vishakhapatnam
-
చరిత్ర సృష్టించిన అశుతోష్.. ఐపీఎల్లో భారత తొలి బ్యాటర్గా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025 సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపుతో ఆరంభించింది. లక్నో సూపర్ జెయింట్స్తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం సాధించింది. ఇందుకు ప్రధానం కారణం ఢిల్లీ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు.సుడిగాలి ఇన్నింగ్స్ముఖ్యంగా ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసిన అశుతోష్ శర్మ (Ashutosh Sharma) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో.. చేజారిందనుకున్న మ్యాచ్ ఢిల్లీ సొంతమైంది. 26 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. కేవలం 31 బంతుల్లోనే 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన అశుతోష్ ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.ఇక లక్నోతో మ్యాచ్ సందర్భంగా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో.. విజయంతమైన లక్ష్య ఛేదనలో ఏడు లేదంటే ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చి.. అత్యధిక స్కోరు సాధించిన భారత తొలి బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో యూసఫ్ పఠాన్ రికార్డును అశుతోష్ బద్దలు కొట్టాడు.సెంచూరియన్ వేదికగా 2009లో యూసఫ్ పఠాన్ రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగి.. ఢిల్లీపై 62 పరుగులు సాధించి నాడు తన జట్టును గెలిపించుకున్నాడు. ఇక ఈ జాబితాలో ఓవరాల్గా డ్వేన్ బ్రావో 68 పరుగులతో టాప్లో కొనసాగుతున్నాడు.ఏడు లేదా ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి లక్ష్య ఛేదనలో జట్టును గెలిపించిన బ్యాటర్లు👉డ్వేన్ బ్రావో- 2018లో ముంబై వేదికగాచెన్నై సూపర్ కింగ్స్ తరఫున ముంబై ఇండియన్స్పై 68 పరుగులు👉అశుతోష్ శర్మ- 2025లో విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున లక్నో సూపర్ జెయింట్స్పై 66 నాటౌట్👉ఆండ్రీ రసెల్- 2015లో పుణె వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తరఫున పంజాబ్ కింగ్స్పై 66 పరుగులు👉యూసఫ్ పఠాన్- 2009లొ సెంచూరియన్ వేదికగా రాజస్తాన్ రాయల్స్ తరఫున ఢిల్లీపై 62 పరుగులు👉ప్యాట్ కమిన్స్- 2022లో పుణె వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ముంబై ఇండియన్స్పై 56 పరుగులుమొదటి జట్టుగా ఢిల్లీ అరుదైన రికార్డుమరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా సరికొత్త రికార్డు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఓ జట్టు తరఫున ఏడు, ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన బ్యాటర్లు వందకు పైగా పరుగులు సాధించి.. జట్టును గెలిపించడం ఇదే తొలిసారి. అంతకు ముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉండేది. 2018లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా చెన్నై లోయర్ ఆర్డర్ బ్యాటర్లు 79 పరుగులు చేసి జట్టును గెలిపించారు.ఏడు లేదా ఆ తర్వాతి స్థానాల్లోని బ్యాటర్లు లక్ష్య ఛేదనలో అత్యధిక పరుగులతో జట్టును గెలిపించిన సందర్భాలు👉2025- ఢిల్లీ క్యాపిటల్స్- లక్నో సూపర్ జెయింట్స్పై 113 రన్స్👉2018- చెన్నై సూపర్ కింగ్స్- ముంబై ఇండియన్స్పై 79 పరుగులు.ఐపీఎల్-2025: ఢిల్లీ వర్సెస్ లక్నో👉వేదిక: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం👉టాస్: ఢిల్లీ క్యాపిటల్స్.. తొలుత బౌలింగ్👉లక్నో స్కోరు: 209/8 (20)👉ఢిల్లీ స్కోరు: 211/9 (19.3)👉ఫలితం: ఒక వికెట్ తేడాతో లక్నోపై ఢిల్లీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అశుతోష్ శర్మ. చదవండి: అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోనిClose finish ✅Safe to say, the #DC dugout was a bunch of emotions in those last couple of overs of a nail-biter! 😦 ☺𝗥𝗮𝘄 𝗩𝗶𝘀𝘂𝗮𝗹𝘀! 🎥 🔽 #TATAIPL | #DCvLSG | @DelhiCapitals pic.twitter.com/0EIdIQ7VTt— IndianPremierLeague (@IPL) March 25, 2025 -
DC vs LSG: విశాఖలో మ్యాచ్.. తుదిజట్లు ఇవే!.. వర్షం ముప్పు?
ఐపీఎల్-2025 (IPL)లో మరో ఆసక్తికర మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)- లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) మధ్య సోమవారం పోటీ జరుగనుంది. విశాఖపట్నంలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం ఇందుకు వేదిక. కాగా ఢిల్లీ క్యాపిటల్స్కు ఇది రెండో హోంగ్రౌండ్ అన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఢిల్లీకి గతేడాది సారథ్యం వహించిన టీమిండియా స్టార్ రిషభ్ పంత్.. ఈసారి లక్నో సూపర్ జెయింట్స్కు కెప్టెన్ అయ్యాడు. రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో ఫ్రాంఛైజీ కొనుక్కోగా.. ఈ సీజన్లో తొలి మ్యాచ్లోనే తన పాత జట్టుపై ఈ వికెట్ కీపర్ ప్రతాపం చూపేందుకు సిద్ధమయ్యాడు.పంత్ వర్సెస్ అక్షర్!మరోవైపు.. పంత్ నిష్క్రమణతో ఖాళీ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ పోస్టును టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ భర్తీ చేశాడు. ఈ జట్టులో మరో టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ కూడా కీలకం కానున్నాడు. అయితే, లక్నోతో మ్యాచ్కు అతడు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహుల్ భార్య అతియా శెట్టి త్వరలోనే తమ తొలి సంతానానికి జన్మనివ్వనుండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది.గాయాల బెడదఇదిలా ఉంటే.. లక్నో జట్టును గాయాల బెడద వేధిస్తోంది. ఆ జట్టు పేసర్ మొహ్సిన్ ఖాన్ సీజన్ మొత్తానికి దూరం కాగా.. అతడి స్థానంలో శార్దూల్ ఠాకూర్ జట్లుఓకి వచ్చాడు. అయితే, కీలక పేసర్లు మయాంక్ యాదవ్, ఆవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్ కూడా గాయాల బారిన పడ్డారు. వీరంతా ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.ఇలా స్టార్ పేసర్లంతా గాయపడటం లక్నో తుదిజట్టు కూర్పుపై కచ్చితంగా ప్రభావం చూపనుంది. మరోవైపు.. ఢిల్లీ రాహుల్ సేవలను కోల్పోయినా జేక్ ఫ్రేజర్-మెగర్క్తో పాటు ఫాఫ్ డుప్లెసిస్ అందుబాటులో ఉండటం.. ఆ జట్టుకు సానుకూలాంశంగా పరిణమించింది. అంతేకాదు ప్రపంచస్థాయి పేసర్ మిచెల్ స్టార్క్ కూడా జట్టుతో ఉండటం ఢిల్లీకి కలిసి రానుంది.లక్నోదే పైచేయిఇక లక్నో మిచెల్ మార్ష్తో అర్షిన్ కులకర్ణిని ఇన్నింగ్స్ ఆరంభించేందుకు పంపే సూచనలు ఉన్నాయి. పంత్ వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు నాయకుడిగానూ జట్టును ముందుండి నడిపించనుండగా.. నికోలస్ పూరన్ స్పెషలిస్టు బ్యాటర్గా అందుబాటులో ఉన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా ఆకాశ్ సింగ్ లేదంటే షాబాజ్ అహ్మద్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. కాగా ఢిల్లీ- లక్నో జట్లు ఇప్పటి వరకు ముఖాముఖి ఐదుసార్లు తలపడగా.. ఢిల్లీ రెండుసార్లు, లక్నో మూడుసార్లు గెలిచాయి.వర్షం ముప్పు?ఇదిలా ఉంటే.. విశాఖపట్నంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములతో ఆకాశం మేఘావృతమైంది. ఇక హైదరాబాద్లో ఇప్పటికే కుండపోత వర్షం కురుస్తుండగా.. విశాఖలోనూ వాన పడితే ఢిల్లీ- లక్నో మ్యాచ్పై ప్రభావం పడనుంది.ఐపీఎల్-2025: ఢిల్లీ వర్సెస్ లక్నో తుదిజట్లు (అంచనా)ఢిల్లీజేక్ ఫ్రేజర్-మెగర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముకేష్ కుమార్, టి.నటరాజన్ఇంపాక్ట్ ప్లేయర్: మోహిత్ శర్మలక్నోఅర్షిణ్ కులకర్ణి, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఆయుశ్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, రాజ్వర్ధన్ హంగ్రేకర్, రవి బిష్ణోయి, షమార్ జోసెఫ్ఇంపాక్ట్ ప్లేయర్: ఆకాశ్ సింగ్/షాబాజ్ అహ్మద్.చదవండి: కలకాలం గుర్తుండిపోతుంది!.. ఎవరీ విఘ్నేశ్?.. ధోని కూడా ఫిదా!Captains 👍Match-day rivals 🆚Friends through & through 🤝𝗠. 𝗢. 𝗢. 𝗗 Axar & Rishabh as we gear up for tonight's #DCvLSG clash 👌👌#TATAIPL | @DelhiCapitals | @LucknowIPL | @akshar2026 | @RishabhPant17 pic.twitter.com/mI2RI3WHYF— IndianPremierLeague (@IPL) March 24, 2025 -
Paris Olympics: భారత తొలి అథ్లెట్గా యర్రాజి జ్యోతి ఘనత
సాక్షి, విశాఖపట్నం: విశ్వక్రీడల్లో గర్జించేందుకు విశాఖ అథ్లెట్ యర్రాజి జ్యోతి సిద్ధమైంది. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో ఒలింపిక్స్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. నగరానికి చెందిన జ్యోతి గత కొంతకాలంగా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో నిలకడమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు ఆమె ఆసియా, అంతర్జాతీయ పోటీల్లో పది పతకాలు సాధించింది. జ్యోతి ఖాతాలో రెండు కామన్వెల్త్ పతకాలు కూడా ఉన్నాయి.అదే విధంగా.. ప్రపంచ విశ్వవిద్యాలయాల పోటీల్లో ఒక పతకం, జాతీయ పోటీల్లో పది పతకాలు సాధించిన ఘనత యర్రాజి జ్యోతి సొంతం. ఇక వరల్డ్ ర్యాంకింగ్స్ కోటాలో ప్యారిస్ బెర్త్ దక్కించుకున్న యర్రాజి జ్యోతి..100 మీటర్ల హర్డిల్స్లో బరిలోకి దిగనుంది. ఒలింపిక్స్లో 100 మీటర్ల హర్డిల్స్లో పోటీపడనున్న మొదటి భారత అథ్లెట్గా ఆమె రికార్డులకెక్కనుంది.కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి యర్రాజి జ్యోతితో పాటు దండి జ్యోతికశ్రీ(అథ్లెట్), రంకిరెడ్డి సాత్విక్సాయిరాజ్(బ్యాడ్మింటన్), బొమ్మదేవర ధీరజ్(ఆర్చరీ), షేక్ అర్షద్(పారా సైక్లింగ్ చాంపియన్), కె.నారాయణ(పారా రోవర్) ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొననున్నారు.ఇక ఇప్పటికే రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన పీవీ సింధు అందరిలోకెల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో క్రీడా ప్రమాణాలు పెరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి చెందిన ప్రపంచ స్థాయి క్రీడాకారులను 2019 నుంచి 2024 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా సన్మానించి ప్రోత్సాహకాలు అందించి అండగా నిలిచారు. -
IPL 2024- SRH: నితీశ్ రెడ్డి.. పక్కా లోకల్! త్వరలోనే టీమిండియాలో..
సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్. హైదరాబాద్కు చెందిన యువ బ్యాటర్ క్రీజ్లో ఉన్నాడు. ఆల్టైమ్ స్పిన్ దిగ్గజాల్లో ఒకడైన అశ్విన్ వేసిన బంతి ఆఫ్స్టంప్పై పడింది. బలంగా బాదితే వైడ్ లాంగాన్ దిశగా సిక్సర్! ఆ తర్వాత లెగ్స్పిన్నర్ చహల్ వచ్చాడు. టి20 క్రికెట్ స్టార్లలో ఒకడిగా, 350 వికెట్లు తీసిన అనుభవం అతనిది. వరుసగా ఫోర్, సిక్సర్! అంతటితో ఆగిపోలేదు. మరో రెండు బంతుల విరామం తర్వాత అదే ఓవర్లో వరుసగా మళ్లీ సిక్స్, ఫోర్.. కొద్ది సేపటికి అశ్విన్ తిరిగొచ్చాక వరుస బంతుల్లో మళ్లీ రెండు భారీ సిక్సర్లు! ఎక్కడా ఎలాంటి తడబాటు లేదు. పొరపాటున బ్యాట్ చివర తగిలి బంతి స్టాండ్స్లోకి వెళ్లింది కాదు. పూర్తిగా సాధికారికంగా, సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఆడిన షాట్లతో అతను ఆయా బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఎంతో అనుభవం ఉన్న సీనియర్ తరహాలో అతను ఆడిన తీరు, అగ్రశ్రేణి స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న శైలి.. మాజీ ఆటగాళ్లు, వ్యాఖ్యాతలు అతని గురించి మాట్లాడుకునేలా చేసింది. భవిష్యత్తులో భారత జట్టుకు ఆడగల సత్తా ఉన్న ప్లేయర్గా అతనిపై ప్రశంసల జల్లు కురిసింది. ఆ కుర్రాడే కె. నితీశ్ కుమార్ రెడ్డి. విశాఖపట్నానికి చెందిన 21 ఏళ్ల నితీశ్ తాజా ఐపీఎల్లో తన ఆటతో అందరినీ ఆకర్షించాడు. అటు బ్యాటింగ్లో చెలరేగుతూ, ఇటు బౌలింగ్లో కీలక సమయాల్లో వికెట్లు తీయడమే కాకుండా ఫీల్డింగ్లో కూడా చురుకైన ప్రదర్శనతో సన్రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆరేళ్ల క్రితమే జూనియర్ స్థాయి క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు సాధించి తన రాకను ఘనంగా చాటిన నితీశ్ ఇప్పుడు సీనియర్ ఇండియా క్రికెట్లోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.ఐపీఎల్లో ఒక అచ్చమైన తెలుగబ్బాయి ఆటను చూసి ఎంత కాలమైంది! హైదరాబాద్ టీమ్ దక్కన్ చార్జర్స్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి సన్రైజర్స్ వరకూ మనవాళ్ల ప్రాతినిధ్యం చాలా తక్కువ. అటు ఆంధ్ర నుంచి గానీ, ఇటు హైదరాబాద్ నుంచి గానీ ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకుండా చాలా సందర్భాల్లో బయటి ఆటగాళ్లతోనే లోకల్ టీమ్ను ఫ్రాంచైజీ నడిపిస్తూనే ఉంది. ఏ సగటు క్రికెట్ అభిమానిని అడిగినా ఇదే చెబుతాడు. టీమ్లోకి తీసుకున్నా తుది జట్టులో ఆడించకుండా, ఒక్క మ్యాచ్ కూడా ఇవ్వకుండా సాగిన రోజులే ఎక్కువ. అక్కడక్కడా ఎవరైనా బరిలోకి దిగినా.. వాహ్ అనిపించే గుర్తుంచుకోదగ్గ ప్రదర్శనలూ తక్కువే. ఇలాంటి స్థితిలో నితీశ్ను అందరూ రెండు రాష్ట్రాల ప్రతినిధిగా, తమవాడిగా అభిమానిస్తున్నారు. అతను కూడా తన అద్భుత ఆటతో అందరి నమ్మకాన్ని నిలబెడుతూ కొత్త సంచలనంలా మారాడు. అలా మొదలై..నితీశ్లోని సహజ ప్రతిభే అతడిని బ్యాటింగ్లో రాటుదేలేలా చేసింది. చాలా మందిలాగే నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి కూడా అబ్బాయి అల్లరిని భరించలేక ఆరేళ్ల వయసులో వేసవి శిక్షణ శిబిరంలో చేర్పించడంతో మైదానంలో అతని ఆట మొదలైంది. ఆపై అబ్బాయి ఆసక్తి, నేర్చుకోవాలనే పట్టుదల వెరసి పూర్తి స్థాయిలో తండ్రి అతడిని క్రికెట్ శిక్షణ వైపు మళ్లించేలా చేసింది. కోచ్ల పర్యవేక్షణలో రాటుదేలిన నితీశ్ చిన్న వయసులోనే తనలోని అపార ప్రతిభను ప్రదర్శిస్తూ వచ్చాడు. అండర్–12 స్థాయికి వచ్చేసరికి గమ్యం స్పష్టమైపోయింది. అప్పటికే అతని బ్యాటింగ్లో స్ట్రోక్ మేకింగ్, పట్టుదల చూసినవారికి భవిష్యత్తులో ఉత్తమ క్రికెటర్ కావాల్సిన లక్షణాలున్నాయని అర్థమైంది. ఈ క్రమంలోనే అప్పటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్, భారత మాజీ ఆటగాడు ఎమ్మెస్కే ప్రసాద్ దృష్టి కూడా నితీశ్పై పడింది. ట్రయల్స్లో అతని ప్రతిభను చూసిన ఎమ్మెస్కే కడపలోని ఏసీఏ అండర్–14 అకాడమీలో చేరే అవకాశం కల్పించారు. అక్కడి నుంచి నితీశ్కు 24 గంటలూ క్రికెట్టే జీవితంగా మారిపోయింది. తన ఆటను మరింత సానబెట్టుకునే అవకాశం దక్కిన చోట కష్టపడిన అతను మరింత రాటుదేలాడు. మరో వైపు వైజాగ్ జింక్ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా ఉన్న తండ్రి ముత్యాల రెడ్డికి రాజస్థాన్లోని ఉదయ్పూర్కు ట్రాన్స్ఫర్ అయింది. తాను అక్కడికి వెళితే బిడ్డ భవిష్యత్తుకు ఇబ్బంది రావచ్చని భావించిన ఆయన ఏకంగా తన ఉద్యోగానికే రాజీనామా ఇచ్చేశారు. పూర్తి స్థాయిలో కొడుకుకు అండగా ఉండి సరైన మార్గనిర్దేశనంలో నడిపించారు. పరుగుల వరద పారించి..నితీశ్ కెరీర్లో 2017–18 దేశవాళీ సీజన్ హైలైట్గా నిలిచింది. 14 ఏళ్ల నితీశ్ అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆంధ్ర జట్టు తరఫున బరిలోకి దిగి సత్తా చాటాడు. ప్రత్యర్థి జట్లపై చెలరేగిన 8 ఇన్నింగ్స్లలోనే ఏకంగా 176.71 సగటుతో రికార్డు స్థాయిలో 1237 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. ఇందులో 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. అన్నింటికి మించి నాగాలాండ్తో జరిగిన పోరులో అతను సాధించిన క్వాడ్రూపల్ సెంచరీ హైలైట్గా నిలిచింది. రాజ్కోట్లో జరిగిన ఈ ప్రీక్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో నితీశ్ 366 బంతులు ఎదుర్కొని 60 ఫోర్లు, 7 సిక్సర్లతో 441 పరుగులు సాధించడం విశేషం. ఇదే జోరును కొనసాగిస్తూ అండర్–19 టోర్నీ వినూ మన్కడ్ ట్రోఫీలో కూడా ఆకట్టుకున్న అతను బీసీసీఐ చాలెంజర్ టోర్నీలోనూ అవకాశం దక్కించుకున్నాడు. అదే జోరులో 17 ఏళ్ల వయసులో ఆంధ్ర తరఫున తొలి సీనియర్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. ఒంగోలులో జరిగిన కేరళతో జరిగిన మ్యాచ్లో రంజీ ట్రోఫీలో అతను అరంగేట్రం చేశాడు. తర్వాతి సీజన్లో విజయ్హజారే వన్డే టోర్నీలో అడుగు పెట్టిన నితీశ్కు కొన్నాళ్ల తర్వాత ముస్తాక్ అలీ టి20 టోర్నీలోనూ ఆంధ్రకు ఆడే అవకాశం దక్కింది. ప్రతికూల పరిస్థితులను దాటి..అండర్–19 స్థాయిలో ఆకట్టుకున్నా.. అక్కడి నుంచి సీనియర్ స్థాయికి చేరే క్రమంలో యువ క్రికెటర్లంతా ఒక రకమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. రెండింటి మధ్య ఉండే అంతరం కారణంగా అంచనాలను అందుకోలేక వెనుకబడిపోయే ప్రమాదం ఉంటుంది. దాదాపు అందరు ఆటగాళ్లు ఈ పరిస్థితిని ఎదుర్కొంటారు. నితీశ్కు కూడా ఇలాగే జరిగింది. జూనియర్ స్థాయి మెరుపుల తర్వాత కొంత కాలం పాటు అతను ఇదే స్థితిని అనుభవించాడు. రంజీ అరంగేట్రం తర్వాత ఆశించిన ప్రదర్శన లేకపోవడంతో పాటు కోవిడ్ వల్ల వచ్చిన విరామం, ఇతర వేర్వేరు కారణాలు అతడిని ఇబ్బంది పెట్టాయి. ఈ దశలో అతను తన ఆటకు మరో రూపంలో పదును పెట్టాడు. అప్పటి వరకు వేర్వేరు వయో విభాగాల్లో ఓపెనర్గా భారీగా పరుగులు సాధించి అప్పుడప్పుడు మీడియం పేస్ బౌలింగ్ చేసిన నితీశ్ ఇప్పుడు తన బౌలింగ్పై మరింత శ్రద్ధ పెట్టాడు. అది 2022–23 రంజీ సీజన్లో బ్రహ్మండంగా పని చేసింది. 8 మ్యాచ్లలో 25 వికెట్లు పడగొట్టి సత్తా చాటడంతో ఆంధ్ర టీమ్లో ఆల్రౌండర్గా అతనికి గుర్తింపు దక్కింది. ఇదే క్రమంలో 2023–24 సీజన్లో పూర్తి స్థాయి ప్రదర్శనతో రెగ్యులర్గా టీమ్లో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఈ ఏడాది కూడా అతను మళ్లీ 25 వికెట్లతో చెలరేగడంతో పాటు గతంలోలాగా బ్యాటింగ్లో కూడా తన పదును చూపించడం విశేషం. ఐపీఎల్లో అదరగొట్టి..‘నితీశ్కు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. అప్పటికి నాకు మరో 25 ఏళ్ల సర్వీస్ ఉంది. ఆ సమయంలో నేను అలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల అందరూ హతాశులయ్యారు. సహజంగానే ఆ తర్వాత ఎన్నో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. మేమందరం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అయితే వాటి ప్రభావం అబ్బాయిపై పడరాదని భావించాం. అతడి ఆటకు మాత్రం ఇబ్బంది రాకుండా అన్నీ చూసుకున్నాం. అసలు ఆటల గురించి ఏమాత్రం అవగాహన లేని నా భార్య మానస కూడా కొడుకు కోసం ఎన్నో త్యాగాలు చేసి శ్రమించింది. ఇప్పుడు అతడిని ఐపీఎల్లో చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉంది’ భావోద్వేగంతో ముత్యాల రెడ్డి నాటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు.నితీశ్ గత ఏడాదే సన్రైజర్స్ టీమ్తో పాటు ఉన్నాడు. కానీ ఆడిన రెండు మ్యాచ్లలో బ్యాటింగ్ అవకాశమే రాకపోగా, బౌలింగ్లోనూ వికెట్లు దక్కలేదు. అప్పుడు కొంత నిరాశకు గురైనా.. ఈసారి దక్కిన అవకాశాన్ని అతను అద్భుతంగా వాడుకున్నాడు. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్లో చెలరేగుతూ రైజర్స్ టీమ్లో కీలకంగా మారాడు.‘చిన్నప్పుడే నితీశ్లో ప్రతిభను గుర్తించాం. ఆపై సరైన అవకాశాలు అతడిని వెతుక్కుంటూ వచ్చాయి. ఐపీఎల్లో అతని ఆట చూస్తే సంతోషం కలుగుతోంది. ఒత్తిడిలోనూ ఎక్కడా తడబాటుకు, ఆందోళనకు గురికాని అతని ఆత్మవిశ్వాసం నాకు నచ్చుతుంది. ఇప్పుడు అతను కెరీర్ కీలక దశలో ఉన్నాడు. బ్యాటింగ్ అద్భుతంగా చేస్తున్నాడు. బౌలింగ్లో స్టోక్స్, పాండ్యా తరహాలో మీడియం పేస్తోనే వేరియేషన్లు ప్రదర్శించడం, బంతిని ఇరు వైపుల స్వింగ్ చేయడం వంటివి మెరుగుపరచుకుంటే మంచి ఆల్రౌండర్గా త్వరలోనే టీమిండియాకు ఆడగలడు’ అని ఎమ్మెస్కే ప్రసాద్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయనలాగే సగటు తెలుగు క్రికెట్ అభిమానులదీ అదే కోరిక. త్వరలోనే నెరవేరుతుందని ఆశిద్దాం.-మొహమ్మద్ అబ్దుల్ హాది -
నేనేమైనా తక్కువా?.. ఒకే ఓవర్లో రింకూ సిక్సర్ల వర్షం
ఐపీఎల్-2024.. విశాఖ సాగర తీరాన.. బుధవారం రాత్రి.. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియం.. కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్ల పరుగుల వరదతో తడిసి ముద్దైంది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లపై ఏమాత్రం కనికరం లేకుండా కేకేఆర్ ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నమ్మకాన్ని నిలబెడుతూ.. ఓపెనర్ సునిల్ నరైన్ మరోసారి వీర బాదుడు బాదాడు. 35 ఏళ్ల ఈ బౌలింగ్ ఆల్రౌండర్ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. కేవలం 39 బంతుల్లోనే 85 పరుగులు(7 ఫోర్లు, 7 సిక్సర్లు) సాధించి నరైన్ సత్తా చాటాడు. ఇక తన తొలి ఐపీఎల్ ఇన్నింగ్స్లోనే వన్డౌన్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ(27 బంతుల్లో 54) సైతం ధనాధన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. Raghuvanshi Ji ke ang ang mein talent hai 🤌#DCvKKR #TATAIPL #IPLonJioCinema #TATAIPLinBhojpuri pic.twitter.com/YKUIw577kD — JioCinema (@JioCinema) April 3, 2024 ఇక నాలుగో స్థానంలో వచ్చిన పవర్ హిట్టర్ ఆండ్రీ రసెల్ సరేసరి. 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 41 రన్స్ చేశాడు. మరి ఈ ముగ్గురు పరుగుల విధ్వంసం సృష్టిస్తుంటే.. తానేమీ తక్కువ కాదన్నట్లు చెలరేగిపోయాడు సిక్సర్ల కింగ్ రింకూ సింగ్. Yeh toh Rinku ke daayein haath ka khel hai 😅#IPLonJioCinema #TATAIPL #DCvKKR #TATAIPLinBengali pic.twitter.com/AIDYeZNbpk — JioCinema (@JioCinema) April 3, 2024 ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఈ యూపీ సంచలనం.. ఈ పరుగుల విధ్వంసంలో తనదైన ముద్ర వేశాడు. కేవలం 8 బంతులు ఎదుర్కొని 26(ఒక ఫోర్, 3 సిక్సర్లు) పరుగులు సాధించాడు. తన ఇన్నింగ్స్లోని మూడు సిక్సర్లను అన్రిచ్ నోర్జే బౌలింగ్లోనే బాదడం విశేషం. పందొమ్మిదో ఓవర్లో సౌతాఫ్రికా స్పీడ్స్టర్ నోర్జే వేసిన తొలి రెండు బంతులను సిక్సర్గా మలిచిన రింకూ సింగ్.. మధ్యలో బాల్కు గ్యాప్ ఇచ్చాడు. ఆ తర్వాత నాలుగో బంతికి మరో భారీ షాట్తో ఆరు పరుగులు పిండుకున్నాడు. ఇక ఆ మరుసటి బంతిని బౌండరీకి తరలించాడు. అయితే, అదే ఓవర్లో ఆఖరి బంతి(లో ఫుల్ టాస్)కి మరోసారి షాట్కు యత్నించిన రింకూ.. వార్నర్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఉన్నది కాసేపే అయినా.. విశాఖ స్టేడియంలోని ప్రేక్షకులకు తన వంతు వినోదం అందించాడు రింకూ!! ఢిల్లీకి నాలుగో ఓటమి ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ విధించిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఢిల్లీ క్యాపిటల్స్ చతికిలపడిన విషయం తెలిసిందే. తమకు రెండో హోం గ్రౌండ్ అయిన విశాఖలో ఏకంగా 106 పరుగుల తేడాతో ఓడి.. ఐపీఎల్-2024లో నాలుగో పరాజయాన్ని నమోదు చేసింది. ఇక అంతకు ముందు ఇదే వేదికపై పంత్ సేన చెన్నై సూపర్ కింగ్స్పై గెలిచిన విషయం తెలిసిందే. అలా ఢిల్లీకి ఇప్పటి వరకు ఒక్క విజయం దక్కింది. చదవండి: తొలి ఇన్నింగ్స్లోనే పరుగుల విధ్వంసం.. ఎవరీ అంగ్క్రిష్ రఘువంశీ? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Shah Rukh Khan offered the blank check to Gautam Gambhir and results are visible. KKR wins three out of three matches of the season. You need special efforts to beat this special team. Lord Rinku Singh is on a mission.pic.twitter.com/5KsVkhD9lN — Sujeet Suman (@sujeetsuman1991) April 3, 2024 -
వాళ్లకు రిషభ్ పంత్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై
కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఘోర పరాజయంపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు. సమిష్టి వైఫల్యం కారణంగా భారీ మూల్యం చెల్లించామని పేర్కొన్నాడు. ఒక్కోసారి బౌలర్లకు ఏదీ కలిసిరాదని.. తమ జట్టు విషయంలో ఈరోజు(బుధవారం) ఇలా జరిగిందని పంత్ విచారం వ్యక్తం చేశాడు. ఇక కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నామని.. అయితే, ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయామని రిషభ్ పంత్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ నాలుగో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో తలపడింది. కేకేఆర్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా విశాఖపట్నంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన ఢిల్లీకి కేకేఆర్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సునిల్ నరైన్(39 బంతుల్లో 85), అంగ్క్రిష్ రఘువంశీ(27 బంతుల్లో 54), ఆండ్రీ రసెల్(19 బంతుల్లో 41) పరుగుల వరద పారించారు. ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న ఢిల్లీ బౌలర్లు వీరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో రెండో భారీ స్కోరు నమోదు చేసింది. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జే 3 వికెట్లు తీసినా.. ఏకంగా 59 పరుగులు సమర్పించుకున్నాడు. ఇషాంత్ శర్మ మూడు ఓవర్ల బౌలింగ్లో 43 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయగలిగాడు. చేతులెత్తేసిన టాపార్డర్ మిగతా వాళ్లలో ఖలీల్ అహ్మద్(1/43), మిచెల్ మార్ష్(1/37) ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఢిల్లీ తడబడింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(18), పృథ్వీ షా(10) పూర్తిగా నిరాశపరిచారు. మిచెల్ మార్ష్, అభిషేక్ పోరెల్ కనీసం పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు. ఈ క్రమంలో పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్(25 బంతుల్లో 55)తో చెలరేగగా.. ట్రిస్టన్ స్టబ్స్(32 బంతుల్లో 54) మెరుపులు మెరిపించాడు. No look Pant 🫨#IPLonJioCinema #TATAIPL #DCvKKR pic.twitter.com/OLhLl28aAn — JioCinema (@JioCinema) April 3, 2024 అయితే, మిగతా బ్యాటర్ల నుంచి వీరికి సహకారం అందకపోవడంతో 17.2వ ఓవర్లోనే ఢిల్లీ క్యాపిటల్స్ కథ ముగిసింది. 166 పరుగుల వద్ద ఆలౌట్ అయి పంత్ సేన ఏకంగా 106 పరుగుల భారీ తేడాతో పరాజయం చవిచూసింది. సీజన్లో ఆడిన నాలుగు మ్యాచ్లలో మూడో ఓటమి నమోదు చేసింది. An excellent diving catch by Varun Chakaravarthy 👌 Early trouble for #DC in the chase They have lost 4 wickets now Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvKKR | @KKRiders pic.twitter.com/SzzvnzRm3F — IndianPremierLeague (@IPL) April 3, 2024 ఆటగాళ్లకు పంత్ వార్నింగ్ ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ మాట్లాడుతూ.. కేకేఆర్తో మ్యాచ్లో స్పిన్నర్లతో బౌలింగ్ చేయొద్దని భావించామని.. అయితే, పేసర్లు భారీగా పరుగులు ఇవ్వడం ప్రతికూల ప్రభావం చూపిందన్నాడు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నాడు. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి ఇది వర్తిస్తుందంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు కెప్టెన్ సాబ్. ఇక తాను ప్రస్తుతం పూర్తి ఫిట్గా ఉన్నానన్న రిషభ్ పంత్.. ఆటను ఆస్వాదిస్తున్నానని చెప్పుకొచ్చాడు. సవాళ్లు తనకేమీ కొత్త కాదని.. విజయవంతంగా వాటిని దాటుకుని ముందుకు వెళ్తానని ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తదుపరి ఆదివారం ముంబై ఇండియన్స్తో వాంఖడేలో తలపడనుంది. చదవండి: IPL 2024: పంత్కు రూ. 24 లక్షల జరిమానా.. ఈసారి జట్టుకు కూడా తొలి ఇన్నింగ్స్లోనే పరుగుల విధ్వంసం.. ఎవరీ అంగ్క్రిష్ రఘువంశీ? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వచ్చీరాగానే ఇరగదీశాడు.. ఎవరీ అంగ్క్రిష్ రఘువంశీ?
