రాహుల్ సింగ్, కునాల్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు. -
ఆసీస్తో టీ20 సిరీస్.. రియాన్ పరాగ్కు బంపర్ ఆఫర్..?
ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్కప్ తర్వాత టీమిండియా స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుంది. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 5 వరకు జరిగే ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతి కల్పించి, యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తారని తెలుస్తుంది. త్వరలో ప్రకటించబోయే జట్టులో ప్రస్తుత దేశవాలీ క్రికెట్ సెన్సేషన్ రియాన్ పరాగ్కు స్థానం పక్కా అని సమాచారం. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు (అస్సాం కెప్టెన్గా) చేసి, భీకర ఫామ్లో ఉన్న రియాన్ సైతం భారత సెలక్టర్ల నుంచి పిలుపు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. ముస్తాక్ అలీ టోర్నీలో మొత్తం 10 మ్యాచ్లు ఆడిన రియాన్ 85.00 సగటున, 182.79 స్ట్రైక్ రేట్తో 510 పరుగులు చేసి టోర్నీ లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ టోర్నీలో రియాన్ 11 వికెట్లు కూడా పడగొట్టాడు. రియాన్ తన అద్భుతమైన ఆల్రౌండ్ ప్రతిభతో, కెప్టెన్సీ స్కిల్స్తో అస్సాంను సెమీస్ వరకు తీసుకెళ్లాడు. అయితే సెమీస్లో రియాన్తో పాటు జట్టు మొత్తం విఫలం కావడంతో అస్సాం టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీకి ముందు జరిగిన దియోదర్ ట్రోఫీలోనూ భీకర ఫామ్లో ఉండిన రియాన్ (ఈస్ట్ జోన్).. ఈ టోర్నీలో 5 మ్యాచ్లు ఆడి 88.50 సగటున 136.67 స్ట్రైక్ రేట్ 136.67తో రెండు సెంచరీలు, హాఫ్ సెంచరీ సాయంతో 354 పరుగులు చేశాడు. ఈ టోర్నీలోనూ రియాన్ బ్యాట్తో పాటు బంతితోనూ రాణించాడు. ఈ టోర్నీలో అతను 19.09 సగటున 11 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుని రియాన్ను భారత జట్టుకు ఎంపిక చేయడం ఖాయమని నెటిజన్లు అనుకుంటున్నారు. 21 ఏళ్ల రియాన్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
మరీ అంత అతి పనికిరాదు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి! పరాగ్పై ట్రోల్స్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అస్సాం కెప్టెన్ రియాన్ పరాగ్ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం బెంగాల్తో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో తన హాఫ్ సెంచరీతో మార్క్ను అందుకున్నాడు. అస్సాం విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా టోర్నీలో ఇది పరాగ్కు 7వ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. ఇప్పటివరకు ఆడిన 8 ఇన్నింగ్స్లలో పరాగ్ 490 పరుగులు చేశాడు. తన కెరీర్లోనే భీకర ఫామ్లో ఉన్న పరాగ్పై ఒకవైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే.. మరోవైపు విమర్శల వర్షం కురుస్తోంది. ఏం జరిగిందంటే? బెంగాల్తో మ్యాచ్లో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకోగానే పరాగ్ తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. అయితే అతడి సెలబ్రేషన్స్ శృతి మించాయి. ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లను పరాగ్ అవమానపరిచాడు. హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే పరాగ్ డ్రెస్సింగ్ రూమ్ వైపూ చూస్తూ.. "నేనే అందరికంటే తోపు, నన్నే అపేవారు ఇక్కడ లేరంటూ" సైగలు చేశాడు. దీంతో పరాగ్విమర్శకులకు మరోసారి తోవనిచ్చాడు.. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పటికే చాలా సార్లు పరాగ్ ట్రోల్స్కు గురైన సంగతి తెలిసిందే. ఓవరాక్షన్ స్టార్ అంటూ అభిమానులు ఓ ట్యాగ్ కూడా ఇచ్చేసారు. చదవండి: World cup 2023: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. మ్యాక్స్వెల్కు ప్రమాదం! తలకు తీవ్ర గాయం Celebration by Riyan Parag after his 7th consecutive 50 in T20 Cricket.pic.twitter.com/Z6PitN1XYc — Riyan Parag FC (@riyanparagfc_) October 31, 2023 Riyan Parag celebration myan 😭😭😭. He fucking just said, these guy's aren't on my level. I am fucking couple level ahead of them 😭😭😭 Proper Chad pic.twitter.com/Gd8fbECfM7 — HS27 (@Royal_HaRRa) October 31, 2023 -
పొట్టి క్రికెట్లో కొనసాగుతున్న రియాన్ పరాగ్ విధ్వంసకాండ
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో అస్సాం కెప్టెన్ రియాన్ పరాగ్ (ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ ఆల్రౌండర్) డ్రీమ్ రన్ కొనసాగుతుంది. ఈ టోర్నీలో అతను వరుసగా ఏడో హాఫ్ సెంచరీ బాదాడు. గత మ్యాచ్లో చేసిన హాఫ్ సెంచరీతో ప్రపంచ రికార్డు (టీ20ల్లో వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా వార్నర్, సెహ్వాగ్, బట్లర్ల పేరిట ఉన్న రికార్డు బద్దలు) నెలకొల్పిన రియాన్.. తాజాగా హాఫ్ సెంచరీతో తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. బెంగాల్తో నిన్న (అక్టోబర్ 31) జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్-2లో బ్యాట్తో పాటు బంతితోనూ రాణించిన రియాన్.. తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో అస్సాం క్వార్టర్ ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో రియాన్ 2 వికెట్లు పడగొట్టడంతో పాటు 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 50 పరుగులు చేశాడు. Riyan Parag celebration myan 😭😭😭.He fucking just said, these guy's aren't on my level. I am fucking couple level ahead of them 😭😭😭Proper Chad pic.twitter.com/Gd8fbECfM7— HS27 (@Royal_HaRRa) October 31, 2023 టీమిండియాలో చోటు దక్కేనా..? ముస్తాక్ అలీ టోర్నీలో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు బాది జోరుమీదున్న రియాన్.. త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్లో భారత జట్టులో చోటుపై కన్నేశాడు. ముస్తాక్ అలీ ట్రోఫీకి ముందు నుంచే భీకరమైన ఫామ్లో ఉన్న రియాన్.. బ్యాట్తో పాటు బంతితోనూ రాణిస్తూ భారత సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. అస్సాంతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అస్సాం బౌలర్లు ఆకాశ్ సేన్గుప్తా 3, రియాన్ పరాగ్ 2, మ్రిన్మోయ్ దత్తా, శివ్శంకర్ రాయ్, సౌరవ్ డే తలో వికెట్ పడగొట్టారు. బెంగాల్ ఇన్నింగ్స్లో ఎనిమిదో నంబర్ ఆటగాడు కరణ్ లాల్ (24) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అస్సాం.. రిశవ్ దాస్ (31), బిషల్ రాయ్ (45 నాటౌట్), రియాన్ పరాగ్ (50 నాటౌట్) రాణించడంతో 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నిన్ననే జరిగిన మరో ప్రీక్వార్టర్ ఫైనల్లో గుజరాత్పై ఉత్తర్ప్రదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. నవంబర్ 2న మరో రెండు ప్రీ క్వార్టర్ఫైనల్ మ్యాచ్లు జరుగనున్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో రియాన్ పరాగ్ గణాంకాలు.. 45(19) & 0/53(4) 61(34) & 2/25(4) 76(37) & 3/6(4) 53(29) & 1/17(4) 76(39) & 1/37(4) 72(37) & 1/35(3) 57(33) & 1/17(4) 50(31) & 2/23(4) -
చరిత్ర సృష్టించిన రియాన్.. ఓవరాక్షన్ స్టార్ కాస్త సూపర్ స్టార్ అయ్యాడు..!
ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ఆడుతూ, ఆటకంటే ఓవరాక్షన్ ద్వారా ఎక్కువ పాపులర్ అయిన రియాన్ పరాగ్ ఇటీవలికాలంలో అతిని పక్కకు పెట్టి ఆటపై మాత్రమే దృష్టి సారిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాడు. వ్యక్తిగత ప్రవర్తనతో పాటు ఫామ్లేమి కారణంగా గత ఐపీఎల్లో సరైన అవకాశాలు రాని రియాన్.. ఆతర్వాత జరిగిన అన్ని దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణించి శభాష్ అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ టోర్నీలో (సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ-2023) ఆల్రౌండ్ షోతో అదరగొడుతున్న రియాన్.. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ల్లో బ్యాట్తో పాటు బంతితోనూ రాణిస్తూ మ్యాచ్ విన్నర్గా మారాడు. ఈ టోర్నీలో అస్సాం జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న రియాన్.. వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు సాధించి ప్రపంచ రికార్డును సైతం నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో రియాన్కు ముందు ఏ ఇతర ఆటగాడు వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు సాధించలేదు. ఈ టోర్నీలో బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ అదరగొడుతున్న రియాన్.. ప్రతి మ్యాచ్లో వికెట్లు కూడా తీసి పర్ఫెక్ట్ ఆల్రౌండర్గా పేరు తెచ్చుకుంటున్నాడు. ఈ ప్రదర్శనలతో ఓవరాక్షన్ స్టార్ కాస్త సూపర్ స్టార్గా మారిపోయాడు. ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా కేరళతో ఇవాళ (అక్టోబర్ 27) జరిగిన మ్యాచ్లో 33 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 57 పరుగులు చేసిన రియాన్.. తన కోటా 4 ఓవర్లు పూర్తి చేసి పొదుపుగా (17 పరుగులు) బౌలింగ్ చేయడంతో పాటు వికెట్ తీసుకుని తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ ప్రదర్శనకు ముందు రియాన్ వరసగా 102 నాటౌట్, 95 (దియోదర్ ట్రోఫీ), 45, 61, 76 నాటౌట్, 53 నాటౌట్, 76, 72 పరుగులు స్కోర్ చేశాడు. ఈ ప్రదర్శనలతో రియాన్ త్వరలో జరుగనున్న ఐపీఎల్ 2024 వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంటుంది. ఒకవేళ రియాన్ను రాయల్స్ టీమ్ రిలీజ్ చేయకపోతే.. ఆ జట్టులోనే మంచి అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంటుంది. -
నేను అవన్నీ పట్టించుకోను.. చూయింగ్ గమ్ నమిలితే తప్పు! అది నా ఇష్టం
ఐపీఎల్-2023లో విఫలమైన అస్సాం స్టార్ క్రికెటర్ రియాన్ పరాగ్.. దేశవాళీ టోర్నీల్లో మాత్రం అదరగొడుతున్నాడు. ఇటీవల ముగిసిన దేవధర్ ట్రోఫీ 2023లో పరాగ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో 5 మ్యాచ్లు ఆడిన పరాగ్ 88.50 సగటుతో 354 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఈ టోర్నీలో 23 సిక్సర్లు కొట్టిన రియాన్ పరాగ్, బౌలింగ్లోనూ 11 వికెట్లు తీశాడు. ఈ ఏడాది దేవ్ధర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సర్లు, అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా పరాగ్ నిలిచాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్లో గత కొన్ని సీజన్ల నుంచి రాజస్తాన్ రాయల్స్కు పరాగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఆట కన్నా తన చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో ఎక్కువగా నిలిచాడు. విజయం సాధించినపుడు చేసుకునే సంబురాలు, క్యాచింగ్ సెలబ్రేషన్స్తో అతి చేసేవాడు. దీంతో అతడిపై చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో వేదికగా ట్రోలింగ్ జరిగింది. తాజాగా తనపై ట్రోల్స్ చేస్తున్నవారికి పరాగ్ గట్టి కౌంటరిచ్చాడు. ఇండియాన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరాగ్ మాట్లాడుతూ.. "ప్రజలు నన్ను ఎందుకు ద్వేషిస్తారో నాకు బాగా తెలుసు. నేను చూయింగ్ గమ్ నమిలితే అది ఒక సమస్యే. అదే విధంగా నా టీషర్ట్ కాలర్పైకి పైకి ఉంటే అది నచ్చదు. నేను ఒక క్యాచ్ పట్టుకున్న తర్వాత సెలబ్రేషన్స్ చేసుకుంటే అది కూడా అందరి దృష్టిలో తప్పే. నేను ఖాళీ సమయంలో గోల్ఫ్ ఆడటం కూడా తప్పుగా భావిస్తారు "అని అసహనం వ్యక్తం చేశాడు. వాటిని పట్టించుకోను.. "క్రికెట్ ఎలా ఆడాలి అనే దాని గురించి రూల్ బుక్ ఉంది. టీషర్ట్ టక్ చేసుకోవాలి, కాలర్ క్రిందికి ఉండాలి, ఎవరినీ స్లెడ్జ్ చేయకూడదు, ఇవన్నీ రూల్స్ అన్న సంగతి నాకు కూడా తెలుసు. వీటిన్నటికీ నేను వ్యతేరేకంగా ఉంటా కనుక ప్రజలకు నేను నచ్చను. నేను దేవ్ధర్ ట్రోఫీలో అద్బుతంగా రాణించాను. కాబట్టి అందరూ వావ్ వాట్ఏ టాలెంట్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అదే తర్వాత ఒక్క మ్యాచ్లో విఫలమైతే చాలు, చెత్త ఆట అంటూ మాట్లాడుకుంటారు. కాబట్టి అర్ధం లేని ట్రోల్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను నాకు నచ్చిన విధంగానే ఉంటాను. ఇప్పటివరకు ఎవరూ కూడా నా దగ్గరకు వచ్చి నీలో ఈ సమస్య ఉందంటూ చెప్పలేదు. నేను నా లైఫ్ను ఎంజాయ్ చేయడానికి క్రికెట్ ఆడటం మొదలు పెట్టాను. నేను ఇప్పటికీ సరదా కోసమే క్రికెట్ ఆడుతున్నాను. నేను ఎంజాయ్ చేస్తుంటే ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు" అని చెప్పుకొచ్చాడు. చదవండి:ఈ వెస్టిండీస్ క్రికెటర్ వారణాసి అమ్మాయిని పెళ్లాడాడు! వ్యాపారవేత్తగా ఆమె! అతడేమో.. -
Riyan Parag: ఓవరాక్షన్ ప్లేయర్ అన్న నోళ్లతోనే శభాష్ అనిపించుకున్నాడు..!
