Warangal Crime News
-
నకిలీ గడ్డి మందుల ముఠా అరెస్ట్
సాక్షి, వరంగల్: నకిలి విత్తనాలతో పాటు గడువు తీరిన పురుగుల మందులను విక్రస్తున్న ముఠా గుట్టును వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నకిలీ విత్తనాలు, మందులతో పాటు నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్న మూడు ముఠాలకు చెందిన 13మందిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అలాగే ఇద్దరు ఫర్టిలైజర్ షాప్ యాజమానులపై కూడా కేసు నమోదయ్యింది. ఈ దాడిలో నిందితుల నుంచి 75 లక్షల విలువైన నకిలీ, గుడువు తీరిన పురుగుల మందు, నిషేధిత గడ్డి మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మందుల తయారీకి అవసరమైన రసాయనాలు, ప్రింటింగ్ సామగ్రి, ఖాళీ బాటిల్స్, ఓ కారును పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. పట్టుబడ్డ మందుల్లో 24 లక్షల రూపాయల విలువైన గడువు తీరిన పురుగు మందులు, 30 లక్షల రూపాయల విలువ గల నకిలీ పురుగు మందులు, 3 లక్షల 53వేల రూపాయల విలువగల ప్రభుత్వ నిషేదిత గడ్డి మందు ఉన్నట్లు సిపి రంగనాథ్ తెలిపారు. గడువు తీరిన మందులు సైతం విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో నిఘా పెట్టగా ముఠాల గుట్టురట్టయిందని, కల్తీలపై ప్రత్యేక దృష్టి పెట్టి, సీరియస్ యాక్షన్ చేపట్టామన్నారు. కల్తీలతో మోసానికి పాల్పడే వారిపై పిడి యాక్ట్ అమలు చేస్తామని పేర్కొన్నారు. మందులు కొనే ముందు జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలని సిపి రంగనాథ్ రైతులకు సూచించారు. -
భార్యపై పెట్రోల్ పోసి హత్య చేసిన భర్త
సాక్షి, ఏటూరునాగారం: కట్టుకున్న భర్త భార్యపై పెట్రోల్ పోసి హత్య చేసిన సంఘటన మండల కేంద్రంలోని తీగలవాయి ప్రాంతంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం. ఏటూరునాగారం మండలకేంద్రంలోని తీగలవాయి ప్రాంతానికి చెందిన గునిగంటి ప్రవీణ్కుమార్తో ఇదే మండలం చిన్నబోయినపల్లి పంచాయతీ హనుమాన్ నగర్కు చెందిన గొసు్కల జ్యోతి, నర్సయ్య కుమార్తె శిరీషతో రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. స్థానికంగా ఇద్దరూ నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాది బాబు కూడా ఉన్నాడు. అనాథగా మారిన బాలుడు బుధవారం భార్యభర్తల మధ్య గొడవలు రావడంతో భర్త ప్రవీణ్కుమార్ భార్య శిరీషపై పెట్రోల్ పోసి నిప్పంటించగా మంటలు వ్యాప్తి చెంది శిరీష ఒల్లు కాలిపోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శిరీషను భర్త ప్రవీణ్ ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు భర్త ప్రవీణ్కుమార్ విలేకరులకు తెలిపారు. భార్య మృతదేహాన్ని వదిలేసి పారిపోయి తన నివాసానికి రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కానిస్టేబుల్ కృష్ణయ్య నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. తల్లి మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో బాలుడు ఉన్నాడు. -
స్టేషన్ ఎదుట కలకలం.. రైతు ఆత్మహత్యాయత్నం
సాక్షి ప్రతినిధి, వరంగల్: భూ వివాదంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ రైతు పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం చోటుచేసుకుంది. ఆయన పరిస్థితి ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటన కలకలం రేపింది. కమలాపూర్ పోలీసుస్టేషన్ ఎదుట 20 రోజుల్లో ఇది రెండో ఆత్మహత్యాయత్నం ఘటన కావడం గమనార్హం. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. కమలాపూర్ మండలం మర్రిపల్లికి చెందిన కుందూరు సంజీవరెడ్డి, శ్రీనివాస్రెడ్డి కుటుంబీకులు సుమారు 50 ఏళ్ల కిందట తమ మేనమామ పింగిళి శ్రీరాంరెడ్డి నుంచి 11 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఇందులో 1.17 ఎకరాల భూమిని చందుపట్ల వెంకట్రెడ్డి, సర్పంచ్ భర్త చందుపట్ల సరోత్తంరెడ్డి అండతో వీరి మేనత్త పింగిళి శ్రీమతిదేవి ఆక్రమించుకుంది. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఆరు నెలలుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీమతిదేవి ఆ భూమిలో వరి నాట్లు వేయగా శ్రీనివాస్రెడ్డి అడ్డుకున్నాడు. దీనిపై కమలాపూర్ పోలీస్స్టేషన్లో ఈ నెల 24వ తేదీన కేసు నమోదైంది. ఆ భూమిలోకి ఎవరూ వెళ్లవద్దని పోలీసులు ఆదేశించారు. అయితే బుధవారం శ్రీమతిదేవి సంబంధీకులు వెళ్లడంతో సంజీవరెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు అడ్డుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకోవద్దని, రెవెన్యూ అధికారులు లేదా పోలీస్స్టేషన్కు వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అక్కడి నుంచి పోలీస్స్టేషన్కు వెళ్లిన శ్రీనివాస్రెడ్డిని ఎస్ఐ పరమేశ్ బెదిరింపులకు గురి చేశాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో అటు రెవెన్యూ అధికారులు, ఇటు పోలీసుల నుంచి తనకు న్యాయం జరగడం లేదనే శ్రీనివాస్ రెడ్డి మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి పోలీస్స్టేషన్ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన ఎస్ఐ జె.పరమేశ్ వెంటనే శ్రీనివాస్రెడ్డిని కమలాపూర్ పీహెచ్సీకి, అక్కడి నుంచి హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్ మాట్లాడుతూ శ్రీనివాస్రెడ్డి కోలుకుంటున్నాడని, ఆయన ఆత్మహత్యాయత్నానికి పోలీసులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా ఇలాంటి సంఘటన కమలాపూర్ పోలీసుస్టేషన్ ఎదుట 20 రోజుల్లో ఇది రెండోది. -
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రియుడిపై కేసు
సాక్షి, వరంగల్: ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండల పరిధి నల్లగుంట గ్రామ శివారు దేవాదుల పైపులైను సమీపాన ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నల్లగుంటకు చెందిన ధరంసోతు రాజేష్, భూపాలపల్లి జిల్లా మంజూర్నగర్కు చెందిన ఓ యువతి(16) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం ఇంట్లో తెలియడంతో తల్లితో పాటు బంధువులు యువతిని ప్రశ్నించినట్లు తెలిసింది. పెళ్లికి నిరాకరిస్తారనే భయంతో సదరు యువతి గురువారం రాత్రి 8 గంటల సమయంలో నల్లగుంటకు వచ్చి రాజేష్తో కలిసి గ్రామసమీపాన ఉన్న దేవాదుల పైపులైన్ వద్దకు చేరుకుని పురుగుల మందు తాగారు. అపస్మారకస్థితిలో ఉన్న రాజేష్ తెల్లవారుజామున స్నేహితులకు ఫోన్ చేయగా.. వారిద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రేమికులిద్దరిని ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాజేష్ను మల్లంపల్లిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి, యువతిని వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన యువతి మైనర్గా పోలీసులు పేర్కొంటున్నారు. రాజేష్పై కేసు నమోదు తమ కూతురు గురువారం రాత్రి 7 గంటలకు కిరాణా సామగ్రి తీసుకురావడానికి వెళ్లి తిరిగిరాలేదని యువతి తల్లి శుక్రవారం ఉదయం భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దూరపు బంధువైన ధరంసోతు రాజేష్పై అనుమానం ఉందని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అభినవ్ తెలిపారు. -
దారి గొడవలో గాయపడ్డ మహిళలు.. పరిస్థితి విషమం
సాక్షి, వరంగల్: అర్బన్ జిల్లాలో రెండు కుటుంబాల మధ్య చెలరేగిన దారి ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ గొడవలో ప్రశ్నించిన ఒక కుటుంబానికి చెందిన మహిళలపై కర్రలతో చితకబాదిన దారుణ ఘటన ఖిల్లా వరంగల్ వసంతపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. తీవ్రగాయలైన వారిని హాస్పిటల్కు తరలిచించారు. ప్రస్తుం వారి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు... దారి విషయంలో గుండెకారి బాబు, గుండెకారి జగదీష్ అనే అన్నదమ్ముల కుటుంబాలు గత కొద్దికాలం నుంచి గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం ఈ రెండు కుటుంబాల మధ్య మాట మాట పెరగడంతో జగదీష్ కుటుంబ సభ్యులు కర్రలతో దాడికి దిగారు. మహిళలని కూడా చూడకుండా విచక్షణారహితంగా పశువులను కొట్టినట్లు కర్రలతో చితక బాదారు. ఈ దాడిలో బాబు భార్యతో పాటు, అడ్డుకున్న మరో మహిళ తలకు కూడా తీవ్ర గాయలయ్యాయి. దీంతో వారిని హాస్పిటల్కు తరలించారు. తలకు గట్టి గాయాలు కావడంతో వారి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు పెర్కొన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గీసు గీసుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదుగురు స్నేహితులను కబళించిన ప్రమాదం
అందరూ మంచి స్నేహితులు.. అందులో ఓ మిత్రుడి సోదరుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. ఆనందంగా కార్యక్రమం ముగించుకున్నాక ఒక మిత్రుడిని స్వస్థలంలో దింపడానికి కారులో బయలుదేరారు. అప్పుడే తెల్లవారుతోంది. మసక మసక చీకటికి తోడు నిద్ర ఆవహించే సమయమది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళ్తున్న వాహనాలు. కనులు తెరుస్తూ మూస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు వాహనదారులు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ఇసుక లారీ కారును ఢీకొనడంతో భారీ శబ్దం. తేరుకునేలోపే అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు విగతజీవులుగా మారారు. సాక్షి, దామెర(వరంగల్) : మిత్రుడి సోదరుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరైన స్నేహితులను మృత్యురూపంలో వచ్చిన ఇసుక లారీ పొట్టన పెట్టుకుంది. గమ్యం చేరకముందే కారులో అందరూ విగతజీవులుగా మారారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వరంగల్ అర్బన్ జిల్లా పెద్దమ్మగడ్డకు చెందిన కండె జయప్రకాష్(23), పోచమ్మమైదాన్కు చెందిన మేకల రాకేష్(23), హసన్పర్తికి చెందిన గజవెల్లి రోహిత్(20), ములుగుకు చెందిన కొండబోయిన నరేష్(23), వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటకు చెందిన షేక్ షాబీర్(19) మృత్యువాత పడ్డారు. మృతుల్లో అందరూ పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం. వివరాలు.. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గజవెల్లి రోహిత్(20), కండె జయప్రకాష్(23), షేక్ సాబీర్(19), మేకల రాకేష్(23) వీరంతా నగరంలోని పలు ప్రాంతాల్లో నివసిస్తుండగా కొండవేన నరేష్(23) మాత్రం ములుగుకు చెందిన వాడు. జయప్రకాష్ నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతుండా మిగతావారంతా ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మేకల రాకేష్ బంధువైన మేకల ప్రవీణ్ పుట్టిన రోజు వేడుకల కోసం మంగళవారం అర్ధరాత్రి అందరూ కలుసుకుని కేక్ కట్ చేసిన అనంతరం విందు చేసుకున్నారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున నరేష్ను ములుగులో దింపడానికి కారులో బయలు దేరారు. ఈ క్రమంలో దామెర మండలంలోని పసరగొండ క్రాస్ వద్దకు రాగానే కారు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన ఇసుక లారీ ఢీ కొట్టింది. కారు నుజ్జునుజ్జు కావడమే కాకుండా అందులోని వారంతా విగతజీవులుగా మారారు. విషయం తెలియగానే సంఘటనా స్థలాన్ని పరకాల ఏసీపీ శ్రీనివాస్, ఆత్మకూరు, శాయంపేట సీఐలు వెంకటేశ్వర్రావు, రంజిత్ కుమార్, ఎస్సై భాస్కర్ రెడ్డి, రాజబాబులు చేరుకొని కారులో ఇరుక్కుపోయిన మృత దేహాలను బయటికి తీసి మార్చురీకి తరలించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మేకల చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మిన్నంటిన బంధువుల రోదనలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకులు కుటుంబాల సభ్యుల రోదలను మిన్నుముట్టాయి. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించగా బంధువులు పెద్ద ఎత్తున మార్చూరీకి చేరుకున్నారు. చేతికొచ్చిన చెట్టంత కొడుకులను పోగొట్టుకున్న తల్లిదండ్రులు, వారి స్నేహితుల బోరున విలపించారు. బైక్ పెట్టి కారు అద్దె..? జయప్రకాష్ అలియాస్ చందు తన బైక్ను హన్మకొండలోని హనుమాన్నగర్లో ఓ వడ్డీ వ్యాపారి వద్ద తనకా పెట్టి ఆ డబ్బుతో కారును అద్దెకు తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే బైక్ రైడర్గా పేరున్న జయప్రకాష్ ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడని సమాచారం. ప్రైవేట్ కంపెనీలో.. మేకల రాకేష్... వరంగల్ : వరంగల్ పోచమ్మమైదాన్కు చెందిన మేకల చంద్రమౌళి, స్వరూప దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు రాకేష్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం మహేశ్వరీని ప్రేమించి పెళ్లి చేసుకోగా రెండు నెలల క్రితం పాప జన్మించింది. ఎదిగిన కొడుకు మృతి చెందడంతో కుటుంబం సభ్యులు విలపిస్తున్నారు. బేకరీలో పనిచేస్తూ.. షేక్సాబీర్.. నర్సంపేట రూరల్ : వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన షేక్ యాకూబ్– నూర్జాన్ దంపతుల కుమారుడు సాబీర్(19). చిన్నతనంలో తండ్రి యాకూబ్ మృతిచెందాడు. సాబీర్ కొంతకాలంగా వరంగల్ పోచమ్మమైదాన్లోని ఒక బేకరీలో పనిచేస్తూ ఆటోనగర్లో అద్దెకు ఉంటున్నాడు. సాబీర్ తల్లి ఖానాపూర్ బీసీ హాస్టల్ వర్కర్గా పనిచేస్తోంది. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు విలిపస్తున్నారు. బైక్ రైడింగ్లో ఫేమస్..జయప్రకాష్ హన్మకొండ చౌరస్తా : హన్మకొండలోని పెద్దమ్మగడ్డకు చెందిన మేడి జయప్రకాష్(23) అలియాస్ చందు కమ్యూనిస్టు నాయకుడిగా పేరున్న నర్సయ్యకు ఒక్కేఒక్క కుమారుడు. దీంతో తల్లిదండ్రులు చిన్న నాటి నుంచి గారాబంగా పెంచారు. పాఠశాల విద్యతోనే చదువు మానేసిన జయప్రకాష్ చెడు అలవాట్లకు బానిసయ్యాడు. బైక్ రైడింగ్లో ఫేమస్ అయిన ఇతడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ అభిమాని. అయితే ఈనెల 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో మంగళవారం కాళేశ్వరానికి వెళ్లి అక్కడి నుంచి బొగత జలపాతం చేరుకుని పుట్టిన రోజు వేడుకుల జరుపుకున్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. క్యాటరింగ్, డెకరేషన్ : రోహిత్ నయీంనగర్ : హన్మకొండ నయీంనగర్ లష్కర్ సింగారానికి చెందిన గజవల్లి రోహిత్(20) అలియాస్ కెన్ని స్వస్థలం హసన్పర్తి మండలం వంగపాడు గ్రామం. రోహిత్ తాత గజవల్లి శంభులింగం చిందు నాటకాలు చేసే వారు. రోహిత్ తండ్రి గజవల్లి యాదగిరి ఎల్లాపూర్లో పాస్టర్గా పని చేస్తున్నారు. ఏళ్ల క్రితమే శంభులింగం తన కుమారులతో హనుమకొండ లష్కర్ సింగారానికి వచ్చి నివసిస్తున్నారు. రోహిత్ పదో తరగతి మధ్యలోనే మానేసి క్యాటరింగ్, డెకరేషన్ పనులు చేస్తున్నాడు. పనిచేసే చోట పరిచయమైన వారితో కలసి వెళ్లి మృత్యువాత పడ్డారని కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. కొండవేన నరేష్.. ములుగు రూరల్: ములుగుకు చెందిన కొండవేన సరోజన–సాంబయ్య దంపతుల కుమారుడు నరేష్. అతడి తండ్రి 20 ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. నరేష్ కొంతకాలం హైదరాబాద్లో పని చేసుకుంటూ జీవనం కొనసాగించి.. కొంత కాలంగా ములుగులో ఉంటున్నాడు. ప్రాణాలు దక్కించుకున్న ప్రవీణ్ మేకల ప్రవీణ్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న అనంతరం ప్రవీణ్ కూడా కారులో వెళ్లాల్సి ఉంది. అయితే కారులో ఐదుగురే కూర్చునే వీలుండడంతో ప్రవీణ్ ఇంటి వద్దే ఉండిపోయాడు. దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి వరకు తనతో ఆనందంగా ఉన్న మిత్రులందరూ ఒక్కసారిగా విగత జీవులుగా మారడంతో ప్రవీణ్ బోరున విలపించాడు. అతి వేగం కూడా కారణమే.. కారు అతి వేగం కూడా ప్రమాదానికి కారణమని పోలీసులు చెపుతున్నారు. కారులో ఉన్న వారు సీట్ బెల్టులు పెట్టుకొని ప్రయాణిస్తున్నా బెలూన్లు తెరుచుకుని అవి పూర్తిగా పగిలి పోయాయని తెలిపారు. కారు వేగంగా వెళ్లకుంటే ప్రాణాలు దక్కేవని పేర్కొంటున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ పసరగొండ క్రాస్ వద్ద బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఇన్చార్జి డీసీపీ వెంకటలక్ష్మి మధ్యాహ్నం పరిశీలించారు. ఘటన జరగడానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె వెంట ఏసీపీ శ్రీనివాస్, శాయంపేట్, ఆత్మకూర్ సీఐలు వెంకటేశ్వర్ రావు, రంజిత్ కుమార్, ఎస్సైలు భాస్కర్రెడ్డి, రాజబాబు ఉన్నారు. -
కన్నతల్లినే కడతేర్చాడు...
దుగ్గొండి : నవమాసాలు మోసింది.. తాను పునర్జన్మ పొందుతూ కుమారుడికి జన్మనిచ్చింది. పెంచి పెద్ద చేసి ఆస్తినిచ్చింది.. చనిపోయాక తలకొరివిపెట్టి పున్నామ నరకం నుండి విముక్తి కల్పిస్తాడనుకుంటే ఆ కొడుకే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కర్రతో మోది కడతేర్చడంతో పాటు శవాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేసి పరారయ్యాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం శివాజినగర్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళితే... మండలంలోని శివాజినగర్ గ్రామానికి చెందిన కుసుంబ కమలాబాయి(65) భర్త కుసుంబ లింగయ్య 30 ఏళ్ల క్రితమే మరో వివాహం చేసుకుని హైదరాబాద్కు వెళ్లిపోయాడు. అప్పటినుండి కమలాబాయి తన కుమారుడు కుసుంబ రాజేందర్, కూతుళ్లు సుకినె రజిత(మాజీ జడ్పీటీసీ) మరో కూతురు రజినిని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు జరిపించింది. ప్రస్తుతం ఆమె కుమారుడితోనే కలిసి ఉంటుండగా, కమలాబాయితో ఆమె కుమారుడు రాజేందర్ తరచూ డబ్బుల విషయంలో గొడవ పడేవాడు. ‘నీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి.. ఎవరికి ఇచ్చావు. తీసుకురాపో.. గ్రామంలో నీ పేరిట ఉన్న గుంట ఇంటి స్థలాన్ని అమ్మి నాకు ఇవ్వు.. నెలనెలా పించన్ డబ్బులు నాకే ఇవ్వాలి’ అని గొడవ పడుతుండేవాడు. ఇదే క్రమంలో సోమవారం రాజేందర్ భార్య రాజేంద్ర పొలం పనులకు వెళ్లగా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రాజేందర్ తన తల్లి కమలాబాయితో గొడవ పడ్డాడు. ఇదేక్రమంలో మాటమాట పెరగగా కర్రతో కొట్టి చంపాడు. అనంతరం తనకేం తెలియదన్నట్లు ఇంటికి తాళం వేసి తన ద్విచక్రవాహనంపై పారిపోయాడు. ఇది ఇంటికి ఎదురుగా ఉన్న ఓ చిన్నారి గమనించి కమలాబాయి కూతురు సుకినె రజితకు వివరించింది. దీంతో రజిత పరుగు పరుగున వచ్చి కిటికీలోంచి చూడగా తల్లి రక్తపు మడుగులో విగతజీవిగా పడిఉంది. విషయం తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రె డ్డి శివాజీనగర్ చేరుకుని వివరాలు ఆరా తీ శారు. ఏసీపీ ఫణీందర్, సీఐ సతీష్బాబు, ఎ స్సై రవికిరణ్ చేరుకుని కుమార్తె రజిత ఇచ్చి న ఫిర్యాదు మేరకు కుసుంబ రాజేందర్– రా జేంద్ర దంపతులపై కేసు నమోదు చేశారు. -
భర్తకు బీమా చేసి హత్య చేసిన భార్య
కాజీపేట అర్బన్: మద్యానికి బానిసై నిత్యం భార్యను వేధిస్తున్నాడు.. కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో విసిగి వేసారిన భార్య అతడిని హత్య చేయాలని నిర్ణయించింది. అయితే.. కుటుంబ పెద్దను హత్య చేస్తే తర్వాత తమ పరిస్థితి ఏమిటని ఆలోచించిన ఆమె.. రూ.20 లక్షలకు బీమా చేయించి మరీ ఘాతుకానికి పాల్పడింది. ఈ హత్యకు భర్త సోదరి, బావ సహకారం కూడా తీసుకుంది. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలో జరిగిన ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం హన్మకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి ఈ కేసు వివరాలన మీడియాకు వెల్లడించారు. పర్వతగిరి మండలం హత్యా తండాకు చెందిన బాదావత్ వీరన్న భార్య యాకమ్మతో కలసి పున్నేలు ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దోబీగా పనిచేసేవాడు. లాక్డౌన్తో పాఠశాలను మూసివేయగా ఖాళీ మద్యం సీసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. (ఫోన్ స్విచ్చాఫ్ చేసిన ఎస్సై ) మద్యానికి బానిసైన వీరన్న భార్యను వేధించడం.. కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. భార్య పలుమార్లు హెచ్చరించినా మార్పు రాలేదు. దీంతో యాకమ్మ భర్తను హత్య చేయాలని నిర్ణయించింది. ఇందుకు చెన్నారావుపేటలో నివాసం ఉండే వీరన్న సోదరి భూక్యా బుజ్జి, బావ భూక్యా బిచ్చాల సహకారం కోరింది. వారు అంగీకరించడంతో అందరూ కలసి హత్యకు పథక రచన చేశారు. తొలుత గ్రామంలోని గ్రామీణ బ్యాంకులో రూ.20 లక్షలకు వీరన్న పేరిట బీమా చేయించారు. తర్వాత ఈనెల 19వ తేదీన నెక్కొండ ప్రాంతంలో సైకిల్పై ఖాళీ మద్యం సీసాలను విక్రయించేందుకు వీరన్న వెళ్లగా.. ఆ సమాచారాన్ని భూక్యా బిచ్చాకు అందజేసింది. నెక్కొండలో సాయంత్రం వీరన్నను కలసిన బిచ్చా.. తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని హత్యాతండాకు బయలుదేరాడు. మార్గమధ్యలో మద్యం తాగి తమ వ్యవసాయ భూమి వద్దకు రాత్రి 11.45 గంటలకు తీసుకెళ్లగా.. అప్పటికే భార్య యాకమ్మ, సోదరి బుజ్జి ఉన్నారు. అందరూ కలసి వీరన్నకు తాడుతో ఉరి వేసి హత్య చేశారు. బతికి ఉన్నాడన్న అనుమానంతో ముఖంపై బండరాయితో కొట్టి పక్కనే ఉన్న కెనాల్లో పడేశారు. అనంతరం బిచ్చా, బుజ్జి తమ స్వగ్రామానికి వెళ్లిపోగా.. యాకమ్మ తన భర్తను ఎవరో హత్య చేశారని నటించడం మొదలు పెట్టింది. దీంతో పర్వతగిరి ఇన్స్పెక్టర్ పి.కిషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజీల ఆధారంగా.. అయితే, సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా అనుమానం రావడంతో పోలీసులు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. ఈ హత్య తామే చేశామని వారు అంగీకరించారు. దీంతో నిందితులు యాకమ్మ, బిచ్చా, బుజ్జిలను అరెస్టు చేశారు. కాగా, ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన మామూనూర్ ఏసీపీ శ్యాంసుందర్, పర్వతగిరి ఇన్స్పెక్టర్ పి.కిషన్, ఎస్సైలు ప్రశాంత బాబు, నర్సింగరావు, సురేష్తో పాటు, కానిస్టేబుళ్లను సీపీ రవీందర్ అభినందించారు. -
వరంగల్లో విషాదం.. రిజర్వాయర్లో పడి..
సాక్షి, వరంగల్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బీమారంలో ఉన్న పుట్టలమ్మ రిజర్వాయర్లో పడి గురువారం ముగ్గురు బాలురు మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. బీమారానికి చెందిన దొడ్డిపాటి మనివిత్ (11), దొడ్డిపాటి మహేష్ బాబు(14), మ్యూనికుంట్ల విష్ణు తేజ (14) ఈ ముగ్గురు బాలురు సైకిల్పై వెళ్లి పుట్టలమ్మ రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు రిజర్వాయర్లో పడి పిల్లలు గల్లంతు కావటంతో స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లని దింపి గాలింపు చర్యలు చేపట్టారు. (ఆయన గొంతు విన్నాక.. కన్నీళ్లు ఆగలేదు! ) సమాచారం అందుకున్న కేయూసీ పోలీసులు హుటాముటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే రెండు మృతదేహాలను వెలికి తీయగా.. వారిని మనివిత్, మహేష్ బాబుగా గుర్తించారు. మరో బాలుడి కోసం గాలిస్తున్నారు. ఇక ఈ దుర్ఘటనతో బాధితుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. బిడ్డల కోసం తల్లిదండ్రుల ఆర్తనాదాలు పలువురిని కంటతడి పెట్టించాయి. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. (తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్న్యూస్..) -
రఫికా కూతురుపైనా ఆత్యాచారం..?
సాక్షి ప్రతినిధి, వరంగల్: గొర్రెకుంట హత్యల ఘటన నిందితుడు సంజయ్కుమార్ యాదవ్పై మరిన్ని కేసులు నమోదు చేసేందుకు వరంగల్ పోలీసులు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలిసింది. రఫీకా కూతురు(15)పైనా అఘాయిత్యానికి పాల్పడినట్లు వీరు ఆధారాలు సేకరించారు. దీంతో సంజయ్పై పోక్సో చట్టం కూడా ప్రయోగించే అవకాశం ఉంది. 9 మంది హత్య కేసులో నిందితుడు సంజయ్కుమార్ యాదవ్ అంతకు ముందు మక్సూద్ భార్య నిషా అక్క కూతురు రఫికను రైలు నుంచి నిడదవోలు వద్ద కిందకి తోసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమెకు కూతురు సిర్దాస్ ఖాతూన్, కుమారులు సుల్తాన్, సాల్మన్ ఉన్నారు. మహ్మద్ మక్సూద్ ఆలం కుటుంబసభ్యులు మృతి చెందడం.. తల్లిని కోల్పోయి అనాథలుగా మారిన రఫిక పిల్లలు ముగ్గురికి దిక్కెవరు? అన్న చర్చ జరుగుతోంది. అయితే రఫిక అలియాస్ చోటీ భర్త ఏమయ్యాడు? అసలు ఆయన ఉన్నాడా? లేడా? ఆయనను కూడా సంజయ్కుమార్ యాదవ్ ఏమైనా చేసి ఉంటాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (ఖైదీ నంబర్ 4414) -
సంజయ్ మొబైల్ సెర్చ్ హిస్టరీ అంతా అవే!
సాక్షి, వరంగల్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తొమ్మిది మంది హత్య కేసుతో కదిలివచ్చిన పోలీస్ వాహనాలు, పలు విభాగాల అధికారుల హడావిడితో అట్టుడికిన గొర్రెకుంట ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని బార్దాన్ గోదాంలో పని చేసే వలస కూలీలు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 9 మంది బావిలో శవాలై తేలిన కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసును త్వరగా ఛేదించడానికి ఆరు పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎస్సై స్థాయి నుంచి ఐపీఎస్ల వరకు పోలీస్ అధికారులు, హైదరాబాద్ నుంచి సిటీ క్లూస్ టీం, టాస్క్ఫోర్స్, సైబర్ క్రైం, ఐటీ కోర్, సీసీఎస్, ఎస్బీ, ఇంటలిజెన్స్ విభాగం... ఇలా పోలీస్ శాఖలోని దాదాపు అన్ని ముఖ్య విభాగాలు పని చేశాయి. బావిలో మృత దేహాలు తేలిన ఈనెల 21 నుంచి 24 వరకు గొర్రెకుంట పారిశ్రామిక ప్రాంతం పోలీస్ వాహనాల రాకపోకలతో బిజీగా మారింది. తొమ్మిది మందిని ఎవరు హత్య చేసి ఉంటారా అనే అంశంపై ప్రజలు సైతం ఉత్కంఠగా ఎదురు చూశారు. 6 ప్రత్యేక బృందాలు కేవలం 72 గంటల్లోనే హంతకుడిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ( మొదట తల్లితో.. ఆపై కుమార్తెతో సాన్నిహిత్యం) ఓకే గూగుల్ను ఫుల్గా వాడేశాడు.. ఈ కేసులో నిందితుడు సంజయ్ కుమార్ విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. 10 మందిని చంపిన అతడిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. సంజయ్ 3వ తరగతి వరకు చదువుకున్నా గతంలో ఢిల్లీలోని ఓ సెల్ఫోన్ షాపులో పని చేసిన అనుభవంతో ఇంటర్ నెట్ ఉపయోగించడంలో దిట్ట. తనకున్న పరిజ్ఞానాన్ని నేరాలు చేయడం, తర్వాత తప్పించుకోవడం ఎలా అన్న విషయాలకే ఉపయోగించుకున్నాడు. ముఖ్యంగా గూగుల్ వాయిస్ అసిస్టెంట్ టూల్లోని 'ఓకే.. గూగుల్' ఆప్షన్ ద్వారానే నేరాలకు అవసరమైన సమాచారాన్ని పొందాడు. ఓకే గూగుల్.. అంటూ ఎక్కువ కాలం మత్తునిచ్చే టాబ్లెట్ల పేరు ఏవని తెలుసుకుని తన ప్రణాళికను విజయవంతంగా అమలు చేశాడు. ఇదే విషయాన్ని పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం. దీంతో పోలీసులు అతడి సెల్ఫోన్తో పాటు మృతుల సెల్ఫోన్ల కాల్ డేటా ఆధారంగా హంతకుడిని త్వరగా గుర్తించారు. అంతే కాకుండా హంతకుడు తన సెల్ఫోన్ ద్వారా యూట్యూబ్, గూగుల్ సెర్చ్ ద్వారా ఏఏ విషయాలను పరిశీలించాడనేవి పోలీసులకు క్లూస్గా మారాయి. ( ఖైదీ నంబర్ 4414 ) నిందితుడి వద్దనుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు అతడు వరంగల్లోని ఒక మెడికల్ షాపులో ఎక్కువ ధర చెల్లించి కొన్ని మాత్రలు కొనుగోలు చేసినట్టు సమాచారం. మత్తు కోసం చాలా మంది వ్యసనపరులు ఇలాంటి మందులను దొంగచాటుగా కొనుగోలు చేస్తుంటారు. సంజయ్ ఇదే కోవకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఇక సంజయ్ సెల్ ఫోన్ సెర్చ్ హిస్టరీ అంతా నేర పూరిత అంశాలు, అశ్లీల చిత్రాలు, వీడియోలతోనే నిండి ఉండడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. మహిళలతో బెడ్ రూమ్లో ఉన్న ఫోటోలు, నెట్లో డౌన్లోడ్ చేసిన అశ్లీల వీడియోలు వందల కొద్దీ ఉన్నట్లు గుర్తించారు. మనిషిని హత్య చేయడం సంజయ్కి టీ తాగినంత తేలిక. అతడిలో అపరాధ భావం మచ్చుకైనా కానరావడం లేదని తెలుస్తోంది. విచారణలో పోలీసులను కూడా ముప్పుతిప్పలు పెట్టినట్టు సమాచారం. ఆపస్మారక స్థితిలో ఉన్న తల్లి, అమ్మమ్మ, తాతయ్య, మామయ్యల వద్ద గుక్కపట్టి ఏడుస్తున్న మూడేళ్ల బాలుడి కన్నీళ్లు కూడా సంజయ్ను కదిలించలేకపోయాయి. ఆ చిన్నోడి ఏడుపు తన నేరానికి అడ్డు అవుతుందని భావించి కొట్టి, గొంతు పిసికి, ప్రాణం ఉండగానే బావిలో పడేశానని పోలీసుల విచారణలో సంజయ్ ఒప్పుకున్నాడు. ( పూడ్చి పెట్టారు.. పోస్టుమార్టం నివేదికలో ఏముంది?) సంజయ్ సైకిల్ కీలకంగా మారిన సీసీ కెమెరాలు మృతులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కావడం, హంతకుడు ఎవరో తెలియకపోవడంతో తొలుత పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. అయితే గొర్రెకుంట ప్రాంతంతోపాటు వరంగల్ వెంకట్రామా జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఈ ఫుటేజీల్లో సంజయ్ వరుసగా ఐదు రోజులుగా సైకిల్పై వచ్చి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తొమ్మిది మందిని హత్య చేసిన తీరుతో పాటు వీటన్నింటికి కారణమైన రఫికా హత్య వివరాలు తెలుసుకోవడం పోలీసులకు సులువైంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే ఎంతటి క్లిష్టమైన కేసునైనా సులభంగా చేధించవచ్చునని మరోసారి నిరూపితమైందని పోలీసులు చెబుతున్నారు. -
మొదట తల్లితో.. ఆపై కుమార్తెతో సాన్నిహిత్యం
వివాహితతో ఏర్పడిన పరిచయం ఆపై సాన్నిహిత్యంగా.. అది కూడా దాటిపోయి శారీరకంగా సంబంధానికి దారి తీసింది.. అంతటితో ఆగక ఆమె కుమార్తెతోనూ సంబంధం ఏర్పర్చుకోవాలని భావించగా గుర్తించిన వివాహిత తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసింది.. ఆమెను అడ్డు తొలగించుకునేందుకు హత్య చేసిన నిందితుడు, ఆమె కోసం ఆరా తీసిన కుటుంబాన్ని మట్టుబెట్టేందుకు సిద్ధమయ్యాడు.. ఈ కుటుంబంలోని ఆరుగురికి తోడు పక్కనే ఉన్న పాపానికి మరో ముగ్గురు బలి కాగా.. మొత్తం తొమ్మిది మంది మృతదేహాలు వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట వద్ద బావిలో తేలిన ఘటన రాష్ట్రంలోనే సంచలనం కలిగించింది. ఈ కేసును 72 గంటల్లో ఛేదించిన పోలీసులు బీహార్కు చెందిన నిందితుడు సంజయ్కుమార్ను యాదవ్ను అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా తొలుత తాను మహిళను హత్య చేశానని.. ఆ తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరో తొమ్మిది హత్యలు చేసినట్లు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు వివరాలను మీడియాకు సీపీ రవీందర్ సోమవారం సాయంత్రం వెల్లడించారు. సాక్షి ప్రతినిధి వరంగల్ / కాజీపేట అర్బన్ / గీసుకొండ : ఒక తప్పు చేస్తే అలాంటి తప్పు మరోసారి జరగకుండా చూసుకోవాలి.. అప్పుడే మనిషిలో పరివర్తన వచ్చినట్లు లెక్క! కానీ ఆ తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరో తప్పు చేస్తూ వెళ్తే దానికి అంతమనేదే ఉండదు. అచ్చంగా తొమ్మిది మృతదేహాలు లభించిన కేసులో నిందితుడు ఇలాగే చేస్తూ పోయాడు. గీసుకొండ మండలంలోని గొర్రెకుంటలో లభించిన మృతదేహాల విషయంలో ఆత్మహత్యలా, హత్యలా అనే కోణం దర్యాప్తు చేసిన పోలీసులకు సీసీ ఫుటేజీల రూపంలో ఓ తీగ దొరికింది. ఆ తీగ ఆధారంగా ముందుకెళ్లగా నిందితుడు దొరికాడు. విచారణ సందర్భంగా.. ఈ తొమ్మిది హత్యలకు గతంలో తానే చేసిన ఓ హత్య నాంది అని నిందితుడు చెప్పడం గమనార్హం. కేసు వివరాలను వెల్లడిస్తున్న సీపీ రవీందర్, పక్కన అధికారులు పని కోసం వచ్చాక పరిచయం వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో బార్దాన్ గోదాంలో పశ్చిమ బెంగాల్కు చెందిన మహ్మద్ మక్సూద్ ఆలం(47), ఆయన భార్య నిషా(40) పనిచేసేవారు. వీరితో పాటు మక్సూద్ కుమారులు షాబాజ్(19), సోహిల్ ఆలం(18)తో పాటు ఆయన కుమార్తె బుష్రా ఖాతూన్, ఆమె కుమారుడు బబ్లూ నివసించేవారు. ఈక్రమంలో బార్దాన్ పనికి వచ్చిన బీహార్ వాసి సంజీవ్ కుమార్ యాదవ్కు వీరితో పరిచయం ఏర్పడింది. ఇంతలోనే మక్సూద్ భార్య నిషా అక్క కుమార్తె రఫీకా(31) భర్తతో విడిపోయాక ముగ్గురు పిల్లలతో కలిసి పని కోసం వచ్చింది. ఆమెతోనూ çసంజయ్ పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లకు తనకు హోటళ్లలో తినడం ఇబ్బందిగా ఉందని చెబుతూ డబ్బు చెల్లించేలా మాట్లాడుకుని రఫీకా ఇంట్లో భోజనం చేయడం ఆరంభించాడు. ఆ పరిచయం సాన్నిహిత్యానికి.. ఆపై వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహితతో పాటు ఆమె కుమార్తెతో.. మక్సూద్ సమీప బంధువైన రఫీకాతో సాన్నిహిత్యం ఏర్పడ్డాక ఆమె కుటుంబం మకాంను సంజయ్ జాన్పాకకు మార్చాడు. అక్కడ అద్దె ఇంటిని తీసుకుని వారితోనే ఉండసాగాడు. అప్పటికే యుక్త వయస్సుకు వచ్చిన రఫీకా కుమార్తెపై సంజయ్ కన్ను పడింది. ఈ విషయం రఫీకాకు తెలియగా నిలదీయడమే కాకుండా త్వరగా తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయసాగింది. దీంతో అడ్డు తొలగించుకోవాలని భావించిన సంజయ్.. బంధువులతో మాట్లాడాలంటూ పశ్చి మ బెంగాల్ బయలుదేరదీశాడు. విశాఖ వైపు గరీభ్ర థ్ రైలులో మార్చి 6న వెళ్లే క్రమంలో అప్పటికే సి ద్ధం చేసుకున్న నిద్రమాత్రలను మజ్జిగలో కలిపి ఇచ్చాడు. అది తాగి అపస్మారక స్థితికి చేరుకున్న రఫీకా మెడకు చున్నీ బిగింగి రైలు నుంచి ఏపీలోని నిడదవోలు వద్ద తోసివేశాడు. ఆ తర్వాత రాజమండ్రిలో దిగి మరో రైలులో వరంగల్ వచ్చాడు. ఆమె ఎటు వెళ్లింది..? తాపీగా వచ్చిన సంజయ్ పని చేసుకుంటున్నాడు. అయితే, రఫీకా విషయమై నిషా సంజయ్ను గట్టిగా అడగసాగింది. పోలీసులను ఆశ్రయిస్తానని చెప్పడంతో ఈ కుటుంబం అడ్డు కూడా తొలగించాలని నిర్ణయించుకున్నాడు. నిందితుడు సంజయ్ సైకిల్ కొడుకు పుట్టిన రోజే అందరికీ చివరి రోజు సంజయ్కుమార్ యాదవ్.. మక్సూద్ ఆలం కుటుంబాన్ని హతమార్చేందుకు ఈనెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు రెక్కీ నిర్వహించాడు. ప్రతీరోజూ సైకిల్పై వారు నివాసం ఉండే ఇంటికి వెళ్లి వస్తూ పరిశీలించాడు. ఈ కుటుంబంలో ఐదుగురికి తోడు పక్కన మరో భవనం పైభాగంలో నివాసముంటున్న బీహార్కు చెందిన శ్రీరాం, శ్యాంను గుర్తించాడు. చివరకు ఈనెల 20వ తేదీన మక్సూద్ ఆలం పెద్ద కుమారుడు షాబాజ్ ఆలం పుట్టినరోజు అని తెలుసుకుని సాయంత్రం వెళ్లాడు. మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసిన నిద్రమాత్రలను మక్సూద్ ఆలం కుటుంబంతో మాటల్లో ఉండగా పప్పు కూరలో కలిపాడు, అదే విధంగా శ్రీరాం, శ్యాం ఆహారంలో కూడా కలిపాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లు, సామగ్రి ఒక్కరొక్కరిని.. రాత్రి 12 గంటల వరకు అందరూ మత్తులో చేరుకోగా ఒకరి వెంట ఒకరిని గోనె సంచిలో పెట్టుకుని తీసుకొచ్చాడు. గోదాం – బావి మధ్య ఉన్న ప్రహరీపై ఆయన ఒక్కరొక్కరిని ఉంచాడు. ఆ పై తాను గోడ దూకి వారిని తీసుకెళ్లి బావిలో పడవేయసాగాడు. ఉదయం 5.30 గంటలకు మృతులు వాల్మార్ట్లో కొనుగోలు చేసి వస్తువులు, సెల్ఫోన్లు తీసుకుని జాన్పాక చేరుకున్నాడు. 6 బృందాలు... 72 గంటలు తొమ్మిది మంది మృతి చెందిన కేసును వరంగల్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని విభాగాల అధికారులతో కలిపి ఆరు బృందాలు ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా సంజయ్ను గుర్తించగా.. సోమవారం సాయంత్రం మీడియాకు సీపీ డాక్టర్ వి.రవీందర్ వివరాలు వెల్లడించారు. కాగా, తొలుత హత్యకు గురైన రఫీకా ముగ్గురు పిల్లలను బాలసదనంలోకి చేర్చినట్లు వివరించారు. కేసు విచారణలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్జోన్ ఇన్చార్జి డీసీసీ వెంకటలక్ష్మి, ఏసీపీ శ్యాంసుందర్, గీసుకొండ, పర్వతగిరి ఇన్స్పెక్టర్లు శివరామయ్య, కిషన్, ఇన్స్పెక్టర్లు నందిరాంనాయక్, జనార్దన్రెడ్డి, రాఘవేందర్, రమేష్కుమార్ను సీపీ అభినందించారు. రంజాన్ జరుపుకోకుండానే.. రంజాన్ జరుపుకునేందుకు ముస్లిం కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటాయి. అదే తరహాలో మక్సూ ద్ ఆలం కుటుంబం కూడా కొత్త బట్టలు, సరుకులు కొనుగోలు చేశారు. కానీ వారిని మృత్యువు వెంటాడింది. ఆ కుటుంబంలో ఒక్కరూ బతికి లేకపోవడంతో పండుగ జరుపుకోలేకపోయారు. రెండున్నర అడుగల ఎత్తులో బావిగోడ మృతదేహాలు తేలిన బావి చుట్టూ ప్రహారీ ఉంది. ఒకచోట మాత్రం మట్టితో 2.5 అడుగుల గోడ ఉంది. అక్కడి నుంచే సంజయ్.. మత్తులో ఉన్న వారిని బావిలోకి తోసినట్లు చెబుతున్నారు. పాపం.. ఆ ముగ్గురు తొలుత మక్సూద్ కుటుంబంలోని ఆరుగురిని మాత్రమే సంజయ్ అంతం చేయాలనుకున్నాడు. కానీ వారి ఇంటి పక్కనే ఉండే బీహార్ కార్మికులు శ్రీరాం, శ్యాంతోపాటు పని ఉందని చెప్పడంతో వచ్చిన షకీల్ కూడా బలయ్యారు. మార్చురీలోనే మృతదేహాలు ఎంజీఎం : బావిలో తేలిన తొమ్మిది మంది మృతదేహాలు ఇంకా ఎంజీఎం మార్చురీలోనే ఉన్నా యి. కేసు ఓ కొలిక్కి వచ్చినా సోమవారం రంజా న్ కావడంతో మంగళవారం మృతదేహాల ను ఖ ననం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎప్పుడేం జరిగిందంటే... దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన తొమ్మిది హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ మేరకు నిందితుడి వివరాలను సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా బావిలో నాలుగు మృతదేహాలు తేలిన రోజు నుంచి నిందితుడి వివరాలు వెల్లడించిన సోమవారం వరకు జరిగిన ఘటనల వివరాలివి.. నిందితుడు సంజయ్ను తీసుకొస్తున్న పోలీసులు 21 – 05 – 2020 : గురువారం వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలో సాయిదత్తా ట్రేడర్స్ ఆధ్వర్యాన నిర్వహించిన బార్దాన్ సంచులను కేంద్రానికి ఆటోడ్రైవర్ను అక్కడకు పంపించారు. నిల్వ ఉన్న సంచులను తీసుకురావాలని సూచించారు. ఆటో డ్రైవర్ ఉదయం 7 గంటలకు వెళ్లగా అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో యజమానులకు సమాచారం ఇచ్చాడు. దీంతో యజమానులు భాస్కర్, సంతోష్ చేరుకుని చూడగా ఎవరూ లేకపోవడంతో పనిపై బయటకు వెళ్లారని భావించారు. మళ్లీ కాసేపటికి వెళ్లి చూడగా కూడా లేకపోవడంతో బీహార్ కార్మికులు ఉండే భవనం ఎక్కి చూడగా పక్కనే పాడుబడిన వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలు తేలడాన్ని గమనించి గీసుకొండ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సాయంత్రం వరకు మహ్మద్ మక్సూద్ ఆలం(47), ఆయన భార్య నిషా ఆలం(40), కుమార్తె బుష్రా ఖాతూన్(20)తో పాటు ఆమె మూడేళ్ల కుమారు బబ్లూ మృతదేహాలను వెలికితీశారు. ఘటనా స్థలాన్ని ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు ఏసీపీ శ్యాంసుందర్, గీసుకొండ, పర్వతగిరి సీఐలు జూపల్లి శివరామయ్య, కిషన్, ఎస్లు రహీం, నాగరాజు పరిశీలించారు. క్లూస్టీం, డాగ్స్క్వార్డ్ను రప్పించి ఆధారాల కోసం అన్వేషించారు. మ«ధ్యాహ్నం 2నుంచి రాత్రి 8 గంటల వరకు గాలించినా ఏ ఆధారమూ లభించకపోవడంతో నలుగురు ఎలా మృతి చెంది ఉంటారనే విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోయారు. 22 – 05 – 2020 : శుక్రవారం ఉదయం 7 గంటలకు బావి వద్దకు స్థానికులు వెళ్లి చూడగా ఓ మృతదేహం తేలుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మామునూరు ఏసీపీ శ్యాంసుందర్తో పాటు పోలీసు అధికారులు చేరుకుని సిబ్బందితో గాలించారు. దీంతో తొలుత మక్సూద్ ఆలం స్నేహితుడు, కరీమాబాద్కు చెందిన మహ్మద్ షకీల్(38) మృతదేహం బయటపడినా ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత బావిలోని నీటిని మోటార్ సాయంతో తోడుతుండగా చొప్పున నాలుగు మృతదేహాలు లభించాయి. ఇందులో మక్సూద్ పెద్ద కుమారుడు షాబాజ్, బీహార్ కార్మికుడు శ్రీరాంకుమార్షా, మక్సూద్ చిన్న కుమారుడు మహ్మద్ సుహేల్, బీహార్ కార్మికుడు శ్యాంకుమార్షా మృతదేహాలను వెలికితీసి వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. బార్దాన్ గోదాంలోని మక్సూద్ కుటుంబం నివాసం ఉండే రెండు గదులతో పాటు, బీహార్ కార్మికులు ఉండే డాబా పైగదులు, బావి పరిసర ప్రాంతాల్లో క్లూస్టీం ఆధారాల కోసం పలు నమూనాలు సేకరించింది. వండి తినకుండా మిగిలిపోయిన అన్నం, ఆకుకూర పప్పు, కూల్డ్రింక్స్ ఖాళీ బాటిళ్లను తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని సీపీ రవీందర్ సందర్శించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలో మృతదేహాలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, చీఫ్ విప్ వినయ్భాస్కర్, వరంగల్ అర్బన్, రూరల్ కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, హరిత సందర్శించారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసినట్లు మంత్రి దయాకర్రావు వెల్లడించారు. 23 – 05 – 2020 : శనివారం సంఘటనా స్థలానికి సెంట్రల్ విజిలెన్స్ అధికారుల బృందం, హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ విభాగం అధికారులు చేరుకుని సాంకేతిక పరమైన అంశాలను పరిశీలించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు పలు కోణాల్లో పరిశోధనలు చేశారు. మృతదేహాల పోస్టుమార్టం నివేదికను పరిశీలించారు. ప్రాణాలతో ఉండగానే బావిలో పడేశారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కాల్డేటా ఆధారంగా సంజయ్కుమార్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని ఘటనాస్థలికి తీసుకుని వచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ తరహాలో పరిశీలించారు. డీసీసీ వెంకటలక్ష్మి నేతృత్వంలో ఐదు గంటల పాటు పరిశీలన జరిపారు. ♦ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని, మృతదేహాలను వారి బంధువులకు అప్పగించాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ సీపీని ఆదేశించారు. ♦ రాత్రి తొమ్మిది మృతదేహాలకు ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. నీట మునిగాక మృతి చెందినట్లు ప్రాథమికంగా నివేదిక అందజేశారు. 24 – 05 – 2020 : ఆదివారం ♦ డీజీపీ కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి డైరెక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో పది మంది క్లూస్ టీం బృందాన్ని పంపించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సిటీ క్లూస్ టీంతో పాటు ట్రెయినీ ఐపీఎస్ అధికారులు యోగేశ్ గౌతం, అఖిలేష్, రీజినల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ భాస్కర్, పోలీస్ అధికారులు ఘటనా స్థలంలో మరిన్ని ఆధారాల కోసం అణువణువు అన్వేషించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ అన్వేషణ సాగింది. ♦ సివిల్ పోలీస్ అధికారులతో పాటు టాస్క్ఫోర్స్, సైబర్ క్రైం, ఐటీకోర్, సీసీఎస్ టీం, క్లూస్టీం, హైదరాబాద్ సిటీ క్లూస్టీం, ఎస్బీ, ఇంటలిజెన్స్ విభాగం అధికారులు పలు కోణాల్లో కేసు మిస్టరీని ఛేదించడం కోసం కృషి చేశారు. 25 – 05 – 2020 : సోమవారం ♦ నిందితుడు సంజయ్కుమార్ను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు. ఆ తర్వాత హత్యల వెనుక ఉన్న కారణాలను సీపీ వెల్లడించారు. ఒక్కడే అంతా చేశాడా? గీసుకొండ సమీపంలోని గొర్రెకుంట వద్ద తొమ్మిది మందిని హత్య చేసిన ఘటనలో నిందితుడు ఒక్కడేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంజయ్ ఒక్కడే తొమ్మిది మంది తినే ఆహారంలో నిద్రమాత్రలు కలపడం.. వారు మత్తులోకి జారుకున్నాక ఒక్కరొక్కరిని తీసుకొచ్చి బావిలో పడేయడం.. ఇదంతా తెల్లవారుజాము వరకు జరిగిందని చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. అయితే, పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని చెబుతుండడంతో మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. పట్టించిన సీసీ కెమెరాలు తొమ్మిది మంది మృతదేహాలు బావిలో తేలిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వేరే రాష్ట్రం నుంచి పని కోసం వచ్చిన వారు కావడం.. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక తనువు చాలించారని తొలిరోజు ప్రచారం సాగింది. ఇంతలోనే వేరే కారణంగా ఉండొచ్చని తేలగా.. మరుసటి రోజు ఐదు మృతదేహాలు వెలుగు చూశాయి. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు ఆరు బందాలను ఏర్పాటు చేశారు. గోదాం, గొర్రెకుంట ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలు ఈ కేసులో కీలకంగా మారాయి. ఈ పుటేజీల్లో సంజయ్ సైకిల్పై వరుసగా ఐదు రోజులుగా వచ్చినట్లు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా తొమ్మిది హత్యలు చేసిన తీరుతో పాటు వీటన్నింటికీ కారణమైన రఫీకా హత్య వివరాలు వెల్లడించాడు. అలాగే, మక్సూద్ కుటుంబం వాల్మార్ట్లో కొనుగోలు చేసిన వస్తువులు కూడా కొంత మేర పరిశోధనలో ఉపయోగపడినట్లు సమాచారం. -
అర్ధరాత్రి వేళ.. అగ్నిప్రమాదం
సాక్షి, హన్మకొండ : అందరూ నిద్రిస్తున్న వేళ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నా.. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, భవనం పూర్తిగా దెబ్బతిని స్లాబ్ లోపలి చువ్వలు బయటకు రావడం ప్రమాద తీవ్రతకు అద్దం పట్టింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తుండగా దాదాపు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. హన్మకొండ రాంనగర్లోని ఏబీకే మాల్లో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం వివరాలు నైట్ వాచ్మెన్ అంజనేయులు, ఇతర ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. ఏబీకే మాల్లోని రెండో అంతస్తులో మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయం ఏర్పాటుకు అద్దెకు తీసుకున్నారు. కార్యాలయానికి అనువుగా తీర్చిదిద్దుతున్న పనులు చివరి దశకు చేరుకోగా.. కార్మికులు రెండో అంతస్తులో నిద్రించారు. ఇందులో కొందరు తెల్లవారుజామున మూత్రవిసర్జనకు నిద్ర లేవగా మంటలు కనిపించడంతో ఫైర్ స్టేషన్కే కాకుండా భవనంలోని ఇతర సంస్థల ప్రతినిధులకు ఫోన్ చేశారు. దీంతో హన్మకొండ ఫైర్ ఆఫీసర్ నాగరాజు నేతృత్వంలో సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్ల ద్వారా చేరుకుని మంటలు ఆర్పారు. ఈ ఘటనలో పీఎన్బీ హౌజింగ్ ఫైనాన్స్ కార్యాలయంలోని ఏసీల తదితర సామగ్రి దెబ్బతిన్నదని అసిస్టెంట్ మేనేజర్ బి.రామారావు తెలిపారు. అయితే, పై అంతస్తుల్లో ఉన్న కార్యాలయాలకు ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ మాల్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రీజియన్ కార్యాలయం, ఏపీజీవీబీతో పాటు చిట్ఫండ్ కార్యాలయాలు, మెడికల్ షాపులు ఉన్నాయి. -
బిర్యానీ గొడవ.. ఆపై హత్య
సాక్షి, గీసుకొండ(పరకాల): గ్రేటర్ వరంగల్ నగరం జాన్పిరీలు వద్ద ఉన్న సాయివైన్స్లో పని చేసే వర్కర్ సంగ రమేశ్ హత్య కేసులో నిందితుడు రామగిరి ప్రభాకర్ను అరెస్టు చేసినట్లు గీసుకొండ సీఐ శివరామయ్య తెలిపారు. సోమవారం సాయంత్రం గీసుకొండ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సాయివైన్స్ వద్ద గడిచిన ఆరు సంవత్సరాలుగా రామగిరి ప్రభాకర్ పాన్షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. అదే వైన్స్లో సంగ రమేశ్ క్లీనర్గా పని చేస్తుండగా.. ఈ నెల 9న హోళీ పండుగ రోజు రాత్రి 12.30 గంటలకు మృతుడు రమేశ్ అక్కడే ఉన్న ప్రభాకర్ను బిర్యానీ కావాలని అడగటంతో తన సెల్ఫోన్ ద్వారా ఆర్డర్ చేయడానికి ప్రయత్నింగా ఫోన్లో బ్యాలెన్స్ లేకపోవడంతో వీలు కాలేదు. వేరే వారి ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తానని రమేశ్ కోరగా అందుకు ప్రభాకర్ ఒప్పుకోకపోగా డబ్బులు ఇవ్వనని బుకాయించాడు. అయితే బిర్యానీ తెప్పిస్తానని చెప్పి ఎందుకు మాటమార్చావని రమేశ్ అతడిని తిట్టడంతో దాన్ని మనసులో పెట్టుకున్న ప్రభాకర్ గతంలో తన పాన్షాపును తీసివేయిస్తానని బెదరించిన అతడిని ఎలాగైనా హత్య చేయాలని పథకం పన్నాడు. అర్ధరాత్రి వైన్షాపు ముందు నిద్రిస్తున్న రమేశ్ను తిట్టి, కాళ్లతో తన్ని, బీరుసీసా పగులగొట్టి దాంతో రమేశ్ మెడపై పొడవడంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రభాకర్ అక్కడినుంచి పారిపోయాడు. నిందితుడి కోసం గాలిస్తుండగా వరంగల్ రైల్వేస్టేషన్ వద్ద గుర్తించి సోమవారం అరెస్ట్ చేసినట్లు సీఐ శివరామయ్య తెలిపారు. హత్య జరిగిన వారం రోజుల్లోనే నిందితుడిని గీసుకొండ పోలీసులు పట్టుకోవడం విశేషం. విలేకర్ల సమావేశంలో ఎస్సైలు అబ్దుల్ రహీం, నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కోర్టులో లొంగిపోనున్న ప్రదీప్రెడ్డి?