IPL 2024: Who Is Angkrish Raghuvanshi?: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా మరో ప్రతిభావంతుడైన క్రికెటర్ వెలుగులోకి వచ్చాడు. ఇప్పటికే ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అభిషేక్ పోరెల్ సత్తా చాటగా.. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున మయాంక్ యాదవ్ సంచలనాలు సృష్టిస్తున్నాడు. తన స్పీడ్ పవర్తో ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నాడు ఈ 21 ఏళ్ల రైటార్మ్ పేసర్. ఆడిన తొలి రెండు మ్యాచ్లలో వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుని.. టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు ఢిల్లీ ఎక్స్ప్రెస్ మయాంక్. ఇక తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్- కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో మరో యువ సంచలనం తెర మీదకు వచ్చాడు. విశాఖ సాగర తీరాన పరుగుల సునామీ విశాఖ సాగర తీరాన పరుగుల సునామీ సృష్టించి తన ఆగమాన్ని ఘనంగా చాటాడు. అతడే అంగ్క్రిష్ రఘువంశీ. జూన్ 5, 2005లో.. ఢిల్లీలో జన్మించాడు ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్. అండర్ 19 వరల్డ్కప్-2023 గెలిచిన భారత జట్టులో సభ్యుడు. Raghuvanshi Ji ke ang ang mein talent hai 🤌#DCvKKR #TATAIPL #IPLonJioCinema #TATAIPLinBhojpuri pic.twitter.com/YKUIw577kD — JioCinema (@JioCinema) April 3, 2024 యశ్ ధుల్ సారథ్యంలో యంగ్ ఇండియాకు ఆడి ఆ ఏడాది ప్రపంచకప్ టోర్నీలో 278 పరుగులు సాధించాడు. తద్వారా భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన అంగ్క్రిష్ రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. వన్డౌన్లో వచ్చి దుమ్ములేపాడు ఈ నేపథ్యంలో దుబాయ్లో జరిగిన ఐపీఎల్-2024 వేలంలో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ అతడిని 20 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా అంగ్క్రిష్ క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టాడు. అయితే, ఆర్సీబీతో మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా అతడికి అవకాశం వచ్చింది. ఇక డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో.. ఢిల్లీ క్యాపిటల్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్ చేసే దక్కించుకున్న అంగ్క్రిష్.. వన్డౌన్లో వచ్చి ఇరగదీశాడు. నరైన్ ఊచకోత.. అంగ్క్రిష్ విధ్వంసం ఓవైపు సునిల్ నరైన్(39 బంతుల్లో 85) ఢిల్లీ బౌలింగ్ను ఊచకోత కోస్తుంటే.. అతడికి తోడుగా మరోవైపు అంగ్క్రిష్ కూడా దుమ్ములేపే ఇన్నింగ్స్ ఆడాడు. 27 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఏకంగా 54 పరుగులు రాబట్టాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అతి పిన్న వయసులో అర్ధ శతకం సాధించిన ఏడో ఆటగాడిగా నిలిచాడు. 18 ఏళ్ల 303 రోజుల వయసులో అంగ్క్రిష్ ఈ ఘనత అందుకున్నాడు. ఓవరాల్గా ఐపీఎల్లో ఆడిన తొలి ఇన్నింగ్స్లోనే యాభై కంటే ఎక్కువ రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో 23వ స్థానం సంపాదించాడు. దేశవాళీ క్రికెట్లో ముంబైకి ఆడుతూ.. ఢిల్లీకి చెందిన అంగ్క్రిష్ రఘువంశీ పదకొండేళ్ల వయసులో ముంబైకి వచ్చాడు. చిన్ననాటి కోచ్, టీమిండియా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ సాయంతో అంచెలంచెలుగా ఎదిగి ముంబై జట్టుకు ఆడే స్థాయికి చేరాడు. 2023లో ముంబై తరఫున లిస్ట్ ఏ, టీ20లలో అరంగేట్రం చేశాడు. సీకే నాయుడు ట్రోఫీ(ఫస్ట్ క్లాస్ క్రికెట్)లో తొమ్మిది మ్యాచ్లు ఆడి 765 పరుగులతో సత్తా చాటాడు. ఇక కేకేఆర్ తరఫున అరంగేట్రంలోనే అదరగొట్టిన అంగ్క్రిష్ రఘువంశీ ఇదే జోరు కొనసాగిస్తే సహచర ఆటగాడు రింకూ మాదిరి.. త్వరలోనే టీమిండియాలోనూ అడుగుపెట్టే అవకాశం దక్కించుకోగలడు. ఆల్ ది బెస్ట్ అంగ్క్రిష్ రఘువంశీ!! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Innovative! Maiden IPL Fifty for Angkrish Raghuvanshi ✨ Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #DCvKKR pic.twitter.com/72oQQZIDbd — IndianPremierLeague (@IPL) April 3, 2024 -
IPL 2024: రిషభ్ పంత్కు భారీ జరిమానా.. రిపీట్ అయితే!
గెలుపు జోష్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్కు ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ నిర్వాహకులు అతడికి రూ. 12 లక్షల జరిమానా విధించారు. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో క్యాపిటల్స్ నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఈ మేరకు భారీగా ఫైన్ వేశారు. కాగా విశాఖపట్నంలో సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో క్యాపిటల్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన పంత్ సేన 191 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(43), డేవిడ్ వార్నర్(52) మెరుపులకు తోడు పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. దాదాపు పదిహేను నెలల విరామం తర్వాత తొలి అర్ధ శతకం(32 బంతుల్లో 51) నమోదు చేశాడు. That iconic one-handed six is back 🥹#DCvCSK #JioCinemaSports #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/N01gOlTLRM — JioCinema (@JioCinema) March 31, 2024 అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై జట్టును ఢిల్లీ క్యాపిటల్స్ 171 పరుగులకే పరిమితం చేసింది. తద్వారా 20 పరుగుల తేడాతో గెలుపొంది.. తాజా సీజన్లో తొలి విజయం అందుకుంది. Season’s 1️⃣st Win 🙌@DelhiCapitals get off the mark in #TATAIPL 2024 with a collective team effort in Visakhapatnam 🙌 Scorecard ▶️ https://t.co/8ZttBSkfE8#DCvCSK pic.twitter.com/PB9tLAD13i — IndianPremierLeague (@IPL) March 31, 2024 ఇక ఢిల్లీ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఖలీల్ అహ్మద్ అద్భుతమైన స్పెల్(2/21)తో రాణించగా.. ముకేశ్ కుమార్ మూడు వికెట్లతో చెలరేగాడు. అక్షర్ పటేల్ సైతం ఒక వికెట్ దక్కించుకున్నాడు. అయితే, స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేయడంతో ఢిల్లీ సారథి పంత్కు ఫైన్ పడింది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ నిర్వాహకులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన తొలి తప్పిదం కావున రూ. 12 లక్షల జరిమానాతో సరిపెట్టారు. ఇదే గనుక మరోసారి పునరావృతమైతే కెప్టెన్ రూ. 24 లక్షలు ఫైన్ వేస్తారు. అదే విధంగా.. జట్టులోని ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఆరు లక్షల మేర కోత విధిస్తారు. కాగా ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో ఫైన్ బారిన పడ్డ రెండో కెప్టెన్ రిషభ్ పంత్. ఇంతకు ముందు సీఎస్కేతో మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా గుజరాత్ టైటాన్స్ సారథి శుబ్మన్ గిల్కు జరిమానా విధించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024 - Vizag: మార్చి 12 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్
సాక్షి, విశాఖపట్నం: నగరంలో మరోసారి ఐపీఎల్ సందడి నెలకొననుంది. మార్చి 31, ఏప్రిల్ 3న నిర్వహించనున్న మ్యాచ్లకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది. తొలి విడత షెడ్యూల్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియం హోం గ్రౌండ్గా నిలవనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్రెడ్డి గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ ఆపరేషన్స్ టీమ్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా అనుమతులు, పారిశుధ్యం, టిక్కెట్ల విక్రయం, పార్కింగ్ తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. అదే విధంగా.. మార్చి 12 నుంచి 19 వరకు వైఎస్సార్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ సభ్యులు ప్రాక్టీసు చేయనున్న నేపథ్యంలో.. ఆ మేరకు స్టేడియంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ ట్రెజరర్ ఏ.వి.చలం, సీఈవో ఎం.వి.శివారెడ్డి, సీఎఫ్ఓ ఎం.నవీన్ కుమార్, జనరల్ మేనేజర్లు ఎం.ఎస్.కుమార్, ఎస్.ఎం.ఎన్.రోహిత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. వైజాగ్లో ఐపీఎల్ మ్యాచ్లు మార్చి 31: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఏప్రిల్ 3: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ -
Adudam Andhra: ఈనెల 13న ముగింపు వేడుకలు.. హాజరుకానున్న సీఎం జగన్
విశాఖ స్పోర్ట్స్: మహా క్రీడా సంబరానికి విశాఖ సర్వం సిద్ధమైంది. గ్రామీణస్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ‘ఆడుదాం ఆంధ్రా’తుది ఘట్టానికి చేరుకుంది. నాలుగు దశల్లో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలకు విశేష స్పందన రాగా.. జిల్లా స్థాయిలో సత్తా చాటిన జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలకు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు మహా సంగ్రామం జరగనుంది. విశాఖ వేదికగా ఫైనల్ మ్యాచ్లను మంత్రి ఆర్కే రోజా ప్రారంభించనున్నారు. ఇక 13న ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. కాగా చైన్నె సూపర్ కింగ్స్, ప్రో కబడ్డీ జట్లకు శిక్షణాపరమైన సహకారం అందించిన నిపుణులు ఈ పోటీలను వీక్షించేందుకు రానుండటం విశేషం. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఎంపిక చేసి, వీరితో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. 40 బస్సులు సిద్ధం జిల్లా స్థాయిలో విజయం సాధించిన జట్లు ఇప్పటికే విశాఖ చేరుకున్నాయి. ప్రతీ జిల్లా నుంచి 134 మంది చొప్పున మెన్, వుమెన్ పోటీలకు హాజరవుతున్నారు. రైళ్లలో కొందరు, బస్సుల్లో మరికొందరు విశాఖలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకున్నారు. రైళ్లలో వచ్చిన వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో బస వద్దకు చేర్చారు. ఐదు రోజుల పాటు క్రీడాకారులను బస ప్రాంతం నుంచి మైదానాల వద్దకు తరలించేందుకు 40 బస్సులను సిద్ధం చేశారు. జేసీపీ పర్యవేక్షణలో భద్రత మెన్ జట్లకు దబ్బంద, వుమెన్ జట్లకు సుద్దగెడ్డ, కొమ్మాదిలోని టిడ్కో గృహాల్లో వసతి సౌకర్యం కల్పించారు. మహిళలకు ఏర్పాటు చేసిన బస వద్ద జాయింట్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో భద్రత ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం ప్రారంభ వేడుక జరగనుండగా.. మధ్యాహ్నం నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం వసతి కల్పించిన చోటే అందిస్తారు. మధ్యాహ్న భోజనం క్రీడా ప్రాంగణాల వద్ద అందజేయనున్నారు. పోటీలు జరిగే సమయంలో క్రీడాకారులకు స్నాక్స్, ఎనర్జీ డ్రింక్స్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వసతి ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. మొబైల్ టాయిలెట్లు సిద్ధం చేశారు. పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లు ఇవే.. జిల్లా స్థాయిలో మెన్ విభాగం క్రికెట్ పోటీల్లో నక్కవానిపాలెం, బ్యాడ్మింటన్లో సుసర్ల కాలనీ–1 జట్టు, వాలీబాల్లో ప్రశాంతినగర్, కబడ్డీలో ఓల్డ్ అయ్యన్నపాలెం, ఖోఖోలో సాకేత్పురం–1 జట్లు విజేతలుగా నిలిచాయి. మహిళా విభాగం క్రికెట్లో వాంబే కాలనీ–6, బ్యాట్మింటన్లో పెదవాల్తేర్–2, వాలీబాల్లో రజకవీధి–1, కబడ్డీలో లాసన్స్బే కాలనీ, ఖోఖోలో లంకెలపాలెం జట్లు విజేతలుగా నిలిచి.. రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాయి. మైదానాలు ఇవే.. రాష్ట్ర స్థాయిలో పోటీ పడేందుకు 1,482 మందిపురుషులు,1,482 మంది మహిళలు విశాఖ తరలివచ్చారు. పోటీలకు నగరంలోని మైదానాలను సిద్ధం చేశారు. ►వుమెన్ క్రికెట్ వైఎస్సార్ బీ గ్రౌండ్ ►మెన్ క్రికెట్ రైల్వే స్టేడియం, ఏఎంసీ మైదానం ►కొమ్మాది కె.వి.కె స్టేడియం ►కబడ్డీ, ఖోఖో ఏయూ గోల్డెన్ జూబ్లీ మైదానం ►వాలీబాల్ ఏయూ సిల్వర్ జూబ్లీ మైదానం ►బ్యాడ్మింటన్ జీవీఎంసీ ఇండోర్ స్టేడియం రాష్ట స్థాయి విజేతలకు బహుమతులు ఇలా.. క్రీడ- ప్రథమ - ద్వితీయ -తృతీయ ►క్రికెట్- రూ.5లక్షలు -రూ.3లక్షలు -రూ.2లక్షలు ►వాలీబాల్- రూ.5లక్షలు -రూ.3లక్షలు -రూ.2 లక్షలు ►కబడ్డీ - రూ.5లక్షలు -రూ.3లక్షలు -రూ.2లక్షలు ►ఖోఖో - రూ.5లక్షలు -రూ.3లక్షలు -రూ.2 లక్షలు ►బ్యాడ్మింటన్- రూ.2లక్షలు -రూ.లక్ష -రూ.50వేలు -
మీ మీద అరిచీ.. అరిచీ.. నా గొంతు పోయింది: రోహిత్ అసహనం
India vs England Test Series 2024: ఇంగ్లండ్తో మొదటి టెస్టులో ఓటమి వల్ల విమర్శల పాలైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. రెండో మ్యాచ్లో జట్టును గెలిపించి సత్తా చాటాడు. విశాఖపట్నం టెస్టులో బ్యాటర్గా విఫలమైనా సారథిగా రోహిత్కు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా.. ఎప్పుటికప్పుడు ఫీల్డర్లను అలర్ట్ చేస్తూ.. పరిస్థితులకు తగ్గట్లుగా ఫీల్డ్ సెట్ చేస్తూ హిట్మ్యాన్ వ్యవహరించిన తీరు అభిమానులను ఆకర్షించింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ.. సహచర ఆటగాళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. 106 పరుగుల తేడాతో ఘన విజయం హైదరాబాద్లో ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఓడిన టీమిండియా.. విశాఖలో 106 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. నాలుగో రోజు దాకా సాగిన ఆటలో ఆఖరికి పైచేయి సాధించి ఈ మేరకు గెలుపు బోణీ కొట్టింది. అయితే, ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా కొందరు ఫీల్డర్లు బద్దకంగా కదలడంతో రోహిత్ కాస్త గట్టిగానే వారిపై అరిచాడు. సోమవారం నాలుగో రోజు ఆట సందర్భంగా.. ఇంగ్లండ్ 157/4 వద్ద ఉన్న సమయంలో రోహిత్ మాట్లాడిన మాటలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి. అరిచీ.. అరిచీ నా గొంతు పోతోంది ఇందులో.. ‘‘మీ మీద అరిచీ.. అరిచీ నా గొంతు పోతోంది’’ అంటూ సహచర ఆటగాళ్లను ఉద్దేశించి రోహిత్ అన్నట్లుగా వినిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా విశాఖలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా విధించిన 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఇంగ్లండ్ భారీ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో తొమ్మిది వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ.. బుమ్రాను చాంపియన్ ప్లేయర్ అంటూ ప్రశంసించాడు. సమిష్టి ప్రదర్శనతో తమకు విజయం సాధ్యమైందని పేర్కొన్నాడు. చదవండి: Ind vs Eng: ఛాన్స్ ఇస్తే ఇలాగేనా ఆడేది?.. ఎందుకంత తొందర? View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) Rohit sharma :- Mera gale ka watt lag gya hai chilla chilla ke tum sab ko eee6 #INDvENG @RVCJ_Sports @RVCJ_FB @CricCrazyJohns @mufaddal_vohra pic.twitter.com/IPnZ3YUwQ3 — Ashish Gupta (@ashishbomu) February 6, 2024 Rohit Sharma 🗣️-mere gale ka vaaat lag Gaya tum logo ko chilla chilaa ke Struggle of captain 😭😂#INDvsENGTest #RohitSharma pic.twitter.com/63nIFZYBgX — Pranav 🚩 (@Pranavtweet18) February 6, 2024 -
Ind vs Eng: ఛాన్స్ ఇస్తే ఇలాగేనా ఆడేది?.. వేటు తప్పదు!
Ind vs Eng Test series 2024: ఇంగ్లండ్తో టెస్టుల్లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆట తీరును భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ విమర్శించాడు. వరుసగా అవకాశాలు ఇచ్చినా.. వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తొందరపాటు చర్యలతో అనవసరంగా వికెట్ పారేసుకుంటున్నాడని జహీర్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు రంజీ ట్రోఫీ-2024లో ఆడిన ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఫామ్లోకి వచ్చినట్లే కనిపించాడు. కానీ తొలి రెండు టెస్టుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. హైదరాబాద్లో కేవలం 48 పరుగులకే పరిమితమైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... విశాఖపట్నంలోనూ వైఫల్యాన్ని కొనసాగించాడు. రెండు ఇన్నింగ్స్లో కలిపి 56 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ రెండు సందర్భాల్లోనూ ఒక్కసారి కూడా జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్.. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ తీరును విమర్శిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగే సత్తా ఉండి కూడా అనసరపు షాట్లకు పోయి విశాఖలో వికెట్ సమర్పించుకున్నాడంటూ పెదవి విరిచాడు. ఎందుకంత తొందర? ‘‘జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు మనం ఎలాంటి పాత్ర పోషించాలన్న అంశం మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. శ్రేయస్ అయ్యర్ మాత్రం ఇవేమీ పట్టనట్టు కనిపించాడు. ఆండర్సన్ అప్పటికే తన స్పెల్ పూర్తి చేశాడు. ప్రత్యర్థి జట్టులో ఒక్క ఫాస్ట్ బౌలర్ మాత్రమే ఉన్నాడు. అతడి తర్వాత స్పిన్నర్లు అటాకింగ్కు వస్తారని తెలుసు. నిజానికి అయ్యర్ స్పిన్ ఆడటంలో టాప్ క్లాస్ బ్యాటర్. అయినా కూడా.. తొందరపడ్డాడు. స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించాలనే తొందరలో తనకు మేనేజ్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు ఆదుకోలేకపోయాడు’’ అని జహీర్ ఖాన్ అయ్యర్కు చురకలు అంటించాడు. వేటు తప్పదు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి తిరిగి వస్తే ఇంగ్లండ్తో మిగిలిన టెస్టుల్లో సెలక్టర్లు శ్రేయస్కు ఉద్వాసన పలకడం ఖాయమని జహీర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా గతేడాది కాలంగా టెస్టుల్లో శ్రేయస్ అయ్యర్ ఒక్క అర్ధ శతకం కూడా సాధించలేకపోయాడు. వరుస అవకాశాలు ఇస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఇక విశాఖపట్నం మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో మంచి ఆరంభమే అందుకున్నా ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్లీ బౌలింగ్లో తొందరపడి వికెట్ పారేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా- ఇంగ్లండ్ ప్రస్తుతం చెరో విజయంతో 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. చదవండి: SAT20 League 2024: సన్రైజర్స్ పేసర్ సంచలనం.. ఫైనల్ చేరిన డిఫెండింగ్ చాంపియన్ -
Ashwin: క్రికెట్ ఐన్స్టీన్.. ఏ బౌలర్ కూడా అతడి దరిదాపుల్లో లేడు!
‘మైదానంలో కొత్త తరహాలో ఇలా ఆలోచించాలంటే అశ్విన్ బుర్ర వాడాల్సిందే’... సూపర్ ఓవర్ సమయంలో భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంస. ఆ మ్యాచ్లో అశ్విన్ ఆడటమే లేదు. అయినా అతని ప్రస్తావన రావడం అంటే ఆ బుర్ర విలువేమిటో అర్థమవుతుంది. ‘మన్కడింగ్’తో వివాదాస్పదరీతిలో ప్రత్యర్థి బ్యాటర్ను అవుట్ చేసి కూడా తాను చేసింది సరైందని ఒప్పించగల సామర్థ్యం అశ్విన్ది.. ఇది అతని గురించిన మరో ప్రశంస. గ్రౌండ్లో క్రికెటర్ అంటే తన ఆట మాత్రమే బాగా ఆడుకొని వెళ్లిపోవడం కాదు.. ఎవరి అంచనాలకూ అందని వ్యూహాలతో అవతలి జట్టు ఆటగాళ్లను పడగొట్టడం కూడా! అది ఒక కళ. అందులో ఆరితేరినవాడు రవిచంద్రన్ అశ్విన్.. కెప్టెన్ కాకపోయినా సారథిగా బాధ్యతను భుజానికెత్తుకోగలడు.. కోచ్ కాకపోయినా కుర్రాళ్లకు మార్గనిర్దేశనం చేయగలడు.. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తున్న చదరంగపు ఆటగాడు. క్రికెట్ నిబంధనలకే పాఠాలు చెప్పగల జీనియస్.. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకొని పలు ఘనతలను తన పేరిట రాసుకున్న అశ్విన్ ప్రస్థానం ఎంతో ప్రత్యేకం. క్రికెటర్గా అశ్విన్ గొప్పతనం ఏమిటో అతని గణాంకాలు చెబుతాయి. వంద టెస్టులు కూడా ఆడకముందే, 500 వికెట్లకు చేరువైన తరుణం, లెక్కలేనన్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ పురస్కారాలు.. ఆధునిక క్రికెట్లో ఏ బౌలర్ కూడా అతని దరిదాపుల్లో లేడు. అయితే అంతకు మించి అశ్విన్లోని సృజనాత్మక ఆలోచనలు అతడిని అందరికంటే భిన్నంగా నిలబెట్టాయి. సాధారణంగా వేర్వేరు కారణాలతో అంతర్జాతీయ ఆటగాళ్లు చదువుపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టలేక ఆటకే అంకితం అవుతూ ఉంటారు. కానీ మద్రాసులో ఇంజినీరింగ్ చదివిన అశ్విన్ దానిని అక్కడితో వదిలి పెట్టలేదు. ఆ టెక్నిక్స్ను క్రికెట్ మైదానంలో వాడాడు. అప్పటి వరకు జట్టు ఏదైనా వ్యూహం అనుసరిస్తోంటే దానికి భిన్నమైన కొత్త ఆలోచన కోసం టీమ్ అంతా తన వైపు చూసేలా చేశాడు. పిచ్ను సరిగ్గా అంచనా వేయడం మొదలు బ్యాటర్లు ఊహించని రీతిలో బౌలింగ్తో మానసికంగా దెబ్బ కొట్టడం వరకు అంతా అశ్విన్కే చెల్లింది. సమయోచిత వ్యూహాలతో.. స్పిన్ బౌలర్గా అశ్విన్ ఎన్నో రికార్డులు సాధించాడు. కానీ బ్యాటర్గా కూడా అతను విలువైన ఇన్నింగ్స్తో జట్టును నడిపించాడు. 2022.. టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్తో మ్యాచ్లో అత్యంత కీలక స్థితిలో అశ్విన్ ఆడిన తీరు దీనికి ఉదాహరణ. మరో బ్యాటర్ గనుక ఉంటే చివరి బంతిని ముందూ వెనకా ఆలోచించకుండా ఆడి అవుటైపోయేవాడేమో. కానీ బౌలర్ బంతిని వదులుతున్న తీరును బట్టే అది వైడ్ అవుతుందని అంచనా వేసి దానిని వదిలేయడమే కాదు.. తర్వాతి బంతిని కూడా సరైన అంచనాతో మిడాఫ్ మీదుగా ఆడటం అతనిలోని ‘థింకర్’ను చూపించింది. క్రికెట్ అనేది ఒక సైన్స్ అయితే అశ్విన్ ఒక ఐన్స్టీన్ వంటివాడు అనే మాటను అతను అక్షరాలా రుజువు చేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్తో మ్యాచ్ను గెలిపించిన కోహ్లీ కూడా అశ్విన్ను ప్రశంసించేందుకు ప్రత్యేక పదాలు వెతుక్కోవాల్సి వచ్చింది. ‘అశ్విన్ తన మెదడుకు అదనంగా మరో మెదడును వాడినట్లున్నాడు’ అంటూ మ్యాచ్ తర్వాత కోహ్లీ వ్యాఖ్యానించాడు. 2021 సిడ్నీ టెస్టులో వెన్నునొప్పితో బాధపడుతూనే 38 పరుగులతో జట్టును ఆదుకున్న ఇన్నింగ్స్.. బంగ్లాదేశ్తో టెస్టులో భారత్ 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా వెళుతున్నప్పుడు ఆపద్బాంధవుడిగా నిలిచి.. గెలిపించిన తీరు ఎలాంటి లెక్కల ప్రకారం అశ్విన్ ఆడతాడనేది చూపిస్తుంది. అపార ప్రతిభతో ఆకట్టుకొని.. కోచ్ చంద్రశేఖర్ చిన్నతనంలోనే అశ్విన్లోని ప్రతిభను గుర్తించాడు. అందుకే 12 ఏళ్ల వయసులోనే మైదానంలో అతనికి ఫీల్డింగ్ను ఎంచుకునే అవకాశం కల్పించాడు. ఆరంభంలో పేస్ బౌలింగ్తో మొదలుపెట్టిన అతను ఆ తర్వాత ఆఫ్స్పిన్కు మారాడు. అయితే ఇది అంత సులువుకాలేదు. చాలా కష్టపడ్డాడు. ఒక వైపు ఆటకు పదును పెడుతూనే మరో వైపు చదువులో కూడా ఎక్కడా తగ్గకుండా సాగాడు. ఎస్సెసెన్ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నప్పుడే రంజీ ట్రోఫీకి ఎంపికైన అశ్విన్ ఆ తర్వాత కొన్నాళ్లకే అటు ఇంజినీరింగ్ పూర్తి చేసుకోవడంతో పాటు ఇటు భారత జట్టులోకి కూడా ఎంపికయ్యాడు. ఆ తర్వాత మరో కోచ్ సుబ్రహ్మణ్యం వద్ద చేరడంతో అతని ఆటే మారిపోయింది. ఆటతో పాటు దృక్పథమూ మారింది. ‘నేను మొదటిసారి అతన్ని కలిసినప్పుడు అంతా ప్రశ్నలు, ప్రశ్నలే. అందులోనే అతడి ఉత్సాహాన్ని, తెలివితేటలను నేను గమనించాడు. అశ్విన్ కచ్చితంగా గొప్పవాడు అవుతాడని భావించి శిక్షణనిచ్చి ప్రోత్సహించాను’ అని కోచ్ గుర్తు చేసుకున్నాడు. అయితే అద్భుతమైన క్రికెటింగ్ బ్రెయిన్ అంటూ పొగడ్తలు అందుకున్నా.. భారత జట్టు కెప్టెన్ పదవి కోసం బీసీసీఐ అతన్నెప్పుడూ పరిశీలనలోకి తీసుకోలేదు. దిగ్గజాల సరసన.. ప్రపంచవ్యాప్తంగా 3 వేలకు పైగా పరుగులు చేసి 400కు పైగా వికెట్లు తీసిన అరుదైన జాబితాలో ఆరుగురు క్రికెటర్లు ఉన్నారు. వారిలో అశ్విన్ ఒకరు. భారత ఆల్రౌండర్లలో.. దిగ్గజం కపిల్దేవ్ తర్వాతి స్థానం అతనిదే. ముందుగా ఐపీఎల్తో అశ్విన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అతనికి భారత జట్టులో స్థానం దక్కింది. వన్డేల్లో వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీలు గెలిచిన భారత జట్లలో అతను భాగంగా ఉన్నాడు. అనిల్ కుంబ్లే రిటైర్ అయిపోవడంతో పాటు హర్భజన్ తన కెరీర్ చివరి దశలో వరుసగా విఫలమవుతున్న సమయంలో అశ్విన్ జట్టులోకి వచ్చాడు. భారత్కు సంబంధించి కూడా అది ఒక కీలక దశ. నాణ్యమైన అగ్రశ్రేణి స్పిన్నర్ కోసం టీమ్ ఎదురు చూస్తుండగా అశ్విన్ రూపంలో ఒక ఆణిముత్యం లభించింది. తన తొలి టెస్టులోనే 9 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన అశ్విన్ ఈ ఘనారంభాన్ని ఆ తర్వాతా కొనసాగించాడు. తన తొలి 16 టెస్టుల్లోనే 9 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడంటే అశ్విన్ జోరు ఏమిటో తెలుస్తుంది. ఈ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ అత్యంత వేగంగా 300 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్గా అశ్విన్ నిలిచాడు. ఏడాదికి కనీసం 50 వికెట్ల ఘనతను అతను నాలుగుసార్లు నమోదు చేయడం విశేషం. 2016–17లోనైతే అశ్విన్ బౌలింగ్ శిఖరానికి చేరింది. ఐదు సెంచరీలు చేశాడు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్లపై కలిపి 13 టెస్టుల్లోనే అతను ఏకంగా 82 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్లో సాధించిన ఐదు సెంచరీలు కూడా అశ్విన్ బలాన్ని చూపిస్తున్నాయి. ఒకే టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టడంతో పాటు అర్ధసెంచరీ కూడా చేసిన ఫీట్ను మూడుసార్లు నమోదు చేసిన ఏకైక ఆటగాడు అతనే కావడం విశేషం. ఐసీసీ మెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్తో పాటు ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులన్నీ అతని ఖాతాలో ఉన్నాయి. వ్యక్తిగతంగా చూస్తే తమిళ సినిమాలను ఇష్టపడే అతను రజినీకాంత్కు వీరాభిమాని. 2011లో ప్రీతిని వివాహమాడిన అశ్విన్కు ఇద్దరు అమ్మాయిలు. కుట్టి స్టోరీస్ పేరుతో క్రికెట్ను అద్భుతంగా విశ్లేషిస్తూ యూట్యూబ్లో అతను చేసే వీడియోలు సూపర్హిట్ అయ్యాయి. కెరీర్ చివర్లో ఉన్న అశ్విన్ ఎప్పుడు రిటైరైనా అద్భుతమైన కామెంటేటర్ కాగలడు. అయితే ఆటగాడిగా అతని శైలి మాత్రం ప్రత్యేకంగా ఉండిపోతుంది. అశ్విన్ ప్రస్తుతం ఇంగ్లండ్తో సొంతగడ్డపై టెస్టు సిరీస్తో బిజీగా ఉన్నాడు. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
జైస్వాల్ను హీరో చేయకండి: గంభీర్ ఘాటు విమర్శలు
India vs England, 2nd Test: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. వైజాగ్ స్టేడియంలో ఇంగ్లండ్తో రెండో టెస్టు సందర్భంగా ఈ ముంబై బ్యాటర్ డబుల్ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. తద్వారా టెస్టుల్లో టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన మూడో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు జైస్వాల్. 22 ఏళ్ల 37 రోజుల వయసులో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు యశస్వి జైస్వాల్ ప్రతిభను కొనియాడుతున్నారు. మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అయితే సర్ బ్రాడ్మన్ కంటే ఎక్కువంటూ ఆకాశానికెత్తాడు. ఇక అభిమానులేమో.. యశస్వి స్వస్థలం ఉత్తరప్రదేశ్లో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. #WATCH | Uttar Pradesh | People burst crackers and distributed sweets in Bhadohi - the hometown of cricketer Yashasvi Jaiswal as he hit a double-century today in the second test match against England. pic.twitter.com/kwB68wxQcc — ANI (@ANI) February 3, 2024 అదే విధంగా సోషల్ మీడియా వేదికగా అతడి పేరును ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓవర్హైప్ క్రియేట్ చేసి అతడిపై ఒత్తిడి పెంచవద్దని అభిమానులు, మీడియాకు విజ్ఞప్తి చేశాడు. మనకు ఓ అలవాటు ఉంది ఈ మేరకు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘చిన్న వయసులోనే అరుదైన రికార్డులు సాధిస్తున్న యశస్వికి శుభాకాంక్షలు. అతడు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. తనను స్వేచ్ఛగా ఆడనివ్వండి. భారత్లో అందరికీ ఓ పాత అలవాటు ఉంది. హీరోలను చేసి ఒత్తిడి పెంచుతారు ముఖ్యంగా మీడియా.. ఆటగాళ్ల విజయాలను అతి చేసి చూపించి.. వారికి ఏదో ఒక ట్యాగ్ అంటగట్టి... హీరోలను చేస్తుంది. ఇలాంటి ప్రచారం వల్ల ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగిపోతుంది. కాలక్రమంలో వాళ్లు సహజమైన, తమదైన ఆటను మర్చిపోతారు. అంచనాలు తట్టుకోలేక ఒత్తిడిలో కూరుకుపోతారు’’ అని గౌతం గంభీర్ ఈ సందర్భంగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా వైజాగ్లో టెస్టులో జైస్వాల్ డబుల్ సెంచరీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన కారణంగా రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఆధిపత్యం సంపాదించింది. ఇంగ్లండ్ కంటే 171 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చదవండి: Ind vs Eng: అఫీషియల్.. అందుకే కోహ్లి టెస్టులకు దూరం -
నిన్న యశస్వి.. నేడు బుమ్రా.. ఆధిక్యంలో టీమిండియా
ఇంగ్లండ్తో రెండో టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం చాటుకుంది. వైజాగ్లో శనివారం నాటి ఆట ముగిసే సరికి 171 పరుగుల ఆధిక్యం సంపాదించింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియం వేదికగా శుక్రవారం ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభమైన విషయం తెలిసిందే. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో రోజు డబుల్ సెంచరీగా మలిచి ఈ క్రమంలో తొలి రోజు భారీ సెంచరీ చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్.. రెండో రోజు దానిని డబుల్ సెంచరీగా మార్చాడు. ఇక 209 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యశస్వి అవుట్ కాగా.. టీమిండియా 396 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. శనివారం 336/6 ఓవర్ నైట్ స్కోర్తో రెండు రోజు ఆటను ఆరంభించిన భారత్.. అదనంగా 60 పరుగులు జత చేయగలిగింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ బ్యాటింగ్కు దిగగా ఓపెనర్ బెన్ డకెట్(21) కుల్దీప్ బౌలింగ్లో తొలి వికెట్గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ జాక్ క్రాలే(76) పట్టుదలగా నిలబడ్డాడు. మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ అద్భుత అర్ధ శతకంతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. వికెట్ల వేట మొదలుపెట్టి.. ఘనంగా ముగించి అయితే, అక్షర్ పటేల్ బౌలింగ్లో బంతిని తప్పుగా అంచనా వేసి షాట్ ఆడాలని క్రాలే భావించగా.. శ్రేయస్ అయ్యర్ అద్భుత క్యాచ్తో అతడికి సెండాఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన వికెట్ల వేట మొదలుపెట్టాడు. హైదరాబాద్ టెస్టు హీరో ఒలీ పోప్(23), జో రూట్(5), బెయిర్ స్టో(25), కెప్టెన్ బెన్స్టోక్స్(47) రూపంలో కీలక బ్యాటర్లను అవుట్ చేసిన బుమ్రా.. అంతర్జాతీయ టెస్టుల్లో 150 వికెట్ల క్లబ్లో చేరాడు. ఇక టామ్ హార్లీ వికెట్తో ఈ మ్యాచ్లో ఫైఫర్ సాధించిన ఈ రైటార్మ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్(6)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఆఖరి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ 55.5 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రాకు ఆరు, కుల్దీప్ యాదవ్కు మూడు, అక్షర్ పటేల్కు ఒక వికెట్ దక్కాయి. 171 పరుగుల ఆధిక్యంలో భారత్ ఈ నేపథ్యంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా ఆట పూర్తయ్యేసరికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓవరాల్గా 171 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 13, యశస్వి జైస్వాల్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విశాఖలో గెలిచి 1-1తో సమం చేయాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. చదవండి: ఇలాంటి బాల్ ఎలా ఆడాలి బుమ్రా?.. స్టోక్స్ బౌల్డ్.. రియాక్షన్ వైరల్ Memorable Performance ✅ Special Celebration 🙌 Well bowled, Jasprit Bumrah! 🔥 🔥 Follow the match ▶️ https://t.co/X85JZGt0EV #TeamIndia | #INDvENG | @Jaspritbumrah93 | @IDFCFIRSTBank pic.twitter.com/bRYTf68zMN — BCCI (@BCCI) February 3, 2024 -
#Bumrah: బుమ్రా సరికొత్త చరిత్ర.. భారత తొలి బౌలర్గా!
