Sumanth Ashwin
-
‘7 డేస్ 6 నైట్స్’ వసూళ్లు పెరుగుతున్నా చిన్న వెలితి: ఎంఎస్ రాజు
‘‘మా ‘7 డేస్ 6 నైట్స్’ సినిమాని ప్రేక్షకులతో కలిసి థియేటర్లో చూశాను.. వారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.. చాలా సంతోషంగా అనిపించింది’’ అని డైరెక్టర్ ఎంఎస్ రాజు అన్నారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలయింది. (చదవండి: అప్పుడు నాకు ఆ సెన్స్, జ్ఞానం లేదు: నాగబాబు) ఈ చిత్రం సక్సెస్ మీట్లో చిత్రదర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ– ‘‘శంకరాభరణం’ నుంచి ఇప్పటివరకు క్లాసిక్ సినిమాల వసూళ్లు మౌత్ టాక్ వల్ల పెరిగాయి. మా సినిమాకి కూడా మౌత్ టాక్తో ప్రతి షోకి అన్ని చోట్ల వసూళ్లు పెరుగుతుండటం హ్యాపీ. అయితే, ఒక చిన్న వెలితి. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ పెద్ద సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యిందనేది చాలా మంది ఉద్దేశం. ఇప్పుడు దాసరి నారాయణరావుగారిలా, కె.బాలచందర్గారిలా చిన్న సినిమాలు, ప్రయోగాత్మక చిత్రాలు చేస్తే?, ఈ రోజు ‘హ్యాపీ డేస్’ లాంటి సినిమాలు వస్తే? పరిస్థితి ఏంటి? అని ఆలోచించాల్సిన పరిస్థితి. చిన్న సినిమాలకు, నాలుగు కోట్ల బడ్జెట్ లోపు చిత్రాలకు టికెట్ రేట్లు తగ్గించాలి. రూ.200 టికెట్ పెట్టి చిన్న సినిమాలను ఎవరు చూస్తారు?. ప్రభుత్వాలతో చర్చించి ధర తగ్గించేలా నిర్ణయం తీసుకోవాలి’’ అన్నారు. -
చిన్న సినిమాలకు ఇదే సరైన సమయం
‘‘7 డేస్ 6 నైట్స్’ డీసెంట్ ఫిల్మ్.. యువతరంతో పాటు ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. మార్చి తర్వాత ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’ సినిమాలు విడుదలై, మంచి హిట్టయ్యాయి. చిన్న సినిమాలు రావడానికి సరైన సమయం ఇదేనని భావిస్తున్నాను’’ అన్నారు దర్శక–నిర్మాత ఎంఎస్ రాజు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతున్న సందర్భంగా కొత్త ట్రైలర్ను విడుదల చేశారు. చిత్రదర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూపించాలనుకుంటున్నాం. మా చిత్రాన్ని యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చూడాలని తక్కువ టికెట్ రేట్స్ పెడుతున్నాం. ఈ సినిమాతో నిర్మాతలుగా మారిన మా అబ్బాయి సుమంత్, అమ్మాయి రిషితా దేవికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’’ అన్నారు రిషితా దేవి. ‘‘7 డేస్ 6 నైట్స్’ నాకు ఒక మాస్టర్ పీస్లా అనిపిస్తోంది’’ అన్నారు సుమంత్ అశ్విన్. నిర్మాత రజనీకాంత్ .ఎస్, కో ప్రొడ్యూసర్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
దేవుడు వరమిస్తే.. మళ్లీ ఎంఎస్ రాజు గారి అబ్బాయిగానే పుడతా: సుమంత్ అశ్విన్
మా నాన్న(నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు) ఎలాంటి ఫాదర్ అని ఎప్పుడు ఆలోచించలేదు. నాకు ఏది కావాలంటే అది ఇచ్చారు. ఆయనే ఫర్ఫెక్ట్ ఫాదర్. మరో జన్మంటూ ఉంటే.. దేవుడు వచ్చి ఏం కావాలని అడిగితే.. మళ్లీ ఎంఎస్ రాజు దంపతులు కడుపునే పుట్టాలని కోరుకుంటా’అని యంగ్ హీరో సుమంత్ అశ్విన్ అన్నారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా ఎంఎస్ రాజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘7 డేస్ 6నైట్స్’.సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. జూన్ 24న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► నా కెరీర్లో సక్సెస్ ఫుల్ సినిమాలు ఉన్నాయి. డిజప్పాయింట్ చేసినవీ ఉన్నాయి. అయితే, ఈ జర్నీ చాలా అందంగా ఉంది. నా తొలి మూవీ'తూనీగ తూనీగ’విడుదలైన 10 ఏళ్లు కావోస్తుంది. ఈ పదేళ్ల కూడా చాలా స్పీడ్గా వెళ్లింది. ►'తూనీగ తూనీగ' కోసం మూడు నాలుగు సినిమాలకు పెట్టినంత ఎఫర్ట్ పెట్టాం. ప్రశంసలు వచ్చాయి కానీ ఆశించిన వసూళ్లు రాలేదు. కొన్ని సినిమాలు పేపర్ మీద బావుంటాయి. ఎక్కడో చిన్న తప్పు వల్ల అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. అయితే, మనం చేసే హార్డ్ వర్క్ విషయంలో ఎటువంటి లోపం ఉండకూడదు. ►ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే..'7 డేస్ 6 నైట్స్’లో డిఫరెంట్ రోల్ చేశా.రియాలిటీకి దగ్గరగా ఉన్న పాత్ర అది. ఇప్పుడు ప్రేక్షకులు కూడా డిఫరెంట్ రోల్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. కరోనా వల్ల కావచ్చు, మరొకటి కావచ్చు... ప్రేక్షకులు వరల్డ్ సినిమా చూశారు. అప్డేట్ అయ్యారు. వేరే లెవెల్లో ఉన్నారు. వాళ్ళకు రీచ్ అవ్వాలంటే మనం కూడా నెక్స్ట్ లెవెల్ థింగ్స్ చేయాలి. టైమ్ పట్టినా కొత్త రోల్స్ చేయాలనుకుంటున్నాను. ►ఈ సినిమాలో నేను ఒక నార్మల్ యంగ్స్టర్ పాత్ర చేశాను. అతను ఫిల్మ్ మేకర్ అవ్వాలని అనుకుంటాడు. జీవితంలో తనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఎక్కువ స్మోక్ చేస్తాడు. వెయిట్ చేస్తాడు. తన మీద కేర్ తీసుకోడు. అటువంటి మనిషి ఎలా ఉంటాడో... నా లుక్ కూడా అలాగే ఉంటుంది. ►ఇందులో రోహన్ది ఇంపార్టెంట్ రోల్. అతడిని నాన్నే సెలెక్ట్ చేశారు. ముందు ఎస్టాబ్లిష్ హీరోని తీసుకుంటే బావుంటుందని అనుకున్నా. సినిమా చూశాక పర్ఫెక్ట్ కాస్టింగ్ అనిపించింది. మెహర్ ఎంత బాగా చేసిందంటే... ఆమెను 'సతి' సినిమాలో కూడా తీసుకున్నాం. ►నాన్న(ఎంఎస్ రాజు) ఇప్పుడు ఫుల్ ఫైర్లో ఉన్నాడు. ఎంఎస్ రాజు 2.0 అనుకోవచ్చు. 'డర్టీ హరి'తో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. నాన్నతో సన్నిహితంగా ఉంటాను కాబట్టి ఆయనేంటో నాకు తెలుసు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' తర్వాత మధ్యలో ఎక్కడో 'ప్రేక్షకులకు ఏం కావాలో అదే ఇవ్వాలి. సేఫ్ గేమ్... ఫ్యామిలీలు, టార్గెట్ ఆడియన్స్' అంటూ చేసిన సినిమాలు కథల పరంగా కొంత డిజప్పాయింట్ చేసి ఉండొచ్చు. అవన్నీ పక్కన పెట్టి... నాన్నగారు కంప్లీట్ అప్ గ్రేడ్ అయ్యి సినిమాలు చేస్తున్నారు. నాకు అది బాగా నచ్చింది. '7 డేస్ 6 నైట్స్'లో ఎంఎస్ రాజు మార్క్ ఉంటుంది. అదే సమయంలో 20 ఏళ్ళ దర్శకుడు తీసినట్టు ఉంటుంది. ► చిన్నప్పుడు, బాగా వెయిట్ ఉండేవాడిని. అప్పుడు వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు గారిని చూస్తే ఫిట్గా, హ్యాండ్సమ్గా ఉండేవారు. మంచి డ్రస్సులు వేసుకునేవారు. నేను వెయిట్ వల్ల అటువంటి డ్రస్సులు వేసుకోలేకపోయేవాడిని. డ్యాన్సులు చేసేవారు. షూటింగ్స్ చేసేటప్పుడు వాళ్ళను చూసి... నేను అలా చేయలేనని అనుకున్నా. అప్పుడు సినిమాటోగ్రాఫర్ లేదా డైరెక్టర్ కావాలనుకున్నా. 'వర్షం' సమయంలో నిక్సన్ మాస్టర్ పరిచయం అయ్యారు. ఆయన దగ్గర ఏరోబిక్, డ్యాన్సులో కొన్ని క్లాసులు తీసుకున్నా. అప్పుడు వెయిట్ తగ్గా. మా సినిమాల్లో హీరో హీరోయిన్ల ఫోటోషూట్స్ టైమ్లో వెళితే... నా ఫోటోలు కొన్ని తీశారు. అవి త్రివిక్రమ్ గారు, ప్రభుదేవా గారు చూసి 'చాలా బావున్నాడు. బాడీ బిల్డ్ చేస్తే మంచి హీరో అవుతాడు' అని చెప్పారు. నా మనసులో అది ఉండిపోయింది. దాంతో ముంబై వెళ్లి యాక్టింగ్ కోర్స్ చేశా. హీరో కావాలనుకున్నా. ► నాకు బోల్డ్ అనే పదం నచ్చదు. యువత అడల్ట్ కంటెంట్ కోసం థియేటర్లకు రావాల్సిన అవసరం లేదు. ఎవరూ రారు కూడా! ఇంటర్నెట్లో బోలెడు కంటెంట్ ఉంది. కథ ఉంటేనే ఎవరైనా థియేటర్లకు వస్తారు.'7 డేస్ 6 నైట్స్' ఫ్యామిలీతో చూసే మూవీ ► 'డర్టీ హరి'తో నిర్మాతలకు మంచి లాభాలు వచ్చాయి. దాని తర్వాత ఏ సినిమా చేయాలని నాన్న ఆలోచిస్తున్నారు. ఆయన దగ్గర ఆరేడు కథలు ఉన్నాయి. అందులో ఇది చేద్దామని అనుకున్నప్పుడు... నేను ప్రొడ్యూస్ చేయాలనుకున్నా. చిరంజీవి గారి దగ్గర నుంచి ఇండస్ట్రీలో చాలా మంది దర్శక, నిర్మాతలు నాన్నగారిని హానీ అని పిలుస్తారు. 'డర్టీ హరి' తర్వాత నాన్నగారు వైల్డ్ గా అనిపించారు. అందుకని 'వైల్డ్ హనీ ప్రొడక్షన్స్' అని పేరు పెట్టా. -
ఇందులో నాది బోల్డ్ రోల్ కాదు: హీరోయిన్
‘‘7 డేస్ 6 నైట్స్’ ఒక ఫన్ ఫిల్మ్. టీనేజ్, యంగ్స్టర్ వైబ్స్ ఉన్న కథ. ఎంఎస్ రాజుగారి సినిమాలు చూశాను. ఆయన దర్శకత్వంలో సినిమా అనగానే ఎగ్జయిట్ అయ్యాను. కథ కూడా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాను’’ అని హీరోయిన్ మెహర్ చాహల్ అన్నారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, కృతికా శెట్టి, మెహర్ చాహల్ హీరోయిన్లుగా ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్, రజనీకాంత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహర్ చాహల్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నేను అస్సాంలో పుట్టాను. మా నాన్నగారు టీ ప్లాంటేషన్స్లో పని చేయడం వల్ల దేశంలో చాలా ప్రాంతాలు తిరిగాను. చదవండి: డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్లు ప్రస్తుతం నా తల్లిదండ్రులతో కలిసి కోల్కతాలో ఉంటున్నాను. అయితే సినిమాల కోసం ముంబైలో ఉన్నాను. ముంబైలో నన్ను చూసిన ఎంఎస్ రాజుగారు మా మేనేజర్తో మాట్లాడారు. హైదరాబాద్ వచ్చి ఆడిషన్ ఇచ్చాను.. సెలెక్ట్ చేశారు. ‘7 డేస్ 6 నైట్స్’లో నా పాత్ర పేరు రతికా. సుమంత్ అశ్విన్కి జోడీగా కనిపిస్తాను. ఇందులో నాది బోల్డ్ రోల్ కాదు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్. హిందీలో ‘హౌస్ఫుల్’ సిరీస్లో జోక్స్ ఎలా ఉంటాయో ఇందులోనూ అలా ఉంటాయి.. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఫుల్గా నవ్వుకోవచ్చు. యూత్తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు. -
మంగళం పాత్ర చేయడం ఛాలెంజింగ్గా అనిపించింది: రోహన్
‘‘7 డేస్ 6 నైట్స్’లో నా పాత్ర పేరు మంగళం. తర్వాత ఏమవుతుందో అని ఆలోచించకుండా జీవితంలో అనుకున్నది చేస్తాడు. స్నేహితుడు ఆనంద్ (సుమంత్ అశ్విన్)తో కలిసి మంగళం బ్యాచిలర్ ట్రిప్కి గోవా వెళతాడు. ఆ ట్రిప్లో ఏం జరిగింది? అనేది ‘7 డేస్ 6 నైట్స్’ కథ’’ అని రోహన్ అన్నారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, కృతికా శెట్టి, మెహర్ చాహల్ హీరోయిన్లుగా ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న రిలీజవుతోంది. (చదవండి: వాళ్లను విశ్లేషించడం మూర్ఖత్వం!) ఈ సందర్భంగా రోహన్ మాట్లాడుతూ– ‘‘నా షో రీల్ చూసిన సునీల్గారు ఎంఎస్ రాజుగారికి చూపించారట. రెండు ఆడిషన్స్ తర్వాత నన్ను ఫైనలైజ్ చేశారు రాజుగారు. తొలి సినిమాకే కామెడీ చేయడం కష్టం అనుకున్నాను. అయితే ఎంఎస్ రాజుగారు ఇచ్చిన కాన్ఫిడెన్స్తో చేశాను. మంగళం పాత్ర తెలంగాణ యాసలో మాట్లాడాలి.. అందుకోసం ఈ మధ్య వచ్చిన తెలంగాణ యాస చిత్రాలు చూశాను. నా నిజజీవితానికి ఆపోజిట్గా ఉండే మంగళం పాత్ర చేయడం ఛాలెంజింగ్గా అనిపించింది. హీరోగానే చేయాలనుకోవడం లేదు.. కథలో ఇంపార్టెన్స్ ఉంటే ముఖ్య పాత్రలు కూడా చేస్తాను’’ అన్నారు. -
7 డేస్ 6 నైట్స్ ట్రైలర్ వచ్చేసింది..
‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్, రోహన్, క్రితిక శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రొడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్ చిత్రనిర్మాణంలో భాగస్వాములైన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి కొత్త ట్రైలర్ని విడుదల చేశారు. దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ–‘‘యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’. ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరిస్తుంది. సుమంత్ అశ్విన్ తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి నటించాడు. మెహర్ చాహల్, రోహన్, క్రితికా శెట్టి తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు’’ అన్నారు. ‘‘ఆద్యంతం నవ్వించే, కవ్వించే సన్నివేశాలతో అందరికీ నచ్చే యూత్ సినిమా ఇది. హైదరాబాద్, బెంగళూరు, ఉడిపి, గోకర్ణ, గోవాలో చిత్రీకరించాం’’ అన్నారు సుమంత్ అశ్విన్. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, కో ప్రొడ్యూసర్స్: జె.శ్రీనివాసరాజు, మంతెన రాము. చదవండి: నా సినిమా ఫ్లాప్ అయినా కూడా రానా బాగుందనేవాడు పొట్టి బట్టలు వేసుకోవడం తప్పు అనడం లేదు.. సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు -
భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు
MS Raju Says Bhumika Serious On Fighter In Okkadu Shooting: ఒక్కడు, వర్షం, నువ్ వస్తానంటే నేనొద్దంటాన వంటి తదితర బ్లాక్బస్టర్ హిట్స్ ఇచ్చిన ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు. నిర్మాతగా ఎన్నో అవార్డులు అందుకున్న ఆయన 2008లో వచ్చిన 'వాన' సినిమాతో డైరెక్టర్గా మారారు. తర్వాత తూనిగ తూనిగ (2012), డర్టీ హరీ (2020) చిత్రాలతో దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన డైరెక్ట్ చేసిన చిత్రం '7 డేస్ 6 నైట్స్'. ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఎంఎస్ రాజు, ఆయన తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ ఒక టాక్ షోలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్లో అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన భూమిక గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఒక్కడు సినిమా షూటింగ్ సమయంలో ఫైటర్పై భూమిక సీరియస్ అయిందన్న విషయం గురించి హోస్ట్ అడిగాడు. అందుకు సమాధానంగా 'నేను, మహేశ్ బాబు, భూమిక పక్కపక్కన కూర్చున్నాం. ఒక్కసారిగా భూమిక పైకి లేచింది. ఏం తిట్టిందో తెలియదు. ఇంగ్లీషులో ఏదో తిట్టింది. అదేదో భయంకరంగా ఉంది.' అని ఎంఎస్ రాజు తెలిపారు. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం ఆ పాత్ర నాకు నచ్చలేదు.. కానీ ఒప్పుకున్నా: సత్యరాజ్ -
నవ్వించే.. కవ్వించేలా ‘7 డేస్ 6 నైట్స్’
‘డర్టీ హరి’ చిత్రం తర్వాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన మరో యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, మెహర్ చాహల్, క్రితికా శెట్టి హీరోయిన్లుగా నటించారు. సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఎంఎస్ రాజు మాట్లాడుతూ– ‘‘ఆకట్టుకునే కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, విజువల్స్, మ్యూజిక్తో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’అన్నారు. ‘‘అందరికీ నచ్చే యూత్ఫుల్ సినిమా ఇది’’ అన్నారు సుమంత్ అశ్విన్. ‘‘ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సహ నిర్మాతల్లో ఒకరైన జె. శ్రీనివాసరాజు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత, కో–డైరెక్టర్: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్: మంతెన రాము. -
కొత్త సినిమా ప్రకటించిన ఎమ్ఎస్ రాజు, ఫస్ట్లుక్ రిలీజ్
‘డర్టీ హరి’ తర్వాత ప్రముఖ నిర్మాత ఎమ్ఎస్ రాజు దర్శకత్వం వహించిన ‘7 డేస్ 6 నైట్స్’ చిత్రం రిలీజ్కు సిద్ధంగా ఉంది. మంగళవారం (మే 10)న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఎమ్ఎస్ రాజు దర్శకత్వంలో రానున్న ‘సతి’ ఫస్ట్ లుక్ రిలీజైంది. సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్ జంటగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు నరేశ్ కీలక పాత్రలో నటించనున్నాడు. రఘురామ్, టి. సారంగ సురేష్కుమార్, డా. రవి దాట్ల, సుమంత్ అశ్విన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘‘కొత్త దంపతుల మధ్య జరిగే అనుకోని సంఘటనల చుట్టూ అల్లిన కథ ఇది. ఉద్వేగభరిత సన్నివేశాలతో రూపొందిస్తున్న ‘సతి’ నా కెరీర్లో గర్వించదగ్గ చిత్రంగా నిలుస్తుంది’’ అన్నారు ఎమ్ఎస్ రాజు. ఈ సినిమాకు సహనిర్మాత: జె.వాస రాజు. Presenting you the First Look of our next #Sathi 💥 A @SumanthArtPro proud presentation 😇 Produced By @WildHoneyPro & @RamantraCreate @MSumanthAshwin #MeherChahal @DrRaviPRaju @EditorJunaid @PulagamOfficial pic.twitter.com/zQJMQz8HWO — MS Raju (@MSRajuOfficial) May 10, 2022 -
7 డేస్ 6 నైట్స్.. ఇది హారర్ మూవీ కాదు
‘డర్టీ హరి’ చిత్రం తర్వాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్–మెహర్ చాహల్, రోహన్–క్రితికా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘ఒక రోడ్ ట్రిప్కు వెళ్లిన ఇద్దరు యువకుల కథే ‘7 డేస్ 6 నైట్స్’. టైటిల్ చూసి హారర్ చిత్రం అనుకోవద్దు.. ఇదొక కూల్ ఎంటర్టైనర్. నాన్నగారు (ఎంఎస్ రాజు) అందంగా చిత్రీకరించారు’’ అన్నారు. ‘‘రాజుగారి నుంచి వచ్చే మరో క్లాసిక్ చిత్రమిది’’ అన్నారు చిత్ర సహనిర్మాత జె. శ్రీనివాసరాజు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, సహనిర్మాత: మంతెన రాము. -
ఆ ప్రశంసలతో మా కష్టాన్ని మర్చిపోయాం
‘‘చాలా రోజుల తర్వాత మంచి విజయం దక్కింది. సినిమా చూసినవారు బాగుందని అభినందిస్తున్నారు. దర్శకుడు గురు బాగా తీశారు’’ అన్నారు శ్రీకాంత్. సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రధారులుగా జి. మహేష్ నిర్మాణంలో గురు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇదే మా కథ’. ఈ నెల 2న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డాం. ప్రేక్షకుల ప్రశంసలు మా కష్టాన్ని మర్చిపోయేలా చేస్తున్నాయి’’ అన్నారు. ‘‘మౌత్ పబ్లిసిటీతో ముందుకు వెళ్తున్నందువల్లే మా సినిమా సక్సెస్మీట్ను ఎమోషనల్ హిట్ అంటున్నాం. ‘మార్నింగ్ సినిమా చూశాను... ఈవెనింగ్ మా ఫ్యామిలీని కూడా తీసుకుని వెళ్లి సినిమా చూపించాను’ అని ఒకరు ఫోన్ చేసి చెప్పారు’’ అన్నారు గురు. ‘‘ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని ఈ చిత్రాన్ని పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాం. సినిమా చూసినవారు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు’’ అన్నారు జి. మహేశ్. చదవండి: ‘ఇదే మా కథ’ మూవీ రివ్యూ -
Idhe Maa Katha Review: ‘ఇదే మా కథ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఇదే మా కథ నటీనటులు : శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమిక, తాన్యా హోప్ తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ నిర్మాత : జీ మహేష్ దర్శకత్వం : గురు పవన్ సంగీతం : సునీల్ కశ్యప్ సినిమాటోగ్రఫీ : రాంప్రసాద్ ఎడిటింగ్: జునైద్ సిద్దిఖీ విడుదల తేది : అక్టోబర్ 2,2021 సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ముఖ్య పాత్రల్లో గురు పవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇదే మా కథ’. జి. మహేష్ నిర్మించిన ఈ సినిమా శనివారం (అక్టొబర్ 2)న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ చిత్రం ఎలా ఎందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? మహేంద్ర(శ్రీకాంత్) క్యాన్సర్ బారిన పడిన ఓ బైక్ రైడర్. తన చివరి లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం బైక్పై లడఖ్కి బయలుదేరుతాడు. లక్ష్మీ (భూమిక) సాధారణ గృహిణి. భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నా ఆమె.. తన తండ్రి చివరి కోరికను తీర్చడం కోసం భర్తను ఎదురించి లడఖ్కి బయలుదేరుతుంది. మరోవైపు యూట్యూబర్ కమ్ బైక్ రైడర్ అజయ్(సుమంత్ అశ్విన్) ఛాంపియన్ షిప్ సాధించాలని లడఖ్ బయలు దేరుతాడు. ప్రేమ పేరుతో మోసానికి గురైన మేఘన (తాన్యా హోప్) బైక్ రైడింగ్కి వెళ్తుంది. వీరంతా అనుకోకుండా మార్గమధ్యలో కలుసుకుంటారు. చావు, బతుకులతో పోరాడుతున్న మహేంద్ర.. బైక్పైనే లడఖ్కి ఎందుకు వెళ్తాడు? అనుకోకుండా కలిసే ఈ నలుగురు బైక్ రైడర్స్ వారి కష్టాలను ఎలా పంచుకున్నారు? ఎలా పరిష్కరించుకున్నారు? అన్నదే ‘ఇదే మా కథ’ స్టోరీ. ఎవరెలా చేశారంటే.. భగ్న ప్రేమికుడు మహేంద్ర పాత్రలో శ్రీకాంత్ అద్భుతంగా నటించాడు. సినిమా భారాన్ని మొత్తం తన భూజాన వేసుకొని నడిపించాడు. సాధారణ గృహిణి లక్ష్మీ పాత్రలో భూమిక ఒదిగిపోయింది. కుటుంభ బాధ్యతలు మోస్తూనే.. తండ్రి ఆశయం కోసం మోటార్ రంగంలో కొత్త ఆవిష్కరణలు సాధించే మహిళగా భూమిక తనదైన నటనతో మెప్పించింది. ఇక బైక్ రైడర్ అజయ్గా సుమంత్ అశ్విన్ అదరగొట్టేశాడు. చాలా హూషారైన పాత్ర తనది. కొత్తలుక్తో చాలా కాన్ఫిడెన్స్గా నటించాడు. ఇక మేఘనగా తాన్యా హూప్ పర్వాలేదనిపించింది. తెరపై చాలా అందంగా కనిపించింది. సప్తగిరి, పృథ్వీ, జబర్దస్త్ రాంప్రసాద్ తమదైన కామెడీతో నవ్వించారు. శ్రీకాంత్ అయ్యంగార్,సుబ్బరాజు తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? నలుగురు బైక్ రైడర్స్ జీవితాలకు సంబంధించిన ఎమోషనల్ కథే ‘ఇదే మా కథ’మూవీ. నలుగురు వ్యక్తుల జీవితంతో చోటు చేసుకున్న సమస్యలు, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఎలా తమ లక్ష్యాలను నెరవేర్చుకున్నారనే నేపథ్యంలో కథ నడుస్తుంది. కంప్లీట్ రోడ్ జర్నీగా సాగే ఈ కథకి ఎమోషనల్ టచ్ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు దర్శకుడు గురు పవన్. రొటీన్ కథే అయినప్పటికీ.. కథనాన్ని ఇంట్రెస్టింగ్ నడిపించాడు. అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం స్లోగా సాగుతూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి. ఫస్టాఫ్లో పాత్రలను పరిచయం చెయ్యడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. నలుగురు కలిశాక కానీ సినిమాపై ఆసక్తి పెరగదు. మధ్యలో వచ్చే సప్తగిరి, రాంప్రసాద్, పృథ్వీ ల కామెడీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సప్తగరి పంచ్లు.. నవ్వులు పూయిస్తుంది. ఎమోషనల్ కంటెంట్ని ఇంకా ఎలివేట్ చేసి ఉంటే ఈ మూవీ మరోస్థాయికి వెళ్లేది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు సందర్భోచితంగా వస్తాయి. సి. రామ్ప్రసాద్ సినిమాటోగ్రఫి సినిమాకు హైలెట్. బైక్ విన్యాసాలతో పాటు సానా సన్నివేశాలను బ్యూటిఫుల్గా చిత్రీకరించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
చెన్నై నుంచి హైదరాబాద్కు బైక్పై వచ్చేవాణ్ణి
‘జీవితం అంటే ఏంటి? మన లక్ష్యాలను చేరుకునేందుకు ఎంతలా కష్టపడాలి? అనేది ‘ఇదే మా కథ’ చిత్రంలోని సందేశం’’ అని శ్రీకాంత్ అన్నారు. సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ముఖ్య పాత్రల్లో గురు పవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇదే మా కథ’. జి. మహేష్ నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘అనుకోకుండా కలిసే నలుగురు బైక్ రైడర్స్ వారి కష్టాలను ఎలా పంచుకున్నారు? ఎలా పరిష్కరించుకున్నారు? అన్నది ‘ఇదే మా కథ’లో ఆసక్తిగా ఉంటుంది. ఇందులో మహేంద్ర పాత్ర చేశాను. 24 ఏళ్ల క్రితం మిస్ అయిన అమ్మాయిని కలుసుకునేందుకు లడఖ్కి వెళ్లే పాత్ర నాది. బైక్లోనే ఎందుకు వెళ్తాడు? అనేదానికి కూడా ఓ కథ ఉంటుంది. కులుమనాలి నుంచి లడఖ్ వరకు బైక్ మీద షూటింగ్ చేశాం. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బైక్ మీదే తిరిగేవాణ్ణి. చెన్నై నుంచి హైదరాబాద్కు కూడా బైక్ మీదే వచ్చేవాణ్ణి. మామూలుగా బైకర్స్ అంతా ఢిల్లీలో కలుస్తుంటారు. ఈ గ్రూపుల్లో కలిసినవాళ్లు జీవితాంతం ఫ్రెండ్స్గా ఉంటుంటారు. వారి జీవిత కష్టాలను కూడా ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు. ‘‘సాయితేజ్ క్షేమంగా ఉన్నారు. ఈ రోజు (గురువారం) కూడా తనతో మాట్లాడాను. తను నటించిన ‘రిపబ్లిక్’ పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు శ్రీకాంత్. -
నిర్మాతల కష్టం బాగా తెలిసింది
‘‘యాక్టర్గా నా జర్నీ పట్ల సంతృప్తిగానే ఉన్నాను. ప్రతి సినిమా ఓ కొత్త అనుభూతే. ఈ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్నాను. ప్రొడ్యూసర్ అంటే అంతా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. నిర్మాతల కష్టం ఏంటో ఇప్పుడు నాకు ఇంకా బాగా తెలుస్తోంది’’ అన్నారు సుమంత్ అశ్విన్. గురు దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. మనోరమ సమర్పణలో మహేశ్ గొల్లా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర హీరో సుమంత్ అశ్విన్ చెప్పిన విశేషాలు. ► ఈ సినిమాలో ఒక్కొక్కరికీ ఒక్కో గోల్ ఉంటుంది. శ్రీకాంత్గారికి లడక్లో ఓ స్టోరీ ఉంటుంది. పాత్ర ప్రకారం ఆయన కోరుకుంటే ప్రైవేట్ జెట్ ఫ్లయిట్లో వెళ్లొచ్చు. కానీ బైక్ రైడ్ అంటే ఇష్టంతో బైక్లో స్టార్ట్ అవుతారు. తండ్రి ఆశయాన్ని పూర్తి చేయడం కోసం భూమికగారు, మా గోల్స్ను ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం నేను, తాన్య రోడ్ జర్నీని బైక్పై మొదలుపెడతాం. మేమంతా ఎక్కడ కలుసుకున్నాం? మా జర్నీ ఏమైంది? గోల్స్ రీచ్ అయ్యామా లేదా? అనేది కథ. ► తెలుగులో రోడ్ ఫిలిమ్స్ చాలా తక్కువ. క్లైమాక్స్లో మంచుపై రైడ్ సీన్స్ ఉంటాయి. రోడ్డుపై అంటే ఓకే.. కానీ మంచుపై కష్టం. అందుకే బాగా ప్రాక్టీస్ చేశాం. భూమికగారు ధైర్యవంతురాలు. డూప్స్ను పెట్టుకునే వీలు ఉన్నప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. ► తాన్యాతో నా లవ్ట్రాక్ న్యాచురల్గా ఉంటుంది. డైరెక్టర్ గురు ఈ సినిమా కోసం బైక్స్పై చాలా పరిశోధన చేశారు. ఏ బైక్కు ఎంత సీసీ ఉంటుంది? బైక్ గేర్లు ఇలాంటివాటిపై ఆయనకు అవగాహన ఉంది. ► ఒకే రకమైన సినిమాలు తీయడం నాన్నగారి (నిర్మాత, దర్శకుడు ఎమ్ఎస్ రాజు)కి నచ్చదు. సినిమాకు చెందిన అన్ని కోణాలను టచ్ చేయాలనుకుంటారు. ఆయన డైరెక్షన్లో నేను హీరోగా నటించిన ‘7 డేస్ 6 నైట్స్’ షూటింగ్ పూర్తయింది. -
'ఇదే మా కథ' కాన్సెప్ట్ టీజర్ రిలీజ్ చేసిన వెంకటేశ్
సుమంత్ అశ్విన్, తాన్యా హోప్ జంటగా నటించిన చిత్రం 'ఇదే మా కథ' రోడ్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి గురు పవన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ను హీరో విక్టరీ వెంకటేశ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మూవీ టీంకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాంత్, భూమికా చావ్లా ముఖ్య పాత్రలు పోషించారు. మతి మనోరమ సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ గొల్లా నిర్మించిన ఈ సినిమాను నిర్మించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్స్లో విడుదల కానుంది. చదవండి: నేను ఇన్స్టాల్మెంట్స్లో ప్రేమించను: నటి -
‘‘7 డేస్ 6 నైట్స్’ షూటింగ్ పూర్తి..ఎం.ఎస్ రాజు ఎమోషనల్
‘‘7 డేస్ 6 నైట్స్’ చిత్రంతో మా అబ్బాయి సుమంత్ అశ్విన్ని నిర్మాతగా పరిచయం చేయడం హ్యాపీగా ఉంది. ఆకట్టుకునే సీన్స్, అద్భుతమైన విజువల్స్తో హృదయాన్ని హత్తుకునేలా ఈ కథ ఉంటుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన మా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్కి ఈ చిత్రంతో పూర్వ వైభవం వస్తుంది’’ అన్నారు ఎంఎస్ రాజు. సుమంత్ అశ్విన్, మెహర్ చావల్, రోహన్, క్రితికా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్ప ణలో ఎంఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ‘‘నిర్మాణం– దర్శకత్వం ఏదయినా నాన్నగారు ఎంతో పట్టుదలతో, ఇష్టంతో చేస్తారు’’ అన్నారు సుమంత్ అశ్విన్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత, కో–డైరెక్టర్: యూవీ సుష్మ, సహనిర్మాతలు: జె. శ్రీనివాసరాజు, మంతెన రాము. చదవండి : ఆ స్టార్ హీరో సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న రకుల్! అఫీషియల్ ప్రోమో: అమెజాన్లో 'టక్ జగదీష్' -
7 డేస్ 6 నైట్స్: గోవాలో 100 మంది.. 4 కెమెరాలు..
