selfie video
-
మరో వివాదంలో ఎమ్మెల్యే కొలికపూడి
సాక్షి,ఎన్టీఆర్జిల్లా:ఎప్పుడూ వివాదాల్లో ఉండే తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. గురువారం(ఫిబ్రవరి 6) తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్త పల్లికంటి డేవిడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేకే ఆత్మహత్యచేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో డేవిడ్ చెప్పడం సంచలనమైంది. ‘పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశా. కొలికపూడి దళిత ఎమ్మెల్యే అయినప్పటికీ దళితుడినైన నన్ను ఎమ్మెల్యే వేధిస్తున్నారు. నాపై అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. నాలాంటోళ్లు ఎంతో మంది పైకి చెప్పుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యే వేధింపులతో ఇక బతకడం అనవసరం. నా చావుతోనైనా తిరువూరు పార్టీ కార్యకర్తలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా. కొలికపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’అని సెల్ఫీ వీడియోలో డేవిడ్ విజ్ఞప్తి చేశాడు. తన కుటుంబానికి చంద్రబాబే న్యాయం చేయాలని కోరాడు. ప్రస్తుతం డేవిడ్ విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, కొలికపూడిపై ఇటీవల సొంత పార్టీలో ఫిర్యాదులు ఎక్కువవడంతో పార్టీ క్రమశిక్షణ సంఘం కూడా ఆయనను సంజాయిషీ కోరింది. గతంలో దళిత క్రైస్తవుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కొలికపూడి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. -
గర్ల్ఫ్రెండ్ని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే ప్రాణమే పోయింది
కొందరు వెర్రితో చేసే పిచ్చి స్టంట్లు భయానకంగానూ, ప్రాణాంతకంగానూ ఉంటాయి. కనీసం ఇలాంటివి చేసే ముందు వికటిస్తే ఏమవుతుందో అనే ధ్యాస లేకుండా అనాలోచితంగా చేసేస్తారు. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే వాళ్ల కథ విషాదాంతంగా ముగిసిపోతుంటుంది. అలాంటి ఘటనే ఇది.ఓ జూ సంరక్షకుడు గర్ల్ఫ్రెండ్(Girlfriend)ని ఇంప్రెస్ చేద్దాం అనుకుని చేసిన పనికి ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఉజ్బెకిస్తాన్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..44 ఏళ్ల జూకీపర్(zookeeper) తన గర్ల్ఫ్రెండ్ని ఇంప్రెస్ చేద్దామన్న ఉద్దేశ్యంతో ఓ స్టంట్ చేయాలనుకున్నాడు. అందుకోసం తెల్లవారుజామున 5 గంటలకు సింహాల గుహ(Lion Den)కు చేరుకుని సెల్ఫీ వీడియో(Selfie Video) తీసుకుంటున్నాడు. ముందుగా మూడు పెద్ద సింహాలు ఉన్న బోనులోకి వెళ్లాడు. వాటిని నిశబ్దంగా ఉండండి అని సైగ చేస్తూ సెల్ఫీ వీడియో చిత్రీకరిస్తున్నాడు..ఇంతలో ఓ సింహం అనుహ్యంగా అతడి చేతిపై దాడిచేయడంతో.. జరగకూడని ఘోరం జరిగిపోయింది. చివరికీ ఆ సింహాల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించాడు. అతడు సరదాగా చేసిన స్టంట్ కాస్తా తన చివరి క్షణాలను బంధించిన వీడియోగా మిగిలిందని పోలీసులు వెల్లడించారు. ఏదీ ఏమైనా క్రూర జంతువులతో చేసే స్టంట్ల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాల్సిందే.(చదవండి: షాలిని పాసీ అందమైన కురుల రహస్యం ఇదే..!) -
నా చావుకు కానిస్టేబుల్, ఆయన భార్యే కారణం.. యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో యువతి ఆత్మహత్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చేయని తప్పునకు కానిస్టేబుల్ వేధింపులు భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోయింది. తన చావుకు కానిస్టేబుల్, ఆయన భార్యే కారణమని కన్నీరు పెట్టుకుంది. ఈ ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాచారంలోని బాపూజీనగర్ సరస్వతి కాలనీకి చెందిన పులివర్తి దీప్తి హబ్సిగూడలోని ఐఐసీటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ)లో ప్రాజెక్టు అసిస్టెంట్గా పని చేస్తున్నారు. దీప్తి తండ్రి సంగీతరావు ఐఐసీటీలో పని చేసి రిటైర్ అయ్యారు. తండ్రితో వేరుగా దీప్తి రెండు సంవత్సరాల నుండి తన తల్లితో కలిసి ఉంటోంది. సంగీతరావుకు డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న బెల్లా అనిల్తో పరిచయముంది.అయితే, బిల్ల అనిల్ అనే వ్యక్తి తన భార్య కోసం ఐఐసీటీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కోసం, దీప్తి తండ్రి సంగీత రావుకు రూ.15 లక్షలు డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. రెండేళ్ల క్రితమే ఈ డబ్బులు ఇచ్చినట్టు సమాచారం. అయితే, తన తండ్రి సంగీతరావు.. అనిల్ వద్ద డబ్బు తీసుకున్న విషయం దీప్తికి తెలియదు. కాగా, ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకూ ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో అనిల్ తన డబ్బు తిరిగివ్వాలని దీప్తిని అడిగేవాడు. డబ్బు తన తండ్రి తీసుకున్నాడని, ఆయన తమతో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండటం లేదని, తనను డబ్బులు అడగవద్దని అనిల్కు సమాధానం చెప్పింది. ఆయన పట్టించుకోకుండా నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించాడు. దీంతో, దీప్తి, సంగీత రావుపై ఛీటింగ్ కేసు నమోదైంది. అనిల్ దంపతులు న్యాయస్థానంలో సివిల్ దావా కూడా వేశారు.ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన దీప్తి, బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి వచ్చి చూసేసరికి దీప్తి మృతి చెందింది. ఆమె ఫోన్ చూడగా సెల్ఫీ వీడియో ఉంది. సెల్ఫీ వీడియో ప్రకారం ఆమె మాటలు.. ‘నేను చనిపోవడానికి అనిల్, ఆయన భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్య కారణం. మా నాన్న డబ్బులు తీసుకుంటే నన్ను అడిగి నా మీద నకిలీ కేసు పెట్టారు. నా జీవితం నాశనం చేశారు. ఈ కేసుల మీద పోరాడే స్తోమత లేదు. నా మరణంతోనైనా కుటుంబానికి న్యాయం జరుగుతుంది. నా చావునకు కారణమైన వాళ్లకు శిక్షపడాలి. నా మృతదేహాన్ని వైద్య పరిశోధనకు ఇచ్చేయండి అంటూ కన్నీరు పెట్టుకుంది. అనంతరం, పోలీసులు అనిత, అనిల్, సోమయ్య, సైదులు మీద కేసు బుక్ చేశారు. -
బంధించేశారు, ఒక్కపూటే భోజనం..రక్షించండి: కువైట్లో ఏపీ మహిళ ఆవేదన
ఉపాధి కోసం కువైట్ వెళ్లి పనిప్రదేశంలో ఇబ్బందులు పడుతున్నమహిళ తనను కాపాడ్సాలిందిగా వేడుకుంటున్న సెల్ఫీ వీడియో ఒకటి ఆందోళన రేపుతోంది. తిరుపతి శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ చెందిన ఎల్లంపల్లి లక్ష్మి తన కుమార్తెను ఉద్దేశించి ఈ వీడియో చేసింది. కువైట్ లో తనను ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.మతిస్థిమితం లేని పిల్లవాడి సంరక్షణ కోసం కువైట్ వచ్చిన తనకు కనీసం కడుపు నిండి తిండి పెట్టకుండా, వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయింది. పిల్లవాణ్ని సరిగ్గా చూడటం లేదని ఆరోపిస్తూ తనను బాగా కొట్టిన యజమానులు గదిలో నిర్బంధించారని కన్నీళ్లు పెట్టుకుంది. తిండీ, తిప్పలు లేక, అనారోగ్యంతో బాధలు పడుతున్నట్టు వెల్లడించింది. అంతేకాదు రక్షించాలని ఎజెంటుకు విన్నవించుకుంటే 2.50 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితులో ఉన్నానని దయచేసిన తనను ఈ నరకంనుంచి రక్షించాలని సెల్ఫీ వీడియోలో కుమార్తెను వేడుకుంది. దీంతో లక్ష్మి కుమార్తె సుచిత్ర ఆందోళనలో మునిగిపోయింది. తల్లిని కాపాడాలని కోరుతూ స్టానిక శ్రీకాళహస్తి ఎమ్మెల్యేకు విజ్ఞపి చేసింది. కువైట్ నుండి తన తల్లిని త్వరగా ఇండియాకు తీసుకురావాలని కోరూతూ ఏమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి కుమార్తె సెల్ఫీ వీడియో ద్వారా వేడుకుంది. -
అతుల్.. అంతులేని ఆవేదన
బనశంకరి: భార్య, ఆమె బంధువులు పెట్టే వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న టెక్కీ అతుల్ సుభాష్ (34) కేసు దర్యాప్తును బెంగళూరు మారతహళ్లి పోలీసులు తీవ్రతరం చేశారు. నిందితుల కోసం ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్కి వెళ్లారు. అక్కడ అతుల్ భార్య నిఖితా సింఘానియా, తల్లి నిశా, సోదరుడు అనురాగ్, బంధువు సుశీల్ ను విచారణ చేపట్టారు. మృతుని సోదరుడు బికాస్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మారతహళ్లి ఠాణాలో ఆత్మహత్యకు ప్రేరేపించడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. బిహార్లో ఉండే మృతుని తల్లిదండ్రుల నుంచి కూడా వాంగ్మూలం తీసుకుంటారు. రూ.3 కోట్లు ఇవ్వాలని ఒత్తిడి భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయి కేసు పెట్టడంతో ఆవేదన చెందిన అతుల్ ఈ నెల 9వ తేదీన మారతహళ్లి మంజునాథ లేఔట్లోని ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. సుమారు 40 పేజీల డెత్నోట్ రాశాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. అతుల్, నిఖితలకు 2019లో వివాహమైంది. ఆమె తల్లి, సోదరుని ప్రోద్బలంతో ఆమె తప్పుడు కేసు పెట్టిందని అతుల్ తన డెత్నోట్లో ఆరోపించాడు. 4 ఏళ్ల కుమారుడు ఉండగా, అతన్ని కలవాలంటే రూ.30 లక్షలకు డిమాండ్ పెట్టారు. అంతేగాక కోర్టు విచారణకు వచ్చినప్పుడు కేసులు వాపస్ తీసుకోవాలంటే రూ.3 కోట్లు ఇవ్వు, లేకపోతే చచ్చిపో అని భార్య, బంధువులు దూషించారు. దీంతో మానసికంగా శారీరకంగా కుంగిపోయిన అతుల్సుబాష్ ఆత్మహత్యకు పాల్పడ్డారని మృతుని సోదరుడు బికాస్కుమార్ పిర్యాదులో పేర్కొన్నారని వైట్ఫీల్డ్ విభాగ డీసీపీ డాక్టర్ శివ కుమార్ గుణారే తెలిపారు. సెల్ఫీ వీడియోలో ఆక్రోశం ఆత్మహత్యకు ముందు అతుల్ రికార్డు చేసిన 90 నిమిషాల సెల్ఫీ వీడియో అతని బాధలను కళ్లకు గట్టింది. భార్య నిఖితా, ఆమె కుటుంబసభ్యులు పెట్టిన వేధింపుల గురించి వివరించాడు. ఏ తప్పు లేకపోయినా తనపై 9 కేసులు బనాయించారని తెలిపాడు. తనకు న్యాయం జరగకపోతే చితాభస్మాన్ని కోర్టు ఎదురుగా ఉన్న డ్రైనేజీలో పడేయాలని వీడియోలో కోరాడు. వందలాది మంది నెటిజన్లు అతుల్కు అండగా నిలిచారు. దేశంలో వ్యవస్థలు భ్రష్టుపట్టాయని, వాటిని సంస్కరించకపోతే మరింతమంది అమాయకులు ఆత్మహత్యలు చేసుకుంటారని విమర్శలు గుప్పించారు. This is heartbreaking, truly heartbreaking. I am sad and angry. Atul Subhash, an AI engineer, tragically took his own life after enduring constant harassment from the court and his ex-wife over alimony. 💔 #JusticeForAtulSubhash pic.twitter.com/dmRtTaPQUq pic.twitter.com/ClyiotyiFs— Prayag (@theprayagtiwari) December 10, 2024 -
నేను చనిపోతున్నా.. నా బిడ్డ జాగ్రత్త
జ్యోతినగర్(రామగుండం): ‘అమ్మా.. నాన్న.. నన్ను క్షమించండి.. ప్రేమ వివాహం చేసుకుని మీకు దూరంగా ఉన్నా.. మొదట్లో ఎంతో ప్రేమగా చూసుకున్న మా ఆయన నిత్యం వేధిస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక పోతున్నా. నేను చనిపోతున్నా.. నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి’.. అంటూ సెల్ఫీ వీడియో తీసి ఒక వివాహిత బలవన్మరణానికి పాల్ప డింది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద పల్లి జిల్లా ఎన్టీపీసీ ఆటోనగర్లో నివసిస్తున్న నరేందర్ (32), గోదావరిఖనికి చెందిన దేవర కొండ దీప్తిని 2021న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు ఉన్నాడు. నరేందర్, దీప్తి స్థానిక అన్నపూర్ణ కాలనీలోని ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయి తే, కట్నం తీసుకు రావాలని నరేందర్ కొంతకాలంగా దీప్తిని వేధిస్తున్నాడు. ఇదే విషయమై శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన దీప్తి.. భర్త వేధిస్తున్నందున చనిపోతున్నానని సెల్ ఫోన్లో సెల్ఫీ వీడియో తీసింది. ఉరేసుకున్న దీప్తిని గమనించిన నరేందర్ తన మిత్రుల సాయంతో ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. కాగా, తన బిడ్డను నరేందర్ చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని.. దీప్తి తండ్రి దివాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని గోదావరిఖని ఏసీపీ రమేశ్, సీఐ ప్రవీణ్, ఎస్ఐ ఉదయ్కిరణ్ తెలిపారు. -
‘టీడీపీ ఎమ్మెల్యే కూనరవితో ప్రాణహాని’
శ్రీకాకుళం, సాక్షి: టీడీపీ నేతల దాడులు, బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్యే కూనరవితో తనకు ప్రాణహాని ఉందని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస స్వతంత్ర అభ్యర్థి సనపల సురేష్ తెలిపారు. ఆయన ఓ సెల్ఫీ వీడియో ద్వారా ఎమ్మెల్యే దాడి, బెదిరింపుల విషయాన్ని బయటపెట్టారు. ‘‘ఎమ్మెల్యే కూనరవి నుంచి నాకు ప్రాణహాని ఉంది. అక్రమ ఇసుక రవాణా అడ్డుకుంటున్నానని దాడి చేశారు. ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారు. జిల్లా ప్రభు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు. దెబ్బలు తగిలినా రిపోర్టు నార్మల్ అని ఇచ్చారు. పోలీసులతో కలిసి నన్ను చంపేందుకు రవి కూమార్ స్కెచ్ వేశారు. దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాల్సిందే. నాపై దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు’’ అని వీడియోలో తెలిపారు. -
నా మొహం ఎలా చూపించను
శ్రీరాంపూర్: జీవితంలో సక్సెస్ కావాలి..డబ్బు సంపాదించాలి.. కుటుంబ సభ్యులను ఉన్నత స్థితిలో ఉంచాలంటూ ఆ యువకుడు ఎన్నో కలలు క న్నాడు. మొదట్లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి లా భాలు బాగానే వచ్చాయి. ఆ తర్వాత తెలిసిన వారి వద్ద, లోన్యాప్లలో అప్పు చేసి పెట్టిన పెట్టుబడు లు ఆవిరయ్యాయి. మూడేళ్లుగా ట్రేడింగ్ చేస్తున్నా కలిసి రావడం లేదని.. లోన్యాప్ల వేధింపులు తాళలేక.. ఉరేసుకొని ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో శనివారం వెలుగులోకి వచి్చంది. ఎస్సై సంతోష్ కథనం ప్రకారం.. శ్రీరాంపూర్లోని అరుణక్కనగర్కు చెందిన నమ్తబాజీ శ్రీకాంత్(29) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. భార్య శ్రుతి, 9 నెల ల కుమారుడు ఉన్నారు. భార్య కొడుకుతో కలిసి రాఖీ పండుగకు ఊరెళ్లింది. దీంతో ఇంట్లో ఒక్కడే ఉన్న సమయంలో శుక్రవారం రాత్రి ఫ్యాన్కు వైరు తో ఉరేసుకున్నాడు. ఇంటి సమీపంలోనే తల్లిదండ్రులు ఉంటారు. శనివారం ఉదయం శ్రీకాంత్ తమ్ముడు సాయికుమార్ ఇంటికొచ్చి తలుపులు కొట్టినా తీయలేదు. దీంతో బలవంతంగా త లుపులు తెరిచి చూడగా, ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు శ్రీకాంత్ సెల్ఫోన్ను పరిశీలించగా, ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడయ్యాయి.సెల్ఫీ వీడియో తీసుకొని.. శ్రీకాంత్ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ‘నేను ఒక కొడుకుగా, అన్నగా, భర్త గా, తండ్రిగా ఫెయిల్ అయ్యాను. లైఫ్లో సక్సెస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను. సక్సెస్ కాకపోగా, లోన్యాప్స్లో లోన్ తీశాను. బయట కూడా అప్పు తీసుకొచ్చాను. ఇంట్లో వారిని గొప్ప గా ఉంచాలి. మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని స్టాక్ మార్కెట్లో డబ్బులన్నీ పెట్టా. ట్రేడింగ్ చేసి డబ్బులన్నీ పోగొట్టుకున్నాను. మాఫ్రెండ్ వాళ్ల అన్న దగ్గరి నుంచి రూ.3 లక్షలు తీసుకున్నా. మా డాడీ దగ్గర రూ.2 లక్షలు అట్లనే వేర్వేరు దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా. అన్నీ పోగొట్టుకున్నా. నాకు చాలా అప్పులున్నాయ్. దానికి తోడు ఈ లోన్యాప్స్. ప్రతి నెలా ఈఎంఐలు కచి్చతంగా కట్టేసిన. ఈ నెలొక్కటే కట్టలేదు. ఏడెనిమిది యాప్ల దాకా కట్ట లేదు. ఫోన్లలో టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఇంటికి వస్తామని వేధించారు. కుటుంబ సభ్యుల వద్ద మొహం చూపెట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నా ను’ అని ఆ వీడియోలో శ్రీకాంత్ పేర్కొన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. -
భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనీ భార్య ఆత్మహత్య
యశవంతపుర: భర్త వేధింపులను తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం సాయంత్రం బెంగళూరు బ్యాడరహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ఆంధ్రహళ్లికి చెందిన మానస (25)కు ఆరేళ్ల క్రితం దిలీప్తో పెళ్లి కాగా, వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. ఏడాదిన్నరగా దిలీప్కు మరో మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీనిపై ఇంట్లో రోజూ గొడవ జరిగేది. దీనికి తోడు దిలీప్ మానసను వేధించేవాడు. దీంతో విరక్తి చెందిన ఆమె సెల్ఫీ వీడియో తీసుకుని, ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు బ్యాడరహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయగా, దిలీప్ని అరెస్టు చేశారు. -
విషాదం: రైలు కిందపడి యువదంపతుల ఆత్మహత్య
సాక్షి,నిజామాబాద్ జిల్లా: రైలు కిందపడి యువ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ మధ్య రైలు కింద పడి యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు పోతంగల్ మండలం హెగ్డోలి వాసులు అనిల్ (28), శైలజ (24)గా పోలీసులు గుర్తించారు. బంధువుల దుష్ప్రచారం భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో తెలిపారు. వీరికి ఏడాదిన్నర క్రితం పెళ్లయింది.ఈ వీడియోను ఆత్మహత్యకు ముందు కోటగిరి ఎస్.ఐ సందీప్కి పంపారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా మిట్టాపుర్ శివారులో రైల్వే ట్రాక్పై దంపుతులిద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్వ్యూ ఉందని ఇంట్లో చెప్పి బయటికొచ్చిన యువ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
పురుగుల మందు తాగి.. సెల్ఫీ వీడియో తీసుకుని..