India vs England, 2nd Test- #Bumrah: ఇంగ్లండ్తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. వైజాగ్ మ్యాచ్లో శనివారం నాటి ఆటలో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ ఫాస్ట్బౌలర్.. అంతర్జాతీయ టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అంతేకాదు.. అతి తక్కువ బంతుల్లోనే ఈ ఘనత సాధించిన భారత తొలి బౌలర్గా రికార్డులకెక్కాడు. రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(47)ను అవుట్ చేసి బుమ్రా ఈ ఫీట్ నమోదు చేశాడు. 𝘚𝘵𝘰𝘬𝘦𝘴' 𝘳𝘦𝘢𝘤𝘵𝘪𝘰𝘯 𝘴𝘢𝘺𝘴 𝘪𝘵 𝘢𝘭𝘭 😱 1⃣5⃣0⃣ Test wickets for the Wrecker-in-chief! 🤌#Bumrah #INDvENG #BazBowled #IDFCFirstBankTestsSeries #JioCinemaSports pic.twitter.com/cWG7HfKqir — JioCinema (@JioCinema) February 3, 2024 ఇక ఈ మ్యాచ్లో తన అద్భుత నైపుణ్యాలతో ఆకట్టుకున్న పేస్ గుర్రం బుమ్రా.. మొత్తంగా ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా రెండో రోజు ఆటలో భాగంగా జో రూట్తో వికెట్ల వేట మొదలుపెట్టిన బుమ్రా.. తర్వాత ఒలీ పోప్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, టామ్ హార్లీలను కూడా అవుట్ చేసి.. జేమ్స్ ఆండర్సన్తో ముగించాడు. ఇతర బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీయగా.. ఇంగ్లండ్ 253 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా ఆట పూర్తయ్యేసరికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 15, రోహిత్ శర్మ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక అంతకుముందు టీమిండియా 396 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను ముగించిన విషయం తెలిసిందే. Memorable Performance ✅ Special Celebration 🙌 Well bowled, Jasprit Bumrah! 🔥 🔥 Follow the match ▶️ https://t.co/X85JZGt0EV #TeamIndia | #INDvENG | @Jaspritbumrah93 | @IDFCFIRSTBank pic.twitter.com/bRYTf68zMN — BCCI (@BCCI) February 3, 2024 అంతర్జాతీయ టెస్టుల్లో... తక్కువ బంతుల్లోనే 150 వికెట్ల క్లబ్లో చేరిన భారత బౌలర్లు 6781 బాల్స్- జస్ప్రీత్ బుమ్రా 7661 బాల్స్- ఉమేశ్ యాదవ్ 7755 బాల్స్- మహ్మద్ షమీ 8378 బాల్స్- కపిల్ దేవ్ 8380 బాల్స్- రవిచంద్రన్ అశ్విన్ చదవండి: ఇలాంటి బాల్ ఎలా ఆడాలి బుమ్రా?.. స్టోక్స్ బౌల్డ్.. రియాక్షన్ వైరల్ -
తుదిజట్టులో నో ఛాన్స్!.. సర్ఫరాజ్ ఖాన్ వ్యాఖ్యలు వైరల్
India vs England, 2nd Test- Sarfraz Khan: ‘‘టెస్టు క్రికెట్ ఆడాలంటే ఎంతో ఓపికగా ఉండాలి. జీవితంలో కొన్నిసార్లు మనం తొందరపాటులో పనులు చేసేస్తూ ఉంటాం. నేను కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టీమిండియాలో అడుగుపెట్టాలని ఎదురుచూసేవాడిని. ఒక్కోసారి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యేవాడిని. అలాంటపుడు మా నాన్న నన్ను ఓదార్చేవారు. హార్డ్వర్క్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడో ఓసారి ఫలితం అదే వస్తుంది. అప్పుడు నిన్నెవరూ ఆపలేరని చెబుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసం, ఓపిక కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని నేను తెలుసుకున్నా. ఇప్పుడు మా నాన్న ఎంతో సంతోషంగా ఉన్నారు. కోట్లాది మంది జనాభా ఉన్న ఈ దేశంలో టీమిండియాలో భాగమయ్యే అవకాశం రావడం పట్ల నాకు గర్వంగా ఉంది’’.. ఇంగ్లండ్తో టీమిండియా రెండో టెస్టు ఆరంభానికి ముందు యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ అన్న మాటలివి. అలా తొలిసారి టీమిండియాకు ఎంపిక దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతూ.. భారత్-ఏ తరఫున కూడా అదరగొడుతున్న ఈ ముంబై బ్యాటర్కు వైజాగ్ టెస్టు సందర్భంగా బీసీసీఐ సెలక్టర్లు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయపడటంతో వారి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్లతో పాటు సర్ఫరాజ్కు కూడా ప్రధాన జట్టులో చోటిచ్చింది. అయితే, అంతకంటే ముందే మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ ఇంగ్లండ్తో సిరీస్కు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్లో చోటు కోసం పాటిదార్తో పోటీపడ్డ సర్ఫరాజ్కు నిరాశే మిగిలింది. తుదిజట్టులో పాటిదార్కు స్థానం ఇచ్చారు సెలక్టర్లు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండగా.. బీసీసీఐకి అతడు ఇచ్చిన ఇంటర్వ్యూ తెరమీదకు వచ్చింది. ఓపికగా ఉంటేనే అనుకున్న లక్ష్యాలు సాధించగలమంటూ 26 ఏళ్ల సర్ఫరాజ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) సిరాజ్ స్థానంలో అతడు కాగా ఐదు మ్యాచ్ల సిరీస్ను పరాజయంతో ప్రారంభించింది టీమిండియా. హైదరాబాద్ టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ స్టేడియంలో శుక్రవారం రెండో టెస్టు మొదలుపెట్టింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో మూడు మార్పులతో టీమిండియా బరిలోకి దిగింది. రజత్ పాటిదార్ టెస్టు క్యాప్ అందుకోగా.. మహ్మద్ సిరాజ్ స్థానంలో ముకేశ్ కుమార్ జట్టులోకి వచ్చాడు. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకున్నాడు. చదవండి: SA20 2024: టీ20 మ్యాచ్లో విధ్వంసం.. ఏకంగా 462 పరుగులు -
Ind vs Eng: ‘ఇంత అన్యాయమా.. ఇంకెలా ఆడితే ఛాన్స్ ఇస్తారు?’
India vs England, 2nd Test- No Place For Sarfaraz Khan: టీమిండియా తరఫున అరంగేట్రం చేయాలన్న సర్ఫరాజ్ ఖాన్ నిరీక్షణ కొనసాగుతోంది. ఇంగ్లండ్తో రెండో టెస్టు సందర్భంగా ఈ ముంబై బ్యాటర్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం ఖాయమని అభిమానులతో పాటు భారత మాజీ క్రికెటర్లు కూడా భావించారు. కానీ మేనేజ్మెంట్ మాత్రం అతడికి మరోసారి మొండిచేయి చూపింది. తుదిజట్టులో చోటు కోసం మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్ల మధ్య పోటీ నెలకొన్న తరుణంలో పాటిదార్ వైపే మొగ్గుచూపింది. ఇప్పటికే టీమిండియా తరఫున వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన పాటిదార్కే టెస్టు క్యాప్ కూడా అందించింది. దీంతో సర్ఫరాజ్కు నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘పాపం.. సర్ఫరాజ్ ఖాన్కు మరోసారి అన్యాయం జరిగింది. ఇన్నాళ్లు జట్టుకు ఎంపికే చేయలేదు. ఈసారి ఛాన్స్ ఇచ్చారనుకుంటే తుదిజట్టులో ఆడించడం లేదు. అసలు అతడిని ఎందుకు పక్కనపెట్టారో కాస్త వివరించగలరా? మీ నిర్ణయాలు మాకైతే అంతుపట్టడం లేదు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ఇటీవల ఇంగ్లండ్-ఏ జట్టుపై భారత్- ఏ తరఫున సెంచరీ బాది ఫామ్లో ఉన్నా కూడా సర్ఫరాజ్ ఖాన్ ఆట తీరుపై మీకు నమ్మకం కుదరలేదా? ఇంకెన్నాళ్లు అతడు ఎదురుచూడాలి?’’ అంటూ సెలక్టర్లపై ఫైర్ అవుతున్నారు. No Sarfaraz..?? What..??? Please explain. Unbelievable...#INDvsENGTest #INDvsENG #INDvENG #IndianCricket #SarfarazKhan — Raghav Srinivasan (@RaghavSrinivas7) February 2, 2024 I hope India’s more main players get injured so that Sarfaraz ko chance mile https://t.co/vXVrS2n6ND — Akshayyyy (@AkshayyMahadik) February 2, 2024 కాగా తొలి రెండు టెస్టులకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరం కాగా.. అతడి స్థానంలో రజత్ పాటిదార్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు.. మొదటి టెస్టు తర్వాత రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయపడటంతో వారి స్థానాల్లో సౌరభ్ కుమార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్లకు రెండో టెస్టుకు ఎంపిక చేసింది బీసీసీఐ. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విశాఖపట్నం వేదికగా డాక్టర్ వైఎస్సార్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఇక కేఎస్ భరత్కు సొంతమైదానంలో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో.. ఇలాంటి అవకాశం రావడం తనకు గర్వకారణమంటూ భరత్ సంతోషం వ్యక్తం చేశాడు. 🗣️🗣️ It's a proud moment to be playing in front of your home crowd. Proud and focused @KonaBharat is geared up for the 2nd #INDvENG Test in Visakhapatnam 🙌#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/2eUkG5vDSN — BCCI (@BCCI) February 1, 2024 తుది జట్లు: టీమిండియా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్. చదవండి: IND VS ENG 2nd Test: సర్ఫరాజ్ ఎంట్రీ గ్యారెంటీ..? ఎందుకంత స్పెషల్ -
Sarfaraz Khan: చిన్న జట్ల మీద ఆడితే సరిపోతుందా?
Ex India Star's Blunt Take After Sarfaraz Khan's Test Selection: భారత యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ను ఉద్దేశించి టీమిండియా మాజీ బ్యాటర్ దీప్దాస్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో రెండో టెస్టుకు అతడిని ఎంపిక చేసిన విధానం సబబుకాదేమోనని అభిప్రాయపడ్డాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అతడి బ్యాటింగ్ గణాంకాలు మెరుగ్గానే కనిపిస్తున్నా.. కేవలం వాటి ప్రాతిపదికన సర్ఫరాజ్ గొప్ప ఆటగాడని చెప్పలేమన్నాడు. చిన్న జట్లను అగౌరవపరచడం తన ఉద్దేశం కాదన్న దీప్దాస్ గుప్తా.. అలాంటి జట్లపై సాధించిన పరుగులను ఎంత వరకు లెక్కలోకి తీసుకవచ్చో ఆలోచించాలన్నాడు. తానేమీ సర్ఫరాజ్కు వ్యతిరేకంగా మాట్లాడటం లేదన్న ఈ బెంగాలీ క్రికెటర్.. ఓ బ్యాటర్ ఎన్ని పరుగులు తీశాడన్న దానికన్నా.. పటిష్ట ప్రత్యర్థిపై ఎలా ఆడాడన్న విషయాన్నే పరిగణనలోకి తీసుకోవాలన్నాడు. రెండో టెస్టుకు సర్ఫరాజ్ను ఎంపిక చేసినంత మాత్రాన అతడి ఆడిస్తారనే నమ్మకం లేదని దీప్దాస్ గుప్తా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తుదిజట్టులో పదకొండు మంది ఆటగాళ్లకే చోటు ఉంటుందని.. అలాంటపుడు కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలంటే మేనేజ్మెంట్ ఆచితూచి వ్యవహరిస్తుందన్నాడు. ఉదాహరణకు.. శుబ్మన్ గిల్ లేదంటే సర్ఫరాజ్.. ఇద్దరిలో ఒకరినే ఎంచుకోవాలంటే కచ్చితంగా కెప్టెన్ రోహిత్ శర్మ.. గిల్వైపే మొగ్గు చూపుతాడని దీప్దాస్ అభిప్రాయపడ్డాడు. ఆ జట్లను తక్కువ చేయాలని కాదు.. కానీ ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఫస్ట్క్లాస్ క్రికెట్ గురించి మాట్లాడతారు. అక్కడ 37 జట్లు ఉంటాయి. అందులో కొంతమంది యావరేజ్ జట్ల మీద పరుగుల వరద పారిస్తారు. అలా అని నేను చిన్నజట్లను అగౌరవపరచడం లేదు. అయితే, ఓ బ్యాటర్ ఎంపిక గురించి మాట్లాడేటపుడు క్వాలిటీ ఆఫ్ రన్స్ గురించి కూడా మాట్లాడాలి. నేను ఇదంతా సర్ఫరాజ్కు వ్యతిరేకంగా చెప్పడం లేదు. కానీ సెలక్షన్ సమయంలో మేనేజ్మెంట్ ఇవన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటుంది. వాళ్లకు ఎవరిపై ఎక్కువ నమ్మకం ఉంటే వాళ్లకే అవకాశం ఇస్తుంది’’ అని దీప్దాస్ గుప్తా అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా తరఫున దీప్దాస్ 8 టెస్టులాడి కేవలం 100 పరుగులు చేశాడు. ఆ ముగ్గురికి ఛాన్స్ ఇంగ్లండ్తో వైజాగ్ వేదికగా రెండో టెస్టుకు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరం కాగా.. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు తొలిసారి టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భారత్, సహా పాకిస్తాన్ క్రికెటర్లు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. దీప్దాస్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఫిబ్రవరి 2న మొదలుకానున్న రెండో టెస్టుకు సర్ఫరాజ్తో పాటు వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్ కూడా ఎంపికయ్యారు. చదవండి: సర్ఫరాజ్ ఎంట్రీ గ్యారెంటీ..? అతడు ఎందుకు స్పెషల్? -
Ind vs Eng: రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు
Ind vs Eng 2nd Test Vizag: టీమిండియాతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. శుక్రవారం మొదలుకానున్న ఈ మ్యాచ్లో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ అరంగేట్రం చేయనున్నట్లు వెల్లడించింది. జాక్ లీచ్ స్థానంలో అతడిని ఎంపిక చేసినట్లు తెలిపింది. అదే విధంగా మార్క్వుడ్ని తప్పించి.. అతడి స్థానంలో దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ను జట్టులోకి తీసుకువచ్చింది మేనేజ్మెంట్. ఈ మ్యాచ్లో తాము ఈ మేరకు రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. కాగా తొలి టెస్టులో మార్క్వుడ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మరోవైపు.. హైదరాబాద్ టెస్టు సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జాక్ లీచ్ మోకాలికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో బుధవారం జరిగిన ట్రెయినింగ్ సెషన్లో అతడు పాల్గొనలేదు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడికి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు బషీర్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. విశాఖలో గెలిచేందుకు కాగా విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ స్టేడియం వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు జరుగనుంది. ఫిబ్రవరి 2న ఆరంభం కానున్న ఈ మ్యాచ్ కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు.. మంగళవారమే నగరానికి చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ టీమిండియా మీద 28 పరుగుల తేడాతో గెలిచింది. ఈ క్రమంలో విశాఖలో విజయం సాధించి 1-1తో సమం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇప్పటికే జట్టుకు దూరం కాగా.. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయాల వల్ల విశాఖ టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్లను జట్టులో చేర్చింది బీసీసీఐ. టీమిండియాతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్. చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో రెండో టెస్టు.. సర్ఫరాజ్కు ఛాన్స్! సిరాజ్కు నో ప్లేస్? -
సర్ఫరాజ్ను ఆడిస్తారా? లేదంటే.. టీమిండియా కోచ్ స్పందన
India vs England, 2nd Test- Sarfaraz vs Patidar: ‘‘ఎట్టకేలకు టీమిండియా సెలక్టర్ల నుంచి అతడికి పిలుపు వచ్చింది.. దేశవాళీ క్రికెట్లో, భారత్-ఏ తరఫున సత్తా చాటుతున్న ఈ ముంబై బ్యాటర్ను ఇన్నాళ్లకు బీసీసీఐ కరుణించింది.. ఇక భారత్ తరఫున అతడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడమే తరువాయి. ఇంతకీ రెండో టెస్టు తుదిజట్టులో అతడికి చోటు దక్కుతుందా?’’.. యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ గురించి క్రీడా వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. ఎట్టకేలకు పిలుపు రంజీల్లో పరుగుల వరద పారించినా.. నోటి దురుసు కారణంగా సెలక్షన్ కమిటీ అతడి పేరును పరిశీలనలోకి తీసుకోలేదనే అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో ఎట్టకేలకు అతడి ప్రతిభ వైపే మొగ్గు చూపిన సెలక్టర్లు ఇంగ్లండ్తో రెండో టెస్టుకు ఛాన్స్ అయితే ఇచ్చారు. అంతకంటే ముందుగానే పాటిదార్ అయితే, అంతకంటే ముందే విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిగా మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్కు జట్టులో చోటిచ్చారు. హైదరాబాద్ టెస్టు తర్వాత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయాల కారణంగా దూరం కాగా.. సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్లతో పాటు సర్ఫరాజ్కు తలుపులు తెరిచారు. కానీ విశాఖపట్నం టెస్టులో తుది జట్టులో అతడికి చోటిస్తారా లేదంటే పాటిదార్ను ఆడిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఈ అంశం గురించి ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరిలో ఎవరిని ఆడిస్తారు? ‘‘వాళ్లిద్దరూ సూపర్ ప్లేయర్లు. ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం కష్టంతో కూడుకున్న నిర్ణయం. గత కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్లో ఇద్దరూ అద్భుతంగా రాణిస్తున్నారు. ఎప్పుటికపుడు వారి ప్రదర్శనలు మేము గమనిస్తూనే ఉన్నాం. ఇక స్వదేశీ పిచ్ల మీద జట్టు ఆడేపుడు వాళ్లిద్దరి చేరిక మాకు అదనపు ప్రయోజనంగా మారుతుందనడంలో సందేహం లేదు. వాళ్ల నిర్ణయాన్ని బట్టే ముందు చెప్పినట్లుగానే ఇద్దరిలో ఒకరినే తీసుకోవాల్సి రావడం వల్ల కఠిన నిర్ణయం తీసుకోకతప్పదు. రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ నిర్ణయాలకు అనుగుణంగానే తుదిజట్టు ప్రకటన ఉంటుంది’’ అని విక్రమ్ రాథోడ్ స్పష్టం చేశాడు. తొలి టెస్టులో ఓటమితో తామేమీ కుంగిపోలేదని.. రెండో మ్యాచ్లో తమ ఆటగాళ్లు కచ్చితంగా తిరిగి పుంజుకుంటారని ఈ సందర్భంగా రాథోడ్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఫిబ్రవరి 2 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య విశాఖపట్నంలో రెండో టెస్టు ఆరంభం కానుంది. ఇంగ్లండ్తో రెండో టెస్టుకు భారత జట్టు(అప్డేటెడ్): రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్. చదవండి: Ind vs Eng: కోహ్లి వస్తే వేటు పడేది నీ మీదే సర్ఫరాజ్! తాడోపేడో తేల్చుకో.. -
Ind vs Eng 2nd Test: విశాఖపట్నం చేరుకున్న టీమిండియా
సాక్షి, విశాఖపట్నం: రెండో టెస్టు కోసం టీమిండియా- ఇంగ్లండ్ జట్లు మంగళవారం విశాఖపట్నం చేరుకున్నాయి. ఈ క్రమంలో క్రికెటర్లను నేరుగా చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. తమ అభిమాన ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికారు. దూరం నుంచే వారిని పలకరిస్తూ మురిసిపోయారు. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రోహిత్ సేన- స్టోక్స్ బృందం మధ్య తొలి టెస్టుకు హైదరాబాద్ వేదికైంది. హైదరాబాద్లో ఓటమిపాలై ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో అనూహ్యంగా టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఇంగ్లండ్ 1-0తో సిరీస్లో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. విశాఖలోని డాక్టర్ వైస్ రాజశేఖర్రెడ్డి క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. విశాఖలో విజయమే లక్ష్యంగా ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులకు కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించనుంది. అదే విధంగా.. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రోజుకు 2 వేల మంది చొప్పున 5 రోజులకు 10 వేల మంది విద్యార్థులకు ఏసీఏ ఉచిత ప్రవేశం కల్పించనుంది. అంతేగాకుండా.. రాష్ట్రంలో ఉన్న క్లబ్ క్రీడాకారులు కూడా.. రోజుకు 2,850 మంది చొప్పున.. 5 రోజులకు 14,250 మంది ఫ్రీగా మ్యాచ్ చూసే అవకాశం ఇవ్వనుంది. ఇదిలా ఉంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ అమ్మమ్మగారి ఊరైన వైజాగ్లో గెలుపే లక్ష్యంగా టీమిండియా సన్నద్ధమవుతోంది. సిరీస్ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. అయితే, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరం కావడం ప్రభావం చూపే అవకాశం ఉంది. చదవండి: Ind vs Eng: రోహిత్ కూడా చెప్పాడు..! తుదిజట్టులో సిరాజ్ అవసరమా? -
Ind vs Eng: అతడు జడేజా కాదు కదా.. టీమిండియాకు కష్టమే
India vs England 2nd Test: ఇంగ్లండ్తో రెండో టెస్టుకు రవీంద్ర జడేజా దూరం కావడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బేనని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్రౌండర్ జడ్డూ అని.. అతడు లేని లోటును ప్రస్తుత జట్టులోని ఏ ఆటగాడూ తీర్చలేడని పేర్కొన్నాడు. కాగా స్టోక్స్ బృందంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో రోహిత్ సేన 28 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. హైదరాబాద్లో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత మ్యాచ్ టీమిండియా చేతిలో ఉందనిపించినప్పటికీ.. అనూహ్య రీతిలో పుంజుకున్న ఇంగ్లండ్ గెలిచి సత్తా చాటింది. మొదటి టెస్టులో అదరగొట్టాడు అయితే, ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఆటగాళ్లలో స్పిన్ ఆల్రౌండర్ జడేజా పేరు ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. ఉప్పల్ టెస్టులో మొత్తంగా ఐదు వికెట్లు తీయడంతో పాటు.. 89 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా తొడ కండరాలు పట్టేయడంతో జడ్డూ వైజాగ్లో జరుగనున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతడితో పాటు కేఎల్ రాహుల్ కూడా గాయం బారిన పడటంతో వీరి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్లకు పిలుపునిచ్చారు బీసీసీఐ సెలక్టర్లు. టీమిండియాకు కష్టమే ఈ విషయంపై స్పందించిన మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. ‘‘జడ్డూ ఉంటేనే టీమిండియాకు బలం. బ్యాటర్గా.. బౌలర్గా.. గన్ ఫీల్డర్గా అతడి సేవలను జట్టు కచ్చితంగా మిస్సవుతుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో అతడే నంబర్ వన్ టెస్టు ఆల్రౌండర్ అనడంలో సందేహం లేదు. ఇంగ్లండ్తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా ఆధిక్యంలో నిలిచిందంటే అందుకు కారణం జడేజానే. అతడు ఉన్నా.. మరో జడ్డూ కాలేడు కదా జట్టులో ఉంటే అతడు కనీసం రెండు నుంచి మూడు వికెట్లు తీయడం కూడా గ్యారెంటీ. జడ్డూ స్థానంలో బ్యాటింగ్ కూడా చేయగల బ్యాటర్ను తీసుకోవాలని మేనేజ్మెంట్ భావించడం సహజం. కాబట్టి వాషింగ్టన్ సుందర్కే ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, అతడు పరుగులు ఇవ్వకుండా పొదుపుగా బౌలింగ్ చేయగలడేమో గానీ వికెట్లు మాత్రం తీయలేడు. బ్యాటింగ్ పరంగా అతడు మెరుగైన ఆటగాడే. అయితే, వాషీ జడ్డూ మాత్రం కాలేడు కదా’’ అని వ్యాఖ్యానించాడు. ఏదేమైనా వాషింగ్టన్ సుందర్ను తుదిజట్టులో ఆడించినా జడ్డూ లేని లోటును మాత్రం పూడ్చలేడని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా - ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్లో రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Rishabh Pant: చచ్చిపోయానేమో అనుకున్నా.. -
Ind vs Eng: విశాఖ టెస్టు.. విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ
సాక్షి, విశాఖపట్నం: టీమిండియా – ఇంగ్లండ్తో రెండో టెస్టు మ్యాచ్కు నగరంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఫిబ్రవరి 2- 6 వరకు నిర్వహించనున్న ఈ మ్యాచ్ కోసం ఏర్పాట్లు చేసినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్రెడ్డి వెల్లడించారు. ఇరు జట్ల ఆటగాళ్లు జనవరి 30న విశాఖపట్నానికి చేరుకుంటారని తెలిపారు. హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 3.25 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారని గోపినాథ్రెడ్డి పేర్కొన్నారు. ఆటగాళ్ల వెంట మ్యాచ్ అధికారులు, ఇతర సిబ్బంది రానున్నట్లు వెల్లడించారు. పనులన్నీ పూర్తి చేయాలి ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణలో భాగంగా స్థానిక స్టేడియంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ఏసీఏ ట్రెజరర్ ఎ.వి.చలంతో కలిసి గోపినాథ్రెడ్డి ఆదివారం పరిశీలించారు. స్టేడియం లోపల, బయట చేపడుతున్న పనులను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసుల సమన్వయంతో అవసరమైన భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ అదే విధంగా... వాహనాల పార్కింగ్ వద్ద తగిన సిబ్బందిని నియమించి ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని గోపీనాథ్రెడ్డి ఆదేశించారు. రోజుకు 2 వేల మంది చొప్పున 5 రోజులకు 10 వేల మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీ ఇవ్వనున్న దృష్ట్యా వారి ఐడీ కార్డులను పరిశీలించి స్టేడియంలోకి పంపాలన్నారు. ఇక విద్యార్థులతో పాటు.. రోజుకు 2,850 మంది చొప్పున.. 5 రోజులకు 14,250 మంది రాష్ట్రంలో ఉన్న క్లబ్ క్రీడా కారులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ఏసీఏ కార్యదర్శి గోపినాథ్రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఉప్పల్ మ్యాచ్లో రోహిత్ సేన స్టోక్స్ బృందం చేతిలో 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో ఐదు మ్యాచ్ల టెస్టులో 0-1తో వెనుకబడింది. చదవండి: శతక్కొట్టిన బెంగాల్ మంత్రి.. చెలరేగిన షమీ తమ్ముడు -
భారత సిబ్బందితో ఉన్న నౌకపై దాడి.. రంగంలోకి ఐఎన్ఎస్ విశాఖ
ఎర్రసముద్రంలో నౌకలపై యెమెన్ దేశానికి చెందిన తిరుబాటుదారులు హౌతీ రెబల్స్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో సముద్రంలో ప్రయాణిస్తున్న బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్పై హౌతీ రెబల్స్ మిస్సైల్ దాడికి తెగపడ్డారు. దాడికి గురైన బ్రిటిష్ నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది, ఒక బంగ్లాదేశ్ ఉద్యోగి ఉన్నారు. దీంతో సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ సహాయక చర్యలకోసం ఐఎన్ఎస్ విశాఖపట్నం సిబ్బందిని పంపించినట్లు శనివారం వెల్లడించింది. దాడి జరిగిన వెంటనే ఎంవీ మార్లిన్ లువాండా అనే బ్రిటిష్ నౌక నుంచి ఓ అత్యవసర సందేశం ఇండియాన్ నేవీ వచ్చింది. #IndianNavy's Guided missile destroyer, #INSVisakhapatnam, deployed in the #GulfofAden responded to a distress call from MV #MarlinLuanda on the night of #26Jan 24. The fire fighting efforts onboard the distressed Merchant Vessel is being augmented by the NBCD team along with… pic.twitter.com/meocASF2Lo — SpokespersonNavy (@indiannavy) January 27, 2024 ‘ఎంవీ మార్లిన్ లువాండా నుంచి వచ్చిన అత్యవసర సందేశంతో అప్రమత్తమైన సమీపంలోని ఐఎన్ఎస్ విశాఖపట్నం సిబ్బంది రంగంలో దిగారు. నౌకల భద్రతను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నాం’ ఇండియాన్ నేవి ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా పేర్కొంది. -
Ind vs Eng- Vizag: రేపటి నుంచి ఆఫ్లైన్ టికెట్లు.. ధరలు ఇలా
సాక్షి, విశాఖపట్నం: టీమిండియా- ఇంగ్లండ్ రెండో టెస్టుకు నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం(జనవరి 26) నుంచి ఆఫ్లైన్లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు టికెట్ల విక్రయాలు ప్రారంభించనున్నట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 6 వరకు పీఎం పాలెంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియం, ఫిబ్రవరి 1 వరకు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో టికెట్లు విక్రయించనున్నట్లు తెలిపారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టికెట్లు విక్రయించేలా ఏర్పాట్లు చేశామన్నారు. తొలి రోజు టీమిండియాదే కాగా.. ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం(జనవరి 25) తొలి టెస్టు ఆరంభమైంది. స్పిన్నర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ను 246 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడటంతో మొదటి రోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. మొత్తానికి తొలి రోజు పర్యాటక స్టోక్స్ బృందంపై రోహిత్ సేన పైచేయి సాధించింది. ఆఫ్లైన్లో అందుబాటులో ఉన్న టికెట్ల ధరల వివరాలు.. ►రోజుకు రూ.100+సీజన్కు రూ.400 ►రోజుకు రూ.200+సీజన్కు రూ.800 ►రోజుకు రూ.300+సీజన్కు రూ.1,000 ►రోజుకు రూ.500+సీజన్కు రూ.1,500 రోజుకు 2,850 మంది క్లబ్ క్రీడాకారులకు ఉచిత ఎంట్రీ.. రాష్ట్రంలో రోజుకు 2,850 మంది క్రికెట్ క్లబ్ క్రీడాకారులన చొప్పున ఐదు రోజులకు 14,250 మందికి ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. రోజుకు 2 వేల మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీ.. రోజుకు 2 వేల మంది చొప్పున ఐదు రోజులకు 10,000 మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీకి ఏర్పాట్లు చేశారు. అయితే విద్యార్థులు ఐడీ కార్డులు తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తక్కువ ధరలు.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా లోయర్ పెవిలియన్ సీజన్ టికెట్లను విశాఖపట్నంలో కేవలం రూ. 1500లకు అందుబాటులో ఉంచినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. చదవండి: INDA& U19 WC: టెస్టులో అన్న.. వరల్డ్కప్లో తమ్ముడి సెంచరీలు -
APL 2023: ధరణీకుమార్ మెరుపులు.. గోదావరి టైటాన్స్కు తప్పని ఓటమి
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్–2 సీజన్లో భాగంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ– వీడీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్లో కోస్టల్ రైడర్స్ 35 పరుగుల తేడాతో గోదావరి టైటాన్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోస్టల్ రైడర్స్ ఓపెనర్ ప్రణీత్ 15 పరుగులు చేసి మాధవ్ బౌలింగ్లో ఇస్మాయిల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రైడర్స్ కెప్టెన్ రషీద్ 7 పరుగులే చేసినా ఓపెనర్ ధరణీకుమార్(32 బంతుల్లో 59, 8x4, 3x6)తో కలిసి రెండో వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యం అందించాడు. హర్షవర్ధన్ (నాలుగు ఫోర్లు, సిక్సర్తో 22 బంతుల్లో 35)తో కలిసి లేఖజ్ రెడ్డి(12) ఇన్నింగ్స్ సరిదిద్దే ప్రయత్నం చేశాడు. 101 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన రైడర్స్.. మరో 63 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. మొత్తంగా తొమ్మిది వికెట్లకు 173 పరుగులు చేసింది. సత్యనారాయణ రాజు, సమన్విత్ మూడేసి వికెట్లు తీయగా మాధవ్ రెండు, విజయ్ ఒక వికెట్ తీశారు. లక్ష్య ఛేదనకు దిగిన గోదావరి టైటాన్స్ ఓపెనర్లు వంశీకృష్ణ(4) 10 పరుగుల వద్ద, కెప్టెన్ జానేశ్వర్ (14) 28 పరుగుల వద్ద వెనుదిరిగారు. హేమంత్రెడ్డి ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 49 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ధీరజ్కుమార్(10), పాండురంగరాజు(14) వికెట్లను 94 పరుగుల స్కోర్ వద్ద కోల్పోయింది. ఇస్మాయిల్ ఎనిమిది బంతుల్లో 19 పరుగులతో చివర్లో కాస్త మెరుపులు మెరిపించినా 18.1 ఓవర్లలోనే 138 పరుగులకు గోదావరి టైటాన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. అబ్దుల్లా మూడు, సుదర్శన్, చిరంజీవి, స్టీఫెన్ రెండేసి వికెట్లు తీశారు. ఆశిష్ ఓ వికెట్ పడగొట్టాడు. చదవండి: అఫ్గనిస్తాన్పై ఘన విజయం.. పాత రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్ -
ఏడాదిన్నార కాలంలోనే 245 శాశ్వత నియామకాలు
-
గంజాయి రవాణా ఒడిశా నుండి విశాఖ
-
తూ.గో. జిల్లా కు చెందిన మహిళ తో ట్రాప్ చేయించిన ముట్ట
-
Ind Vs Aus: ఘోర ఓటమి.. టీమిండియా చెత్త రికార్డులివే! మరీ దారుణంగా..
