statement
-
ట్రంప్పై దాడి చేసినవాడు రాక్షసుడు: మెలానియా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై దాడి జరిగిన అనంతరం అతని భార్య మెలానియా తన ఆవేదనను ఒక ప్రకటనలో తెలియజేశారు. పెన్సిల్వేనియాలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉండగా, థామస్ క్రూక్స్ అనే 20 ఏళ్ల షూటర్ కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ట్రంప్ చెవికి గాయమయ్యింది.మెలానియా తన భావోద్వేగాలను ఒక ప్రకటనలో పంచుకుంటూ ట్రంప్ను రక్షించేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఈ ఘటనలో గాయపడినవారికి సానుభూతి ప్రకటించారు. ఆమె తన ప్రకటనలో.. ‘డొనాల్డ్ అభిరుచిని, నవ్వును, మాటల చాతుర్యాన్ని, సంగీతంపైగల ప్రేమను, అతని స్ఫూర్తిని నాశనం చేయడానికి ప్రయత్నించిన ఒక అమానవీయ రాజకీయ ఘటన ఇది. ట్రంప్పై దాడి చేసినవాడు రాక్షసుడు. నా భర్త జీవితంలో నాకు నచ్చిన ప్రధాన అంశం అతని మానవతా దృక్పథం.ఆయన ఉదారమైన వ్యక్తిత్వం కలిగినవాడు. మంచి, చెడు సమయాల్లో నేను అతని వెంట ఉన్నాను. ప్రేమకు భిన్నమైన అభిప్రాయాలు, విధానాలు, రాజకీయ ఆటలు హీనమైనవని మనం మరచిపోకూడదు. మా వ్యక్తిగత, నిర్మాణాత్మక జీవిత కట్టుబాట్లు మా మరణం వరకు అలానే కొనసాగుతాయి. దేశంలో మార్పు పవనాలు వచ్చాయని అంటున్నారు. ఈ మాటకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు. రాజకీయ విభేదాలకు అతీతంగా స్పందిస్తున్నవారిని అభినందిస్తున్నాను’ అని మెలానియా పేర్కొన్నారు. pic.twitter.com/IGIWzL6SMJ— MELANIA TRUMP (@MELANIATRUMP) July 14, 2024 -
కంగనా రనౌత్కు చెంపదెబ్బ.. కుల్విందర్ కౌర్ అరెస్ట్
బీజేపీ ఎంపీ కంగనా రౌనత్ను కానిస్టేబుల్ చెంపదెబ్బ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చండీగఢ్ ఎయిర్పోర్ట్లో కంగనను చెంపదెబ్బ కొట్టిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. ఆపై ఆమెను అరెస్ట్ చేసింది.జాతీయ మీడియా కథనాల ప్రకారం..బీజేపీ నేత, మండీ లోక్సభ ఎంపీ కంగన రనౌత్ చండీగఢ్ నుంచి ఢిల్లీకి వచ్చేందుకు చండీగఢ్ ఎయిర్పోర్ట్లోకి అడుగు పెట్టారు. ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకుని విమానం ఎక్కేందుకు వెళ్తున్న కంగనను కుల్విందర్ కౌర్ చెంప పగలగొట్టింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా2020లో మోదీ ప్రభుత్వం రైతుల మేలు కోసమేనని చెబుతూ మూడు వ్యవసాయ చట్టాల్ని తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాల్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని, వాటిని వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళన చెపట్టారు. దీంతో తలొగ్గిన కేంద్రం వాటిని వెనక్కి తీసుకుంటున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు.సింగర్ రిహానా మద్దతుఆ సమయంలో ప్రముఖ సింగర్ రిహానా భారత్లో రైతులు చేస్తున్న ఉద్యమంపై స్పందించారు. ‘మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదు?’ అంటూ రైతుల ఉద్యమంపై అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ ప్రచురించిన కథనాన్ని రిహానా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ నెట్టింట్లో ట్రెండ్ అవ్వడంతో పలువురు ప్రముఖ ఆమెకు మద్దతుగా నిలిచారు. నోరు పారేసుకున్న కంగనా రనౌత్రిహానా ట్వీట్పై కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమం చేస్తున్నది రైతులు కాదు ఉగ్రవాదులు. దేశాన్ని ముక్కలు చేసి చైనా కాలనీగా మార్చాలని అనుకుంటున్నారు. అందుకే దీనిపై ఎవరూ మాట్లాడడం లేదు. మేం మాదేశాన్ని అమ్ముకోవాలనుకోవడం లేదు’ అంటూ రిహానాపై కంగానా తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ ట్వీట్ చేశారు.టైమ్ మ్యాగజైన్లో బిల్కిస్దీనికి తోడు టైమ్ మ్యాగజైన్ ప్రతి ఏటా ఆయా దేశాలకు 100మంది అత్యంత ప్రభావశీలురు జాబితాను విడుదల చేస్తోంది. 2019లో టైమ్ మ్యాగజైన్ .. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సమీపంలోని షషీన్ బాగ్లో వందలాది మహిళలు 100 రోజుల పాటు నిరసన తెలిపారు. ఆ ఉద్యమాన్ని షషీన్ బాగ్ దాదీగా పేరొందిన 82 ఏళ్ల (నాడు) బిల్కిస్ ముందుండి నడిపించారు. బిల్కిస్ను ప్రస్తావిస్తూ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల ఉద్యమంలో బిల్కిస్ పాల్గొన్నారని, ఆమె రోజువారీ కిరాయి ప్రాతిపదికన అందుబాటులో ఉంటారని ఓ ట్విటర్ యూజర్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఉద్యోమంలో పాల్గొనందుకు ఆమెకు ఆహారం, బట్టలు, అవార్డ్లు, పాకెట్ మనీ ఇస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆట్వీట్ను కంగాన రీట్వీట్ చేస్తూ “హ హ హ ఆమె అత్యంత శక్తివంతమైన భారతీయురాలిగా టైమ్ మ్యాగజైన్లో కనిపించిన అదే దాదీ. ఆమె రూ.100 రూపాయలకే ధర్నాలో పాల్గొన్నారని అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారు. ప్రతీకారం తీర్చున్న కుల్విందర్ కౌర్ఈ నేపథ్యంలో నాడు కంగానా చేసిన వ్యాఖ్యలపై సీఐఎస్ఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఎయిర్ పోర్ట్లో ప్రతీకారం తీర్చున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లేందుకు చండీగఢ్ ఎయిర్ పోర్ట్లోకి వచ్చిన కంగనాను కుల్విందర్ కౌర్ చెంప చెళ్లుమనిపించారు.అందుకే కొట్టాఅనంతరం రైతులను కంగనా అవమానించినందుకే ఆమె చెంపపై కొట్టినట్లు కుల్విందర్ కౌర్ తెలిపింది. రైతులు రూ.100 కోసం అక్కడ కూర్చున్నారని ఆమె (కంగనా) స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె వెళ్లి అక్కడ కూర్చుంటుందా? ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మా అమ్మ కూడా అక్కడ కూర్చుని నిరసన వ్యక్తం చేసింది అని రైతు కుటుంబానికి చెందిన కౌర్ అన్నది. కాగా, కంగనాను కొట్టినందుకు సీఐఎస్ఎఫ్ విభాగం ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేసింది. విధుల నుంచి తొలగించింది. -
ఏ పార్టీ ఓటర్లు ఉదాసీనం? జేపీ నడ్డా ఏమన్నారు?