సాక్షి, కాజీపేట అర్బన్ : ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మోకు ఆనంద్రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు, సూత్రదారి పింగిళి ప్రదీప్రెడ్డి సోమవారం కోర్టులో లొంగిపోనున్నట్లు పుకార్లు శికార్లు చేస్తున్నాయి. ఆనంద్రెడ్డి, ప్రదీప్రెడ్డి మధ్య ఇసుక వ్యాపారం నిమిత్తం 80 లక్షల లావాదేవీల చెల్లింపులో భాగంగా శనిగరంకు చెందిన శనిగరం గ్రామానికి చెందిన పింగిళి ప్రదీప్రెడ్డి, విక్రమ్రెడ్డి, రమేష్ ఈనెల 7న కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆనంద్రెడ్డిని కమలాపూర్ మండలం హన్మకొండలో కిడ్నాప్ చేసి భూపాలపల్లి జిల్లా రామారం అడవుల్లో గట్టమ్మగుడి దగ్గర దారుణంగా హత్య చేశారు. లేబర్ ఆఫీసర్ ఆనంద్రెడ్డి దారుణ హత్య మృతుడి సోదరుడి ఫిర్యాదు ఆధారంగానే.. ప్రదీప్రెడ్డిపై అనుమానం ఉందని మృతుడు ఆనంద్రెడ్డి సోదరుడు శివకుమార్రెడ్డి ఈనెల ఎనిమిదో తేదీన హన్మకొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యలో ఆరుగురు పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు శివరామకృష్ణ, శంకర్, మధుకర్లను అరెస్టు చేసి వాహనాన్ని, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగి వారం అవుతున్నా మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లోనే 2 స్పెషల్ టీంలు.. ఆనంద్రెడ్డి హత్య కేసును వరంగల్ కమిషనరేట్ పోలీసులు సవాల్గా తీసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు నాలుగు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి రెండు స్పెషల్ టీంలు ముగ్గురు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. హైదరాబాద్లోని హోటళ్లలో బస చేశారనే సమాచారంతో తనిఖీలు చేపట్టి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితులు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మకాం మార్చినట్లు తెలుస్తోంది. విక్రమ్ రెడ్డి ఎవరు? ఆనంద్రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు పింగిళి ప్రదీప్రెడ్డి మిత్రుడుగా పేర్కొంటున్న విక్రమ్రెడ్డి ఎవరు అనే కోనంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. విక్రమ్రెడ్డి బంధువులు పోలీస్ విభాగంలో ఉన్నారని, ఇందుమూలంగానే అరెస్ట్ పర్వం ఆలస్యం అవుతుందనే అనుమానం తలెత్తుతుంది. -
కవలలపై కీచక తండ్రి అఘాయిత్యం
సాక్షి, కాజీపేట అర్బన్ : కంచె చేను మేసిన చందంగా కన్న తండ్రి, మేనమామ కలిసి మైనర్లు అయిన కవలలపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఇది. దీనికి సంబంధించి వరంగల్ ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు కాగా షీ టీమ్స్ ఏసీపీ బాబురావు శుక్రవారం రాత్రి వివరాలు వెల్లడించారు. వరంగల్ కాశిబుగ్గలోని శ్రీనివాసకాలనీకి చెందిన దంపతులకు 14 ఏళ్ల కవలల కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరి తండ్రి, మేనమామ సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, మూడేళ్ల నుంచి మేనమామ, ఏడాది కాలంగా తండ్రి బాలికలపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అయితే, ఎవరికైనా చెబితే ఏమవుతుందోనన్న భయంతో బాలికలు లోలోపల కుమిలిపోతున్నారు. ఇటీవల వేధింపులు తీవ్రంగా కావడంతో తాము చదువుతున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు విషయాన్ని వెల్లడించారు. దీంతో ఉపాధ్యాయులు షీ టీంకు సమాచారం ఇవ్వగా.. నిందితులను అదుపులోకి తీసుకుని ఇంతేజార్గంజ్ పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ తెలిపారు. మామ లైంగిక వేధింపులు.. కోడలి ఆత్మహత్య నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం మామునూరు: అభం శుభం తెలియని ఓ నాలుగేళ్ల చిన్నారిపై 58 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన శుక్రవారం మధ్యా హ్నం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. తిమ్మాపురం గ్రామంలోని ఓ కాలనీకి చెందిన దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. వీరి ఇంటి పక్కన ఉన్న పొలంలో ఐనవో లు మండలం గర్నెపల్లికి చెందిన చిదురాల యాకయ్య(58) పాలేరుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా మొక్కజొన్న కంకులు ఇస్తానని చేనులోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించా డు. ఇంతలోనే పానను పిలుస్తూ తల్లి రాగా యాకయ్య పారిపోయేందుకు యత్నించాడు. దీంతో ఆయనను బాలిక తల్లిదండ్రులు పట్టుకుని దేహశుద్ధి చేశాక పోలీసులకు అప్పగించా రు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చంపేస్తే అప్పు తప్పుతుందని..
గోవిందరావుపేట: అప్పు తీసుకున్న డబ్బు ఇప్పుడే ఇవ్వాలంటూ కూర్చున్న దేవేందర్రెడ్డిని హత్య చేస్తే మిగతా చిన్నచిన్న అప్పులను తీర్చేయవచ్చని.. ఇదేక్రమంలో హత్య చేశాక మృతదేహాన్ని రాత్రి మాయం చేయాలని భావించాడు.. ఇదే ఆలోచనతో బేకరీ లోపలికి తీసుకెళ్లిన దేవేందర్రెడ్డిని తీవ్రంగా కొట్టాక చనిపోయాడనుకుని బయటకు వచ్చాక సునీల్రెడ్డి కనిపించాడు.. అంతసేపటి వరకు ఒకటే హత్య చేయాలని అనుకున్న నిందితుడు.. రెండో హత్యకు కూడా సిద్ధమయ్యాడు. దీంతోనే సునీల్ను నమ్మించి ఇంటికి తీసుకెళ్లి హత్యకు పాల్పడ్డాడు. ఇదీ ములుగు జిల్లా పస్రాలో సోమవారం రాత్రి జరిగిన హత్యకు సంబంధించి నిందితుడు, బేకరీ యజమాని దయానంద్ అలియాస్ దయ పన్నాగంగా తెలుస్తోంది. ఈ మేరకు నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. రూ.6లక్షల అప్పు.. కర్ణాటకకు చెందిన దయానంద్ తన మామ ప్రభుతో కలిసి పస్రాలో కొన్నేళ్ల క్రితం బేకరీ ప్రారంభించారు. అయితే, అప్పులు ఎక్కువ కావడంతో కొద్దికాలం క్రితం ఊరు వదిలేసి వెళ్లిపోయారు. మళ్లీ ఆరునెలల క్రితం వచ్చిన వారు పస్రాలోనే కొత్తగా బేకరీ తెరిచారు. అప్పటికే ఉన్న అప్పులకు తోడు మరికొన్ని అప్పులు చేశారు. ఈ క్రమంలో దయకు రూ.6లక్షలు అప్పు ఇచ్చిన దేవేందర్రెడ్డి నుంచి ఒత్తిడి పెరిగింది. సోమవారం కూడా దేవేందర్రెడ్డి తన స్నేహితుడైన ఫొటో జర్నలిస్ట్ సునీల్రెడ్డితో కలిసి పస్రా వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మంతనాలు సాగించినా డబ్బు తిరిగి ఇవ్వడంలో ఎలాంటి పురోగతి కానరాలేదు. తనకు స్థానిక వ్యాపారి ఒకరు డబ్బు ఇవ్వాల్సి ఉందని చెప్పగా.. దేవేందర్, సునీల్ ఆయన వద్దకు వెళ్లి ఆరా తీశారు. అయితే, దయకు తాను డబ్బు పెద్దగా ఇచ్చేది లేదని.. కొంతమొత్తమే ఉన్నా తనకు కుమార్తె వివాహం ముగిశాక ఇస్తానని చెప్పాడు. (ఫొటో జర్నలిస్ట్ దారుణ హత్య) ఇస్తావా.. ఇవ్వవా? వ్యాపారి మొండిచేయి చూపడంతో దేవేందర్, సునీల్ మళ్లీ దయ బేకరీ వద్దకు వచ్చారు. దేవేందర్రెడ్డి తనకు ఇవ్వాల్సిన రూ.6లక్షల విషయమై మళ్లీ ప్రశ్నించాడు. ఉదయం నుంచి నచ్చచెప్పినా వినడం లేదని భావించిన దయ.. తొలుత దేవేందర్రెడ్డిని హత్య చేసి అప్పు వదిలించుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఇదే భావనతో పక్కనే ఉన్న మామ ప్రభుకు కూడా అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. రాత్రి 7–30 గంటలకు బేకరీకి వచ్చిన దేవేందర్రెడ్డిని బేకరీలో వెనక ఉన్న బట్టీ వద్దకు తీసుకెళ్లి విచక్షణా రహితంగా తలపై దాడి చేశాడు. ఈ ఘటనలో చనిపోయాడని భావించి శవాన్ని రాత్రికి మాయం చేయాలనే ఆలోచనతో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అలా రాగానే సునీల్రెడ్డి కనిపించడంతో దయా తన ఆలోచన మార్చుకున్నాడని సమాచారం. ‘ఇంటికి పోయి మాట్లాడుకుందాం.. అక్కడ నీకు అన్ని విషయాలు, నా ఇబ్బందులు చెబుతా’ అంటూ సునీల్రెడ్డిని తీసుకుని ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో దయ మామ, భార్య బేకరీలో ఉన్నారు. ఈ మేరకు ఇంటికి వెళ్లగానే అక్కడ ఉన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన సునీల్రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. రక్తపు మడుగులో దేవేందర్.. దయ, సునీల్రెడ్డి ఇంటికి వెళ్లాక పనిపై ప్రభు బేకరీలోని బట్టీ వద్దకు వెళ్లాడు. అక్కడ రక్తపు మడుగులో దేవేందర్రెడ్డి కనిపించడంతో ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన స్థానికుల సాయంతో 108లో ములుగు ఆస్పత్రికి చేర్చాడు. ఇంతలోనే దయ భార్య బేకరీ నుంచి ఇంటికి వెళ్లగా లోపలి నుంచి గొడవ వినిపించినట్లు సమాచారం. ఉదయం నుంచి అప్పు విషయమై జరుగుతున్న గొడవగానే ఆమె భావించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దయ రక్తపు మరకలు కడుక్కుంటూ ఇంటి నుంచి బయటకు రావడాన్ని చూసిన ఆమె ఏదో జరిగిందని ఊహించినట్లు సమాచారం. ఆ తర్వాత దయా రోడ్డుపైకి రావడాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఇంతలోనే దయ నేరుగా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. -
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, వరంగల్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి గంగాదేవిపల్లి సమీపంలో సంభవించింది. పోలీసుల వివరాల ప్రకారం.. చనిపోయిన యువకులు గంగాదేవిపల్లికి చెందిన ఇట్ల జగదీష్(19), న్యాల నవీన్(20), జనగామ జిల్లా నర్మెట్ట మాన్సింగ్ తండాకు చెందిన లకావత్ గణేష్(21)గా గుర్తించారు. ముగ్గురు ద్విచక్ర వాహనంపై వరంగల్ నుంచి గంగాదేవిపల్లికి వెళ్తుండగా.. వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కోట్టడంతో అక్కడిక్కడే ప్రాణాలు వదిలిన ఘటన స్థానికులను కలిచివేసింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన జగదీష్, న్యాల నవీన్ల మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. -
కి‘లేడీ’ అరెస్టు
సాక్షి, భీమారం(వరంగల్): వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి ఇల్లు అద్దెకు తీసుకుంటున్న కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. కేయూ పోలీస్స్టేషన్ పరిదిలో ఇలాంటి సంఘటనలు వెలుగు చూశాయి. ఈమేరకు నిఘా వేసిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి ఆరు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి కేయూసీ పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ డేవిడ్ రాజు వివరాలు వెల్లడించారు. హుస్నాబాద్ మండలం హైసమ్మవాగు తండాకు చెందిన భూక్య రజిత యాదవ నగర్, పెద్దమ్మగడ్డ ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకుని చుట్టుపక్కల వారితో పరిచయాలు పెంచుకుంది. నమ్మకస్తురాలిగా ఉంటూ ఉదయం ఎవరూలేని ఇళ్లలోకి ప్రవేశించి దొంగతనాలు చేస్తోంది. ఆ తర్వాత ఇళ్లు ఖాళీ చేసి మరో ఏరియాకు మకాం మార్చేది. ఇదిలా ఉండగా రెడ్డిపురం క్రాస్ వద్ద సోమవారం అనుమానాస్పదంగా కనిపించిన రజితను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలు వెలుగు చూశాయి. పెద్దమ్మగడ్డ, యాదవనగర్ ప్రాంతాల్లో చోరీ చేసినట్లు ఆమె అంగీకరించగా సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డేవిడ్రాజు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సైలు హరికృష్ణ, రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళ ఫిర్యాదుతో సీఐడీ విచారణ
సాక్షి, వరంగల్: మండల కేంద్రంలోని ఓ రైస్మిల్లుపై గతేడాది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ (ఎస్సీఎస్)కు బాధితురాలు ధరావత్ శకుంతల ఫిర్యాదు చేయగా విచారణ అధికారిగా కమిషన్ సీఐడీ డీఎస్పీ రవికుమార్ను నియమించింది. ఈ మేరకు బుధవారం డీఎస్పీ రవికుమార్ రైస్మిల్లు వద్దకు వచ్చి ఫిర్యాదు చేసిన వారితో పాటు ప్రస్తుతం నిర్వహిస్తున్న వారిని విచారించారు. 2010లో ధరావత్ శకుంతల ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రైజెస్ పథకంలో రూ.50 లక్షల సబ్సిడీతో రూ.3 కోట్లతో రైస్మిల్లు పొంది రూ.1.93 కోట్ల పెట్టుబడితో రైస్మిల్లు ఏర్పాటు చేసుకున్నారు. రూ.89,50 లక్షలు కెనరా బ్యాంక్ రుణం అందజేయగా.. ప్రభుత్వం నుంచి రూ.40 లక్షల సబ్సిడీ విడుదల చేసింది. ప్రతినెలా 1.29 లక్షలు బ్యాంక్ అప్పు చెల్లించే విధంగా ప్రీమియం ఏర్పాటు చేసుకోగా ప్రతినెలా ప్రీమియం చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు మిల్లును వేలం వేసి అమ్మేశారు. దీనిపై ధరావత్ శకుంతల మిల్లును వేలం వేసి తనకు నష్టం చేశారంటూ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రస్థాయి నుంచి ఆ ఫిర్యాదుపై నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్్సకు బదిలీ చేసింది. దీనిపై సీఐడీ డీఎస్పీ రవికుమార్ను విచారణ అధికారిగా నియమించగా బుధవారం రైస్మిల్లు వద్ద విచారించారు. -
ఎవరైనా.. ఎక్కడి నుంచైనా!
వరంగల్ క్రైం: సైబర్ నేరాలకు సంబంధించి ఇకపై ఎవరైనా.. ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయొచ్చని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ తెలి పారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం సైబర్ విభా గం ఆధ్వర్యాన ‘సైబర్ పోలీసు పోర్టల్’పై పోలీసు స్టేషన్ల రైటర్లకు ఒక రోజు శిక్షణ ఏర్పాటుచేశారు. ఈ సందర్బంగా సీపీ రవీందర్ మాట్లాడుతూ దేశంలో సైబర్ నేరాలను నియంత్రించి నేరస్తులను పట్టుకోవడంతో పాటు బాధితుల ఫిర్యాదులను ఎక్కడి నుంచైనా స్వీకరించేందుకుగాను కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇండియన్ సైబర్ క్రైం కోఆరి్డనేషన్ సెంటర్ పేరుతో పోర్టల్ను ప్రారంభించిందని తెలిపారు. దీని వల్ల సైబర్ బాధితులు నేరుగా http://cybercrime.gov.in ద్వారా తమ నమోదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ పోర్టల్ ద్వార అందిన ఫిర్యాదులను రాష్ట్ర సైబర్, జిల్లా సైబర్ విభాగాల ద్వారా సంబంధించి పోలీసు స్టేషన్లకు బదిలీ చేస్తారని చెప్పారు. ఆ వెంటనే విచారణ ప్రారంభమవుతుందని వివరించారు. కమిషరేట్లో ఓ కేసు ఇటీవల కమిషనరేట్ పరిధిలో ఓ మహిళ వ్యక్తిగత ఫొటోలను పరిచయం ఉన్న వ్యక్తి ఫేస్బుక్లో పెట్టాడని సీపీ రవీందర్ తెలిపారు. ఈ విషయమై మహిళ ఫిర్యాదు చేయగా సైబర్ విభాగం అధికారులు ఫేస్బుక్లో ఫొటోలు తొలగింపచేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా నిందితుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ మేరకు సైబర్ క్రైం పోర్టల్పై సిబ్బంది అవగాహన పెంచుకోవడంతో పాటు ప్రజలకు వివరించాలని సూచించారు. సదస్సులో అడిషనల్ డీసీపీ వెంకటలక్ష్మి, సైబర్, ఐటీ కోర్ విభాగం ఇన్స్పెక్టర్లు జనార్దన్రెడ్డి, రాఘవేందర్, ప్రశాంత్, సైబర్ సిబ్బంది కిషోర్, రాజు, దినేష్, ఆంజనేయులు, రత్నాకర్, నరేష్ పాల్గొన్నారు. -
తండ్రీకొడుకుల గంజాయి స్మగ్లింగ్
సాక్షి, నెక్కొండ: గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నర్సంపేట ఏసీపీ ఫణీంద్ర కేసు వివరాలను వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనంతారం గ్రామానికి చెందిన కొంగర యేసు, వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం హరిశ్చంద్రు తండా గ్రామానికి చెందిన జాటోతు రాజ్కుమార్, జాటోతు సీతారాం(పరారీలో ఉన్నాడు).. పశ్చిమ గోదావరి జిల్లా చింతూరులో గంజాయి కొనుగోలు చేసి స్మగ్లింగ్కు చేస్తున్నారు. నిందితుల్లో జాటోతు సీతారాం అక్రమ దందాలకు పాల్పడుతుండేవాడు. ఆయన కుమారుడు, ఎంకాం చదివిన రాజ్కుమార్ కూడా తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తండ్రి మార్గాన్ని ఎంచుకున్నాడు. వీరిద్దరితోపాటు మరొకరి సాయంతో పశ్చిమగోదావరి జిల్లా నుంచి గంజాయి స్మగ్లింగ్కు పాల్పడే వారు. ఈ నెల 9న నెక్కొండకు రైలు మార్గం ద్వారా గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నిఘా వేయగా రెండు సంచులతో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో రాజ్కుమార్, యేసును అదుపులోకి తీసుకోగా పక్కనే ఉన్న సీతారాం ఉడాయించాడు. ఈ మేరకు రూ.12 లక్షల విలువైన శుద్ధి చేసిన 60 కిలోల(30 ప్యాకెట్లు) గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి తీసుకొచి్చన గంజాయిని రైలు మార్గంలో మహరాష్ట్రకు తరలించే క్రమంలో అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ తిరుమల్, ఎస్సై నవీన్కుమార్, ఏఎస్సై ప్రతాప్సింగ్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
రిజర్వాయర్లో యువతి మృతదేహం
సాక్షి, కాజీపేట: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి రిజర్వాయర్లో గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మంగళవారం నీటిపై యువతి మృతదేహం తేలియాడుతోందని స్థానికులు అందించిన సమాచారం మేరకు ఏసీపీ రవీంద్రకుమార్, సిబ్బంది చేరుకుని బయటకు తీయిం చారు. బూడిద రంగు టాప్, తెలుపు రంగు ప్యాంటు ధరించిన ఆమె కుడి చేతికి ఎరుపు దారం, చెవికి కమ్మల బుట్టలు, ముత్యంతో కూడిన ముక్కు పుల్ల ధరించి ఉందని తెలిపారు. చెప్పులు రిజర్వాయర్ కట్టపై ఉండటంతో ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేసి వేశారా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. యువతి వివరాలు తెలిసిన వారు 94910 89128, 94407 95212, 94407 00506 నంబర్లకు ఫోన్ చేయాలని ఏసీపీ కోరారు. -
నమ్మితే.. నయవంచనే!
సాక్షి వరంగల్ : ప్రేమకు పునాది నమ్మకం.. ఆ నమ్మకమే యువతుల పట్ల మరణ శాసనంగా మారుతోంది. ప్రేమ. ప్రేమా అంటూ తియ్యటి మాటలు చెప్పి యువతలను ఆకర్షించడం.. ఆ పైన సెల్ నంబర్ దొరికితే చాలు అమ్మాయి తనదేనని గర్వంగా స్నేహితులకు చెబుతున్న ఘటనలు కోకోల్లలుగా జరుగుతున్నాయి. ఇందులోలో కొన్ని ఘటనలు విషాదంగా ముగుస్తుండడం కుటుంబీకులకు తీరని ఆవేదనను మిగులుస్తున్నాయి. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జరిగిన రెండు సంఘటనల్లో చివరకు అమ్మాయిలు ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. వరుసగా యువతులపై జరుగుతున్న దాడుల వల్ల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవువుతున్నారు. ప్రేమ పేరుతో వంచించే నయ వంచకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కళాశాలలకు వెల్లిన తమ పిల్లలు ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులకు ప్రతి రోజు పరీక్షే అవుతోంది. ప్రమాదం ఎవరి రూపంలో వచ్చి ఏం చేస్తుందో తెలియక ప్రతీ క్షణం టెన్షన్తో బ్రతకాల్సిన పరిస్థితులు చాలా కుటుంబాల్లో చోటు చేసుకుంటున్నాయి. సంఘటనల జరిగాక పోలీసులు ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నా నిందితులు, మిగతా వారి వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. పేద కుటుంబం.. ప్రేమ మోసం నగరంలో నాలుగు నెలల్లో జరిగిన రెండు సంఘటనల్లో రెండు పేద కుటుంబాలకు చెందిన ఇద్దరు అమ్మయిలు తనువు చాలించాల్సి వచ్చింది. కాకతీయ యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ఆగస్టు 10 జరిగిన సంఘటనలో సమ్మయ్యనగర్కు చెందిన పదో తరగతి విద్యార్థిని వెన్నెలపై ఇద్దరు అత్యాచారం చేశారు. దీంతో ఆమె ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక, బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నిందితుడు కొయ్యడ తిరుపతితో పాటు మరో మైనర్ బాలుడు జైలు పాలయ్యారు. ఇంతలోనే మరో అమ్మాయి ప్రేమకు బలైంది. దీన్దయాళ్నగర్కు చెందిన గాదం మానస పేద కుటుంబానికి చెందిన యువతి. ఆమె తల్లిదండ్రులు గాదెం స్వరూప, మల్లయ్య గీసుగొండ మండలం కొమ్మాల నుంచి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. ముగ్గురు పిల్లల్లో ఒకరి వివాహం చేయగా, మరో ఇద్దరిని కూరగాయలు అమ్మి చదివిస్తున్నారు. తల్లిదండ్రులకు తోడుగా షాపులో పనిచేస్తున్న క్రమంలో పులి సాయిగౌడ్ పరిచయం పెంచుకుని ఆ తర్వాత సెల్ నంబర్ తీసుకుని, ముందుగా చాలా మర్యాదగా మాట్లాడుతూ దగ్గరయ్యాడు. ఆ తర్వాత ప్రేమ మొదలుపెట్టాడు. అనంతరం తన కోసం బయటకు రాకుంటే చస్తానని బెదిరించి చివరకు బయటకు వచ్చిన తరువాత బలవంతంగా అత్యాచారం జరిపి హత్య చేయడం ఆ కుటుంబాన్ని ఎంతో కుంగుబాటుకు గురిచేసింది. ఈ రెండు సంఘటనల్లో అమ్మాయిలు కేవలం సెల్ఫోన్లలో నిందితులు ప్రేమగా మాట్లాడిన మాటలకు పొంగిపోయి... ఇంట్లో వారికి చెప్పకుండా నిందితుల వెంట వెళ్లి ప్రాణాలను కోల్పోయారు. మానస హత్యలో నిందితుడు సాయిగౌడ్ సుమారు ఆరు గంటల పాటు మృత దేహంతో ప్రయాణం చేసి , చివరకు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం గమనార్హం. ఏం జరుగుతుందో... ఇంట్లో ఈడు వచ్చిన పిల్లలు ఉన్నప్పుడే ఏం జరుగుతుందో కూడా పట్టించుకోని తల్లిదండ్రుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కళాశాలలకు వెళ్లే అమ్మాయిలు, అబ్బాయిల దగ్గర రూ.వేల విలువైన సెల్ఫోన్లు ఉంటున్నాయి. వీటి ద్వారా ఎన్ని అద్భుతాలు చేస్తున్నారో, ఎవరితో ఎంత సేపు మాట్లాడుతున్నారో పట్టించుకునే తీరిక చాలా మంది తల్లిదండ్రులకు ఉండడం లేదు. కమిషనరేట్ పరిధిలో ప్రతీ వారం షీ టీమ్స్ అధికారులు ఈవ్టీజర్లకు కౌన్సెలింగ్ ఇస్తుండగా.. ఇందులో 80 శాతం మంది కళాశాల విద్యార్థులే ఉంటున్నారు. అయితే, కౌన్సెలింగ్ తర్వాత కూడా చాలామందిలో మార్పు రాకపోవడం ఇలాంటి ఘటనలకు కారణమవుతోంది. మృతదేహం వద్ద నివాళుర్పించిన ఎమ్మెల్యే వినయ్భాస్కర్ ఎంజీఎం : అత్యాచారం, హత్యకు గురైన మానస మృతహం వద్ద ప్రభుత్వ చీఫ్ వినయ్భాస్కర్ నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన గురువారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మానస మృతదేహాన్ని సందర్శించి కుటుంబీకులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో పాటు ఘటనకు పాల్పడిన నిందింతుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. కాగా, పోస్టుమార్టం అనంతరం మానస మృతదేహాన్ని స్వగ్రామమైన కొమ్మాలకు తరలించగా రాత్రి అంత్యక్రియలు పూర్తిచేశారు. -
వరంగల్ హత్య కేసును చేధించిన పోలీసులు
సాక్షి, వరంగల్ : జిల్లాలో కలకలం రేపిన యువతి హత్యకేసును గంటల వ్యవధిలో పోలీసులు చేధించారు. వరంగల్లోని దీన్ దయాల్ నగర్కు చెందిన యువతి మానస బుధవారం భద్రకాళి ఆలయానికి వెళ్లి హంటర్ రోడ్డులో అనుమానాస్పదంగా మృతి చెందిన విషమం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన కేసులో నిందితుడిని సుబేదారి పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ఒక కారును సైతం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వరంగల్ కమిషనర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించారు. పోలీస్ కమిషనర్ వి. రవీందర్ మాట్లాడుతూ.. కేసులో అరెస్టు చేసిన నిందితుడు జనగాం జిల్లా ఘన్పూర్ మండలం నెమలిగొండ్ల గ్రామానికి చెందిన పులి సాయిగౌడ్గా తెలిపారు. ‘నిందితుడు హంటర్రోడ్లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. హత్యకు గురైన మానస హంటర్రోడ్డులోని నీలమ్ జంక్షన్ వద్ద తండ్రితో కలిసి కూరగాయల వ్యాపారం నిర్వహిస్తూనే.. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీకి వచ్చిపోయే క్రమంలో ఆరు నెలల క్రితం ఇరువురి మధ్య పరిచయం ఏర్పడిందని, కొన్ని రోజుల నుంచి వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు’ సీపీ పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం మానస పుట్టిన రోజు కావడంతో సాయిగౌడ్ తనను కలిసేందుకు రమ్మని చెప్పాడు. మానస భద్రకాళి గుడికి వెళ్ళి వస్తానని తన తల్లికి చెప్పి బయటకు వచ్చింది. సాయి సూచన మేరకు మానస కాజీపేట చేరుకోగా.. కారులో వచ్చిన సాయి తనను తీసుకొని వెళ్లి చిన్న పెండ్యాల రైల్వే ట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో కారులోనే మానసపై హత్యాచారం చేసాడు. ఈ క్రమంలో మానస అక్కడికక్కడే మరణించడంతో ఆ హత్యా నేరం తనపై రాకుండా ఉండేందుకు తన మిత్రుల సహాయం కోరాడు. అనంతరం అక్కడికి చేరుకున్న నిందితుని మిత్రులు శవంగా పడి ఉన్న మానసను చూసి సాయికి సహయం చేసేందుకు అంగీకరించగపోగా, అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. దీంతో కంగారు పడ్డ సాయి ఒంటరిగానే మానస మృతిదేహాన్ని కారులో వేసుకోని చీకటి అయ్యే వరకు శివారు ప్రాంతంలో తిరిగాడు. అనంతరం మానస హత్యను సహజంగా చిత్రికరించేందుకు ఓ కాలేజీ సమీపంలోని బట్టల షాపులో డ్రెస్ కోనుగోలు చేసి, తిరిగి కారులో హంటర్ రోడ్లోని న్యూశాయంపేట రైల్వేట్రాక్ వద్ద రక్త సిక్తమైన మృతురాలి బట్టలను తొలగించి కొత్త బట్టలను మృతదేహానికి వేశాడు. అక్కడి నుంచి మానసను ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో పడేసి అనంతరం నిందితుడు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. కూతురు తిరిగి ఇంటికి రాలేదని కంగారు పడ్డ మానస తల్లిదడ్రులు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మానస తల్లిదండ్రులు ఇచ్చిన పిర్యాదుపై కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులు దర్యాప్తు నిర్వహించి నిందితుడు సాయిగౌడ్ను గురువారం మద్యాహ్నం తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక నిందితుడి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకోని కోర్టులో హాజరు పరుచనున్నట్లు సీపీ తెలిపారు. -
500 కిలోల గంజాయి స్వాధీనం
సాక్షి, వరంగల్: గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను వరంగల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.50 లక్షల విలువైన 500 కిలోల గంజాయి, రెండు నాటు తుపాకులు, 11 రౌండ్ల బుల్లెట్లు, ఒక కత్తి, బొలెరో వాహనం, ఐదు సెల్ఫోన్లు, రూ.1.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీసు కమిషనర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. నిందితుల్లో వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన దండెబోయిన సుమన్, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా అన్నవరానికి చెందిన వంతల విజయ్, గిమ్మెల రంగారావు, వంతల నర్సింగరావు, మరో నిందితుడు బాల నేరస్తుడు ఉన్నాడని చెప్పారు. -
టాటా చెప్పేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..
అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు కళ్లెదుటే కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు పడిన బాధ వర్ణనాతీతం. తన అక్కకు టాటా చెప్పేందుకు వెళ్లిన చిన్నారిని మృత్యువు బస్సు రూపంలో కబళించగా.. అప్పటివరకు ముద్దు ముద్దు మాటలతో మాట్లాడిన తమ కూతురు ఇక లేదనే చేదు నిజాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. గుళ్లూ.. గోపురాలు తిరిగితే దేవుడు ఇచ్చిన బిడ్డను దేవుడే తీసుకెళ్లాడంటూ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సాక్షి, సంగెం: అప్పటివరకు ముద్దు ముద్దు మాటలతో మాట్లాడిన చిన్నారిని ప్రైవేట్ స్కూల్ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాధ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకా రం.. అక్క స్కూల్కు వెళ్తుంటే టాటా చెప్పేం దుకు వెళ్లి చెల్లెలు తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషాధ సంఘటన ఇది. స్థానికులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని కాట్రపల్లికి చెందిన కర్ర జ్యోత్స్న, అమరేందర్రెడ్డిలకు సమ్మిత, మనస్విత(రెండున్నర సంవత్సరాలు) సంతానం ఉన్నారు. పెద్దకూతురు వరంగల్ అర్బన్ జిల్లా మామునూర్ క్యాంపులోని పాత్ఫైండర్ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతుంది. బుధవారం బస్సు హారన్ విని తల్లి పెద్ద కూతురు సమ్మితను స్కూల్ బస్సు ఎక్కించడానికి చిన్న కూతురును తీసుకుని ఇంటి సమీపంలోని రోడ్డు వరకు వెళ్లింది. రోడ్ అటు వైపు దాటి ఆగిఉన్న బస్సులో పెద్ద కూతురును ఎక్కించింది. చిన్న కూతురును తీసుకుని బస్సు ముందు నుంచి ఇంటికి వస్తుండగా బస్సు డ్రైవర్ కాగితాల లింగమూర్తి ఆజాగ్రత్తగా ముందుకు వెళ్లడంతో బస్సు ముందు టైర్ కిందపడిన చిన్నారి మనస్విత తల పైనుంచి వెళ్లడంతో రోడ్పై ఉన్న కర్ర రాజిరెడ్డి, మిలుకూరి రామచంద్రారెడ్డి, మందాటి రాజేశ్వర్రెడ్డి చూసి కేకలు వేయడంతో బస్సును నిలిపివేశాడు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే చిన్నారి మృతిచెందింది. చిన్నారి మనస్విత తండ్రి అమరేందర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. కాగా, చిన్నారి మృతిచెందడంతో కుటుంబసభ్యులు రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించాయి. -
మార్ఫింగ్ ఫొటోలతో అశ్లీల చాటింగ్..!