India vs Australia, 2nd ODI: రెండో వన్డేలో ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్ గెలుస్తారని ఆశించిన అభిమానులను టీమిండియా తీవ్రంగా నిరాశపరిచింది. స్వదేశంలో ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. పరుగులు తీయడానికి బదులు.. ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి భారత ‘స్టార్లు’ పెవిలియన్కు క్యూ కట్టడంలో పోటీపడ్డారు. విరాట్ కోహ్లి ఒక్కడు 31 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీళ్లిద్దరు మినహా ‘పటిష్ట’ టీమిండియా బ్యాటింగ్ లైనప్లోని ఏ ఒక్క బ్యాటర్ కూడా కనీసం 20 పరుగులు కూడా చేయలేక చతికిలపడ్డారు. ఊహించని రీతిలో.. వెరసి విశాఖపట్నంలోని ఆదివారం నాటి మ్యాచ్లో 26 ఓవర్లలో కేవలం 117 పరుగులకే రోహిత్ సేన కథ ముగిసింది. భారత బ్యాటర్లు విఫలమైన చోట.. ఆసీస్ ఓపెనర్లు ఊహించని రీతిలో చెలరేగారు. ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 51, మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 66 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి మెరుపు బ్యాటింగ్తో 11 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే కంగారూ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ ఘోర పరాభవం నేపథ్యంలో టీమిండియా పేరిట పలు చెత్త రికార్డులు నమోదయ్యాయి. స్వదేశంలో ఇలా సొంతగడ్డపై టీమిండియాకు వన్డేల్లో నాలుగో అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం. శ్రీలంకతో మ్యాచ్లో 1986లో 78, వెస్టిండీస్తో 1993లో 100, 2017లో శ్రీలంకతో 112 పరుగులు చేసిన భారత జట్టు.. తాజాగా ఆస్ట్రేలియాతో రెండో వన్డే సందర్భంగా ఈ మేరకు నాలుగో అత్యల్ప స్కోరు(117) నమోదు చేసింది. అతిపెద్ద ఓటమి 234: రెండో వన్డేలో ఆసీస్ విజయం పూర్తయిన సమయానికి మిగిలి ఉన్న బంతులు. మిగిలి ఉన్న బంతుల పరంగా వన్డేల్లో భారత్కిదే అతిపెద్ద ఓటమి. ఆసీస్ చేతిలో.. 2: స్వదేశంలో భారత్ ఓ వన్డేలో 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం ఇది రెండోసారి మాత్రమే. 2020లో ముంబైలో ఆసీస్ చేతిలోనే భారత్ తొలిసారి 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇక ఓవరాల్గా ఆరోసారి ఈ మేరకు ఘోర పరభావాన్ని మూటగట్టుకుంది. 1981లో న్యూజిలాండ్, 1997లో వెస్టిండీస్, 2000, 2005లో సౌతాఫ్రికా చేతిలో ఓటమిని మూటగట్టుకుంది. పేసర్లకు తలవంచి 2: స్వదేశంలో భారత జట్టు మొత్తం 10 వికెట్లను పేసర్లకే కోల్పోవడం ఇది రెండోసారి. 2009లో గువాహటిలో జరిగిన మ్యాచ్లో ఆసీస్ పేస్ బౌలర్లు (బొలింగర్ 5, మిచెల్ జాన్సన్ 3, వాట్సన్ 2 వికెట్లు) ఈ ఘనత సాధించారు. చదవండి: IND vs AUS: మా ఓటమికి ప్రధాన కారణమిదే.. అస్సలు ఊహించలేదు! వారిద్దరూ అద్భుతం IND VS AUS 2nd ODI: బీస్ట్ ఈజ్ బ్యాక్.. పేస్తో గడగడలాడించి టీమిండియాకు చుక్కలు చూపించిన స్టార్క్ Temba Bavuma: సెంచరీల మీద సెంచరీలు బాదుతూ జాత్యహంకారుల నోళ్లు మూయించిన ధీరుడు -
WPL: దాదాపు పదేళ్ల తర్వాత ‘అమ్మ’ నుంచి మళ్లీ ఆటకు.. మెరిసిన వైజాగ్ తేజం
WPL 2023 Auction-Sneha Deepthi: 16 ఏళ్ల 204 రోజులు... 2013 ఏప్రిల్లో విశాఖటాన్నికి చెందిన స్నేహ దీప్తి అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ టి20ల్లో ఆడిన భారత ప్లేయర్గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత మరో టి20 మ్యాచ్లో బరిలోకి దిగిన ఆమె అదే నెలలో తన ఏకైక వన్డే కూడా ఆడింది. అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు ఆమె దూరమైంది. దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత స్నేహ దీప్తికి అరుదైన రీతిలో తొలి డబ్ల్యూపీఎల్లో ఆడే అవకాశం దక్కింది. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. సాధారణంగా దశాబ్ద కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరం అంటే కెరీర్ ముగిసినట్లే. కానీ దీప్తి 26 ఏళ్ల వయసులో మళ్లీ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇన్నేళ్ల పాటు ఆటకు దూరం కాకుండా ‘అమ్మ’గా మారిన తర్వాత కూడా క్రికెట్లో ఆమె కొనసాగిన తీరు స్ఫూర్తిదాయకం. దక్షిణ మధ్య రైల్వే తరఫున దూకుడైన బ్యాటింగ్తో గుర్తింపు తెచ్చుకున్న స్నేహ ఆంధ్ర జట్టు తరఫున నిలకడైన ప్రదర్శనతో చిన్న వయసులోనే భారత జట్టులో అవకాశం దక్కించుకుంది. దేశవాళీలో దక్షిణ మధ్య రైల్వే తరఫున చక్కటి ఇన్నింగ్స్లతో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఫిబ్రవరి 2021లో ఆమెకు పాప పుట్టింది. ఈ సమయంలోనే ఆటకు విరామమిచ్చి స్నేహ సెప్టెంబర్లోనే మళ్లీ దేశవాళీ క్రికెట్లోకి అడుగు పెట్టింది. అప్పటి నుంచి క్రికెట్ను కొనసాగిస్తూ ఇప్పుడు డబ్ల్యూపీఎల్తో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించడం విశేషం. – సాక్షి క్రీడా విభాగం చదవండి: వేలంలో అత్యధిక ధర పలికిన తెలుగు క్రికెటర్? ఎవరు ఏయే జట్లకు ఆడబోతున్నారంటే.. Eoin Morgan: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ -
ఆంధ్ర క్రికెట్ జట్టుకు మధురవాడ కుర్రాడు
మధురవాడ(భీమిలి): మధురవాడ బొట్టవానిపాలేనికి చెందిన ముగడ భానుస్వరూప్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అండర్–14 జట్టులో చోటు సంపాదించాడు. భానుస్వరూప్ ప్రస్తుతం బక్కన్నపాలెం సెయింట్ ఆన్స్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి రమణ లారీ యజమాని. చిన్నప్పుడే కుమారుడి ఆసక్తిని గమనించిన రమణ.. తమకు తెలిసిన వారి దగ్గర క్రికెట్లో శిక్షణ ఇప్పించాడు. అనంతరం పక్కనే ఉన్న పీఎం పాలెంలో స్టేడియం ఉండటంతో.. విశాఖ క్రికెట్ అసోసియేషన్లో చేర్పించాడు. అప్పటి నుంచి భానుస్వరూప్ టోర్నమెంట్లలో పాల్గొంటూ ప్రతిభ చూపేవాడు. ఈక్రమంలో గతేడాది వీడీసీఏలో స్థానం సంపాదించాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా, బ్యాటింగ్లో రాణిస్తూ.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అండర్–14 జట్టులో స్థానం సంపాదించాడు. ప్రస్తుతం కేరళలో దక్షిణాది రాష్ట్రాల జట్ల మధ్య జరుగుతున్న పోటీల్లో ఏసీఏ తరఫున భానుస్వరూప్ పాల్గొంటున్నాడు. భానుస్వరూప్ మాట్లాడుతూ.. ‘నాకు క్రికెట్పై ఉన్న ఇష్టాన్ని గమనించిన మా నాన్న.. నన్ను బాగా ప్రోత్సహించారు. వీడీసీఏలోని కోచ్లు, పెద్దల సూచనలు, ప్రోత్సాహంతో మరింత పట్టుదలగా ఆడుతున్నాను. నాకు రవీంద్ర జడేజా అంటే చాలా ఇష్టం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని జాతీయ జట్టులో ఆడాలనేది నా కల. దాన్ని నిజం చేసుకుంటా’అని చెప్పాడు. -
రోబోటిక్ ‘లైఫ్బాయ్’తో సెకన్లలో సహాయం
బీచ్ రోడ్డు(విశాఖ తూర్పు): ఇటీవల సముద్రంలో రాకాసి అలలకు చిక్కుకుని అనేక మంది మృత్యువాత పడ్డారు. వీరిలో చాలా మంది సరైన సమయంలో సహాయం అందకపోవడం వల్లనే కెరటాలకు బలైపోయారన్న వాదన ఉంది. ఇప్పుడు అటువంటి ప్రమాదాలను అరికట్టేందుకు లైఫ్బాయ్ పేరుతో రోబోటిక్ బోట్లు(వాటర్ డ్రోన్లు) అందుబాటులోకి వచ్చాయి. వీటి సహాయంతో సముద్రంలో మునిగిపోతున్న వారిని సెకన్ల వ్యవధిలో రక్షించి ఒడ్డుకు చేర్చవచ్చు. 25 కేజీల బరువు గల ఈ డ్రోన్ 28 కిలోమీటర్ల స్పీడ్తో 2 కిలోమీటర్ల మేర సముద్రంలోకి వెళ్లి ఆపదలో ఉన్న 200 కేజీల వరకు బరువు ఉన్న వ్యక్తులను రక్షిస్తాయి. సేఫ్ బీచ్గా విశాఖ తీరం ఆర్కే బీచ్లో ఉన్న రోబోటిక్ బోట్(వాటర్ డ్రోన్లు)లను శుక్రవారం కలెక్టర్ మల్లికార్జున, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ పరిశీలించారు. వాటి పని తీరు, ఎలా రక్షిస్తుంది అనేది వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ సాగర తీరాన్ని సేఫ్ బీచ్గా రూపుదిద్దుతామన్నారు. జీవీఎంసీ సహకారంతో 39 మంది గజ ఈతగాళ్లను బీచ్లో నియమించామని, వారికి అవసరమైన లైఫ్ జాకెట్లు, ఇతర సామగ్రిని సమకూర్చినట్టు చెప్పారు. ఇదీ చదవండి: గుడ్ న్యూస్: అందుబాటులోకి అదనపు బెర్తులు, సీట్లు -
విశాఖ విమ్స్ లో మెరుగైన వైద్య సేవలు
-
covid-19: విశాఖ పోర్టుకు చేరిన సింగపూర్ సాయం
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ సమయంలో మిత్ర దేశాల నుంచి భారత్కు అత్యవసర సేవలు అందుతున్నాయి. ముఖ్యంగా సింగపూర్ తదితర మిత్ర దేశాలు సముద్ర సేతు పేరుతో అత్యవసర మందులు, వైద్య పరికరాలు అందిస్తున్నాయి. అందులో భాగంగా ఐఎన్ఎస్ జలస్వ నౌక 18 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, 3650 ఆక్సిజన్ సిలిండర్లు, 39 వెంటిలేటర్లతో ఆదివారం విశాఖలోని తూర్పు నౌకాదళ కేంద్రానికి చేరింది. వీటితో పాటు కోవిడ్ మందులు కూడా మిత్ర దేశాలు అందించాయి. సముద్ర సేతు 2లో భాగంగా ఈ సేవలు భారత్కు చేరాయి. చదవండి: మాకు కరోనా లేదు... పరీక్షలు చేయొద్దు -
కోవిడ్ బాధితులకు విశాఖ కే జీ హెచ్ లో మెరుగైన వైద్య సేవలు
-
విశాఖలో మరో 300 ఆక్సిజన్ బెడ్లు సిద్ధం
-
నేటి నుంచి రెండోడోసు వ్యాక్సినేషన్
-
ఎల్జీ పొలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు ఇవాళ్టితో ఏడాది పూర్తి
-
విశాఖలో మూడో రోజు కర్ఫ్యూ ఆంక్షలు
-
విశాఖ ఏజెన్సీలో కర్ఫ్యూకు అన్ని రకాల చర్యలు
-
విశాఖ లో ఉధృతంగా పరిషత్ ఎన్నికల ప్రచారం
-
కోవిద్ ఆంక్షల నేపథ్యంలో ఇంట్లోనే హోలీ జరుపుకుంటున్న ప్రజలు
-
గ్రేటర్ విశాఖ లో ప్రశాంతంగా బంద్
-
దాడికి దారి తీసిన విద్యార్థుల మధ్య గొడవ
-
విశాఖ జిల్లాలో కొనసాగుతున్న కరోనా వాక్సినేషన్
-
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాస్ రావు అదృశ్యం కేసు
-
గ్రేటర్ విశాఖ కార్పొరేటర్ దాడి సూర్యకుమారి మృతి
-
విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు టెన్త్ విద్యార్థులు మృతి
-
మహిళకు అవకాశాలు కలిపించిన సీఎంకు కృతజ్ఞతలు
-
మహిళా కార్పొరేటర్లతో జీవీఎంసీ కళకళ
-
విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు భారీ ర్యాలీ
-
విశాఖ కార్పొరేషన్ లో వైఎస్సార్సీపీ అఖండ విజయం
-
విశాఖ సముద్రతీరంలో పంజరాల్లో చేపల పెంపకం
-
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల ఆందోళన
-
జీవీఎంసీ ఎన్నికలు: ప్రచారంలో ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: వైద్యరంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమూల మార్పులు తెచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గ్రేటర్ విశాఖలో శనివారం మునిసిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను కూడా సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారని పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సంక్షేమ ఫలాలు ఇంటింటికి అందజేస్తున్నారని తెలిపారు. విద్య, వైద్యం, ఆరోగ్యానికి పెద్దపీట వేసిన సీఎం జగన్.. నాడు-నేడు ద్వారా విద్యా ప్రమాణాలను పెంచారని కొనియాడారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలనేది సీఎం లక్ష్యమని అన్నారు. కాలువలు, రోడ్లు, స్వయం సహాయక సంఘాల భవనాలు వంటి ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్చించినట్లు పేర్కొన్నారు. చదవండి: పుర పోరు.. వైఎస్సార్ సీపీ ప్రచార జోరు Visited Wards 42 & 55 during our G.V.M.C. 2021 Election Campaigning today & discussed plans for improving basic amenities, canals, roads, buildings for SHGs, Infra. setup for community halls & sanctioning of house pattas, under Hon. CM Shri @YSJagan Garu’s leadership. pic.twitter.com/WGuLwt9k8G — Vijayasai Reddy V (@VSReddy_MP) February 27, 2021 -
శ్రీకాంత్కు ప్రభుత్వం అండగా ఉంటుంది
సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి: విశాఖపట్నంలో శిరోముండనం బాధితుడు పర్రి శ్రీకాంత్కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. జనసేన సానుభూతిపరుడు, టీడీపీ నేతలతో వ్యాపార భాగస్వామి, సినీ దర్శక, నిర్మాత నూతన్నాయుడు ఇంట్లో దాష్టీకానికి గురైన దళిత యువకుడు శ్రీకాంత్ ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. బాధితుడు శ్రీకాంత్ను మంత్రి ముత్తంశెట్టి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ ఆదివారం పరామర్శించారు. ► శ్రీకాంత్కు ప్రభుత్వం తరఫున రూ.లక్ష సాయం అందజేయటంతో పాటు ఔట్సోర్సింగ్ ద్వారా ఉపాధి కల్పిస్తామని మంత్రి ప్రకటించారు. ► కేసు విషయంలో పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరు ప్రశంసనీయమన్నారు. భవిష్యత్లో మరెవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరారు. ► బాధితులకు అండగా ఉండాల్సిన ప్రతిపక్షాలు నిస్సిగ్గుగా రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ► బాధితుడు శ్రీకాంత్కు ఎమ్మెల్యే అదీప్రాజ్ తన సొంత నిధులు రూ.50 వేలు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ► ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, ఆర్డీవో పెంచల కిశోర్ తదితరులు పాల్గొన్నారు. జ్యుడీషియల్ రిమాండ్కు ఏడుగురు నిందితులు శ్రీకాంత్ను హింసించిన ఘటనలో అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్కి పంపించారు. నిందితులను ఎస్సీ, ఎస్టీ స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా.. వారికి సెప్టెంబర్ 11 వరకు రిమాండ్ విధించారు. ఆరిలోవలో ఉ¯న్న విశాఖ జిల్లా సెంట్రల్ జైలుకు నూతన్నాయుడి భార్య ప్రియామాధురితో సహా బ్యూటీషియన్ ఇందిరారాణి, వరహాలు, ఝాన్సీ, సౌజన్యలను తరలించగా బార్బర్ రవికుమార్, బాల గంగాధర్ను అనకాపల్లి సబ్ జైలుకు పంపించినట్లు డీసీపీ (క్రైం) సురేష్బాబు తెలిపారు. -
22 రోజులు.. 110 కిలో మీటర్లు..
సాక్షి, హైదరాబాద్: కూటి కోసం.. కూలి కోసం.. కాంట్రాక్టర్ మాటలు నమ్మి.. వెంట వెళ్లిన కుటుంబానికి ఎంత కష్టం.. ఎంత కష్టం.. చేతిలో చిల్లిగవ్వలేక.. కరోనా వేళ కరుణించేవారు లేక.. కళ్లలో ఆశలుడిగి కాలినడకన బయలుదేరిన ఆ కూలీ కుటుంబానికి ఎంత కష్టం.. ఎంత కష్టం.. 22 రోజులుగా నడిచి నడిచి, ఎడతెరిపిలేని వాననీటిధారలోనే ఎడతెగని కన్నీటిధార కలిసిపోయిన ఆ పేద జంటకు ఎంత కష్టం.. ఎంత కష్టం.. చివరికి కూలీని మరో కూ లీ చెంతకు తీసుకొని చింత తీర్చి మానవత్వం ఇంకా కూలిపోలేదని నిరూపించిన ఘటన ఇది. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్నగర్కు చెందిన భాషబోయిన రమేశ్ దినసరి కూలీ. రెండు నెలల కిందట గుంటూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్ మాటలు నమ్మి భార్య లక్ష్మి, కుమారుడు చక్రిని తీసుకుని ఉపాధి కోసం విశాఖపట్నం వెళ్లాడు. తీరా పనిచేయించుకున్న కాంట్రాక్టర్ వారికి చెప్పాపెట్టకుండా ఎటో ఉడాయించాడు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వస్తోంది. ఎన్నిరోజులు ఎదురుచూసినా తిరిగిరాలేదు. తనతోపాటు పలువురు స్థానిక, మహారాష్ట్ర నుంచి వచ్చిన కూలీలకు కూడా ఆ కాంట్రాక్టర్ కూలి డబ్బులు ఎగ్గొట్టాడు. దీంతో మోసపోయామని గ్రహించిన రమేశ్ భార్యాబిడ్డలతో కలసి స్వగ్రామానికి తిరిగి వెళ్లాలనుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో చాలామందిని చార్జీ డబ్బుల కోసం బతిమిలాడాడు. కరోనా విజృంభిస్తున్నవేళ ఎవరూ వారిని కరుణించలేదు. కాంట్రాక్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫోన్ స్విచ్చాఫ్ అని వస్తుండటంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. రూ.100 చేతిలో పెట్టి వెళ్లిపొమ్మన్నారు. లారీ డ్రైవర్లు కూడా వారిని వాహనంలోకి ఎక్కించుకునేందుకు నిరాకరించారు. 22 రోజులపాటు పట్టాల వెంబడే నడక..! చేసేదేమీ లేక కాలినడకన రైలు పట్టాల వెంట విశాఖపట్నం నుంచి వరంగల్కు బయల్దేరింది ఆ కూలీ కుటుంబం. మార్గమధ్యంలోనూ చాలామందిని అర్థించినా ఫలితం లేకుండా పోయింది. సరిగా తిండి లేకపోవడంతో రోజుకు 4–5 కి.మీ. మాత్రమే నడిచేవారు. స్టేషన్లలో ప్రయాణికులను బతిమిలాడుతూ.. పొట్టనింపుకున్నారు. పట్టాల వెంబడే నిద్రపోవడంతో రమేశ్ కుమారుడు చక్రీకి, భార్య లక్ష్మికి పలుమార్లు తేళ్లు కుట్టాయి. అయినా గుండెధైర్యంతో 22 రోజులపాటు పట్టాల వెంట నడక సాగించారు. మధ్యలో ఐదురోజులపాటు ఏకధాటి వాన కురుస్తున్నా నడుస్తూనే ఉన్నారు. దాదాపు 110 కిలోమీటర్ల అనంతరం రాజమండ్రి సమీపంలోని లక్ష్మీనారాయణపురం రైల్వేస్టేషన్ వద్దకు బుధవారం రాత్రి 9 గంటలకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడ పనులు చేసుకుంటున్న రైల్వే కూలీ డేవిడ్ వారిని గుర్తించి వివరాలు వాకబు చేశాడు. డేవిడ్ ఇటీవల తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) కానిస్టేబుల్గా సెలక్టయ్యాడు. ట్రైనింగ్ ఇంకా మొదలు కాకపోవడంతో కూలి పనులు చేసుకుంటున్నాడు. రమేశ్ తన పరిస్థితి చెప్పగానే డేవిడ్, అతని మిత్రులంతా కలిసి ఆ కుటుంబాన్ని చేరదీశారు. ఆకలి తీర్చి, ఆ రాత్రికి తమ వద్దే ఆశ్రయమిచ్చారు. మర్నాడు డేవిడ్ తాను పనిచేసే ఎంఎంఆర్ సంస్థ అధికారులకు, తోటి కూలీలకు, తెలంగాణలోని టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులకు విషయం వివరించాడు. దీంతో వారంతా కలసి రమేశ్ కుటుంబానికి ఆన్లైన్లో రైల్వే టికెట్లు బుక్చేశారు. కూలీలంతా కలసి రాజమండ్రి వరకు ఆటో మాట్లాడి వారిని అందులో ఎక్కించారు. దారి ఖర్చులకు డబ్బులిచ్చారు. రాజమండ్రిలో వరంగల్ రైలెక్కించి మానవత్వం చాటుకున్నారు. -
బాధితులంతా డిశ్చార్జ్
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో వెలువడిన స్టైరీన్ గ్యాస్ ప్రభావానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులందరూ పూర్తిగా కోలుకున్నారు. బుధ, గురువారాల్లో మొత్తం 300 మందికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందించి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ► కేజీహెచ్లో చేరిన 321 మందిలో 21 మందికి ఆరోగ్యం నయమవడంతో రెండు రోజుల క్రితమే వైద్యులు ఇంటికి పంపించారు. మిగిలిన 300 మందిలో 287 మందికి బుధవారం రూ.లక్ష చొప్పున పరిహారం చెక్కులను ఇచ్చి డిశ్చార్జ్ చేశారు. ► బాధితులు గ్రామాలకు వెళ్లడానికి భయపడే అవకాశాలు ఉండడంతో అధికారులు గోపాలపట్నంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిశ్చార్జ్ అయిన వారిని ప్రత్యేక బస్సులలో అక్కడికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ► బుధవారం రాత్రికి 180 మంది ఆ కేంద్రాలకు వెళితే.. మిగిలిన 107 మంది వారి సొంత వాహనాలలో ఇళ్లకు వెళ్లిపోయారు. మిగిలిన 13 మంది కూడా గురువారం రూ.లక్ష చెక్కు తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు. అధికారులు వీరిని బస్సులో పునరావాస కేంద్రానికి తరలించారు. ► గ్రామాల్లో ప్రస్తుతం స్టైరీన్ అవశేషాలు పూర్తిగా తొలగిపోవడంతో పునరావాస కేంద్రాల్లో 42 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వారంతా ఇళ్లకు వెళ్లిపోయారు. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా చికిత్స అందిస్తాం ప్రమాదానికి గురైన మొత్తం బాధితులందరూ గురువారం నాటికి డిశ్చార్జ్ అయిపోయారు. ఎవరికైనా ఏ చిన్న పాటి ఆరోగ్య సమస్య వచ్చినా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో చికిత్స అందిస్తారు. గతంలో డిశ్చార్జ్ అయిన వాళ్లు నేరుగా కేజీహెచ్కు వచ్చినా చికిత్స అందిస్తాం. – అర్జున, కేజీహెచ్ సూపరింటెండెంట్ -
పరిశ్రమల శాఖను అప్రమత్తం చేసిన మంత్రి
సాక్షి, విశాఖపట్నం : విజయవాడ నుంచి విశాఖకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి బయలుదేరారు. మధ్యాహ్నం విశాఖకు గౌతమ్ రెడ్డి చేరుకోనున్నారు. 12.30గంటలకు ఎల్ జీ పాలిమర్స్ పరిశ్రమ, స్థానిక గ్రామాలు, ప్రజల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించనున్నారు. ఒంటి గంటకు ఎల్ జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ పరిశీలన అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడనున్నారు. 1.30 గంటలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మేకపాటి పరామర్శించనున్నారు. గురువారం రాత్రి వరకూ ఫ్యాక్టరీలో లీకేజ్ కట్టడి, బాధితుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించారు. విశాఖ ప్రమాదంతో పరిశ్రమల శాఖను, అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. (యుద్ధ ప్రాతిపదికన స్పందించాం) ఇప్పటికే ఉష్ణోగ్రతల వల్ల ప్రభావితం చెందే పరిశ్రమల జాబితాను గౌతమ్ రెడ్డి తెప్పించుకున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాయం చేస్తున్న అధికారులకు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులకు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు. మధ్యాహ్నం 2గంటలకు ఆస్పత్రి ప్రాంగణంలో అధికార యంత్రాంగంతో, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలోని ఇతర ఫ్యాక్టరీలు, పారిశ్రామిక జోన్లు, పరిశ్రమల పరిస్థితులపై చర్చించనున్నారు. వేసవి కాలం, ఉష్ణోగ్రతల మార్పుకు అనుగుణంగా పట్టణ పరిధిలో ఉన్న పరిశ్రమలు, స్థానిక ప్రజల రక్షణకై ఎలా వ్యవహరించాలన్నదానిపై అధికారులతో చర్చించనున్నారు. తాజా దుర్ఘటన నేపథ్యంలో మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. -
మంత్రి కన్నబాబుకు పర్యవేక్షణ బాధ్యత
సాక్షి, విశాఖపట్నం: స్టైరీన్ గ్యాస్ బాధిత ప్రజలకు సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కురసాల కన్నబాబుకు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్ స్థానికంగా అందుబాటులో ఉండాలని, ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రెండు రోజుల పాటు విశాఖలోనే ఉండాలని సూచించారు. డిప్యూటీ సీఎం సమీక్ష ఎల్జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించి కలెక్టరేట్లో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాసరావు(నాని), మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సమీక్షించారు. విషవాయువు ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈని అడిగి తెలుసుకున్నారు. కేజీహెచ్తో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంత మంది చికిత్స పొందుతున్నారో ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్చంద్, అగ్నిమాపక శాఖ డీజీ ఎ.ఆర్.అనురాధ, విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన, జేసీ ఎం.వేణుగోపాలరెడ్డి, డీఆర్వో ఎం.శ్రీదేవి, ఆర్డీవో పెంచల కిషోర్, ఇండస్ట్రీస్ అధికారులు పాల్గొన్నారు. -
యుద్ధ ప్రాతిపదికన స్పందించాం
సాక్షి, అమరావతి: ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకయిన వెంటనే రాష్ట్ర యంత్రాంగం యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. ► ప్రభావిత గ్రామాల్లోని ప్రజలను త్వరితగతిన ఖాళీ చేయించడం ద్వారా మరణాల సంఖ్య తగ్గించగలిగాం. ► జిల్లా కలెక్టర్, పరిశ్రమలశాఖ అధికారులతో పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు విశాఖలోని పరిశ్రమలశాఖ జీఎం కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం. ► ఇందుకోసం ఎస్ ప్రసాదరావు, ఆర్.బ్రహ్మ అనే అధికారులను నియమించాం. సహాయం కోసం వీరిని 7997952301, 8919239341, 9701197069 అనే నంబర్లలో సంప్రదించవచ్చు. ► సహాయక పనులను పర్యవేక్షించడానికి పరిశ్రమలశాఖ తరఫున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశాం. ► ఈ దుర్ఘటనకు కంపెనీ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. విచారణ అనంతరం తగిన నిర్ణయం తీసుకుంటాం. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం ఢిల్లీలోని దక్షిణ కొరియా దౌత్యవేత్త షిన్బాంగ్ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజ్ ఘటనపై దక్షిణ కొరియా స్పందించింది. విశాఖ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఢిల్లీలో ఉన్న కొరియన్ దౌత్యవేత్త షిన్బాంగ్ కిల్ అన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని పేర్కొంటూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్యాస్ లీకేజీతో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దర్యాప్తుకు సహకరిస్తాం ఎల్జీ పాలిమర్స్ జీఎం శ్రీనివాస్ రామ్ ఎల్జీ పాలిమర్స్లో జరిగిన ఘటనపై ఆ సంస్థ జీఎం శ్రీనివాస్ రామ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులందరికీ అవసరమైన వైద్య సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బాధిత గ్రామాల ప్రజలు, సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్య భద్రత తమ బాధ్యతని తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం చేసే దర్యాప్తుకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సాంకేతిక బృందాల్ని సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత పటిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
బాధితుల భద్రతే ముఖ్యం
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులకు, గ్రామాల్లో వారి ఆస్తులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్ వి.వినయ్చంద్ను ఆదేశించారు. గ్యాస్ ప్రభావం తగ్గిన తర్వాత సురక్షిత పరిస్థితి ఏర్పడి.. బాధితులు తమ గ్రామాలకు తిరిగి వెళ్లేవరకూ షెల్టర్లలో వసతి కల్పించాలని సూచించారు. గురువారం ఆయన కేజీహెచ్లో బాధితులను పరామర్శించిన అనంతరం ఆంధ్రా వైద్య కళాశాలలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. దుర్ఘటన జరిగిన తీరుపై సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన విషయాలు, సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. రిఫ్రిజిరేషన్ సరిగా జరగకే.. ► ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో తెల్లవారుజామున గ్యాస్ లీక్ అయ్యింది. ఘటన జరిగిన ప్రదేశంలో 2,500 కిలోలీటర్ల ట్యాంకు, మరొకటి 3,500 కిలోలీటర్ల సామర్థ్యం ఉన్నవి ఉన్నాయి. ► 2,500 కేఎల్ ట్యాంకు నుంచే తొలుత గ్యాస్ లీక్ మొదలైంది. దీనిలో 1,800 కేఎల్ స్టైరీన్ ద్రవ రూపంలో ఉంది. 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకూ ఇది సురక్షితం. సాంకేతిక కారణాల వల్ల రిఫ్రిజిరేషన్ సరిగా జరగలేదు. దీంతో అది గ్యాస్ రూపంలోకి మారి లీక్ అయ్యింది. ► గ్యాస్ లీకైన వెంటనే కంపెనీ పరిసరాల్లోని వెంకటాపురం, పద్మనాభపురం, ఎస్సీ, బీసీ కాలనీల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ప్రధానంగా వెంకటాపురం గ్రామంపై తీవ్ర ప్రభావం పడింది. 5.30 గంటలకల్లా అధికార యంత్రాంగం ఘటన స్థలికి చేరుకుంది. ► గురువారం ఉదయం 9.30 గంటల సమయానికి 122.5 పీపీఎం స్థాయిలో గ్యాస్ గాలిలో ఉంది. ఇది పూర్తిగా తగ్గాలి. దీనికి 24 గంటల సమయం పట్టవచ్చు. దీనివల్ల శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో పాటు చర్మ వ్యాధుల ప్రమాదం ఉంటుంది. ► గ్యాస్ ప్రభావం పరిధి 1.5 కి.మీ నుంచి 2 కి.మీ ఉంటుంది. మధ్యాహ్నం సమయానికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. గ్యాస్ లీకేజీ ప్రదేశంలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి నీటిని వెదజల్లుతున్నాం. ఈ ప్రమాదం కారణంగా పది మంది చనిపోయారు. 22 పశువులు మృత్యువాత పడ్డాయి.(పెద్దాయనా.. ఎలా ఉన్నావు?) మరోసారి నిపుణులతో అధ్యయనం ► బాధిత ప్రజలకు పునరావాసం కల్పించే బాధ్యత జిల్లా కలెక్టర్ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వాతావరణంలో గ్యాస్ విష ప్రభావాన్ని మరోసారి నిపుణులతో అధ్యయనం చేయించాలని, పూర్తిగా సురక్షితమని తేలిన తర్వాతే బాధితులను ఇళ్లకు పంపాలన్నారు.షెల్టర్లను ఏర్పాటు చేసి, మంచి భోజనం అందించాలన్నారు. గ్రామాల్లో ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని సూచించారు. ► ప్రమాద సంఘటన సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన స్పందించిన జిల్లా కలెక్టర్ వినయ్చంద్, పోలీసు అధికారులను సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. సైరన్ ఎందుకు మోగలేదు? ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై ముఖ్యమంత్రి ఆగ్రహం విష వాయువు లీకేజీ దుర్ఘటనకు సంబంధించి సైరన్ ఎందుకు మోగలేదని ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన కేజీహెచ్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన అనంతరం విశాఖ ఎయిర్పోర్ట్లో ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం, మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెల్లవారుజామున స్టైరీన్ గ్యాస్ లీక్ అయినప్పుడు సమీప గ్రామాల ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయలేదని ఆరా తీశారు. ఆ సమయంలో అలారం ఎందుకు మొగలేదని ప్రశ్నించారు. దీనిపై ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని సీఎస్ నీలం సాహ్నిని సీఎం ఆదేశించారు. ప్రమాద ప్రభావిత ఐదు గ్రామాల ప్రజల సంరక్షణ బాధ్యతను ఐదుగురు మంత్రులు ఆళ్లనాని, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాసులకు అప్పగించారు. (విశాఖ విషాదం) -
విశాఖపై విషవాయు పంజా
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు తీరాన కొలువైవున్న సుందర విశాఖ నగరం వెలుపల వేకువజామున ఎల్జీ పాలిమార్స్ కర్మాగారం నుంచి వెలువడిన విషవాయువు పంజా విసిరింది. ఏం జరుగుతు న్నదో తెలిసేలోగానే కొందరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వందలమంది కళ్ల మంటలు, ఊపిరి తీసుకోలేకపోవడం, వాంతులు వగైరా లక్షణాలతో అనారోగ్యం పాలయ్యారు. వీరిలో కొందరు ఆసుపత్రిలో మరణించారు. సహాయచర్యల్లో పాల్గొంటున్న పోలీసు సిబ్బంది, ఇతరులు సైతం ఈ విషవాయువు ప్రభావానికి లోనయి ఆసుపత్రిలో చేరాల్సివచ్చింది. సుదీర్ఘ లాక్డౌన్ అనంతరం కర్మాగారాన్ని తెరవడానికి ఎల్జీ పాలిమార్స్ సంస్థ మొదలుపెట్టిన ప్రయత్నాలు చివరకు ఈ ప్రమాదాన్ని తెచ్చాయి. ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే ప్రభుత్వ యంత్రాంగం యావత్తూ కదిలిన తీరు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ నగరానికి చేరుకుని బాధితులను పరా మర్శించి ధైర్యం చెప్పడం, ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారం ప్రక టించడంతో పాటు వేరు వేరు స్థాయిల్లో అనారోగ్యం పాలైన వారికి రూ. 10 లక్షలు మొదలుకొని రూ. 10 వేల వరకూ పరిహారం ఇస్తామనడం కొనియాడదగింది. అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నట్టు కనబడే ఈ ప్రపంచంలో... ఆధునికంగా మారడానికి తోడ్ప డుతున్నాయని చెప్పే అనేకానేక ఉపకరణాల ఉత్పత్తిలో ఎన్ని ప్రమాదాలు పొంచివున్నాయో చెప్ప డానికి విశాఖ విషాదం తాజా ఉదాహరణ. మన దేశంలో విషవాయువు లీకైన ప్రతిసారీ 1984 డిసెం బర్ 2 వేకువజామున భోపాల్ నగరంలోని యూనియన్ కార్బయిడ్లో మిథైల్ ఐసోసైనేట్(ఎంఐసీ) వాయువు వెలువడిన ఉదంతం స్ఫురణకొస్తుంది. వేలమంది ప్రాణాలు బలిగొని, లక్షలాదిమందిని శాశ్వతంగా వ్యాధిగ్రస్తుల్ని చేసిన ఆ దుర్ఘటన... లాభాపేక్ష మినహా మరేది పట్టించుకోని బహుళజాతి సంస్థల పోకడలను, భద్రతా ప్రమాణాలు పాటించడంలో వాటి నిర్లక్ష్యాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆనాటి దుర్ఘటనలో పసిపిల్లలతోసహా 4,000 మంది కన్నుమూయగా, దాదాపు అయిదు లక్షలమంది పలు రకాలుగా వ్యాధిగ్రస్తులయ్యారు. అది జరిగి 35 ఏళ్లు గడుస్తున్నా పరిశ్రమల తీరు మెరుగుపడలే దని తాజా ఉదంతం వెల్లడిస్తోంది. ఛత్తీస్గఢ్లోని భిలాయ్ ఉక్కు కర్మాగారంలో 2014 జూన్లో జరి గిన విషవాయువు లీక్ పర్యవసానంగా ఆరుగురు మరణించారు. 40 మంది గాయపడ్డారు. మిథేన్ గ్యాస్ పైప్లైన్ బద్దలై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అదే ప్లాంటులో రెండేళ్లక్రితం పైప్లైన్ పేలడం వల్ల మరోసారి ప్రమాదం జరిగి తొమ్మిదిమంది చనిపోయారు. 2014లో ఆంధ్రప్రదేశ్లోని కోన సీమలో ఉన్న నగరం గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్లు లీకై 17మంది బలయ్యారు. ఎందరో తీవ్ర గాయాలపాలయ్యారు. పైప్లైన్ల నుంచి గ్యాస్ లీకవుతున్నదని వచ్చిన ఫిర్యాదులను పట్టించు కోకపోవడంవల్ల ఈ దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీలోని తుగ్లకాబాద్లో ఒక రసాయన డిపో నుంచి విషవాయువు లీకై 470 మంది బడి పిల్లలు అస్వస్థులయ్యారు. ఇలా పలు దుర్ఘటనలు జరుగుతున్నా, జన నష్టం సంభవిస్తున్నా అప్రమత్తంగా వ్యవహరించడంలో పరిశ్రమలు దారుణంగా విఫలమవు తున్నాయి. వాటì ని పర్యవేక్షించాల్సిన యంత్రాంగాలు సమర్థవంతంగా పని చేయడం లేదు. లాక్డౌన్ కారణంగా మార్చి 24న మూతబడిన ఎల్జీ పాలిమార్స్ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెసులుబాట్లతో తిరిగి ఉత్పత్తి ప్రారంభించేందుకు చేసిన ప్రయత్నాలు ఈ విషాదానికి కారణం. ఫ్యాక్టరీ ఆవరణలో వున్న స్టోరేజీ ట్యాంక్లో 1,800 టన్నుల స్టెరీన్ నిల్వలు వున్నాయని, పరిశ్రమ మూతబడేనాటికి ట్యాంక్లో వుండిపోయిన ఆ నిక్షేపాలు ఉష్ణోగ్రత మార్పుల కారణంగా పాలిమరైజేషన్కు లోనయి, ఆవిరిగా మారాయని, అది లీకై ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని ఆ కంపెనీ ప్రతినిధి చెబుతున్నారు. దీంతోపాటు యాజమాన్యం అనేక ప్రశ్నలకు బదులీయాల్సివుంది. విషవాయువు లీకైనప్పుడు అప్రమత్తం చేస్తూ మోగాల్సిన అలారం ఏమైనట్టు? ఈ లాక్డౌన్ సమ యంలో అది కూడా పనికిరాకుండా పోయిందా? పరిశ్రమ మూతబడ్డాక ఇతరేతర సిబ్బంది వెళ్లిపో యినా, ట్యాంక్లో వున్న నిల్వల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిసిన నిపుణులు తమ విధులు కొనసాగించారా? అసలు ఈ అంశంపై పరిశ్రమ యాజమాన్యం దృష్టి పెట్టిందా? వీటితోపాటు ఈ ట్యాంక్ నుంచి తొలిసారి గ్యాస్ లీకయింది గురువారం వేకువజామునేనా, అంతకు కొద్దిరోజులముందే అది మొదలైందా అన్న అంశాలు కూడా తేలాలి. గ్యాస్ స్టోరేజీ ట్యాంకును తనిఖీ చేస్తున్న సిబ్బంది అందుకు సంబంధించిన అర్హతలున్నవారా కాదా అన్నది తెలియాలి. ఇలాంటి విషాద సమయాల్లో సహజంగానే అనేక సందేహాలు, అనుమానాలు వస్తాయి. ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా, దుర్బుద్ధితో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా అన్నది అందులో ఒకటి. పౌరుల ప్రాణాలతో ముడిపడివున్న దుస్సంఘటనలు జరిగినప్పుడు దేన్నీ వదలకుండా విచారణ జరిపించడం తప్పని సరి. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు గనుక అన్ని అంశాలూ వెలుగులోకొస్తాయని భావించాలి. ఈ విషాద ఘటన సమయంలో విశాఖ యువత, పోలీసు సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీ ఆర్ఎఫ్ సిబ్బంది చేసిన సేవలు కొనియాడదగినవి. వీరందరి చొరవ, సాధారణ పౌరుల ప్రాణాలు కాపాడాలన్న తపన దేశానికంతకూ ఆదర్శవంతం. ఉషోదయ వేళకే వీరంతా 5,000 మంది పౌరుల్ని ఆసుపత్రులకు, సహాయశిబిరాలకు తరలించి శభాష్ అనిపించుకున్నారు. సంక్షోభం చుట్టుముట్టినప్పుడు స్వచ్ఛందంగా తరలివచ్చి స్పందించే తీరే సమాజ ఔన్నత్యాన్ని పట్టిచూపుతుంది. దురదృష్టవశాత్తూ ఇదే రోజు ఛత్తీస్గఢ్, తమిళనాడుల్లో కూడా రెండు వేర్వేరు దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. సీఎం జగన్మోహన్రెడ్డి విశాఖ విషాద ఉదంతంలో స్పందించిన తీరు ప్రశంసనీయం. ఈ ఘటనపై నివేదిక అందాక ప్రజల ప్రాణాలకు పూర్తి భరోసా కలిగే విధంగా ఆయన చర్యలు తీసుకోగలరన్న విశ్వాసం అందరికీ ఏర్పడింది. -
ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై కేసు
విశాఖపట్నం: విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో ఎల్జీ పాలిమర్స్ ఇండియా యాజమాన్యంపై గోపాలపట్నం పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. గోపాలపట్నం వీఆర్వో ఎంవీ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 278, 284, 285, 337, 338, 304 తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా గురువారం వేకువజామున ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో రసాయన వాయువు లీకైన విషయం విదితమే. స్టిరెన్ను నిల్వ చేసే కంటైనర్ పాతబడి పోయిందని.. దాని నిర్వహణ సరిగా లేనందు వల్లే గ్యాస్ లీకైందని సెంటర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్ట్ షీట్ పేర్కొంది. (గ్యాస్ లీకేజ్ : కొరియా రాయబారి స్పందన) ఇక ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించగా.. దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. వారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. బాధితులను ఆస్పత్రిలో పరామర్శించారు. వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.కోటి చొప్పున ఆర్థిక సాయం అందచేస్తామని భరోసా ఇచ్చారు.(మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం: సీఎం జగన్) -
కరోనా: ‘ఆ కమిటీ మంచి ఫలితాలను ఇస్తుంది’
సాక్షి, విశాఖపట్నం: కరోనా మహమ్మారి కట్టడిలో అధికారుల పనితీరు ప్రశంసనీయమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా కట్టడి కోసం కలెక్టర్ వినయ్ చంద్ ఏర్పాటు చేసిన 21 కమిటీలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. విశాఖ జిల్లాలో రెడ్జోన్లపకై మరింత దృష్టి సారించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రావోద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు చెప్పారు. పేదల కోసం ప్రభుత్వం నుంచి మరిన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టామన్నారు. పేదలను అన్ని విధాలా ఆదుకోవాలిని సీఎం జగన్ సూచించారని మంత్రి పేర్కొన్నారు. -
నాడు టీడీపీ ట్రస్టు బోర్డుగా మన్సాస్!