మేడ్చల్ రూరల్: పురుగుల మందు తాగడంతో పాటు హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అగ్రికల్చర్ విద్యార్థి ఘటన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలో చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి హరినాథ్ మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలోని అగ్రికల్చర్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. స్థానికంగా ఉన్న ఓ హాస్టల్లో ఉంటున్నాడు. మూడు రోజులుగా కళాశాలలో తోటి విద్యార్థుల మధ్య గొడవల కారణంగా మనస్తాపం చెందిన హరినాథ్ బుధవారం హాస్టల్ గదిలో పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో రికార్డు చేసుకున్నాడు. అనంతరం తాను ఉంటున్న హాస్టల్ భవనం పైఅంతస్తుకు వెళ్లి పక్కనే ఉన్న సాయి బాలాజీ హాస్టల్ భవనంపైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నంచాడు. భవనంపై నుంచి దూకుతున్న క్రమంలో విద్యుత్ తీగలపై పడి.. అనంతరం కిందపడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. హరినాథ్ను చికిత్స నిమిత్తం 108లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. సారీ మామా.. ఆత్మహత్య యత్నానికి ముందు హరినాథ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అరే మామా.. (ఫ్రెండ్స్నుద్దేశించి) సారీ మామా తట్టుకోలే కపోతున్నాను. ఓ ఇద్దరు విద్యార్థుల పేర్లు ప్రస్తావించి వారిని వదిలిపెట్టవద్దని కోరాడు. మామా.. మా అమ్మ తట్టుకోలేదు. త్వరగా వచ్చేయ్ మామా... ప్లీజ్ మామా.. ఏడుపోస్తుంది మామా.. అంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. ఆ వీడియో మిత్రులకు పంపినట్లు సమాచారం. గత మూడు రోజులుగా విద్యార్థుల మధ్య వాగ్వాదం కారణంగా సున్నితమైన మనస్తత్వం కలిగిన హరినాథ్ మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు సమాచారం. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హరినాథ్ తన వీడియోలో తెలిపిన విద్యార్థుల పేర్లు, కారణాలపై ఆరా తీసున్నారు. -
కాళహస్తిలో సెల్ఫీ వీడియో.. టీడీపీ నేతపై ఆగ్రహం
తిరుపతి, సాక్షి: తెలుగుదేశం పార్టీ నేత బొజ్జల సుధీర్రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీకాళహస్తి ఆలయంలో సెల్ఫీ వీడియో ద్వారా ఆలయ ట్రస్ట్ ఆగ్రహానికి గురయ్యారు. ఆలయ దర్శనానికి వెళ్ళే సమయంలో సెల్ ఫోన్ వాడకం నిషేధం అమలులో ఉన్నప్పటికీ.. ఆ నిబంధనల్ని బొజ్జల ఉల్లంఘించారు. ఆలయంలో సెల్ఫీ వీడియో చిత్రీకరించారు. ఆలయంలో పురాతమైన భాగం తొలగింపు.. ఆ తొలగింపుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బొజ్జల. పైగా గోడ కూలడాన్ని ప్రభుత్వానికి ముడిపెట్టి విమర్శలు గుప్పించారు. దీంతో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఆంజురు తారక శ్రీనివాసులు తీవ్రంగా పరిగణించారు. ఈ క్రమంలో బొజ్జలపై చట్టపరమైన చర్యలు కు సిద్దం అవుతున్నారు. ఆలయ చైర్మన్ వివరణ ఇది.. ఆలయంలో కూల్చివేత అంటూ టీడీపీ నేత సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడంపై శ్రీకాళహస్తి ఆలయం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్పందించారు. ఆలయంలో మృత్యుంజయ లింగం ఆనుకుని ఉన్న గదిని గతంలో ప్రసాదాలు తయారీ సరుకుల గోడౌన్ గా వినియోగించేవారు. 1956 లో దేవస్థానం ట్రస్టీ సహకారం తో దీన్ని నిర్మాణం చేశారు. శిథిలావస్థలో ఉన్న దీన్ని కూల్చి వేయాలని ప్రస్తుత పాలక మండలి 2022 ఆగస్టులో జరిగిన పాలకమండలి సమావేశం లో 7వ అంశంగా చేర్చారు. దానిలో భాగంగా పాడుబడిన ఈ గదిని తొలగింపు చర్యలు చేపట్టారు -
తప్పు చేయకపోతే గగ్గోలెందుకు?
సాక్షి, అమరావతి : ‘అవినీతికి పాల్పడకపోతే చంద్రబాబుకు భయమెందుకు? అనేక కేసుల్లో జరిగే తరహాలోనే ఈ కేసు విచారణ జరుగుతున్నప్పటికీ ఏదో జరిగిపోతున్నట్టు గగ్గోలు ఎందుకు? విచారణకు సహకరించి నిజాయితీ నిరూపించుకోవచ్చు’ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య అన్నారు. స్కిల్ స్కామ్లో సీఐడీ పోలీసులు పక్కా సాక్ష్యాధారాలతోనే దర్యాప్తు చేస్తున్నారని, రూ.241 కోట్ల ప్రజాధనం అక్రమంగా మళ్లించినట్టు స్పష్టమవుతోందని చెప్పారు. కస్టోడియల్ కస్టడీలో విచారిస్తే నిజ నిర్ధారణ జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కొద్ది రోజులుగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తన చేతికి ఆ రిమాండ్ రిపోర్టు అందినందున, ఇందులో నిజా నిజాలు, క్రెడిబులిటీ చెప్పదల్చుకున్నానని తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. క్లియర్ ఎవిడెన్స్ కనిపిస్తున్నాయి.. ♦ ఎంతో మంది నాయకులు క్రిమినల్ కేసులు ఎదుర్కొన్నారు. కొంత మందికి శిక్షలు పడ్డాయి. నిర్దోషులు హానరబుల్ (గౌరవం)గా బయటకొచ్చారు. కానీ ఎక్కడా జరగని విధంగా ఇక్కడే ఏదో జరిగిపోయినట్టు చంద్రబాబు కేసు విషయంలో కొంత మంది గగ్గోలు పెడుతున్నారు. ఆయన అరెస్టు సరైనదే అని కొందరు సమర్థిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.241 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కేసులో ఈ నెల 9న సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ♦ ప్రభుత్వ డబ్బు (ప్రజాధనం) బోగస్ ఇన్వాయిస్ల ద్వారా టెక్నాలజీ పార్ట్నర్స్కు, ఇతరులకు డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఆ సిక్స్ క్లస్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేయలేదు. వారికి ఇచ్చిన డబ్బుకు లెక్కలేదు. దానికి జీఎస్టీ కట్టలేదని జీఎస్టీ అథారిటీ వారు కూడా ఎంక్వైరీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ వాళ్లూ విచారించారు. తర్వాత ఇన్కంట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత.. దీనికి సంబంధించి కొన్ని కీ నోట్ ఫైల్స్ మిస్ అయ్యాయి కాబట్టే చంద్రబాబును అరెస్టు చేశారు. ♦ 141 మంది సాకు‡్ష్యలను కూడా విచారించి ఆధారాలు సేకరించారు. ఆ డబ్బు ఎవరి అకౌంట్లో పడింది.. నిధులు ఎలా దారి మళ్లాయి.. షెల్ కంపెనీల ద్వారా తిరిగి వీళ్ల వద్దకు ఆ డబ్బు ఎలా వచ్చింది.. ఇవన్నీ మరింత స్పష్టంగా విచారించడానికే చంద్రబాబును అరెస్టు చేశారు. నేరం చేయకపోతే భయమెందుకు? ♦ చంద్రబాబు ఏ రకమైన నేరం (ఫ్రాడ్) చేయకపోతే, నిధులు దుర్వినియోగం చేయకపోతే, నిబంధనలు ఉల్లంఘించకపోతే, ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కిందకు రాకపోతే, అది 409 కిందకు రాకపోతే ఎందుకు భయపడుతున్నట్లు? నిధులు అక్రమంగా మళ్లింపు(సైఫెన్) అని తెలుస్తోంది. ఆ డబ్బు దుర్వినియోగం అయినట్టు తేటతెల్లమైంది. సీఐడీ పోలీసులు రికార్డును బట్టే ముందుకెళ్తున్నారు. ♦ ఇది సరికాదనుకున్నప్పుడు మా దగ్గర రికార్డు ఉంది.. జరిగిందిదీ అని ఆ ఆరు షెల్ కంపెనీలు వచ్చి చెప్పడం లేదు. మేనేజింగ్ డైరెక్టర్ ప్రైవేటు కెపాసిటీతో ఏదైనా లెటర్ ఇచ్చి ఉండొచ్చు. అండర్ స్టాండింగ్ ఉండొచ్చు. కానీ దాంతో మా కంపెనీకి ఏ సంబంధం లేదని సిమన్స్ ఇండస్ట్రీ వాళ్లు చెబుతున్నారు. డిజైన్ టెక్ ప్రైవేట్ కంపెనీ కూడా మాకు సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరిస్తోంది. షెల్ కంపెనీలు కూడా వాస్తవ సమాధానం చెప్పడం లేదు. ఇంత మందికి శిక్షణ ఇచ్చామని, ఇన్ని పరికరాలు కొన్నామని బెయిల్ పిటిషన్లలో ఎందుకు చెప్పలేదు? ♦ ఇంత క్లియర్గా కేసు ఉంటే ఏదో ఘోరం జరిగిపోయిందని గగ్గోలు పెట్టడం విచిత్రం అనిపిస్తోంది. ఆయన సత్యవంతుడని నిరూపించుకుంటే రేపు పరువు నష్టం దావా వేయొచ్చు. ఇలా గగ్గోలు పెట్టడం అనవసరం. ఇంత కంటే పూర్తి ఆధారాలతో కూడిన(ఫుల్ ఫ్రూఫ్) కేసు నేను చూడలేదు. అనుమానాలకు తావులేదు. గవర్నర్ అనుమతి అవసరం లేదు ♦ ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ ప్రకారం గవర్నర్ అనుమతి కావాలనే వాదన జరుగుతోంది. సెక్షన్ 17ఎ ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ 2018లో ఫోర్స్లోకి వచ్చింది. అంతకు ముందు జరిగిన నేరాలకు అది వర్తించదు. కాబట్టి అవి అంతకంటే ముందు నేరాలు కాబట్టి 17ఎ లో గవర్నర్ అనుమతి తీసుకోవాలనేది వర్తించదు. అచ్చెన్నాయుడు కేసులో ఇది డిసైడ్ అయ్యింది. ♦ అరెస్టు, కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఇవన్నీ విచారణలో భాగమే. దాదాపు 141 మంది సాకు‡్ష్యలను విచారించారు. ఏడుగురిపై రిమాండ్ రిపోర్టు ఇచ్చారు. తర్వాత అత్యంత ఎక్కువ సమాచారం సేకరించారు. దర్యాప్తునకు సహకరించడ లేదు. అంతకు ముందు చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాసరావు విదేశాలకు వెళ్లిపోయాడు. వాళ్లిద్దరూ సహకరించడం లేదు. తర్వాత కొన్ని నోట్ ఫైల్స్ మిస్సింగ్. షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనం వీరికి చేరిందనేది నిర్ధారణ కావాలంటే అరెస్ట్ చేసి విచారిస్తేనే నిజానిజాలు బయటపడతాయి. -
తల్లి కొట్టిందని బాలుడి ఆత్మహత్య
కోనరావుపేట (వేములవాడ): ‘‘ఊర్లో బతుకబుద్ధి అవు తలే. వేరేవాళ్లు చెప్పే మాటలకు బాధనిపిస్తోంది. అమ్మా.. నన్ను కొట్టినందుకు బాధలేదు. చెల్లిని మంచిగా చూసుకో. ఈ పేదబతుకు నాకొద్దు. చెల్లెకు మంచిగా పెళ్లి చేయండి. అమ్మా.. అన్నా.. బావా.. డాడీ.. నేను వెళ్తున్నా..’’అని ఓ బాలుడు స్నేహితుడికి సెల్ఫీ వీడియో పంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండ లంలోని కమ్మరిపేటతండాలో ఈ ఘటన జరిగింది. కమ్మ రిపేటతండా (వట్టిమల్ల)కు చెందిన భూక్యా రాజు, జ్యోతి దంపతులకు దినేశ్, దీప్తి అనే పిల్లలు ఉన్నారు. దినేశ్ (17) గతేడాది వరకు కోనరావుపేట మండలంలోని ధర్మా రం హాస్టల్లో ఉంటూ ఎనిమిదో తరగతి వరకు చదువుకు న్నాడు. ఈ ఏడాది చదువు ఆపేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం ఓ దుకాణంలో సిగరెట్ ప్యాకెట్ దొంగిలించాడని దుకాణం యజమా ని దినేశ్ తల్లిదండ్రులకు చెప్పగా.. తల్లి కోపంతో దినేశ్ను కొట్టింది. దీంతో గురువారం ఉదయం 10 గంటలకు దినేశ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. స్నేహితుల దగ్గరికి వెళ్లాడని భావించిన తల్లిదండ్రులు వరినాట్లు వేసేందుకు పొలానికి వెళ్లారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో.. గురువారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన దినేశ్, తాను చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి స్నేహితునికి పంపాడు. అయితే అతను పాఠశాలకు వెళ్లిపోగా.. సెల్ఫోన్ను అతని తండ్రి తీసుకెళ్లాడు. రాత్రి పది గంటలకు స్నేహితుడి తండ్రి ఇంటికొచ్చాక వీడియో చూసి వెంటనే దినేశ్ తల్లిదండ్రులకు చెప్పాడు. అందరూ కలసి దినేశ్ కోసం అటవీ ప్రాంతంలో గాలించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు వట్టిమల్ల శివారు అటవీ ప్రాంతంలో దినేశ్ మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. కోనరావుపేట ఎస్సై రమాకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమారుని మృతికి దుకాణం యజమాని మాలోత్ కాంతి కారణమని మృతుని తండ్రి రాజు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
గా పిల్ల ఘోరంగా మోసం చేసింది.. ఉండలేక పోతున్న..
శంకర్పల్లి/చేవెళ్ల: ‘ప్రేమించిన అమ్మా యి విడిచిపెట్టి పోయింది.గా పిల్ల నన్ను ఘోరంగా మోసం చేసింది. ఇక నేను ఉండలేక పోతున్న’ అంటూ అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థి సెల్ఫీ వీడియో ద్వారా తన సోదరుడికి సమాచారం అందించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శంకర్పల్లి రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అల్లాపూర్కు చెందిన కురువ మహేశ్(21) నగరంలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్నాడు. ఓ అమ్మాయి తో ప్రేమ విఫలమై ఇద్దరి మధ్య అగాధం పెరిగింది. ఏం జరిగిందో కానీ ప్రియురాలు తనను విడిచిపెట్టిపోయిందని తీవ్ర మనస్తాపం చెందాడు. దీన్ని జీర్ణించుకోలేకపోయాడు. చివరికి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. శంకర్పల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలపైకి వెళ్లి సెల్ఫీ వీడియో ద్వారా అన్నకు ఈ విషయం చెప్పాడు. ఇక తాను ఉండలేనని, అమ్మానాన్నలను మంచిగా చూసుకోవాలి.. ఇక పోతా అంటూ గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల మొండెం రెండు ముక్కలై మృతదేహం ఛిద్రమైంది. అతని వద్ద మల్లారెడ్డి యూనివర్సిటీ ఐడీ కార్డు ఉంది. ప్రయోజకుడు అవుతాడనుకున్న కొడుకు అర్ధంతరంగా తనువు చాలించటంతో తల్లిదండ్రులు కన్నీరుమన్నీరయ్యారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శ్వేతా నువ్వు లేక ఉండలేకపోతున్నా.. ఈ జీవితం వ్యర్థం
షాద్నగర్: ‘మూడు రోజులు అవుతుంది.. శ్వేతా నువ్వు లేక ఉండలేకపోతున్నా.. నువ్వు లేని జీవితం వ్యర్థం.. ఇక చనిపోతున్నా’ అంటూ ఓ భర్త సెల్ఫీ వీడియో తీసుకుంటూ అన్నంలో గుళికల మందు కలుపుకొని తిని బలవన్మరణానికి పాల్పడాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండల పరిధిలోని కొండన్నగూడలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కొండన్నగూడ గ్రామానికి చెందిన కందనోళ్ల రాజేష్ (35)కు అదే గ్రామానికి చెందిన శ్వేతతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కొంతకాలంగా షాద్నగర్లోని రాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. రాజేష్ డీసీఎం డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవ జరిగింది. ఈ క్రమంలోనే భార్య శ్వేత పుట్టింటికి వెళ్లింది. మనస్తాపంతో.. భార్య తిరిగి రావడం లేదన్న మనస్తాపంతో రాజేష్ శుక్రవారం రాత్రి గుళికల మందు ప్యాకెట్ తీసుకొని కొండన్నగూడ గ్రామ శివారులోని తమ పొలానికి వెళ్లాడు. ‘నీతో గొడవ పడినా అర్ధరాత్రి వచ్చి అయినా నీతో మాట్లాడేవాడిని.. మూడు రోజుల నుంచి ఒంటరిగా ఉన్నా.. ఒంటరిగానే తిరుగుతున్నా.. నా కన్నతల్లికంటే నీవే ఎక్కువ కదా.. నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయావు.. నీవు లేని జీవితం వ్యర్థం.. ఇక చనిపోతున్నా.. నా భార్య నా వల్ల ఇబ్బందులు పడింది.. ఆమెపై కేసులు పెట్టొద్దు.. నా చావుకు నేనే కారణం..’ అంటూ చివరిసారిగా సెల్ఫీ వీడియో తీసుకొన్నాడు. తండ్రి నారాయణగౌడ్ సమాధి వద్ద అన్నంలో గుళికల మందు కలుపుకొని తిని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం అటువైపు వెళ్లిన స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకుని భోరున విలపించారు. సీఐ ప్రతాప్లింగం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నా లవర్ బర్త్డే రోజునే చనిపోతున్నా.. సెల్ఫీ వీడియో తీసుకుని..
