Toyota
-
2025లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే (ఫోటోలు)
-
హోండా, నిస్సాన్ విలీనం.. టయోటాకు గట్టిపోటీ తప్పదా?
ఆటోమొబైల్ పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రెండు దిగ్గజ కంపెనీలు విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి. జపాన్లో రెండు, మూడో స్థానాల్లో ఉన్న హోండా మోటార్ , నిస్సాన్ మోటార్ సంస్థలు విలీనాన్ని అన్వేషిస్తున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇది వాస్తవ రూపం దాల్చితే జపనీస్ ఆటోమోటివ్ పరిశ్రమ పూర్తీగా మారిపోతుంది. టయోటా మోటార్ కార్పొరేషన్కు గట్టి పోటీ తప్పదని భావిస్తున్నారు.బ్లూమ్బెర్గ్ రిపోర్ట్ ప్రకారం.. ఇరు కంపెనీల మధ్య చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి. పూర్తీగా విలీనం చేయాలా లేదా మూలధనాన్ని పంచుకోవాలా లేదా హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలా అని యోచిస్తున్నాయి. చర్చల నివేదికలు వెలువడిన తర్వాత హోండా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షింజీ అయోమా స్పందిస్తూ కంపెనీ పలు వ్యూహాత్మక అవకాశాలను పరిశీలిస్తోందని, అందులో ఈ విలీనం ప్రతిపాదన కూడా ఉందని ధ్రువీకరించారు.అంతర్గత వర్గాల సమాచారం మేరకు.. విలీనం తర్వాత రెండు సంస్థల సంయుక్త కార్యకలాపాలను నిర్వహించడానికి కొత్త హోల్డింగ్ కంపెనీని స్థాపించడం అనేది పరిశీలనలో ఉన్న ఒక ప్రతిపాదన. నిస్సాన్తో ఇప్పటికే మూలధన సంబంధాలను కలిగి ఉన్న మిత్సుబిషి మోటార్స్ కార్ప్ని కూడా ఈ డీల్లో చేర్చవచ్చు. అయితే దీనికి సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి ఒప్పందంగా మారుతుందా లేదా అన్నది అస్పష్టంగా ఉంది.ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే, అది జపాన్ ఆటో రంగాన్ని రెండు ఆధిపత్య సమూహాలుగా ఏకీకృతం చేస్తుంది. హోండా, నిస్సాన్, మిత్సుబిషి ఒక గ్రూప్గా, టయోటా, దాని అనుబంధ సంస్థలు మరో సమూహంగా ఉంటాయి. ఈ ఏకీకరణ విలీన సంస్థ ప్రపంచ పోటీతత్వాన్ని బలోపేతం చేయగలదు. బ్యాటరీలు, సాఫ్ట్వేర్పై హోండా, నిస్సాన్ మధ్య ఇది వరకే సహకారం కుదిరిన విషయం తెలిసిందే. విలీన చర్చల వార్తల తరువాత బుధవారం ప్రారంభ ట్రేడింగ్లో నిస్సాన్ షేర్లు 24% వరకు పెరిగగా హోండా షేర్లు 3.4% తగ్గాయని బ్లూమ్బెర్గ్ నివేదిక పేర్కొంది. -
టయోటా కొత్త కారు లాంచ్: ధర రూ.48 లక్షలు
టయోటా కంపెనీ ఎట్టకేలకు తన 9వ తరం 'క్యామ్రీ'ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సెడాన్ రూ. 48 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో ఒకే వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది.సరికొత్త టయోటా క్యామ్రీ TNGA-K ప్లాట్ఫామ్పై ఆధారంగా నిర్మితమైంది. ఇది యూ షేప్ హెడ్ల్యాంప్లతో కూడిన పెద్ద ట్రాపెజోయిడల్ గ్రిల్, వెనుక వైపు కొత్త టెయిల్లైట్ వంటివి ఉన్నాయి. ఈ కారులో 12.3 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 3 స్పోక్ స్టీరింగ్ వీల్, 10 వే అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, రిక్లైనింగ్ రియర్ సీట్లు, 3 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, హెడ్స్ అప్ డిస్ప్లే, 9 స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: టాప్ 5 బడ్జెట్ కార్లు: ధర తక్కువ.. ఎక్కువ కంఫర్ట్టయోటా క్యామ్రీలోని 2.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 227 బీహెచ్పీ, 220 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఈసీవీటీ (ఎలక్ట్రిక్ కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్) పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ సేడం లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్, 9 ఎయిర్బ్యాగ్లు, 360 డిగ్రీ కెమెరా వంటి మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. -
కింగ్ నాగార్జున గ్యారేజిలోని కార్లు ఇవే (ఫోటోలు)
-
బహురూపాల బండి.. ఎక్కడికెళ్లాలన్నా ఈ ఒక్కటుంటే చాలు
-
రెండేళ్లు.. లక్ష సేల్స్: ఈ కారు రేటెంతో తెలుసా?
భారతదేశంలో వాహన విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ప్రజలు కొన్ని బ్రాండ్ కార్లను మాత్రమే అధికంగా కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి కోవకు చెందిన కార్లలో ఒకటి ఇన్నోవా హైక్రాస్. ఇప్పటికే ఈ కారును లక్ష మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. కేవలం రెండేళ్లలో కంపెనీ ఈ అరుదైన ఘనతను సాధించింది.2022లో అమ్మకానికి వచ్చిన టయోటా ఇన్నోవా హైక్రాస్.. ఇన్నోవా క్రిస్టాతో పాటు అమ్ముడైంది. ప్రారంభంలో అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నపటికీ.. ఆ తరువాత సేల్స్ భారీగా పెరిగాయి. ఈ కారు పెట్రోల్ - హైబ్రిడ్ పవర్ట్రెయిన్ పొందుతుంది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.ఇదీ చదవండి: పెరగనున్న బీఎండబ్ల్యూ ధరలు: ఎప్పటి నుంచో తెలుసా?టయోటా ఇన్నోవా హైక్రాస్ నాన్-హైబ్రిడ్ వేరియంట్లు 172 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది సీవీటీ ఆటోమేటిక్ గేర్బాక్స్తో లభిస్తుంది. టాప్ వేరియంట్లు స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 184 హార్స్ పవర్ అందించే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుతాయి. మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 19.77 లక్షల నుంచి రూ. 30.98 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ధరలు మీరు ఎంచుకునే వేరియంట్ ఆధారంగా మారుతూ ఉంటాయి. -
రెండు లక్షల మంది కొన్న టయోటా కారు ఇదే..
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ అమ్మకాలు భారతదేశంలో లక్ష యూనిట్లు దాటేశాయి. సెప్టెంబర్ 2022లో మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి అక్టోబర్ చివరి నాటికి హైరైడర్ మొత్తం సేల్స్ 1,07,975 యూనిట్లుగా నమోదయ్యాయి.2023 ఆర్ధిక సంవత్సరంలో 22,839 యూనిట్లు, 2024 ఆర్ధిక సంవత్సరంలో 48,916 యూనిట్లు, 2025 ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 36,220 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసిన హైరైడర్.. టయోటా గ్లాంజా హ్యాచ్బ్యాక్, మారుతి బాలెనో నుంచి పుట్టిన రీబ్యాడ్జ్ మోడల్.ఇదీ చదవండి: ఖరీదైన కారులో సమస్య!.. కంపెనీ కీలక నిర్ణయంటయోటా కంపెనీ అక్టోబర్ చివరి నాటికి మొత్తం 1,91,029 యూనిట్ల హైరైడర్ కార్లను డీలర్షిప్లకు పంపించినట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ వరకు హైరైడర్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దీనికి పండుగ సీజన్ చాలా దోహదపడింది. టయోటా కంపెనీ మరింత మంది కస్టమర్లను చేరుకునే ఉద్దేశ్యంతో పండుగ సీజన్లో హైరైడర్ ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్ను కూడా లాంచ్ చేసింది. -
టయోటాకు సుజుకీ ఈవీలు.. గుజరాత్ ప్లాంటులో తయారీ
న్యూఢిల్లీ: పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్యూవీని టయోటా మోటార్ కార్పొరేషన్కు సుజుకీ మోటార్ కార్పొరేషన్ సరఫరా చేయనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు తమ సహకారాన్ని మరింత విస్తరింపజేశాయి. ఈ మోడల్ను 2025 ప్రారంభంలో గుజరాత్ ప్లాంటులో తయారు చేయనున్నట్లు సుజుకీ మోటార్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.మారుతీ సుజుకీ ఇండియా వచ్చే ఏడాది పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్యూవీని విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ మోడల్ కోసం తీసుకున్న బీఈవీ యూనిట్, ప్లాట్ఫామ్లను సుజుకీ, టయోటాతోపాటు డైహట్సు మోటార్ కార్పొరేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.‘ప్రపంచవ్యాప్తంగా టయోటాకు మా మొదటి బీఈవీ (బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్) సరఫరా చేస్తాం. ఈ విధంగా రెండు కంపెనీల మధ్య సహకారం మరింతగా కొనసాగినందుకు చాలా సంతోషంగా ఉంది. పోటీదారులుగా కొనసాగుతూనే ఇరు కంపెనీలు విభిన్న మార్గాల ద్వారా కార్బన్–న్యూట్రల్ సొసైటీని సాకారం చేయడంతో సహా సామాజిక సమస్యలను పరిష్కరించడంలో మరింత సహకరించుకుంటాయి’’ అని సుజుకీ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ తెలిపారు.ఇదీ చదవండి: టీవీఎస్ రికార్డ్.. 4.89 లక్షల వాహనాలు అమ్మేసింది!ఉత్పత్తులను ఇచ్చిపుచ్చుకోవడం, తయారీ కేంద్రాల వినియోగానికై భాగస్వామ్యం కోసం టయోటా మోటార్ కార్పొరేషన్, సుజుకీ మోటార్ కార్పొరేషన్ 2017లో అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. మారుతీ సుజుకీలో... సుజుకీ కార్పొరేషన్కు దాదాపు 58 శాతం వాటా ఉంది. -
టయోటా క్యాంపర్ వ్యాన్: ఒకటే వెహికల్.. ఉపయోగాలెన్నో (ఫోటోలు)
-
టయోటా లాంచ్ చేసిన మరో ఫెస్టివ్ ఎడిషన్ ఇదే..
టయోటా కంపెనీ గ్లాన్జా, టైసర్, హైరైడర్ ఫెస్టివల్ ఎడిషన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు తాజాగా రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ కారు కొనుగోవులు చేసేవారు ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండానే రూ. 20608 విలువైన యాక్సెసరీలను పొందవచ్చు.టయోటా రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్ మడ్ ఫ్లాప్లు, మ్యాట్లు, క్రోమ్ డోర్ వైజర్, స్పాయిలర్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా టెయిల్గేట్, రియర్ బంపర్, హెడ్ల్యాంప్, నంబర్ ప్లేట్, బాడీ మౌల్డింగ్లకు గార్నిష్లు ఉన్నాయి. ఈ కొత్త యాక్ససరీస్ వల్ల కారు మరింత అద్భుతంగా కనిపిస్తుంది.టయోటా రూమియన్ దాని మునుపటి మోడల్లోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 102 Bhp పవర్, 138 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ అప్షన్స్ పొందుతుంది. ఈ ఫెస్టివల్ ఎడిషన్ ఎస్, జీ, వీ ట్రిమ్లలో మాత్రమే కాకుండా CNG రూపంలో కూడా అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: టయోటా టైజర్ లిమిటెడ్ ఎడిషన్.. మంచి ఆఫర్తో..మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టయోటా రూమియన్ ప్రధానంగా మారుతి సుజుకి ఎర్టిగా, కియా కారెన్స్, హ్యుందాయ్ అల్కాజార్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఇది ఫెస్టివ్ ఎడిషన్ కాబట్టి మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఈ కారు ఎప్పటి వరకు మార్కెట్లో విక్రయానికి ఉంటుందనేది తెలియాల్సి ఉంది. -
జాబిల్లిపై కారులో!
టోక్యో: సంప్రదాయకంగా అపోలో మిషన్ మొదలు తాజా ప్రయోగాల దాకా జాబిల్లిపై జరిగిన అన్ని ప్రయోగాల్లో ల్యాండర్, రోవర్లనే అధికంగా వాడారు. మానవరహితంగా కదిలే రోవర్ కొద్దిపాటి దూరాలకు వెళ్లగలవు. అక్కడి ఉపరితల మట్టిని తవ్వి చిన్నపాటి ప్రయోగాలు చేయగలవు. అయితే వీటికి చెల్లుచీటి పాడేస్తూ చంద్రుడిపై ఏకంగా కారులో వ్యోమగాములు ప్రయాణించేలా ఒక అధునాతన స్పెషల్ కారును తయారుచేస్తామని జపాన్ ప్రకటించింది. ఆటోమోటివ్ దిగ్గజం టొయోటాతో కలిసి తాము తయారుచేయబోయే భారీ వాహనం వివరాలను జపాన్లోని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ(జాక్సా) తాజాగా వెల్లడించింది. భూమి లాంటి వాతావరణం అక్కడ లేని కారణంగా చంద్రుడి ఉపరితలంపై గురుత్వాకర్షణ చాలా తక్కువ. దీంతో సాధారణ కారు అక్కడ చకచకా ముందు కదలడం చాలా కష్టం. అందుకే ఒత్తిడితో నడిచే ప్రత్యేక వాహనాన్ని రూపొందిస్తామని టొయోటా సంస్థ తెలిపింది. ఈ కారు కథాకమామిషు ఓసారి చూద్దాం.. అమెరికా నాసా వారి ప్రతిష్టాత్మక ఆరి్టమిస్–8 మిషన్ ప్రాజెక్ట్లో భాగంగా కారులా ఉండే అత్యాధునిక రోవర్ వాహనాన్ని సిద్ధంచేయనున్నారు. ఈ వాహనంలో వ్యోమగాములు ఎక్కువ కాలం గడపొచ్చు. సంప్రదాయ రోవర్ మాదిరిగా స్వల్ప దూరాలకుకాకుండా చాలా దూరాలకు ఈ వాహనం వెళ్లగలదు. వ్యోమగాములు చేపట్టబోయే అన్ని ప్రయోగాలకు సంబంధించిన ఉపకరణాలు ఇందులో ఉంటాయి. గతంలో ఎన్నడూ వెళ్లని ప్రాంతాలకు వెళ్తూ కారు లోపల, వెలుపల ప్రయోగాలు చేయొచ్చు. చందమామపై వేర్వేరు ప్రదేశాల వాతావరణ పరిస్థితులను ప్రత్యక్షంగా చూస్తూ వ్యోమగాములు అక్కడి నేల స్వభావాన్ని అంచనావేయొచ్చు. వ్యోమగాముల రక్షణ కోసం లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్, వాహనం దిగి ఎక్కువసేపు బయట గడిపితే రేడియేషన్ ప్రభా వానికి లోనుకాకుండా ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు, దిగి సులభంగా ఆ ప్రాంతంలో కలియతిరిగేందుకు ‘ఎయిర్లాక్’వ్యవస్థ ఇలా పలు ఏర్పాట్లతో వాహనాన్ని తీర్చిదిద్దుతామని జాక్సా తెలిపింది. ఆటోమొబైల్ సాంకేతికతలో జపాన్ది అందెవేసిన చేయి. దీంతో జ పాన్ టెక్నాలజీ, అంతరిక్ష అనుభవం చంద్రుడి ఉపరితలంపై కొత్త తరహా ప్రయోగాలకు బాటలు వేస్తాయని నాసా తెలిపింది. -
దూసుకెళ్తున్న ఆటో రంగం.. మహారాష్ట్రలో వేలకోట్ల పెట్టుబడులు
స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చకాన్లో తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి ఏకంగా రూ. 15,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది. ఈ విషయాన్ని క్యాబినెట్ మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు.స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా చకాన్ తయారీ కేంద్రంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను తయారు చేయనుంది. కంపెనీలో వెయ్యి కంటే ఎక్కువ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఇదే సమయంలో టయోటా కిర్లోస్కర్ కూడా రాష్ట్రంలో రూ. 21273 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ కంపెనీ 8800 ఉద్యోగాలను కల్పించనుంది.మహారాష్ట్రలో తన కొత్త ఉత్పత్తి యూనిట్ ద్వారా తమ పోర్ట్ఫోలియోను మరింత విస్తరిస్తామని, మెరుగైన హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తామని స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా అధికారులు వెల్లడించారు.టయోటా కంపెనీ తమ ఛత్రపతి శంభాజీనగర్లో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇక్కడ కంపెనీ హైబ్రిడ్ వెహికల్స్, ప్లగ్ఇన్ హైబ్రిడ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.One more BIG news for Maharashtra !Huge investments of total₹ 1,20,220 crore approved in today’s Cabinet Sub-Committee Meeting, with CM Eknath Shinde ji !The detailed list of approved investments is as follows:✅Tower Semiconductor with Adani Group at Taloja MIDC, Panvel… pic.twitter.com/DVI9z94WyU— Devendra Fadnavis (@Dev_Fadnavis) September 5, 2024 -
టయోటా వాహనాలకు యూనియన్ బ్యాంక్ రుణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టయోటా వాహనాల కొనుగోలుకై కస్టమర్లకు సమగ్ర రుణ సౌకర్యాన్ని బ్యాంకు కల్పించనుంది.ఆన్రోడ్ ధరపై 90 శాతం వరకు లోన్ సమకూరుస్తారు. యూనియన్ వెహికిల్ స్కీమ్ కింద 84 నెలల వరకు ఈఎంఐ సౌకర్యం ఉంది. యూనియన్ పరివాహన్ స్కీమ్లో భాగంగా వాణిజ్య వాహనాలకు 60 నెలల వరకు వాయిదాలు ఆఫర్ చేస్తారు. అన్ని రకాల టయోటా వాహనాలకు కొత్త స్కీమ్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. -
50వేల మంది ఇష్టపడి కొన్న కారు ఇదే..
టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) కంపెనీ ఇన్నోవా హైక్రాస్ అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. 2022లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 50వేల యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న హైక్రాస్ అమ్మకాలు ఇప్పటికి కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందులో భాగంగానే కంపెనీ ఈ మోడల్ టాప్ వేరియంట్ బుకింగ్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. కాగా వెయిటింగ్ పీరియడ్ కూడా 12 నుంచి 13 నెలల సమయం ఉన్నట్లు సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ 5వ జనరేషన్ సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టం కలిగి 187 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఈ డ్రైవ్ సీక్వెన్షియల్ షిఫ్ట్తో కూడిన మోనోకోక్ ఫ్రేమ్తో శక్తిని పొందుతుంది. ఆకర్షణీయమైన డిజైన్ కలిగి అంతకు మించిన పర్ఫామెన్స్ కలిగి ఉండటం వల్ల కస్టమర్లు ఈ కారును ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. హైక్రాస్ ఉత్తమ అమ్మకాలు 50వేలు దాటిన సందర్భంగా కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ.. కేవలం 14 నెలల్లో 50000 యూనిట్ల హైక్రాస్ అమ్మకాలు మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. కస్టమర్లు మా ఉత్పత్తుల మీద ఉంచుకున్న నమ్మకానికి కృతజ్ఞులం అన్నారు. -
11.2 లక్షల టయోటా కార్లు వెనక్కి! అగ్ర రాజ్యంలో అత్యధికం..
ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'టయోటా' (Toyota) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 11.2 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. ఇన్ని కార్లకు కంపెనీ ఎందుకు రీకాల్ ప్రకటించింది, ఈ కార్లలో ఉన్న లోపాలు ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2020 నుంచి 2022 మధ్యలో తయారైన అవలాన్, కామ్రీ, కరోలా, ఆర్ఏవీ4, లెక్సస్ ఈఎస్ 250, ఈఎస్300హెచ్, ఈఎస్350, ఆర్ఎక్స్350 హైల్యాండర్, సియన్నా హైబ్రిడ్ వెహికిల్స్ వంటి వాటికి రీకాల్ ప్రకటించింది. సమస్య ఏంటంటే? 2020 నుంచి 2022 మధ్యలో తయారైన ఈ కార్లలో ఎయిర్ బ్యాగులో ఏర్పడే లోపం కారణంగా ఆక్యుపెంట్ క్లాసిఫికేషన్ సిస్టమ్ (OCS) సెన్సార్లకు సంబంధిచిన సమస్యలు తలెత్తవచ్చని సంస్థ భావించి, దీనిని భర్తీ చేయడానికి ఈ రీకాల్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఒక్క అమెరికాలో మాత్రమే సుమారు 10 లక్షల కార్లలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. రీకాల్ సమయంలో సదరు వినియోదారుడు తన కారుని కంపెనీ అధికారిక డీలర్షిప్ వద్ద సమస్యను పరిష్కరించుకోవచ్చు. ప్రస్తుతానికి కంపెనీ కార్ ఓనర్లకు సమాచారం అందించలేదని, 2024 ఫిబ్రవరి సమయంలో అందరికి సమాచారం అందించే అవకాశం ఉందని సమాచారం. ఇదీ చదవండి: భారత్ ఒక్కరోజు అమ్మకాలను చేరుకోలేకపోయిన పాకిస్తాన్ - కారణం ఇదే! కార్లలోని లోపాలకు పరిష్కరించడానికి రీకాల్ ప్రకటించడం ఇదే మొదటి సారి కాదు, గతంలో చాలా కంపెనీలు ఇలా రీకాల్ ప్రకటించి సమస్యలను పరిష్కరించాయి. ఇటీవల టెస్లా కూడా ఆటోపైలట్ సిస్టమ్లోని లోపాన్ని సరి చేయడానికి 20 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. -
Vedio: 'బస్సు కింద పడి చచ్చిపో..' బైకర్పై దేవెగౌడ కోడలు ఆగ్రహం
బెంగళూరు: కర్ణాటకకు చెందిన మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ్ కోడలు ఓ బైకర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారును ఢీకొట్టిన ద్విచక్రవాహనదారునిపై కోపంతో రంకెలు వేశారు. కారు విలువ రూ.1.5 కోట్లు అని పదే పదే పేర్కొంటూ బైకర్ని చివాట్లు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేవెగౌడ కోడలు భవాని రేవణ్ణ స్వగ్రామం ఉడిపిలోని సాలిగ్రామానికి వెళ్లి వస్తుండగా.. ఓ బైకర్ ఆమె కారును ఓవర్టేర్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రేవణ్ణ కారు టొయేటా వెల్ఫైర్ను బైకర్ ఢీకొట్టాడు. దీంతో భవాని రేవన్న అతనిపై కోపంతో ఊగిపోయారు. తన కారు విలువ రూ.1.5 కోట్లు.. రిపేర్కు రూ.50 లక్షలు ఇవ్వగలవా? అని అతనిపై రంకెలు వేశారు. చనిపోవాలనుకుంటే.. ఏ బస్సు కిందో పడి చావొచ్చుగా? రాంగ్ సైడ్లో ఎందుకు డ్రైవ్ చేస్తున్నావని అతనిపై మండిపడ్డారు. A video shows former prime minister #HDDeveGowda’s daughter-in-law & #JDS leader #BhavaniRevanna yelling at villagers after a two-wheeler allegedly damaged her pricey Toyota Vellfire.#Karnataka #Mysuru #RoadAccident #HDRevanna pic.twitter.com/I4GRvgoGVQ — Hate Detector 🔍 (@HateDetectors) December 4, 2023 బైకర్ని తిట్టే క్రమంలో భవాని రేవణ్ణ కారు విలువ రూ.1.5 కోట్లు అని పదే పదే చెప్పారు. దీనిపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవానీ రేవన్నకు మరికొందరు మద్దతు కూడా తెలుతున్నారు. రైడర్ రాంగ్ సైడ్లో డ్రైవ్ చేయడం తప్పుకదా? అని ప్రశ్నిస్తున్నారు. భవానీ రేవన్న భర్త హెచ్డీ రేవన్న ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఆమె కుమారులు ప్రజ్వాల్, సూరజ్ రేవన్న ఎంపీ, ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ చేసిన తప్పు అదేనా? -
టయోటా హైలక్స్ యాడ్ బ్యాన్ చేసిన యూకే - కారణం ఇదే!