సాక్షి, వరంగల్: సామాజిక మాధ్యమాల నుంచి యువతుల ఫొటోలను సేకరించాక మార్ఫింగ్ చేసి ఆ ఫొటోలతో ఇన్స్టాగ్రాం ఖాతాలు తెరుస్తున్నాడు.. ఆ ఖాతా ద్వారా యువతులతో చాటింగ్కు దిగేవాడు.. అయితే, అశ్లీలంగా చాటింగ్ చేయకపోతే మార్ఫింగ్ చేసిన ఫొటోలను బంధువులు, స్నేహితులకు పంపిస్తానని బెదిరిస్తున్నాడు... అలా అంగీకరించని ఓ యువతి ఫొటోలను మిత్రులకు పంపించడంతో విషయం బయటపడగా ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాధ్యుడైన ఇంజనీరింగ్ విద్యార్థిని అరెస్టు చేశారు. ధర్మారం వాసి... వరంగల్ రూరల్ జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి(మైనర్) ఇన్స్టాగ్రాంలోని యువతల ఫొటోలను సేకరిస్తున్నాడు. ఆ తర్వాత అశ్లీలకరమైన ఫొటోతో మార్ఫింగ్ చేసి ఆ ఫొటో ద్వారా నకిలీ ఇన్స్టాగ్రాం ఖాతాలు తెరిచేవాడు. ఆ ఖాతా ద్వారా తనతో అశ్లీలకరంగా చాటింగ్ చేయాలని.. లేకపోతే మార్ఫింగ్ చేసిన ఫొటోలను తన కుటుంబసభ్యులు, స్నేహితులకు పంపిస్తానని బెదిరిస్తున్నాడు. ఈక్రమంలో ఓ యువతిని బెదిరిస్తూనే మార్ఫింగ్ చేసిన ఆమె ఫొటోను కాలేజీకి సంబంధించిన గ్రూప్లో పోస్ట్ చేశాడు. దీంతో ఖంగుతిన్న సదరు యువతి తల్లిదండ్రులు మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన కమిషనరేట్ సైబర్ క్రైం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు నిర్వహించి యువతల ఫొటోలను మార్ఫింగ్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న యువకుడిని మట్టెవాడ పోలీసుల సహకారంతో బుధవారం ఉదయం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన నుంచి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఫిర్యాదు అందుకున్న అతితక్కువ సమయంలోనే నిందితుడిని గుర్తించి అరెస్టు చేసిన సైబర్ క్రైం విభాగం ఇన్స్పెక్టర్ జనార్దన్రెడ్డి, మట్టెవాడ ఇన్స్పెక్టర్ తౌటం గణేష్తో పాటు ఏఏఓ ప్రశాంత్, కానిస్టేబుళ్లు కిషోర్కుమార్, రాజు, దినేష్, ఆంజనేయులు, రత్నాకర్, నరేష్ను సీపీ రవీందర్ అభినందించారు. -
క్షుద్రపూజలు చేయించిందని వేధించడంతో..
సాక్షి, హసన్పర్తి(వరంగల్): క్షుద్ర పూజలు చేయించావంటూ ఓ కుటుంబం చేస్తున్న వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ అర్బన్ హసన్పర్తి మండలం హరిశ్చంద్రు నాయక్ తండాలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. హరిశ్చంద్రునాయక్ తండాకు చెందిన కవిత(18) పదో తరగతి పూర్తిచేసింది. ఆమెకు జ్యోతితో పాటు మరో ఇద్దరు యువతులు స్నేహితులు ఉన్నారు. ఇటీవల కోమటిపల్లిలో జ్యోతి ఫొటోకు క్షుద్రపూజలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు కవితే కారణమని జ్యోతి, ఆమె తండ్రి బిక్షపతి, సోదరుడు అనిల్ వేధించడం ప్రారంభించారు. క్షుద్ర పూజలు ఎవరు చేశారు, ఎవరు చేయించారో చెప్పాలని వేధించారని కవిత బంధువులు తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వారే బెదిరింపులకు గురి చేశారని కుటుంబసభ్యులు చెప్పారు. దీంతో వారి వేధింపులు భరించలేక కవిత స్థానికంగా ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు జ్యోతి, బిక్షపతి, అనిల్ వేధింపులతోనే కవిత ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ ఆమె కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. జ్యోతి ఇంటి ఎదుట మృతదేహంతో ధర్నా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బంధువులకు నచ్చచెప్పి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
భర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు
సాక్షి, దామెర వరంగల్ : మద్యానికి బానిసై తరచూ వేధింపుపులకు గురి చేస్తున్న భర్తను ఎలాగైనా వదిలించుకోవాలనే భావనతో పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన నేరంపై మహిళకు జీవిత కారాగారశిక్ష విధించారు. ఈ మేరకు శుక్రవారం వరంగల్ మూడో అదనపు జిల్లా కోర్టు జడ్జి కె.శైలజ సంచలన తీర్పు వెల్లడించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముగంటి బాలకిషన్ కథనం ప్రకారం కేసు, తీర్పు వివరాలిలా ఉన్నాయి బెల్ట్షాపు నడుపుతూ మద్యానికి బానిసై... వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ల్యాదెల్ల గ్రామానికి చెందిన ఎరుబాటి మల్హల్రావు, లలితకు 2002లో వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితంతో ఆకాష్, నక్షత్ర జన్మించారు. ఓ పక్క వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూనే బెల్టు షాపు నిర్వహిస్తూ జీవనం కొనసాగించే మల్హల్ రావు మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో మల్హల్రావు మద్యానికి బానిపై భార్యను తరచూ వేధించేవాడు. ఈక్రమంలో పలుమార్లు పంచాయతీ నిర్వహించినా మార్పు రాలేదు. 2015 జూలై 6న రాత్రి భార్యాభర్తలు గొడవపడుతుండగా.. ఎప్పుడూ జరిగేదనే భావనతో మల్హల్రావు తండ్రి మోతయ్య రైస్మిల్లులో పనికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చి వెనుక వూపు వెళ్లి చూడగా ఆయన కుమారుడు కాలిపోయి పడి ఉన్నాడు. అయితే, తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. ఇది ముమ్మాటికీ హత్యేనని చెబుతూ మోతయ్య ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో నేరం అంగీకారం.. ఆత్మకూరు పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో మల్హల్రావు భార్య లలిత పోలీసులకు లొంగిపోయింది. తరచూ తాగిన మైకంలో తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తుండడంతో భర్తను చంపాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. 2015 జూలై 6న రాత్రి 7 గంటలకు గొడవ పడి బయటకు వెళ్లిన హల్హల్రావు తిరిగి ఇంటికి రాలేదు. అయితే, అర్ధరాత్రి 12 గంటలకు లలిత బయటకు రాగా.. తాగిన మైకంలో ఇంటి వెనుక పడి ఉన్న భర్త కనిపించాడు. ఈ మేరకు ఇంట్లోని పెట్రోల్ తీసుకొచ్చి ఆయనపై పోసి నిప్పంటించి సజీవంగా కాల్చి చంపింది. అయితే, తాగిన మైకంలో స్పృహ లేకుండా ఉండడంతో మల్హల్రావు ఎలాంటి కేకలు, అరుపులు చేయకుండా మంటల్లో కాలిపోయాడు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. లలితపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు శిక్ష విధిస్తూ జడ్జి శైలజ తీర్పు వెల్లడించారు. కేసును సీఎం ఎంరవికుమార్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్ రమేషబాబు పర్యవేక్షించారు. 31 మంది సాక్షులను కానిస్టేబుల్ డి.వెంకటనారాయణ కోర్టులో ప్రవేశపెట్టారు. -
కన్నపేగునే కబళించారు!
సాక్షి, దామెర(వరంగల్) : మద్యానికి బానిసై ఇంట్లో గొడవలకు కారణమవుతున్న ఓ కొడుకును తల్లిదండ్రులే కడతేర్చారు. ఇంటి ముందు వరండాలో తాళ్లతో కట్టేసి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. హృదయ విదారక ఘటన వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కడారి ప్రభాకర్, విమల దంపతుల పెద్ద కుమారుడు మహేష్ చంద్ర (42). మహేష్ భార్య రాధికను డబ్బుల కోసం వేధిస్తుండటం, భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఆమె ఇటీవల పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మహేష్ మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో తల్లిదండ్రులతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మద్యం సేవించి వచ్చి తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు మహేష్ను ఇంటి ముందు వరండాలో తాళ్లతో కట్టేసి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. స్థానికులు మంటలనార్పి అతడిని కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే సజీవ దహనమయ్యాడు. పరకాల ఏసీపీ శ్రీనివాస్, శాయంపేట సీఐ ఎస్.వెంకటేశ్వర్రావు, ఎస్సై భాస్కర్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులుగా భావిస్తున్న కడారి ప్రభాకర్, విమలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, గ్రామస్తులు మహేశ్ తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తొలుత గొంతు కోసి హత్య చేసి.. ఆ తరువాత..
సాక్షి, నెక్కొండ(వరంగల్): వృద్ధ తల్లిదండ్రులపై మమకారాన్ని మరచిన కన్న కొడుకు, మనువడు కలిసి కిరాతకంగా గొంతు కోసి కడతేర్చిన ఘటనలో నిందితులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి పరిధిలోని భూక్యా తండాలో వృద్ధ దంపతులు భూక్యా దస్రూ – బాజిని స్వయాన కుమారుడు, మనవడు కలిసి బుధవారం రాత్రి సజీవ దహనం చేసిన విషయం విదితమే. అయితే, సజీవ దహనం కాదని.. తొలుత గొంతు కోసి హత్య చేశాక.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించారని తేలింది. ముందుగా నిందితులు కేతురాం, వెంకన్నలు బుధవారం సాయంత్రం భూక్యా దస్రూ – బాజి ఇంటికి వెళ్లి వెళ్లగానే దస్రూపై దాడికి పాల్పడి గొంతు కోశాడు. ఆ తరువాత తల్లి బాజిపై దాడికి పాల్పడుతుండగా ప్రాధేయపడినా గొంతు కోసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎవరికి అనుమానం కలగకుండా ఉండేందుకు ఇంట్లో, శవాలను మం చంపై ఉంచి పెట్రోలు పోసి, నిప్పు అంటించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే నిందితుల కు గాయాలయ్యాయని వారు చెప్పారు. వృద్ధ దంపతులు వారి పనులు వారే చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండేవారని.. అలాంటిది సజీవ దహనం చేస్తే కనుక కేకలు వినిపించేవని తండా వాసులు చెబుతున్నారు. హత్య చేశాక మంచంపై వేసి పెట్రోలు వేసి నిప్పు అంటివచ్చినట్లు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది..! నెక్కొండ మండలం మడిపల్లి పరిధిలోని భూక్యా తండాకు చెందిన దస్రూకు ఇద్దరు కుమారులు కేతురాం, వీరన్నతో పాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు. దస్రూకు ఉన్న భూమిలో పెద్దకొడుకు కేతురాంకు 3–30 ఎకరాలు, చిన్నకొడుకు వీరన్నకు 4 ఎకరాలు బీడు భూమి పంచి ఇచ్చాడు. అయితే కానిస్టేబుల్ అయిన వీరన్న భార్య ఝాన్సీతో ఏర్పడిన గొడవలతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఈక్రమంలోనే తన నాలుగు ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టాడు. దీంతో ఏడేళ్ల క్రితం దస్రూ మూడో కుమార్తె భద్రమ్మ ఆ భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపింది. వీరన్న రెండో వివాహం చేసుకున్న కొన్నేళ్లకు అనారోగ్యంతో మృతి చెందాడు. తన తమ్ముడికి అర ఎకరం భూమి ఎక్కువ ఇచ్చావని. సోదరి అయిన భద్రమ్మ కొనుగోలు చేసిన భూమి విషయంలో అప్పటి నుంచి కేతురాం గొడవ చేస్తున్నాడు. భూమి సాగు చేసినేందుకు వచ్చిన క్రమంలో కేతురాం కుటుంబ సభ్యులు దాడి చేశారని భద్రమ్మ పేర్కొన్నారు. దీంతో స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కోర్టులో కేసు వేశామని తెలిపింది. తరచూ గొడవలు జరుగుతుండడంతో ఈనెల 30న బుధవారం నెక్కొండ సీఐ పెద్దన్నకుమార్.. దస్రూ, బాజి, కుమార్తె భద్రమ్మ కుటుంబ సభ్యులు, కేతురాం కుటుంబ సభ్యులు, పెద్ద మనుషులను పిలిచి విచారణ చేశారు. భద్రమ్మ దగ్గర నాలుగు ఎకరాల భూమికి రిజిస్ట్రేషన్ ఉందని, ఆమెకే సాగు హక్కు ఉందని స్పష్టం చేయడంతో సమస్య పరిష్కారమైందని భావించినట్లు ఆమె తెలిపారు. ఆ తర్వాత తండాకు వెళ్తే గొడవలు జరుగుతాయని పోలీసులు చెప్పడంతో భద్రమ్మ తాము నివాసముంటున్న ఖమ్మం వెళ్లిపోయింది. ఇంతలోనే సాయంత్రం తన తల్లిదండ్రులను కేతరాం, వెంకన్న పొట్టన పెట్టుకున్నారని కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రులు చేతబడి చేయించారని అనుమానం కేతురాం చిన్నకుమారుడు బాలకృష్ణ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మూఢనమ్మకాలను నమ్మిన కేతురాం తన తల్లిదండ్రులే చేతబడి చేయించారని అనుమానం పెంచుకున్నాడు. అటు భూమి విషయం కొడుకు అనారోగ్యం విషయంలో తనకు అన్యాయం జరిగిందని కేతురాం కక్ష కట్టి కన్న తల్లిదండ్రులనే కడ తేర్చారని తండాలో చర్చించుకుంటున్నారు. తండ్రి వద్ద ఉన్న భూమిలో వాటా ఇవ్వాలని కొంత కాలంగా కేతురాం ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దస్రూ తన వాటాగా ఉంచుకున్న 2–5 ఎకరాల భూమిలో చిన్న కోడలుకు అర ఎకరం ఇవ్వగా అమ్ముకుంది. అలాగే, కేతురాంకు అర ఎకరం ఇచ్చి, మరో అర ఎకరం దస్రూ అమ్మకున్నాడు. మిగిలిన ఎకరం భూమితో పాటు దస్రూ నివసిస్తున్న ఇంటిని ఇప్పుడే తన పేర చేయాలని కేతురాం కొంతకాలంగా పట్టుబడుతున్నాడు. తన తదనంతరం మాత్రమే ఇస్తానని దస్రూ చెప్పడంతో కేతురాం కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. కాగా, నిందితులను కఠనంగా శిక్షించాలని దస్రు కుమార్తెలు కమలమ్మ, భద్రమ్మ, యాకమ్మ కుటుంబ సభ్యులు విలపిస్తూ కోరారు. భద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు సీఐ పెద్దన్నకుమార్, ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. -
‘ట్రిమ్విజన్’ పేరిట 230 మందికి టోకరా
సాక్షి, వరంగల్: నిరుద్యోగుల ఆశలను సొమ్ము చేసుక్ను మరో సంస్థ బోర్డు తిప్పేసింది. వరంగల్ దేశాయిపేటలోని ట్రిమ్విజన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటేడ్ ముందు వందల మంది బాధితులు బుధవారం సాయంత్రం ఆందోళనకు దిగే వరకు కూడా నిర్వాహకులు చేసిన మోసం బయటపడలేదు. ‘విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తాం.. నూరు శాతం ఉద్యోగం గ్యారంటీ.. దుబాయ్, అమెరికా ఏ దేశమైనా సరే ఉద్యోగానికి మాది భరోసా’ అని ట్రీమ్ విజన్ సంస్థ చేసిన ప్రకటనలకు మోసపోయిన నిరుద్యోగులు ఇప్పుడు లబోదిబో అంటున్నారు. వందలాది మంది నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి విదేశాలకు చెక్కేసిన నిర్వాహకుల తీరు నిరుద్యోగులను కంట తడి పెట్టిస్తోంది. రూ.20వేల నుంచి రూ.60వేల వరకు వరంగల్ దేశాయిపేటలో ట్రిమ్విజన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటేడ్ పేరిట మట్టెవాడకు చెందిన సీ.హెచ్.స్నేహలత కార్యాలయాన్ని తెరిచారు. దుబాయిలో ఉద్యోగం... రూ.వేలు, రూ.లక్షల్లో వేతనాలు అంటూ ఊరించి సుమారు 230 మంది నుంచి రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు అందినంత వసూలు చేశారు. స్థానికురాలే కావడంతో నగరానికి చెందిన పలువురు నమ్మి డబ్బు అప్పగించారు. గత ఎనిమిది నెలలుగా నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపి డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. డబ్బుతో పాటు అభ్యర్థుల అర్హత సర్టిఫికెట్లు, పాస్పోర్టులు, కూడా తీసుకున్నారు. ఇదిగో వీసా.. అదిగో వీసా అంటూ సుమారు ఆరు నెలలుగా నమ్మించి కాలయాపన చేశారు. ట్రీమ్ విజన్ సంస్థ కార్యాలయం చుట్టూ నిరుద్యోగులు చెప్పులరిగేలా తిరుగుతుండగా.. నిర్వాహకులు రూ.60 లక్షలతో దుబాయికి ఉడాయించినట్లు అందిన సమాచారంతో కార్యాలయం ఎదుట బుధవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. ఉన్న ఉద్యోగం వదిలి.. దుబాయిలో ఉద్యోగం వస్తుంది.. రేపో.. మాపో వీసా రానుందనే నమ్మకంతో పలువురు ఇక్కడ చేస్తున్న ఉద్యోగాలను కూడా వదిలేశారు. ఇప్పుడు నిర్వాహకులు బోర్డు తిప్పేసినట్లు తెలియడంతో బాధితులు కుటుంబ సభ్యులతో వచ్చి ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఇంతేజార్గంజ్ పోలీసులు రంగంలో దిగి బాధితులను శాంతింపచేశారు. అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. బాధితులు ఫిర్యాదు చేస్తే సంస్థ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశాం... ట్రీమ్ విజన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకులు సుమారు 230 మంది నుంచి రూ.60 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ఇందులో సుమారు 30 మందికి డబ్బు తిరిగి ఇచ్చినట్లు సమాచారం. మిగిలిన బాధితులు ఆందోళనకు దిగగా వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిర్వాహకురాలు సీహెచ్.స్నేహలతపై కేసు నమోదు చేశాం. దర్యాప్తు చేస్తున్నాం. – అశోక్కుమార్, ఇంతేజార్గంజ్ ఎస్సై -
వాటర్ ట్యాంక్ ఎక్కిన సర్పంచ్
డోర్నకల్: మోడల్ స్కూల్ హాస్టల్ ప్రారంభోత్సవ శిలాఫలకంపై తన పేరు సక్రమంగా రాయకుండా అవమానించారంటూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామ సర్పంచ్ స్థానిక వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. చిలుకోడు జీపీ పరిధి మోడల్ స్కూల్లో శనివారం హాస్టల్ భవనాన్ని ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై తన పేరు తప్పుగా రాయడమే కాకుండా చివరన చిన్న అక్షరాలతో రాశారని ఆరోపిస్తూ సర్పంచ్ రాయల వెంకటేశ్వర్రావు ప్రారంభోత్సవానికి ముందే గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కాడు. తనను అవమానించిన ఇద్దరు వ్యక్తులతో పాటు సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలని, లేకుంటే తిక్కడి నుంచి దూకుతానని హెచ్చరించాడు. సర్పంచ్కు మద్దతుగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగడంతో ట్రాఫక్ స్తంభించింది. సీఐ జె.శ్యాంసుందర్, ఎస్సై నాగభూషణం ట్యాంకు వద్దకు చేరుకుని సర్పంచ్తో మాట్లాడాడు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పినా ఒప్పుకోలేదు. సుమారు నాలుగు గంటల పాటు సర్పంచ్ ట్యాంక్పైనే ఉండగా గ్రామస్తులు రోడ్డుపై బైటాయించారు. మహబూబాబాద్ డీఎస్పీ నరేష్కుమార్ వచ్చి చెప్పినా ససేమిరా అనండంతో చివరకు సర్పంచ్ మద్దతుదారులతో పోలీసులు చర్చలు జరిపి అవమానించిన వారిపై ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటామని సూచించగా కిందకు దిగివచ్చిన సర్పంచ్ రాతపూర్వకగా ఫిర్యాదు అందజేశాడు. -
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
సాక్షి, వరంగల్ : జిల్లాలోని రెండు వేర్వేరు గ్రామాల్లో పిడుగు పడి ఇద్దరు మరణించారు. మృతులు ఆత్మకూరు మండలం, అక్కంపేట గ్రామానికి చెందిన మహిళ పూలమ్మ(40), గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామానికి చెందిన రైతు దూడయ్య(45)గా అని గ్రామస్తులు తెలిపారు. జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. పిడుగులు కూడా పడడంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు. వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రాకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
కారుతో ఢీకొట్టి కిడ్నాప్ చేసిన కేసులో వీడిన మిస్టరీ!
సాక్షి, బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట శివారులో ఈనెల 5న దంపతులు బైక్పై వెళ్తుండగా కారుతో ఢీకొట్టి భార్యను కిడ్నాప్ చేసిన సంఘటనలో నలుగురు నిందితులను పట్టుకున్నట్లు జనగామ డీసీపీ శ్రీనివాస్రెడ్డి, ఏసీపీ వినోద్కుమార్, నర్మెట సీఐ సంతోష్కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పారుపెల్లికి చెందిన బండ తిరుపతి– భాగ్యలక్ష్మి దంపతులకు 20 ఏళ్ల క్రితం వివాహమైనది. భాగ్యలక్ష్మికి అన్నదమ్ములు లేక పోవడంతో తిరుపతి ఇళ్లరికం వెళ్లాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న వీరికి ఒక పాప ఉంది. భాగ్యలక్ష్మి తండ్రి ఆర్ఎంపీగా సేవలందిస్తున్నాడు. ఆయన వద్దకు పక్క గ్రామమైన బొందుగులకు చెందిన మరో ఆర్ఎంపీ పుట్ట బాల్నర్సయ్య వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో కొంతకాలం నుంచి తిరుపతి భార్యపై అనుమానంతో వేధించసాగాడు. ఈ విషయాన్ని భాగ్యలక్ష్మి బాల్నర్సయ్యకు చెప్పడంతో తిరుపతిని ఎలాగైనా అంతమొందించాలని పథకం వేశారు. పక్కా పథకం ప్రకారం.. భాగ్యలక్ష్మి ప్రియుడు బాల్నర్సయ్య మిత్రుడు అమరాజు సిద్ధులు హైదరాబాద్లో బీడీఎల్లో డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ పథకం గురించి నర్సయ్య సిద్దులుకు మూడు నెలల క్రితం తెలుపగా మహబూబాద్ జిల్లా బయ్యా రం మండలం గంధంపల్లికి చెందిన మల్సూర్, కేసముద్రం మండలానికి చెందిన లక్ష్మీనారాయణతో కలిసి హత్య చేయడానికి ఒప్పుకుంటారు. ఇందుకుగాను రూ.5 లక్షలు సుపారీ మాట్లాడుకోగా బాల్న్సయ్య అడ్వాన్స్గా రూ. లక్ష ఇవ్వగా ఆ ముగ్గురు పంచుకున్నారు. ఈ డబ్బుతో హత్యకు అవసరమైన కా>రును సిద్ధులు ఆలేరు పట్టణంలో రూ.17వేలతో కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ఈనెల 5న తిరుపతి, భాగ్యలక్ష్మి జనగామ ఆస్పత్రికి వెళ్లి తిరిగి బైక్పై వస్తుండగా పోచన్నపేట శివారులో కారులో వచ్చి ఢీకొట్టా రు. ఈ ఘటనలో గాయపడిన తిరుపతిని పొల్లోకి లాక్కెళ్లి జే వైరుతో ఉరిపెట్టారు. ఆ సమయంలో గొర్లకాపర్లు రావడంతో గాయపడిన భాగ్యలక్ష్మిని కారులో తీసుకుని పోచన్నపేటకు వెళ్లారు. అక్కడి నుంచి బాల్నర్సయ్య భాగ్యలక్ష్మి జనగామకు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. అయితే సంఘటన స్థలంలో అపస్మారకస్థితిలోకి వెళ్లిన తిరుపతిని అటుగా వచ్చిన వారు గమనించి 108లో జనగామ ఆస్పత్రికి తరలించారు. ఏసీపీ వినోద్కుమార్, సీఐ మల్లేష్, ఎస్సై రంజిత్రావు వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నలుగురు అరెస్టు స్వాధీనం చేసుకున్న వాహనం వద్ద డీసీపీ, ఏసీపీ పోలీసులు; మాట్లాడుతున్న జనగామ డీసీపీ శ్రీనివాస్రెడ్డి దర్యాప్తులో భాగంగా నర్మెట సీఐ సంతోష్కుమార్ ఆదేశాలతో ఎస్సై రంజిత్రావు, ప్రొహిబిషన్ ఎస్సై ప్రశాంత్ బొందుగుల గ్రామంలోని ఇంట్లో బాల్నర్సయ్యతో సహా అతడికి సహకరించిన సిద్ధులు, లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశా రు. విచారణ చేపట్టగా హత్యాయత్నం ఘటనలో భాగ్యలక్ష్మి పాత్ర ఉందని తేలడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి మ న్సూర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి కారు, రూ.30,430 నగదు, బైక్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. హత్యాయత్నం కేసులు రెండు రోజుల్లోనే ఛేదించిన ఎస్సైలు రంజిత్రావు, ప్రశాంత్లను డీసీపీ శ్రీనివాస్రెడ్డి, ఏసీపీ వినోద్కుమార్, సీఐ సంతోష్కుమార్ అభినందించారు. -
రుధిర దారులు
ఇంకో రోజు గడిస్తే సద్దుల బతుకమ్మ.. ఆ తర్వాత మరో రోజుకు దసరా పండుగ.. ఆయా పండుగలకు సంబంధించి ఆ కుటుంబాలు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి.. కుటుంబీకులతో కలిసి ఆనందంగా పర్వదినాలు జరుపుకోవాలని సిద్ధమవుతున్నాయి.. ఇంతలోనే పెనువిషాదం! రోడ్డు ప్రమాదాల రూపంలో ఎదురొచ్చిన మృత్యువు ఎనిమిది మందిని బలి తీసుకుంది. ఉమ్మడి జిల్లాలోని దేవరుప్పుల మండలం బంజర స్టేజీతో పాటు ఆత్మకూరు మండలం కటాక్షపూర్ సమీపాన శుక్రవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ఓ ఘటనలో భార్యాభర్తలు వారి కుమారుడితో పాటు మరో ఘటనలు మామ, మేనల్లుడు, సమీప బంధువులు మృతి చెందడంతో ఆ కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. సాక్షి, వరంగల్: ఉమ్మడి జిల్లాలోని రెండు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఎనిమిది మంది మృతి చెందడంతో మరో నాలుగు రోజుల్లో దసరా పండుగ జరుపుకోవాల్సిన ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు కారులో వెళ్తున్న నలుగురు మృతి చెందగా.. ఇందులో మామ, మేనల్లుడు, బావబామ్మర్దులు ఉన్నాయి. ఇక మరో ఘటనలో సోదరుడిని పరామర్శించి తల్లిదండ్రులతో కలిసి పండుగ జరుపుకునేందుకు వెళ్తున్న భార్యాభర్తలు, వారి ఐదు నెలల కుమారుడు దుర్మరణం పాలవడం కలిచివేసింది. ఓ ప్రమాదానికి అతివేగం, అజాగ్రత్తే కారణమని పోలీసులు తేల్చిచెప్పారు. దేవరుప్పుల మండలం బంజర వద్ద ఓ ప్రమాదం, ఆత్మకూరు మండలం మహ్మద్గౌస్పల్లి వద్ద శుక్రవారం ఈ ప్రమాదాలు జరిగాయి. బంధువుల మృతదేహాల వద్ద బంధువుల రోదనలు మిన్నంటగా.. ఆస్పత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబీకుల ఆర్తనాదాలతో మార్మోగాయి. శుభాకార్యానికి వెళ్తుండగా... జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాలకు చెందిన బోగ సోమనర్సయ్య(40) జనగామలోని వీవర్స్ కాలనీలో స్థిరపడ్డారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో శుక్రవారం బంధువుల జన్మదిన వేడుకలకు ఆయనతోపాటు ఒకే సామాజిక వర్గం(పద్మశాలి)కు చెందిన హైదరాబాద్ వాస్తవ్యుడు, మేనల్లుడు చింతకింది మణిదీప్(18), జనగామ వీవర్స్ కాలనీకీ చెందిన బోగ రోహిత్, ప్రమీల, ఎల్లంలకు చెందిన బిర్రు సుధీర్కుమార్, రమాదేవితో స్విప్ట్ కారు(టీఎస్ 27–9772)లో శుక్రవారం ఉదయం బయలుదేరారు. సుమారు 11 గంటలకు బంజర స్టేజీ సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు రాగానే యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం తుర్కలషాపురంకు చెందిన వృద్ధుడు జక్కులు రాములు వృద్ధుడు టీవీఎస్ ఎక్సెల్పై బంక్ నుంచి బంజర వైపు రోడ్డు క్రాస్ చేస్తుండగా ఆయనను తప్పించబోయే క్రమంలో జనగామ వైపు ఎదురుగా వస్తున్న కారు(టీఎస్ 10యూ 2344)ను ఢీకొట్టాడు. ఈ సంఘటనలో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ మేరకు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ పగిలిపోయి చింతకింది మణిదీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, ఎదురుగా వస్తున్న కారులో పెద్దమడూరుకు చెందిన వర్రె మహేష్(24), కొమ్ము కృష్ణ(32), కర్రె అశోక్, చెరుకు సందీప్, దండబోయిన ఉమేష్ తీవ్రగాయాలపాలయ్యారు. రెండు కార్లలోని ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో క్షతగాత్రులతో సహా స్థానిక ఎస్సై బి.రామారావు సిబ్బందితో చేరుకుని క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ బోగ సోమనర్సయ్య, కొమ్ము కృష్ణ మృతి చెందగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించిన వర్రె మహేష్ కూడా మృతి చెందగా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మరణంలోను వీడని బంధుత్వం, స్నేహం బోగ సోమనర్సయ్య మృతదేహం; చింతకింది మనిదీప్; వర్రె మహేష్; కొమ్ము కృష్ణ బంజర స్టేజీ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో మృతి చెందిన నలుగురి నడుమ బంధుత్వం, స్నేహం ఉంది. బోగ సోమనర్సయ్య తమ రక్తససంబంధీకులు, బంధువులతో అన్యోన్యంగా ఉండే క్రమంలో ఆయనతోపాటు అక్క కొడుకు, మేనల్లుడు చింతకింది మణిదీప్ మరణంలోనూ కలిసే వెళ్లారు. ఇక పెద్దమడూరుకు చెందిన వర్రె మహేష్, కొమ్ము కృష్ణ ఒకే సామాజికవర్గాని(యాదవ)కి చెందిన యాదవులు కావడంతో పాటు చిన్ననాటి నుంచి స్నేహంతో పాటు బంధుత్వం(బావబామ్మర్దులు) కూడా ఉంది. ఆస్పత్రిలో మిన్నంటిన ఆర్తనాదాలు జనగామ ఏరియా ఆస్పత్రి వద్ద రోదిస్తున్న మృతుల కుటుంబసభ్యులు, బంధువులు బంజర స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల్లో నలుగురు మండల వాసులే కాగా మరొకరు హైదరాబాద్కు చెందిన వారు ఉన్నా అందరి నడుమ బంధుత్వం ఉంది. దీంతో ఘటన జరగగా జనగామ ఏరియా ఆస్పత్రికి చేరుకున్న బంధుమిత్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ దుర్ఘటనతో మృతి చెందిన బోగ సోమర్సయ్య నీర్మాల వాసికావడమేగాక అత్తగారు ఇదే మండలం కడవెండి కావడంతో ఆ రెండు గ్రామాలతోపాటు జనగామ వీవర్స్ కాలనీలో విషాదం అలుముకుంది. ఇక పెద్దమడూరులో ఊరుకు అరిష్టమని ఏడొద్దుల సద్దుల బతుకమ్మ రోజే ఇద్దరు గ్రామస్తుల దుర్మరణంతోపాటు నలుగురు గాయపడడంతో గ్రామం మూగబోయినట్లయింది. ఇక ఆస్పత్రి వద్ద సోమనర్సయ్య భార్య మాధవి, కొమ్ము కృష్ణ భార్య రేణుక, కుటుంబ సభ్యులు ‘అయ్యో తమ పిల్లల భవిత ఎట్టా.. తమకు ఆదెరువు ఎట్టా...దేవుడా మేమేం పాపం చేశాం..’ అంటూ చేసిన రోదనలు కలిచి వేశాయి. -
అదృశ్యం.. ఆపై అస్తిపంజరంగా..
సాక్షి, ములుగు: భర్త మరణించిన అనంతరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ఏర్పడిన వ్యక్తిగత సంబంధం మహిళ ప్రాణాలను బలికొంది. నమ్మిన వ్యక్తితో వెళ్లిన మహిళ అదే వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన ములుగు మండలంలోని జాకారం గ్రామపంచాయతీ పరిధిలోని గట్టమ్మ ఆలయ పరిసర అటవీ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుగు సీఐ కొత్త దేవేందర్రెడ్డి పోలీస్స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశంలో గురువారం కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని పత్తిపల్లి జీపీ పరిధిలోని కొడిశలకుంట గ్రామానికి నూనావత్ రాధ(45) భర్త సారయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కుమారుడు రాజుతో కలిసి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో రాధతో అదే గ్రామానికి చెందిన జాటోతు భోజ్యానాయక్ సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టాడు. గత నెల 18వ తేదీన రాధ భోజ్యనాయక్తో గట్టమ్మకు మొక్కులు చెల్లించడానికి వెళ్లింది. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆలయానికి కిలోమీటరు దూరంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వెంట తెచ్చిన స్కార్ప్తో రాధను హతమార్చాడు. ఆత్యహత్యగా చిత్రీకరించే ప్రయత్నం.. హత్య చేసిన అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భోజ్యానాయక్ స్కార్ప్తో చెట్టుకు ఉరి వేసుకొని రాధ మృతి చెందినట్లుగా కట్టిపడేశాడు. అందరూ ఆత్మహత్యగా భావిస్తారని గుట్టుచప్పుడు కాకుండా స్వగ్రామానికి వెళ్లాడు. ఫిర్యాదుతో.. తల్లి కనిపించకపోవడంతో కుమారుడు నూనవత్ రాజు గత నెల 28న సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ములుగు రెండో ఎస్సై డీవీ ఫణీ నేతృత్వంలో పోలీసులు మృతురాలి కాల్ డేటాను సేకరించారు. చివరి రెండు రోజుల్లో భోజ్యానాయక్తో ఎక్కువసార్లు మాట్లాడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అతడు రాధను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. భోజ్యానాయక్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన వెళ్లి చూడగా రాధ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరంగా మారింది. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అందించారు. నిందితుడిపై 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ దేవేందర్రెడ్డి వివరించారు. సమావేశంలో ఎస్సైలు బండారి రాజు, డీవీ ఫణీ పాల్గొన్నారు. రోధనలతో మిన్నంటిన గట్టమ్మ గుట్ట రాధ మృతదేహం కుళ్లిపోయి అస్థిపంజరంగా దర్శనమివ్వడంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. రోధలనతో గట్టమ్మ గుట్ట పరిసర ప్రాంతాలు మిన్నంటాయి. అస్థిపంజరం మాత్రమే ఉండడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో అక్కడే ఖననం చేశారు. -
ఆర్డీఓ సంతకం ఫోర్జరీ..
సాక్షి, నెల్లికుదురు: తొర్రూర్ ఆర్డీఓ తాటిపల్లి ఈశ్వరయ్య సంతకం ఫోర్జరీ చేసిన కేసులో కొండపల్లి కిరణ్కుమార్ను అరెస్టు చేసి రిమాండ్ పంపించినట్లు తొర్రూర్ సీఐ వి.చేరాలు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో బుధవారం నెల్లికుదురు ఎస్సై పెండ్యాల దేవేందర్తో కలసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. ఇసుక అక్రమంగా రవాణా చేసేందుకు తన సంతకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఫోర్జరీ చేసినట్లు తొర్రూర్ ఆర్డీఓ తాటిపల్లి ఈశ్వరయ్య ఆగస్టు 19న నెల్లికుదురు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన నెల్లికుదురు ఎస్సై దర్యాప్తు ప్రారంభించారు. మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామానికి చెందిన మాజీ వీఆర్ఓ కొండపల్లి నర్శింగరావు కుమారుడు కొండపల్లి కిరణ్కుమార్ నెల్లికుదురు తహసీల్దార్ అనిశెట్టి పున్నంచందర్తో కుమ్మక్కై ఆర్డీఓ సంతకాలు ఫోర్జరీ చేశారు. ఇసుక రవాణాకు ఆర్డీఓ ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు ట్రాక్టర్ యజమానుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఇసుక కూపన్లు సరఫరా చేశారు. ఈ తతంగం ఈ ఏడాది జనవరి నుంచి కొనసాగుతున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడు ఏ1 కొండపల్లి కిరణ్ కుమార్ను ఈనెల 1న రాత్రి అరెస్టుచేసి బుధవారం రిమాండ్కు తరలించారు. అయితే ఏ2 నిందితుడు నెల్లికుదురు తహసీల్దార్ అనిశెట్టి పున్నంచందర్ పరారీలో ఉన్నట్లు సీఐ చేరాలు తెలిపారు. వెలుగు చూసింది ఇలా.. బ్రాహ్మణకొత్తపల్లికి చెందిన కొండపల్లి నర్సింగరావు నెల్లికుదురు తహసీల్ కార్యాలయం ఏర్పాటైన కొద్ది సంవత్సరాలు వీర్ఓగా పనిచేశాడు. 2009లో నర్సింగరావుకు ఆరోగ్యం సహకరించకపోవడంతో అతడి కుమారుడు కిరణ్కుమార్ రెవెన్యూ అధికారులతో కుమ్మకై తండ్రి స్థానంలో వీఆర్ఓగా చేరాడు. బ్రాహ్మణకొత్తపల్లితో పాటు మధనతుర్తితో పనిచేశాడు. 2010లో బ్రాహ్మణకొత్తపల్లికి ప్రభుత్వం పంటల నష్టం కింద గ్రామానికి మంజూరు చేసిన సుమారు రూ.80వేలు తన ఒక కుటుంబానికే వాడుకుని అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ విషయమై గ్రామస్తులు అప్పటి ట్రెయినీ కలెక్టర్ అంబేడ్కర్కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి కొండపల్లి నర్సింగరావును వీఆర్ఓ పోస్టు నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నెల్లికుదురు తహసీల్దార్ కార్యాలయంలో కిరణ్కుమార్ హవా కొనసాగుతూనే ఉందని.. ఎట్టకేలకు పాపం పడిందని ప్రజలు అనుకుంటున్నారు. -
ఏడాది క్రితం భార్యకు ప్రేమ లేఖ ఇచ్చాడని..