‘డర్టీ హరి’ తర్వాత ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్, రోహన్, క్రితికి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎం. సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్ నిర్మిస్తున్నారు. గోవా షెడ్యూల్ ముగించుకున్న చిత్రబృందం హైదరాబాద్ వచ్చేసింది. ఈ సందర్భంగా ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ.. ‘విభిన్నమైన కథనం, సన్నివేశాలతో ‘7 డేస్ 6 నైట్స్’ కథ ఆసక్తికరంగా ఉంటుంది. సుమంత్ తన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ చిత్రం ద్వారా 16 మంది కొత్తవారిని పరిచయం చేస్తున్నాం. గోవాలో ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించాం. గోవాలో భారీ వర్షాలు కురుస్తున్నా, కరోనా నియమాలు కఠినంగా అమలవుతున్నప్పటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ...100 మంది బృందంతో, 4 కెమెరాలతో తెరకెక్కించాం. తర్వాతి షెడ్యూల్ను మంగళూరు, ఉడుపిలో ప్లాన్ చేశాం’ అన్నారు. అలాగే సహా నిర్మాత జె శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. చిత్రీకరణ చివరి దశలో ఉండగానే మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. -
‘7 డేస్ 6 నైట్స్’ ఫస్ట్ లుక్ విడుదల
'డర్టీహరి'తో డైరెక్టర్గా మారిన ఎమ్మెస్ రాజు తెరకెక్కిస్తున్న మరో చిత్రం '7 డేస్ 6 నైట్స్'. సుమంత్ అశ్విన్, ఎం. రజనీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. అశ్విన్ సరసన మెహర్ చావల్ అనే కొత్త అమ్మాయి హీరోయిన్గా పరిచయం కానుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ తర్వాతి షెడ్యూల్ ఈ నెల 28 నుంచి ఉంటుందని డైరెక్టర్ ఎమ్మెస్ రాజు తెలిపారు. ఇక రోహన్, కృతికా శెట్టి సైతం ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సమర్థ్ గొల్లపూడి సంగీతం అందిస్తున్నారు. Here's the first look of a refreshing tale of love n life #7Days6Nights Stay tuned for an @MSRajuOfficial directorial @SumanthArtPro @MSumanthAshwin @RajnikantSOffl @SamarthGollapu5 @EditorJunaid @WildHoneyPro #WintagePictures @AbgCreations @PulagamOfficial pic.twitter.com/C4Z1RRMbeu — BARaju's Team (@baraju_SuperHit) July 22, 2021 -
7 డేస్ 6 నైట్స్... షూటింగ్ మొదలైంది
'డర్టీ హరి' చిత్రం తర్వాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం '7 డేస్ 6 నైట్స్'. సుమంత్ అశ్విన్, ఎం. రజనీకాంత్ ఎస్. నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్, హైదరాబాద్లో ప్రారంభమైంది. ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. 'ఇదొక కూల్ అండ్ న్యూ ఏజ్ ఎంటర్టైన్మెంట్ సర్. వినోదానికి మంచి అవకాశం ఉంది. నటీనటుల వివరాల్ని గోప్యంగా ఉంచాం' అన్నారు. 'జూలై 10 వరకు హైదరాబాద్లో చిత్రీకరిస్తాం. ఆ తర్వాత 15 నుంచి గోవా, మంగుళూరు, ఉడిపి, అండమాన్- నికోబార్ దీవుల్లో చిత్రీకరిస్తాం. సెప్టెంబర్లో చిత్రాన్ని విడుదల చేస్తాం' అన్నారు సుమంత్ అశ్విన్. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, లైన్ ప్రొడ్యూసర్: జె.శ్రీనివాసరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్: ఎం.రాము. చదవండి: '7 డేస్ 6 నైట్స్'.. డర్టీ హరీని మించి ఉంటుంది -
'7 డేస్ 6 నైట్స్'.. డర్టీ హరీని మించి ఉంటుంది
‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎంఎస్ రాజు దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న ఎంఎస్ రాజు పుట్టినరోజు నేడు (మే 10). ఈ సందర్భంగా దర్శకుడిగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ‘7 డేస్ 6 నైట్స్’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. వింటేజ్ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్ నిర్మాతలు. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘జూన్ 7న ‘7 డేస్ 6 నైట్స్’ చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నాం. హైదరాబాద్, గోవా, మంగుళూరు, అండమాన్ నికోబార్ దీవుల్లో షూటింగ్ చేయనున్నాం. ప్రస్తుతానికి నటీనటుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం’’ అన్నారు. ఎంఎస్ రాజు మాట్లాడుతూ– ‘‘న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. ‘డర్టీ హరి’ని మించి ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, లైన్ ప్రొడ్యూసర్: జె. శ్రీనివాసరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్: మంతెన రాము. -
నిర్మాతగా మారిన యంగ్ హీరో.. తండ్రితో తొలి సినిమా!
ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు కుమారుడు, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ కొత్త జర్నీని మొదలుపెట్టబోతున్నాడు. ఇటీవల పెళ్లి చేసుకున్న ఆయన నటనకి కాస్త విరామం ఇచ్చి నిర్మాతగా రాణించాలనుకుంటున్నాడు. వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలు నిర్మించబోతున్నాడు. తన తొలి సినిమాకి తండ్రి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించబోతున్నారట. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి 7 డేస్… 6 నైట్స్ టైటిల్ ఫిక్స్ చేశారట. కాగా, నిర్మాత ఎంఎస్ రాజు ఇటీవల 'డర్టీ హరి' సినిమాతో దర్శకుడిగా మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అందించిన సక్సెస్ జోష్తోనే కొడుకు నిర్మాణ సంస్థలో కొత్త చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. తర్వలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికానున్నట్లు సమాచారం. ఇక సుమంత్ విషయానికి వస్తే.. తూనీగ తూనీగ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కేరింత, కొలంబస్, ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్, హ్యాపీ వెడ్డింగ్, ప్రేమకథ చిత్రం 2 చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు. -
సుమంత్ పెళ్లి: ప్రభాస్ సర్ప్రైజ్ గిఫ్ట్
'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'' వంటి హిట్ చిత్రాల నిర్మాత ఎమ్ఎస్ రాజు ఏకైక కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13న అత్యంత దగ్గరి బంధువుల సమక్షంలో దీపిక మెడలో మూడు ముళ్లు వేసి ఆమెను ఇల్లాలిని చేసుకున్నాడు. కరోనా నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరు కాలేకపోయారు. అయితే నెట్టింట మాత్రం విషెస్ తెలిపారు. ఈ క్రమంలో తాజాగా బాహుబలి ప్రభాస్.. సుమంత్కు పెళ్లి శుభాకాంక్షలు చెప్తూ ప్రత్యేక బహుమతి పంపాడు. ఇందులో ఓ పుష్పగుచ్ఛంతో పాటు పట్టు వస్త్రాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. "కొత్త జీవితాన్ని ఆరంభించిన నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభాస్ బొకేతో పాటు కానుకలు పంపాడు" అని చెప్తూ ఎమ్ఎస్ రాజు ఈ గిఫ్ట్ ఫొటోలను ట్విటర్లో షేర్ చేశాడు. #Prabhas sends gifts to #SumanthAshwin, wishing on his marriage with Deepika. Thank You for ur wishes Darling ❤️ pic.twitter.com/PVx14g9YGb — MS Raju (@MSRajuOfficial) February 17, 2021 కాగా నిర్మాతగా ఎమ్ఎస్ రాజు వర్షం సినిమాతో ప్రభాస్కు బ్లాక్బస్టర్ హిట్నిచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత పౌర్ణమి సినిమాను కూడా ఎమ్ఎస్ రాజే నిర్మించాడు. ఈ రెండు సినిమాలు ప్రభాస్ సినీ కెరీర్లోనే ప్రత్యేకమైనవి కావడం విశేషం. చదవండి: -
ఎమ్ఎస్ రాజు కుమారుడు హీరో సుమంత్ అశ్విన్ పెళ్లి ఫోటోలు
-
ఇంటివాడైన యంగ్ హీరో సుమంత్.. ఫోటోలు వైరల్
ప్రముఖ నిర్మాత ఎమ్ఎస్ రాజు కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాద్ కు చెందిన దీపికతో అతని వివాహం నగర శివార్లలోని ఫామ్ హౌస్ లో ఇరు వర్గాల కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కరోనా నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువులు మాత్రమే ఈ వివాహ వేడుకకి హాజరయ్యారు. 'తూనీగ తూనీగ' సినిమాతో హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. ఆతర్వాత ‘కేరింత’, ‘లవర్స్’, ‘ప్రేమకథా చిత్రం-2’ సినిమాల్లో నటించాడు. తాజాగా సుమంత్ నటించిన ‘మా కథ’ మూవీ కూడా మార్చి 19న విడుదలకు సిద్దంగా ఉంది -
హీరో సుమంత్ అశ్విన్ హల్దీ ఫంక్షన్.. ఫొటోలు వైరల్
ప్రముఖ నిర్మాత ఎమ్ఎస్ రాజు ఎకైక కూమారుడు, యువ హీరో సుమంత్ అశ్విన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్కు చెందిన దీపిక అనే అమ్మాయి మెడలో శనివారం(ఫిబ్రవరి 13)సుమంత్ మూడుముళ్లు వేయనున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం ఈ కొత్త జంట హల్దీ ఫంక్షన్ వేడుకను జరుపుకుంది. ఈ ఫంక్షన్లో సుమంత్ ‘కేరింత’ మూవీ సహా నటుడు విశ్వంత్, మరికొందరు నటీనటులు సందడి చేశారు. (చదవండి: దీపికతో సుమంత్ అశ్విన్ వివాహం) ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా కరోనా నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్ పట్టణ శివారులోని వారి ఫాంహౌజ్లో సుమంత్-దీపికల వివాహ మహోత్సవం జరగనుంది. ‘తూనిగ తూనిగ’ మూవీతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుమంత్ ఆ తర్వాత ‘కేరింత’, ‘లవర్స్’, ‘ప్రేమకథా చిత్రం-2’ లలో హీరోగా నటించాడు. తాజాగా సుమంత్ నటించిన ‘మా కథ’ మూవీ కూడా మార్చి 19న విడుదలకు సిద్దంగా ఉంది. (చదవండి: ‘నలుగురు అపరిచితులు.. గమ్యం ఒకటే’) -
హీరో సుమంత్ అశ్విన్ మెహందీ ఫంక్షన్ ఫోటోలు
-
హీరో సుమంత్ అశ్విన్ పెళ్లి డేట్ ఫిక్స్
వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా?, ఒక్కడు వంటి బ్లాక్బస్టర్ చిత్రాల నిర్మాత ఎమ్ఎస్ రాజు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన ఏకైక కుమారుడు, హీరో సుమంత్ అశ్విన్ పెళ్లికి రెడీ అయ్యాడు. హైదరాబాద్కు చెందిన దీపిక అనే అమ్మాయి చిటికన వేలు పట్టుకుని ఏడడుగులు నడవనున్నాడు. ఫిబ్రవరి 13న వేదమంత్రాల సాక్షిగా ఈ వివాహం జరగనుంది. కరోనా నిబంధనలను దృష్టిలో పెట్టుకుని కేవలం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్యే ఈ పెళ్లి వేడుక జరగనున్నట్లు ఎమ్ఎస్ రాజు తెలిపాడు. (చదవండి: నమ్రత పోస్టుపై హర్ట్ అయిన నిర్మాత ఎమ్ఎస్ రాజు) సుమంత్ కెరీర్ విషయానికొస్తే.. తండ్రి ఎమ్ఎస్ రాజు డైరెక్షన్లో 'తూనీగ తూనీగ' సినిమా ద్వారా వెండితెరపై అడుగు పెట్టాడు. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోలేక బొక్కబోర్లాపడింది. తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో చేసిన 'అంతకు ముందు ఆ తరువాత' హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక మూడో చిత్రం 'లవర్స్' మాత్రం అతడికి కమర్షియల్ బ్రేకిచ్చి హీరోగా నిలబెట్టింది. కేరింతతో బిగ్ సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం ఇతడు శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్తో కలిసి 'ఇదే మా కథ'(రైడర్స్ స్టోరీ)లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు గురుపవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఎమ్ఎస్ రాజు విషయానికొస్తే.. ఆయన సక్సెస్ఫుల్ నిర్మాతగానే కాదు, మంచి దర్శకుడిగానూ పేరు తెచ్చుకున్నాడు. తూనీన తూనీగ, వాన సినిమాలకు డైరెక్షన్ చేసిన ఆయన ఈ మధ్య డర్టీ హరి సినిమాకు దర్శకత్వం వహించాడు. (చదవండి: పుష్ప రిలీజ్ డేట్పై సుకుమార్ అసంతృప్తి!) We're immensely Happy to announce the wedding of our son Chi. #Sumanth with Chi. #Deepika on Feb 13th 2021. Given the unusual times, the wedding is going to be a very private affair. Although we deeply miss ur presence, we shall rejoice your love & blessings to the newly weds ❤️ pic.twitter.com/mU3lPZibs3 — MS Raju (@MSRajuOfficial) February 3, 2021 -
త్వరలో ప్రముఖ టాలీవుడ్ హీరో పెళ్లి!