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న జపనీస్ వాహన తయారీ దిగ్గజం 'టయోటా' (Toyota)కు యూకేలో గట్టి షాక్ తగిలింది. సామాజిక బాధ్యత ప్రమాణాలను ఉల్లంఘించినందుకు కంపెనీ ప్రకటనను నిషేధిస్తూ ఏఎస్ఏ ఆదేశాలు జారీ చేసింది. టయోటా హైలక్స్ యాడ్ నిలిపేయడం వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? గతంలో ఇలాంటి నిషేధాలు విధించారా? అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. యూకే అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ అథారిటీ (ASA) పర్యావరణ బాధ్యతారహిత డ్రైవింగ్ను ప్రోత్సహిస్తున్న రెండు టయోటా ప్రకటనలను నిషేధించింది. ఇందులో ఒకటి పోస్టర్, మరొకటి వీడియో. వీడియోలో టయోటా హైలెక్స్ పికప్ ట్రక్కులు కఠినమైన భూభాగాల్లో న్యావిగేట్ చేస్తున్నాయి. ఇందులో రివర్స్ క్రాసింగ్ కూడా ఉంది. ఆ తరువాత పట్టణ ప్రాంతం గుండా వెళ్లడం చూడవచ్చు. రోడ్డులో వాటికవి విడిపోవడం చూడవచ్చు. ఇవన్నీ వినియోగదారులను కొంత తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని చెబుతున్నారు. పోస్ట్ విషయానికి వస్తే.. ఇందులో తిరగటానికే పుట్టాను అన్నట్లు రాసి ఉంది. అంతే కాకుండా కొండల్లో దిగటం, ఎత్తైన ప్రదేశాల్లో దుమ్ములేపుకుంటూ ప్రయాణించడం వంటివి ఇందులో చూడవచ్చు. ఈ ప్రకటనలు పర్యావరణ హానికరమైన ప్రవర్తనను ఆమోదించాయని, అధిక కార్బన్ ఉత్పత్తులు ప్రొడ్యూస్ చేస్తున్నట్లు వెల్లడిస్తూ.. ఈ ప్రకటనలను నిషేదించింది. ఈ ప్రకటనలపై అడ్ఫ్రీ సిటీస్ కో-డైరెక్టర్ వెరోనికా విగ్నాల్ మాట్లాడుతూ.. వాహనాలు నదులు, అడవి గడ్డి మైదానాల గుండా వేగంగా డ్రైవింగ్ చేస్తే.. ప్రకృతి దెబ్బతింటుందని చెబుతూ, యూకేలో చాలా వాహనాలు పట్టాన ప్రాంతాలకు పరిమితమయ్యాయి. అలాంటిది ఇలాంటి ప్రకటలను ఎలా చిత్రీకరిస్తారని వాదించింది. ఇదీ చదవండి: లక్షల విలువ చేసే కారులో 'హోమ్ మేడ్ ఫుడ్' బిజినెస్.. వీడియో వైరల్ ఈ ప్రకటనను కంపెనీ సమర్థిస్తూ.. వ్యవసాయ, అటవీ ప్రాంత వాసులకు ఇలాంటి కార్లు చాలా ఉపయోగపడతాయని చెప్పినప్పటికీ, ప్రకటనలో అలాంటి కార్మికులు కనిపించలేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. కానీ ఫుటేజీని యూకే వెలుపల ఉన్న ప్రైవేట్ భూమిలో చిత్రీకరించినట్లు, పోస్టర్ మాత్రం కంప్యూటర్ ద్వారా క్రియేట్ చేసినట్లు ప్రతినిధి స్పష్టం చేశారు. ఇందులో మళ్ళీ మార్పులు చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. -
టయోటా కొత్త ప్లాంటుకు రూ.3,300 కోట్లు
బెంగళూరు: వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మూడవ ప్లాంట్ ఏర్పాటుకు రూ.3,300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మంగళవారం ప్రకటించింది. కర్ణాటకలోని బిదాడిలో ఈ కేంద్రం రానుంది. 2026 నాటికి నూతన ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం కానుంది. రెండు షిఫ్టులలో 1 లక్ష యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. బిదాడిలో ఇప్పటికే సంస్థకు రెండు యూనిట్లు ఉన్నాయి. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3.42 లక్షల యూనిట్లు. మల్టీ–యుటిలిటీ వెహికిల్ ఇన్నోవా హైక్రాస్తోపాటు వివిధ ఇంధన సాంకేతికతలతో మోడళ్లను తయారు చేసేందుకు భవిష్యత్కు అవసరమయ్యే స్థాయిలో కొత్త ప్లాంట్ ఉంటుందని టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ విక్రమ్ గులాటీ తెలిపారు. కొత్త ప్లాంట్ ద్వారా 2,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న రెండు ప్లాంట్లలో 11,200 మంది పని చేస్తున్నారని వివరించారు. -
ప్రపంచ చరిత్రలో సరికొత్త మైలురాయి.. అదరగొట్టిన జపాన్ కంపెనీ!
కార్ల తయారీలో సరికొత్త రికార్డు నమోదైంది. జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం (టయోటా) ఈ రికార్డును నెలకొల్పింది. కంపెనీ మొదలై 88 సంవత్సరాలు కాగా.. మొత్తం 30 కోట్ల కార్లు తయారు కావడం విశేషం. ప్రపంచ ఆటోమొబైల్ చరిత్రలో ఇన్ని కార్లు తయారు చేసిన కంపెనీ ఇంకోటి లేకపోవడం చెప్పుకోవాల్సిన విషయం. 1933లో టయోడా ఆటోమాటిక్ లూమ్ వర్క్స్లో భాగంగా కార్ల తయారీ ప్రారంభించింది ఈ కంపెనీ. మోడల్ -జీ1 కంపెనీ తయారు చేసిన మొట్టమొదటి ట్రక్కు. ఆ తరువాత 1937లో టయోటా మోటర్ కంపెనీ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ కంపెనీ తయారు చేసిన కార్లు మొత్తం 30 కోట్లు. అయితే ఇందులో జపాన్లో ఉత్పత్తి అయినవాటితోపాటు ఇతర మార్కెట్లలోనివి కూడా చేర్చారు. జపాన్లో మొత్తం 18.05 కోట్ల కార్లు ఉత్పత్తి కాగా.. ఇతర దేశాల్లో తయారైనవి 11.96 కోట్లు. టయోటా 1941 నుంచి విస్తరణ పథం పట్టింది. టయోడా మెషీన్ వర్క్స్ (1941), టయోటా ఆటోబాడీ (1945) వంటి అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసుకుంది. 1960, 70లలో జపాన్లో తయారు చేసిన కార్లను పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేసింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 1982లో టయోటా మోటర్ కంపెనీ కాస్తా... టయోటా మోటర్ కార్పొరేషన్ గా మారింది. ఇదీ చదవండి: భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో టయోటా కంపెనీ బెస్ట్ సెల్లింగ్ మోడల్గా నిలిచిన 'కొరొల్లా' (Corolla) ఉత్పత్తి మొత్తం 5.33 కోట్ల కంటే కంటే ఎక్కువ. 1966 నుంచి ఈ సెడాన్ అనేక అప్డేట్స్ పొంది అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికీ బాగా అమ్ముడుపోతోంది. భారతీయ మార్కెట్లో కూడా టయోటా కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూ.. మంచి అమ్మకాలతో దూసుకెళ్తోంది. -
భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో
దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రీనర్ ఫ్యూయెల్ లేదా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని గత కొన్ని రోజులుగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. తాజాగా విడుదలైన ఒక వీడియోలో తన గ్యారేజిలోని ప్రపంచంలోనే మొట్ట మొదటి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు గురించి వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సాధారణంగా రాజకీయ నాయకులు మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లను వినియోగిస్తారు. కానీ గడ్కరీ దీనికి భిన్నంగా ఇథనాల్ శక్తితో నడిచే 'ఇన్నోవా హైక్రాస్' ప్రోటోటైప్ హైబ్రిడ్ కారుని ఉపయోగిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడాలనే సదుద్దేశ్యంతో ప్రజలకు చెప్పడమే కాకుండా.. తానూ ఆచరిస్తుండటం నిజంగా గొప్ప విషయం. ఈ వీడియోలో తన కారు గురించి వెల్లడిస్తూ.. ఇది ప్రపంచంలో మొట్ట మొదటి 100 శాతం ఇథనాల్తో నడిచే వాహనమని తెలిపారు. దీనికి కావలసిన ఇంధనం రైతుల దగ్గర నుంచి లభిస్తుందని, ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని, పెట్రోల్ కంటే చౌకగా లభిస్తుందని పేర్కొన్నాడు. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ కలిగిన ద్విచక్ర వాహనాలు త్వరలోనే మార్కెట్లో లభిస్తాయని, ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల ద్వారా ఇటువంటి ఇంధనాలను అందించడానికి కృషి చేస్తోందని వెల్లడించారు. ఇండియన్ ఆయిల్ ప్రస్తుతం ఇథనాల్ నుంచి ఏవియేషన్-గ్రేడ్ ఇంధనాన్ని వెలికితీసే పనిలో ఉందని తెలిపారు. అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే పెట్రోలియం దిగుమతులు రానున్న రోజుల్లో తగ్గుతాయని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: దీపావళికి కొత్త స్కూటర్ కొనాలా? బెస్ట్ మోడల్స్ ఇక్కడ చూడండి! నితిన్ గడ్కరీ గ్యారేజీలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో నడిచే టయోటా మిరాయ్ కారు కూడా కనిపిస్తుంది. ఇది ఫ్యూచరిస్టిక్ కారు అని, భవిష్యత్తులో ఇలాంటి కార్లు వినియోగంలోకి వస్తాయని వెల్లడించారు. ఈ కారు 1.2 కిలో వాట్ లిథియం అయాన్ బ్యాటరీ, మూడు హైడ్రోజన్ ట్యాంకులు కలిగి ఉంటుంది. కావున ఇది 647 కి.మీ రేంజ్ అందిస్తుంది. -
రతన్ టాటా కలల కారు ‘నానో’ ఈవీ కారుగా వచ్చేస్తుందా? అందులో నిజమెంత?
రతన్ టాటా ! పరిచయం అక్కర్లేని పేరు. దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న ధీశాలి. పద్మ అవార్డుల గ్రహీత. మంచితనం, మానవత్వానికి నిలువెత్తు నిదర్శం. నమ్మకంతో కూడిన నాయకత్వం, నైతిక విలువలు, ఎంత ఎత్తకు ఎదిగినా ఒదిగి ఉండే గుణం. రూ. వేల కోట్ల సంపద ఉన్నా కూడా సాధారణ జీవితం గడుపుతున్న అసామన్యుడు. అలాంటి రతన్ టాటాకు ‘నానో’ కారంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ కారే భారత మార్కెట్లో తిరిగి ఎలక్ట్రిక్ వెహికల్గా విడుదలవుతుందుంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నానో ఎలక్ట్రిక్ కారుగా రాబోతుందా? సోషల్ మీడియా పోస్టుల్లో నిజమెంత? త్వరలో, టాటా గ్రూప్ నానో ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తుందంటూ నానో’ పోలికతో ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అంతేకాదు, టాటా నానో న్యూ అవతార్. కారు ధర రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల మధ్య ఉంటుందనే ఆ ఫేక్ సోషల్ మీడియా ఫోటో సారాశం. ఇంతకీ నానో తరహాలో ఉన్న ఆ కారును ఏ ఆటోమొబైల్ కంపెనీ తయారు చేస్తుందనే అనుమానం రావొచ్చు. జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా 998 సీసీ పెట్రోల్ ఇంజిన్తో ‘టయోటా ఐగో’ హ్యాచ్బ్యాక్ కారును అమ్ముతుంది. కానీ ఈ కారు భారత్లో మాత్రం అందుబాటులో లేదు. గత కొన్నేళ్లుగా భారత్లో ఈవీ కార్ల క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. వాటి బడ్జెట్ ఎక్కువ కావడంతో వాహనదారులు టాటా గ్రూప్ బడ్జెట్ ధరలో ఈవీ కారును అందుబాటులోకి తెస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అదిగో అప్పటి నుంచి టాటా సంస్థ నానో ఈవీ కారు వస్తుందనే ప్రచారం జోరందుకుంది. తాజాగా, టాయోటా ఐగో కారు ఫోటోల్ని చూపిస్తూ.. ఇదే టాటా నానో ఈవీ కారు అంటూ ఫోటోలు విడుదలయ్యాయి. అయితే, ఆ ఫోటోలు ఫేక్ అని తేలింది. నానో కారు ఇలా పుట్టిందే నానో కారు.. 15 ఏళ్ల క్రితం ఆటోమొబైల్ రంగంలో అదో పెను సంచలనం. రతన్ టాటా ప్రతి రోజు తన కారులో వెళ్లే సమయంలో స్కూటర్లపై వెళ్లుతున్న తల్లిదండ్రుల మధ్యలో కూర్చొవడం గమనించాను. తల్లీతండ్రి మధ్యలో కూర్చున్న పిల్లలు నలిగిపోతున్నారేమో అని నాకు అనిపించింది. గుంతలుగా ఉండే రోడ్లపైనా వారు అలాగే ప్రయాణించడం చూసి నాకో ఆలోచన తట్టింది. అలా పురుడు పోసుకుందే నానో కారు. ప్రపంచంలో అత్యంత చౌకైన కారు.. కానీ 2008 జనవరి 10న టాటా మోటార్స్ ‘నానో’ కారును విడుదల చేసింది. సామాన్యుల కోసం టాటా కంపెనీ అతి తక్కువ ధర అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కారు ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా గుర్తింపు పొందింది. అయితే క్రమక్రమంగా తన ఉనికిని కోల్పోయి పూర్తిగా కనుమరుగైంది. చదవండి👉ముద్ద ముట్టని పెంపుడు కుక్కలు, ప్రిన్స్ ఛార్లెస్ అవార్డు కార్యక్రమానికి ‘రతన్ టాటా’ డుమ్మా! -
భారత సైన్యంలోకి బలిష్టమైన వాహనాలు - ఇవి చాలా స్పెషల్!
భారతదేశానికి రక్షణ కవచం 'ఇండియన్ ఆర్మీ' కోసం ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) ప్రత్యేకంగా తయారు చేసిన హైలక్స్ పికప్ ట్రక్కులను డెలివరీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే మొదటి బ్యాచ్ డెలివరీ చేసిన టయోటా ఇప్పుడు రెండు కొత్త మోడిఫైడ్ వెర్షన్లను సైన్యానికి అందించింది. ఈ రెండు కార్లు ప్రత్యేక అవసరాల కోసం తయారైనవి.. కావున వీటికి ఫీల్డ్ డయాగ్నోసిస్ వెహికల్ (FDV), ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ వెహికల్ (RIV) అని పేరు పెట్టారు. ఫీల్డ్ డయాగ్నోసిస్ వెహికల్ భారతదేశ కఠిన భూభాగాల్లో ప్రయాణించడానికి అనుకూలంగా తయారైంది, కాగా ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ వెహికల్ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి నిర్మించారు. ఇందులో ఫైర్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ పరికరాలు ఉంటాయి. మొత్తానికి భారత సైన్యంలో ఇవి రెండు తప్పకుండా ఉత్తమ సేవలను అందించేలా రూపొందించారు. డిజైన్ పరంగా కొంత భిన్నంగా ఉన్న ఈ పికప్ ట్రక్కులు చాలా వరకు అదే ఫీచర్స్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.8 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 204 పీఎస్ పవర్ అందిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్తో 420 న్యూటన్ మీటర్ టార్క్ & ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో 500 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదీ చదవండి: ఏఐ అద్భుత చిత్రం.. చీకట్లో ల్యాండర్ ఇలాగే ఉంటుందా? ఇండియన్ ఆర్మీకి భారతీయ కార్ల తయారీదారులకు ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రారంభం నుంచి సైన్యలో మహీంద్రా, ఆ తరువాత మారుతి వాహనాలు విస్తృతమైన సేవలు అందిస్తూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు టయోటా తన హైలక్స్ ట్రక్కులతో సేవలందించడానికి అడుగులు వేస్తోంది. -
నితిన్ గడ్కరీ ఆవిష్కరించిన ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు.. ఇది చాలా స్పెషల్!
భారతదేశం అభివృద్ధివైపు వేగంగా పరుగులు పెడుతున్న తరుణంలో ఈ రోజు కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రపంచంలోనే మొట్ట మొదటి బిఎస్6 హైబ్రిడ్ కారుని ఆవిష్కరించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పెట్రోల్, డీజిల్ కార్ల వినియోగంతో కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ప్రపంచంలోని చాలా దేశాలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ ఫ్యుయల్ పుట్టుకొచ్చింది. టయోటా కంపెనీకి చెందిన ఈ 'ఇన్నోవా హైక్రాస్' ఇథనాల్ శక్తితో నడిచే ప్రోటోటైప్ హైబ్రిడ్ కారు. ఈ లేటెస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్ ఇంజిన్ E100 గ్రేడ్ ఇథనాల్తో (100 శాతం ఇథనాల్) పనిచేసేలా తయారైంది. సెల్ఫ్ ఛార్జింగ్ లిథియం అయాన్ బ్యాటరీ ఇందులో ఉంటుంది. కావున ఈవీ మోడ్లో కూడా నడుస్తుంది. ఇందులోని 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజన్ పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఫ్లెక్స్ ఫ్యూయెల్ టెక్నాలజీ.. ఫ్లెక్స్ ఫ్యూయెల్ టెక్నాలజీ అనేది ఇంజిన్ను ఇథనాల్-పెట్రోల్ మిశ్రమంతో పనిచేసేలా చేస్తుంది. దీని వల్ల కర్బన ఉద్గారాలు తక్కువగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా E20 ఇంధనం అందుబాటులో ఉంది. ప్రస్తుతం బ్రెజిల్ అత్యధిక ఇథనాల్ మిశ్రమాన్ని 48 శాతం వరకు మిక్స్ చేస్తోంది. భారతదేశంలోని అనేక సంస్థలు తమ వాహనాలను E20 ఇంధన సామర్థ్యంతో ప్రారంభించాయి. ఇదీ చదవండి: ఉత్పత్తి నిలిపివేసిన టయోటా.. షాక్లో కస్టమర్లు - కారణం ఇదే! ఇథనాల్.. ఇతర ఇంధనాలతో పోలిస్తే ఇథనాల్ అనేది తక్కువ ఖర్చుతో లభిస్తుంది. ఎందుకంటే బయోవేస్ట్ నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేస్తారు. కావున ఇలాంటి వాహనాల వినియోగానికి అయ్యే ఖర్చు.. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. అయితే ఈ రకమైన కార్లు ఎప్పటి నుంచి వినియోగంలోకి వస్తాయనేది తెలియాల్సి ఉంది. -
ఉత్పత్తి నిలిపివేసిన టయోటా.. షాక్లో కస్టమర్లు - కారణం ఇదే!
ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థ 'టయోటా' (Toyota) ఒక్కసారిగా షాక్ ఉత్పత్తి నిలిపివేసి కస్టమర్లకు షాకిచ్చింది. జపాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ అక్కడ మొత్తం 14 తయారీ కేంద్రాలలో ఈ రోజు (మంగళవారం) ఉత్పత్తి నిలిపివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి సంస్థకు సంబంధించిన విడిభాగాల ఆర్డర్స్ పర్యవేక్షించే కంప్యూటర్ సిస్టంలో ఏర్పడిన లోపం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం ఉందా? లేదా? అనే కోణంలో విచారణ జరుగుతోంది. అధికారిక సమాచారం త్వరలోనే వెల్లడవుతుంది. గ్లోబల్ మార్కెట్లో ఎక్కువ మంది వాహన వినియోగదారులు ఇష్టపడి కొనుగోలు చేసే బ్రాండ్లలో టయోటా ఒకటి. అయితే కంపెనీ ఉత్పత్తి నిలిపివేసిందనే వార్త కష్టమరల్లో ఒకింద భయాన్ని కలిగించింది. కాగా మళ్ళీ ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ప్రస్తుతానికి వెల్లడికాలేదు. అంతే కాకుండా ఏ మోడల్స్ ఉత్పత్తులు నిలిచిపోయాయి అనేదానికి సంబంధించిన విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఇదే జరిగితే ఉద్యోగుల పంట పండినట్లే.. వర్క్ ఫ్లెక్సిబిలిటీ గురూ! కరోనా వైరస్ విజృంభించిన సమయంలో సెమీ కండక్టర్ల కొరత కారణంగా గతంలో కూడా కంపెనీ ఉత్పత్తి కొన్ని రోజులు నిలిపివేసింది. కాగా ప్రస్తుతం ఈ సమస్య తొలగిపోయింది, కొత్త సమస్య పుట్టుకొచ్చింది. దీనికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. -
నెమ్మదించిన ఆటో అమ్మకాలు: కంపెనీలకు షాక్
ముంబై: దేశీయంగా ఆటో అమ్మకాలు జూలైలో నెమ్మదించాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ కంపెనీల విక్రయాలు ఒక అంకె వృద్ధికి పరిమితమయ్యాయి. మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం జూలైలో మొత్తం 1,75,916 వాహనాలను విక్రయించగా, జూలైలో ఈ సంఖ్య స్వల్పంగా 3% పెరిగి 1,81,630 యూనిట్లకు చేరింది. ‘‘ఈ జూలైలో మా ఎస్యూవీ అమ్మకాలు 42,620 యూనిట్లు. కేరళ ఓనమ్ పండుగ(ఆగస్టు 28)తో ప్రారంభం కానున్న పండుగ సీజన్ నుంచి ఆటో పరిశ్రమ అమ్మకాల్లో వృద్ధి ఆశించవచ్చు’’ అని కంపెనీ మార్కెటింగ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ♦ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ జూలైలో 66,701 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే ఏప్రిల్లో అమ్మిన 63,851 వాహనాలతో పోలిస్తే నాలుగు శాతం అధికం. ‘‘స్పోర్ట్ యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ) వాహనాలకు డిమాండ్ లభించడంతో జూలైలో దేశీయంగా 60 వేలకు పైగా అమ్మకాలను సాధించగలిగాము’’ అని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. ♦ టాటా మోటార్స్ స్వల్పంగా అమ్మకాలు తగ్గాయి. గతేడాది జూలైలో 81,790 వాహనాలకు విక్రయించగా.., ఈ జూలైలో నాలుగుశాతం క్షీణతతో 80,633 యూనిట్లకు పరిమితమయ్యాయి. ♦మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాల్లో 18% వృద్ధి సాధించింది. గతేడాది జూలైలో మొత్తం 56,148 యూనిట్లకు విక్రయించగా, ఈ జూలైలో 66,124 వాహనాలను అమ్మింది. ముఖ్యంగా ప్యాసింజర్ విభాగంలో 29 శాతం వృద్ధిని నమోదు చేసింది. ♦ ద్విచక్ర వాహన విక్రయాలకు డిమాండ్ కొనసాగడంతో చెప్పుకొదగిన స్థాయిలో విక్రయాలు జరిగాయి. బజాజ్ ఆటో(10% క్షీణత) మినహా రాయల్ ఎన్ఫీల్డ్, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు వరుసగా 32%, 12%, 4% చొప్పున పెరిగాయి. ♦ మొత్తంగా వార్షిక ప్రాతిపదికన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 3% స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. ఈ జూలైలో వీటి విక్రయాలు 3,52,492 యూనిట్లకు చేరాయి. -
ఇండియన్ ఆర్మీలోకి మొదటి సారి ఆ కార్లు!