సాక్షి, వాజేడు: తన భార్యకు ఏడాది క్రితం ప్రేమలేఖ ఇచ్చాడనే కోపంతో కోడిని కోసే కత్తితో వ్యక్తిపై దాడి చేసిన సంఘటన మండల పరిధిలోని ప్రగళ్లపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వాజేడు ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొప్పునూరు గ్రామానికి చెందిన వేల్పుల నగేష్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుండగా, ప్రగళ్లపల్లి గ్రామానికి చెందిన హిమామ్ చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కాగా నగేష్ హిమామ్ భార్యకు ఏడాది క్రితం ప్రేమిస్తున్నానని లెటర్ ఇచ్చాడు. విషయం తెలుసుకున్న హిమామ్ దాన్ని మనసులో దాచుకున్నాడు. మంగళవారం నగష్ హిమామ్ చికెన్ సెంటర్కు రాగా ఈ విషయమై ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆవేశం పట్టలేక హిమామ్ కత్తితో నగేష్పై దాడి చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. దీంతో నగేష్ మొఖంపై గాయాలయ్యాయి. వైద్యం చేయించున్న అనంతరం బాధితుడు నేరుగా వాజేడు పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణప్రసాద్ తెలిపారు. గాయపడిన నగేష్ -
వివాహేతర సంబంధం: ప్రియుడి సాయంతో ఘాతుకం
సాక్షి, మహబూబాబాద్: తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడు, ఆయన స్నేహితులతో కలిసి హత్య చేయించింది ఓ భార్య.. అయితే, ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు శాస్త్రీయ పద్ధతిలో విచారించడంతో అసలు నిజం బయటపడింది. ఈ మేరకు భార్య, ఆమె ప్రియుడు, ఇందుకు సహకరించిన మరొకరిని అరెస్టు చేయడంతో పాటు, హత్యకు ఉపయోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మంగళి కాలనీకి చెందిన ఇన్నారపు నవీన్ పెయింటర్గా పనిచేస్తుండగా ఆయన భార్య శాంతితో కలిసి జీవిస్తున్నాడు. అయితే, మరో పెయింటర్ అయిన దాసరి వెంకటేష్తో శాంతికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన నవీన్ తన భార్యను గట్టిగా హెచ్చరించాడు. ఈ విషయంలోనే రెండేళ్ల క్రితం దాసరి వెంకటేష్, పద్దం నవీన్ కలిసి ఇన్నారపు నవీన్ను ఊరి బయటకు తీసుకువెళ్లి దేహశుద్ది చేశారు. అనంతరం కూడా దాసరి వెంకటేష్, శాంతి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుండగా ప్రతిసారి ఇన్నారపు నవీన్ తన భార్యను హెచ్చరిస్తున్నాడు. అయితే, తన భర్తను అడ్డు తొలగిస్తేనే మంచిదని శాంతి చెప్పడంతో వెంకటేష్ అంగీకరించాడు. ఇందులో భాగంగా గతనెల 21వ తేదీన శాంతి తన తల్లిగారిల్లయిన రేగడి తండాకు వెళ్లి రాత్రి 9 గంటలకు మటన్ తీసుకురావాలని తన భర్త నవీన్కు ఫోన్లో చెప్పింది. దీంతో ఆయన హోండా యాక్టివాపై రేగడి తండాకు బయలుదేరగా.. ఈ విషయాన్ని శాంతి తన ప్రియుడు వెంకటేష్తో పాటు ఆయన స్నేహితుడు పద్దం నవీన్కు చేరవేసింది. దీంతో మధ్యలో కాపుకాచిన వెంకటేష్ ఆయన స్నేహితుడు నవీన్ కలిసి ఇన్నారపు నవీన్ను ఆపి రోడ్డు పక్కకు లాక్కెళ్లి రాడ్తో తలపై కొట్టడమే కాకుండా మెడకు టవల్తో ఉరి బిగించి హత్య చేశారు. ఆ తర్వాత రోడ్డు పక్కన ఆయన మృతదేహాన్ని వేసి, దానిపై బండి పడవేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మద్యం గ్లాసులు.. సీసా మూతే ఆధారం రోడ్డు ప్రమాదంలో ఇన్నారపు నవీన్ మృతి చెందినట్లు తెలియడంతో పోలీసులు చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించగా అక్కడ మద్యం సేవించిన ప్లాస్టిక్ గ్లాసులు, మద్యం బాటిల్ మూత, ప్లాస్టిక్ వాటర్ బాటిల్, నేలపై ఉన్న రక్తపు మరకలు, చిల్లర డబ్బు కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న మహబూబాబాద్ రూరల్ సీఐ జూపల్లి వెంకటరత్నం, కురవి ఎస్సై జె.శంకర్రావు నేర స్థలంలో లభించిన మద్యం బాటిల్పై ఉన్న బార్కోడ్ ఆధారంగా వైన్స్ను గుర్తించి వెళ్లి ఆరా తీశారు. మార్గమధ్యలో సీసీ కెమెరాల్లో కనిపించిన వ్యక్తులతో పాటు మృతుడి భార్య శాంతి కాల్డేటాను ఆరా తీయగా.. పలుమార్లు వెంకటేశ్తో మాట్లాడినట్లు తేలింది. దీంతో శాంతితో పాటు దాసరి వెంకటేష్, పద్దం నవీన్ను మహబూబాబాద్ రూరల్ సీఐ వెంకటరత్నం అదుపులోకి విచారించగా తామే హత్య చేసినట్లు అంగీకరించారు. ఈ మేరకు కేసులో పకడ్బందీగా విచారించిన కురవి ఎస్సై జె.శంకర్రావు, వారి సిబ్బందిని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఆంగోతు నరేష్కుమార్, మహబూబాబాబాద్ రూరల్ సీఐ జూపల్లి వెంకటరత్నం, కురవి ఎస్సై జె.శంకర్రావు పాల్గొన్నారు. -
మహిళపై మాజీ కార్పొరేటర్ దాడి
సాక్షి, కరీమాబాద్: నగరంలోని 9వ డివిజన్ ఖిలావరంగల్ మద్యకోటలో సోమవారం భూ వివాదం చోటు చేసుకుంది. దీంతో ఇరువర్గాల మద్య గొడవ జరగడంతో మహిళకు గాయాలయ్యాయి. మిల్స్కాలనీ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం. ఖిలావరంగల్ మద్యకోటలోని వాకింగ్ గ్రౌండ్ సమీపంలో ఉన్న ఎకరం స్థలం తమదంటే తమదని మాజీ కార్పొరేటర్ కొప్పుల శ్రీనివాస్, ముప్ప శ్రీలత గొడవలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో శ్రీలత ఆమె భర్త సోమవారం వివాదాస్పద స్థలంలోని పంటపొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కొప్పుల శ్రీనివాస్కు ముప్ప శ్రీలతలకు మద్య గొడవ జరిగింది. దీంతో శ్రీనివాస్ శ్రీలతను కర్రతో కొట్టడంతో తలకు గాయమైంది. ఈ గొడవలో మరో వ్యక్తికి కూడా గాయమైంది. తీవ్రంగా గాయపడిన శ్రీలతతో పాటు ఆమె సంబందీకులు మిల్స్కాలనీ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం గాయాలైన శ్రీలతను చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించి.. దాడికి పాల్ప డిన కొప్పుల శ్రీనివాస్పై, అతనితో ఉన్న కొప్పుల మొగిలీపై కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ కేసును ఎస్సై వెంకటేశ్వర్లు దర్యాప్తు చేస్తున్నారు. -
నాడు ప్రేమన్నాడు.. నేడు కాదన్నాడు
వరంగల్ చౌరస్తా: ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడి ఇంటి ఎదుట బాధిత యువతి కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగిన సంఘటన వరంగల్ 16వ డివిజన్లో గురువారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. లక్ష్మిపురానికి చెందిన పోలెపాక సృజన్కు అదే ప్రాంతానికి చెందిన యువతి పరిచమైంది. ఆరేళ్ల కిందట ప్రేమ పేరుతో వెంబడించడం, యువతి తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో వెళ్లి మాట్లాడటం చేశాడు. కాల క్రమేణ శారీరకంగా బలవంతం చేశాడు. అందుకు యువతి నిరాకరించడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లొంగదీసుకున్నాడు. పెళ్లి విషయంపై యువకుడి తల్లి విజయ, చెల్లెలికి వివరించిగా, వారు అంగీకరించినట్లు తెలిపింది. నెల రోజుల క్రితం పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిలదీయగా చేసుకోనని, తిట్టి పంపించాడు. దీంతో యువతికి ఇంతేంజార్ గంజ్ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు ఇద్దరిని పిలిచి వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డులు తీసుకురావాలని సూచించారు. అంగీకరించిన సృజన్ మర్నాడు మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. దీంతో బాధిత యువతి తల్లిదండ్రులతో కలిసి యువకుడి ఇంటి ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. న్యాయం చేయాలని, వివాహం జరిపించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీసాల ప్రకాశ్, టీఆర్ఎస్ నాయకుడు సీతయ్య తదితరులు యువతికి అండగా మద్దతు పలికారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి యువకుడిని మందలించగా, మరో యువతిని ఒక రోజు ముందే పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు సృజన్ను అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఇంతేంజార్ గంజ్ పోలీసులు తెలిపారు. -
హెచ్ఎం వర్సెస్ టీచర్
విద్యారణ్యపురి: కడిపికొండలోని జిల్లాపరిషత్ హైస్కూల్లోని హెచ్ఎం జయమ్మ, అదే స్కూల్లో గణితం స్కూల్ అసిస్టెంట్గా వెంకటకరుణాకర్కు మధ్య కొంత కాలంగా విబేధాలు నెలకొన్నాయి. ఇరువురు పరస్పరం డీఈఓకు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు వెంకటకరుణాకర్ తన విధులను సక్రమంగా నిర్వర్తించకపోగా.. బెరింపులకు గురిచేస్తున్నారని హెచ్ఎం జయమ్మ 15సార్లకు పైగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోకున్నా.. చార్జెస్ ప్రేమ్ చేశారని తెలిసింది. మరోవైపు వెంకటకరుణాకర్ కూడా హెచ్ఎం జయమ్మపై డీఈఓకు పలు ఆరోపణలతో ఫిర్యాదు చేశారని తెలిసింది. ఇరువురి ఫిర్యాదులపై డీఈఓ కార్యాలయంలోని డీసీఈబీ కార్యదర్శి రమేష్బాబుతో పరిశీలన చేయించారు. ఈ అంశంపై ఆయన నివేదిక ఇవ్వగా... హెచ్ఎం జయమ్మ చెప్పినట్లు ఉపాధ్యాయుడు వినడం లేదని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తాం కడిపికొండ జెడ్పీ హైస్కూల్లో హెచ్ఎం జయమ్మ, వెంకటకరుణాకర్కు మధ్య తలెత్తిన వివాదంపై విచారణ జరిపించాక వెంకటకరుణాకర్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఈఓ కె.నారాయణరెడ్డి వివరణ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితమే ఆయనపై చార్జెస్ ఫ్రేమ్ చేశామన్నారు. ఒకటి, రెండురోజుల్లో విద్యాశాఖకు సబంధించిన వారితో విచారణ జరిపించాక చర్యల్లో భాగంగా ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తామని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు కడిపికొండ జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం జయమ్మ ఈనెల 13న సంబంధిత పరిధిలోని పోలీస్టేషన్లో మ్యాథ్స్ స్కూల్అసిస్టెంట్ వెంకటకరుణాకర్పై ఫిర్యాదు చేశారు. పాఠశాలలో తన వద్దకు వెంకటకరుణాకర్ వచ్చి రిజిస్టర్లో సంతకం చేయబోగా.. సర్వీస్బుక్ ఇవ్వాలంటూ తాను ఇచ్చిన మెమో, నోటీసులు తీసుకోవాలని సూచించానని తెలిపారు. సరేనని నమ్మబలికి హాజరు రిజిస్టర్లో సంతకం చేశాక మెమో, నోటీసుబుక్ను తన ముఖంపై కొట్టడంతో పాటు కులం, లింగ వివక్షతతో దూషించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా ఏసీసీ ఈనెల 16న హైస్కూల్కు వెళ్లి కూడా విచారణ జరిపినట్లు సమాచారం. -
రాత్రంతా జాగారం చేసిన కడిపికొండ
సాక్షి, కాజీపేట: ఏడ్చీ ఏడ్చీ ఇంకిపోయిన కన్నీళ్లు.. తమ వారేమయ్యారోనని అంతు లేని ఎదురుచూపులు.. సురక్షితంగా బయటపడిన వారు ఎలా ఉన్నారోనని ఆవేదన.. వచ్చివెళ్లే వారి పరామర్శలు.. రాత్రి మొత్తం జాగారం.. ఇదీ కడిపికొండ గ్రామంలోని పరిస్థితి! పాపికొండల విహారయాత్రకు వెళ్లి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిలో బోటు బోల్తా పడిన ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ వాసులు 14 మంది చిక్కుకున్న విషయం తెలిసిందే. వీరిలో ఐదుగురు సురక్షితంగా బయటపడగా, ఇంకో ఇద్దరి మృతదేహాలు లభించాయి. మిగతా ఏడుగురి ఆచూకీ లేకపోవడంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నాయి. కాగా, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ పాపికొండలకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న వారిలో న్యూశాయంపేట వాసి హేమంత్ కూడా ఉన్నట్లు తెలియడంతో గల్లంతైన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. కాగా, బస్కే రాజేందర్, బస్కే అవినాష్ మృతదేహాలు సోమవారం అర్ధరాత్రి 2.30 గంటలకు స్వస్థలానికి చేరగా కుటుంబీకులకు అప్పగిం చారు. దీంతో గ్రామంలో రోదనలు మిన్నంటాయి. అలాగే, సురక్షితంగా బయటపడిన ఐదుగురికి రంపచోడవరం ఆస్పత్రిలో చికిత్స చేసిన అనంతరం అంబులెన్స్లో ఇక్కడకు పంపించగా మ్యాక్స్కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇక సోమవారం ఉదయం వరకు రంపచోడవరం చేరుకున్న రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్లు అక్కడి మంత్రులు, అధికారులతో మాట్లాడుతూ మృతదేహాల తరలింపు, గల్లంతైన వారి గాలింపు చర్యలను సమీక్షించారు. కాజీపేట మండలంలోని కడిపికొండ కన్నీటి సంద్రంగా మారింది.. గ్రామంలో ఎవరిని కదిలించినా కన్నీళ్లే.. ‘అంతు’చిక్కని తమ వారి ఆచూకీ కోసం రోదనలు.. మృతి చెందినట్లు తేలిసిన వారి కుటుంబాల్లో మిన్నంటిన ఆర్తదానాలు.. సురక్షితంగా బయటపడిన వారి బంధువులు తమ వారు ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తూనే.. సహచరులు గల్లంతు కావడంపై ఆవేదన... ఇదీ గ్రామంలో సోమవారం నెలకొన్న పరిస్థితి! తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో ఆదివారం చోటు చేసుకున్న బోటు ప్రమాదంలో కడిపికొండకు చెందిన 14 మంది చిక్కుకుకోవడం తెలిసింది. ఇందులో ఐదుగురు సురక్షితంగా బయటపడగా మరో ఇద్దరి మృతదేహాలు ఆదివారం రాత్రే బయటపడ్డాయి. ఇక మిగిలిన ఏడుగురి ఆచూకీ లేకపోవడంతో వారి కుటుంబాలు టీవీలు చూస్తూ.. పరామర్శకు వచ్చిన వారిని ఆరా తీస్తూ రాత్రంగా గడిపారు. వెలగని పొయ్యి గల్లంతైన వారితో పాటు మృతి చెందిన వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. అలాగే, సురక్షితంగా బయటపడిన వారి కుటుంబీకులు తమ వారి కోసం ఎదురుచూడడం కనిపించింది. దీంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు గ్రామంలోని వారి గృహాల్లో పొయ్యి వెలగలేదు. మిగతా గ్రామస్తులు ముందుండి వంటలు చేయించి భోజనాలు పెట్టిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. పాండవుల గుట్టల్లో పాపికొండలు ప్లాన్ కడిపికొండకు చెందిన బస్కే దశరథం, బస్కే వెంకటస్వామి, సివ్వి వెంకటస్వామి, బస్కే రాజేంద్రప్రసాద్, బస్కే అవినాష్, దర్శనాల సురేష్, ఆరెపల్లి యాదగిరి, గొర్రె రాజేందర్, కొండురి రాజ్కుమార్, కొమ్ముల రవి, గొర్రె ప్రభాకర్, బస్కే ధర్మరాజు, బస్కే రాజేందర్, బస్కే వెంకటస్వామి ఐదేళ్లుగా వాకింగ్ చేస్తున్నారు. వీరిలో సివ్వి వెంకటస్వామి, బస్కే వెంకటస్వామి రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు కాగా గొర్రె ప్రభాకర్ రైల్వే బుకింగ్ క్లర్క్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా వారిలో కొందరు టీఆర్ఎస్లో కొనసాగుతుండగా.. ఇంకొందరు ఆటో డ్రైవర్లు, పెయింటర్లుగా జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతీరోజూ కడిపికొండ నుండి రాజీవ్గృహ కల్ప సముదాయం వరకు వాకింగ్ చేయడం ఆనవాయితీ. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో మాదిగ మహరాజ్ కుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ఈ సంఘం ద్వారా పాపికొండల టూర్కు వెళ్లాలని రెండు నెలల క్రితమే నిర్ణయించుకున్నారు. రైలు టికెట్లు కూడా బుక్ చేసుకున్నప్పటికీ ఆ సమయంలో భారీ వర్షాలు కురవడంతో టికెట్లు రద్దు చేసుకున్నారు. అయినా విహారయాత్రకు వెళ్లాలనే కాంక్షతో పాండవుల గుట్టకు వెళ్లారు. ఆ సమయంలోనే అక్కడే మాట్లాడుకునే క్రమంలో ఎలాగైనా పాపికొండలు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మళ్లీ టూర్ను ప్లాన్ చేసుకుని సరదాగా వెళ్లి వచ్చారు. అనంతరం పాండవుల గుట్ట టూర్ నుండి పాపికొండల టూర్కు ప్లాన్ వేసారు. ఇటీవల వాతావరణం అనుకూలించగా రైల్వే బుకింగ్ క్లర్క్ గొర్రె ప్రభాకర్ 14 మందికి రైలు టికెట్లు బుక్ చేశారు. కంటిమీద కునుకులేదు.. కడిపికొండకు చెందిన 14 మంది పాపికొండల టూర్కు వెళ్లి బోటు ప్రమాదంలో చిక్కుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు తమ వారి ఆచూకి లభిం చిందా లేదా.. మృతి చెందారా, ఏదైనా సమాచారం అందుతుందా అంటూ ఆదివారం రాత్రంతా జాగారం చేశారు. వీరికి తోడు కడిపికొండ వాసులు కూడా ఉండడంతో ఊరంతా జాగారం చేసినట్లయింది. మృత్యుంజయులు పాపికొండల విహారయాత్రకు వెళ్లిన కడిపికొండకు చెందిన 14 మందిలో సురక్షితంగా బయటపడ్డ బస్కే దశరథం, బస్కే వెంకటస్వామి, ఆరెపల్లి యాదగిరి, గొర్రె ప్రభాకర్, దర్శనాల సురేష్ను రంపచోడవరం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందజేయగా... సోమవారం ఉదయకల్లా అక్కడకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, పువ్వాడ అజయ్, వరంగల్ ఎంపీ పసునూని దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పరామర్శించారు. తక్షణ వైద్యఖర్చుల నిమిత్తం రూ.10వేలు అందజేయడంతో పాటు వైద్యులు మాట్లాడారు. అనంతరం వరంగల్ నుంచి వెళ్లిన కాజీపేట తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, ఇన్స్పెక్టర్ అజయ్ తదితరులు అంబులెన్స్లో తీసుకురాగా.. సోమవారం రాత్రి 11.30 గంటలకు హన్మకొండకు చేరుకోగానే మ్యాక్స్కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. టూర్సాగిందిలా.. కాజీపేట నుంచి శుక్రవారం రాత్రి గౌతమి ఎక్స్ప్రెస్ లో బయలుదేరిన వారు శనివారం ఉదయం 5.45 నిమిషా లకు రాజమండ్రి చేరుకున్నారు. ఓ లాడ్జిలో సేద తీరి.. గైడ్ సాయంతో రూ.3వేల టూర్ ప్యాకేజీ మాట్లాడుకున్నారు. శనివారం ఉదయం రాజమండ్రి పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఆదివారం ఉదయం 11.30 నిమిషాలకు దేవిపట్నం ప్రాంతానికి చేరుకుని బోటులో పాపికొండల టూర్కు బయలుదేరారు. మధ్యాహ్నం 12.35 నిమిషాలకు కచ్చులూరుకు బోటు చేరుకోగా గోదావరి ఉగ్రరూపానికి మునిగిపోయింది. దీంతో లైఫ్ జాకెట్లు ధరించిన ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. మిగతా వారు గల్లంతు కాగా.. బస్కే రాజేందర్, బస్కే అవినాష్ మృతదేహాలు మాత్రమే వెలుగు చూశాయి. ప్రమాద ఘటనలో న్యూశాయంపేట వాసి గోదావరిలో బోటు మునిగిన ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన మరొకరు కూడా ఉన్నట్లు సోమవారం సాయంత్రానికి తెలిసింది. హన్మకొండ హంటర్రోడ్డులోని న్యూశాయంపేటకు చెందిన దోమల హేమంత్ గల్లంతైన వారిలో ఉన్నట్లు సమచారం. హైదరాబాద్లోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో విధులు కొనసాగిస్తున్న హేమంత్ స్నేహితులతో కలిసి పాపికొండలు టూర్కు వెళ్లాడు. బోటు ముగినిపోయినట్లు తెలియడంతో హేమంత్ తండ్రి భూమయ్య, తల్లి పద్మావతి కన్నీరుమున్నీరయ్యారు. కాగా, భూమయ్య టైలరింగ్ వృత్తి కొనసాగిస్తూ ముగ్గురు కుమారులను చదివించారు. ఇప్పుడు హేమంత్ గల్లంతైనట్లు తెలియడంతో ఆయన రోదిస్తున్నారు. బస్కే అవినాష్ మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి ; బస్కే రాజేందర్ కుటుంబీకులు రెండు మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత గోదావరి బోటు ప్రమాదంలో మృతి చెందిన బస్కే రాజేందర్, బస్కే అవినాష్ మృత దేహాలు కూడా కడిపికొండకు చేరుకున్నాయి. ఈ మేరకు రంపచోడవరం ఆస్పత్రిలో పోస్టుమార్టం కార్యక్రమాలు త్వరగా పూర్తయ్యేలా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్షించారు. ఆతర్వాత అంబులెన్స్లో కడిపికొండకు తీసుకురాగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మృతదేహాలు చేరుకోగానే కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పరామర్శించిన మంత్రులు గోదావరి నదిలో బోటు ప్రమాదంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడ్డ బస్కే దశరధం, బస్కే వెంకటస్వామి, గొర్రె ప్రభాకర్, దర్శనాల సురేష్, ఆరెపల్లి యాదగిరి రంపచోడవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితులు సమీక్షిచేందుకు వెళ్లిన రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి బాధితులను పరామర్శించిన సమయంలో తెలంగాణ మంత్రులు కూడా ఉన్నారు. ఇక కాజీపేట ఇన్స్పెక్టర్ అజయ్ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకన్నారు. రెండు శాఖలు 13 మంది ఇంజనీర్లు.... వరంగల్: పాపికొండల విహార యాత్రకు రెండు ప్రాంతాలు, రెండు శాఖలకు చెందిన 13 మంది ఇంజనీర్లు వెళ్లిన ట్లు తెలిసింది. ఇందులో హైదరాబాద్ పోలీసు హౌజింగ్ శాఖకు చెందిన ఏఈలు ఏడుగురు ఉండగా ఆదిలాబాద్ జిల్లాకు విద్యు త్ శాఖ ఏఈలు ఆరుగురు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ హౌజింగ్ ఏఈల్లో ప్రమాదం నుంచి నలుగురు బయట పడగా ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో హన్మకొండ న్యూశాయంపేటకు చెందిన హేమంత్ కూడా ఉన్నట్లు తెలియడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఐదు అంబులెన్స్లు... అధికారులు తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం దగ్గర జరిగిన బోటు ప్రమాదంలో చిక్కుకున్న జిల్లా వాసులను అండగా నిలిచేందుకు ఇక్కడి నుంచి అధికారులు ఆదివారం రాత్రే వెళ్లారు. జిల్లా నుంచి ఐదు అంబులెన్స్లతో పాటు కాజీపేట తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, ఇన్స్పెక్టర్ అజయ్ వెళ్లారు. ఈ మేరకు ఓ అంబులెన్స్లో బస్కె రాజేందర్, బస్కె అవినాష్ మృతదేహాలతో పాటు సురక్షితంగా బయటపడిన మరో ఐదుగురికి ఇంకో అంబులెన్స్లో పంపించారు. నదిలో పడ్డాక లైఫ్ జాకెట్ దొరికింది.. రాజమండ్రి నుంచి పాపికొండలు.. అక్కడి నుంచి భద్రాచలం వెళ్లాలన్నది మా ప్లాన్. బోటు ప్రయాణం సాగుతుండగా ఒక్కసారిగా కుదిపినట్లు అయ్యింది. అందులో ఉన్నవారంతా కేకలు పెడుతుండగానే బోటు మనిగిపోయింది. మునిగిన బోటు ఒక్కసారిగా పైకి లేచింది. ఆ క్షణంలోనే నాతో పాటు కొందరం బయటపడ్డాం. అప్పటి వరకు నాకు లైఫ్ జాకెట్ లేదు. బోటులో ఉన్న కొన్ని జాకెట్లు నీటిపై తెలియడుతుండగా ఒక్కటి వేసుకుని ఈదడం మొదలు పెట్టాను. సుమారు 15 నిమిషాల తరువాత స్థానిక జాలర్లు నన్ను రక్షించారు. అలా నేను బతికి బయట పడ్డాను. నదిలో పడ్డాక మళ్లీ ఈ లోకాన్ని చూస్తాననని ఊహించ లేదు. – బస్కే వెంకటస్వామి, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి సంబంధిత వార్తలు... నిండు గోదారిలో మృత్యు ఘోష -
పండగ వేళ విషాదం
సాక్షి, జనగామ(వరంగల్) : వినాయక చవితి ఆ కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. పండగ సరుకుల కోసం సంతకు వెళ్లి వస్తుండగా.. మృత్యువు రూపంలో దూసుకువచ్చిన ఓ కారు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ సంఘటన జనగామ మండలం పెంబర్తి వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. సంఘటనకు సంబంధించిన ఎస్సై శ్రీనివాస్ తెలిపాన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన జూకంటి జహంగీర్(40), కొమురయ్య, సిద్ధులు వినాయక చవితి పండగ సరుకులతో పాటు ఇతర పనుల నిమిత్తం ద్విచక్రవాహనాలపై జనగామ జిల్లా బచ్చన్నపేట సంతకు వెళ్లారు. పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా స్వగ్రామానాకి వెళ్లే ఎక్స్(టంగుటూరు) రోడ్డు మలుపు వద్ద ముగ్గురు కలవడంతో రహదారి పక్కన కాసేపు ఆగి మాట్లాడుకుంటుండగా వరంగల్ వైపు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి, రాంగ్ రూట్లో వీరు నిలబడిన ప్రదేశానికి దూసుకొచ్చింది. కారువేగాన్ని గమనించిన వారు తప్పించుకునే లోపే వారిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జూకంటి జహంగీర్ అక్కడిక్కడే మృతిచెందగా, సిద్ధులు, కొమురయ్యలకు తీవ్రగాయాలు కాగా క్షతగాత్రులను 108లో జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి హైదరాబాద్కు రెఫర్ చేశారు. కాగా, మృతిచెందిన జహంగీర్ మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తీసుకువెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
ఫోర్జరీ సంతకంతో డబ్బులు స్వాహా..
సాక్షి, వరంగల్ : మహిళా సంఘం బాగోగులు చూడాల్సిన ఓ ‘సీఏ’ సంఘం సభ్యులను మోసం చేసి, ఫోర్జరీ సంతకంతో డబ్బులు ‘డ్రా’ చేసింది. సొంతంగా వాడుకున్న విషయమై ఏపీఎంకు చేసిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. మహిళా సంఘం డబ్బులు సంఘం బాధ్యులు దుర్వినియోగం చేయకుండా నెల నెలా సంఘం లెక్కలు చూడాల్సిన సీఏ మహిళా సంఘం డబ్బులు రూ.70 వేలను బ్యాంక్ నుంచి డ్రా చేసిన సంఘటన నెక్కొండ మండలంలోని రెడ్లవాడ గ్రామంలో జరిగింది. ఈ విషయాన్ని అయ్యప్ప పొదుపు సంఘం సభ్యురాలు, గ్రామ 4వ వార్డు సభ్యురాలు తోపుచర్ల పద్మ ఆదివారం ఏపీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. గ్రామానికి చెందిన సాయిరాఘవ పొదుపు సంఘం సీఏ సుజాత సంఘానికి సంబంధించిన డబ్బులను నెక్కొండ ఏపీజీవీబీ నుంచి డిసెంబర్ 2018లో రూ.10వేలు, మార్చి 2019లో రూ.20 వేలు, ఏప్రిల్లో రూ.40 వేలను బ్యాంక్ నుంచి డ్రా చేసినట్లు ఆమె తెలిపారు. సంఘానికి సంబంధించి నెల నెలా లెక్కలు ఉండడంతో రికార్డులు, ముద్రలు, బ్యాంక్ పాస్ పుస్తకాలు సీఏ వద్ద ఉండేవన్నారు. దీంతో మహిళా సంఘం అధ్యక్ష, కార్యదర్శులతో పాటు మరో 8 మంది సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి, తీర్మాణం రాసి బ్యాంక్ అధికారులను మోసం చేసి డబ్బులను తన ఖాతాలోకి జమ చేసుకున్నట్లు ఆమె వివరించారు. ఈ నెల 17న తాను బ్యాంక్ వెళ్లగా ఈ విషయం తెలిసిందని ఆమె పేర్కొన్నారు. సంఘం సభ్యులందరూ బ్యాంక్ అధికారుల ఎదుట హాజరైతేనే సంఘానికి రుణం మంజూరు చేయాల్సి ఉండగా కేవలం సీఏను నమ్మి ఎలా డబ్బులు డ్రా చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఏపీఎం శ్రీనివాస్కు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. విచారణ చేసి డబ్బులు స్వాహాకు పాల్పడిన సీఏ సుజాతపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఏపీఎం తెలిపారు. -
ఇస్మార్ట్ ‘దొంగ’ పోలీస్!
కాళేశ్వరం: రూ.30వేల జీతం.. పేరైన కంపెనీలో ఆపరేటర్ ఉద్యోగం.. యువకున్ని చూస్తే అచ్చం పోలీసులాగా ఉండే దేహదారుఢ్యం.. ఇదంతా బాగానే ఉన్నా పోలీస్ యూనిఫాంను పోలిన డ్రెస్సుతో అందరిని ఇస్మార్ట్గా బెదిరిస్తున్నాడు ఈ దొంగ పోలీస్!. అసలు విషయం ఏమిటంటే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లిపంపుహౌస్లో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అమర్జిత్సింగ్ భూమ్ప్రెసర్ ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి నెలకు రూ.30వేల జీతం కూడా వస్తుంది. కానీ వక్రబుద్ధితో పోలీస్లా డ్రెస్సు వేసుకొని అంతర్రాష్ట్ర వంతెన వద్ద వచ్చిపోయే ఆటోవాలాలను బెదిరిస్తూ డబ్బులు వసూళ్లకు పూనుకున్నాడు. అనుమానం వచ్చిన ఆటోవాలాలు శనివారం సాయంత్రం కాళేశ్వరం పోలీసులకు దొంగ పోలీస్పై సమాచారం ఇవ్వగా స్టేషన్కు తీసుకెళ్లి తమదైన పద్ధతిలో లాఠీకి పని చెప్పారు. అయితే అతడిపై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో కంపెనీ వారు రావడంతో వదిలిపెట్టారు. గతంలోనూ మద్యం తీసుకు వెళ్తున్న వ్యక్తులను ఇదే డ్రెస్సులో వచ్చి మద్యం బాటిళ్లు లాక్కున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇతగాడి వ్యవహారం వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అయింది. -
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, వరంగల్ అర్బన్ : పరీక్షలు ఫెయిల్ కావడంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వంగర ఎస్సై ఉపేందర్ కథనం ప్రకారం వంగర గ్రామానికి చెందిన వొల్లాల రమేష్–రాణి దంపతుల రెండో కుమారుడైన వొల్లాల నిశాంత్(21) హైదరాబాద్లో బీటెక్ తృతీయ సంవత్సరం చదవుతున్నాడు. ఇటీవల కాలేజీ నుంచి ఇంటికొచ్చాడు. సప్లిమెంటరీ ఫలితాల్లో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున నిశాంత్ తండ్రి రమేష్ పని నిమిత్తం హైదరాబాద్కు, తల్లి వ్యవసాయ పనుల కోసం బావి వద్దకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నిశాంత్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుని మృతదేహంపై పడి తల్లిదండ్రులు రమేష్, రాణి రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు యువకులు
సాక్షి, వరంగల్: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి లో బుధవారం చోటు చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. దొడ్ల నరేష్(22) కొన్ని నెలలుగా మతి స్థిమితం కోల్పోయాడు. బుధవారం తల్లి లక్ష్మితో కలిసి వ్యవసాయ భూమిలో పంటకు మందు కొట్టేందుకు వెళ్లారు. తల్లి నీళ్లు తాగేందుకు కొంతదూరం వెళ్లగా నరేష్ వద్ద ఉన్న పురుగుల మందు తాగాడు. గమణించిన తల్లి స్థానికుల సాయంతో చికిత్స నిమిత్తం చిట్యాల సామాజిక ఆరోగ్యానికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. కాగా, మతిస్థిమితం కోల్పోయిన నరేష్ గతంలో కూడా రెండుసార్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్సాడ్డాడని తెలిపారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పల్లె నర్సింగ్ తెలిపారు. ఉరి వేసుకుని మరో యువకుడు.. కాజీపేట: ప్రభుత్వ ఐటీఐ చదువులో ఉత్తీర్ణత సాధించలేకపోయాననే మానసిక ఆవేదనతో క్షణికావేశానికిలోనై ఓ యువకుడు బుధవారం కాజీపేట ప్యారడైజ్ ఫంక్షన్హాల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ అజయ్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. రామకృష్ణకాలనీకి చెందిన తాండ్ర అరవింద్(20) ఇటీవల ఐటీఐలో ఫెయిల్ అయ్యాడు. కొద్ది రోజులుగా మిత్రులతో కలిసి క్యాటరింగ్ పనులకు వెళ్తున్నాడు. చదువులో వెనుకబడిపోయాననే బాధతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ తెలిపాడు. మహిళా ఆత్మహత్యాయత్నం.. నర్మెట: ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానకి పాల్ప డింది. ఈ సంఘటన మండలంలోని ఆగాపేటలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కొన్నేళ్లుగా వ్యవసా యం కలసిరాకపోవడంతో రైతు శిల్వారెడ్డి అప్పులపాలై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది కూడా వర్షాలు కురవకపోవడంతో మనస్తాపానికి గురైన రైతు భార్య సబీనమ్మ బుధవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి ఎంజీఎంకు తరలించారు. -
బైకుల దొంగ అరెస్ట్
సాక్షి, వరంగల్: మండలంలో ఈనెల 10న 2 మోటార్సైకిళ్లు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు గార్ల, బయ్యారం సీఐ వై.రమేష్ తెలిపారు. బుధవారం గార్ల పోలీస్స్టేషన్లో మోటార్సైకిళ్ల చోరీకి సంబందించిన వివరాలను సీఐ విలేకరులకు వెల్లడించారు. గార్లలో గత 2 నెలల క్రితం బంధువుల ఇళ్లకు వచ్చిన మహ్మద్ రఫిక్ గార్లలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 10న అర్ధరాత్రి గార్లకు చెందిన పతంగి ప్రవీణ్, గద్దపాటి రాము తమ ఇళ్ల ముందర మోటార్సైకిళ్లు పెట్టి, ఉదయాన్నే లేచిచూడగా మోటార్ సైకిళ్లు చోరీకి గురయ్యాయి. దీంతో బాధితులు గార్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు గార్ల ఎస్సై పోలిరెడ్డి శ్రీనివాసరెడ్డి గార్లలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మహ్మద్ రఫిక్ మోటార్సైకిళ్ల చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాలో గుర్తించారు. నాటినుంచి పరారీలో ఉన్న నిందితుడు బుధవారం సత్యనారాయణపురం క్రాస్రోడ్ వద్ద చోరీ చేసిన అప్పాచీ, స్కూటీ మోటార్సైకిళ్లను వేరే వ్యక్తులకు అమ్ముతుండగా గార్ల పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి రూ.1లక్ష విలువ గల 2 మోటార్సైకిళ్లను స్వాధీన పరుచుకుని, నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. ఇకనుంచి ప్రతీ గ్రామంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకుని శాంతి భద్రతలను కాపాడుకోవడంలో పోలీసులతో ప్రజలు భాగస్వాములు కావాలని సీఐ కోరారు. కాగా, మోటార్సైకిళ్ల చోరీ నిందితుడిని పట్టుకున్న ఎస్సై పోలిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సిబ్బందిని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అభినందించి, వీరికి త్వరలో రివార్డులు అందజేస్తామని తెలిపినట్లు సీఐ రమేష్ విలేకరులకు తెలిపారు. -
వరంగల్: దొంగల ముఠా అరెస్ట్
సాక్షి, కాజీపేట అర్బన్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు క్రైం ఏసీపీ బాబురావు తెలిపారు. ఈ సందర్భంగా సీసీఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మాట్లాడారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీకి చెందిన కోటగిరి సునీల్, కోటగిరి రాజు, చెట్టె ప్రసాద్, చెట్టె సురేష్లతో పాటు దామెర మండలంలోని ఊరుగొండ గ్రామానికి చెందిన మేకల రాములు ఒక ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. సమీపబంధువులైన ఈ ఐదుగురు జల్సాలకు మోజులో ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లు వివరించారు. 2005 నుంచి చోరీలకు పాల్పడడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. నిందితులు గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శాయంపేట, పరకాల, గీసుకొండ, మామూనూర్, ఆత్మకూర్, ఇంతేజార్గంజ్, మట్టెవాడ, కాజీపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడగా పలుమార్లు అరెస్ట్ చేసి జైలుకు తరలించామన్నారు. ఈనెల 5వ తేదిన కాజీపేట బాపూజీనగర్లోని ఓ ఇంట్లో మహిళను తాగేందుకు నీరివ్వమని మాయమాటలు చెప్పి ఇంట్లో ఉన్న నగల బ్యాగును దొంగిలించారు. దీంతో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 2015లో ఖమ్మం జిల్లా ఇల్లంద ప్రాంతంలో ఇదే విధంగా చోరీలకు పాల్పడడంతో సీసీఎస్ పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితులకు సంబంధించిన ఫొటోలను సేకరించి వారి కదలికపై దృష్టి సారించారు. కాగా శుక్రవారం చోరీ చేసిన బంగారాన్ని హైదరాబాద్లో విక్రయించేందుకు ప్యాసింజర్ ఆటోలో కాజీపేట రైల్వే స్టేషన్కు వస్తున్నట్లు సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు రైల్వే స్టేడియం వద్ద గస్తీ నిర్వహించారు. అనుమానాస్పదంగా తారసపడిన ముఠాను విచారించగా చోరీలకు పాల్పడిన విషయాన్ని ఒప్పుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. క్రైం ఏసీపీ బాబురావు, కాజీపేట ఏసీపీ నర్సింగరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రవిరాజు, శ్రీనివాస్రావు, కాజీపేట ఇన్స్పెక్టర్ అజయ్, ఎఎస్సై శివకుమార్, హెడ్కానిస్టేబుళ్లు అహ్మద్పాషా, జంపయ్య, కానిస్టేబుళ్ నజీరుధ్ధీలను సీపీ రవీందర్ అభినందించారు. -
బడి ఉంటే బతికేటోళ్లు బిడ్డా..
సాక్షి, కురవ(వరంగల్) : పండుగ ఆ ఇంట్లో చీకట్లను నింపింది.. తొలి ఏకాదశి పర్వదినం ఆ ఇంటికి దుర్ధిన్నాన్ని తెచ్చిపెట్టింది.పండుగ కావడంతో బడికి సెలవు ఇచ్చారు.. బడి ఉంటే బతికేటోళ్లు కదా బిడ్డాలారా.. అంటూ తల్లిదండ్రుల రోదిస్తున్న తీరు గుండెల్నిపిండేసింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గులగూడెం గ్రామానికి చెందిన చింతనూరి శ్రీను, హైమ ల కుమారులు సూర్యతేజ(8) మూడో తరగతి, విశాల్(5) ఒకటో తరగతి చదువుతున్నారు. వీరి స్వగ్రామం తొర్రూరు మండలం వెంకటాపురం కాగా బతుకుదెరువుకోసం పదేళ్ల క్రితం మోద్గులగూడెంలో ఉంటున్నారు. తిర్మలాపురంలోని తిరుమల వర్మీ కంపోస్టు తయారీ కేంద్రంలో గత సంవత్సర కాలంగా పనిచేస్తూ కుటుంబంతోసహా అక్కడే నివాసముంటున్నారు. శుక్రవారం పాఠశాలకు సెలవు ఉండడంతో సూర్యతేజ, విశాల్, మరో స్నేహితుడు పుల్సర్ ఈశ్వర్తో కలిసి పాఠశాలకు ఎదురుగా ఉన్న మర్రికుంటలో ఈతకు వెళ్లారు. సూర్యతేజ, విశాల్లు కుంటలోకి దిగారు. నీరు ఎక్కువగా ఉండడంతో వారిద్దరూ అందులో మునిగిపోయారు. దీంతో ఒడ్డు మీదున్న స్నేహితుడు ఈశ్వర్ పరుగెత్తుతూ వచ్చి గ్రామస్తులకు విషయాన్ని చెప్పాడు. గ్రామస్తులు కుంట వద్దకు వెళ్లేసరికే అన్నదమ్ములిద్దరూ మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న కురవి ఎస్సై నాగభూషణం శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని మహబూబాబాద్ రూరల్ సీఐ వెంకటరత్నం పరిశీలించారు. గ్రామంలో విషాదఛాయలు అన్నదమ్ములిద్దరూ కుంటలో పడి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బడి ఉంటే బతికేటోళ్లు కదరా బిడ్డలూ అంటూ తల్లి హైమ రోదిస్తున్నతీరు చూసినవారంతా కన్నీటిపర్యంతమయ్యారు. కడుపున పుట్టిన ఇద్దరు కుమారులు ఒకే రోజు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చుడం ఎవరివల్ల కాలేదు. -
లిఫ్టు ఇచ్చాడు.. దోపిడీ చేశాడు..!
సాక్షి, జనగామ(వరంగల్) : తన వ్యక్తిగత పనిపై వెళ్లేందుకు రహదారిపై బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళకు లిఫ్ట్ ఇచ్చి ద్విచక్రవాహనదారుడు దోపిడీకి పాల్పడిన ఘటన ఆదివారం చంపక్హిల్స్ డంపింగ్ యార్డు వద్ద చోటుచేసుకుంది. ఎస్సై రాజేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓబుల్కేశ్వాపూర్– పెద్దపహాడ్ ఎక్స్రోడ్డు వద్ద జనగామకు వచ్చేందుకు ఓ మహిళ బస్సు కోసం ఎదురు చూస్తుంది. అదే సమయంలో అటుగా వస్తున్న ద్విచక్రవాహదారుడు ఆమెకు లిఫ్టు ఇస్తానని బైక్పై ఎక్కించుకున్నాడు. చంపక్హిల్స్ డంపింగ్ యార్డు వద్దకు రాగానే వ్యక్తిపై అనుమానం వచ్చిన సదరు మహిళ కేకలు వేయడంతో నోరును గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. అరిస్తే చంపేస్తానని బెదిరిస్తూ ఆమె బ్యాగులో ఉన్న పర్సుతో పాటు సెల్ఫోన్ను ఎత్తుకెళ్లాడు. నేరుగా పోలీస్స్టేషన్కు వచ్చిన బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
యువకుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నా..!
సాక్షి, వరంగల్ : ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటిముందు ఆందోళన చేపట్టింది. మాయమాటలతో తనను లోబర్చుకుని గర్భం దాల్చడానికి కారకుడయ్యాడని, న్యాయం చేయాలని కోరుతూ ధర్నాకు దిగింది. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. సద్దాం అనే యువకుడు అదే గ్రామానికి చెందిన అప్సరా అనే యువతిని ప్రేమ పేరుతో మోసం చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. అతని ఇంటిముందు ఆందోళన చేస్తున్న యువతికి ఎమ్మార్పీఎస్ నాయకులు, గ్రామం సర్పంచ్ యశోద తదితరులు మద్దతుగా నిలిచారు. అయితే, యువతిని ఇష్టపడిన మాట వాస్తవమేనని, ఆమెను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పానని సద్దాం వెల్లడించాడు. అప్సరా వేరేవారి మాయమాటల్లో పడి ఆందోళన చేస్తోందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నేను డీఎన్ఏ టెస్టుకు సిద్దం. నా వల్లనే ఆమె గర్భం దాల్చిందని రుజువైతే.. ఏ శిక్షకైనా రెడీ. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. కానీ, ఆమె వేరేవారి మాయమాటల్లో పడి ఆందోళన చేస్తోంది’ అన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. -
కాయ్.. రాజా కాయ్..!
