Sunny Leone
-
ముంబైలో ఆఫీస్ కొన్న సన్నీ లియోన్: ఎన్ని కొట్లో తెలుసా?
సినీతారలు, క్రికెటర్స్ లేదా పారిశ్రామిక వేత్తలు చాలామంది ఎప్పటికప్పుడు ఖరీదైన వాహనాలు, ప్లాట్స్ వంటివి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది ముంబై వంటి అభివృద్ధి చెందిన నగరాల్లో ఆస్తులను కొనుగోలు చేశారు. తాజాగా ఈ జాబితాలోకి నటి 'సన్నీ లియోన్' (Sunny Leone) కూడా చేరింది. కోట్ల రూపాయలు వెచ్చించి ఓ కమర్షియల్ బిల్డింగ్ కొనుగోలు చేసింది.బర్త్ డే సాంగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా పాపులర్ అయిన సన్నీ లియోన్.. ముంబైలోని ఓషివారాలో రూ. 8 కోట్లకు ఆఫీస్ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు స్క్వేర్ యార్డ్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ వెల్లడించింది. ఇక్కడే ఆమె తన కార్యకలాపాలను కొనసాగించే అవకాశం ఉంది.బిగ్ బి, అజయ్ దేవగన్, కార్తీక్ ఆర్యన్ కార్యాలయాలు ఉన్న భవనంలోనే సన్నీ లియోన్ కార్యాలయాన్ని కొనుగోలు చేసింది. ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. కొనుగోలుకు సంబంధించిన లావాదేవీ ఫిబ్రవరి 2025లో జరిగినట్లు సమాచారం.సన్నీ లియోన్ ఆస్తిని.. ఆనంద్ కమల్నాయన్ పండిట్ & రూపా ఆనంద్ పండిట్ యాజమాన్యంలోని ఐశ్వర్య ప్రాపర్టీ అండ్ ఎస్టేట్స్ నుంచి కొనుగోలు చేసింది. ఆనంద్ పండిట్.. టోటల్ ధమాల్, చెహ్రే మరియు ది బిగ్ బుల్ వంటి చిత్రాలను నిర్మించారు.ఇదీ చదవండి: కొత్త బిజినెస్లోకి అనన్య బిర్లా: ఇషా అంబానీకి పోటీ!?సన్నీ లియోన్ కొనుగోలు చేసిన ఆఫీస్ స్థలంలో 176.98 చదరపు మీటర్ల (1,904.91 చదరపు అడుగులు) కార్పెట్ ఏరియా, 194.67 చదరపు మీటర్ల (2,095 చదరపు అడుగులు) బిల్ట్ అప్ ఏరియా వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఈ లావాదేవీకి రూ. 35.01 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు, మరో రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. -
హైదరాబాద్ లో సన్నీ లియోన్ సందడి (ఫొటోలు)
-
కలర్ఫుల్ శారీలో హన్సిక.. సాక్షి అగర్వాల్ స్మైలీ లుక్స్!
మూవీ షూట్లో బిజీగా సన్ని లియోన్..ఈవెంట్లో మెహరీన్ ఫిర్జాదా సందడి..కలర్ఫుల్ శారీలో హన్సిక పోజులు..ఖుషీ కపూర్ ఫ్యాషన్ డ్రెస్ లుక్స్..బుల్లితెర భామ తేజస్వినీ గౌడ్ లేటేస్ట్ పిక్స్..బిగ్ బాస్ బ్యూటీ దివి అలాంటి లుక్..పింక్ శారీలో సాక్షి అగర్వాల్ స్మైలీ లుక్స్.. View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
సన్నీలియోన్, అషు నటిస్తున్న 'త్రిముఖ' పోస్టర్ రిలీజ్
నటుడు యోగేష్ కల్లే పాన్ ఇండియా చిత్రం "త్రిముఖ" (Trimukha Movie)తో హీరోగా తెరంగేట్రం చేస్తున్నారు. ఇందులో సన్నీ లియోన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో నాజర్, CID ఫేమ్ ఆదిత్య శ్రీవాస్తవ్, సుమన్, మొట్ట రాజేంద్రన్, ప్రవీణ్, అషు రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రధాన షూటింగ్ పూర్తి చేసుకున్న "త్రిముఖ" ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ఏడాది మార్చిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఇది ఆకట్టుకుంటోంది.యోగేష్ కల్లే.. "త్రిముఖ"తో పాటు "చాణుక్యం", "బెజవాడ బాయ్స్" అనే మరో రెండు చిత్రాలకు సంతకం చేశారు. హెబ్బా పటేల్ కథానాయికగా నటిస్తున్న "చాణుక్యం" చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది, ఇందులో మోటా రాజేంద్రన్, సుమన్, వినోద్ కుమార్, ధన్య బాలకృష్ణ, శ్రావణ్, నాగ మహేష్, ప్రభాకర్ వంటి వారు సహాయక పాత్రలు పోషిస్తున్నారు. "బెజవాడ బాయ్స్" చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. త్రిముఖ విషయానికి వస్తే.. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజేష్ నాయుడు, శ్రీదేవి మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. అకీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్పై హర్ష కల్లే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Cine Digital (@cine_digital_tfi)చదవండి: సంక్రాంతికి కొత్త కారు కొన్న బ్యూటీ.. భర్తతో జాలీగా.. -
సన్నీ లియోన్ పేరిట మోసం
నటి సన్నీ లియోన్ పేరును ఉపయోగించుకుని ప్రభుత్వం నుంచి నెలకు వెయ్యి రూపాయలు పొందుతున్న వ్యక్తిని అధికారులు గుర్తించారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలలో ఇలాంటి మోసం జరిగిందని తెలియడంతో అందరూ షాక్ అయ్యారు. ఛత్తీస్గఢ్లో అర్హత కలిగిన వివాహిత మహిళల కోసం ఆర్థిక సహాయ చేసేందుకు 'మహతారీ వందన్ యోజన'పథకాన్ని ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. అయితే, కొందరు దీనిని ఆసరా చేసుకుని తప్పుడు పత్రాలు అందించి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు.ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలోని తాలూర్ గ్రామానికి చెందిన వీరేంద్ర జోషి ఈ మోసానికి పాల్పడ్డాడు. సన్నీ లియోన్ పేరు మీద బ్యాంక్ ఖాతా తెరిచి, అందులో జమ అయ్యే 1,000 మొత్తాన్ని తన జేబులో వేసుకున్నాడు. తాజాగా మహిళల ఖాతాలను అధికారులు పరిశీలిస్తుండగా అందులో సన్నీలియోన్ పేరు ఉండడాన్ని గుర్తించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై లోతుగా విచారణ జరిపి బ్యాంకు ఖాతాను కలెక్టర్ హరీస్ సీజ్ చేశారు. అతను అందుకున్న డబ్బు రికవరీ చేయాలని మహిళా శిశు అభివృద్ధి శాఖను కలెక్టర్ ఆదేశించారు. మహిళలందరికీ వర్తించే మహతారీ వందన్ యోజన పథకంలో అతను మోసానికి పాల్పడ్డాడని పోలీసులు కేసు నమోదు చేశారు. సన్నీ లియోన్ పేరుతో బ్యాంకు ఖాతాకు అనుమతి ఇచ్చిన బ్యాంక్ అధికారులతో పాటు ప్రభుత్వ పథకం మంజూరు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.ఈ వార్త వెలుగులోకి రావడంతో అధికార బీజేపీపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఇరు పార్టీల మధ్య వాగ్వాదానికి దారితీసింది. 'మహతారీ వందన్ యోజన'పథకం కింద సుమారు 50 శాతం మంది లబ్ధిదారులు నకిలీలే అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ దీపక్ బైజ్ ఆరోపించారు. సన్నీ లియోన్ పేరుతో నెలకు వెయ్యి రూపాయలు అందుకున్న ఈ కేటుగాడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. -
2040లో ఏం జరుగుతుంది?
కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యుఐ: ది మూవీ’. రీష్మా నానయ్య, మురళీ శర్మ, సన్నీ లియోన్, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళీ కృష్ణ, ఇంద్రజిత్ లంకేష్ ముఖ్యపాత్రలుపోషించారు. లహరి ఫిల్మ్స్, జి. మనోహరన్ – వీనస్ ఎంటర్టైనర్స్ కేపీ శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవీన్ మనోహరన్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ‘‘ప్రపంచంలో 2040లో ఏం జరుగుతుంది? అనే నేపథ్యంలో ‘యుఐ: ది మూవీ’ కథ ఉంటుంది. చాలా విరామం తర్వాత ఉపేంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఓటీటీలో 15 రోజుల్లోనే 'సన్నీ లియోన్' సినిమా
సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై తెరకెక్కిన చిత్రం 'మందిర'. ఈ సినిమాకు ఆర్. యువన్ దర్శకత్వం వహించగా సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా ఉన్నారు. నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.సన్నీలియోన్ ఈ చిత్రంలో ఉండటంతో సోషల్మీడియాలో ప్రాజెక్ట్ గురించి భారీగానే చర్చ జరిగినప్పటికీ థియేటర్స్లలో మాత్రం పెద్దగా మెప్పించలేదు. అయితే, డిసెంబర్ 5న ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. సన్నీతో ఆటలు మీరు అనుకున్నంత ఫన్నీ కాదు.. కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ సోషల్ మీడియాలో ఆహా తెలిపింది. మందిర సినిమాలో సన్నీ లియోన్, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాలో సన్నీ లియోనీ యువరాణిగా నటించింది. సన్నీ దెయ్యం రోల్ కనిపించినప్పటికీ అక్కడక్కడా తన గ్లామర్తో కూడా కొన్ని సీన్స్లలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. -
సన్నీలియోన్ షోకు పోలీసుల అనుమతి నిరాకరణ
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్.10లోని ఇల్లీయూజన్ పబ్లో శనివారం వీకెండ్ నైట్లైఫ్లో భాగంగా ప్రముఖ బాలివుడ్ నటీ సన్నీ లియోన్ లైవ్ ఫెర్ఫార్మెన్స్ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రాత్రి 11 గంటల నుంచి 12.30 గంటల వరకు ఆమె ఈ పబ్లో ఒప్పందం ప్రకారం డీజే ప్లే చేస్తూ కుర్రకారుకు హుషారు తెప్పించాలి. ఇందుకోసం నిర్వాహకులు జూబ్లీహిల్స్ పోలీసుల అనుమతి కోరగా, ఇందుకు నిరాకరించారు. ఉదయం నుంచే సన్నీ లియోన్ రాకకోసం కుర్రకారు ఎదురు చూస్తుండగా, అనుమతి నిరాకరిస్తూ పోలీసులు ఫైల్ పక్కన పెట్టారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సన్నీ లియోన్ ప్రోగ్రామ్ నిర్వహించాలని నిర్ణయించుకున్న నిర్వాహకులు ఉన్నతాధికారులను కూడా కలిశారు. ఎలాగైనా ఆమెను పబ్కు తీసుకు రావాలని ప్రయత్నించారు. మరోవైపు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్లోకి రానివ్వొద్దంటూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పబ్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. టికెట్లు కొనుగోలు చేసిన యువతీ యువకులు రాత్రి 8 గంటల నుంచే పబ్కు చేరుకోవడం ప్రారంభించారు. ఒక వైపు పోలీసుల మోహరింపు..మరో వైపు అనుమతుల నిరాకరణ...ఇంకో వైపు హోటల్లో సన్నిలియోన్ ఎదురు చూపుల మధ్య హైడ్రామా రక్తి కట్టింది. ఈ క్రమంలో చివరకు నిర్వాహకులు సన్నీలియోన్ ఆరోగ్యం బాగాలేనందున ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినట్లు ఓ వీడియోను విడుదల చేశారు. రూ.లక్షలు పోసి టికెట్లు కొన్న యువతీ యువకులు నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అడ్డదారిలోనైనా ఆమెను తీసుకొస్తారేమోనని అనుమానించి పబ్ చుట్టూ 100 మంది పోలీసులను మోహరించారు. రాత్రి 1 గంటకు ఇక ఆమె రాదని నిర్ధారించుకున్న పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు డబ్బింగ్ సినిమా
కొరియోగ్రాఫర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా.. ఆ తర్వాత దర్శకుడిగా పలు సినిమాలు చేశాడు. ఇప్పుడు నటుడిగా బిజీ అయిపోయాడు. ఇతడు హీరోగా నటించిన ఓ తమిళ సినిమా.. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్)ప్రభుదేవా, సన్నీ లియోన్, వేదిక హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'పెట్టా రాప్'. అక్టోబరులో తమిళంలో థియేటర్లలో రిలీజ్ కాగా.. డిజాస్టర్గా నిలిచింది. ఔట్ డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. ప్రభుదేవా, వేదిక యాక్టింగ్తో పాటు సన్నీలియోన్ రోల్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది. ఇప్పుడు దీని తెలుగు వెర్షన్ నేరుగా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేశారు.'పెట్టా రాప్' విషయానికొస్తే.. బాల (ప్రభుదేవా) సినిమా యాక్టర్ కావాలనే కలతో బతుకుతుంటాడు. వందకుపైగా ఆడిషన్స్ ఇచ్చిన ఒక్క అవకాశం రాదు. ఎప్పటికీ నటుడివి కాలేవని స్నేహితులు బాలను అవమానిస్తారు. ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. జానకి (వేదిక) అనే సింగర్ ద్వారా బాల జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. బాల, జానకి మధ్య ఉన్న సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ప్రేమ విషయం.. పబ్లిక్లో ఓపెన్ అయిపోయిన రష్మిక) -
మళ్లీ పెళ్లి చేసుకున్న నటి సన్నీ లియోన్!
సన్నీ లియోన్.. ఒకప్పుడు శృంగార తార. ఇప్పుడు నటిగా గుర్తింపు తెచ్చుకుంది. చాన్నాళ్ల క్రితమే తన పాతవృత్తిని విడిచిపెట్టేసింది. ఆ తర్వాత ఓవైపు నటిస్తూనే మరోవైపు పెళ్లి చేసుకుని పిల్లల్ని కని సెటిలైపోయింది. ఆడపాదడపా ఏదో ఓ సినిమాలో కనిపిస్తున్న ఈమె.. ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకుంది. అదీ తన భర్తనే.భారత మూలాలున్న సన్నీ లియోన్.. అమెరికాకు చెందిన డేనియల్ వెబర్ని 2011లో పెళ్లి చేసుకుంది. దీని తర్వాత నిషా అనే అనాథ అమ్మాయిని ఈ జంట దత్తత తీసుకున్నారు. అనంతరం కొన్నాళ్లకు ఆషెర్, నోవా అనే ఇద్దరు మగపిల్లలు పుట్టారు. అలా కుటుంబంతో సన్నీ లియోన్ ఆనందంగా ఉంది. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ పిక్స్ పోస్ట్ చేస్తుండేది.(ఇదీ చదవండి: గౌతమ్కి 'అమ్మతోడు' సవాలు.. ఈసారి బిగ్ బాస్ నామినేషన్స్లో ఎవరెవరు?)పెళ్లయి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సన్నీ లియోన్.. కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. ఏదో సరదా కోసం అని కాకుండా పిల్లల సమక్షంలో భర్తని మరోసారి పెళ్లాడింది. తెల్లని పెళ్లి దుస్తుల్లో రెడీ అయిన సన్నీ-డేనియల్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.హిందీలో నటిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగులోనూ సన్నీ లియోన్ పలు సినిమాలు చేసింది. వీటిలో కరెంటు తీగ, జిన్నా, గరుడవేగ చిత్రాలు ఉన్నాయి. అలానే తమిళ, కన్నడ, బెంగాలీ తదితర భాషల్లోనూ నటించింది. కొన్నిసార్లు ప్రత్యేక గీతాల్లోనే తనదైన అందాల ప్రదర్శనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్) -
ఎల్లె ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2024..సందడి చేసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
వీళ్లు.. ఈ కుర్రాడి తల్లిదండ్రులా?