-
‘మోసం చేసింది.. నా లవర్ బర్త్డే రోజునే చనిపోతున్నా’.. సెల్ఫీ వీడియో తీసుకుని..
హనుమకొండ జిల్లా: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్లో యువకుడు సాయి ఆత్మహత్య కలకలం సృష్టించింది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని సెల్పీ వీడియో తీసుకుని ఇంట్లో ఉరి వేసుకున్నాడు. సెల్ఫీ వీడియోలో ప్రేమించిన అమ్మాయి, ఆమె స్నేహితుడు మానసికంగా హింసించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. యువతికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఆమె బర్త్ డే రోజున చనిపోతున్నానని సూసైడ్కు ముందు వీడియోలో తెలిపాడు. యువతి, ఆమె స్నేహితుడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. సెల్ఫీ వీడియో కలకలం సృష్టించడంతో తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో మసాజ్ సెంటర్.. గుట్టుచప్పుడు కాకుండా.. -
కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో
ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన వారి కుటుంబంతో పాటు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. అయితే ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను తన సహచరులతో పంచుకున్నారు. (ఇది చదవండి: ఇంత మోసం చేస్తాడనుకోలేదు.. ఏడుపు కూడా రావడం లేదు : చైతన్య మాస్టర్ తల్లి) నెల్లూరులోని ఓ హోటల్లో బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆ వీడియోలో చైతన్య వెల్లడించారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే అప్పుల బాధతోనే సూసైడ్ చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపారు. (ఇది చదవండి: ‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..?) -
Vizag: సెల్ఫీ వీడియో కలకలం.. ఆత్మహత్య చేసుకుంటున్నామని..
సాక్షి, విశాఖపట్నం: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నామని ఓ దంపతులు సెల్ఫీవీడియో తీసుకోవడం కలకలం రేపుతోంది. ఈ వీడియోను కొడుక్కి పంపి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. ఈ ఘటన విశాఖపట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక వడ్లపూడి తిరుమల నగర్లో చిత్రాడ వరప్రసాద్(47), మీరా(41) దంపతులు నివాసముంటున్నారు.వర ప్రసాద్ స్టీల్ప్లాంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భార్య మీరాతో కలిసి సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ‘నా కూతురు, కొడుకును జాగ్రత్తగా చూసుకోండి.. మా అత్తను, అమ్మను మంచిగా చూసుకోండి. నా కూతురు అమాయకురాలు. మీకు ఇవ్వాల్సింది ఇవ్వలేదని తనను ఏం అనకండి. లక్ష్మి, తమ్ముడు జాగ్రత్త. మామయ్య వాళ్లందరూ ఉన్నారు కదా మిమ్మల్ని చూసుకుంటారు. ఏవరూ ఏమన్నా పట్టించుకోండి. ఇక మేం వెళ్లిపోతున్నాం’ అంటూ కంటతడిపెట్టుకున్నారు. ఈ వీడియోను తమ కుమారుడు కృష్ణ సాయితేజకు పంపించి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. విషయం తెలుసుకున్న కృష్ణ సాయితేజ దువ్వాడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అనకాపల్లి కొప్పాక ఏలూరు కాల్వ వద్ద చెప్పులు, హ్యాండ్ బ్యాగు, మొబైల్ గుర్తించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఎస్ఐ నా భార్యా పిల్లలను దూరం చేశారు.. సెల్ఫీ సూసైడ్ కలకలం..
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో సెల్ఫీ సూసైడ్ యత్నం ఘటన కలకలం రేపింది. నిజామాబాద్ సీపీ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్ఐ బాబూరావు వేధింపులు భరించలేకపోతున్నానంటూ క్రాంతికుమార్ అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నం చేశాడు. రూ.7 లక్షల రూపాయల నగదు, మూడున్నర తులాల బంగారం తీసుకుని ఎస్ఐ బాబూరావు తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ సూసైడ్ యత్నానికి ముందు ఓ సెల్ఫీ వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టాడు. భార్యా భర్తల మధ్య విబేధాలు సృష్టించి.. తన భార్యను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశాడు. భార్యా పిల్లలకు తనను దూరం చేశాడని కన్నీటి పర్యంతమయ్యాడు క్రాంతి. న్యాల్ కల్ రోడ్ఖులో ఓ పోలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసే ముందు.. డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేయగా.. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ బాబూరావు అన్న కూతురినే క్రాంతి పెళ్లి చేసుకోగా.. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలతో ఎస్ఐ బాబూరావు మధ్యవర్తిత్వం చేస్తుండటంతో విషయం ముదిరింది. బాన్సువాడకు చెందిన క్రాంతి నిజామాబాద్లోని గాయత్రీనగర్లో ఉంటున్నాడు. క్రాంతి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చదవండి: నా పెళ్లి సంబంధం చెడగొట్టారు.. యువతి సూసైడ్ నోట్ రాసి.. -
15 నిమిషాల సెల్ఫీ వీడియో.. అమ్మాయిని గదిలోకి పంపించి.. షాకింగ్ విషయాలు
రాయదుర్గం రూరల్(అనంతపురం జిల్లా): తన ఆత్మహత్యకు ఆ ఇద్దరే కారణమంటూ ఓ యువకుడు బుధవారం ఉదయం ఓ గుర్తు తెలియని లాడ్జిలో క్రిమి సంహారక మందు తాగాడు. ఈ ఘటనను సెల్ఫీ వీడియో తీసి తన భార్య, స్నేహితులకు పంపాడు. ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాయదుర్గం ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 15 నిమిషాల నిడివిగల సెల్ఫీ వీడియోలో ఎర్రిస్వామి పేర్కొన్న అంశాలు ఇలా... ఏం జరిగింది? గుమ్మఘట్ట మండలం కలుగోడు గ్రామానికి చెందిన ఎం.ఎర్రిస్వామి, రాయదుర్గం మండలం కెంచానపల్లి నివాసి శ్రుతి దంపతులకు ఐదేళ్ల లోపు వయసున్న ఇద్దరు కుమారులున్నారు. రాయదుర్గంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పార్ట్టైం ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో కలుగోడు పంచాయతీ జె.వెంకటాంపల్లికి చెందిన అనిల్కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు మనోహర్రెడ్డి పరిచయమయ్యారు. తమకు రూ.3 లక్షలు ఇస్తే రైల్వేలో మంచి జీతం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తామని పేర్కొన్నారు. దీంతో తన తల్లి, భార్య బంగారు నగలు తాకట్టు పెట్టి 2021 డిసెంబర్లో రూ.3 లక్షలను ఎర్రిస్వామి అందజేశాడు. నెల రోజులు గడిచిన తర్వాత మరో రూ.2 లక్షలు డిమాండ్ చేయడంతో అప్పు చేసి గత ఏడాది ఫిబ్రవరిలో అందజేశాడు. డ్రగ్స్ అమ్మాలంటూ ఒత్తిడి గత ఏడాది మార్చిలో ఎర్రిస్వామిని అనిల్కుమార్రెడ్డి, మనోహర్రెడ్డి కలిసి తమకు తెలిసిన వ్యక్తి నాబార్డులో పనిచేస్తున్నాడని, అతనితో మాట్లాడి ఉద్యోగం వచ్చేలా చేశామని నమ్మబలికారు. విధుల్లో భాగంగా కొందరితో డిపాజిట్లు చేయిస్తే రూ.50 లక్షల రుణం కూడా ఇప్పిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగం వచ్చింది కాబట్టి డిన్నర్ చేసుకుందామంటూ గోవాకు పిలుచుకెళ్లారు. అక్కడ ఎర్రిస్వామికి మద్యం తాపి, డ్రగ్స్ ఇచ్చారు. అనంతరం గదిలోకి అమ్మాయిని పంపి ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఎర్రిస్వామిని గంజాయి, డ్రగ్స్ అమ్మి డబ్బు తీసుకురావాలంటూ ఒత్తిడి చేశారు. తాము చెప్పినట్లుగా చేయకపోతే అమ్మాయితో గడిపిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తామంటూ బ్లాక్మెయిల్కు దిగారు. ఈ క్రమంలో ఎన్నో మోసపూరిత పనులకు వాడుకున్నారు. వారు చెప్పిన పద్ధతిలోనే ప్రజల నుంచి రూ.22 లక్షలు వసూలు చేసిచ్చిన తర్వాత తనపై మూడు సార్లు హత్యాయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో దోషిని చేస్తూ కర్ణాటకలోని శిరా, బెంగళూరులో కేసులు నమోదయ్యేలా చేశారు. ఇలా ఇంకొందరు యువకుల జీవితాలు సైతం నాశనం చేశారు. నాలుగు పేజీల సూసైడ్ నోట్ తనను అనిల్కుమార్రెడ్డి, మనోహర్రెడ్డి వంచన చేసిన తీరును వివరిస్తూ పోలీసులకు నాలుగు పేజీల సూసైడ్ నోట్ను ఎర్రిస్వామి రాశాడు. తన ఆత్మహత్యకు వారిద్దరే కారణమంటూ అందులో పేర్కొన్నాడు. తన భార్యాపిల్లలను బాగా చూసుకోవాలని తల్లిదండ్రులను, మామను కోరాడు. తన భర్త పంపిన సెల్ఫీ వీడియోలు, సూసైడ్ నోట్ను చూడగానే శ్రుతి ఒక్కసారిగా నిశ్చేషు్టరాలైంది. ఆయన ఆచూకీ కనుగొని ప్రాణాలు కాపాడాలంటూ రాయదుర్గం అర్బన్ ఎస్ఐ సుమన్కు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు వెంటనే స్పందించారు. ఎర్రిస్వామి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. -
స్నేహితులని హామీ ఉన్నందుకు..చివరకు సెల్ఫీ వీడియో తీసుకుని..
సాక్షి, బనశంకరి: అప్పుల వాళ్ల వేధింపులు భరించలేక ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కగ్గలిపుర పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. బెంగళూరు వాసుదేవనపురలో శివరాజ్ (33) హెయిర్సెలూన్ నిర్వహిస్తున్నారు. శివరాజ్ స్నేహితులకు జామీను పడి అప్పు ఇప్పించాడు. దీంతో శివరాజ్ ప్రతివారం వడ్డీ చెల్లించేవాడు. ఇటీవల అధిక వడ్డీ చెల్లించలేదని రేణుకారాధ్య, ధను, వెంకటేశ్ అనే ముగ్గురు శివరాజ్ బైక్ను ఎత్తుకెళ్లారు. దీంతో మానసిక వేధింపులకు గురవుతున్నట్లు సెల్ఫీ వీడియో తీసిన శివరాజ్ ఈనెల 3న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి భార్య కగ్గలిపుర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. (చదవండి: ఎన్ఐఏ చేతికి ‘ఉగ్ర త్రయం’ కేసు ) -
భార్యకు సెల్ఫీ వీడియో పంపి..ఆ తర్వాత..
సాక్షి, కణేకల్లు: తన చావుకు ఎవరూ కారణం కాదంటూ భార్యకు వీడియో సందేశాన్ని పంపి భర్త కనిపించకుండా పోయాడు. వివరాలు.. కణేకల్లు మండలం యర్రగుంట గ్రామానికి చెందిన మల్లికార్జున, జయలక్ష్మి దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. యర్రగుంట బస్టాండ్ ప్రాంతంలో సెల్ఫోన్ల మరమ్మతు దుకాణాన్ని మల్లికార్జున నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడిన అతను ఈ విషయాన్ని భార్యకు కూడా తెలపలేదు. డాక్టర్ వద్దకు ఒక్కడే వెళ్లి చికిత్స చేయించుకుని వచ్చేవాడు. మంగళవారం ఉదయం తాను దుకాణానికి వెళుతున్నట్లు ఇంట్లో తెలిపి బయటకు వచ్చిన అతను.. ద్విచక్ర వాహనంపై మాల్యం – నాగేపల్లి గ్రామాల మధ్య ఉన్న హెచ్చెల్సీ గట్టుకు చేరుకున్నాడు. అనంతరం కాలువ గట్టుపై నిల్చోని తన చావుకు ఎవరూ కారణం కాదని, ఆరోగ్యం బాగాలేకపోవడంతో జీవితంపై విరక్తితో కాలువలో దూకి చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి భార్యకు పంపాడు. ఆలస్యంగా ఈ సందేశాన్ని గమనించిన భార్య జయలక్ష్మి తీవ్ర ఆందోళనకు గురైంది. విషయాన్ని వెంటనే కుటుంబసభ్యులకు, బంధువులకు, పోలీసులకు చేరవేయడవంతో అందరూ ఆగమేఘాలపై కాలువ గట్టుకు చేరుకున్నారు. అక్కడ మల్లికార్జున ద్విచక్ర వాహనంతో పాటు సెల్ఫోన్, షర్ట్ లభ్యమయ్యాయి. కుటుంబసభ్యులు కాలువ వెంబడి గాలింపు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. (చదవండి: అంతా క్షణాల్లోనే.. రెండు కుటుంబాల్లో అంతులేని శోకం) -
స్వప్నా.. నన్ను క్షమించు.. కొందరి వల్ల సంసారంలో నిప్పులు పోసుకున్నా
సాక్షి, ఖమ్మం: ‘స్వప్నా.. నన్ను క్షమించు.. కొందరి వల్ల నేను ఇబ్బందులు పడ్డాను.. సాయి అమ్మను మంచిగా చూసుకో.. అమ్మ మాట విను..’అంటూ మధిర ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న బింగి వెంకటేశ్వరరావు తన మృతికి కారణాలు వివరిస్తూ సెల్ఫీ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన బింగి వెంకటేశ్వరరావు మధిర ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పని చేస్తున్నాడు. అయితే, మధిరలోని కొందరు ఫైనాన్సర్లతో పాటు పలువురి వద్ద నుంచి మరికొందరికి ఆయన డబ్బు అప్పు ఇప్పించాడు. అయితే, అప్పు తీసుకున్న వారు చెల్లించకపోవడంతో వెంకటేశ్వరరావుపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యాన కొంతకాలం ఆయన సొంతంగా వడ్డీ చెల్లించాడు. ఆతర్వాత చెల్లించే పరిస్థితి లేకపోవడంతో అత్తగారిల్లయిన ఏపీలోని పెనుగంచిప్రోలు నుంచి మధిరకు రాకపోకలు సాగిస్తున్నాడు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం కందుకూరుకు వచ్చిన వెంకటేశ్వరరావు మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి పడిపోయాడు. ఈ విషయం పెనుగంచిప్రోలులో ఉన్న భార్యకు తెలియడంతో ఆమె రాత్రి చేరుకుని వచ్చి వెంకటేశ్వరరావు సత్తుపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈమేరకు బుధవారం ఉదయం ఆమె తన భర్త కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై సురేష్ తెలిపారు. వైరల్గా మారిన వీడియో.. వెంకటేశ్వరరావు మృతికి అనారోగ్యమే కారణమని ఆయన భార్య ఫిర్యాదు చేయగా, బుధవారం సాయంత్రానికి ఆయన తీసిన సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఇందులో ‘పలువురి వద్ద డబ్బులు తీసుకుని వేరే వాళ్లకు ఇచ్చాను. ఇప్పుడు వారు కట్టకపోవడంతో అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. కొంతకాలంగా సొంతంగా డబ్బు కట్టినా.. ఇక కట్టలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. నన్ను క్షమించు స్వప్నా(భార్య).. పచ్చని కాపురంలో నిప్పులు పోసుకున్నాను.. సాయి(కుమారుడు) అమ్మను మంచిగా చూసుకో’అని చెబుతూ పురుగుల మందు తాగి పడిపోయాడు. సాయంత్రానికి ఈ వీడియో వైరల్గా మారగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ వెంకటేశ్వరరావు రికార్డ్ చేసిన వీడియోలో పలువురి పేర్లను ప్రస్తావించినప్పటికీ వారు అప్పు ఇచ్చిన వారా, తీసుకున్న వారా అనేది తెలియరావడం లేదు. -
‘నా పరిస్థితి ఎవరికీ రావొద్దు’.. యువతి సెల్ఫీ వీడియో కలకలం
గీసుకొండ(వరంగల్ జిల్లా): ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతి భర్తతోపాటు అతడి బంధువుల వేధింపులు తాళలేక క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన గీసుకొండ మండలం కోటగండి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థాని కుల కథనం ప్రకారం.. ఖానాపురం మండల కేంద్రానికి చెందిన ఇబ్రహీం, నసీమా దంపతుల కూతురు నూర్జహాన్ అదే గ్రామానికి చెందిన రవి, అరుణ దంపతుల కుమారుడు శరత్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని హైదరాబాద్లో ఉంటున్నారు. చదవండి: డీజే ప్రవీణ్తో సుజాత వివాహేతర సంబంధం.. భర్తను కడతేర్చిన భార్య ఆ తర్వాత కొన్ని రోజులకు భర్త శరత్తోపాటు అత్తమామలు, ఆడబిడ్డ, ఆమె భర్త నూర్జహాన్ను కట్నం కోసం వేధిస్తూ చిత్రహింసలకు గురి చేశారు. దీనిపై పలుమార్లు గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించినా.. వారి తీరు మారలేదు. వారి వేధింపులు భరించలేక నూర్జహాన్ మంగళవారం సాయంత్రం గీసుకొండ మండలం కోటగండి వద్దకు వచ్చి క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా.. క్రిమిసంహారక మందు తాగే ముందు నూర్జహాన్ సెల్ఫోన్లో తన బాధను వీడియో తీసి తెలిసిన వారికి వాట్సాప్లో పెట్టింది. ఎక్కడికెళ్లినా న్యాయం జరగలేదు.. ‘నా చావుకు కారణం మాత్రం నా హజ్బెండ్, మా ఆడబిడ్డ, మా బావ, మా అత్తమామలు.. నేను లవ్ మ్యరేజ్ చేసుకున్నా.. క్యాస్టు తక్కువని, కట్నం కోసం కొట్టడంతోపాటు చంపేస్తామని వారు బెదిరిస్తున్నారు. చాలా పీఎస్లకు తిరిగాను. నాకు ఎక్కడా న్యాయం లేదు. ఉమెన్ పీఎస్కు వెళ్లినా అక్కడ సీఐ సారు వాళ్లవద్ద మనీ తీసుకుని నాకు న్యాయం చేయలేదు. ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగడం లేదు. అందుకే చనిపోతున్నా.. నాలాంటి సిచ్యువేషన్ ఇంకో అమ్మాయికి రాకుండా చూడండి.. ప్లీజ్..’ అని ఒక వీడియోలో .. మరో వీడియోలో ‘అన్నా వినయ్రెడ్డి అన్నా థాంక్యూ వెరీమచ్ అన్నా. ఒక చెల్లిగా నాకు సహాయం చేసినందుకు థాంక్యూ అన్నా’ అంటూ మరో వీడియోను నూర్జహాన్ పోస్టు చేసింది. -
‘చిన్న చిన్న తప్పులు చేశాను’..అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని
సాక్షి, హైదరాబాద్: జీవితం మీద విరక్తి చెంది ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా కుంటాల గ్రామానికి చెందిన నారాయణరావు కుమారుడు హర్షిత్(20) మల్లారెడ్డి కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. మైసమ్మగూడలోని శ్రీకాంత్రెడ్డి హాస్టల్లో ఉంటూ ప్రతి రోజు కాలేజీకి వెళ్లి వస్తుండేవాడు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు హాస్టల్ గదికి చేరుకున్న హర్షిత్ సాయంత్రం 4 గంటల సమయంలో తోటి స్నేహితులు వచ్చే సరికి ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకున్న వారు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీయగా.. ‘చిన్న చిన్న తప్పులు చేశాను.. స్నేహితుల వద్ద అప్పులు కూడా తీసుకున్నాను.. చదువులో సైతం పూర్గా ఉన్నాను.. జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్న’ అంటూ సెల్ఫీ వీడియో ఉన్నట్లు తేలింది. దీంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా తండ్రి నారాయణరావు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఫోన్ ఓపెన్ అయితే తెలుస్తుందన్న తండ్రి అనుమానం మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నెహ్రూ జూపార్కులోనే ఓ చీతా ఉంది తెలుసా! -
నా భార్య నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంది.. భర్త సెల్ఫీ వీడియో కలకలం..