2024 లోక్సభ ఎన్నికల్లో నేడు చివరిదశ పోలింగ్ జరుగుతోంది. నేడు ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 57 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. అయితే 2019తో పోల్చి చూస్తే, ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గిందనే మాట సర్వత్రా వినిపిస్తోంది.దీనికి ఒక మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన అభిప్రాయం వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల ఓటర్లు ఉదాసీనంగా ఉన్నారని, అందుకే ఆ పార్టీలకు దక్కిన ఓట్లు తక్కువేనన్నారు. ఈ కారణంగానే ఓటింగ్ శాతం తగ్గిందని పేర్కొన్నారు. బీజేపీ మద్దతుదారులైన ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేశారన్నారు.దేశంలో అధికార ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత లేదని, గత ఎన్నికల డేటాను పరిశీలిస్తే అంటే 2019 మొదటి, రెండవ దశ, 2024 మొదటి, రెండవ దశలలో ఓటింగ్శాతం బాగానే ఉన్నదన్నారు. దీనిప్రకారం చూస్తే ఉదాసీనత అనేది బీజేపీ మద్దతుదారులలో లేదని, ప్రదిపక్షాల మద్దతుదారులే ఓటు వేయడానికి ముందుకు రావడం లేదన్నారు.సమాజ్వాదీ పార్టీ మద్దతుదారుల్లో ఉదాసీనత ఉందని బీజేపీ నేత జేపీ నడ్డా ఆరోపించారు. ఇప్పుడు జరుతున్న ఎన్నికలపైనా, మూడోసారి రాబోయే మోదీ ప్రభుత్వంపైనా బీజేపీ మద్దతుదారుల్లో ఉత్సాహం ఉన్నదన్నారు. బీజేపీకి పోటీ లేని స్థానాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నదన్నారు. -
తగ్గిన ఓటింగ్ శాతంతో బీజేపీకి దెబ్బ? రాజ్నాథ్ ఏమన్నారు?
2024 లోక్సభ ఎన్నికల్లో ఆరు దశల ఓటింగ్ పూర్తయ్యింది. ఇంకా ఒక దశ మిగిలివుంది. అయితే 2019తో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గింది. ఇది బీజేపీకి దెబ్బ అనే వాదన వినిపిస్తోంది. ఈ విషయమై రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ఒక మీడియా సమావేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓటింగ్ శాతం తక్కువగా ఉంటే అది బీజేపీకి ప్రతికూలమేమీ కాదని, ఓటింగ్ శాతం తగ్గడానికి ఎండవేడిమి ప్రధాన కారణమని రాజ్నాథ్ సింగ్ అన్నారు.ఇండియా కూటమి విశ్వసనీయతపై పలు సందేహాలు ఉన్నాయని, ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో చాలా జాప్యం జరిగిందన్నారు. ఇండియా కూటమిలోని పార్టీలు విభిన్న అభిప్రాయాలు కలిగినవని అన్నారు. ఇందుకు పంజాబ్లోని రాజకీయ పరిస్థితులే ఉదాహరణ అన్నారు. ఇండియా కూటమి ప్రజలకు ఉమ్మడి సందేశాన్ని ఇవ్వలేకపోయిందని, అందుకే ఈ కూటమిపై ప్రజల్లో నమ్మకం లేదన్నారు. ఈ కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదని చాలామంది భావిస్తున్నారని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈసారి కూడా బీజేపీ అత్యధిక మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు.ఓటింగ్ శాతం తక్కువగా ఉండటానికి కారణం ఎండ వేడిమి అని అన్నారు. గత ఎన్నికల్లో ఇంతటి వేడి లేదన్నారు. ఈసారి దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీకి సీట్లు పెరుగుతాయని భావిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ హయాంలో 25 శాతం మంది దారిద్య్ర రేఖ నుంచి బయటపడ్డారని, దేశంలో నిరుద్యోగం గతంలో కన్నా తగ్గిందని రాజ్నాథ్ పేర్కొన్నారు. -
AAP MP Swati Maliwal: కొట్టాడు.. పొట్టలో తన్నాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ తనపై చేసిన దాడిపై ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ సంచలన విషయాలు బయటపెట్టారు. విచక్షణారహితంగా ఛాతిపై కొట్టాడని, పొట్టలో తన్నాడని, చంపి పూడ్చిపెడతా అని బెదిరించాడని ఆమె ఇచి్చన వాంగ్మూలం వివరాలు ఎఫ్ఐఆర్ ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చాయి. దెబ్బలకు తాళలేక నడవలేకపోయా గురువారం బిభవ్పై ఢిల్లీ పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్లో స్వాతి ఇచి్చన వాంగ్మూలం వివరాలు ఉన్నాయి. ‘‘ కేజ్రీవాల్ను కలిసేందుకు డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నా. పట్టరాని ఆవేశంతో నా వైపు దూసుకొచి్చన బిభవ్ ‘ మా మాట ఎందుకు వినట్లేవు? మాకు ఎదురుచెప్పడానికి ఎంత ధైర్యం? నీచమైన దానివి నువ్వు. నీకు గుణపాఠం చెప్తాం’ అని తిట్టడం మొదలెట్టాడు. తర్వాత 7–8 సార్లు చెంపమీద కొట్టాడు. దీంతో షాక్కు గురయ్యా. సాయం కోసం అరిస్తే ఎవ్వరూ ముందుకు రాలేదు. కూర్చున్న నన్ను షర్ట్ పట్టుకుని కిందకు తోశాడు. టేబుల్కు తల తగిలి కింద పడ్డా. అంతటితో ఆగకుండా వీరావేశంతో నా ఛాతి, పొట్ట, పొత్తికడుపు, కటి భాగంపై కాలితో పలుమార్లు తన్నాడు. నిలువరించబోతే షర్ట్ పట్టుకుని లాగాడు. షర్ట్ బటన్స్ కొన్ని ఊడిపోయాయి. షర్ట్ పైకి లేస్తోంది ఆపు అని అరిచినా బలంగా నెట్టేసి కొట్టాడు. పిరియడ్ నొప్పికితోడు ఈ దెబ్బల ధాటికి బాధతో విలవిల్లాడిపోయా. పీరియడ్స్ విషయం చెప్పినా అతను ఆగలేదు. దెబ్బల నొప్పికి కనీసం నడవలేకపోయా. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి పోలీస్స్టేషన్కు వెళ్లి విషయం చెప్పా. లిఖితపూర్వక ఫిర్యాదు అడిగారు. భయంకరమైన నొప్పుల బాధతో రాసే ఓపికలేక అక్కడి నుంచి వెళ్లిపోయా’’ అని స్వాతి చెప్పారు. ‘ఏం చేసుకుంటావో చేస్కో. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. నీ అంతుచూస్తా. ఎముకలు విరగ్గొట్టి పూడ్చిపెడతా. ఎక్కడ పూడ్చామో ఎవరూ కనిపెట్టలేరు’ అని బిభవ్ నన్ను బెదిరించాడు’’ అని మలివాల్ వాంగ్మూలం ఇచ్చారు. ముఖంపై అంతర్గత గాయాలు శుక్రవారం మలివాల్ ఢిల్లీ ఎయిమ్స్లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలు ఉన్నట్లు వైద్యులు మెడికో లీగల్ కేస్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ కేసు విషయమై మలివాల్ శుక్రవారం తీస్ హజారీ కోర్టు మేజి్రస్టేట్ ఎదుట హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు కేజ్రీవాల్ సెక్యూరిటీ సిబ్బందితో మలివాల్ వాగ్వాదానికి దిగిన మే 13నాటి 52 సెకన్ల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ‘‘ నన్నెవరైనా టచ్చేస్తే బాగుండదు. ఉద్యోగం నుంచి తొలగిస్తా. పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేశా. వాళ్లు వచ్చేదాకా ఆగండి. డీసీపీతో మాట్లాడి మీ సంగతి తేలుస్తా’’ అని మలివాల్ అంటున్నట్లు వీడియోలో ఉంది. పొలిటికల్ హిట్మ్యాన్.. మలివాల్ శుక్రవారం ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్ట్చేశారు. ‘‘ పొలిటికల్ హిట్మ్యాన్ మళ్లీ తనను తాను కాపాడుకునే పనిలో పడ్డాడు. విషయం లేకుండా సొంత మనుషులతో ట్వీట్లు, వీడియోలు షేర్ చేయిస్తాడు. నేరాలు చేసి కూడా తప్పించుకోవచ్చని ఆయన ధీమా. ఇంటిలోపలి సీసీటీవీ ఫుటేజీ బహిర్గతమైతే నిజం అందరికీ తెల్సిపోతుంది’’ అని పోస్ట్చేశారు. ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారో ఆమె పేర్కొనలేదు. కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ బృందం కేసు విచారణలో భాగంగా ఢిల్లీ పోలీసు ఫోరెన్సిక్ బృందం ఘటన జరిగిన కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మలివాల్ను వెంట తీసుకెళ్లారు. అక్కడి సాక్ష్యాధారాలు, సీసీటీవీ ఫుటేజీని ఐదుగురు సభ్యుల ఫోరెన్సిక్ నిపుణులు స్వా«దీనం చేసుకున్నారు. కాగా, తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ ఇచి్చన సమన్లను బిభవ్ బేఖాతరు చేశారు. దీంతో ఆయన జాడ తెల్సుకునేందుకు ఢిల్లీ పోలీసు బృందాలు బయల్దేరాయి. ఒక బృందం ఇప్పటికే అమృత్సర్కు వెళ్లింది. మహారాష్ట్రకు వచ్చాడేమో అనే అనుమానంతో ఆ రాష్ట్ర పోలీసు విభాగాన్ని సంప్రదించారు. ఇంత జరిగితే మాట్లాడరా?: సీతారామన్ ‘‘ ఇంట్లో సొంత పార్టీ మహిళా ఎంపీపై ఇంత ఘోరమైన దాడి జరిగితే కేజ్రీవాల్ ఎందుకు మాట్లాడట్లేరు? నిందితుడు బిభవ్ను ఇంకా వెంటేసుకుని తిరగడం నిజంగా సిగ్గుచేటు. ఈ విషయంలో కేజ్రీవాల్ ఒక బహిరంగ ప్రకటన చేసి క్షమాపణ చెప్పాలి’ అని బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్చేశారు. ఇదంతా బీజేపీ కుట్ర: అతిశి మలివాల్ను అడ్డుపెట్టుకుని కేజ్రీవాల్ను ఈ కేసులో ఇరికించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆప్ నాయకురాలు అతిశి ఆరోపించారు. ‘‘ ఈ రోజు ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. అందులో మలివాల్ సోఫాలో కూర్చుని వాగ్వాదానికి దిగారు. కొట్టారని, నొప్పితో బాధపడ్డానని, షర్ట్ బటన్లు ఊడిపోయాయని ఎఫ్ఐఆర్లో చెప్పారు. కానీ ఆ వీడియో చూస్తుంటే అదంతా అబద్ధమని తేలిపోయింది. సీఎం బిజీగా ఉంటే కలుస్తానని బిభవ్ను ఆమెనే కేకలేసి నెట్టేశారు. ఈ ఉదంతం వెనుక బీజేపీ హస్తముంది’’ అని అతిశి ఆరోపించారు. -
USA: ‘సీఏఏ’ అమలుపై అమెరికా కీలక ప్రకటన
వాషింగ్టన్: భారత్ తాజాగా అమలులోకి తీసుకువచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)పై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. సీఏఏ అమలు తీరును తాము నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయమై గురువారం అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు. ‘మార్చ్ 11 సీఏఏ నోటిఫికేషన్పై మేం ఆందోళనతో ఉన్నాం. ఈ చట్టం అమలు తీరును గమనిస్తున్నాం. మత పరమైన స్వేచ్ఛను గౌరవించడం, అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించడం అనేవి ప్రజాస్వామ్య మూల సూత్రాలు’ అని మిల్లర్ పేర్కొన్నారు. అయితే హిందూ అమెరికన్లు మాత్రం సీఏఏను స్వాగతిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. US State Department spokesperson, Matthew Miller, provides the State Department's response to CAA, The Citizenship Amendment Act, being implemented in India.#CAAImplemented #CAA #CAAImplementation #CitizenshipAmendmentAct #CitizenshipAct pic.twitter.com/a9kAzL64ft — Diya TV (@DiyaTV) March 14, 2024 పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి డిసెంబర్ 31, 2014కు ముందు వలస వచ్చిన నాన్ ముస్లింలకు సీఏఏ ప్రకారం భారత పౌరసత్వం ఇస్తున్నారు. కేవలం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే చాలు వలసవచ్చిన వారికి పౌరసత్వం జారీ చేస్తున్నారు. ఈ చట్టం కింద దేశంలోని ఒక్క ముస్లిం కూడా తమ పౌరసత్వాన్ని కోల్పోడని భారత ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. దేశంలో అన్ని మతాలు సమానమేనని స్పష్టం చేసింది. ఇదీ చదవండి.. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడ్డ భారతీయులు ఇదీ చదవండి -
అరుణాచల్ప్రదేశ్పై చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్లో ఇటీవల ప్రధాని మోదీ చేసిన పర్యటనపై చైనా ప్రకటనను భారత్ ఖండించింది. ప్రధాని పర్యటనపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవ దూరమైనవని, అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పడూ భారత్లో భాగమేనని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ మంగళవారం స్పష్టం చేశారు. ‘అరుణాచల్ ప్రదేశ్పై చైనా ఉన్నతాధికారి వెన్బిన్ చేసిన వ్యాఖ్యలను మేం ఖండిస్తున్నాం. భారత్లోని మిగిలిన రాష్ట్రాల్లో పర్యటించినట్లుగానే మా నాయకులు అరుణాచల్ప్రదేశ్లోనూ పర్యటిస్తారు’ అని జైస్వాల్ తెలిపారు. కాగా, మార్చి 9వ తేదీన ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైన సేలా టన్నెల్తో పాటు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. ఈ పర్యటనపై మార్చ్ 11న చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ దక్షిణ టిబెట్లోని జాంగాన్(అరుణాచల్ ప్రదేశ్) తమ దేశంలో భాగమని, అరుణాచల్ప్రదేశ్ అనే రాష్ట్రాన్ని తాము గుర్తించడం లేదని వ్యాఖ్యానించడం భారత్ ఆగ్రహానికి కారణమైంది. ఇదీ చదవండి.. 10 వందేభారత్లకు ప్రధాని మోదీ పచ్చజెండా -