ప్రముఖ నిర్మాత, డర్టీ హరి దర్శకుడు ఎమ్ఎస్ రాజు ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. ఆయన తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ తొందర్లోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం. దీపిక అనే అమ్మాయితో ఆయన వివాహం జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కాలం కాబట్టి తక్కువ మంది సమక్షంలోనే అదీ హైదరాబాద్లోనే ఈ పెళ్లి తంతును కానిచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. నెట్టింట వైరల్గా మారిన ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే హీరో సుమంత్ అధికారికంగా ప్రకటించేవరకు వేచిచూడాల్సిందే! (చదవండి: మూగజీవాన్ని రక్షించిన హీరో, రేణూ ప్రశంస) ఇక సుమంత్ కెరీర్ విషయానికి వస్తే.. తండ్రి ఎమ్ఎస్ రాజు డైరెక్షన్లో 'తూనీగ తూనీగ' సినిమా ద్వారా వెండితెరపై అడుగు పెట్టాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో చేసిన 'అంతకు ముందు ఆ తరువాత' హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో కొంత బూస్ట్ వచ్చినట్లైంది. ఇక మూడో చిత్రం 'లవర్స్' మాత్రం అతడికి కమర్షియల్ బ్రేకిచ్చి హీరోగా నిలబెట్టింది. ప్రస్తుతం ఇతడు శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్తో కలిసి 'ఇదే మా కథ'(రైడర్స్ స్టోరీ)లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు గురుపవన్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: నమ్రత పోస్టుపై హర్ట్ అయిన నిర్మాత ఎమ్ఎస్ రాజు) -
అందరి కథ
రోడ్డు ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇదే మా కథ’. (రైడర్స్ స్టోరి అనేది ఉపశీర్షిక). సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గురుపవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్. సుబ్రహ్మణ్యం ఆశీస్సులతో మనోరమ గురప్ప సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై జి.మహేష్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ‘ఇదే మా కథ’ ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. గురుపవన్ మాట్లాడుతూ– ‘‘నేను రైడర్ని. అందుకే ఆ నేపథ్యంలో కథ రాశా. డిసెంబర్లో షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘ఇది మనందరి కథ. చాలా ఎమోషన్స్తో ట్రావెల్ అయ్యే స్క్రిప్ట్’’ అన్నారు జి.మహేష్. శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు చాలాసార్లు రైడింగ్కి వెళ్లాను. ఒకసారి హైదరాబాద్ నుండి లడక్కి కారులో వెళ్లాను. ఇప్పుడు ఈ టీమ్తో లడక్ వెళ్లడం ఒక మంచి అనుభూతి’’ అన్నారు. ‘‘బైక్ రైడింగ్ అంటే ఇష్టం కానీ నేను ప్రొఫెషనల్ రైడర్ని కాదు. గురుపవన్ నాకు శిక్షణ ఇచ్చారు’’ అన్నారు సుమంత్ అశ్విన్. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిరంజీవి ఎల్. -
రోడ్డు ప్రయాణం
‘‘చాలా రోజుల తర్వాత సినిమా సెట్స్పైకి వచ్చాను. త్వరలో మీ అందర్నీ తెరపై కలుసుకుంటాం’’ అని భూమిక అన్నారు. సుమంత్ అశ్వి¯Œ , శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రూపొందుతోంది. గురుపవన్ దర్శకత్వంలో జి. మహేష్ నిర్మిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత గురువారం పునఃప్రారంభమైన షూటింగ్లో భూమిక జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘నాలుగు పాత్రల చుట్టూ నడిచే రోడ్ జర్నీ కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. లాక్డౌన్కు ముందుగానే లడఖ్ షెడ్యూల్తో సహా 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘భూమిక, శ్రీకాంత్ లాంటి సీనియర్ యాక్టర్లతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా’’ అన్నారు సుమంత్ అశ్విన్. ‘‘ఏడు నెలల తర్వాత మళ్లీ షూటింగ్కు రావడం హ్యాపీ’’ అన్నారు శ్రీకాంత్. ఈ చిత్రానికి కెమెరా: సి. రామ్ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిరంజీవి ఎల్, సంగీతం: సునీల్ కశ్యప్. -
వేసవికి రెడీ
సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా, సలోని మిశ్రా కథానాయికగా తెరకెక్కుతోన్న చిత్రం ‘18+ సినిమా’. ‘దండుపాళ్యం 1, 2, 3’ చిత్రాల తర్వాత శ్రీనివాస రాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. జ్యోస్టార్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై ఎం.కోటేశ్వరరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాసరాజు, ఎం.కోటేశ్వరరాజు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాకి సంబంధించిన చివరి షెడ్యూల్ తమిళనాడులోని తిరువల్లూరులో వేసిన సెట్లో ఈ నెల 11 నుంచి 20 వరకు జరగనుంది. ఈ షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తవుతుంది. వేసవిలో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. మకరంద్ దేశ్పాండే, సప్తగిరి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. -
అపరిచితుల ప్రయాణం
నలుగురు అపరిచితులు.. 3,450 కిలోమీటర్లు రోడ్డుపై ప్రయాణం.. వాళ్ల ప్రయాణం దేనికోసం? ఆ సమయంలో వాళ్లు ఎదుర్కొన్న అనుభవాలేంటి? అనే కథాంశంతో ఓ సినిమా మొదలైంది. సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, ఇంద్రజ, ప్రియ వడ్లమాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకులు రామ్గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, నగేష్ కుకునూర్ వద్ద పని చేసిన గురుపవన్ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. గురప్ప పరమేశ్వర ప్రొడక్ష¯Œ ్స పతాకంపై జి. మహేష్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కెమెరామేన్ సి. రాంప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎన్.బి. బాలసుబ్రహ్మణ్యం క్లాప్ ఇచ్చారు. గురుపవన్ మాట్లాడుతూ –‘‘భిన్న నేపథ్యాలు కలిగిన నలుగురు అపరిచితులు హైదరాబాద్ నుంచి బైకులపై చేసే ప్రయాణమే ఈ సినిమా. మార్చి 2న తొలి షెడ్యూల్ మొదలుపెడతాం’’ అన్నారు. ‘‘శ్రీకాంత్, ఇంద్రజ వంటి మంచి నటులతో పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు సుమంత్ అశ్విన్. ‘‘శ్రీకాంత్, నేను ‘జంతర్ మంతర్’ సినిమాతో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యాం. ఇన్నాళ్లకు ఆయనతో మళ్లీ సినిమా చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఇంద్రజ. ‘‘గురు పవన్ చెప్పిన కథ నచ్చడంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నా’’ అన్నారు మహేష్. ప్రియ వడ్లమాని, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చిరంజీవి ఎల్. మాట్లాడారు. అమ్ము అభిరామి, నాజర్, పృథ్వీ, ఈశ్వరీ రావు, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటించనున్నారు. -
‘నలుగురు అపరిచితులు.. గమ్యం ఒకటే’
సినిమా సినిమాకు డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు సుమంత్ అశ్విన్. ఫలితాలతో సంబంధం లేకుండా హార్రర్, కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్ వంటి డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేస్తూ నటుడిగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హ్యాపీ వెడ్డింగ్, ప్రేమకథా చిత్రం-2 తర్వాత ఈ హీరో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం గురు పవన్ అనే దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. సుమంత్ అశ్విన్ సరసన ప్రియా వడ్లమాని కథానాయికగా నటిస్తున్న ఈచిత్రంలో శ్రీకాంత్, ఇంద్రజ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై జి.మహేశ్ నిర్మిస్తున్నారు . తాజాగా ఈ చిత్ర షూటింగ్ స్థానిక రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. త్వరలోనే చిత్ర రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం సుమంత్ అశ్విన్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నలుగురు అపరిచితులు.. 3450 కిలోమీటర్ల ప్రయాణం.. గమ్యం ఒకటే.. చివరికి ఏమైంది.. ఎందుకు ప్రయాణించారు’.. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నాడు. చదవండి: 50 శాతం పూర్తి.. వీసా కోసం వెయిటింగ్ 'ముద్దు సన్నివేశం నాకు తెలియకుండానే తీశారు' -
‘ప్రేమ కథా చిత్రమ్ 2’ మూవీ రివ్యూ
టైటిల్ : ప్రేమ కథా చిత్రమ్ 2 జానర్ : హారర్ కామెడీ తారాగణం : సుమంత్ అశ్విన్, సిద్ధీ ఇద్నానీ, నందితా శ్వేత సంగీతం : జేబీ దర్శకత్వం : హరి కిషన్ నిర్మాత : ఆర్ సుదర్శన్ రెడ్డి సుధీర్ బాబు, నందిత జంటగా తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ కామెడీ ప్రేమ కథాచిత్రం. తాజాగా ఆ సినిమాకు సీక్వల్ను తెరకెక్కించారు చిత్రయూనిట్. హరి కిషన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో సుమంత్ అశ్విన్, నందితా శ్వేత, సిద్ధి ఇద్నాని లు హీరో హీరోయిన్లుగా నటించారు. గతంలో కామెడీ హారర్ లు టాలీవుడ్ సక్సెస్ ఫార్ములాగా పేరుతెచ్చుకున్న ఇటీవల కాలంలో ఈ జానర్లో వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. మరి ప్రేమ కథా చిత్రమ్ 2 మరోసారి సక్సెస్ ఫార్ములాగా ప్రూవ్ చేసుకుందా..? ఈ సినిమా అయినా సుమంత్ అశ్విన్కు సక్సెస్ అందించిందా.? కథ : డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న సుధీర్ (సుమంత్ అశ్విన్)ను కాలేజ్లో పరిచయం అయిన బిందు (సిద్ధి ఇద్నాని) ఇష్టపడుతుంది. కానీ సుధీర్ ఆమె ప్రేమను రిజెక్ట్ చేయటంతో బిందు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ఆమెను కాపాడిన సుధీర్, తాను మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాని నచ్చజెప్పి వెళ్లిపోతాడు. తరువాత అనుకోని పరిస్థితుల్లో సుధీర్ ఓ ఫాం హౌజ్కు వెళ్లాల్సి వస్తుంది. ఫాం హౌస్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి సుధీర్కు విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఓ అమ్మాయి(నందితా శ్వేత) రాత్రి మాత్రమే కనిపిస్తూ సుధీర్ని అతని ఫ్రెండ్ బబ్లూని బయపెడుతుంటుంది. ఇంతకీ సుధీర్ ఆ ఫాం హౌజ్కి ఎందుకు వెళ్లాడు? సుధీర్ను భయపెడుతున్న ఆ అమ్మాయి ఎవరు? బిందు ఏమైంది.? చివరకు సుధీర్ తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్నాడా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : లవర్ బాయ్ ఇమేజ్తో మెప్పించిన సుమంత్ అశ్విన్ హారర్ కామెడీతో ఆకట్టుకోలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ కాలేజ్ సీన్స్లో పరవాలేదనిపించినా క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాల్లో సుమంత్ ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. సిద్ధి ఇద్నాని తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో పరవాలేనిపిస్తుంది. కీలక పాత్రలో నటించిన నందిత శ్వేత నిరాశపరిచింది. చాలా సన్నివేశాల్లో ఆమె నటన అతిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ పాత్రల్లో కనిపించిన కృష్ణతేజ(బబ్లూ), విధ్యుల్లేఖ రామన్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. విశ్లేషణ : ప్రేమ కథా చిత్రమ్ సినిమాకు కొనసాగింపుగా కథను తయారు చేసుకున్న దర్శకుడు, ఆ కథను తెర మీదకు తీసుకురావటంలో తడబడ్డాడు. తన కథనంతో ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఏ జరుగుతుంది.. ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుంది అని ప్రేక్షకుడు అర్థం చేసుకోవడానికే సరిపోతుంది. ద్వితీయార్థంలో కథనం రోలర్కోస్టర్లా సాగుతూ ప్రేక్షకుడి సహనాన్ని మరింత పరీక్షిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆడియన్స్ను భయపెట్టేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నాలన్నీ నవ్వుతెప్పిస్తాయి. సంగీత దర్శకుడు జేబీ తన సంగీతంతో సినిమాను కొంతమేర కాపాడే ప్రయత్నం చేశాడు. పాటలు, నేపథ్యం సంగీతం పరవాలేదనిపిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కామెడీ మైనస్ పాయింట్స్ : స్క్రీన్ప్లే దర్శకత్వం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
గ్లామర్ రోల్స్ ఇవ్వటం లేదు
‘‘అవకాశాలు వస్తే గ్లామర్ రోల్స్ చెయ్యాలని ఉంది. కానీ, ఎవ్వరూ నన్ను అలాంటి పాత్రలు చేయమని అడగటం లేదు. ఎవరైనా అలాంటి రోల్స్ ఆఫర్ చేస్తే.. ఆ పాత్రకి సినిమాలో మంచి ప్రాధాన్యం ఉంటే కచ్చితంగా చేస్తాను. ఇటీవల ఓ తమిళ సినిమాలో ప్రత్యేక పాట చేశాను’’ అని నందితా శ్వేత అన్నారు. సుమంత్ అశ్విన్, సిద్ధీ ఇద్నాని జంటగా నందితా శ్వేత మెయిన్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్ 2’. హరికిషన్ని దర్శకునిగా పరిచయం చేస్తూ, ఆర్పీఏ క్రియేషన్స్ పతాకంపై ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నందితా శ్వేత మాట్లాడుతూ– ‘‘తెలుగులో నా మొదటి సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’. ఆ సినిమాలో నేను చేసిన అమల పాత్ర ఎంతో మంచి పేరు తీసుకువచ్చింది. ఆ సినిమాలో చేసిన దెయ్యం పాత్ర కంటే ‘ప్రేమకథా చిత్రమ్ 2’లో చేసిన దెయ్యం పాత్ర చాలా కష్టం. పది సంవత్సరాల క్రితం ఓ రోజు రాత్రి గుడికి వెళ్తున్న సమయంలో ఏదో ఒక ఆకారం కనబడటంతో చాలా భయం వేసింది. అప్పుడు నిజంగా దెయ్యం ఉందేమోననిపించింది. కానీ, దేవుడు ఉన్నాడని కూడా నేను బాగా నమ్ముతాను. ‘ప్రేమకథా చిత్రమ్’ ఎండింగ్ నుంచి ఈ సినిమా మొదలవుతుంది. ఇప్పటివరకూ చేసిన సినిమాలకన్నా ఇందులో నా యాక్టింగ్లో పూర్తి వేరియేషన్స్ చూడొచ్చు. సమంత్ ఆశ్విన్ మంచి కో ఆర్టిస్ట్. చాలా బాగా సపోర్ట్ చేశాడు. ప్రస్తుతం కన్నడలో యశ్తో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో ‘సెవెన్, అక్షర’ వంటి చిత్రాలున్నాయి’’ అన్నారు. -
కారు సడన్గా ఆగింది!
‘‘ఏదైనా సినిమా ఒప్పుకునే ముందు స్క్రిప్ట్ చాలా ముఖ్యమని భావిస్తాను. పాత్రల మధ్య వైవిధ్యం చూపేందుకు ఇష్టపడతాను’’ అని హీరోయిన్ సిద్ధీ ఇద్నాని అన్నారు. సుమంత్ అశ్విన్, నందితా శ్వేత, సిద్ధీ ఇద్నానీ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘ప్రేమకథాచిత్రమ్ 2’. 2013లో వచ్చిన ‘ప్రేమకథాచిత్రమ్’ సినిమాకు ఇది సీక్వెల్. హరి కిషన్ దర్శకత్వం వహించారు. ఆర్. సుదర్శన్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా సిద్ధీ ఇద్నాని చెప్పిన విశేషాలు. ► ఈ చిత్రంలో నా నిజజీవితానికి దగ్గరగా ఉండే బిందు అనే కాలేజీ అమ్మాయి పాత్రలో నటించాను. బిందుకి చాలా గర్వం. తను ఇష్టపడితే అవతలివారు ఇష్టపడాల్సిందే. ఈ చిత్రంలో హీరోగా నటించిన సుమంత్ అశ్విన్ మంచి కో–స్టార్. అతనికి ఇండస్ట్రీ నేపథ్యం ఉన్నప్పటికీ నిగర్వంగా ఉంటాడు. సెట్లో ఫుడ్ గురించి, ట్రావెల్ గురించి మేం ఎక్కువగా మాట్లాడుకున్నాం. నందితాశ్వేతాతో నాకు మూడు, నాలుగు సీన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఆమె నటించిన హారర్ సినిమాలు చూశాను. దర్శకుడు హరి సెట్లో సీన్స్ను బాగా వివరించడంతో ఈజీ అయింది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ చాలా పెద్ద విజయం సాధించింది. రెండో పార్ట్ పై అంచనాలు ఉంటాయి. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇందులో దెయ్యం ఎవరు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ► కోపం, సంతోషం వంటి ఎక్స్ప్రెషన్స్ను బాగానే ఇవ్వచ్చు. ఎందుకంటే ఇవి రెగ్యులర్ లైఫ్లో భాగమే. కానీ పొసెస్డ్గా.. అంటే నాకే సొంతం అన్న ఫీలింగ్ను ఫేస్లో ఎక్స్ప్రెస్ చేయడానికి కాస్త హోమ్వర్క్ చేశాను. ► అతీంద్రియ శక్తులను నమ్ముతాను. ఆత్మలు ఉన్నాయని నా నమ్మకం. ఓ సారి నేను కారులో వెళ్తుంటే సడన్గా ఆగింది. రెడ్ శారీలో ఓ లేడీ వచ్చి కారు ముందు నిలబడింది. ఈ అనుభవంతో భవిష్యత్లో నేను కచ్చితంగా సినిమా చేస్తాను. ► నేను తెలుగులో హీరోయిన్గా నటించిన తొలి సినిమా ‘జంబలకిడిపంబ’(2018) ట్రైలర్ రిలీజైనప్పుడు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ట్రైలర్లో నేను అబ్బాయిలా నటించడం చూసి నిర్మాత పిలిచి, ఆడిషన్ ఇవ్వమని అడగలేదు. ఇది కథ, నీ క్యారెక్టర్ ఇలా ఉంటుందని చెప్పారు. ‘జంబలకిడిపంబ’ చిత్రం మంచి హిట్ సాధించి ఉంటే నాకు మరిన్ని అవకాశాలు వచ్చి ఉండేవి. ► సమంతకు నేను అభిమానిని. ఆమె ఎంపిక చేసుకుంటున్న తరహా పాత్రలు చేయాలని ఉంది. రాజమౌళిగారి దర్శకత్వంలో నటించాలని ఆశ. ప్రస్తుతం నేను నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్ యాభై శాతం పూర్తయింది. జూన్లో విడుదల కావొచ్చు. మరో సినిమా కమిట్ అయ్యాను. ఈ నెలాఖర్లో సెట్స్పైకి వెళ్తుంది. -
రావు రమేశ్ వాయిస్తో...
హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ ప్రేక్షకుల్ని భయపెట్టడంతో పాటు నవ్వుల్లో ముంచెత్తింది. జె. ప్రభాకర్రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కిన చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్ 2’. సుమంత్ అశ్విన్, సిద్ధీ ఇద్నాని జంటగా నందితా శ్వేత మెయిన్ హీరోయిన్గా నటించారు. హరికిషన్ని దర్శకునిగా పరిచయం చేస్తూ, ఆర్పీఏ క్రియేషన్స్ పతాకంపై ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఉగాది సందర్భంగా ఏప్రిల్ 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘సూపర్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. మొదటి భాగానికి దీటుగా ఉంటుంది. ఈ చిత్రం రావు రమేష్గారి వాయిస్ ఓవర్తో నడుస్తుంది. తాజాగా విడులైన మా సినిమా ట్రైలర్కు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ లభించింది. సెన్సార్ పనులు పూర్తయ్యాయి. విద్యుల్లేఖ, ప్రభాస్ శ్రీను మధ్య వచ్చే కామెడీ హిలేరియస్గా ఉంటుంది. పూర్తి సర్ప్రైజింగ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన మా ‘ప్రేమకథా చిత్రమ్ 2’ అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సి. రాంప్రసాద్, సంగీతం: జె.బి, సహ నిర్మాతలు ఆయుష్ రెడ్డి, ఆర్పి అక్షిత్ రెడ్డి. -
సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుంది
సుమంత్ అశ్విన్, సిద్ధీ ఇద్నానీ జంటగా నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ప్రేమకథాచిత్రమ్ 2’. 2013లో వచ్చిన ‘ప్రేమకథాచిత్రమ్’ సినిమాకు ఇది సీక్వెల్. హరికిషన్ దర్శకత్వంలో ఆర్. సుదర్శన్రెడ్డి నిర్మించారు. ఆయుష్ సహ నిర్మాత. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ను నటుడు సప్తగిరి శుక్రవారం హైదరాబాద్లో విడుదల చేశారు. అనంతరం సప్తగిరి మాట్లాడుతూ– ‘‘ప్రేమకథాచిత్రమ్’ మాకు జీవితాన్ని ప్రసాదించింది. ఆ సినిమా పేరును ఇంకా చెప్పుకుంటున్నాం. అంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఫస్ట్ పార్ట్లో నటించిన నేను ఈ ‘ప్రేమకథాచిత్రమ్ 2’ ట్రైలర్ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. స్టోరీ పరంగా నేను అవసరం లేదనే నిర్మాత నన్ను ఈ సినిమాకు పిలవలేదు. పిలిచి ఉంటే వచ్చేవాడిని. సుమంత్ కెరీర్లో ఇది బెస్ట్ మూవీగా ఉండిపోతుంది. నిర్మాతకు డబ్బులు రావాలి. సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుంది’’ అన్నారు. ‘‘భావోద్వేగభరితమైన సన్నివేశాలను హరికిషన్ చక్కగా తెరకెక్కించారు. హీరోయిన్ల పాత్రలు ఇతర పాత్రలను డామినేట్ చేసేలా ఉన్నాయి’’ అన్నారు సుమంత్ అశ్విన్. ‘‘కంటెంట్ని నమ్మి ఈ సినిమాను నిర్మించాను. స్క్రిప్ట్ పరంగా సప్తగిరి పాత్రకు అవకాశం లేదు. ఇప్పుడు ఆయన హీరో కూడా అయిపోయారు. కెమెరామేన్ రాంప్రసాద్ మంచి విజువల్స్ అందించారు. నందితా సింగిల్ టేక్ ఆర్టిస్టులా నటించారు. సుమంత్ అశ్విన్ కెరీర్లో ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుంది. ఈ సినిమాను ఉగాది సందర్భంగా ఏప్రిల్ 6న విడుదల చేస్తున్నాం’’ అన్నారు సుదర్శన్రెడ్డి. ‘‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా తర్వాత చాలా హారర్ కథలు విన్నాను. ఈ చిత్రానికి సైన్ చేసినప్పుడు... మళ్లీ హారరా? అన్నారు నా సన్నిహితులు. కానీ నా క్యారెక్టర్ బాగుంటుంది’’ అన్నారు నందితాశ్వేత. ‘‘ఈ సీక్వెల్ ‘ప్రేమకథాచిత్రమ్’కు దీటుగా ఉండాలని చాలా కష్టపడి తీశాం. సినిమా హిట్ సాధిస్తుంది’’ అన్నారు దర్శకుడు హరికిషన్. ‘‘ప్రేమకథాచిత్రమ్ 2’ నాకు స్పెషల్ మూవీ. ఇది తెలుగులో నా రెండో చిత్రం. అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు సిద్ధీ ఇద్నానీ. నిర్మాతలు శ్రీధర్ రెడ్డి, ఆయుష్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ జేబీ, కెమెరామేన్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మార్చి 21న ‘ప్రేమ కథా చిత్రమ్ 2’
సుధీర్ బాబు, నందితలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా ప్రేమ కథా చిత్రమ్. మారుతి కథ అందించిన ఈ సినిమాకు జె ప్రభాకర్ రెడ్డి దర్శకుడు. కామెడీ హర్రర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ కావటంతో సుమంత్ అశ్విన్ హీరోగా సీక్వెల్ ను తెరకెక్కించారు. ప్రేమ కథా చిత్రం 2 పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. హరి కిషన్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఒక హీరోయిన్గా జంబ లకిడి పంబ ఫేం సిద్ధి ఇద్నాని నటిస్తుండగా మరో హీరోయిన్ గా ఎక్కడికి పోతావు చిన్నావాడా ఫేం నందిత శ్వేత నటించారు. ప్రేమ కథా చిత్రానికి నిర్మాతగా వ్యహరించిన సుదర్శన్ రెడ్డి సీక్వెల్ను కూడా నిర్మిస్తున్నారు. -
వేసవిలో భయం మొదలు
సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని జంటగా నందితా శ్వేతా ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్ 2’. ‘బ్యాక్ టు ఫియర్’ అనేది ఉపశీర్షిక. హరికిషన్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆర్. సుదర్శన్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం మార్చి 21న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అంటే వేసవిలో మళ్లీ భయం మొదలు అన్నమాట. ‘‘ప్రేమకథాచిత్రమ్’ మంచి విజయం సాధించింది. దీనికి సీక్వెల్గా వస్తుంది ‘ప్రేమకథాచిత్రమ్ 2’. నటుడు రావు రమేష్గారి వాయిర్ ఓవర్తో కథలో ప్రేక్షకులు లీనమవుతారు. సుమంత్, సిద్ధి, నందితాల నటన హైలైట్గా ఉంటుంది. విద్యుల్లేఖా, ప్రభాస్ శ్రీనుల మధ్య వచ్చే సన్నివేశాల నవ్విస్తాయి. మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సుదర్శన్రెడ్డి. ఈ సినిమాకు సహ నిర్మాతలు: ఆయుష్ రెడ్డి, ఆర్పి అక్షిత్ రెడ్డి, సంగీతం: జెబి. -
క్రేజీ నవ్వులు
విశ్వంత్ , పల్లక్ లల్వాని జంటగా సంజయ్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’. విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. శ్రీ లక్ష్మీ పిక్చర్స్పై బాపిరాజు ఈ సినిమా విడుదల చేస్తున్నారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను హీరో సుమంత్ అశ్విన్, నిర్మాత దామోదర్ రెడ్డి విడుదల చేశారు. దర్శకుడు సంజయ్ కార్తీక్ మాట్లాడుతూ– ‘‘కుటుంబంతో కలిసి చూసే చక్కటి వినోదాత్మక చిత్రమిది. షూటింగ్ అంతా హ్యాపీగా జరిగింది. మా హీరో విశ్వంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పల్లక్ లల్వాని చాలా బాగా నటించారు. నాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చిన నిర్మాత మధుగారికి స్పెషల్ థాంక్స్’’ అన్నారు. ‘‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’తో కేరింత పెట్టే రోజు దగ్గర్లోనే ఉంది’’ అని నటుడు రాజీవ్ కనకాల అన్నారు. విశ్వంత్ మాట్లాడుతూ– ‘‘నేను ఫస్ట్ డే కథ విన్నప్పటి నుంచి మిస్ కమ్యూనికేషన్ లేకుండా సంజయ్ చేశాడు. ఆయనకు పెద్ద బ్రేక్ రావాలి. నా సినిమా ఏడాది తర్వాత రిలీజ్ అవుతోంది. పెద్ద హిట్ అవ్వాలి. గతంలో నేను చేసిన ‘కేరింత, మనమంతా’ సినిమాలు ఎక్కువ డ్రామాతో కూడుకున్నవి. తొలిసారి కామెడీ చేశా. వినోదం పంచడం చాలా కష్టం. కానీ అది నాకు ఈజీ అయ్యిందంటే కారణం మా డైరెక్టర్’’ అని చెప్పారు. -
‘ప్రేమకథా చిత్రమ్ 2’ మూవీ స్టిల్స్
-
ఇంకా చాలా ఉంది
సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని జంటగా నందితా శ్వేత కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్ 2’. ‘బ్యాక్ టు ఫియర్’ అనేది ఉపశీర్షిక. సుదర్శన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో హరి కిషన్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. 2013లో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ చిత్రానికి ఇది సీక్వెల్ అన్నది తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. టీజర్ను విడుదల చేశారు. సినిమాను జనవరిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రేమకథా చిత్రమ్’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలుసు. సీక్వెల్ కూడా అంతటి ఘనవిజయం సాధిస్తుందని టీజర్ని చూసిన వారు చెబుతుంటే హ్యాపీగా ఉంది. సుమంత్, సిద్ధి ఇద్నాని ప్లెజంట్గా నటిస్తే నందితా శ్వేత నటనలో తన విశ్వరూపం చూపించారు. ప్రేక్షకులు చూసింది టీజర్ మాత్రమే.. సినిమాలో ఇంకా చాలా ఉంది’’ అని అన్నారు. కృష్ణతేజ, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖా రామన్ తదితరులు నటించిన ఈ సినిమాకు జేబీ సంగీతం అందించారు. -
‘ప్రేమకథా చిత్రమ్ 2’ మూవీ స్టిల్స్
-
నాలుగు భాషల్లో థ్రిల్
లవర్బాయ్ ఇమేజ్ ఉన్న సుమంత్ అశ్విన్ ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అయ్యారు. ఆయన హీరోగా ‘దండుపాళ్యం’ ఫేమ్ శ్రీనివాసరాజు దర్శకత్వంలో ఓ భారీ హారర్ థ్రిల్లర్ సినిమా రూపుదిద్దుకోనుంది. జ్యోస్టార్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై ‘గరుడవేగ’ వంటి యాక్షన్ ఎంటర్టైనర్ను నిర్మించిన ఎం.కోటేశ్వరరాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రం ఈ నెల రెండో వారంలో ప్రారంభం కానుంది. శ్రీనివాసరాజు మాట్లాడుతూ– ‘‘చాలా మంచి సబ్జెక్ట్ ఇది. అందుకే నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ఇతర పాత్రల్లో భారీ తారాగణం నటిస్తారు. రీ–రికార్డింగ్కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న హారర్ థ్రిల్లర్ ఇది. అందుకే మణిశర్మగారు ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారు. హారర్ థ్రిల్లర్స్లోనే ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుంది’’ అన్నారు. ‘‘ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్వర్మ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా శ్యామ్ప్రసాద్. -
నా టార్గెట్ వారే
‘‘నాది తిరుపతి. ఓంకార్గారి ‘జీనియస్’ షోకి నా స్నేహితుడు శ్రీహరి ఎంపికయ్యాడు. నేను కూడా తనతో పాటు హైదరాబాద్ వచ్చా. నేను చేసిన షార్ట్ ఫిలింస్ చూసి నన్ను కూడా ఎంపిక చేసుకోవడంతో ‘జీనియస్’ షోకి పని చేశా’’ అని డైరెక్టర్ లక్ష్మణ్ కార్య అన్నారు. సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్’. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా నిర్మించిన ఈ సినిమా జూలై 28న విడుదలైంది. ఈ సందర్భంగా లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ– ‘‘మొగుడు’ సినిమాకు కెమెరా డిపార్ట్మెంట్లో, దేవా కట్టాగారి దగ్గర ‘ఆటోనగర్ సూర్య’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశా. ‘హ్యాపి వెడ్డింగ్’కి ముందు ‘ఎందుకిలా’ వెబ్ సిరీస్ చేశా. ఆ సమయంలో సుమంత్ అశ్విన్గారితో ఏర్పడిన పరిచయంతో ‘హ్యాపి వెడ్డింగ్’ సెట్ అయింది. ఫ్యామిలీ, మహిళా ప్రేక్షకులను టార్గెట్ చేసి ‘హ్యాపి వెడ్డింగ్’ చేశా. వారి నుంచి మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. తొలి నరేషన్లోనే నిహారిక ఇందులో నటించడానికి ఒప్పుకున్నారు. సినిమా విడుదల తర్వాత నాగబాబుగారు ఫోన్ చేసి అభినందించడం వెరీ హ్యాపీ. నా తర్వాతి చిత్రంపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలో వివరాలు చెబుతా’’ అన్నారు. -
వెడ్డింగ్ ఎప్పుడు
-
‘హ్యాపి వెడ్డింగ్’ మూవీ రివ్యూ
టైటిల్ : హ్యాపి వెడ్డింగ్ జానర్ : ఫ్యామిలీ డ్రామా తారాగణం : సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల, ఇంద్రజ తదితరులు.. సంగీతం : శక్తికాంత్ కార్తీక్ నేపథ్య సంగీతం : తమణ్ ఎస్ దర్శకత్వం : లక్ష్మణ్ కార్య నిర్మాత : పాకెట్ సినిమా స్టార్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెలలు తమని తాము ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హ్యాపి వెడ్డింగ్. నూతన దర్శకుడు లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా యువీ క్రియేషన్స్ లాంటి సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థ సమర్పణలో తెరకెక్కటంతో రిలీజ్ కు ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా ఆడియోతో పాటు టీజర్, ట్రైలర్లు కూడా ఆకట్టుకోవటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ హ్యాపి వెడ్డింగ్ అందుకుందా..? నిహారిక, సుమంత్ అశ్విన్ల కెరీర్లకు ఈ సినిమా ఎంత వరకు ఉపయోగపడుతుంది..? కథ ; ఇది విజయవాడ అబ్బాయి, హైదరాబాద్ అమ్మాయిల పెళ్లి కథ. విజయవాడలో ఉండే గోపాల్ (నరేష్), లలిత(పవిత్రా లోకేష్)ల అబ్బాయి ఆనంద్ విరాట్ వాకలపూడి (సుమంత్ అశ్విన్). యాడ్ ఫిలింకు మేకర్ అయిన ఆనంద్ది మెచ్యూర్డ్ గా ఆలోచించే మనస్థత్వం. హైదరాబాద్లో ఉండే హనుమంతరావు (మురళీ శర్మ), లత(తులసి)ల అమ్మాయి అక్షర (నిహారిక కొణిదెల). డిజైనర్ గా పనిచేసే అక్షరది ఏ విషయంలోనూ వెంటనే నిర్ణయం తీసుకోలేని చంచల మనస్థత్వం. (సాక్షి రివ్యూస్) ఓ బస్సు ప్రయాణంలో ప్రేమలో పడిన వీరిద్దరికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయిస్తారు. కానీ ఆనంద్ చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా అక్షర పెళ్లి విషయంలో ఆలోచనలో పడుతుంది. అదే సమయంలో తను గతంలో ప్రేమించిన విజయ్ (రాజా) మరోసారి తన జీవితంలోకి రావటంతో.. ఆనంద్ను పెళ్లి చేసుకోవాలా.. వద్దా..? అన్న సందిగ్థంలో పడిపోతుంది. ఈ విషయం తెలిసి ఇరు కుటుంబాలు ఎలా రియాక్ట్ అయ్యాయి..? చిరవకు అక్షర, ఆనంద్లు ఎలా ఒక్కటయ్యారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; విజయవాడ అబ్బాయిగా సుమంత్ అశ్విన్, హైదరాబాద్ అమ్మాయిగా నిహారికలు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. లవర్ బాయ్ రోల్స్ లో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న సుమత్ అశ్విన్, మరోసారి అదే తరహా పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్లో సుమంత్ అశ్విన్ నటన సూపర్బ్. ఒక్కమనసు సినిమాతో నిరాశపరిచిన నిహారికకు ఈ సినిమాలో నటనకు అవకాశం ఉన్న పాత్ర దక్కింది. (సాక్షి రివ్యూస్)పెద్దగా వేరియేషన్స్ చూపించే అవకాశం లేకపోయినా.. ఉన్నంతలో పరవాలేదనిపించారు. సీనియర్ నరేష్, మురళీ శర్మ, పవిత్రా లోకేష్, తులసి, ఇంద్రజ, రాజాలు రొటీన్ పాత్రల్లో కనిపించారు. తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ ; తెలుగు తెర మీద పెళ్లి నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ఘన విజయం సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదే బాటలో హ్యాపి వెడ్డింగ్ సినిమాతో మరో అందమైన ఫ్యామిలీ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు లక్ష్మణ్. పెళ్లి ఇంట్లో ఉండే హడావిడి, కుటుంబ బంధాలను బలంగా చూపించిన దర్శకుడు, హీరో హీరోయిన్ల మధ్య గొడవకు కారణాన్ని మాత్రం అంత బలంగా తయారు చేసుకోలేదు. చిన్న విషయానికి హీరోయిన్ పెళ్లి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం సిల్లీగా అనిపిస్తుంది. అదే సమయంలో కథనం కూడా నెమ్మదిగా సాగుతూ ఇబ్బంది పెడుతుంది. (సాక్షి రివ్యూస్)సినిమాకు ప్రధాన బలం సంగీతం. శక్తికాంత్ కార్తీక్ అందించి పాటలు బాగున్నాయి. పాటలు కావాలని ఇరికించినట్టుగా కాకుండా కథలో భాగంగా వచ్చి వెలుతూ అలరిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : ఎమోషనల్ సీన్స్ సంగీతం మైనస్ పాయింట్స్ ; నెమ్మదిగా సాగే కథనం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. మరిన్ని రివ్యూల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి
‘‘నిజాయితీగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయినే వివాహం చేసుకోవాలన్నది నా అభిప్రాయం. ఫ్రెండ్స్ లిస్ట్లో అమ్మాయిలు ఉన్నారు కానీ ఇప్పటి వరకైతే నేను ఎవర్నీ లవ్ చేయలేదు. ఏదో ఒక టైమ్లో అందరికీ కచ్చితంగా పెళ్లి జరుగుతుంది. నా టైమ్ వచ్చినప్పుడు నాకు జరుగుతుంది’’ అన్నారు సుమంత్ అశ్విన్. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా రూపొందిన సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్’. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా సుమంత్ చెప్పిన విశేషాలు.. ► డైరెక్టర్ లక్ష్మణ్గారు కథ చెప్పినప్పుడు చివరి 20 నిమిషాల్లో వచ్చే డైలాగ్స్, సన్నివేశాలు నచ్చి సినిమా ఒప్పుకున్నాను. రొమాన్స్, డ్రామా విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉంటుంది. పెళ్లి వాతావరణంలో సినిమా కథనం సాగుతుంది. ఇందులో ఆనంద్ పాత్ర చేశా. ► అవుట్పుట్ కూడా బాగా వచ్చింది. క్లైమాక్స్ సన్నివేశాలు ఆడియన్స్ను ఆకట్టుకుంటాయి. మా సినిమాలో విలన్ ఎవరు? అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఈ సినిమా వల్ల కుటుంబ ఆప్యాయతలు, అనుబంధాలులపై మరింత అవగాహన పెంచుకున్నాను. ► కథానాయికగా నిహారిక అయితే బాగుంటుందని దర్శకుడు అన్నారు. నిహారిక చాలా బాగా నటించింది. ముఖ్యంగా ఇంట్రవెల్ సీన్లో ఆమె చేసిన యాక్టింగ్ సినిమాలో సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సినిమాలో నా క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుందా లేక నిహారిక పాత్ర ఎక్కువ ఉంటుందా? అనే లెక్కలు వేసుకోలేదు. ఇద్దరి క్యారెక్టర్స్కు సినిమాలో ఇంపార్టెన్స్ ఉంది. ► ఈ సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. భవిష్యత్లో నేనూ పెద్ద బ్యానర్లో చేయడానికి ఇదొక ఫ్లాట్ఫామ్గా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. యూవీ క్రియేషన్స్ వారు కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. వాళ్లు లేకపోతే సినిమా ఇంత గ్రాండియర్గా వచ్చేది కాదు. ► నేను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా మా తల్లిదండ్రులకు ఇష్టమే. కానీ ఆ అమ్మాయి మా అమ్మానాన్నలకు నచ్చాలనేది నా ఫీలింగ్. వాళ్లకు నచ్చితేనే నేను పెళ్లి చేసుకుంటాను. నా ఇష్టాన్ని మా పేరెంట్స్ కాదనరని నా నమ్మకం. -
అప్పుడు సినిమాలు మానేస్తాను
‘‘మంచి పాత్రలు చేస్తే మంచి నటిగా గుర్తుండిపోతావు. చిన్న తప్పు చేసినా.. భూతద్దంలో పెట్టి చూస్తారు. వాటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి’ అని సినిమాల్లోకి వచ్చే ముందు పెదనాన్న (చిరంజీవి) చెప్పారు’’ అన్నారు నిహారిక. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్’. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిహారిక పంచుకున్న విశేషాలు... ► ‘‘హీరోలతో బయటి అమ్మాయిలు క్లోజ్గా మాట్లాడితేనే ఏదేదో అంటుంటారు. నువ్వు మెగా ఫ్యామిలీ నుంచి వెళుతున్నావంటే నీపై కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. నువ్వు నార్మల్గా కనిపించినా ఏదేదో రాసేస్తారు’’ అని నాన్న (నాగబాబు) అన్నారు. ప్రస్తుతం నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే ఉంది. సోషల్ మీడియాతో సమయం వృథా అని రెండేళ్లు ఫోన్ వాడలేదు. మళ్లీ ఈ మధ్యే వాడుతున్నాను. ► ‘హ్యాపి వెడ్డింగ్’లో అక్షర అనే సింపుల్ ఫ్యాషన్ డిజైనర్ పాత్రలో కనిపిస్తా. ప్రేమించిన వ్యక్తితో ఇంట్లోవాళ్ల సమ్మతంతో ఎంగేజ్మెంట్, పెళ్లి జరుగుతుంది. నా పాత్రవల్లే సమస్యలు, సొల్యూషన్స్ ఉంటాయి. ► చిరంజీవిగారి డ్యాన్స్ చూస్తూ పెరగడంతో నేర్చుకోవాల్సిన పని లేదనిపించింది. డ్యాన్స్ బాగా వచ్చినప్పటికీ నా మూడు సినిమాల్లో చేసే అవకాశం రాలేదు. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకునే క్రమంలో కాళ్లపై కొట్టి నేర్పిస్తారు (నవ్వుతూ). అలా చేయడం వల్ల నాకు జ్వరం వచ్చి నేర్చుకోవడమే మానేశాను. ► నాకు 10–15 ఏళ్లు సినిమాల్లో నటించాలని లేదు. మూడు నాలుగేళ్ల తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలు మానేస్తాను. అయితే ప్రొడక్షన్ సైడ్ ఉంటాను. వెబ్ సిరీస్ చేసుకుంటాను. సినిమాలు మానేసిన తర్వాత నా సినిమాలు చూసుకుంటే నా ప్రతి క్యారెక్టర్ నాకు నచ్చాలి. స్టార్ హీరోలతో ఇప్పటి వరకూ అవకాశం రాలేదు.. వస్తే చేస్తా. ► పెళ్లంటే చాలా గౌరవం. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోను. ప్రస్తుతం నా దృష్టి కెరీర్పైనే. విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్లతో సినిమా చేసేటప్పుడు ట్యూటర్ని పెట్టుకుని తమిళం నేర్చుకున్నా. ఇప్పుడు రాస్తాను కూడా. ఇంట్లో నేనెవర్నీ ఇమిటేట్ చేయను. ► మెగా ప్రిన్సెస్ అన్నప్పుడల్లా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయనిపిస్తుంది. దానివల్ల కొన్నిసార్లు మంచే జరిగినా నాకు భయంగా ఉంటుంది. ‘కథ నీకు నచ్చితే చెయ్’ అని అన్నయ్య (వరుణ్ తేజ్) అంటారు. నా సినిమా కథ వినరు. ప్రణీత్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా లాంగ్ షెడ్యూల్ పూర్తి చేశాం. రాహుల్ విజయ్తో ఓ సినిమా చేస్తున్నా. ∙చిరంజీవిగారి సినిమాలో ఆయనతో ఓ ఫ్రేమ్లో కనిపించినా చాలనుకునేదాన్ని. ‘సైరా’లో నటించాలని అన్నయ్య చరణ్ను బతిమలాడాను. సురేందర్రెడ్డిగారు వచ్చి ‘డైలాగ్స్ లేకున్నా పర్లేదా?’ అంటే.. ఓకే అన్నా. రెండు ఫ్రేమ్స్లో కనపడే చిన్న బోయ అమ్మాయిగా చేశా. -
‘హ్యాపి వెడ్డింగ్’ మూవీ స్టిల్స్
-
‘హ్యాపి వెడ్డింగ్’ ప్రీ–రిలీజ్ వేడుక
-
నాన్నగారికి రాజుగారు అప్పు ఇచ్చారు
‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే రిస్క్. ఆ రిస్క్ తీసుకోవడానికి యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్లు ఎప్పుడూ ముందుంటారు. కానీ తెరవెనుక నుంచే మొత్తం నడుపుతారు. రిస్క్, రివార్డులు తీసుకునే వాళ్లలో ‘బాహుబలి’ నిర్మాతలు (శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని) తర్వాత వీరినే అనుకుంటా. గుండె ధైర్యంతో పాటు చాలా పెద్ద మనసున్న మంచివాళ్లు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్’. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ–రిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘నిహారిక మా ముందు పుట్టి పెరిగి మామయ్యా.. అంటుండేది. ఇవాళ హీరోయిన్గా చూస్తుంటే నాకు డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతోంది. సుమంత్ అశ్విన్ డీసెంట్, ప్లెజెంట్, రొమాంటిక్ యాక్టర్. టీనేజ్కి కొంచెం పైబడినట్టు ఉండి రొమాంటిక్ క్యారెక్టర్స్ చేయగల తక్కువ మంది హీరోల్లో సుమంత్ ఒక్కరు. ఎమ్మెస్ రాజుగారితో పోటీ పడి పైకొచ్చాం. అంత మంచి నిర్మాత ఆయన. ఇటీవల ఓ సినిమాలో మురళీశర్మగారి నటన చూశాక ఎస్వీ రంగారావుగారి అవార్డు ఉంటే ఇవ్వాలనిపించింది. అంత బాగా చేశారు. ‘సమ్మోహనం’ సినిమా చూసి నరేశ్ని అభినందిస్తూ మెసేజ్ చేశా. ‘హ్యాపి వెడ్డింగ్’ ఫీల్ గుడ్ మూవీ. సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలనుకునే సినిమాల్లో ఇదొకటి’’ అన్నారు. రామ్చరణ్ మాట్లాడుతూ– ‘‘నిహారిక కోసమో, ఈ సినిమా గురించి మాట్లాడటానికో ఇక్కడికి రాలేదు. ఎమ్మెస్ రాజుగారి కోసం వచ్చా. ఆయన, యూవీ క్రియేషన్స్ కలిసి ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. వంశీ అన్న, విక్రమ్, ప్రమోద్గారు చేసిన ప్రతి సినిమా హిట్ అవుతోంది. వారిపై నమ్మకంతో, నిహారిక మాటలు విన్నాక, ట్రైలర్ చూశాక కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందనిపించింది. ట్రైలర్ పండితే సినిమా కూడా పండుతుందని చాలా వరకు నేను నమ్ముతా. మురళీశర్మగారితో ‘ఎవడు’ సినిమా చేశా. త్వరలో మరో సినిమా చేయాలనుకుంటున్నా. సుమంత్ వెరీ హార్డ్వర్కర్. తన కెరీర్కి ఇది మైల్స్టోన్ అవుతుంది. ఎమ్మెస్ రాజుగారితో మాకున్న అనుబంధం ఈనాటిది కాదు. నెలక్రితం నాన్నగారు (చిరంజీవి), నేను కూర్చుని ఉన్నప్పుడు రాజుగారి టాపిక్ వచ్చింది. నాన్నగారు 1980లలో జరిగిన ఓ సంఘటన చెప్పారు. నాన్నగారు చాలా మంది నిర్మాతలతో పని చేస్తూ ఉండేవారు. ఓ నెల నాన్నకీ, అమ్మకీ డబ్బులు సరిపోలేదు. నాన్నగారు హీరోగా పని చేస్తున్న ఓ ముగ్గురు నిర్మాతలను ఐదు వేలు అప్పు అడిగితే వాళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. చివరిగా ఎమ్మెస్ రాజుగారి నాన్నగార్ని (అయ్యప్పరాజు) అడిగినప్పుడు.. ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా ఐదు వేల రూపాయలు నాన్నగారికి ఇచ్చి తీసుకో.. తర్వాత తీసుకుంటాను అన్నారట ఎమ్మెస్ రాజుగారు. తర్వాత నాన్న తిరిగిచ్చేశారు. అది ఇవాళ్టికి కూడా గుర్తుపెట్టుకుని నాన్నగారు నాకు చెప్పారు. ఎమ్మెస్ రాజుగారు నాకు ఫోన్ చేసి ఫంక్షన్ గురించి చెప్పగానే అది నా బాధ్యత.. వస్తాను అన్నాను. ఇక్కడికి నేను రావడం గొప్ప విషయం కాదు. ఆయన గొప్పతనం మీ అందరికీ చెప్పాలనే ఇక్కడికొచ్చా. నటుడికి, నిర్మాతకి, డైరెక్టర్కి కావాల్సింది ప్రతిభే కాదు మంచి ప్రవర్తన. గ్రేట్ టాలెంట్ ఉన్నవారు బ్యాడ్ యాటిట్యూడ్తో ఉంటే సక్సెస్ అవలేరు కానీ, బ్యాడ్ టాలెంట్ ఉన్నా ఒక మంచి యాటిట్యూడ్ ఉంటే ఎప్పటికైనా లైఫ్లో సక్సెస్ అవుతారు. అలాంటి రాజుగారి ఫ్యామిలీ ఎప్పుడూ సక్సెస్ఫుల్గా ఉండాలని మా ఫ్యామిలీ తరఫునుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘హ్యాపి వెడ్డింగ్’ వెరీ గుడ్ టైటిల్. చాలా పాజిటివ్గా ఉంది. ఈ సినిమా ‘బొమ్మరిల్లు’ అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు డైరెక్టర్ బి. గోపాల్. ‘‘నా దృష్టిలో ప్రతి ఒక్కరి జీవితంలో బిగ్గెస్ట్ ఫంక్షన్ పెళ్లి. ఆ ఈవెంట్ ఓ ఎమోషనల్ ప్యాకేజ్.. అదే మా ‘హ్యాపి వెడ్డింగ్’. ఈ సినిమా ఫీల్ని ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుని ఇంటికి తీసుకెళతారని చెప్పగలను. సుమంత్, నిహారికగార్ల సపోర్ట్ లేకుంటే ఈ సినిమా చాలా కష్టం’’ అన్నారు లక్ష్మణ్ కార్య. ‘‘హ్యాపి వెడ్డింగ్’ కథ విన్న వెంటనే నేను కనెక్ట్ అయ్యి ఓకే చేశా. ఈ కథకి అమ్మాయిలు ఎక్కువ కనెక్ట్ అవుతారు. వంశీ, ప్రమోద్గారు లక్కున్న నిర్మాతలు. ఆ లక్ మాకూ వస్తుందనుకుంటున్నా’’ అన్నారు నిహారిక. ‘‘ఈ సినిమాలో కొన్ని సీన్లకి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. అవి స్వీట్ మెమొరీస్. వాటిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ప్రేక్షకులే దేవుళ్లు. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి’’ అన్నారు సుమంత్ అశ్విన్. -
నెలాఖర్లో పెళ్లి
పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. వరుడు సుమంత్ అశ్విన్. వధువు నిహారిక. ఈ నెల 28న వీరి వివాహం జరగనుంది. ఇది రీల్ మ్యారేజ్. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్’. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న రిలీజ్ కానుంది. లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ – ‘‘పెళ్లంటే నూరేళ్ల పంట. జీవించినంత కాలం ఒకరినొకరు అర్థం చేసుకుని ఎటువంటి మనస్పర్థలు రాకుండా జీవించాలని అర్థం. దీనికి ఇరు పెద్దలు కూర్చుని చక్కటి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. పెళ్లికి ముహూర్తం నిర్ణయించిన దగ్గర నుంచి పెళ్లి జరిగే రోజు వరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని చూపించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శక్తికాంత్ కార్తీక్, రీ రికార్డింగ్: తమన్, కెమెరా: బాల్ రెడ్డి. -
హ్యాపీ వెడ్డింగ్ : సంగీత్ కంటిన్యూస్
మెగా వారసురాలు నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం హ్యాపీ వెడ్డింగ్. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు లక్ష్మణ్ కర్య దర్శకుడు. సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్, పాకెట్ సినిమా బ్యానర్తో కలిసి నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతమందిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీద ట్రైలర్ను రిలీజ్ చేయించారు. రేపు తొలి సాంగ్ను రిలీజ్ చేయనున్నారు. ‘దీంతన.. తోంతన..’ అంటూ సాగే ఓ ఫంక్షన్ సాంగ్ను రేపు (గురువారం) ఉదయం రిలీజ్ చేయనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మావాడికి పెళ్లి కుదిరింది
‘మాకు బంధువులు ఎక్కువేగానీ పనులకు ఎవరూ రారు’ అనే డైలాగ్తో ‘హ్యాపి వెడ్డింగ్’ సినిమా ట్రైలర్ ప్రారంభమైంది. ‘మీ అబ్బాయిలంతా ఇంతేనా.. మేం కన్ఫామ్ చేయగానే ఎందుకు మీలో అంత మార్పు’ అంటూ సుమంత్ అశ్విన్ని నిలదీస్తున్నారు నిహారిక. ‘మా విజయవాడ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. ఏం చేసినా చాలా రొమాంటిక్గా చేస్తారు’ అని నిహారికతో అంటున్నారు సుమంత్ అశ్విన్. టోటల్గా ‘హ్యాపి వెడ్డింగ్’ ట్రైలర్లో పెళ్లి సందడి కనిపించింది. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. ‘‘పెళ్లి కుదిరిన రోజు నుంచి పెళ్లి జరిగే రోజు వరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని అందంగా చూపించాం. ప్రేక్షకులు తమని తాము చూసుకునేలా ఉంటుంది’’ అన్నారు లక్ష్మణ్ కార్య. ‘‘నిహారిక బాగా నటించారు. నా కెరీర్కి ఈ సినిమా మంచి హెల్ప్ అవుతుందనుకుంటున్నా’’ అన్నారు సుమంత్ అశ్విన్. ‘‘యూవీ క్రియేషన్స్లో మూవీ చేయడం హ్యాపీ’’ అన్నారు నిహారిక. ఈ సినిమాకు సమర్పణ: యూవీ క్రియేషన్స్, సంగీతం: శక్తికాంత్, రీ–రికార్డింగ్: ఎస్.ఎస్. తమన్, కెమెరా: బాల్రెడ్డి, నిర్మాత: పాకెట్ సినిమా. -
‘మా విజయవాడ అబ్బాయిలు చాలా రొమాంటిక్’
ఒక్కమనసు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మెగా వారసురాలు నిహారిక కొణిదెల తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల కోలీవుడ్లోనూ అడుగుపెట్టిన నిహారిక త్వరలో హ్యాపీ వెడ్డింగ్సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు లక్ష్మణ్ కర్య దర్శకుడు. యువీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల ఓ డిఫరెంట్ వీడియోతో నిహారిక ఆకట్టుకోగా చిత్ర ట్రైలర్ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియా పేజ్ ద్వారా రిలీజ్ చేశారు. ఫిదా ఫేం శక్తికాంత్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. -
నా పెళ్లి గురించి మీకెందుకు : నిహారిక
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి వార్తలపై ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను యూవీ క్రియేషన్స్ యూట్యూబ్లో షేర్ చేసింది. ఓ వ్యక్తి మేడమ్ మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం.. మీ వెడ్డింగ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. దీనిపై ఏమైనా చెబుతారా అని అడగగా.. నిహారిక స్పందిస్తూ.. ‘అసలు ఎవరు నిన్ను లోనికి రానిచ్చింది. నా పెళ్లి గురించి మీకెందుకయ్యా.. నిహారిక ఎవర్ని చేసుకుంటుంది, ఎప్పుడు చేసుకుంటుంది,ఎందుకు చేసుకుంటుంది.. చూస్తే షాక్ అవుతారు.. షేక్ అవుతారు.. కిందపడి లేస్తారు.. పిచ్చా మీకేమైనా.. మీ థంబ్ నెయిల్స్ కోసం నన్ను వాడుకుంటారా’ అంటూ అతనిపై విరుచుకుపడ్డారు. తర్వాత అతడు మేము అడుగుతుంది మీ హ్యాపి వెడ్డింగ్ మూవీ గురించి మేడమ్ అని చెప్పగా.. నిహారిక సారీ చెప్పారు. ఆమె మాట్లాడుతూ.. హ్యాపి వెడ్డింగ్ ట్రైలర్ జూన్ 30న రిలీజ్ కాబోతుందన్నారు. అప్పుడు సినిమా రిలీజ్ ఎప్పుడో చెబుతామంటూ.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. హ్యాపి వెడ్డింగ్ చిత్ర ప్రమోషన్ కోసం రూపొందించిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. యూవీ క్రియేషన్ బ్యానర్పై తెరకెక్కిన చిత్రంలో సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటించారు. ఈ చిత్ర ట్రైలర్ను శనివారం ఉదయం 10.35 గంటలకు విడుదల చేయనున్నారు. -
నా పెళ్లి గురించి మీకెందుకు..?