సాక్షి, ఆదిలాబాద్: బలవంతపు పెళ్లిని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బోక్కలగూడలో భార్య వేధింపులు తట్టుకోలేక.. ఫిరోజ్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి, సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఒక మహిళ తనను బలవంతంగా పెళ్లి చేసుకుందని.. పైగా తరుచు వేధింపులకు పాల్పడుతుందని, ఆ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ యువకుడి పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. చదవండి: హయత్ నగర్లో దారుణం.. టీచర్ మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
హత్య చేసి పారిపోతూ....మృతదేహంతో సెల్ఫీ వీడియో!
చిన్నచిన్న వాటికే పెద్దగా రియాక్ట్ అయిపోయి జీవితాలను నాశనం చేసుకుని కటకటాల పాలవుతున్నారు చాలామంది. ఏ చిన్న బాధ, అవమానం కలిగిన అవతలవాళ్లను కడతేర్చాలనేంత ఉద్రేకానికి గురవ్వడం...ఇరు జీవితాలను తెలియకుండానే చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడోక వ్యక్తి చేసి కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలోని పంకజ్ అనే వ్యక్తి సురేష్ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఐతే పంకజ్ మద్యానికి బానిసై తరచు తాగుతూ ఇంటికి రావడంతో యజమాని సురేష్కి చిర్రేత్తుకొచ్చి గట్టిగా చివాట్లు పెడతాడు. ఆ తర్వాత పంకజ్ ఇంటి యజమానికి సురేష్, అతని కొడుకు జగదీష్లకు క్షమాపణలు చెప్పడంతో గొడవ సద్దుమణిగిపోయింది. ఐతే పంకజ్ ఇంటి యజమాని సురేష్ చాలా ఘోరంగా అవమానంగా తిట్టడాని, అందుకే తాను ఇక ఇంట్లో ఉండలేనని కొడుకు జగదీష్కి ఫోన్ చేసి చెబుతాడు. అంతేకాదు పంకజ్ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతాడు కూడా. ఐతే జగదీష్కి పంకజ్ తీరు మీద అనుమానం వచ్చి తండ్రి సురేష్ ఇంటికి వచ్చి చూస్తాడు. అంతే అక్కడ తండ్రి మృతి చెంది ఉండటం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అత్యాధునిక ఎలక్ట్రానిక్ ట్రేసింగ్ పరికరాల సాయంతో 250 కి.మీ దూరం వెంబడించి మరీ నిందితుడు పంకజ్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో సురేష్ని సుత్తితో కొట్టి చంపినట్లు తెలిపాడు. అంతేకాదు చంపి వెళ్లిపోతూ సురేష్ మృతదేహంతో ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పంకజ్ వెళ్లిపోతూ తన వెంట సురేష్ ఐడీ కార్డు, మొబైల్ ఫోన్ని కూడా తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఐతే నిందితుడు తన మీద అనుమానం రాకుండా అక్కడ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడూ జగదీష్కి వేర్వేరు ప్రదేశాల నుంచి పోన్లు చేస్తూ ఉన్నాడు. ఆ భయమే అతన్ని పోలీసులకు సునాయసంగా చిక్కేలా చేసింది. (చదవండి: రాజస్థాన్ దళిత చిన్నారి మృతి వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. నీళ్ల కుండే లేదంట!!) -
సెల్ఫీ వీడియో తీస్తూ రైతు ఆత్మహత్యాయత్నం
కౌడిపల్లి(నర్సాపూర్): సెల్ఫీ వీడియో తీస్తూ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువ రైతు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. దేవులపల్లి గ్రామానికి చెందిన జింక శ్రీశైలంకు గ్రామ శివారులోని అటవీభూమి పక్కన సాగుభూమి ఉంది. అందులో వరితోపాటు మిరప పంట సాగు చేశారు. ఇటీవల గ్రామానికి బృహత్ పల్లె ప్రకృతి వనం మంజూరైంది. అటవీశాఖ అధికారులు దీనికోసం ఐదు ఎకరాల స్థలం కేటాయించారు. శనివారం అక్కడికి వచ్చిన డిప్యూటీ ఎఫ్ఆర్ఓ రాజమణి, బీట్ అధికారి హరిత.. మిగతా భూమితోపాటు శ్రీశైలం పోడు చేసుకుంటున్న అటవీభూమిని సైతం దున్ని చదును చేయాలని సిబ్బందికి చెప్పారు. దీంతో శ్రీశైలం తమ తాతల కాలం నుంచి పోడు భూమిలో సాగు చేస్తున్నామని.. పంటను నాశనం చేయొద్దని అధికారులను కోరాడు. ఈ నేపథ్యంలో అతను అధికారులతో వాగ్వాదానికి దిగాడు. పనులను అడ్డుకోవడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై వారు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీశైలం, అటవీశాఖ అధికారులు, సర్పంచ్ కలసి తన పొలంలో బృహత్ పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేస్తున్నారంటూ సెల్ఫీ వీడియో ద్వారా బాధను తెలిపాడు. ఈ భూమి పోతే తమకు వేరే ఆధారం లేదని రోదిస్తూ పురుగు మందు తాగాడు. వీడియోను చూసిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అతడిని మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీశైలం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. అది అటవీ భూమి.. జింక శ్రీశైలం ఇప్పటికే అటవీ భూమిని ఆక్రమించి వరి సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది కొత్తగా మరో ఎకరా అటవీభూమి దున్ని మిరప పంట సాగు చేస్తున్నాడు. అటవీ భూమి కావడంతో పల్లెప్రకృతి వనం కోసం చదును చేస్తుండగా అడ్డుకొని ఇష్టానుసారంగా దూషించాడు. భూమికి సంబంధించి ఆధారాలు చూపించలేకపోయాడు. సిబ్బంది పనులకు అడ్డు తగలడంతో వాటిని నిలిపివేసి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ కోసం వస్తారన్న ఆందోళనతో శ్రీశైలం పురుగు మందు తాగి ఉండవచ్చు. – రాజమణి, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ, కౌడిపల్లి -
ఫైటర్ జెట్తో ప్రధాని విన్యాసాలు.. సెల్ఫీ వీడియో.. నెటిజన్ల ఫైర్!
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ పైలట్ యూనిఫామ్ ధరించి టైఫూన్ ఫైటర్ జెట్లో చక్కర్లు కొట్టారు. ఫైటర్ జెట్లో గగన విహారం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆ దృశ్యాలు సోమవారం విడుదల చేసింది డౌనింగ్ స్ట్రీట్. తన మాస్క్ ధరించి ఫైటర్ జెట్ను నడుపుతూ.. తనను అనుసరిస్తూ మరో రెండు విమానాలకు థంబ్స్ అప్ ఇవ్వడం వీడియోలో కనిపించింది. 'ప్రధాని బోరిస్ జాన్సన్ లింకన్షైర్లోని ఆర్ఏఎఫ్ కానింగ్స్బై నుంచి టైఫూన్ ఫైటర్ జెట్ కాక్పిట్లో ఎగురుతున్నారు.' అంటూ వీడియో క్యాప్షన్ ఇచ్చారు. ఐటీవీ ప్రకారం.. గత వారం లింకన్షైర్లోని రాయల్ ఎయిర్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) బేస్లో టైఫూన్ పైటర్స్ జెట్స్ ప్రదర్శన సందర్భంగా ఈ వీడియో తీశారు. ఈ సందర్భంగా ఆ ఫైటర్ జెట్లో ప్రయాణించిన బోరిస్.. కొన్ని విన్యాసాలు చేసేందుకు విమానాన్ని నియంత్రించానంటూ పేర్కొన్నారు. ఫైటర్ జెట్లో ప్రయాణంపై వింగ్ కమాండర్ అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలీలో సమాధానమిచ్చారు బోరిస్. మరోవైపు.. ఫైటర్ జెట్లో బోరిస్ ప్రయాణించటంపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వచ్చాయి. టాప్ గన్ సినిమాలో టామ్ క్రూజ్ ఫీట్లు చేసేందుకు ప్రయత్నించారని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. ప్రధాని ఈ జాయ్రైడ్లో జాలీగా వెళ్లడానికి, టామ్ క్రూజ్లా విన్యాసాలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు ఎంత ఖర్చయిందంటూ ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఈ రైడ్ వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటని మరొకరు ప్రశ్నించారు. విశ్వాస పరీక్షలో విజయం.. మరోవైపు.. ఇటీవలే ప్రధాని పదవికి రాజీనామా చేసి తాత్కాలిక బాధ్యతల్లో కొనసాగుతున్నారు బోరిస్ జాన్సన్. కొత్త ప్రధానిని ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతోంది. భారత సంతతి వ్యక్తి, ఆ దేశా మాజీ మంత్రి రిషి సునాక్ ముందంజలో ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో అధికార కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించింది. ఇదీ చదవండి: Rishi Sunak.. పావులు కదుపుతున్న బోరిస్ జాన్సన్.. రిషి సునాక్ ఓటమికి స్కెచ్! -
సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి బలవన్మరణం
గుణదల (విజయవాడ తూర్పు): మసాజ్ పేరుతో వ్యభిచార రొంపిలోకి దింపి, అసభ్యకరంగా ఉన్న ఫొటోలను బయట పెడతామంటూ వేధింపులకు గురి చేస్తున్న ముఠా కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయవాడలోని ఓ హోటల్లో మంగళవారం జరిగింది. మాచవరం పోలీసులు తెలిపిన వివరాలు.. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన బెరవలి శ్రీకాంత్రెడ్డి (30) ప్రైవేటు ఉద్యోగి. రెండేళ్ల క్రితం శ్రీలత అనే యువతితో అతడికి వివాహమైంది. శ్రీకాంత్రెడ్డి ఉద్యోగ విధుల్లో భాగంగా కొంతకాలంగా విజయవాడ వచ్చిపోతున్నాడు. ఈ క్రమంలో చైతన్య, సత్యకుమార్, సునిల్ అనే ముగ్గురు వ్యక్తులు పరిచయమయ్యారు. వీరు శ్రీకాంత్రెడ్డిని ఇటీవల ఓ మసాజ్ సెంటర్కు తీసుకెళ్లి ఓ మహిళతో చనువుగా ఉండేలా చేశారు. అదే సమయంలో సెల్ఫోన్లో వారి ఫొటోలు చిత్రీకరించిన ఆ ముగ్గురూ.. ఫొటోలు తొలగించాలంటే తమకు భారీగా నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడికి గురైన శ్రీకాంత్రెడ్డి మంగళవారం బెంజి సర్కిల్లోని ఓ హోటల్లో గది తీసుకుని తన ఆవేదనంతా చెప్పుకుంటూ ఓ సెల్ఫీ వీడియో తీశాడు. అనంతరం హోటల్ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, నిందితులు ముగ్గుర్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
దొంగతనం కేసు.. సెల్ఫీ వీడియో తీసి..
సాక్షి,రెబ్బెన(ఆసిఫాబాద్): ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులో అసలు దొంగలను పట్టుకోకుండా అన్యాయంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఓ యువకుడు సెల్పీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన మండలంలోని తక్కళ్లపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... తక్కళ్లపల్లి పరిధిలోని కొత్తగూడలో ఇటీవల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. దీంతో రెబ్బెన పోలీసులు దర్యాప్తులో భాగంగా గతంలో ట్రాన్స్ఫార్మర్ల దొంగతనం కేసులో సంబంధం ఉన్న పుప్పాల అంజితో పాటు మరో ముగ్గురిని అనుమానితులుగా భావించి పోలీస్స్టేషన్కు రప్పించి విచారణ అనంతరం తిరిగి ఇంటికి పంపించారు. సోమవారం సైతం మరోసారి స్టేషన్కు రావాలని చెప్పడంతో తనను దొంగతనం కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని తక్కళ్లపల్లి రైల్వేగేట్ సమీపంలో సెల్ఫీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగాడు. ఆ వీడియోను వాట్సప్ గ్రూప్లో పోస్టు చేయటంతో గమనించిన స్థానికులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అంజిని బెల్లంపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. ఈ విషయమై రెబ్బెన ఎస్సై భవానీసేన్ను వివరణ కోరగా అంజికి గతంలో ట్రాన్స్ఫార్మర్ల దొంగతనం చేసిన నేర చరిత్ర ఉండడంతో అనుమానంతో పోలీస్స్టేషన్కు పిలింపించి విచారించి వదిలేశాం. అంతకు మించి మాకు సంబంధం లేదు. పురుగుల మందు తాగిన అంజితోనూ మాట్లాడాను అని ఎస్సై తెలిపాడు. చదవండి: భార్యను సంతోష పెట్టడం కోసం రాజస్థాన్ నుంచి బెంగళూరుకు వచ్చి.. -
పారిపోలేదు!..నేను ఇక్కడే ఉన్నా! పోరాడుతున్నా: జెలెన్ స్కీ
For the second time Ukrainian president Posted A Video: ఉక్రెయిన్ పై రష్యా చర్చలు విఫలమైన నేపథ్యంలో ఉక్రెయిన్లోని జనావాసాలు, పౌరుల పైన భీంకరంగా దాడి చేయడం మొదలు పెట్టింది. అంతేకాదు పలు నగరాలను స్వాధీనం చేసుకోవడమే కాక. ఐరోపాలోని అతి పెద్ద అణు కర్మాగారంపై కూడా దాడులకు తెగబడింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు పోలాండ్కు పారిపోయాడంటూ పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించాయి. మరోవైపు రష్యా రాజకీయ నాయకుడు వ్యాచెస్లావ్ వోలోదిన్ ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యులకు జెలెన్ స్కీ అందుబాటులో లేరు ఆయన దేశ విడిచి పోలాండ్ వెళ్లిపోయాడని వెల్లడించారు. ఆఖరికి రష్య మీడియా సైతం ఉక్రెయిన్ అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లిపోయారని పేర్కొంది. దీంతో వోలోదిమిర్ జెలెన్ స్కీ తాను ఎక్కడికి పారిపోలేదని ఇక్కడే ఉన్నానంటూ శనివారం మరోసార సెల్ఫీ వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియోలో జెలెన్ స్కీ తాను కైవ్లోని ఉన్నానని, ఇక్కడే పని చేస్తున్నాను ఎవరు పారిపోలేదని చెప్పారు. అయితే ఉక్రెయిన్లో నెలకొన్న భయంకరమైన ఉద్రిక్తల నడుమ జెలెన్స్కీ యూఎస్ తరలింపు ప్రతిపాదనను సైతం అంగీకరించారంటూ వదంతులు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. మరోవైపు జెలెన్ స్కీ ఉక్రెయిన్ని విడిచి పెట్టను తగ్గేదేలే అంటూ ఆయన గట్టి కౌంటరిస్తూనే ఉన్నారు. ఈ మేరకు ఆయన తన కైవ్ కార్యాలయంలో నుంచి తీసిన ఒక సెల్ఫీ వీడియో సందేశంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. అంతేకాదు ఈ వీడియో సందేశంలో ఉక్రెయిన్ పై నో ఫ్లై జోన్ను అమలు చేయకూడదనే నాటో నిర్ణయాన్ని కూడా తప్పుబట్టారు. View this post on Instagram A post shared by Володимир Зеленський (@zelenskiy_official) (చదవండి: రష్యన్ డ్రోన్ విధ్వంసం: వైరల్ వీడియో) -
జెలెన్స్కీ సెల్ఫీ వీడియో
-
ఉక్రెయిన్ అధ్యక్షుడి సెల్ఫీ వీడియో! నేను చెప్పాలనుకుంటున్నది ఇదే..
Ukraine President Selfie Video: ఉక్రెయిన్ దళాలు శనివారం తమ రాజధాని కైవ్లో రష్యా దాడిని తిప్పి కొట్టాం అని ప్రకటించిన కొద్ది నిమిషాల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేశారు. ఆ వీడియోలో జెలెన్స్కీ "నేను ఇక్కడే ఉన్నాను, ఆయుధాలు వదిలి పారిపోలేదు. మా ఆయుధాతో రష్యా దాడిని తిప్పి కొట్టి మా దేశాన్ని రక్షించుకుంటాం. ఇదే సత్యం. అలాగే ఇంటర్నెట్లో నేను ఆయుధాలు వదిలేసి దేశం నుంచి పారిపోయానంటూ వదంతులు వస్తున్నాయి. అది నిజం కాదు. ఇది మా భూమి మా దేశాన్ని, మా పౌరులను రక్షిస్తాం. మా ఉక్రెయిన్ కీర్తిని కాపాడుకుంటాం. ఇదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాది. అని అన్నారు. జెలెన్స్కీ ఆ వీడియోలో ఆలివ్ ఆకుపచ్చ మిలిటరీ తరహా దుస్తులు ధరించి నిర్విరామ యుద్ధంతో అలిసి పోయినప్పటికీ ఏ మాత్రం బెదరకుండా తమ అజేయమైన ధైర్యసాహసాల్ని ప్రదర్శించటం విశేషం. అంతేకాదు ఆ వీడియోలో రాజధాని కైవ్ చుట్టు రష్యా దళాలు భూ, వాయు, జల మార్గాలలో వేస్తున్న బాంబుల మోత వినిపిస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Не вірте фейкам. pic.twitter.com/wiLqmCuz1p — Володимир Зеленський (@ZelenskyyUa) February 26, 2022 (చదవండి: అమ్మ నాన్న ఐ లవ్ యూ !..వైరల్ అవుతున్న ఉక్రెయిన్ సైనికుడి చివరి వీడియో!) -
ప్రేమ వివాహం: తణుకులో సెల్ఫీ సూసైడ్ వీడియో కలకలం..