భారత సైన్యం మరింత బలపడటానికి ఎప్పటికప్పుడు తగిన వాహనాలను ఫ్లీట్లో చేరుస్తూనే ఉంది. ఇటీవల 1850 మహీంద్రా స్కార్పియో వాహనాలకు ఆర్డర్ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ తాజాగా టయోటా హైలక్స్ పికప్ ట్రక్కులను డెలివరీ తీసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీలో ఇప్పటికే మారుతీ జిప్సీ, మహీంద్రా స్కార్పియో, టాటా సఫారి స్టోర్మ్ (GS800), టాటా జెనాన్ పిక్-అప్ల వంటి వాహనాలు ఉన్నాయి. కాగా ఇప్పుడు ఈ విభాగంలో టయోటా కంపెనీకి చెందిన హైలక్స్ పికప్ ట్రక్కులు చేరనున్నాయి. ఈ కార్లు ఆఫ్ రోడింగ్కి అనుకూలంగా ఉండటం వల్ల భారత సైన్యానికి ఇవి చాలా అనుకూలంగా ఉంటాయని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఏఐతో కొత్త రకం మోసం - తెలిసిన ముఖమే అనుకున్నారో..) టయోటా హైలక్స్.. టయోటా హైలక్స్ అద్భుతమైన డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు 2.8 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ కలిగి 204 హార్స్ పవర్ & 420 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ పొందుతుంది. కావున అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఇది మంచి వాటర్ వాడింగ్ కెపాసిటీ కూడా కలిగి ఉంటుంది. కావున అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఇవి భారత సైన్యానికి మరింత బలం చేకూర్చుతాయని భావిస్తున్నాము. -
విడుదలకు సిద్దమవుతున్న టయోటా కొత్త ఎమ్పివి ఇదే!
Toyota Rumion: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టయోటా కంపెనీ త్వరలోనే కొత్త 'రూమియన్' (Rumion) అనే కొత్త ఎమ్పివి విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న ఈ కారు త్వరలో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టానికి సిద్ధంగా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి ఎర్టిగా బేస్డ్ రూమియన్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్టోబర్ 2021 ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో విడుదలైన ఈ కారు 2023 సెప్టెంబర్ నాటికి భారతీయ గడ్డపై అడుగుపెట్టనుంది. దీని కోసం కంపెనీ ట్రేడ్మార్క్ను కూడా దాఖలు చేసింది. ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్, వెల్ఫైర్ విభాగంలో రూమియన్ నాల్గవ మోడల్ అవుతుంది. త్వరలోనే టయోటా వెల్ఫైర్ ఆధునిక అప్డేట్స్ అందుకునే అవకాశం ఉంది. ఈ కొత్త MPV డిజైన్ దాదాపు ఎర్టిగా మాదిరిగా ఉంటుందని సమాచారం. ఇంటీరియర్ కూడా దాదాపు ఆ మోడల్ మాదిరిగానే ఉండవచ్చు. (ఇదీ చదవండి: నారాయణ మూర్తి లాంటి భర్తకు భార్యగా ఉండటం అంత ఈజీ కాదు!) ఇంజిన్ పరంగా.. రూమియన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 103 హార్స్ పవర్, 137 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్తో లభించనుంది. ఇది CNG వేరియంట్లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. 2023 సెప్టెంబర్ నాటికి మరిన్ని ఎలక్ట్రిక్ కార్లు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. -
ఇంత మంచి డిస్కౌంట్ మళ్ళీ రాదు.. హైలక్స్ కొనుగోలుపై బంపర్ ఆఫర్!
Toyota Hilux Discounts: భారతీయ మార్కెట్లో 'టయోటా' (Toyota) కార్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కంపెనీ ఇప్పుడు తన పికప్ ట్రక్కు 'హైలక్స్' (Hilux) మీద కనీవినీ ఎరుగని డిస్కౌంట్ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఇప్పటికే మంచి సంఖ్యలో అమ్ముడవుతున్న 'టయోటా హైలక్స్ పికప్' (Toyota Hilux Pickup) ట్రక్కు మీద కంపెనీ రూ. 6 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. గతంలో సంస్థ ఈ వెహికల్ బేస్ వేరియంట్ ధరలు రూ. 3.60 లక్షలు తగ్గించి, ఇతర వేరియట్ల ధరలను రూ. 1.35 లక్షల వరకు పెంచింది. కాగా ఇప్పుడు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. టయోటా హైలక్స్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్ ఎమ్టి, హై ఎమ్టి, హై ఏటీ. ఈ పికప్ ట్రక్కు ఇప్పటి వరకు 1300 యూనిట్లు అమ్ముడైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని ధరలు రూ. 30.40 లక్షల నుంచి రూ. 37.90 లక్షల మధ్య ఉన్నాయి. (ఇదీ చదవండి: యమహా ఆర్ఎక్స్100 మళ్ళీ రానుందా? ఇదిగో క్లారిటీ!) ప్రస్తుతం దేశంలోని కొన్ని కంపెనీ డీలర్షిప్లు రూ. 6 లక్షల డిస్కౌంట్ అందిస్తున్నట్లు, ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతంలోని డీలర్షిప్లు రూ. 8 లక్షల వరకు తగ్గింపుని అందిస్తున్నట్లు సమాచారం. అయితే తగ్గింపులు ఒక నగరం నుంచి మరో నగరానికి మారే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉండే అధికారిక డీలర్షిప్లను సందర్శించి తెలుసుకోవచ్చు. (ఇదీ చదవండి: అదరగొట్టిన 'నెక్సాన్ ఈవీ'.. టాటా ఆంటే మినిమమ్ ఉంటది!) 2022 మార్చిలో ప్రారంభమైన ఈ హైలక్స్ అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగి మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. దీని కోసం కంపెనీ ఇందులో 2.8 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ అమర్చింది. మాన్యువల్ వేరియంట్లలో 201 బిహెచ్పి, 420 ఎన్ఎమ్ టార్క్.. ఆటోమేటిక్ వేరియంట్లలో 500 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది. -
పాకిస్తాన్కు మరో ఎదురు దెబ్బ.. దేశాన్ని విడిచి వెళ్లిపోతున్న దిగ్గజ కంపెనీలు!
పాక్ ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఐఎంఎఫ్ ప్యాకేజీ కోసం వేచి చూస్తోంది. అయితే, ఈ తరుణంలో పాక్ నుంచి పలు అంతర్జాతీయ సంస్థలు కార్యకలాపాలు నిలిపివేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం యూకే ఆయిల్ కంపెనీ ‘షెల్’ పాకిస్తాన్ నుంచి వెళ్లిపోయింది. తాజాగా, ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టయోటా సైతం తన తయారీ యూనిట్లను షట్ డౌన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై టయోటా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. టయోటా ఇండస్ మోటార్స్ పాకిస్తాన్కి చెందిన తన తయారీ ప్లాంట్ను శాస్వతంగా మూసేసింది. దేశం విడిచి పెట్టి వెళ్లిపోనుంది అంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయంటూ బలోచిస్తాన్ జర్నలిస్ట సఫర్ ఖాన్ ట్వీట్ చేశారు. టయోటా ఇండస్ పాకిస్థాన్లో తన కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు వచ్చిన నివేదికపై స్టాక్ వ్యాపారి జెహాన్జేబ్ నవాజ్ వివరణ కోరారు. "వార్తలు సరైనవి అయితే, ఇప్పటికే బుక్ చేసిన కార్ల పరిస్థితి ఏమిటి? ముందస్తు చెల్లింపులు, డీలర్షిప్ల గురించి చెప్పాలని తెలిపారు. Most selling Car Brand 'Toyota Indus Motors' to permanently Shutdown their Plant from Pakistan and leaving Pakistan permanently. pic.twitter.com/bEKXJOapQW — BleedGreen.pk (@bleedgreenarmy) June 17, 2023 ఈ నెల ప్రారంభంలో, ఏఆర్వై న్యూస్ ప్రకారం.. కంపెనీ సరఫరా గొలుసులో అంతరాయం కారణంగా టయోటా ఇండస్ మోటార్స్ ఉత్పత్తిని నిలిపివేసింది. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ జనరల్ మేనేజర్కు రాసిన లేఖలో, కంపెనీ మేనేజ్మెంట్ "లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (LC) తెరవడంలో జాప్యం, ఇన్వెంటరీ కొరత" కారణంగా దాని ఉత్పత్తిని మూసివేస్తున్నట్లు పేర్కొంది. According to the report, Toyota Indus Motors is set to permanently Shutdown their Plant from Pakistan and leave Pakistan permanently. — Safar Khan Baloch (@SafarKhanBaluch) June 17, 2023 కంపెనీ తన ఉత్పత్తిని నిలిపివేయడం ఇది రెండోసారి. గత ఏడాది డిసెంబర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (SBP) నుండి దిగుమతి అనుమతులలో జాప్యం కారణంగా కంపెనీ తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఆటో మొబైల్ రంగానికి సీకేడీ కిట్లు, ప్యాసింజర్ కార్ల విడిభాగాల దిగుమతికి ముందస్తు అనుమతి పొందేందుకు పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ కొత్త మెకానిజంను ప్రవేశపెట్టిందని కంపెనీ తెలిపింది. ఇప్పుడు టయోటా శాస్వతంగా మూసివేస్తున్నట్లు నివేదికలు వెలుగులోకి రావడంపై పాక్ ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడిందన్న చందంగా అసలే ఆర్ధిక పరమైన ఇబ్బందులు పడుతున్న ఈ కఠిన సమయంలో అంతర్జాతీయ కంపెనీలు తరలి వెళ్లడం.. దేశ ఎకానమీకి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చదవండి : విమాన టికెట్ ధరలు చాలా తక్కువేనంటూ.. కేంద్రంపై చిదంబరం సెటైర్లు! -
ఇక నో వెయిటింగ్! స్పీడ్ పెంచిన టయోటా.. ఆ వాహనాల కోసం మూడో షిఫ్ట్
న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్.. కర్నాటకలోని బెంగుళూరు వద్ద ఉన్న బిదాడి ప్లాంట్–1 ఉత్పత్తి సామర్థ్యాన్ని 30 శాతం పెంచేందుకు మూడవ షిఫ్ట్ను ప్రారంభించింది. ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ వంటి ప్రసిద్ధ మోడళ్లలో వెయిటింగ్ పీరియడ్ను తగ్గించాలన్నది కంపెనీ భావన. ఈ యూనిట్లో మౌలిక సదుపాయాలను మెరుగు పర్చడానికి కంపెనీ రూ.90 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టింది. ఇదీ చదవండి: హ్యుందాయ్, షెల్ జోడీ.. ఎలక్ట్రిక్ వాహనదారులకు వెసులుబాటు ప్లాంట్లో 3వ షిఫ్ట్ కోసం దాదాపు 1,500 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకుంది. ‘ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్, ఫార్చ్యూనర్ వంటి మోడళ్లను ఉత్పత్తి చేసే ప్లాంట్లో మూడవ షిఫ్ట్ని ప్రారంభించాం. ఈ ఉత్పత్తులు చాలా విజయవంతం అయ్యా యి. అలాగే వీటికి వెయిటింగ్ పీరియడ్ అధికంగా ఉంది. వేచి ఉండే కాలాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని టయోటా కిర్లోస్కర్ మోటార్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ సుదీప్ ఎస్ దాల్వి తెలిపారు. -
భారత్లో ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి టాప్ 5 కార్లు - ఇవే!
భారతదేశంలో ఎక్కువ మంది సొంతంగా కార్లను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. ఈ కారణంగానే కార్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే కొనుగోలుదారులు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కార్లను ఎంచుకుంటున్నారు. అలాంటి వారికోసం ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి తక్కువ ధరకు లభించే టాప్-5 కార్లు గురించి ఇక్కడ తెలుసుకుందాం. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: దేశీయ మార్కెట్లో ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి రూ. 7.95 లక్షల నుంచి రూ. 8.51 లక్షల మధ్య లభించే సరసమైన కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఆస్టా. ఇందులో డ్రైవర్, ఫ్యాసింజర్, సైడ్ ఎయిర్ బ్యాగులను పొందుతుంది. కావున భారతదేశంలోని అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఇది కూడా ఒకటిగా ఉంది. గ్రాండ్ ఐ10 నియోస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 83 హెచ్పి పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మారుతి సుజుకి బాలెనొ: మారుతి సుజుకి కంపెనీకి చెందిన బాలెనొ జీటా, ఆల్ఫా ట్రిమ్లలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. దీని ధర రూ. 8.38 లక్షల నుంచి రూ. 9.88 లక్షల మధ్య ఉంటుంది. CNG మోడల్ కారులో కూడా ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉన్న బాలెనొ పనితీరు పరంగా కూడా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. హ్యుందాయ్ ఆరా: ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే హ్యుందాయ్ ఆరా ధర రూ. 8.61 లక్షలు. ఆరా ఎస్ఎక్స్(ఓ) ట్రిమ్లో మాత్రమే ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. మిగిలిన అన్ని వేరియంట్లు నాలుగు ఎయిర్ బ్యాగులను పొందుతాయి. హ్యుందాయ్ ఆరా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 83 హెచ్పి పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. (ఇదీ చదవండి: రూ. 32,999 ఫోన్ కేవలం రూ. 2,999కే సొంతం చేసుకోండిలా..!) టయోటా గ్లాంజా: ఇండియన్ మార్కెట్లో రూ. 8.63 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య లభించే టయోటా గ్లాంజా ఉత్తమ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని జి, వి ట్రిమ్లలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 90 హెచ్పి పవర్ 113 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: రూ. 5వేలు పెట్టుబడితో రూ. 750 కోట్ల వ్యాపార సామ్రాజ్యం - తయారైందిలా..!) హ్యుందాయ్ ఐ20: మన జాబితాలో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా ఆరు ఎయిర్ బ్యాగులు కలిగిన హ్యుందాయ్ ఐ20 ఒకటి. దీని ధర రూ. 9.77 లక్షల నుంచి రూ. 11.88 లక్షల మధ్య ఉంటుంది. ఆరు ఎయిర్ బ్యాగులు హ్యుందాయ్ ఐ20 ఆస్టా(ఓ) ట్రిమ్లో మాత్రమే ఉంటాయి. ఐ20 రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్. రెండూ మంచి పనితీరుని అందిస్తాయి. -
ఈ టయోటా కారు కావాలన్నా కొనలేరు - ఎందుకంటే?
ఇండియన్ మార్కెట్లో టయోటా కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తోంది. అయితే ఇప్పుడు 'FJ క్రూయిజర్ SUV'ని నిలిపివేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 2006లో ప్రారంభమైన ఐకానిక్ ఎఫ్జే క్రూయిజర్ ఎట్టకేలకు మరుగునపడనుంది. 2022లో కూడా మిడిల్ ఈస్టర్న్ మార్కెట్లో అమ్ముడైన ఈ కారు గతంలో టయోటా 'ఫైనల్ ఎడిషన్' రూపంలో విడుదలైంది. ఇది కేవలం అప్పట్లో 1,000 యూనిట్లకు మాత్రమే పరిమితమైంది. ల్యాండ్ క్రూయిజర్ నుంచి ప్రేరణ పొందిన ఈ కారు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ ఆఫ్-రోడర్ రూపంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎస్యువి రెట్రో-థీమ్ స్టైలింగ్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఉత్తర అమెరికా, జపాన్, మిడిల్ ఈస్ట్ వంటి అనేక దేశాల్లో విజయవంతంగా అమ్ముడైన ఈ కారు కనుమరుగు కావడం గమనార్హం. (ఇదీ చదవండి: కొత్త మొబైల్ కొనాలకుంటున్నారా? వచ్చే నెల విడుదలయ్యే కొత్త స్మార్ట్ఫోన్స్, ఇవే!) టయోటా ఎఫ్జే క్రూయిజర్ ఫైనల్ ఎడిషన్ బేజ్ ఎక్స్టీరియర్ షేడ్లో ఉంటే.. మిర్రర్స్, గ్రిల్, బాడీ క్లాడింగ్ వంటివి బ్లాక్ షేడ్లో ఉన్నాయి. ఇంటీరియర్ డిజైన్ మొత్తం కూడా ఆకర్షణీయంగా ఉంది. సీట్లు డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్లో, సెంటర్ కన్సోల్ ఇరువైపులా కూడా అదే కలర్ పొందింది. టయోటా ఎఫ్జే క్రూయిజర్ ఫైనల్ ఎడిషన్ 4.0 లీటర్ వి6 ఇంజిన్ కలిగి 270 హెచ్పి పవర్, 370 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో యాక్టివ్ ట్రాక్షన్ కంట్రోల్, క్రాల్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఆఫ్-రోడ్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్ చేస్తున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయ్.. చూసారా..!) ప్రస్తుతం టయోటా భారతదేశంలో ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్, హైరిడర్, వెల్ఫైర్, హిలక్స్ పికప్, ల్యాండ్ క్రూయిజర్ 300 వంటి వాటిని విక్రయమిస్తూ మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. కంపెనీ రానున్న రోజుల్లో మరిన్ని మంచి అమ్మకాలను పొందటానికి కొత్త ఉత్పత్తులను విడుదల చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. -
వీల్స్ ఆన్ వెబ్: కార్ ఆన్లైన్లో ఆర్డర్ చేయండి.. ఇంటికొచ్చేస్తుంది!
ఇప్పటి వరకూ వివిధ రకాల వస్తువలు, దుస్తులు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వంటివి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాం. ఇప్పుడు ఆన్లైన్లో కార్లు ఆర్డర్ చేసే వెసులుబాటు వచ్చేసింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ఇటీవల తన బెంగళూరు కస్టమర్ల కోసం కొత్త ప్లాట్ఫామ్ను పరిచయం చేసింది. ‘వీల్స్ ఆన్ వెబ్’ పేరిట ఆన్లైన్ రిటైల్ సేల్స్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. దీంతో కస్టమర్లు షోరూంలకు వెళ్లే పని లేకుండా హాయిగా ఇంటి వద్దే ఉండి తమకు ఇష్టమైన టయోటా మోడల్ కార్లను ఆర్డర్ చేయొచ్చు. ఇంటి వద్దే కార్ డెలివరీ పొందవచ్చు. పత్రికా ప్రకటన ద్వారా కొత్త ప్లాట్ఫామ్ను ప్రకటించిన టయోటా సంస్థ ‘వీల్స్ ఆన్ వెబ్’ అనేది బిజినెస్ టు కస్టమర్ (B2C) ప్లాట్ఫామ్ అని తెలిపింది. డిజిటల్ స్పేస్లో కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో భాగంగా ఈ ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. ఆన్లైన్ ద్వారా కార్ కొనుగోలు చేసేవారు కారు ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్లు, కలర్లు, వేరియంట్ల ప్రత్యేకతలను డిజిటల్గా వీక్షించవచ్చు. యాక్సెసరీలు, సర్వీస్ ప్యాకేజీలు, ఎక్స్టెండెడ్ వారంటీ వంటి విలువ-ఆధారిత సేవలను కూడా ఆన్లైన్లోనే ఎంచుకోవచ్చు. టయోటా వీల్స్ ఆన్ వెబ్లో కస్టమర్లు ఇప్పటికే తమ వద్ద ఉన్న పాత కార్లను సైతం ఎక్సేంజ్ కింద విక్రయించవచ్చు. ఇక్కడ వివిధ రకాల ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. బుకింగ్ అమౌంట్, పూర్తి మొత్తం లేదా డౌన్పేమెంట్ను ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. ఆన్లైన్ కార్ ఆర్డర్ చేసిన కస్టమర్లకు బుకింగ్ నుంచి డెలివరీ వరకు ప్రతి దశనూ వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. తాము కొత్తగా ప్రారంభించిన వీల్స్ ఆన్ వెబ్ ఆన్లైన్ రిటైల్ ప్లాట్ఫామ్ భారతదేశంలో కార్ల కొనుగోలు అనుభవాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ అండ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ పేర్కొన్నారు. -
హైక్రాస్ బుకింగ్స్ నిలిపివేసిన టాయోటా.. కారణం ఏంటంటే?
టయోటా కిర్లోస్కర్ మోటార్ తన ఇన్నోవా హైక్రాస్ ZX & ZX (O) మోడళ్ల బుకింగ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే హైక్రాస్ మోడల్లో హైబ్రిడ్, గ్యాసోలిన్ మోడళ్ల బుకింగ్లను కొనసాగించనున్నట్లు కంపెనీ పేర్కొంది. దేశీయ మార్కెట్లో గత ఏడాది చివరిలో విడుదలైన హైక్రాస్ మంచి బుకింగ్స్ పొందుతూ, అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. ఈ కొత్త MPV జి-ఎస్ఎల్ఎఫ్, జిఎక్స్, విఎక్స్, జెడ్ఎక్స్, జెడ్ఎక్స్ (ఓ) అనే ఐదు వేరియంట్స్ లో లభిస్తుంది. ఇందులో టాప్ వేరియంట్లకు మాత్రమే ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల ప్రస్తుతానికి బుకింగ్స్ నిలిపివేయడం జరిగింది. జెడ్ఎక్స్ కోసం వెయిటింగ్ పీరియడ్ సుమారు 2.5 సంవత్సరాలుగా ఉంది. ఇన్నోవా హైక్రాస్ ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు వంటివి పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉండి వెనుక భాగంలో స్పోర్ట్స్ ర్యాప్రౌండ్ టెయిల్లైట్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ కలిగి ఉంటుంది. మొత్తం మీద ఇది ఆధునిక డిజైన్ కలిగి ఆకర్షణీయంగా ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. (ఇదీ చదవండి: చిన్న గ్రామం.. చెట్ల కింద చదువు: ఇప్పుడు అమెరికాలో సంపన్న భారతీయుడు!) ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులోని 10.1 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులోని సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చిన్న 4.2 ఇంచెస్ MID స్క్రీన్ను పొందుతుంది. ఇది వాహనం గురించి చాలా సమాచారం అందిస్తుంది. కొత్త హైక్రాస్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలిగి 172 బిహెచ్పి పవర్, 205 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే సమయంలో ఇందులోని 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్ 150 బిహెచ్పి, 187 బిహెచ్పి పవర్ అందిస్తుంది. ఈ రెండూ కూడా CVT ఆటోమేటిక్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటాయి. ఇది కేవలం 9.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కొత్త ఇన్నోవా హైక్రాస్ 21.1 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. -
2023 ఇన్నోవా క్రిస్టా లాంచ్ చేసిన టయోట - పూర్తి వివరాలు
ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా దేశీయ మార్కెట్లో తన '2023 ఇన్నోవా క్రిస్టా' (2023 Innova Crysta) విడుదల చేసింది. ఈ అప్డేటెడ్ మోడల్ డిజైన్ ఏంటి, ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ధరలు, వేరియంట్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూడవచ్చు. వేరియంట్స్ & ధరలు: 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా G, GX, VX , ZX అనే నాలుగు ట్రిమ్లలో లభిస్తుంది. ఈ ఫేస్లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 19.13 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధరలు రూ. 20.09 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త కారుని కంపెనీ ఇప్పటికే మార్కెట్లో విక్రయించబడుతున్న ఇన్నోవా హైక్రాస్తో పాటు విక్రయించనున్నట్లు సమాచారం. ఎక్స్టీరియర్ డిజైన్: డిజైన్ విషయంలో ఇన్నోవా క్రిస్టా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ కొన్ని సూక్షమైన మార్పులు గమనించవచ్చు. ఇందులో ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన బంపర్, కొత్త ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ వంటివి పొందుతుంది. కానీ సైడ్ ప్రొఫైల్, రియర్ ఫ్రొఫైల్ మునుపటి మాదిరిగానే ఉంటాయి. ఇంటీరియర్ ఫీచర్స్: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2023 ఇన్నోవా క్రిస్టా 7-సీటర్, 8-సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ పొందుతాయి. ఇందులో పవర్డ్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, లెదర్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, రెండవ వరుసకు వన్ టచ్ టంబుల్ వంటి ఫీచర్లు ఉంటాయి. అంతే కాకుండా ఇందులోని 8-ఇంచెస్ టచ్స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. (ఇదీ చదవండి: బిలినీయర్గా మారిన రైతు కొడుకు.. రవి పిళ్ళై సక్సెస్ స్టోరీ!) పవర్ట్రెయిన్: గతంలో టయోటా కంపెనీ ఇన్నోవా క్రిస్టాలోని 2.4-లీటర్ డీజిల్ ఇంజిన్ నిలిపివేసింది. ఇది నిలిపివేయడానికి ముందు 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్తో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు విడుదలైన లేటెస్ట్ ఇన్నోవా క్రిస్టా 2.4-లీటర్ డీజిల్ ఇంజన్ మాన్యువల్ గేర్బాక్స్తో మాత్రమే లభిస్తుంది. (ఇదీ చదవండి: మహిళా.. ఇక భయమేల! నీ ఆలోచన ఇలా అమలు చేసేయ్..) సేఫ్టీ ఫీచర్స్: 2023 ఇన్నోవా క్రిస్టా ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఏడు ఎయిర్బ్యాగ్లు, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, త్రీ పాయింట్ సీట్బెల్ట్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. -
Top Car News of The Week: ఒక్క కథనం.. అన్ని వివరాలు!