అయోధ్యపై టీఎంసీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీజేపీ
పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామేందు సిన్హా రాయ్ అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నూతన రామాలయాన్ని అపవిత్ర ప్రదేశంగా అభివర్ణించారు. హిందువులెవరూ ఇలాంటి అపవిత్ర ప్రదేశంలో పూజలు చేయకూడదని కూడా అన్నారు. హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్కు చెందిన తృణమూల్ ఎమ్మెల్యే రామేందు సిన్హా రాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తృణమూల్ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. సువేందు తన ట్విట్టర్ హ్యాండిల్లో తృణమూల్పై విరుచుకుపడ్డారు.. అధికార పార్టీ నేతల మాటలు హిందువులపై జరుగుతున్న దాడులకు నిదర్శనం అని అన్నారు. శ్రీరాముని ఆలయాన్ని ‘అపవిత్రం’ అని అభివర్ణించేంతలా వారి వైఖరి మారిపోయిదన్నారు. ఇది తృణమూల్ నేతల భావజాలాన్ని వెల్లడిస్తుందన్నారు. Simply Outrageous. TMC MLA of Tarakeswar Assembly Constituency - Ramendu Sinha Roy, who is also the TMC President of Arambagh Organizational District has labeled the Grand Ram Mandir as 'UNHOLY'. He has also stated that no Indian Hindu should offer Puja at such unholy site.… pic.twitter.com/xBBQuqpTzn — Suvendu Adhikari (Modi Ka Parivar) (@SuvenduWB) March 4, 2024 -
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. భారత్ వ్యూహాత్మక వైఖరి
ఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భారత్ రెండో ప్రకటన వ్యూహత్మకంగా ఉంది. విదేశాంగ శాఖ గురువారం వెలువరించి ప్రకటన ప్రధాని మోదీ మొదట ఇచ్చిన ప్రకటనకు కాస్త విరుద్ధంగా ఉన్నప్పటికీ తటస్థ వైఖరి కనిపిస్తోంది. మొదట ఇజ్రాయెల్ వైపే ఏకపక్షంగా ఉన్న భారత్.. పాలస్తీనాపై కూడా స్పందిస్తూ శాంతిని ఆకాంక్షించింది. పాలస్తీనా సార్వభౌమాధికారం, స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయడంపై ప్రత్యక్ష చర్చలు జరపాలని తాము ఎల్లవేళలా కోరుకుంటున్నామని భారత్ గురువారం తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పాటించాల్సిన సార్వత్రిక బాధ్యత గురించి భారతదేశానికి తెలుసని అన్నారు. ఇజ్రాయెల్తో శాంతియుతంగా జీవించే స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు దిశగా చర్యలు ఉండాలని భారత్ భావిస్తున్నట్లు బాగ్చీ చెప్పారు. ప్రధాని మోదీ ప్రకటన ఇజ్రాయెల్పై హమాస్ దాడులు జరిపిన ఆరంభంలో ప్రధాని మోదీ ప్రకటన భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ప్రకటనకు కాస్త విరుద్ధంగా ఉంది. ప్రధాని మోదీ పాలస్తీనా పేరు కూడా ఎత్తకుండా ఏకపక్షంగా ఇజ్రాయెల్కు భారత్ మద్దతు ఉంటుందని తెలిపారు. హమాస్ దాడులను ఉగ్రదాడులుగా పేర్కొంటూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ ప్రతిపక్ష నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అరబ్ దేశాలు నోరువిప్పడంతో భారత విదేశాంగ శాఖ, ప్రధాని మోదీ ప్రకటనలలో ఉగ్రవాదంపై వ్యతిరేక వైఖరి ఉమ్మడి అంశంగా ఉన్నప్పటికీ స్వతంత్ర పాలస్తీనా అంశాన్ని కూడా జోడించి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పశ్చిమాసియాతో సంబంధాలు కోల్పోకుండా భారత్ వ్యూహంగా ముందుకు వెళుతోంది. యుద్ధం ఆరంభంలో ఇజ్రాయెల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ-నెతన్యాహు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ వైపే ఏకపక్షంగా ఉన్నారు. గాజాలో జరుగుతున్న దాడులపై అరబ్ దేశాలు నోరువిప్పడంతో పరిస్థితి కాస్త మారింది. దీంతో వ్యూహాత్మకంగా భారత్ విదేశాంగ శాఖ పాలస్తీనా అంశంపై కూడా మాట్లాడింది. అరబ్ దేశాలతో సంబంధాలు అరబ్ దేశాలతో వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలను భారత్ కలిగి ఉంది. భారతదేశం చమురును ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఇండియా పాలస్తీనాతో కూడా సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. పాలస్తీనాకు చట్టబద్ధ గుర్తింపు కోసం 1974లో మద్దతు తెలిపిన ఏకైక అరబ్ దేశం కాని వాటిల్లో భారత్ మొదటిస్థానంలో ఉంది. 2016లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాలస్తీనాను కూడా సందర్శించారు. 2017లో పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఇండియాను సందర్శించారు. 1977లోనూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ వైఖరి కూడా పాలస్తీనాకు మద్దతుగానే ఉంది. అక్రమంగా ఆక్రమించిన పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఖాలీ చేస్తేనే పశ్చిమాసియా సమస్య పరిష్కారమవుతుందని అప్పట్లో వాజ్పేయీ కూడా అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత శనివారం ప్రారంభమైన యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరుపక్షాల వైపు రాకెట్ దాడులు, బాంబుల మోతలతో మారణోమాన్ని సృష్టిస్తున్నారు. ఇరుదేశాల్లో కలిపి దాదాపు 3200 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1300 మంది మరణించగా.. పాలస్తీనాలో 1900 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాను ఖాలీ చేయాలని ఇజ్రాయెల్ దళాలు ఆదేశాలు జారీ చేశాయి. వరుసదాడులతో ఇరుపక్షాలు చెలరేగిపోతున్నాయి. ఇదీ చదవండి: ఉత్తర గాజాను ఖాళీ చేయండి: ఇజ్రాయెల్ సైన్యం -
ఆస్పత్రి నుంచి అమ్మ ఒడికి..