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని తణుకులో సెల్ఫీ సూసైడ్ వీడియో కలకలం రేపింది. పట్టణానికి చెందిన కొల్లి వెంకటేష్ (26) ఉరి వేసుకుని శనివారం ఆత్మహత్మ చేసుకున్నాడు. అయితే మూడు నెలల క్రితం అతని భార్య లక్ష్మి తులసి కూడా ఆత్మహత్య చేసుకొంది. వెంకటేష్, లక్ష్మి తులసిది ప్రేమ వివాహం. ఇద్దరు పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలో కులం తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నావంటూ ఇరుగుపొరుగు వారు తన భార్యను వేధించినట్లు వీడియోలో పేర్కొన్నారు. ఈ విషయంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సైతం స్పందించలేదని ఆరోపించాడు. ఈ వివాదాలతో పాటు తనకు రూ.7 లక్షలు అప్పు కూడా ఉన్నట్లు వెంకటేష్ సూసైడ్ నోట్లో వివరించాడు. చదవండి: (శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. భార్య, అత్తను కిరాతకంగా..) -
వనమా రాఘవేంద్ర అరెస్ట్ పై కొనసాగుతున్న సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్: పాల్వంచ రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసులో వనమా రాఘవేంద్రరావు చుట్టు ఉచ్చు బిగుస్తుంది. వనమాకు సంబంధించి మరో కేసు వెలుగులోకి వచ్చింది. మనుగురు ఫైనాన్స్ వ్యాపారి మలిపెద్ది వెంకటేశ్వర్లు సూసైడ్ కేసులో ఎఎస్పీ శబరిష్ ఎదుట విచారణకు హాజరవ్వాలని అధికారులు నోటీసులు జారీచేశారు. వనమాను శుక్రవారం మధ్యాహ్నంకల్లా లొంగిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. పోలీసులు రాఘవకు సంబంధించి పాత కేసులపై మరోసారి విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి.. వనమాను వెతకడానికి 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నిన్న (గురువారం)వనమాను అరెస్టు చేసినట్లు కొన్నివదంతులు వ్యాపించాయి. దీన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. అయితే, వనమా.. రాజమండ్రిలో ఉన్నట్లు సమాచారం రావడంతో కొన్ని టీంలు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. వనమా వ్యవహరం ఇప్పుడు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. గడువులోగా రాఘవేంద్ర అరెస్టా? లొంగుబాటా? అనేదానిపై సస్సెన్స్ కొనసాగుతుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: ఎమ్మెల్యే తనయుడితో పోరాడలేకే వెళ్లిపోతున్నాం -
ఎమ్మెల్యే తనయుడితో పోరాడలేకే వెళ్లిపోతున్నాం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య ఉదంతంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసిన సెల్ఫీ వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన తల్లి సూర్యావతి, అక్క మాధవితోపాటు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేందర్రావు పెట్టిన బాధలను ఆ వీడియోలో వివరించారు. చనిపోయే ముందు తన కారులో కూర్చొని 8:55 నిమిషాల నిడివి గల వీడియో తీసిన రామకృష్ణ తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, మానసిక క్షోభను వివరించారు. ఇది అందరినీ కలచివేస్తోంది. వీడియోలో రామకృష్ణ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే... ►వాళ్లుండేది (తల్లి, అక్క) సొంతిళ్లు.. రూ. పది వేల అద్దె వస్తుంది. వాళ్లకు సంవత్సరానికి పంట కౌలు వస్తుంది. నాకు పొలం మీద ఆదాయం రాదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేను వనమా రాఘవేందర్రావు గారి వద్దకు వెళ్లా. ఈ సమస్య తేలాలంటే నీ భార్యను తీసుకొని హైదరాబాద్కు రా. పిల్లలు లేకుండా. అప్పడు నీ సంగతి చూస్తా. అప్పటివరకు ఈ సమస్య పరిష్కారం కాదు. ఎక్కడికి వెళ్లినా ఎవరూ ఏమీ చేయలేరు. నయాపైసా నీకు రాకుండా చేస్తానని రాఘవేందర్రావు నాతో చెప్పారు. ►సాయం కోసం వెళ్తే నా భార్యను పంపాలన్న ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలి? కనీసం డబ్బు రూపంలో అడిగినా నేను ఇచ్చేవాడిని. కానీ నా భార్యను కోరుకున్నాడు. దాన్ని జీర్ణించుకోలేకపోయా (ఈ విషయం నా భార్యకు తెలియదు). వీళ్లతో పోరాడే స్థితిలో నేను లేను. రాజకీయ, ఆర్థిక అండదండలూ లేవు. నేనొక్కడినే ఏదైనా చేసుకుంటే రేపు నా భార్య పరిస్థితి ఏంటి? ఆమెను అసలు వీళ్లు ఏం చేస్తారో, నా పిల్లలు ఏమైపోతారో కూడా అర్థంకావడం లేదు. నడిరోడ్డుపై వదిలేసి నా దారి నేను చూసుకోవడం బాధ్యత కాదు. కాబట్టి నాతోపాటే వారినీ తీసుకెళ్లిపోతున్నా. ►నా జీవితం ఎలాగైనా ఫర్వాలేదు. ఇంకా వేరే కుటుంబాలు పాడవకుండా ఊళ్లో మిగిలిన పెద్దలు, నాయకులంతా కలిసి నా తండ్రి ద్వారా నాకు వచ్చే ఆస్తిని.. నాకు ఆర్థికసాయం చేసిన వారికిచ్చి నా అప్పు తీర్చండి. మిగిలింది వారి (అమ్మ, అక్క)కే వదిలేయండి. ►రాఘవేందర్రావు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. ఇంకా చాలా కుటుంబాలు నాశనమవుతాయి. ఈ మధ్య కాలంలోనే పాల్వంచలో ఒకతను ఆయన పేరు రాసి చనిపోయాడు. నెల రోజులు ఎక్కడో దాక్కొని ఆ తర్వాత వచ్చాడు. మూడు, నాలుగు నెలల్లోనే మళ్లీ ఇలా దురాగతాలు చేస్తోంటే సామాన్యులు ఎలా బతుకుతారు? కుదిపేసిన సెల్ఫీ వీడియో... ఎమ్మెల్యే తనయుడిపై రామకృష్ణ చేసిన ఆరోపణలు ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. అజ్ఞాతంలో ఉన్న రాఘవను అరెస్ట్ చేసి శిక్షించాలంటూ మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, బీఎస్పీ శ్రేణులు గురువారం ఆందోళనను ఉధృతం చేశాయి. పాల్వంచలోని ఎమ్మెల్యే నివాసాన్ని బీజేపీ నాయకులు ముట్టడించగా పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొత్తగూడెంలో వనమా రాఘవ దిష్టిబొమ్మను దహనం చేశారు. వామపక్ష నేతలు శుక్రవారం కొత్తగూడెం నియోజకవర్గ బంద్కు పిలుపునిచ్చారు. రాఘవేందర్పై ఆరు కేసులు.. వనమా రాఘవేందర్రావుపై పాల్వంచ పట్టణం, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఆరు కేసులున్నాయి. 2013లో పాల్వంచ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి చీరలు పంపిణీ చేసిన ఘటనలో ఐపీసీ 336, 353, 171, 188 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ►2017లో పాల్వంచలోని కేటీపీఎస్ సెంటర్లో ఆర్టిజన్లకు ఉద్యోగాలు కల్పించాలని ఆందోళన చేస్తూ అధికారుల విధులకు ఆటంకం కలిగించినట్లు ఐపీసీ 427, 149 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ►2020లో ఓ స్థల వివాదంలో రాఘవేందర్ అనుచరులు గిరిజన మహిళపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఘటనలో రాఘవపై ఐపీసీ 158, 307 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసు ఎస్సీ, ఎస్టీ కమిషన్కు వెళ్లడం సంచలనంగా మారింది. ►2020లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు కేసు నమోదైంది. ►2021లో పాల్వంచ జయమ్మ కాలనీకి చెందిన మలిపెద్ది వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా.. అందుకు కారకుల్లో రాఘవ పేరు కూడా ఉండటంతో ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన ఏ1గా ఉన్నారు. ►తాజాగా నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో రాఘవేందర్పై 302, 307, 306 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆయన ఏ2గా ఉన్నారు. -
సంచలనంగా మారిన రామకృష్ణ సెల్ఫీ వీడియో
-
ఏ భర్తకూడా వినకూడని మాటలు విన్నాను..
సాక్షి, ఖమ్మం: పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మీ సేవ నిర్వాహకుడు రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీవీడియో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వీడియోలో రామకృష్ణ తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవేంద్రరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. వనమా రాఘవా తనను మానసికంగా వేధించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. వనమా అరాచకాలను చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఏ భర్తకూడా వినకూడని మాటలను రాఘవ అన్నారని ఆవేదన చెందాడు. రాజకీయ, ఆర్థిక బలంతో రాఘవ.. పబ్బం గడుపుకోవాలని చూశారని విమర్శించాడు. తాను చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు అందుకే.. వారితో పాటు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. తన సోదరుడు, అక్క కూడా ఇబ్బందిపెట్టారన్నారు. వనమా.. నా భార్యను హైదరాబాద్ తీసుకొస్తేనే నా సమస్యను పరిష్కారిస్తానని నీచంగా మాట్లాడాడు. వీరివల్ల మానసికంగా కృంగిపోయి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. కాగా, ప్రస్తుతం ఈ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. బీజేపీ నాయకులు వనమా ఇంటిని ముట్టడించారు. తక్షణం రాఘవను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: కుటుంబం ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడి పేరు? -
బావ లైంగిక వేధింపులు.. మహిళ ఆవేదన.. ఆత్మహత్య
సాక్షి, కరీంనగర్: కరీంనగర్లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక కాపువాడలో నివాసం ఉండే వివాహిత.. లైంగిక వేధింపులు తాళలేక సెల్ఫీవీడియో తీసిన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బావ కనకయ్య కొన్ని రోజులుగా తనను.. లైంగికంగా వేధిస్తున్నాడని ఆత్మహత్య చేసుకునే ముందు వీడియోలో తెలిపింది. ఈ వీడియోలో బాధితురాలు అరుణ.. తన భర్త ఇంట్లో లేని సమయంలో కనకయ్య ఇంటికి వచ్చి వేధిస్తూ.. పిల్లలకు తప్పుగా చెబుతానని బెదిరించేవాడని పేర్కొంది. కాగా, తాను.. కష్టపడి మిషన్ కుట్టుకుంటూ తన పిల్లలను పోషించుకుంటున్నట్లు తెలిపింది. కనకయ్య వేధింపులు తట్టుకోలేక.. ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో అరుణ ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలు ఎవరిజోలికి పోకుండా జాగ్రత్తగా బతకాలని తన చివరి మాటగా అరుణ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడి బలవన్మరణం
సాక్షి, జవహర్నగర్: సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. కార్పొరేషన్ పరిధిలోని వెంకటేశ్వరకాలనీలో నివసించే ఆటో మల్లేశం కుమారుడు అశోక్ (28) కొరియర్ బోయ్గా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచి్చన అశోక్ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ‘నేను నానమ్మ దగ్గరకు వెళ్తున్నాను. ఇదే నా చివరి వీడియో. నేను నిజంగా ఉరి వేసుకుంటున్నా..’ అని చెబుతూ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియో క్లిప్ను మిత్రుడికి పంపి ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు పూర్తిగా వెల్లడి కాలేదు. చదవండి: భర్త తనకు నచ్చినట్లు షర్ట్ కుట్టించుకోలేదని.. భార్య ఆత్మహత్య -
పోలీసులు ఇష్టమొచ్చినట్లు కొట్టిండ్రు..
సాక్షి, వీణవంక(కరీంనగర్): వీణవంక మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన టీఆర్ఎస్ పార్టీ ధూంధాం కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. నరసింహులపల్లి గ్రామానికి చెందిన నిరుద్యోగి లకోట నిరోష ఉద్యోగ ప్రకటనపై ప్రశ్నించగా.. నాయకులు, పోలీసులు ఆమెను సభ నుంచి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై సోమవారం సదరు యువతి తన ఆవేదనను సెల్ఫీ వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వేస్తారని అడిగినందుకు అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ వాళ్లు రూ.10 లక్షలు ఇచ్చి పంపించారా అంటూ బెదిరించినట్లు ఆరోపించింది. అక్కడి నుంచి వస్తుంటే పోలీసులు ఇష్టమొచ్చినట్లు కొటట్టారని.. మెడలో ఉన్న గోల్డ్ చైన్ కూడా పోయిందని చెప్పింది. చేతులు, కాళ్లు పట్టుకొని కదలనివ్వకుండా చేశారని.. పోలీస్స్టేషన్కు వెళ్లిన తర్వాత కూడా మాట్లాడదామనుకుంటే పోలీసులు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. వారు కేసీఆర్కు తొత్తులుగా మారారంటూ వీడియోలో కంటతడి పెట్టింది. చదవండి: పచ్చని సంసారంలో కేసీఆర్ నిప్పు పెట్టారు -
కర్కశ తల్లి లక్ష్మీ అనూష అరెస్టు.. వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే
సాక్షి, కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో కన్న బిడ్డలను కర్కశంగా హతమార్చిన లక్ష్మీ అనూషను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బిడ్డలను హత్య చేసిన రోజే నిందితురాలు ఈ సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. తర్వాత తానే హత్య చేసినట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో అనూష మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం కుదుటపడిందని తెలుసుకున్న పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పిల్లలను హత్య చేస్తూ తీసుకున్న సెల్పీ వీడియోను స్వాధీనం చేసుకున్నారు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఈ అఘాయిత్యానికి పాల్పడిందని నిందితురాలి తాత మీడియాకు చెప్పారు. కొన్నాళ్లు పిల్లలను చాలా బాగానే చూసుకునేదని, ఇటీవలే ఆమెలో మార్పు వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యాడు. చదవండి: (రాజమహేంద్రవరంలో దారుణం..) -
మాచనపల్లెలో భూ వ్యవహారం వివాదాస్పదం.. స్పందించిన సీఎం ఆఫీస్
దువ్వూరు/కడప అర్బన్/చాగలమర్రి: వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండల పరిధిలోని మాచనపల్లెలోని సర్వే నంబర్ 325/1లో ఉన్న 1.50 ఎకరాల భూమి వివాదం చర్చనీయాంశమైంది. ఈ భూమికి సంబంధించి తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన మిద్దె అక్బర్ బాషా శుక్రవారం రాత్రి ఫేస్బుక్లో తన కుటుంబ సభ్యులతో కలసి సెల్ఫీ వీడియో పెట్టాడు. అందులో.. దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామానికి చెందిన తన భార్య అఫ్సానాకు తన మేనత్త ఖాసీంబీ 2009లో ఎకరా 50 సెంట్లు దాన విక్రయం కింద ఇచ్చిందని తెలిపారు. కొంత కాలంగా ఆ భూమి సాగు చేసుకుంటున్నానని, అయితే ఇప్పుడు ఆ భూమిలో కొందరు అక్రమంగా నాట్లు వేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. వైఎస్సార్సీపీ నాయకులు ఇరగంరెడ్డి తిరుపాలరెడ్డి, ఆయన కుమారుడు విశ్వేశ్వరరెడ్డి తన భూమిని ఆక్రమించుకున్నారని.. మైదుకూరు రూరల్ సీఐ వెంకట కొండారెడ్డి వారికి మద్దతు తెలుపుతూ ఎన్కౌంటర్ చేస్తామని తనను బెదిరిస్తున్నాడని చెప్పాడు. తమకు న్యాయం చేయకుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని పేర్కొన్నారు. వెంటనే స్పందించిన పోలీసులు అక్బర్బాషా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సీఎంవో వెంటనే స్పందించింది. ఈ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయాలని వైఎస్సార్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ను ఆదేశించింది. ఆయన వెంటనే ఆళ్లగడ్డ రూరల్ సీఐ రాజశేఖర్రెడ్డి, దువ్వూరు ఎస్ఐ చప్పలరాజులకు సమాచారం ఇచ్చారు. వారు తమ సిబ్బందితో హుటాహుటిన చాగలమర్రిలో ఉన్న మిద్దె అక్బర్ బాషా కుటుంబం వద్దకు నిమిషాల వ్యవధిలో చేరుకుని వారికి న్యాయం చేస్తామని తెలిపారు. ఇదే విషయమై శనివారం కడప మేయర్ సురేష్బాబు అక్బర్ కుటుంబంతో కలిసి కడప జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చారు. ఎస్పీని కలిసిన అనంతరం పోలీసు కార్యాలయం ఆవరణలో అక్బర్ బాషా మీడియాతో మాట్లాడారు. జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో విలేకరులతో మాట్లాడుతున్న అక్బర్బాషా, ఆయన భార్య అఫ్సానా తన భార్యకు దాన విక్రయం కింద ఇచ్చిన భూమి రిజిస్టర్ను ఖాసీంబీ 2011 ఆగస్టు 20న రద్దు చేయించి, ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి కుమారుడు విశ్వేశ్వరరెడ్డి పేరు మీద (డాక్యుమెంట్ నంబర్ 251/2012) తిరిగి రిజిష్టర్ చేయించిందన్నారు. ఈ విషయమై మైదుకూరు సివిల్ కోర్టులో దావా వేయగా తమకు తాత్కాలిక ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిందని చెప్పారు. ఈ వ్యాజ్యం కోర్టులో నడుస్తుండగానే.. విశ్వేశ్వరరెడ్డి దువ్వూరు మండలం సంజీవరెడ్డి పల్లెకు చెందిన పెద్ద పుల్లారెడ్డి కుమారుడు వీర లక్ష్మిరెడ్డికి ఆ భూమిని అమ్మి (డాక్యుమెంట్ నెంబర్ 5/2019) రిజిస్టర్ చేయించారన్నారు. ఆపై వారిద్దరూ రాజకీయ పలుకుబడితో తమ కుటుంబాన్ని బెదిరిస్తూ భూమిని సాగు చేయిస్తున్నారని చెప్పారు. ఈ విషయం ఎస్పీకి వివరించామని, వారం రోజుల్లో తమకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ కడప మైనార్టీ నేత ఎస్ఎండీ షఫీ, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు. వైఎస్ జగన్ను అభాసుపాలు చేసేందుకే.. మిద్దె అక్బర్ బాషా వైఎస్సార్సీపీ కార్యకర్త అని, అతడిని బెదిరించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరానని కడప నగర మేయర్, వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షుడు కె.