భారతదేశం ఆటోమొబైల్ రంగంవైపు రోజురోజుకి వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే గత వారం మార్కెట్లో కొత్త ఉత్పత్తులు విడుదలయ్యాయి, కొన్ని కార్ల ధరలు కూడా పెరిగాయి. గత వారం దేశీయ మార్కెట్లో అడుగెట్టిన కార్లు, ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకోవచ్చు. మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్జి: వాహన ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న మారుతి బ్రెజ్జా సిఎన్జి రూ. 9.14 లక్షల ప్రారంభ ధర వద్ద విడుదలైంది. ఈ సిఎన్జి వెర్షన్ కోసం కంపెనీ రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ఇప్పటికే ప్రారంభించింది. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్న బ్రెజ్జా సిఎన్జి మైలేజ్ విషయంలో అద్భుతంగా తయారైంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. 2023 కియా కారెన్స్: ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే గొప్ప అమ్మకాలు పొందుతున్న కియా కారెన్స్, రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (RDE) ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారైంది. ఈ అప్డేటెడ్ మోడల్ ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 1.5 లీటర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 157.8 బిహెచ్పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ iMT యూనిట్ పొందుతుంది. 2023 కియా కారెన్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. సిట్రోయెన్ సి3 కొత్త ధరలు: ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ తన సి3 కారుని దేశీయ మార్కెట్లో విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది, ఈ తరుణంలో కంపెనీ ఈ హ్యాచ్బ్యాక్ ధరలను రూ. 45,000 వరకు పెంచింది. ధరల పెరుగుదల తరువాత సి3 రూ. 6.16 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది. సిట్రోయెన్ సి3 కొత్త ధరల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. పెరిగిన జీప్ గ్రాండ్ చెరోకీ ధరలు: దేశీయ విఫణిలో మంచి ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి జీప్ కంపెనీకి చెందిన గ్రాండ్ చెరోకీ. ఈ SUV ధరలు ఇటీవల లక్ష వరకు పెరిగింది. కావున దీని ధర ఇప్పుడు రూ. 78.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 2.0 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్తో 268 బిహెచ్పి పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. జీప్ గ్రాండ్ చెరోకీ కొత్త ధరలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. టయోటా హైలెక్స్ డిస్కౌంట్: భారతదేశంలో అతి పెద్ద వాహనంగా గుర్తింపు పొందిన టయోటా హైలెక్స్ పికప్ ట్రక్కు కొనుగోలు మీద కంపెనీ రూ. 3.59 లక్షల (స్టాండర్డ్ వేరియంట్) తగ్గింపును ప్రకటించింది. అదే సమయంలో హై వేరియంట్ మ్యాన్యువల్, ఆటోమాటిక్ ధరలను భారీగా పెంచింది. హైలెక్స్ కొత్త ధరలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. -
ఒకటి తగ్గింది.. మరొకటి పెరిగింది: ఇదీ టయోటా హైలెక్స్ ధరల వరుస!
భారతదేశంలో కేవలం కార్లకు, బైకులకు మాత్రమే కాకుండా పికప్ ట్రక్కులకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టొయోటా కంపెనీ గత ఏడాది 'హైలెక్స్' (Hilux) విడుదల చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు ఒక వేరియంట్ ధరలను కొంత తగ్గించింది, మరో వేరియంట్ ధరలను పెంచింది. వేరియంట్స్ & ధరలు: నిజానికి టొయోటా హైలెక్స్ స్టాండర్డ్, హై అనే రెండు ట్రిమ్లలో లభిస్తుంది. ఇప్పుడు స్టాండర్డ్ మోడల్ మీద ఏకంగా రూ. 3.59 లక్షలు తగ్గించింది. కావున ప్రస్తుతం ఈ వేరియంట్ ధర రూ. 30.40 లక్షలు. అదే సమయంలో హై మ్యాన్యువల్, ఆటోమాటిక్ మీద వరుసగా రూ. 1.35 లక్షలు, రూ. 1.10 లక్షలు పెంచింది. దీని ప్రస్తుత ధరలు రూ. 37.15 లక్షలు, రూ. 37.90 లక్షలు. టయోటా ఈ ఏడాది ప్రారంభంలో తన రెండవ బ్యాచ్ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాగా ఇప్పుడు ఒక మోడల్ మీద భారీగా ధరలను తగ్గించి, మరో మోడల్ ధరలను పెంచింది. ధరల పెరుగుదల అమ్మకాల మీద ప్రభావం చూపే అవకాశం ఉందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. డిజైన్ & ఫీచర్స్: టయోటా హైలక్స్ ఆధునిక డిజైన్ పొందుతుంది. ఇందులో పెద్ద హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది, దీనికి రెండు వైపులా ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్లైట్లు ఇవ్వబడ్డాయి. ఈ పికప్ ట్రక్కు అల్లాయ్ వీల్స్తో పాటు వీల్ ఆర్చ్ల చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ పొందుతుంది. దీని డిజైన్ దాదాపు ఫార్చ్యూనర్ మాదిరిగానే ఉంటుంది. ఇది వర్టికల్ టెయిల్ లైట్ మరియు డబుల్ క్యాబ్ స్టైలింగ్ పొందుతుంది. (ఇదీ చదవండి: భార్య గురించి అలా ట్వీట్ చేసిన అష్నీర్ గ్రోవర్) ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8.0 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మౌంటెడ్ కంట్రోల్లతో కూడిన మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కొలతలు: టయోటా ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ మాదిరిగానే ఈ కొత్త పికప్ ట్రక్కును కూడా IMV-2 ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్పై నిర్మించబడింది. కావున దీని పొడవు 5,325 మి.మీ, వెడల్పు 1,855 మి.మీ, ఎత్తు 1,865 మి.మీ, వీల్బేస్ 3,085 మి.మీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని గ్రౌండ్ క్లియరెన్స్ 216 మి.మీ కాగా, బరువు 2.1 టన్నులు వరకు ఉంటుంది. మొత్తం మీద భారతదేశంలో అమ్ముడవుతున్న వాహనాల్లో ఇదే భారీ వాహనం అని చెప్పాలి. ఇంజిన్: టయోటా హైలక్స్ 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ద్వారా 204 బిహెచ్పి పవర్ 420 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. ఇందులో ఫోర్ వీల్ డ్రైవ్ స్టాండర్డ్గా అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న మారుతి కార్లు: కొత్త జిమ్నీ నుంచి ఫ్రాంక్స్ వరకు..) ప్రత్యర్థులు: దేశీయ మార్కెట్లో అమ్ముడవుతున్న టయోటా హైలక్స్ ఒక ప్రత్యేకమైన విభాగంలో ఉండటం వల్ల దీనికి ప్రధాన ప్రత్యర్థులు లేదు. అయిత్ ఇది 'ఇసుజు D-Max V-క్రాస్'కి అమ్మకాల్లో ప్రత్యర్థిగా నిలిచే అవకాశం ఉంది. కానీ దీని ధర హైలక్స్ కంటే చాలా తక్కువ. -
పెరిగిన ఇన్నోవా హైక్రాస్ ధరలు.. విఎక్స్(ఓ) వేరియంట్ లాంచ్
టయోటా కంపెనీ తన ఇన్నోవా హైక్రాస్ VX(O) వేరియంట్ని అధికారికంగా విడుదల చేసింది. ఈ వేరియంట్ 7 సీటర్, 8 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 26.73 లక్షలు, రూ. 26.78 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). కొత్త ఇన్నోవా హైక్రాస్ విఎక్స్(ఓ) వేరియంట్ ఇప్పటికే అందుబాటులో ఉన్న విఎక్స్, జెడ్ఎక్స్ మధ్య ఉంటుంది. ఇది మూడ్ లైటింగ్తో కూడిన పనోరమిక్ సన్రూఫ్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, వైర్లెస్ యాపిల్ కార్ప్లే కనెక్టివిటీతో కూడిన 10 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 6 ఎయిర్బ్యాగ్లు వంటి వాటిని పొందుతుంది. ఇదిలా ఉండగా కంపెనీ ఇప్పుడు మొదటిసారిగా తన హైక్రాస్ ధరలను పెంచింది. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ. 25,000, హైబ్రిడ్ వేరియంట్ ధరలు రూ. 75,000 వరకు పెరిగాయి. ధరల పెరుగుదల తరువాత హైక్రాస్ బేస్ వేరియంట్ ధర రూ. 18.55 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 29.72 లక్షలు (ధరలు, ఎక్స్-షోరూమ్). టయోటా ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్, హైబ్రిడ్ పవర్ట్రెయిన్తో అందుబాటులో ఉన్నాయి. ఇందులోని 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 172 బిహెచ్పి పవర్, 197 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మైల్డ్-హైబ్రిడ్ వెర్షన్ 2.0-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్తో 183 బిహెచ్పి పవర్ అందిస్తుంది. రెండు ఇంజిన్లు CVT ఆటోమేటిక్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటాయి. కేవలం 9.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతాయి, అదే సమయంలో ఇన్నోవా హైక్రాస్ 21.1 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇన్నోవా హైక్రాస్ ADAS టెక్నాలజీ కూడా పొందుతుంది. కావున ఇందులో పార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. డిజైన్ పరంగా ఉత్తమంగా ఉండటమే కాకుండా అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. -
‘ఇథనాల్’ ప్రచారంలో టయోటా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజాగా ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్తో (ఇస్మా) చేతులు కలిపింది. భారత్లో స్థిర జీవ ఇంధనంగా ఇథనాల్ను ఉపయోగించడాన్ని ప్రోత్సహించడానికి, అవగాహన కల్పించడానికి ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. పర్యావరణ అనుకూల సాంకేతికతతో పాటు ఇంధన స్వావలంబనను ప్రోత్సహించే వివిధ అధునాతన పవర్ట్రెయిన్ల కోసం నిరంతరం అధ్యయనం చేస్తున్నట్టు టయోటా తెలిపింది. ఇథనాల్ను జీవ ఇంధనంగా ఉపయోగించడాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. 2025 నాటికి పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలపడం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. 2025–2026 నాటికి 8.6 కోట్ల బ్యారెల్స్ పెట్రోల్ స్థానంలో 20 శాతం ఇథనాల్ మిశ్రమం ద్వారా భారత్కు రూ.30,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని అంచనా. -
టయోటా లగ్జరీ కారు సొంతం చేసుకున్న ఫస్ట్ సెలబ్రిటీ: ధర తెలిస్తే!
సాక్షి, ముంబై: ఖరీదైన వాహనాలను కొనాలని అందరికి ఉంటుంది. కానీ అది చాలా వరకు పారిశ్రామిక వేత్తలకు, సెలబ్రటీలకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇటీవల పంజాబీ సింగర్ 'గురుదాస్ మాన్' టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC300 సొంతం చేసుకున్నారు. ఇటీవల జరిగిన 2023 ఆటో ఎక్స్పోలో అడుగుపెట్టిన ల్యాండ్ క్రూయిజర్ ఎల్సి300 ధర రూ. 2.1 కోట్లు. ఇది వైట్ పెర్ల్, సూపర్ వైట్, డార్క్ రెడ్ మైకా మెటాలిక్, ఆల్టిట్యూడ్ బ్లాక్, డార్క్ బ్లూ మైకా కలర్ ఆప్సన్స్లో లభిస్తుంది. ఇందులో గురుదాస్ మాన్ ఆల్టిట్యూడ్ బ్లాక్ కలర్ కారుని డెలివరీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే కంపెనీ ల్యాండ్ క్రూయిజర్ ఎల్సి300 కోసం రూ. 10 లక్షల టోకెన్తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే మొత్తం అమ్ముడైపోవడం గమనార్హం. ఇది 3.3-లీటర్, టర్బోచార్జ్డ్, V6 డీజిల్ ఇంజిన్ కలిగి 309 పిఎస్ పవర్ & 700 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జత చేయబడి ఉంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే, ల్యాండ్ క్రూయిజర్ LC300లో 12.3 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సింగిల్ పేన్ సన్రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్, 14-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ సీట్లు, సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. గురుదాస్ మాన్ పంజాబ్కు చెందిన సింగర్, రచయిత కూడా. ఇతడు 1980లో దిల్ దా మామ్లా హై అనే పాటతో ఒక్కసారిగా పేమస్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు తన పాటలతో అందరినీ ఆకట్టుకుంటూ 2013 లో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. ల్యాండ్ క్రూయిజర్ డెలివరీ సమయంలో కూడా పంజాబీ పాటతో అలరించాడు. -
టయోటా హైలక్స్ బుకింగ్స్ ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ ప్రీమియం యుటిలిటీ వెహికిల్ హైలక్స్ బుకింగ్స్ను తిరిగి ప్రారంభించింది. ఆన్లైన్లోనూ బుకింగ్స్ స్వీకరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. 2022 జనవరిలో కంపెనీ ఈ మోడల్ను ఆవిష్కరించింది. సరఫరా అడ్డంకుల నేపథ్యంలో అదే ఏడాది ఫిబ్రవరిలో బుకింగ్స్ను నిలిపివేసింది. హైలక్స్ ధర ఎక్స్షోరూంలో రూ.33.99 లక్షల నుంచి ప్రారంభం. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో 2.8 లీటర్ డీజిల్ ఇంజన్ పొందుపరిచారు. వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాలకైనా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హైలక్స్.. భారత మార్కెట్లో కొత్త ప్రమాణాలను సృష్టిస్తుందని విశ్వసిస్తున్నట్టు టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్, స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ తెలిపారు. చదవండి: నెలకు రూ.12వేలు పెన్షన్ కావాలా? ఇలా ట్రై చేయండి! -
టయోటా ఇన్నోవా హైక్రాస్.. అదిరే లుక్, డెలివరీ అప్పటినుంచే!
వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్.. హైబ్రిడ్ మల్టీపర్పస్ వెహికిల్ ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ వర్షన్ ధరను వేరియంట్ను బట్టి రూ.18.3– 19.2 లక్షలుగా నిర్ణయించింది. జనవరి మధ్యకాలం నుంచి డెలివరీలు ఉంటాయని కంపెనీ ప్రకటించింది. సెల్ఫ్చార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వర్షన్ ధర వేరియంట్ను బట్టి రూ.24–29 లక్షలుగా ఉంది. ఈ–డ్రైవ్ సీక్వెన్షియల్ షిఫ్ట్ సిస్టమ్తో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. మైలేజీ లీటరుకు 23.24 కిలోమీటర్లు అని కంపెనీ ప్రకటించింది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లోనూ లభిస్తుంది. మైలేజీ లీటరుకు 16.13 కిలోమీటర్లు. బుకింగ్స్ నవంబర్ 25 నుంచే ప్రారంభం అయ్యాయి. 2005లో భారత్లో అడుగుపెట్టిన ఇన్నోవా ఇప్పటి వరకు 10 లక్షలకుపైగా యూనిట్లు రోడ్డెక్కాయి. సంస్థ మొత్తం అమ్మకాల్లో ఈ మోడల్ వాటా ఏకంగా 50 శాతం పైమాటే. చదవండి: టెక్ దిగ్గజం యాపిల్కు రూ.870 కోట్ల ఫైన్! -
హైబ్రిడ్ మోడళ్లపైనే టయోటా ఫోకస్
ముంబై: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను భవిష్యత్తులో ప్రవేశపెడతాం. ప్రస్తుతానికి హైబ్రిడ్ మోడళ్లపైనే టయోటా కిర్లోస్కర్ ఫోకస్ చేసిందని కంపెనీ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ తెలిపారు. భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో హైబ్రిడ్లపై దృష్టిసారించారన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘కర్బన ఉద్గారాలను తగ్గించడమే దేశ లక్ష్యం అని నేను భావిస్తున్నాను. మీరు దానిని సమగ్రంగా, శాస్త్రీయ ప్రాతిపదికన చూడాలి. అదే మేము చేస్తున్నాము’ అని చెప్పారు. సమీప కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకువచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. పునరుత్పాదక విద్యుత్తు వాటా కనీసం 50–60 శాతానికి చేరితే తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేస్తామని స్పష్టం చేశారు. ఇన్నోవా హైక్రాస్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇవీ ఇన్నోవా హైక్రాస్ ఫీచర్లు.. మల్టీ పర్పస్ వెహికల్ ఇన్నోవా ప్లాట్ఫామ్పై హైక్రాస్ పేరుతో హైబ్రిడ్ వెర్షన్ను కంపెనీ ప్రవేశపెట్టింది. బుకింగ్స్ మొదలయ్యాయి. జనవరి మధ్యకాలం నుంచి డెలివరీలు ఉంటాయి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తోనూ లభిస్తుంది. సెల్ఫ్ చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్తో 2 లీటర్ పెట్రోల్ ఇంజిజన్ పొందుపరిచారు. మైలేజీ లీటరుకు 21.1 కిలోమీటర్లు అని కంపెనీ ప్రకటించింది. డైనమిక్ రాడార్ క్రూజ్ కంట్రోల్, ప్రీ కొలీషన్ సిస్టమ్, 6 ఎయిర్బ్యాగ్స్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ–డ్రైవ్ సీక్వెన్షియల్ షిఫ్ట్ సిస్టమ్, 7–8 సీట్లు, పనోరమిక్ సన్రూఫ్ జోడించారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవా వాహనాలు 26 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2005లో భారత్లో ఇది రంగ ప్రవేశం చేసింది. ఇప్పటి వరకు 10 లక్షల పైచిలుకు ఇన్నోవాలు రోడ్డెక్కాయి. కంపెనీ మొత్తం అమ్మ కాల్లో ఈ మోడల్ వాటా ఏకంగా 50 శాతం ఉంది. చదవండి: బైక్ కొనాలనుకునే వారికి షాక్.. ధరలు పెంచిన ప్రముఖ కంపెనీ! -
టయోటా నుంచి సీఎన్జీ వేరియంట్లు, బుకింగ్స్ షురూ
హైదరాబాద్: వాహన తయా రీ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజా గా సీఎన్జీ విభాగంలోకి ప్రవేశించింది. గ్లాంజా, అర్బన్ క్రూజర్ హైరైడర్ మోడళ్లలో సీఎన్ జీ వేరియంట్లను పరిచయం చేసింది. గ్లాంజా ధర రూ.8.43 లక్షల నుంచి ప్రారంభం. అర్బన్ క్రూజర్ హైరైడర్ ధరను ప్రకటించాల్సి ఉంది. బ్రాండ్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ గ్లాంజా ఆన్లైన్ బుకింగ్లను కూడా ప్రారంభించింది. రూ. 11 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. గ్లాంజా ఎస్ ట్రిమ్కు రూ. 8.43 లక్షలు, జీ ట్రిమ్కి రూ. 9.46 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ధరలను నిర్ణయించింది.పెట్రోల్ వెర్షన్తో పోలిస్తే, గ్లాంజా సీఎన్జీ ధర రూ. 95,000 ఎక్కువ. ఇంజీన్, ఫీచర్లు 55 లీటర్ సీఎన్జీ ట్యాంక్ను అమర్చింది. ఇంటీరియర్ ఎలాంటి మార్పులు లేవు. LED ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, 7.0-అంగుళాల టచ్స్క్రీన్, వాయిస్ అసిస్టెంట్, OTA అప్డేట్లతో కనెక్ట్ చేయబడిన కార్ టెక్, స్టార్ట్/స్టాప్ బటన్ , ఆరు ఎయిర్బ్యాగ్లు లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇటీవల లాంచ్ చేసిన బాలెనో సీఎన్జీతో ఇది పోటీ పడనుందని అంచనా. -
టయోటా ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రాజెక్ట్ను ప్రారంభించిన నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: కార్ల తయారీలో ఉన్న జపాన్ సంస్థ టయోటా ఓ పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఫ్లెక్స్ ఫ్యూయల్–స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్ను అభివృద్ధి చేయనుంది. బ్యాటరీతోపాటు 100 శాతం ఇథనాల్తో ఇది పరుగెడుతుంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టును మంగళవారం ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్ట్ కోసం బ్రెజిల్ నుంచి తెప్పించిన టయోటా కరోలా ఆల్టిస్ ఫ్లెక్స్ ఫ్యూయల్–స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ వాహనానికి ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్తోపాటు ఎలక్ట్రిక్ పవర్ట్రైయిన్ పొందుపరిచారు. ఫ్లెక్స్–ఫ్యూయల్ అనుకూల కార్లు ఒకటి కంటే ఎక్కువ రకాల ఇంధనం లేదా మిశ్రమంతో కూడా నడుస్తాయి. సాధారణంగా పెట్రోల్తోపాటు ఇథనాల్ లేదా మిథనాల్ మిశ్రమం ఉపయోగిస్తారు. 20 నుంచి 100 శాతం వరకు ఇథనాల్ను వినియోగించవచ్చు. ఇటువంటి వాహనాలు బ్రెజిల్, యూఎస్ఏ, కెనడాలో ప్రస్తుతం వాడకంలో ఉన్నాయి. దేశంలో కాలుష్యం పెద్ద ఆందోళన కలిగిస్తోందని మంత్రి అన్నారు. రవాణా రంగం కాలుష్యానికి దోహదపడుతోందని చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్తోపాటు ఇథనాల్, మిథనాల్ వంటి జీవ ఇంధనాలతో నడిచే వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. భారతదేశం అతి తక్కువ సమయంలో 10 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని సాధించిందని టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ అన్నారు. 2025 నాటికి ఇది 20 శాతానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
హైడ్రోజన్ సెల్.. ఎక్కడికైనా తేలికగా తీసుకుపోవచ్చు
హైడ్రోజన్ సెల్– దీనిని ఎక్కడికైనా తేలికగా తీసుకుపోవచ్చు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దీని ద్వారా విద్యుత్తును పొందవచ్చు. ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా అనుబంధ సంస్థ ‘వోవెన్ ప్లానెట్’ చిన్నసైజు సిలిండర్లాంటి ఈ హైడ్రోజన్ సెల్కు రూపకల్పన చేసింది. దీని బరువు 5 కిలోలు మాత్రమే! ఈ హైడ్రోజన్ సెల్ గంటకు 3.3 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఇంధనం అయిపోయాక వీటిని రీఫిల్ చేసుకోవచ్చు. ఈ హైడ్రోజన్ సెల్స్తో వాహనాలకు, విద్యుత్ పరికరాలకు, ఇళ్లకు విద్యుత్ సరఫరా చేసుకోవచ్చు. ప్రత్యేకించి విహారయాత్రకు వెళ్లేవారికి ఈ సెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని హైడ్రోజన్ సెల్స్ మరింతగా వినియోగంలోకి వస్తే, ఉద్గారాల సమస్య తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఇవి అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చదవండి: వినడానికి కొత్తగా ఉన్నా.. ఈ టైర్ల కంపెనీ సేల్స్ టెక్నిక్ మైండ్బ్లోయింగ్! -
టొయాటో హైరైడర్ హైబ్రిడ్ ఎస్యూవీ, వాటికి గట్టిపోటీ
సాక్షి, ముంబై: టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రపంచ ఈవీ దినోత్సవం సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హైబ్రిడ్ ఎస్యూవీని శుక్రవారం లాంచ్ చేసింది. వీటి ధరలరూ. 15.11 లక్షల (ఎక్స్-షోరూమ్)గా సంస్థ ప్రకటించింది. నాలుగు వేరియంట్లలో లభ్యం కానున్న దీని టాప్-స్పెక్ నియో డ్రైవ్ (మైల్డ్-హైబ్రిడ్) వేరియంట్ రూ. 17.09 లక్షలు, హై వేరియంట్ ధర రూ. 18,99,000 (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. 2022 జూలైలో దీన్ని తొలిసారి పరిచయం చేసిన సంస్థ దాదాపు రెండు నెలల తర్వాత దీన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే మోడల్ కోసం అధికారిక బుకింగ్లను ప్రారంభించింది. టయోటా ఇండియా డీలర్షిప్లలోకి రానుంది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మొదలైన వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. అలాగే త్వరలోనే ధరను ప్రకటించనున్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రిడ్ ఎస్యూవీకి కూడి ఇది పోటీగా నిలవనుందని అంచనా. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వేరియంట్ వారీ ధరలు (ఎక్స్-షోరూమ్) S eDrive 2WD హైబ్రిడ్ రూ. 15.11 లక్షలు G eDrive 2WD హైబ్రిడ్ రూ. 17.49 లక్షలు V eDrive 2WD హైబ్రిడ్ రూ. 18.99 లక్షలు V AT 2WD నియో డ్రైవ్ రూ. 17.09 లక్షలు టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్తో బలమైన హైబ్రిడ్ టెక్తో e-CVTతో వస్తుంది. ఇది 91 bhp & 122 Nm ఉత్పత్తి చేస్తుంది. అయితే ఎలక్ట్రిక్ మోటార్ 79 bhp, 141 Nm ను ప్రొడ్యూస్ చేస్తుంది. అర్బన్ క్రూయిజర్ హైరైడర్కు ఇంత అద్భుతమైన స్పందన లభిస్తోందంటూ వినియోగదారులకు అసియేట్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ అతుల్ సూద్ ధన్యవాదాలు తెలిపారు. ఫీచర్లు: టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ నియో డ్రైవ్ , సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్తో అందుబాటులో ఉంటుంది. 6 ఎయిర్బ్యాగ్లు, EBDతో కూడిన ABS, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 9 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్, వైర్లెస్ ఛార్జర్, హెడ్-అప్ డిస్ప్లే, యాంబియంట్ ఇంటీరియర్ లైటింగ్, 7అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి టాప్ ఫీచర్లుఇందులోఉన్నాయి. టయోటా iConnect టెక్నాలజీ సహా క్రూయిజ్ కంట్రోల్, 55 ప్లస్ ఫీచర్లు లభ్యం. -
మార్కెట్లోకి అదిరిపోయే టయోటా ఎస్యూవీ!