కామారెడ్డి క్రైం: క్రీడాకారులకు రూ.కోట్లు కుమ్మరిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఐపీఎల్–12 క్రికెట్ మ్యాచ్లు అదే స్థాయిలో బెట్టింగ్ రాయుళ్ల జీవితాల్లో చీకట్లను నింపుతున్నాయి. బెట్టింగ్లు నేరమని చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిసినా యువత అటువైపు మొగ్గు చూపుతోంది. ప్రస్తుత వేసవిలో కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) క్రికెట్ మ్యాచ్లపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ముఖ్యంగా యువకులు బెట్టింగ్ మాయలో పడి తమ డబ్బును, సెల్ఫోన్లను, మోటర్ బైకులను అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో అనధికారిక అంచనా ప్రకారం ప్రతిరోజు రూ.లక్షల్లో బెట్టింగ్ కొనసాగుతోంది. నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాల్లో బెట్టింగులు నడుస్తున్నట్లు తెలిసింది. కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు లక్షల్లో చేతులు మారుతున్నాయని తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఐపీఎల్ మ్యాచ్లపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఒక్క బాన్సువాడ పట్టణంలోనే ప్రతీ రోజు రూ.500 నుంచి రూ. వేలు, లక్ష నుంచి రూ.2 లక్షల వరకు బెట్టింగ్లకు పాల్పడుతూ తమ ఆస్తులను కోల్పోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. పలువురు పారిశ్రామికేవేత్తల మధ్య రూ.లక్ష చొప్పున బెట్టింగ్ సాగినట్లు తెలిసింది. ఇలా వందలాది మంది ఐపీఎల్ జట్లపై నమ్మకంతో గెలుపు, ఓటములను చూపుతూ బెట్టింగులకు పాల్పడుతున్నారని తెలిసింది. పోలీసుల నిఘా అవసరం ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న బెట్టింగులపై పోలీసుల నిఘా కొరవడింది. బెట్టింగులకు పాల్పడుతున్న వారు సెల్ఫోన్లు వినియోగిస్తూ కేవలం ఫోన్లలోనే లావాదేవీలు కొనసాగిస్తుండడంతో పోలీసులకు సమాచారం అందడం లేదు. ఎవరు బెట్టింగులకు పాల్పడుతున్నారనే విషయమై పక్కా సమాచారం లేక వారు మిన్నకుండిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో బెట్టింగులపై ప్రత్యేకంగా సమాచారాన్ని రాబట్టి, కొందరిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటే, బెట్టింగులను నియంత్రించేందుకు వీలవుతుందని పరిశీలకులు అంటున్నారు. అనేక కుటుంబాలు బెట్టింగ్ జాడ్యం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, బెట్టింగులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొంటున్నారు. సెల్ఫోన్లలోనే చర్చలు.. ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభానికి ముందే బెట్టింగులకు పాల్పడుతున్న కొందరు వ్యక్తులు మధ్యవర్తులుగా అవతారమెత్తి బెట్టింగ్ డబ్బులపై సెల్ఫోన్లలో బేరమాడుతున్నారు. నేటి మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుంది? ఏ జట్టు ఓడి పోతుందనే? అంశంపై బేరమాడుతూ డబ్బులను ఫిక్స్ చేస్తున్నారు. మ్యాచ్లు కొనసాగిన తర్వాత గెలుపు/ఓటములపై ఫలితాలు రాగానే డబ్బుల కలెక్షన్ ప్రారంభిస్తున్నారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రధానంగా ఇండ్లలో, దుకాణాల్లో కూర్చొని బెట్టింగ్ బేరాలను నడిపిస్తున్నారు. ఒకవేళ ఓడిపోయిన పక్షంలో డబ్బులు లేకపోతే తమ సెల్ఫోన్లు, మోటర్ బైకులను ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్ల్ల యువకులే బెట్టింగుల్లో అధికంగా పాల్గొంటున్నారు. చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు, కూలీ పనులు చేసుకొనేవారు త్వరగా డబ్బులు సంపాధించవచ్చనే దురాశతో ఐపీఎల్ మ్యాచ్లపై బెట్టింగులకు దిగుతున్నారు. కొన్నిసార్లు బెట్టింగుల్లో గెలుపొందడంతో ముందు, వెనకా చూడకుండా తమ డబ్బులను బెట్టింగుల కోసం వెచ్చిస్తున్నారు. దీంతో కొందరు సర్వం కోల్పోతుండగా, మరి కొందరు డబ్బులు సంపాదిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. బెట్టింగుల కారణంగా ఆయా కుటుంబాలపై ప్రభావం చూపుతోంది. బెట్టింగ్లకు ఆకర్షితులవుతూ... నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలతోపాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ ఏరియాల్లో కూడా బెట్టింగ్ దందా జరుగుతున్నట్లు సమాచారం. మండల కేంద్రాల్లో సైతం చాలా మంది వీటిపై ఆసక్తిని చూపుతున్నారు. టాస్తోనే బెట్టింగ్ దందా ప్రారంభం కాగా, పేవరేట్ జట్టు, నాన్ ఫేవరేట్ జట్ల పేరుతో బెట్టింగ్లు కడుతున్నారు. జట్లతో పాటు మ్యాచ్ సమయంలో రన్లు, సింగిల్లు, డబుల్, ఫోర్లు, సిక్స్లు, రనౌట్లు, స్టంప్లు ఇలా ప్రతి దానికి బెట్టింగ్ కడుతున్నారు. బెట్టింగ్ల కోసం ఆండ్రాయిడ్ ఫోన్లను వాడుతున్నారు. ఇటీవలి కాలంలో అందుబాటు లోకి వచ్చిన యాప్ల ద్వారా బ్యాంక్ లావాదేవీలను కూడా నిర్వహిస్తున్నారు. డబ్బులను ట్రాన్స్ఫర్ చేసేందుకు ఫోన్ పే, తేజ్, పేటీఎం యాప్లను వాడుతున్నారు. వీటి ద్వారా సులభంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. 1:2, 1:4, 1:5 అంటూ బెట్టింగ్లు కాస్తున్నారు. బెట్టింగ్లు కాస్తూ యువత దానికి బానిసలుగా మారి ప్రతిరోజు ఆర్థికంగా నష్టపోగా వారి కుటుంబాలు చిధ్రమవుతున్నాయి. బెట్టింగ్లకు ఆకర్షితులవుతూ... నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలతోపాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ ఏరియాల్లో కూడా బెట్టింగ్ దందా జరుగుతున్నట్లు సమాచారం. మండల కేంద్రాల్లో సైతం చాలా మంది వీటిపై ఆసక్తిని చూపుతున్నారు. టాస్తోనే బెట్టింగ్ దందా ప్రారంభం కాగా, పేవరేట్ జట్టు, నాన్ ఫేవరేట్ జట్ల పేరుతో బెట్టింగ్లు కడుతున్నారు. జట్లతో పాటు మ్యాచ్ సమయంలో రన్లు, సింగిల్లు, డబుల్, ఫోర్లు, సిక్స్లు, రనౌట్లు, స్టంప్లు ఇలా ప్రతి దానికి బెట్టింగ్ కడుతున్నారు. బెట్టింగ్ల కోసం ఆండ్రాయిడ్ ఫోన్లను వాడుతున్నారు. ఇటీవలి కాలంలో అందుబాటు లోకి వచ్చిన యాప్ల ద్వారా బ్యాంక్ లావాదేవీలను కూడా నిర్వహిస్తున్నారు. డబ్బులను ట్రాన్స్ఫర్ చేసేందుకు ఫోన్ పే, తేజ్, పేటీఎం యాప్లను వాడుతున్నారు. వీటి ద్వారా సులభంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. 1:2, 1:4, 1:5 అంటూ బెట్టింగ్లు కాస్తున్నారు. బెట్టింగ్లు కాస్తూ యువత దానికి బానిసలుగా మారి ప్రతిరోజు ఆర్థికంగా నష్టపోగా వారి కుటుంబాలు చిధ్రమవుతున్నాయి. సమాచారమిస్తే చర్యలు తీసుకుంటాం బెట్టింగ్లకు పాల్పడడం చట్ట రీత్యా నేరం. ఐపీఎల్ మ్యాచ్లపై బెట్టింగులు జరుగుతున్నట్లు సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. నిఘా పెంచుతాం. బెట్టింగులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొంటాం. మాకు సమాచారం అందించాలి. –మహేష్గౌడ్, సీఐ, బాన్సువాడ. -
ఇద్దరు మహిళా దొంగల అరెస్ట్
వరంగల్ క్రైం: ఆటోల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలను లక్ష్యంగా చేసుకోని బ్యాగుల్లోని బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు సీసీఎస్ ఇన్స్పెక్టర్ డేవిడ్రాజ్ తెలిపారు. వారి నుంచి 30 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సీసీఎస్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఆం«ధ్రప్రదేశ్ రాష్త్రం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన గండికోటి నూకాలమ్మ అలియాస్ ఉయ్యాల కుమారి, ఉయ్యాల మరియమ్మ అలియాస్ బుజ్జిలు స్నేహితులు. జల్సాగా బతకాలను ఆలోచనతో వారు దొంగతనాలకు అలవాటుపడ్డారు. ఈ మేరకు వారు ఇద్దరు మరొక మహిళ కడమ్మతో కలిసి దొంగతనాలు చేశారు. 2013 నుంచి 2017 వరకు విజయవాడ, గుంటూరుల్లో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడ్డారు. 2017లో పోలీసులకు దొరకడంతో ఒక సారి జైలుకు కూడా వెళ్లారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 1న ఆటోలో ప్రయాణిస్తున్న ఖమ్మం ప్రాంతానికి చెందిన తంగిళపల్లి కరుణ బ్యాగులో బంగారు ఆభరణాలను వారు చోరీ చేశారు. వరంగల్ రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో నిందితులు తిరగుతున్నట్లు వరంగల్ ఏసీపీ నర్సయ్యకు సమాచారం రావడంతో ఇద్దరు మహిళలను అధుపులోకి తీసుకున్నారు. వారు నేరాన్ని అంగీకరించారు. దీంతో మరియమ్మ, నూకలమ్మలను అరెస్ట్ చేశారు. కడమ్మ పరారీలో ఉంది. నిందితులను సకాలంలో గుర్తించిన ఏసీపీ నర్సయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ డేవిడ్రాజ్, ఇంతెజార్గంజ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్సై అశోక్కుమార్, సీసీఎస్ ఏఎస్సై ఫర్వీన్, హెడ్కానిస్టేబుళ్లు రవికుమార్, జంపయ్య, కానిస్టేబుళ్లు మహ్మద్అలీ, రవీందర్రెడ్డి, మీర్ మహ్మద్ అలీ, సంతోష్, నరేష్, రాంరెడ్డి, కుమారస్వామి, మహిళ కానిస్టేబుల్ కవితను వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్ అభినందించారు. -
ప్రాణం తీసిన ఆస్తి తగాదా
కేసముద్రం: కడుపున పుట్టిన కొడుకే కన్న తండ్రి పాలిట కాలయముడయ్యాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకే ఆస్తి కోసం తండ్రిపై దాడిచేసి హతమార్చిన విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం ఇంటికన్నె శివారు ముత్యాలమ్మ తండాలో చోటు చేసుకుంది. ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. ముత్యాలమ్మ తండాకు చెందిన భుక్యా మంగ్యా(53)–చంద్రమ్మ దంపతులకు కుమారుడు వీరన్న, మగ్గురు కుమార్తెలున్నారు. వారు తమకున్న 4ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నా రు. మంగ్యా ఇద్దరు కుమార్తెలతోపాటు, కొడుకు పెళ్లి చేశాడు. యేడాదిన్నర క్రితం చంద్రమ్మ అనారోగ్యంతో గురవడంతో చికిత్స చేయించా రు. ఆమె వైద్య ఖర్చుల కోసం రూ.7లక్షల అప్పు తీసుకువచ్చారు. అనంతరం చంద్రమ్మ ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందింది. వైద్య ఖర్చు ల కోసం చేసిన రూ.7లక్షల అప్పును తీర్చడానికి భూమిని అమ్మాలంటూ తండ్రితో వీరన్న తరచు గొడవ పడుతున్నాడు. భూమిని అమ్మవద్దంటూ తండ్రి వాదిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మళ్లీ భూమి విషయంలో తండ్రి, కొడుకుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఆగ్రహనికి గురైన కొడుకు తండ్రిపై దాడిచేయడానికి ప్రయత్నించా డు. అతడు పరుగెత్తుకుంటూ వెళ్తుండగా నెట్టివేశాడు. దీంతో ఒక్కసారిగా రోడ్డుపై పడిన మంగ్యా తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందా డు. గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలున్న వారంతా కేకలు పెడుతూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంగ్యాను లేపిచూడగా అప్పటికే మృతిచెంది నట్లు వారు గుర్తించారు. తాతయ్య చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేని మనుమండ్లు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఘటనా స్థలాన్ని రూరల్ సీఐ వెంకటరత్నం, ఎస్సై సతీష్లు ఆదివారం పరీశీలించారు. మృతుడి తమ్ముడు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మానుకోట ఆస్పత్రికి తరలించారు. నిందితుడు వీరన్నను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రేమోన్మాది దాడిలో గాయపడిన రవళి మృతి
వరంగల్ క్రైం: ప్రేమను నిరాకరించిదనన్న అక్కసుతో పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఘటనలో తీ వ్రంగా గాయపడిన తోపుచర్ల రవళి(22) మృత్యువుతో పోరాడి చివరకు సోమవారం యశోద ఆస్పత్రిలో కన్ను మూసింది. హన్మకొండ రాంగనర్లో ఫిబ్రవరి 27న లలితారెడ్డి హాస్టల్ ముందు ప్రేమోన్మాది పెండ్యాల సాయిఅన్వేష్ చేతిలో దాడికి గురైన విద్యార్థిని ఆరు రోజుల పాటు నరకం అనుభవించి మృత్యువు ఒడిలోకి చేరింది. ఐసీయూలో ఆరు రోజుల నరకయాతన.. ఫిబ్రవరి 27వ తేదీన హన్మకొండలోని రాంనగర్లో ఉదయం 9.05 గంటలకు హాస్టల్ నుంచి నడుచుకుంటూ వస్తున్న రవళిపై ప్రేమోన్మాది సాయిఅన్వేష్ పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన తరువాత చివరగా తన స్నేహితురాలు కావ్యతో నిందితుని వివరాలు చెప్పింది. ఆ తరువాత ఎంజీఎం ఆస్పత్రికి ఉదయం 9.30 గంటలకు చేరుకున్న రవళి మధ్యాహ్నం 12 గంటల వరకు చికిత్స పొందింది. మెరుగైన వైద్యం కోసం హైదరబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించగా 3.15 గంటలకు యశోద ఆస్ప త్రిలో ఐసీయూలో చేర్చారు. అప్పటి నుంచి సోమవారం సాయంత్రం 6.10 గంటల వరకు ప్రాణా లతో పోరాడింది. ఆరు రోజుల పాటు నరకయాతన అనుభవించి చివరకు రవళి ప్రాణాలను వదిలింది. శ్వాస నాళాలు ఉబ్బి.. పెట్రోల్ దాడిలో గాయపడిన రవళి ముఖం ఎక్కువ మొత్తంలో కాలిపోయింది. తీవ్రమైన గాయాల వల్ల శ్వాసనాళాలు ఉబ్బిపోయాయి. చర్మంపై ఉన్న మూడు పొరలు పూర్తి స్థాయిలో దెబ్బతిని, ఊపిరితిత్తులు పాడైపోయాయి. ప్లేట్లేట్స్ తగ్గిపోయాయి. శ్వాస నాళాలు దెబ్బతినడం వల్ల శ్వాస తీసుకోలేక మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఐసీయూలో ఆరు రోజుల పాటు వెంటిలేటర్పైనే చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. నేడు గాంధీలో పోస్టుమార్టం.. మృతదేహానికి సోమవారం పంచనామా అనంతరం ముషీరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తారు. సెంట్రల్ జైల్లో ప్రేమోన్మాది సాయిఅన్వేష్ 27న దాడి జరిగిన తరువాత 28వ తేదీన మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపిం చారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడు సాయిఅన్వేష్పై ఐసీసీ 341, 354–డీ, 326–ఏ, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రవళి మృతి చెందటంతో నిందితుడు సాయి అన్వేష్పై 302 కింద హత్య కేసు నమోదు చేయనున్నారు. హన్మకొండ ఇన్స్పెక్టర్ సంపత్రావు విచారణ అధికారిగా వ్యవహరిస్తున్నారు. హైదరబాద్లో పంచనామా నిర్వహించిన తరువాతనే పోస్టుమార్టం చేపడుతారు. ఆరు రోజుల పాటు హన్మకొండ పోలీసు స్టేషన్కు చెందిన ఓ ఎస్సై రవళి ఆరోగ్య పరిస్థితిని దగ్గర ఉండి పర్యవేక్షించారు. సెంట్రల్ జైల్లో పేమోన్మాది సాయిఅన్వేష్ పెట్రోల్ పోసి అత్యంత దారుణంగా కాల్చిన ప్రేమోన్మాది సాయిఅన్వేష్ వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. హన్మకొండ పోలీసులు 27న దాడి జరిగిన తరువాత 28వ తేదీన మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు. న్యాయమూర్తి 14 రోజుల రిమైండ్ విధించారు. మృతురాలు రవళి ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడు సాయిఅన్వేష్పై ఐసీసీ 341, 354–డీ, 326–ఏ, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రవళి మృతి చెందటం నిందితుడు సాయి అన్వేష్పై 302 కింద హత్య కేసు నమోదు చేయనున్నారు. రవళి మృతిపై మంత్రి ఎర్రబెల్లి సంతాపం పాలకుర్తి: ఇటీవల హన్మకొండలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్లో చికిత్స పొందుతూ రవళి సోమవారం మృతి చెందింది. ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాలకుర్తిలో విలేకరులతో మాట్లాడారు. రవళి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. రవళి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. అత్యంత భాధకరం పెట్రోల్ దాడిలో గాయపడి చికిత్స పొందుతూ రవళి మృతి చెందటం అత్యంత బాధాకరం. ప్రేమోన్మాది సాయిఅన్వేష్ను అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగింది. ఇన్స్పెక్టర్ సంపత్రావును హైదరాబాద్కు పంపించి పోస్టుమార్టం నిర్వహిస్తాం. పోలీసు శాఖాపరంగా సరైన అధారాలు కోర్టుకు అందజేసి శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటాను. యువతులు, మహిళలను ఎవరైనా ప్రేమ పేరుతో వేధిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. షీ టీమ్స్, 100కు డయల్ చేయాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ రవీందర్, సీపీ సంగెం : రవళి స్వగ్రామం రామచంద్రాపురంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సంగెం ఎస్సై ఎం.నాగరాజు పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మంగళవారం రవళి మృతదేçహాన్ని స్వగ్రామానికి తీసుకురానున్న క్రమంలో ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. మరో తల్లికి గర్భశోకం లేకుండా చూడాలి.. ప్రేమ పేరుతో రవళిని వేధించి చివరకు పెట్రోల్ పోసి నిప్పటించి తన పైశాచికానికి బలి చేసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలి. అతడికి విధించిన శిక్షను చూసి మరో మృగాడు ఏ ఆడపిల్ల వైపు కూడా కన్నెత్తి చూడకూడదు. రవళి తల్లితండ్రులకు కలిగిన గర్భశోకం మరే తల్లిదండ్రులకు రాకుండా చూడాలి. ప్రేమ పేరుతో వేధించే వారి పట్ల చట్టాలు కఠినంగా అమలు చేయాలి. బొంపల్లి జయశ్రీ, సర్పంచ్, రామచంద్రాపురం ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి.. సమాజంలో అన్ని రంగాల్లో మగవారితో సమానంగా ముందుకు పోతున్న ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి. దీంతో వారిని కళాశాలలకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ప్రేమ పేరుతో వేధించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఒక్కగానోక్క కూతురును పొట్టన పెట్టుకున్న అన్వేష్ను కఠినంగా శిక్షించాలి. రవళి తల్లిదండ్రులకు తగిన న్యాయం జరిగేలా అతనిని శిక్షించాలి. కత్తి రాధిక, ఎంపీటీసీ సభ్యురాలు,రామచంద్రాపురం -
ప్రేమికుడు మోసం చేశాడని.. యువతి ఆత్మహత్య
మహబూబాబాద్ రూరల్ : ఓ యువకుడు తనను ప్రేమించడంతో పాటు పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లెనిన్ నగర్లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. టౌన్ ఎస్సై సీహెచ్.రమేష్బాబు కథనం ప్రకారం... మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లెనిన్ నగర్కు చెందిన బూర్గుల యాకమ్మ, పాపయ్య మనుమరాలు బూర్గుల ప్రవళిక(19)కు తల్లి ఉపేంద్రమ్మ చిన్నతనంలోనే చనిపోయింది. దీంతో ఆమె అమ్మమ్మ ఇంటి వద్దే ఉంటోంది. ఇదే కాలనీకి చెందిన బల్లెం మార్కయ్య కుమారుడు చంటి, ప్రవళికలు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెద్ద మనుషుల వద్ద పంచాయితీ కూడా నిర్వహించారు. ఈ క్రమంలో ప్రవళికను పెళ్లి చేసుకుంటానని చంటి కాగితం కూడా రాసి ఇచ్చాడు. అనంతరం పెళ్లి చేసుకోనని చెప్పడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందింది. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బల్లెం చంటిపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్బాబు తెలిపారు. మృతదేహన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం ఏరియాస్పత్రికి తరలించారు. -
ఘరానా మోసం
పర్వతగిరి: అతి ఆశ, అమాయకత్వం వారి గొప్ప ముంచింది. తక్కువ ధరకు బంగారం అందిస్తామన్న మోసగాళ్ల మాటలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. నకిలీ బంగారం చేతిలో పెట్టి రూ.4లక్షల ఘరానా మోసానికి పాల్పడిన సంఘటన రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఇస్లావత్ తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు ధరంసోత్ హుక్యా తెలిపిన వవరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి తన ఫోన్ నంబర్ సేకరించి తమ ఇంటి వద్ద పెద్ద ఎత్తున బంగారం ఉందని, తులానికి రూ.20వేలకు అందిస్తామని మాయమాటలు చెప్పాడు. ఇది నమ్మిన హుక్యా బల్లారి వెళ్లి రూ.4లక్షలు చెల్లించి బంగారం తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చి చెక్ చేసే సరికి నకిలీ బంగారమని తెలియడంతో బాధిత కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. అలా మొదలైంది.. తండాకు చెందిన హుక్యా అన్నయ్య వెంకన్నకు తరచూ బంగారం ఉంది తక్కువ ధరకు ఇస్తామని దుండగులు ఫోన్ చేస్తున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని వెంకన్న మేం కూలీ పనిచేసుకుంటాం మా వద్ద డబ్బులు లేవు అని చెప్పినప్పటికీ దుండగులు మళ్లీ మళ్లీ ఫోన్ చేసి ఇబ్బందిపెట్టారు. పదే పదే ఫోన్ చేస్తుడడంతో తమ ఇంటికి బంగారాన్ని చూపించాలనడంతో దుండగుడు నెక్కొండ మండల కేంద్రానికి వచ్చి రెండు చిన్న బంగారు బిళ్లలను అప్పగించి కేవలం రూ.500 తీసుకుని వెళ్లాడు. తదుపరి రెండు రోజు తర్వాత ఫోన్ చేసి అసలు బంగారమో నకిలీదో తేల్చుకుని రండి మీకు ఎంత బంగారం కావాలంటె అంత అప్పగిస్తాను తులానికి రూ.20వేల చొప్పున అని మాయ మాటలతో నమ్మించాడు. పక్కనే ఉన్న హుక్యా గతంలో ఇచ్చిన బంగారాన్ని చెక్ చేయించాడు. నిజమైన బంగారమని తేలడంతో ఇతరుల వద్ద అప్పుగా రూ. 4.50లక్షలు తీసుకువచ్చి వెంకన్నతో పాటు మరో వ్యక్తితో బల్లారి బయలుదేరారు. బల్లారి వద్ద దబ్బులను దుండగుల చేతిలో పెట్టి నకిలీ బంగారం తీసుకు వచ్చారు రౌడీలకు బయపడి... దుండగుడు నకిలీ బంగారం ఇచ్చాడని నిర్ధారణకు వచ్చిన హుక్యా, వెంకన్న వారిని నిలిదిసేందుకు బయపడ్డారు. డబ్బులు చెల్లించి నకిలీ బంగారం తీసుకునే సమయంలో సుమారు ఇరవై మంది పక్కనే ఉన్నట్లు తెలిపారు. ప్రాణాలను రక్షించుకోవాలనే తపనతో అక్కడి నుండి బయపడి వెనక్కి తిరిగారు. పోలీసులు ఫోన్ చెసినప్పటికీ.. కర్ణాటక పోలీసులు కొద్ది రోజులకు దుండగులను పట్టుకుని విచారిస్తున్న సమయంలో వారి ఫోన్ నంబర్లు బయటపడ్డాయి. ఫోన్ సమాచారంతో పోలీసులు బాధితుడికి ఫోన్ చేసి బల్లారికి వచ్చి పిటిషన్ ఇవ్వాలని తెలిపినప్పటికీ బాధితుడు బయపడి బల్లారికి వెల్లడం మానేశాడు. పోలీసులు మాత్రం దుండగులను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధిడుతు ఫిర్యాదు చేస్తే సహకారం అందిస్తామని కర్ణాటక పోలీసులు తెలిపినట్లు సమాచారం. స్థానిక పోలీసులు సహకరించి డబ్బులు ఇప్పించాలని బాధిడుతు, అతడి భార్య వేడుకుంటున్నారు. -
మందలించినందుకు యువతి..
ఖానాపురం: ఉరేసుకొని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని కోమటిపల్లి తండాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన భూక్య సుభద్ర(20) ఇంటి వద్ద సరిగా పనులు చేయడం లేదు. దీంతో తల్లి గుగని పనులు చేయకుండా ఖాళీగా ఉంటే ఎలా అంటూ మందలించి అన్నారంకు వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన సుభద్ర ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి కుటుంభ సభ్యులు ఇంటికి చేరుకుని చూడగా ఉరేసుకొని ఉంది. మృతురాలి అన్న భూక్య శంకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గుట్కా కేంద్రాలపై దాడులు
వరంగల్ క్రైం: ప్రభుత్వం నిషేధించిన గుట్కాలను అమ్ముతున్న కేంద్రాలపై టాస్క్ఫోర్స్ అధికారులు ఆదివారం దాడులు చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ చక్రవర్తి తెలిపారు. ఏసీపీ కథనం ప్రకారం...సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలోని గోకుల్నగర్కు చెందిన కొమురవెల్లి వేణుమాధవ్ హుజురాబాద్కు చెందిన శ్రీనివాస్ గుట్కా సరఫరా దారుని నుంచి గుట్కాలు తీసుకుని అమ్ముతున్నాడు.ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకున్నాం.. సరఫరా దారుడు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.72వేల విలువ గల గుట్కాలు, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్యల కోసం నింధితులను సుబేదారి ఎస్సై సత్యనారాయణకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్ రమేష్కుమార్, సిబ్బంది పాల్గొన్నట్లు ఏసీపీ తెలిపారు. ప్రైవేట్ హాస్టల్లో గుట్కాలు స్వాధీనం హన్మకొండ పోలీసు స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్దంగా గుట్కాలు సరఫరా చేస్తున్న వీరమల్ల కార్తీక్ను అరెస్టు చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ చక్రవర్తి తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్కు చెందిన వీరమల్ల కార్తీక్ హన్మకొండలోని కిషన్పురలో మహర్షి ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ నగరంలోని పాన్షాపులకు గుట్కాలను సరఫరా చేస్తున్నాడు. నగరంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న కార్తీక్ గత కొంత కాలంగా గుట్కాల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. పక్కా సమాచారం మేరకు నింధితున్ని అదుపులోకి తీసుకుని నిందితుని నుంచి రూ.50వేల విలువ గల గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. తదుపరి చర్యల కోసం నిందితున్ని హన్మకొండ ఎస్సై శ్రీనా«ధ్కు అప్పగించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నందిరాంనాయక్, సిబ్బంది పాల్గొన్నారు. -
యూట్యూబ్ చూసి తుపాకుల తయారీ
వరంగల్ క్రైం: యూట్యూబ్ చూసి తుపాకులు తయారుచేసి జనగామ జిల్లా మొండ్రాయి పాలకుర్తిలో ఈ నెల 15న అర్ధరాత్రి దోపిడీకి పాల్పడిన ఆరుగురి దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ తెలిపారు. కమిషనరేట్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడారు. తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడిన నకిలీ నక్సలైట్ ముఠాను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. నిందితుల్లో జనగామ జిల్లా కొడకండ్ల మండలం చెరువు ముందు తండాకు చెందిన ఇస్లావత్ శంకర్, నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన నారబోయిన మల్లేష్, నల్గొండ జిల్లా చిట్యాల మండలం, పేరపల్లికి చెందిన గంగాపురం స్వామి, అలియాస్ మల్లేష్, పాలకుర్తి మండలం చెన్నూరుకి చెందిన పిట్టల శ్రీనివాస్, చెన్నూరు గ్రామానికి చెందిన చీలూరి పరమేశ్, నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఎన్జి కొత్తపల్లికి చెందిన సరిపంగి విప్లవ్లు ఉన్నారని సీపీ తెలిపారు. ముఠాగా ఏర్పడి.. ప్రధాన నిందితుడు ఇస్లావత్ శంకర్ మరో నిందితుడు గంగారపు స్వామితో కలిసి 2018లో జనశక్తి పార్టీ అనుబంధ సంస్థ అయిన రైతు సంఘం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. జనశక్తి పేరుతో మరోసారి డబ్బులు సంపాధించాలనే ఆలోచనతో గంగారపు స్వామి పిట్టల శ్రీనివాస్, నారబోయిన మల్లేశంను ప్రధాన నిందితుడు ఇస్లావత్ శంకర్కు పరిచయం చేశాడు. వీరంత ఒక ముఠాగా ఏర్పడి పలుసార్లు వివిధ ప్రాంతాల్లో కలుసుకొని అసెంబ్లీ ఎన్నికల ముందు స్వామిని గ్రామంలో కలుసుకున్నారు. జనశక్తి పేరుతో డబ్బులు సంపాధించాలంటే ఆయుధాలు అవసరం కావడంతో పిట్టల శ్రీనివాస్ తుపాకులు తయారు చేశాడు. డిసెంబర్ 31న దోపిడీకి ప్రణాళిక.. బొమ్మలు తయారు చేసే నైపుణ్యం కలిగిన పిట్టల శ్రీనివాస్ యూట్యూబ్ చూసి తుపాకులు తయారు చేశాడు. సైకిల్ బొంగులు, కర్ర, డ్రమ్స్, రాగిరేకు ఇలా... అందుబాటులో ఉండే వస్తువులతో నాటు తుపాకులతో పాటు అవసరమైన బులెట్లను తయారు చేశాడు. దీనికి తోడు మరో నిందితుడు స్వామి గతంలో తన దగ్గర ఉన్న 12 బోర్ తూటాలను అందించాడు. కొడకండ్ల మండలంలోని మద్యం షాపులను లక్ష్యంగా చేసుకున్న ముఠా సభ్యులు మొదట డిసెంబర్ 31న దోపిడీకి ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఆ రోజు రాత్రి జనం ఎక్కువగా ఉండంతో ప్రణాళిక మార్చుకున్నారని సీపీ వివరించారు. సమానంగా వాటాలు 15న ఇస్తావత్ శంకర్ ఇంటి దగ్గర ముఠా సభ్యులు అందరూ కలుసుకుని శంకర్ మద్యం షాపు దగ్గర కాపు కాయగా మిగితా నిందితులు మొండ్రాయి, పాలకుర్తి రోడ్డులో తుపాకులతో కాపుకాచి దోపిడీకి సిద్ధం అయ్యారు. తిరుమల మద్యం దుకాణం నిర్వహకులు రూ.6.70 లక్షలు తీసుకుని ముగ్గురు ఒకే వాహనంపై వెళ్తుండగా మద్యం షాపు దగ్గర ఉన్న శంకర్ మిగితా సభ్యులకు సమాచారం ఇచ్చాడు. డబ్బులతో వస్తున్న షాపు నిర్వాహకుల ద్విచక్రవాహనాన్ని రోడ్డుకు అడ్డంగా తాడు కట్టి గాలిలో కాల్పలు జరిపి డబ్బులను డబ్బులు తీసుకుని వెళ్లారు. దోపిడీ అనంతరం నిందితులు సొమ్మును సమాన వాటాలుగా పంచుకుని వివిధ ప్రాంతాలకు పారిపోయారు. దోపిడీ దొంగలను పట్టుకునేందుకు స్థానిక పోలీసులతో పాటు పది ప్రత్యేక బృందాలు పనిచేశాయని సీపీ తెలిపారు. నిందితులు శంకర్ , మల్లేష్, స్వామిలు ముగ్గరు చెరువు ముందు తండాలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్సైలు రాజు, సతీష్లు వారిని అదుపులోకి తీసుకోని విచారించగా శ్రీనివాస్, పరమేశ్, విప్లవ్లు చెన్నూరులో ఉన్నట్లు తెలిపడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందని సీపీ రవీందర్ వివరించారు. రూ.5.56 లక్షలు స్వాదీనం.. నిందితుల నుంచి దోపిడీ చేసిన సొమ్ము నుంచి రూ.5,56,650 నగదు, మూడు తపంచాలు,10 తూటాలు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అధికారులకు అభినందనలు.. నిందితులను సకాలంలో గుర్తించి సొమ్మును రికవరీ చేసిన వెస్ట్జోన్ డీసీపీ శ్రీనివాస్రెడ్డి, వర్ధన్నపేట ఏసీపీ మధుసూధన్, టాస్క్ఫోర్స్ ఏసీపీ చక్రవర్తి, పాలకుర్తి ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్సైలు సతీష్, రాజు, టాస్క్ఫోర్స్, ఐటీకోర్, సైబర్ విభాగం, స్పెషల్ పార్టీ పోలీసులను సీపీ అభినందించారు. -
ప్రేమ కోసం విద్యార్థిని.. పరువు కొసం ప్రియుడి తండ్రి
వెంకటాపురం(ఎం): సంక్రాంతి పండుగ వేళ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకొని మృతిచెందడంతో మండల పరిధిలోని పాలంపేట గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మండలంలోని పాలంపేటకు చెందిన బోడ సుమలత–సంజీవయ్య దంపతుల పెద్ద కూతురు సింధూజ(18) మండలంలోని జవహర్నగర్ మోడల్ స్కూల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం హైదారాబాద్లో ఉంటున్నారు. సంక్రాంతి సెలవులకు ఈనెల 10న సాయంత్రం సింధూజ పాలంపేటలోని తన పెద్దనాన్న రవి ఇంటికి వచ్చింది. సింధూజ పాలంపేటకు చెందిన కొండబత్తుల రమేష్లు కొంతకాలంగా ప్రేమించుకున్నట్లు తెలిసింది. ఈనెల 14న సింధూజ ఇంటివద్దే ఉదయం 10 గంటలకు పురుగుల మందు తాగడంతో కుటుంబసభ్యులు ము లుగు ప్రభుత్వ ఆస్పత్రికి తర లించగా చికిత్స పొం దుతూ మధ్యాహ్నం 2 గంటల సమయంలో పరిస్థితి విషమించి మృతి చెందింది. తన కూతురు కడుపునొప్పి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని సింధూజ తల్లి సుమలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సింధూజ తల్లిదండ్రులు ఆమె ఫోన్ డాటాను పరిశీలించారు. సింధూజ మృతికి ఇదే గ్రామానికి చెందిన కొండబత్తుల రమేష్ కారణమని 15న ఉదయం వెంకటాపురం పోలీసులకు ఆమె తల్లి దండ్రులు మరోసారి ఫిర్యాదు చేశారు. అలాగే రమేష్ ఇంటి ఎదుట మృతదేహంతో మంగళవారం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆందోళన చేపట్టారు. న్యాయం చేస్తానని పోలీసులు హామీ ఇవ్వడంతో విరమించారు. ఈ క్రమంలో కొండబత్తుల రమేష్ తండ్రి రాజు సాయంత్రం ఇంటివద్దే పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యల మృతి చెందాడు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి నిరసన
జఫర్గఢ్: రెండేళ్ల పాటు ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మొహం చాటేసిన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగిన సంఘటన మండలంలోని హిమ్మత్నగర్లో గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గుడికందుల కుమార్, స్వరూప దపంతుల కూతురు అశ్వినితో మండలంలోని హిమ్మత్నగర్ గ్రామానికి చెందిన మేర్గు ఎల్లగౌడ్, శోభ దంపతుల కుమారుడు మేర్గు శ్రీకాంత్ ప్రేమాయణం సాగించాడు. అశ్విని మైనర్ కావడంతో రెండు సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. అయితే గత డిసెంబర్ 31న అమ్మాయి ఇంటికి వచ్చిన శ్రీకాంత్ను పెళ్లి చేసుకోవమని నిలదీయగా అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ విషయంపై అమ్మాయి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల ఆదేశాల మేరకు ఇరువర్గాలకు సంబంధించిన పెద్ద మనుషులు పంచాయితీ నిర్వహించి అశ్వినిని పెళ్లి చేసుకోమని చెప్పడంతో ఇందుకు శ్రీకాంత్, అతడి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో కలత చెందిన అశ్విని, కుటుంబ సభ్యులు శ్రీకాంత్ ఇంటి ఎదుట నిరసన తెలుపగా మహిళలు, పలువురు కుల పెద్దలు ఆమెకు మద్దతుగా నిలిచారు. ప్రియురాలు నిరసనకు దిగిన సమయంలో ప్రియుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై వెంకటకృష్ణ ఘటన స్థలానికి చేరుకుని ఆమెకు, కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు శాంతించలేదు. అశ్వినికి న్యాయం జరిగే తాము ఆందోళన విరమించేది లేదని తెగేసి చెప్పారు. దీంతో వారు రాత్రి వరకు నిరసన కొనసాగించారు. -
గ్రానైట్ లారీ ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
ఎల్కతుర్తి: మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ గ్రానైట్ లారీ మరో గ్రానైట్ లారీని ఢీ కొట్టిన సంఘటనలో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సూరారం బస్స్టేజీ సమీపంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ జీ కథనం ప్రకారం...కరీంనగర్ జిల్లా రేకూర్తికి చెందిన రొంటాల కిషన్(అలియాస్) కిషన్రెడ్డి(47), కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన క్లీనర్ ఎస్కె. అక్రమ్సందానీ(35) గ్రానైట్ లారీని కరీంనగర్ నుంచి కాకినాడకు తీసుకెళ్తున్నారు. మార్గమధ్యలో గల సూరారం బస్స్టేజీ సమీపంలోని కరీంనగర్–వరంగల్ ప్రధాన రహదారిపై మరో గ్రానైట్ లారీని అతి వేగంగా వెళ్లి ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీలో ఉన్న గ్రానైట్ రాళ్లు క్యాబిన్పై పడి నుజ్జునుజ్జు కావడంతో అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిందన్న సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాస్ జీ, ఎస్సై శ్రీధర్లు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కిషన్రెడ్డిని బయటకు తీసేక్రమంలోనే పరిస్థితి విషమించి మృతి చెందాడని సీఐ వివరించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇద్దరు మృతదేహాలను బయటకు తీసి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ముందు లారీలో ఉన్న డ్రైవర్ శ్రీరాంమూర్తి, క్లీనర్ రవికుమార్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మృతుల కుంటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ మార్చురీకి తరలించినట్లు సీఐ తెలిపారు. మృతులు ఇద్దరికీ భార్య పిల్లలు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన లారీ విఘ్నేశ్వర ట్రాన్స్పోర్టుకు చెందింది కాగా మరో లారీ శరభ క్వారీకి చెందిందని పోలీసులు తెలిపారు. -
ప్లాట్ల పేరుతో ఘరానా మోసం..
బచ్చన్నపేట/జనగామ: మండల కేంద్రంలో పలువురికి హైదరాబాద్లో ప్లాట్లు ఇప్పిస్తానని డబ్బులను తీసుకొని రూ.4లక్షల రూపాయలతో ఉడాయించిన ఘటన మండల కేంద్రంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై రంజిత్రావు కథనం ప్రకారం..మండల కేంద్రానికి చెందిన బొమ్మ నర్సింహులుకు చేనేత మగ్గాలు ఉన్నాయి. ఈ మొగ్గాలను నేయడానికి హైదరాబాద్, ఎల్బీ నగర్, సాయిసప్తగిరి కాలనీకి చెందిన శింగం కిష్టయ్య 4 నెలల క్రితం వచ్చాడు. గడిచిన 4 నెలలుగా మగ్గం నేచుకుంటూ గ్రామంలో అందరితో చనువు పెంచుకున్నాడు. హైదరాబాద్లో ప్రభుత్వం నిరుపేదలకు ప్లాట్లు ఇస్తుందని, ఆ ప్లాట్ కావాలంటే ముందుగా రూ. 20 వేలు చెల్లించి బుక్ చేసుకోవాలని తెలిపాడు. తక్కువ ధరకే ప్లాట్ వస్తుండడంతో దాదాపు 20 మంది 20 వేల చొప్పున రూ.4 లక్షల వరకు కిష్టయ్యకు అందించారు. ఉన్నట్టు ఉండి కిష్టయ్య వారం రోజులుగా కనిపించడం లేదు. డబ్బులు ఇచ్చిని వారు ఎక్కడ వెదికినా అతని ఆచూకీ కనిపించలేదు. ఈ విషయమై బొమ్మ నర్సింహులు స్థానిక పోలీస్ స్టేషన్లో, అలాగే జనగామ డీసీపీ శ్రీనివాస్రెడ్డికి కూడా బుధవారం ఫిర్యాదు ఇచ్చాడని ఎస్సై రంజిత్రావు తెలిపారు. ఈ వివరాల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా బాధి తులు మాట్లాడుతూ మగ్గం నేసుకుని నెల నెల వ చ్చే మిగులు డబ్బులతో బతికే తమ లాంటి కుటుంబాలను మోసం చేసిన వ్యక్తిని పట్టుకోవా లని కోరారు. తమలాంటి వారు మోసపోకుండా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. -
న్యూ ఇయర్ వేడుకల్లో అపశ్రుతి
హసన్పర్తి: కొత్త సంవత్సరం వేడుకలు మూడు కుటుంబాల్లో విషాదం నింపాయి. వేడుకల్లో పాల్గొని వస్తుండగా ఓ ఆటో డ్రైవర్ అనుమానా స్పద స్థితిలో మృతిచెందగా, వేడుకల అనంతరం నిద్రిస్తున్న క్రమంలో ఓ డిగ్రీ విద్యార్థి గుండెపోటుతో చనిపోయింది. ఓ యువకుడు మూత్రవిసర్జనకు వెళ్లి డ్రెయినేజీ వద్ద పడి ప్రాణాలు వదిలాడు.పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని 58వ డివిజన్ వంగపహాడ్కు చెందిన దోమ అరుణ్(28)కు భార్య కళ్యాణి, ఆరు నెలల కూతురు ఉన్నారు. అరుణ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి బైరాన్పల్లి శివారులోని ఓ మామిడితోటలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని ఆటోలో తిరిగి ఇంటికి పయనమయ్యాడు. ఈ క్రమంలో అతడు మంగళవారం ఉదయం గ్రామ సమీపంలో మృతిచెంది కనిపించాడు. హత్యచేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ కాగా దోమ అరుణ్ను హత్య చేశారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సోమవారం రాత్రి జరిగిన న్యూయర్ గొడవలే హత్యకు కారణంగా వారు పేర్కొంటున్నారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని కుటుంబ సభ్యుల డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా పోలీసులు మాత్రం ఆటో బోల్తాపడడంతో అరుణ్ మృతిచెందినట్లు అనుమానిస్తున్నారు. ఇంటికి వచ్చే క్రమంలో మూలమలుపు వల్ల ఆటో బోల్తాపడినట్లు పేర్కొంటున్నారు. భయపడ్డారా ? వంగపహాడ్ శివారులోని మూలమలుపు వద్ద ఆటో బోల్తాపడిన దృశ్యాన్ని అదే మార్గంలో వస్తున్న అతడి స్నేహితులు చూసినట్లు తెలిసింది. ఆటోను పక్కకు జరి పి దాని కిందన ఉన్న అరుణ్ను పరిశీలించగా ఎలాంటి చలనం లేకపోవడంతో భయపడిన ఆ యువకులు ఎవరికి చెప్పకుండా మరో మార్గం నుంచి ఇంటికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. కాగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఈ విందు ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అరుణ్తోపాటు న్యూఇయర్ వేడుకల్లో పాల్గొన్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విచారణ చేçస్తున్నాం.. అరుణ్ మృతిపై విచారణ చేపడుతున్నట్లు ఎస్పై సుధాకర్ తెలిపారు. వివిధ కోణాల్లో విచారిస్తున్నట్లు చెప్పారు. ఆటో బోల్తాపడడంతో అరుణ్ మృతిచెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. –సుధాకర్, ఎస్సై -
క్రిస్మస్కు వచ్చి.. కానరాని లోకాలకు
బచ్చన్నపేట: కిస్మస్ వేడుకలకు వచ్చిన ఇద్దరు విద్యార్థులకు అవే చివరి గడియలయ్యాయి. ఆడు తూ పాడుతూ పలకరించిన ఆ బాలురు లేరనే సరికి గ్రామస్తులంతా కన్నీరు మున్నీరయ్యారు. కుంటలో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కేసిరెడ్డిపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరుకు చెందిన బంగారు రాజు, హైదరాబాద్ మల్కాజిగిరికి చెందిన ఏసురాజులను హైదరాబాద్లోని మల్కాజిగిరిలోని ఫీచర్ ఫౌండేషన్ అనాథాశ్రమంలో చదువుల నిమిత్తం చేర్పించారు. వీరిద్దరికి తండ్రులు లేరు. తల్లులు పలువురు ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మృతులు ఏసు రాజు (12) 7వ తరగతి, బంగారి రాజు(15) 9వ తరగతి చదువుతున్నారు. బచ్చన్నపేట మండలంలోని కేసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కంత్రి బాపురాజు, ప్రశాంత్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి నిరుపేద విద్యార్థులు పడుతున్న కష్టాలను చూడలేక 2004 సంవత్సరంలో ఫీచర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. అప్పటి నుంచి పలువురు నిరుపేద విద్యార్థులను చేర్పించుకొని వారికి విద్యా బుద్ధులను నేర్పించి ప్రయోజకులను చేస్తున్నారు. వారు ప్రతి సంవత్సరం సొంత గ్రామమైన కేసిరెడ్డిపల్లికి క్రిస్టమస్ పండుగకు వచ్చి నిరుపేదలకు దుప్పట్లను, పాఠశాల విద్యార్థులకు బుక్కులను, పెన్నులను ఉచితంగా పంపిణీ చేస్తారు. అదే క్రమంలో కేసిరెడ్డిపల్లికి 30 మంది విద్యార్థులతో వచ్చిన బృంద సభ్యులు శుక్రవారం నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఆ బృందంలోని ఇద్దరు బంగారి రాజు, ఏసురాజులు స్నానం చేయడానికి గ్రామ చివర ఉన్న మల్లంకుంట్లకు వెళ్లారు. ఇటీవల మిషన్ కాకతీయ పథకంలో చెరువు మరమ్మతు పనులను చేయడంతో చెరువును లోతుగా తవ్వారు. ఆ గుంతలోకి వెళ్లిన ఇద్దరు రాజులు ఒకరి కొకరు చేతులను అందించుకొని నీటిలో మునిగారు. వీరితో పాటు స్నానానికి వచ్చిన ఇమ్మానియేల్ అనే విద్యార్థి వారిని బయటకు లాగడానికి చేతిని అందించేందుకు ప్రయత్నం చేసినా లాభం లేక పోయింది. ఈ విషయాన్ని బృంద సభ్యులకు తెలుపగా వారంతా పరుగు పరుగున వచ్చే సరికే వారు మునిగి పోయారు. విషయాన్ని పోలీసులకు తెలుపగా ఘటనా స్థలానికి నర్మెట సీఐ మల్లేష్ యాదవ్, ఎస్సై రంజిత్రావు వచ్చి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం
కమలాపూర్(హుజూరాబాద్): వివాహేతర సంబంధానికి అడ్డు రావడమే కాకుండా ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్తూ పరువు తీస్తున్నాడన్న కక్షతోనే కమలాపూర్కు చెందిన బైరి విజయ్కుమార్ అనే యువకుడు దుస్తులు వ్యాపారి బైరి రాజనర్సును బండరాయితో తలపై మోది దారుణంగా హత్య చేశాడని, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కాజీపేట ఏసీపీ కె.నర్సింగ్రావు తెలిపారు. కమలాపూర్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. కమలాపూర్లో సెల్ షాపు నడుకునే విజయ్కుమార్ గత కొంత కాలంగా కమలాపూర్కే చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. రెండు నెలల క్రితం రాజనర్సు వారిద్దరు కలిసి ఉండగా చూసి విషయాన్ని విజయ్కుమార్ తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో విషయం కాస్తా బయటకు పొక్కింది. దీంతో విజయ్కుమార్ రాజనర్సు కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే రాజనర్సు సదరు మహిళను బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో రాజనర్సును కొట్టాలని, అవసరమైతే హత మార్చాలని విజయ్కుమార్ నిర్ణయించుకున్నాడు. అప్పటికే రాజనర్సు విజయ్కుమార్కు కొంత మొత్తం డబ్బులు బాకీ ఉండగా ఆ డబ్బులు ఇవ్వాలని ఈ నెల 18న రాత్రి ఫోన్ చేయగా 8 గంటల ప్రాంతంలో రాజనర్సు వచ్చి విజయ్కుమార్కు రూ.120, ఆ పక్కనే ఉన్న మరో దుకాణాదారుడికి కొన్ని డబ్బులు ఇచ్చి పోతున్న క్రమంలో అతన్ని విజయ్కుమార్ పిలిచి తనకు మందు తాగించాలని కోరడంతో రాజనర్సు సరేనన్నాడు. చెరువు కట్టపై నుంచి రాజనర్సును ద్విచక్ర వాహనం ఎక్కించుకుని పెద్ద తూము వద్దకు వెళ్లారు. చెరువు తూములో కూర్చుని మందు సేవిస్తున్న క్రమంలో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ప్రస్తావ వచ్చింది. దీంతో తీవ్ర వాగ్వాదం చేసుకుంటూ చెరువుకట్టపైకి వచ్చారు. కోపంతో ఉన్న విజయ్కుమార్ అక్కడే ఉన్న ఓ బండరాయితో కొట్టగా రాజనర్సు తల వెనుక భాగంలో తగిలి కింద పడిపోయాడు. ఆ తర్వాత అదే బండరాయితో నుదుటి పైభాగంలో బలంగా మోది చంపాడు. అనంతరం శవాన్ని చెరువు కట్టపై నుంచి ఈడ్చుకెళ్లి పెద్దతూముపై ఉంచాడు. ఈ హత్యకు సంబంధించి ఘటన స్థలంలో ఎలాంటి ఆధారాలు దొరుకనప్పటికీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరికి ఒక ఫోన్ కాల్ డాటా ఆధారంగా నిందితుడిని గుర్తించామని వివరించారు. అతడి వద్ద నుంచి ద్విచక్ర వాహనం, మొబైల్ తదితర వస్తువులు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ హత్యా ఘటనలో నిందితుడిని చాకచక్యంగా గుర్తించి, పట్టుకున్న స్థానిక ఇన్స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్, సహకరించిన ఎస్సైలు సూర్యప్రకాష్, టీవీఆర్ సూరి, పోలీసు సిబ్బందిని సీపీ రవీందర్, ఏసీపీ అభినందించారు. -
218 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నెల్లికుదురు (మహబూబాబాద్) : 218క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుకుని లారీ సీజ్ చేసి 15మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో తొర్రూర్ డీఎస్పీ జి.మదన్లాల్, సీఐ వి.చేరాలు, ఎస్సై పెండ్యాల దేవేందర్లతో కలసి మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. నెల్లికుదురు, చిన్నగూడూరు, నర్శింహులపేట మండలాల్లో పోలీసులు అలర్ట్గా ఉన్నప్పటికీ రేషన్ బియ్యం, ఇసుక అక్రమ దందాలు నిర్వహిస్తున్నారని వారిపై ప్రత్యేక నిఘా పెంచనున్నట్లు తెలిపారు. మండలంలోని శ్రీరామగిరి, వావిలాల, బంజర, ఆలేరు గ్రామాలల్లోని రేషన్ డీలర్లు తండ్రీకొడుకులు సంద సీతయ్య, కుమారుడు సంద అనిల్ (ఇద్దరు), ఆవుల సంధ్యారాణి, భర్త వెంకటనర్సయ్య (ఇద్దరు), గట్టు వేణు, బాద ఉప్పలయ్యల, గొట్టె నర్సయ్యలతో మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామానికి చెందిన బానోతు రాములు, వేముల రామారావు, జంగిలిగొండకు చెందిన కొయ్యాల కొమురెల్లి, వావిలాల గ్రామానికి చెందిన మార్త యుగేందర్, ఓ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న గోగుల ప్రశాంత్(సాక్షికాదు), శామకూరి వెంకన్న, చిన్నముప్పారం గ్రామానికి చెందిన ఒబిలిశెట్టి నర్సయ్య, ఈస్ట్గోదావరి జిల్లా అద్దెటిగల్ మండల కేంద్రానికి చెందిన గొలుసు శ్రీనివాసరావులు కుమ్మకై పీడీఎస్ బియ్యాన్ని వివిధ గ్రామాల్లో సేకరించినట్లు తెలిపారు. సేకరించిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు నెల్లికుదురు ఎస్సై పెండ్యాల దేవేందర్కు వచ్చిన సమాచారంతో పోలీసు సిబ్బందితో కలసి వెళ్లి మండల కేంద్రంలోని క్రాస్ రోడ్ వద్ద వాహానాల తనిఖీ నిర్వహిస్తుండగా 218క్వింటాళ్ళ లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్, మరో వ్యక్తి పోలీసులను చూసి పారిపోతున్నారని తెలిపారు. వారిని పట్టుకుని విచారించి తనిఖీ చేయగా లారీలో రేషన్ బియ్యం ఉన్నట్లు తెలిపారు. రేషన్ బియ్యం లోడు లారీని సీజ్ చేసి, 15 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బానోతు రాములు, సంద అనిల్, అవుల వెంకటనర్సయ్య (ఇద్దరు), గట్టు వేణు, బాద ఉప్పలయ్యల, ఒబిలిశెట్టి నర్సయ్య, గొలుసు శ్రీనివాసరావు ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మిగిల వారు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించి రెండోసారి భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఎస్సై దేవేందర్, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. రివార్డులు అందజేస్తామని తెలిపారు. బియ్యం వ్యాపారంలో డీలర్లు ఉండటం విచారకరం ప్రభుత్వ సొమ్ము తింటూ రేషన్ బియ్యం దందాలో నలుగురు డీలర్లు, వారి కుటుంబ సభ్యులు ఇద్దరు ఉండడం విచారకరమని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. ఈ వ్యాపారంలో ఎంతటివారు ఉన్నా వదిలిపెట్టేది లేదని, రేషన్ డీలర్లపై, అక్రమ వ్యాపారంలో అరెస్టు అయిన వారిపై పీడీయాక్టును ఉపయోగించేందుకు నివేదికను కలెక్టర్కు అందిస్తామన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
గణపురం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామంలో చోటు చేసుకుంది. గణపురం ఎస్సై గోవర్థన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుందయ్యపల్లె గ్రామానికి చెందిన బిల్లా రాంరెడ్డి(52) శనివారం సాయంత్రం పని మీద చెల్పూరు గ్రామానికి వెళ్లాడు. రాత్రి సమయంలో ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతడి కోసం వెతికారు. కాని ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉద యం చెల్పూరు గ్రామంలోని అన్నపూర్ణ సినిమా థియేటర్ వెనుక ప్రాంతంలోని మర్రి చెట్టు కింద రాంరెడ్డి మృతి చెంది ఉన్నాడని తెలిసింది. రాంరెడ్డి తలకు బలమైన గాయం తగిలి తీవ్ర రక్తస్రావం జరిగి వుండడంతో ఎవరైన తలపై బండ రాళ్లతో నైనా, లేద కర్రలతో నైన కొట్టి చంపి ఉంటారా లేదా రాంరెడ్డి మద్యం సేవించి ఇంటికి వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బండరాయి పై జారి పడి తీవ్ర రక్త స్రావం జరిగి మృతి చెందాడా అనే అనుమానాలు ఉన్నాయని ఎస్సై తెలిపారు. రాంరెడ్డి వివాద రహితుడని అతనిని చంపాల్సిన అవసరం ఎవరికి లేదని గ్రామస్తులు అంటున్నారు. మృతుడికి భార్య స్వరూప, ఒక కూతురు వున్నారు. మృతుడు భార్య స్వరూప తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి వుండవచ్చని ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఘటన స్థలాన్ని క్లూస్టీం, డాగ్స్క్వాడ్లతో తనిఖీ చేయించారు. ములుగు డీఎస్పీ విజయ పార్థసారధి, సీఐ సార్ల రాజు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మెడికల్ రిపోర్టు ఆధారంగా రెండురోజుల్లో కేసు వివరాలు వెల్లడి కానున్నాయి. -
ఏసీబీ వలలో ఇరిగేషన్ ఇంజినీర్లు
వరంగల్ క్రైం: రూ. 1.5లక్షలు లంచం తీసుకుంటూ ఇరిగేషన్ ఇంజినీర్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన నగరంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...మిషన్ కాకతీయ పనుల్లో వర్ధన్నపేట మండలం కొనారెడ్డి చెరువు మరమ్మతు పనులను టెండర్ ద్వారా సాధించుకున్న కాంట్రాక్టర్ గంకిడి శ్రీనివాస్రెడ్డి నుంచి ఎస్టిమేట్ కోసం వరంగల్ ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయంలో పనిచేసే టెక్నికల్ డీఈ వాంసని రఘుపతి, ఏఈ గాడిపెల్లి గౌరిలక్ష్మీలు డబ్బులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంగళవారం కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సందర్భంగా వరంగల్ రేంజ్ డీఎస్పీ కె.భద్రయ్య అధికారులు పట్టుబడిన వివరాలను వెల్లడించారు. వర్ధన్నపేట మండలంలోని కోనారెడ్డి చెరువు పనులకు అవసరమైన డిటేల్ ఎస్టిమేట్ కోసం ఎస్ఈ కార్యాలయంలో పనిచేసే టెక్నికల్ డీఈ–1 వాంసని రఘుపతి డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిపారు. రూ.2.25 కోట్ల చెరువు పనిని టెండర్ ప్రక్రియ ద్వారా దక్కించుకుంటే ఆ డబ్బులలో నుంచి 1 శాతం(రూ.2.25లక్షలు) డబ్బులు ఇస్తానే...ఎస్టిమేట్ ఇస్తామని డిమాండ్ చేసినట్లు తెలిపారు. కాంట్రాక్టర్ గంకిడి శ్రీనివాస్రెడ్డి పలు మార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఎస్టిమేట్ ఇవ్వలేదని దీంతో ఆయన ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టెక్నికల్ డీఈ రఘుపతితో కాం ట్రాక్టర్ మాట్లాడి రూ.1.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. దీంతో సదరు కాంట్రాక్టర్ మంగళవారం మధ్యాహ్నం ఫోన్లో డీఈ రఘుపతితో మాట్లాడగా ఏఈ గాడపెల్లి గౌరిలక్ష్మీకి డబ్బులు ఇవ్వాలని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. కాం ట్రాక్టర్ శ్రీనివాస్రెడ్డి కార్యాలయంకు వెళ్లి నేరుగా ఏఈ గౌరిలక్ష్మీ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు డీఎస్పీ భద్రయ్య తెలిపారు. కోర్టులో హాజరుపరుస్తాం... ఏసీబీకి చిక్కిన డీఈ రఘుపతి, ఏఈ గౌరిలక్ష్మీలను అరెస్టు చేసి వారి నుంచి రూ.1.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని హైదరబాద్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ భద్రయ్య తెలిపారు. దీంతో పాటు డీఈ రఘపతికి సంబంధించిన దేశాయిపేట, గిర్మాజీపేటలో ఉన్న ఇండ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదా యంకు మంచి ఆస్తులు ఉన్నట్లు వెలువడితే మరో కేసు కూడా నమోదు అవుతుందని తెలిపారు. ఈ దాడులలో ఇన్స్పెక్టర్లు వాసల సతీష్, వెంకట్, సిబ్బంది పాల్గొన్నారు. ఇంజినీరింగ్ శాఖలపై నిఘా వరంగల్ ఏసీబీ అధికారులకు వచ్చిన ఫిర్యాదుతో స్పందించిన అధికారులు రంగంలోకి దిగి ఇంజినీరింగ్ శాఖలపై పెద్ద ఎత్తున నిఘా ఉంచారు. అవినీతికి ఆస్కారం ఉన్న ఇంజనీరింగ్ శాఖలో ఇటీవల ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఆర్ అండ్ బీ ఏఈ కోటేశ్వర్రావును పట్టుకున్న మూడు నెలల్లోనే మరో ఇద్దరు ఇంజినీరింగ్ అధికారులు పట్టుబడటం ఇంజినీరింగ్ శాఖల్లో కలకలం రేపుతోంది. కాంట్రాక్టు పనులకు బిల్లులు చేయటానికి అధికారులు పెద్ద మొత్తంలో పర్సంటేజీలు డిమాండ్ చేయడం, సకాలంలో బిల్లులు రాకపోవడం, కాళ్లకు ఉన్న చెప్పులు అరిగేలా తిరుగుతున్న అధికారులు కనికరం చూపకపోవడంతో కాంట్రాక్టర్లు ఏసీబీ అధికారులను అశ్రయిస్తున్నారు. మిషన్ కాకతీయ పనులతో పాటు మిషన్ భగీరథ« పనులు చేస్తున్న ఇంజినీరింగ్ అధికారులపై ఏసీబీ దృష్టి సారించినట్లు సమాచారం. దీంతో పాటు పంచాయతీరాజ్ కార్యాలయంలో కొంత మంది అధికారులు బహిరంగంగా డబ్బులు డిమాండ్ చేసిన విషయం ఏసీబీ అధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. -
మద్యం మత్తులో ఎస్సైని దూషించి.. వీరంగం
నల్లబెల్లి: మద్యంమత్తులో పోలీస్స్టేషన్ ఎదుట ఇద్దరు యువకులు శనివారం అర్థరాత్రి వీరంగం సృష్టించిన సంఘటన రూరల్ జిల్లా నల్లబెల్లి పోలీస్స్టేషన్లో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఎస్సై నరేందర్రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి ఆదివారం అర్థరాత్రి పెట్రోలింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని రాంతీర్థం శివారు బిల్నాయక్తండాకు చెందిన మాలోత్ నమ్కు, మాలోత్ రాజా రతన్సింగ్లతో పాటు మరికొందరు శనిగరం క్రాస్ రోడ్డు జాతీయ రాహదారి సమీపంలో పబ్లిక్ ప్లేస్లో మద్యం సేవిస్తూ కనిపించారు. పోలీస్ వాహనంలో ఎస్సైతో పాటు పోలీస్ సిబ్బంది అక్కడి వెళ్తున్న క్రమంలో కొందరు యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నమ్కు, రాజారతన్సింగ్లు మాత్రం అక్కడే నిలుచున్నారు. ఇంతరాత్రి ఇక్కడ ఎందుకు ఉన్నారని వారిని పోలీసులు ప్రశ్నిస్తూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో మద్యంమత్తులో ఉన్న యువకులు ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. పబ్లిక్ ప్లేసులో మద్యం తాగినందుకు కేసు నమోదు చేస్తామని ఎస్సై వారికి తెలియజేస్తూ అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న యువకులు పోలీస్ వాహనాన్ని ద్విచక్రంపై వెంబడిస్తూ పీఎస్కు చేరుకొని సుమారు రెండుగంటల పాటు ఎస్సైతో పాటు పోలీసులపై పరుషపదజాలాన్ని ఉపయోగిస్తూ దూషించారు. ఎస్సై, పోలీసులు క్షమాపన చేప్పేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని హంగామ సృష్టించారు. ఫ్రెండ్లీ పోలీస్ కావడంతో చేసేది ఎమిలేక చూస్తూ ఉండి పోయారు. కేసు నమోదు స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, అసభ్య పదజాలంతో దూషించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేందర్రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బిల్నాయక్తండా గ్రామానికి చెందిన మాలోత్ నమ్కు, మాలోత్ రాజా రతన్సింగ్లు మద్యంమత్తులో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల విధులకు ఆటంకపరుస్తూ అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
అయ్యో.. రైతన్నా
ఆరుగాలం కష్టం చేసి జీవించే రైతన్నకు అడుగడుగునా సమస్యలే ఎదురవుతున్నాయి. ఏ పనిచేయాలన్నా ప్రాణాల మీదకే వస్తున్నాయి. కొందరు ప్రమాదవశాత్తు చనిపోతుండగా కొందరు చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. శుక్రవారం అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడగా దుక్కి దమ్ము చేసి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి ఓ రైతు మృతిచెందాడు. అప్పుల బాధతో.. గణపురం: చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జయశంకర్ జిల్లా గణపురం మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గణపురం మండల కేంద్రానికి చెందిన పాశికంటి రాజయ్య(45) తనకున్న కొద్దిపాటి భూమితో పాటు నాలుగెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడికి తెచ్చిన అప్పులు పెరిగాయి. పంట దిగుబడి రాక అప్పులు తీర్చలేక శుక్రవారం తన చేను వద్దకు వెళ్లాడు. ఎవరూ లేని సమయంలో క్రిమీ సంహారక మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. సమీప వ్యవసాయ భూముల్లో ఉన్న రైతులు గమనించి 108కు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం ములుగు సివిల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో రాజయ్య మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతుడికి భార్య సుగుణ, కుమార్తె , కుమారుడు ఉన్నారు. పురుగు మందు తాగి .. గార్ల(ఇల్లందు): ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగు మందు సేవించి ఓ రైతు మృతిచెందిన సంఘటన శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పూమ్యా తండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గార్ల మండలం పూమ్య తండాకు చెందిన ఇస్లావత్ పంతు(46) కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పత్తి చేను కోసం తెచ్చిన పురుగు మందు సేవించి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇరుగు పొరుగు వారు చూసి హుటాహుటిన పంతును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందా డు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం. కుమారుడు కల్యాణ్ ఫిర్యాదు మేరకు ఏఎస్సై యాకుబ్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి కొత్తగూడ(ములుగు): ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి చెందిన సంఘటన కొత్తగూడ మండలం కోనాపురంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతిరెడ్డి కిషన్రెడ్డి తనకున్న జాన్డీయర్ ట్రాక్టర్కు రోటోవేటర్తో నారుమడి దమ్ముచేసి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి పక్కన ఉన్న గుంతలోకి ఒక టైర్ దిగడంతో ఒకవైపు బోల్తాపడింది. ఘటనలో కిషన్రెడ్డి తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సరిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న పద్దర్మ మంత్రి చందూలాల్ తనయుడు ధరంసింగ్ ఘటనా స్థలం వద్దకు చేరుకుని పరామర్శించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్సై తాహెర్బాబా తెలిపారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి దీక్ష
ఎల్కతుర్తి : తనను శారీరకంగా వాడుకుని తీరా పెళ్లి చేసుకొమ్మంటే తప్పించుకు తిరుగుతున్న ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు దీక్షకు దిగిన సంఘటన బుధవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శ్రీపతి శ్వేత ఇంటర్ చదివే రోజుల్లో అదే మండలానికి చెందిన సట్ల సుధీర్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్వేత హైదరాబాద్లోని ఓ బ్యూటీషియన్ సంస్థలో సభ్యురాలిగా పని చేస్తోంది. సుధీర్ సైతం హెచ్డీఎఫ్సీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరూ హైదరాబాద్లో ఓ అద్దె గదిలో సహజీవనం చేస్తున్నారు. గదిలోనే తాళి సైతం కట్టాడని శ్వేత తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో పెద్ద మనుషులు కలుగజేసుకుని పెళ్లి కోసం ప్రయత్నాలు చేశారు. దీనికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజుల క్రితం తాను లేని సమయంలో గదిలోకి ఎవరో యువకుడు వచ్చాడంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, తనను అనుమానిస్తూ గొడవపడ్డాడని.. అప్పటి నుంచి తాను పెళ్లి చేసుకోనంటూ తప్పించుకు తిరుగుతున్నాడని స్వేత బోరున విలపించింది. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు.పెద్ద మనుషులు సైతం పట్టించుకోలేదు. దీంతో తాను ప్రియుడి ఇంటి ఎదుట దీక్షకు దిగినట్లు తెలిపింది. బాధితురాలి మౌనపోరాటానికి మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. ఇదిలా ఉండగా సుధీర్ తండ్రి మల్లయ్య తనను ఓ విలేకరి రూ. 5లక్షలు ఇస్తే సముదాయిస్తానని, లేకుంటే ఇంటి ముందు బైఠాయిస్తుందని చెప్పాడని, తాను డబ్బులు ఇవ్వకపోవడంతో అనుకున్న ప్రకారం ఇలా జరిగిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం. -
పిల్లలు కావడం లేదని భార్యను...