సైదాబాద్: కుమార్తె వైద్యానికైన బిల్లు కట్టలేక.. ఆస్పత్రిలో వదిలేసి వచ్చిన తల్లిదండ్రుల చెంతకు ఆ చిన్నారి ఎట్టకేలకు చేరింది. తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి చొరవతో కథ సుఖాంతమైంది. ప్రేమ వివాహం చేసుకుని సింగరేణి కాలనీలో నివసిస్తున్న నితిన్, ప్రవల్లిక దంపతులకు ఈనెల7న పాప పుట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన పాప మెరుగైన వైద్యం కోసం వారు పిసల్బండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆరు రోజుల చికిత్సకు రూ.లక్షా16వేల బిల్లు అయింది. వారి వద్ద కేవలం రూ.30 వేలు మాత్రమే ఉండటంతో దిక్కుతోచక పాపను ఆస్పత్రిలో వదిలేసి వచ్చేశారు. వారి నిస్సహాయస్థితిపై సాక్షి దినపత్రికలో బుధవారం ‘బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దాంతో పలువురు దాతలు వారిని సంప్రదించి తోచిన సహాయం చేశారు. సాక్షి కథనంపై స్పందించిన తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి కళార్చన, గోవర్ధన్రెడ్డి గురువారం ఆస్పత్రికి చేరుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడి అదే రాత్రి చిన్నారిని డిశ్చార్జి చేయించారు. తమ పరిస్థితిని వెల్లడిస్తూ కథనం ప్రచురించిన సాక్షి దినపత్రికకు, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ అధికారులకు చిన్నారి తల్లిదండ్రులు నితిన్, ప్రవల్లికలు కృతజ్ఞతలు తెలిపారు. -
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై రాజకీయ ప్రకంపనలు
-
పవన్పై క్రిమినల్ డిఫమేషన్ కేసు.. వలంటీర్ స్టేట్మెంట్ రికార్డ్
సాక్షి, విజయవాడ: వలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విజయవాడ సివిల్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలైన సంగతి తెలిసిందే. వలంటీర్ పిటీషన్ను న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. పవన్ కేసు ఫైల్ చేసిన వలంటీర్ స్టేట్మెంట్ను శుక్రవారం.. జడ్జి రికార్డు చేశారు. వలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురైయానని, న్యాయం చేయాలని మహిళా వలంటీర్ కోర్టుని ఆశ్రయించారు. వలంటీర్ తరఫున లాయర్లు కేసు దాఖలు చేశారు. సెక్షన్ 499, 500, 504, 505 ప్రకారం కేసు దాఖలు చేశారు. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరింది. చదవండి: అజేయ కల్లం పిటిషన్ విచారణకు స్వీకరణ -
ఇంకా ఎన్ని కనిపెడతావ్ బాబు ?
-
వివేకా హత్య కేసులో సీబీఐ స్టేట్ మెంట్ లో అన్నీ అబద్దాలే ఉన్నాయన్న అజేయకల్లం
-
మావోయిస్టు ఆర్కే భార్య శిరీష అరెస్ట్పై ఎన్ఐఏ ప్రకటన
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ భార్య శిరీషను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ ప్రకటన విడుదల చేసింది. ఆమెతో పాటు దుడ్డు ప్రభాకర్ను కూడా అరెస్టు చేసినట్లు స్పష్టం చేసింది. వీరిద్దరికి మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఎన్ఐఏ తెలిపింది. ఇప్పటికీ వారు మావోయిస్టుల కోసం పనిచేస్తున్నారని పేర్కొంది. అంతేకాకుండా మావోయిస్టుల కోసం రిక్రూట్మెంట్ జరుపుతున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. 2019లో తిరియా ఎన్కౌంటర్లో ఆర్కే భార్య శిరీష, దుడ్డు ప్రభాకర్లు పాల్గొన్నారని ఎన్ఐఏ తెలిపింది. వారోత్సవాల్లో భాగంగా వారు భారీ కుట్రకు పాల్పడినట్లు వెల్లడించింది. ఆర్కే డైరీ ఆధారంగానే శిరీష, దుడ్డు ప్రభాకర్లను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ పేర్కొంది. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ (రామకృష్ణ అలియాస్ ఆర్కే) సతీమణి శిరీష అలియాస్ పద్మని కేంద్ర దర్యాప్తు సంస్థ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని ఆమె ఇంట్లో అదుపులోకి తీసుకుంది. మూడు ప్రైవేటు కార్లలో ఆలకూరపాడుకు చేరుకున్న ఎన్ఐఏ బృందం ఇంటి పనుల్లో ఉన్న ఆమెను సాయంత్రం 6 గంటల సమయంలో అదుపులోకి తీసుకుని, బలవంతంగా కారులో తరలించేందుకు ప్రయత్నం చింది. ఎందుకు అరెస్టు చేస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నముచినా సమాధానం చెప్పలేదు. గతంలోనూ తనిఖీ ఆర్కే 2021 అక్టోబర్ 16న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు మున్నా సైతం ఉద్యమ బాటలో నడిచి ఎదురు కాల్పుల్లో మరణించాడు. ఆ తర్వాత 2022లో ఆలకూరపాడులో శిరీష ఇంట్లో ఎన్ఐఏ బృందం ఓసారి తనిఖీలు చేసింది. మావోయిస్టులకు సహకరించడం, నగదు సమకూర్చడం, వైద్య విద్యారి్థనితో దళాలకు వైద్యం చేయించి, దళం వైపు ఆకర్షించేలా చేయడంలో శిరీషకు సంబంధం ఉందన్న ఆరోపణలతో 2022 జూలై 19న ఛత్తీస్ఘడ్కు చెందిన ఎన్ఐఏ బృందం ఆమె ఇంట్లో తనిఖీ చేసింది. ఇదీ చదవండి: ఎన్ఐఏ అదుపులో ఆర్కే భార్య శిరీష -
మళ్లీ జగనే సీఎం..నాకు అనుభవం లేదు బాబుకు అంత సీన్ లేదు
-
మంటల్లో మహీంద్రా ఎక్స్యూవీ700: వీడియో వైరల్, స్పందించిన కంపెనీ