-
ఇద్దరు భామలతో ‘ప్రేమ కథా చిత్రం 2’
సుధీర్ బాబు, నందితలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా ప్రేమకథా చిత్రం. మారుతి కథ అందించిన ఈ సినిమాకు జె ప్రభాకర్ రెడ్డి దర్శకుడు. కామెడీ హర్రర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ కావటంతో సుమంత్ అశ్విన్ హీరోగా సీక్వెల్ ను ప్రారంభించారు. ప్రేమ కథా చిత్రం 2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ త్వరలోనే పట్టాలెక్కనుందని తెలుస్తోంది. హరి కిషన్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఒక హీరోయిన్గా జంబ లకిడి పంబ ఫేం సిద్ధి ఇద్నాని నటిస్తుండగా మరో హీరోయిన్ గా ఎక్కడికి పోతావు చిన్నావాడా ఫేం నందిత శ్వేత నటించనుంది. ప్రేమ కథా చిత్రానికి నిర్మాతగా వ్యహరించిన సుదర్శన్ రెడ్డి సీక్వెల్ను కూడా నిర్మిస్తున్నారు. -
నిహారిక కొత్త సినిమా ఓపెనింగ్
హీరోయిన్గా నిలదొక్కుకునేందుకు మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల కష్టపడుతున్నారు. ఒక్క మనసు సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ భామ, ఇటీవల స్పీడు పెంచారు. కోలీవుడ్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్న నిహారిక ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. సుమంత్ అశ్విన్కు జోడిగా తెరకెక్కిన హ్యాపీ వెడ్డింగ్ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతుంది. హ్యాపీ వెడ్డింగ్ సెట్స్మీద ఉండగానే మరో రెండు సినిమాలను ప్రారంభించారు నిహారిక. శ్రియతో కలిసి నటిస్తున్న ఓ లేడీ ఓరియటెండ్ సినిమా ఇటీవల ప్రారంభం కాగా.. ఈరోజు (శనివారం) ఉదయం మరో సినిమాను ప్రారంభించారు. రాహుల్ విజయ్ హీరోగా ప్రణీత్ బ్రహ్మండపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. డిస్టిబ్యూషన్ రంగంలో మంచి అనుభవమున్న నిర్వాణ సినిమాస్ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సుమంత్ అశ్విన్, నిహారికల ‘హ్యాపి వెడ్డింగ్’ టీజర్ విడుదల
-
‘హ్యాపి వెడ్డింగ్’.. ఫస్ట్ ఇన్విటేషన్
‘తూనీగ తూనీగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చా రు స్టార్ ప్రొడ్యూసర్ ఎమ్ ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్. లవర్స్, కేరింత లాంటి విజయవంతమైన చిత్రాలు అతని ఖాతాలో ఉన్నప్పటికీ గత కొంతకాలం పాటు సరైన హిట్లేక వెనుకబడ్డారు. అయితే ప్రస్తుతం ఈ కుర్ర హీరో ‘హ్యాపి వెడ్డింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను ‘ఫస్ట్ ఇన్విటేషన్’ పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్గా నటిస్తున్నారు. ‘ఒక మనసు’తో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు నిహారిక. కమర్షియల్గా ఆ సినిమా విజయవంతం కాకపోయినా నటన పరంగా నిహారికకు మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా తరువాత మళ్లీ తెలుగులో ఇంకో సినిమా చేయలేదు. తమిళంలో విజయ్సేతుపతితో కలిసి ఓ సినిమా చేసినా, అది తెలుగులో విడుదల కాలేదు. అయితే ఈ ‘హ్యాపి వెడ్డింగ్’ సినిమా నిహారికకు, సుమంత్కు విజయం అందిస్తుందో లేదో వేచి చూడాలి. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ను జూన్ 30న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. Wedding shenanigans begin💍@UV_Creations & #PocketCinema cordially invites you to the #HappyWedding of #SumanthAshwin @IamNiharikaK. With best compliments from @lakshmankarya Sangeet by #ShakthiKarthik & @musicthaman 🎶#HappyWeddingFirstInvitationhttps://t.co/ro4nifDBex — UV Creations (@UV_Creations) June 21, 2018 -
పెళ్లి కుదిరాక...
‘‘పెళ్లి కుదిరిన రోజు నుంచి పెళ్లి జరిగే వరకూ రెండు కుటుంబాల మనసుల్లో ఏం జరుగుతుందో మా సినిమాలో చూపించాం’’ అంటున్నారు ‘హ్యాపి వెడ్డింగ్’ చిత్రబృందం. సుమంత్ అశ్విన్, నిహారికా జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా నిర్మిస్తున్న చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్’. ‘ఫిదా’ ఫేమ్ శక్తికాంత్ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు తమన్ రీ–రీకార్డింగ్ చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యూవీ క్రియేషన్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్తో కలసి ఈ సినిమా చేస్తున్నాం. లక్ష్మణ్ విజన్ ఉన్న దర్శకుడు. ఇప్పుడీ ప్రాజెక్ట్లోకి తమన్ ఎంటర్ అయ్యారు. తనదైన రీ–రికార్డింగ్తో ఆడియన్స్ను మెస్మరైజ్ చేయనున్నారు. త్వరలోనే సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. -
నవ్వు.. భయం.. ఖాయం
‘ప్రేమకథా చిత్రమ్, జక్కన్న’ వంటి హిట్స్ అందించిన ఆర్పీఏ క్రియేషన్స్ ప్రస్తుతం ‘ప్రేమకథా చిత్రమ్ 2’ రూపొందించనుంది. ‘బ్యాక్ టు ఫియర్’ అన్నది క్యాప్షన్. సుమంత్ అశ్విన్ హీరోగా హరికిషన్ దర్శకత్వంలో ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సీనియర్ డైరెక్టర్ సాగర్ క్లాప్ ఇవ్వగా, అమరేందర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. అఖిల్ రెడ్డి తొలి సన్నివేశానికి డైరెక్షన్ చేశారు. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రేమకథా చిత్రమ్’ హిలేరియస్ కామెడీతో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్గా ‘ప్రేమకథా చిత్రమ్ 2’ ప్రారంభించాం. హరికిషన్ను దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. కామెడీ ఎంటర్టైనర్గా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కథ ఇది. మా బ్యానర్లో మరో సూపర్ హిట్ చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాం. కెమెరామెన్ సి.రాంప్రసాద్, ఎడిటర్ ఉద్ధవ్, సంగీత దర్శకుడు జేబీ, డైలాగ్ రైటర్ చంద్రశేఖర్ లాంటి టెక్నీషియన్స్ మెయిన్ పిల్లర్స్గా ఈ సినిమా రూపొందిస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: ఆయుష్ రెడ్డి, ఆర్.పి. అక్షిత్ రెడ్డి. -
వేసవిలో వెడ్డింగ్
సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా రూపొందిన సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్’. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాని వేసవికి విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. పెళ్లి కుదిరిన రోజు నుంచి జరిగే వరకూ ఉన్న టైమ్లో రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని లక్ష్మణ్ చక్కగా తెరకెక్కించాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవం జరిగి ఉంటుంది. ఆయా పాత్రల్లో ప్రేక్షకులు తమని తాము చూసుకునేలా ఉంటుంది. సుమంత్ అశ్విన్, నిహారిక చక్కగా నటించారు. ‘ఫిదా’ ఫేమ్ శక్తికాంత్ కార్తీక్ మా సినిమాకి పాటలు అందించారు. త్వరలోనే టీజర్ని రిలీజ్ చేస్తాం. ఈ సమ్మర్కి చక్కని ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా మా సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. నరేశ్, మురళీ శర్మ, పవిత్ర లోకేష్, తులసి, ఇంద్రజ, మధుమణి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: బాల్ రెడ్డి. -
హ్యాపీ వెడ్డింగ్!
యంగ్ హీరో సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమా తెరకెక్కనుంది. వరుస విజయాలు సాధిస్తున్న యూవీ క్రియేషన్స్.. పాకెట్ సినిమాతో కలసి నిర్మించనున్న ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘క్రేజీ బ్యానర్ యూవీ క్రియేషన్స్తో అసోసియేట్ కావడం హ్యాపీగా ఉంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రమిది. కథ చెప్పగానే సుమంత్ అశ్విన్, నిహారిక ఎక్సైట్ అయ్యారు. రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి హైలెట్గా నిలుస్తుంది. అక్టోబర్ 4న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా తెరకెక్కిస్తాం’’ అన్నారు. నరేశ్, మురళీ శర్మ, పవిత్రా లోకేష్, తులసి, నిరోష తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: బాలరెడ్డి. -
మెగా డాటర్ 'హ్యాపీ వెడ్డింగ్'
స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన భామ నిహారిక. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ భామ ముందు యాంకర్ గా బుల్లితెర మీద సత్తా చాటి.. తరువాత ఒక మనసు సినిమాతో హీరోయిన్ పరిచయం అయ్యింది. అయితే తొలి సినిమా నిరాశపరచటంలో లాంగ్ గ్యాప్ తీసుకున్న నిహారిక తన రెండో సినిమా ను గత జూన్ లో ప్రారంభించింది. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ప్రారంభించనుంది. సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కుతున్న హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో నిహారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సమర్పణలో పాకెట్ సినిమా సంస్థ నిర్మిస్తోంది. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అవుతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. -
ఆయన సినిమాలన్నీ నా లైబ్రరీలో ఉన్నాయి
► నిర్మాత శ్యామ్ప్రసాద్రెడ్డి ‘‘నేను చిత్ర పరిశ్రమకు రావాలనుకున్నప్పుడు వంశీగారి సినిమాలనే ఎక్కువగా చూశా. ప్రతి పాత్రలో తెలుగుదనాన్ని చూపిస్తారు. వంశీగారికి టెక్నికల్గా మంచి నాలెడ్జ్ ఉంది. ఆయన ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన పాతిక సినిమాలు నా మూవీ లైబ్రరీలో ఉంచాను. వంశీగారి తాజా చిత్రం ‘ఫ్యాషన్ డిజైనర్’ పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు నిర్మాత శ్యామ్ప్రసాద్రెడ్డి. సుమంత్ అశ్విన్, అనీషా ఆంబ్రోస్, మనాలీ రాథోడ్, మానసా హిమవర్ష హీరో హీరోయిన్లుగా వంశీ దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘ఫ్యాషన్ డిజైనర్’. మణిశర్మ స్వరపరచిన ఈ చిత్రం పాటల్ని విడుదల చేయడంతో పాటు ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. దర్శకుడు వీవీ వినాయక్ సినిమా విడుదల తేదీ (జూన్ 2) బోర్డ్ని ఆవిష్కరించారు. సుమంత్ అశ్విన్ మాట్లా డుతూ– ‘‘లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల’ చిత్రాలు చూసి వంశీగారికి పెద్ద ఫ్యాన్ అయ్యా. ‘సితార, అన్వేషణ’ సినిమాలు చూసి, ఆయన్ను ఆరాధించడం మొదలుపెట్టా. మణిశర్మగారి ‘ఖుషి’ సినిమా పాటల్ని వెయ్యిసార్లు చూసుంటా’’ అన్నారు. ‘‘వంశీ, మణిశర్మ గారి కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. ఓ అభిమానిగా వాళ్ల కాంబినేషన్లో ‘ఫ్యాషన్ డిజైనర్’ తీశా. మణిశర్మగారు మంచి పాటలిచ్చారు. మా ‘మధుర’ ఆడియో ఆల్బమ్స్లో ఇదే బెస్ట్’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్. ‘‘వంశీగారిదో ప్రత్యేకమైన శైలి. ‘లేడీస్ టైలర్’ని ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు’’ అన్నారు వినాయక్. దర్శకుడు వంశీ, నిర్మాతలు ఎమ్మెస్ రాజు, తమ్మారెడ్డి భరద్వాజ, లగడపాటి శ్రీధర్, నటులు తనికెళ్ల భరణి, దర్శకులు బి.గోపాల్, బీవీయస్ రవి,æహీరో విజయ్ దేవరకొండ, సంగీత దర్శకుడు రఘుకుంచె తదితరులు పాల్గొన్నారు. -
‘ఫ్యాషన్ డిజైనర్ ' మూవీ స్టిల్స్
-
లేడీస్ టైలర్ కొడుకు ఫ్యాషన్ డిజైనర్
వాలు జడ, రూపాయి కాసంత బొట్టు, కళ్లకు కాటుక, కాళ్లకు పట్టీలు, ఒంటి నిండా చీర... దర్శకుడు వంశీ చిత్రాల్లో హీరోయిన్ ఇలా నిండుగా, చూడ్డానికి రెండు కళ్లూ చాలనంత అందంగా ఉంటుంది. ఆయన సినిమా మన ఇంట్లోనో.. మన పక్కింట్లోనో జరుగుతున్న కథలా ఉంటుంది. అంత సహజంగా ఉంటుంది కాబట్టే, వంశీ సినిమాకి బోల్డంత మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా వంశీ దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్న వాటిలో ‘లేడీస్ టైలర్’ ఒకటి. ఈ చిత్రం విడుదలై 30 ఏళ్లవుతోంది. ఇప్పుడు దీనికి సీక్వెల్గా వంశీ ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’ తెరకెక్కించనున్నారు. ఇందులో టైటిల్ రోల్ చేసే అవకాశం సుమంత్ అశ్విన్కి దక్కింది. వంశీ వంటి డెరైక్టర్తో సినిమా అంటే సుమంత్ అశ్విన్కి గోల్డెన్ చాన్స్ లాంటిదే. మధుర ఎంటర్టైన్ మెంట్స్పై ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ నిర్మించను న్నారు. ముగ్గురు కథా నాయికలు ఉంటారట. నవంబర్లో చిత్రాన్ని ఆరంభిం చాలనుకుంటు న్నారు. -
ఆ పాత్ర గురించి చెప్పగానే రజనీకాంత్ గుర్తొచ్చారు!