ఆన్ ఫీల్డ్ బిహేవియర్ కారణంగా ఓవరాక్షన్ ప్లేయర్గా ముద్ర వేసుకున్న టీమిండియా యువ ఆటగాడు రియాన్ పరాగ్.. తనను తిట్టిన నోళ్లతోనే పొగిడించుకుంటున్నాడు. ఆట కంటే అతి ఎక్కువగా చేసి బాగా పాపులరైన రియాన్.. తాజాగా ముగిసిన దియోదర్ ట్రోఫీ-2023లో బ్యాట్తో బంతితో చెలరేగి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. దియోదర్ ట్రోఫీలో 5 మ్యాచ్లు ఆడిన రియాన్.. 2 సెంచరీలు, అర్ధసెంచరీ సాయంతో 88.50 సగటున 354 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ టోర్నీలో పరుగుల వరద పారించిన రియాన్.. బంతితోనూ మెరిశాడు. 19.09 సగటున 11 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన రియాన్.. ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు. తన జట్టు (ఈస్ట్ జోన్) కష్ట సమయాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్లు ఆడిన రియాన్.. మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. సౌత్ జోన్తో నిన్న (ఆగస్ట్ 3) జరిగిన ఫైనల్లోనూ ఆల్రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్న 21 ఏళ్ల రియాన్.. తన జట్టును గెలిపించేందుకు శత విధాల ప్రయత్నించి విఫలమయ్యాడు. తొలుత బంతితో (2/68) మ్యాజిక్ చేసిన రియాన్.. ఆ తర్వాత బ్యాట్తో చెలరేగి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో 65 బంతులు ఎదుర్కొన్న రియాన్.. 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. భారీ లక్ష్య ఛేదనలో కుమార్ కుషాగ్రాతో (68) కలిసి కీలక భాగాస్వామ్యం నెలకొల్పిన రియాన్.. ఆరో వికెట్గా వెనుదిరగడంతో ఈస్ట్ జోన్ ఓటమి ఖరారైంది. కాగా, దియోదర్ ట్రోఫీ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్.. రోహన్ కున్నుమ్మల్ (107), మయాంక్ అగర్వాల్ (63) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఈస్ట్ జోన్.. 46.1 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటై 45 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్లో రియాన్ పరాగ్, కుషాగ్రా మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. దియోదర్ ట్రోఫీ-2023లో రియాన్ పరాగ్ స్కోర్లు, వికెట్లు.. నార్త్ ఈస్ట్ జోన్పై 13 పరుగులు, 4 వికెట్లు నార్త్ జోన్పై 131 పరుగులు, 4 వికెట్లు సౌత్ జోన్పై 13 పరుగులు, ఒక వికెట్ వెస్ట్ జోన్పై 102 నాటౌట్ ఫైనల్లో సౌత్ జోన్పై 95 పరుగులు, 2 వికెట్లు -
పరాగ్ విధ్వంసకర సెంచరీ.. 6 ఫోర్లు, 5 సిక్స్లతో! నీలో ఇంత టాలెంట్ ఉందా?
దియోదర్ ట్రోఫీ-2023లో ఈస్ట్జోన్ స్టార్ ఆటగాడు రియాన్ పరాగ్ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా వెస్ట్జోన్తో జరుగుతున్న మ్యాచ్లో పరాగ్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో ఓవరాల్గా 68 బంతులు ఎదుర్కొన్న పరాగ్ 6 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 102 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ టోర్నీలో అతడికి ఇది రెండో సెంచరీ కావడం గమానర్హం. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. నార్త్జోన్ బ్యాటర్లలో పరాగ్తో పాటు అభిమన్యు ఈశ్వరన్(38), ఉత్కర్ష్ సింగ్(50) విరాట్ సింగ్(42) పరుగులతో రాణించారు. ఇక 320 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్జోన్ 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. ఇక రియాన్ పరాగ్ బ్యాటింగ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పరాగ్ ప్రదర్శనపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. "నీలో ఇంత టాలెంట్ ఉందా, అస్సలు ఊహించలేదంటూ" సెటైర్లు వేస్తున్నారు. నార్త్జోన్ ఘన విజయం ఇక మరో మ్యాచ్లో నార్త్ఈస్ట్జోన్పై నార్త్జోన్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ ఈస్ట్జోన్ కేవలం 101 పరుగులకే కుప్పకూలింది. మయాంక్ మార్కండే 4 వికెట్లు, మయాంక్ యాదవ్ 3 వికెట్లతో నార్త్ఈస్ట్ పతనాన్ని శాసించారు. అనంతరం 102 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన నార్త్జోన్ 12 ఓవర్లలోనే ఛేదించింది. నార్త్జోన్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్(40 నాటౌట్), హిమాన్షు రాణా(52 నాటౌట్) పరుగులతో రాణించారు. చదవండి: Ravindra Jadeja On Kapil Dev Remarks: మేమంతా దేశం కోసమే ఆడతాం.. అంతేగానీ: కపిల్ దేవ్కు జడ్డూ స్ట్రాంగ్ కౌంటర్ Hundred for the ages, Riyan Parag is a ✨, the celebration too is deserved. #Deodhar pic.twitter.com/NRZdZmGZhP — Aakash Sivasubramaniam (@aakashs26) August 1, 2023 -
సిక్సర్ల వర్షం.. సెంచరీతో పాటు 4 వికెట్లు! రియాన్ పరాగ్ విధ్వంసం.. నిజమేనా?
Deodhar Trophy 2023- North Zone vs East Zone: దియోధర్ ట్రోఫీ-2023లో ఈస్ట్ జోన్ బ్యాటర్ రియాన్ పరాగ్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. నార్త్ జోన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ సాధించాడు. తన విలువైన ఇన్నింగ్స్లో జట్టును గెలిపించాడు. కాగా పుదుచ్చేరి వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్లో నార్త్ జోన్- ఈస్ట్ జోన్ తలపడ్డాయి. టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ శుభారంభం అందుకోలేకపోయింది. టాపార్డర్లో మొత్తం పూర్తిగా విఫలమైంది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(10), ఉత్కర్ష్ సింగ్(11) స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. వన్డౌన్లో వచ్చిన విరాట్ సింగ్ కేవలం 2 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ సిక్సర్ల వర్షం ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన సుభ్రాంషు సేనాపతి (13), కెప్టెన్ సౌరభ్ తివారి(16) సైతం నిరాశపరిచారు. ఈ క్రమంలో ఆరో స్థానంలో బరిలోకి దిగిన రియాన్ పరాగ్ ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడ్డాడు. వికెట్ కీపర్ బ్యాటర్ కుశర్గ(98)తో కలిసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అద్భుత సెంచరీ 102 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 131 పరుగులు సాధించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఈస్ట్ జోన్ 8 వికెట్ల నష్టపోయి ఏకంగా 337 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన నార్త్ జోన్ బ్యాటింగ్ ఆర్డర్ను రియాన్ పరాగ్ కకావికలం చేశాడు. నాలుగు వికెట్లు తీసి 10 ఓవర్ల బౌలింగ్లో 57 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. ఉత్కర్ష్, ఆకాశ్ దీప్, ముఖ్తార్ హుసేన్ తలా ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో 45.3 ఓవర్లలోనే నార్త్ జోన్ కథ ముగిసింది. 249 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ కావడంతో.. 88 పరుగులతో ఈస్ట్జోన్ జయభేరి మోగించింది. అస్సలు ఊహించలేదు.. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ ప్రదర్శనపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఎన్నాళ్లకెన్నాళ్లకు.. రియాన్ పరాగ్ ఇప్పటికైనా నువ్వున్నావని గుర్తించేలా చేశావు... అది కూడా ఆటతో! అస్సలు ఊహించలేదు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ అసోం కుర్రాడు.. ఆట కంటే తన చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఓవరాక్షన్ ప్లేయర్గా ముద్రపడి విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజా సీజన్లో 7 ఇన్నింగ్స్ ఆడి 78 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రియాన్ దియోదర్ ట్రోఫీ ప్రదర్శనపై నెటిజన్లు ఈ మేరకు కామెంట్లు చేయడం గమనార్హం. చదవండి: టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు.. -
Ind Vs Pak: సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్.. పాక్ను చిత్తు చేసిన భారత్
ACC Mens Emerging Teams Asia Cup 2023- Pakistan A vs India A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో భాగంగా భారత యువ జట్టు పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది. శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్-ఏ- పాకిస్తాన్- ఏ జట్లు బుధవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పాక్కు ఆదిలోనే షాకిచ్చాడు భారత యువ పేసర్ రాజ్వర్ధన్ హంగర్గేకర్. ఓపెనర్ సయీమ్ ఆయుబ్ను డకౌట్ చేశాడు. ఐదు వికెట్లతో చెలరేగిన హంగర్గేకర్ అంతేకాదు.. వన్డౌన్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్తో కూడా సున్నా చుట్టించాడు. దీంతో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన పాక్ను ఓపెనర్ షాహిజాదా ఫర్హాన్(35), హసీబుల్లా ఖాన్(27) ఆదుకున్నారు. అయితే, భారత స్పిన్నర్ మానవ్ సుతార్, ఫాస్ట్బౌలర్ హంగేర్గకర్ వారిని ఎక్కువసేపు నిలవనీయలేదు. వీరిద్దరి విజృంభణతో పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కాసిం అక్రమ్(48) కాసేపు పోరాడాడు. అతడికి తోడుగా.. ముబాసిర్ ఖాన్(28) రాణించాడు. ఆఖర్లో మెహ్రాన్ మంతాజ్ 25 పరుగులతో అజేయంగా నిలవడంతో 48 ఓవర్లలో పాకిస్తాన్ 205 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో హంగేర్గకర్ అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. మానవ్కు మూడు, రియాన్ పరాగ్, నిషాంత్ సింధు ఒక్కో వికెట్ తీశారు. సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్ సాయి సుదర్శన్ అదిరిపోయే ఆరంభం అందించాడు. సెంచరీ(104)తో చెలరేగి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. వరుసగా రెండు సిక్సర్లు బాది శతకం పూర్తి చేసుకుని వారెవ్వా అనిపించాడు. ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(20) నిరాశ పరచగా.. వన్డౌన్లో వచ్చిన నికిన్ జోస్ అర్ధ శతకం(53)తో రాణించి సాయితో కలిపి మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశాడు. మెహ్రాన్ బౌలింగ్లో నికిన్ అవుట్ అయ్యాడు. హ్యాట్రిక్ విజయం అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ యశ్ ధుల్ 19 బంతుల్లో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సాయి సుదర్శన్ అజేయ శతకం, నికిన్ జోస్ హాఫ్ సెంచరీ కారణంగా భారత్ 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. కాగా ఈ టోర్నీలో భారత-ఏ జట్టుకు ఇది హ్యాట్రిక్ విజయం. అంతకు ముందు యూఏఈ, నేపాల్లపై భారీ విజయాలు నమోదు చేసింది. చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్లో ఎందుకు లేడు? అయినా అతడితో.. -
పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు! రియాన్ పరాగ్ సైతం