సాక్షి, అమరావతి: సింహాచలం దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్పర్సన్గా, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మాన్సాస్) ట్రస్ట్ చైర్మన్గా ఉండే హక్కు మహిళలకు లేదంటూ మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు వాదించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును దేస్థానం ట్రస్టు బోర్డు, మన్సాన్ చైర్పర్సన్గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఇటీవల ప్రమాణం స్వీకారం చేసి.. తనకు ఇంతటి బృహత్తర బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ పరిణామాలపై అశోక్ గజపతి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో సంచయితకు కీలక బాధ్యతలు అప్పగించడాన్ని సహించలేకపోతున్న ఆయనకు గతంలో జరిగిన పరిణామాలు గుర్తుకురావడం లేదా అంటూ పలువురు విమర్శిస్తున్నారు. (సంచలనమైన సీఎం జగన్ నిర్ణయం ) కాగా 2016 ఏప్రిల్లో మాన్సాస్ వ్యవహారం టీడీపీ చేతిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ చెరుకూరి కుటుంబరావు, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ కులపతి ఐవీ రావులను ట్రస్టు సభ్యులుగా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం 2016 ఏప్రిల్ 7న జీవో 139 జారీ చేసింది. ఆ తర్వాత 2017 ఏప్రిల్ 27న వారిద్దరిన్నీ కొనసాగిస్తూనే... జీవో నంబర్ 155 ద్వారా అశోక్గజపతి కుమార్తె అదితి విజయలక్ష్మిని కూడా బోర్డు సభ్యురాలిగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. అయితే అప్పుడు పూసపాటి వారసురాలైన ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయితను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ ఇష్టానుసారం వ్యవహరించారు. ఈ క్రమంలో సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచ మాల భూ సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు వేసిన ప్రభుత్వం... తాజాగా ట్రస్టు చైర్పర్సన్గా సంచయితను నియమించింది. అదే విధంగా... అశోక్ గజతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మిని కూడా సభ్యురాలిని చేసి.. ఆమెతో పాటు మొత్తంగా ఇదే కుటుంబానికి చెందిన ముగ్గురికి మాన్సాస్ ట్రస్టుబోర్డులో స్థానం కల్పించింది. -
ఉరిమిన ఉత్తరాంధ్ర
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ వద్దంటున్న ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై ఉత్తరాంధ్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి అవరోధంగా మారుతున్నారంటూ మండిపడింది. విశాఖ ఎయిర్పోర్టు నుంచి బయటకు రానీయకుండా వివిధ వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు అడ్డుకున్నారు. గురువారం వేల సంఖ్యలో విమానాశ్రయం వద్దకు చేరుకున్న ప్రజలు చంద్రబాబు వాహనాన్ని ముందుకు కదలనీయకుండా నిలిపివేశారు. బాబు వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో 8 గంటల పాటు హైడ్రామా నడిపిన చంద్రబాబు..అక్కడినుంచే హైదరాబాద్ విమానంలో వెనుదిరిగారు. మిన్నంటిన బాబు వ్యతిరేక నినాదాలు చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్న మహిళలు, ప్రజాసంఘాల నేతలను అడ్డుకుంటున్న పోలీసులు విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత తొలిసారిగా గురువారం చంద్రబాబు విశాఖ, విజయనగరం జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు విజయవాడ నుంచి ఉదయం 11.20 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అయితే చంద్రబాబు పర్యటన గురించి ముందే తెలుసుకున్న వివిధ వర్గాల ప్రజలు, ప్రజాసంఘాలు తమ నిరసన తెలియజేయాలని తీర్మానించుకున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచే విమానాశ్రయ పరిసరాలకు నిరసనకారులు చేరుకున్నారు. 11.30 సమయంలో చంద్రబాబు ఎయిర్పోర్టు నుంచి బయటకు రాగానే.. విశాఖ కార్యనిర్వాహక రాజధానిని వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న ‘చంద్రబాబు గోబ్యాక్’ అనే నినాదాలు మారుమోగాయి. బాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు అక్కడికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు కాన్వాయ్ని పెద్దసంఖ్యలో మహిళలు సహా ఆందోళనకారులు చుట్టుముట్టారు. చంద్రబాబు బయటికి వచ్చి గంట సేపు గడిచినా పరిస్థితిలో మార్పులేకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. లాఠీలతో నిరసనకారుల్ని చెదరగొట్టి నెమ్మదిగా కాన్వాయ్ని ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేశారు. అయినా ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం, వాహనాలకు అడ్డంగా పడుకోవడంతో చంద్రబాబు కాన్వాయ్ అంగుళం కూడా కదలలేని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు వద్దన్నా కాన్వాయ్ దిగిన చంద్రబాబు ఈ దశలో టీడీపీ ఎమ్మెల్యేలతో కలసి నడిచి వెళ్తానంటూ పోలీసులు వారిస్తున్నా వినకుండా వాహనం దిగిన చంద్రబాబు హైడ్రామాకు తెరతీశారు. రెండడుగులు వెయ్యగానే దాదాపు అర కిలోమీటరు మేర నిలుచున్న ప్రజలంతా ఒక్కసారిగా కాన్వాయ్పైకి దూసుకొచ్చారు. ఆ సమయంలోనే కాన్వాయ్ వాహనంపై కొందరు చెప్పులు. కోడిగుడ్లు, టమోటాలు విసిరేశారు. చంద్రబాబుకు రక్షణ కవచంగా నిలిచిన పోలీసులు ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు. పోలీసుల లాఠీ చార్జీలో పలువురు గాయపడ్డారు. వాహనంలోనే కూర్చోవాలనీ, నడిచివెళ్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చంద్రబాబుని పోలీసులు హెచ్చరించారు. విశాఖకు జై కొడితేనే వెళ్లనిస్తామన్న ప్రజలు.. మరోవైపు ప్రజలు తమ నిరసన కొనసాగించారు. ‘ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు’, తదితర నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. విశాఖను కార్యానిర్వాహక రాజధానిగా వద్దన్న చంద్రబాబు.. విశాఖలో ఎలా పర్యటిస్తారంటూ నిలదీశారు. విశాఖకు జై కొడితేనే ముందుకు వెళ్లనిస్తామనీ ప్రజా సంఘాలు స్పష్టం చేశాయి. ప్రజాగ్రహం తీవ్రమవుతూ, పరిస్థితి చెయ్యి దాటిపోతున్న నేపథ్యంలో వెనక్కి వెళ్లిపోవాలంటూ చంద్రబాబుకు పోలీసులు సూచించారు. భారీ భద్రత నడుమ చంద్రబాబు తిరుగు ప్రయాణం పోలీసులపై చంద్రబాబు మండిపాటు తనను వెనక్కి వెళ్లాలన్న పోలీసులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి కాన్వాయ్ దిగి రోడ్డుపై బైఠాయించి హడావిడి సృష్టించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వేలాది మంది ప్రజలు ఒక్కసారిగా చంద్రబాబుకి వ్యతిరేకంగా నినదించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో కాన్వాయ్లోకి ఎక్కాలని చంద్రబాబుకు చెప్పిన పోలీసులు.. పశ్చిమ జోన్ ఏసీపీ పేరుతో సెక్షన్ 151 కింద నోటీసు ఇచ్చి.. భద్రతా కారణాల దృష్ట్యా ముందస్తుగా అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. కాన్వాయ్లోకి ఎక్కించి ఎయిర్పోర్టు ప్రవేశ ద్వారం గుండా వీఐపీ లాంజ్లోకి పంపించారు. అనంతరం రాత్రి 7.50 గంటల సమయంలో హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానం ఎక్కించారు. కాగా చంద్రబాబు ఎయిర్పోర్టులోకి వెళ్లే వరకూ ఉత్తరాంధ్ర ప్రజలు గో బ్యాక్ బాబూ.., బై బై బాబూ.. మళ్ళీ రాకు బాబు అనే నినాదాలు చేస్తూనే ఉన్నారు. మీ సంగతి తేలుస్తా.. పోలీసుల్ని దూషించిన చంద్రబాబు హై డ్రామా క్రమంలో చంద్రబాబు పోలీసులపై పలుమార్లు విరుచుకుపడ్డారు. అచ్చెన్నాయుడు కూడా ఇష్టం వచ్చినట్లు దూషించారు. తాను అనుమతి తీసుకొనే పర్యటనకు వచ్చాననీ, అయినా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ‘40 సంవత్సరాల అనుభవం ఉన్న నన్ను ఇబ్బంది పెడతారా.. మీ సంగతి తేలుస్తా.. నన్ను ముట్టుకునే అర్హత మీకు లేదు.. రేపు రానియ్యరు.. ఎల్లుండి వస్తా.. ఎల్లుండి రానియ్యరు.. నెక్స్ట్ వస్తా.. ఐయామ్ నాట్ గోయింగ్ టూ లీవ్ యూ.. ఎవ్వరినీ వదలను’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బాబును వెనక్కిపంపాం: పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ప్రజాగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని, శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతోనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును సురక్షితంగా హైదరాబాద్కు పంపామని విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా చెప్పారు. నౌకాదళ పర్యవేక్షణలోని విశాఖ ఎయిర్పోర్ట్లో గంటల తరబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే చంద్రబాబును వెనక్కి పంపాల్సి వచ్చిందని అన్నారు. చంద్రబాబు భద్రతే ప్రధానాంశంగా భావించామని, పార్టీలు, రాజకీయాలకతీతంగానే పోలీసులు వ్యవహరించారని స్పష్టం చేశారు. చంద్రబాబు రాక సందర్భంగా జరిగిన ఎయిర్పోర్ట్ ఎపిసోడ్లో ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎక్కడా కనిపించక పోవడం గమనార్హం. నాపై చెప్పులు వేస్తుంటే పోలీసులు గాడిదలు కాస్తున్నారా? ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మండిపాటు రాష్ట్రంలో 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసి, ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్న తనపై చెప్పులు, కోడి గుడ్లు, వాటర్బాటిల్స్తో దాడి చేస్తుంటే పోలీసులు గాడిదలు కాస్తున్నారా.. అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు పూర్తిగా విఘాతం కలుగుతోందని విమర్శించారు. గురువారం ఆయన విశాఖ ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడారు. తనపై దాడి చేస్తుంటే చూస్తూ ఉన్న వీరు పోలీసులేనా.. పోలీస్ డ్రెస్ వేసుకున్న వేరెవరైనా వచ్చారా.. అని మండిపడ్డారు. చట్టపరంగా అనుమతి ఉన్నా, పోలీసులు తనను అరెస్ట్ చేయడం పట్ల చట్టపరంగా వారిపై చర్యలు తీసుకునేలా చేస్తానన్నారు. ఏ చట్టాన్ని అనుసరించి పోలీసులు తనను అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలన్నారు. పోలీసులందరూ బాడీ కెమెరాలు పెట్టుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా వీరు పాటించలేదన్నారు. పోలీసులు లిఖిత పూర్వకంగా రాసిస్తే.. వారు ఎక్కడికెళ్లమంటే అక్కడికి వెళతానన్నారు. పులివెందుల నుంచి రౌడీలను తెచ్చారు విశాఖ ప్రాంత ప్రజలు దాడులకు పాల్పడరని, ఇది చాలా ప్రశాంతమైన వాతావరణమని, ఇక్కడికి పులివెందుల నుంచి రౌడీలను తీసుకొచ్చి దాడులు చేయించారని చంద్రబాబు ఆరోపించారు. 2014 ఎన్నికల్లో పంచెలు కట్టుకుని కడప నుంచి రౌడీలు వస్తే వైఎస్ విజయలక్ష్మిని ఓడించారన్నారు. 40 ఏళ్లగా తాను ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని, భవిష్యత్తులో కూడా ఎప్పుడూ చూడబోనన్నారు. ఓ ఉన్మాది ముఖ్యమంత్రి అయితే ఇలాంటి వింతలు జరుగుతాయన్నారు. ఇంతమంది పోలీసులు ఏం చేశారు? జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న తన చుట్టూ 2 వేలకు పైగా పోలీసులు ఉన్నప్పటికీ ప్రేక్షక పాత్రే వహించారు తప్ప వారు చేసిందేమీ లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆత్మకూర్లో కూడా ఇదే విధంగా తనను అడ్డుకున్నారని, అప్పుడు హ్యూమన్ రైట్ కమిషన్కు ఫిర్యాదు చేశానన్నారు. -
ఏపీ: సీనియర్ ఐఏఎస్లకు పదోన్నతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ముఖ్య కార్యదర్శులు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా... కార్యదర్శులు ముఖ్యకార్యదర్శులుగా పదోన్నతి పొందారు. మరికొందరు సంయుక్త కార్యదర్శులుగా పనిచేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీలుగా ఉన్న రజత్ భార్గవ్, జవహర్రెడ్డి, అనంతరాము, ప్రవీణ్కుమార్... స్పెషల్ చీఫ్ సెక్రటరీలుగా పదోన్నతులు పొందారు. అదే విధంగా... సెక్రటరీ హోదాలో ఉన్న జి.జయలక్ష్మి, ఉషారాణి, రామ్గోపాల్కు ప్రిన్సిపల్ సెక్రటరీలుగా... జాయింట్ సెక్రటరీలుగా ఉన్న ముత్యాలరాజు, బసంత్కుమార్ పదోన్నతి పొందారు. ఇదిలా ఉండగా... ఇంటర్ క్యాడర్ ట్రాన్స్ఫర్ల ద్వారా ఏపీకి ఇద్దరు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో నాగాలాండ్, యూపీ క్యాడర్కు చెందిన.. మంజిర్ జిలానా సమూన్, తమీమ్ అన్సారియాకు విశాఖలో పోస్టింగ్ లభించింది. వీఎంఆర్డీఏ అదనపు కమిషనర్గా మంజిర్ జిలానీ సమూన్, జీవీఎంసీ అదనపు కమిషనర్గా తమీమ్ అన్సారియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
దూసుకుపోతున్న విశాఖ నగరం
విశ్వ నగరి విశాఖ స్వచ్ఛత విషయంలోనూ అత్యున్నతమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రజలు భుజానికెత్తుకున్నారు. సిటిజన్ ఫీడ్బ్యాక్ విషయంలో ఇన్నాళ్లూ వెనుకబడిన విశాఖ నగరం ఇప్పుడు ప్రజా చైతన్యంతో ఏకంగా మొదటి స్థానానికి చేరుకుంది. ఈ నెల 31 వరకూ ప్రజలు ఇదే రీతిలో స్పందించి ఈ స్థానాన్ని నిలబెడితే టాప్–10లో నిలుస్తుంది. మరోవైపు ఇప్పటి వరకూ వచ్చిన ప్రాతిపదికల ఆధారంగా చూస్తే రాష్ట్రంలో నంబర్ వన్గా విశాఖ నగరం ఉంది. అదే దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఏడో స్థానంలో నిలిచింది. మొత్తంగా వైజాగ్ స్వచ్ఛ సర్వేక్షణ్–2020లో అప్రతిహతంగా దూసుకుపోవాలంటే ప్రజలు ఇదే తరహాలో ప్రోత్సహించాలి. సాక్షి, విశాఖపట్నం: స్వచ్ఛ సర్వేక్షణ్లో ఢిల్లీ బృందం చేపట్టే కీలకమైన ప్రత్యక్ష పరిశీలన ఈ నెల 31లోగా జరుగుతుంది. విశాఖ నగరానికి ఈ నెల 10లోపు వచ్చే అవకాశం ఉందని జీవీఎంసీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ బృందం అడిగే ఎనిమిది కీలక ప్రశ్నలకు సరైన సమాధానాలిస్తే మహా నగరం మంచి ర్యాంకుని సాధిస్తుంది. ఆ ప్రశ్నలివీ.. 1. స్వచ్ఛ సర్వేక్షణ్లో మీ సిటీ పాల్గొంటుందని మీకు తెలుసా..? • అవునని సమాధానం వస్తే అత్యధిక మార్కులు వస్తాయి. 2). మీ పరిసరాల పరిశుభ్రత స్థాయిపై మీ సిటీకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు.? • గరిష్టంగా 10 మార్కులు ఇవ్వవచ్చు. 10కి పది ఇస్తే ర్యాంకుకి ఉపయోగపడుతుంది. 3). వాణిజ్య, పబ్లిక్ ప్రాంతాల్లో శుభ్రత స్థాయిపై మీ సిటీకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు.? • 10 మార్కులు వరకూ ఇవ్వవచ్చు. 10కి పది ఇస్తే ర్యాంకు సాధించేందుకు వీలవుతుంది. 4). మీ చెత్త పట్టుకెళ్లేవారు తడి పొడి చెత్త వేరుగా ఇవ్వమని మిమ్మల్ని అడుగుతున్నారా.? • అవును.. ప్రతి రోజూ అడుగుతున్నారు అని చెబితే ఉపయుక్తంగా ఉంటుంది. 5). మీ సిటీలోని రోడ్డు డివైడర్స్ పచ్చదనం పెంపొందించేలా మొక్కలతో కవర్ చేశారా.? • అవును, అన్ని రోడ్లు డివైడర్లు గ్రీనరీతో నిండాయి అని చెబితే ర్యాంకుకి ఉపయోగపడుతుంది. 6). మీ సిటీలోని పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్స్ పరిశుభ్రతకు ఎన్ని మార్కులు ఇస్తారు.? • 10 మార్కులు వరకూ ఇవ్వవచ్చు. 10కి పది ఇస్తే ర్యాంకు సాధించేందుకు వీలవుతుంది. 7). మీ సిటీ ఓడీఎఫ్(బహిరంగ మల విసర్జన రహిత) స్థితి మీకు తెలుసా.? • ఇటీవలే జీవీఎంసీ ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ నగరంగా ధ్రువీకరించబడింది. కాబట్టి.. ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ నగరంగా చెబితే చాలు. 8). మీ సిటీ గార్బేజ్ ఫ్రీ సిటీ స్టార్ రేటింగ్ స్థితి మీకు తెలుసా.? •జీవీఎంసీ 5 స్టార్ రేటింగ్ నగరంగా గుర్తింపు పొందేందుకు దరఖాస్తు చేసుకుంది. ►ఇప్పటివరకు స్వచ్ఛతలో రాష్ట్ర స్థాయి ర్యాంకు– 1 ►ఇప్పటివరకు స్వచ్ఛతలో దేశ స్థాయిలో ర్యాంకు– 7 ►ఓడీఎఫ్ ప్లస్ప్లస్ నగరంగా ధ్రువపత్రం సాధించిన జీవీఎంసీ ►గార్బేజ్ ఫ్రీ సిటీగా 5 స్టార్ రేటింగ్కు దరఖాస్తు ప్రజలే వారధులు.. స్వచ్ఛతలో నగరాన్ని అత్యుత్తమ స్థాయిలో నిలబెట్టేందుకు జీవీఎంసీ తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రజలు కూడా మంచి సహకారం అందిస్తున్నారు. కీలకమైన ప్రశ్నలకు మంచి సమాధానాలు ఇస్తే.. వైజాగ్ మంచి ర్యాంకు సాధించగలదు. కమిషనర్ సూచనలతో నగర వ్యాప్తంగా 8 ప్రశ్నలపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రజల సహకారం ఈ నెల 31 వరకూ అందిస్తే.. టాప్–10లోకి దూసుకుపోతాం. – విశ్వనాథ సన్యాసిరావు, జీవీఎంసీ అదనపు కమిషనర్ -
‘మరో 30 ఏళ్లు సీఎంగా జగన్ కొనసాగాలి’
సాక్షి, విశాఖపట్నం: అధికార వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందుతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ పరిపాలనా రాజధానిగా ప్రకటించబడితే చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. కుల, మతాలకు అతీతంగా రాష్ట్రమంతా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షిస్తున్నారన్నారు. శనివారమిక్కడ వైఎస్సార్సీపీ కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డి... భారీ కేక్ కట్చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గత ఆరు నెలలలో మంచి పరిపాలన అందించారని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ వ్యక్తిత్వంపై టీడీపీ దుష్ప్రచారం చేసిందని... అయితే ఆయన ఎంత మృదు స్వభావో.. ఎంత మంచి వ్యక్తో ప్రజలు దగ్గరగా చూశారన్నారు. రాష్ట్రానికి 30 ఏళ్లపాటు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు. ఇక సీఎం జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ నాయకులు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తిప్పల నాగిరెడ్డి, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, సిటీ అధ్యక్షుడు కృష్ణశ్రీనివాస యాదవ్, మల్లా విజయప్రసాద్, అక్కరమాని విజయనిర్మల, కెకె రాజు, కోలా గురువులు, వరుదు కళ్యాణి, గరికిన గౌరి, రొంగల జగన్నాథం, కొయ్యా ప్రసాదరెడ్డి, ఫక్కి దివాకర్, జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. -
శివసేన మోసం చేసింది: కిషన్రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: వచ్చే ఏడాది భారత్లో ‘నో మనీ ఫర్ టెర్రర్’ మీద అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ హోం మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారమిక్కడ ఆయన మాట్లాడుతూ... ‘ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకూడదు’ అనే నినాదంతో మెల్బోర్న్లో సమావేశం జరిగిందని తెలిపారు. 71 దేశాలకు చెందిన అనేక అంతర్జాతీయ సంస్థలు ఈ సమావేశాల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అదే విధంగా ఉగ్రవాదులకు సహాయం చేసే బ్యాంకులేవైనా సరే వాటిపై చర్యలు తీసుకునేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో దాయాది దేశం పాకిస్తాన్ తీరును ఆయన ప్రస్తావించారు. ‘పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. భారత్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడానికి డ్రగ్స్ విక్రయించి ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తుంది. దొంగ నోట్లను కూడా ముద్రించి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ కారణంగా మనం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. తీర్పును అందరూ స్వాగతించారు.. నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘సబ్ కె సాథ్ సబ్ కె విశ్వాస్’ పేరిట అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి.. అన్నివర్గాల ప్రజలు విశ్వాసం పొందుతుందని కిషన్రెడ్డి అన్నారు. ‘కాంగ్రెస్ సుస్థిరమైన పాలన అందించలేకపోయింది. ఏనాడు కూడా ప్రజల ఏకాభిప్రాయం సాధించలేకపోయింది. అయితే గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రామజన్మ భూమి అంశం పట్ల కేంద్రం తన వైఖరిని, ప్రతిపాదనను ధైర్యంగా సుప్రీంకోర్టు ముందుంచింది. అయోధ్య అంశంపై తీర్పును అన్ని వర్గాలు స్వాగతించాయి’ అని పేర్కొన్నారు. అదే విధంగా అభివృద్ధి సాధించే దిశగా కేంద్రం గట్టిగా కృషి చేస్తోందని తెలిపారు. ఆహార భద్రత, విద్యాహక్కును సమర్థవంతగా అమలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా కేంద్ర మంత్రిగా రెండు తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. రానున్న రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. శివసేన మోసం చేసింది.. ‘మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సివచ్చింది. బీజేపీ పొత్తు ధర్మాన్ని పాటించి శివసేనతో పొత్తు పెట్టుకుంది. అయితే శివసేన మోసం చేసింది. నిజానికి బీజేపీ స్వతంత్రంగా పోటీ చేసి ఉంటే అత్యధిక స్థానాల్లో గెలిచి ఉండేది’ అని కిషన్రెడ్డి మహా రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ‘స్కూళ్ళు తెరిచాం, పర్యాటకులను అనుమతించాం. 90 శాతం జమ్మూ కశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. కేవలం18 పోలీసు స్టేషన్ల పరిధిలో ఉద్రిక్త వాతావరణం ఉంద’ని చెప్పారు. -
విశాఖ భూ కుంభకోణాలపై సిట్ విచారణ షురూ
సాక్షి, విశాఖపట్టణం : టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలను విచారించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ శుక్రవారం నుంచి తన విచారణను ప్రారంభించింది. విచారణ బృందానికి మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ విజయ్ కుమార్ నేతృత్వం వహిస్తుండగా, మాజీ ఐఏఎస్ అధికారిణి అనూరాధ, రిటైర్డ్ జడ్జి భాస్కరరావు సభ్యులుగా ఉన్నారు. అక్టోబరు 26న సిట్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు సిరిపురంలోని వుడా చిల్డ్రన్స్ ఎరీనా థియేటర్ వద్ద బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఫిర్యాదుల స్వీకరణకు పదమూడు బృందాలను నియమించగా, ఒక్కో బృందంలో డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు సహాయకులు ఉంటారు. బాధితులు వివరాలను సిట్ రూపొందించిన నిర్ణీత ఫార్మాట్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఫార్మాట్తో పాటు ఆధారాలను సిట్ ఏర్పాటు చేసిన టేబుల్ వద్ద అందజేయాలి. బాధితులకు సహాయంగా ఆరు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. 13 మండలాలకు ఒకటి చొప్పున 13 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారు దరఖాస్తుతో పాటు భూమికి సంబంధించిన దస్తావేజుల జిరాక్స్ కాపీలను జతచేయాలి. ఒరిజినల్స్ సైతం తీసుకెళ్లి, అధికారులకు చూపించాలి. నేరుగా ఫిర్యాదు చేయడానికి ఇష్టపడని వారికోసం ప్రత్యేకంగా ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలోనే కాకుండా దేశ, విదేశాల్లో ఉండే ఎన్నారైల కోసం vizagcollectorate.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదులను స్వీకరించనున్నారు. బాధితుల అనుమానాల నివృత్తికి 1800-42500002, 0891-2590100 నంబర్లను ఏర్పాటు చేశారు. -
జూపార్క్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం -మంత్రి
విశాఖపట్నం : విశాఖ ఇందిరా గాంధీ జూపార్క్ లో 65వ వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ పాల్గొన్నారు. రూ. 70 లక్షల నిధులతో అభివృద్ది చేయనున్న ఏనుగుల సంరక్షణ కేంద్రానికి వీరు శంఖుస్థాపన చేశారు. మంగుళూరు నుంచి తీసుకొచ్చిన రెండు కొత్త పులులను జూలో సందర్శకులు చూడడానికి అవకాశం కల్పించారు. వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల ముగింపు వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ.. విశాఖ జూ పార్క్ సిటీకి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి విశాఖకు వచ్చే పర్యాటకులు జూ పార్క్ని సందర్శించేలా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు, రాబోయే రోజుల్లో సీఎంతో మాట్లాడి జూపార్క్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణ సమతుల్యతలో భాగంగా విశాఖలో కోటి మొక్కలు నాటే ప్రణాళికలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ.. దేశంలోనే విశాఖ జూ కి ఓ ప్రత్యేకత ఉంది. 625 ఎకరాలలో సహజ సిద్దంగా ఏర్పడిన జూ ఇది. హుదూద్ తుఫాన్ తర్వాత విశాఖ జూని తరలించాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ మన ప్రభుత్వంలో విశాఖ జూని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎఫ్ రాహుల్పాండే, ఇంచార్జి కలెక్టర్ శివశంకర్, మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్, కేకే రాజు, జూ క్యూరేటర్ యశోద బాయి తదితరులు పాల్గొన్నారు. -
‘కబ్జాదారుల చేతుల్లో ఉన్న భూములు స్వాధీనం’
సాక్షి, విశాఖపట్నం : విశాఖ అభివృద్ధిని ఓర్వలేకే టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి అయ్యన్న విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని, ఐదేళ్ల భూ కబ్జాలను అడ్డుకున్న పోలీసులపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. రానున్న కాలంలో కబ్జాదారుల చేతుల్లో ఉన్న సర్కారు భూములు స్వాధీనం చేసుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. టీడీపీ నేతల ఐదేళ్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతోందని వెల్లడించారు. వంద రోజుల్లోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సంక్షేమ పథకాలకు జనం నీరాజనం పలుకుతున్నారని ప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. చదవండి : దేవతల యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టు.. -
‘ఆంధ్రజ్యోతికి రూ. 50లక్షలకే భూమి’
సాక్షి, విశాఖపట్నం : విశాఖ భూ కుంభకోణంపై మరోమారు విచారణ జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ వేదికగా జరిగిన తప్పుడు ఒప్పందాలన్నింటిపై విచారణ జరగబోతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పెద్దల పేర్లు ఈ భూ కుంభకోణంలో ఉన్న కారణంగానే సిట్ విచారణ నివేదిక అప్పట్లో బయటపడలేదని ఆరోపించారు. సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... విశాఖపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. నగర అభివృద్ది చూడలేకే కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు ప్రచురించాయని విమర్శించారు. విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడాన్ని ఓ వర్గం జీర్ణించుకోలేకపోతుందన్నారు. విశాఖను అభివృద్ది చేయడానికి సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తుంటే టీడీపీ.. దాని అనుకూల మీడియాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు విశాఖకు ఏం చేశారో చెప్పాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రజలను చంద్రబాబు ఉపయోగించుకున్నారే గానీ విశాఖకు చేసిందేమీ లేదని విమర్శించాను. నగరాన్ని పేకాట క్లబ్గా మార్చిన ఘనత మీది కాదా చంద్రబాబు అని ప్రశ్నించారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ...‘ దివంగత సీఎం వైఎస్సార్ విశాఖ అభివృద్దికి కృషి చేశారు. అచ్యుతాపురంలో వేలాది ఎకరాలలో ఎస్ఇజెడ్ స్ధాపించింది కూడా ఆయనే. విమ్స్ను స్ధాపించిన ఘనత వైఎస్సార్దే. అంతేకాదు విశాఖలో హెల్త్ సిటీని ప్రారంభించింది కూడా వైఎస్సారే కదా. పోలవరంతో విశాఖ దాహార్తిని తీర్చేందుకు ఆయన ప్రయత్నించారు. విశాఖలో ఎన్నో కీలకమైన ప్రాజెక్ట్ లు తీసుకొచ్చింది కూడా ఆయనే. విశాఖ ఎయిర్ పోర్టు విస్తరణ కూడా వైఎస్సార్ హయాంలోనే జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాంధ్ర ప్రజల కోసం సుజల స్రవంతికి శ్రీకారం చుట్టింది కూడా ఆయనే. ఇలా ఎన్నో రంగాలలో విశాఖను అభివృద్ది చేసిన తండ్రికి తగ్గ తనయుడిగా సీఎం వైఎస్ జగన్ విశాఖను మరింతగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు అని తెలిపారు. అయితే కొంతమంది మాత్రం...వైఎస్ జగన్ను కించపరిచేలా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం పేరుతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేషన్ ఎన్నికలలో లబ్ది పొందాలనే టీడీపీ తప్పుడు ప్రచారాలతో కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఆంధ్రజ్యోతికి రూ. 50లక్షలకే భూమి ‘విశాఖలో భూ దందాలకు పాల్పడింది మీరు. విశాఖ భూ కుంభకోణం మీ హయాంలో జరగలేదా. విశాఖను దోచుకుంది మీరు కాదా. మీలాగా అక్రమాలను, అసాంఘిక కార్యక్రమాలను వైఎస్సార్ సీపీ ప్రోత్సహించదు అని గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు. టీడీపీ అనుకూల పత్రికలలో వచ్చిన కథనాలపై సుమోటాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కమిషనర్ ను కోరబోతున్నట్లు తెలిపారు. అదే విధంగా రూ. 5 కోట్ల కోట్ల విలువైన భూములను ఆంధ్రజ్యోతికి రూ. 50 లక్షలకే గత ప్రభుత్వం ఇచ్చిందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో స్థానికులకి 75 శాతం ఉద్యోగాలిస్తామని ఒప్పందాలు చేసుకుని ఉల్లంఘనలకు పాల్పడిన ఐటీ కంపెనీలపై చర్యలు తీసుకోవాలి’ అని ప్రభుత్వాన్ని కోరారు. -
విశాఖ జిల్లాలో.. బాక్సైట్ మైనింగ్ లీజు రద్దు
సాక్షి, అమరావతి : విశాఖ జిల్లాలో 3,030 ఎకరాల బాక్సైట్ మైనింగ్ లీజును రద్దుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సంతకం చేశారు. దీంతో బాక్సైట్ మైనింగ్ లీజు ఉత్తర్వులు శుక్రవారం జారీకానున్నాయి. తమ ప్రభుత్వం వస్తే బాక్సైట్ తవ్వకాలు జరపబోమని, గతంలో సర్కారు ఇచ్చిన మైనింగ్ లీజు రద్దుచేస్తామని విపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు బాక్సైట్ లీజు రద్దుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ‘సర్కారుకు ఆదాయం ఒక్కటే ముఖ్యం కాదు.. గిరిజనుల సెంటిమెంటును కూడా గౌరవించాల్సిందే. ప్రజల విశ్వాసాలకు, అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఉంది. అందుకే బాక్సైట్ మైనింగ్ లీజు రద్దుచేస్తున్నాం’.. అని వైఎస్ జగన్ ఈ ఫైలుపై సంతకం చేసిన సందర్భంగా పేర్కొన్నారు. కాగా, ఈ నిర్ణయంతో సీఎం మాట తప్పని, మడమ తిప్పని నేతగా నిరూపించుకున్నారని ఒక ఉన్నతాధికారి ‘సాక్షి’తో అన్నారు. మాట మార్చిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి విశాఖ జిల్లా చింతపల్లి, జెర్రిల్లా అటవీ బ్లాకుల్లో 3030 (1212 హెక్టార్లలో) ఎకరాల బాక్సైట్ నిక్షేపాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది. బాక్సైట్ తవ్వకాలు జరపొద్దని గిరిజనులు డిమాండు చేయడంతో అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు.. తాము అధికారంలోకి వస్తే వీటి లీజులు రద్దుచేస్తామని ప్రకటించడమే కాక.. అక్కడ బాక్సైట్ వ్యతిరేక ఆందోళనలో సైతం పాల్గొన్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట గాలికొదిలేశారు. బాక్సైట్ తవ్వకాలతోనే గిరిజనుల ప్రగతి సాధ్యమంటూ మాట మార్చారు. బాక్సైట్ తవ్వకాలకు అటవీ, పర్యావరణ తుదిదశ అనుమతులను ఆఘమేఘాలపై కేంద్రాన్ని ఒప్పించి తెచ్చుకున్నారు. అనంతరం.. రాత్రికి రాత్రే బాబు సర్కారు 2015 నవంబరు 5న విశాఖ జిల్లాలోని చింతపల్లి, జెర్రిల్లా అటవీ ప్రాంతంలో 3030 ఎకరాల్లో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ జీవో నంబరు 97 జారీచేసింది. దీనిని నిరసిస్తూ అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గిరిజనులతో ఆందోళన చేపట్టింది. దీంతో.. తమకు తెలియకుండానే జీవో జారీచేశారంటూ చంద్రబాబు అధికారులపై నెపం నెట్టే ప్రయత్నం చేశారు. పర్యావరణ అనుమతి ఇవ్వాలంటూ టీడీపీ సర్కారు కేంద్రానికి నాలుగుసార్లు లేఖలు రాసిన విషయాన్ని ‘సాక్షి’ ఆధారాలతో బట్టబయలు చేయడంతో నాలుక కరుచుకున్న చంద్రబాబు.. ఇక సమాధానం చెప్పలేక ఈ జీవోను అబయెన్సులో పెడతామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. చెప్పిన మాటకు కట్టుబడి.. ఈ నేపథ్యంలో.. అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్.. చెప్పిన మాటకు కట్టుబడి అధికారుల నుంచి అందుకు సంబంధించిన ఫైలు ఇటీవల తెప్పించుకున్నారు. బాక్సైట్ మైనింగ్ లీజును రద్దుచేయాలని సంతకం చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) పేరుతో ఉన్న 3030 ఎకరాల మైనింగ్ లీజు రద్దుచేస్తూ భూగర్భ గనుల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేయనుంది. కాగా, బాక్సైట్ అనేది మేజర్ మినరల్ అయినందున మైనింగ్ లీజు జారీచేసే, రద్దుచేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే రాష్ట్ర ప్రభుత్వాలు లీజులు ఇవ్వడం లేదా రద్దుచేయడం లాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మైనింగ్ లీజు గడువు ముగిస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే రద్దుచేయవచ్చు. కానీ, లీజు గడువు ముగియక ముందే రద్దుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున ఈ విషయాన్ని వివరిస్తూ అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా కోరనుంది. -