ముంబై: టయోటా కిర్లోస్కర్ మోటార్ శుక్రవారం కొత్త ఎస్యూవీ ‘అర్బన్ క్రూయిజర్ హైరైడర్’’ను ఆవిష్కరించింది. టయోటా డీలర్షిప్లలో లేదా అధికారిక వెబ్సెట్లలో రూ. 25,000 చెల్లించి ముందుస్తు బుకింగ్ చేసుకోవచ్చు. వచ్చేనెలలో డెలివరీలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇందులో 1.5–లీటర్ ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ 5–స్పీడ్ మాన్యువల్ లేదా 6–స్పీడ్ ఆప్షనల్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. ఆరు ఎయిర్బ్యాగ్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్–హోల్డ్ అసిస్ట్ తదితర ఫీచర్లు ఉన్నాయి. రియర్ ప్యాసింజర్ల కోసం సీట్బెల్ట్స్ సౌకర్యం ఉంది. దేశీయ మార్కెట్లోని టాటా సఫారీ, హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్ తదితర ఎస్యూవీలకు ప్రత్యర్థిగా ఉంటుంది. -
తొలి ఈవీతో వచ్చిన గండం.. టయోటాకు తప్పని తిప్పలు..
ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అనేక దేశాల్లో మంచి పేరున్న టయోటాకు తొలి ఎలక్ట్రిక్ వెహికల్తో ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఎంతో అర్భాటంగా ఇటీవల టయోటా తమ సంస్థ తరఫున బీజెడ్4ఎక్స్ పేరుతో ఎస్యూవీ కారుని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. టయోటా పేరుకున్న బ్రాండ్ ఇమేజ్తో ఈ కార్లకు బాగానే అమ్మకాలు సాగాయి. అయితే ఇటీవల బీజెడ్4ఎక్స్ వాహనంలో వరుసగా ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రయాణం మధ్యలో చక్రాలు ఊడిపోతున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయ్. దీంతో వెంటనే టయోటా అప్రమత్తమైంది. ఇబ్బందులు వస్తున్న బీజెడ్4ఎక్స్ కార్లను వెనక్కి రీకాల్ చేయాలని నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 2700 కార్లను రీకాల్ చేయనున్నారు. ఇందులో యూరప్ 2,200, యూఎస్ 260, కెనాడ 10, జపాన్ 110 వరకు కార్లు ఉన్నాయి. టయోటా ఈవీ కారులో ఇబ్బందులు రావడం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఇటీవల ఈవీలలో మంటలు చెలరేగడం పరిపాటిగా మారింది. తాజాగా ఇండియాలో టాటా నెక్సస్ కారులో మంటలు వ్యాపించాయి. ఇదే సమయంలో టయోటా ఈవీ కారు ఉదంతం తెరపైకి రావడంతో ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై సందేహాలు కమ్ముకున్నాయి. అయితే టయోటా విషయంలో సమస్య బ్యాటరీలో కాకుండా చక్రాల దగ్గర కావడంతో సమస్య తీవ్రత తగ్గింది. చదవండి: షాకింగ్ వీడియో: మంటల్లో టాటా నెక్సాన్ ఈవీ, స్పందించిన సంస్థ -
ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ, టయోటా వేలకోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల పరికరాలు, పవర్ట్రెయిన్ విడిభాగాలు మొదలైన వాటిని దేశీయంగా తయారు చేయడంపై టయోటా గ్రూప్ సంస్థలు దృష్టి పెట్టాయి. ఇందుకోసం రూ. 4,800 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఇందులో టయోటా కిర్లోస్కర్ మోటర్ (టీకేఎం), టయోటా కిర్లోస్కర్ ఆటో పార్ట్స్ (టీకేఏపీ) కలిసి రూ. 4,100 కోట్లు, మరో అనుబంధ సంస్థ టయోటా ఇండస్ట్రీస్ ఇంజిన్ ఇండియా (టీఐఈఐ) రూ. 700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. దీని కోసం కర్ణాటక ప్రభుత్వంతో టీకేఎం, టీకేఏపీ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. స్థానికత, పర్యావరణ హిత ఉత్పత్తులకు పెద్ద పీట వేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీకేఎం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ గులాటీ తెలిపారు. గ్రూప్ కంపెనీలు (టీకేఎం, టీకేఏపీ) ద్వారా ప్రత్యక్షంగా 3,500 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని, రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరగగలదని ఆయన పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులోనే ఉత్పత్తి ప్రారంభించగలమని గులాటీ వివరించారు. టయోటా గ్రూప్ కంపెనీలు ఇప్పటికే రూ. 11,812 కోట్ల పైచిలుకు ఇన్వెస్ట్ చేశాయని, తమ సంస్థల్లో 8,000 మంది పైగా సిబ్బంది ఉన్నారని టీకేఎం వైస్–చైర్మన్ విక్రమ్ ఎస్ కిర్లోస్కర్ తెలిపారు. భారత్లో టయోటా కార్యకలాపాలు ప్రారంభించి పాతికేళ్లయింది. -
ఈలాన్మస్క్ ఎక్కడ.. చైనా అప్పుడే మొదలెట్టింది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిటికలెస్తూ ట్విటర్ను క్షణాల్లో కొనేసిన ఈలాన్ మస్క్కి ఇప్పటికీ ఓ కోరిక అలాగే ఉండిపోయింది. టెస్లా కార్లలో ఆటోపైలెట్కి అనుమతి సాధించేందుకు ఏళ్ల తరబడి ఈలాన్ మస్క్ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆశించిన ఫలితం పొందలేదు. మరోవైపు చైనా చాప కింద నీరులా ఈ పని చేసేసింది. చైనాలో సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ సేవలు ప్రపంచంలో తొలిసారిగా సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ సేవలు చైనాలో ప్రారంభం కానున్నాయి. క్వాంజో నగరంలోని నన్షా ప్రాంతంలో 100 రోబోట్యాక్సీలు నడిపేందుకు టయోటా ప్రమోట్ చేస్తున్న పోనీ.ఏఐ అనే కంపెనీ ఈ మేరకు లైసెన్స్ దక్కించుకుంది. అలాగే బీజింగ్ నగరంలోనూ సేవలు ఆఫర్ చేసేందుకు పోనీ.ఏఐతోపాటు ఇంటర్నెట్ దిగ్గజం బైడూ లైసెన్స్ పొందింది. 2021 నవంబరు.. బీజింగ్లో 67 అటానమస్ (డ్రైవర్ రహిత) వెహికిల్స్ పరీక్షల కోసం పోనీ.ఏఐ 2021 నవంబర్లో ఆమోదం పొందింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 7,00,000 ట్రిప్స్ పూర్తి చేసింది. 80 శాతం రైడర్స్ పాత కస్టమర్లేనని కంపెనీ తెలిపింది. క్వాంజో నగరంలోని ఇతర ప్రాంతాలతోపాటు చైనాలో ప్రథమ శ్రేణి నగరాల్లోనూ రోబోట్యాక్సీ సర్వీసులను వచ్చే ఏడాది నుంచి మొదలు పెట్టాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతానికి ఈ అటానమస్ వాహనంలో డ్రైవర్ కూడా ఉంటారు. ఈ రెండు కంపెనీలూ రానున్న రోజుల్లో డ్రైవర్ లేకుండానే సేవలు అందించనున్నాయి. కాలిఫోర్నియాకు చెందిన పోనీ.ఏఐ కంపెనీని జేమ్స్ హంగ్, టించెంగ్ లూహ్ 2016లో స్థాపించారు. చదవండి: ‘దిగంతర’ స్పేస్ స్టార్టప్'.. ఇంజనీరింగ్ విద్యార్థుల సక్సెస్ స్టోరీ -
అల్ట్రా స్టైలిష్ లుక్లో కొత్త ఎలక్ట్రిక్ కార్..రేంజ్ దుమ్ము దులిపేస్తుంది!
టెక్నాలజీ శరవేగంగా దూసుకెళ్తున్న నేపథ్యంలో వాహన కొనుగోలు దారుల అభిరుచి మారింది. పెరిగి పోతున్న ఇందన ధరలతో పాటు కొత్త దనాన్ని కోరుకుంటున్నారు. అందుకే ఆటోమొబైల్ సంస్థలు సాంప్రదాయ వెహికల్స్ ఉత్పత్తి తగ్గిస్తున్నాయి. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ను పరిచయం చేస్తున్నాయి. తాజాగా జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ సంస్థ తొలి ఎలక్ట్రిక్ వెహికల్ 'టయోటా బీజెడ్4ఎక్స్'ను లాంచ్ చేసింది. టయోటా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫీచర్లు టయోటా బీజెడ్4ఎక్స్ కారు పొడవు ఆర్ఏవీ4 ఎస్యూవీని తరహాలో ఉంది. వీల్బేస్ 15 సెంటీమీటర్ల పొడవు, 5ఎంఎం విడ్త్ ఉండగా..టయోటా మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్ కారులో ప్రత్యేకగా లెగ్ రూమ్ పొడవు ఉండేలా డిజైన్ చేసింది. ఇక ప్రత్యేకంగా బరువు తగ్గించడంతో పాటు, ఉత్పత్తి అయ్యే ఖర్చు తగ్గించుకోవడంతో పాటు అత్యధికంగా మైలేజ్ ఇచ్చే ఫంట్ర్ వీల్ డ్రైవ్(ఎఫ్డబ్ల్యూడీ), బెటర్ ఫర్మామెన్స్, సుపీరయర్ ట్రాక్షన్ వంటి ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్(ఏడబ్ల్యూడీ)ను అందిస్తుంది. కారు రేంజ్ 559కిలో మీటర్లు డ్రైవింగ్ సమయంలో స్టీరింగ్ దగ్గర బయటి నుంచి కారు లోపలికి వినిపించే శబ్ధాలు రాకుండా చేస్తుంది. అంతేకాదు స్మార్ట్ ఫోన్ కోసం వైర్లెస్ట్ ఛార్జింగ్ పోర్ట్,యూఎస్బీ సీ, ఏ పోర్ట్ తో పాటు 12.3అంగుళాల మల్టీమీడియా సిస్టమ్, ఒకేసారి 5డివైజ్లను కనెక్ట్ చేసుకునేలా 4జీ మోడెమ్, 9స్పీకర్ల జేబీఎల్ స్పీకర్ సిస్టమ్, 8 ఛానెళ్ల 800డబ్ల్యూ యాంపిప్లైర్, 9అంగుళా సబ్ వూఫర్ను అందిస్తుంది. ఇక సింగిల్ ఛార్జ్తో ఎఫ్డబ్ల్యూడీ మోడల్ కారు రేంజ్ 559కిలోమీటర్లు ఉండగా ఏడబ్ల్యూడీ కారు రేజ్ 540 కిలోమీటర్లుగా ఉంది. అదే ఎస్యూవీ కారు ఎఫ్డబ్ల్యూడీ కారు 0-100కేఎంపీఎస్ను 7సెకండ్స్లో, ఏడబ్ల్యూడీ వేరియంట్ కారు 6.5 సెకండ్స్లో వెళ్తుంది. తొలిసారి డిజిటల్ కీ టయోటా కారు ప్రత్యేకంగా ఈ ఎలక్ట్రిక్ కారులో 'డిజిల్ కీ'ని డిజైన్ చేసింది.ఈ 'డిజిటల్ కీ'ని ఒకరి నుంచి మరొకరికి స్మార్ట్ ఫోన్ ద్వారా సెండ్ చేసే సదుపాయం ఉంది. టయోటా బీజెడ్4ఎక్స్ కారు ఫంట్ర్ వీల్ డ్రైవ్లో హార్స్ పవర్ 201 హెచ్పీ, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్, హార్స్ పవర్ను అందిస్తుంది. చదవండి: టాటా సరికొత్త సంచలనం..కొత్త ఎలక్ట్రిక్ కారుతో ప్రత్యర్ధి కంపెనీలకు చుక్కలే! -
వచ్చేస్తోంది...టయోటా ఇన్నోవా ఎలక్ట్రిక్ కారు..! లాంచ్ ఎప్పుడంటే..?
ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా మోటార్స్ ఈవీ వాహనాలపై దృష్టి సారిస్తోంది. అందులో భాగంగా టయోటా ప్రస్తుతం ఇన్నోవా ఈవీ ఎంపీవీ వాహనాన్ని తెచ్చేందుకు సన్నాహాలను చేస్తోంది. ఈ కొత్త ఇన్నోవా ఎంపీవీ నెక్స్ట్-జెన్ ఇన్నోవా ఎంపీవీగా పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లాంచ్ ఎప్పుడంటే..? ఎంపీవీ సెగ్మెంట్లో టయోటా ఇన్నోవా వాహనాలు భారీ ఆదరణను పొందాయి. టయోటా ఇన్నోవా ఈవీ వాహనాన్ని 2023లో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా జకార్తాలో జరుగుతున్న ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షో అధికారికంగా అరంగేట్రం చేయడానికి ముందు కొత్త ఇన్నోవా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ లీక్ అయింది. టయోటా ఇన్నోవా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ప్రోటోటైప్ దశలో ఉందని లీకైన చిత్రాలు వెల్లడిస్తున్నాయి. జపనీస్ ఆటోమేకర్ భవిష్యత్తులో ఎంపిక చేసిన మార్కెట్లలోకి ఎలక్ట్రిక్ టయోటా ఈవీ ఎంపీవీ వాహనాన్ని విడుదల చేయవచ్చు. భారత్లో ఇన్నోవా క్రిస్టాగా విక్రయిస్తోన్న ఎంపీవీ నెక్స్ట్జెన్ ఆధారంగా ఎలక్ట్రిక్ టయోటా ఇన్నోవా కాన్సెప్ట్ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. రేంజ్, ధర వంటి విషయాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. టయోటా ఇన్నోవా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ప్రస్తుత మోడల్ మాదిరిగానే కనిపిస్తోంది. అయినప్పటికీ, దీనికి ఎలక్ట్రిక్ రూపాన్ని అందించడానికి కొన్ని మార్పులు చేర్చబడ్డాయి. ఇన్నోవా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్లో షట్-ఆఫ్ ఫ్రంట్ గ్రిల్, మధ్యలో హెక్సాగోణల్ ఫ్రేమ్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ హెడ్ల్యాంప్లు ఉన్నాయి. ఈ కారు కొత్త ఫ్రంట్ బంపర్తో వస్తుంది. ఇంటీరియర్ కూడా ఇన్నోవా క్రిస్టాతో సారూప్యతను పంచుకుంటుంది. ఇది టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 3-స్పోక్ మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మొదలైన వాటిని పొందుతుంది. క్యాబిన్ లోపల ఎలక్ట్రిక్ అనుభూతిని అందించడానికి బ్లూ కలర్ కూడా జోడించబడింది. చదవండి: సరికొత్తగా రెనో కైగర్.. అదిరిపోయిన ఫీచర్స్! -
ఒకరి తర్వాత ఒకరు.. వరుసగా బాదుడే బాదుడు..
ఉక్రెయిన్ యుద్దమో, అమెరికాలో ద్రవ్యోల్బణమో, చిప్సెట్ల కొరతనో క్రూడ్ ఆయిల్ ధరలో పెరుగుదలో.. కారణం ఏదైతేఏం ధరల బాదుడు షురూ అయ్యింది. ఎఫ్ఎంసీజీ కంపెనీలు మొదలు ఆటోమొబైల్స్ వరకు వరుసగా అన్నింటి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా టయోటా కిర్లోస్కర్ తమ వాహనాల ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఎంపీయూ సెగ్మెంట్లో టయోటా ఇన్నోవాకి ఎస్యూవీలో టయోటా ఫార్చునర్లదే రాజ్యం. ఎంట్రీ లెవల్ నుంచి సెడాన్ల వరకు అనేక మోడళ్లను ఇండియాలో అందిస్తోంది టయోటా. అయితే ఇన్పుట్ కాస్ట్ పెరిగినందున తమ కంపెనీ కార్ల ధరలను 4 శాతం పెంచుతున్నట్టు టయోటా ప్రకటించింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇప్పటికే బీఎండబ్ల్యూ, ఆడి వంటి కంపెనీలు ఏప్రిల్ 1 నుంచి తమ కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. అంతకు ముందే మారుతి, టాటాలు ఈ పని చేశాయి. ఓవైపు ఎలక్ట్రిక్ కార్ల నుంచి తీవ్రపోటీ ఉన్నా ధరలను పెంచేందుకు ఆటోమొబైల్ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. చదవండి: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, 'ఆడీ' కి షాక్! -
ఆటోమొబైల్ కంపెనీలకు భారీగా ‘పీఎల్ఐ’ ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీని ప్రోత్సహించే దిశగా.. ఆటోమొబైల్, ఆటో విడిభాగాల రంగం కోసం ప్రకటించిన ఉత్పాదకత ఆధార ప్రోత్సాహకా(పీఎల్ఐ) పథకం కింద 75 సంస్థలకు ప్రయోజనాలు లభించనున్నాయి. మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, లూకాస్-టీవీఎస్, టాటా కమిన్స్, టయోటా కిర్లోస్కర్ తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. దేశీ కంపెనీలతో పాటు జపాన్, జర్మనీ, అమెరికా, బ్రిటన్ తదితర దేశాల సంస్థలు కూడా వీటిలో ఉన్నట్లు వివరించింది. పీఎల్ఐ స్కీములో అంతర్భాగమైన రెండు పథకాల ద్వారా అయిదేళ్లలో రూ. 74,850 కోట్ల మేర పెట్టుబడులు రానున్నట్లు పేర్కొంది. కాంపోనెంట్ చాంపియన్ ఇన్వెస్టివ్ స్కీము కింద దాదాపు రూ. 29,834 కోట్లు, చాంపియన్ ఓఈఎం ఇన్సెంటివ్ స్కీము కింద రూ. 45,016 కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి. ప్రభుత్వం నిర్దేశించుకున్న రూ.42,500 కోట్ల లక్ష్యం కన్నా ఇది అధికమని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఓఈఎం స్కీము కింద ఇప్పటికే 20 సంస్థలు ఎంపికయ్యాయి. ‘ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా భారత్ సాధిస్తున్న పురోగతిపై పరిశ్రమ గట్టి నమ్మకంతో ఉందని ఈ పథకాలకు లభించిన స్పందన తెలియజేస్తోంది. (చదవండి: ఐఫోన్ 13పై అమెజాన్ అదిరిపోయే ఆఫర్..!) -
కారు నడిపితే నీరు బయటకు వస్తోంది..భారత్లో తొలి కారుగా రికార్డు..!