న్యూఢిల్లీ: మహీంద్రా పాపులర్ వాహనం ఎక్స్యూవీ 700 అగ్ని ప్రమాదం వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. జైపూర్ జాతీయ రహదారిపై ఎక్స్యూవీ 700 మంటలు చెలరేగిన ఘటనపై స్పందించిన మహీంద్ర, ప్రమాద కారణాలపై వివరణ ఇచ్చింది. ఎక్స్యూవీ 700 కార్ ఓనర్ కులదీప్ సింగ్ ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను మే 21న, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్గా మారింది. దీనిపై మహీంద్రా ఆటోమోటివ్ దర్యాప్తు నిర్వహించి, వైర్ ట్యాంపరింగ్ వల్లే ఎక్స్యూవీ 700 అగ్నిప్రమాదం జరిగిందని నిర్ధారించింది. ఈ మేరకు కంపెనీ అధికారిక ప్రకటనలను విడుదల చేసింది. (మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్న్యూస్, ఇంట్రస్టింగ్ అప్డేట్స్) జైపూర్ జాతీయ రహదారిపై తన కుటుంబంతో కలిసి డ్రైవింగ్ చేస్తుండగా సడెన్గా మంటలు వ్యాపించినట్టు కులదీప్ సింగ్ ట్విటర్లో పేర్కొన్నారు. కారు వేడెక్కుతోంది అనే ముందస్తుహెచ్చరిక లేకుండానే, పొగలు వ్యాపించి మంటల్లో చిక్కుకుందని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్వీట్ చేశారు. ఈ కారులో ఎలాంటి మార్పులు చేయలేదని, అసలు తన కారు చాలా కొత్తదని కూడా చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మంటలు వ్యాపించి వాహనం దగ్ధమయ్యేలోపే ప్రయాణికులంతా బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మహీంద్రా ఆటోమోటివ్ ప్రకటన అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని కనుగొన్నామని,వాహనం అసలు సర్క్యూట్ను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఆఫ్టర్మార్కెట్ ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్లు , నాలుగు యాంబియంట్ లైటింగ్ మాడ్యూల్స్ వల్ల ఇది సంభవించిందని మరో ప్రకటన విడుదల చేసింది. ఎడిషనల్ వైరింగ్ కనెక్షన్ ఒరిజనల్ది కాదని , నకిలీ వైరింగ్ జీనును అమర్చినట్టు పేర్కొంది. ఇది ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమాచారాన్ని కారు ఓనర్కు ఈమెయిల్ ద్వారా అందించినట్టు కూడా తెలిపింది. Thank You Mahindra For Risking My Family's Life With Your Most Premium Product (XUV700). The Car Catches Fire While Driving On Jaipur Highway. The car did not overheat, smoke came in the moving car, then it caught fire.@anandmahindra @MahindraRise @tech_mahindra @ElvishYadav pic.twitter.com/H5HXzdmwvS — Kuldeep Singh (@ThKuldeep31) May 21, 2023 చాలామంది తమ వాహనాలను ఎడిషనల్ ల్యాంప్స్ లేదా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి వాటితో అప్డేట్ చేయాలనుకుంటారు అయితే, వైరింగ్ సరిగ్గా ఇన్స్టాల్ చేయకపోతే, అది షార్ట్ సర్క్యూట్కు దారితీస్తుంది. దీంతో ఎలక్ట్రికల్ సర్క్యూట్ వేడెక్కే ప్రమాదం ఉందని, ఇంజిన్ సరిగ్గా పనిచేసినప్పటికీ, మంటలు చెలరేగే అవకాశం ఉందని హెచ్చరించింది. అందుకే ఆఫ్టర్-మార్కెట్ పార్ట్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు విశ్వసనీయ డీలర్లు, మెకానిక్లపై మాత్రమే ఆధారపడటం చాలా కీలకమని సూచించింది. Here is an update to our official statement with reference to the incident in Jaipur involving the XUV700. Our customers' safety is always our top most priority. pic.twitter.com/HYSQDEBFIu — Mahindra Automotive (@Mahindra_Auto) May 24, 2023 -
అనుమానాస్పద కాల్స్ వస్తున్నాయా? వాట్సాప్ ఏం చెప్పిందంటే..
గత కొన్ని రోజులుగా వాట్సాప్ (WhatsApp)లో యూజర్లకి అంతర్జాతీయ నంబర్ల నుంచి అనుమానాస్పద కాల్స్ వస్తున్నాయి. యూట్యూబ్ వీడియోలను లైక్ చేయడం, స్క్రీన్షాట్లను పంపడం వంటివి చేస్తే చాలు నగదు, ఇతర బహుమతులు వస్తాయంటూ నమ్మించి డబ్బులు కాజేస్తున్నారు దుండగులు. ఇదీ చదవండి: డబ్బుల్లేకుండా రైల్వే టికెట్ బుకింగ్! ఎలాగో తెలుసా? ఈ అనుమానాస్పద కాల్స్ కు సంబంధించి వాట్సాప్ వివరణ ఇచ్చింది. స్పామ్ను ఆపడానికి అసాధారణ ప్రవర్తన కలిగిన అకౌంట్లను గుర్తించి చర్య తీసుకోవడానికి తాము స్పామ్ డిటెక్షన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సీఎన్బీసీ టీవీ18 వార్తా సంస్థ ద్వారా తెలియజేసింది. ఫిర్యాదుల స్వీకరణకు భారత్ లో ప్రత్యేక అధికారిని నియమించినట్లు పేర్కొంది. అనుమానాస్పద కాల్స్ లేదా ఇతర అసౌకర్యాలు కలిగితే తమను సంప్రదించవచ్చని సూచించింది. ఇలా వచ్చిన ఫిర్యాదులు, వాటిపై వాట్సాప్ తీసుకున్న చర్యలను యూజర్లు తెలుసుకోవచ్చు. ఆన్లైన్ స్కామ్ల నుంచి రక్షణకు వాట్సాప్ లో అంతర్నిర్మితంగా ఉన్న టూ-స్టెప్ వెరిఫికేషన్, బ్లాక్ అండ్ రిపోర్ట్ గోప్యతా నియంత్రణల వంటి భద్రతా సాధనాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి “స్టే సేఫ్ విత్ వాట్సాప్” పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. వాట్సాప్ లో అంతర్జాతీయ నంబర్ల నుంచి అనుమానాస్పద కాల్స్, సందేశాలు ఎక్కువయ్యాయంటూ ట్విటర్ లో పోస్టింగులు హోరెత్తాయి. ఇలా వస్తున్న కాల్స్ లో ఎక్కువ భాగం +251 (ఇథియోపియా), +60 (మలేషియా), +62 (ఇండోనేషియా), +254 (కెన్యా) +84 (వియత్నాం)తో ప్రారంభమయ్యే ఫోన్ నంబర్ల నుంచి వస్తున్నాయి. వాట్సాప్ లో అంతర్జాతీయ నంబర్ల నుంచి అనుమానాస్పద కాల్స్ వస్తే స్పందించవద్దని తెలంగాణ సైబరాబాద్ పోలీసులు కూడా ట్విటర్ ద్వారా వాట్సాప్ యూజర్లను హెచ్చరించారు. వాట్సాప్లో స్కామర్లు తన స్నేహితుడిని మోసగించి రూ. 5 లక్షలు ఎలా కాజేసారో బిలియనీర్, జెరోధా సంస్థ సీఈవో నితిన్ కామత్ తెలియజేశారు. ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. తగ్గనున్న సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు.. దిగుమతి సుంకం ఎత్తేసిన కేంద్రం -
షమీమ్ స్టేట్ మెంట్ లో కనిపించని వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పేర్లు
-
బీ అలర్ట్: మంటల్లో టాటా నెక్సాన్ ఈవీ, కంపెనీ స్పందన ఏంటంటే?