సోషల్ మీడియా ఎప్పటికప్పుడు కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంటుంది. కొన్నిసార్లు షాకింగ్ వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వీటిని చూసినప్పుడు ఎవరికీ ఏమాత్రం నమ్మాలని అనిపించదు.తాజాగా ఒక ఫొటో వైరల్గా మారింది. దీనిని చూసినవారు తెగ ఆశ్యర్యపోవడానికి తోడు కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఒక కుర్రాడికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫారం తెగ వైరల్ అవుతోంది. ఆ కుర్రాడు బీఏ ఆనర్స్ విద్యార్థి అని తెలుస్తోంది. అతనికి సంబంధించిన ఫారంలో తండ్రి పేరు ‘ఇమ్రాన్ హష్మీ’ అని, తల్లి పేరు ‘సన్నీ లియోన్’ అని రాసి ఉంది. వీరు బాలీవుడ్ ప్రముఖులనే విషయం తెలిసిందే.ఈ ఫోటో వైరల్ అవడానికి ఆ కుర్రాడి తల్లిదండ్రుల పేర్లే ప్రధాన కారణం. అయితే ఇది నిజమా లేక ఎవరైనా ఫోటోను ఎడిట్ చేశారా అనేది స్పష్టం కాలేదు. ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటో ఇండియన్ రేర్ ఇమేజస్ అనే పేజీ నుండి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయ్యింది. ఈ పోస్ట్ను ఇప్పటివరకూ 2 లక్షల 28 వేల మందికి పైగా యూజర్లు వీక్షించారు. ఈ పోస్ట్ చూసిన ఒక యూజర్ ఆ కుర్రాడి తాత పేరు మహేష్ భట్ అని రాయగా, మరొక యూజర్ దీనిని ఫేక్ అని పేర్కొన్నాడు.ఇది కూడా చదవండి: సహారాలో భారీ వర్షాలు.. ఆశ్చర్యపరుస్తున్న దృశ్యాలు -
సన్నీ లియోన్ షాకింగ్ లుక్.. 'క్యూజీ' ట్రైలర్ రిలీజ్
సన్నీ లియోన్, ప్రియమణి, జాకీష్రాఫ్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'క్యూజీ గ్యాంగ్ వార్'. ఈనెల 30న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతోంది. వివేక్ కుమార్ కన్నన్ దర్శకుడు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాతలు ప్రసన్నకుమార్, దామోదర్ ప్రసాద్ చేతుల మీదగా ఇది లాంచ్ అయింది.(ఇదీ చదవండి: అభిమాని కుటుంబాన్ని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి)ట్రైలర్ చూస్తుంటే ప్రధాన పాత్రధారులు ఎవరినీ గుర్తుపట్టలేం అన్నంతగా డీ గ్లామర్ లుక్లో కనిపించారు. అలానే విజువల్స్ చూస్తుంటే గతంలో వచ్చిన 'దండుపాళ్యం' సినిమా గుర్తొచ్చింది. మరి ఈ సినిమా కూడా అంత సెన్సేషన్ సృష్టించి హిట్ అవ్వాలని ట్రైలర్ ఆవిష్కరణకు విచ్చేసిన నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు.(ఇదీ చదవండి: చేదు అనుభవం.. హీరోయిన్ నమితకి గుడిలోకి నో ఎంట్రీ) -
తెలుగులో సన్నీ లియోన్, ప్రియమణి ‘క్యూజీ’
జాకీ షరఫ్, సన్నీలియోన్, ప్రియమణి, సారా అర్జున్ ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం క్యూజీ. వివేక్ కుమార్ కన్నన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని రుషికేశ్వర్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత ఎం. వేణుగోపాల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వేణు గోపాల్ మాట్లాడుతూ..క్యూజీ సినిమా తెలుగు రిలీజ్ రైట్స్ నాకు ఇచ్చినందుకు తమిళ నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. . ఈ సినిమా టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అదేవిధంగా ఇప్పుడు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. జాకీ షరాఫ్, ప్రియమణి, సన్నిలియోన్, సారా నటన సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. అతి త్వరలో సినిమాని మా మూడు సంస్థల ద్వారా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ఉంటే చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా మంచి విజయాన్ని అందిస్తారు. ఈ సినిమాను కూడా ఆదరించి పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. -
ఇప్పటికీ అలా పిలవడం బాధగా అనిపిస్తుంది: బాలీవుడ్ నటి ఆవేదన
బాలీవుడ్ నటి సన్ని లియోన్ బిగ్బాస్తో ఫేమ్ తెచ్చుకుంది. 2011లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హోస్లో అడుగుపెట్టిన ఆమె అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఆ తర్వాత జిస్మ్- 2 మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఓ రియాలిటీ షోను హోస్ట్గా వ్యవహరిస్తోన్న సన్నీ లియోన్ గతంలో తన కెరీర్ గురించి వస్తున్న కామెంట్స్పై స్పందించింది. అలాంటివీ విన్నప్పుడు తనకు బాధగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది.తాజా ఇంటర్వ్యూలో సన్నిలియోన్ మాట్లాడుతూ..' మొదట తాను ఇండియాకు వచ్చినప్పుడు నా గురించి పలు రకాలుగా మాట్లాడుకున్నారు. అడల్ట్ మూవీ స్టార్ అన్నారు. కానీ అప్పట్లో అది సాధారణ విషయమే. కానీ నేను వచ్చి ఇప్పటికీ 13 ఏళ్లు పూర్తయింది. ఇప్పుడు కూడా అలాంటి ట్యాగ్తోనే పిలుస్తుంటే బాధేస్తోంది. అలాంటి మాటలు విన్నప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పటికీ కూడా మీరు వాటిని వదలకపోతే.. మేము జీవితంలో ముందుకెలా వెళ్తాం. అది నా జీవితంలో జరిగిందని మీకు తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ మన సొంత మార్గాల్లో ఎదుగుతున్నాం' అని అన్నారు.కాగా.. బాలీవుడ్లో జిస్మ్ 2తో ఎంట్రీ ఇచ్చిన సన్ని లియోన్.. ఆ తర్వాత జాక్పాట్, రాగిణి ఎంఎంఎస్ 2, హేట్ స్టోరీ 2, ఏక్ పహేలీ లీలా, కుచ్ కుచ్ లోచా హై, వన్ నైట్ స్టాండ్ లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె అనురాగ్ కశ్యప్ తెరకెక్కిస్తోన్న థ్రిల్లర్ మూవీ కెన్నెడీలో కనిపించనుంది. ఈ చిత్రం కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ప్రీమియర్ ప్రదర్శించారు. అంతే కాకుండా జాకీ ష్రాఫ్, ప్రియమణి, సారా అర్జున్ నటించిన తమిళ చిత్రం కొటేషన్ గ్యాంగ్లో నటిస్తోంది. వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగష్టు 30, 2024న విడుదల కానుంది. -
జాన్వీ గ్లామర్ ఫ్యూజులు ఔట్.. సన్నీ లియోన్ సొగసులు!
జాన్వీ కపూర్ జిగేలు.. హాట్నెస్ మామూలుగా లేదుగాటైట్ డ్రస్సులో తమన్నా వయ్యారాలు.. చూస్తే మెంటలేహాట్ బ్యూటీ సన్నీ లియోన్ సొగసులు చూడతరమాసంప్రదాయ చీరకట్టులో రష్మిక.. ఇలా ఎప్పుడూ చూసుండరు'పొలిమేర' బ్యూటీ అందాల జాతర.. ఇలా ఉందేంట్రా బాబుపూనమ్ పరువాల విందు.. చీరలో బొద్దుగుమ్మలాపూల్లో గ్లామర్ చూపించి మరీ రెచ్చిపోయిన బిగ్ బాస్ అరియానా View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by kamakshi|Actor|Traveler|Fitness|🌈 (@saikamakshibhaskarla) View this post on Instagram A post shared by Bandaru Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) -
ఐటం సాంగ్లో సన్నీలియోన్..
ఇండియన్ మైఖేల్ జాక్సన్గా ముద్ర వేసుకున్న నృత్యదర్శకుడు ప్రభుదేవా. ఈయన నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో దర్శకుడిగా హిట్ చిత్రాలను చేసిన ఈయన ప్రస్తుతం నటనపైనే దృష్టి పెడుతున్నారు. అలా ప్రభుదేవా ఇటీవల నటించిన చిత్రం భగీర. ఇందులో రకరకాల గెటప్ల్లో విలన్గా అదరగొట్టారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. తాజాగా రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. వాటితో పాటు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న గోట్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు.ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో జాలియో జింఖానా ఒకటి. శక్తి చిదంబరం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ భామ మడోనా సెబాస్టియన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రభుదేవా హీరోగా నటిస్తున్న మరో చిత్రం పేటరాప్. ఎస్జే.శీను దర్శకత్వం వహిస్తున్న ఇందులో వేదిక హీరోయిన్గా నటిస్తున్నా రు.బ్లూ హిల్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో బాలీవుడ్ సంచలన నటి సన్నీ లియోన్ ఒక ఐటమ్ సాంగ్లో నటిస్తున్నారు. ఇంతకు ముందు కొన్ని తమిళ చిత్రాల్లో నటించిన ఈమె చిన్నగ్యాప్ తరువాత మళ్లీ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారన్నమాట. వివేక్ ప్రసన్న, భగవతి పెరుమాళ్, రమేశ్ తిలక్, మైమ్గోపి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. Get ready to dance to the tunes of 'Paatu Adi Aattam Repeat', music rights bagged by #TSeries.@PDdancing @vedhika4u@sunnyleone @sinu_sj@immancomposer @swetamohan@viveka_lyrics @nehabhasinteam@nikhitagandhi @deepthisings@thilak_ramesh @actorvivekpra@madhankarky… pic.twitter.com/6PGlZbVpzF— T-Series South (@tseriessouth) June 12, 2024 చదవండి: గోల్డ్ స్కీమ్ పేరుతో మోసం..శిల్పా శెట్టిపై కేసు నమోదు -
సన్నీ లియోన్ బర్త్డేను ఎందుకు జరుపుకున్నారో చెప్పిన యువకులు
సన్నీలియోన్ బాలీవుడ్లో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆమెకు దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఉన్నారు. మే 13న తన 43వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. దీంతో ఆమె అభిమానులు సైతం తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో ఆమె అభిమానులు కేక్ కట్ చేసి అన్నదానాలు చేశారు. అలా తమ అభిమాన నటి మీద ప్రేమను చాటుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.కర్నాటకలోని కర్కల్లి గ్రామానికి చెందిన యువకులు ఆమె పుట్టినరోజు వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. సన్నీలియోన్ భారీ కటౌట్ను ఏర్పాటు చేసి అక్కడ వారందరూ కేక్ కట్ చేశారు. ఈ యువకుల బృందం తమను తాము కర్కల్లి బాయ్స్ అని పిలుస్తారు. సన్నీ పుట్టినరోజును ఎందుకు జరుపుకున్నారో కూడా వారు చెప్పుకొచ్చారు. సన్నీ చేస్తున్న సామాజిక సేవతో పాటు ఆమెలో ఉన్న దాతృత్వమే తమను అభిమానులుగా మార్చిందని వారు తెలిపారు. కరోనా సమయంలో ఆమె చాలామందికి భోజనాలు ఏర్పాటు చేసి ఆకలి తీర్చిందని వారు గర్తుచేశారు. ఆమె నటించిన గత సినిమాలు ఎలా ఉన్నా సరే సన్నీలో సేవా గుణం ఉంది. భారత్పై గౌరవంతో ఇక్కడే ఉంటుంది. అందుకు తగ్గట్లు తన జీవితాన్ని మార్చుకుంది. ఇక్కడి ప్రజల్లో మమేకమైంది. ఇక్కడి ప్రజలకు ఆమె ఎంతో సాయం చేస్తుంది. ఇంతకంటే ఇంకేం కావాలి..? అంటూ వారు సన్నీ లియోన్ గురించి చెబుతున్నారు. -
మరో తెలుగు సినిమాలో సన్నీ లియోన్.. అలాంటి కథతో!
సన్నీ లియోన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పోర్న్ స్టార్గా కెరీర్ ప్రారంభించినప్పటికీ.. తర్వాత తర్వాత నటిగా మారిపోయింది. ప్రత్యేక గీతాలు, పలు పాత్రల్లో నటిస్తూ వస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈమె.. ఇప్పుడు తెలుగులో ఓ హారర్ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. (ఇదీ చదవండి: మెగాకోడలు క్యూట్నెస్.. చీరలో స్టార్ హీరో కూతురు అలా!) సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై రాబోతోన్న మూవీ 'మందిర'. సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాత. ఆర్.యువన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సన్నీ ఈ పోస్టర్లో భయపెడుతూనే కవ్విస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో మిగిలిన వివరాలు ప్రకటించనున్నారు. (ఇదీ చదవండి: టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!) -
పెళ్లి పేరుతో నన్ను మోసం చేశాడు: సన్నీలియోన్
‘ఓ వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో నన్ను మోసం చేశాడు’ అన్నారు బాలీవుడ్ నటి సన్నీలియోన్ . హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మరాఠి, బెంగాలి, మలయాళ భాషల్లోని పలు చిత్రాల్లో ప్రత్యేక పాటలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నారు ఈ బ్యూటీ. ‘కరెంట్ తీగ’(2014) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్ ‘పీఎస్వీ గరుడవేగ’, ‘జిన్నా’ వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె ‘రంగీలా’, ‘వీరమదేవి’, ‘కొటేషన్ గ్యాంగ్’, ‘షీరో’, ‘కోకా కోలా’, ‘యుఐ’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా ‘స్ల్పీట్స్విల్లా’ అనే ఓ రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు సన్ని. తాజాగా ఈ షోలో ఆమె మాట్లాడుతూ–‘‘కొన్నేళ్ల క్రితం ఒక వ్యక్తిని చాలా ప్రేమించాను. తన కూడా నన్ను ప్రేమించాడు. మా ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ తర్వాత ఏదో తప్పు జరుగుతోందని, అతడు నన్ను మోసం చేస్తున్నాడేమోనని నా మనసుకు అనిపించింది. దీంతో ‘నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా?’ అని ప్రశ్నిస్తే లేదన్నాడు. మరో రెండు నెలల్లో మా పెళ్లిని ప్లాన్ చేసుకున్నాం. హవాయి దీవుల్లో గ్రాండ్గా, జీవితాంతం గుర్తుండిపోయేలా వివాహం జరగాలని ప్లాన్ చేసుకున్నాం. ఇందుకోసం అన్నీ బుక్ చేసుకుని డబ్బులు కూడా ఇచ్చేశాను. పైగా పెళ్లి షాపింగ్ కూడా అయిపోయింది. ఇలాంటి సమయంలో తను అలా చెప్పడంతో నా మనసు ముక్కలైంది.. ఎంతో బాధపడ్డాను. ఆ తర్వాత భగవంతుడు నా జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకువచ్చాడు. డానియల్ వెబర్ను పరిచయం చేశాడు. నా తల్లితండ్రులు చనిపోయినప్పుడు తను ఎంతో అండగా నిలిచాడు. మా ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి (2011) చేసుకున్నాం. ఎప్పటికీ నా భర్త చేయి వదలను’’ అన్నారు. -
కొద్దిరోజుల్లో పెళ్లి పెట్టుకుని నన్ను మోసం చేశాడు: సన్నీలియోన్
బాలీవుడ్లో ఐటం సాంగ్స్తో అల్లాడించింది సన్నీలియోన్. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, మరాఠి, బెంగాలి, మలయాళ భాషల్లోనూ పలు పాటల్లో తళుక్కుమని మెరిసింది. ఈమె తెలుగులో చివరగా జిన్నా సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఎనిమిది సినిమాలున్నాయి. ఇందులో ఒకటి స్పెషల్ సాంగ్ కాగా మిగతా వాటిలో కీలక పాత్రలు పోషిస్తోంది. అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే స్ప్లిట్స్విల్లా ఐదో సీజన్కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. నాకు డౌట్ వచ్చి.. తాజాగా ఆమె ఈ షోలో తన మనసు ముక్కలైన క్షణాలను గర్తు చేసుకుంది. 'ఇది నా పెళ్లికి ముందు జరిగిన సంఘటన. ఒక వ్యక్తిని ఎంతో ప్రేమించాను. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాం. కానీ అతడు నన్ను మోసం చేస్తున్నాడేమోనని మనసు కీడు శంకించింది. ఒకసారి తననే నేరుగా అడిగేశాను.. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అని! దానికతడు లేదు, నీ మీద ప్రేమ ఎప్పుడో పోయిందని చెప్పాడు. కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. అప్పటికే మా పెళ్లి షాపింగ్ కూడా అయిపోయింది. అన్నీ బుక్ చేసేశా హవాయి దీవుల్లో గ్రాండ్గా, జీవితాంతం గుర్తుండిపోయేలా వివాహం జరగాలని ప్లాన్ చేసుకున్నాం. ఇందుకోసం అన్నీ బుక్ చేసుకుని డబ్బులు కూడా ఇచ్చేశాను. పెళ్లికి ఇంకా రెండు నెలల సమయం ఉందనగా నేనంటే ఇష్టం లేదని చెప్పి నా మనసు ముక్కలు చేశాడు. అప్పుడు నేనెంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నించాను. ఆ సమయంలోనే దేవుడు నాకోసం వెబర్ను పంపాడు. అండగా నిలబడ్డాడు కష్టసమయాల్లో అండగా నిలబడ్డాడు. అమ్మానాన్న మరణించినప్పుడు నావెంటే ఉండి నాలో ధైర్యం నింపాడు. ఎప్పటికీ నా భర్త చేయి వదలను' అని చెప్పుకొచ్చింది. కాగా సన్నీ లియోన్ - డేనియల్ వెబర్ 2011లో పెళ్లి చేసుకున్నారు. 2017లో నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాది సరోగసి ద్వారా నోవా, ఆషర్ అనే కుమారులకు తల్లిదండ్రులయ్యారు. చదవండి: ‘కాంట్రవర్సీ కింగ్’ ఆర్జీవీ గురించి ఈ విషయాలు తెలుసా? -
అజియో గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024.. హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
-
సన్నీ లియోన్ కీలక పాత్రలో ‘డాక్టర్ యోగి డైరీస్’
డా.యోగేష్, ఆకృతి అగర్వాల్ జంటగా సన్నీ లియోన్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘డాక్టర్ యోగి డైరీస్’. రాజేశ్ -ప్రసాద్ల దర్శకత్వంలో హర్షవర్ధన్, శ్రీదేవి మద్దాలి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవంలో తొలి సీన్కి దర్శకుడు వీరశంకర్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు వీఎన్ ఆదిత్య కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు మహేశ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హర్షవర్దన్ మాట్లాడుతూ..‘రాజేష్ - ప్రసాద్ లు కథ చెప్పగానే లైవ్ లో ఇలా కూడా జరుగుతుందా అనే ఆశ్యర్యానికి లోనయ్యాను.. అంతలా కథతో ఇప్రేస్ చేశారు. ప్రతిదీ చాలా ప్లానింగ్ గా వర్క్ చేస్తున్నారు. 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చెయ్యటానికి ప్లాన్ చేశాం’ అన్నారు. ‘ఈ ఏడాది ప్రేక్షకులు ఓ మంచి పారా నార్మల్ థ్రిల్లర్ను చూస్తారు’అని అన్నారు డా.యోగేష్ -
కొత్త పెళ్లి కూతురిలా సన్నీ లియోన్.. మంచు లక్ష్మీ అలాంటి లుక్!