గ్రీన్ మొబిలిటే లక్ష్యంగా..సంప్రదాయ దహనశీల వాహనాలకు చెక్ పెడుతూ..ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసే పనిలో పడ్డాయి పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు. మరికొన్ని కంపెనీలు ఈవీ వాహనాలపైనే కాకుండా హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్స్తో నడిచే వాహనాలను కూడా తయారు చేసేందుకు సిద్దమయ్యాయి. ఈ వాహనాల తయారీలో జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా ఒక అడుగు ముందుంది. కొద్దిరోజుల క్రితమే హ్రైడోజన్ ఫ్యుయల్తో నడిచే కారును టయోటా మిరాయ్ను ఆవిష్కరించింది. కాగా తాజాగా హైడ్రోజన్తో నడిచే కారును టయోటా భారత్లోకి తీసుకొచ్చింది. భారత్లోని తొలి కారుగా రికార్డు..! భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ఫ్యుయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికిల్ను టయోటా మిరాయ్ కారును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లాంచ్ చేశారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బ్యాటరీ ప్యాక్తో నడిచే టయోటా మిరాయ్ సెడాన్ కారును టయోటా ఆవిష్కరించింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ను టయోటా, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. టయోటా మిరాయ్ ఎస్యూవీ సుమారు 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించనుంది. దీనిలో హైడ్రోజన్ను ఇంధనంగా ఉపయోగిస్తారు. హైడ్రోజన్ వాయువును విచ్చిన్నం చేయడంతో విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఇక ఈ కారు నుంచి నీరు అవశేషంగా బయటకు వస్తోంది. సాధారణంగా సంప్రదాయ ఇంధన వాహనాలు కర్భన ఉద్గారాలను రిలీజ్ చేస్తాయి. ఇంధన ధరలకు చెక్..! సమీప భవిష్యత్తులో టయోటాకు చెందిన క్యామ్రీ కారులో ఫ్లెక్స్ ఇంధనాన్ని ఉపయోగించబోతున్నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ వాహనాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని గడ్కరీ అన్నారు. గ్రీన్ హైడ్రోజన్, ఫ్లెక్స్ ఇంధనంతో పెరుగుతున్న ఇంధన ధరలకు చెక్ పెట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. చదవండి: భారీ షాక్..! రూ. 17 వేలకు పైగా పెంచేసిన చమురు సంస్థలు..! టికెట్ ధరలకు రెక్కలే..! -
పెట్రోల్, డీజిల్, కరెంట్ ఏదీ అక్కర్లేని కారు.. త్వరలో ఇండియాలో
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్తో కూడా కొద్దోగొప్పో కాలుష్యం సమస్య ఉంటుందేమోగానీ.. హైడ్రోజన్తో మాత్రం అస్సలు ఉండదు. ఈ విషయం చాలాకాలంగా మనందరికీ తెలుసు. అయితే, మనం ఇప్పుడు దీని గురించి ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే. ఇప్పటికే రోడ్ల మీద పెట్రోల్, డీజిల్, సీఎన్'జీ, ఎలక్ట్రిక్ కార్లు తిరుగుతున్నాయి. త్వరలో హైడ్రోజన్తో నడిచే కార్లు కూడా దర్శనం ఇవ్వనున్నాయి. తాజాగా టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రయివేట్ లిమిటెడ్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ(ఐసీఏటీ) భారతీయ రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నడిచే హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ టయోటా మిరాయ్ కారును మన దేశంలో పరీక్షించనున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రేపు(మార్చి 16) ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇది. దేశంలో ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ గురించి అవగాహన పెంచడం కోసం ఈ పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. గత ఏడాది టయోటా కంపెనీకి చెందిన మిరాయ్ కారు హైడ్రోజన్ ఫ్యూయెల్'ని ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత అత్యధిక దూరం ప్రయాణించి ఏకంగా 'గిన్నిస్ వరల్డ్ రికార్డ్' కైవసం చేసుకుంది. ఈ విధమైన అత్యధిక మైలేజ్ అందించిన మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కారు ఇదే. కొన్ని నివేదికల ప్రకారం.. హైడ్రోజన్ ఫ్యూయెల్'ని ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత 1,359 కిమీల దూరం ప్రయాణించింది. ఈ మొత్తం దూరం ప్రయాణించడానికి 5.65 కిలోగ్రాముల హైడ్రోజన్ను వినియోగించింది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో విద్యుత్ ఉత్పత్తి చేసే గ్రీన్ హైడ్రోజన్ 1 కేజీ ధర రూ.350-400 వరకు ఉంది. (చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్... భారత్కు ఇదే గోల్డెన్ ఛాన్స్..! అమెరికాకు చెక్..!) -
టయోటాలో అత్యంత సరసమైన ధరలో కార్..! ధర ఎంతంటే..!
ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా దేశీయ మార్కెట్లోకి 2022 టయోటా గ్లాంజాను లాంచ్ చేసింది. భారత్లోని టయోటా కార్లలో 2022 టయోటా గ్లాంజా అత్యంత సరసమైన ధరలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుందని కంపెనీ ప్రకటించింది. ఇంజన్ విషయానికి వస్తే..! 2022 టయోటా గ్లాంజా 1.2 లీటర్, ఫోర్ సిలిండర్ డ్యుయల్జెట్ కే12ఎన్ పెట్రోల్ ఇంజిన్ తో 90hp పవర్ తో 113 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేయనుంది. ఇందులో 5 స్పీడ్ ఆటో, మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరింయట్లలో అందుబాటులో ఉండనుంది. డిజైన్లో స్టైలిష్ లుక్తో..! 2022 టయోటా గ్లాంజా కార్ ముందుబాగం స్టైలిష్ లుక్ వచ్చేలా కంపెనీ డిజైన్ చేసింది. బంపర్, ముందు గ్రిల్, హెడ్ లైట్, ఎల్ఈడీ లైట్స్ గ్రాఫిక్స్ డిజైన్ లో గ్లాంజా కొత్తదనాన్ని కలిగి ఉండనుంది. వేరువేరు మోడళ్లలో లభించే ఫీచర్లు మారనున్నట్లు కంపెనీ వెల్లడించింది. 360-డిగ్రీ కెమెరా, ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే సపోర్ట్తో కూడిన 9.0-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ‘టయోటా ఐ-కనెక్ట్’ కనెక్ట్ చేయబడిన కార్ టెక్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టిల్ట్ , టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్తో కూడిన స్టీరింగ్, 6 ఎయిర్బ్యాగ్స్తో రానున్నాయి. బాలెనో, ఆల్ట్రోజ్ వంటి కార్లకు పోటీగా..! 2022 టయోటా గ్లాంజా కొద్ది వారాల క్రితం మారుతి సుజుకి లాంచ్ చేసిన బాలెనో, టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20, ఫోక్స్వేగన్ పోలో, హోండా జాజ్ కార్లకు పోటీగా నిలుస్తోందని టయోటా కిర్లోస్కర్ మోటార్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ధర ఏంతంటే..? టయోటా గ్లాంజా మొత్తంగా నాలుగు ట్రిమ్ లేవల్స్లో రానుంది. గ్లాంజా ధరలు రూ. 6.39 లక్షల నుంచి ప్రారంభంకానున్నాయి. కంపెనీకి చెందిన డీలర్షిప్లు, వెబ్సైట్ ద్వారా కేవలం రూ.11,000తో ప్రి బుకింగ్స్ను టయోటా గత వారం ప్రారంభించింది. చదవండి: మైలేజ్లో రారాజు..మారుతి సుజుకీ రికార్డుల హోరు..! 10 లక్షలకుపైగా.. -
చేతులు కలిపాయ్..దుమ్ము దులిపేస్తున్నాయ్! దేశీయ రోడ్లపై ఎస్యూవీ చక్కెర్లు!
ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్ ఎస్యూవీ వెహికల్స్కు యమా క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ను దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ తో పాటు వోక్స్వ్యాగన్ టైగూన్, స్కోడా కుషాక్ కార్లు క్యాష్ చేసుకుంటున్నాయి. అదే సమయంలో దేశీయ ఆటోమొబైల్ సంస్థలు సైతం ఎస్యూవీ మార్కెట్ను గ్రాబ్ చేసుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా మనదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా భాగస్వామ్యంలో కొత్త మిడ్ సైజ్ ఎస్యూవీని మార్కెట్లోకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆ రెండు సంస్థ భాగస్వామ్యంలో తయారైన తొలి ఎస్యూవీ వెహికల్స్ టెస్ట్లో భాగంగా దేశీయ రోడ్లపై రయ్ రయ్ మంటూ చక్కెర్లు కొట్టాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వెహికల్స్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. వెహికల్ ఒక్కటే.. కోడ్లు మాత్రం రెండు మారుతి సుజుకీ - టయోటా సంస్థలు మిడ్ రేంజ్ ఎస్యూవీ వెహికల్స్ను తయారు చేశాయి. కానీ ఆ కార్ల కోడ్లు మాత్రం విడి విడిగా ఉన్నట్లు తెలుస్తోంది. మారుతి సుజికి ఎస్యూవీ కోడ్ వైఎఫ్జీ కాగా..టయోటా కారు కోడ్ డీ22 అని పేరు పెట్టారు. ఇక ఆ కార్ల ముందు భాగం చూడటానికి చాలా స్పెషల్ గా ఉంది. హెడ్ ల్యాంప్లను విడగొట్టి.. అదే ప్లేస్లో బంపర్, ఎల్ఈడీ లైట్లతో పాటు హెడ్ లైట్లతో కారును డిజైన్ చేశారు. ఫ్రంట్ ఫాసియా పాక్షికంగా కనిపిస్తుంది. ప్రత్యేక టయోటా, మారుతి కార్ల తరహాలో ఉంటున్నాయి. అయితే, టొయోటా డీ22 ట్విన్ ఎల్ఈడీ డీఆర్ఎల్ లు కనిపిస్తున్నప్పటికీ, మారుతి వైఎఫ్జీకి కింద భాగంలో ఏ ఆకారంలో పెద్ద హెడ్ల్యాంప్తో ఎల్ఈడీ డీఆర్ఎల్లు ఉన్నాయి. రెండు ఎస్యూవీల మంచి గ్రౌండ్ క్లియరెన్స్,వెనుకవైపు ఒకేలా డిజైన్ను కలిగి ఉంటాయి. ఫీచర్లు, సెక్యూరిటీ పరంగా కొనుగోలు దారుల్ని అట్రాక్ట్ చేస్తాయని ఆటోమొబైల్ మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా పరికరాల పరంగా, అవి మొప్పలకు లోడ్ అవుతాయని ఆశించవచ్చు. మారుతీ సుజుకి, టయోటా ఆల్ న్యూ మిడ్ సైజ్ ఎస్యూవీలు కర్ణాటక బిడాడిలో టయోటా రెండవ ప్లాంట్లో తయారు చేస్తున్నారు. ఈ ఎస్యూవీలు దీపావళికి ముందు ఈ పండుగ సీజన్లో దేశీయ మార్కెట్ లో విడుదల కానుండగా.. ఆ కార్ల ధరలు అవి రూ. 10 లక్షలు, రూ.16 లక్షలు (ఎక్స్-షోరూమ్) సెగ్మెంట్లో ఉండనున్నాయి. చదవండి: ఉద్యోగులకు బిగ్షాక్.. 40ఏళ్ల తరువాత కీలక నిర్ణయం! -
లాంఛ్కు ముందే బుకింగ్కు టయోటా బ్రేకులు!
భారత్లో లాంచ్ చేయడానికి కంటే ముందే హైలక్స్ ట్రక్ బుకింగ్ను నిలిపివేసినట్లు కంపెనీ ప్రకటించుకుంది. ఈ మేరకు జపనీస్ ఆటోమేకర్ టయోటా కిర్లోస్కర్ మోటార్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. మోస్ట్ అవెయిటింగ్ మోడల్గా ఉన్న ‘హైలక్స్’ కోసం కిందటి నెలలోనే బుకింగ్స్ను ప్రారంభించింది. మార్చ్లో లాంఛింగ్కు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు డీలర్షిప్స్ వద్ద లక్ష రూ., కంపెనీ ఆన్లైన్ పోర్టల్లో రూ. 50వేలతో బుకింగ్స్ కొనసాగించింది. అయితే ఉన్నపళంగా ఆ బుక్సింగ్ను ఆపేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. కానీ, ఇది తాత్కాలికమే అని పేర్కొంది. వాస్తవానికి బుకింగ్కు మంచి స్పందన వచ్చింది. ఇది సప్లయ్కి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అందుకే బుకింగ్ను టెంపరరీగా ఆపేశామని, త్వరలో మళ్లీ బుక్సింగ్స్ను కొనసాగిస్తామని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. Hilux టయోటా ఫార్చ్యూనర్ SUV వలె.. సేమ్ ప్లాట్ఫారమ్పై ఆధారపడి ఉంటుంది, అయితే ప్రస్తుతం ఇక్కడ మైక్రోస్కోపిక్గా ఉన్న విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకోవాలని చూస్తోంది. హైలక్స్కు సమీప ప్రత్యర్థిగా ఇసుజు V-క్రాస్ను భావిస్తున్నారు. -
చంద్రుడిపై అడుగు పెట్టేద్దామంటున్న టయోటా? మన కోసం వెహికల్ రెడీ చేస్తోంది!
జాబిల్లి పైకి సామాన్యులను తీసుకెళ్లేలా ఓ క్రూయిజర్ వెహికల్ని తయరుచేసే పనిలో ఉంది టయోటా. జపాన్ ఎయిరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా)తో జాయింట్ వెంచర్గా ఈ లూనార్ క్రూయిజర్ వెహికల్ని అభివృద్ధి చేస్తోంది. 2030 చివరినాటికి వాహనం సిద్ధమవుతుందని టయోటా అంటోంది. అంతేకాదు 2040 కల్లా మార్స్ మీదికి కూడా వెళ్లవచ్చని చెబుతోంది. తాము అభివృద్ధి చేసే లూనార్ క్రూయిజర్ వెహికల్ చంద్రుడికి మీదకు తీసుకెళ్లడమే కాదు అక్కడ మనుషులు తిరిగేందుకు అనువైన ఏర్పాట్లు కూడా చేయగలదని హామీ ఇస్తోంది టయోటా. లూనార్ లాండ్ క్రూయిజర్లోనే చంద్రుడిపై తిరిగేందుకు , తాత్కాలికంగా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది. స్పేస్ టెక్నాలజీకి సంబంధించి వందేళ్లకు ఓ సారి గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని, ప్రస్తుతం తాము అదే తరహా టెక్నాలజీపై పని చేస్తున్నట్టు టయోటా చెబుతోంది. భూమిపై వాహనాల్లో ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లినట్టుగా చంద్రుడిపైకి ప్రయాణాలు చేయించాలన్నది తమ లక్ష్యమని చెబుతోంది. చదవండి:జాబిలి వైపు భారీ రాకెట్.. లాంఛ్ కాదు ఢీ కొట్టడానికి! -
బుక్ చేసిన నాలుగేళ్లకు డెలివరీ ప్రచారం.. టయోటా క్లారిటీ
This Toyota Car Will Deliver After 4 Years: ఆ కారును బుక్ చేసుకున్నవాళ్లు డెలివరీ కోసం నాలుగేళ్లు ఎదురుచూడక తప్పదంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో జపనీస్ కార్ మేకర్ టయోటా స్పందించింది. టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్సీ 300 కోసం ఎదురు చూడకతప్పదంటూ కొన్ని వెబ్ సైట్లలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ప్రచారం వాస్తవమని, వాహనదారులు మన్నించాలంటోంది టయోటా. నిజానికి ఈ మోడల్ను కిందటి ఏడాదే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. అత్యాధునిక సాంకేతికత, హై ఫీచర్లతో తీసుకొచ్చింది. 2022 మూడవ త్రైమాసికంలో మార్కెట్లోకి రావొచ్చని భావించారు. అయితే.. సెమీకండక్టర్ల కొరత వల్ల ఇప్పుడు బుక్ చేసుకున్నవాళ్లకు నాలుగేళ్ల దాకా వాహనం డెలివరీ చేయలేమని కంపెనీ తేల్చేసింది. హై ఫీచర్లు ఉండడంతో సెమీకండర్లు అధికంగా అవసరం పడుతోందని, అందుకే అవాంతరాలు ఎదురవుతున్నాయని, అయినా నాలుగేళ్లలోపే డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని టయోటా ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో ప్రభావం ఇతర మార్కెట్లపై పడనుంది. భారత మార్కెట్లో టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్సీ300 ధర కోటిన్నర రూపాయలకు పైనే ఉండొచ్చని అంచనా. ఈ వెహికిల్ 10 శాతం తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఇంజిన్పరంగా రెండు వేరియెంట్స్ లభించనున్నాయి. నిస్సాన్ పాట్రోల్, బెర్సిడెజ్ బెంజ్ జీఎస్, బీఎండబ్ల్యూ ఎక్స్ 6 మోడల్స్కు గట్టి పోటీగా దీనిని భావిస్తున్నారు. -
నానో కారు కంటే చిన్న కారును లాంచ్ చేసిన టయోటా..! ధర ఎంతంటే..?
ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా సరికొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. పరిమాణం, పార్కింగ్ స్థలం, రేంజ్ వీటన్నింటీని దృష్టిలో ఉంచుకొని టయోటా సీప్లస్ పాడ్ (C+pod) కారును లాంచ్ చేసింది. ఈ కారు నానో కారు కంటే చిన్నగా ఉండడం విశేషం. సీ+పాడ్ ప్రత్యేకతలు ఇవే..! నగరాల్లోని ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని టయోటా గత ఏడాది డిసెంబర్లోనే జపాన్లో సీ+పాడ్ను ఆవిష్కరించగా...ఇప్పుడు అన్ని దేశాల్లో ఈ కారు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టయోటా సీ+పాడ్ ఎలక్ట్రిక్ కారులో రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ కారు పూర్తిగా బ్యాటరీ అపరేటెడ్. త్రీటోన్ కలర్ ఆప్షన్స్తో రానుంది. సీ+పాడ్ 9.06 kWh లిథియం అయాన్ బ్యాటరీను అమర్చారు. ఈ కారు దాదాపు 150 కిమీ రేంజ్ను ఇవ్వనుంది. గరిష్ట వేగం గంటకు 60 కి.మీ. స్టైలింగ్ పరంగా, టయోటా సీ+పాడ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లతో రానుంది. ఈ కారు బరువును తగ్గించేందుకుగాను బాహ్య ప్యానెల్లను పూర్తిగా ప్లాస్టిక్తో తయారు చేశారు. ధర ఎంతంటే..! టయోటా సీ+పాడ్ ఎక్స్, జీ అనే రెండు వేరియంట్లలో రానుంది. ఎక్స్ ట్రిమ్ ధర 1.65 మిలియన్ యెన్ (సుమారు రూ.11.75 లక్షలు)గా ఉండగా, జీ ట్రిమ్ ధర 1.71 మిలియన్ యెన్ (సుమారు రూ. 12.15 లక్షలు)గా ఉంది. చదవండి: అదిరే లుక్స్, హై రేసింగ్ పర్ఫార్మెన్స్తో నయా టీవీఎస్ అపాచీ లిమిటెడ్ ఎడిషన్ బైక్! ధర ఎంతంటే..? -
టయోటా దూకుడు.. లైనప్లో 30 ఎలక్ట్రిక్ మోడళ్లు
టోక్యో: భవిష్యత్లో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు జపనీస్ ఆటో దిగ్గజం టయోటా మోటార్ కార్పొరేషన్ తాజాగా వెల్లడించింది. 2030కల్లా 30 పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ మోడళ్లను ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్ అకియో టయోడా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పదేళ్ల కాలంలో 3.5 మిలియన్ ఈవీలను విక్రయించాలని కంపెనీ ప్రణాళికలు వేసినట్లు తెలియజేశారు. తొలుత వేసిన 2 మిలియన్ వాహనాలతో పోలిస్తే లక్ష్యాన్ని పెంచినట్లు తెలియజేశారు. బియాండ్ జీరో(బీజెడ్) సిరీస్ పేరుతో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ మోడళ్ల తయారీకి తెరతీసినట్లు టయోడా వెల్లడించారు. తద్వారా మరికొన్నేళ్లలో అన్ని రకాల ఎస్యూవీ, పికప్ ట్రక్కులు, స్పోర్ట్స్ కార్లను ఈవీ మోడళ్లలో రూపొందించనున్నట్లు వివరించారు. లెక్సస్ లగ్జరీపై దృష్టి ప్రియస్ హైబ్రిడ్, లెక్సస్ లగ్జరీ మోడళ్లతోపాటు.. మిరాయి ఫ్యూయల్ సెల్ కారును రూపొందించిన కంపెనీ ఇకపై మరిన్ని వేరియంట్లను విడుదల చేయనున్నుట్లు వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో 2035కల్లా లెక్సస్ లగ్జరీ బ్రాండును పూర్తిఎలక్ట్రిక్గా అందించనున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో 2030కల్లా వీటిని యూఎస్, యూరోపియన్, చైనీస్ మార్కెట్లలో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. బ్యాటరీ అభివృద్ధి కోసం ఈ ఏడాది మొదట్లో ప్రకటించిన 13.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తాజాగా 17.6 బిలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు ఈ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. హైబ్రిడ్స్ తదితర గ్రీన్ టెక్నాలజీలపై కంపెనీ మొత్తం 70 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. చదవండి: బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ -
కళ్లు చెదిరే లుక్స్తో టయోటా నుంచి సరికొత్త కార్..! ధర ఎంతంటే..!
పికప్ ట్రక్ వాహనాల్లో జపనీస్ కంపెనీ ఇసుజుకు సాటిలేదు. ఇసుజు డీ మ్యాక్స్ వీ క్రాస్ వాహనాలకు పోటీగా ప్రత్యర్థి జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా భారత మార్కెట్లలోకి సరికొత్త పికప్ ట్రక్ను లాంచ్ చేయనుంది. అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లో అత్యంత ప్రజాదరణను పొందిన ‘హిలక్స్’ పికప్ వాహనాన్ని వచ్చే ఏడాది జనవరిలో భారత్లో లాంచే చేసేందుకు టయోటా ఇండియా సన్నహాలు చేస్తోంది. ఇసుజుకు హిలక్స్ దీటైన పోటీ ఇవ్వనుంది. టయోటా భారత్లో ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవాలకు భారీ ఆదరణను సంపాదించింది. అదే నిర్మాణంతో టయోటా హిలక్స్ కూడా ఉండనుంది.టయోటా హిలక్స్ 3000ఎంఎం వీల్బేస్తో రానుంది. టూ డోర్, ఫోర్ డోర్ కాన్ఫిగరేషన్స్తో లభించనుంది. ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్, లాంగ్ స్లిట్ హెడ్ల్యాంప్స్ అమర్చారు. వీటితో పాటుగా 8-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే వంటి ఇంటీరియర్స్ ను కల్గి ఉంది. టయోటా ఫార్చూనర్ కంటే తక్కువగా రూ 25-35 లక్షల మధ్య హిలక్స్ ఉండనుంది. ఇంజిన్ విషయానికి వస్తే..! కంపెనీ ఇంజిన్కు సంబంధించిన విషయాలను ఇంకా వెల్లడించలేదు. అయితే ఇండియా-స్పెక్ టయోటా హిలక్స్ డీజిల్ యూనిట్ ద్వారా శక్తిని పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది., ఇది టయోటా ఫార్చ్యూనర్ మాదిరి 2.8-లీటర్ యూనిట్ 4x4 టాప్-స్పెక్ వేరియంట్గా ఉండనుంది. ఇంజన్ 201bhp సామర్థ్యంతో 500Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. చదవండి: కరోనా ఉన్నప్పటికీ.. రూ. 228 లక్షల కోట్లకు చేరిన కంపెనీలు..! -
ఒక సెకండ్కు సుమారు 6 లక్షల 48 వేల సంపాదన..!
ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు వారి నికర ఆదాయాలను, నష్టాలను, ప్రతి ఆర్థిక సంవత్సరం ఆయా త్రైమాసికాల్లో ప్రకటిస్తాయి. క్యూ1, క్యూ 2, క్యూ 3, క్యూ 4 ఫలితాల పేరిట కంపెనీలు ఆయా ఆర్థిక సంవత్సరంలో ఏంతమేర లాభనష్టాలను ప్రదర్శించాయనే విషయాన్ని బహిరంగంగానే విడుదల చేస్తాయి. కంపెనీల సంపాదన డేటా ఖచ్చితంగా రహస్యం కానప్పటికీ, దాదాపు అన్ని కంపెనీలు తమ విక్రయాలు , ఆదాయ గణాంకాలను కనీసం ప్రతి త్రైమాసికంలో, నెలవారీగా ప్రకటిస్తారు. కాగా ఆయా కంపెనీలు 3 నెలలకొకసారి మాత్రమే ఆదాయ గణంకాలను రిలీజ్ చేస్తాయి. కానీ ఏ ఒక్క కంపెనీ కూడా సెకనుకు లేదా నిమిషానికి లేదా గంటకు వచ్చే సంపాదన గురించి మాత్రం చెప్పవు. ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ కంపెనీలు గణనీయంగానే ఆర్జిస్తున్నాయి. ప్రపంచంలోని రెండో అతి పెద్ద ఆటోమొబైల్ దిగ్గజం టయోటా ఒక సెకనుకు ఎంతమేర ఆర్జిస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం...! చదవండి: నెలకు లక్షల్లో జీతాలు.. నెలాఖరుకు జేబులు ఖాళీ! టెస్లా కంటే..టయోటానే నంబర్ వన్..! టయోటా ఒక సెకనుకు సంపాదన విషయంలో తొలిస్థానంలో నిలుస్తోంది. జపాన్ ఆటోమేకర్ టయోటా ప్రతి సెకనుకు సుమారు 8,731 డాలర్లు(రూ. 6,48,490) మేర ఆర్జిస్తుంది. టయోటా నిమిషానికి 523,889 డాలర్లను , గంటకు 31.4 మిలియన్ డాలర్లను, ఏడాదిగాను 275 బిలియన్ డాలర్లను ఆర్జిస్తోంది. ప్రపంచంలో అతి పెద్ద కార్ల బ్రాండ్గా నిలుస్తోన్న ఫోక్స్వ్యాగన్ కంటే టయోటా ఎక్కువగా సంపాదిస్తోంది. ఫోక్స్వ్యాగన్ ప్రతి సెకనుకు 8,073 డాలర్లను సంపాదిస్తుంది. మూడో స్ధానంలో మెర్సిడిజ్ బెంజ్ నిలుస్తోంది. మెర్సిడెజ్ బెంజ్ కంపెనీ ఒక సెకనుకు 5,589 డాలర్లను వెనకేసుకుంటుంది. తరువాతి స్థానాల్లో హోండా, మిత్సుబిషి , ఫోర్డ్, జనరల్ మోటార్స్, బీఎమ్డబ్ల్యూ, స్టెల్లాంటిస్ సంస్థలు నిలుస్తున్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే...ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమేకర్లలో ఒకటిగా సుజుకీ ఉన్నప్పటికీ టాప్ టెన్లో స్థానంలో లేదు. దాంతోపాటుగా ఈవీ రంగంలో తరచుగా హెడ్లైన్ మేకర్గా నిలిచే టెస్లా కూడా టాప్ టెన్ లిస్ట్లో లేదు. నివేదిక ప్రకారం.. టాప్ టెన్ ఆటోమొబైల్ బ్రాండ్లలో భారతీయ వాహన తయారీదారులు ఎవరూ లేరు. చదవండి: Demand For Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలపై క్రేజ్ మరి ఇంతగా ఉందా...! -
కేసీఆర్ చెప్పినట్టే జరగబోతుందా? ఆ విషయంలో జట్టు కట్టిన యమహా, కవాసాకి
భవిష్యత్తులో పెట్రోలు, డీజిల్ వాహనాలు ఉండబోవంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవల ప్రెస్మీట్లో వ్యాఖ్యానించారు. ఆయన చెప్పినట్టే ఫ్యూచర్ ఉండబోతుందా ? అంటే అవును అన్నట్టుగానే వెహికల్ ఇండస్ట్రీలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల వరి ధాన్యం కొనుగోలు అంశంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. టెక్నాలజీ వేగంగా మారుతుందని, త్వరలో రోడ్ల మీద పెట్రోలు , డీజిల్ వాహనాలు కనపించవన్నారు. రోడ్లపై కాలుష్యం వెదజల్లని ఎలక్ట్రిక్ వెహకిల్స్ మాత్రమే తిరుగుతాయన్నారు. తాను అటువంటి కారు ఒకటి కొన్నట్టు చెప్పారు. ఆయన మాటలకు నిజం కావడానికి ఎంతో కాలం పట్టేట్టుగా లేదు. ఇంతకాలం పెట్రోలు, డీజిల్లను ఉపయోగించే ఇంటర్నల్ కంబస్టన్ (ఐసీ) ఇంజన్లతో కార్లు, బైకులు, స్కూటర్లు తయారు చేస్తూ వచ్చిన సంస్థలన్నీ త్వరలో వాటికి ఫుల్స్టాప్ పెట్టబోతున్నట్టు సంకేతాలు ఇచ్చాయి. అంతేకాదు కాలుష్య రహిత ఇంజన్లను తయారు చేసేందుకు వీలుగా దశబ్ధాల తరబడి ఉన్న వైరాన్ని మరిచి జట్టు కట్టేందుకు సైతం రెడీ అయ్యాయి. కలిసికట్టుగా జపాన్లోని ఓకహాలో నవంబరు 13,14 తేదీల్లో ఇంటర్నల్ కంబస్టన్ (ఐసీ) ఇంజన్ల తయారీ సంస్థ సదస్సులో కీలక ప్రకటన వెలువడింది. ఐసీ ఇంజన్ల తయారీలో మార్కెట్ దిగ్గజ కంపెనీలైన కవాసాకి, యమహా, టయోటా, మజ్దా, సబరు కార్పొరేషన్లు కలిసి పని చేయాలని నిర్ణయించాయి. పరస్పరం సాంకేతిక సహకారం అందించుకుంటూ ఐసీ ఇంజన్ల స్థానంలో హైడ్రోజన్ ఇంజన్లు రెడీ చేస్తామంటూ సంయుక్త ప్రకటన జారీ చేశాయి. హైడ్రోజన్ ఇంజన్ డీజిల్, పెట్రోల్లకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ను ఉపయోగించే టెక్నాలజీ 2018లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. అంతకు ముందు 2010 నుంచే హైడ్రోజన్తో వాహనాలు నడిచే ఇంజన్లను తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానంపై కవాసాకి ప్రయోగాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి హైడ్రోజన్ ఫ్యూయల్ ఇంజన్ అందుబాటులోకి తేనుంది. అనంతరం ఆ టెక్నాలజీనికి మిగిలిన కంపెనీలతో మరింత సమర్థంగా మార్చి కమర్షియల్ వెహికల్స్ మార్కెట్లోకి తేవాలని నిర్ణయించారు. ఒక్కసారి ఇంజన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత హోండా, సుజుకిలను కూడా ఇందులో భాగస్వాములను చేస్తామంటున్నారు. ఈవీ హవా ఇండియాలో ఉన్న బైకుల్లో నూటికి తొంభై శాతం జపాన్ కంపెనీలు తయారు చేసిన ఐసీ ఇంజన్లతోనే తయారవుతున్నాయి. కాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ పుంజుకుంటోంది. రోజుకో కొత్త స్టార్టప్ కంపెనీ ఈవీ బైకులు, స్కూటర్లతో మార్కెట్ని ముంచెత్తుతున్నాయి. దీంతో ఐసీ ఇంజన్ల వాహనాల మార్కెట్కి కోత పడుతోంది. రిలయన్స్ సైతం ఇక రియలన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఏకంగా హైడ్రోజన్ ఫ్యూయల్ ఉత్పత్తి చేసే రెండు గిగా ఫ్యాక్టరీలు నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. ముఖేశ్తో పాటు అదానీ సైతం ఈ రంగంలో పోటీ పడుతున్నారు. ఫలితంగా రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఫ్యూయల్ ఇంజన్ల హవా నడవనుంది. ఒకప్పటి స్టీమ్ ఇంజన్ల తరహాలోనే పెట్రోలు, డీజిల్ ఇంజన్లు మూలన పడే పరిస్థితి ఎదురుకానుంది. చదవండి:ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. టెస్ట్ రైడ్కి మీరు సిద్ధమా? -
మార్కెట్లోకి మరో మైక్రో ఎస్యూవీ కారు!
Toyota Aygo X: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా అధికారికంగా తన కొత్త మైక్రో ఎస్యూవీ కారు ఐగో ఎక్స్(Aygo X)ను ఆవిష్కరించింది. ఇది గతంలో కొద్ది రోజుల క్రితం మన దేశంలో విడుదల అయిన టాటా మోటర్స్ ‘పంచ్’ పోలీకను కలిగి ఉంది. టయోటా ఐగో ఎక్స్ కారును జీఎ-బి ప్లాట్ ఫామ్ ఆధారంగా రూపొంకదించారు. ఈ టయోటా ఐగో ఎక్స్ కారు 3,700 మిమీ పొడవు, 1,740 మిమీ వెడల్పు, 1,510 మిమీ ఎత్తు ఉంది. ఐగో ఎక్స్ తో పోలిస్తే టాటా పంచ్ పొడవు 3,827 మిమీ, వెడల్పు 1,742 మిమీ, ఎత్తు 1,615 మిమీగా ఉంది. ఈ టయోటా ఐగో ఎక్స్ పెద్ద ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ ల్యాంపులు, హెడ్ లైట్లతో పాటు ఎల్ఈడి పగటి పూట రన్నింగ్ లైట్లతో వస్తుంది. ఐగో ఎక్స్ ఇంటీరియర్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ తో వస్తుంది. దీని వెనుక 9 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే ఉంది. టయోటా ఐగో ఎక్స్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేతో అనుకూలమైన ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ కలిగి ఉంది. ఐగో ఎక్స్ 231 లీటర్ల సైజుతో మంచి పెద్ద బూట్ స్థలంతో వస్తుంది. టయోటా ఐగో ఎక్స్ 1.0-లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 72 హెచ్పి, 205 ఎన్ఎమ్ వరకు గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ సీవీటి గేర్ బాక్స్ తో వస్తుంది. 2022లో యూరోప్ మార్కెట్లోకి తీసుకొనిరానున్నారు. మన దేశంలో ఎప్పుడూ తీసుకొస్తారు అనే విషయంపై స్పష్టత లేదు. (చదవండి: చైనాను వెంటాడుతున్న సమస్యలు.. రహదారులు మూసివేత!) -
Toyota Tocozilla: ఇది ట్రక్కు కాదు నడిచే ఇల్లు.. అచ్చంగా హీరోల తరహాలో
టాలీవుడ్ మొదలు హాలీవుడ్ వరకు అవుట్డోర్ షూటింగ్లకి వెళ్లే హీరోలు వ్యానిటీ కార్లు ఉపయోగిస్తుంటారు. అచ్చం ఇంటిలాగే బెడ్, డైనింగ్, కిచెన్, బాత్రూమ్ ఇలా సకల సౌకర్యాలు ఆ వ్యానిటీ వెహికల్లో ఉంటాయి. సినిమా హీరోల తరహాలో ఆ తర్వాత కొందరు రాజకీయ నాయకులు కూడా ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చేసుకున్నారు. హీరోలు, పొలిటీషియన్లకే కాదు ఇప్పుడు అడ్వెంచరిస్టులు, క్యాంపర్లతో పాటు ఈ తరహా వాహనాలపై ఆసక్తి ఉన్న సామాన్యులకు వ్యానిటీ వెహికల్ను అందుబాటులోకి తెస్తోంది టయోటా. సెమా షోలో పూర్తి ఆఫ్రోడ్ వెహికల్గా టయోటా సంస్థ టోకోజిల్లాను రూపొందించింది. అమెరికాలోని లాస్వెగాస్లో జరుగుతున్న సెమా షో 2021లో ఈ ట్రక్ను టయోటా ప్రదర్శించింది. త్వరలోనే మార్కెట్లోకి తెస్తామని తెలిపింది. కదిలే ఇళ్లు టయోటా టోకోజిల్లాలో ఇద్దరు వ్యక్తులు ఇందులో ప్రయాణించడమే కాదు ఇంటిగా మార్చుకుని బతికేందుకు అవసరమైనన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. కిచెన్ అందులో స్టవ్, సింక్, డిష్ వాషర్, ఫ్రిడ్జ్ వంటివి ఉన్నాయి. బాత్రూమ్ కమ్ టాయిలెట్, టీవీ, డైనింగ్ ఏరియా, రెండు సోఫాలు, ఇద్దరు వ్యక్తులు పడుకునేందుకు వీలుగా స్లీపింగ్ ఏరియాతో పాటు సన్రూఫ్ సౌకర్యాన్ని కూడా అమర్చారు. ఈ ట్రక్కులో లివింగ్ ఏరియా 1.83 మీటర్ల ఎత్తుతో డిజైన్ చేశారు. క్యాంపింగ్కి అనుకూలం టయోటా నుంచి 70, 80వ దశకాల్లో వచ్చిన ట్రక్ మోడల్లను అనుసరించి పూర్తి రెట్రో స్టైల్లో టాకోజిల్లాను తయారు చేశారు. క్యాంపింగ్ని ఇష్టపడే వారికి ఈ ట్రక్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని టయోటా అంటోంది. వచ్చే ఏడాదిలో ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ధరకు సంబంధించి టయోటా నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. ఇంజన్ సామర్థ్యం 3.5 లీటర్ వీ6 ఇంజన్తో 6 మాన్యువల్ గేర్ షిప్ట్ పద్దతి 4 వీల్ డ్రైవ్ మోడ్లో ఈ కారుని డిజైన్ చేశారు. ఈ కారు ఇంజన్ 278 హెచ్పీతో 6,000 ఆర్పీఎమ్ ఇవ్వగలదు. -
ఎలక్ట్రిక్ కారు రేసులోకి టొయోటా.. రేంజ్ కూడా అదుర్స్!
పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్న తరుణంలో వినియోగదారులు ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లవైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీవైపు మొగ్గు చూపుతున్నాయి. గత ఏడాది నుంచి ఎక్కువ శాతం మంది ప్రజలు ఈ ఎలక్ట్రిక్ వాహనాల గురుంచి మాట్లాడుకుంటున్నారు. దీంతో భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలపై ఆధారపడుతుందనే ఆలోచనతో పోటీ పడుతూ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. తాజాగా, ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ టొయోటా మోటార్స్ కూడా తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్యూవీ టొయోటా బిజెడ్4ఎక్స్(Toyota bZ4X)ని ఆవిష్కరించింది. ఇతర కంపెనీలకు పోటీ ఇచ్చే విధంగా ఇందులో ఫీచర్స్ ఉన్నాయి. 500 కిలోమీటర్ల రేంజ్తో టెస్లా, వోక్స్ వ్యాగన్, హ్యుందాయ్ వంటి ఇతర బ్రాండ్లను ఇది సవాలు చేయగలదు. టొయోటా బిజెడ్4ఎక్స్ ఉత్తర అమెరికా, చైనా, ఎంపిక చేసిన యూరోపియన్ మార్కెట్లలో 2022లో తీసుకొని రానున్నారు. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వాహనాల కోసం టొయోటా సిద్ధం చేస్తున్న బిజెడ్ సిరీస్లో బిజెడ్4ఎక్స్ కారు అనేది మొదటి మోడల్. 2025 నాటికి 'బిజెడ్' సిరీస్ మోడల్స్ తో సహ మొత్తం 15 ఎలక్ట్రిక్ వాహనలను లాంచ్ చేయాలని చూస్తుంది. టొయోటా బిజెడ్4ఎక్స్ పేరులో బిజెడ్ అంటే అర్థం 'బియాండ్ జీరో(జీరోకి మించి అని అర్థం)'. బిజెడ్4ఎక్స్ డిసెంబర్ 2న ఐరోపాలో ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఈ కొత్త బిజెడ్4ఎక్స్ ఈవీలో 71.4 kWh బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు. ఈ బ్యాటరీ ప్యాక్ పూర్తి చార్జ్ పై ఫ్రంట్-వీల్-డ్రైవ్ వెర్షన్తో 500 కి.మీ రేంజ్, ఆల్-వీల్-డ్రైవ్ వెర్షన్తో దాదాపు 460 కి.మీ రేంజ్ వరకు వెళ్లనున్నట్లు టొయోటా పేర్కొంది.బిజెడ్4ఎక్స్ కారు ఫ్రంట్-వీల్-డ్రైవ్ వెర్షన్ కేవలం ఒకే 150కెడబ్ల్యు మోటార్ కలిగి ఉంటుంది. కాగా, ఆల్-వీల్-డ్రైవ్ వెర్షన్ bZ4X మోడల్ లో ప్రతి యాక్సిల్ పై చేయబడిన 80 కెడబ్ల్యు మోటార్ అమర్చబడి ఉంటుంది. ఈ టొయోటా ఎలక్ట్రిక్ కారు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అవుట్పుట్ ఛార్జర్ లకు కూడా అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 150కెడబ్ల్యు డీసీ ఛార్జర్ సహాయంతో బ్యాటరీలను 30 నిమిషాల్లో 80% వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు అని టొయోటా పేర్కొంది. డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా పార్క్ చేసేటప్పుడు ఛార్జింగ్ కోసం సోలార్ ప్యానెల్స్ ని పైకప్పులో నిర్మించవచ్చు. 4.69 మీటర్ల పొడవు, 1.65 మీ ఎత్తు, 1.86 మీ వెడల్పుతో బిజెడ్4ఎక్స్ హ్యుందాయ్ అయోనిక్ పరిమాణంలో ఉంటుంది. మన ఇండియాలో ఎప్పుడూ ఎలక్ట్రిక్ కారు తీసుకొని వస్తారు అనే విషయంలో స్పస్టత లేదు. -
సరికొత్త హంగులతో టయోటా ఇన్నోవా..!
Toyota Innova Crysta Limited Edition Launched: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ సరికొత్త హంగులతో ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ను లాంచ్ చేసింది. ఇన్నోవా క్రిస్టా మోడల్ భారత్ మార్కెట్లలో అధికంగా సేల్ ఐనా ఎమ్పీవీ(మల్టీపుల్ పర్పస్ వెహికిల్)గా ప్రజాదరణ పొందింది. ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ ధర ఎక్స్షోరూంలో పెట్రోల్ వేరియంట్ ధర రూ.17.18–18.59 లక్షల మధ్య ఉండగా, డీజిల్ వేరియంట్స్ రూ.18.99–20.35 లక్షల కు అందుబాటులో ఉండనుంది. ఇన్నోవా క్రిస్టా లిమిడెట్ ఎడిషన్ మోడల్ 7-సీటింగ్, 8-సీటింగ్ వేరింయట్స్తో అందుబాటులో ఉండనుంది. ఈ కారులో 8 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆటో హెడ్ ల్యాప్స్, ఆటో క్లైమట్ కంట్రోల్, సెవన్ ఎయిర్బ్యాగ్స్ అందుబాటులో ఉండనున్నాయి. భారత్లో టయోటా 2005 నుంచి సుమారు 9 లక్షలకు పైగా ఇన్నోవా కార్లను సేల్ చేసింది. చదవండి: అదృష్టం అంటే వీళ్లదే..! పెట్టుబడి రూ.లక్ష..సంపాదన కోటి రూపాయలు కొత్త ఫీచర్స్ ఇవే...! ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్లో.. 360 డిగ్రీ కెమెరా, మల్టీ టెరేయిన్ మానిటర్, హెడ్ అప్ డిస్ప్లే, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వైర్లెస్ చార్జర్, డోర్ ఎడ్జ్ లైటింగ్ విత్ 16 కలర్ ఆప్షన్స్, ఎయిర్ అయోనైజర్ వంటి హంగులను ఇన్నోవా క్రిస్టాలో టయోటా జోడించింది. ఇంజిన్ విషయానికి వస్తే..! ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ 2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ 164బీహెచ్పీ వద్ద గరిష్టంగా 245ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తోంది. 2.4 లీటర్ డిజీల్ ఇంజిన్ వేరియంట్ 148బీహెచ్పీ వద్ద గరిష్టంగా 343ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తోంది. చదవండి: మరో అరుదైన ఫీట్కు సిద్ధమైన రిషబ్ పంత్..! దినేష్ కార్తీక్ సరసన...! -
కొనుగోలుదారులకు షాకిచ్చిన టయోటా!
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం టయోటా కొత్త కారు కొనేవారికి షాక్ ఇచ్చింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత మార్కెట్లో తన అన్ని ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. అయితే, ధరలు ఎంత శాతం పెరగనుంది అనేది స్పష్టత ఇవ్వలేదు. కానీ, అక్టోబర్ 1, 2021 నుంచి కార్ల ధరలు మరింత ప్రియం కానున్నట్లు ధృవీకరించింది. ధరల పెరుగుదల అనేది మోడల్స్, వాటి వ్యక్తిగత వేరియెంట్లను బట్టి మారవచ్చు. ఇన్ పుట్ ఖర్చులు పెరగడం వల్ల టయోటా ఉత్పత్తుల ధరల పెంచుతున్నట్లు ప్రకటించింది. (చదవండి: భారీగా పెరిగిన హీరో మోటోకార్ప్ బైక్ ధరలు...!) ఇటీవలి కాలంలో ద్రవ్యోల్బణం అధిక రేటు, అధిక ఇంధన ధరల కారణంగా ఆటోమోటివ్ భాగాలు, కమాడిటీస్ & సరుకు ఛార్జీల ధరలు పెరగడం కారణంగా ఆ ధరలను వినియోగదారుల మీద తయారీ కంపెనీలు వేస్తున్నాయి. ఇతర ఆటోమేకర్లు కూడా రాబోయే కొద్ది రోజుల్లో ధరలను పెంచాలని భావిస్తున్నారు. టయోటా ప్రస్తుతం గ్లాంజా, అర్బన్ క్రూయిజర్, ఇన్నోవా క్రైస్టా, ఫార్చ్యూనర్, క్యామ్రీ, వెల్ఫైర్లను సేల్ చేస్తుంది. యారిస్ సెడాన్ కారును మాత్రం టయోటా నిలిపివేసింది. గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ మాదిరిగానే టయోటా యారిస్ స్థానంలో మారుతి సుజుకి సియాజ్ ఆధారంగా కొత్త క్రాస్ బ్యాడ్జ్డ్ సెడాన్ ను ప్రవేశపెట్టాలని భావిస్తుంది. -
టోక్యో ఒలింపిక్స్: ప్రచారానికి ‘టయోటా’ టాటా...
Tokyo Olympics TV Ads: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి సుదీర్ఘ కాలంగా అండగా నిలుస్తున్న అగ్రశ్రేణి స్పాన్సర్ కంపెనీ టయోటా. జపాన్కు చెందిన ఈ ప్రఖ్యాత కంపెనీ ఈ సారి స్వదేశంలో జరుగుతున్న ఒలింపిక్స్లో ప్రచారంతో హోరెత్తిస్తుందని అంతా అనుకున్నారు. అయితే టయోటా భిన్నంగా ఆలోచించింది. కరోనా నేపథ్యంలో దేశ ప్రజల అయిష్టత మధ్య జరుగుతున్న ఒలింపిక్స్లో తాము ప్రచారం చేసుకుంటే మేలుకంటే కీడే ఎక్కువ జరుగుతుందని భావించింది. అందుకే ఒలింపిక్స్ సమయంలో జపాన్లో వచ్చే టీవీ ప్రకటనలనుంచి తమ బ్రాండ్ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. గేమ్స్ జరిగినన్ని రోజులు టీవీలో టయోటా ప్రకటనలు కనిపించవని వెల్లడించింది. కంపెనీ సీఈఓ అకియో టయోడా ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా హాజరు కావడం లేదు. ఎనిమిదేళ్ల కాలానికి సుమారు వంద కోట్ల డాలర్లు (దాదాపు రూ. 7 వేల కోట్లు) స్పాన్సర్ షిప్గా టయోటా ఐఓసీకి చెల్లిస్తుండటం విశేషం. మరో వైపు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే కూడా ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలకు టోక్యో వెళ్లడం లేదని ప్రకటించారు. క్రీడలకు హాజరై ఆపై జపాన్ ప్రధాని యోషిహితె సుగతో విభిన్న ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపాలని ఆయన భావించగా... సమావేశం జరిగే అవకాశం లేకపోవడంతో ఒలింపిక్స్కూ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1731380308.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
లిమిటెడ్ ఎడిషన్లో ఎల్సీ 500హెచ్
ముంబై: టయోటా అనుబంధ సంస్థ లెక్సెస్ లిమిటెడ్ బుధవారం లిమిటెడ్ ఎడిషన్గా ఎల్సీ 500హెచ్ మోడల్ కారును విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.2.15 కోట్లుగా ఉంది. ఎయిర్ రేస్ పైలెట్ యోషిహిడే మురోయా, లెక్సెస్ ఇంజనీర్ల భాగసామ్యంలో ఈ కారు రూపకల్పన జరిగింది. ఏవియేషన్ డిజైన్ ప్రేరణతో వస్తున్న ఈ మోడల్ను కస్టమర్లు ఆదరిస్తారని భారత ప్రెసిడెంట్ పీబీ వేణుగోపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలలో ఈ లెక్సస్ కార్లు అమ్ముడవుతున్నాయి. -
ఫార్చూనర్ కొత్త వెర్షన్...