ACC Mens Emerging Teams Asia Cup 2023- Pakistan A vs India A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్లో భారత-ఏ జట్టు బౌలర్లు అద్భుతంగా రాణించారు. యువ పేసర్ రాజ్వర్ధన్ హంగర్గేకర్ ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ మానవ్ సుతార్ మూడు వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరికి తోడు మరో స్పిన్నర్ నిషాంత్ సింధు, పార్ట్టైమ్ స్పిన్ బౌలర్ రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్-ఏ, పాక్- ఏ జట్ల మధ్య బుధవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డకౌట్ ఈ క్రమంలో హంగర్గేకర్ పాక్ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ను డకౌట్ చేయడంతో పాటు వన్డౌన్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్ను కూడా పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్కు పంపాడు. దీంతో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన పాక్ను ఓపెనర్ షాహిజాదా ఫర్హాన్(35), హసీబుల్లా ఖాన్(27) ఆదుకునే ప్రయత్నం చేశారు. 48 ఓవర్లలోనే కథ ముగిసింది అయితే, మానవ్ సుతార్, హంగేర్గకర్ ధాటికి వరుసగా వికెట్లు పడ్డాయి. టాపార్డర్ విఫలమైన వేళ లోయర్ ఆర్డర్లో వచ్చిన కాసిం అక్రమ్(48), ముబాసిర్ ఖాన్(28) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆఖర్లో మెహ్రాన్ మంతాజ్ 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, భారత బౌలర్ల ధాటికి 48 ఓవర్లలోనే పాకిస్తాన్ కథ ముగిసింది. 205 పరుగులు చేసి దాయది జట్టు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యశ్ ధుల్ సేన గెలవాలనే పట్టుదలతో రంగంలోకి దూకింది. కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో భారత్ విజయం సాధించింది. యూఏఈ, నేపాల్లపై వరుసగా 8, 9 వికెట్ల తేడాతో గెలుపొంది. చిరకాల ప్రత్యర్థిపై కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్లో ఎందుకు లేడు? అయినా అతడితో.. విండీస్తో రెండో టెస్టు! కీలక అప్డేట్ ఇచ్చిన రోహిత్!; వాళ్లకు నో ఛాన్స్! -
ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్.. కోహ్లిని గుర్తు చేసుకున్న యువ క్రికెటర్లు
భారత్-పాకిస్తాన్ల మధ్య ఏ క్రీడలో అయినా, ఏ స్థాయి మ్యాచ్ అయినా భారీ అంచనాలు కలిగి ఉంటుందన్న విషయం తెలిసిందే. దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్ అయితే, దాని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. క్రికెటర్లతో పాటు అభిమానులు తీవ్ర భావోద్వేగాలకు లోనవుతారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 ద్వారా ఇరు దేశాల క్రికెటర్లు, అభిమానులకు మరోసారి ఆ భావోద్వేగానుభూతికి లోనయ్యే అవకాశం దొరికింది. టోర్నీలో భాగంగా రేపు (జులై 19) భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు తలపడనున్నాయి. కొలొంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచ్ కోసం యువ భారత క్రికెటర్లు, పాకిస్తాన్ ఆటగాళ్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్లో ఎలాగైనా రాణించి, అభిమానుల మనసుల్లో చిరకాలం కొలువుండిపోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. భారత-ఏ క్రికెటర్లయితే తమ ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లి చివరిసారి పాకిస్తాన్పై ఆడిన ఇన్నింగ్స్ను గుర్తుచేసుకుంటూ తాము కూడా అదే స్థాయి ఇన్నింగ్స్ ఆడాలని కలలు కంటున్నారు. నేపాల్తో నిన్న జరిగిన మ్యాచ్లో సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ (87) స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. తన దృష్టిలో ఆసియా కప్-2022లో పాక్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్ అని అన్నాడు. మరో భారత-ఏ జట్టు సభ్యుడు రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ఆసియా కప్లో పాక్తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి ముఖంలో, కళ్లలో కనిపించిన కసి అత్యద్భుతమని కొనియాడాడు. నేపాల్తో మ్యాచ్లో రాణించిన సాయి సుదర్శన్ మాట్లాడుతూ.. ఆసియా కప్లో పాక్తో జరిగిన మ్యాచ్లో హరీస్ రౌఫ్ బౌలింగ్ కోహ్లి కొట్టిన ఓ షాట్ సూపర్ హ్యూమన్ షాట్ అని అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురు యువ క్రికెటర్లు రేపు పాక్తో జరిగే మ్యాచ్లో కోహ్లిలా చెలరేగాలని అనుకుంటున్నట్లు తెలిపారు. -
నా గురించి ట్వీట్లు చేస్తుంటారు... అదేదో డైరెక్ట్గా చెప్పొచ్చు కదా! అంతకంటే..
ఐపీఎల్-2023లో ఎక్కువగా ట్రోలింగ్కు గురైన క్రికెటర్ రియాన్ పరాగ్. 2019లో క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టిన ఈ అసోం ఆల్రౌండర్ ఆరంభం నుంచే పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. తాజా ఎడిషన్లోనూ వైఫల్యాల పరంపర కొనసాగించాడు. రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించిన అతడు వరుస మ్యాచ్లలో తేలిపోయాడు. దీంతో మేనేజ్మెంట్ రియాన్కు కేవలం ఏడు మ్యాచ్లలో మాత్రమే అవకాశమిచ్చింది. అయితే, రియాన్ పరాగ్ మాత్రం వచ్చిన కాసిన్ని అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆడిన ఏడు మ్యాచ్లలో అతడు సాధించిన మొత్తం పరుగులు 78. అత్యధిక స్కోరు 20. ఆసియా కప్ ఆడే జట్టులో ఆటలో విఫలమైనప్పటికీ మైదానంలో అతి చేష్టల వల్ల ఓవరాక్షన్ ప్లేయర్గా ముద్రపడ్డాడు రియాన్ పరాగ్. నెటిజన్ల చేతిలో ట్రోలింగ్కు గురయ్యాడు. ఈ క్రమంలో ఎమర్జింగ్ ఆసియా కప్-2023 నేపథ్యంలో ఇండియా- ఏ జట్టులో అతడు స్థానం సంపాదించడంతో మరోసారి ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ తనపై వస్తున్న విమర్శలు, వ్యంగ్యాస్త్రాల గురించి స్పందించాడు. ‘‘తాము కష్టపడి సంపాదించిన డబ్బు మనకోసం వెచ్చించి మ్యాచ్ చూడటానికి వస్తారు. అలాంటపుడు వాళ్లను నిరాశపరిస్తే కొంతమంది తిట్టుకుంటారు. నేరుగా నాకే మెసేజ్ చేయొచ్చు కదా మరికొంత మంది మనల్ని ద్వేషిస్తారు. వాళ్ల కోపంలో అర్థం ఉంది. నేను ఆ విషయం అర్థం చేసుకోగలను. కానీ కొంతమంది మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు సోషల్ మీడియాలో నన్ను విమర్శిస్తూ పోస్టులు పెడుతుంటారు. ట్వీట్లు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు కదా! ‘‘నువ్వు ఇలా ఆడుతున్నావు. ఈ విషయంలో నిన్ను నువ్వు మార్చుకోవాలి. టెక్నిక్లో మార్పులు చేసుకోవాలి. అలా అయితే నీ ఆట మెరుగుపడుతుంది’’ అని నాకు సలహాలు ఇవ్వొచ్చు కదా! సోషల్ మీడియాలో పోస్టులు చేసే సమయం కంటే ఇదేమీ ఎక్కువ టైమ్ తీసుకోదు. నిజంగా నాకు ఎవరైనా అలాంటి సలహాలు, సూచనలు ఇస్తే ఇష్టం’’ అంటూ రియాన్ పరాగ్ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ ట్విటర్లో షేర్ చేసింది. ఎమర్జింగ్ ఏసియా కప్-2023 భారత- ఏ జట్టు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ(వైస్ కెప్టెన్), నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, యశ్ ధుల్(కెప్టెన్), రియాన్ పరాగ్, నిశాంత్ సంధు, ప్రభ్షిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), మానవ్ సుతార్, యువరాజ్సిన్హ్ దోడియా, హర్షిత్ రానా, ఆకాశ్ సింగ్, నితీశ్ కుమార్రెడ్డి, రాజ్వర్దన్ హంగ్రేకర్. స్టాండ్ బై ప్లేయర్లు: హర్ష్ దూబే, నేహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రేద్కార్. చదవండి: కీలక ప్రకటన చేయనున్న సౌరవ్ గంగూలీ MS Dhoni: ధోనికి హెలికాప్టర్ షాట్ నేర్పించింది అతడే! 42 ఆసక్తికర విషయాలు.. -
ఇండియా-ఏ జట్టులో ఓవరాక్షన్ ప్లేయర్.. అభిమానుల ట్రోల్స్
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023కి భారత్ జట్టును ప్రకటించింది. వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి జూనియర్ క్రికెట్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన ఇండియా- ఏ జట్టును ఎంపిక చేసింది. మరో నలుగురికి స్టాండ్ బై ప్లేయర్లుగా అవకాశమిచ్చింది. కాగా ఈ టోర్నీకి రియాన్ పరాగ్ కూడా ఎంపికయ్యాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడుతున్న రియాన్ పరాగ్ తన చర్యలతో ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాడు ''ఆడేది తక్కువ.. ఓవరాక్షన్ ఎక్కువ'' రియాన్ పరాగ్పై అభిమానుల ధోరణి ఇలానే ఉంటుంది. మనం కూడా ఇదివరకు చాలాసార్లు చూశాం. అందుకే అతనిపై ఓవరాక్షన్ ప్లేయర్ అనే ముద్ర ఉంది. ఇక ఐపీఎల్ 2023 ఏడు మ్యాచ్లాడి 78 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలోనే రియాన్ పరాగ్పై అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురిపించారు. ఓవరాక్షన్ ప్లేయర్ను ఎందుకు ఎంపిక చేశారు అంటూ కామెంట్ చేశారు. జూలై 13 నుంచి 23 వరకు టోర్నీ.. జూలై 13 నుంచి జూలై 23 వరకు శ్రీలంకలోని కొలంబోలో ఎమర్జింగ్ ఆసియా కప్-2023 నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో గ్రూప్-బిలో భారత్తో పాటు.. నేపాల్, యూఏఈ, పాకిస్తాన్- ఏ జట్లు.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్- ఏ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఇరు గ్రూపులలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఇందులో గ్రూప్-ఏ టాపర్తో గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు తొలి సెమీ ఫైనల్లో.. గ్రూప్-బి టాపర్తో గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టు రెండో సెమీ ఫైనల్లో తలపడతాయి. జూలై 23న ఈ టోర్నీ ఫైనల్ జరుగనుంది. ఎమర్జింగ్ ఏసియా కప్-2023 భారత- ఏ జట్టు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ(వైస్ కెప్టెన్), నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, యశ్ ధుల్(కెప్టెన్), రియాన్ పరాగ్, నిశాంత్ సంధు, ప్రభ్షిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), మానవ్ సుతార్, యువరాజ్సిన్హ్ దోడియా, హర్షిత్ రానా, ఆకాశ్ సింగ్, నితీశ్ కుమార్రెడ్డి, రాజ్వర్దన్ హంగ్రేకర్. స్టాండ్ బై ప్లేయర్లు: హర్ష్ దూబే, నేహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రేద్కార్. కోచింగ్ స్టాఫ్: సితాంశు కొటక్(హెడ్కోచ్), సాయిరాజ్ బహూతులే (బౌలింగ్ కోచ్), మునిష్ బాలి(ఫీల్డింగ్ కోచ్). Riyan Parag after selection be like 😅#RiyanParag pic.twitter.com/IxlHQIhG8r — Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) July 4, 2023 Riyan Parag scored a 33(45) in a tough wicket and is the 2nd highest scorer in the first Innings of the match between East zone and Central Zone #DuleepTrophy pic.twitter.com/a7SDXUNXFu — ' (@riyanparagfc_) June 29, 2023 Riyan Parag selected in India A squad Meanwhile me : pic.twitter.com/jiWU96Qnt3 — CHINMOY RAY (@ChinmoyRay07) July 4, 2023 చదవండి: Asia Cup- India A: ఆసియా కప్-2023 జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్రెడ్డికి చోటు #ZIMVsSCO: హతవిధి.. జింబాబ్వే కొంపముంచిన స్కాట్లాండ్ -
బిల్డప్ బాబాయ్.. ఒక్క మ్యాచ్లో అయినా ఆడు నాన్న
-
రియాన్ పరాగ్ అకాడమీ.. మీకు దణ్ణం సామీ
-
ఆర్సీబీకి డీకే, రాజస్థాన్కు పరాగ్, సన్రైజర్స్కు మయాంక్.. మరి ఢిల్లీకి..?