నల్లబెల్లి: మూడుముళ్లు వేసి కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. పిల్లలు కావడం లేదని కట్టుకున్న భార్య చిక్కుడు అశ్విని(25)ని భర్త ముకేష్ హత్య చేసిన సంఘటన ఆలస్యంగా మండలంలోని బోల్లోనిపల్లిలో గురువారం వెలుగుచూసింది. మృతురాలి తల్లిదండ్రులు ఉస్తం భద్రమ్మ, వెంకటయ్య, సోదరుడు అశోక్ల కథనం ప్రకారం... పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన భద్రమ్మ, వెంకటయ్య దంపతుల కుమార్తె అశ్వినిని ఆరేళ్ల క్రితం మండలంలోని బోల్లోనిపల్లి గ్రామానికి చెందిన చిక్కుడు ముకేష్కు ఇచ్చి వివాహం చేశారు. వీరి దాంపత్య జీవితం రేండేళ్ల వరకు సజావుగానే సాగింది. కుల వృత్తిలో భాగంగా కాటిపాపల కథలు చెబుతూ జీవనం కొనసాగించేవారు. పిల్లలు కావడం లేదని ఆస్పత్రులు తిరుగుతున్నారు. అశ్విని గర్భసంచిలో లోపం ఉండడంతో పిల్లలు కావడం లేదని వైద్యులు చెప్పడంతో రెండేళ్లుగా ముకేష్తో పాటు కుటుంబ సభ్యులు వేధిస్తున్నారు. కుల వృత్తిలో భాగంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని రాయిగూడెంకు కథలు చెప్పేందుకు అశ్విని, ముకేష్ దంపతులు వెళ్లారు. ఈ క్రమంలో పిల్లలు కావడం లేదు బంధువుల అమ్మాయిని రెండో పెళ్లి చేసుకొంటానని అశ్వినితో గొడవపడి భర్తతో పాటు అతని బంధువులు కలిసి మంగళవారం కొట్టిచంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. రాయిగూడెంలో చంపిన తమ బిడ్డను గుట్టుచప్పుడుగా బోల్లోనిపల్లికి తీసుకవచ్చి దహన సంస్కారాలు చేసేందుకు ప్రయత్నించిన అత్తింటివారిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులను వేడుకుంటున్నారు. ఈ మేరకు ఎస్సై నరేందర్రెడ్డిని వివరణ కోరగా మృతదేహాన్ని తీసుకొని సంఘటన జరిగిన నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేయాలని మృతురాలి బంధువులకు సూచించడంతో మృతదేహాంతో వారు అక్కడికి వెళ్లారని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఆత్మకూరు(పరకాల): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన సంఘటన దామెర మండలం ఒగ్లాపూర్ సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... దుగ్గొండి మండలం లక్ష్మిపురంకు చెందిన గద్దల వినోద్(25), మంద శ్యామ్సుందర్, సింగారపు ప్రణయ్, ఆత్మకూరు మండలం పెంచికలపేటకు చెందిన డ్రైవర్ కలకోటి సుమన్(21) పెంచికలపేటలో ఓ ఫంక్షన్కు హాజరై తిరిగి వరంగల్కు కారులో వెళ్తున్నాడు. కారును ఒగ్లాపూర్లోని పవర్గ్రిడ్ సమీపంలో ఎదురుగా ములుగు వైపు వెళుతున్న లారీ ఢీకొట్టడంతో కారు డ్రైవర్ సుమన్, గద్దల వినోద్లు అక్కడికక్కడే మృతిచెందగా మంద శ్యామ్సుందర్కు తలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్కు తరలించారు. అలాగే సింగారపు ప్రణయ్కు గాయాలు కాగా స్థానికంగా చికిత్స పొందుతున్నాడు. గద్దల వినోద్ స్వేరోస్ శిక్షణా కేంద్రంలో పనిచేస్తున్నాడు. సుమన్, శ్యామ్సుందర్ మృతి పలువురిని కలచివేసింది. ఎస్ఐ భాస్కర్రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఓనర్ ఇంటి ముందు ఆందోళన.. పెంచికలపేటకు చెందిన కారుడ్రైవర్ కలకోటి సుమన్ మృతదేహంతో పెంచికలపేటకు చెందిన కారు యజమాని పసుల రాజేష్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. రాజేష్ కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన కొనసాగుతోంది. కారు యజమానిపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. -
భార్యను చంపిన భర్త..ఆత్మహత్య
సాక్షి, కరీమాబాద్: భార్యను గొడ్డలితో నరికి తాను సమీపంలోని రైలు పట్టాలపై రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలోని అండర్ రైల్వేగేట్ 23వ డివిజన్ ఎస్ఆర్ఆర్ తోటలోని హనుమాన్ గుడి వీధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. మిల్స్కాలనీ పోలీసులు, కుటుంబ సభ్యుల, స్థానికుల కథనం ప్రకారం... ఎస్ఆర్ఆర్తోటలో చాలా కాలంగా ఊగ చిన్న,కన్నమ్మ దంపతులతో పాటు కుటుంబ సభ్యులు కిరాయి ఇంట్లో ఉంటున్నారు. ఉగ చిన్న (57)తాగుడుకు బానిసయ్యాడు. ప్రతిరోజూ తన భార్య కన్నమ్మ(52)తో గొడవకు దిగడంతో పాటు కొట్టేవాడు. ఈ క్రమంలో శుక్రవారం తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కన్నమ్మను మద్యం మత్తులో ఉన్న చిన్న అతి కిరాతరంగా కన్నమ్మను గొడ్డలితో తలపై నరికి చంపాడు. అక్కడి నుంచి పారిపోయిన చిన్న సమీపంలోని రైల్వే ట్రాక్పైకి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాళం చెవి కోసం మనవరాలు ప్రియదర్శిని కన్నమ్మ చనిపోయి ఉన్న విషయాన్ని చూసి వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ లోగా మిల్స్కాలనీ సీఐ దయాకర్, ఎస్సై భీమేష్తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు తీసుకుని పంచనామా చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. అదే విధంగా వరంగల్ జీఆర్పీ పోలీసులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న చిన్న మృతదేహాన్ని సైతం ఎంజీఎంకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇదిలా ఉండగా కన్నమ్మ–చిన్నలకు నాగలక్ష్మి, శ్రీలత, లావణ్య, శివ ఉన్నారు. కుమారుడు ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడని స్థానికులు చెబుతున్నారు. మిన్నంటిన కూతుళ్ల రోదనలు అటు తల్లిని చంపి, ఇటు తండ్రి కూడా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో వారి కూతుర్లు నాగలక్ష్మి, లావణ్యల రోదనలు మిన్నంటాయి. తన తల్లి తమను పండ్లు, కూరగాయలు, కంకులు అమ్మి సాదుకుందని, తమకు ఎలాంటి లోటు లేకుండా పెంచిందని ఏడుస్తూ గుర్తు చేశారు. తమ తండ్రి చిన్న తాగుడుకు బానిసై తమ కుటుంబాన్ని ఏనాడు పట్టించుకోలేదని బోరున విలపించారు. -
హిజ్రాపై ప్రియుడి హత్యాయత్నం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఓ హిజ్రాతో సహజీవనం చేస్తున్న ప్రియుడు కత్తితో గొంతు కోసి హత్యా యత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, హిజ్రా అమ్మమ్మ బానోతు జంకు కథనం ప్రకారం... బానోత్ రాధిక అనే హిజ్రాకు, మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచ గ్రామ శివారు కొత్తతండాకు చెందిన ధరావత్ సురేష్తో కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి మహబూబాబాద్ పట్టణంలోని హనుమంతరావు స్థూపం సమీపంలో అద్దె ఇంట్లో ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే డబ్బులు కావాలని సురేష్ కొద్ది నెలలుగా రాధికను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో ఆమె రూ.లక్ష ఇచ్చింది. ఆతర్వాత కూడా మరో రూ.లక్ష కావాలని వేధింపులకు గురిచేస్తుండటంతో మళ్లీ రూ.లక్ష ఇచ్చింది. ఆతర్వాత మళ్లీ రూ.3లక్షలు కావాలంటూ వారం రోజులుగా వేధిస్తున్నాడు. డబ్బులు లేవని చెబుతుండటంతో బానోత్ రాధికను దూషిస్తూ చితకబాదుతున్నాడు. సురేష్ తల్లి సాలి కూడా మూడు రోజుల క్రితం వచ్చి డబ్బులు ఇవ్వకపోవడంపై దూషించింది. ఈ క్రమంలో సురేష్ హిజ్రా రాధికను వేధిస్తూనే రాత్రి ఆమె అమ్మమ్మ బానోతు జంకు నోట్లో గుడ్డలు కుక్కి ఓ గదిలో పడేశాడు. తర్వాత హిజ్రా రాధికను కత్తితో గొంతుకోసి చంపేందుకు యత్నించాడు. దీంతో ఆమె గొంతుపై, కుడి కన్ను భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె గట్టిగా కేకలు వేయడంతో పక్కింట్లో నివసిస్తున్న శ్రావణి, భర్త కమల్ రాగా సురేష్ పరారయ్యాడు. ఈ ఘటనకు ధరావత్ సురేష్, అతడి అన్న నరి, తల్లి సాలీ, తండ్రి వీరన్న కారణమని హిజ్రా రాధిక అమ్మమ్మ బానోత్ జంకు పేర్కొంది. వెంటనే రాధికను మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. మానుకోట టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడు సురేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ ఎస్.రవికుమార్ తెలిపారు. -
విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
గూడూరు(మహబూబాబాద్): విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మృత్యువాత పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో వేర్వేరు చోట్ల జరిగింది. ఎస్సై ఎస్కే.యాసిన్ కథనం ప్రకారం... బొద్దుగొండకు చెందిన అయిలి విజయ్(25) తండ్రి పుల్లయ్యతో కలిసి గ్రామ శివారులోని వరి పొలానికి నీరు పారించేందుకు సోమవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. విజయ్ విద్యుత్ మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. ఇది చూసిన తండ్రి కేకలు వేయడంతో సమీపంలోని రైతులు వచ్చి మానుకోట ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ కొద్ది సేపటికే మృతిచెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, మట్టెవాడ శివారు పరికల తండాలో ఆదివారం రాత్రి బానోతు భీంసాగర్(20) సమీపంలోని పంట పొలానికి నీరు పారించడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. పొలంలోని ఓ గట్టుపై స్తంభానికి మినీ ట్రాన్స్ఫార్మర్ ఉంది. దాని సప్లయ్ రాడ్ను పక్కకు తిప్పే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సీఐ బాలాజీ, ఎస్సై యాసిన్ సోమవారం వెళ్లి పరిశీలించారు. విద్యుత్ శాఖ ఏఈ వివరాలు సేకరించారు. మృతుడి తల్లి బానోతు సోనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఇంటికి నిప్పు..
కమలాపూర్(హుజూరాబాద్): గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంటికి నిప్పం టించగా ద్విచక్రవాహనంతోపాటు తలుపులు, కిటికీలు, ఇంట్లోని సామగ్రి మొత్తం దగ్ధమైన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని దేశరాజుపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. నద్దునూరి సమ్మయ్య ఇంట్లోకి రెండు నెలల క్రితం ఉడుము వచ్చింది. దీంతో మూడు నెలల పాటు ఇల్లు వదిలి పెట్టాలనడంతో రెండు నెలలుగా హన్మకొండలో నివాసం ఉంటున్నాడు. కాగా సోమవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి పొగలు, మంటలు వస్తున్నాయని చుట్టుపక్కల వారు ఫోన్ చేసి చెప్పగా అతడు గ్రామానికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పేశారు. అప్పటికే ఇంటి తలుపులు, కిటికీలు, ఇం ట్లోని పల్సర్ ద్విచక్రవాహనం, రెండు బీరువాలు, రెండు డెకోలం మంచాలు, ఒక కుట్టుమిషన్, కూలర్, టీవీ, బీరువాలోని ఐదు తులాల బంగా రు ఆభరణాలు, దుస్తులు, సర్టిఫికెట్లు తదితర సామాగ్రి కాలిబూదిదైంది. సుమారు రూ.5లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత కుటుం బీకులు బోరున విలపించారు. పథకం ప్రకారమేనా? దగ్ధమైన సమ్మయ్య ఇంటి ఆవరణను పరిశీలిస్తే పథకం ప్రకారమే ఇదంతా చేసినట్లుగా బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ఆవరణలో పడి ఉన్న కట్టర్, ప్రధాన ద్వారానికి బిగించిన బెడెం తెగి ఉన్నాయి. కట్టర్తో బెడం కట్ చేసిన దుండగులు ఇంట్లోకి వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించి ఉంటారని భావిస్తున్నారు. దిలీప్పై అనుమానం.. దేశరాజుపల్లి గ్రామంలోనే ఎల్లబోయిన దిలీప్ ఈ పనికి ఒడిగట్టి ఉంటాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దిలీప్, తన కూతురు సుమారు ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, ఆ తర్వాత గొడవలు జరగడంతో పెద్దల తీర్పు మేరకు తన కూతురుకు కొంత మొత్తం డబ్బులు చెల్లించి ఏడాది క్రితం విడాకులు తీసుకున్నారన్నారు. తన నుంచి డబ్బులు వసూలు చేశారని మనసులో పెట్టుకొన్న దిలీప్ తన స్నేహతుడు శ్రీనివాస్తో కలిసి తాము ఇంట్లో లేని సమయం చూసి ఇదే అదనుగా భావించి తమ ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించి దహనం చేసి ఉంటాడని సమ్మయ్య, అతడి కూతురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. దేశరాజుపల్లిలో అగ్ని ప్రమాదం జరిగిందనే సమాచారం మేరకు ఎస్సై సందీప్కుమార్ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దగ్ధమైన ఇంటిని పరిశీలించి బాధిత కుటంబీకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. బాధితుడు సమ్మయ్య ఫిర్యాదు మేరకు దిలీప్, అతడి స్నేహితుడు శ్రీనివాస్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
బాలికను బావిలోకి తీసుకెళ్లి.. బాలికపై...
జఫర్గఢ్(స్టేషన్ఘన్పూర్): ఇంటి ముందు నిల్చున్న ఓ బాలికను పక్కింటి యువకుడు బలవంతంగా ఎత్తుకెళ్లి సమీపంలోని పాడుబడిన వ్యవసాయ బావిలో పడేసి, అతడు కూడా అందులో దూకి అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. స్థానికులు చేరుకుని అతడిపై దాడికి యత్నించగా గ్రామంలో ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటన జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బాలిక హన్మకొండలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులు కావడంతో రెండు రోజు ల క్రితమే ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులు శనివారం వ్యవసాయ పనులకు వెళ్లారు. బాలిక మధ్యాహ్నం ఇంటి ముందు నిల్చొని ఉంది. గమనించిన పక్కింటి యువకుడు కేశోజు రాజేష్చారి(23) వచ్చి ఆమెను బలవంతంగా ఎత్తుకుని రోడ్డు అవతలకు వెళ్తుండగా పెద్ద పెట్టున కేకలు వేసింది. విన్న స్థానికులు వస్తుండగా రాజేష్చారి ఆ బాలికను సమీపంలోని పాడుబడిన బావిలో పడేశాడు. అతడు కూడా బావిలో దూకాడు. బాలిక తలకు, కాళ్లకు గాయాలైనప్పటికీ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బావి వద్దకు చేరుకున్న స్థానికులు పైనుంచి అతడిని బెదిరించి బాలికను తాళ్ల సాయంతో పైకి లాగారు. గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం వెంటనే 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న వర్ధన్నపేట ఏసీపీ మధుసూదన్, సీఐ కరుణాసాగర్రెడ్డి నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిపై గ్రామస్తులు దాడికి యత్నించగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ఫైరింజిన్ను కూడా తెప్పించారు. నిందితుడిని ఆస్పత్రికి తరలించే క్రమంలో గ్రామస్తులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. కాగా నిందితుడు రాజేష్చారి ఇంటర్మీడియట్ చదువు ఆపేసి గ్రామంలోని ఇసుక డంపుల వద్ద రోజువారీ కూలిగా పనిచేస్తున్నాడు. అతడితోపాటు కుటుంబ సభ్యులు తరుచూ గొడవ పడేవారని, ఇతరులతో కూడా గొడవలకు దిగేవారని స్థానికులు తెలిపారు. రాజేష్చారిపై కేసు నమోదు ఉప్పుగల్లు గ్రామంలో బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి బావిలో పడేసి అత్యాచార యత్నానికి పాల్పడటంతోపాటు చంపేందుకు యత్నించాడనే ఫిర్యాదు మేరకు నిందితుడు కేశోజు రాజేష్చారిపై కేసు నమోదైనట్లు ఎస్సై వెంకటకృష్ణ శనివారం రాత్రి తెలిపారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేయగా నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి 376, 366, 307 సెక్షన్ల కింద ఫోక్సో యాక్టు ప్రకారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
కొడుకు లేని సమయంలో కోడలిపై మామ..
సాక్షి, గూడూరు (వరంగల్): గూడూరు మండలంలోని రాములు తండా శివారు చిర్రకుంట తండాలో కోడలిపై మామ అత్యాచారయత్నానికి పాల్పడగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాసిన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిర్రకుంటతండాకు చెందిన బానోతు అనితపై ఆమె మామ మంజ్య గత ఆరునెలలుగా తన భర్త ఇంటి వద్ద లేని సమయం చూసి శారీరకంగా లొంగదీసుకునేందుకు యత్నించాడు. ఈ నెల 7వ తేదీ రాత్రి కూడా తన భర్త ఇంట్లో లేని సమయంలో మామ తనపై అత్యాచారయత్నం చేయగా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు చెప్పుకోవాల్సి వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనిత ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ప్రత్యేక నిఘా
వరంగల్ క్రైం: ముందస్తు ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ సమాయత్తం అవుతోంది. పోలింగ్కు సుమారు రెండు నెలల సమయం ఉన్నప్పటికీ పోలీసులు పక్కా ప్రణాళిక తో ముందుకు సాగుతున్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. అభ్యర్థులు.. గెలుపు, ఓటములు, పార్టీలు వాటి ప్రభావంపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు ఉన్నతా ధికారులకు నివేదికలు అందజేస్తున్నాయి. వివాదాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని వరంగల్ కమిషనరేట్ పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 2014లో జరిగిన ఎన్నికల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ముందుస్తుగా పోలీసు ఉన్నత అధికారులు ప్రణాళికలను రూపొందించారు. కమిషనరేట్లోని ప్రతిపోలీస్స్టేషన్ పరిధిలో మాజీ మావోయిస్టులు, రౌడీషీటర్లు, అక్రమ మద్యం విక్రయించి కేసుల పాలైన వారు, ఎన్నికల్లో అల్లర్లు సృష్టించి కేసులు ఉన్నవారు ఇలా.. స్టేషన్ల వారీగా లెక్కలు తీస్తున్నారు. ఒక్కొక్కరిని పిలిచి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా బాధ్యత మీదే అంటూ హెచ్చరికలు చేస్తున్నారు. చెక్ పోస్టుల ఏర్పాటు వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఒక్కో నియోజకవర్గానికి మూడు చెక్పోస్టుల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతీ చెక్పోస్టులో పోలీసు సిబ్బందిని నియమించి ఆయా నియోజకవర్గాలకు వచ్చి పోయే వాహనాలను, వ్యక్తులను తనిఖీ చేస్తున్నా రు. వాహనాలలో పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే వాటి గురించి ఆరా తీస్తున్నారు. డబ్బులకు సంబంధించి సరైన పత్రాలను ఉంటేనే వదిలి పెడుతున్నారు. లేదంటే డబ్బులను సీజ్ చేస్తున్నారు. అలాగే అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బెల్ట్షాపులపై దృష్టి.. పోలీస్స్టేషన్ల పరిధిలోని ఎన్ఫోర్స్మెంట్పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బెల్ట్ షాపుల నిర్వాహకులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నా రు. ఎన్నికల సమయంలో అక్రమంగా మద్యం అమ్మకాలు చేపడితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతోపాటు బెల్ట్ షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రచారంపై ప్రత్యేక నిఘా.. ఎన్నికల ప్రచారంపై ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. నియోజకవర్గాల వారీగా ప్రచారానికి సంబంధించిన అప్డేట్స్ను ఉన్నతాధికారులకు వాట్సప్లలో పంపుతున్నారు. అలాగే ఏ నియోజవర్గంలో ఏ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో ముందు ఉన్నారు.. ప్రభుత్వంపై ఎవరెవరు ఆరోపణలు చేస్తున్నారు.. అధికారుల పనితీరు ఎలా ఉంది.. అనే విషయాలపైనా సమాచారం సేకరించి ప్రభుత్వానికి పంపుతున్నారు. ప్రచారంలో అభ్యర్థులు ఇస్తున్న హామీలు, ఖర్చులపైనా దృష్టి సారించినట్లు తెలిసింది. బైండోవర్లు.. కేసుల నమోదు.. ఎన్నికల్లో అలర్లు సృష్టించే వారిని, గత ఎన్నికల సమయంలో ఇబ్బందులు కలిగించిన వారిని, రౌడీషీటర్లను. మాజీ నక్సలైట్లను, బెల్టుషాపుల నిర్వాహకులను పోలీసు అధికారులు తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేయిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం మద్యం అమ్ముతున్న బెల్ట్షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు. వెస్ట్జోన్ పరిధిలో రికార్డులలో ఉన్న 230 మంది రౌడీ షీటర్లతోపాటు గతంలో ఎన్నికలకు విఘాతం కలిగించిన వ్యక్తులను ఇప్పటికే బైండోవర్ చేశారు. వారి నుంచి ముందస్తుగా ‘ఇంటీరియం బాండ్’, రూ.లక్షతో వ్యక్తిగత పూచీకత్తు తీసుకుంటున్నారు. రాత్రి 10 తర్వాత మైకుల బంద్ ఎన్నికలలో ఏమైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తమదే బాధ్యత అంటూ వారితో రాయించుకుని కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత మైక్లకు అనుమతి ఇవ్వడం లేదు. అనుమతి లేని మైకులను సీజ్ చేస్తున్నారు. సెంట్రల్ జోన్ పరిధిలో ఇప్పటికే మద్యం అమ్మకాలు, పాత నేరస్తులపై 7 కేసులు నమోదు చేసి 24 మందిని బైండోవర్ చేశారు. అలాగే ఈస్ట్జోన్ పరిధిలో 17 కేసులు నమోదు కాగా 50 మందిని బైండోవర్ చేసినట్లు ఆయా స్టేషన్ల పోలీసులు తెలిపారు. వాహనాలను, వ్యక్తులను తనిఖీ చేస్తున్నా రు. వాహనాలలో పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే వాటి గురించి ఆరా తీస్తున్నారు. డబ్బులకు సంబంధించి సరైన పత్రాలను ఉంటేనే వదిలి పెడుతున్నారు. లేదంటే డబ్బులను సీజ్ చేస్తున్నారు. అలాగే అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బెల్ట్షాపులపై దృష్టి.. పోలీస్స్టేషన్ల పరిధిలోని ఎన్ఫోర్స్మెంట్పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బెల్ట్ షాపుల నిర్వాహకులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నా రు. ఎన్నికల సమయంలో అక్రమంగా మద్యం అమ్మకాలు చేపడితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతోపాటు బెల్ట్ షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రచారంపై ప్రత్యేక నిఘా.. ఎన్నికల ప్రచారంపై ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. నియోజకవర్గాల వారీగా ప్రచారానికి సంబంధించిన అప్డేట్స్ను ఉన్నతాధికారులకు వాట్సప్లలో పంపుతున్నారు. అలాగే ఏ నియోజవర్గంలో ఏ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో ముందు ఉన్నారు.. ప్రభుత్వంపై ఎవరెవరు ఆరోపణలు చేస్తున్నారు.. అధికారుల పనితీరు ఎలా ఉంది.. అనే విషయాలపైనా సమాచారం సేకరించి ప్రభుత్వానికి పంపుతున్నారు. ప్రచారంలో అభ్యర్థులు ఇస్తున్న హామీలు, ఖర్చులపైనా దృష్టి సారించినట్లు తెలిసింది. -
మహిళ గొంతు కోసి.. ఆపై?
కురవి(డోర్నకల్): పత్తి చేనులో పనిచేస్తున్న ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తి కత్తి (చాకు) చూపి బెదిరించి గొంతుపై కోసి మెడలోని ఐదు తులాల బంగారు పుస్తెల తాడు లాక్కుని పరారయ్యాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని నేరడ శివారు చెరువుముందు(భద్రు) తండాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తండాకు చెందిన బాదావత్ చందన అనే మహిళ తమ పత్తి చేనులో పనిచేస్తోంది. గుర్తుతెలియని వ్యక్తి బైక్ (పల్సర్)పై వచ్చి పత్తి చేను సమీపంలో రోడ్డుపై ఆగాడు. బైక్ను రోడ్డు పక్కన నిలిపి చందన వద్దకు వెళ్లి, తాగడానికి మంచినీళ్లు కావాలని అడిగాడు. ఆమె మంచినీళ్లు తీసుకువచ్చింది. హఠాత్తుగా కత్తి(చాకు) చూపి బెదిరిస్తూ మెడలోని బంగారు పుస్తెల తాడును అపహరించేందుకు లాగాడు. ఆమె ప్రతిఘటించడంతో చాకుతో మెడపై రెండుచోట్ల కోశాడు. అయినా తిరగబడటంతో అతడు అక్కడున్న రాయిని తీసుకుని ఆమె ముఖంపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండగా ఆమె అరవడంతో అతడు బంగారు పుస్తెల తాడుతో బైక్పై పరారయ్యాడు. రక్తం కారుతుండగా రోధిస్తూ రోడ్డుపైకి రావడంతో పక్క చేలలోని రైతులు చూసి 108కు సమాచారం అందించారు. మానుకోటలోని ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతోంది. విషయం తెలుసుకున్న కురవి ఎస్సై నాగభూషణం ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. దుండగుడు అక్కడే వదిలేసిన కత్తిని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి వెళ్లి బాధితురాలితో మాట్లాడారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగభూషణం తెలిపారు. కాగా ఈ ఘటనపై తండావాసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పత్తి చేను వద్ద పనిచేస్తున్న బాధితురాలి వద్దకు వెళ్లి మంచినీళ్లు అడగడం, పత్తి చేను పక్కన రాళ్ల వద్ద ఈ ఘటన జరగడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల విచారణలో విషయం వెలుగుచూసే అవకాశాలు ఉన్నాయి. -
తాళం వేసిన ఇళ్లలో చోరీలు
కాజీపేట అర్బన్: ఈజీ మనీకి అలవాటు పడి, తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట దొంగలను అరెస్ట్ చేసి, వారి నుంచి భారీగా బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో శనివారం విలేకరుల సమావేశంలో సీపీ వివరాలను వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ధార్ జిల్లా, కుక్షి తహశీల్ బగోలి గ్రామానికి చెందిన 25 ఏళ్ల దిలీప్ పవార్, అదే తహసీల్ భడ్కచ్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల సర్వన్ పవార్ దూరపు బంధువులు. వీరు మధ్యలోనే చదువు మానేసి కూలిపని చేస్తుండేవారు. తర్వాత చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి ఈజీమనీ కోసం దొంగతనాలను మార్గంగా ఎంచుకున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యం.. రైలు మార్గంలో ఉన్న వరంగల్ నగరాన్ని ఎంచుకున్నారు. నగరానికి చేరుకుని తాళం వేసిన ఇళ్లను చూసి, రాత్రి వేళల్లో తాళాలను పగులగొట్టి చోరీలకు పాల్పడేవారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడాదిలో మామునూర్ పోలీస్స్టేషన్ పరిధిలో మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడటంతోపాటు ఒక బైక్, సుబేదారి పరిధిలో రెండు ఇళ్లలో చోరీలు, రెండు బైక్లు, కేయూసీ పరిధిలో రెండు చోరీలు, మట్వాడా, హన్మకొండ, మిల్స్కాలనీ, కాజీపేట, కమలాపూర్, గీసుకొండ, ఐనవోలు, దేవరుప్పుల పోలీస్స్టేషన్ల పరిధిలో ఒక్కో ఇంట్లో చోరీలకు పాల్పడ్డారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్లు డేవిడ్రాజు, రవిరాజ్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బలగాలను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి పంపి విచారణ జరపగా వారిద్దరు వరంగల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇక్కడి సీసీ కెమెరాల్లో వారిద్దరినీ గుర్తించడంతోపాటు వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. వరంగల్కు వెళ్తుండగా... చోరీ చేసిన బంగారం, వెండి ఆభరణాలను విక్రయించేందుకు చోరీ చేసిన బైక్పై వరంగల్కు హన్మకొండ నుంచి హంటర్రోడ్డు మీదుగా వెళ్తున్నారు. క్రైమ్స్ అదనపు డీసీసీ బిల్లా అశోక్కుమార్ సమాచారం మేరకు సీసీఎస్ ఇన్స్పెక్టర్లు డేవిడ్రాజు, రవిరాజు తనిఖీలు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 900 గ్రాముల బంగారం, 12 కిలోల వెండి, మూడు బైక్, రెండు సెల్ఫోన్లు, చోరీకి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులను శనివారం రిమాండ్కు తరలించినట్లు సీపీ తెలిపారు. వారికి సహకరించిన ఇద్దరిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న సీసీఎస్ ఇన్స్పెక్టర్లు డేవిడ్రాజు, రవిరాజ్ను అభినందించారు. ఐటీకోర్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్, అసిస్టెంట్ అనాలిటికల్ ఆఫీసర్ సల్మాన్పాషా, ఏఎస్సైలు వీరాస్వామి, శివకుమార్, హెడ్కానిస్టేబుళ్లు అహ్మద్పాషా, జంపయ్య, కానిస్టేబుళ్లు రాజశేఖర్, చంద్రశేఖర్, మహేశ్వర్, డ్రిస్టిక్ట్ గార్డ్స్ కానిస్టేబుళ్లు సుధాకర్రెడ్డి, మహేష్, మహేందర్ పాల్గొన్నారు. -
మాట్లాడే పని ఉంది రమ్మని చెప్పి...