కలర్ఫుల్ డ్రస్లో మంచు అక్క గ్లామర్ ట్రీట్ ఫ్యామిలీతో కలిసి జపాన్లో సాయిపల్లవి ఎంజాయ్ అందంగా మెరిసిపోతున్న హీరోయిన్ తాన్య హోప్ ఫస్ట్ నైట్ పెళ్లి కూతురిలా రెడీ అయిన సన్నీ లియోన్ బికినీతో కళ్లు చెదిరిపోయే ట్రీట్ ఇచ్చిన తెలుగమ్మాయి ఎక్సర్సైజ్ వీడియో పోస్ట్ చేసిన హీరోయిన్ త్రిదా చౌదరి పెళ్లి హడావుడిలో ఫుల్ బిజీబిజీగా హీరోయిన్ రాశీఖన్నా వజ్రంలా ధగధగా మెరిసిపోతున్న మలయాళ బ్యూటీ రెబా View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Gnaneswari Kandregula (@gnaneswari_kandregula) View this post on Instagram A post shared by Tridha Choudhury🪬 (@tridhac) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) -
సన్నీలియోన్ కానిస్టేబుల్ పరీక్షకు అప్లై చేశారా?
సెలబ్రిటీలకు సంబంధించిన ఫొటోలు పలు ప్రభుత్వ పథకాల దరఖాస్తుల్లో కనిపిస్తూ అందరినీ అశ్చర్యపరుస్తాయి. ఎన్నికల ఐడీ, అధార్ కార్డుల్లో కూడా చాలా మంది సెలబ్రిటీల ఫొటో ప్రక్షత్యమైన సందర్భాలు కూడా చూశాం. అయితే ప్రముఖ బాలీవుడ్ నటీ సన్నీలియోన్కు సంబంధించిన ఫొటో సైతం ఓ పోటీపరీక్షల దరఖాస్తులో కనిపించటం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని పోలీసు కానిస్టేబుల్ ప్రరీక్ష దరఖాస్తులో ఓ అభ్యర్థి సన్నిలియోన్ ఫొటోతో అప్లై చేశారు. అయితే రిజిస్ట్రషన్ ప్రాసెస్లో సన్నీలియోన్ ఫొటోతో అప్లై చేసిన సదరు అప్లికేషన్కు అడ్మిట్ కార్డు కూడా జారీ అయింది. ప్రస్తుతం ఈ అడ్మిట్కార్డు నెట్టింట హల్చల్ చేస్తోంది. అడ్మిట్కార్డు వివరాల ప్రకారం.. న్నౌజ్ తిర్వాలోని శ్రీమతి సోనేశ్రీ మెమోరియల్ బాలికల కళాశాల సన్నీలియోన్కు పరీక్ష కేంద్రంగా కేటాయించబడట గమనార్హం. ఫిబ్రవరి 17, 18 రెండు రోజుల పాటు యూపీలో పోలీసు ఉద్యోగాలకు పరీక్షలు జరుగుతున్నాయి. Sunny Leone applied for UP police constable examination....😅😅 pic.twitter.com/YuxYMzGjwt — Simple man (@ArbazAh87590755) February 17, 2024 మరోవైపు.. అభ్యర్థుల సమచారంలో అవకతకలు, అక్రమైన మార్గాల్లో పరీక్ష రాయాలని వేసుకున్న ప్రణాళికను భగ్నం చేస్తూ.. గత రెండు రోజుల్లో సుమారు 120 మంది అభ్యర్థులను అరెస్ట్ చేసినట్టు అక్కడి పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అయితే నెట్టింట్లో వైరల్ అయిన సన్నీలియోన్ అడ్మిట్ కార్డుపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘యూపీ పోలీసు కానిస్టేబుల్ పరీక్షకు సన్నీలియోన్ అప్లై చేశారా?’ అని ఓ ‘ఎక్స్’ (ట్విటర్) హ్యాండిల్ కామెంట్ చేసింది. దీనిపై స్పందించిన యూపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు స్పందిస్తూ... సన్నీలియోన్ పేరు, ఫొటోతో ఉన్న అడ్మిట్కార్డు నకిలీది అని స్పష్టం చేసింది. -
సన్నీలియోన్ రెస్టారెంట్లో ప్రేమికులకు ప్రత్యేక ఏర్పాట్లు!
బాలీవుడ్ నటి సన్నీలియోన్కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. సన్నీలియోన్ ఇటీవలే ఓ రెస్టారెంట్ యజమానిగా మారారు. ఆమె ఈ మధ్యనే యూపీలోని నోయిడాలో తన మొదటి రెస్టారెంట్ను ప్రారంభించారు. సన్నీ రెస్టారెంట్ పేరు చికా లోకా. ఇది నోయిడాలోని గుల్షన్ మాల్లో ఉంది. ‘చికా లోకా’ ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రేమ జంటలకు చక్కని అలంకారంతో కూడిన టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రైవేట్ టేబుళ్లను కూడా బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. లైవ్ బ్యాండ్ సంగీతంతో క్యాండిల్ డిన్నర్ చేయవచ్చని వివరించింది. రెస్టారెంట్కు వచ్చే ప్రేమ జంటల కోసం టెర్రస్ను అందంగా అలంకరించినట్లు మేనేజర్ భూపేష్ సింగ్ తెలిపారు. ఇక్కడ సమయాన్ని గడపడం ద్వారా ఈ వాలెంటైన్ను ప్రత్యేకంగా చేసుకోవచ్చన్నారు. గ్రౌండ్ ఫ్లోర్, టెర్రస్ ఏరియాలలో ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. డ్యాన్స్, క్యాండిల్ డిన్నర్, లైవ్ బ్యాండ్ మ్యూజిక్ విత్ డీజే మొదలైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
భర్తతో కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన సన్నీ లియోన్
-
నటి సన్నీ లియోన్ కొత్త వ్యాపారం.. వీడియో వైరల్
సన్నీ లియోన్ గురించి సినిమా ప్రేమికులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే పోర్న్స్టార్గా ఉన్న ఈమె.. ఆ తర్వాత నటిగా బాలీవుడ్లోకి ఎంటరైంది. స్పెషల్ సాంగ్స్తో పాటు పలు పాత్రల్లోనూ నటించి ఆకట్టుకుంది. తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు భర్తతో కలిసి కొత్తగా ఓ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) మారిపోయిన సన్నీ లియోనీ సన్నీ లియోన్ పేరు చెప్పగానే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఒకప్పుడు పోర్న్ చిత్రాల్లో నటించడమే దీనికి కారణం. ఆ ఇండస్ట్రీని వదిలి ఏళ్లకు ఏళ్లకు గడిచిపోయినా సరే ఇప్పటికీ చాలామంది.. ఈమెని ఆ ఉద్దేశంతోనే చూస్తుంటారు. కానీ సన్నీ లియోనీ.. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వ్యాంప్ క్యారెక్టర్స్ చేసినా సరే.. బయట మాత్రం కొన్ని మంచి పనులు చేసింది. ఓ అనాథ బాలికని కూడా దత్తత తీసుకుని పెంచుకుంటోంది. ఏంటా బిజినెస్? గత కొన్నేళ్ల నుంచి సినిమాల పరంగా ఈమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. దీంతో రూట్ మార్చేసింది. భర్త డేనియల్ వెబర్తో రెస్టారెంట్ బిజినెస్ మొదలుపెట్టింది. ఢిల్లీలోని నోయిడాలో 'చికలోక' పేరుతో ఓ రెస్టారెంట్ ఈ మధ్య ఓపెన్ చేసింది. ఇందులో కుక్ చేస్తున్న ఓ వీడియో తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో వ్యాపారంలోకి సన్నీ లియోన్ అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసింది. (ఇదీ చదవండి: టీనేజీలోనే గట్టిగా సంపాదిస్తున్న మహేశ్ కూతురు సితార.. నెలకు ఎన్ని లక్షలంటే?) View this post on Instagram A post shared by Chica Loca Noida (@chicalocanoida) -
సన్ని లియోన్ మూవీ హీరోయిన్.. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న భామ!
ఈ రోజుల్లో ఫేమస్ కావడం చాలా ఈజీ. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన నటీమణులు సోషల్ మీడియాను ఇష్టం వచ్చినట్లు వాడేసుకుంటున్నారు. అవకాశాల కోసం, అభిమానులను అలరించడంకోసం, ఆదాయం కోసం కూడా లేటేస్ట్ పిక్స్తో హల్చల్ చేస్తుంటారు. ఇందుకు సీనియర్, జూనియర్ నటీమణులు అంటూ ఎవరూ అతీతులు కారు. వీరిలో యువ నటి దర్శా గుప్త వంటి వారికి ఈ సామాజిక మాధ్యమాలే అవకాశాల కోసం ముఖ్యమైన వేదికగా మారుతున్నాయి. బుల్లితెరపై విశేష ఆదరణను పొందిన దర్శా గుప్త రుద్ర తాండవం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ చిత్రం సక్సెస్ అయినా ఈ అమ్మడికి తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ ప్రధాన పాత్ర పోషించిన ఓ మై ఘోస్ట్ చిత్రంలో యువ కథానాయకిగా నటించింది. అందులో తనకు అవకాశం వచ్చినప్పుడల్లా అందాలను ఆరబోయడానికి వెనుకాడలేదు. ప్రస్తుతం మెడికల్ మిరాకిల్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. దీంతో చేతిలో మరో అవకాశం లేకపోవడంతో ఇప్పుడు ఆ వేటలో పడింది. అందుకు ఈ బ్యూటీ ఎంచుకున్న మార్గం సోషల్ మీడియా. అందులో అందాలను విచ్చలవిడిగా ఆరబోసిన ఫొటోలను పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే దర్శాగుప్త ప్రయత్నం ఏ మాత్రం ఫలిస్తుందో చూడాలి. View this post on Instagram A post shared by Dharsha Gupta (@dharshagupta) View this post on Instagram A post shared by Dharsha Gupta (@dharshagupta) -
సన్నీ-ప్రియమణి యాక్షన్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఫిల్మిటీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గాయత్రి సురేష్, వివేకానందం కలిసి నిర్మించిన కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది. వివేక్ కుమార్ కర్నూల్ దర్శకత్వం వహించగా... ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్, గాయత్రి రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. డ్రమ్స్ శివమణి సంగీతమందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'కొటేషన్ గ్యాంగ్' అనే ఈ చిత్రం డిసెంబర్ రెండో వారంలో థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: బిగ్బాస్ అశ్వినికి ఆల్రెడీ పెళ్లయిందా? మరి అలా!) చెన్నైలోని ఓ స్టూడియోలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. ఆసక్తికర విషయాల్ని బయటపెట్టారు. కేరళలో కొటేష న్ గ్యాంగ్ ఉన్నారనే వార్త పేపర్లో చదివానని, దాన్ని బేస్ చేసుకుని తయారు చేసుకున్న కథతో ఈ సినిమా తీశానని డైరెక్టర్ వివేక్ చెప్పుకొచ్చారు. చెన్నై, ముంబై, కశ్మీర్లో జరిగే మూడు కథలు ముంబైలో కలుస్తాయని, డబ్బు కోసం ఎలాంటి పనైనా ఆలోచించకుండా చేసే కూలీ ముఠా ఇతివృత్తమే కొటేషన్ గ్యాంగ్ చిత్రమని దర్శక నిర్మాతలు చెప్పారు. ప్రియమణి చేసే ఫైట్స్ ఆకట్టుకుంటాయని చెప్పారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. (ఇదీ చదవండి: హీరోగా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్బాస్' కంటెస్టెంట్) -
Sunny Leone: సన్నీ లియోన్ బ్లాక్ డ్రెస్ కొత్త ఫోటోలు చూశారా?
-
సన్నీ లియోన్ గొప్పమనసు .. రూ.50 వేల రివార్డ్ ప్రకటించిన నటి!
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తన గొప్ప మనసును చాటుకుంది. తప్పిపోయిన బాలిక ఆచూకీ తెలిపిన వారికి ప్రత్యేకంగా తానే రూ.50 వేల రివార్డ్ ఇస్తానని తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాలో పంచుకుంది. ఆ బాలిక ఫోటోతో పాటు చిరునామా, ఫోన్ సంబంధించిన వివరాలు షేర్ చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో చూద్దాం. సన్నీ లియోన్ ఇంట్లో ముంబయికి చెందిన కిరణ్ మోరే అనే వ్యక్తి పని చేస్తున్నారు. అతనికి అనుష్క అనే 9 ఏళ్ల కూతురు ఉంది. అయితే 8వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో ముంబయిలోని జోగేశ్వరి ప్రాంతంలో తప్పిపోయింది. దీంతో బాలిక కోసం తల్లిదండ్రులు గాలిస్తున్నారు. ఎవరైనా బాలిక ఆచూకీ చెబితే 11 వేల రూపాయలు పారితోషికం ఇస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. రూ.50 వేల రివార్డ్ అయితే బాలిక సమాచారం ఇచ్చినవారికి తాను వ్యక్తిగతంగా రూ.50 వేల రూపాయలు ఇస్తానని సన్నీ లియోన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కానీ.. సన్నీ లియోన్ చివరిసారిగా అనురాగ్ కశ్యప్ చిత్రం కెన్నెడీలో కనిపించింది. ఇది చూసిన సన్నీ అభిమానులు.. దేవుడా ఎలాగైనా ఆ బాలికను రక్షించు అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు సన్నీ లియోన్ మానవత్వం పట్ల అభినందనలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
Diwali Bash: దీపావళి వేడుకల్లో మెరిసిపోయిన బాలీవుడ్ తారలు ఫోటోలు
-
‘జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ 2023’ తారల సందడి (ఫొటోలు)
-
తెలుగు షోలో సన్నీ లియోన్.. ఇదెక్కడి ట్విస్టురా మావ!