పోలీసులపై అయ్యన్న పాత్రుడి చిందులు
సాక్షి, విశాఖపట్నం: తన పుట్టిన రోజు బైక్ ర్యాలీకి అనుమతులు ఇవ్వలేదంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చిందులు తొక్కారు. పోలీసులు కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారంటూ నోరు పారేసుకున్నారు. హెల్మెట్లు పెట్టుకుని బైక్ ర్యాలీ చేయాలట... బండ్లు నడపకుండా తోసుకుని పోలీసు స్టేషను వరకు వెళ్లాలి అంటూ పోలీసులను ఎద్దేవా చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా సీనియర్ నాయకులు వస్తారని.. రక్తదాన శిబిరాలు పెడతానంటే అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎవరు ఏం చెప్పినా తాను తగ్గనని.. అనుకున్నది చేసి తీరతానని పేర్కొన్నారు. తన గురించి తెలుసు కాబట్టే కలెక్టర్ తర్వాత పర్మిషన్ ఇచ్చారని తెలిపారు. మూడేళ్లలో అందరి కళ్ళు దింపుతామంటూ పోలీసులను ఉద్దేశించి అయ్యన్న పాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా... అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసిపాత్రుడు బుధవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు కూడా టీడీపీకి గుడ్బై చెప్పారు. ఇప్పటికే విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. విశాఖ డెయిరీ సీఈఓ, టీడీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్, డెయిరీ డైరెక్టర్ పిల్లా రమాకుమారి(యలమంచిలి మాజీ మున్సిపల్ చైర్పర్సన్), డెయిరీ ఇతర డైరెక్టర్లు ....సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. తాజాగా సన్యాసిపాత్రుడు నిర్ణయంతో తెలుగు తమ్ముళ్లు షాక్ తింటున్నారు. -
చిరునవ్వుతో స్వాగతించాలి : సీఎం జగన్
సాక్షి, అమరావతి : పంచగ్రామాల సమస్య పరిష్కారం కనుగొనే విషయమై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ కలెక్టర్ వినయ్ను ఆదేశించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘పోలీస్ స్టేషన్కు ఎందుకు వచ్చామా? అని ప్రజలు బాధపడకూడదు. వాళ్లు సమస్యలు, బాధతో వస్తారన్న విషయాన్ని గుర్తించి.. వారి ఫిర్యాదులను ఎలా స్వీకరిస్తున్నాం, ఎలా పరిష్కరిస్తున్నామన్నది ముఖ్యం. పోలీసులు చిరు నవ్వుతో ప్రజలను స్వాగతించాలి. నేను ఇదివరకే ఈ విషయం మీకు చెప్పాను. ఇది కొనసాగాలి. ప్రతి పోలీస్స్టేషన్కు ఈ సందేశం పంపాలి’ అని సీఎం జగన్ కలెక్టర్ను ఆదేశించారు. వారి సమస్యలు పరిష్కరించండి వైఎస్సార్ జిల్లా : పులివెందుల నియోజకవర్గ పరిధిలోని యుసిఐఎల్ బాధితుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ హరికిరణ్, యుసిఐఎల్, సిఎండి అధికారులు, బాధితులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. యుసిఐఎల్ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులు, ఎంపీ, జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. పరిశ్రమలో గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేసి, బాధితులకు తాగునీరు, టైల్పాండ్ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
త్వరలోనే నూతన ఐటీ పాలసీ
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శనివారం ఐటీ హబ్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన ఐటీ పాలసీ రూపకల్పనపై దృష్టి సారించామన్నారు. ఇందుకోసం 100 రోజుల కార్యచరణని సిద్ధం చేశామన్నారు. గత ప్రభుత్వం ఐటీని నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. బెంగళూరు, హైదరాబాద్కు ధీటుగా విశాఖలో ఐటీని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో జరిగిన భూ కేటాయింపులపై సమీక్షిస్తున్నామన్నారు. -
విశాఖ పోర్టు లాభం రూ. 200 కోట్లు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు గడిచిన ఐదేళ్లలో ఆర్థిక, నైపుణ్యత, మౌలిక సదుపాయాలు తదితర అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధిని సాధించిందని పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. ప్రతి ఏటా ఐదు శాతం వృద్ధి రేటు సాధించడమే కాకుండా దేశంలోనే శుభ్రమైన పోర్టుగా వరుసగా మూడేళ్లు జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. గ్రీన్ ఇండస్ట్రీ, గ్రీన్ పోర్టు అవార్డులను కూడా సొంతం చేసుకుందని చెప్పారు. పోర్టు అభివృద్ధి కోసం తన హయాంలో చేపట్టిన కార్యక్రమాలను కృష్ణబాబు శుక్రవారం విశాఖలో మీడియాకు వివరించారు. 2017–18లో 63.54 మిలియన్ టన్నుల మేర ఎగుమతులు, దిగుమతులు జరిగితే 2018–19లో 65.3 మిలియన్ టన్నులకు పెరిగాయని, తద్వారా రూ. 200 కోట్ల లాభాలను ఆర్జించి పోర్టు రికార్డు నెలకొల్పిందని తెలిపారు. రూ. 300 కోట్ల ఖర్చుతో పోర్టు ఛానల్ లోతును 11 మీటర్ల నుంచి 14.5 మీటర్లకు పెంచామని, దీనివల్ల లక్ష టన్నులకు మించిన నౌకలు కూడా ఇన్నర్ హార్బర్లలోకి వచ్చే వెసులుబాటు కలిగిందని చెప్పారు. 85 ఏళ్ల కిందట ఏర్పడిన పోర్టును ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా ఆధునికీకరిస్తున్నామని, ఇందుకోసం విశాఖ పోర్టు ట్రస్ట్ రూ. 1,200 కోట్లు ఖర్చు చేస్తే, ప్రైవేటు సెక్టార్ నుంచి రూ. 2,500 కోట్లు పెట్టుబడులు పెట్టారన్నారు. విలాసవంతమైన భారీ క్రూయిజ్ల నిర్మాణం కోసం రూ. 77 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. పోర్టు కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు కాన్వెంట్ కూడలి నుంచి సీ హార్స్ జంక్షన్ వరకు 7.5 మీటర్ల ఎత్తులో రక్షణ గోడ నిర్మించామని వివరించారు. కాలుష్య నియంత్రణ కోసం గడిచిన 8 ఏళ్లలో రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. సాగరమాల ప్రాజెక్టు కింద పోర్టు రోడ్డును నాలుగు వరుసలకు విస్తరించడంతో పాటు షీలానగర్ నుంచి సబ్బవరం వరకు కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారికి అనుసంధానమయ్యేలా పనులు జరుగుతున్నాయన్నారు. -
ఏపీఎస్ఆర్టీసీలో మరోమారు సమ్మె సైరన్
-
ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్?
సాక్షి, విశాఖపట్నం : ఏపీఎస్ఆర్టీసీలో మరోమారు సమ్మె సైరన్ మోగించేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీలో ఉద్యోగుల కుదింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా సోమవారం ద్వారకా బస్ స్టాండ్ ఆర్టీసీ ఆర్ ఎమ్ కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. జేఏసీ నాయకులు లక్ష్మి నారాయణ, జయ, రోహిణిల ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్లరిబ్బన్లతో ఉద్యోగులు తమ నిరసన తెలియజేశారు. ఉద్యోగులతో సంప్రదించకుండా ఆర్టీసీ ఎండీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జేఏసీ నాయకులు ఆరోపించారు. మే 23 తర్వాత కార్మికులకు మేలు చేసే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని తెలిసే.. ఆ లోపే ఆర్టీసీని ఏదో చేసేయ్యాలని కుట్ర చేస్తున్నారంటూ జేఏసీ నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్లు వారు పేర్కొన్నారు. -
తీరం వైపు దూసుకొస్తున్న పెథాయ్
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుపాన్ తీవ్ర వాయువేగంతో దూసుకొస్తోంది.పెథాయ్ తుపాన్ పశ్చిమ బంగాళాఖాతానికి అనుకొని కొనసాగుతోంది. మచిలీపట్నానికి తూర్పున ఆగ్నేయంగా 480 కి.మీ దూరంలోను, కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 510 కి.మీ, దూరంలో కేంద్రికృతమైంది. శ్రీహరికోటకు 280 కిలోమీటర్ల దూరంలోను, ఉత్తర వాయువ్య దిశగా గంటకు 28 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఇది మరింత బలపడి రాత్రికి తీవ్రంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపు సాయంత్రం నాటికి కాకినాడ, తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదుగాలులు వీస్తాయని అధికారులు అంచనావేస్తున్నారు. పెథాయ్ తుపాన్ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలో తాళ్లరేవు, కాజులూరు, తుని పాటు, తొణంగిలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. విశాఖ, గాజువాక, భీమునిపట్నం, పరవాడ, పెదగంట్యాడ, అచ్యుతాపురం, రాంబిలి, ఎస్. రాయవరం, పాయకరావు పేటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అదే విధంగా విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో భారీ వర్షలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గార, పలాస, మందస, సంతబొమ్మాళి, కవిటి, ఇచ్చాపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశలు ఉన్నాయని ఆధికారులు తెలిపారు. -
బలపడనున్న అల్పపీడనం.. భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రానున్నా ఒకటి, రెండు రోజుల్లో కోస్తాలోని కొన్ని ప్రాంతల్లో వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలో రేపు ఎల్లుండి మరీంత బలపడనున్న అల్పపీడనం. కోస్తా ప్రాంతల్లో ఈ రోజు నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. విశాఖతీరం వెంబడి గంటకు 45 నుంచి, 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదుగాలులు బలంగా విచే అవకాశం ఉందని దీంతో మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లకూడదని విశాఖ వాతావరణ కేంద్ర తూఫాను హెచ్చరికలు జారీ చేసింది. -
1,400 కిమీ దూరం, 4 ఏళ్లు సా...గింది
బస్తీ, ఉత్తరప్రదేశ్ : బండి బండి రైలు బండి వేళకంటూ రాదులెండి.. దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఈ పాట మన రైల్వేలకు చాలా బాగా సరిపోతుంది. మన రైల్లు గంటలు, నిమిషాలు మాత్రమే కాక అప్పుడప్పుడు రోజుల తరబడి కూడా ఆలస్యంగా నడుస్తుంటాయి. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే రైలు బండి మాత్రం ఏకంగా సంవత్సరాల తరబడి ఆలస్యంగా వచ్చింది. ఏపీ నుంచి యూపీకి అంటే దాదాపు 1, 400 కిమీ దూరాన్ని చేరడానికి ఈ గూడ్స్ వ్యాగన్ బండికి ఏకంగా నాలుగేళ్లు పట్టింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని బస్తీకి చెందిన రామచంద్ర గుప్తా అనే వ్యాపారి ఆంధ్రప్రదేశ్, విశాఖపట్టణంలో ఉన్న ఇండియన్ పొటాషియమ్ లిమిటెడ్ (ఐపీఎల్) కంపెనీ నుంచి 1, 316 బస్తాల డీఏపీ ఎరువును బుక్ చేశాడు. దాంతో ఐపీఎల్ కంపెనీ ఈ ఎరువును సరఫరా చేసేందుకు రామచంద్ర గుప్తా పేరు మీద ఒక గూడ్స్ వ్యాగన్ను బుక్ చేశారు. సాధరంణంగా విశాఖ నుంచి యూపీలోని బస్తీని చేరడానికి పట్టే సమయం దాదాపు 42 గంటలు, అంటే మూడు రోజులు. కానీ మన రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ గూడ్స్ వ్యాగన్ యూపీకి చేరడానికి ఏకంగా నాలుగేళ్లు పట్టింది. 2014 నవంబర్లో ప్రయాణం ప్రారంభించిన ఈ గూడ్స్ వ్యాగన్ ఈ రోజు (జులై 28) మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో బస్తీని చేరుకుంది. దాంతో ఆశ్యర్యపోయిన రైల్వే అధికారులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 2014లో ప్రయాణం ప్రారంభించిన ఈ వ్యాగన్ ఫిజికల్ కండిషన్ సరిగా లేకపోవడం చేత దానికి మరమత్తులు చేసే ఉద్దేశంతో బోగిని తప్పించారు. తరువాత ఆ విషయాన్ని మర్చిపోయారు. ఇన్నాళ్ల తర్వాత దాన్ని తిరిగి తన గమ్యస్థానికి చేర్చే ప్రయత్నం చేశారు. ఫలితంగా దాదాపు 3 సంవత్సరాల 8 నెలల తర్వాత ఈ బోగీ బస్తీని చేరుకుంది. దాంతో రైల్వే అధికారులు రామచంద్ర గుప్తాకు ఈ వ్యాగన్ గురించి సమాచారం అందించారు. కానీ గుప్తా మాత్రం ఆ ఎరువులను తీసుకోవడానికి నిరాకరించారు. పాడైపోయిన ఈ ఎరువులను తీసుకుని ఏం చేసుకోవాలి అని ప్రశ్నించారు. అంతేకాక తాను గతంలోనే పలుమార్లు ఈ వ్యాగన్ గురించి రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశానని కానీ వారు మాత్రం దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఇప్పుడు ఈ విషయం కంపెనీ యాజమాన్యం, రైల్వే బోర్డు మాట్లాడుకోని నిర్ణయించుకుంటారని తెలిపారు. వ్యాగన్లోని ఎరువుల ఖరీదు దాదాపు 10 లక్షల రూపాయల వరకూ ఉంటుందని తెలిపారు. -
రానున్న 48గంటలు.. వెదర్ అప్డేట్
సాక్షి, హైదరాబాద్ / విశాఖపట్నం : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్లో గత రాత్రి నుంచి కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అంతే కాకుండా రోడ్లపై నీరు చేరి గుంతలు పడటంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పోలీసులు ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. ఆఫీస్లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందలకు గురయ్యారు. ఇక ఏపీ విషయానికి వస్తే విశాఖపట్నంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశం మొత్తం మబ్బులతో ముసురు కప్పేసింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది. వాటితో పాటు రానున్న 48 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలిపింది. ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో బలమైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని కారణంగా ఈ నెల 16న మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. అల్ప పీడనాల కారణంగా కోస్తాంధ్రతో పాటు ఉత్తర తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 55-60 కిలోమీటర్లు, ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
తెలుగు రాష్ట్రాల రైతులకు శుభవార్త
సాక్షి, విశాఖపట్నం : మరో రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలకు నైరుతి రుతుపవనాలు చల్లని తీపికబురును అందిచనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శుక్రవారం నుంచి వర్షపాతం పెరిగే అవకాశముంది. దీంతో ఈ సారి వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గత కొన్ని రోజులుగా నైరుతి రుతుపవనాలు పయనిస్తూ బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో దక్షిణ ప్రాంతానికి విస్తరించిన అండమాన్ దీవులకు చేరాయి. కాగా ప్రస్తుతం విదర్భ నుంచి తెలంగాణ ఏపీ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు లేదా మోస్తారు వర్షాలు, పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
రోడ్డు ప్రమాదంలో అయ్యన్న తనయుడికి గాయాలు
మాకవరపాలెం(నర్సీపట్నం) విశాఖపట్నం : ప్రమాదవశాత్తు బైక్పై నుంచి పడడంతో మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ గాయపడ్డాడు. ప్రత్యేక హోదాకోసం బుధవారం గిడుతూరులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విజయ్ బైక్పై పి.పి.అగ్రహారం బయలుదేరారు. గ్రామ సమీపంలోని మలుపు వద్దకు వచ్చే సరికి బైక్ అదుపుతప్పడంతో కిందపడిపోయాడు. దీంతో ఆయన ఎడమ చేతికి తీవ్ర గాయమైంది. తొలుత నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన అనంతరం విశాఖకు తరలించారు. -
నవ్వుల్ పువ్వుల్
సీతంపేట (విశాఖ ఉత్తర) : ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా లాఫ్టర్ ఫన్ క్లబ్, ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ సంయుక్తంగా ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక వినోదాల విందు అలరించింది. జబర్దస్త్ ఫేం రాపేటి అప్పారావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అప్పారావు తనదైన శైలిలో కామెడీ పంచ్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. క్లబ్ కళాకారులు కోరుకొండ రంగారావు, జి.వి.త్రినాథ్, ఎం.వి.సుబ్రహ్మణ్యం నిర్వహణలో విశాఖ హ్యూమర్ క్లబ్, క్రియేటివ్ కామెడీ క్లబ్, హాస్యప్రియా కామెడీక్లబ్, అనకాపల్లి లాఫింగ్క్లబ్ కళాకరులు పాల్గొని స్కిట్స్ ప్రదర్శించారు. భలే టైలర్, ఆర్టీటీ ఎంక్వైరీ, గుడ్ మెమరీ, మీ వాళ్లేమీ చెప్పలేదా స్కిట్స్ అలరించాయి. పోలవరపు ప్రశాంతి చేసిన నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. కళాకారులు ఎఫ్.ఎం.బాబా య్, రామానుజం, అంజలి ఘోష్, ఇమంది ఈశ్వరరావు, భాను, శివరామకృష్ణ తదితరులు స్కిట్స్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డి.వి.మూర్తి, కొసనా, లక్ష్మీ భార్గవి, ప్రసన్నకుమార్, కొమ్మినేని రామారావు,నండూరి రామకృష్ణ పాల్గొన్నారు. -
రైలు ఢీకొని గ్యాంగ్మన్ మృతి
యలమంచిలి : రైలు గేటు దాటుతున్న సమయంలో రైలు ఢీకొని ఆదివారం రైల్వే గ్యాంగ్మన్ మృత్యవాత పడ్డాడు. యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలోని పెద్దపల్లి రైల్వేగేటు వద్ద గేటు వేసి ఉన్న సమయంలో పట్టాలు దాటుతుండగా రామ్నగర్కు చెందిన రైల్వే ఉద్యోగి ఎం.నాగేష్ (32)రైలు ఢీకొని మృతిచెందాడు. మృతుడు యలమంచిలి రైల్వేస్టేషన్ పరిధిలో గ్యాంగ్మన్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొద్దిరోజులుగా ఇతను సెలవులో ఉన్నట్టు మృతుడి బందువులు తెలిపారు. ఆదివారం రామ్నగర్లోని తన ఇంటి నుంచి మిలట్రీ కాలనీలోని బంధువుల ఇంటికి బయలుదేరిన నాగేష్ గేటు వేసి ఉన్న సమయంలో రైలుపట్టాలు దాటుండగా ప్రమాదానికి గురయ్యాడు. అప్లైన్లో వచ్చిన రైలును చూసి దానిని తప్పించుకునే సమయంలో డౌన్లైనులో వచ్చే మరో రైలు ఢీకొంది. దీంతో నాగేష్ మృతదేహం నుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. మృతుడికి రెండేళ్లక్రితం వివాహమైంది. ఒక బాబు ఉన్నాడని బంధువులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న బంధువులు శోకసంద్రంలో మునిగారు. శవపంచనామా అనంతరం మృదేహాన్ని మృతుడి స్వగ్రామం అయిన రేగుపాలెం గ్రామానికి తరలించారు. తుని రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెచ్సీ మూర్తి తెలిపారు. -
ఇంటి నుంచి వెళ్లి శవమయ్యాడు
పెదవాల్తేరు(విశాఖ తూర్పు) : పెదజాలారిపేటకు చెందిన షేక్ మదీన (30) మరణం మిస్టరీగా మారింది. ఇంట్లోంచి వెళ్లిపోయిన మదీన ఒడిశా రాష్ట్రంలోని రాయగడలో చెట్టుకి ఉరి వేసుకుని ఈ నెల 4న ఆత్మహత్య చేసుకున్నట్టుగా శనివారం వాట్సాప్లో ఫొటోలు హల్చల్ చేశాయి. పెదజాలారిపేట బాపూజీనగర్లో తల్లిదండ్రులు, అన్నయ్య సుభానీతో కలిసి మదీనా నివసిస్తున్నారు. వీరంతా మటన్ దుకాణం నడుపుతున్నారు. కొంతకాలంగా మానసిక వ్యాధితో మదీన బాధపడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. గతంలో కూడా ఇలా వెళ్లి రావడంతో అలాగే వస్తాడని కుటుంబ సభ్యులు భావించారు. ఇంతలో మృతి చెందాడని వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మదీనా మృతితో పెదజాలారిపేట కాలనీలో విషాదం నెలకొంది. రాయగడలో మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం ఆదివారం ఉదయం పెదజాలారిపేటకు తరలించారు. అనంతరం ఇక్కడి వాల్తేరు డిపో సమీపంలో గల శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో ఆత్మహత్య చేసుకున్నాడని రాయగడ పోలీసులు తెలిపారని ఎంవీపీ పోలీసులు ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. మదీన కనిపించడం లేదని శనివారం అతని సోదరుడు సుభానీ ఫిర్యాదు చేయడంతో ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంవీపీ పోలీస్ స్టేషన్ సీఐ మళ్ల మహేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్ఐ లక్ష్మణరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీ ప్రజలను మోసం చేసేందుకు తిరుపతిలో మరో దీక్ష
-
ప్యాకేజీ అనగానే జైట్లీకి సన్మానం చేయలేదా!
సాక్షి, విశాఖపట్నం: ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక పోరాటాలు చేశారని, హోదా కోసం గుంటూరులో వైఎస్ జగన్ ఆమరణ దీక్ష చేస్తే.. ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని దీక్షను భగ్నం చేసిన చరిత్ర మీది కాదా అంటూ సీఎం చంద్రబాబు నాయుడును ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. విశాఖపట్నం వేదికగా వైఎస్సార్సీపీ నేతలు సోమవారం భారీ ఎత్తున చేపట్టిన ‘వంచన వ్యతిరేక దీక్ష’ లో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా హోదా కోసం చంద్రబాబు ఏనాడూ పోరాడింది లేదని, హోదా కోసం కేంద్రాన్ని అడిగిన దాఖలాలు లేవని తెలిపారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించగానే.. ఢిల్లీ వెళ్లి జైట్లీని సన్మానించిన ఘనుడు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడింది వైఎస్సార్సీపీనే అని, హోదా ఇవ్వకుండా కేంద్రం ఏ విధంగా మోసం చేసిందో ఏపీ ప్రజలకు తెలియజేసింది వైఎస్సార్సీపీయే అని గుర్తు చేశారు. హోదా సాధన కోసం అవిశ్వాసంపై తాము అన్ని పార్టీలను ఒప్పించామన్నారు. కానీ సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు మాత్రం యూటర్న్ తీసుకుని ఎన్డీయే నుంచి వైదొలగడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఐదుగురు వైఎస్సార్సీపీ ఎంపీలు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి నిరవధిక దీక్షకు పూనుకున్నా భగ్నం చేశారంటూ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. కేంద్రం, రాష్ట్రం దిగిరాకపోగా వైఎస్సార్సీపీ ఎంపీల దీక్షలను చంద్రబాబు భగ్నం చేయించారని ఆరోపించారు. ఇప్పటికీ చంద్రబాబు ఏపీ ప్రజలను వంచన చేసే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. గుంటూరులో దీక్షకు 30 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రజాధనాన్ని వృథా చేశారని చెప్పారు. తిరుపతిలో ధర్మపోరాటం దీక్ష పెట్టి ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారని, ఇందుకు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో సభ ఎందుకు పెడుతున్నారో ప్రజలకు చంద్రబాబు చెప్పాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని.. మాలో ఊపిరి ఉన్నంతవరకు హోదా కోసం పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. -
'వంచన వ్యతిరేక దీక్ష'
-
ప్రజలను మభ్యపెట్టేందుకే చంద్రబాబు దీక్షలు
-
ప్రారంభమైన 'వంచన వ్యతిరేక దీక్ష'
సాక్షి, విశాఖపట్నం : ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు మోసాలు, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని బీజేపీ దగా కోరు వైఖరికి నిరసనగా విశాఖపట్నం వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం భారీ ఎత్తున ‘వంచన వ్యతిరేక దీక్ష’ చేపట్టారు. ఇందులో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యాకర్తలు పెద్ద ఎత్తున దీక్షా వేదిక వద్దకు తరలివచ్చారు. వంచన దీక్షను ప్రారంభిస్తూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలతో దీక్ష ప్రారంభమైనది. ఈ సందర్భంగా హోదా కోసం రాజీనామాలు చేసిన ఐదుగురు ఎంపీలతో పాటు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా నల్లదుస్తుల్లో నిరసన దీక్షకు కూర్చున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై వైఎస్సార్ సీపీ నేతలు నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష వైఎస్సార్సీపీతోపాటు రాష్ట్ర ప్రజలు నాలుగేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోకుండా మౌనంగా ఉంటూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు హోదా కోసం ‘ధర్మ పోరాటం’ అంటూ తిరుపతిలో దీక్షకు పూనుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి తామంతా ముందుంటామని, కేంద్రం ఇచ్చిన ప్రతి హామీ అమలు కోసం తుదికంటా పోరాడతామని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. చంద్రబాబు దీక్షలకు పూనుకోవడం అధికారం కోసం వేస్తున్న ఎత్తుగడలే తప్ప మరొకటి కాదని వైఎస్సార్ సీపీ నేతలు ఎద్దేవా చేశారు. హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్రెడ్డి, అవినాష్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, భూమన కరుణాకర్రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డితోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ దీక్షలో పాల్గొన్నారు. -
ఏఆర్సీలో ఆడ సింహం మృతి
ఆరిలోవ (విశాఖ తూర్పు): జంతు పునరావాస కేంద్రం (ఏఆర్సీ)లో శుక్రవారం ఆడ సింహం అనారోగ్యంతో మృతి చెందింది. ఇక్కడ 16 సంవత్సరాల 3 నెలల వయసు గల ‘లత’ అనే ఆడ సింహం కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీని గర్భాశయం పాడయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందని జూ ఇన్చార్జి క్యూరేటర్ బి.జానకిరావు తెలిపారు. దీనిని 2002 జూన్ 12న కోల్కతాలో ఫేమస్ సర్కస్ నుంచి ఇక్కడ తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. జూలో బేబీ బైసన్ మృతి ఆరిలోవ(విశాఖతూర్పు): జూ పార్కులో వారం రోజుల క్రితం పుట్టిన బైసన్(అడవిదున్న) పిల్ల శుక్రవారం మృతి చెందింది. ఇక్కడ అనుష్క అనే బైసన్కు ఈ నెల 6న పిల్ల పుట్టింది. ఇది పుట్టిన నుంచి నీరసంగా ఉండటంతో పాటు తల్లి వద్ద పాలు సరిగా తాగేది కాదు. దీంతో నీరసించిపోయింది. ఇదిలా ఉండగా గురువారం రాత్రి ఇది మృతి చెందింది. తల్లి బైసన్ కాళ్లతో తొక్కేయడంతో ఈ పిల్ల మృతి చెందినట్లు ఇక్కడ వైద్యులు గుర్తించారు. దీని పొట్టపై తల్లి బైసన్ కాళ్లతో తొక్కేసిన పెద్ద గాయాలున్నట్లు గుర్తించామని వైద్యుడు శ్రీనివాస్ తెలిపారు. -
లోయలో అంబులెన్స్ బోల్తా
కొయ్యూరు(పాడేరు): ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ఓ అంబులెన్స్ బోల్తా పడింది. సుమారు 30 అడుగుల లోయలోకి వెళ్లిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య సిబ్బంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. పోతవరం సంతలో వైద్య శిబిరం నిర్వహించేందుకు యూ.చీడిపాలెం పీహెచ్సీ వైద్యాధికారిగా కొత్తగా బాధ్యతలు జగదీశ్వరరావు, దారకొండ పీహెచ్సీ వైద్యధికారి సాహితి, హెల్త్ సూపర్వైజర్ రామకృష్ణ, హెల్త్ అసిస్టెంట్లు బి.రామకృష్ణ, కుశరాజు, ఫార్మసిస్టు గురువారం యూ. చీడిపాలెం నుంచి అంబులెన్స్లో పోతవరం వెళ్లారు. అక్కడ వైద్యశిబిరం ముగిసిన తరువాత ఎం.భీమవరం నుంచి వై.రామవరానికి రాత్రికి చేరుకున్నారు. అక్కడ నుంచి యూ.చీడిపాలెంలో పీహెచ్సీకి వస్తుండగా చవిటి దిబ్బల సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో అదుపు లోయలోకి అంబులెన్స్ బోల్తాపడింది. అదృష్టవశాత్తు అందరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వెంటనే తేరుకున్న వైద్యుడు జగదీశ్వరరావు దుచ్చర్తి పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.తరువాత మరో వాహనంలో అందరిని యూ.చీడిపాలెం ఆస్పత్రికి తరలించారు.శుక్రవారం వరకు అక్కడ చికిత్స పొందారు. -
బుక్ స్టాల్లో అగ్ని ప్రమాదం
సాగర్నగర్(విశాఖ తూర్పు): ముద్ర రుణం తీసుకుని నిర్వహిస్తున్న ఓ నిరుద్యోగి బుక్స్టాల్ శుక్రవారం తెల్లవారుజామున షార్ట్సర్క్యూట్ కారణంగా కాలిబూడదైంది. సాగర్నగర్ వుడా కాలనీ మెయిన్ రోడ్డులో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. దూది రామకృష్ణ అనే నిరుద్యోగి ప్రధానమంత్రి ముద్ర యోజన ప£ýథకం కింద రూ.50 వేలు రుణం తీసుకొని ఒక బుక్స్టాల్ అండ్ స్టేషనరీ షాపు ఏర్పాటు చేశాడు. గురువారం రాత్రి యథావిధిగా దుకాణం షెటర్ దించి తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో విద్యుత్ మీటరు వద్ద షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో మంటలు చెలరేగి బుక్స్, కాగితాలకు అంటుకున్నాయి. పొగలు బయటకు రావడంతో పక్కనే ఉన్న నివాసితులు అప్రమత్తమై షాపు యజమాని రామకృష్ణకు సమాచారం అందించారు. వెంటనే ఆయన షాపు వద్దకు వచ్చి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలియజేశారు. వారు వచ్చేసరికే షాపు లోపల నోట్బుక్స్, విలువైన స్టేషనరీ, జిరాక్స్ మిషన్, రూ.11వేల నగదు కాలిబూడదైంది. గంట తర్వాత వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. చినగదిలి తహసీల్దార్ ఎస్.భాస్కరరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆర్ఐ యసేశ్వని, వీఆర్వో సందర్శించి ఈ ప్రమాదంలో సుమారు రూ.3 లక్షలు వరకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేశారు. -
వ్యభిచార గృహం నిర్వాహకురాలికి ఏడాది జైలు
విశాఖ లీగల్: ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మహిళలతో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మహిళకు ఏడాది జైలు, వెయ్యి రూపాయిలు జరిమానా విధిస్తూ నగరంలోని 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి కె.వెంకటరమణా రెడ్డి గురువారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా నెల రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నమ్మి సన్యాసిరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితురాలు జి.మధు(41) వన్టౌన్ ప్రాంతంలోని సున్నపు వీధిలో నివసిస్తోంది. గత కొంతకాలంగా ఆమె మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మభ్యపెట్టేది. వారిని మాయమాటలతో వ్యభిచారం ఉచ్చులోకి దించేది. ఈ నేపథ్యంలో వివరాలు సేకరించిన వన్టౌన్ పోలీసులు 2013, ఆగస్టు 27న వలపన్ని పట్టుకున్నారు. నిందితురాలిపై వ్యభిచార నియంత్రణ చట్టం ఐపీసీ సెక్షన్3, 4, 7ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి నేరాభియోగ పత్రం దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో పైవిధంగా తీర్పు చెప్పారు. -
పగబట్టిన మృత్యువు
ఆ కుటుంబంపై విధి పగబట్టినట్టుంది. నెలరోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్త, కుమారుడిని మృత్యువు కబళించింది. దీంతో ఆ కుటుంబ శోక సంద్రంలో మునిగిపోయింది. మాడుగుల రూరల్: ఒకే కుటుంబంలో తల్లి, కుమారుడు ఒక రోజు వ్యవధిలో మృతి చెం దగా, కుటుంబం యజమాని నెల రోజుల క్రితం మరణించాడు. వివరాలు ఇలా లున్నాయి. కె.జె.పురం గ్రామానికి చెందిన పాటోజు నాగభూషణం బంగారం పనిచేసేవాడు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వీరిలో ఇద్దరు కుమార్తెలకు, చిన్న కుమారుడికి వివాహం జరిగింది. నెల రోజుల క్రితం నాగభూషణం అకస్మాత్తుగా మృతి చెందాడు. ఆయన భార్య ఈశ్వరమ్మ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మంచం పట్టింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆమెకు సపర్యలు చేసేవారు. నాగభూషణం మృతి చెందిన విషాదం నుంచి ఆ కుటుంబ కోలుకోకముందే ఈశ్వరమ్మ ఈ నెల 11వ తేదీ సాయంత్రం కె.జె.పురంలో మృతి చెందింది. ఆమెకు గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. ఆ విషాదం నుంచి తేరుకోక ముందే నాగభూషణం పెద్ద కుమారుడు పాటోజు రామకృçష్ణ గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఆయన గతంలో హైదరాబాద్లో సినీ రంగంలో పనిచేశాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలో క్యాన్సర్ సోకింది. మిత్రులు సాయం చేసి చికిత్స చేయించారు. అయినా ఫలితం లేకపోయింది. రామకృçష్ణ గురువారం మధ్యాహ్నం సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెం గ్రామంలో తన సోదరి ఇంటి వద్ద మృతి చెందాడు. దీంతో ఆ విషాదఛాయలు అలుముకున్నాయి. రామకృష్ణ మృతదేహాన్ని అక్కడ నుంచి కె.జె.పురం తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. -
ముగ్గురు హాస్టల్ విద్యార్థుల ఆచూకీ లభ్యం
చోడవరం: మూడు రోజు ల కిందట గోవాడ హాస్టల్ నుంచి అదృశ్యమైన ము గ్గురు విద్యార్థులు తిరుప తి రైల్వేస్టేషన్లో దొరికిన ట్టు గురువారం సమాచా రం రావడంతో వారి తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. చోడవరం మండలం గోవాడ బాలుర బీసీ హాస్టల్లో చీడికాడ మండలం కోనాం పరిసర గ్రా మాలకు చెందిన నంబారు గోవింద, గంటా కొండలరావు, విస్సారపు గణేష్ చదువుతున్నారు. వీరు ముగ్గురు ఈనెల 10న హాస్టల్ నుంచి అదృశ్యమయ్యారు. దీనిపై బాధిత విద్యార్ధుల తల్లిదండ్రులు చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు అదృశ్యమైన విద్యార్థుల ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృత ప్ర చారం కూడా చేశారు. వీరి కోసం బంధువులు, పోలీసులు గాలిస్తుండగా చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి ఒక యువకుడు ఫోన్ చేయడంతో వారి కో సం తమ బంధువులను పంపినట్టు, పిల్లలు క్షేమంగా దొరికినట్టు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. విద్యార్థులు దొరికిన విషయాన్ని ఆ యువకుడు తనతో ఉన్న ఆ ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్న ఫొటోను వాట్సాప్ లో పెట్టడంతో తల్లిదండ్రులు, హాస్టల్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
రోజూ 18 పేపర్లు చదువుతా..