సురేష్బాబు తెలిపారు. ఈ సంఘటనతో సంబంధం ఉన్న వారు వైఎస్సార్సీపీ వారైనా చర్యలు తీసుకోవాలని చెప్పానన్నారు. అక్బర్బాషా కుటుంబానికి అండగా వుంటామన్నారు. ఎక్కడో ఒక సంఘటన జరిగితే సీఎం వైఎస్ జగన్ వైఫల్యమని సామాజిక మాధ్యమాల్లో రావడం బాధాకరమన్నారు. సువర్ణ పాలన అందిస్తున్న వైఎస్ జగన్ను, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకే కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఆ భూమిని 2012లోనే కొన్నాం ఈ విషయంపై డీసీసీబీ మాజీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్రెడ్డి, విశ్వేశ్వరరెడ్డిలను వివరణ కోరగా ఖాసీంబీ 2012లో తమ వద్దకు వచ్చిందని.. తన కూతురు, అల్లుడు మోసం చేశారని.. రద్దు చేసిన దాన విక్రయ పత్రాలను చూపించిందన్నారు. తమకు ఒక ఎకరాను రూ.6 లక్షలకు అమ్మిందని తెలిపారు. చట్ట ప్రకారం ఆ భూమి తమకే చెందుతుందని పేర్కొన్నారు. కాగా, ఈ సర్వే నంబర్లో 13 మంది రైతుల పేర్లు ఉన్నాయని, వాటన్నింటినీ పరిశీలించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని రెవిన్యూ అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ విషయం తన దృష్టికి రావడంతో దగ్గరలో ఉన్న పోలీసులను 20 నిమిషాల్లో బాధితుడి ఇంటికి పింపి.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, వారు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా ఆపామని వైఎస్సార్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ చెప్పారు. ఈ విషయమై బాధితులకు న్యాయం చేయాలని సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. మైదుకూరు రూరల్ సీఐ వెంకటకొండారెడ్డిపై వచ్చిన ఆరోపణలపై అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) దేవప్రసాద్ను విచారణాధికారిగా నియమించామని తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు వెంకట కొండారెడ్డిని విధుల నుంచి తప్పిస్తున్నట్టు వెల్లడించారు. భూమి వద్దకు వస్తే అల్లుడే చంపుతామంటున్నాడు.. అక్బర్ అత్త ఖాసింబీ ఆవేదన కడప రూరల్: ఏకాకినైన తనను భూమి వద్దకు వస్తే చంపుతామని అక్బర్ బెదిరిస్తున్నాడని వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం యర్రబల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు తద్ది ఖాసింబీ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. తమకు సంతానం లేదని, తన భర్త మరణించినందున ఏకాకిగా ఉంటున్నానని తెలిపారు. గతంలో తాను చాగలమర్రిలోని తన సొంతింటికి వెళ్లినప్పుడు.. కొన్ని రోజులకు తన తమ్ముడి కొడుకు అక్బర్, కోడలు అఫ్సానాలు తనను ఇంటి నుంచి గెంటేశారని ఆరోపించారు. దీంతో జీవనాధారం కోసం అర ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటుంటే అక్బర్.. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల అండతో భూమి వద్దకు వస్తే చంపుతామని బెదిరించారని పేర్కొన్నారు. తన నుంచి ఒక ఎకరా భూమిని కొలుగోలు చేసిన వారిని కూడా పొలంలోకి దిగనీయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పారు. దీంతో తాను ఆత్మ రక్షణ కోసం శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెప్పారు. వారి నుంచి తన ఆస్తికి, ప్రాణాలకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు జి.ఖాసీం, సమానుల్లా, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
పొలం వివాదం: సెల్ఫీ వీడియోలపై స్పందించిన సీఎంవో
-
పొలం వివాదం: సెల్ఫీ వీడియోలపై స్పందించిన సీఎంవో
సాక్షి, వైఎస్సార్ జిల్లా: దువ్వూరు మండలం ఎర్రబల్లి వద్ద పొలం వివాదం ఘటనలో అక్బర్ బాషా కుటుంబ సభ్యుల సెల్ఫీ వీడియోలపై సీఎంవో స్పందించింది. అక్బర్ బాషా ఆవేదనపై సీఎం కార్యాలయం స్పందిస్తూ.. అక్బర్ బాషా ఇంటికి వెళ్లి విచారణ చేపట్టాలని ఎస్పీని ఆదేశించింది. అక్బర్ బాషా కుటుంబ సభ్యులతో పోలీసు అధికారులు మాట్లాడారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఘటనపై సమగ్ర విచారణ: ఎస్పీ అన్బురాజన్ అక్బర్ బాషా కుటుంబం.. ఎస్పీ అన్బురాజన్ను కలిసింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, అక్బర్ బాషా ఆత్మహత్యాయత్నం వీడియో వైరల్ కావడంతో వెంటనే స్పందించామన్నారు. చాగలమర్రి దువ్వూరు పోలీసుల సహకారంత కాపాడగలిగామన్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నామని.. అదనపు ఎస్పీ దేవప్రసాద్ నేతృత్వంలో విచారణ చేపట్టామని ఎస్పీ తెలిపారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని పేర్కొన్నారు. విచారణ జరిగే వరకు సీఐ కొండారెడ్డిని విధుల నుంచి తప్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. సీఐ, ఇతర పోలీసుల తప్పు ఉంటే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు. అక్బర్ బాషా కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. ఇవీ చదవండి: ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణం: 19 మందిపై ఎఫ్ఐఆర్ ఢిల్లీలో భారీ వర్షం.. 18 ఏళ్ల తర్వాత తొలిసారి -
'నా చావుకు బాకీలోల్లే కారణం'.. సెల్ఫీ వీడియో
-
'నా చావుకు బాకీలోల్లే కారణం'.. సెల్ఫీ వీడియో
మంచిర్యాల: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సెల్పీ వీడియో తీసుకొని ఒక వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. బాకీలోల్లు తనపై చేస్తున్న ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు సదరు వ్యక్తి వీడియోలో స్పష్టం చేశాడు. ''నన్ను అప్పులోల్లు బాగా వేధిస్తున్నారు. దీనికి తోడు బ్యాంకు నుంచి కూడా ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. కనీసం భార్యపిల్లలున్నారనే అనే ఆలోచన లేకుండా నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మృతి చెందిన వ్యక్తి ఆదిలాబాద్ పట్టణంలోని బుక్తాపూర్ కాలనీకి చెందిన జక్కుల శ్రీనివాస్గా గుర్తించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
హారతి ఆరిపోయింది.. కుంకుమ భరిణె కిందపడింది..
సాక్షి, బంజారాహిల్స్: దేవుడికి హారతి ఇస్తుండగా మధ్యలోనే హారతి ఆరిపోయింది.. దేవుడికి బొట్టు పెట్టేందుకు కుంకుమ భరణె చేతులోకి తీసుకోగానే అది చేతులో నుంచి జారి కిందపడిపోయింది. దీంతో తనకు ఆయుష్షు మూడిందని భావించిన ఓ వివాహిత సెల్ఫీ వీడియో ఆన్చేసి సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్కు చెందిన ఓంప్రకాశ్, కబిత తమ నాలుగేళ్ల కూతురుతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నెం.78లోని పద్మాలయ అంబేడ్కర్నగర్ బస్తీలో అద్దెకుంటున్నారు. ఈ నెల 2వ తేదీన ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఓంప్రకాశ్ తాను డ్రైవింగ్ చేసే చోటకు కూతురిని తీసుకొని వెళ్లిపోయాడు. రాత్రి 7.30 గంటలకు డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చి తలుపుతట్టగా భార్య ఎంతకూ తలుపు తీయలేదు. కిటికీలో నుంచి లోనికి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. దీంతో ఇంటి యజమాని సహాయంతో తలుపులు తీసి చూడగా అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. అక్కడే ఉన్న సెల్ఫోన్ చూడగా ఆన్లోనే ఉంది. సెల్ఫోన్లో వీడియో ఆన్చేసి ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా అంతకుముందు హారతి ఆరిపోవడాన్ని, కుంకుమ భరణి కిందపడిపోవడాన్ని సైగలతో చూపించి తనకు ఆయుష్షు తీరిపోయిందని చెప్పినట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘నేను చనిపోతేనే నీకు ప్రేమ విలువ తెలుస్తుంది’
సాక్షి, అమీర్పేట: ‘నేను చనిపోతేనే నీకు ప్రేమ విలువ తెలుస్తుంది’అంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్ మండలం కేపీ పాలెం గ్రామానికి చెందిన గొర్రె సుధాకర్ (29) హైదరాబాద్కు వచ్చి ఎస్సై ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. బీకేగూడ వేంకటేశ్వర దేవాలయం సమీపంలో గదిని అద్దెకు తీసుకుని స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. శనివారం రాత్రి రూమ్మేట్ భార్గవ్ గది తలుపులు తట్టగా, ఎంతసేపటికీ తలుపు తీయక పోవడంతో పై పోర్షన్లోకి వెళ్లి బాల్కనీ ద్వారా గదిలోకి వెళ్లి చూడగా సుధాకర్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపారు. సెల్ఫోన్లో తీసుకున్న సెల్ఫీ వీడియోను గుర్తించారు. ప్రేమ విఫలం కావడంతోనే సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతుడి బాబాయ్ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రేయసితో సెల్ఫీ వీడియో: చనిపోతున్నా.. చివరిసారి చూసిపో..
గుర్రంపోడు: ‘నువ్వే నా ప్రాణమని చెప్పా.. ఇక బతికినా నీతోటే... చచ్చినా నీతోటే అని చెప్పినా నువ్వు పట్టించుకోలేదు.. నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను.. అందుకే చనిపోతున్నా.. చివరిసారి చూసిపో.. ఇదే నా ఆఖరి కోరిక’ అంటూ ఓ యువకుడు ప్రియురాలిని కోరుతూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. నల్లగొండ జిల్లా గుర్రంపోడుకి చెందిన మైదాసు రమేశ్, యాకాశమ్మ దంపతుల కుమారుడు రాకేశ్ నల్లగొండలో డిగ్రీ పూర్తిచేసి వ్యవసాయంలో తల్లిదండ్రులకు సాయంగా ఉంటున్నాడు. రాకేశ్ అదే ప్రాంతానికి చెందిన యువతిని కొంతకాలంగా ఇష్టపడుతున్నాడు. అయితే, తాను ప్రేమించిన యువతికి మరొకరితో జూన్ 2న వివాహం నిశ్చయించారని తెలుసుకున్న రాకేశ్ మనస్తాపానికి గురయ్యాడు. శనివారం సాయంత్రం తాను చని పోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకొని స్నేహితుల వాట్సాప్ గ్రూపులో పోస్టు చేసి ఉరేసుకున్నాడు. వేరే ఊరిలో బంధువుల పెళ్లికి వెళ్లిన తల్లిదండ్రులకు స్నేహితులు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు ఇంటికి వచ్చి.. ప్రాణాపాయస్థితిలో ఉన్న రాకేశ్ను నల్లగొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. చదవండి: చనిపోయాడని తెలియక.. రాత్రంతా మృతదేహంపై నిద్ర..! -
ప్రాణాలు పోయేలా ఉన్నాయ్..కాపాడండి అంటూ ఆర్తనాదాలు
-
అవినీతి ఖాకీ ‘సెల్ఫీ బాణం’
తాడిపత్రి రూరల్: కరోనా సోకినా లీవు ఇవ్వడం లేదంటూ తాడిపత్రి రూరల్ కానిస్టేబుల్ గణేష్ బాబు చేసిన హడావుడి అందరికీ తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో గణేష్ సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో స్వయంగా ఎస్పీ సత్యయేసుబాబు రంగంలోకి దిగి ప్రకటన చేయాల్సి వచ్చింది. తాజాగా గణేష్ బాబు సెల్ఫీ వీడియో వెనుక ఎవరి హస్తమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నానంటూనే ఓ సీఐ, ఎస్ఐ పేర్లను గణేష్ టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. వీఆర్లో ఉన్న ఓ ఖాకీ కనుసన్నల్లోనే సెల్ఫీ వీడియో వ్యవహారం జరిగినట్లు పోలీసులు ఓ అభిప్రాయానికి వచ్చారు. గతంలో తాడిపత్రి పట్టణ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించిన సమయంలో అతనిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆ హెడ్ కానిస్టేబుల్ను మూడుసార్లు వీఆర్కు పంపగా.. తిరిగి పైరవీలు చేసుకొని ఇదే ప్రాంతానికే బదిలీపై వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం వీఆర్లో ఉన్న ఆ హెడ్కానిస్టేబుల్ సిక్ లీవుపై వచ్చి ఇక్కడ గ్యాంబ్లింగ్ నిర్వాహకులకు పరోక్షంగా సహకరిస్తున్నట్లు సమాచారం. వసూళ్ల పర్వం బయట పడిందనే... గణేష్ సెల్ఫీ వీడియో వెనుక ప్రస్తుతం వీఆర్లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ హస్తం ఉన్నట్లు స్పష్టమైంది. గతంలో తాడిపత్రి రూరల్ పోలీస్స్టేషన్లో ఆ కానిస్టేబుల్ విధులు నిర్వహించేవాడు. ఆ సమయంలో గ్యాంబ్లింగ్ ఆర్గనైజర్స్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటూ అక్రమ వసూళ్లకు తెరలేపిన అంశాన్ని ఉన్నతాధికారులకు ఆ స్టేషన్ ఎస్ఐ తెలియజేశారు. ఈ విషయంలో ఉన్నతాధికారుల విచారణకు భయపడిన సదరు హెడ్కానిస్టేబుల్ తన తప్పు కప్పిపుచ్చుకునేందుకు తన సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులను రెచ్చగొట్టి వారి చేత ఆ ఎస్ఐకి వ్యతిరేకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు పంపడమే కాక, మూకుమ్మడి సెలవుల పేరుతో బెదిరింపులకు దిగాడు. ఆ సమయంలో విచారణకు వచ్చిన డీఎస్పీతో ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కానిస్టేబుల్ గణేష్ కూడా గట్టిగా వాదించినట్లు తెలిసింది. పావుగా మారిన గణేష్.. ప్రస్తుతం వీఆర్లో ఉన్న హెడ్కానిస్టేబుల్ ఓ ఎస్ఐపై కక్షగట్టి తగిన సమయం కోసం వేచి చూస్తున్న తరుణంలో గణేష్ రూపంలో అవకాశం దక్కింది. ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. గత నెల 25న కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన గణేష్ను ఉన్నతాధికారులు ప్రత్యేక అంబులెన్స్లో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో గణేష్తో వీడియో చేయించి సోషల్ మీడియాలో వైరల్ చేయించాడు. తనను ఉద్యోగపరంగా ఎస్ఐ వేధిస్తున్నాడని, సెలవు అడిగినా ఇవ్వలేదని, కరోనా అని చెప్పినా డ్యూటీ చేయించాడని, సీఐ కూడా తనను మందలించాడని వీడియోలో పేర్కొన్నాడు. మూడు రోజుల చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో కానిస్టేబుల్ గణేష్ డిశ్చార్జి అయ్యాడు. అయితే ఈ మొత్తం అడ్డగోలు వ్యవహారంతో పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసిన అవినీతి ఖాకీపై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. చదవండి: జెడ్పీ సీఈఓ కుటుంబంలో విషాదం.. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల కన్నుమూత -
కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధి బోడ్ సునీల్ మృతి
-
'నాకు ఉద్యోగం రాలేదు.. అందుకే చనిపోతున్నా'
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. తేజావత్ రామ్ సింగ్ తండాకు చెందిన బోడ సునీల్ అనే యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. అదే క్రమంలో ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడంలేదని.. తనకు ఉద్యోగం రాకపోవడంతో పురుగుల మందు తాగినట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. మార్చి 27న వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం వద్ద సునీల్ పురుగుల మందుతాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా... వెంటనే అతన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మార్చి 28 వ తేదీన నిమ్స్ కు తరలించారు. కాగా చికిత్స పొందుతూ సునీల్ శుక్రవారం ఉదయం కన్నుమూశాడు. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో సునీల్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. -
అలాంటి ప్రేమను ఒప్పుకోరు.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ..
ఉరవకొండ: ‘‘కులం చూడకుండా ఎవరూ ప్రేమించవద్దు.. అలాంటి ప్రేమను పెద్దలు ఒప్పుకోరు..’’ అంటూ వీడియో తీసుకుంటూ క్రిమిసంహారక మందు తాగి ఓ యువకుడు మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విడపనకల్లుకు చెందిన బెస్త సుధాకర్ గత ఐదేళ్లుగా కడప జిల్లాలోని ఎర్రగుంట్లలో జేసీబీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అక్కడే ఓ అమ్మాయితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అయితే ప్రేమ విఫలమైందో, పెద్దలు అంగీకరించలేదో కానీ.. మంగళవారం ఉరవకొండ సమీపంలోని బూదగవి కొండపైకి క్రిమిసంహారక డబ్బాతో వెళ్లాడు. అక్కడ తన సెల్ఫోన్లో వీడియో తీసుకుంటూ ‘‘కులం చూడకుండా ఎవరూ ప్రేమించొద్దు. పెద్దలు అలాంటి ప్రేమను ఒప్పుకోరు. బైబై ఫ్రెండ్స్..’’ అంటూ పురుగుల మందు తాగేశాడు. తీసిన వీడియోను వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ చేశాడు. గమనించిన స్నేహితులు ఎస్ఐ ధరణిబాబుకు సమాచారం అందించారు. వెంటనే కొండపైకి చేరుకున్న ఎస్ఐ.. అపస్మారక స్థితిలోని సుధాకర్ను ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురానికి తరలించారు. చదవండి: వీడియో వైరల్: రాస్కెల్.. నన్నే కొడతావా? వివాహేతర సంబంధం: ప్రియుడిని దూరం పెట్టడంతో -
యువకుడి సెల్ఫీ వీడియో: నా చావుకు కారణమిదే..