బాలీవుడ్ నటి సన్నీ లియోన్కు టాలీవుడ్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఆమె తొలిసారిగా తెలుగు బుల్లితెరపై కనిపించబోతోంది. ఆమె జీ తెలుగు కోసం 'తెలుగు మీడియం స్కూల్' అనే కొత్త రియాల్టీ షోకి గెస్టుగా వచ్చింది. దీంతో ఈ షో పై భారీ అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షోకి సంబంధించిన ప్రోమోను ఛానెల్ విడుదల చేసింది. జీ తెలుగు మునుపెన్నడూ చూడని రియాల్టీ షోగా 'తెలుగు మీడియం స్కూల్'ని పరిచయం చేసింది. ఈ ప్రోమోలో సన్నీ లియోన్తో పాటు ప్రముఖ గాయకుడు మనో, యాంకర్ రవి కూడా ఉన్నారు. (ఇదీ చదవండి: దు:ఖంలోనూ చిన్న కూతురితో ప్రమోషన్లకు వచ్చిన విజయ్ ఆంటోనీ) ఇందులో టీవీ, టాలీవుడ్ హాస్యనటులు కూడా ఉన్నారు. ఈ ప్రోమో విడుదల అయిన వెంటనే సూపర్, అద్భుతం అంటూ సన్నీ లియోన్పై కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో కనకాల సుమ,రష్మి,అనసూయ,శ్రీముఖి వంటి వారు యాంకరింగ్లో తనదైన ముద్ర వేశారు. మరీ గెస్టుగా వచ్చిన ఈ బ్యూటీ వీరిలో ఎవరినైనా మెప్పించేలా యాంకరింగ్ చేస్తుందా అనేది చూడాలి? ఈ షో కాన్సెప్ట్ ఏంటి అనేది ఇంకా నిర్వహకాలు వెల్లడించలేదు. ఈ ప్రోమోలో సన్నీ తెలుగులో మాట్లాడుతూ తనకు ప్రాణం పోసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ మాట్లాడింది. అలాగే, ప్రోమో చాక్బోర్డ్పై షో టైటిల్ కనిపించడంతో ముగుస్తుంది, ఆ తర్వాత చీరలో సన్నీ లియోన్ ఉల్లాసమైన చిరునవ్వుతో ఉంటుంది. సన్నీలియోన్ 11 ఏళ్ల కిందటే 'జిస్మ్ 2'తో బాలీవుడ్లోకి అడుగుపెట్టినప్పటికీ, ఆమె 'కరెంట్ తేగ, గరుడ వేగ,జిన్నా' వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించింది. -
గణేశుడి సన్నిథిలో సన్నీలియోన్.. నెటిజన్ల కామెంట్లు
విదేశాల్లో పుట్టి పెరిగిన భారత సంతతికి చెందిన సన్నీలియోన్ నీలిచిత్రాల్లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వెండి తెరపై కూడా ఎంతో పేరు తెచ్చుకున్న సన్నీలియోన్ పలు సినిమాలతో బిజీగా ఉంటుంది. ఆమెకు ఇక్కడ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. భారతీయులకు ప్రధానమైన హిందూ పండుగల్లో గణేశ్ చతుర్థి ఒకటి. తాజాగా ఈ బ్యూటీ భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో గణేశ్ చతుర్థి ఉత్సవాల్లో పాల్గొంది. ముంబైలోని లాల్బాగ్ వద్ద గణేశుడి మండపానికి భర్త డానియల్ వెబర్తో కలిసి వెళ్లి పూజలు చేసింది. దీంతో ఆమెను చూసేందుకు భారీగా జనాలు అక్కడికి చేరుకున్నారు. ఆమెతో సెల్పీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఓ వైపు వర్షం పడుతున్నా ఏ మాత్రం లెక్కచేయకుండా నడుచుకుంటూ వెళ్లి బొజ్జ గణపయ్యను ఆమె దర్శించుకుంది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: వాల్తేరు వీరయ్య నటుడు బాబీకి స్నేహితుల నుంచే హత్య బెదిరింపులు!) సన్నీలియోన్ ఎక్కడున్నా భారతీయ మూలాలు ఉన్న స్త్రీ కాబట్టి ఆమెలో దైవభక్తి ఉందని నెటిజన్లు తెలుపుతున్నారు. తనకు ఊహ తెలీని టైంలో తప్పులు చేశానని సన్నీలియోన్ గతంలో ఇలా చెప్పింది. 'నేను చేసిన తప్పుల వల్ల ఇప్పుడు కొన్ని చోట్ల తల దించుకుంటున్నాను. ఎంతయినా భారతీయ మూలాలు నాలో ఉండడం వల్లేనేనేమో నేను ఇలా ఆలోచిస్తున్నాను కాబోలు.' అని సన్నీలియోన్ చెప్పింది. తాజాగా ఆమె భర్తతో పాటుగా బొజ్జ గణపయ్యను దర్శించుకోవడంతో ఆమెను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ##WATCH | Actor Sunny Leone and her husband seek blessing from Lord Ganpati at Mumbai's Lalbaugcha Raja Sarvajanik Ganeshotsav Mandal pic.twitter.com/cGPg3dphph — ANI (@ANI) September 22, 2023 -
అలాంటి లుక్లో జాన్వీ.. ముక్కు పుడకతో రష్మిక
ముక్కుపుడకతో రష్మిక క్యూట్ పోజులు బ్లాక్ డ్రస్లో మెరిసిపోతున్న శ్రీనిధిశెట్టి యంగ్ బ్యూటీ కోమలి ప్రసాద్ రొమాంటిక్ స్టిల్స్ సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేస్తున్న సమంత వింటేజ్ గెటప్లో దేవర బ్యూటీ జాన్వీ కపూర్ డైమండ్లా జిగేలు మంటున్న సన్నీ లియోన్ జిమ్ వర్కౌట్స్.. కండలు చూపిస్తున్న తేజస్వీ నీలం రంగు చీరల్లో హీరోయిన్ సదా వయ్యారాలు అందాల విందు చేస్తున్న ఇనయా సుల్తానా కాస్త ఒళ్లు చేసినట్లు కనిపిస్తున్న అరియానా బీచ్ వెకేషన్లో జాలీగా తమన్నా View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Komalee Prasaad (@komaleeprasad) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) ` -
వరదలో మూడు కార్లు కొట్టుకుపోయాయి: సన్నీలియోన్
ముంబై వరదల వల్ల ఎంతగానో నష్టపోయానంటోంది హీరోయిన్ సన్నీలియోన్. తను ఇష్టపడి కొనుక్కున్న ఖరీదైన కార్లు వరదలో కొట్టుకుపోయాయని వాపోయింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను ముంబైలో ఉంటున్నాను. పని కోసం ముంబైకి వచ్చినప్పుడు నేను ఉండే ఇంటి పరిస్థితి చూసి ఆందోళన చెందేదాన్ని. గోడల నుంచి నీళ్లు కారేవి. అధిక తేమ వల్ల చాలా వస్తువులు తడిగా ఉన్నట్లు అనిపించేది. అయినా సరే అక్కడి వాతావరణం నాకెంతో నచ్చేది. చెప్పాలంటే వర్షాకాలం అంటే ఎంతో ఇష్టం. ఆకాశం నుంచి చినుకులు నేలను తాకుతుంటే ముచ్చటగా అనిపించేది. కానీ ఆ వర్షపు నీళ్లు ఇంటి లోపలదాకా వస్తే మాత్రం నచ్చేది కాదు. ఓసారి తీవ్ర వర్షాలు పడటంతో నా మూడు కార్లు వరదలో కొట్టుకుపోయాయి. అందులో రెండైతే ఒక్కరోజులోనే మాయమైపోయాయి. మేఘాలు అంత వర్షాన్ని దాచుకున్నాయా? అనిపించింది. చాలా బాధపడ్డా.. ఒకరకంగా ఏడ్చేశాను కూడా! ఎందుకంటే ఇండియాలో దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్లు కొనాలంటే చాలా ఎక్కువ టాక్స్ కట్టాలి. ఒక కారైతే ఎనిమిది మంది కూర్చునే మెర్సిడిస్ ట్రక్. వాటిని పోగొట్టుకున్నందుకు ఎంత ఫీలయ్యానో! అయితే ఇప్పుడు నేను ఇండియాలోనే తయారు చేసిన కార్లు వాడుతున్నాను. అవి నాకు చాలా నచ్చాయి' అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. కాగా సన్నీ లియోన్ ప్రస్తుతం కొటేషన్ గ్యాంగ్ అనే తమిళ చిత్రం చేస్తోంది. వివేక్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, ప్రియమణి, సారా అర్జున్, వి.జయప్రకాశ్, విష్ణు వారియర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) చదవండి: మరో రెండు,మూడేళ్లలో పెళ్లి చేసుకుంటా: విజయ్ దేవరకొండ -
శోభిత ధూళిపాల హోయలు.. కలర్ఫుల్ శారీలో కవ్విస్తోన్న అనిత!
►బ్లూ డ్రెస్లో స్మైలీగా యామీ గౌతమ్! ►కలర్ఫుల్ శారీలో కవ్విస్తోన్న అనిత! ►బాలీవుడ్ భామ సన్నీలియోన్ హాట్ పోజులు! ►స్టెలిష్ డ్రెస్లో శోభిత ధూళిపాల హోయలు! ►బాలీవుడ్ భామ దిశా పటానీ హాట్ లుక్స్! View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) -
మద్యానికి బానిసైన సన్నీ లియోన్ తల్లి.. ఆ వీడియోల వల్లే!
సన్నీ లియోన్ పేరు చెప్పగానే చాలామందికి ఆమె శృంగార వీడియోలే గుర్తొస్తాయి. అయితే వాటిని, ఆ ఇండస్ట్రీని ఆమె ఎప్పుడో వదిలేసింది. ప్రస్తుతం నటిగా సినిమాలతో బిజీగా ఉంది. ఈ మధ్య కాలంలో సన్నీ లియోనీ పేరు ట్రెండింగ్లో ఉంటోంది. పలు ఇంటర్వ్యూలు ఇస్తుండటమే దీనికి ప్రధాన కారణం. ఓ ఇంటర్వ్యూలో తన తల్లి గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ఆమె మద్యానికి బానిస అయిందనే విషయాన్ని బయటపెట్టింది. అడల్ట్ వీడియోస్ వల్ల 'మా అమ్మకు మందు తాగే అలవాటు ఉండేది. అయితే నేను పో*ర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఎక్కువగా మద్యం తాగేది. అలా దానికి బానిస అయిపోయిందని అనుకుంటున్నా. నేను ఇలాంటి వీడియోల చేయడం ఇష్టం లేకపోవడం వల్లే మందు తాగుతుందని అనుకునేదాన్ని. ఈ కారణాలతో ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. అలా రోజులు గడిచేకొద్ది నా కంటే అమ్మకి మందు ఎక్కువ ఇష్టమనుకునే దాన్ని' (ఇదీ చదవండి: ఉపాసనపై రామ్చరణ్ కామెంట్స్.. అలా చేసిందంటూ!) అదే కారణం 'అయితే నా తల్లి ఇలా కావడానికి నేను గానీ నా సోదరుడు గానీ తండ్రి గానీ కారణం కాదు. పరిస్థితులు ఆమెని అలా మార్చేసి ఉండొచ్చు. ఇది ఓ మానసిక సమస్య అని ఆ తర్వాత తెలిసింంది. అలాంటి వాటికి బానిస అయితే త్వరగా బయటపడలేరనే విషయం నాకు అర్థమైంది. కుటుంబ పోషణ భారం కావడంతో ఆ వృత్తిలోనే నేను పనిచేయాల్సి వచ్చింది' అని సన్నీ లియోన్ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం హ్యాపీలైఫ్ సన్నీ లియోన్ గతం ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు ఆమె సంతోషంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. డేనియల్ వెబర్ని పెళ్లి చేసుకున్న ఈమె.. భారత్లోనే సెటిలైపోయింది. ఇద్దరు కొడుకులు ఉండగా, మరో అమ్మాయిని దత్తత తీసుకుంది. సినిమాల్లో వ్యాంప్ తరహా పాత్రలు చేస్తున్నప్పటికీ.. బయటమాత్రం మంచి పనులు చేస్తూ తనపై పడిన ముద్రని చాలావరకు చెరిపేసుకుందనే చెప్పొచ్చు. (ఇదీ చదవండి: మూడో పెళ్లిపై ప్రముఖ నటి కామెంట్స్.. అందుకే విడిపోయామని!) -
వాళ్ల కోసమే బూతు సినిమాలు చేశా.. పాత రోజుల్ని గుర్తుచేసుకున్న సన్నీ లియోన్
బాలీవుడ్లో శృంగార తారగా రాణిస్తున్న సన్నీలియోన్ దక్షిణాదిలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. లండన్లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మొదట్లో అశ్లీల చిత్రాల్లో నటించి వివాదాస్పద నటిగా ముద్ర వేసుకుంది. దీంతో 2012 నుంచి అలాంటి చిత్రాలు చేయడం మానేసి హిందీ చిత్రాలు, ఐటమ్ సాంగ్స్లో నటిస్తూ మంచి యాక్టర్గా గుర్తింపు తెచ్చుకుంది. (ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ.. ఫోటోలు వైరల్) వివాదాస్పద రియాలిటీ షో బిగ్ బాస్ (2011-12) ఐదవ సీజన్లో పాల్గొన్నప్పుడు సన్నీ లియోన్ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. అప్పటికే ఆమె అశ్లీల చిత్రాల్లో నటిస్తూ ఉండటంతో ఆమెపై ఇండియాలో చాలా వ్యతిరేకత ఉండేది. దీంతో భారత్లో అడుగుపెడితే చంపేస్తామని ఆమెకు పలువురు మెయిల్స్ కూడా చేశారు. కానీ షో నిర్వాహుకులు ఆమెను బలవంతంగా ఒప్పించి. సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పడంతో ఇండియాలో అడుగుపెట్టింది. కానీ ఆమెపై బెదిరింపులు ఎక్కువడంతో తట్టుకోలేక బిగ్బాస్షోను ప్రజెంట్ చేసే సంస్థకు సంబంధించిన ప్రధాన వ్యక్తి ఒకరు అప్పట్లో జాబ్కు రిజైన్ చేసేశారు. కానీ సన్నీకి ఎలాంటి ఆపద జరగలేదు. షో అనంతరం ఆమె లండన్ వెళ్లిపోయింది. ఆ షో సన్నీలియోన్ కెరీర్ను మార్చేసింది. షోలో ఆమెను చూసిన భారత్ ప్రజలు ఎంతగానో ఆదరించారని సన్నీ చెప్పుకొచ్చింది. తర్వాత అశ్లీల చిత్రాల్లో నటించడం ఆమె మానేసింది. 2012 ఎరోటిక్ థ్రిల్లర్ జిస్మ్ 2లో సన్నీలియోన్ బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం ,బెంగాలీ భాషల్లో పలు చిత్రాలలో భాగమైంది. (ఇదీ చదవండి: లైంగిక వేధింపులు.. ఎలా బయటపడతానోనని భయమేసింది: నటి) ఇటీవలి ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ పాత రోజుల్ని గుర్తు చేసుకుంది. తాను అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అత్యుత్తమ కంపెనీలతో పనిచేశానని, ఉదాహారణగా వాటిని హిందీ చిత్ర పరిశ్రమలోని రెండు అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థలైన కరణ్ జోహార్కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్, ఆదిత్య చోప్రాకు చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్తో పోల్చింది. ఈ రెండూ తనను బాలీవుడ్లో ఎంతగానో ఆదరించాయని సన్నీ తెలిపింది. 'ఒక శృంగార తారగా ఎంతో కష్టపడి పనిచేశాను. నన్ను నియమించుకున్న కంపెనీలు వారు కోరుకున్నవి నా నుంచి పొందారు. కానీ నాకు ఎలాంటి ప్రయోజనం పొందలేదు. నాకు అప్పట్లోనే కోట్లాదిమంది అభిమానులు ఉండేవారు. వారి కోసం అయినా శృంగార సన్నివేశాల్లో నటించాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో ఆర్థికంగా కూడా చెప్పుకోతగిన స్థాయిలో లేను. కానీ ఇండియాలో బిగ్బాస్ సీజన్లో అడుగుపెట్టిన తర్వాత నా జీవితమే మారిపోయింది. ఇక్కడ నాకు అడల్ట్ సీన్లు చేస్తారా..? అని ఎవరూ అడగలేదు. అన్నీ మంచి అవకాశాలే వచ్చాయి. దాంతో వాటికి గుడ్బై చెప్పేశాను. ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నా. పలు సినిమాల ద్వారా మంచి పేరుతో పాటు డబ్బు కూడా వచ్చింది. కానీ బాలీవుడ్లో స్టార్ హీరోలు నాతో నటించేందుకు ముందుకు రాలేదు. తొలిసారి షారుఖ్ సరసన ఐటెం సాంగ్లో అవకాశం దక్కింది.' అని చెప్పుకొచ్చింది. ఇండియన్ సినిమాను రిప్రజెంట్ చేసిన సన్నీ ఫ్రాన్స్లో జరిగిన 76వ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో సన్నీ లియోన్ మెరిసింది . అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రాహుల్ భట్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కెన్నెడీ’. కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రీమియర్ను ప్రదర్శించింది యూనిట్. ‘కెన్నెడీ’ పూర్తయిన తర్వాత వీక్షకుల నుంచి ఐదు నిమిషాలకు పైగా స్టాండింగ్ ఒవేషన్ చిత్ర యూనిట్కు ఇచ్చారు. ఇక కాన్స్ రెడ్ కార్పెట్పై సన్నీ లియోన్ నడవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ‘‘కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఇండియన్ సినిమాను రిప్రజెంట్ చేయడం చాలా గౌరవంగా ఉంది’’ అన్నారు సన్నీ లియోన్ . ఈ ఏడాది చివర్లో ఇండియాలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. -
నా భర్త నన్ను మోసం చేశాడు: సన్నీ లియోన్
సన్నీ లియోన్ పేరు చెప్పగానే మీలో చాలామంది అలెర్ట్ అయిపోతారు. ఆమె గతం ఏంటనేది పక్కనబెడితే నటిగా పాన్ ఇండియా స్టార్డమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ముగ్గురు పిల్లలలో కలిసి ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఓ విషయంలో భర్త తనని మోసం చేశాడని చెబుతూ వీడియో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: వైద్యం కోసం విదేశాలకు సమంత.. అతడు ఎమోషనల్!) శృంగార తారగా చాలా క్రేజ్ తెచ్చుకున్న సన్నీ లియోన్.. భారత మూలాలున్న అమెరికన్ నటి. కెనడాలోని ఓ సిక్కు కుటుంబంలో ఈమె పుట్టింది. 2012లో 'జిస్మ్ 2'తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండేళ్ల తర్వాత 'కరెంట్ తీగ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఆ తర్వాత గరుడవేగ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. చివరగా మంచు విష్ణు 'జిన్నా' సినిమాలో కనిపించింది. ఈ మధ్యే భర్తతో కలిసి మాల్దీవులు టూర్ కి వెళ్లిన సన్నీ లియోన్.. దాని తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్లింది. ప్రస్తుతం భర్త డేనియల్ వెబర్ తో కలిసి దుబాయి వెకేషన్లో ఉంది. ఈ క్రమంలోనే రూమ్ లో భర్త దొంగచాటుగా ఐస్ క్రీమ్ తినడాన్ని సన్నీ చూసేసింది. ఈ మొత్తాన్ని వీడియోగా తీసి, ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీనికే 'నా భర్త నన్ను మోసం చేస్తున్నప్పుడు' అనే క్యాప్షన్ పెట్టుకొచ్చింది. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) (ఇదీ చదవండి: 'బేబి' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!) -
ట్రెండీ లుక్లో ప్రణీత ఫోజులు.. సమ్మర్లో చిల్ అవుతోన్న ఇస్మార్ట్ శంకర్ భామ
ట్రెండీ లుక్లో అత్తారింటికి దారేది భామ ప్రణీత సన్ని లియోన్ ట్రెండీ అవుట్ ఫిట్ లుక్స్ ఫ్యాషన్ డ్రెస్లో ప్రియమణి ఫోజులు చిల్ అవుతూ సమ్మర్ను ఎంజాయ్ చేస్తోన్న నభా నటేశ్ View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) -
Cannes 2023: కాన్స్ లో ‘కెన్నెడీ’కి
ఆదరణ ఫ్రాన్స్లో జరుగుతున్న 76వ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో మెరిశారు సన్నీ లియోన్ . అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రాహుల్ భట్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కెన్నెడీ’. కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రీమియర్ను ప్రదర్శించింది యూనిట్. ‘కెన్నెడీ’ పూర్తయిన తర్వాత వీక్షకుల నుంచి ఐదు నిమిషాలకు పైగా స్టాండింగ్ ఒవేషన్ చిత్ర యూనిట్కు దక్కినట్లు తెలిసింది. ఇక కాన్స్ రెడ్ కార్పెట్పై సన్నీ లియోన్ నడవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ‘‘కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఇండియన్ సినిమాను రిప్రజెంట్ చేయడం చాలా గౌరవంగా ఉంది’’ అన్నారు సన్నీ లియోన్ . సన్నీకి హెల్ప్ చేసిన అనురాగ్ కాన్స్ రెడ్ కార్పెట్పై పొడవాటి గౌనులో సన్నీ లియోన్ మెరిశారు. అయితే నడుస్తున్నప్పుడు ఆ గౌను ఆమె షూలో చిక్కుకోవడంతో ఇబ్బందిపడ్డారు. పక్కనే ఉన్న అనురాగ్ కశ్యప్ ఈ విషయాన్ని గ్రహించి సన్నీకి హెల్ప్ చేశారు. అలాగే మౌనీ రాయ్, అదితీరావ్ హైదరీలు కూడా రెడ్ కార్పెట్పై నడిచారు. కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఇండియన్ పెవిలియన్ లో ‘లయనీస్’ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో అదితీ రావ్ హైదరి, సంధు ముఖ్య తారలు. -
చంపేస్తామని బెదిరించారు.. అడల్ట్ ఇండస్ట్రీలో ఇబ్బందులపై హీరోయిన్!