సాక్షి, విశాఖపట్నం: ‘అప్పట్లో మా కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు.. రాజకీయ నాయకులూ లేరు. వారసత్వం లేకున్నా జవసత్వంతో ఈ స్థాయికి (ఉపరాష్ట్రపతి) ఎదిగా. నా జీవితంలో అన్ని పదవులూ చేశా. స్కూలు, కాలేజీ, యూనివర్సిటీల్లో విద్యార్థి నాయకుడిగా పనిచేశాను. కేంద్రంలో కీలక మంత్రి పదవులు చేపట్టాను. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి అధిరోహించాను. ఇప్పుడు దేశంలోనే రెండో అత్యున్నత పదవిలో ఉన్నాను. ఇలా అన్ని పదవులూ నిర్వహించాను.నేను నా ఈ జీవితాన్ని ఊహించలేదు.’ అని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తన మనసులో భావాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) మొదటి బ్యాచ్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘నేను యువకుడిగా ఉన్నప్పుడు వాజ్పేయి నెల్లూరు పర్యటనకు వచ్చారు. ఆయన బహిరంగ సభకు జనమంతా తరలి రావాలంటూ జట్కాబండిలో మైకులో ఊరంతా ప్రచారం చేశాను. కానీ వాజ్పేయి, అద్వానీల్లాంటి వారి మధ్య కూర్చుని ప్రసంగిస్తానని గాని, దేశంలో రెండో అత్యున్నత పదవి (ఉపరాష్ట్రపతి)కి ఎదుగుతానని నేనూహించలేదు.’ అని వివరించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను రైతుల కష్టాలను ఎరుగుదునన్నారు. ‘నేను తాడిచెట్టు ఎక్కగలను. చెరువుల్లో ఈదగలను. చిన్నతనంలో పశువులను కడిగే వాడిని. నాగలిపట్టి పొలం దున్నేవాడిని. ఇవన్నీ నాకు మా తాత నేర్పారు. చేలో పంటను పక్షులు తినకుండా కొట్టేవాళ్లం. పంట ఇంటికొచ్చాక అవి తినడానికి వీలుగా వరి, జొన్న, సజ్జ కంకులను ఇళ్ల పంచలకు వేలాడదీసేవాళ్లం. ఇవన్నీ విద్యార్థులు తెలుసుకుంటే మన నాగరికత, సంస్కృతి ఎంత గొప్పదో అర్థం అవుతుంది.’ అని వివరించారు. నేను రోజూ 18 దినపత్రికలు చదువుతాను. మీరూ పత్రికలు చదవి వాటి ద్వారా జ్ఞానాన్ని అవగతం చేసుకోండి’ అని పిలుపునిచ్చారు. విశాఖలో తిరగని వీధి లేదు.. ‘విశాఖ వస్తే నాకు కొత్త ఉత్సాహం వస్తుంది. విశాఖలో నేను తిరగని వీధిలేదు. అప్పట్లో ఎన్ఎస్ఎన్ రెడ్డి గెలుపుకోసం ఎన్నికల్లో గట్టిగా పనిచేశా. ఆంధ్ర యూనివర్సిటీలో గోపీ బడ్డీ, ఎండు చేపలు, చావుల మదుం, జగదాంబ జంక్షన్.. ఆర్కే బీచ్.. ఇలా ఒకటేమిటి విశాఖలో ప్రకృతి అందాలన్నీ అన్నీ గుర్తుకొస్తాయి.’ అని విశాఖతో తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని, విలాసాల వైపు వెళ్లొద్దని ఉద్బోధించారు. మావి హ్యాపీ డేస్.. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో అంతా స్నేహపూర్వకంగా ఉండేవాళ్లం. చదువుకే ఎక్కువ ప్రాధాన్యతిచ్చేవాళ్లం. స్టూడెంట్స్ ఎన్నికలకు గట్టి పోటీ ఉండేది. జై ఆంధ్ర ఉద్యమంలో ఆరు నెలలు డుమ్మా కొట్టాను. మా క్లాస్మేట్స్ 12 మంది జడ్జీలయ్యారు. వారిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఒకరు. యూనివర్సిటీలో మావి హ్యాపీ డేస్!’ అంటూ స్టూడెంట్ జీవితాన్ని వివరించమని అడిగిన ఓ విద్యార్థికి వెంకయ్యనాయుడు సమాధానం ఇచ్చారు. -
ముందే కనువిందు
పాడేరు రూరల్, డుంబ్రిగుడ(అరకులోయ): ప్రతి ఏటా మే నెలలో కనిపించి కనువిందు చేసే మే ఫ్లవర్స్ ఈ ఏడాది కాస్త ముందుగా ఏప్రిల్నెలలో విరబూశాయి. పాడేరు పట్టణంలోని సుండ్రుపుట్టు వీధిలో తుడుముబాబూరావు అనే గిరిజనుడి ఇంటిపెరట్లో, డుంబ్రి గుడ మండలంలోని మారుమూల పంచాయతీ బొడ్డపుట్టు గ్రామంలో ఈ పుష్పాలు అందాలుచిందించాయి. బొడ్డపుట్టు గ్రామంలో ప్రధాన రోడ్డుకు అనుకుని ఉండడంతో ఆదారిన వెళ్లేవారు, గ్రామస్తులు మే ఫ్లవర్ను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. -
మల్టీకేర్లో ఘరానా మోసం
పాలకోడేరు : నిరుపేదలకు ఖరీదైన వైద్యం అందించాలనే సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవగా పేరుమార్చి అవినీతికి కేరాఫ్ అడ్రస్గా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామానికి చెందిన పొదిలాపు రాంబాబు ఎఫ్సీఐలో హమాలీగా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి నెలలో సైకిల్పై వెళ్తుండగా వెనుక నుంచి మోటార్ సైకిలిస్ట్ ఢీకొట్టాడు. ఫలితంగా మెడ భాగంలో గట్టిగా దెబ్బ తగిలింది. మెడ కదల్చలేని స్థితిలో విశాఖ పట్టణంలోని ఆదిత్య మల్టికేర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి మెడ భాగంలో పూసలు కొద్దిగా తప్పుకున్నాయని, ఫలితంగా నరాలు దెబ్బతిన్నాయని ఆపరేషన్ ద్వారా సరిచేయవచ్చని చెప్పారు. అందుకు రాంబాబు సరేనన్నారు. ఇక అక్కడ నుంచి శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమా మొదలైంది. న్యూరో సర్జన్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ గొల్లా రామకృష్ణ ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఆపరేషన్ చేసి మందులిచ్చి పంపించేశారు. మందులు ప్రభావంతో కొద్ది రోజులు తగ్గినా మరలా పరిస్థితి మామూలుగా తయారయింది. రెండోసారి వెళ్లినప్పుడు కూడా మందులిచ్చి పంపేంచేశారు. ఈసారి పరిస్థితి సీరియస్గా మారింది. కాళ్లు, చేతులకు రక్త ప్రసరణ తగ్గి కదలికలు లేకుండా స్తంభించిపోయాయి. కేవలం ద్రవ ఆహారంపైనే ఆధారపడటంతో శరీరం క్షీణించి పోయింది. దాంతో విషయం తెలిసిన ఆర్టీఐ ప్రొటెక్షన్ కౌన్సిల్ జిల్లా కోఆర్డినేటర్ కె.శ్రీనివాస్ భీమవరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో స్కానింగ్ తీయించగా ఆశ్చర్యకరమైన విషయం బహిర్గతమైంది. అసలు రాంబాబుకు ఆపరేషనే జరగలేదని పరీక్షల్లో తేలింది. ఇదే విషయమై విశాఖలోని ఆస్పత్రి వర్గాలను ప్రశ్నించినా స్పందన లేదని శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం మరో చోట వైద్యం చేయించుకుందామన్నా వైద్యసేవ కార్డు ఆస్పత్రి వర్గాల్లో క్లెయిమ్ చేయించుకున్నారని దాంతో పనికి రాకుండా పోయిందన్నారు. ప్రభుత్వమే స్పందించి బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు. -
సామాజిక స్థలం..పచ్చనేత బేరం
పట్టణంలో లక్షలాది రూపాయల విలువైన సామాజిక స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో అ«ధికార టీడీపీ నేతలు వీటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. లేఅవుట్లు వేసి సామాజిక అవసరాల కోసం పంచాయతీ వారికి కేటాయించిన ఈ స్థలాలు బేరాలకు పెడుతున్నారు. పాయకరావుపేట : పట్టణంలో లక్ష్మి థియేటర్ వెనుక పెదిరెడ్డి సన్యాసిరావునగర్లో వేసిన లేఅవుట్లో సామాజిక అవసరాల కోసం కేటాయించిన సుమారు రూ.10 లక్షల విలువైన స్థలాన్ని స్థానిక టీడీపీ నేత ఒకరు విక్రయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ స్థలంలో కొనుగోలు చేసిన వ్యక్తి యథేచ్ఛగా ఇంటి నిర్మాణం చేపట్టి స్లాబ్ వేసాడు. ఇంత జరుగుతున్నా పంచాయతీ అధికారులు చోద్యం చూస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే సర్వే నం 138/2లో కొద్దిపాటి భూమిని గతంలో లే అవుట్లుగా వేసి ప్లాట్లుగా విభజించి విక్రయించారు. అప్పట్లో భూ యజమానులు సామాజిక అవసరాల కోసం కొంత స్థలాన్ని పంచాయతీకి కేటాయించారు. పంచాయతీ వారు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ భూమిని స్థానిక టీడీపీ నేత ఒకరు కొద్దిరోజుల క్రితం బేరం పెట్టేసారు. రిజిస్ట్రేషన్ కూడా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి ఇంటి నిర్మాణం ప్రారంభించి స్లాబ్ వేసాడు. కానీ పంచాయతీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. -
జక్కన్న చెక్కిన చదువుల గుడి
కశింకోట(అనకాపల్లి): కశింకోటలోని డీపీఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వసతి సమస్య పరిష్కారానికి ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి బృందం చేయూతనిచ్చింది. ఆ బృందం సుమారు రూ.40 లక్షల సమకూర్చగా నాలుగు తరగతి గదులతో నిర్మించిన భవనం పూర్తై ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ భవనానికి రాజమౌళి తన తల్లి రాజనందిని పేరుతో ‘జనని రాజనందిని’గా నామకరణం చేశారు. స్వాతంత్య్రం కోసం మొదటిసారి సిపాయిల తిరుగుబాటు జరిగిన 1857వ సంవత్సరంలోనే ఇక్కడి పాఠశాల ప్రారంభమైంది. హుద్హుద్ తుపానుకు ముందుగానే భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వసతి సమస్య కారణంగా వేరే పాఠశాలలో తరగతులు నిర్వహించవలసి వస్తోంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హుద్హుద్ తుపాను అనంతరం పాఠశాలల్లో భవనాలు నిర్మించాలని సంకల్పించిన సినీ దర్శకుడు రాజమౌళి... కలెక్టర్ సూచనల మేరకు ఇక్కడి పాఠశాలలో భవన నిర్మాణానికి ముందుకు వచ్చి నిధులు సమకూర్చారు. ఈ భవనంలోనే వర్చువల్ తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వం తాజాగా నిధులను సమకూర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పాఠాలను ఈ తరగతుల ద్వారా విద్యార్థులు వినడానికి, అక్కడ ఉండే ఉపాధ్యాయులతో సందేహాలు నివృత్తి చేసుకోవడానికి అవకాశం కలగనుంది. అందుకు ఎసీ సౌకర్యం కల్పించడానికి అవసరమైన సీలింగ్ పనులు నిర్వహిస్తున్నారు. -
విజృంభిస్తున్న ఆంత్రాక్స్
డుంబ్రిగుడ(అరకులోయ): మండలంలో ఆంత్రాక్స్ మళ్లీ విజృంభిస్తోంది. ఐదు రోజుల క్రితం పోతంగి గ్రామంలో ఇద్దరికి ఈ వ్యాధి సోకగా, తాజాగా ఆ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల పంచాయతీ కండ్రుం గ్రామంలో ఇద్దరు గిరిజనులకు సోకింది. కండ్రుం గ్రామానికి చెందిన వంతల సన్యాసి,వంతల అర్జున్ అనే గిరిజనులు ఈవ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. వ్యాధి గ్రస్తులు వారిని అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన మేక మాంసాన్ని వారం రోజుల క్రితం వీరు తిన్నారని, అందువల్లే ఈ వ్యాధి ప్రబలినట్టు గ్రామస్తులు తెలిపారు.' ఇదే గ్రామంలో 2016 ఏప్రిల్లో ఆంత్రాక్స్ వ్యాపించింది. ఈ ఏడాది కూడా ఏప్రిల్ నెలలో ఆంత్రాక్స్ వ్యాధి రావడంపై గిరిజనులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అవగాహన కల్పించాలి ఆంత్రాక్స్ వ్యాధి పట్ల గిరిజనులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అవగాహన కల్పించాలని గిరిజన సంఘం నేతలు కోరుతున్నారు. అవగాహన లేకపోవడం వల్ల మృతి చెందిన పశువుల మాంసం తిని వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రతి ఏడాది ఆంత్రాక్స్ వ్యాధి ప్రబలుతున్నా నిరోధించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు. అప్రమత్తంగా ఉండాలి ఆంత్రాక్స్ పట్ల గిరిజనులు అప్రమతంగా ఉండాలని పాడేరు ఏడీఎంహెచ్వో పార్థసారధి సూచించారు. మంగళవారం ఆయన పోతంగి గ్రామాన్ని సందర్శించారు. ఆంత్రాక్స్ వ్యాధి సోకడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతి చెందిన పశువుల మాంసాన్ని తినరాదని తెలిపారు. దీనిపై గిరిజనులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిం చాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమ వైద్యులు కళ్యాణ్ ప్రసాద్, స్థానికులు శాంతికిరణ్, సింధరాంపడాల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
మరణించి.. మరొకరికి వెలుగునిచ్చి..
పెందుర్తి: మరణంలోనూ ఆమె మరొకరికి వెలుగునిచ్చింది. పెందుర్తి మండలం పినగాడిలో మంగళవారం విద్యుదాఘాతంతో ఓ మహిళ మృత్యువాత పడింది. ఇంటిపై ఉతికిన దుస్తులు ఆరేస్తుండగా సమీపంలోని విద్యుత్ వైర్లు తగలడంతో దుర్ఘటన చోటు చేసుకుంది. మృతురాలి కళ్ళను కటుంబసభ్యులు దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాలివి.. పినగాడి బీసీ కాలనీలో వంటాకుల నాగమణి(48) కుమార్తెతో కలిసి నివాసం ఉంటుంది. మంగళవారం ఉదయం 8.40 సమయంలో ఉతికిన బట్టలు ఆరబెట్టేందుకు మేడ మీదకు వెళ్ళింది. ఈ క్రమంలో సమీపంలోని విద్యుత్ తీగలకు ప్రమాదవశాత్తు నాగమణి చేయి తగలడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం తెలుసుకున్న పెందుర్తి సీఐ పి.సూర్యనారాయణ, ఎస్ఐ రామారావు ఘటనాస్థలికి వెళ్ళి వివరాలు సేకరించారు. కేజీహెచ్ ఐబ్యాంక్ ప్రతినిధులు కుటుంబసభ్యులకు నేత్రదానం గురించి వివరించగా నాగమణి నేత్రాలను ఇచ్చేందుకు అంగీకరించారు. వైద్యులు ఆమె కళ్ళను సేకరించారు. -
పార్ట్టైమ్ ఉద్యోగాల పేరిట మోసం
అల్లిపురం(విశాఖ దక్షిణ): మీరు ఇంటి వద్దే ఉంటూ ఖాళీ సమయాల్లో పనిచేస్తూ డబ్బు సం పాదించండి... విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు అదనపు ఆదాయం సంపాదించవచ్చు... అంటూ ప్రకటనలతో ఆకట్టుకుని ఒక సంస్థ లక్షలాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... అల్లిపురం జైలురోడ్డులో కోల్కత్తాకు చెందిన ఎస్ఎస్ కమ్యూనికేషన్ పేరిట ఒక కార్యాలయం ప్రారంభించారు. వారు నిరుద్యోగ యువత, గృహిణులు, చిరుద్యోగుల నుం చి పార్ట్ టైం వర్కు చేసి అదనపు ఆదాయం సంపాదించండి అంటూ రూ.6వేల నుంచి రూ.40వేల వర కు డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్ చేసిన నగదు మళ్లీ కావాల్సినప్పుడు వెనక్కు తీసుకోవచ్చని... అంతవరకు నెలకు రూ.9వేల నుంచి రూ.36వేల వరకు సంపాదించుకోవచ్చని ఆశ చూపించారు. రోజ్వాటర్ తయారీ, ఎల్ఈడీ ప్యానెల్స్, ఎల్ఈడీ స్ట్రిప్ లైట్లు, సీఎఫ్ఎల్ బల్బు తయారీ, ఎల్ఈడీ బల్బుల తయారీ ప్యాకింగ్కు ముడి సరకు అందిస్తామన్నారు. దీంతో వంద మందికి పైగా సభ్యులు ఆ సంస్థలో ఈ నెల 7, 8వ తేదీల్లో డబ్బులు చెల్లించారు. అందుకు సంస్థ తరఫున రసీదులు కూడా ఇచ్చారు. మంగళవారం ఉదయం సంబంధిత కార్యాలయానికి ముడి సరుకు తీసుకొనేందుకు వెళ్లగా మూసి ఉంది. దీంతో బాధితులంతా లబోదిబోమంటూ టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు అనకాపల్లిలో ఉన్నాడని బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు సిబ్బందిని అక్కడికి పంపించినట్లు పోలీసులు తెలిపారు. -
పరిమళించిన మానవత్వం
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): మానవత్వం పరిమళించింది. ఎంతలా అంటే... కాలువలో దీనావస్థలో పడి ఉన్న వృద్ధురాలికి మెరుపు వేగంతో ఆస్పత్రిలో వైద్యం చేయించడం... అనంతరం ఓ ఆశ్రమానికి తరలించడం... ఇదంతా ఒకే ఒక్క ఫొటో ఆధారంగా గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే... గోపాలపట్నం శివారు కొత్తపాలెం అండర్ పాత్ వే వద్ద 80 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు పడి ఉంది. మలమూత్ర విసర్జనలతో మూలుగుతోంది. ఆమె ఎవరో తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు. మనకెందుకులే అని ముందుకు సాగిపోయారు. అయితే రాత్రి ఏడు గంటల సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి ఇలా వెళ్తూ ఆ వృద్ధురాలిని గమనించాడు. మాట్లాడుదామంటే ఆమె నోట మాట లేదు. దగ్గరకెళ్తే తీవ్రంగా రోత... ఇలా ఉన్న చిత్రాన్ని అతను నేరుగా పోలీస్ కమిషనర్ యోగానంద్కు వాట్సాప్లో పంపారు. దయచేసి స్పందించాలని కోరాడు. అంతే యోగానంద్ నుంచి గోపాలపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ వైకుంఠరావుకు సమాచారం వచ్చింది. ఆయన ఎస్ఐ శ్రీనివాస్మహంతి, సిబ్బందితో హుటాహుటిన కొత్తపాలెం అండర్పాత్వే వద్దకు చేరుకుని రక్షక్లో గోపాలపట్నం ఎస్ఆర్ మల్టీస్పెషాల్టీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ సీఈవో గిరి, వైద్యులను ఒప్పించి ఉచితంగా వైద్యసేవలు చేయించారు. అనంతరం సీఐ వైకుంఠరావు ప్రేమసమాజం యాజమాన్యంతోనూ, పలు వృద్ధాశ్రమాల నిర్వాహకులతోనూ సంప్రదించారు. పెందుర్తిలో ఉన్న లయోలా వృద్ధాశ్రమ నిర్వాహకుడు ప్రకాశరావు స్పందించడంతో అక్కడికి పోలీసులు వృద్ధురాలిని అంబులెన్స్లో తరలించారు. అయితే వృద్ధురాలి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. మెరుపువేగంతో పోలీసులు, ఇక్కడి ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది స్పందించిన తీరుకి సీపీ యోగానంద్ వాట్సాప్ ద్వారా ప్రశంసించారు. -
యువకుడి ఆత్మహత్య
పరవాడ(పెందుర్తి): ప్రేమ విఫలమైందన్న కారణంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దేశపాత్రునిపాలెం గ్రామంలో సోమవారం చోటుచేసుకొంది. పరవాడ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాని మణికంఠ (21) అదే గ్రామానికి ఓ యువతిని ప్రేమించాడు. తను ప్రేమించిన యువతిని వేరొకరికిచ్చి వివాహం చేయడానికి ఆమె తల్లిదండ్రులు నిశ్చయించారు. ప్రేమ విఫలమైన కారణంగా విరక్తి చెందిన మణికంఠ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరిపోసుకొని మృతి చెందాడు. సోమవారం ఉదయం తన తల్లి కనకలక్ష్మి విధులకు వెళ్లిన తరువాత మణికంఠ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లి ఫ్యాన్కు వేలాడుతున్న కొడుకును చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. సమాచారం అందుకున్న పరవాడ సీఐ బి.సీహెచ్.స్వామినాయుడు, ఎస్ఐ జి.వెంకటరావులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. -
వేధింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
విశాఖక్రైం: బలవంతపు వడ్డీలు కట్టలేక నగరంలోని రైల్వేన్యూకాలనీకి చెందిన సీహెచ్ రవికుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే కుటుంబ సభ్యులు గమినించడంతో చికిత్స కోసం అతన్ని కేజీహెచ్కు తరలించారు. బాధితుడి కథనం మేరకు రైల్వేన్యూకాలనీకి చెందిన సీహెచ్ రవికుమార్ ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. కాలనీలో భార్య, ఇద్దరు కుమార్తెలతో నివాసముంటున్నా డు. 2013లో గోపాలపట్నానికి చెందిన పోర్టు ఉద్యోగి మురళీ దివాకర్రెడ్డి, సిరిపురానికి చెం దిన శంకరరావుల వద్ద రూ.లక్ష అప్పుతీసుకున్నాడు.వారు వడ్డీ కోసం వేధించడంతో శనివారం రాత్రి నిద్రమాత్రలు మింగాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు అతన్ని కేజీహెచ్కు తరలించారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న రవికుమార్ మాట్లాడుతూ వడ్డీ వ్యాపారులు మురళీ దివాకర్రెడ్డి, శంకరరావులు తనను వేధిస్తున్నారని ‘సాక్షి’కి వివరించారు. వారి వద్ద 2013లో రూ. లక్ష అప్పుగా తీసుకోవడం జరిగిందన్నారు. అందుకు షూరిటీగా రూ.లక్ష చెక్కును వారికి అందజేసినట్లు వివరించారు. అనంతరం 2014లో రూ. లక్ష తిరిగి వారికి ఇవ్వడం జరిగిందన్నారు. అయితే దివాకర్రెడ్డి, శంకరరావులు మరో లక్షరూపాయాలు వడ్డీ అయ్యిందని చెప్పి చెక్కు తిరిగి ఇవ్వలేదని, దీంతో పాటు మరిన్ని డబ్బులు చెల్లించాలని బెదిరింపులకు దిగిరాని తెలిపారు. దీంతో పాటు తనకు తాళ్లవలసలో ఉన్న 80 గజాల స్థలాన్ని, అమ్మంచి డబ్బులు కాజేశారని రవికుమార్ వెల్లడించాడు. సింహాచలంలో ఉన్న 330 గజాల స్థలాన్ని రాయించుకున్నారని తెలిపాడు.అయినా ఇంకా డబ్బులు చెల్లించకపోతే చంపేస్తామని హెచ్చరిస్తున్నారని అతను ఆరోపించారు. వారి వేధింపులు భరించలేక శనివారం రాత్రి నిద్రమాత్రలు మింగినట్లు వెల్లడించారు. పోలీసులు చొరవతీసుకొని తనకు న్యాయం చెయ్యాలని రవికుమార్ కోరాడు. -
కోడి పందేల ముఠా అరెస్ట్
విశాఖ క్రైం: నాలుగో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో గుట్టుగా కోడి పందేలు నిర్వహిస్తున్న ముఠాని టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్సు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తాటిచెట్లపాలెం దరి లెప్రసీ కాలనీలోని బహిరంగ ప్రదేశంలో ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారంతో టాస్క్ఫోర్సు పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో నిర్వాహకుడు ఆనంద్ పరారయ్యాడు. అక్కడ ఉన్న మిగిలిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే 18 పందెం కోళ్లు, రూ.5వేలు, మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నాలుగో పట్టణ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ చిట్టిబాబు మాట్లాడుతూ కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారంతో దాడులు చేశామన్నారు. దాడుల్లో ఎస్ఐలు సతీష్, మూర్తి సిబ్బంది పాల్గొన్నారు. -
అంగన్వాడీలకు భయోమెట్రిక్!
పెదవాల్తేరు(విశాఖతూర్పు): ఉద్యోగుల్లో సమయ పాలన కోసం అంటూ సర్కారు ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ హాజరు విధానం భయోమెట్రిక్గా మారింది. తోచిందే తడువుగా నిర్ణయాలు ప్రకటించడంతో పలుశాఖ ఉద్యోగులకు తలనొప్పిగా మారుతోంది. సిగ్నల్స్ సరిగా లేక పాఠశాలల్లో ఉపాధ్యాయులే హాజరు నమోదుకు ఇక్కట్లు పడుతుంటే... తాజాగా అంగన్వాడీలు కూడా బయోమెట్రిక్ వేయాలని ఉత్తర్వులు జారీ చేయడంపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీలకు అవస్థలు టీడీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ సిబ్బందికి కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే బండెడు చాకిరీ చేయిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు బయోమెట్రిక్ హాజరు రూపంలో కొత్త కష్టాలు తీసుకొచ్చింది. అంగన్వాడీ కేంద్రాలకు సమీపంలో గల జీవీఎంసీ పాఠశాలలకు వెళ్లి కార్యకర్తలు, ఆయాలు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు పల్స్పోలియో, స్మార్ట్ఫోన్లలో వివరాల నమోదు, ప్రీ–స్కూలు నిర్వహణ, పౌష్టికాహారం పంపిణీ, మధ్యాహ్నభోజన పథకాలతో తీవ్ర పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. అంగన్వాడీ టీచర్లలో చాలామంది బీఎల్ఓలుగా ఓటర్లనమోదు డ్యూటీలు సైతం నిర్వహిస్తున్నారు. బయోమెట్రిక్తో అవస్థలు ఇప్పటికే జీవీఎంసీ పాఠశాలల్లో బయోమెట్రిక్మిషన్లు సిగ్నల్స్ లేక హాజరు నమోదు విషయంలో ఉపాధ్యాయులే అష్టకష్టాలు పడుతున్నారు. చాలదన్నట్టు అంగన్వాడీ సిబ్బంది కూడా వీరి వెనుక క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొంది. అక్కడ ఎప్పుడు హాజరు వేస్తారు, ఎప్పుడు అంగన్వాడీ కేంద్రాలకు చేరుకుంటారో అధికారులే సెలవివ్వాలి. స్మార్ట్ఫోన్లు ఉన్నా అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ఏడాది నుంచి స్మార్ట్ఫోన్లు వినియోగంలోకి తెచ్చారు. దీనితో టీచర్లంతా పిల్లల హాజరు, మధ్యాహ్న భోజనాలు, బాలింతలు, గర్భిణులు, పౌష్టికాహారం పంపిణీ వంటి సమస్త వివరాలన్నీ ఏ రోజుకారోజు స్మార్ట్ఫోన్లలో నమోదు చేస్తున్నారు. ఈ వివరాలన్నీ ఉన్నతాధికారులకు సైతం ఆన్లైన్లో అందుబాటులో వుంటాయి. ఈ నేపథ్యంలో టీచర్ల హాజరు కూడా స్మార్ట్ఫోన్లలో నమోదు చేసే అవకాశం కల్పిస్తే సరిపోతుంది కదా అని పలువురు సూచిస్తున్నారు. నగరంలోని రెండు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 232 అంగన్వాడీ కేంద్రాలు వున్నాయి. భీమిలి, పెందుర్తి ప్రాజెక్టుల పరిధిలో కూడా అంగన్వాడీ కేంద్రాలు వున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తున్నాం అంగన్వాడీ సిబ్బంది సైతం బయోమెట్రిక్ విధానం ద్వారానే హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం సిబ్బంది అంతా సమీపంలో గల పాఠశాలల్లో హాజరు నమోదు చేసుకుని కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే కిలో మీటర్పరిధిలో పాఠశాలలు లేకుంటే మాత్రం సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. – జి.ఉషారాణి, సీడీపీఓ, ఐసీడీఎస్–అర్బన్–2,విశాఖపట్నం. -
ఎంతపని చేశావమ్మా!
ఆమె ఓ విధి వంచిత.. ప్రేమ వివాహం చేసుకుంది.. దీంతో కన్నవారు దగ్గరకు రానీయలేదు.. పుట్టిన పిల్లలిద్దరూ దివ్యాంగులే.. మనస్పర్థలతో భర్త దూరమయ్యాడు.. ఈ సమస్యలకు తోడు వేధిస్తున్న అనారోగ్యం.. మానసికంగా కుంగిపోయింది.. చివరకు కొడుకులిద్దరినీ అనాథలను చేసి బలవన్మరణానికి పాల్పడింది. తినడం కూడా చేతకాని స్థితిలో వైకల్యంతో బాధ పడుతున్న చిన్నారుల బేల చూపులు చూపరులను కంట తడి పెట్టిస్తున్నాయి. కానీ వారిని అక్కున చేర్చుకునేదెవరు? ఈ విషాద ఘటన చీడికాడ మండలం అప్పలరాజుపురంలో జరిగింది. చీడికాడ (మాడుగుల): అప్పలరాజుపురం విషాదంతో కుమిలిపోయింది. పిల్లల్ని అనాథలను చేసి ఓ తల్లి ఆత్మహత్య అందరినీ కలచివేసింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఇన్చార్జి ఎస్సై హిమగిరి అందించిన వివరాలు.. గ్రామానికి చెందిన రెడ్డి సునీత (30) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. శనివారం సాయంత్రం సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి పెదపాటి లక్ష్మి ఆదివారం చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సర్పంచ్ చుక్కా అప్పలనాయుడు, పెద్దల సమక్షంలో శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ప్రేమకు దూరమైన అభాగ్యురాలు ప్రేమ రాహిత్యమే సునీత మరణానికి కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. సునీత పుట్టింటి వారిది రోలుగుంట మండలం జె.నాయుడు పాలెం గ్రామం. పదేళ్ల క్రితం సునీత, అప్పలరాజుపురానికి చెందిన రెడ్డి గంగరాజులు ప్రేమించుకున్నారు. వేరువేరు కులాలకు చెందిన వారు కావడంతో సునీత కుటుంబసభ్యులు ఈ వివాహానికి అంగీకరించలేదు. వారిని ఎదురించి సునీత గంగరాజును పెళ్లాడింది. వీరికి భానుతేజ(8), త్రిగుణు(6) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం గంగరాజు మండలంలోని దిబ్బపాలెం యూపీ స్కూల్లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. పిల్లలు పుట్టాక కూడా సునీత తల్లిదండ్రులు సునీతతో సక్యతగా మెలగలేదు. దీంతో ఒంటరితనం ఆవహించింది. ఇదిలా ఉంటే పెద్ద కుమారుడు భానుతేజ ఆరోగ్యం అంతంత మాత్రం. మానసిక వికలాంగుడు. రెండో కుమారుడు పుట్టుకతోనే ఒక చెవి పూర్తిగా లేకపోవడంతో వినికిడి సమస్యతో బాధపడుతున్నాడు. ఈ సమస్యలన్నింటి మధ్య భర్త గంగరాజుతో మనస్పర్ధలు ఏర్పడడంతో మానసికంగా కుంగిపోయింది. దీంతోపాటు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆత్మహత్యకు పాల్పడింది.ç సునీత ఆత్మహత్యతో ఇద్దరు పిల్లలు తల్లిలేని అనాథలుగా మిగిలిపోయారు. వారికి దిక్కెవరు?ఇదిలా ఉంటే చిన్న కుమారుడికి చేతితో తినడం చేతకాకపోవడంతో రోజూ సునీతే తినిపించేదని చుట్టుపక్కల వారు చెబుతూ రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. పిల్లలిద్దిరినీ ఎవరికి అప్పగించాలో చెప్పాలని మృతురాలి తల్లి లక్ష్మీ, సోదరి, కుటుంబసభ్యుల రోదనలతో విషాద ఛాయలు అలముకున్నాయి.∙ -
మద్యం మత్తులో........