సాక్షి, మెదక్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుల బహిష్కరణకు గురైన ఓ యువకుడు సెల్ఫీ వీడియోను తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో సంచలనం రేపింది. అన్యాయంగా కుల పెద్దలు కుల బహిష్కరణ చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మనస్తాపం చెందిన అల్లా దుర్గం మండలం ముస్లాపూర్ గ్రామానికి చెందిన ఇప్ప శంకర్ అనే యువకుడు తన ఆవేదనను వీడియోలో రికార్డు చేశాడు. గ్రామానికి చెందిన ముగ్గురు కుల పెద్దలపై జనవరి 6న అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కానీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదనను వ్యక్తం చేస్తూ గత అర్థరాత్రి వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: తస్మాత్ జాగ్రత్త: స్కూటీ ఇచ్చాడు ఏ-1 గా జైలుకెళ్లాడు భార్యపై అనుమానం.. గొడ్డలితో నరికి -
యువకుడి సెల్ఫీ వీడియో: నా చావుకు కారణమిదే..
-
దర్గా దగ్ధం దొంగల పనే
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా నాగిరెడ్డిపల్లిలోని దర్గా దగ్ధం ఘటన దొంగల పనేనని, దీనివెనుక ఎటువంటి మత విద్వేషాలకు తావు లేదని దర్గా నిర్వాహకుడు జిలానీ బాషా స్పష్టం చేశారు. ఈ ఘటనను పురస్కరించుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో ఆలయాలకు రక్షణ లేదని, దర్గాలనూ వదలడం లేదని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో జిలానీ బాషా సెల్ఫీ వీడియో ద్వారా గట్టి బదులిచ్చినట్టయ్యింది. ఈ ఘటనపై జిలానీ ఆ వీడియోలో ఏమన్నారంటే.. ‘నా పేరు జిలానీ బాషా. మా నాన్న పేరు అల్లాబక్షు. 30 ఏళ్ల క్రితం మా నాన్న ఒక దర్గా నిర్మించారు. అప్పటినుంచి అక్కడ హిందూ ముస్లింలు ఎటువంటి మత విభేదాలకు తావు లేకుండా మత సామరస్యంతో సద్భావంతో ఉరుసు ఉత్సవం జరుపుకుంటున్నారు. ఇక్కడి ప్రజలంతా మత సామరస్యం కలిగినవారే. విలువైన వస్తువులు, హుండీలోని డబ్బుల కోసం ఈ నెల 16 రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి దర్గాలోకి ప్రవేశించారు. ఎటువంటి విలువైన వస్తువులు దొరక్కపోవడంతో కోపంతో అక్కడ ఉన్న పాత చద్దర్లను తగులబెట్టారు. దీనిపై నేను గంగవరం పీఎస్లో ఫిర్యాదు చేశాను. దీనికి బాధ్యులైన వారిని పోలీసులు తొందర్లోనే పట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఎలాంటి మత విభేదాలూ లేవని మరొక్కసారి చెబుతున్నాను’ అని స్పష్టం చేశారు. మూడు ప్రత్యేక బృందాల ఏర్పాటు నాగిరెడ్డిపల్లి దర్గా ఘటనకు కారణమైన నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చిత్తూరు జిల్లా ఎస్పీ ఎస్.సెంథిల్కుమార్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ సోమవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. 16వ తేదీన రాత్రి జిలానీ బాబా దర్గాలోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి దర్గాలోని మజార్పై నుంచి తీసేసిన చద్దర్లను, కొన్ని పాత వస్తువులు కాల్చారన్నారు. దర్గా నిర్వాహకుడు జిలాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇటువంటి సమయాల్లో ప్రజలు సంయమనం పాటించాలని, సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో నిజానిజాలను ప్రభుత్వ వెబ్సైట్ factcheck.ap.gov.in ద్వారా తెలుసుకోవాలని సూచించారు. ప్రార్థనా స్థలాలు, ఆలయాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు కన్పించినా, విద్రోహ చర్యలకు పాల్పడే ప్రయత్నం చేసినా అటువంటి వారి సమాచారాన్ని డయల్ 100కు గానీ, పోలీస్ వాట్సాప్ నంబర్ 94409 00005కు గాని తెలియజేయాలని ఎస్పీ కోరారు. -
భార్య దారుణ హత్య.. భర్త ఏమయ్యాడు..!
సాక్షి, మార్టూరు : మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన వివాహిత దారుణహత్యకు గురైంది. పోలీసులు, సమీప బంధువుల తెలిపిన వివరాల ప్రకారం..లక్కవరం ఎస్సీ కాలనీకి చెందిన మద్దుమాల పద్మ(38), భాస్కర్రావు భార్యభర్తలు. ఉన్నత విద్యావంతులైన వీరు కనిగిరిలో ప్రైవేట్ స్కూల్లో గత కొన్నేళ్లుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా స్వగ్రామంలో ఉంటూ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు చెబుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ శుక్రవారం సాయంత్రం యద్దనపూడి మండలంలోని పూనూరులో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామం బయలుదేరి రాత్రికి ఇంటికి చేరుకోలేదు. కంగారు పడిన బంధువులు అదే రోజు రాత్రి మార్టూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెల్ఫోన్ సిగ్నల్ ద్వారా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కోనంకి, లక్కవరం గ్రామాల మధ్య పంట కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉన్నట్లు శనివారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బందితో ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించిన ఎస్సై శివకుమార్ మహిళ మృతదేహం శుక్రవారం రాత్రి కన్పించకుండా పోయిన పద్మదిగా గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. అనంతరం శనివారం రాత్రి మార్టూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన పద్మ మృతదేహానికి ఆదివారం పోస్టుమార్టం చేశారు. ఆచూకీ లేని భర్త ఇదిలా ఉండగా భార్య పద్మతో కలిసి ప్రయాణించిన భర్త భాస్కరరావు ఆచూకీ ఇంత వరకు తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. భాస్కరరావు అనుమానంతో భార్య పద్మను తరచూ వేధిస్తూ ఉండేవాడని, అతడే చంపి ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నివేదిక, భాస్కరరావు ఆచూకీ తెలిస్తే గానీ హత్యకు గల కారణాలు చెప్పలేమని పోలీసులు అంటున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చీరాల డీఎస్పీ వేణుగోపాల్ సోమవారం సాయంత్రాన్ని సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో పెద్దదోర్నాల: ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న తండ్రీ కొడుకులను ఎట్టకేలకు పోలీసులు అదుపులోనికి తీసుకోవటంతో ఇరు రాష్ట్రాల పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలోని అచ్చంపేటకు మండలం అంకురోనిపల్లెకు చెందిన హరిశంకర్ నాయక్ తన ఇద్దరు కుమారులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నాంటూ హైదరాబాద్ రోడ్డులోని మన్ననూర్ వద్ద అటవీ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శనివారం సెల్ఫీ వీడియోను ఫేస్బుక్, వాట్సప్లలో అప్లోడ్ చేశాడు. దీంతో తెలంగాణ పోలీసులు శనివారం నుంచి వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు అదుపులోనికి తీసుకున్న తండ్రీ కొడుకులు తెలంగాణలోని దోమలపెంట, ఈగలపెంట తదితర ప్రాంతాలతో పాటు శ్రీశైలం, సుండిపెంట పరిసరాల ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తెలంగాణలోని ఈగలపెంటకు చెందిన ఎస్సై సమాచారం మేరకు పెద్దదోర్నాల ఎస్సై హరిబాబు సైతం వీరి ఆచూకీ కోసం మండల పరిధిలోని చిన్నారుట్ల, శిఖరం తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఇద్దరు బాలురతో కలిసి తుమ్మలబైలు వద్దకు వచ్చి వెనుదిరిగి వెళ్లినట్లు తమ్మలబైలుకు చెందిన గిరిజనులు పోలీసులకు సమాచారమందించారు. దీంతో తెలంగాణ నుంచి వచ్చిన పోలీసులు కాల్ డేటా ఆదారంతో హరిశంకర్ నాయక్తో పాటు ఇద్దరి కుమారులను మండల పరిధిలోని శిఖరం, చిన్నారుట్ల మధ్యలో అదుపులోనిని తీసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడేందుకు అటవీ ప్రాంతంలోకి వచ్చి ఉంటాడని పోలీసులు పేర్కొంటున్నారు. -
24 గంటల్లోనే ఇద్దరూ అరెస్టు
సాక్షి, అమరావతి, నంద్యాల/బొమ్మలసత్రం: కర్నూలు జిల్లాలో ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం అంతే వేగంగా స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించింది. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు బాధితుడు తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగులోకి రాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు 24 గంటలలోపే ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నంద్యాల వన్టౌన్ సీఐ సోమశేఖర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్లను సస్పెండ్ చేయడంతోపాటు పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఘటనపై విచారణకు ప్రభుత్వం నియమించిన పోలీస్ ఉన్నతాధికారులు ఆదివారం ఉదయమే నంద్యాల చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టబోమన్న ప్రభుత్వ వైఖరి దీని ద్వారా మరోసారి స్పష్టమైంది. ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించిన తీరును మైనార్టీ వర్గాలు స్వాగతిస్తున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ షేక్ అబ్దుల్ సలామ్ (45), భార్య నూర్జహాన్ (38), కుమారుడు దాదా ఖలందర్ (10), కూతురు సల్మా (14) ఈ నెల 3వతేదీన పాణ్యం వద్ద గూడ్స్ రైలు కిందపడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. తక్షణమే చర్యలకు సీఎం ఆదేశం.. నంద్యాలలో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తన దృష్టికి రాగానే ముఖ్యమంత్రి జగన్ తక్షణమే స్పందించారు. క్షుణ్నంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న సీఎం జగన్ స్వయంగా డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను. ఘటనపై హోంమంత్రి, డీజీపీలను నివేదిక కోరారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీ శంకబ్రతబాగ్చీ, గుంటూరు అడిషనల్ ఎస్పీ హఫీజ్ను విచారణాధికారులుగా నియమిస్తూ డీజీపీ సవాంగ్ ఉత్తర్వులిచ్చారు. ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులు నంద్యాల చేరుకుని విచారణ చేపట్టారు. ఏ సెక్షన్లు అంటే.. సస్పెండైన సీఐ సోమశేఖర్, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్లపై పలు ఐపీసీ సెక్షన్లు కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 323 (ఉద్దేశపూర్వకంగా వేధించడం, బాధించడం), 324 (మారణాయుధాలు చూపించడం, బెదిరించడం), 306 (ఆత్మహత్యకు పురిగొల్పడం) తదితర సెక్షన్లపై కేసులు నమోదయ్యాయి. సలామ్ సెల్ఫోన్ సీజ్... వారిని 24 గంటల్లో కోర్టులో హాజరు పరుస్తామని ఏఎస్పీ గౌతమిసాలి, డీఎస్పీ పోతురాజు ఆదివారం రాత్రి విలేకరులకు తెలిపారు. విచారణ పేరుతో భయపెట్టడం, బెదిరింపులకు పాల్పడటం, ఆడవారి పట్ల అమర్యాదగా మాట్లాడటం, ఆత్మహత్యకు ప్రేరేపించడం లాంటివి ఎవరు చేసినా తప్పేనన్నారు. అబ్దుల్ సలాం సెల్ఫోన్ను సీజ్ చేశామని, ఆధారాలను కోర్టులో అందజేస్తామని చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం బంధువులను ఏఎస్పీ గౌతమిసాలి నంద్యాల వన్టౌన్ పోలీస్టేషన్లో విచారించారు. నూర్జహాన్ తల్లి మాబున్నీసా నుంచి వివరాలు సేకరించారు. మరో 10 మంది పోలీసు సిబ్బందిని కూడా విచారించామని, ఈనెల 2వతేదీన సలాం ఆటోలో నగదు పోగొట్టుకున్న భాస్కర్రెడ్డిని కూడా ప్రశ్నించినట్లు డీఐజీ వెంకటరామిరెడ్డి తెలిపారు. బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్వాగతించిన ముస్లిం మైనార్టీలు.. ఘటనపై ముఖ్యమంత్రి వేగంగా స్పందించి దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించడం, పోలీసు శాఖ ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ మైనారిటీ సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యను మైనార్టీలు స్వాగతించారు. దర్యాప్తు కొనసాగుతోంది: డీజీపీ సవాంగ్ ముఖ్యమంత్రి ఆదేశాలతో విచారణ చేపట్టిన ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం చర్యలు తీసుకున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. తప్పుచేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తిలేదని, చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
సెల్ఫీ వీడియో: అందుకే చనిపోతున్నాం..
నంద్యాల/బొమ్మలసత్రం(కర్నూలు జిల్లా): పోలీసుల వేధింపుల వల్ల తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అబ్దుల్సలాం కుటుంబ సభ్యులు తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగులోకి వచ్చింది. అబ్దుల్సలాం, అతని భార్య నూర్జహాన్, కుమారుడు దాదాఖలందర్, కుమార్తె సల్మా ఈ నెల 3వ తేదీన పాణ్యం మండలం కౌలూరు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం అప్పట్లో తెలియలేదు. అయితే... తాజాగా వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియోలో అబ్దుల్సలాం, నూర్జహాన్ కన్నీటి పర్యంతమవుతూ పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారని, అందువల్లే ఆత్మహత్య చేసుకుంటున్నామని వాపోయారు. వెంటాడిన కష్టాలు.. నంద్యాలలోని రోజాకుంటకు చెందిన అబ్దుల్గఫార్, రసూల్బీ దంపతులకు నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు. చిన్నవాడైన అబ్దుల్సలాం పాఠశాలకు వెళ్లేటప్పుడే ఖాళీ సమయంలో పక్కనే ఉన్న బంగారు దుకాణంలో పని చేసేవాడు. తల్లిదండ్రుల మృతి తర్వాత చదువు మానేసి గాందీచౌక్లోని వెంకన్న వర్మకు చెందిన బంగారు దుకాణంలో గుమాస్తాగా చేరాడు. 2004లో మూలసాగరానికి చెందిన నూర్జహాన్ను వివాహం చేసుకున్నాడు. వీరికి సల్మా, దాదాఖలందర్ సంతానం. గుమాస్తా పని చేసుకుంటూనే తనకు తెలిసిన వారితో అగ్రిగోల్డ్ డిపాజిట్లు కట్టించాడు. కంపెనీ బోర్డు తిప్పేయడంతో తన ఇంటిని రూ.10 లక్షలకు విక్రయించి డిపాజిట్దారులకు నగదు చెల్లించాడు. కాగా.. గత ఏడాది నవంబర్ 7న అర్ధరాత్రి అబ్దుల్సలాం పని చేస్తున్న దుకాణంలో దొంగలు చొరబడి కేజీన్నర బంగారాన్ని అపహరించారు. ఈ కేసులో పోలీసులు అబ్దుల్సలాంను నిందితుడిగా చేర్చారు. విచారణ నేపథ్యంలో కర్నూలు సీసీఎస్లో చిత్రహింసలు పెట్టి కేసులు ఒప్పుకొనేలా చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. అనంతరం సలాంను రిమాండ్కు తరలించారు. ఇంట్లో ఉన్న బంధువుల బంగారు ఆభరణాలు దాదాపు 50 తులాలను రికవరీ కింద పోలీసులు తీసుకెళ్లారు. తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన సలాం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. నూర్జహాన్ పిల్లలు చదువుకునే పాఠశాలలోనే టీచర్గా వెళుతూ భర్తకు చేదోడుగా ఉండేది. కష్టాల నుంచి గట్టెక్కుతున్నామని సంతోషించేలోగానే పోలీసులు మరో చోరీ కేసును తెరపైకి తెచ్చారు. ఈ నెల 2వ తేదీన గడివేముల మండలం కరిమద్దెల గ్రామానికి చెందిన భాస్కరరెడ్డి.. సలాం ఆటోలో ప్రయాణిస్తుండగా రూ.70 వేల నగదు మిస్సయ్యింది. ఈ విషయంపై పోలీసులు విచారణకు పిలిచారు. సలాంతో పాటు భార్య నూర్జహాన్, అత్త మాబున్నీసా స్టేషన్కు వెళ్లారు. అక్కడ సలాంను, భార్యను పోలీసులు దూషించడమే కాకుండా..మరుసటి రోజు మళ్లీ స్టేషన్కు రావాలని ఆదేశించారు. దీంతో భయపడిపోయిన సలాం ఈ నెల 3న భార్యాపిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు సీసీఎస్ పోలీసుల వేధింపులే కారణమని అబ్దుల్సలాం అత్త మాబున్నీసా అంటున్నారు. -
తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య
కమలాపురం: క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ముగ్గురి ప్రాణాల్ని బలి తీసుకుంది. అల్లుడి వేధింపులతో కూతురు పడుతున్న కష్టాలు చూడలేక తండ్రి ఆత్మహత్య చేసుకుంటే, తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు కుమార్తెలు బలవన్మరణానికి పాల్పడ్డారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఈ విషాద ఘటన జరిగింది. బంధువులు తెలిపిన సమాచారం మేరకు.. ప్రొద్దుటూరు పట్టణం వైఎంఆర్ కాలనీకి చెందిన డి.బాబుల్రెడ్డి (55)కి ఇద్దరు కుమార్తెలు శ్వేత, సాయి ఉన్నారు.పెద్ద కుమార్తె శ్వేతను అదే మండలంలోని తాళ్లమాపురం గ్రామానికి చెందిన సురేష్ కుమార్రెడ్డికి ఇచ్చి సంవత్సరం క్రితం వివాహం చేశారు. శ్వేత, సురేష్కుమార్రెడ్డిల మధ్య ఆరు నెలల నుంచి వివాదాలు తలెత్తాయి. సురేష్ కుమార్రెడ్డి తరచూ వేధించడంతో శ్వేత పుట్టింటికి వచ్చేసింది. అల్లుడి వేధింపులు తట్టుకోలేక, కుమార్తె పడుతున్న బాధలు చూడలేక బాబురెడ్డి తనువు చాలించాలనుకున్నాడు. శుక్రవారం సెల్ఫీ వీడియో తీసుకుని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రిలో తండ్రి మృతదేహాన్ని చూసిన కుమార్తెలు శ్వేత, సాయి తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. శనివారం ఉదయం కమలాపురం మండలం రాయునిపేట, ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు మధ్య రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడప రైల్వే పోలీసులు శవ పంచనామా నిర్వహించి మృతదేహాలను రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆత్మహత్యకు ముందు యువతి సెల్ఫీ వీడియో
నెల్లూరు (క్రైమ్): ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువతి ఉరివేసుకుంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఆత్మహత్య ఘటన వెనుక గల కారణాలు శనివారం ఈ సెల్ఫీ వీడియోతో వెలుగుచూశాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ► జిల్లా కేంద్రంలోని భక్తవత్సలనగర్లో నివాసం ఉంటున్న వెంకటరాజు కుమార్తె రమ్య (21) నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ► శుక్రవారం రమ్య కుటుంబసభ్యులతో కలిసి తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. భోజనం చేసి వస్తానని చెప్పి మధ్యాహ్నం రమ్య తిరిగి ఇంటికి వచ్చేసింది. అనంతరం ఫ్యానుకు ఉరి వేసుకుంది. ► యువతి ఆత్మహత్యకు కారణాలేమీ లేవని కుటుంబీకులు చెప్పడంతో వేదాయపాళెం పోలీసులు సెక్షన్ 174 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేశారు. రమ్య కుటుంబీకులు అదే రోజు రాత్రి రమ్య ఫోన్ను పరిశీలించగా ఫ్యాన్కు ఉరి వేసుకుంటూ తీసిన డెత్ సెల్ఫీ వీడియో, సెల్ఫీలు, శివభార్గవ్కు పంపిన మెసేజ్లు బయటపడ్డాయి. దీంతో వారు అసలు విషయంపై ఆరా తీయగా రమ్య, శివభార్గవ్ల ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ► రమ్య పెళ్లి చేసుకోమని అడగగా అతను నిరాకరించడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తల్లి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసులోని సెక్షన్లు మార్చి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చేయని చికిత్సకు చార్జీలు వేశారు
-
లావణ్య ఆత్మహత్యలో మరో వ్యక్తి..