ఐపీఎల్-2023లో సగానికిపైగా మ్యాచ్లు పూర్తయినా ఇప్పటికీ కొందరు బ్యాటర్లు గాడిలో పడకపోవడంతో సంబంధిత ఫ్రాంచైజీలు కలవరపడుతున్నాయి. భారీ మొత్తం వెచ్చించి సొంత చేసుకున్న కొందరు ఆటగాళ్లు పదేపదే అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేక ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారారు. తమ చెత్త బ్యాటింగ్తో ఫ్రాంచైజీలకు భారంగా మారిన ఆటగాళ్లెవరో ఓసారి పరిశీలిద్దాం. ప్రస్తుత సీజన్లో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్ల జాబితాలో రాజస్థాన్ రియాన్ పరాగ్ ముందువరుసలో ఉంటాడు. వేలంలో 3.8 కోట్లు దక్కించుకున్న ఈ ఓవరాక్షన్ ఆటగాడు.. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 20 అత్యధిక స్కోర్తో కేవలం 58 పరుగులు మాత్రమే చేశాడు. పరాగ్ తర్వాత చెత్త పెర్ఫార్మెన్స్ చేస్తున్న ఆటగాడు ఆర్సీబీ దినేశ్ కార్తీక్. ఫినిషర్గా ఇరగదీస్తాడని భారీ అంచనాల నడుమ ఈ సీజన్ బరిలోకి దిగిన డీకే (5.5 కోట్లు).. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 28 అత్యధిక స్కోర్తో కేవలం 99 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటర్గా దారుణంగా విఫలమైన డీకే.. వికెట్కీపింగ్లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. క్యాచ్లు మిస్ చేయడం, స్టంపింగ్, రనౌట్లు చేయలేకపోవడం, చేతిలోకి వచ్చిన బాల్స్ను జారవిడచడం.. ఇలా వికెట్కీపింగ్లోనూ డీకే అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇంతటితో ఇతని ఆగడాలు ఆగలేదు. బ్యాటింగ్ సమయంలో ఇతను పరుగులు చేయలేకపోగా.. బాగా ఆడుతున్న వారిని పలు సందర్భాల్లో రనౌటయ్యేలా చేశాడు. కార్తీక్తో పాటు మరో ఆటగాడు కూడా ఆర్సీబీకి చాలా భారంగా మారాడు. స్పిన్ ఆల్రౌండర్ అని చెప్పుకునే షాబాజ్ అహ్మద్ కూడా ఆడిన ప్రతి మ్యాచ్లోనూ విఫలమై జట్టు ఓటములకు కారకుడయ్యాడు. సన్రైజర్స్ విషయానికొస్తే.. ఈ జట్టులో మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్తో పాటు జట్టు మొత్తం బ్యాటింగ్ విభాగంలో దారుణంగా నిరాశపరుస్తుంది. బ్రూక్ ఒకే ఒక మ్యాచ్లో సెంచరీ చేసి, ఆతర్వాత వరుసగా విఫలమవుతున్నాడు. మయాంక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. చించేస్తాడనుకున్న కెప్టెన్ మార్క్రమ్ కూడా తేలిపోతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్కు దీపక్ హుడా.. సీఎస్కేకు అంబటి రాయుడు.. ఢిల్లీ క్యాపిటల్స్కు పృథ్వీ షాలు పెద్ద తలనొప్పిగా మారారు. వీరిని సంబంధిత ఫ్రాంచైజీలు తదుపరి జరుగబోయే మ్యాచ్ల్లో ఆడిస్తారో లేక సాహసం చేసి పక్కకు కూర్చోబెడతారో వేచి చూడాలి. చదవండి: ముంబైతో మ్యాచ్.. జూనియర్ మలింగ అద్భుత గణాంకాలు -
దారుణమైన ట్రోల్స్! ట్వీట్తో బదులిచ్చిన రియాన్ పరాగ్.. వైరల్
IPL 2023 RR Vs GT- Riyan Parag: రాజస్తాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లకు కోట్లు తీసుకుంటూ.. కనీసం ఒక్క మ్యాచ్లో కూడా కనీస స్థాయి ప్రదర్శన కనబరచకలేకపోతున్నాడంటూ రాజస్తాన్ అభిమానులు మండిపడుతున్నారు. ఐపీఎల్-2022లో 14 ఇన్నింగ్స్ ఆడి 183 పరుగులు మాత్రమే చేసిన రియాన్.. ఈ సీజన్లోనూ వైఫల్యం కొనసాగిస్తున్నాడు. సంజూ మినహా మిగతా వాళ్లంతా ముఖ్యంగా కీలక సమయాల్లో అవుటవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు. తాజాగా.. ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో శుక్రవారం నాటి మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. కెప్టెన్ సంజూ శాంసన్(30 పరగులు) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ.. ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగిన రియాన్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. మొత్తంగా ఆరు బంతులు ఎదుర్కొన్న అతడు.. రషీద్ ఖాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో 118 పరుగులకే ఆలౌట్ అయిన రాజస్తాన్.. 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ల వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా రియాన్ను ఇంపాక్ట్ ప్లేయర్గా దింపడంపై సెటైర్లు వేస్తూ చురకలు అంటిస్తున్నారు. వీళ్లంతా నీ అకాడమీయే పనిలో పనిగా రియాన్తో పాటు ఈ సీజన్లో అంచనాలు అందుకోలేకపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా, సన్రైజర్స్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సహా ముంబై సారథి రోహిత్ శర్మ పేర్లను ప్రస్తావిస్తూ.. వీళ్లంతా రియాన్ పరాగ్ అకాడమీ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రియాన్ ట్వీట్ నెట్టింట వైరల్ ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. తనపై ఘాటు విమర్శలు వస్తున్న తరుణంలో.. ‘‘కాలం.. మంచిదో .. చెడ్డదో.. ఏదేమైనా కరిగిపోతూనే ఉంటుంది’’ అని అతడు పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023 సీజన్లో రియాన్ పరాగ్ ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్లలో కలిపి చేసిన మొత్తం పరుగులు 58. అత్యధిక స్కోరు 20. రాజస్తాన్ రియాన్ కోసం రూ. 3.80 కోట్లు ఖర్చు చేస్తే.. అతడు మాత్రం ఇంతవరకు ఒక్క మ్యాచ్లో కూడా రాణించిందిలేదు. చదవండి: Pak Vs NZ: 12 ఏళ్ల తర్వాత తొలిసారి సిరీస్ సమర్పయామి.. ఇప్పుడేమో ఏకంగా.. IPL 2023: కేఎల్ రాహుల్ అవుట్.. అతడి స్థానంలో కర్ణాటక బ్యాటర్ Riyan Parag Academy pic.twitter.com/wuli9FbaMv — Dennis🕸 (@DenissForReal) May 5, 2023 Riyan Parag in IPL 2019 - 160 runs 32 average 2020 - 86 runs 12 average 2021 - 93 runs 11 average 2022 - 183 runs 16 average 2023 - 54 runs 13 average Biggest Fraud ever in IPL? pic.twitter.com/J7NGCGg3Ic — ♚ (@balltampererr) May 5, 2023 Waqt acha ho ya bura Guzar he jata hai! — Riyan Paragg (@ParagRiyan) May 5, 2023 That was some performance by @gujarat_titans 🙌#GT win the match by 9 wickets and add another 2 points to their tally 👌 Scorecard ▶️ https://t.co/54xkkylMlx#TATAIPL | #RRvGT pic.twitter.com/fJKu9gmvLW — IndianPremierLeague (@IPL) May 5, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఎందుకు బాబు మా మర్యాద తీస్తున్నారు.. ఆర్సీబీ బ్యాటర్లను మించిపోయారు..!
స్టార్ ఆటగాళ్లు, విధ్వంసకర బ్యాటర్లతో నిండిన రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుత సీజన్లో వరుసగా రెండో మ్యాచ్లో ఓటమిపాలైంది. సొంతగడ్డపై ఇవాళ (మే 5) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో శాంసన్ సేన 9 వికెట్ల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. బ్యాటర్లంతా మూకుమ్మడిగా చేతులెత్తేయడంతో 17.5 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. గుడ్డి కంటే మెల్ల మేలు అన్న చందంగా సంజూ శాంసన్ (30) ఒక్కడు కాస్త పర్వాలేదనిపించాడు. విధ్వంసకర హిట్టర్లు యశస్వి జైస్వాల్ (14), జోస్ బట్లర్ (8), హెట్మైర్ (7)దారుణంగా నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లతో రెచ్చిపోగా, నూర్ అహ్మద్ 2, షమీ, హార్ధిక్, జాషువ లిటిల్ తలో వికెట్ పడగొట్టారు. 119 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్.. ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. 13.5 ఓవర్లలో గిల్ వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు వృద్దిమాన్ సాహా (41 నాటౌట్), శుభ్మన్ గిల్ (36) రాణించగా.. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన హార్ధిక్ పాండ్యా (15 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గిల్ వికెట్ చహల్కు దక్కింది. రియాన్ పరాగ్, దేవ్దత్ పడిక్కల్లపై ధ్వజమెత్తిన ఫ్యాన్స్.. ఈ మ్యాచ్లో ఓటమి అనంతరం రాజస్థాన్ ఫ్యాన్స్ ఇద్దరు ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. 7.75 కోట్ల ఆటగాడు దేవ్దత్ పడిక్కల్, 3.8 కోట్లు పోసి కొనుక్కున్న రియాన్ పరాగ్లపై అభిమానులు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. వీరి కంటే గల్లీ క్రికెటర్లు వంద రెట్లు నయమని అంటున్నారు. వీరి వల్ల రాజస్థాన్ రాయల్స్ ఇమేజ్ డామేజ్ అయిపోతుందని వాపోతున్నారు. రానురాను రాజస్థాన్ ఆటగాళ్ల ఆటతీరు ఆర్సీబీ మిడిలార్డర్ కంటే చెండాలంగా తయారవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా రియాన్, పడిక్కల్ మారరని, తక్షణమే వీరిని జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పడిక్కల్పై కాస్త కనికరం చూపిస్తున్న అభిమానులు రియాన్ పరాగ్ను మాత్రం తూర్పారబెడుతున్నారు. వీడికి ఆట తక్కువ ఓవరాక్షన్ ఎక్కువ అంటూ బండ బూతులు తిడుతున్నారు. పైగా ఈ మ్యాచ్లో ఇతనేదో పొడుస్తాడని ఆర్ఆర్ యాజమాన్యం ఇతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దించడం సోచనీయమని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఇవాల్టి మ్యాచ్లో ఓవరాక్షన్ ఆటగాడు రియాన్ పరాగ్ 4 (6), పడిక్కల్ 12 (12) పరుగులు చేశారు. ఈ సీజన్లో పరాగ్ 6 మ్యాచ్ల్లో కేవలం 58 పరుగులు మాత్రమే చేస్తే.. పడిక్కల్ 9 మ్యాచ్ల్లో 206 పరుగులు సాధించాడు. -
ఈ ఓవరాక్షన్ ఆటగాడిని ఎందుకు ఆడించారు.. పైగా ఇంపాక్ట్ ప్లేయర్ అట..!