రైల్వేగేట్ (వరంగల్): మాట్లాడే పని ఉందంటూ రమ్మని చెప్పి.. ఆతర్వాత బెదిరించి ఓ బంగారం షాపు గుమస్తా బ్యాగ్లోని రూ.14.38లక్షల నగదును దుండగులు అపహరించిన సంఘటన నగరంలోని వరంగల్ రైల్వేస్టేషన్లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడు, వరంగల్ జీఆర్పీ సీఐ జూపల్లి వెంకటరత్నం కథనం ప్రకారం... వరంగల్ ఆర్ఎన్టీ రోడ్లోని శ్రీకృష్ణా బులియన్ మర్చంట్స్ షాపులో గుమస్తాగా పనిచేస్తున్న బేతి యుగేందర్ చెన్నైలో బంగారం నగలు కొనుగోలు చేసేందుకు శుక్రవారం రాత్రి 9గంటలకు వరంగల్ స్టేషన్కు వచ్చాడు.తమిళనాడు ఎక్స్ప్రెస్ జనరల్ బోగీలో రైలు ఎక్కాడు. గుర్తుతెలియని వ్యక్తి(30) వచ్చి ‘నీతో మా ట్లాడేది ఉంది.. సార్ పిలుస్తుండు.. స్టేషన్కు వెళ్లాలి.. రా...’ అన్నా డు. నిజమే అనుకుని అతడు రైలు దిగడంతో గుర్తుతెలియని ఆ వ్యక్తి బెదిరించాడు. మరో ఇద్దరు వచ్చి యుగేందర్ బ్యాగ్లోని రూ. 14,38,800 నగదు అపహరించారు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. షాపు ఓనర్ సురేష్కుమార్ దాలియాకు సమాచారం ఇచ్చా డు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా కనిపించారు. దీంతో పోలీసులు ఆ ముఠా కోసం గాలిస్తున్నారు. అలాగే శ్రీకృష్ణా బులియన్ మర్చం ట్స్ దుకాణం యజమాని సురేష్కుమార్ దాలి యా వరంగల్ జీఆర్పీలో ఫిర్యాదు చేశారు. -
తోడేళ్లగూడెంలో విషాదఛాయలు
డోర్నకల్ (వరంగల్): విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి చెందడంతో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్లగూడెం గ్రామంలో విషాదం నెలకొంది. అన్నదమ్ములు తేనె రమేష్(50), తేనె జగన్(47) మృత్యువాత పడడంతో రెండు కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. తోడేళ్లగూడెం గ్రామానికి చెందిన తేనె సహదేవ్, వెంకటమ్మకు నలుగురు కుమారులు రమేష్, జగన్, సతీష్, వెంకన్న ఉన్నారు. సహదేవ్ కొంతకాలం క్రితం మృతి చెందాడు. గ్రామం నుంచి బొడ్రాయి తండా మార్గంలో ఉన్న భూమిని నలుగురు కుమారులకు పంపిణీ చేశారు. వ్యవసాయ భూమిలో కుమారులు వేర్వేరుగా పత్తిపంటను సాగు చేస్తున్నారు. దుక్కి దున్ని ఎరువు చల్లేందుకు రమేష్, జగన్ వేర్వేరుగా అరకలు తీసుకుని బుధవారం ఉదయం చేను వద్దకు వెళ్లారు. రమేష్ అరకు దున్నుతున్న క్రమంలో పత్తి చేను మీదుగా వ్యవసాయ బావి వద్దకు అమర్చిన విద్యుత్ లైను తీగ తెగి పడింది. అది తగిలి రమేష్ చనిపోయాడు. అన్న రమేష్ను కాపాడబోయి జగన్ కూడా విద్యుదాఘాతంతో క్షణాల్లో మృతి చెందాడు. పత్తి చేను వద్దకు పరుగులు.. విద్యుదాఘాతంతో అన్నదమ్ములు రమేష్, జగన్ మృతి చెందిన వార్త తెలుసుకున్న గ్రామస్తులు పత్తి చేను వద్దకు పరుగులు పెట్టారు. ఇద్దరి మృతదేహాలను వెంటనే ఇంటికి చేర్చారు. రోడ్డుకు ఇరువైపులా రమేష్, జగన్ ఇళ్లు ఉండడంతో రాకపోకలు స్తంభించాయి. ఇరువురి కుటుంబ సభ్యులు, గ్రామానికి చెందిన మహిళల రోదనలు మిన్నంటాయి. రమేష్, జగన్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ మండలానికి సుపరిచితులు కావడంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇద్దరు కుమారులను కోల్పోయిన తల్లి.. తండ్రిని కోల్పోయిన ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారుల మృతదేహాలను చూసిన తల్లి వెంకటమ్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. కొద్దిసేపు రమేష్ ఇంటికి, కొద్దిసేపు జగన్ ఇంటికి వెళ్లి మృతదేహాల వద్ద విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. జగన్కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె బీటెక్, రెండో కుమార్తె ఇంటర్, మూడో కుమార్తె 9వ తరగతి చదువుతున్నారు. ఉదయమే పిల్లలు కళాశాలకు వెళ్లారు. తండ్రి మరణ వార్త తెలుసుకుని వెంటనే ఇంటికి చేరుకున్నారు. నవ్వుతూ కళాశాలకు పంపిన తండ్రి విగతజీవిగా మారి కనిపించడంతో ముగ్గురు పిల్లల రోదనలు మిన్నంటాయి. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ.. సంఘటన స్థలాన్ని డోర్నకల్ సీఐ జక్కుల శ్యాంసుందర్ పరిశీలించారు. ఘటన జరిగిన తీరు గురించి చుట్టు పక్కన వ్యవసాయ భూములకు చెందిన రైతులను విచారించారు. ఘటనకు కారణమైన విద్యుత్ తీగను సేకరించారు. అనంతరం శవ పంచనామా పూర్తి చేసి మృతదేహాలను పోస్టుమార్టు నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సబ్మెరైన్ మోటార్లకు వినియోగించే వైరు.. తోడేళ్లగూడెం సమీపంలో రమేష్, జగన్కు చెందిన వ్యవసాయ బావికి మెయిన్ లైన్ నుంచి అమర్చిన విద్యుత్ వైరు వ్యవసాయ బావుల్లోని సబ్ మెరైన్ మోటర్లకు వినియోగించేదని విద్యుత్ శాఖ సిబ్బంది చెబుతున్నారు. స్తంభాల మీదుగా సర్వీస్ వైరు (సబ్మెరైన్ మోటర్లకు వినియోగించేది)తో లైను ఏర్పాటు చేసుకున్నారు. సన్నగా ఉండే వైరు తెగి పత్తి చేనులో పడడం, అది గమనించక రమేష్, జగన్ మృత్యువాత పడ్డారు. రమేష్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ శ్యాంసుందర్ రమేష్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ శ్యాంసుందర్ -
ఆత్మహత్య చేసుకోబోతున్నా..సెల్ఫీ వీడియో
ధర్మసాగర్(స్టేషన్ఘన్పూర్): తనపై సీఐ చేయి చేసుకున్నందున మనస్తాపం చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసి వాట్సప్ గ్రూప్లో పోస్ట్ చేయడం శనివారం కలకలం సృష్టించింది. కొన్ని గంటలపాటు ఉత్కంఠకు దారితీయగా చివరకు ఆ యువకుడు క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్లే.. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన యువకుడు జక్కుల సుధీర్కు, ఎంపీపీ వల్లపురెడ్డి లక్ష్మి భర్త రమణారెడ్డికి మధ్య కొన్నేళ్లుగా ఓ భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 30న సుధీర్పై దాడి జరగ్గా, ప్రతిగా అతడి వర్గీయులు జూలై 1వ తేదీన నారాయణగిరి గ్రామంలో ఉన్న ఎంపీపీ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం 6 గంటలకు తనను సీఐ డి.శ్రీలక్ష్మి పోలీస్స్టేషన్కు పిలిపించి కొట్టిందని, సమాజంలో చట్టాలను గౌవించే వారికి న్యాయం జరగదని, తన చావుకు సీఐ, ఏసీపీ, ఎంపీపీ భర్త రమణారెడ్డి కారకులు అంటూ 5.10నిమిషాలు, ఒక్క నిమిషం వ్యవధి ఉన్న రెండు వీడియోలను గుర్తుతెలియని ప్రాంతంలో రైల్వేట్రాక్పై సెల్ఫీ వీడియో తీసి తానే అడ్మిన్గా ఉన్న వాట్సప్ గ్రూప్లో అప్లోడ్ చేశాడు. అనంతరం గంట తర్వాత సెల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. వీడియో చూసిన గ్రూప్ సభ్యులు ఇతర గ్రూపులకు షేర్ చేయగా సర్వత్రా కలకలం రేగింది. సుధీర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు 100కు డయల్ చేసి చెప్పి, జీఆర్పీ పోలీసులకు సంప్రదించారు. చివరకు ఉదయం 10గంటల సమయంలో జమ్మికుంట మండలం మడిపల్లిలోని కొడమల్ల సదయ్య ఇంట్లో అతడు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు జమ్మికుంట పోలీస్స్టేషన్కు తరలించి, అక్కడి నుంచి ధర్మసాగర్ పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి తండ్రి వెంకట్రాజంకు అప్పగించారు. కాగా మూడు గంటల పాటు తీవ్ర ఉత్కంఠ రేపిన ఘటనలో ఆ యువకుడు క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇలా చేయడం సరికాదు... యువకుడి ఆత్మహత్యా బెదిరింపు వీడియో కలకలం రేపిన నేపథ్యంలో డీసీపీ వెంకట్రెడ్డి ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. విచారణ సమయంలో బాధితులు పోలీసులకు సహకరించాలని, అన్యాయం జరిగినట్లు భావిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. సుధీర్ను జమ్మికుంట మండలం మడిపల్లిలోని అతడి బాబాయి సదయ్య ఇంట్లో గుర్తించి పలువురు గ్రామస్తుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి తండ్రికి అప్పగించామని చెప్పారు. కేసు విచారణలో ఉండగా ఇలాంటి వీడియోలు తీసి వాట్సప్లో పెట్టడం సరికాదని అన్నారు. సీఐ కొట్టడంతోనే మనస్తాపం చెందా... ధర్మసాగర్ పోలీస్స్టేషన్కు రావాలని శుక్రవారం ఉదయం ఓ కానిస్టేబుల్ ఫోన్ చేసి చెప్పగా వెళ్లాను. రమణారెడ్డితో జరిగిన గొడవ విషయంలో ఒప్పంద పత్రాన్ని తాను చింపేసినట్లు సంతకం పెట్టాలని, హ్యూమన్ రైట్స్ కమిషన్లో పెట్టిన కేసును వాపస్ తీసుకోవాలని సీఐ మేడం నన్ను తీవ్రంగా ఒత్తిడి చేసింది. మా పెద్దమనుషులతో మాట్లాడిన తర్వాత సంతకం పెడతానని నేను చెప్పాను. దీంతో సీఐ మేడం నన్ను తీవ్రంగా కొట్టింది. మేడం కొట్టడంతోనే ఆత్మహత్య చేసుకుందామని సెల్ఫీ వీడియో తీసి వాట్సప్లో పెట్టాను. ట్రైన్ ట్రాక్పై ఉన్న నన్ను జాగింగ్కు వచ్చిన వాళ్లు గుర్తించి తీసుకెళ్లి ఊర్లో వదిలారు. అక్కడి నుంచి మా బాబాయి ఇంటికి వెళ్లాను. మనస్తాపంతోనే ఈవిధంగా చేశాను. – జక్కుల సుధీర్, బాధితుడు సుధీర్ను కొట్టలేదు.. గతంలో ఉన్న కేసు విషయంపై సుధీర్ను పోలీస్స్టేషన్కు పిలిపించి మాట్లాడి పంపించా. అతడిపై ఎవరూ చేయి చేసుకోలేదు. సుధీర్ ఆరోపిస్తున్న హ్యూమన్ రైట్స్ కమిషన్ కేసు విషయంలో మేము వివరణ ఇచ్చుకుంటాం. కేసు వాపస్ తీసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు చెబుతున్న ఆరోపణ పూర్తిగా అవాస్తవం. – డి.శ్రీలక్ష్మి, ధర్మసార్ సీఐ -
మంచం కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు
కరీమాబాద్ (వరంగల్): తల్లిదండ్రులకు చెందిన మంచం కోసం అన్నదమ్ములు ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణ కాస్త ఒకరి ప్రాణం తీసింది. అన్నను తమ్ముడు కర్రతో కొట్టి హత్య చేసిన సంఘటన మంగళవారం రాత్రి నగరంలోని లేబర్ కాలనీలో చోటు చేసుకుంది. మిల్స్కాలనీ సీఐ దయాకర్, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. నగరంలోని లేబర్కాలనీకి ఈఎస్ఐ ఆస్పత్రి సమీపంలో విద్యుత్ లైన్మన్ ఇమ్మడి భాను ప్రకాష్(43) తన అన్నదమ్ములకు తల్లిదండ్రులు ఆస్తులు పంచగా మిగిలిన డెకోలం మంచం తమ్ముడైన ఇమ్మడి రాములు ఇంట్లో ఉంది. ఆ మంచాన్ని తీసుకెళ్లేందుకు మంగళవారం సాయంత్రం సుమా రు 6.30 గంట ల ప్రాంతంలో అన్న ఇమ్మడి భానుప్రకాష్ వస్తాడు. ఈ క్రమంలో తమ్ముడు రాములుకు భానుప్రకాష్ కు మధ్య తీవ్రంగా గొడవ జరుగుతుంది. ఆగ్రహం చెందిన రాములు అక్కడే ఉన్న కర్రతో అన్న భానుప్రకాష్ తల, కాళ్లమీద కొట్టాడు. దీంతో అపస్మారక స్తితిలోకి వెళ్లిన భానుప్రకాష్ను ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృ తిచెందాడు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. రాములు పరారీలో ఉన్నాడు. -
సాకలేక పది వేలకు అమ్మేసింది
ఇబ్రహీంపట్నంరూరల్: సాకలేక కన్నబిడ్డను విక్రయించింది ఆ తల్లి. ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఆదిబట్ల సీఐ బిక్షపతి, ఎస్ఐ మోహన్రెడ్డి వెల్లడించారు. బాలాపూర్ మండలం కుర్మల్గూడ గ్రామంలోని ఇందినగర్ గుడిసెల్లో నివాసం ఉంటున్న పైడాల బాలరాజ్ భార్య పద్మ అలియాస్ మంగ కూలి పని చేసుకొని జీవనం సాగించేది. మంగకు మూడు నెలల మగ శిశువు ఉన్నాడు. కొన్ని నెలల క్రితం మంగ భర్త బలరాజ్ వదిలేయడంతో ఒంటరిగా నివాసం ఉంటోంది. కొద్ది రోజుల క్రితం మంగ రోడ్డు ప్రమాదంలో గాయపడింది. సంపాదన లేక బిడ్డను సాకలేని పరిస్థితి ఏర్పడింది. సరైన పోషణ కోసం మూడు నెలల మగబిడ్డను అమ్మడానికి మంగ సిద్ధమైంది. ఈ క్రమంలో పక్కనే రాజీవ్గృహకల్పలో నివాసం ఉంటున్న వారికి అమ్మకానికి పెట్టింది. మగ శిశువును రూ.10వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ నెల 23న సాయంత్రం కుమ్మరి లక్ష్మమ్మకు మంగ తన మూడు నెలల బిడ్డను ఇచ్చి రూ.500 తీసుకుంది. మిగతా డబ్బులు త్వరలోనే ఇస్తామని లక్ష్మమ్మ శిశువును తీసుకెళ్లింది. అయితే, లక్ష్మమ్మ ఇంటి పక్కల వారికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. లక్ష్మమ్మ దంపతులను విచారించగా.. మంగ దగ్గర కొనుగోలు చేసినట్టు తెలిపారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. శిశువు తల్లి మంగ, కొనుగోలు చేసిన లక్ష్మమ్మ చెన్నయ్యలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మూడు నెలల బాబును అంగన్వాడీ అధికారుల సమక్షంలో శిశువిహార్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. -
భర్త ఇంటి వద్ద భార్య నిరాహార దీక్ష
కురవి(డోర్నకల్): భర్త ఇంటి వద్ద భార్య రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సంఘటన సోమవారం వెలుగుచూసింది. బాధితురాలి కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపల్లి శివారు తునికిచెట్టు తండాకు చెందిన బానోత్ రాజా, కమిలి దంపతుల కుమార్తె స్వప్నను సక్రాంనాయక్ తండా కు చెందిన బాదావత్ వెంకన్నకు ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం చేశారు. రూ.10లక్షల కట్నంగా ఇచ్చి పలు వస్తువులు పెట్టారు. వెంకన్న రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లయ్యాక ఉద్యోగరీత్య ఆంధ్రప్రదేశ్లోని గూడూరు జంక్షన్ వద్ద నివసిస్తున్నారు. వీరికి పాప రమ్య ఉంది. మూడేళ్లుగా స్వప్న, వెంకన్న మధ్య గొడవలు జరుగుతున్నాయి. తనను వేధిస్తుండటంతో అక్కడి నుంచి పుట్టింటికి వచ్చానని, పోలీస్స్టేషన్లో గతంలో కేసు పెట్టగా తనకు ఖర్చులకు నెలకు రూ.3వేల చొప్పున చెల్లిస్తున్నాడని వివరించింది. మూడు నెలలుగా ఖర్చులు ఇవ్వలేదని తెలిపింది. దీంతో ఆదివారం తన భర్త కావాలంటూ సక్రాంనాయక్ తండాలో అతడి ఇంటికి వచ్చి తిండి లేకుండా నిరశన దీక్ష చేపట్టింది. అత్తామామ, కుటుంబ సభ్యులందరూ వేరే గదిలో ఉంటూ అన్నం తిని తాళం వేసుకుని బయటకు వెళ్తున్నారని, తన కూతురుకు కూడా అన్నం పెట్టడంలేదని రోధించింది. కాగా ఈ విషయంపై సీరోలు ఎ స్సై రాణాప్రతాప్ను వివరణ కోరగా ఆమెను స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చామని, అయినా మళ్లీ సోమవారం ఆందోళన చేస్తోందని, వారి కేసు కోర్టులో ఉందని తెలిపారు. -
మేనత్తతో వివాహేతర సంబంధం..
కురవి(డోర్నకల్): వివాహేతర సంబంధం ఒకరి హత్యకు దారితీసింది. తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని ఓ వ్యక్తి సొంత మేనల్లుడినే గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నారా యణపురం శివారు కొత్తతండాలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మహబూబాబాద్ రూరల్ సీఐ ముత్తిలింగయ్య, కురవి ఎస్సై నాగభూషణం, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... కొత్తతండాకు చెందిన బానోత్ భద్రు, నాగమణి భార్యభర్తలు. భద్రు మేనల్లుడు మాలోత్ లింగన్న(25) నాగమణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో లింగన్నను హత్య చేయాలని భద్రు నిర్ణయించుకున్నాడు. ఆదివారం రాత్రి తండాలోని గణేష్ విగ్రహాన్ని యువకులు డీజే సౌండ్కు నృత్యాలు చేస్తూ నిమజ్జనానికి ఊరేగింపుగా తరలిస్తున్నారు. వారిలో మేనల్లుడు లింగన్న కూడా ఉండటాన్ని భద్రు చూశాడు. వెనుక నుంచి వచ్చి గొడ్డలితో అతడి తలపై నరికాడు. దీంతో లింగన్న తల పగిలి కింద పడ్డాడు. వెంటనే భద్రు అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న లింగన్న తలకు ఓ వ్యక్తి తన షర్ట్ గట్టిగా కట్టి మరో వ్యక్తి సాయంతో బైక్పై కూర్చోబెట్టుకుని మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించాడు. అక్కడ స్టెచర్పై పడుకోబెడుతుండగా లింగన్న మృతిచెందాడు. భద్రు గొడ్డలతో సహా కురవి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భద్రు మూడో భార్య నాగమణి.. బానోతు భద్రు సొంత అక్క బిడ్డ సేవిరిని మొదట వివాహం చేసుకోగా విడాకులయ్యాయి. రెండో భార్య సరోజ ముగ్గురు కొడుకులు జన్మించాక మృతిచెందింది. ఆతర్వాత నాగమణిని పెళ్లి చేసుకున్నాడు. అతడి మేనల్లుడు మాలోత్ లింగన్న వ్యవసాయం చేస్తూనే అప్పుడప్పుడు కారు డ్రైవింగ్ చేస్తుంటాడు. రెండేళ్లుగా నాగమణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంలో భద్రు, లింగన్న మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. అయినా మార్పు లేకపోవడంతో రెండేళ్ల క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా రూ.10వేల జరిమానా విధించారు. ఆ తర్వాత వారం రోజులకే నాగమణి తల్లిగారింటికి వెళ్లిపోయింది. కొద్ది రోజులకు అక్కడా లేదని మేనల్లుడు లింగన్న, నాగమణి మరో చోట సహజీవనం చేస్తున్నారని లింగన్నపై భద్రు పగపెంచుకున్నాడు. దీంతో అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అందరు చూస్తుండగానే నడిరోడ్డుపై గొడ్డలితో నరికి చంపేశాడు. లింగన్న రెండు సుపారీ హత్యల్లో నిందితుడు మాలోత్ లింగన్న అప్పుడప్పుడు కారు డ్రైవింగ్ చేసేవాడు. ఈ క్రమంలో మహబూబ్నగర్ జిల్లా మరికల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడి అక్కడ రూ.5లక్షల సుపారీ తీసుకుని ఒకరి హత్య చేశాడు. అలాగే నల్గొండ జిల్లా సూర్యాపేట సమీపంలోని నూతనకల్ పోలీస్స్టేషన్ పరిధిలో మరొకరి వద్ద రూ.3లక్షలు సుపారీ తీసుకుని హత్య చేశాడు. ఆయా కేసులు పోలీస్స్టేషన్లలో నమోదై ఉన్నాయి. ఆయా హత్య కేసుల్లో లింగన్న వెంట నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. పోలీసుల విచారణ లింగన్నను గొడ్డలితో నరికి చంపిన ఘటనా స్థలికి సీఐ ముత్తిలింగయ్య, ఎస్సై నాగభూషణం సోమవారం విచారణ చేపట్టారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు. మృతుడు లింగన్న తండ్రి మాలోత్ సేవ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు. శవపంచనామా చేసి పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందచేశారు. కాగా హత్య జరిగిన తర్వాత భద్రు ఇంట్లోని వస్తువులను లింగన్న బంధువులు ధ్వంసం చేశారు. -
ప్రియురాలి కోసం వేటకొడవలితో...
గీసుకొండ(పరకాల): తన ప్రియురాలిని వెంట తిప్పుకుంటున్నాడని టీఆర్ఎస్ నాయకుడిపై ఓ వ్యక్తి కొడవలితో హత్యా యత్నం చేసిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండలో ఆదివారం జరిగింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. గీసుకొండ మండలం గంగదేవిపల్లికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గోనె మల్లయ్య(మల్లారెడ్డి)ని గీసుకొండకు చెందిన ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా అటెండర్ గ్యాస్ సేఫ్టీ డివైజ్ విక్రయానికి సంబంధించి ఏజెంట్గా చేర్పించింది. కాగా శని వారం మల్లారెడ్డితోపాటు టీమ్ లీడర్లు సదానందం, బాలిరెడ్డి, మహిళా అటెండర్ తమ కంపెనీ పనిపై కారులో సంగెం మండలం లోహిత గ్రామానికి బయల్దేరారు. వరంగల్ నగరంలోని అండర్బ్రిడ్జి దాటి వెళ్తుండగా గమనించిన మనుగొండ గ్రామానికి చెందిన బోయరాజు (ఊకల్ క్రాస్లో ఫాస్ట్ఫుడ్ సెంటర్ యజమాని) బైక్పై వేగంగా వెళ్లి కారుకు అడ్డంగా పెట్టాడు. మహిళా అటెండర్ను ఎందుకు తీసుకెళ్తున్నారని గొడవపడ్డాడు. అదేరోజు రాత్రి ఆమె నిద్రిమాత్రలు మింగడంతో బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు మల్లారెడ్డి తన కారులో తీసుకుని వెళ్లి ఆస్పత్రిలో చేర్పించాడు. ఆమె కోల్కోవడంతో ఆదివారం తెల్లవారుజామున ఇంటి వద్ద దింపి వెళ్లాడు. అక్కడికి బోయరాజు వచ్చి ఆమెతో గొడవపడి చంపుతానని బెదిరిం చాడు. వితంతువైన ఆమె, తాను ప్రేమించుకున్నామని, చాలా ఏళ్లుగా సహజీవనం చేస్తున్నామని, ఫొటోలు చూపుతూ ఆమెతో తిరగరాదని హెచ్చరించాడు. గీసుకొండలో ఎంపీపీ భర్త రాజ్కుమార్ వద్ద మాట్లాడుకుందామని చెప్పి మల్లారెడ్డి అక్కడికి వెళ్లాడు. ఉదయం గ్రామంలోని ఆంధ్రాబ్యాంకు ఎదురుగా హోటల్ వద్ద రాజ్కుమార్ ఉండగా అతడికి విషయం చెబుతుండగానే అక్కడే ఉన్న బోయ రాజు వెంట తెచ్చుకున్న వేట కొడవలితో మల్లారెడ్డి మెడపై వేటు వేయడానికి యత్నించాడు. అయితే చొక్కా కాలర్కు కొడవలి తగలటంతో మెడపై స్వల్ప గాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. రాజ్కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ ఎస్సై విఠల్ తెలిపారు. -
బుధరావుపేటలో బాలిక కిడ్నాప్ కలకలం
ఖానాపురం(నర్సంపేట): ఆరుబయట ఆడుకుం టుండగా తొమ్మిదేళ్ల బాలికను ఇద్దరు మహిళలు, ఒక దుండగుడు ఆటోలో వచ్చి కిడ్నాప్నకు యత్నించిన సంఘటన శనివారం కలకలం సృష్టించింది. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలంలోని బుధరావుపేటలో ఈ ఘటన జరి గింది. స్థానికులు, ఎస్సై మ్యాక అభినవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధరావుపేట గ్రామ పరిధి లోని బోడ్యతండాకు చెందిన ఎంపీటీసీ సభ్యురాలు లకావత్ జ్యోతి, రవి దంపతులకు కుమార్తె ఝాన్సీ(9), కుమారుడు వంశీ ఉన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా శనివారం పాఠశాలకు వెళ్లకుండా ఇంటివద్దే ఉన్నారు. తండ్రి రవి నర్సంపేటలో పని నిమిత్తం వెళ్లగా, తల్లి జ్యోతి ఇంట్లో పనులు చేసుకుంటోంది. బాలిక ఝాన్సీ సమీపంలోని అంగన్వాడీ సెంటర్ వద్ద తోటి పిల్ల లతో ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి ఆటోలో వచ్చారు. తమకు ఒక చిన్నారి కావాలని, గుడిలో పూజ చేసిన తర్వాత వెంటనే తీసుకువస్తామని అంగన్వాడీ ఆయాతో చెప్పగా నిరాకరించింది. దీంతో వారు ఆటోలో వెళ్లి.. మళ్లీ వెనక్కు వచ్చి బాలిక ఝాన్సీకి మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకుని వెళ్లిపోయా రు. అంగన్వాడీ కేంద్రంలో నుంచి ఆయా బయటకు వచ్చి చూడగా బాలిక ఝాన్సీ కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల వారికి తెలియజేయగా, వారు బాలిక తల్లి జ్యోతికి చెప్పారు. ఆమె భర్త రవికి తెలియజేయగా వెంటనే 100కు డయల్ చేశాడు. మంగళవారిపేటలో ఎంపీపీ రవీందర్రావు, అక్కడి యువకులకు సమాచారం అందించారు. రెండు గ్రామాలకు చెందిన యువకులు ఆటోలను ఆపి తనిఖీలు చేయడం ప్రారంభించారు. అప్పటికే ముగ్గురు స్థానిక మురారీ హోటల్లో బాలికతో కలిసి టిఫిన్ చేస్తున్నారు. గమనించిన యువకులు వెళ్లి వారిని పట్టుకున్నారు. బాలిక తండ్రి రవి చేరుకుని వారిపై ఆగ్రహిస్తూ చేయిచేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై అభినవ్ వెంటనే సిబ్బందితో వచ్చి దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ఆటోతో పాటు ఇద్దరు మహిళలు, పురుషుడిని పోలీస్స్టేషన్కు తరలించా రు. కాగా కిడ్నాప్నకు యత్నించిన వారి ద్వారా గతంలో మృతిచెందిన ఇర్షద్ మృతి వివరాలు తెలుస్తాయని ముస్లింలు సైతం తరలివచ్చారు. కాగా ఎస్సై అభినవ్ విచారణ చేస్తున్నామని, వివరాలు తెలియలేదని వారికి చెప్పి పంపారు. రూరల్ సీఐ సతీష్బాబు చేరుకొని ఎస్సై అభినవ్తో కలిసి విచారణ చేపట్టారు. కాగా డీసీపీ అనురాధ సాయంత్రం ఖానాపురానికి చేరుకుని కిడ్నాప్నకు యత్నం ఘటనపై పోలీస్ సిబ్బందితో చర్చించారు. అక్కడే ఉన్న ఎంపీపీ రవీందర్రావు, జడ్పీటీసీ సభ్యుడు జగన్మోహన్రెడ్డి, బాలిక తండ్రి లకావత్ రవితో మాట్లాడారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నా రు. ఏసీపీ సునితామోహన్, సీఐ, ఎస్సై ఉన్నారు. భయాందోళనలో గ్రామస్తులు గ్రామంలో పట్టపగలే బాలికను కిడ్నాప్కు యత్నించడంతో గ్రామంలోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత ఏడాది జూలై నెలలో ఇదే గ్రామానికి చెందిన ఇర్షద్ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఇలాగే మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేయగా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భీమునిపాదం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం విధితమే. ఇదే తరహాలో మళ్లీ ఏడాది తర్వాత బాలిక ఝాన్సీని కిడ్నాప్నకు యత్నించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. -
వేర్వేరు ఘటనల్లో నలుగురి ఆత్మహత్య
భీమారం(వరంగల్): అనారోగ్య కారణంతో ఓ విద్యార్థి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే... వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం చౌళ్లపల్లికి చెందిన కంచె రమేష్ (21) భీమారంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే పక్కనే ఉన్న ఓప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కళాశాలకు వెళ్తున్నాడు. కొంతకాలం రమేష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యం తీసుకున్నప్పటికీ వ్యాధి నయం కాలేదు. దీంతోపాటు చదువులో కూడా వెనుకబడి ఉన్నట్లుపోలీసులు తెలిపారు. ఈనెల 17వ తేదీన ఉదయం హాస్టల్ నుంచి రమేష్ అదృశ్యమయ్యాడు. ఈమేరకు హాస్టల్ నిర్వాహకులు విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా, బుధవారం రమేష్ మృతదేహం భీమారం చెరువులో లభ్యమైంది. అయితే అనారోగ్యంతోనే రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి సదయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భీమేష్ తెలిపారు. పురుగుల మందు తాగి రైతు.. మొగుళ్లపల్లి(భూపాలపల్లి): పురుగుల మందు తాగి రైతు మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొర్కిశాల గ్రామ శివారు బద్ధంపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బధ్ధంపల్లి గ్రామానికి చెందిన సామల జయపాల్ (40)కు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో పత్తి పంటను సాగు చేసుకుంటున్నాడు. కాగా, గత సంవత్సరం దిగుబడి సరిగా రాలేదు. ఈ క్రమంలో ఈ సంవత్సరం కూడా పత్తి వేసి సాగు చేశాడు. వర్షాలకు పత్తి పంట ఎర్రబడడంతో సరైన దిగుబడి రాదేమోనని మనస్తాపానికి గురైన జయపాల్ మంగళవారం రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సారయ్య తెలిపాడు. తాళ్లపూసపల్లిలో.. కేసముద్రం: పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని తాళ్లపూసపలిలో చోటుచేసుకుంది. ఎస్సై సతీష్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన గువ్వ యాకయ్య(45) భార్య కొంతకాలం క్రితం మృతిచెందింది. అప్పటి నుంచి ఒంటరి జీవితాన్ని భరించలేక మద్యానికి బానిసయ్యాడు, మంగళవారం మద్యం తో పాటు పురుగుల మందు తాగాడు. గమనిం చిన కుటుంబ సభ్యులు అతడిని మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొం దుతూ రాత్రి మృతిచెందాడు. మృతుడికి ఇద్ద రు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడి బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై.. నర్మెట: మద్యానికి బానిసై కుటుంబ కలహాలతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మాన్సింగ్తండా పరిధిలోని కొత్త తండాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన భూక్య బిక్కు (36) కొద్ది కాలం నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అతిగా మద్యం సేవించి ఆలస్యంగా ఇంటికి చేరుకుని భార్య లక్ష్మితో గొడవపడ్డాడు. దీంతో భార్య లక్ష్మి ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి నిద్రకు పొరుగింటికెళ్లింది. కాగా, తెల్లవారి లక్ష్మి ఇంటికి చేరుకునే సరికే బిక్కు ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వడిచర్ల గోవర్ధన్ తెలిపారు. -
‘చిట్ఫండ్’లో రూ.4.5 లక్షల నగదు చోరీ
కాజీపేట: వరంగల్ నగరంలోని దర్గాకాజీపేట చౌరస్తాకు కూతవేటు దూరంలో ఉన్న భద్రం చిట్ఫండ్ కంపెనీలో శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.4.5 లక్షల నగదు అపహరించారు. కంపెనీ ప్రతినిధుల ఫిర్యా దు మేరకు స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దర్గాకాజీపేకు చెందిన 8 మంది మిత్రులు కలిసి భద్రం చిట్ఫండ్తోపాటు ఎస్ఆర్ఆర్ ఎంటర్ ప్రైజేస్ ఏర్పాటు చేశారు. గురువారం వినాయక చవితికావడంతో కంపెనీలో పార్ట్నర్లు పూజలు చేసి ఎప్పటిలాగే తాళాలు వేసి ఇళ్లకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం కార్యాలయం శుభ్రం చేయడానికి వచ్చిన స్వీపర్ తాళాలు తీసి ఉండడం గమనించి యజమానులకు తెలియజేయగా దొంగతనం జరిగినట్లుగా నిర్థారించారు. కంపెనీ ఎండీ బండి సాంబయ్యతో కలిసి సభ్యులు రూ.4.5లక్షల నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ వెంకటరెడ్డి, సీఐ అజయ్ తోపాటు క్రైమ్ పోలీసుల బృందం, మడికొండ సీఐ సంతోష్ ఘటన స్థలాన్ని సందర్శించారు. క్లూస్టీం వేలిముద్రలను సేకరించగా డాగ్స్క్వాడ్ సిబ్బంది చుట్టుపక్కల గాలించారు. కంపెనీలో చొరబడిన దొంగలు నగదుతోపాటు లోపల ఏర్పా టు చేసిన సీసీ కెమెరాల హార్డ్డిస్క్ను పట్టుకు వెళ్లారు. పోలీసు జాగాలాలు భవనం వెనుక నుంచి ఫాతిమానగర్ ప్రధాన రహదారి సమీపానికి వచ్చి ఆగిపోయాయి. విభిన్న కోణాల్లో విచారణ.. చిట్ఫండ్లో జరిగిన దొంగతనం కేసు విచారణలో భాగంగా పోలీసులు కార్యాలయంలో పనిచేసే సిబ్బందితోపాటు కంపెనీ డైరెక్టర్లు, నిత్యం వచ్చి పోయే వారిని వేర్వేరుగా పిలిపించి విచారణ జరుపుతున్నారు. కార్యాలయంలో ఇంత మొత్తం డబ్బు ఉన్నట్లుగా తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉండొచ్చని.. లేదా ప్రొఫెషనల్ దొంగలు ఎవరైనా ఈ పని చేశారా అనే కోణంలో డీసీపీ వెంకటరెడ్డి పర్యవేక్షణలో విచారణ జరుగుతోంది. -
మా కుమార్తెను అల్లుడే చంపాడు..
దంతాలపల్లి (వరంగల్): తమ కుమార్తెను అల్లుడే హత్య చేశాడని ఆరోపిస్తూ.. మృతదేహంతో తల్లిదండ్రులు ఆందోళన చేసిన సంఘటన మండల కేంద్రంలో జరిగింది. మృతురాలి బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. బయ్యారం మండల శివారు కంకరబోడు తండాకు చెందిన జాటోతు కీర్తి(28)కి దంతాలపల్లి మండల కేంద్రం శివారు రాగితండాకు చెందిన జాటోతు రామోజీ, అమ్ముల చిన్న కుమారుడు బాలుతో సంవత్సరం క్రితం వివాహమైంది. కాగా, బాలు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య కీర్తితో హైదరాబాద్లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 10వ తేదీన వరంగల్ సమీపంలో చింతలపల్లి–ఎలుగూరు రైల్వే స్టేషన్ల మధ్య అప్లైన్లో పట్టాల పక్కన ఉన్న మోరీలో కీర్తి శవమై కనిపించింది. జీఆర్పీ సిబ్బంది గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపరిచారు. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా సమాచారం తెలుసుకున్న మృతురాలి బంధువులు మంగళవారం మృతదేహాన్ని గుర్తించారు. జీఆర్పీ సిబ్బంది మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అనంతరం వారు మంగళవారం రాత్రి దంతాలపల్లి మండల కేంద్రం శివారులోని రాగితండాకు చేరుకుని కీర్తి అత్తింటి ఎదుట మృతదేహంతో ఆందోళన చేశారు. తమ కుమార్తెను అల్లుడే హత్య చేశాడని ఆరోపించారు. రెండు రోజులుగా మృతదేహానికి అంత్యక్రియలు చేయలేదు. ఈ విషయమై ఎస్సై నందీప్ను వివరణ కోరగా జీఆర్పీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించారన్నారు. బంధువుల నుంచి కూడా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
రోడ్డెక్కాలంటేనే భయం..
తాజాగా.. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో సుమారు 50 మంది మరణించారు. సోమవారం హైదరాబాద్లో గచ్చిబౌలి బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. ఈ నేపథ్యంలో రోడ్డెక్కాలంటే జనం బెంబేలెత్తుతున్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను గత ఏడాదితో పోలిస్తే 26 శాతం తగ్గించామని అధికారులు చెబుతున్నప్పటికీ.. నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం జరుగుతూనే ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా హన్మకొండ అశోకా జంక్షన్లో ఆగస్టు 19న రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. హన్మకొండ చౌరస్తా నుంచి అశోక్ జంక్షన్కు వస్తున్న పాపని సరిత(32), ఆమె కుమారుడు రిత్విక్ హన్మకొండ చౌరస్తా నుంచి ప్రీ లెఫ్ట్లో నడిచి వస్తున్నారు. వారు నడిచే దారిలో ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు రాకూడదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ బస్సు ప్రీ లెఫ్ట్లోకి ప్రవేశించి రెండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ తప్పు నూటికి నూరు పాళ్లు ఉంది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత పోలీసు అధికారులు పెట్రోల్ పంపు నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక దారి ఏర్పాటు చేసి హన్మకొండ నుంచి వచ్చే ప్రీ లెఫ్ట్లోకి వాహనాలు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చే శారు. ఇదే పని ముందు చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. అధికారులు, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదంలో రెండు ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వచ్చింది. వరంగల్ క్రైం: ప్రజలు రోడ్డెక్కాలంటే భయపడుతున్నారు. మృత్యువు ఎటువైపు నుంచి ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. బస్సు, లారీ, డీసీఎం తదితర భారీ వాహనాలు నడిపే డ్రైవర్ల నిర్లక్ష్యంతో ద్విచక్రవాహన దారులు, పాదచారుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ఇంట్లో నుంచి బయటికి వెళ్లినవారు తిరిగొచ్చేవరకు గ్యారంటీ లేకుండా పోయింది. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో సుమారు 50 మంది మరణించారు. సోమవారం హైదరాబాద్లో గచ్చిబౌలి బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. రాష్ట్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాహనాల అతివేగం ప్రాణాలను బలితీసుకుంటోంది. మార్కెట్లోకి విడుదలవుతున్న కార్లు, బైక్ల వేగం కంట్రోల్ కావడం లేదు. ఆనందం కోసం వేగంగా వాహనాలను నడిపితే.. అదే వేగం ప్రాణాలు హరిస్తోంది. వరంగల్ పోలీ సు కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను గత ఏడాదితో పోలిస్తే 26 శాతం తగ్గించామని అధికారులు చెబుతున్నప్పటికీ నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం జరగడం.. ప్రాణాలు పోవడం మనం చూస్తూనే ఉన్నాం. కుటుంబాన్ని మింగేసిన రోడ్డు ప్రమాదం.. హన్మకొండ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మనుగొండ సరిత నాలుగు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కొడుకును కోల్పోయింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె తన కూతురితో కలిసి ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రోడ్డు ప్రమాదం మిగిల్చిన విషాదం చివరికి ఇలా ఇద్దరి ఆత్మహత్యకు కారణమైంది. పోలీస్ కమిషనరేట్ పరిధిలో 274 మరణాలు వరంగల్ పోలీసు కమిషనరేట్లో 2018 జనవరి నుంచి ఆగస్టు వరకు వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 274 మంది మృతిచెందగా, మరో 1,193 మందికి గాయాలైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీనిని బట్టి కమిషనరేట్లో ప్రమాదాల తీవ్రత అర్థమవుతోంది. కమిషనరేట్లో ఒక మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వరంగల్–ఖమ్మం 563 హైవేపై 2016లో 15 మంది మరణించగా 20 మందికి గాయాలయ్యాయి. 2017లో 14 మంది మరణించగా 17 మందికి గాయాలయ్యయి. 2018లో ఇప్పటి వరకు ఈ రవహదారిపై ఐదుగురు మరణించగా 8 మందికి గాయాలయ్యాయి. ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితిని ఊహించవచ్చు. శాఖల మధ్య సమన్వయ లోపం... రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సంఘటన స్థలాలకు చేరుకుని చేరుకోని తుతూ మంత్రంగా నివేదికలు సమర్పిస్తున్నారు. కానీ ప్రమాదాలకుగల కారణాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డు యాక్సిడెంట్ అనాలసిస్ గ్రూప్(రాగ్)లో పోలీసు శాఖ, ఆర్టీఏ, రవాణాశాఖ, ఆర్ అండ్ బీ, పంచాయతిరాజ్ శాఖలు ఉన్నాయి. పెద్ద ప్రమాదాలు జరిగిన తర్వాత ఈ శాఖల అధికారులు ప్రమాదాలకు గల కారణాలపై నివేదికలు రూపొందిస్తున్నారు. కానీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తూతూమంత్రంగా అక్కడక్కడ చిన్నచిన్న సైన్ బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. భద్రత లేని ఆర్టీసీ బస్సులు... ఒకప్పుడు సురక్షిత ప్రయాణానికి కేరాఫ్గా నిలిచిన ఆర్టీసీ బస్సులు ఇటీవల మృత్యుశకటాలుగా మారుతున్నాయి. హన్మకొండ నయీంనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వంగపహాడ్కు చెందిన ఒక ఏఎన్ఎం ప్రాణాలు కోల్పోయింది. హన్మకొండ పోలీసు స్టేషన్ సమీపంలోని అశోకా జంక్షన్లో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి తల్లి, కుమారుడు బలయ్యారు. ఆర్టీసీలాంటి సంస్థల్లో డ్రైవర్లకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చిన తర్వాతే రోడ్డుపైకి పంపుతారు. కానీ కొందరు డ్రైవర్లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారనే విమర్శలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. భారీ వాహనాలతో భద్రత కరువు.. రోడ్డు ప్రమాదాల్లో అధికంగా డ్రైవర్ల అతివేగం, వారు మద్యం తాగి నడపడం, నిద్రలేమి వల్లే జరుగుతున్నాయి. నగరంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను విరివిగా నిర్వహించడంతో మద్యం తాగి వాహనాలు నడపాలంటే కొంత భయపడుతున్నారు. కానీ భారీ వాహనాలు(బస్సులు, లారీలు, కంటైనర్లు) నడిపే వారికి బ్రీత్ ఎన్లైజర్ పరీక్షలు నిర్వహించడం లేదు. దీంతో కొంతమంది మద్యం మత్తులో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు భారీ వాహనాలను నడిపే డ్రైవర్లకు కూడా పరీక్షలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. పని ఒత్తిడీ కారణమే కొంతకాలంగా ఆర్టీసీలో నియామకాలు లేవు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగింది. ప్రయాణికులకు సరిపడా బస్సులు సైతం లేవు. కొన్ని రూట్ల బస్సుల్లో కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు. సంస్థలో ఉన్న డ్రైవర్లతోనే పని చేయిస్తున్నారు. దీంతో అదనంగా పని భారం పెరుగుతోంది. పని భారం పెరగడంతో కూడా డ్రైవర్లు ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారుల పర్యవేక్షణ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. – చొల్లేటి కిరణ్, టీఎంయూ రీజినల్ అధ్యక్షుడు -
కొడుకు జులాయిగా తిరుగుతున్నాడని..