శంషాబాద్: భర్త ప్రవర్తనతో విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడిన సాప్ట్వేర్ ఇంజనీర్ లావణ్య లహరి కేసులో మరో నలుగురు నిందితులను ఆర్జీఐఏ పోలీసులు రిమాండ్కు తరలించారు. పట్టణంలోని సీఎస్కే విల్లాలో పైలట్ వెంకటేశ్వర్రావుతో కలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన భార్య లావణ్య లహరి నివాసముండేది. భర్త చెడుతిరుగుళ్లతో ఆమె మనస్తాపం చెందింది. అదేవిధంగా వెంకటేశ్వర్రావు భార్యను మానసినంగా వేధిస్తుండేవాడు. ఈనేపథ్యంలో గతనెల 25న సూసైడ్నోట్ రాసిన లావణ్య లహరి సెల్ఫీ వీడియో తీసి బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. (లావణ్య ఆత్మహత్య కేసులో కొత్త కోణం) లావణ్య ఆత్మహత్యకు కారణమైన ఆమె భర్త వెంకటేశ్వర్రావుతో పాటు అత్తమామలతో పాటు ఆడపడుచు, మరో బంధువుపైనా బంధువులు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆర్జీఐఏ పోలీసులు సోమవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా అద్దంకితో పాటు వరిమడుగు గ్రామంలో తలదాచుకున్న అత్త రమాదేవి, ఆడపడుచులు కృష్ణవేణి, లక్ష్మీకుమారితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి ఆర్జీఐఏ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈమేరకు వారిని మంగళవారం రిమాండ్కు తరలించారు. వెంకటేశ్వర్రావు తండ్రి సుబ్బారావు పరారీలో ఉన్నాడు. అయితే, ఈ కేసులో ఇప్పటికే పోలీసులు లావణ్య లహరి భర్త వెంకటేశ్వర్రావును రిమాండుకు తరలించారు. -
సెల్ఫీ వీడియో..మృత్యువుతో పోరాడి
-
చెస్ట్ ఆస్పత్రిలో మరో దారుణం
సాక్షి, హైదరాబాద్ : ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలో మరో దారుణం చోటుచేసుకుంది. సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని ఆరోపిస్తూ మరో వ్యక్తి కూడా ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకి వెళితే.. డాక్టర్లు పట్టించుకోవడం లేదంటూ మృత్యువుతో 3 గంటల పాటు పోరాడిన రవికుమార్.. చివరకు అత్యంత విషాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రాణాలు కోల్పోవడానికి ముందు రవికుమార్ తీసిన సెల్ఫీ వీడియో వైరల్గా మారింది. ఈ ఘటన జరిగి 48 గంటలు గడవకముందే మరో వ్యక్తి కూడా అదే రీతిలో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. తనకు వైద్యం చేయడం లేదని సెల్ఫీ వీడియో తీసుకుని సయ్యద్ అనే వ్యక్తి చనిపోయాడు. తీవ్ర అనారోగ్యం ఉన్న తనను పట్టించుకోవడం లేదని సయ్యద్ ఆ వీడియోలో పేర్కొన్నారు. (చదవండి : డాడీ.. ఊపిరాడట్లేదు!) మరోవైపు సయ్యద్ ఉదయం మరణించినప్పటికీ.. ఇప్పటివరకు వరకు అతని మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా, చెస్ట్ ఆస్పత్రిలో కరోనా బాధితులకు అందుతున్న చికిత్సపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
డాడీ.. ఊపిరాడట్లేదు!
జవహర్నగర్: ‘డాడీ బై.. బై..! నాకు ఊపిరి ఆడక గుండె ఆగిపోయేలా ఉంది. వెంటిలేటర్ పెట్టమని బతిమిలాడినా డాక్టర్లు పట్టించుకోవడం లేదు..’అంటూ మృత్యువుతో 3 గంటల పాటు పోరాడిన ఓ వ్యక్తి.. చివరకు అత్యంత విషాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు.. ఓ కరోనా మృతుడి హృదయ విదారక సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బీజేఆర్నగర్లో చోటుచేసుకుంది. జవహర్నగర్ కార్పొరేషన్లో నివాసముండే వెంకటేశ్ గౌడ్ కుమారుడు రవికుమార్ (35) తన భార్య ఇద్దరు పిల్లలతో కలసి మల్కాజిగిరి నియోజక వర్గంలోని నేరేడ్మెట్ వినాయక్నగర్లో నివాసముంటున్నాడు. 6 నెలల క్రితమే దుబాయ్ నుంచి వచ్చాడు. ఈ క్రమంలో లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నాడు. ఈ నెల 22న రవికుమార్కు తీవ్ర జ్వరం రావడంతో స్థానిక వైద్యుల సలహా మేరకు నిమ్స్కు వెళ్లాడు. అక్కడి వైద్యులు ముందుగా కరోనా టెస్ట్ చేయించాలని చెప్పడంతో సమీపంలోని ఓ ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లో కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. అప్పటికే తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడుతున్న రవికుమార్ ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలో ఈ నెల 24న చేరి చికిత్స పొందుతూ 26న ఉదయం మృతి చెందాడు. వైద్యులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. జవహర్నగర్ కార్పొరేషన్లోని బీజేఆర్నగర్కు మృతదేహాన్ని తీసుకొచ్చి ఖననం చేయించారు. అంత్యక్రియల్లో దాదాపు 30 మంది పాల్గొన్నట్లు సమాచారం. మరుసటిరోజు మృతుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ రిపోర్ట్ రావడంతో వైద్యులు, పోలీసులు మృతుడి కుటుంబసభ్యులను ఆదివారం క్వారంటైన్ చేశారు. భయం గుప్పిట్లో జవహర్నగర్ ప్రజలు మృతదేహం ఖనన అనంతరం అతనికి కరోనా పాజిటివ్ అని తెలియడంతో జవహర్నగర్ ప్రజల్లో భయం మొదలైంది. అసలు అంత్యక్రియల్లో కుటుంబసభ్యులతో పాటు బంధువులు ఇతర వ్యక్తులు ఎందరు పాల్గొన్నారు. వారు ఎవరెవరిని కలిశారు అనే ఆందోళన మొదలైంది. దీంతో అధికారులు అప్రమత్తమై అంత్యక్రియల్లో పాల్గొన్న వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. కరోనా వల్లే మృతి..: ఛాతీ ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంగళరావునగర్: కరోనా పాజిటివ్ అవడం వల్ల గుండెకు ముప్పు వాటిల్లి తద్వారా యువకుడు మృతి చెందాడని ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్ మహబూబ్ఖాన్ చెప్పారు. వెంటిలేటర్ను బలవంతంగా తొలగించామనేది వాస్తవం కాదని, అతనిని కాపాడటానికి శతవిధాలా తమ సిబ్బంది ప్రయత్నించారన్నారు. కరోనా గుండెకు చేరి తద్వారా ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా మారి మృతి చెందాడని తెలిపారు. -
వేధింపులు భరించలేక రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
-
సెల్ఫీ వీడియో.. రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
సాక్షి, విజయవాడ: అధికారుల వేధింపుల భరించలేక రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆ ఉద్యోగి సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. పురుగుల మందు తాగారు. స్థానికులు రైల్వే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని రాయనపాడుకు చెందిన రైల్వే కీమేన్ రాజుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య ఇద్దరు బిడ్డలతో కలిసి మహిళ కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఈ సంఘటనలో తల్లి నాగస్వరూపారాణి మృతి చెందగా, ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిని పశ్చిమగోదావరి జిల్లా మార్తాండ గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలకు ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. -
కార్పొరేటర్ భర్త సెల్ఫీ వీడియో కలకలం
సాక్షి, నిజామాబాద్: జిల్లాకు చెందిన మహిళా కార్పొరేటర్ భర్త నరేష్ తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. తనను ఓ వ్యక్తి చంపుతానని బెదిరిస్తున్నాడంటూ నరేష్ సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు. 'నా భార్యను తన భార్య అంటూ ఆకాష్ అనే వ్యక్తి ప్రచారం చేసుకుంటున్నాడు’ అంటూ సెల్ఫీ వీడియోలో వాపోయాడు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తన జీవితం ఇంతటితో ముగుస్తున్నందుకు చాలా బాధగా ఉందని నరేష్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. . -
సెల్ఫీ వీడియో.. యువకుడి ఆత్మహత్య
రాంగోపాల్పేట్: పనిచేసే సంస్థ సొమ్మును సొంత అవసరాల కోసం వాడుకోవడంతో వాటిని చెల్లించాలని నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికిలోనైన ఓ యువకుడు లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.హయత్నగర్ భాగ్యలత కాలనీకి చెందిన వరికుప్పల సైదులు అలియాస్ సాయి (28)ముషీరాబాద్లోని టే ట్ సెట్టర్స్ బిజినెస్ సొల్యూషన్స్ సంస్థలో బైక్ రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం సంస్థకు చెందిన రూ.25వేలు సొంత అవసరాల కోసం వాడుకున్నాడు. అదే సంస్థలో మేనేజర్గా ప్రసాద్ అనే వ్యక్తి వద్ద రూ.12వేలు అప్పు చేశాడు. గత కొద్ది రోజులుగా ఆఫీస్ డబ్బుతో పాటు, తన వద్ద అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ప్రసాద్ సైదులుపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో మనస్తాపానికిలోనైన సైదులు ఈ నెల 29న ఉదయం ఆఫీస్కు వెళుతున్నట్లు చెప్పి ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. సాయంత్రం ఇంటికి రాకపోగా, అతడి సెల్ఫోన్ స్విచ్ఆఫ్లో ఉండటంతో ఆందోళన చెందిన అతడి భార్య మాధవి హయత్నగర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ నెల 30న ఉదయం సైదులు కేకే రెసిడెన్సీలో రూమ్ నంబర్ 207లో బస చేశాడు. అదే రోజు మధ్యాహ్నం బయటికి వెళ్లి సాయంత్రం లాడ్జికి తిరిగి వచ్చాడు. శుక్రవారం సాయంత్రం వరకు అతను గదిలో నుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి నిర్వాహకులు గోపాలపురం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు పగులగొట్టి చూడగా సైదులు ఫ్యానుకు ఉరి వేసుకుని కనిపించాడు. వేధింపులే కారణం... ఆఫీసు డబ్బులు వాడుకున్నాడని గత కొద్ది రోజులుగా మేనేజర్ ప్రసాద్ సైదులుపై ఒత్తిడి చేస్తున్నాడని, అతడి వేధింపులు భరించలేకే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య మాధవి, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సెల్ఫీ వీడియో... ఆత్మహత్య చేసుకునే ముందు సైదులు సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ‘తనకు బతకాలని లేదని, ఎంతో మంది పెద్ద, పెద్ద వాళ్లు చనిపోతున్నారని నేను కూడాముందే చనిపోవాలని అనుకుంటున్నాను, భార్య పిల్లలు జాగ్రత్త’ అంటూ వీడియోలో పేర్కొన్నాడు. -
సెల్ఫీ వీడియో..ఆపై ఆత్మహత్య
కందుకూరు: తనను పోలీసులు వేధిస్తున్నారంటూ మనస్తాపానికి గురైన ఓ యువకుడు తన ఆత్మహత్యకు గల కారణాలను తెలుపుతూ సెల్ఫీ వీడియో తీసుకుని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... ప్రకాశం జిల్లా కందుకూరు మండలం బూడిపాలేనికి చెందిన సయ్యద్ జహీర్ (31)కి పన్నెండేళ్ల క్రితం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన జరీనా అనే యువతితో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కందుకూరు పట్టణంలోని బూడిపాలెంలో నివాసం ఉంటున్నారు. జరీనా వడ్డీ వ్యాపారం చేస్తూ భర్త జహీర్కు తెలియకుండా అప్పులు చేసింది. ఈ విషయమై భార్యా, భర్తల మధ్య వివాదం ఏర్పడింది. జరీనా పుట్టింటికి వెళ్లి తన భర్త, కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ చేశారు. ఈ క్రమంలో అక్కడి పోలీసుల నుంచి జహీర్కు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.పెద్దలు రాజీకి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పైగా జరీనా సోదరులు, తండ్రి జహీర్ను దూషించారు. దీంతో మనస్తాపానికి గురైన జహీర్ తనను బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు వేధిస్తున్నారని, భార్య తరఫు కుటుంబ సభ్యులు దూషిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. శనివారం అర్ధరాత్రి బూడిపాలెంలోని తన ఇంట్లోనే ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతి చెందాడు. ఆదివారం పోలీసులు వచ్చి అతని సెల్ఫోన్ను పరిశీలించగా ఉరికి ముందు తన ఆత్మహత్యకు గల కారణాలను చెబుతూ తీసిన సెల్ఫీ వీడియో కనిపించింది. ఉరివేసుకుంటున్నట్లు భార్యకు సందేశం జహీర్ తాను ఉరేసుకునేందుకు చేసుకుంటున్న ఏర్పాట్లను వీడియో తీసి భార్యకు పంపి, ఫోన్లో కూడా మాట్లాడినట్లు సమాచారం. దీన్ని జరీనా పట్టించుకోలేదు. తన కొడుకు ఆత్మహత్య చేసుకునే విషయం తమకు ఏమాత్రం తెలిసినా కాపాడుకునే వాళ్లమని జహీర్ తండ్రి ఆరీఫ్ విలపించాడు. -
వేధింపులు బరించలేక పూజారి ఆత్మహత్య
-
కువైట్లో ఏడాదిగా బందీ
కోరుట్ల: ‘నేను ఏ నేరం చేయలేదు.. నాకు సంబంధం లేకుండా జరిగిన తప్పునకు కంపెనీ పని నుంచి తొలగించి నాపై కేసు పెట్టింది. వారం రోజులు జైలులో పెట్టారు. ఆ తరువాత జైలు నుంచి విడుదల చేసి ఏడాదిగా ఓ గదిలో బంధించారు. తిండి తిప్పలు లేక అవస్థలు పడుతున్న. అయ్యా.. కేసీఆర్, కేటీఆర్ సార్లు.. నా మీద దయచూపండి. నన్ను స్వదేశానికి రిప్పంచండి.’ఇదీ కువైట్లో ఓ నేరంలో ఇరుక్కున్న కోరుట్ల వాసి నారాయణ దీన పరిస్థితి. తన ఆవేదనను సెల్ఫీ వీడియో తీసి పంపడంతో రెండు రోజుల నుంచి ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇరవై ఏళ్లుగా కువైట్కు.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వంగరి నారాయణ సుమారు ఇరవై ఏళ్లుగా కువైట్కు వెళ్లి వస్తున్నాడు. అక్కడ కేజీఎల్ అనే కంపెనీలో వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ వ్యాన్ ద్వారా కేజీఎల్ కంపెనీ వారు డబ్బులను కువైట్లోని ఓ బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు పంపుతారు. 20 ఏళ్లుగా అదే కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్న నారాయణ.. 2018 జులై 26వ తేదీన విధుల్లో భాగంగా మరో ఇద్దరితో కలసి (నేపాల్, పిలిప్పీన్స్కు చెందిన వ్యక్తులు) ఎప్పటిలాగే కంపెనీ వ్యాన్ నడుపుతున్నాడు. మధ్యా హ్నం అకస్మాత్తుగా డబ్బు లు తీసుకెళ్లే వ్యాన్ పాడైంది. సాయంత్రం వేళ కంపెనీకి చేరాడు. కంపెనీ వారు డబ్బులు లెక్కింపు చూసుకోగా.. 1.90 లక్షల దినార్లు (ఇండియా కరెన్సీలో సుమారు రూ.4 కోట్లు) తేడా వచ్చింది. కంపెనీవారి ఫిర్యాదు మేరకు పోలీసులు నారాయణతోపాటు వ్యాన్లో పనిచేస్తున్న మరో ఇద్దరిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. తరువాత కేజీఎల్ కంపెనీకి అప్పగించారు. నా భర్తను రప్పించండి ఇరవై ఏళ్లుగా ఒకే కంపెనీలో నమ్మకంగా పనిచేస్తున్న నా భర్తపై అకారణంగా కేసు పెట్టారు ఇండియాకు రాలేక నానా అవస్థలు పడుతున్నాడు. దయచేసి సీఎం కేసీఆర్, కేటీఆర్, ఎంపీ అరవింద్లు కలసి నా భర్తను ఇండియాకు రప్పించండి. – వంగరి పద్మ, కోరుట్ల -
సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!
సాక్షి, హైదరాబాద్ : అప్పుల బాధ తాళలేక ప్రాణాలు తీసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియోలో ఓ వ్యాపారి చెప్పాడు. ఎవరెవరికి ఎంత బాకీ చెల్లించాల్సి ఉందో చీటిలో రాసిపెట్టానని ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారి రాయపాటి నరసింహన్ తెలిపారు. నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కొందరు వ్యక్తుల మోసం వల్లే తీవ్రంగా నష్టపోయినట్టు వెల్లడించాడు. లిస్టులో ఉన్నవారందరికీ ఇప్పటికే రెండింతల వడ్డీలు కట్టానని తెలిపాడు. ఇంటికొస్తున్నానని చెప్పి మోసం చేసినందుకు క్షమించాలని కోరాడు. ఇంటికి తిరిగి రావాలని అనుకున్నా.. తనవల్ల కావడం లేదని పేర్కొన్నాడు. ఇక ఆలస్యం చేయడం తనవల్ల కావడం లేదని, తనకు చావే శరణ్యమని రోదించాడు. కాగా, తన భర్త ఐదు రోజులుగా కనిపించడం లేదని నరసింహన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని సెల్ఫీ వీడియో బయటకు రావడంతో ఆమె కన్నీరుమున్నీరయ్యారు. -
నవవధువు ఆత్మహత్యాయత్నం