Riyan Parag: ఐపీఎల్-2023లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. గత సీజన్ (2022) నుంచే చెత్తగా ఆడుతున్న ఈ ఓవరాక్షన్ ఆటగాడు.. గుజరాత్తో ఇవాళ (మే 5) జరుగుతున్న మ్యాచ్లో 6 బంతుల్లో 4 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఈ సీజన్లో ఆరు మ్యాచ్లు ఆడిన రియాన్ ఒక్క మ్యాచ్లో కూడా కనీసం 20 పరుగుల స్కోర్ను దాటలేకపోయాడు. సన్రైజర్స్తో మ్యాచ్లో 7 (6), పంజాబ్పై 20 (12), ఢిల్లీపై 7 (11), గుజరాత్పై 5 (7), లక్నోపై 15 నాటౌట్ (12) పరుగులు చేశాడు. మొత్తంగా ఈ సీజన్లో రియాన్ 6 మ్యాచ్ల్లో కేవలం 58 పరుగులు మాత్రమే చేశాడు. పైగా గుజరాత్తో ఇవాల్టి మ్యాచ్లో రాజస్థాన్ యాజమాన్యం ఇతగాడిని ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దించింది. ఈ మ్యాచ్లో రియాన్ విఫలం కావడంతో రాజస్థాన్ అభిమానులు ఏకీ పారేస్తున్నారు. ఈ ఓవరాక్షన్ ఆటగాడిని ఎందుకు ఆడించారు.. పైగా ఇతను ఇంపాక్ట్ ప్లేయర్ అట అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. వీడికి ఆట తక్కువ ఓవరాక్షన్ ఎక్కువ అంటూ బండ బూతులు తిడుతున్నారు. ఏదో పొడుస్తాడని రాజస్థాన్ యాజమాన్యం ఇతనిపై 3.8 కోట్లు పెట్టుబడి పెట్టిందని, వెంటనే ఇతన్ని జట్టు నుంచి తీసిపారేయలని డిమండ్ చేస్తున్నారు. రియాన్ కంటే గల్లీలో ఆడుకునే చిన్న పిల్లలు నయమంటూ ఉతికి ఆరేస్తున్నారు. ఓ పక్క జట్టు మొత్తం విఫలమైన నెటిజన్లు రియాన్నే ఎక్కువగా టార్గెట్ చేశారు. కాగా, సొంత మైదానంలో (జైపూర్) గుజరాత్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. గుజరాత్ బౌలర్ల ధాటికి 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, నూర్ అహ్మద్ 2, షమీ, హార్ధిక్, జాషువ లిటిల్ తలో వికెట్ పడగొట్టారు. రాజస్ణాన్ ఇన్నింగ్స్లో సంజూ శాంసన్ (30) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
ఐపీఎల్-2023లో చెత్తగా ఆడుతుంది వీరే.. వీరితో ఓ జట్టు తయారు చేస్తే ఇలా ..!
ఐపీఎల్-2023లో స్వదేశీ విదేశీ ఆటగాళ్లు అన్న తేడా లేకుండా భారీ అంచనాలు పెట్టుకున్న చాలామంది ఉసూరుమనిపించారు. వీరి చెత్త ప్రదర్శనతో ఫ్రాంచైజీలతో పాటు అభిమానులు సైతం విసిగివేసారిపోయారు. ఇప్పటివరకు (ఏప్రిల్ 30) జరిగిన 42 మ్యాచ్ల్లో ఏయే ఆటగాళ్లు దారుణంగా నిరాశపరిచారో, వారందరిని కలిపి ఓ జట్టుగా తయారు చేస్తే ఇలా ఉంటుంది. ఓపెనర్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా (8 కోట్లు, 6 మ్యాచ్ల్లో 47 పరుగులు), ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (16 కోట్లు, 8 మ్యాచ్ల్లో 184 పరుగులు, ఒక్క హాఫ్సెంచరీ), వన్ డౌన్లో సన్రైజర్స్ మయాంక్ అగర్వాల్ (8.25 కోట్లు, 8 మ్యాచ్ల్లో 169 పరుగులు), నాలుగో స్థానంలో లక్నో దీపక్ హుడా (5.75 కోట్లు, 8 మ్యాచ్ల్లో 52 పరుగులు), ఐదులో రాజస్థాన్ రియాన్ పరాగ్ (3.80 కోట్లు, 5 మ్యాచ్ల్లో 54 పరుగులు), ఆరులో ఆర్సీబీ దినేశ్ కార్తీక్ (5.5 కోట్లు, 8 మ్యాచ్ల్లో 83), ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ (8.75 కోట్లు, 7 మ్యాచ్ల్లో 60 పరుగులు, 3 వికట్లు), ఎనిమిదో ప్లేస్లో ఆర్సీబీ షాబాజ్ అహ్మద్ (2.4 కోట్లు, 8 మ్యాచ్ల్లో 42 పరుగులు, 0 వికెట్లు), 9వ స్థానంలో ముంబై ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్ (8 కోట్లు, 3 మ్యాచ్ల్లో ఒక్క పరుగు, 2 వికెట్లు), 10లో కేకేఆర్ ఉమేశ్ యాదవ్ (2 కోట్లు, 8 మ్యాచ్ల్లో ఒక్క వికెట్, 19 పరుగులు), 11వ స్థానంలో కేకేఆర్ లోకి ఫెర్గూసన్ (10 కోట్లు, 3 మ్యాచ్ల్లో 12.52 ఎకానమీతో ఒక్క వికెట్). వీరు కాక ఇంకా ఎవరైనా చెత్త ప్రదర్శన (కనీసం ఒక్క మ్యాచ్లో కూడా రాణించని వారు) చేసిన ఆటగాళ్లు ఉంటే కామెంట్ చేయండి. -
నీకెందుకు ఈ ఆట.. వెళ్లి డ్యాన్స్లు వేసుకో పో! 3 కోట్లు దండగా..
ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్కు ఊహించని పరాభావం ఎదురైంది. జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో రాజస్తాన్ ఓటమి పాలైంది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఈ మ్యాచ్లో రాజస్తాన్ పరాజయం పాలైంది. 155 పరుగుల స్వల్ప లక్క్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. రాజస్తాన్ బ్యాటర్లలో జైశ్వాల్(44), జోస్ బట్లర్(40) మినహా మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్లో రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ దురదృష్టవశాత్తూ రనౌట్గా వెనుదిరిగాడు. అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన పడిక్కల్, హెట్మైర్ తమ స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయారు. జట్టులో ఇంకా ఎందుకు? హెట్మైర్ ఔటైన తర్వాత ఫినిషర్గా క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ మరోసారి నిరాశపరిచాడు. ఆఖరి వరకు క్రీజులో ఉన్న పరాగ్ తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్లో 12 బంతులు ఎదుర్కొన్న పరాగ్ కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. అతడు తన ఎదుర్కొన్న తొలి 7 బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రాజస్తాన్ విజయానికి కావాల్సిన రన్రేట్ విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాకుండా క్రీజులో ఉన్న మరో బ్యాటర్పై ఒత్తడికూడా పెరిగింది. ఈ క్రమంలో ఆఖరిలో కొంచెం దూకుడుగా ఆడుతోన్న పడిక్కల్ తన వికెట్ను కోల్పోయాడు. దీంతో రాజస్తాన్ ఓటమి ఖారారైంది. ఇక మరోసారి దారుణ ప్రదర్శన కనబరిచిన పరాగ్పై నెటిజన్లు మండిపడుతున్నారు. అతడు స్లో ఇన్నింగ్స్ వల్లే రాజస్తాన్ ఓటమి పాలైందని పోస్టులు చేస్తున్నారు. ఓ యూజర్ స్పందిస్తూ.. నీవు క్రికెట్కు పనికిరావు.. వెళ్లి డ్యాన్స్లు వేసుకోపో అంటూ కామెంట్ చేశాడు. only best thing Riyan Parag can do is pic.twitter.com/94RNuFZamK — PrinCe (@Prince8bx) April 19, 2023 ఆట తక్కువ.. పోజులు ఎక్కువ పరాగ్ 2019లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 52 మ్యాచ్లలో 42 ఇన్నింగ్స్లు ఆడిన రియాన్.. 576 పరుగులు మాత్రమే చేశాడు. పరాగ్ తన ఆటకంటే కూడా మైదానంలో తన చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్-2023కు ముందు రూ. 3.8 కోట్లకు అతడిని రాజస్తాన్ రిటైన్ చేసుకుంది. Riyan Parag is useful as the ‘ueue’ in queue#RRvsLSG pic.twitter.com/EcVX5e4iMN — Akash (@vaderakash) April 19, 2023 చదవండి: IPL 2023: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. ప్రతీ మ్యాచ్లో ఇంతే! తీసి పడేయండి.. -
‘పిచ్చి వేషాలు వేసినా నన్నెవరూ ఏం చేయలేరు; అదే అర్జున్ టెండుల్కర్ను చూడండి!’