సాక్షి, ముంబై: ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలంటే..అందులోనూ ఎండాకాలంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయనే భయం ఈ మధ్య కాలంలో కస్టమర్లను పట్టిపీడిస్తోంది. ఈ క్రమంలో టాటా మోటార్స్ కు చెందిన పాపులర్ కారు,అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు టా టా నెక్సాన్లో మంటలు చెలరేగడం ఆందోళన రేపింది. టాటా నెక్సాన్ ఈవీలో మంటలు చెలరేగుతున్న వీడియో వైరల్ కావడం ఎలక్ట్రిక్ వాహన ప్రియుల్లో కలవరం రేపింది. పూణేలో చోటుచేసుకున్న ఈ ఘటనలో మంటల్లో కారు కాలి పోయింది. అయితే అధికారులు మంటలను ఆర్పేందుకు కృషి చేశారు. దీనిపై టాటా మోటార్స అధికారిక ప్రకటన విడుదల చేసింది. టాటా మోటార్స్ అధికారిక ప్రకటన టాటా నెక్సాన్ ఈవీలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదానికి కారణం అనధికార సర్వీస్ సెంటర్లో లెప్ట్ హెడ్ల్యాంప్ను సరిగ్గా మార్చకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని స్పష్టం చేసింది. దురదృష్టవశాత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని ఒక ప్రకటనలో వెల్లడించింది. సంబంధిత వర్క్షాప్లో ఫిట్మెంట్, రిపేర్లో లోపాలున్నాయని, హెడ్ల్యాంప్ ఏరియాలో విద్యుత్ లోపం కారణంగా థర్మల్ సంఘటనకు దారితీసిందని వివరించింది. బాధిత కస్టమర్కు అన్ని రకాలుగా సాయం చేస్తున్నట్టు తెలిపింది. (layoffs: షాకిచ్చిన ఇండియన్ ట్విటర్, 30 శాతం మందికి గుడ్ బై?) ఆటోమోటివ్ మార్కెట్ నిరంతరం కొత్త టెక్నాలజీ, ఆధునిక ఎలక్ట్రానిక్ భాగాలతో అభివృద్ధి చెందుతోంది, ICE కార్లు, EVలలో శిక్షణ పొందిన నైపుణ్యం అవసరం. వినియోగదారుల భద్రత దృష్ట్యా, అటువంటి సంఘటనలు జరగకుండా అధీకృత టాటా మోటార్స్ వర్క్షాప్లలో మాత్రమే తమవాహనాలకు ఆన్-స్పెక్ కాంపోనెంట్స్, యాక్సెసరీస్, స్పేర్ పార్ట్లను అమర్చుకోవాలని కస్టమర్లను కోరుతున్నామని విజ్ఞప్తి చేసింది. ఇదే మొదటిసారి కాదు 2022 జూన్లో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ముంబైలోని రెస్టారెంట్ వెలుపల నిలిపి ఉంచిన టాటా నెక్సాన్ ఈవీలో మంటలు చెలరేగాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై ఆందోళనలు తలెత్తాయి. -
ఓఐసీ ప్రకటనపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: భారత్ అంతర్గత వ్యవహారాలపై ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య (ఓఐసీ) మరోసారి అసంబద్ధ వ్యాఖ్యలు చేసింది. శ్రీ రామ నవమి సందర్భంగా జరిగిన ఘర్షణలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది ఓఐసీ. అయితే.. దీనిపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వాళ్ల కమ్యూనల్ మైండ్సెట్(మతపరమైన ఆలోచనాధోరణికి) ఇది మరో ఉదాహరణ అని, భారత్ వ్యతిరేక ఎజెండాను ఆ దేశాలు మరోసారి బయటపెట్టాయని భారత్ మండిపడింది. భారత్ అంతర్గత వ్యవహారాలలో ఓఐసీ జోక్యం అక్కర్లేని అంశమని భారత్ పేర్కొంది. పలు రాష్ట్రాల్లో శ్రీరామనవమి శోభాయాత్రల సందర్భంగా ముస్లింలు లక్ష్యంగా హింస, విధ్వంసం చోటుచేసుకున్నాయని ఒక ప్రకటనలో ఆరోపించింది. అధికారులు దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భారత్లో ముస్లింల భద్రతకు, హక్కులకు భరోసా ఇవ్వాలని ఓఐసీ తన ప్రకటనలో భారత్ను డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే.. భారత్ తరపున విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పందించారు. ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య జనరల్ సెక్రటేరియెట్ పేరిట రిలీజ్ అయిన ప్రకటనను, బాగ్చీ ఖండించారు. అలాగే జమ్ము కశ్మీర్ అంశంలోనూ ఓఐసీ(ఇందులో పాక్ కూడా ఉంది) జోక్యాన్ని అవసరమైన అంశంగా తేల్చారు ఆయన. -
రాఘవ్ చద్దా, పరిణితిచోప్రా పెళ్లి సాధ్యమేనా? నటి స్టేట్మెంట్ వైరల్
బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణితీ చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ యువనేత రాఘవ్ చద్దాల వివాహంపై కొద్ది రోజులుగా రూమర్స్ జోరుగా వ్యాప్తి చెందుతున్నాయి. వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్నారని, త్వరలోనే ఒక్కటి కాబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల ఓ కార్యక్రమానికి ఈ జోడీ కలిసివెళ్లడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. కానీ ఇప్పటివరకు వీరిద్దరు ఈ విషయంపై నోరుమెదపలేదు. ఈ వార్తలను ఖండించనూ లేదు ఖరారూ చేయలేదు. అయితే తాజాగా పరిణితీ చోప్రా గతంలో ఇచ్చిన ఓ స్మేట్మెంట్కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన పరిణితి.. తాను రాజకీయ నాయకులను మాత్రం పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. స్వయంగాపైకి వచ్చినవారు అంటే తనకు ఇష్టమని, తనకు గౌరవం ఇచ్చేవారినే ఇష్టపడతానని పేర్కొంది. పొలిటిషియన్ను తప్ప ఏ రంగానికి చెందినవారినైనా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమని తెలిపింది. ఈ అమ్మడు గతంలో ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. యువ నాయకుడు రాఘవ్ చద్దాతో ఈమె సన్నితంగా మెలగడే ఇందుకు కారణం. ఈమె కొత్త సినిమాలో సహ నటుడు హార్డీ సంధు కూడా.. పరిణితి త్వరలో పెళ్లి చేసుకోబోతుందని, ఎట్టకేలకు తనకు కావాల్సిన భాగస్వామి దొరికాడని వెల్లడించాడు. ఆమెకు అడ్వాన్స్గా.. ఆల్ది బెస్ట్ కూడా చెప్పాడు. దీంతో రాఘవ్ చద్దాతోనే పరిణితి వివాహానికి సిద్ధం అవుతోందని నెటిజన్లు భావిస్తున్నారు. వీరి పెళ్లి సాధ్యాసాధ్యాల గురించి జోరుగా చర్చిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకుడ్ని పెళ్లి చేసుకోనని చెప్పిన పరిణితి ఇప్పుడు మనసు మార్చుకుని ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. ప్రేమలో ఏదైనా సాధ్యమే అని అంటున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ అటు రాఘవ్కు ఇటు అభిమానులకు షాక్ ఇస్తుందా..? లేదంటే పెళ్లికి రెడీ అవుతుందా చూడాలి! చదవండి: సొంత అంతరిక్ష విమానం.. కల సాకారానికి అడుగు దూరంలో భారత్.. -
రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన!