సన్నీ లియోన్ ఇప్పుడు బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ షోతో ఫేమ్ తెచ్చుకున్న భామ ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. మహేశ్ భట్ తెరకెక్కించిన చిత్రం జిస్మ్-2తో అరంగ్రేటం చేసింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత జాక్ పాట్, రాగిణి ఎంఎంఎస్, ఏక్ పహేలీ లీలా లాంటి చిత్రాల్లో కనిపించింది. తాజాగా ఫ్రాన్స్లో జరుగుతున్న 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసింది బాలీవుడ్ భామ. ఈ వేడుకలో ప్రస్తుతం తాను హీరోయిన్గా నటిస్తోన్న కెన్నెడీ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపింది. తాజా ఇంటర్వ్యూలో సన్నీ లియోన్ అడల్ట్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్కు మారే క్రమంలో ఎదురైన ఇబ్బందులను పంచుకుంది. (ఇది చదవండి: రప్ఫాడిస్తున్న మెగాస్టార్.. భోళాశంకర్ క్రేజీ అప్డేట్) సన్నీ లియోన్ మాట్లాడుతూ..' మొదట నన్ను బిగ్ బాస్ మేకర్స్ సంప్రదించారు. కాల్ చేసి షోలో పాల్గొనాలని కోరారు. కానీ దీనిపై నేను నా ప్రియుడు, భర్త డేనియల్ వెబర్తో మాట్లాడా. నీకు బుద్ధి లేదు. నేను ఇండియా వెళ్లడం లేదు. వారంతా నన్ను ద్వేషిస్తారు. ఎందుకంటే నేను ఇప్పటికే అడల్డ్ ఇండస్ట్రీలో ఉన్నా.' అంటూ సన్నీ చెప్పుకొచ్చింది. బిగ్బాస్ హౌస్ గురించి మాట్లాడుతూ.. 'అయితే ఈ షోకి రాకముందే నాకు చాలా అడ్డంకులు వచ్చాయి. చంపేస్తామని బాంబు బెదిరింపులు కూడా వచ్చాయి. తాను బిగ్ బాస్లో దాదాపు 7 వారాల పాటు ఉన్నా. ప్రతి వారం గడిచేకొద్దీ ఏదో మంచి జరుగుతుందని ఆశించా. హౌస్లో ఉండగానే తనకు సినిమా ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత ఒక వ్యక్తిగా వారితో రిలేషన్ తర్వాత తాను అడల్ట్ ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నా.' అంటూ చెప్పింది. (ఇది చదవండి: లైంగిక వేధింపుల కేసు.. హీరోకు షాకిచ్చిన హైకోర్టు!) బిగ్ బాస్ హౌస్లో అందరితో కలిసి వంటచేయడం, రోజువారీ జీవితం నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది. బిగ్ బాస్లో పాల్గొనడం వల్లే అడల్ట్ ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నట్లు తెలిపింది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అంతా బాగానే ఉందని.. కానీ మధ్యలో తాను అనేక అడ్డంకులు ఎదుర్కొన్నట్లు పేర్కొంది. కాగా.. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కిస్తున్న కెన్నెడీ చిత్రంలో రాహుల్ భట్ సరసన నటిస్తోంది. View this post on Instagram A post shared by Deadline Hollywood (@deadline) -
నా జీవితంలో అత్యంత చెత్త సందర్భం అదే: సన్నీ లియోన్
బాలీవుడ్ భామ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'కెన్నెడీ'. ఈ చిత్రాన్ని దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్లుక్ విడుదలైంది. ఈ పోస్టర్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. సన్నీ లియోన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమా ఆడిషన్పై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెన్నెడీ సినిమాకు ఆడిషన్స్ కోసం చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది. రూమ్ మొత్తం మనుషులు ఉండటం చూసి చాలా కంగారు పడ్డానన్నారు. సన్నీ లియోన్ మాట్లాడుతూ..' కెన్నెడీలో ఆఫర్ కోసం అనురాగ్ నాకు ఫోన్ చేసి రమ్మన్నారు. దర్శక, నిర్మాతలు మాత్రమే ఆడిషన్ చేస్తారని తెలుసు. అందుకే ఎలాంటి భయం లేకుండా వెళ్లాను. తీరా చూస్తే అక్కడ సినిమా యూనిట్ అంతా ఉంది. సినిమా కోసం పని చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్స్, ఇతర టీమ్ మొత్తం అక్కడే రూమ్లో ఉన్నారు. దీంతో వాళ్లందర్నీ చూసి నేను ఆశ్చర్యపోయా. ఇది నాకు కంఫర్ట్గా అనిపించలేదు. నాలో చాలా కంగారు మొదలైంది. నేను ఆడిషన్ ఇవ్వడం పూర్తయిన వెంటనే అనురాగ్ వాళ్ల టీమ్ వైపు చూసి.. ఆమె ఎలా చేసింది? అని అడిగారు. ఆ క్షణం సినీ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత చెత్త ఆడిషన్ అదే అనిపించింది,.' అని అన్నారు. అదృష్టవశాత్తు తాను ఆ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని సన్నీ లియోన్ తెలిపారు. -
Sunny Leone: సన్నీలియోన్ చాలా సహకరించింది
శృంగార తార సన్నిలియోన్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ఓ మై ఘోస్ట్. వీఏయూ మీడియా అధినేత వీరశక్తి, వైట్హార్స్ స్టూడియోస్ అధినేత ఆల్.శశికుమార్ కలిసి నిర్మించిన చిత్రం ఇది. యువన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు సతీష్, దర్శగుప్తా, యోగిబాబు, మొటై రాజేంద్రన్, జీపీ ముత్తు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం చెన్నైలో చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసంది. సన్నిలియోన్ మాట్లాడుతూ ఓ మై ఘోస్ట్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో తనను క్వీన్గా మార్చిన యూనిట్ సభ్యులకు, తన టీమ్కు ధన్యవాదాలు తెలిపారు. చిత్రం లవ్, యాక్షన్, కామెడీ, గ్లామర్ తదితర అంశాలతో ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. దక్షిణాది చిత్రాల్లో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఇక్కడి ప్రజల్లో ప్రేమాభిమానాలు ఎక్కువ అన్నారు. ఈ చిత్రంలో నటించడానికి దర్శకుడు యువన్ సహకరించడంతో తమిళ భాష సమస్య అనిపించలేదన్నారు. చిత్ర దర్శకుడు యువన్ మాట్లాడుతూ.. ఈ కథను తయారు చేస్తున్నప్పుడు సన్నిలియోన్ పాత్రను బ్రాకెట్లో పెట్టినట్లు తెలిపారు. ఆ పాత్రకు సన్నిలియోన్ లాంటి నటి అయితే బాగుంటుందని నిర్మాతతో చెప్పగా అలాంటి నటి ఎందుకు ఆమెనే నటించమని అడుగుదాం అన్నారని, దీంతో ఆమెను కలిసి కథ చెప్పగానే బాగుంది చేద్దామని చెప్పారన్నారు. ఆ తరువాత ఆమె ఎంతగానో సహకరించారని తెలిపారు. చిత్రం బాగా వచ్చిందని, ప్రేక్షకులు కొన్న టికెట్కు కచ్చితంగా తగిన వినోదాన్ని అందిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. -
చంపేస్తామని బెదిరించేవారు.. నటి షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ జిన్నా మూవీతో టాలీవుడ్లో అలరించింది. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవల ఓ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. గతంలో ఆమెకు ఎదురైన భయానక సంఘటనలను తలుచుకుని భావోద్వేగానికి గురైంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో బెదిరింపులు వచ్చాయని.. నేను తిరిగి ఇండియాకు వస్తానని అనుకోలేదని సన్నీ తెలిపింది. సన్నీ లియోన్ మాట్లాడుతూ..' నా కెరీర్ ప్రారంభంలో బెదిరింపు మెయిల్స్ వచ్చేవి. చంపేస్తామంటూ సందేశాలు పంపేవాళ్లు. అధిక సంఖ్యలో ఇండియా నుంచి వచ్చేవి. ఇక్కడ ప్రజలు నాపై చాలా కోపంగా ఉన్నారని అనుకున్నా. అవీ నన్ను తీవ్ర ప్రభావితం చేశాయి. అప్పుడు నా వయసు కేవలం 20 ఏళ్లే. ఆ సమయంలో నాకు మంచిచెడులు చెప్పడానికి ఎవరూ లేరు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఎదురైతే నన్నేం చేయలేవు. ఇప్పుడు నేను మానసికంగా చాలా బలంగా ఉన్నా.' అని ఆమె అన్నారు. -
సన్నీ లియోన్ కేసు విచారణపై కేరళ హైకోర్టు స్టే
కొచ్చి: బాలివుడ్ నటి సన్నీ లియోన్కి కోజికోడ్లో ఒక స్టేజ్ షోకి సంబంధించిన కేసు విషయంలో భారీ ఊరట లభించింది. ఆమెపై నాలుగేళ్ల క్రితం కోజికోడ్లో స్టేజ్ ఫెర్ఫార్మెన్స్కి ఒప్పందం విషయమై నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ మేరకు నమోదైన కేసులో తదుపరి చర్యలపై కేరళ హైకోర్టు స్టే విధించింది. సన్నీ లియోన్పై కోజికోడ్లో రంగస్థల ప్రదర్శన కోసం ఒక సంస్థలో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలను ఉల్లఘించారంటూ కార్యక్రమ నిర్వహకుడు షియాస్ కుంజుమహమ్మద్ నాలుగేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పటి క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐతే సన్నీ లియోన్ తనపై దాఖలైన ఎఫ్ఆర్ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడంతో జస్టిస్ జియాద్ రెహమాన్ విచారణ నిలిపేశారు. ఈ మేరకు సన్నీ లియోన్ పిటిషన్లో..తాను, తన భర్త, తమ ఉద్యోగిపై వచ్చి ఆరోపణలను తిరస్కరించారు. ఇప్పటి వరకు తాము ఎలాంటి నేరాలకు పాల్పడలేదని వివరించారు. అలాగే తమను అరెస్టు చేసే విధంగా పోలీసులుకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అందువల్ల వారు ఏమి చేయలేకపోయారని చెప్పారు. తమను దీర్ఘకాలం విచారణ ఎదుర్కొనేలా చేయడంతో తమకు కోలుకోలేని నష్టం వాటిల్లందని వాపోయారు. ఐతే ఆమెపై ఎర్నాకులంకి చెందిన కార్యక్రమ నిర్వాహాకుడు షియాస్ కుంజుమహమ్మద్ ఫిర్యాదు మేరకు క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. షియాస్ సన్నిలియోన్ విదేశాలలో స్టేజ్ షోల ప్రదర్శనకు సుమారు రూ. 39 లక్షలు అదుకుని మరీ ఒప్పందం ఉల్లంఘించారంటూ కోర్టు మెట్లెక్కారు. (చదవండి: ఆప్ అభ్యర్థి కిడ్నాప్!...అంతా చేస్తోంది బీజేపీనే: సిసోడియా) -
టెట్ హాల్ టికెట్పై సన్నీ లియోన్ ఫోటో!
బెంగళూరు: ఎగ్జామ్ హాల్టికెట్పై సన్నీ లియోన్ ఫోటో కలకలం. దీంతో సీరియస్ అయిన విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు నవంబర్ 6న జరిగే కర్ణాటక టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్-2022)కి హాజరయ్యేందుకు యువతి హాల్ టికెట్ డౌన్లౌడ్ చేయగా ఒక్కసారిగా ఖంగుతుంది. దీంతో ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా హల్ టికేట్ స్క్రీన్ షాట్లను షేర్చేసి తన గోడు వెల్లబోసుకుంది. ఈ ఫోటోలు వైరల్ కావడంతో విద్యాశాఖ సీరియస్ అయ్యి విచారణకు ఆదేశించింది. ఈ ఘటన కర్ణాటకలోని రుద్రప్ప కాలేజీ అభ్యర్థికి ఎదురైంది. దీంతో సదరు కాలేజ్ ప్రిన్స్పాల్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐతే పోలీసుల విచారణంలో యువతి ఆన్లైన్లో దరఖాస్తును పూర్తి చేయలేదని వేరేవాళ్లు పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ అభ్యర్థులే ఆన్లైన్లో దరఖాస్తు అప్లై చేసుకునేలా యూజర్ ఐడీ పాస్వర్డ్ రూపొందించామని తెలిపింది. దీనిలో ఎవరూ జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉండదని స్పష్టం చేసింది. ఇది అభ్యర్థి నేరుగా అప్లై చేసుకోవాలి కాబట్టి విద్యాశాఖ పాత్ర ఉండదని తేల్చి చెప్పింది. ఈ ఘటనపై సత్వరమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ పోలీసులను కోరింది. (చదవండి: ఇంటి నుంచి పారిపోయి మరీ పెళ్లి.. ఏమైందో ఏమో కత్తితో పొడిచి...) -
అందంతో కట్టి పడేస్తున్న ‘జిన్నా’ భామ సన్నీ లియోన్.. ఫోటోలు వైరల్
-
Ginna: ‘జిన్నా’ హిందీ డబ్బింగ్ రైట్స్కు రూ.10 కోట్లు!
ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా, పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జిన్నా’. మంచు మోహన్బాబు నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో అక్టోబర్ 21న విడుదైంది. ఈ సినిమాకు విమర్శకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. థియేటర్స్లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఈ సినిమాతో పాటు మరో నాలుగు సినిమాలు కూడా అదే రోజు విడుదల కావడంతో ‘జిన్నా’కు ఆశించిన కలెక్షన్స్ రాలేకపోయాయి. అయితే ‘జిన్నా’మాత్రం మంచు ఫ్యామిలీకి మంచి లాభాలే తెచ్చిపెట్టినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు సమాచారం. ‘జిన్నా’ కంటే ముందు మంచు విష్ణు నటించిన కొన్ని సినిమాలు హిందీలో డబ్బింగ్ అయి మంచి వ్యూస్ సంపాదించుకున్నాయి. దానికి తోడు ‘జిన్నా’లో బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న సన్నీ లియోన్, పాయల్ రాజ్పుత్ నటించడంతో దాదాపు రూ.10 కోట్లకు హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముడుపోయినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. రూ. 15 కోట్లతో జిన్నా సినిమాను నిర్మించారు. ఒక హిందీ డబ్బింగ్ ద్వారానే రూ.10 కోట్లు వచ్చాయి. ఇక డిజిటల్ రైట్స్, థియేట్రికల్ కలెక్షన్స్, ఆడియో రైట్స్.. అన్ని కలుపుకుంటే బడ్జెట్ కంటే ఎక్కువే వచ్చాయట. థియేట్రికల్ కలెక్షన్స్ కంటే డబ్బింగ్, ఓటీటీ రైట్స్ ద్వారా ఎక్కువ లాభం వచ్చిందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి. -
Sunny Leone: ఆ సమయంలో వారు పక్కనుండటం ఇష్టపడను
బాలీవుడ్లో శృంగార తారగా రాణిస్తున్న సన్నీలియోన్ దక్షిణాదిలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. లండన్లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మొదట్లో అశ్లీల చిత్రాల్లో నటించి వివాదాస్పద నటిగా ముద్ర వేసుకుంది. దీంతో 2012 నుంచి అలాంటి చిత్రాలు చేయడం మానేసి హిందీ చిత్రాలు, ఐటమ్ సాంగ్స్లో నటిస్తూ శృంగార తారగా గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఈమె డేనియల్ వైబర్ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కవల పిల్లలకు (మగపిల్లలు) సరోగసీ ద్వారా తల్లిదండ్రులయ్యారు. నిషాకౌర్ అనే కూతురు కూడా ఉంది. శృంగార తారగా రాణిస్తున్న సన్నీ లియోన్ తనకు సినిమా, వ్యక్తిగత జీవితం వేర్వేరు అంటోంది. ఈమెకు ఇప్పుడు దక్షిణాదిలోనూ క్రేజ్ ఉంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో ఐటెం సాంగ్స్తో క్రేజ్ తెచ్చుకుంది. తమిళంలో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటించడం ప్రారంభించింది. అలా ఓ మై ఘోస్ట్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్న సన్నీ లియోన్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను గ్లామరస్గా నటిస్తున్న సమయంలో తన పిల్లలు గాని, ఇతర పిల్లలు గాని అక్కడ ఉండడం ఇష్టపడనని చెప్పింది. వారు అక్కడ ఉంటే షూటింగ్ చేయడమే మానేస్తానని చెప్పింది. -
'జిన్నా' మూవీ రివ్యూ
టైటిల్: జిన్నా నటీనటులు: మంచు విష్ణు, పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్, వెన్నెల కిశోర్, సునీల్, నరేశ్, రఘుబాబు, సత్యం రాజేశ్, చమ్మక్ చంద్ర,సద్దాం తదితరులు నిర్మాణ సంస్థలు: అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాతలు: మోహన్బాబు, మంచు విష్ణు కథ, స్క్రీన్ప్లే: కోన వెంకట్ దర్శకత్వం: ఇషాన్ సూర్య సంగీతం: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు ఎడిటర్: చోటా కే ప్రసాద్ విడుదల తేది: అక్టోబర్ 21, 2022 మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో నటించిన సినిమా 'జిన్నా'. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సన్నీలియోన్, పాయల్ రాజ్పుత్లు హీరోయిన్స్గా నటించారు. స్క్రీన్ప్లేను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా నేడు(అక్టోబర్ 21) విడుదలైంది. కేవలంలో తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈరోజు విడుదల చేశారు. మరి ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయి? ఆడియెన్స్ను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం. జిన్నా కథ ఏంటంటే.. గాలి నాగేశ్వర రావు అలియాస్ జిన్నా తన స్నేహితులతో కలిసి టెంట్హౌస్ నడుపుతుంటాడు. అప్పుచేసి మరీ టెంట్హౌస్ పెడతాడు. అయితే అతను టెంట్హస్ వేస్తే పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. ఇంకోవైపు అంతకంతకూ అప్పు పెరిగిపోతుంటుంది. మరోవైపు ఓ గుండా దగ్గర జిన్నా అప్పులు చేయడంతో దాన్ని తిరిగి తీర్చలేక పరారీలో ఉంటాడు. చివరికి ఆ గుండా జిన్నాని పట్టుకొని అప్పు తీర్చడానికి ఓ షరతు పెడతాడు. అదేంటంటే.. తన సోదరిని వివాహం చేసుకుంటే అప్పు మొత్తం తీర్చేసినట్లే అని కండీషన్ పెడతాడు. ఇదే సమయంలో అమెరికా నుంచి వచ్చిన జిన్నా చిన్ననాటి స్నేహితురాలు రేణుక(సన్నీలియోన్)ఊర్లోకి దిగుతుంది.దాంతో జిన్నా పరిస్థితి మారుతుంది. అప్పులు తీరిపోతాయి. ప్రెసిడెంట్ అవ్వాలన్నా జిన్నా కోరిక కూడా తీరబోతుంది. అయితే రేణుకతో పెళ్లికి రెడీ అయిన జిన్నా.. తాను ప్రేమించిన పచ్చళ్ల స్వాతి (పాయల్ రాజ్పుత్)తో కలిసి వేసిన పథకం ఏంటి? చివరకు జిన్నా ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అన్నదే మిగితా కథ. ఎవరెలా నటించారంటే.. జిన్నాగా మంచు విష్ణు కామెడీ సన్నివేశాల్లో చాలా బాగా నటించారు. కొన్ని సన్నివేశాలు ఢీ సినిమాను గుర్తుచేస్తాయి.యాక్షన్, కామెడీలో తన స్టైల్లో మెప్పించాడు. పాయల్ రాజ్పుత్ చేసిన స్వాతి పాత్ర రొటీన్గా అనిపించినా తన అందంతో ఆకట్టుకుంటుంది. సన్నీలియోన్ పాత్ర అందరిని మెస్మరైజ్ చేస్తుంది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్ చేశాక, ఆమె పాత్ర కాస్త తేలిపోయినట్లు అనిపిస్తుంది. మిగతా పాత్రలు పోషించిన సురేశ్, నరేశ్, రఘుబాబు, సునీల్, ‘సత్యం’ రాజేశ్, గౌతంరాజు, చమ్మక్ చంద్ర, ‘వెన్నెల’ కిశోర్, భద్రం తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.బిగ్బాస్ ఫేమ్ దివి, త్రిపురనేని చిట్టి గెస్ట్ అప్పీరియన్స్లో కనిపించారు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం ఆకట్టుకుంటుంది. ఎలా ఉందంటే..జిన్నా కథ మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేసేంత ఫ్రెష్నెస్ ఏమీ లేదు కానీ, కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్విస్తాయి. అప్పటిదాకా ఓ కామెడీ, ఓ సాంగ్, ఓ ఫైట్ అన్నట్టుగా పక్కా కమర్షియల్ ఫార్మాట్లో సాగుతున్న కథకు ఇంటర్వెల్లో అదిరిపోయే ట్విస్ట్ ఎదురవుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం సెకండాఫ్పై క్యూరియాసిటీని పెంచింది. సన్నీ లియోన్ తన నటనతో ఆశ్చర్యపరుస్తుంది. సెకండాఫ్ను కొంచెం డిఫరెంట్గా డీల్ చేసే ప్రయత్నం చేశారు.వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్రల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. అయితే కొన్ని బలవంతపు కామెడీ సీన్స్ ఉన్నట్లు అనిపించడంతో కోర్ ఎమోషన్ సరిగ్గా పండలేదు.ఇందులో మంచు విష్ణు వేసిన డైలాగ్స్ కొన్ని ట్రోలర్లకు కౌంటర్లుగా అనిపించింది. నన్ను ట్రోల్ చేస్తే ఓకే గానీ నా ఫ్యామిలీ జోలికి వస్తే అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా జిన్నా పర్వాలేదనిపిస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. కెమెరా, ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా అన్నీ కూడా పర్వాలేదనిపిస్తాయి.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
‘జిన్నా’ నవ్వి నవ్వి కడుపునొస్తుంది: మంచు విష్ణు
‘‘జిన్నా’ ని రెండు షోలు ప్రివ్యూ వేశాం.. చూసిన వారందరూ విపరీతంగా ఎంజాయ్ చేశారు. మా అమ్మ, అత్తగార్లు కూడా చప్పట్లు కొట్టేసి నవ్వుతూ ఎంజాయ్ చేశారు. అప్పుడు వచ్చిన నమ్మకంతోనే ‘జిన్నా’ని ఎక్కువగా ప్రమోట్ చేశాను. నేను, ‘వెన్నెల’ కిశోర్, చమ్మక్ చంద్ర సెకండాఫ్లో కడుపుబ్బా నవ్విస్తాం.. నవ్వి నవ్వి ప్రేక్షకులకు కడుపునొస్తుంది’’ అని హీరో విష్ణు మంచు అన్నారు. ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా, పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జిన్నా’. మంచు మోహన్బాబు నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంచు విష్ణు పంచుకున్న విశేషాలు... ►మా నాన్న(మోహన్ బాబు) ‘జిన్నా’ చిత్రాన్ని ‘ఢీ’ సినిమాతో పోల్చారు. ‘ఢీ’ చేస్తున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాం. విడుదలయ్యాక అది కల్ట్ సినిమా అయింది. ‘ఢీ’లో ఇంటర్వెల్కు అంత సర్ప్రైజ్ అనిపించదు. కానీ, ‘జిన్నా’లో ఇంటర్వెల్కు అందరూ సర్ప్రైజ్ షాక్ అవుతారు. అయితే ‘జిన్నా’’ మూవీ ‘ఢీ’ రేంజ్లో సక్సెస్ అవుతుందా? లేదా? అనేది చూడాలి. ∙యాక్షన్ కామెడీ జానర్లో నేను చేసిన సినిమాలన్నీ హిట్లు ఇచ్చాయి. మధ్యలో వేరే జానర్స్ ప్రయత్నించి, తప్పు చేశాను. ఆ తప్పుని సరిదిద్దుకోవడం కోసమే ‘జిన్నా’ చేశా. ప్రతి సినిమా బాగుండాలనే అందరూ అనుకుంటాం.. కానీ, ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు. ∙‘జిన్నా’లో నా పాత్ర పేరు గాలి నాగేశ్వరావు. జీనా అని పిలిస్తే బాగుండదు.. అందుకే జిన్నా అని పెట్టాం. జిన్నా అప్పు చేసి టెంట్ హౌస్ పెట్టుకుంటాడు. ఏ పెళ్లికి టెంట్ వేసినా ఆ పెళ్లి ఆగిపోతుంది. అప్పుడు అప్పు ఎలా తీర్చాడు?. అన్నదే ఈ చిత్ర కథ. ∙ ► ‘పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి’ సినిమాలకు ఏమైనా ప్రిపేర్ అయ్యారా? అని నాన్నని అడిగాను. ‘ప్రిపరేషన్ లేదు.. మన పాత్ర చెబుతారు.. దాన్నే దృష్టిలో పెట్టుకుని చేయాలి’ అని ఆయన చెప్పడంతో షాక్ అయ్యాను. ‘జిన్నా’ కోసం నేను చిత్తూరు యాస మాట్లాడాల్సి వచ్చింది.. దాని కోసం కష్టపడ్డాను. జి.నాగేశ్వరరెడ్డిగారు ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ చిత్రానికి శ్రీనువైట్లగారి అసిస్టెంట్ సూర్యను డైరెక్టర్గా తీసుకున్నాం. ► ఈ చిత్రానికి మూల కథ జి.నాగేశ్వరరెడ్డిగారు అందించారు. ‘జిన్నా’ కోసం కోన వెంకట్గారు ప్రతి రోజూ పని చేశారు.. ఆయనకు చాలా థ్యాంక్స్. మనకు జనాలతో కనెక్షన్ ఉండాలంటే సోషల్ మీడియాలో ఉండక తప్పదు. అయితే ఇందులో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సిందే. ∙‘జిన్నా’తో నా కెరీర్లో ది బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు అనూప్ రూబె¯Œ ్స. ఈ చిత్రంలో చిన్నపిల్లల ట్రాక్ని నా కుమార్తెలు అరియానా, వీవీయానా పాడాలనే ఆలోచన నాదే. దీనిపై అనూప్ తొలుత సందేహపడ్డా, వారి పాట విన్నాక సంతోషించాడు. భవిష్యత్తులో వాళ్లు మంచి సింగర్లు కావాలని కోరుకుంటున్నాను.. కానీ వాళ్లకి నటీమణులు కావాలని ఉంది. ►నేను నటించే సినిమాలు మా అమ్మ, నా పిల్లలతో కలిసి చూసేలా ఉండాలనుకుంటున్నా. ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్ మాస్టర్లు డ్యాన్స్ విషయంలో బాగా కష్టపెట్టారు. నా కెరీర్లో బెస్ట్ సాంగ్స్, డ్యాన్స్లు ‘జిన్నా’ లో ఉన్నాయి. ► కొన్ని సినిమాల రీమేక్ హక్కులు కొన్నాను. మా ప్రొడక్షన్లో వేరే హీరోలతోనూ ఆ సినిమాలు చేస్తాను. నవంబర్లో ఆ చిత్రాల గురించి ప్రకటిస్తాను. ప్రస్తుతానికి యాక్షన్ కామెడీ జానర్లోనే సినిమాలు చేయాలనుకుంటున్నాను. శ్రీను వైట్లగారు, నేను కలిసి చేయనున్న చిత్రం జనవరి లేదా ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. మరో క్రేజీ ప్రాజెక్ట్కి చర్చలు జరుగుతున్నాయి. ► ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) టీమ్లో అంతా మంచి వాళ్లున్నారు. వారు బాగా పని చేస్తుండటంతో నేను ఓ వైపు హీరోగా, మరోవైపు ‘మా’ అధ్యక్షునిగా ప్రశాంతంగా ఉంటున్నాను. ‘మా’ అధ్యక్షునిగా మళ్లీ పోటీ చేయనన్నాను. నా కంటే ఇంకా మంచి ప్రెసిడెంట్ రావొచ్చేమో? ఒక వేళ ఇండస్ట్రీ పెద్దలు మళ్లీ నన్ను చేయమంటే చేస్తాను. అయితే ఈసారి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మంచిదని నా అభిప్రాయం. -
Ginna Twitter Review: ‘జిన్నా’మూవీ ట్విటర్ రివ్యూ
మంచు విష్ణుటైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘జిన్నా’. పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్గా నటించారు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లేను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా నేడు(అక్టోబర్ 21) విడుదలైంది. మంచు విష్ణు భారీ ఆశలు పెట్టుకున్న ‘మోసగాళ్లు’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి.. తనకు అచ్చొచ్చిన కామెడీ యాక్షన్తో మళ్లీ వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ని క్రియేట్ చేశాయి. కేవలంలో తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈరోజు విడుదల చేశారు.ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అవేంటో చూడండి. Story okish and lil sloppy .. But when vishnu meets sunny Adrenaline kicks in … Action sequences and visuals are awesomest 🔥🔥 Vishnu’s perfection in terms of diction n super heroic swag 👌👌 Climax🔥🙏 3.23/5#Ginna @iVishnuManchu proud of u anna..super undi movie — pakash raj pspk (@pakash787791) October 20, 2022 ‘కథ ఫర్వాలేదు. సినిమా కాస్త నెమ్మదించింది. కానీ, సన్నీని విష్ణు కలిసినదగ్గర నుంచి కిక్ వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్లు, విజువల్స్ అదిరిపోయాయి’ అంటూ 3.23 రేటింగ్ ఇచ్చాడు ఓ నెటిజన్. I completed watching the #Ginna Movie , @iVishnuManchu comeback with his comedy timing like in #dhee, those who went for #sunnyleone will definitely not feel regret , #vishnumanchu did a right choice selecting horrorcomedy zonner,rest is mouth talk. Rating:3/5⭐ Congrats team❤️ — Movie Buff (@UnitedTwood2108) October 20, 2022 #ginna Positive: @iVishnuManchu looks fun nd superb.@SunnyLeone looks beautiful and impressive.@starlingpayal scroes well.Gud Casting.@anuprubens music are backbone.Dances are good.Comedies are worked well. Negative: 1 hlf feel length. Verdict:Fun Entertainment Rating:3.0/5 — pakash raj pspk (@pakash787791) October 21, 2022 #ginna sunny Leone 🔥 intervel twist is shocking Awesome songs and dance . Anup bgm for sunny is goosebumps #randaka #randaka — vishnu admirer (@ranap03816208) October 21, 2022 మరోవైపు ఈ సినిమాపై మాత్రం నెగిటివ్ ట్రోలింగ్ ఆగడం లేదు.. కావాలనే కొంతమంది నెగిటివ్గా ట్వీట్లు చేస్తున్నారు. సినిమా బాగోలేదంటూ విషప్రచారం చేస్తున్నారని మంచు విష్ణు మండిపడ్డారు. ఓ పెయిడ్ బ్యాచ్ సోషల్ మీడియాలో నెగెటివ్ రివ్యూ ఇస్తున్నారని, ఇది తాను ముందే ఊహించానని విష్ణు ట్వీట్ చేశాడు. As expected. I am calling out the ‘paid batch’. GINNA hasn’t released and these guys have started giving negative reviews. Why so much hatred???? 🙄. I hope they realize that we will shut their channels down soon. pic.twitter.com/6FJ1xV4vaj — Vishnu Manchu (@iVishnuManchu) October 20, 2022 -
సినిమానే నా ఊపిరి