IPL 2023 GT Vs RR: రాజస్తాన్ రాయల్స్ యువ ‘ఆల్రౌండర్’ రియాన్ పరాగ్పై విమర్శల వర్షం కురుస్తోంది. వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారుతున్న అతడిని తప్పించాలంటూ అభిమానులు రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్కు సూచిస్తున్నారు. ఆట తక్కువ.. ఓవరాక్షన్ ఎక్కువ ఉన్న రియాన్ను పక్కనపెట్టాల్సిన సమయం వచ్చిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అల్లరి చేష్టలతో రాజస్తాన్ రాయల్స్ తరఫున 2019లో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అరంగేట్రం చేశాడు అసోం కుర్రాడు రియాన్ పరాగ్. చెన్నై సూపర్ కింగ్స్తో తొలి మ్యాచ్ ఆడిన అతడు.. 16 పరుగులు చేశాడు. అదే విధంగా 3 ఓవర్ల బౌలింగ్లో 24 పరుగులు ఇచ్చాడు. అరంగేట్ర మ్యాచ్లో పర్వాలేదనిపించిన రియాన్ పరాగ్.. నాటి నుంచి నేటి దాకా ఆట కంటే కూడా మైదానంలో తన చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. చెత్త ప్రదర్శన గత సీజన్లో కేవలం 183 పరుగులు చేసి ఒక్క వికెట్ మాత్రమే తీసిన రియాన్ పరాగ్.. ఐపీఎల్-2023లోనూ విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 39. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో అతడి ప్రదర్శన మరీ చెత్తగా ఉంది. జట్టు కష్టాల్లో ఉన్న వేళ క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ 7 బంతులు ఎదుర్కొని కేవలం 5 పరుగులు చేశాడు. మేనేజ్మెంట్ వరుస అవకాశాలు ఇస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు అతడి ఆట తీరు, మేనేజ్మెంట్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏం పొడిచాడని? ‘‘తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు 51 మ్యాచ్లలో 41 ఇన్నింగ్స్ ఆడిన రియాన్ పరాగ్ చేసిన పరుగులు 561. సగటు 16.03. బౌలింగ్లోనూ పెద్దగా పొడిచిందేమీ లేదు! అయినా బంధుప్రీతి అంటే ఇదే కాబోలు. వరుసగా ఫెయిల్ అవుతున్నా అవకాశాలు మాత్రం వస్తూనే ఉంటాయి. బంధుప్రీతి అంటే ఇదేనేమో మైదానంలో తన చేష్టలు చూస్తుంటే ఆటకు స్వస్తి చెప్పి త్వరలోనే చీర్ లీడర్స్తో పాటు చేరతాడేమో అనిపిస్తోంది. ఆటపై దృష్టి పెట్టకుండా ప్రత్యర్థి బ్యాటర్లు అవుటైనపుడు వెకిలిగా వ్యవహరించడం.. తనను జట్టు నుంచి తీసివేసే దమ్ము ఎవరికీ లేదన్నట్లు ప్రవర్తించడం రియాన్కు చెల్లింది. రాజస్తాన్ ఓనర్లతో సంబంధాలు బాగున్నాయి(రియాన్ అంకుల్కు సెలక్షన్ మెంబర్తో దోస్తీ ఉందన్న ఉద్దేశంలో) గనుకే రియాన్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాడు. అర్జున్ను చూడండి అదే అర్జున్ టెండుల్కర్ విషయంలో చూడండి. తన తండ్రి సచిన్ టెండుల్కర్కు ముంబై ఇండియన్స్తో సత్సంబంధాలు ఉన్నా 2-3ఏళ్ల పాటు బెంచ్ మీదే ఉన్నాడు. ఈరోజు అరంగేట్రం చేశాడు’’ అంటూ ఈ 21 ఏళ్ల బ్యాటింగ్ ఆల్రౌండర్ను నెట్టింట కామెంట్లతో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. కాగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో రాజస్తాన్ ఆఖరి ఓవర్ వరకు పోరాడి 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: చెత్తగా ప్రవర్తించారు.. నితీశ్ రాణా, హృతిక్కు బీసీసీఐ షాక్! సూర్యకు భారీ జరిమానా 2019- He is a Kid and he's learning. 2020- He is a Kid and he's learning. 2021- He is a Kid and he's learning. 2022- He is a Kid and he's learning. 2023- He is a Kid and he's learning 2040- He is a Kid and he's still learning. Lord Riyan Parag pic.twitter.com/WnunyQ0dpZ — StrawHat Luffy (@PirateKing200) April 16, 2023 Just Riyan Parag things✨#RRvsGT pic.twitter.com/opGLPOa0TI — Abisek (@mayyena) April 16, 2023 A guy who got Govt job in IPL#riyanparag #GTvRR #KKRvsMI pic.twitter.com/YtCeoZq6ZR — JimmyCarter (@ImJimmyCarter) April 16, 2023 WHAT. A. GAME! 👌 👌 A thrilling final-over finish and it's the @rajasthanroyals who edge out the spirited @gujarat_titans! 👍 👍 Scorecard 👉https://t.co/nvoo5Sl96y#TATAIPL | #GTvRR pic.twitter.com/z5kN0g409n — IndianPremierLeague (@IPL) April 16, 2023 -
Ranji Trophy: 28 బంతుల్లోనే 78 పరుగులు సహా.. 8 వికెట్లు కూల్చి
Ranji Trophy 2022-23 - Hyderabad vs Assam: రంజీ ట్రోఫీ టోర్నీ 2022-23లో తొలి విజయం సాధించాలన్న హైదరాబాద్ ఆశలపై అస్సాం నీళ్లు చల్లింది. శుక్రవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 18 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్న హైదరాబాద్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ అజేయ సెంచరీ వృథాగా పోయింది. రాణించిన బౌలర్లు! కాగా ఎలైట్ బీ గ్రూపులో ఉన్న హైదరాబాద్- అస్సాం జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో మంగళవారం టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రవితేజ(4/53), కార్తికేయ(3/43)కు తోడుగా అజయ్ దేవ్ గౌడ్, త్యాగరాజన్, భగత్ వర్మ ఒక్కో వికెట్తో రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో అస్సాంను 205 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఓపెనర్ రోహిత్ రాయుడు 60, తొమ్మిదో స్థానంలో వచ్చిన భగత్ వర్మ 46 పరుగులతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్ను 208 పరుగుల వద్ద ముగించగలిగింది. తన్మయ్ ఒంటరి పోరాటం వృథా ఇక రెండో ఇన్నింగ్స్లో అస్సాం 252 పరుగులకు ఆలౌట్ కాగా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 61 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు సాధించింది. ఈ క్రమంలో విజయానికి 22 పరుగుల దూరంలో నిలిచిన హైదరాబాద్.. శుక్రవారం కార్తికేయ అవుట్ కావడంతో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో జట్టును గెలిపించాలని తాపత్రయపడ్డ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (158 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 126 పరుగులు- నాటౌట్) ఒంటరి పోరాటం వృథాగా పోయింది. అదరగొట్టిన రియాన్ పరాగ్ ఆల్రౌండ్ ప్రతిభతో రాణించిన అస్సాం ఆటగాడు రియాన్ పరాగ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్తో మ్యాచ్లో మొత్తంగా 88 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో కేవలం 28 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేయడం విశేషం. అంతేకాదు రియాన్.. ఏకంగా 8 వికెట్లు కూల్చడం గమనార్హం. కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్న ఈ లెగ్ బ్రేక్ స్పిన్నర్ అస్సాం గెలుపొందడంలో తన వంతు సాయం చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక రియాన్ ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్లో సభ్యుడన్న సంగతి తెలిసిందే. చదవండి: Rishabh Pant Health: ప్లాస్టిక్ సర్జరీ?! పంత్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏమన్నారంటే.. Rishabh Pant: ఉదయమే పంత్ గురించి ఆలోచించా.. ఇంతలో ఇలా Rest in Power- ‘King’ Pele: అల్విదా కింగ్.. పీలే రాకముందు అసలు ఫుట్బాల్ అంటే కేవలం.. -
రియాన్ పరాగ్ ఊచకోత.. 12 ఫోర్లు, 12 సిక్సర్లతో భారీ విధ్వంసం
VHT 2022 Quarter Finals: విజయ్ హజారే ట్రోఫీ-2022లో భాగంగా నిన్న (నవంబర్ 28) జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో వివిధ జట్లకు చెందిన ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఉత్తర్ప్రదేశ్తో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (159 బంతుల్లో 220; 10 ఫోర్లు, 16 సిక్సర్లు).. ఒకే ఓవర్లో 7 సిక్సర్లు బాది అజేయమైన ద్విశతకంతో విధ్వంసం సృష్టించగా, జమ్మూ కశ్మీర్తో జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో అస్సాం ఆటగాడు, రాజస్తాన్ రాయల్స్ (ఐపీఎల్) ప్లేయర్ రియాన్ పరాగ్ 116 బంతుల్లో 12 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 174 పరుగులు సాధించి ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. రుతురాజ్ ఒకే ఓవర్లో 7 సిక్సర్ల రికార్డుతో పలు లిస్ట్-ఏ క్రికెట్ రికార్డులను బద్దలు కొట్టడంతో రియాన్ పరాగ్ సునామీ ఇన్నింగ్స్ హైలైట్ కాలేకపోయింది. పరాగ్ సైతం రుతురాజ్ తరహాలోనే ప్రత్యర్ధి బౌలర్లను ఓ రేంజ్లో ఆటగాడుకున్నాడు. ఫలితంగా అస్సాం.. ప్రత్యర్ధి నిర్ధేశించిన 351 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 23 బంతులుండగానే ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జమ్మూ కశ్మీర్..శుభమ్ కజూరియా (120), హెనన్ నజీర్ (124) శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 350 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో రియాన్ పరాగ్, రిషవ్ దాస్ (114 నాటౌట్) శతకాలతో విజృంభించడంతో అస్సాం ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని చేరుకుని సెమీఫైనల్కు అర్హత సాధించింది. కాగా, రేపు (నవంబర్ 30) జరుగబోయే సెమీఫైనల్ మ్యాచ్ల్లో కర్ణాటక-సౌరాష్ట్ర, మహారాష్ట్ర-అస్సాం జట్లు తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్ల్లో విజేతలు డిసెంబర్ 2న జరిగే ఫైనల్ మ్యాచ్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
IPL 2023: ఆ ఫ్రాంచైజీలకు వారిపై ఎంత నమ్మకమో.. దారుణంగా విఫలమైనా..!
కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగబోయే ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలం కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు మొదలయ్యాయి. వేలంలో ప్రక్రియలో భాగంగా ఆటగాళ్లను అట్టిపెట్టుకుని, వదిలించుకునే ప్రాసెస్ రెండు రోజుల కిందటే (నవంబర్ 15) పూర్తయ్యింది. ఇక మిగిలింది మినీ వేలం ప్రక్రియ మాత్రమే. వచ్చే నెలలో జరిగే ఈ తంతులో ఆయా ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్లతో పాటు కొత్త ఆటగాళ్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఐపీఎల్ 16వ ఎడిషన్ భారత్ వేదికగా 2023 మార్చి 20-మే 28 మధ్యలో జరుగనున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ సీజన్లో మొత్తం 74 మ్యాచ్లు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే, గత సీజన్లో ఆశించిన మేరకు రాణించలేకపోయినా కొందరు ఆటగాళ్లను ఆయా ప్రాంచైజీలు అట్టిపెట్టుకోవడం విశేషం. 2022 సీజన్లో దారుణంగా విఫలమైన వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్), సునీల్ నరైన్ (కేకేఆర్), మాథ్యూ వేడ్ (గుజరాత్ టైటాన్స్), షారుఖ్ ఖాన్ (పంజాబ్ కింగ్స్), రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్)లపై సంబంధిత ఫ్రాంచైజీలు పూర్తి నమ్మకంతో వారిని కొనసాగించేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. గత రెండు సీజన్లుగా కేకేఆర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటేశ్ అయ్యర్, 2021 సీజన్లో అద్భుతాలు చేసినప్పటికీ.. గత సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. 2022 సీజన్లో అతనాడిన 12 మ్యాచ్ల్లో 107.69 స్ట్రయిక్ రేట్తో కేవలం 182 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. పార్ట్ టైమ్ ఆల్రౌండర్ అయిన అయ్యర్ సీజన్ మొత్తంలో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. సునీల్ నరైన్ విషయానికొస్తే.. కేకేఆర్కే ప్రాతినిధ్యం వహించే ఈ విండీస్ ఆల్రౌండర్ గత సీజన్లో దారుణంగా నిరాశపరిచాడు. 2022 సీజన్లో అతను ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 71 పరుగులు మాత్రమే చేసి, 9 వికెట్లు పడగొట్టాడు. 11 ఏళ్ల తర్వత ఐపీఎల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆసీస్ వికెట్కీపర్ మాథ్యూ వేడ్.. 2022 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ సీజన్లో మొత్తం 10 మ్యాచ్లు ఆడిన వేడ్.. 113.77 స్ట్రయిక్ రేట్తో కేవలం 157 పరుగులు మాత్రమే చేశాడు. వేడ్కు 2011 ఐపీఎల్ సీజన్లో ఏమంత మెరుగైన రికార్డు లేదు. ఆ సీజన్లో 3 మ్యాచ్లు ఆడిన అతను 66.66 స్ట్రయిక్ రేట్తో కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. 2022 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఏకంగా 9 కోట్ల పెట్టి దక్కించుకున్న షారుఖ్ ఖాన్.. గత సీజన్లో 8 మ్యాచ్లు ఆడి 108 స్ట్రయిక్ రేట్తో కేవలం 117 పరుగులు మాత్రమే చేసి ఫ్రాంచైజీ అతనిపై పెట్టుకున్న ఆశలను అడియాశలు చేశాడు. అండర్-19 వరల్డ్కప్ ద్వారా వెలుగులోకి వచ్చి 2019 సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రియాన్ పరాగ్, గత సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఘోరంగా విఫలమయ్యాడు. ఆ సీజన్లో 17 మ్యాచ్లు ఆడిన పరాగ్ 138. 64 స్ట్రయిక్ రేట్తో కేవలం 183 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో ఒక్క వికెట్ దక్కించుకున్నాడు. పై పేర్కొన్న ఐదుగురు ఆటగాళ్లు గత సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ.. సంబంధిత జట్లు వారిపై విశ్వాసం వ్యక్తం చేసి మరో అవకాశాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా భారీ ధర పెట్టి సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, రియాన్ పరాగ్లను వారి ఫ్రాంచైజీలు రిలీజ్ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చదవండి: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే! -
రియాన్ పరాగ్ ఊచకోత.. కెరీర్లో తొలి శతకం బాదిన రాజస్తాన్ రాయల్స్ ఆల్రౌండర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించే యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ (అస్సాం).. విజయ్ హజారే వన్డే ట్రోఫీ-2022లో భాగంగా నిన్న (నవంబర్ 12) రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి లిస్ట్-ఏ క్రికెట్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 84 బంతులు ఎదుర్కొన్న పరాగ్.. 10 ఫోర్లు, 6 భారీ సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అస్సాం.. రియాన్ పరాగ్ సెంచరీతో కదం తొక్కడంతో 46.5 ఓవర్లలో 271 పరుగులు చేసి ఆలౌటైంది. పరాగ్ మినహా మరే ఇతర బ్యాటర్ రాణించకపోవడంతో అస్సాం తమ కోటా ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయింది. పరాగ్ తర్వాత నెక్స్ టాప్ స్కోరర్గా ముక్తర్ హుసేన్ (39) ఉన్నాడు. అనంతరం 272 పరుగల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్.. అస్సాం బౌలర్లు మ్రిన్మోయ్ దత్తా (3/34), అవినోవ్ చౌదరీ (3/25), రజాకుద్దీన్ అహ్మద్ (2/25), ముక్తర్ హుసేన్ (1/17) ధాటికి 128 పరుగులకే ఆలౌటైంది (33.3 ఓవర్లలో). ఫలితంగా అస్సాం 143 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. చదవండి: Vijay Hazare Trophy: రోహిత్ రాయుడు, తిలక్ వర్మ సెంచరీలు -
'ఆ ఆటగాడు దండగ.. ఏ లెక్కన ఆడించారో కాస్త చెప్పండి'
ఐపీఎల్ 2022 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఆటతీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సీజన్లో రాజస్తాన్ తరపున వ్యర్థమైన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది రియాన్ పరాగేనని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. అసలు సీజన్లో పరాగ్ది ఏ రోల్ అనేది(ఉదా: బ్యాటింగ్, బౌలర్, ఆల్రౌండర్) క్లారిటీ లేదని తెలిపారు. గత సీజన్లో కొన్ని మంచి ఇన్నింగ్స్లతో పేరు పొందిన రియాన్ పరాగ్.. ఐపీఎల్ 15వ సీజన్లో సూపర్గా రాణిస్తాడని అంతా భావించారు. PC: IPL Twitter కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 15 మ్యాచ్ల్లో ఒకే ఒక్క అర్థశతకంతో 183 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పరాగ్ బ్యాటింగ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. బట్లర్ విఫలమయ్యాడు.. ప్రధాన బ్యాటర్స్ అంతా అప్పటికే వెనుదిరిగారు. ఇక క్రీజులో ఉన్న రియన్ పరాగ్ ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ అనుకుంటే కనీసం రాజస్తాన్ పోరాడే స్కోరు అందించినా బాగుండేది. అలా జరగకపోగా.. చివరి వరకు నిలిచిన పరాగ్ 15 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 15 పరుగులు చేసి చివరి బంతికి ఔటయ్యాడు. అతని కంటే బౌల్ట్, మెకాయ్లు చాలా నయం.. ఎందుకుంటే వాళ్లిదరు రెండు సిక్సర్లు బాది 19 పరుగులు జత చేసి వెళ్లారు. ఇక గత సీజన్లో మంచి స్ట్రైక్రేట్ కలిగిన పరాగ్.. తన చెత్త ఆటతీరుతో ఈ సీజన్లో అశ్విన్ తర్వాత బ్యాటింగ్కు రావడం అతని పరిస్థితిని తెలియజేస్తుంది. ఇంత ఘోరంగా విఫలమైనప్పటికి సంజూ శాంసన్ పరాగ్కు ఇన్ని అవకాశాలు ఎందుకు ఇచ్చాడనేది ప్రశ్నార్థకమే. దీనికి తోడూ పరాగ్ క్యాచ్ పట్టినా.. రనౌట్ చేసినా.. బ్యాటింగ్లో ఫోర్ లేదా సిక్సర్ బాదిన.. అతను చేసే ఓవర్ యాక్షన్ తట్టుకోవడం అభిమానులకు కష్టంగా మారింది. రియాన్ పరాగ్పై వచ్చిన ఫన్నీ ట్రోల్స్పై ఒక లుక్కేయండి. Riyan Parag didn’t take a single of the 1st bowl of shami and also hits a six…but honestly im still wondering what is riyan specialised in…??? Feel obed mccoy was more capable of hitting sixes than Riyan…Riyan 15ball 15runs n then bowled by shami 🤦♂️🤦♂️🤦♂️ @rajasthanroyals — Samip Rajguru (@samiprajguru) May 29, 2022 When R Ashwin came to play at number 5 it was proven that the team does not have a strong batting lineup. The overhyped player Riyan Parag did nothing, he didn't even try to hit big shots when only a few balls were left for the inning. #RRvGT #IPLFinals — Ali shaikh (@alishaikh3310) May 29, 2022 Trent Boult + Obed McCoy - 19(12) with 2 sixes Riyan Parag - 15(15) with one four I still don't know his role in the team — mister t-man (@techsaturation) May 29, 2022 ఇక ఐపీఎల్ 2022 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ చివరి వరకు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. 2008 తర్వాత మరోసారి ఫైనల్ చేరిన రాజస్తాన్ రెండోసారి కప్ కొట్టబోతుందని చాలా మంది అభిమానులు భావించారు. అయితే ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో ఫేలవ ప్రదర్శనతో ఓటమిపాలై రెండోసారి టైటిల్ కొట్టాలన్న కలను నెరవేర్చుకోలేకపోయింది. అయితే ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఒక మ్యాచ్ గెలిచింది అంటే ఆ మ్యాచ్లో బట్లర్ మెరుపులు మెరిపించాడు అనేంతలా పేరొచ్చింది. ఎందుకంటే రాజస్తాన్ బ్యాటింగ్లో బట్లర్ ఒక ఎత్తు అయితే.. మిగతావారు మరొక ఎత్తు. జట్టుకు బట్లర్ బలం.. అతనే బలహీనత. మొత్తానికి సీజన్లో రన్నరప్గా నిలిచిన రాజస్తాన్ రాయల్స్ వచ్చే సీజన్లోనైనా కప్ కొడుతుందేమో చూడాలి. చదవండి: Trolls On GT IPL 2022 Win: 'ఊహించిందే జరిగింది.. మ్యాచ్ ఫిక్సింగ్ గట్రా.. ఏమి లేవుగా?!' IPL 2022 Winner: క్రెడిట్ మొత్తం ఆయనకేనన్న హార్దిక్.. అంతా అబద్ధం! కాదు నిజమే! -
ఓవర్ యాక్షన్ అనిపించే రియాన్ పరాగ్ ఖాతాలో అరుదైన రికార్డు
రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఐపీఎల్లో అరుదైన ఫీట్ సాధించాడు. ఈ సీజన్లో బ్యాటింగ్లో పెద్దగా మెరవనప్పటికి పరాగ్ ఒక కొత్త రికార్డు సాధించాడు. ఒక సీజన్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న రెండో ఆటగాడిగా రియాన్ పరాగ్ నిలిచాడు. గుజరాత్ టైటాన్స్తో ఫైనల్లో మాథ్యూ వేడ్ రియాన్ పరాగ్ అందుకున్న క్యాచ్ 17వది. తద్వారా ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక క్యాచ్లు తీసుకున్న జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో ఏబీ డివిలియర్స్(2016లో 19 క్యాచ్లు), కీరన్ పొలార్డ్(15 క్యాచ్లు, 2015 సీజన్) మూడో స్థానంలో, డ్వేన్ బ్రావో(2013 సీజన్), డేవిడ్ మిల్లర్లు(2014 సీజన్) 14 క్యాచ్లతో సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నారు. కాగా పరాగ్ ఫైనల్ మ్యాచ్ పూర్తయ్యేలోపు మరో రెండు క్యాచ్లు అందుకుంటే డివిలయర్స్తో సమానంగా.. మూడు క్యాచ్లు అందుకుంటే అత్యధిక క్యాచ్లు తీసుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. ఇక సీజన్లో రియాన్ పరాగ్ బ్యాటింగ్లో పెద్దగా రాణించింది లేదు. ఓవర్ యాక్షన్కు మారుపేరుగా నిలిచిన పరాగ్ 17 మ్యాచ్ల్లో 183 పరుగులు మాత్రమే చేశాడు. అతని ఖాతాలో ఒకే ఒక్క అర్థసెంచరీ ఉంది. చదవండి: Jos Buttelr: కోహ్లి రికార్డు బద్దలు కాలేదు.. రాజస్తాన్ ఓపెనర్ది చరిత్రే -
'అతడు అద్భుతమైన ఫీల్డర్... ఫీల్డింగ్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను'
రాజస్తాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్పై ఆ జట్టు బౌలింగ్ కోచ్, శ్రీలంక లెజెండ్ లసిత్ మలింగ ప్రశంసల వర్షం కురిపించాడు. పరాగ్ అద్భుతమైన ఫీల్డింగ్ తనను ఎంతగానో ఆకట్టుకుందని మలింగ తెలిపాడు. కాగా ఈ ఏడాది సీజన్లో పరాగ్ ఇప్పటివరకు 16 క్యాచ్లను అందుకున్నాడు. తద్వారా ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్(వికెట్ కీపర్ కాకుండా) గా పరాగ్ రికార్డు సాధించాడు. గత 15 మ్యాచ్లలో రియాన్ ఫీల్డింగ్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అతడికి చాలా ఎనర్జీ ఉంది. అతడు మంచి అథ్లెటిక్. అతడికి బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు రాలేదు. కానీ ఫీల్డ్లో మాత్రం తన ఫీల్డింగ్తో అద్భుతం చేస్తున్నాడు. మరే ఇతర జట్టులో కూడా ఇటువంటి ఫీల్డింగ్ను మీరు చూసిఉండరు" అని మలింగ పేర్కొన్నాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా ఆదివారం ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. చదవండి: IPL 2022: ఫైనల్కు 6000 మంది పోలీసులతో భారీ భద్రత.. కారణం అదేనా? -