రూ.2వేల నోట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు నింపడం అనేది పూర్తిగా బ్యాంకుల ఇష్టమని, దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సూచనలూ ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంటులో తెలియజేశారు. ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!.. ఎలాగంటే... భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వార్షిక నివేదికల ప్రకారం.. రూ.500, రూ.2,000 నోట్ల మొత్తం విలువ 2017 మార్చి చివరి నాటికి రూ.9.512 లక్షల కోట్లు. అదే 2022 మార్చి చివరి నాటికి రూ.27.057 లక్షల కోట్లు అని ఆర్థిక మంత్రి లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు నింపకూడదని బ్యాంకులకు ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని చెప్పారు. తమ కస్టమర్ల అవసరాలు, కాలానుగుణ ధోరణి మొదలైన వాటి ఆధారంగా బ్యాంకులు అంచనా వేసి ఏటీఎంలలో నోట్లను నింపుతాయని వివరించారు. ఇదీ చదవండి: New IT Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఐటీ రూల్స్ ఇవే.. కాగా రూ.2 వేల నోట్ల సర్క్యూలేషన్ పూర్తిగా తగ్గిపోయింది. పలు కారణాల చేత ఈ నోట్ల సర్క్యూలేషన్ను తగ్గించేసినట్టు తెలిసింది. ఆర్బీఐ గత కొన్నేళ్లుగా కనీసం ఒక్క రూ.2000 కరెన్సీ నోటును కూడా ప్రింట్ చేయలేదు. ఏటీఎంలలో ఈ నోట్లు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2019లోనే రూ.2 వేల నోట్ల ప్రింటింగ్ను ఆపేసినట్టు ఆర్బీఐ ఆ మధ్య తెలిపింది. అయితే అప్పటికే చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లు ఏమయ్యాయన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. -
కనీసం వాష్రూమ్కు కూడా వెళ్లనివ్వట్లేదు.. నటుడిపై సంచలన ఆరోపణలు
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, తన భార్య ఆలియా సిద్ధిఖీతో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పాస్పోర్ట్ సమస్యలతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆలియా ముంబయి బాంద్రాలోని సిద్ధిఖీ ఇంటికి తిరిగొచ్చింది. అయితే ఆమెకు ఇక్కడ ఉండే అర్హత లేదంటూ నవాజుద్దీన్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తనను ఇంట్లో వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆలియా ఆరోపించింది. కనీసం అన్నం కూడా తిననివ్వడం లేదని.. వాష్రూమ్కు వెళ్లనివ్వట్లేదని వాపోయింది. తాజాగా తన లాయర్తో ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. అయితే నవాజుద్దీన్ సిద్ధిఖీ దాదాపు రెండేళ్లుగా తన భార్య ఆలియా సిద్ధిఖీతో విడాకులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. ఆలియా తరఫు న్యాయవాది రిజ్వాన్ స్టేట్మెంట్ సంచలనంగా మారింది. ఆలియా న్యాయవాది స్టేట్మెంట్లో రాస్తూ..' నా క్లైంట్ను అవమానిస్తున్నారు. ఆమెకు ఆహారం తిననివ్వడం లేదు. వాష్రూమ్కు కూడా వెళ్లనివ్వట్లేదు. ఆమె చుట్టూ బాడీగార్డ్స్ను ఉంచారు. ఆస్తి విషయంలో కావాలనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్టు చేయిస్తామని బెదిరించారు. ప్రతి రోజూ పోలీసులకు ఫోన్ చేస్తున్నారు. నవాజుద్దీన్, అతని కుటుంబ సభ్యులు గత ఏడు రోజులుగా నా క్లయింట్కు ఆహారం లేదు. ఆమె ఉన్న హాలులో సీసీ కెమెరాలను అమర్చారు. ఆమె ఇద్దరు పిల్లలు కూడా మైనర్లు.' అంటూ రిలీజ్ చేశారు. నవాజుద్దీన్-ఆలియాల వివాహం నవాజుద్దీన్, ఆలియా 2009లో వివాహం చేసుకున్నారు. వారికి కుమార్తె షోరా, కుమారుడు యాని సిద్ధిఖీ ఉన్నారు. 2021లో ఆలియా నవాజుద్దీన్ విడాకుల నోటీసులు పంపించింది. తమ 11 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికింది. లాక్డౌన్ సమయంలో ఇది ఒక అవకాశంగా భావించానని ఆమె వెల్లడించింది. నవాజుద్దీన్, అతని కుటుంబం గృహ హింసకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. -
కందుకూరు ఘటన: డ్రోన్ షాట్ల దారుణమే! ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం
సాక్షి, నెల్లూరు: డ్రోన్ షాట్ల కోసం ఇరుకు కూడలిలో టీడీపీ బహిరంగ సభను నిర్వహించడంతోపాటు భారీగా ఫ్లెక్సీలు, ద్విచక్ర వాహనాల పార్కింగ్తో తోపులాట చోటు చేసుకుని తొక్కిసలాట జరిగినట్లు కందుకూరు ఘటనలో ప్రత్యక్ష సాక్షులు, బాధిత కుటుంబాలు విచారణ కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చాయి. గత నెల 28వ తేదీన ‘ఇదేం కర్మ’లో భాగంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు ఎన్టీఆర్ సర్కిల్లో నిర్వహించిన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 8 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా మరో 8 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణకు ఏర్పాటైన హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ శేషశయనారెడ్డి నేతృత్వంలోని కమిషన్ శుక్రవారం సంఘటనా స్థలాన్ని సందర్శించి పలువురి నుంచి వాంగ్మూలం సేకరించింది. తొక్కిసలాట ఎలా జరిగింది? ఆ సమయంలో ఎంత మంది ఉన్నారు? అనే అంశాలపై ఆరా తీసింది. వాహనం ఎక్కడ నిలిపారు? తొలుత ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో అధికారుల నుంచి వివరాలు సేకరించిన అనంతరం కమిషన్ ఎన్టీఆర్ సర్కిల్ను పరిశీలించింది. బహిరంగ సభకు ఎక్కడ అనుమతి ఇచ్చారు? చంద్రబాబు వాహనం ఎక్కడ నిలిపారు? అనే అంశాలతోపాటు ప్రమాదం జరిగిన గుండంకట్ట రోడ్డును క్షుణ్నంగా పరిశీలించింది. ఇరువైపులా ఉన్న రెండు డ్రైనేజీలను పరిశీలించింది. కందుకూరు టీడీపీ ఇన్చార్జి ప్రకటించిన పరిహారం అందలేదని బాధిత కుటుంబాలు కమిషన్ దృష్టికి తెచ్చాయి. దాదాపు 27 మంది నుంచి కమిషన్ వాంగ్మూలం నమోదు చేసింది.