‘‘మంచి హీరో అనిపించుకునేకన్నా మంచి నటుడు అనిపించుకుంటే నాకు సంతృప్తిగా ఉంటుంది. ఎటువంటి పాత్రను అయినా చేయగలడనే గుర్తింపు ఉంటే చాలు. నా సినిమాలు చూసి, ప్రేక్షకులు ఆనందించాలనీ, తీసే నిర్మాతలు లాభపడాలని కోరుకుంటా’’ అని సుమంత్ అశ్విన్ అన్నారు. మను దర్శకత్వంలో ఆయన నటించిన ‘రైట్ రైట్’ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ చెప్పిన విశేషాలు... ♦ గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రం ‘రైట్ రైట్’. ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్లో ఊహకందని అంశాలుంటాయి. ఇందులో పోలీస్ అవుదామని శాయశక్తులా ప్రయత్నించి, చివరకు బస్ కండక్టర్ అవుతాను. కండక్టర్ పాత్ర అని దర్శకుడు చెప్పగానే రజనీకాంత్ గారు గుర్తొచ్చారు. కండక్టర్గా ఆయన జీవితం మొదలై, సూపర్ స్టార్ స్థాయికి ఎదిగింది. రజనీగారి సినిమాలు చాలా చూశాను. ♦ వాస్తవానికి సెకండాఫ్ కథ విన్నప్పుడు నాకు భయమేసింది. ఆ సీన్స్లో నటించేందుకు నేను, ప్రభాకర్ షాట్ షాట్కి మధ్య పది నిముషాలు టైమ్ తీసుకుని, డిస్కస్ చేసుకుని నటించాం. కన్నీళ్ల కోసం గ్లిజరిన్ వాడకుండా న్యాచురల్గా నటించాం. ఓ సీన్లో ప్రభాకర్గారి ఎమోషనల్ డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ చూసి యూనిట్ మొత్తానికి కన్నీళ్లొచ్చాయి. ఇప్పటివరకూ విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రభాకర్ మెప్పించారు. ఈ సినిమా చూసినవాళ్లు ఆయన ఎలాంటి పాత్రైనా చేయగలరని అంటారు. డెరైక్టర్ మను వెరీ టాలెంటెడ్. ఈ చిత్రకథను అద్భుతంగా తెరకెక్కిం చారు. వంశీకృష్ణగారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ♦ ‘శ్రీమంతుడు’ని చూసి, అందులో మహేశ్బాబుగారు చెప్పిన ‘రైట్ రైట్’ డైలాగ్ నచ్చి, ఈ చిత్రానికి టైటిల్ పెట్టామన్నది కొంతమంది ఊహ. అయితే, స్క్రిప్ట్ చదివినప్పుడే నాన్నగారు టైటిల్ చెప్పేశారు. మేము రిజస్టర్ చేయించిన ఏడాది తర్వాత ‘శ్రీమంతుడు’ వచ్చింది. ♦ కథల ఎంపిక విషయంలో మా నాన్న (ఎమ్మెస్ రాజు)గారి జోక్యం ఉంటుందని, ముందు ఆయనే వింటారని కొంతమంది అనుకుంటున్నారు. కానీ, ఏ కథ అయినా మొదట నేనే వింటా. నాకు నచ్చితే నాన్నగారితో డిస్కస్ చేస్తా. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్, జడ్జ్మెంట్ నాకు హెల్ప్ అవుతాయి. ఆ తరువాత ఏమైనా మార్పులు, చేర్పులు అవసరమైతే ఆయన చెబుతుంటారు. ♦ ప్రస్తుతం నా బాడీ లాంగ్వేజ్కు తగ్గ కథలు ఎంచుకుంటున్నా. ఇప్పుడు కాలేజీ కుర్రాడిగా చేయగలను కానీ పదేళ్ల తర్వాత చేయలేను కదా? ఇప్పుడే యాక్షన్ అంటూ నేను ఓ వందమందిని కొడితే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరు. మొదట్లో ఆమిర్ఖాన్, సూర్య వంటి వారు మామూలు చిత్రాలు చేసి, ఆ తరువాత మాస్ హీరోలుగా ఎదిగారు. ఇప్పుడు వారు ఏ చిత్రం చేసినా అవి చూసి సపోర్ట్ చేసే ఫ్యాన్స్ ఉన్నారు. నేనూ ఆ స్థాయికి చేరుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. ♦ ఇటీవల ‘ద్రోణ’ చిత్ర దర్శకుడు జె.కరుణ్ కుమార్ చెప్పిన కథ నచ్చింది. నా తదుపరి చిత్రం ఆయన దర్శకత్వంలోనే ఉంటుంది. -
మా కెమిస్ట్రీ కుదిరింది!
‘‘పోలీస్ కావాలని హైదరాబాద్కొచ్చా. ఉద్యోగం ఇప్పిస్తామంటూ చాలామంది నన్ను మోసం చేశారు. కానీ, దేవుడు మాత్రం మోసం చేయకుండా నటుడిగా ఈ స్థాయికి చేరుకునేలా చేశాడు. రాజమౌళిగారు ‘మర్యాద రామన్న’, ‘బాహుబలి’లో నాకు మంచి గుర్తింపు తెచ్చే పాత్రలు ఇచ్చారు’’ అని ‘బాహుబలి’ ఫేం ప్రభాకర్ అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా మను దర్శకత్వంలో జె. వంశీకృష్ణ నిర్మించిన ‘రైట్ రైట్’ ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన ప్రభాకర్ మాట్లాడుతూ - ‘‘ ‘బాహుబలి’ తర్వాత నేను చేసిన ఫుల్లెంగ్త్ మూవీ ఇదే. సాధారణంగా హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుంది అంటారు. కానీ, ఈ చిత్రంలో నాకు, సుమంత్ అశ్విన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. సుమంత్ డ్రైవర్.. నేను కండక్టర్. ఇందులో డ్యాన్స్ చేశా. డ్రైవర్లు, కండెక్టర్లు, మెకానిక్లు తప్పక చూడాల్సిన సినిమా ఇది. నిర్మాత ఎమ్మెస్ రాజుగారు, దర్శకుడు మను నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇటీవల గోవాలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’కి వెళ్లినప్పుడు విదేశీయులు కూడా నా నటన మెచ్చుకుంటుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ప్రస్తుతం గోపీచంద్ ‘ఆక్సిజన్’లో విలన్గా, మలయాళంలో మోహన్లాల్ చిత్రంలో ప్రధానపాత్ర చేస్తున్నా. ఇంకా ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’, ‘కాలకేయ వర్సెస్ కాట్రవల్లి’, కన్నడంలో మూడు సినిమాలు చేస్తున్నా’’ అని చెప్పారు. -
మరో కథకు రైట్ రైట్ !
‘రైట్ రైట్’ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న సుమంత్ అశ్విన్ మరో చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. నితిన్ నటించిన ‘ద్రోణ’ చిత్రాన్ని తెరకెక్కించిన కరుణకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ‘సూర్య వెర్సస్ సూర్య’, ‘శౌర్య’ చిత్రాలను నిర్మించిన మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘సుమంత్ అశ్విన్తో సరికొత్త కథాకథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం. సుమంత్ కెరీర్లో మరో మంచి చిత్రంగా నిలిచిపోతుంది. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. -
బస్సులో మిస్సుతో...!
ఓ లక్ష్యాన్ని సాధించడానికి తపన పడే ఒక యువకుడు అనుకోకుండా బస్ కండక్టర్ అవుతాడు. ఆ బస్లో అతనికో మిస్సు పరిచయమవుతుంది. ఆమెతో ఈ కండక్టర్కు ఎలాంటి అనుబంధం ఏర్పడింది? చివరకు ఏమైంది? తెలియాలంటే మా ‘రైట్ రైట్’ చిత్రం చూడాల్సిందే అంటున్నారు హీరో సుమంత్ అశ్విన్. మను దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా శ్రీసత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం జూన్ 10న విడుదల కానుంది. ‘బాహుబలి’ ప్రభాకర్ ఇందులో ప్రధాన పాత్ర చేశారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘నేనిప్పటివరకూ చేసిన పాత్రల్లో ఇందులో చాలా భిన్నమైన పాత్ర చేశా. నా క్యారెక్టర్ చాలా సహజంగా ఉంటుంది. ఈ చిత్రం షూటింగ్ ఎంజాయ్ చేస్తూ చేశా. మొదటి భాగం వినోదాత్మకంగా, రెండో భాగం మిస్టరీగా ఉంటుంది’’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఎస్.కోట నుంచి గవిటికి వెళ్లే ఆర్టీసీ బస్ది ఈ చిత్రంలో కీలక పాత్ర. కామెడీ, లవ్, మిస్టరీ అంశాలతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. సుమంత్ అశ్విన్ కెరీర్లో చెప్పకోదగ్గ చిత్రం అవుతుంది. ప్రభాకర్ పాత్ర ఇందులో హైలెట్గా నిలుస్తుంది. జె.బి. స్వర పరచిన పాటలకు అనూహ్య స్పందన వస్తోంది. అన్నివర్గాల వారు చూసేలా తీర్చిదిద్దిన ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. నాజర్, ధన్రాజ్, షకలక శంకర్, తాగుబోతు రమేశ్, జీవా, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: శేఖర్ వి.జోసఫ్, సహ నిర్మాత జె.శ్రీనివాస రాజు, సమర్పణ: వత్సవాయి వెంకటేశ్వర్లు. -
పక్కింటి అబ్బాయిలా ఉంటాడు
- దాసరి నారాయణరావు ‘‘ఈ చిత్రం పాటలు విన్నా. ఈ మధ్య ఇంత మెలోడీ పాటలున్న సినిమా ఏదీ రాలేదు. సుమంత్ అశ్విన్ పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. కొన్ని సీన్స్ చూశా. బాగున్నాయి. హీరోకు కావాల్సిన లక్షణాలన్నీ అశ్విన్లో ఉన్నాయి. విలన్ పాత్రలో నటించే ప్రభాకర్ను చూస్తే చాలా సెన్సిటివ్ అనిపిస్తోంది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా ఝవేరి జంటగా ‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధాన పాత్రలో మను దర్శకత్వంలో శ్రీసత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తోన్న చిత్రం ‘రైట్... రైట్’. జె.బి. స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. దాసరి నారాయణరావు బిగ్ సీడీ, పాటల సీడీ ఆవిష్కరించి దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత ఎంఎస్ రాజుకు అందించారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రం పోస్టర్ చూస్తుంటే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ గుర్తుకొస్తోంది. సుమంత్ అశ్విన్ బాగా నటిస్తున్నాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. దర్శకునిగా పరిచయమవుతున్న మనుకు ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘డ్రైవర్కు, కండక్టర్కు మధ్య జరిగే కథే ఈ చిత్రం. ఈ కథ మొదట ఎంఎస్ రాజుగారికే చెప్పా. ఆయనకు నచ్చి ఈ సినిమా చేసే అవకాశం కల్పించారు. నటీనటులు, టెక్నీషియన్లు నాకు బాగా సపోర్ట్ చేశారు’’ అని దర్శకుడు మను తెలిపారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘‘క్షణం’, ‘ఊపిరి’వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులు, కొత్త కాన్సెప్ట్తో వస్తోన్న మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారనే నమ్మకముంది’’ అని చెప్పారు. దర్శకులు బి.గోపాల్, కోదండ రామిరెడ్డి, నిర్మాత ‘దిల్’ రాజు, సహ నిర్మాత ఎమ్వి నరసింహులు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత జె.శ్రీనివాస రాజు, సంగీత దర్శకుడు కోటి, నటుడు సీనియర్ నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బస్సులో ప్రేమ కహానీ!
అతనో బస్ కండక్టర్. ఎస్. కోట నుంచి గవిటి వెళ్లే రూట్లో డ్యూటీ. బస్సు జర్నీలోనే ఓ బ్యూటీతో ప్రేమలో పడ్డాడు. ఆమెతో తన లవ్ను కూడా రైట్..రైట్ అనిపించు కున్నాడు. ఈ ఇద్దరి ప్రేమ ప్రయాణంతో పాటు అంతు చిక్కని మిస్టరీ కూడా ఈ సినిమాలో ఉంటుందంటోంది ‘రైట్ రైట్’ సినిమా టీమ్. సుమంత్ అశ్విన్, పూజా ఝవేరీ జంటగా మను దర్శకత్వంలో జె. వంశీకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత, సుమంత్ అశ్విన్ తండ్రి ఎమ్మెస్ రాజు బర్త్డే సందర్భంగా మంగళవారం ఈ చిత్రం మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ- ‘‘సుమంత్ అశ్విన్ కె రీర్లోనే చెప్పుకునే చిత్రమవుతుంది. మేకింగ్ వీడియో ప్రామిసింగ్గా ఉంది’’ అన్నారు. ‘‘నాన్న గారి బర్త్డేకి మేకింగ్ వీడియో విడుదల చేయడం హ్యాపీగా ఉంది’’ అని సుమంత్ అశ్విన్ అన్నారు. ‘‘ఈ నెల 15న పాటలను రిలీజ్ చేస్తాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రా నికి సంగీతం: జె.బి, కెమెరా: శేఖర్ వి. జోసఫ్, సహ నిర్మాత: జె.శ్రీనివాసరాజు, సమర్పణ: వత్సవాయి వెంకటేశ్వర్లు. -
అల్లి బిల్లి చెక్కిలి గిల్లి... చాలా బాగుంది!
- హీరో రామ్ ‘‘‘తొలి చిత్రం నుంచి సుమంత్ అశ్విన్ నటనలో వైవిధ్యం చూపిస్తున్నాడు. ఈ సినిమా తన కెరీర్కు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు విడుదల చేసిన ఈ పాట బాగుంటుంది. ముఖ్యంగా ఈ పాటలో అశ్విన్తో పాటు ప్రభాకర్ స్టెప్స్ వేయడం సరదాగా ఉంది’’ అని రామ్ అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా ఝవేరీ జంటగా ‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘రైట్... రైట్’. మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ ఈ చిత్రం నిర్మించారు. జె.బి. స్వరపరచిన ఈ చిత్రంలోని ‘అల్లి బిల్లి చెక్కిలి గిల్లి.. రెక్కలే విప్పెను లిల్లి’ అనే తొలి పాట వీడియోను సోమవారం హీరో రామ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘అప్పుడప్పుడూ లుంగీతో నాన్నగారు ఇంట్లో సరదాగా స్టెప్స్ వేస్తుంటారు. లుంగీలో అంత క్యాజువల్గా ఎలా డ్యాన్స్ చేయగలుగుతారా? అనిపించేది. ఇప్పుడీ సినిమాలో నేను కూడా లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేశా. లుంగీలో డ్యాన్స్ ఇదే ఫస్ట్ టైమ్. ఈ సినిమా అధిక భాగం చిత్రీకరణ అరకులో జరిపాం. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తర్వాత అరకు అంత అందంగా కనిపించేది ఈ సినిమాలోనే’’ అని చెప్పారు. తొలి సగం వినోదాత్మంగా, మలి సగం మిస్టరీతో ఈ చిత్రం ఉత్కంఠగా సాగుతుందని దర్శకుడు అన్నారు. మే 7న పాటలను విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. ఈ కార్యక్రమంలో నటుడు ‘బాహుబలి’ ప్రభాకర్, సంగీత దర్శకుడు జేబీ, చిత్ర సమర్పకుడు వత్సవాయి వెంకటేశ్వర్లు, సహ నిర్మాత జె.శ్రీనివాసరాజు, ఆదిత్యా మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎక్స్ట్రార్డినరి!
ఆ కుర్రాడో బస్ కండక్టర్. ఎస్. కోట నుంచి గవిటికి వెళ్లే ఓ ఆర్టీసీ బస్సులో బాధ్యతలు నిర్వహిస్తుం టాడు. ఆ బస్డ్రైవరూ, ఈ కండక్టరూ బాగా దోస్తులు అయిపోతారు. ఆ బస్ రూట్లో ఎన్ని మలుపులు ఉంటాయో- ఈ కండక్టర్ లైఫ్లో కూడా అన్ని మలుపులు ఉంటాయి. ఆర్డినరీ బస్సులో జాబ్ చేసే ఈ కుర్రాడి లైఫ్ ఎక్స్ట్రార్డినరీ కావడానికి ఓ అమ్మాయి ప్రేమ కారణమవుతుంది. అదేంటో తెలియాలంటే ‘రైట్ రైట్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు మను. సుమంత్ అశ్విన్, పూజా ఝవేరీ, ‘బాహుబలి’ ఫేమ్ ప్రభాకర్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తు న్నారు. ఇటీవల కేరళలో జరిపిన షెడ్యూల్స్లో చిత్రీకరణ మొత్తం పూర్తయిందనీ, మే నెలాఖరున గానీ , జూన్ ప్రథమార్ధంలో గానీ చిత్రాన్ని విడుదల చే స్తామని నిర్మాతలు తెలిపారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ఆర్డినరీ’ ఆధారంగా ఈ సినిమా రూపొందించామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: వత్సవాయి వెంకటేశ్వర్లు, సహ నిర్మాత: జె. శ్రీనివాసరాజు. -
రైట్ రైట్ అంటూ విజిలేసిన సునీల్!
‘‘ఎమ్మెస్ రాజుగారు నిర్మించిన ‘మనసంతా నువ్వే’ సినిమాతో నా కెరీర్కు బలమైన పునాది పడింది. ఆ సినిమా అప్పట్నుంచీ సుమంత్ అశ్విన్ నాకు బాగా క్లోజ్. ఎమ్మెస్ రాజుగారు జస్ట్ స్టార్స్ని సూపర్ స్టార్స్ని చేశారు. సుమంత్ అశ్విన్ కూడా స్టార్ హీరో కావాలని కోరకుంటున్నా’’ అని హాస్యనటుడు, హీరో సునీల్ అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె. వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘రైట్ రైట్’. ఈ చిత్రం మోషన్ పోస్టర్ను సునీల్ రైట్ రైట్ అంటూ విజిల్ ఊది, ఆవిష్కరించారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘నా చిన్నతనంలో షూటింగ్స్కు వె ళ్లినప్పుడు సునీల్ని బాగా గమనించేవాణ్ణి. ఈ చిత్రంలో ప్రభాకర్, నా కాంబినేషన్లో వచ్చే సీన్స్ కొత్తగా ఉంటాయి’’ అని తెలిపారు. ‘మర్యాద రామన్న’ సినిమా సమయంలో సునీల్ సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ‘రైట్ రైట్’ నాకు బ్రేక్నిస్తుంది’’ అని ‘కాలకేయ’ ప్రభాకర్ అన్నారు. మార్చి 9 వరకు జరిపే షెడ్యూల్తో ఓ పాట మినహా సినిమా పూర్తవుతుందనీ, ఏప్రిల్లో పాటలనూ, మేలో చిత్రాన్నీ విడుదల చేస్తామని జె. వంశీకృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జె.బి, పాటలు: శ్రీమణి, కెమెరా: శేఖర్ వి.జోసఫ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జె .శ్రీనివాసరాజు, కో-ప్రొడ్యూసర్: ఎం.వి. నరసింహులు.