IPL 2022: అశ్విన్పై రియాన్ పరాగ్ గుస్సా.. ఏంటిది? వీడియో వైరల్
IPL 2022 GT Vs RR: ఐపీఎల్-2022 ఫైనల్ చేరాలంటే గెలవాల్సిన కీలక మ్యాచ్లో రాజస్తాన రాయల్స్కు పరాభవమే ఎదురైంది. మంచి స్కోరు నమోదు చేసినప్పటికీ గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 40 పరుగులు), డేవిడ్ మిల్లర్(38 బంతుల్లో 68 పరుగులు) విజృంభణతో ఓటమిపాలైంది. వీరిద్దరు ఆఖరి వరకు అజేయంగా నిలిచి గుజరాత్ టైటాన్స్ను ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. కాగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్తాన్కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. జోస్ బట్లర్(89 పరుగులు), కెప్టెన్ సంజూ శాంసన్(47 పరుగులు), పడిక్కల్(28) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఇదిలా ఉంటే.. ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ పట్ల వ్యవహరించిన తీరు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాజస్తాన్ ఇన్నింగ్స్ 20వ ఓవర్లో అశ్విన్ క్రీజులో ఉండగా యశ్ దయాల్ బంతిని సంధించాడు. ఇది వైడ్గా వెళ్లింది. ఈ క్రమంలో అశ్విన్తో సమన్వయం చేసుకోకుండానే పరుగుకు యత్నించిన రియాన్ పరాగ్ రనౌట్ అయ్యాడు. అంతేగాక అశ్విన్వైపు సీరియస్గా చూస్తూ రన్ ఎందుకు తీయలేదు అన్నట్లు లుక్కు ఇచ్చాడు. అశూ మాత్రం క్రీజులో అలాగే ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీనియర్ పట్ల ఇలాగేనా వ్యవహరించేది అని నెటిజన్లు రియాన్ పరాగ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల తన విచిత్రమైన సెలబ్రేషన్స్తో పరాగ్ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలిచి గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో ప్రవేశించింది. ఐపీఎల్ క్వాలిఫైయర్-1: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ స్కోర్లు 👉🏾టాస్- గుజరాత్ 👉🏾రాజస్తాన్ రాయల్స్- 188/6 (20) 👉🏾గుజరాత్ టైటాన్స్- 191/3 (19.3) 👉🏾7 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం 👉🏾ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డేవిడ్ మిల్లర్(38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు-నాటౌట్) చదవండి👉🏾Hardik Pandya: దీనంతటికీ కారణం వాళ్లే.. ఉప్పొంగిపోను! అతడిని చూసి గర్వపడుతున్నా! చదవండి👉🏾LSG Vs RCB: లక్నో 5 ఓటములు ఆ 3 జట్ల చేతిలోనే.. మరి ఆర్సీబీని ఓడిస్తుందా? నిలిచేది ఎవరు? pic.twitter.com/urWTl8s653 — ChaiBiscuit (@Biscuit8Chai) May 24, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Congratulations to the @gujarat_titans as they march into the Final in their maiden IPL season! 👏 👏 Stunning performance by @hardikpandya7 & Co to beat #RR by 7⃣ wickets in Qualifier 1 at the Eden Gardens, Kolkata. 🙌 🙌 Scorecard ▶️ https://t.co/O3T1ww9yVk#TATAIPL | #GTvRR pic.twitter.com/yhpj77nobA — IndianPremierLeague (@IPL) May 24, 2022 -
ఎంత గొడవపడితే.. ఇది పద్దతి కాదు హర్షల్ పటేల్
రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్లో రియాన్ పరాగ్, హర్షల్ పటేల్ మధ్య గొడవ చర్చనీయాంశంగా మారింది. మాటలతో మొదలైన గొడవ దాదాపు కొట్టుకునేస్థాయి వరకు వెళ్లింది. విషయంలోకి వెళితే.. రాజస్తాన్ టాప్ ఆర్డర్ విఫలమైన వేళ రియాన్ పరాగ్ తొలిసారి బ్యాటింగ్లో మెరిశాడు. 31 బంతుల్లో 56 పరుగులు చేసిన పరాగ్.. హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ సహా మొత్తం 18 పరుగులు రాబట్టాడు. కాగా ఆఖరి బంతికి డీప్ మిడ్వికెట్ మీదుగా కళ్లు చెదిరే సిక్సర్ కొట్టాడు. దీంతో చిర్రెత్తిపోయిన హర్షల్ పరాగ్వైపు కోపంగా చూస్తూ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తానేమైనా తక్కువ తిన్నానా అన్నట్లు పరాగ్ కూడా హర్షల్కు కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఒకరిపైకి ఒకరు దూసుకొచ్చారు. ఇంతలో రాజస్తాన్ ఆటగాళ్లు వెళ్లి పరాగ్ను దూరంగా తీసుకెళ్లారు. ఆర్సీబీ ఆటగాళ్లు కూడా హర్షల్ను కూల్ చేశారు. దీంతో వివాదం ఇక్కడికి ముగిసింది అని మనం అనుకున్నాం. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా పరాగ్- హర్షల్ పటేల్ల గొడవకు ముగింపు లేదని అర్థమైంది. మ్యాచ్ పూర్తైన అనంతరం ఇరుజట్లు కరచాలనం చేయడం ఆనవాయితీ. ఎంత గొడవపడినా ఇరుజట్ల ఆటగాళ్లు సారీ చెప్పుకునే సందర్బం ఉంటుంది. కానీ హర్షల్ పటేల్ మాత్రం ఆనవాయితీని తుంగలో తొక్కాడు. పరాగ్ వచ్చి హర్షల్కు షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నించినప్పటికి.. అతను కనీసం మొహం కూడా చూడలేదు. పరాగ్తో చేతులు కలపడానికి ఇష్టపడని హర్షల్ వేరే ఆటగాడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Courtesy: IPL Twitter ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రాజస్తాన్ రాయల్స్ 29 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రియాన్ పరాగ్ (31 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం బెంగళూరు 19.3 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ డుప్లెసిస్ (21 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. కుల్దీప్ సేన్ (4/20) రాణించగా, అశ్విన్ 3 వికెట్లు, ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు తీశారు. చదవండి: పరాగ్, హర్షల్ పటేల్ మధ్య గొడవ.. కొట్టుకునేంత పని చేశారు This was after 2 sixes were hit off the last over pic.twitter.com/qw3nBOv86A — ChaiBiscuit (@Biscuit8Chai) April 26, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐపీఎల్ చరిత్రలో మూడో ఆటగాడిగా రియాన్ పరాగ్..
మంగళవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ ఆటగాడు రియాన్ పరాగ్ వన్మ్యాన్ షో చేశాడు. గత నాలుగు సీజన్లుగా రాజస్తాన్ తరఫున 37 మ్యాచ్లు ఆడినా... 387 పరుగులే చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ వచ్చిన పరాగ్ ఎట్టకేలకు చక్కటి షాట్లతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 32 పరుగుల వద్ద హసరంగ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పరాగ్ 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్యాటింగ్లో రాణించిన పరాగ్ 4 క్యాచ్లు కూడా అందుకొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవడం విశేషం. ఈ నేపథ్యంలోనే రియాన్ పరాగ్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఒక ఐపీఎల్ మ్యాచ్లో 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేయడంతోపాటు నాలుగు క్యాచ్లు తీసుకున్న మూడో ప్లేయర్గా పరాగ్ నిలిచాడు. గతంలో కలిస్ (కోల్కతా నైట్రైడర్స్; డెక్కన్ చార్జర్స్పై 2011లో), గిల్క్రిస్ట్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్; చెన్నై సూపర్ కింగ్స్పై 2012లో) ఈ ఘనత సాధించారు. కాగా ఇదే మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్తో పరాగ్ గొడవ చర్చనీయాంశంగా మారింది. హర్షల్ వేసిన చివరి ఓవర్లో పరాగ్ 2 సిక్స్లు, ఫోర్తో మొత్తం 18 పరుగులు రాబట్టాడు. కాగా ఆఖరి బంతికి పరాగ్ భారీ సిక్స్ బాదాడు. ఈ క్రమంలో రియాన్ పరాగ్, హర్షల్ పటేల్కి మధ్య మాటల యుద్దం జరిగింది. రాజస్తాన్ ఇన్నింగ్స్ను ఫినిష్ చేసి పెవిలియన్కు వెళ్తున్న పరాగ్.. హర్షల్ పటేల్ను ఉద్దేశించి ఏదో అన్నాడు. అది విన్నహర్షల్ పటేల్ పైపైకి వచ్చాడు. వెంటనే రాజస్తాన్ రాయల్స్ సహాయక సిబ్బందిలో ఒకరు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: రియాన్ పరాగ్ వన్మ్యాన్ షో.. రాజస్తాన్ ‘రాయల్’గా గెలిచింది var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రియాన్ పరాగ్ వన్మ్యాన్ షో.. రాజస్తాన్ ‘రాయల్’గా గెలిచింది
పుణే: బ్యాటింగ్ బలంతో వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన రాజస్తాన్ రాయల్స్ ఈసారి బౌలింగ్లో సత్తా చాటింది. టాప్ బ్యాటర్లంతా విఫలమై తక్కువ స్కోరుకే పరిమితమైనా... బౌలర్లు సమష్టిగా సత్తా చాటడంతో దానిని నిలబెట్టుకోగలిగింది. మంగళవారం జరిగిన పోరులో రాజస్తాన్ 29 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రియాన్ పరాగ్ (31 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం బెంగళూరు 19.3 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ డుప్లెసిస్ (21 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. కుల్దీప్ సేన్ (4/20) రాణించగా, అశ్విన్ 3 వికెట్లు, ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు తీశారు. బట్లర్ విఫలం... సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో సిక్స్ కొట్టిన పడిక్కల్ (7) అదే ఓవర్లో వెనుదిరగ్గా... అనూహ్యంగా అశ్విన్ (9 బంతుల్లో 17; 4 ఫోర్లు) మూడో స్థానంలో బరిలోకి దిగాడు. సిరాజ్ బౌలింగ్లోనే నాలుగు ఫోర్లు బాదిన అశ్విన్ అతని బౌలింగ్లోనే రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. అయితే రాజస్తాన్కు అసలు షాక్ తర్వాతి ఓవర్లో తగిలింది. అత్యద్భుత ఫామ్తో జట్టును నడిపిస్తున్న జోస్ బట్లర్ (8) ఈసారి విఫలమయ్యాడు. ఈ దశలో కెప్టెన్ సంజు సామ్సన్ (21 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్లు) జట్టును ఆదుకున్నాడు. హసరంగ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన అతను షహబాజ్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు బాదాడు. అయితే చివరకు హసరంగ బౌలింగ్లోనే అతను క్లీన్బౌల్డ్ కాగా, డరైల్ మిచెల్ (16), హెట్మైర్ (3) ప్రభావం చూపలేకపోయారు. ఒక దశలో 44 బంతుల పాటు బౌండరీనే రాలేదు! ఇలాంటి స్థితిలో పరాగ్ ఆట రాజస్తాన్కు గౌరవప్రదమైన స్కోరు అందించింది. గత నాలుగు సీజన్లుగా రాజస్తాన్ తరఫున 37 మ్యాచ్లు ఆడినా... 387 పరుగులే చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ వచ్చిన పరాగ్ ఎట్టకేలకు చక్కటి షాట్లతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 32 పరుగుల వద్ద హసరంగ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పరాగ్ 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హర్షల్ వేసిన చివరి ఓవర్లో పరాగ్ 2 సిక్స్లు, ఫోర్తో మొత్తం 18 పరుగులు రాబట్టాడు. సమష్టి వైఫల్యం... ఛేదనలో ఏ దశలోనూ బెంగళూరు పోటీలో ఉన్నట్లుగా కనిపించలేదు. గత మ్యాచ్ బ్యాటింగ్ వైఫల్యాన్ని ఇక్కడా కొనసాగిస్తూ ఒక్క బ్యాటర్ దూకుడుగా ఆడలేకపోగా, చెప్పుకోదగ్గ భాగస్వామ్యం ఒక్కటీ నమోదు కాలేదు. ఓపెనర్గా వచ్చిన విరాట్ కోహ్లి (9) మళ్లీ పేలవ షాట్తో వెనుదిరగ్గా, కుల్దీప్ సేన్ వరుస బంతుల్లో డుప్లెసిస్, మ్యాక్స్వెల్ (0)లను అవుట్ చేసి పెద్ద దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత ఆరు పరుగుల వ్యవధిలో పటిదార్ (16), సుయాశ్ (2) ఆట ముగిసింది. అయితే విజయం కోసం 50 బంతుల్లో 79 పరుగులు చేయాల్సిన స్థితిలో క్రీజ్లోకి వచ్చిన దినేశ్ కార్తీక్ (6) అనవసరపు సింగిల్కు ప్రయత్నించి రనౌట్ కావడంతో ఆర్సీబీ గెలుపు ఆశలు కోల్పోయింది. బ్యాటింగ్లో రాణించిన పరాగ్ 4 క్యాచ్లు కూడా అందుకోవడం విశేషం. That's that from Match 39.@rajasthanroyals take this home by 29 runs. Scorecard - https://t.co/fVgVgn1vUG #RCBvRR #TATAIPL pic.twitter.com/9eGWXFjDCR — IndianPremierLeague (@IPL) April 26, 2022