‘‘సినిమానే మన ఊపిరి అని మా గురువు దాసరి నారాయణరావుగారు అనేవారు.. అలా సినిమానే మా ఊపిరి.. నా ఊపిరి. కళామతళ్లి మాకు భోజనం పెట్టింది. ‘జిన్నా’ సినిమా గొప్ప హిట్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు అన్నారు. విష్ణు మంచు హీరోగా, పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘జిన్నా’. ఈశాన్ సూర్య దర్శకత్వం వహించారు. అవ్రామ్ భక్త మంచు సమర్పణలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్పై మంచు మోహన్బాబు నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘జిన్నా జాతర’ పేరుతో హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో మంచు మోహన్ బాబు మాట్లాడుతూ–‘‘జిన్నా’లో విష్ణు ఎంతో రిస్కీ షాట్స్ చేశాడు.. జీవితంలో అలాంటి సన్నివేశాలు చేయడం మంచిది కాదని చెప్పాను. ‘ఢీ’ కంటే పది రెట్ల హిట్ని ‘జిన్నా’ అందుకోవాలి. విష్ణుని ఛోటా కె.నాయుడు అద్భుతంగా చూపించాడు. మంచి మ్యూజిక్ ఇచ్చిన అనూప్కి థ్యాంక్స్. అరియానా– వీవీయానా ఇంత అద్భుతంగా పాడతారని కలలో కూడా ఊహించలేదు. ఈ సినిమా ద్వారా సూర్య గొప్ప డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నా. నాకు ఎన్నో హిట్ పాటలకు డ్యాన్స్లు సమకూర్చిన ప్రభుదేవా ‘జిన్నా’ లో విష్ణుకి నృత్యరీతులు సమకూర్చారు.. మా ఫ్యామిలీలో ఒకడిగా, మాపై ఉన్న గౌరవంతో తను డబ్బు తీసుకోకుండా చేసినందుకు థ్యాంక్స్’’ అన్నారు. విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘జిన్నా’ సినిమాకి ముందుగా కోన వెంకట్గారికి థ్యాంక్స్. ఛోటాగారితో ఎప్పటి నుంచో పనిచేయాలని అనుకుంటున్నాను.. ఇప్పుడు కుదిరింది. ‘జిన్నా’ నా మనసుకి బాగా దగ్గరైన సినిమా. నా కెరీర్లో బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్కి థ్యాంక్స్. అరియానా–వీవీయానా తొలిసారి అయినా అద్భుతంగా పాడారు. ఇంత మంచి సినిమా ఇచ్చిన సూర్యకి థ్యాంక్స్. అందరూ మా సినిమాని చూసి, మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ‘జిన్నా’ కథా రచయిత జి.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘జిన్నా’ రషెస్ చూసినప్పుటి నుంచి ఒక బ్లాక్బస్టర్ వైఫై నా చుట్టూ తిరుగుతోంది.. ఇది వందశాతం నిజం. సినిమా బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీలో హిట్ చూసిన ఎవరైనా సరే.. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మోహన్ బాబు, చిరంజీవిగార్లు.. ఎవరైనా ఫ్లాప్ చూస్తారు.. కానీ, ఫ్లాప్ని ఎదుర్కొనే దమ్ము ఉండాలి. ఆ దమ్ము మోహన్బాబుగారి ద్వారా విష్ణుకి వచ్చింది.. తను ఎదుర్కొన్నాడు.. ‘జిన్నా’ తో బ్లాక్ బస్టర్ కొడతాడు’’ అన్నారు.‘‘జిన్నా’ సినిమా కాదు.. మా అన్నయ్య(మోహన్బాబు)గారు నాపై పెట్టిన బాధ్యత. ఈ చిత్రం వందశాతం ప్రేక్షకుల్ని సంతృప్తి పరుస్తుంది’’ అన్నారు చిత్ర క్రియేటివ్ ప్రొడ్యూసర్, స్క్రిప్ట్ రైటర్ కోన వెంకట్. ఈ సమావేశంలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నటులు అలీ, చమ్మక్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
జిన్నా మూవీ టీం తో స్పెషల్ చిట్ చాట్
-
పాన్ ఇండియా సినిమాల పై మంచు విష్ణు కామెంట్స్
-
జిన్నా మూవీ నుంచి మాస్ సాంగ్ విడుదల
మంచు విష్ణు, పాయల్ రాజ్పుత్, సన్నీ లియోన్ హీరో హీరోయిన్లుగా ఈషాన్ సర్య దర్శకత్వంలో రపొందిన త్రం ‘జిన్నా’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మించిన ఈ త్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘జారు మిఠాయో..’ అనే పాట లిరికల్ వీడియోను సోమవారం విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ పాటకు ఎ. గణేష్ సాహిత్యం అందించగా సింహా, నిర్మలా రాథోడ్ పాడారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్. నాగేశ్వరరెడ్డి మూల కథ అందించిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే–క్రియేటివ్ ప్రొడ్యూసర్: కోన వెంకట్, కెమెరా: ఛోటా కె. నాయుడు. -
దసరాకు మంచు విష్ణు సర్ప్రైజ్.. జిన్నా ట్రైలర్ అవుట్
మంచు విష్ణు హీరోగా తెరెకెక్కుతున్న తాజా చిత్రం 'జిన్నా'. ఇషాన్ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడులైన టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ను వదిలారు మేకర్స్. దసరా కానుకగా ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృదం. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. ఇవాళ విడుదలై ట్రైలర్ చూస్తే కామెడీ, హార్రర్ను తలపిస్తోంది. ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు పాత్రలో కనిపించనున్నారు. కామెడీ, హారర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. -
మంచు విష్ణు 'జిన్నా' టీజర్ వచ్చేసింది
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ఇందులో టెంట్ హౌస్ నిర్వహించే యువకుడి పాత్రలో మంచు విష్ణు కనిపించనున్నట్లు తెలుస్తుంది. 'వీడేందిరా మనల్ని దొబ్బుతున్నాడు..'అంటూ విష్ణు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. Excited to share #Ginna teaser. Quite eager to bring the movie to you soon. ✊🏽❤️ || #Hindi @SunnyLeone @starlingpayal @avaentofficial @24FramesFactory pic.twitter.com/YUot8WLVC3 — Vishnu Manchu (@iVishnuManchu) September 9, 2022 -
ఇప్పటికీ నాతో వారు నటించేందుకు సంకోచిస్తున్నారు: నటి ఆవేదన
సన్ని లియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు నీలి చిత్రాలతో గుర్తింపు పొందిన ఆమె పదేళ్ల క్రితం బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ రకం చిత్రాలకు స్వస్తి పలికి 2012లో బాలీవుడ్కు మాకాం మార్చి కెరీర్ను కొత్తగా ప్రారంభించింది. హీరోయిన్గా, నటి ప్రస్తుతం బాలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంటోంది. అయితే ఇప్పటికి తనతో నటించేందుకు కొందరు సంక్షోచిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: సల్మాన్పై మరోసారి విరుచుకుపడ్డ మాజీ ప్రేయసి ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ... ‘నేను ఈ పరిశ్రమలో(బాలీవుడ్) అడుగు పెట్టినప్పుడు నాతో కలసి పనిచేయడానికి చాలా మంది వెనుకాడారు. కానీ, అదే సమయంలో నాతో నటిచేందుకు ఎంతో మంది ఆసక్తి చూపించారు. కానీ, పేరొందిన నిర్మాణ సంస్థలు, వ్యక్తులు ఇప్పటికీ నాతో కలసి పనిచేయడానికి సంకోచిస్తున్నారు’ అని చెప్పింది. అయినా ఇదేం తనని బాధించడం లేదని, ఎందుకంటే ఏదోక రోజు వారితో కలసి పనిచేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. అనంతరం తన గతం గురించి ప్రస్తావిస్తూ ‘2012లో పరిశ్రమలో అడుగుపెట్టే నాటికి నేను పూర్తిగా భిన్నమైన వ్యక్తిని. చదవండి: మంచు లక్ష్మికి అరుదైన గౌరవం, 100 మంది మహిళల్లో ఒకరిగా.. నేను మెరుగైన జీవితం గురించి ఆలోచించాను. ఇక్కడ ఉండడాన్ని ఇష్టపడ్డాను. ఈ పరిశ్రమ అంటే నాకు ఇష్టం. ఇప్పటి వరకు నేను చేసిన అన్ని పాత్రల విషయంలోనూ సంతోషంగానే ఉన్నా. అందులో మంచి, చెడు ఎంపికలు కూడా ఉన్నాయి. అద్భుతమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం వచ్చింది. ఇది నా ఇల్లే అని తెలుసుకున్నాను. నేను మొదటిసారి ఇక్కడకు వచ్చినప్పుడు ఈ స్థాయిలో పరిశ్రమను ప్రేమిస్తానని అనుకోలేదు. నాకు మద్దతు తెలిపిన అభిమానులకు ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చింది. -
మంచు విష్ణు 'జిన్నా' టీజర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే
విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సన్నీ లియోన్, పాయల్ రాజ్పుత్ హీరోయిన్లు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రం ఇది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే కోన వెంకట్ అందించారు.’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఛోటా కె. నాయుడు. -
సన్నీ లియోన్ ఇంట రాఖీ సంబరాలు, ఫొటోలు వైరల్
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఇంట రాఖీ పండుగ సందడి నెలకొంది. తన భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండగను సెలబ్రెట్ చేసుకుంది. దత్త కూతురు నిష, తన కవల సోదరులు రాఖీ కట్టిన ఫొటోనలు ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఇద్దరు కుమారులు, కుమార్తెతో ఉన్న ఫొటోను సన్నీ ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. చదవండి: పంత్కు రీకౌంటర్ ఇచ్చిన ఊర్వశి, ‘కౌగర్ హంటర్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు ‘అందరికీ సంతోషకరమైన రక్షా బంధన్ శుభాకాంక్షలు. నా కుటుంబాన్ని ప్రేమిస్తాను’ అంటూ ఆమె పోస్ట్ చేసింది. అలాగే సన్నీ తన స్నేహితుడైన రోహిత్ వర్మ, సెక్యూరిటీ సలహాదారు యూసుఫ్ ఇబ్రహీంకు రాఖీ కట్టిన ఫొటోలను కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. అలాగే సన్నీ ఆమె ఫాలోవర్స్ రాఖీ శుభాకాంక్షలు చెబుతూ తన పోస్ట్పై రియాక్ట్ అవుతున్నారు. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
రేణుక ఫస్ట్ లుక్ పోస్టర్.. స్టయిలిష్ లుక్లో సన్నీ లియోన్
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సన్నీ లియోన్, పాయల్ రాజ్పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణుక పాత్రలో సన్నీ కనిపిస్తారు. బుధవారం స్టయిలిష్గా ఉన్న రేణుక ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేను రచయిత కోన వెంకట్ అందించారు. ‘‘కమర్షి యల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. తెలుగు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ‘జిన్నా’ విడుదల కానుంది. ‘నాటు నాటు’ ఫేమ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ చిత్రానికి నృత్యాలు అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఉర్రూతలూగించే సంగీతం అందించగా, ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. -
వింత సెంటిమెంట్: విరాట్ చేతికి అవే గ్లోవ్స్. ఆ నటి కాళ్లు కడుక్కోవాల్సిందేట!
క్రియేటివిటీ క్లిక్ అవడమనేది అదృష్టంతో కూడుకున్నదని భావిస్తుంటారు మన దగ్గర ఆ రంగంలో ఉన్నవాళ్లు. అందుకే సినీ ఫీల్డ్లో మూఢనమ్మకాల ప్రదర్శన ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాగే టెక్నిక్, శారీరక శ్రమతో సాగే ఆటల మైదానాల్లోనూ ఈ అదృష్టమే గెలుస్తుందన్న అభిప్రాయమూ ఉంది.. అందుకే అక్కడా నమ్మకాలు పందెం వేసుకుంటూంటాయి. ఆ రెండు రంగాల్లోని ఘనాపాటీల సెంటిమెంట్ల పోటీ ఇది.. తీన్ పత్తీ మన దేశంలో.. ఆటల్లో క్రికెట్ మర్రి చెట్టులా వేళ్లూనుకుంది. ఇంకే ఆటకూ గ్రౌండ్ సరిపోనంతగా. అందుకే క్రికెట్ ప్లేయర్స్కున్నంత క్రేజ్.. గ్లామర్ మిగతా ఆటగాళ్లకు లేదు. వాళ్ల అలవాట్లు, ఆలోచనలూ వార్తలకెక్కలేదు. ఇక్కడ మాత్రం ఫుట్బాల్లో మన లెజెండ్ భైచుంగ్ భుటియా వింత అలవాటును ప్లేస్ చేద్దాం. అదేంటంటే.. తను ఫుట్బాల్ పిచ్లోకి ఎంటరయ్యే ముందు ‘తీన్ పత్తీ (మూడు ముక్కలాట)’ ఆడి మరీ వెళ్తాడట. దానివల్ల తన గేమ్.. తన టీమ్ విజయం సాధిస్తుందని భైచింగ్ విశ్వాసమట. కచ్చితంగా చెక్ చేసుకుంటుంది.. ప్రీతి జింటాకూ ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) ఉంది. పరాయి ఊరు, దేశం ఇలా ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా హోటల్లో బస బుక్ చేసుకునే ముందు అక్కడి బాత్రూమ్స్ గురించి వాకబు చేస్తుందట. శుభ్రంగా ఉంటాయనే రివ్యూ వస్తేనే ఆ హోటల్లో బస చేస్తుందట. అంతేకాదు హోటల్లోకి చెకిన్ అయ్యేకంటే ముందు బాత్రూమ్ని నీట్గా కడిగించాకే ఆ స్వీట్లోకి ఎంటర్ అవుతుందట. అదీ ఆమె ఓసీడీ. కాళ్లు కడుక్కోవాల్సిందే నటి సన్నీ లియోనికి పదే పదే కాళ్లు కడుక్కునే అలవాటు ఉందిట. ‘అలవాటు అంటారేంటండీ బాబూ.. అదో పిచ్చి’ అంటూ గుర్రుమంటారు ఆమెతో పనిచేసే వాళ్లు. ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి కాళ్లు కడుక్కుంటూ ఉంటుందట. ‘ఆ పిచ్చి వల్ల జిస్మ్ 2 సినిమా షూటింగ్ అనుకున్నదానికన్నా ఎంతో ఆలస్యంగా పూర్తయింది. దాంతో నిర్మాతలే కాదు యూనిట్ అంతా సఫర్ అయింది తెలుసా?’ అంటూ కామెంట్ చేస్తారు ఆ యూనిట్ సభ్యులు సెలబ్రిటీల సెంటిమెంట్స్ చర్చకు వచ్చినప్పుడల్లా. ఇప్పటికీ? ఏమో మరి! సినిమా వాళ్లకెన్ని సెంటిమెంట్స్ ఉంటాయో క్రికెట్ స్టార్స్కూ అన్నే సెంటిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఏస్ క్రికెటర్ విరాట్ కొహ్లీకున్న సెంటిమెంట్ లేక నమ్మకం గురించి చెప్పుకుందాం. కెరీర్లో ఫస్ట్ టైమ్ మంచి స్కోర్ చేసినప్పుడు ఏ గ్లోవ్స్ అయితే వేసుకున్నాడో.. తర్వాత ఆడిన ప్రతి మ్యాచ్లోనూ అవే గ్లోవ్స్ వేసుకోవడం మొదలుపెట్టాడట ఈ బాట్స్మన్. దాన్ని అలవాటుగా స్థిరపరచుకుని కొన్నాళ్లు కంటిన్యూ చేశాడని చెప్తారు అతని సన్నిహితులు. ‘ఇప్పటికీ అవే గ్లోవ్స్ వాడతాడా?’ ఏమో.. మరి! -
సింగర్స్గా మారిన మంచు విష్ణు కుమార్తెలు
హీరో విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా సింగర్స్గా పరిచయమవుతున్నారు. మంచు విష్ణు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. పాయల్ రాజ్పుత్, సన్నీ లియోన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డా.మంచు మోహన్బాబు ఆశీస్సులతో అవ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించి, క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. (చదవండి: కమల్ హాసన్ నుంచి అది నేర్చుకున్నా: సాయిపల్లవి) ఈ చిత్రంలో గాలి నాగేశ్వరరావు అనే మాస్ పాత్ర చేస్తున్నారు విష్ణు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఓ పాటను అరియానా, వివియానా పాడారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాట సినిమాలో కీలక సందర్భంలో వస్తుంది. ఈ చిత్రానికి కెమెరా: ఛోటా.కె. నాయుడు, మూల కథ: జి.నాగేశ్వరరెడ్డి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4441454862.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సన్నీ లియోన్తో మంచు విష్ణు ఫన్నీ గేమ్, నెటిజనుల సందడి!
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరో మంచు విష్ణు శివబాలాజీ బాలీవుడ్ స్టార్ సన్నీ లీయోన్తో కలిసి ఒక గేమ్ ఆడారు. ఒకరి తరువాత ఫన్నీ గేమ్ ఆడుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సన్నీ ట్విటర్లో పోస్ట్ చేశారు. బాల్యంలో ఆడుకున్న ఆట గుర్తొచ్చిందంటూ కొందరు కమెంట్ చేయగా, మరింత ఫన్నీగా, మరికొందరు స్పందించారు. సన్నీ, మంచు విష్ణును భయపెట్టేందుకు ప్రయత్నించిన వీడియో ఇటీవల నెట్టింట హల్ చల్ చేసింది. కాగా విష్ణు తాజా చిత్రం గాలి నాగేశ్వరరావులో సన్నీ లియోన్ కీలక పాత్ర పోషిస్టున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపు కుంటోంది. ఈ క్రమంలో షూటింగ్ బ్రేక్లో సన్నీ, విష్ణు, బాలాజీ ఈ ఫన్నీ వీడియోతో సందడి చేశారు. Love this game!! pic.twitter.com/wyhr3wq5KV — Sunny Leone (@SunnyLeone) April 15, 2022 -
గెస్ట్లు ఇచ్చిన డబ్బులతోనే రిసెప్షన్ బిల్లు కట్టాం: సన్నీలియోన్
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ శనివారం నాడు తన పెళ్లినాటి ఫొటోను షేర్ చేసింది. ఈ సందర్భంగా 11 ఏళ్ల క్రితం జరిగిన తన వివాహ వేడుక తాలూకు జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. 'ఈ రోజుతో నాకు పెళ్లై 11 ఏళ్లు. ఆ సమయంలో చేతిలో డబ్బులు కూడా లేవు. 50 మంది కంటే తక్కువమంది అతిథుల సమక్షంలో మా వివాహం జరిగింది. వాళ్లు మా చేతిలో పెట్టిన ఎన్విలాప్ కవర్లు గబగబా తీసి అందులో ఉన్న డబ్బుతో రిసెప్షన్ ఫీజులు కట్టాము. కొందరు తాగిన మత్తులో ఏదేదో వాగారు. ఇద్దరం కలిసి ఎంతోదూరం ప్రయాణించాము. ప్రేమతోనే అది సాధ్యమైంది. మా పెళ్లి స్టోరీ అంటే నాకెంతో ఇష్టం. మేము ఎంతో దూరం వచ్చేశాం. హ్యాపీ యానివర్సరీ బేబీ' అని రాసుకొచ్చింది. అటు సన్నీలియోన్ భర్త డేనియల్ కూడా వారిద్దరి ఫొటో షేర్ చేస్తూ భార్యకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపాడు. కాగా సన్నీ, డేనియల్ వివాహం జరిగింది. వీరు 2017లో నిషా అనే ఆడపిల్లను దత్తత తీసుకున్నారు. ఆ తర్వాతి ఏడాది సరోగసి ద్వారా ఆశర్, నోవా అనే కవలలకు జన్మనిచ్చారు. ఇటీవలే సన్నీలియోన్ ఫ్యామిలీ మాల్దీవులకు కూడా వెళ్లివచ్చింది. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Daniel "Dirrty" Weber (@dirrty99) చదవండి: ఆమెతో కమెడియన్ లవ్ ట్రాక్.. ఒక్క ఫొటోతో బండారం బయటపెట్టిన కంగనా ఒంటిపై బట్టల్లేకుండా ఫొటోలు.. కాంప్రమైజ్ కావాలనేవారు -
‘గాలి నాగేశ్వరరావు’ సందడి మళ్లీ మొదలైంది
గాలి నాగేశ్వరరావు (మంచు విష్ణు చేస్తున్న పాత్ర పేరు) సందడి హైదరాబాద్లో మళ్లీ మొదలైంది. మంచు విష్ణు, పాయల్ రాజ్పుత్, సన్నీ లియోన్ ప్రధాన తారాగణంగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈషాన్ సూర్య దర్శకత్వంలో మంచు మోహన్బాబు ఆశీస్సులతో అవ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. విష్ణు, సన్నీపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్లో విష్ణు, సన్నీ చేసిన ఓ సరదా రీల్ వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, క్రియేటివ్ ప్రొడ్యూసర్: కోన వెంకట్, కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
సన్నీ లియోన్ను చూసి భయపడ్డ విష్ణు, ఏం జరిగిందంటే..