మల్కాపురం (విశాఖ పశ్చిమ): కన్న తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకే కాలయముడయ్యాడు. పెంచి పోషించాడన్న కనికరం కూడా లేకుండా మద్యం మత్తులో నిర్దాక్షిణ్యంగా కడతేర్చాడు. తండ్రీ కొడుకుల బంధానికే మచ్చగా నిలిచే ఈ దుర్ఘటన జీవీఎంసీ 49వ వార్డులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ 49వ వార్డు త్రినాథపురం సామాజిక భవనం సమీపాన నీలాపు రమణ(48) అనే వ్యక్తి భార్య పద్మ, కుమారుడు మోహన్తో కలిసి నివాసముంటున్నాడు. బతుకుతెరువు నిమిత్తం పద్మ విదేశాలలో పనులకు ఇటీవలే వెళ్లగా తండ్రీ కొడుకు స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే భార్య పద్మ ఎవరితోనే వెళ్లిపోయిందని, విదేశాలలో ఇతరులతో సహజీవనం చేస్తోందని అనుమానిస్తూ ఈ విషయంపై రమణ కొడుకుతో గొడవపడేవాడు. శనివారం రాత్రి కూడా వారి మధ్య వాదన జరిగింది. ఆదివారం కూడా నీ తల్లి తప్పుడు మనిషి.. అందుకే దూరంగా వెళ్లిపోయిందని కొడుకుతో వాదించడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న మోహన్ ఆవేశంతో తండ్రి మెడపై కాళ్లతో తొక్కి కత్తితో పొడిచేశాడు. దీంతో రమణ అక్కడికక్కడే మరణించాడు. తండ్రి మృతదేహాన్ని గదిలో ఉంచి వివాహితురాలైన అక్కకు ఫోన్లో సమాచారం అందించాడు. తండ్రి మృతిచెందాడని చూడడానికి రావాలని తెలిపాడు. దీంతో ఆమె అక్కడకు రాగా రక్తపు మడుగులో ఉన్న తండ్రిని చూసి అనుమానం వచ్చి మల్కాపురం పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిందితుడు మోహన్ పరారీలో ఉన్నాడని సీఐ కేశవరావు తెలిపారు. -
ఎందుకీ దుష్ట సంస్కృతి
-
మందులో మంగరాజు.. ఏం చేశాడో చూడండి..
సాక్షి, విశాఖపట్నం : మద్యానికి బానిసైన ఓ పోలీస్ కానిస్టేబుల్, గాంధీ జయంతిన కూడా పీకలదాకా మందుకొట్టి ఆఫీసుకెళ్లాడు. విధిగా చేయాల్సిన రోల్కాల్లో తడబడుతూ, తూలిపడ్డాడు. ఉన్నతాధికారుల ఎదురుగానే ఇదంతా జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నంలోని పెదగంట్యాడ ఫైర్ స్టేషన్లో మంగరాజు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, మద్యానికి బానిసైన అతను అక్టోబర్ 2న జరిగిన గాంధీ జయంతి వేడుకలకు మత్తులోనే హాజరయ్యాడు. ఉన్నతాధికారుల ముందు రోల్కాల్ చేస్తూ చిత్రవిచిత్రంగా ప్రవర్తించాడు. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంగరాజుపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. మంగరాజు మద్యంలో ఊగిపోతూ చేసిన ఫీట్లు పొట్టచెక్కలయ్యేంత నవ్వు పుట్టిస్తాయి... -
టౌన్ దోపిడీ: ఏసీబీ దాడుల్లో షాకింగ్ నిజాలు!
సాక్షి, విశాఖపట్నం, విజయవాడ: టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి బాగోతాలు బట్టబయలు అయ్యాయి. ఏపీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గొల్ల వెంకటరఘు, ఆయన బీనామీగా భావిస్తున్న విజయవాడ టౌన్ ప్లానింగ్ ఏవో వెంకటశివప్రసాద్ ఇళ్లపై సోమవారం ఏసీబీ అధికారులు జరిపిన వేర్వేరు దాడుల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఏపీ టౌన్ ప్లానింగ్ అధికారి రఘు ఆదాయానికి మించి ఆస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏకకాలంలో 15 చోట్ల ఏసీబీ అధికారులు ఆయన, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. చిత్తూరులోని రఘు అత్తం ఇంట్లోనూ ఏసీబీ తనిఖీలు కొనసాగాయి. విశాఖ, విజయవాడ, రాజమండ్రి, మంగళగిరి, నెల్లూరు, తిరుపతి, షిర్డీలోనూ రఘు బంధువులు ఇళ్లలో అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో రూ. 500 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక, విజయవాడ టౌన్ ప్లానింగ్ ఏవో వెంకటశివప్రసాద్ ఇళ్లపైనా ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. గన్నవరం, విజయవాడలోని ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో రూ. వందలకోట్ల ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏపీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ రఘుకు సమీప బంధువులైన ఏవో వెంకట శివప్రసాద్, ఆయన భార్య గాయత్రి.. ఆయనకు బినామీలుగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. గతంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో టెక్నికల్ ఇంజినీర్గా గాయత్రి పనిచేశారు. ఆమె ఇటీవలే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. గాయత్రి పేరు మీదనే మొత్తం డాంక్యుమెంట్లు లభించినట్టు సమాచారం. సోదాల్లో ప్రామిసరీ నోట్లు, బంగార అభరణాలు లభించాయి. బంగారు అభరణాల్లో దేవతా విగ్రహాలు, ఊయలలు, జడలు దొరకడం గమనార్హం. గన్నవరంలో 1.40 ఎకరాల్లో కల్యాణ మండపం నిర్మాణం, ఇక్కడే నిర్మాణంలో ఉన్న పలు అపార్ట్మెంట్లలో 16 ఫ్లాట్లు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. వేల్పూరులో వందల ఎకరాల్లో వ్యవసాయ భూములు వీరికి ఉన్నట్టు గుర్తించారు. ఏవో వెంకటశివప్రసాద్కు చెందిన గన్నవరంలోని ఇంట్లో రూ.10కోట్ల విలువైన బంగారం, రూ.50లక్షల నగదు, పెద్ద ఎత్తున ఖాళీ ప్రామిసరీ నోట్లు, పేరు లేని ఎంవీఆర్ జ్యుయలరీ బిల్లులు ఏసీబీ అధికారులు కనుగొన్నారు. కృష్ణాజిల్లా వేల్పూరులో వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. విశాఖ ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు, స్పెషల్ టీమ్ డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. రఘుకు షిర్డీలో కూడా ఓ లాడ్జ్ ఉందని, గన్నవరంలోని ఓ రియల్ ఎస్టేట్లో శివప్రసాద్ పేరు మీద 300 ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది. -
జయదేవ్ కోసం డీజే
-
కర్నూలులో ది విశాఖపట్టణం కో ఆపరేటివ్ బ్యాంకు
– ప్రారంభించిన రిజర్వు బ్యాంకు రీజినల్ డైరక్టర్ కర్నూలు(అగ్రికల్చర్): ది విశాఖపట్టణం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు శాఖను ఆదివారం కర్నూలు నగరంలోని అలంకార్ ప్లాజాలో రిజర్వు బ్యాంకు ఆప్ ఇండియా హైద్రాబాద్ రీజినల్ డైరక్టర్ ఆర్ఎన్ దాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏరాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ది విశాఖపట్టణం కో ఆపరేటివ్ బ్యాంకు ఏర్పాటై 101 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. ఈ బ్యాంకుపై రిజర్వు బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషి ఉంటుందని తెలిపారు. బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు మాట్లాడుతూ....ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో 11 జిల్లాల్లో బ్రాంచిలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. 43వ బ్రాంచిని కర్నూలులో ప్రారంబించినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా అన్ని రకాల రుణాలు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు, జిల్లా సహకార అధికారి సుబ్బారావు, బ్యాంకు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
5న విశాఖలో జాతీయ విద్యా సదస్సు
సాక్షి,హైదరాబాద్: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల5న విశాఖపట్నంలో జాతీయ విద్యా సదస్సును నిర్వహిస్తున్నట్లు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జీ. హృదయరాజు, ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు కె. సుబ్బారెడ్డిలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అఖిల భారత విద్యా సంఘాల సమాఖ్య(ఏఐఎఫ్ఈఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో ఉపాధ్యాయుని విలువలు - వృత్తి ఔన్నత్వాన్ని పెంపొందించుట అంశంపై జాతీయ నాయకులు ప్రసంగాలు ఉంటాయని చెప్పారు. 11 రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరౌతున్న ఈ సదస్సులో ఉపాధ్యాయులు, విద్యాభిమానులు, ప్రజాతంత్రవాదులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. -
ఉత్తరకోస్తాకు భారీ వర్ష సూచన
విశాఖ: ఉత్తర కోస్తాకు భారీ వర్షసూచన ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడనున్నట్టు అధికారులు తెలిపారు. రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. -
ఉత్తర కోస్తాకు భారీ వర్షాలు
విశాఖపట్నం: ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీరానికి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడన ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు.. ఒడిషా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే.. దక్షిణ కోస్తా, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
'మోదీ'పై చంద్రబాబు అసహనం
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు ఆశించిన స్థాయిలో సహకరించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత చట్టబద్ధంగా రావలసిన వాటిలో కొన్నే వచ్చాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం విశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. విభజన నేపథ్యంలో తలెత్తిన సమస్యలను ఇరు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని, లేదంటే కేంద్రమే పరిష్కరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ విభజన జరిగి రెండేళ్లు దాటినా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లోటు రూ.16 వేల కోట్లు భర్తీ చేయాల్సి ఉండగా కేంద్రం రూ. 4800 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. సెంట్రల్, గిరిజన యూనివర్సిటీలు ఏర్పాటు కాలేదని, పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ.800 కోట్లే ఇచ్చిందని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. వెనకబడిన ప్రాంతాలకు రావలసిన నిధులూ ఇవ్వడం లేదు.. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, రాజధాని నిర్మాణానికి నిధులూ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నవన్నీ కేంద్రం అమలు చేయాలని, పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగేలా సాయం చేయాలని కోరారు. -
‘సాక్షి’ కోసం విశాఖలో సాగర దీక్ష
ఏపీలో కొనసాగుతున్న ఆందోళనలు సాక్షి నెట్వర్క్: సాక్షి మీడియా పట్ల చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ రాష్ర్టవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు రోజుకో రీతిలో నిరసనలు తెలుపుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఆర్కే బీచ్లో సాక్షి సిబ్బంది, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు గురువారం సాగర దీక్ష చేశారు. మోకాళ్లపై నిల్చొని చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. బీచ్లో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్కేబీచ్ జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. మీడియా స్వేచ్ఛను హరిస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్న చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని ఎన్టీఆర్ను వేడుకొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సింహాచలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు మనసు మార్చాలంటూ తొలిపావంచా వద్ద ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామికి వినతిపత్రం అందజేశారు. గురువారం రాత్రి అనంతపురంలో జర్నలిస్టు సంఘాలు, వైఎస్సార్సీపీ నేతలు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు రాస్తారోకో నిర్వహించారు. సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. సాక్షి టీవీకి మద్దతుగా చైనాలో విద్యార్థుల నిరసన లయోనింగ్: ఏపీలో సాక్షి టీవీ ప్రసారాల నిలుపుదలపై మన తెలుగు రాష్ట్రాల్లోనేకాదు దేశవిదేశాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చైనాలోని లయోనింగ్ రాష్ట్రంలో వైద్య విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. జిన్ర మెడికల్ వర్సిటీలో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనను వ్యక్తంచేశారు. టీడీపీ ప్రభుత్వం తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేశారని చైనా వైఎస్సార్సీపీ మెడికల్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు కొనకళ్ల పవన్ కుమార్రెడ్డి మండిపడ్డారు. -
40 కేజీల గంజాయి స్వాధీనం
అరకు లోయ: అక్రమ రవాణా చేస్తున్న 40 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నం జిల్లాలోని అరకు ఆర్టీసీ కాంప్లెక్స్లో మహిళల నుండి దీనిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన రాసకోడి, పశ్చిమ గోదావరికి చెందిన వీర వెంకట సత్యాలమ్మ, డుంబ్రీగూడ సరాయ్ గ్రామానికి చెందిన వెన్నెల అనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డుంబ్రీగూడ మండలం నుంచి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
ఇండియాలోనే ఉన్నామా అనిపించింది: చంద్రబాబు
- విశాఖలో ప్లీట్ రివ్యూ అదరహో అన్న ముఖ్యమంత్రి - అంతర్జాతీయ కార్యక్రమ నిర్వహణతో నగర ఖ్యాతి పెరిగిందని వ్యాఖ్య విజయవాడ: ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూను ఘనంగా నిర్వహించడం ద్వారా విశాఖపట్నం కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింపజేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడిన ఆయన ప్లీట్ రివ్యూ నిర్వహణా విశేషాలను పంచుకున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు సహా 50 దేశాలకు చెందిన ప్రతినిధులను ఏపీ ప్రభుత్వం తరఫున సగౌరవంగా సత్కరించామని సీఎం చెప్పారు. కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించినందుకు ఇండియన్ నేవీకి కృతజ్ఞతలు తెలిపారు. 'సాధారణంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రులు ఒకే కార్యక్రమంలో పాల్గొనడం అరుదు. అలాంటి విశేషానికి మన రాష్ట్రం వేదికైనందుకు ఆనందంగా ఉంది. భారత నౌకాదళానికి కేంద్ర బిందువుగా విశాఖను ఎన్నుకోవడం మనకు గర్వకారణం. ప్లీట్ రివ్యూ సందర్భంగా నేవీ ఉన్నతాధికారులు ఆ విషయాన్ని ప్రకటించడం సంతోషకరం. విశాఖ ఇప్పుడొక అంతర్జాతీయ నగరం. ప్లీట్ రివ్యూ వేడుకలు చూస్తుంటే అసలు ఇండియాలోనే ఉన్నామా? అనే సందేహం వచ్చింది. నౌకాదళ పాటవ ప్రదర్శనకు 6 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. మంచి సంఘటనకు స్పందించిన ప్రజలందరినీ అభినందిస్తున్నా' అని సీఎం చంద్రబాబు అన్నారు. రెండేళ్ల కిందట విశాఖను అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుపానును ప్రస్తావిస్తూ.. ఆ సందర్భంలో మాట ఇచ్చినట్లు ఏడాది తిరిగేలోగా వైజాగ్ రూపురేఖల్ని మార్చేశామన్నారు. అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల నిర్వహణకు విశాఖ అనువైన ప్రాంతమని, గత నెలలో 44 దేశాల ప్రతినిధులతో మూడు రోజుల పాటు నిర్వహించిన ఇన్వెస్టర్స్ మీట్ కూడా విజయవంతమైందని సీఎం గుర్తుచేశారు. సీఐఐ సదస్సులో రాష్ట్రానికి 4.70లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టామన్నారు. తాజాగా నిర్వహించిన ప్లీట్ రివ్యూ కూడా విశాఖ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసిందన్నారు. కార్యక్రమాలను నిర్వహించిన తీరుకు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు లభించాయని సీఎం చెప్పారు. -
ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రణబ్, మోదీ
-
ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రణబ్, మోదీ
విశాఖపట్నం: విశాఖపట్నంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకల్లో మూడో రోజు శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నౌకాదళ అధికారులు పాల్గొన్నారు. యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రణబ్, మోదీ ప్రయాణిస్తున్నారు. అంతకుముందు రాష్ట్రపతి నౌకాదళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విశాఖ తీరంలో బంగాళాఖాతంలో 6 వరుసల్లో 70 యుద్ధనౌకలను మోహరించారు. రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణిస్తున్న ఐఎన్ఎస్ సుమిత్రను మరో 5 యుద్ధ నౌకలు అనుసరిస్తున్నాయి. యుద్ధ నౌకల సామర్థ్యాన్ని రాష్ట్రపతి పరిశీలించనున్నారు. ఫ్లీట్ రివ్యూ బ్రాండ్ అంబాసిడర్లుగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వ్యవహరిస్తున్నారు. -
నేడు విశాఖ రానున్న రాష్ట్రపతి, ప్రధాని
విశాఖపట్నం: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకలు శుక్రవారం ఐఎన్ఎస్ శాతవాహన కమాండ్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ నేడు రాత్రి విశాఖ చేరుకోనున్నారు. ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి 11 వేల నేవీ ప్రతినిధులు హాజరుకానున్నారు. శనివారం జరిగే తూర్పు నౌకాదళ సమీక్షలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ప్రధాని గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ఫ్లీట్ రివ్యూ బ్రాండ్ అంబాసిడర్లుగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వ్యవహరిస్తున్నారు. వీఐపీల రాక సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సింథియా నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు వాహనాలను నిషేధించారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు, శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఆంక్షలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. -
స్మార్ట్ సిటీల తొలి జాబితా విడుదల
-
స్మార్ట్ సిటీల తొలి జాబితా విడుదల
న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీల తొలి జాబితాలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగరాలు విశాఖపట్నం, కాకినాడలకు స్థానం దక్కింది. 20 నగరాల పేర్లతో కూడిన స్మార్ట్ సిటీల తొలి జాబితాను గురువారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీల ఎంపికలో పారదర్శక విధానం పాటించామన్నారు. ఆకర్షణీయ నగరాల కోసం రూ. 3 లక్షల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఆకర్షణీయ నగరాలతో జీవన ప్రమాణాలు మెరుగవుతావుతాయని అన్నారు. స్మార్ట్ సిటీ చాలెంజ్ లో తెలంగాణ నగరాలకు అవకాశం దక్కలేదు. ఒక పాయింట్ తేడాతో వరంగల్ అవకాశం కోల్పోయింది. విశాఖ 8, కాకినాడ 14 స్థానాల్లో నిలిచాయి. తొలి జాబితాలోని స్మార్ట్ సిటీలు 1. భువనేశ్వర్ 2. పుణె 3. జైపూర్ 4. సూరత్ 5. కొచ్చి 6. అహ్మదాబాద్ 7. జబల్పూర్ 8. విశాఖపట్నం 9. సోలాపూర్ 10. దావణగెరె 11. ఇండోర్ 12. న్యూఢిల్లీ 13. కోయంబత్తూరు 14. కాకినాడ 15. బెల్గావి 16. ఉదయపూర్ 17. గువాహటి 18. చెన్నై 19. లుథియానా 20. భోపాల్ -
విశాఖ సదస్సులో భారీ ఒప్పందాలు
-
సంక్రాంతి దాకా చలి...ఆపై ఎండల దాడి
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుత చలి సంక్రాంతి వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 'కొన్నాళ్ల నుంచి వీస్తున్న తూర్పు, ఆగ్నేయ గాలులు మళ్లీ దిశ మార్చుకున్నాయి. ప్రస్తుతం ఇవి ఆగ్నేయ, దక్షిణ దిశ నుంచి వీస్తున్నాయి. ఫలితంగా చలిగాలుల ఉధృతికి కాస్త అడ్డుకట్ట పడినట్టయింది. లేకుంటే కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గిపోయేవి. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఒకట్రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. దక్షిణ, ఆగ్నేయ గాలుల ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికంటే తగ్గే అవకాశం లేదు. సంక్రాంతి తర్వాత మాత్రం ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయి' అని విశాఖ వాతావరణ శాఖ మాజీ అధికారులు చెప్పారు. -
విశాఖలో బాలికపై సామూహిక అత్యాచారం
-
విశాఖలో మళ్లీ క్రికెట్ సందడి
నేడు సన్రైజర్స్తో రాజస్తాన్ మ్యాచ్ సాక్షి, విశాఖపట్నం: దాదాపు ఆరు నెలల తర్వాత విశాఖపట్నంలో మళ్లీ క్రికెట్ సందడి మొదలైంది. ఐపీఎల్-8లో భాగంగా నేడు (గురువారం) సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. హుదూద్ తుపాన్ కారణంగా అక్టోబర్ 14న భారత్, వెస్టిండీస్ల మధ్య జరగాల్సిన వన్డే మ్యాచ్ రద్దయిన తర్వాత మళ్లీ క్రికెట్ జరుగుతుండటంతో అభిమానులు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో మ్యాచ్కు ఆతిథ్యమిస్తున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం పూర్తిగా నిండే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక మ్యాచ్ విషయానికొస్తే స్మిత్ సారథ్యంలోని రాజస్తాన్ జట్టు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో విజయం సాధించి మంచి జోరుమీదుంది. కెప్టెన్ షేన్ వాట్సన్ ఈ మ్యాచ్లో కూడా బరిలోకి దిగే అవకాశాల్లేవు. మరోవైపు సన్రైజర్స్ ఒక దాంట్లో గెలిచి మరోదాంట్లో ఓడింది. గత మ్యాచ్లో బెంగళూరుపై విజయంతో సన్రైజర్స్ ఆత్మవిశ్వాసంతో ఉంది. -
విశాఖలో బయోకాన్ యూనిట్ ఏర్పాటు
ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీలో కంపెనీ సీఎండీ వెల్లడి సాక్షి, హైదరాబాద్: విశాఖపట్టణంలో బయోకాన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫార్మా రంగ దిగ్గజం, బయోకాన్ సంస్థ సీఎండీ కిరణ్ మజుందార్ షా ప్రకటించారు. ఆదివారం ఆమె ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ మజుందార్ షా మాట్లాడుతూ ఆర్నెల్లలో ఈ యూనిట్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. బయోకాన్ సంస్థ రూపొందించిన ఈ-హెల్త్కేర్ తద్వారా ఒనగూరే ప్రయోజనాలపై సీఎం చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కిరణ్ వివరించారు. టెలిమెడిసిన్ ద్వారా రోగుల ఆరోగ్య వివరాల్ని నెట్లో ఉంచి ఎలా వైద్య సేవలు పొందవచ్చో ఈ సందర్భంగా వివరించారు. ఈ-డయాగ్నోస్టిస్ కాన్సెప్ట్ గ్రామీణ పేదలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో లేని గ్రామీణులకు, వైద్యం కోసం నగరాలకు రాలేని వారికి ఈ చికిత్సా విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఒడిశాలో 50, రాజస్థాన్లో 100 కేంద్రాలను ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏపీలోనూ 100 నుంచి 200 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. -
టీడీపీలో రెవెన్యూ బదిలీల చిచ్చు
విశాఖపట్నంపై పట్టు సాధించాలన్న టీడీపీ పెద్దల వ్యూహం అధికార పార్టీలో ఆధిపత్య పోరుకు దారితీస్తోంది. భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్న ఇతర జిల్లాల మంత్రులు, సీఎం చంద్రబాబు పేషీ పెద్దలు వ్యూహరచన బెడిసికొట్టింది. జిల్లాలో ఆర్డీవోల బదిలీ అధికార టీడీపీలో చిచ్చు రాజేసింది. ఇతర జిల్లాల మంత్రులు, సీఎం పేషీలోచక్రం తిప్పుతున్న పెద్దల అభిమతానికి అనుగుణంగా జరిగిన ఈ బదిలీలపై విశాఖ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆర్డీవోల బదిలీల్లో తమ జిల్లాపై ఇతర జిల్లాల మంత్రులు, సీఎంపేషీలోని షాడో నేతలు పెత్తనమేమిటని జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన అనుకూల ఎమ్మెల్యేలు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడ్డారు. ప్రధానంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దేవినేని ఉమ, రావెల కిషోర్బాబు, యనమల రామకృష్ణుడుల తీరుపై మండిపడినట్లు తెలుస్తోంది. ఇక పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి ఏకంగా రాజీనామాకు సిద్ధపడటంతో పరిస్థితి తీవ్రరూపు సంతరించుకుంది. పరిస్థితి చేయిదాటేట్లు కనిపించడంతో ఆర్డీవోల బదిలీలపై ప్రభుత్వం వెనక్కితగ్గాలని నిర్ణయించుకుంది. కొత్త ఆర్డీవోలను జాయిన్ చేసుకోవద్దని కలెక్టర్ను మౌఖికంగా ఆదేశించింది. పట్టు కోసం... నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామిక రాజధానిగా భావిస్తున్న జిల్లాపై పట్టుకోసం టీడీపీ పెద్దలు సిగపట్లు పడుతున్నారు. జిల్లాలో పెట్రోకారిడార్, సెజ్లు, ఇతర ప్రాజెక్టులకు భారీస్థాయిలో భూసేకరణ చేపట్టనున్నారు. భూకేటాయింపులపై టీడీపీ పెద్దల సన్నిహితులు కన్నేశారు. అందుకే కీలకమైన రెవెన్యూ పోస్టుల్లో తమ సన్నిహితులు ఉండాలని ఆర్డీవో బదిలీలను మార్గంగా చేసుకుంటున్నారు. అందుకోసం ఇతర జిల్లాల మంత్రులు, సీఎంపేషీ పెద్దలు ఓవర్గంగా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు మరోవర్గంగా ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఆర్డీవోల నియామకానికి సంబంధించి జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు కొందరి పేర్లను సూచించారు. బుధవారం రాత్రి ఆర్డీవోల బదిలీ జాబితాతో వారు కంగుతిన్నారు. విశాఖ ఆర్డీవోగా ఉన్న వెంకట మురళి, అనకాపల్లి ఆర్డీవో ఎస్.ఎన్.వి.బి. వాసుదేవరాయుడులను ప్రభుత్వం బదిలీ చేసింది. వారికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా హైదరాబాద్లో రిపోర్టు చేయమన్నారు. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న వై. రామచంద్రారెడ్డిని విశాఖ ఆర్డీవోగా బదిలీ చేసింది. వెయిటింగ్లో ఉన్న బి.పద్మావతిని అనకాపల్లి ఆర్డీవోగా నియమించింది. మంత్రి గంటా, టీడీపీ ఎమ్మెల్యేల అభిప్రాయానికి విరుద్ధంగా ఆర్డీవోలను బదిలీ చేసింది. మరోవైపు నర్సీపట్నం ఆర్డీవో విషయంలో మంత్రి అయ్యన్నపాత్రుడి మాట చెల్లుబాటైంది. ఆయన సూచనలమేరకు ప్రస్తుత ఆర్డీవో సూర్యారావును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర జిల్లా మంత్రుల పెత్తనం ఆర్డీవోల బదిలీ వెనుక ఇతర జిల్లాల మంత్రులు చక్రం తిప్పారు. ఆర్డీవో నియామకంలో మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దేవినేని నెహ్రూ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మంత్రులు యనమల రామకృష్ణుడు, రావెల కిషోర్బాబు అభీష్టం మేరకు అనకాపల్లి కొత్త ఆర్డీవోను నియమించారని సమాచారం. సీఎం పేషీలోనే చక్రం తిప్పి ఆ నలుగురు మంత్రులు తాము కోరుకున్నవారికి జిల్లాలో పోస్టింగులు వేయించుకున్నారు. దీనికి నారా లోకేష్ సన్నిహితుల ఆశీస్సులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అందుకే జిల్లా మంత్రులు సూచించినవారిని కాకుండా కనీసం వారికి సమాచారం లేకుండానే ఆర్డీవోలను నియమించారు. భగ్గుమన్న విశాఖ నేతలు... ఆర్డీవోల బదిలీల వ్యవహారం బెడిసికొట్టింది. గంటా శ్రీనివాసరావు, ఆయన వర్గీయులైన అనకాపల్లి ఎంపీ అవంతీ శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి తీవ్రస్థాయిలో స్పందించారు. జిల్లాపై ఇతర జిల్లాల మంత్రుల పెత్తనమేమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి తాను రాజీనామాకు వెనుకాడేది లేదని చెప్పడం గమనార్హం. ఆర్డీవో పోస్టింగే కాదు కనీసం తహశీల్దార్ పోస్టింగులను కూడా ఇతర జిల్లాల మంత్రులే నిర్ణయిస్తే ఇక తామెందుకు పదవుల్లో కొనసాగడమని ఆయన ప్రశ్నించారు. ఆయన్ని మంత్రి గంటా అనునయించారు. పరిస్థితి చేయిదాటేట్లుగా ఉండటంతో సీఎం కార్యాలయ అధికారులు సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు సమాచారం అందించారు. దాంతో ప్రస్తుతానికి ఆర్డీవోల బదిలీలను నిలుపుదల చేయాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఆర్డీవోగా నియమితులైన వై.రామచంద్రారెడ్డిని బాధ్యతలు స్వీకరించవద్దని చెప్పారు. ఆయన బాధ్యతలు స్వీకరించేందుకు కలెక్టర్ యువరాజ్ను గురువారం ఉదయం కలిశారు. ఆయన్ను జాయిన్ చేసుకోవాలని తమకు ఆదేశాలు రాలేదని కలెక్టర్ ఆయనతో చెప్పడం గమనార్హం. మరోవైపు హైదరాబాద్లో రిపోర్టు చేయమని ఆదేశాలు వచ్చినప్పటికీ వెంకటమురళి విశాఖ ఆర్డీవోగా గురువారం విధులకు హాజరయ్యారు. అనకాపల్లి ఆర్డీవోగా ఉంటూ బదిలీ అయిన వసంతరాయుడు కూడా విధుల నుంచి రిలీవ్ కాలేదు. ఆయన గురువారం విధులు నిర్వర్తించారు. మంత్రి గంటా, ఎమ్మెల్యేల ఒత్తిడికి ప్రభుత్వం వెనక్కితగ్గినట్లే కనిపిస్తోంది. ఈ బదిలీలపై తుది నిర్ణయం ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది. -
వైజాగ్ కోసం...నేను సైతం!
శ్రీయ మంచి నటి మాత్రమే కాదు.. మంచి చిత్రకారిణి కూడా. ఆ విషయం కొద్దిమందికే తెలుసు. చిన్నప్పుడు సరదాగా ఎన్నో అందమైన బొమ్మలు గీసిన శ్రీయ తాజాగా కుంచె పట్టారు. అయితే ఈసారి సరదా కోసం కాదు.. ఓ బలమైన కారణం కోసం. హుదూద్ తుపాను కారణంగా నిన్నటి విశాఖపట్నం శోభ ఇప్పుడు లేదు. నగరానికి మళ్లీ పాత వైభవాన్ని తీసుకురావడానికి ఎవరికి తోచిన రీతిలో వాళ్లు సహాయం చేస్తున్నారు. శ్రీయ కూడా తన వంతుగా రెండు బొమ్మలు గీశారు. వైజాగ్ పునరుద్ధరణ కోసం నిధి సమకూర్చే దిశలో ఏర్పాటు చేసిన ఒక ‘ఆర్ట్ షో’కు తాను గీసిన కృష్ణుడు, బుద్ధుడి బొమ్మలను పంపించారు శ్రీయ. ఆదివారం హైదరాబాద్లో ఈ షో జరగనుంది. ఈ సందర్భంగా శ్రీయ మాట్లాడుతూ -‘‘ఆర్ట్ షోకి ఏదైనా బొమ్మలు గీసివ్వాలని నిర్వాహకులు నన్ను కోరారు. ఓ సత్కార్యం కోసం చేస్తున్నది కాబట్టి, వెంటనే అంగీకరించాను. నా పరిధిలో వైజాగ్ కోసం ఏ సహాయం చేయడానికైనా వెనకాడకూడదనుకున్నాను. విశాఖ నగరంతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. బోల్డన్ని తీపి జ్ఞాపకాలు మిగిల్చిన నగరం అది. నటిగా నా తొలి సన్నివేశం చేసింది అరకులోనే. అలాగే, నౌకాదళంలో పని చేస్తున్న నా కజిన్ ఉండేది ఆ నగరంలోనే. ప్రకృతి సృష్టించిన బీభత్సం గురించి తను చెప్పినప్పుడు చాలా బాధగా అనిపించింది’’ అని చెప్పారు. -
వైజాగ్కు పొంచి ఉన్న మరోముప్పు ?
-
విశాఖ సముద్ర తీరం అల్లకల్లోలం
-
ఆశలు 'రేసుగుర్రాలై'.. ఫలితాలు అశనిపాతాలై..
-
తొలకరి ఎప్పటికి పలకరించేనో ?!
-
ప్రశాంతి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు
విశాఖపట్నం: విశాఖపట్నం-బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్లో బాంబు పెట్టినట్టుగా బెదిరింపులు వచ్చాయి. దీంతో శనివారం మధ్యాహ్నం దువ్వాడ రైల్వే స్టేషన్లో రైలు ఆపివేశారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి రైల్లో క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
సినీ పరిశ్రమ చూపు.. విశాఖ వైపు..!
-
తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల్లోనూ క్రెడాయ్ చాప్టర్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రసుత్తం క్రెడాయ్కి ఆంధ్రప్రదేశ్లో 18 చాప్టర్లు, 2,200 మంది డెవలపర్లున్నారు. త్వరలోనే వీటి సంఖ్య 23కు చేరుకోనుంది. నిజామాబాద్, మంచిర్యాల, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో త్వరలోనే క్రెడాయ్ చాప్టర్లను ప్రారంభించనున్నట్లు భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) ఏపీ చాప్టర్ ప్రెసిడెంట్ ఎస్.రాంరెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యాక తెలంగాణ, సీమాంధ్ర రెండు రాష్ట్రాల్లోనూ క్రెడాయ్ చాప్టర్లను ప్రారంభిస్తామన్నారు. ఇంకాఏమన్నారంటే.. సీమాంధ్రలో ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి జిల్లాలు అభివృద్ధి చెందాయి. హైదరాబాద్ విషయంలో జరిగిన పొరబాటును కేంద్ర ప్రభుత్వం పునరావృతం చేయదు. అందుకే సీమాంధ్రలో ఏర్పాటు చేయబోయే కొత్త రాజధాని ఈ మూడు జిల్లాల్లో ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. అందుకే వేరే జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు. దీంతో కొత్త రాజధాని ఉండే ప్రాంతం కేవలం పరిపాలనాపరమైన అభివృద్ధినే సాధిస్తుంది. మిగతా జిల్లాల్లో ఐటీ, ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం ఇస్తారు. కొత్త రాజధాని ఏర్పాటు, సచివాలయం, హైకోర్టు వంటి ప్రభుత్వ విభాగాల ఏర్పాటు కోసం 50 నుంచి 60 వేల ఎకరాల భూమిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుంది. దీంతో ఆ ప్రాంతంలో ఐటీ, పరిశ్రమల ఏర్పాటు అవకాశం ఇవ్వరు. దీంతో సీమాంధ్ర రాజధానితో సమానంగా ఇతర జిల్లాలూ అభివృద్ధి చెందుతాయి. నిర్మాణ రంగం పరంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కర్నూల్ జిల్లాకు బాగా కలిసొస్తుంది. ఎలాగంటే.. తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ నుంచి కర్నూల్కు గంటన్నరలో చేరుకోవచ్చు. అదే సీమాంధ్ర రాజధాని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేసినా కర్నూల్కు చేరుకోవాలంటే ఎంతలేదన్నా నాలుగు గంటల సమయం పడుతుంది. కర్నూల్ వాసులకు తెలంగాణ, సీమాంధ్ర రెండు రాష్ట్రాల రాజధానులను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఎంత రెవెన్యూ వస్తే తెలంగాణ రాష్ట్రం అంతగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి హైదరాబాద్లో పెట్టుబడులకు ఇక్కడి ప్రభుత్వం ఎర్ర తివాచీ పరుస్తుంది. ఇప్పటికే ఉన్న ఓఆర్ఆర్, మెట్రో, మాస్టర్ప్లాన్, విమానాశ్రయం వంటివి అదనపు అంశాలు. 2015 చివరికల్లా హైదరాబాద్లో 2.5 కోట్ల చ.గ. విస్తీర్ణంలో బడా బడా ప్రాజెక్టులు రానున్నాయి.