సాక్షి, న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్ తన ప్రీమియం ఎస్యూవీ ఫార్చూనర్ కొత్త వెర్షన్ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్షోరూం వద్ద దీని ధర రూ.29.98 –-రూ.37.43 లక్షల మధ్య ఉంది. మొత్తం ఏడు వేరియంట్లలో వస్తున్న ఈ కారు లెజెండర్ వేరియంట్ ధర రూ. 37.58 లక్షలుగా నిర్ణయించారు. ఈ కొత్త టయోటా ఫార్చూనర్ పెట్రోల్, డిజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్, 2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. సీట్ వెంటిలేషన్ సిస్టమ్, ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థతో పాటు 11 స్పీకర్లతో జేబిల్ ఆడియో, ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ లాంటి లేటెస్ట్ ఫీచర్లను ఇందులో సమకూర్చారు. కొత్త డిజైన్ అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉన్న ఈ కార్ల డెలివరీ త్వరలో ప్రారంభమవుతుంది. భారత్లో గడిచిన 11 ఏళ్లతో సుమారు 1.7 లక్షల ఫార్చూనర్ కార్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. -
స్పీడు పెంచనున్న ఆటోరంగం
న్యూఢిల్లీ: గతేడాది కష్టకాలంగా గడిచినప్పటికీ కొత్త ఏడాదిపై ఆటోమొబైల్ కంపెనీలు కాస్త ఆశావహంగా ఉన్నాయి. సరఫరా వ్యవస్థల సమస్యలు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ .. వృద్ధి ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాయి. కియా మోటర్స్ ఉత్పత్తి పెంచుకోనుండగా.. టయోటా కొంగొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఇక హ్యుందాయ్ మరిన్ని కొత్త ఆవిష్కరణలను పరిచయం చేయడంపై దృష్టి పెడుతోంది. ‘కొత్త ఏడాదిలో మా తయారీ ప్లాంటులో షిఫ్టులను మూడుకు పెంచుకోనున్నాం. అలాగే కొనుగోలుదారులకు సురక్షితమైన అనుభూతినిచ్చేందుకు ‘ఫిజిటల్’ (ఆఫ్లైన్ స్టోర్స్, డిజిటల్) నెట్వర్క్ విధానాన్ని మరింతగా పటిష్టం చేసుకోనున్నాం’ అని కియా మోటర్స్ ఎండీ ఖూఖ్యున్ షిమ్ తెలిపారు. కరోనా పరమైన సవాళ్లు ఎదురైనప్పటికీ.. 2020లో రెండు కొత్త సెగ్మెంట్లలోకి ప్రవేశించగలిగామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని కియా మోటర్స్ ప్లాంటు వార్షిక సామర్థ్యం 3 లక్షల యూనిట్లుగా ఉంది. విద్యుత్ వాహనాలపైనా కసరత్తు .. 2021లో పెరిగే డిమాండ్కు, కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా దశలవారీగా కొంగొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు టయోటా కిర్లోస్కర్ మోటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, సర్వీస్ విభాగాలు) నవీన్ సోని తెలిపారు. అలాగే మధ్యకాలికం నుంచి దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా విద్యుత్ వాహనాల్లాంటి ప్రత్యామ్నాయాలపైనా దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. ఇక వాహనాల లీజింగ్ సర్వీసులను మరిన్ని నగరాలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు సోని పేర్కొన్నారు. మరోవైపు, కార్యకలాపాలను పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాత నుంచి అమ్మకాల పరిమాణం క్రమంగా పెరిగిందని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గోయల్ తెలిపారు. విదేశాలకు ఐ20 ప్రీమియం కార్ల ఎగుమతులు: హ్యుందాయ్ ఆత్మ నిర్భర్ భారత్ నినాదానికి కట్టుబడి తమ సరికొత్త ఐ20 ప్రీమియం హ్యాచ్బ్యాక్ కార్ల ఎగుమతులను ప్రారంభించినట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. మొదటి దఫా ఎగుమతుల్లో భాగంగా 180 ఐ20 మోడళ్లను దక్షిణాఫ్రికా, చిలీ, పెరూ దేశాలకు తరలించినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది నవంబర్లో అందుబాటులోకి వచ్చిన ఐ20 మోడల్ ధర ఎక్స్ షోరూం వద్ద రూ.6.79 – రూ.11.17 లక్షల మధ్య ఉంది. -
మారుతీ, టయోటా సుషో జాయింట్ వెంచర్
న్యూఢిల్లీ: దేశంలో వాహన విచ్ఛిన్నం, రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటు నిమిత్తం నూతన జాయింట్ వెంచర్ (జేవీ)ను నెలకొల్పినట్లు మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ), టయోటా సుషో సంస్థలు బుధవారం ప్రకటించాయి. మారుతీ సుజుకీ టయోసు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎస్టీఐ) పేరిట ఏర్పాటు చేసిన ఈ జేవీలో ఎంఎస్ఐకు 50 శాతం వాటా, టయోటా సుషో గ్రూప్ కంపెనీలకు మిగిలిన 50 శాతం వాటా ఉన్నట్లు వెల్లడించాయి. కాలం చెల్లిన వాహనాలను సేకరించి వాటిని విచ్ఛిన్నం చేయడం ఎంఎస్టీఐ బాధ్యత కాగా, ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన నాణ్యత, పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణను కొత్త జేవీ చేపడుతుంది. 2020–21 నాటికి నోయిడా, ఉత్తర ప్రదేశ్ల్లో యూనిట్లను ఏర్పాటు చేయనున్నామని, నూతన జేవీతో వనరుల పూర్తిస్థాయి వినియోగం జరగనుందని ఎంఎస్ఐ ఎండీ, సీఈఓ కెనిచి ఆయుకవా అన్నారు. నోయిడా ప్లాంట్ సామర్థ్యం నెలకు 2,000 వాహనాలుగా వెల్లడించారు. -
లెక్సస్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ@ రూ.99 లక్షలు
న్యూఢిల్లీ: టయోటా గ్రూప్నకు చెందిన లగ్జరీ వాహనాల తయారీ కంపెనీ ‘లెక్సస్’ తాజాగా తన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఆర్ఎక్స్ 450హెచ్ఎల్’ కారును భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.99 లక్షలు (ఎక్స్షోరూం, ఢిల్లీ). అదనపు మూడవ వరుస సీటింగ్తో వచ్చిన ఈ మోడల్.. బీఎస్–6 ప్రమాణాలతో విడుదలైంది. 3.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ను అమర్చింది. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, డిజైన్తో పాటు ఆకర్షణీయమైన ధరతో ఈ కారు విడుదలైంది’ అని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ పీబీ వేణుగోపాల్ చెప్పారు. -
టయోటా ఫార్చునర్ లిమిటెడ్ ఎడిషన్ విడుదల
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టయోటా కిర్లోస్కర్ మోటార్’ (టీకేఎం) తాజాగా తన పాపులర్ ఎస్యూవీ ‘ఫార్చునర్’లో లిమిటెడ్ ఎడిషన్ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధర రూ. 33.85 లక్షలు (ఎక్స్–షోరూం, ఢిల్లీ)గా ప్రకటించింది. నూతన ఎడిషన్ 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్తో బుధవారం అందుబాటులోకి వచి్చంది. -
భవిష్యత్తు ‘ఎలక్ట్రిక్’ సవారీదే!
ఆటోమొబైల్ రంగంలో భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని జపాన్ కార్ల దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్స్(టీకేఎం) చెబుతోంది. భారత్లోనే కాక... ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ ఉంటుందని సంస్థ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.రాజా అంచనా వేశారు. దేశీయంగా వాహన అమ్మకాల్లో కొనసాగుతున్న డౌన్ట్రెండ్కు ఇకపై అడ్డుకట్టపడొచ్చని... త్వరలోనే మళ్లీ విక్రయాలు పుంజుకుంటాయని చెప్పారాయన. భారత్లో టీకేఎం ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించి ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ కీలకమైన మైలురాయిని చేరుకోవడంతో మీడియా ప్రతినిధులను బెంగళూరు సమీపంలోని బిడది వద్దనున్న ప్లాంట్ సందర్శనకు టీకేఎం ఆహ్వానించింది. ఈ సందర్భంగా ‘సాక్షి బిజినెస్ ప్రతినిధి’తో ఎన్.రాజా ప్రత్యేకంగా మాట్లాడారు. కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు, పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న ప్రయత్నాలు, బీఎస్–6 వాహనాల విషయంలో సన్నద్ధత ఇలా పలు అంశాలకు సమాధానాలిచ్చారు.ఆ వివరాలు సాక్షి పాఠకులకు ప్రత్యేకం... బిడది(కర్ణాటక) నుంచి ఎం. శివరామకృష్ణకొద్ది నెలలుగా దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్రమైన కుదుపులకు గురవుతోంది. టయోటాతో పాటు ఇతరత్రా చాలా దిగ్గజ కంపెనీల అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీనికి ప్రధాన కారణాలేంటి? ఈ ధోరణి ఇంకా ఎన్నాళ్లుండొచ్చు? డిమాండ్ క్షీణతకు చాలా కారణాలున్నాయి. ప్రధానంగా జీడీపీ వృద్ధి మందగమనం, అధిక బీమా వ్యయాలు, వ్యవస్థలో లిక్విడిటీ తగినంత లేకపోవడంతో పాటు సార్వత్రిక ఎన్నికల సీజన్ కూడా కూడా దీనికి తోడైంది. వాస్తవానికి ఎన్నికల కారణంగా వాహన కొనుగోళ్లు పెరుగుతాయనే వాదనలు నిజం కాదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వాహనాల వినియోగాలపై పరిమితులుంటాయి. దీనివల్ల ఎన్నికల ముందు నెలల్లో అమ్మకాలపై గణనీయమైన ప్రతికూల ప్రభావం ఉంది. గత మూడు నాలుగు ఎన్నికల సందర్భంగా కూడా ఇదే ధోరణిని మేం చూశాం. ఎన్నికలు పూర్తయి కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం కొలువుదీరడంతో మళ్లీ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పాటు వాహన పరిశ్రమకు కూడా మంచిరోజులు వస్తాయని భావిస్తున్నాం. కోడ్ ముగియడంతో ప్రభుత్వపరంగా కొనుగోళ్లు మళ్లీ మొదలవుతాయి. దీనికి తోడు వడ్డీరేట్లు తగ్గుముఖం పడుతుండటం కూడా కలిసొచ్చే అంశం. ఇవన్నీ చూస్తే వాహన అమ్మకాలు ఈ నెల (జూన్) నుంచి మళ్లీ జోరందుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కస్టమర్ల నుంచి ఎంక్వైరీలు భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా వాహన పరిశ్రమ వృద్ధి బాటలోనే ఉంటుంది. అయితే, అమ్మకాల వృద్ధి లోయర్ సింగిల్ డిజిట్కే (1–5%) పరిమితం అవుతుందనేది మా అంచనా. బీఎస్–6 కాలుష్య ప్రమాణాల అమలుకు గడువు దగ్గరపడుతోంది? దీనికి మీరు ఎలా సన్నద్ధమవుతున్నారు? 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్ (భారత్ స్టేజ్)–6 ప్రమాణాలతో వాహనాలు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో నెలకొన్న అనిశ్చితికి సుప్రీం కోర్టు తీర్పు తెరదించడంతో వాహన కంపెనీలన్నీ ఈ సన్నాహాల్లో తలమునకలై ఉన్నాయి. మేం కూడా ఈ డెడ్లైన్కు సిద్ధంగానే ఉన్నాం. బీఎస్–4 వాహనాల ఉత్పత్తిని క్రమంగా నిలిపివేసి.. వాటి స్థానంలో బీఎస్–6 వాహనాలను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నాం. మార్కెట్లో బీఎస్–6 ఇంధన లభ్యతకు అనుగుణంగా మేం వ్యూహాలు రూపొందించుకుంటున్నాం. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో ప్రస్తుతం పోటీ పెరిగింది. భారత్లోని చాలా కార్ల కంపెనీలు ఈ సెగ్మెంట్లోకి వస్తున్నాయి. ప్రపంచ దిగ్గజం టయోటా మాత్రం ఈ రేసులో ఇప్పటిదాకా అడుగుపెట్టలేదు? ఎందుకిలా? ప్రస్తుతం మేం ఈ మొత్తం మార్కెట్ను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కేవలం భారత్ మార్కెట్ కోసమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తుల విడుదలపైనే టయోటా ఎప్పుడూ దృష్టిపెడుతుంది. గ్లోబల్ బ్రాండ్స్ను తీసుకురావాలన్నదే మా ఆకాంక్ష. దీనిపై మా అధ్యయనం కొనసాగుతుంది. దీనివల్ల వాహనాల రేట్లు కూడా పెరుగుతాయి కదా, అసలే అమ్మ కాలు పడిపోతున్న తరుణంలో దీన్నెలా ఎదుర్కొంటారు? అవును, కచ్చితంగా రేట్లు పెరుగుతాయి. సాంకేతిక పరిజ్ఞానం పెంచాల్సి వచ్చినప్పుడు ఉత్పాదక వ్యయం కూడా తదనుగుణంగా పెరుగుతుంది. ఈ భారాన్ని మేం కస్టమర్లపైనే వేయాల్సి వస్తుంది కూడా. బీఎస్–6 కారణంగా పెట్రోలు వాహనాలతో పోలిస్తే డీజిల్ వాహనాల రేట్లు మరికొంత అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలం చెల్లిన వాహనాలను నిర్మూలించేందుకు ప్రభుత్వం వెహికల్ స్క్రాపింగ్ పాలసీని తీసుకొచ్చే సన్నాహాల్లో ఉంది. దీనిపై ప్రభుత్వానికి మీరేమైనా సూచనలు చేస్తున్నారా? వాహన తయారీ సంస్థల సంఘం (సియామ్) ద్వారా ప్రభుత్వం సంబంధిత ముసాయిదా పాలసీపై మా అభిప్రాయాలను కోరింది. దీనిపై మేం మా సూచనలు తెలిపాం. కచ్చితంగా ఈ పాలసీ వల్ల అటు పర్యావరణంతో పాటు వాహన పరిశ్రమకూ ప్రయోజనం చేకూరుతుంది. పూర్తిస్థాయి పాలసీ, మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించిన వెంటనే దానికి అనుగుణంగా మేం చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో చాలా ఆసక్తిగా ఉంది. భారత్లో వీటికి ఎంతమేరకు ఆదరణ లభిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి టయోటా లక్ష్యాలేంటి? ఎలక్ట్రిక్ వాహన విభాగంపై మేం నిర్దిష్టమైన ఆలోచనలతో ముందుకెళ్తున్నాం. భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆటోమొబైల్ పరిశ్రమ భవిష్యత్తు కచ్చితంగా ఎలక్ట్రిక్ వాహనాలదే. ఈ ప్రస్థానంలో క్రమంగా హైబ్రిడ్ వాహనాల నుంచి పూర్తిగా ఎలక్ట్రిక్కు మారడం మంచిదనేది మా అభిప్రాయం. ఎందుకంటే ముందుగా చార్జింగ్ స్టేషన్లు, అధిక సామర్థ్యంగల బ్యాటరీల (ఫ్యూయల్ సెల్స్) లభ్యత వంటి మౌలికాంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇక సంప్రదాయ వాహనాలతో పోలిస్తే వీటి ధర కూడా అధికంగా ఉంటుంది. అందుకే ఒకేసారి ఎలక్ట్రిక్లోకి మారడం అసాధ్యం. ప్రభుత్వ తాజా అధ్యయనం కూడా ఇదే చెబుతోంది. 2030 నాటికి దేశంలో ఏటా కోటి కొత్త కార్ల అమ్మకాలు జరుగుతాయనేది పరిశ్రమ అంచనా. దీనిలో 30 శాతం వాహనాలు ఎలక్ట్రిక్వి ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించింది. మరోపక్క, ఎలక్ట్రిక్ వాహనాలతో సమానంగా హైబ్రిడ్ వాహనాలకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలనేది మా డిమాండ్. ప్రధానంగా వీటిపై పన్నులు తగ్గించడంవల్ల కస్టమర్లకు ప్రయోజనం లభిస్తుంది. రానున్న కాలంలో జీఎస్టీ మండలి ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రపంచ దిగ్గజంగా ఉన్న టెస్లా కూడా భారత్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉంది కదా, ఆ పోటీని తట్టుకోవడానికి మీరెలాంటి వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు? మేం కూడా ఇప్పటికే హైబ్రిడ్తో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను భారత్లోకి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నాం. టెస్లా ప్రవేశం వల్ల మాకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. వాస్తవానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు దేశంలోకి అడుగుపెట్టడం పరిశ్రమకు మంచిదే. దీన్ని మేం స్వాగతిస్తున్నాం కూడా. అయితే, భారత్ వంటి మార్కెట్లలో కస్టమర్ల కొనుగోళ్లను నిర్ణయించేది అంతిమంగా ధరే. ప్రస్తుతం భారత్లో 70 శాతం కార్ల విక్రయాలకు సంబంధించి సగటు ధర రూ.9 లక్షల లోపే ఉంటుంది. అదే ప్రపంచవాప్తంగా లేదా యూఎస్లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ధరలను అన్వయించుకుంటే.. భారత్లో వీటి రేట్లు రూ.60 లక్షల కంటే తక్కువకు లభించే అవకాశం లేదు. వాస్తవానికి 2050 నాటికి పూర్తిగా సీఓ2 ఉద్గార రహిత వాహనాలను మాత్రమే ఉత్పత్తి చేయాలనే స్వీయ సవాలుకు అనుగుణంగా టయోటా అడుగులు వేస్తోంది. దీనిలో ఎంతమేరకు విజయం సాధిస్తామనేది ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఎలక్ట్రిక్ పాలసీ(ప్రోత్సాహకాలు ఇతరత్రా), మౌలిక సదుపాయాల కల్పనపై ఆధారపడి ఉంటుంది. ఇటీవలే సుజుకీతో టయోటా భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది కదా... దీని ద్వారా భారత్లో టయోటా ఎలాంటి వ్యాపార ప్రణాళికలను రూపొందిస్తోంది? ప్రపంచ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా మా మాతృ సంస్థ టయోటా, మారుతీ మాతృ సంస్థ సుజుకీతో జట్టుకట్టింది. దీనివల్ల అటు సాంకేతికంగా, ఇటు ఉత్పాదక సామర్థ్యం పరంగా ఇరు కంపెనీలకూ ఉభయతారకంగా ఉంటుంది. వ్యయాలను కూడా తగ్గించుకోవడానికి వీలవుతుంది. ఇందులో భాగంగా మేం మారుతీ బాలెనో ప్రీమియం హ్యాచ్బ్యాక్ను కొన్ని మార్పులతో మా సొంత బ్రాండ్తో ముందుగా ప్రవేశపెట్టనున్నాం(గ్లాంజా ఈ నెల 6న విడుదల కానుంది). దశలవారీగా బ్రెజా, సియాజ్, ఎర్టిగాలను మేం మా బ్రాండ్తో ప్రవేశపెట్టనున్నాం. తదుపరి దశల్లో వీటిని మా ప్లాంట్లలోనే తయారు చేసే ప్రణాళికలు కూడా ఉన్నాయి. ఇంకా సాంకేతికత బదిలీ ఒప్పందంలో భాగంగా మా హైబ్రిడ్ టెక్నాలజీని సుజుకీకి కూడా అందిస్తాం. అదేవిధంగా సుజుకీ కూడా తన చిన్న పెట్రోలు ఇంజిన్లను టయోటా కాంపాక్ట్ కార్ల కోసం సరఫరా చేస్తుంది. ఒకవైపు వడ్డీరేట్లు క్రమంగా దిగొస్తున్నాయి. మరోపక్క ఇంధన ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే, వాహన కంపెనీలు మాత్రం రేట్లు పెంచుకుంటూపోతున్నాయి. దీనికి కారణమేంటి? ఇంధన ధరలు ఇటీవల కొంత దిగొచ్చినమాట వాస్తవమే. అయితే, ఇరాన్పై ఆంక్షల కారణంగా మళ్లీ క్రూడ్ ధరలకు రెక్కలొచ్చే అవకాశం కనబడుతోంది. దీనిపైనే మా ఆందోళన అంతా. అంతేకాకుండా వాహన ధరల పెంపునకు చాలా కారణాలున్నాయి. ముందుగా చెప్పుకోవాల్సినది ముడివస్తువుల రేట్లు పెరగడం. దీనివల్ల ఉత్పాదక వ్యయం గణనీయంగా పెరిగింది. ఇంకా రవాణా, విద్యుత్ ఖర్చు ఇలా చాలా పెరిగాయి కూడా. అయినాసరే మేం ఈ భారాన్ని పూర్తిగా కస్టమర్లకు బదలాయించడం లేదు. చాలావరకూ మేం భరించి, ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే కొంతమేరకు రేట్లు పెంచాల్సి వస్తోంది. ఒకసారి రేటు పెంపు ప్రతిపాదన వస్తే.. కనీసం 6 నెలలపాటు పరిశీలన జరిపాకే అమలు చేస్తున్నాం. ఇక తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బీఎస్–6 ఇంధనాల ధరలను పెంచబోమంటూ చేసిన ప్రకటన అటు వినియోగదారులతో పాటు వాహన పరిశ్రమకు కూడా తీపి కబురే. భారత్లో టయోటా కర్ణాటక రాష్ట్రానికే పరిమితమైంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కొత్త తయారీ యూనిట్ను పెట్టాల్సి వస్తే ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే ప్రణాళికలు ఏవైనా ఉన్నాయా? మీరు మా ప్లాంట్ మొత్తం చూశారు కదా. ఎంత భారీస్థాయిలో ఉందో. 432 ఎకరాల స్థలం ఉంది. ఇందులో ఇంకా మేం వినియోగించకుండా ఉన్నది 150 ఎకరాలకు పైనే. అయినా, ప్రస్తుతానికి మేం ఇక్కడ చాలా సౌకర్యవంతంగా ఉన్నాం. అన్నీ ఒకే చోట ఉంటే నిర్వహణ కూడా సులువుగా ఉంటుంది. సమీపకాలంలో ఇతర రాష్ట్రాలకు విస్తరించే ప్రణాకలేవీ లేవు.