Sunny Leone Try To Scare Manchu Vishnu: సన్నీలియోన్, మంచు విష్ణుకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోలో సన్నీలియోన్, విష్ణును భయపెట్టేందుకు ప్రయత్నించింది. కానీ విష్ణు ఆమె ప్లాన్ను తిప్పికొట్టి సన్నీ ఏడిపించాడు. కాగా మంచు విష్ణు తాజాగా నటిస్తున్న చిత్రం గాలి నాగేశ్వరరావు. ఇందులో సన్నీ లీయోన్ రేణుకా పాత్ర పోషిస్తన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ను జరపుకుంటోంది. ఈ క్రమంలో షూటింగ్ బ్రేక్లో సన్నీ, విష్ణును ఆటపట్టించేందుకు గోడ చాటున్న దక్కుంది. ఆమె సిగ్నేచర్ మాస్క్ ధరించి అటూగా వస్తున్న విష్ణును భయపెట్టాలని చూసింది. కానీ విష్ణు మాత్రం మాస్క్తో ఉన్న సన్నీని చూసి ఏమాత్రం దడుచుకోకుండా సాధారణంగా ఆమెను చూస్తు నిలబడ్డాడు. దీంతో ఆమె మాస్క్ తీయగా విష్ణు ఒక్కసారిగా తనని చూసి భయంతో వణికిపోతూ అక్కడి నుంచి పరుగు తీశాడు. దీంతో వెంటనే ఆమె విష్ణు వెంట పెరుగెత్తిన ఈ వీడియోను సన్నీ లీయోన్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీనికి ‘మరోసారి నా ప్రయత్నం విఫలమైంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక సన్నీలియోన్ షేర్ చేసిన ఈ పోస్ట్కు బాడ్మింటన్ పీవీ సింధు కామెంట్ చేసింది. నవ్వు ఆపుకోలేకపోతున్నానంటూ నవ్వుతున్న ఎమోజీలతో తన స్పందనను తెలిపింది. అలాగే వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. గాలి నాగేశ్వరరావు మూవీకి ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందు గాలి నాగేశ్వరరావుగా విష్ణు కనిపించనున్నాడు. అతడి విష్ణు క్యారెక్టర్ డిజైన్ చేసిన స్కెచ్ను ఇటీవల ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే సన్నీ స్కెచ్ కూడా రిలీజ్ అయ్యింది. అందులో సన్నీ రేణుక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకి ఫేమస్ రైటర్ కోన వెంకట్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
పరేషాన్ వద్దు.. లోన్ మోసాలను గుర్తించండి ఇలా!
ఆన్లైన్లో నగదు లావాదేవీలు ఇటీవల కాలంలో అనూహ్యంగా పెరిగాయి. నగదు లావాదేవీలకు సంబంధించిన యాప్లు విరివిగా అందుబాటులోకి రావడంతో స్మార్ట్ఫోన్లతోనే ఆర్థిక కార్యకలాపాలు సులువుగా చక్కబెట్టుస్తున్నారు. ఇదే సమయంలో ఆన్లైన్ మోసాలు కూడా పెరిగాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మోసగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావు పాన్కార్డును దుర్వినియోగం చేసి రుణ మోసాలకు పాల్పడ్డారు దుండగులు. గతంలో సన్నీలియోన్ కూడా ఇదే తరహాలో మోసగాళ్ల బారిన పడ్డారు. దీంతో వారిద్దరి సిబిల్ స్కోర్ తగ్గిపోయింది. సిబిల్ స్కోర్ అంటే..? బ్యాంకులు వ్యక్తిగత రుణాలు మంజూరు చేయడానికి సిబిల్ ఇచ్చే స్కోర్(క్రెడిట్ స్కోర్)ను ప్రామాణికంగా తీసుకుంటాయి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ ఇచ్చే మూడంకెల సంఖ్యనే సిబిల్ స్కోర్గా పరిగణిస్తారు. ఈ సంఖ్య 300 నుంచి 900 వరకు ఉంటుంది. వ్యక్తిగత రుణ చరిత్ర ఆధారంగా ఈ స్కోర్ ఉంటుంది. 900 పాయింట్ల దగ్గరగా మీ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకి ఎక్కువ రుణం లభించే అవకాశాలు ఉంటాయి. ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్ లేదా సీఆర్ఐఎఫ్ వంటి క్రెడిట్ బ్యూరోలు కూడా స్కోర్ అందిస్తుంటాయి. జాగ్రత్తలు పాటించాలి రుణ మోసాల నుంచి తప్పించుకోవాలంటే వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. క్రెడిట్ స్కోర్ను రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. కనీసం నెలకు ఒకసారైనా క్రెడిట్ స్కోరు చూసుకోవడం మంచిది. సిబిల్ వెబ్సైట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా క్రెడిట్ స్కోరు చూసుకోవచ్చు. మీ పేరు మీద ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎంత మొత్తంలో రుణం తీసుకున్నారనే వివరాలు ఇందులో వెల్లడవుతాయి. (క్లిక్: మీ పాన్ కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నారో తెలుసుకోండి ఇలా..!) ఇలా చేయొద్దు! ► ఐడీ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. ► ఆధార్, పాన్కార్డ్ నంబర్లను మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ చేయొద్దు. ► స్కాన్ చేసిన ఆధార్, పాన్కార్డ్ కాపీలను మీ ఈ-మెయిల్లో పెట్టుకోవద్దు. ► ఈ-మెయిల్లో మీ పాన్కార్డ్ను షేర్ చేయాల్సివస్తే incognito మోడ్లో బ్రౌజర్ను వాడాలి. ► గుర్తింపు పత్రాల ఫొటో కాపీలను అటెస్ట్ చేసి మాత్రమే వాడాలి. ► ప్లబిక్ వై-ఫై వినియోగించి ఆన్లైన్ ట్రాన్టాక్షన్స్ చేయొద్దు. ► పాన్కార్డ్ ఇమేజ్ మీ ఫోన్లో సేవ్ చేసివుంటే.. లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఫొటోగ్యాలరీ యాక్సెస్ ఇవ్వొద్దు. వెంటనే స్పందించండి మీకు తెలియకుండా మీ పేరు ఎవరైనా రుణాలు తీసుకున్నట్టు గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. క్రెడిట్ బ్యూరో వైబ్సైట్ ద్వారా మీ ఫిర్యాదును ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లాలి. ఆన్లైన్లో cms.rbi.org.inకు ఫిర్యాదు చేయవచ్చు. crpc@rbi..org.inకు ఈ-మెయిల్ పంపవచ్చు. (క్లిక్: మీ సిబిల్ స్కోర్ పెరగాలంటే..) -
చీరకట్టులో బాస్కెట్ బాల్ ఆడిన సన్నీ లియోన్... వీడియో వైరల్
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంత ఇంత కాదు. ఆమె నెట్టింట ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు.. వైరల్ కావాల్సిందే. తాజాగా ఈ హాట్ బ్యూటీ చీరకట్టులో భర్తతో కలసి బాస్కెట్ బాల్ ఆడింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎరుపు రంగు చీరలో భర్త డేనియల్ వెబర్తో కలిసి బాస్కెట్ బాల్ ఆడుతూ సందడి చేసింది. ఈ వీడియోని ఆమే స్వయంగా తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేస్తూ.. కుచ్ కుచ్ హోతా హై చిత్రంలోని యే లడ్కీ హై దివానా సాంగ్ను జతచేసింది. ఆ మధ్య ‘ఓ మై ఘోస్ట్’ కోసం సన్నీ వేసిన లుంగీ స్టెప్పులు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. సన్నీ ప్రస్తుతం ‘ఓ మై ఘోస్ట్’ మూవీతో పాటు.. ‘వీరమాదేవి’, ‘రంగీలా’, ‘షెరో’, ‘కోకకోలా’, ‘హెలెన్’ తదితర చిత్రాల్లో నటిస్తోంది. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
బాలీవుడ్ యాక్టర్ సన్నీ లియోన్ (ఫొటోలు)
-
నీకు మంచి పెళ్లాం రావాలి: సన్నీ లియోన్
తారల మీద అభిమానాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనుకునేవాళ్లు చాలామంది. అందులో భాగంగా చాలామంది వారి ఫేవరెట్ హీరోహీరోయిన్ల పేర్లను పచ్చబొట్టులు వేయించుకుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడో ఫ్యాన్. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఓ అభిమాని తన ఎడమచేతిపై సన్నీలియోన్ అని టాటూ వేయించుకోవడాన్ని చూసిన సన్నీ అతడి కృతజ్ఞతలు చెప్తూ చిరునవ్వులు చిందించింది. కానీ క్యాప్షన్లో మాత్రం.. 'ఇకపై నువ్వు నన్ను ఎప్పటికీ ప్రేమించాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. నీకు మంచి భార్య దొరకాలని కోరుకుంటున్నా' అని కొంటెగా రాసుకొచ్చింది. సన్నీ ఫ్యాన్స్ ఆమె మీద అభిమానాన్ని చూపించడం ఇదేం కొత్తేం కాదు. గతంలో కూడా ఓ అభిమాని ఏకంగా ఆమె ముఖాన్ని తన పొట్టపై టాటూ వేయించుకున్నాడు. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) చదవండి: Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ సినిమాలపై నిషేధం..! -
సన్నీ లియోన్ పేరుపై గుర్తు తెలియని వ్యక్తికి రుణం.. ఐవీఎల్ సెక్యూరిటీపై నటి ఫైర్..
Sunny Leone Says PAN Card Used for Loan Fraud: తన పాన్ కార్డును ఎవరో దుర్వినియోగం చేశారని బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఆరోపించింది. తన పాన్ కార్డు మీదు గుర్తు తెలియని వ్యక్తి రుణం తీసుకున్నారంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా మండిపడింది. ఈ మేరకు సన్నీ లియోన్ ట్వీట్ చేస్తూ.. ‘ఎవరో ఇడియట్ నా పాన్ కార్డు సాయంతో 2 వేల రూపాయల రుణం తీసుకుని నా సీబీల్ స్కోరును దెబ్బతీశాడు. ఈ విషయంలో ఐవీఎల్ సెక్యూరిటీస్ (ధనిస్టాక్స్, గతంలో ఇండియా బుల్స్ సెక్యూరిటీస్) నాకు సాయం చేయలేదు. ఇండియాబుల్స్ దీన్ని ఎలా అనుమతిస్తుంది’’ అంటూ సన్నీ లియోన్ ట్వీట్ చేసింది. చదవండి: నష్టాల్లో రామ్ చరణ్ బిజినెస్, నిలిచిపోయిన సేవలు అనంతరం కొద్ది సేపటి తర్వాత సన్నీ లియోన్ ఈ ట్వీట్ను డిలిట్ చేసి మరో ట్వీట్ ఐవీఎల్కు కృతజ్ఞతలు తెలిపింది. ‘ఐవీఎల్ సెక్యూరిటీస్, ఐబీ హోమ్ లోన్స్, సీబీల్కు ధన్యవాదాలు. వేగంగా నా సమస్యను పరిష్కరించారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కావని ఆశిస్తున్నాను. ఎందుకంటే చెత్త సీబీల్ స్కోర్ను ఎవరూ కోరుకోరు’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఇలాంటి మోసాలకు నిత్యం వందల మంది బాధ్యులు అవుతుంటారు. ఆ తర్వాత అవి పరిష్కారమవుతుంటాయి. కానీ సన్నీ లియోన్ తొందరపడి ఐవీఎల్ సెక్యూరిటీని విమర్శించడం, ఆ తర్వాత ట్వీట్ డిలిట్ చేయడంతో పలువురు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. Thank you @IVLSecurities @ibhomeloans @CIBIL_Official for swiftly fixing this & making sure it will NEVER happen again. I know you will take care of all the others who have issues to avoid this in the future. NO ONE WANTS TO DEAL WITH A BAD CIBIL !!! Im ref. to my previous post. — sunnyleone (@SunnyLeone) February 17, 2022 -
బాలీవుడ్ నటి సన్నీలియోన్ పాటపై దుమారం
-
మూడు రోజుల్లో ఆ వీడియోని తీసేయాలి!... సన్నీ లియోన్కి హోం మంత్రి వార్నింగ్!
ఇటీవల కాలంలో కొన్ని పాటలు తమ మనోభావాలు దెబ్బతీసేలా తీస్తున్నారంటూ చాలామంది కేసులు వేసి కోర్టులకెక్కడం జరుగుతోంది. ఈ మధ్య సమంత ఐటెం సాంగ్ గురించి కూడా అటువంటి విమర్శలే వచ్చాయి. అచ్చం అదే రీతీలో సన్నీ లియోన్ నటించిన "మధుబన్ మే రాధికా నాచే" ఆల్బమ్పై విమర్శలు వస్తున్నాయి. మొన్నటి వరకు పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇప్పుడూ మధ్యప్రదేశ్ హోం మంత్రి సన్నీకి వార్నింగ్ ఇచ్చారు. అసలు విషయంలోకెళ్లితే....ఇటీవల సన్నీ హాట్గా నటించిన "మధుబన్ మే రాధికా నాచే" వీడియో ఆల్బమ్ విడుదలైన దగ్గర నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా సన్నీ నటించిన ఆ మ్యూజిక్ ఆల్బమ్ని తీసేయడానికి 72 గంటలు సమయం ఇస్తున్నానంటూ సన్నీని, గాయకుడు సాకిబ్ తోషిని హెచ్చరించారు. ఈ క్రమంలో హోం మంత్రి నరోత్తమ్ మాట్లాడుతూ... "ఆ ఆల్బమ్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. మేము రాధను పూజిస్తాం. సాకిబ్ తోషి తన మతానికి సంబంధించిన పాటలను ఈ విధంగా స్వరపరుచుకోవచ్చు కదా. ఇలాంటి పాటలు మమ్మల్ని బాధపెడతాయి. మూడు రోజుల్లో ఆ వీడియో తీయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరించారు. అంతేకాదు డిజైనర్ సబ్యసాచి పై చర్యలు తీసుకుంటాం అని అన్నారు. పైగా ఈ ఆల్బమ్ని నిషేధించాలంటూ హిందు పూజారులు కూడా మండిపడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు యుపిలోని బృందావన్కు చెందిన సంత్ నావల్ గిరి మహారాజ్ కూడా ఈ వీడియోని ప్రభుత్వం నిషేధించకపోతే కోర్టుకు వెళ్తాం అంటూ హెచ్చరించారు. నిజానికి "మధుబన్ మే రాధికా నాచే" పాటను 1960లో కోహినూర్ చిత్రం కోసం మహమ్మద్ రఫీ పాడారు. అయితే ఈ పాట రాధ, కృష్ణుల ప్రేమకు సంబంధించినది. అటువంటి పాటను సన్నీతో అశ్లీలంగా నృత్యం చేయించి తీయడంతోనే వివాదస్పదంగా మారింది. -
సన్నీపై పూజారుల ఆగ్రహం.. మధు'బ్యాన్' చేయాలని డిమాండ్
Priest Protest Against On Sunny Leone Dance In Madhuban Song: సినిమాలు, సినిమాల్లోని కొన్ని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకుల మనసులకు హత్తుకుపోతాయి. అలాంటి చిత్రాలను ఎంతగానో ఆదరించి సూపర్ హిట్ చేస్తారు ఆడియెన్స్. ఇలా హిట్టు ఇవ్వడమే కాకుండా వారి మనోభావాలను కించపరిస్తే అదే రేంజ్లో ఫట్మనిపిస్తారు కూడా. ఇలా కాంట్రవర్సీల మధ్య చిక్కుకుని ఫట్టయిన సాంగ్స్, సీన్స్, మూవీస్ ఎన్నో ఉన్నాయి. తమ సంస్కృతి మనోభావాలు, ప్రతిష్ట దెబ్బతీసేలా అసభ్యంగా ఉన్నాయని విరుచుకుపడిన వారూ ఉన్నారు. తాజాగా బాలీవుడ్ నటి, మోడల్ సన్నీ లియోన్ ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. ఇటీవల సన్నీ లియోన్ నటించిన 'మధుబన్ మే రాధిక నాచే' వీడియో ఆల్బమ్ విడుదలైంది. ఇందులో సన్నీ హాట్ హాట్గా పర్ఫామెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఆ పర్ఫామెన్సే ఆమెపై వ్యతిరేకత తీసుకొచ్చింది. ఉత్తర ప్రదేశ్లోని ప్రవిత్ర స్థలాల్లో ఒకటైన 'మధుర'కు చెందిన పూజారులు ఆ పాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వీడియో ఆల్బమ్ను నిషేధించాలని మండిపడుతున్నారు. ఈ పాటలో సన్నీ లియోన్ చేసిన అశ్లీల నృత్యం తమ మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉందని ఆరోపించారు. సన్నీపై ప్రభుత్వం చర్యలు తీసుకుని, ఆల్బమ్ను నిషేధించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు బృందావన్కు చెందిన సంత్ నావల్ గిరి మహారాజు. అలా డ్యాన్స్ చేసినందుకు సన్నీ లియోన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అలా చేయకుంటే భారత దేశంలో ఉండనివ్వకూడదన్నారు. అలాగే అఖిల భారతీయ తీర్థ పురోహిత్ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేష్ పాఠక్ కూడా 'మధుబన్ మే' సాంగ్లో సన్నీ డ్యాన్స్ను తప్పుబట్టారు. అలా అవమానకర రీతిలో నృత్యం చేయడం ద్వారా 'బ్రిజ్భూమి' ప్రతిష్టను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనికా కపూర్, అరిందమ్ చక్రవర్తి పాడిన ఈ పార్టీ నంబర్ను సరేగమ మ్యూజిక్ 'మధుబన్' పేరుతో బుధవారం (డిసెంబర్ 22) విడుదల చేసింది. ఈ పాటలో కృష్ణుడు, రాధల మధ్య ఉన్న ప్రేమను తెలియజేసేలా ఉండగా.. సన్నీ లియోన్ బాడీ మూమెంట్స్ హిందూ మనోభావాలను కించపరిచేలా ఉందని నెటిజన్లు కూడా ఫైర్ అయ్యారు. 1960లో కోహినూర్ సినిమాలో మహమ్మద్ రఫీ ఆలపించిన ఈ పాటను రీమేక్ చేశారు. ఇదీ చదవండి: సన్నీ లియోన్ లుంగీ డ్యాన్స్ చూశారా?.. స్టెప్పులు అదిరాయిగా!