భీమారం : కొడుకు పాఠశాలకు వెళ్లకుండా జులా యిగా తిరుగుతున్నాడని మనస్తాపానికి గురై తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈసంఘటన కేయూ పోలీస్స్టేషన్ పరిధిలోని యాదవనగర్ ప్రాంతం భగత్సింగ్ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. అలివేలుమంగమ్మ(38)కు ఇద్దరు కూతు ళ్లు, కుమారుడు సోమశేఖర్ ఉన్నారు. సోమశేఖర్ స్థానిక పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నాడు. అతడు జులాయిగా తిరుగుతుండటంతో మందలించినా మార్పు రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన తల్లి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న సీఐ మహేందర్రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
భార్యపై భర్త వేధింపులు
వరంగల్ : ఆస్తి కోసం కట్టుకున్న వాడితో పాటు.. కన్న పిల్లలు ఏడాదిగా చిత్ర హింసలు పెడుతూ వేధిస్తున్నారు.. చివరకు వారి వేధింపులు భరించలేక న్యాయం చేయాలంటూ ఓ మహిళ ఇంటి ఎదుట నిరసన తెలిపిన సంఘటన నగరంలోని కాశిబుగ్గలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ మార్కెట్లో అడ్తి వ్యాపారం చేస్తున్న భూతం లక్ష్మీనారాయణ, రమాదేవిలు ఓ సిటీలో కాపురం ఉంటున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. గత ఏడాది కాలంగా రమాదేవిని ఆస్తికోసం భర్త లక్ష్మినారాయణ, కొడుకు అనిల్, చిన్న కూతురు మధులత ముగ్గురు కలసి ఆమెను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆరునెలల క్రితం భర్త కర్రతో చితకబాదడంతో చేతి వేళ్లు పూర్తిగా వంకరయ్యాయి. కాశిబుగ్గ 13వ డివిజన్లోని బాపూజీ కాలనీలో తన సొంత ఇంటిలో అద్దెకు ఉంటున్న పెద్ద కూతురుకు సమాచారం అందించారు. ఆమె వెంటనే వచ్చి తల్లిని తీసుకుపోవడంతో పాటు మహిళ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమెకు ఎవరు బాసటగా లేకపోవడం వల్ల అక్కడ సైతం న్యాయం జరగలేదు. ఇంతలోనే భర్త తనకు విడాకుల నోటీసు పంపించినట్లు తెలిపింది. రెండుసార్లు కోర్టుకు తాను హాజరైనప్పటికీ భర్త లక్ష్మినారాయణ రాలేదని చెప్పింది. పెద్ద కూతురు దగ్గర ఉంటున్నప్పటికీ తరచుగా వస్తూ భౌతిక దాడులకు పాల్పడుతుండడంతో భరించలేక ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసినా నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంటి ఎదుట నిరసన.. కాశిబుగ్గలోని బాపూజీకాలనీలో ఉన్న ఇంటి ఎదుట రమాదేవి గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇళ్లు తన పేరు పైనే ఉందని చెప్పారు. కిరాయికి ఇచ్చినా.. అద్దెకు ఇల్లు ఇచ్చినా తీసుకోనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయమని ఇంతేజార్గంజ్ ఎస్సై శ్రీని వాస్ని కలిస్తే ఎందుకమ్మ వేరే ఇంట్లో కిరాయికి ఉండమని సలహా ఇచ్చార తెలిపారు. రెడ్డిపాలెంలోని ఐదెకరాల భూ మి అమ్మితే వచ్చిన రూ.2కోట్ల నగదు వారి వద్దనే ఉందని తెలిపారు. తన కొడుకు 15 ఏళ్లుగా అమ్మా అని పిలవడం లేదని కన్నీరు మున్నీరయ్యారు. తాను పెద్దబిడ్డ వద్ద ఉంటున్నందున తన పేర ఉన్న ఆస్తిని వారి పేరు మీదకు మార్చుకోవాలని చూస్తున్నారని చెప్పారు. ఆస్తి విషయంలో తనను వారు హత్య చేసేందుకు సైతం వెనుకంజ వేయరని రమాదేవి తెలిపారు. తనకు, తన పెద్ద కూతురుకు న్యాయం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. -
బాలిక, యువతి అదృశ్యం
దుగ్గొండి(నర్సంపేట) : ఓ మహిళతో పాటు మరో బాలిక అదృశ్యమైన సంఘటన వరంగల్రూరల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. గ్రామానికి చెందిన సాదు పావని(16), పసరగొండ అనూష(21)లు మంగళవారం ఉదయం 10 గంటల వరకు ఇంటి వద్ద ఉండి ఆ తర్వాత కనబడకుండా పోయారు. సాయంత్రం ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులకు వారు కనబడకపోవడంతో బంధువుల ఇండ్లు, తెలిసిన వారి ఇండ్లు వెదికినా ఫలి తం లేదు. దీంతో సాదు పావని తల్లి సాదు రమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ బోనాలకిషన్ తెలిపారు. ఇద్దరి ఆచూకి తెలిపిన వారికి తగిన పారితోషికం అందిస్తామన్నారు. వివరాలు తెలిసిన వారు సీఐ బోనాల కిషన్ 9440795245, ఎస్సై భాస్కర్రెడ్డి 9440904642లో సంప్రదించాలని సూచించారు. -
ప్రభుత్వ ఖజానాకు తూట్లు
సీజ్ చేసిన ఇసుకరాçశులు మాయం రాత్రికి రాత్రే ట్రక్కులతో ఇసుక తరలింపు ఉదాసీనగా వ్యవహరిస్తున్న రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంమరిపెడ రూరల్: చిన్నగూడూరు మండల కేంద్రంలోని సీజ్ చేసిన ఇసుక రాత్రికి రాత్రే మాయమవుతుంది. అధికారుల కళ్లు కప్పి సీజ్ చేసిన ఇసుకను కొందరు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అదే విధంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తులు రహస్యంగా ఇసుక డంపులు నిల్వ చేసి రాత్రి వేళల్లో పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ అక్కడి రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం ఉదాసీనతగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చిన్నగూడూరు మండల కేంద్రం శివారులో ఆకేరు వాగులోని ఇసుకపై కన్నేసిన కొందరు అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా గ్రామంలోనే పలు రహస్య ప్రాంతాల్లో ఇసుక డప్పులను నిల్వ చేస్తారు. మరికొందరు ట్రాక్టర్ల ద్వారా పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటారు. ఇసుక డంప్లు సీజ్.. చిన్నగూడూరు మండల కేంద్రంలో వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ చేసిన డంపులున్నట్లు సమాచారం తెలుసుకున్న చిన్నగూడూరు రెవెన్యూ అధికారులు రెండు నెలల క్రితం దాడులు నిర్వహించి సుమారు 14 ఇసుక డంపులను సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుక రాసుల నిఘా వైఫల్యం చెందడంతో వాటిపై కొందరు కన్నెశారు. అదును చూసి ఇసుక రాసుల్లో నుంచి ట్రాక్కుల ద్వారా రాత్రికి రాత్రే తరలిస్తున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఆకేరు సమీపంలోని రహాస్య ప్రదేశాల్లో మరిన్ని పెద్ద పెద్ద ఇసుక రాశులు ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో ఈ ఇసుక డంపుల నుంచి పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొందరు గృహాలు నిర్మించుకుంటున్నామని చెబుతూ దర్జాగా ఇంటి ముందే ఇసుక డంప్ నిల్వలు చేసుకొని అమ్ముకుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ట్రక్కు ఇసుక రూ.4 వేలు ఉండటంతో ఇసుక అక్రమార్కుల సంపాదన మూడు పువ్వులు ఆరుకాయల చందంగా వారి వ్యాపారం కొనసాగుతుంది. ఈ తతాంగం అంతా కూడా కొందరి అధికారుల కనుసైగల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సీజ్ చేసిన ఇసుక డంప్ల నుంచి అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ అధికారులు ఇటీవల పట్టుకున్నారు. ప్రభుత్వ ఇసుక తరలిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే జరిమానా వేసి వదిలేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అడుగంటుతున్న భూగర్భజలాలు.. ఆకేరు వాగు నుంచి తోడుతున్న ఇసుక కారణంగా ఆ ప్రాంతంలోని భూగర్భజలాలు అడుగంటుకుపోయి వ్యవసాయానికి ఇబ్బందికరంగా మారుతోంది. వేసవిలో తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చిన్నగూడూరు ఇసుక మాఫియాపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.సీజ్ చేసిన ఇసుకను తరలిస్తూ పట్టుబడిన ట్రాక్టర్ -
ప్రేమ పెళ్లికి సహకరించాడని వ్యక్తి హత్య
కాళేశ్వరం : ప్రేమ పెళ్లి చేసుకున్న సోదరితో రాఖీ కట్టించుకోలేకపోయానని ఓ వ్యక్తి తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. ఆ పెళ్లికి మధ్యవర్తిగా వ్యవహరించిన యువకుడిని గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఎడపల్లి గ్రామ శివారు బ్రాహ్మణపల్లి-2 క్వారీ సమీపంలో ఆదివారం అర్థరాత్రి జరిగింది. సీఐ రంజీత్కుమార్ కథనం ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా సీతనగరానికి చెందిన సంగిశెట్టి కిషోర్(25), ఆయనకు వరుసకు సోదరుడైన నరసింహామూర్తి కలిసి ఎడపల్లిలోని ఓ క్వారీలో సూపర్వైజర్లుగా గత కొన్నిరో జులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఎడపల్లికి చెందిన గోగుల లలితతో నరసింహామూర్తికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కాగా ఈ నెల 23న వారిద్దరు వివాహం చేసుకుని విజయనగరం వెళ్లిపోయారు. ఈ పెళ్లి లలిత వాళ్లింట్లో ఎవరికీ ఇష్టం లేకపోవడంతో మహదేపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా అదే మసస్తాపంతో లలిత సోదరుడు విజయ్ రగిలిపోతున్నాడు. ఆదివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి ఇంట్లో లేకపోవడంతో విజయ్ కోపం మరింత పెరిగింది. ఆమె ఉంటే ఉంటే రాఖీ కట్టించుకునేవాడినని మదన పడ్డాడు. వారి పెళ్లి జరగడానికి సహకరించాడనే ఉద్దేశంతో విజయ్ ఆవేశానికిలోనై కిషోర్ను మండలంలోని బ్రాహ్మణపల్లి- 2 క్వారీ సమీపంలో గొడ్డలితో అతిదారుణంగా నరికి చంపాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ మృతదేహాన్ని రాత్రి మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు విజయ్ని వారు అదుపులోకి తీసుకున్నట్లు సమచారం. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
పండుగ పూట ‘పైసా’చికం
జనగామ : రైలు కిందపడి బలవన్మరణం చెందిన ఆ ముగ్గురిని చూసి రైలు పట్టాలు చిన్నబోయా యి. విలవిలలాడుతూ ప్రాణాలొదిలిన వారి చివ రి క్షణాలను చూసిన ఆకాశం వర్షం రూపంలో కన్నీరుకార్చింది. తలలు తెగిన తల్లి, కుమారుల మృతదేహాలను చూసి బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. అదనపు కట్నం వేధి ంపులు, పుట్టింటికి వెళ్లనీయకుండా భర్త పెట్టే ఇ బ్బందులు భరించలేక భార్య, ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జనగామలోని రాజీవ్నగర్ సమీపంలోని రైలుపట్టాలపై ఆదివా రం జరిగింది. నల్లగొండ జిల్లా మోత్కూరు గ్రామానికి చెం దిన దుడుక నర్సయ్య, పుషమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె మధులత(27)కు జనగామ పట్ట ణంలోని వీవర్స్ కాలనీకి చెందిన మాదాసు మధుకర్తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.2 లక్షల కట్నం, పెట్టుపోతల కింద రూ.40 వేల సామగ్రి ముట్టజెప్పారు. ఏడాది పా టు తల్లిదండ్రులు సిద్ధయ్య, కమలమ్మ వద్ద ఉన్న మధుకర్.. రెడ్డిస్ట్రీట్(17వ వార్డు)లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. వారికి కుమారులు ఉదయ్ కుమార్(8), వినయ్(4) జన్మించారు. స్థానిక సెయింట్ పాల్స్ స్కూల్లో ఉదయ్ 4వ తరగతి, వినయ్ ఎల్కేజీ చదువుతున్నాడు. మధుకర్ హైదరాబాద్ సోమాజీగూడ ప్రాంతలోని జీ4ఎస్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెళ్లయినప్పటి నుం చి అదనపుకట్నం కోసం భార్యను వేధించేవాడని పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. తరుచూ భర్త పెట్టే వేధింపులను భరిస్తూనే తన ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంది మధులత. గొడవలపై అనేకసార్లు ఆమె పుట్టింటివారు పంచాయతీ పెట్టి.. మధుకర్ను నిలదీశారు. అన్న గృహప్రవేశానికి వెళ్లని చెల్లి హైదరాబాద్ బోడుప్పల్లో నివాసముంటున్న మధులత అన్న సతీష్ ఇటీవల నూతన గృహ ప్రవేశం చేశాడు. బావ, చెల్లెలును మర్యాదపూర్వకంగా వేడుకకు రావాలని ఆహ్వానించాడు. అంతకుముందే మధులత తండ్రి నర్సయ్య ఆమెకు రూ.70 వేలతో పుస్తెల తాడు చేయించాడు. అయినా మరిన్ని డబ్బులు కావాలని అల్లుడు వేధించా డని చెప్పారు. అత్తంటివారు తన మాట వినలేదని.. భార్యను గృహ ప్రవేశానికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన మధులత నాలుగైదు రోజులుగా మదనపడుతూ ఎవరికీ చెప్పుకోలేదు. రాఖీ పండగ రావడంతో రెండు రోజుల క్రితం తండ్రికి ఫోన్ చేసి.. హైదరాబాద్ అన్న దగ్గరికి వస్తా.. మీరంతా అక్కడికే రండి అంటూ కబురు పంపించడంతో తండ్రి నర్సయ్య, తల్లి పుషమ్మ హైదరాబాద్కు వెళ్లారు. రాఖీ పండగకని బయల్దేరి.. ఉదయం 9 గంటలకు ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని నిద్రలోనే ఉన్న భర్తను పలకరించింది. రాఖీ కట్టేందుకు తన అన్న వద్దకు వెళ్తున్నట్లు చెప్పింది. ఇంటి నుంచి నేరుగా ఆర్టీసీ బస్టాండుకు వెళ్లి గంటపాటు అక్కడే కూర్చున్నట్లు తెలిసింది. ఏమైందోగానీ 11.30 గంటల సమయంలో రాజీ వ్నగర్(1వ వార్డు) ఏరియాలోని రైలు పట్టాల వద్దకు పిల్లలతో కలిసి చేరుకుంది. వరంగల్ ఉంచి హైదరాబాద్ వెళ్తున్న శాతవాహ న రైలు కింద పడుకుని తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు అక్కడ లభించిన సెల్ఫోన్తో మధ్యాహ్నం 12.30 గంటలకు మధుకర్కు ఫోన్ చేశారు. దీంతో అతడితోపాటు కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని విగత జీవులుగా పడి ఉన్న తల్లి, పిల్లలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అన్నకు ఆఖరి పలకరింపు అన్నాచెల్లెలి అనుబంధాన్ని గుర్తుచేసే రాఖీ పండగ రోజు అన్నకు రాఖీ కట్టేందుకు బయల్దేరిన మహిళ ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆమె ఉదయం 9.30 గం టల ప్రాంతంలో తన అన్న సతీష్కు ఫోన్ చేసి.. ‘నేను రావడం లేదు..’ అనే ఒకే ఒక్క మాట చెప్పి ఫోన్ స్విచ్ఆఫ్ చేసింది. వంద సార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చివరికి మధుకర్కు చేయగా ‘ఇంకా రాలేదా అవులది.. ఏడికి పోయింది..’ అంటూ నిర్లక్ష్యం సమాధానం చెప్పాడని మృతురాలి తండ్రి నర్సయ్య తెలిపారు. పండగ రోజు రాఖీ కట్టించుకునేందుకు చెల్లెలి కోసం ఎదురు చూసిన అన్నలు గుండెలు బాదుకున్నారు. ఎంతపని చేశావంటూ రోదించారు. మధుకర్ను చితకబాదిన పుట్టింటివారు.. మృతురాలి బంధువులు ఆమె భర్త మధుకర్ను సంఘటన స్థలంలో చితకబాదారు. చెప్పులతో కొడుతూ నా బిడ్డను చంపేశావురా అంటూ శాపనార్థాలు పెట్టారు. దీంతో రైల్వే పోలీసులు అడ్డుకుని మధుకర్ను స్టేషన్కు తరలించారు. అమ్మ ప్రేమమధులత తల ఎగిరి మొండెం మిగిలినా.. పెద్ద కుమారుడు తల్లిఒడిలోనే సేద తీరుతున్నట్లుగా కనిపించాడు. ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఇద్దరు కుమారులను తన ఒడిలో పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అక్కడి దృశ్యాన్నిబట్టి తెలుస్తోంది. చిన్న కుమారుడు వంద మీటర్ల దూరం ఎగిరిపడి తల, మొండెం వేరుకాగా, తల్లి తల ఎగిరి చెట్ల పొదల్లో పడిపోయింది. రైల్వే పోలీసులు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. కట్నం కోసం హింసించాడు పెళ్లయినప్పటి నుంచి అదనపుకట్నం కోసం నా కూతురిని అల్లు డు మధుకర్ వేధించాడు. రూ.2 లక్షల కట్నం, రూ.40 వేలు పెట్టుపోతుల కింద ఇచ్చిన. ఈ మధ్యే రూ.70 వేలు పెట్టి పుస్తెల తాడు చేయించిన. అయినా వదిలిపెట్టలేదు. నా కొడుకు గృహ ప్రవేశం చేసినా రానివ్వలేదు. అల్లుడి పోరు భరించలేకనే పిల్లలతో కలిసి నా బిడ్డ ఆత్మహత్య చేసుకుంది. ఎన్నోసార్లు పంచాయతీ పెట్టి బుద్ధిగా ఉండాలని చెప్పినం. అయినా వినిపించుకోలేదు. – దుడుక నర్సయ్య, మృతురాలి తండ్రి నిద్రలో ఉండగానే వెళ్లిపోయింది.. మా మధ్య గొడవలు ఏమీ లేవు. అందరిలాగే చిన్నచిన్న తగాదాలు. అదనపు కట్నం అడగలేదు. ఇటీవల బావమరిది గృహ ప్రవేశానికి వెళ్లొద్దన్నా. రాఖీ పండగ ఉంది కదా..అప్పుడు వెళ్లమని చెప్పా. డ్యూటీకి వెళ్లి శనివారం రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చా. భోజనం చేసి పడుకునేసరికి అర్ధరాత్రి దాటింది. 9 గంటలకు నన్ను లేపి రాఖీ కట్టేందుకు హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పింది. నిద్రలో సరిగ్గా చూడకుండానే.. సరే పో అన్నాను. మధ్యాహ్నం రైల్వే పోలీసులు నాకు ఫోన్ చేయడంతో ఇక్కడికి వచ్చాను. – మాదాసు మధుకర్, మృతురాలి భర్త హన్మకొండలో ఎస్సై కోడలు.. కాజీపేట అర్బన్ : వరకట్న బాధితులకు అండగా నిలవాల్సిన ఎస్సై ఇంట్లోనే అదనపు కట్నం వేధింపులతో అతడి కోడలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హన్మకొండలోని సుబేదారి పోలీస్స్టేషన్ పరిధిలోని స్నేహనగర్లో ఆదివారం జరిగింది. సుబేదారి ఎస్సై సిరిపురం నవీన్కుమార్ కథనం ప్రకారం.. సుబేదారి పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కందుకూరి ఎల్లయ్య కుటుంబం హన్మకొండ స్నేహనగర్లో నివాసముంటోంది. ఆయన కుమారుడు శ్రవణ్కు మూడేళ్ల క్రితం కరీంనగర్ జిల్లా సైదాపురం మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన బొడిగె మచ్చయ్య కూతురు శ్రీలత(25)తో వివాహమైం ది. పెళ్లి సమయంలో రూ.8 లక్షల కట్నం ఇచ్చారు. వారికి సంతా నం కలగలేదు. గతంలో ప్రైవేట్ కంపెనీలో పనిచేసే శ్రవణ్ రెండు నెలలుగా తండ్రి వద్దే ఉంటున్నాడు. రెండు రోజులుగా ఇంటికి రాలేదు. అత్తింటివారు తరచూ మరో రెండు లక్షల కట్నం తీసుకురావాలని శ్రీలతను వేధించడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె తన గదిలో సూసైడ్ నోట్ రాసి సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి మచ్చయ్య ఫిర్యాదు మేరకు మామ ఎల్లయ్య, అత్త దేవికా రాణి, భర్త శ్రవణ్పై కేసు నమో దు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఉద్యోగం రాలేదని ఆత్మహత్య
ఏటూరునాగారం : ఉద్యోగం రాలేదని ఓ పట్టబద్రుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కావిరి సమ్మయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడి వివాహం అయింది. ఎంఏ, బీఈడీ పూర్తి చేసిన చిన్న కుమారుడు అంజయ్య(25), టీటీసీ చేసిన కూతురు సౌందర్య ఇంటి వద్దే ఉంటున్నారు. అంజయ్య మూడేళ్లుగా పోటీ పరీక్షలకు హాజరవుతున్నాడు. గత ఏడాది గ్రూప్–2, ఈ ఏడాది టీఆర్టీ, గురుకుల పోటీ పరీక్షలు రాసాడు. ఇటీవల విద్యావలంటరీ నియామక పరీక్షకు సోదరి సౌందర్యతోపాటు అంజయ్య హాజరుకాగా సౌందర్య సెలక్ట్ అయింది. మూడేళ్లుగా ఉద్యోగ ప్రయత్నం చేసినా ఫలితం దక్కడంలేదని అంజయ్య తరచూ చెప్పుకుని బాధపడేవాడని అతడి తల్లి లక్ష్మి తెలిపింది. శుక్రవారం ఉదయం తాను బయటకు వెళ్లి వచ్చేసరికి కుర్చీలో కూర్చొని ఉన్న అంజయ్య నోటి నుంచి వస్తున్న నురగలు వస్తున్నాయి.. ఏమైంది కొడుకా అని అడిగే లోపే వాంతులు చేసుకుంటూనే పురుగుల మందు తాగిన అవ్వా.. అంటూ పడిపోయాడని తల్లి విలపిస్తూ చెప్పింది. ఏటూరునాగారం ఆస్పత్రికి తీసుకువెళ్లగా డాక్టర్లు చికిత్స చేస్తుండగా చనిపోయాడని కన్నతల్లి గుండెలు బాదుకుంటూ రోదించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కన్నాయిగూడెం ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
రక్తమోడుతున్న రైలు పట్టాలు
కాజీపేట రూరల్ : రైలు పట్టాలు రక్తమో డుతున్నాయి. ఆత్మహత్యలకు అడ్డాలుగా మారు తున్నాయి. వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్ల జీఆర్పీ పరిధులు సూసైడ్ స్పాట్లుగా మారుతు న్నాయి. ఉమ్మడి జిల్లాలో వరంగల్ నుంచి తాళ్లపూసపల్లి మధ్యలో నిత్యం ఎవరో ఒకరు మృత్యు వాత పడుతున్న సంఘటనలున్నాయి. ఇక కొన్ని ప్రమాదాలైతే వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లకు అరకిలో మీటరు దూరంలోపే జరుగుతుండడం విశేషం. తాజాగా గురువారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం వెంగంపేట గ్రామానికి చెందిన హమాలీ కార్మికుడు గట్ల శాంతయ్య(50) స్టేషన్ మూడో నెంబర్ ప్లాట్ ఫాంలోని పట్టపగలు హైటెన్షన్ పోల్ ఎక్కి వైర్లు ముట్టుకుని అందరూ చూస్తుండగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే. అలాగే ఇదే రోజు అండర్ బ్రిడ్జిపైన ఓ వృద్ధురాలు (60) ఆత్మహత్య చేసుకుంది. ఈ రెండు ఘటనలు సుమారు కిలో మీటర్ లోపలే జరగడం సంచలనం రేపుతుంది. ఇంత జరుగుతున్నా సంబంధిత ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు ఆత్మహత్యలను నివారించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు కనిపిస్తుంది. వరంగల్ పరిధిలో.. నగరంలోని వరంగల్ రైల్వే స్టేషన్ జీఆర్పీ పరిధి ఇటు కాజీపేట దర్గా, అటు తాళ్లపూసపల్లి వరకు ఉంటుంది. ఈ క్రమంలో ప్రధానంగా వరంగల్ రైల్వే మినీ బ్రిడ్జి(సంతోషిమాతగుడి వద్ద), వరంగల్ చింతల్ ఆర్వోబీ, ధర్మారం గేట్, హంటర్రోడ్ ఆర్వోబీ, గూడ్స్షెడ్, రైల్వేగేట్, బొందివాగు, దర్గాగేట్ మొదలైన ప్రాంతాలు ఆత్మహత్యల స్పాట్లుగా ఉన్నాయి. అంతే కాకుండా వరంగల్ రైల్వేస్టేషన్ కూడా ఇందులో ఉంది. కాజీపేట పరిధిలో.. కాజీపేట జీఆర్పీ పోలీస్స్టేషన్ పరిధిలోకి కాజీపేట, కాజీపేట టౌన్, హసన్పర్తి, ఉప్పల్, పెండ్యాల్, స్టేషన్ఘన్పూర్, ఇప్పగూడ, రఘునాథపల్లి, యశ్వంత్పూర్, జనగాం, పెంబర్తి వస్తాయి. ఈ స్టేషన్ల పరిధిలో ఎక్కడ రైల్వేట్రాక్పై ఆత్మహత్యలు జరిగితే కాజీపేట జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేస్తారు. పనిచేయనిసీసీ కెమెరాలు.. వరంగల్ రైల్వేస్టేషన్లో గతంలో 8 సీసీ కెమెరాలుండగా ఆ మధ్య మరో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో 14 సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్న విషయం తెలిసింది. గురువారం ప్లాట్ఫాం-3లో శాంతయ్య అనే హమాలీ కార్మికుడు విద్యుత్పోల్ ఎక్కుతున్నపుడు సీసీ కెమెరాల ద్వారా గుర్తించే అవకాశం ఉంది. కానీ వాటి నిర్వహణ సరిగా లేకపోవడం ఇక్కడ సమస్యగా మారింది. అలాగే ప్లాట్ ఫాంల మీద బందోబస్తు నిర్వహించే జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులైన శాంతయ్యను అడ్డుకుని ఉంటే ఒక ఆత్మహత్య చేసుకోకుండా ఉండేవాడని సాటి ప్రయాణికులు అనడం వినిపించింది. అప్పుడు పోలీసులు ఏంచేశారనేది ప్రశ్నార్థకం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఆత్మహత్యల నివారణకు కావల్సిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకు.. వరంగల్ రైల్వేస్టేషన్ పరిధిలో గత జనవరి నుంచి మే నెల వరకు 14 మంది ఆత్మహత్య చేసుకోగా.. గత జూన్ నెల నుంచి ఈ ఆగస్టు ఈ మూడు నెలల్లో 24 మంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తం 38 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు సంబంధిత జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఎక్కువగా కేఎం 375 నుంచి 376ల మధ్య ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు వారు వివరించారు. -
ఇక బతకలేమని..
వరంగల్ క్రైం : కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. అయినా కొడుకు, కూతురు ఉన్నారనే ధైర్యంతో అన్నీ తానై బతుకు బండిని ముందుకు సాగించింది. అకస్మాత్తుగా కొడుకు రోడ్డు ప్రమాదంలో తనువు చాలించాడు. కన్న కొడుకు కానరాని లోకాలకు తరలిపోవడంతో ఆ తల్లికి గుండె పగిలినంత పనైంది. కొడుకును విడిచి ఉండలేనంత ప్రేమను మనసులో నింపుకుందేమో.. ఆ కొడుకు దగ్గరికే వెళ్లిపోయింది. తాను లేకుండా తన కూతురు ఎలా బతుకుతుందో అని.. వెళ్తూ కూతురును కూడా మృత్యుఒడిలోకి తీసుకెళ్లింది.. హృదయవిదారకమైన ఈ ఘటన హన్మకొండ పోలీసు స్టేషన్ పరిధిలోని కొత్తురు–బొక్కలగడ్డలో గురువారం జరిగింది.హన్మకొండ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మనుగొండ సరిత(39), కూతురు మనుగొండ మధుమిత (17) ఇంట్లో దూలానికి ఉరివేసుకొని మృతి చెందింది. హన్మకొండ ఎస్సై ఎలబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. సరిత భర్త మనుగొండ బాబు 1992 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్.. 2007లో అనారోగ్యంతో బాబు చనిపోయారు. భర్త మరణంతో అతడి ఉద్యోగం సరితకు రాగా రెవెన్యూ శాఖలో పనిచేస్తోంది. నాలుగు నెలల క్రితం ఆమె కుమారుడు రోహిత్(21) హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.. కట్టుకున్న భర్త, కన్నకొడుకు మరణంతో సరిత తీవ్ర మానసిక వేదనకు గురైంది. రోహిత్ మరణించిన తర్వాత ఉద్యోగానికి వెళ్లడం లేదు. ఇటీవలే బంధువులు, తోటి ఉద్యోగులు ధైర్యం చెప్పడంతో కొంతకాలంగా విధులకు హాజరవుతోంది. ఉద్యోగం చేస్తూ సుబేదారి ప్రాంతంలో నివాసం ఉండేది. ఇటీవల ఆమె తల్లిదండ్రుల కోరిక మేరకు వారి ఇంట్లోనే ఉంటోంది. గురువారం దేశాయిపేటలో బంధువుల పెళ్లి ఉండడంతో సరిత తల్లిదండ్రులు వెళ్లా రు. సరితను పెళ్లికి రమ్మని ఎంత బ్రతిమిలాడినా వెళ్లలేదు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పెళ్లి నుంచి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు తలుపులు తీసేందుకు బయటి నుంచి సరితను పిలిచారు. లోపల గడియ పెట్టి ఉండి.. ఎంత పిలిచినా సరిత, మధుమిత పలుకలేదు. దీంతో బలవంతంగా తలుపులను తెరిచి చూడగా సరిత, మధుమిత ఇంటి దూలానికి వేలాడుతూ కనిపించారని ఎస్సై వివరించారు. దూలానికి వేలాడుతున్న వారిని చూసి తల్లిదండ్రులు, అన్నావదినలు గుండెలవిసేలా రోధించారు. 11 ఏళ్లలో కుటుంబంలో అందరూ చనిపోయారని కన్నీరుమున్నీరయ్యారు. సరిత, మధుమితల మృతదేహాలను చూసి బంధువులు, తోటి ఉద్యోగులు, స్నేహితులు కంటతడి పెట్టుకున్నారు. సరిత తండ్రి ఇజ్జగిరి చేరాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉద్యోగంలో సౌమ్యురాలు.. హన్మకొండ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసే మనుగొండ సరితకు సౌమ్యురాలుగా పేరుంది. కొడుకు మరణించిన తర్వాత అందరితో తక్కువగా మాట్లాడేదని, కొడుకు జ్ఞాపకాలతోనే రోజులు గడిపేదని సహ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి కంటతడితో నివాళులు అర్పించారు. సరిత మరణం వార్త విన్న ఉద్యోగులు, అధికారులు, ఉద్యోగ సంఘాల నేతల పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని నివాళులు అర్పించారు. తన కొడుకులా.. ఎవరికీ జరగొద్దని.. సరిత కుమారుడు రోహిత్కు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ధరించి ఉంటే బతికేవాడని బంధువులు తెలిపారు. తన కొడుకులా మరెవరికీ అలాంటి పరిస్థితి రావొద్దని.. సరిత.. రోహిత్ స్నేహితులు, బంధువులకు 100 మందికిపైగా హెల్మెట్లు కొనిచ్చింది.. ఈ సారి రాఖీ పండుగకు తన బంధువుల్లో ద్విచక్రవాహనాలు ఉన్న వారందరికీ హెల్మెట్లు కొనివ్వడానికి కూడా ఏర్పా ట్లు చేసిందని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. నివాళులర్పించిన కలెక్టర్, జేసీ భర్త, కుమారుడి మరణంతో మనస్తాపం చెంది ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన మనుగొండ సరిత, కూతురు మధుమిత మృత దేహాలను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట, జేసీ దయానంద్, హన్మకొండ తహసీల్దార్ ఖాజామోయినోద్దిన్లు సందర్శించి నివాళులర్పించారు. గురువారం రాత్రి కావడంతో మృత దేహాలకు శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. -
వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి
డోర్నకల్ మహబూబాబాద్ : వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. దీంతో మహబూబాబాద్ జిల్లా డో ర్నకల్ మండలంలోని కస్నాతండా, గార్ల మం డలంలోని అంజనాపురం, హన్మకొండలోని న్యూ రాయపురలో విషాదఛాయలు అలుముకు నా ్నయి. ట్రాక్టర్ అదుపు తప్పడంతో ఓ రైతు మృతి చెందాడు. స్థానిక రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డోర్నకల్ మండలంలోని కస్నాతండాకు చెందిన గుగులోత్ శంకర్(28)కు రెండున్నర ఎకరాల పొలం ఉంది. గురువారం పొలాన్ని దున్ని నాటు వేసేందుకు ఇదే తండాకు చెందిన గుగులోత్ శ్రీనుతో కలిసి తన సొంత ట్రాక్టర్ను నడుపుకుంటూ బయలుదేరాడు. శంకర్ ట్రాక్టర్ను నడుపుతుండగా శ్రీను ఇంజన్ వెనుక నిల్చున్నాడు. ట్రాక్టర్ పాతదుబ్బతండా సమీపంలో ఉన్న పొలం వైపు వెళ్తుండగా..మలుపు వద్ద అకస్మాత్తుగా ఎదురుగా ద్విచక్ర వాహనం రావడంతో ట్రాక్టర్ను పక్కకు తిప్పాడు. దీంతో ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్ననీటి గుంతలో తలకిందులుగా పడిపోయింది. ట్రాక్టర్ నడుపుతున్న శంకర్ ట్రాక్టర్ కింద బురదలో కూరుకుపోగా శ్రీను నీటిలో పడిపోయాడు. చుట్టు ప్రక్కల రైతులు వచ్చి శంకర్ను బయటకు తీయగా అప్పటికే చనిపోయాడు. శ్రీనుకు స్వల్ప గాయాలయ్యాయి. శంకర్కు భార్య, ఆరు నెలల పాప ఉన్నారు. డోర్నకల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబం ట్రాక్టర్ అదుపు తప్పిన ఘటనలో గుగులోత్ శంకర్ మృతిచెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. శంకర్ అన్న వీరభద్రం రెండు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన భార్య ఇద్దరు పిల్లలను వదిలి వెళ్లడంతో వారి సంరక్షణ బాధ్యత కూడా శంకర్ చూసుకుంటున్నాడు. ప్రస్తుతం తండాలోని ప్రభుత్వ పాఠశాలలో వీరభద్రం కూతురు హర్షవర్ధిని ఐదో తరగతి, కుమారుడు కార్తీక్ రెండో తరగతి చదువుతున్నారు. బాబాయి మృతితో హర్షవర్ధిని, కార్తీక్ రోదనలు మిన్నంటాయి. విద్యుదాఘాతంతో మహిళా రైతు.. గార్ల: విద్యుదాఘాతంతో ఓ మహిళా రైతు మృతి చెందిన సంఘటన అంజనాపురం సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గార్ల మండలం అంజనాపురానికి చెందిన ఇస్లావత్ బుజ్జి అలియాస్ తోలి(40).. అదే గ్రామంలోని ఓ రైతుకు చెందిన 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయ చేస్తోంది. కౌలు పొలం నాటు వేసేందుకు గురువారం బావి వద్దకు వెళ్లింది. పొలం నాటు వేస్తుండగా, మోటారును బంద్ చేసేందుకు వ్యవసాయి బావి వద్దకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై అక్కడ్కిక్కడే మృతి చెందింది. ఇరుగు పొరుగు వారు వచ్చే సరికే అప్పటికే ఆమె మృతి చెందింది. ఆమె భర్త హచ్చ 15 ఏళ్ల క్రింతం అనారోగ్యంతో మృతి చెందాడు. మృతురాలికి ఒక కూతురు, ఒక కుమారుడు సంతానం. కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు. రెడ్కాడితే డొక్కాడని మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వివిధ పార్టీల నాయకులు కోరారు. మృతురాలి కుమారుడు కిరణ్ ఫిర్యాదు మేరకు గార్ల ఎస్సై పి.శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మహిళ.. ధర్మసాగర్ : అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన ధర్మసాగర్ మండలంలోని బంజరుపల్లిలో గురువారం వెలుగు చూసింది. స్థానికులు, ధర్మసాగర్ పోలీసుల కథనం ప్రకారం.. హన్మకొండ న్యూరాయపురకు చెందిన గండె విజయలక్ష్మి (63) బంజరుపల్లిలోని సాయిబాబా దేవాలయంలో దైవ దర్శనం కోసం ఒంటరిగా వచ్చింది. ఇక్కడే ఉన్న రేకుల షెడ్లో రెండు రోజులుగా ఉంటోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆలయ ఆశ్రమ సమీపంలో ఉన్న మరుగుదొడ్డిలో తలపగిలి విగత జీవిగా పడి ఉంది. ఆలయ పూజారి గ్రామస్తులకు సమాచారం అందించడంతో విషయం వెలుగు చూసింది. సమాచారం అందుకున్న ధర్మసాగర్ ఎస్సై విజయ్రాంకుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కాగా, మృతురాలు గతంలో కూడా ఇక్కడకు దైవదర్శనం కోసం వచ్చి రెండు రోజుల పాటు ఉండి వెళ్లేదని, తరచూ దేవాలయాలు సందర్శిస్తు ఉంటుందని ఆమె బంధువులు వెల్లడించారు. మృతురాలి కొడుకు సంపత్ ఫిర్యాదు మేరు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయలక్ష్మికి ఇద్దరు కుమారులు, కుమారై ఉన్నారు. -
గర్భంలోనే పిండం మృతి
మహబూబాబాద్ రూరల్ : వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా గర్భంలోని పిండం మృతి చెందిందని బాధితురాలి బంధువులు మానుకోట ఏరియా ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధితురాలి భర్త పల్ల సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. కురవి మండలం సూదనపల్లికి చెందిన పల్ల భార్గవి నెలలు నిండి వారం రోజులు పూర్తయ్యాక పురుటి నొప్పులు రావడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏరియా ఆస్పత్రికి వచ్చింది. విధుల్లో ఉన్న గైనకాలజిస్టు ఆశాదేవి భార్గవిని పరీక్షించి ఓ ఇంజక్షన్ తెప్పించి ఇవ్వడంతో కొంత ఉపశమనం లభించింది. డెలివరీ కోసం అక్కడే ఉండిపోయింది. రాత్రి 8 గంటల సమయంలో స్కానింగ్ తీయించిన డాక్టర్ ఆశాదేవి రిపోర్టు చూసి చిన్న నొప్పులే.. నార్మల్ డెలివరీ అవుతుంది.. గర్భంలో శిశువు హార్ట్బీట్ బాగానే ఉందని చెప్పింది. కొంచెం నొప్పులు వస్తున్నాయని భార్గవి చెప్పినా పట్టించుకోలేదని సందీప్ తెలిపాడు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో రౌండ్స్కు వచ్చిన సూపరిండెంటెంట్, గైనకాలజిస్టు వెంకట్రాములు భార్గవిని పరీక్షించి స్కానింగ్ చేసి కడుపులో శిశువు మృతి చెందిందని చెప్పారు. రాత్రి డాక్టర్ చెప్పిన విషయం ఆయన దృష్టికి తీసుకురాగా మరో వారం రోజుల వరకు కూడా డెలివరీ చేసేందుకు అవకాశం ఉందని చెప్పి వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఒంటి గంట సమయంలో భార్గవిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి అనంతరం మృతి చెందిన ఆడ శిశువును కుటుంబ సభ్యుల చేతిలో పెట్టారు. దీంతో వారు బోరున విలపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు గర్భంలోనే మృతి చెందిందని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. -
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి ఆత్మహత్య
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసుకోగా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో భార్య కాపురానికి రావడం లేదని ఒకరు, కురవి మండలంలో అవమానం భరించలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. నర్సింహులపేట : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని కౌంసల్యదేవిపల్లి గ్రామంలో భార్య కాపురానికి రాలేదనే మనస్తాపంతో బుధవారం ఎర్పుల నరేష్(36)అనే వ్యక్తి ఉరి వేసుకొని అత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సంతోష్రావు కథనం ప్రకారం.. కౌంసల్యదేవిపల్లికి చెందిన నరేష్ గత 12 సంవత్సరాల క్రితం కరవి మండలానికి చెందిన సావిత్రతో వివాహం జరిగింది. వీరికి ఇద్దకు కుమారులున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి భార్య కాపురానికి రాకుండా పుట్టింట్లోనే ఉంటోంది. దీంతో మనస్తాపానికి బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అప్పుల బాధతో రైతు.. తరిగొప్పుల: అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానిక ఎస్సై రాజేష్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం... మండలకేంద్రానికి చెందిన సాయబోయిన మహేందర్(30) తన తండ్రి పేరు మీదున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయం, ఇటు హమాలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతంలో తన ఇద్దరు అక్కల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పు, పెట్టుబడికి తెచ్చిన అప్పు రూ. 3 లక్షలు ఎక్కువగా కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై తన వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు 108లో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందనట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య స్వరూప, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.దొంగతనం మోపారని విద్యార్థి..కురవి(డోర్నకల్): ఊరి పెద్దలు దొంగతనం మోపడంతో అవమానం భరించలేక మనోవేదనకు గురైన ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్ప డిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చింతపల్లి శివారు దీరావత్ తండాలో జరిగింది. మృతుడి తల్లి లక్ష్మి కథనం ప్రకారం.. తండాకు చెందిన మాలోత్ వంశీ(17) మరిపెడ బంగ్లాలోని ఓ ప్రైవేటు కాలేజిలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. లక్ష్మి భర్త లక్పతి కొన్నేళ్ల క్రితం చనిపోగా ధీరావత్తండాలోని తన తల్లిగారింటికి వచ్చింది. అక్కడే ఉంటూ కుమారుడిని టెన్త్ వరకు చింతపల్లి హైస్కూల్లో చదివించింది. 15 రోజుల క్రితం చింతపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వంశీతోపాటు మరో నలుగురు జేసీబీలో బ్యాటరీ, డీజిల్ దొంగతనం చేశాడని సీరోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశీని పట్టుకెళ్లిన పోలీసులు దొంగతనంపై విచారణ చేపట్టగా మృతుడి తల్లి లక్ష్మి తండాలోని పెద్దల సహకారంతో స్టేషన్కు వెళ్లి కుమారుడిని విడిపించింది. 10 రోజుల క్రితం చోరీ విషయంలో పెద్దమనుషులు పంచాయితీ నిర్వహించి రూ.35 వేల జరిమానా విధించారు. వంశీతోపాటు మరో నలుగురికి ఒక్కొక్కరికి రూ.35 వేల చొప్పున చెల్లించాలని తీర్మానించారు. దీంతో మనస్తాపానికి గురైన వంశీ ఈ నెల 17న పురుగుల మందు తాగాడు. దీంతో వెంటనే మరిపెడకు, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించగా చికిత్సపొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. చోరీ కేసులో ఇరికించి జరిమానా తీసుకున్న భూక్య సైదులు, మామిండ్ల వెంకన్నపై మృతుడి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరిపెడ సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. మాకే సంబంధం లేదు.. వంశీ మృతికి తమకు ఏమి సంబంధం లేదని భూక్య సైదులు, మామిండ్ల వెంకన్నలు తెలిపారు. గ్రామంలో గత కొన్ని నెలల క్రితం జేసీబీలోని డీజిల్, బ్యాటరీలు ఎత్తుకెళ్లినట్లు జేసీబీ డ్రైవర్ రవి జూన్ 29న సీరోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడని, ఆ కేసులో కొందరిని పోలీసులు విచారణ చేశారన్నారు. తమపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. ఇద్దరిపై కేసు.. మాలోత్ వంశీ తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు చింతపల్లికి చెందిన భూక్య సైదులు, మామిండ్ల వెంకన్నలపై కేసు నమోదు చేసినట్లు మరిపెడ సీఐ శ్రీనివాస్ తెలిపారు. మృతదేహాన్ని శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోటకు తరలించినట్లు చెప్పారు. -
తాగొచ్చి వేధిస్తున్నాడని..
నర్సింహులపేట : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని వస్రాతండా పాశంబోడు గుట్టపై కాలిన మృతదేహం కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మంగళవారం మానుకోట ఎస్పీ కోటిరెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి హత్య వివరాలను వెల్లడిం చారు. మండలంలోని వస్రాంతండా శివారులోని పాశంబోడు గుట్టపై ఈనెల 10వ తేదీన కాలిన మృతదేహం ఆనవాళ్లను గొర్రెల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. స్థానిక ఎస్సై సతీష్కుమార్ అనుమానాస్పద స్థితి మృతి కేసును నమోదు చేసుకుని, సీఐ చేరాలుతో ఆధ్వర్యంలో విచారణ చేపట్టారని పేర్కొన్నారు. మృతదేహం ముంగిమడుగు శివారు లాలితండాకు చెందిన గుగులోతు సురేష్ (38)గా గుర్తించారన్నారు. అనంతరం అతడి భార్య సరిత, బంధువులను విచారించగా విషయాలు బయటికొచ్చాయన్నారు. నెల రోజులుగా మద్యం తాగివచ్చి వేధిస్తున్న భర్తను ఎలాగైన హతమార్చాలని భార్య సరిత పూనుకుందని, బంధువులైన సుమన్, గణేష్ సాయంతో ముందుగా పథకం వేసుకున్నారని ఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో ఈనెల 9వ తేదీన రాత్రి తన తల్లిగారి గ్రామమైన వస్రాంతండాలో అతడికి బాగా మద్యం తాగించారు. అనంతరం విసురురాయి బండతో తలపై మోదీ హతమార్చారని ఎస్పీ పేర్కొన్నారు. సమీపంలోని పాశంబోడు గుట్టపైకి మృతదేహాన్ని పెట్రోల్తో కాల్చివేశారు. ఈ సందర్భంగా హత్యకు ఉపయోగించిన వస్తువులను ఎస్పీ స్వాధీనం చేసుకుని సమావేశంలో హాజరుపరిచారు. భార్య సరితతోపాటు హత్యకు సహకరించిన బంధువులు సుమన్, గణేష్ను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు వివరించారు. కేసును ఛేదించిన డీఎస్పీ, సీఐ, ఎస్సైని ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజారత్నం, సీఐ చేరాలు, ఎస్సై సతీష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కీలక ఆధారమైన నల్ల నువ్వులు.. సురేష్ మృతదేహం చుట్టూ చల్లిన నల్ల నువ్వులు నిందితులను పట్టించడానికి కీలక ఆధారంగా మారినట్లు తెలుస్తోంది. ఈనెల 10వ తేదీన పాశంబోడు గుట్టపై మృతదేహం ఉందని గొర్రెల కాపరులు చెప్పడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కాగా, కాల్చిన మృతదేహం చుట్టూ నల్ల నువ్వులు, కళ్లలో సూదులు గుచ్చి ఉండడం ఫోరెన్సిక్ విచారణలో తేలినట్లు సమాచారం. అయితే లంబాడీలు.. చనిపోయిన వ్యక్తి చుట్టూ నల్లనువ్వులు చల్లి, కళ్లలో సూదులతో గుచ్చి అంత్యక్రియలు చేస్తారు. దీంతో చనిపోయిన వ్యక్తి తండావాసిగా గుర్తించి సంబంధిత కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నల్ల నువ్వలతో కేసును ఛేదించడం పోలీసులకు తేలికైనట్లు తెలుస్తోంది. -
కుటుంబ కలహాలతో సవతి తల్లిపై హత్యాయత్నం
నల్లబెల్లి జయశంకర్ జిల్లా : కుటుంబ కలహాలతో సవతి తల్లిపై కుమారుడు పెట్రోలు పోసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బూర సాంబయ్య తన మొదటి భార్య 20 ఏళ్ల క్రితం చనిపోగా విజయను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమారుడు రాజుకుమార్ బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం రాజుకుమార్ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఇంటి కరెంట్ బిల్లు చెల్లింపు విషయంలో మంగళవారం కుటుంబంలో గొడవ జరగగా అతడు విజయ–సాంబయ్య దంపతులపై దాడి చేసి గాయపరిచాడు. కాగా వారు పోలీసులు ఆశ్రయించారు. దీంతో ఆగ్రహనికి గురైన రాజుకుమార్ ప్లాస్టిక్ బాటిల్లో పెట్రోలు తీసుకొచ్చి ఇంటి ముందున్న సవతితల్లిపై పోసి నిప్పంటిం చేందుకు యత్నించాడు. అప్రమత్తమైన ఆమె ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగెత్తింది. ఆగ్రహంతో ఊగిపోయిన రాజ్కుమార్ ఇంటి ఆవరణలో ఉన్న తండ్రి ద్విచక్రవాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో దహనమైంది. దీంతో బాధితులు మళ్లీ పోలీసులను ఆశ్రయించారు. -
కన్నపేగును కాదనుకుని..
జనగామ : పిల్లలు మారాం చేసినా.. తండ్రి మందలించినా..అక్కున చేర్చుకునే ప్రేమ అమ్మ వద్దనే దొరుకుతుంది. తన కడుపును మాడ్చుకుని పిల్లల ఆకలి కోసం ఆరాటపడే ఓ తల్లి.. తన నాలుగు మాసాల కూతురు.. ఐదేళ్ల కొడుకును జనగామ చంపక్హిల్స్లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో వదిలి వెళ్లిపోయిన బాధాకరమైన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. రోగులు, డాక్టర్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఊరు, పేరు తెలియని ఓ తల్లి.. తన కుమారుడు (5), కుమార్తె (4నెలలు)ను తీసుకుని సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఎంసీహెచ్కు వచ్చింది. రాత్రి వరకు అక్కడే ఉన్న ఆ తల్లి తన ఇద్దరు పిల్లలను పార్కులో వదిలి ఆటోలో వెళ్లి పోయింది. రాత్రి వరకు అక్కడే ఉన్న పిల్లలను రోగి బంధువులు చూసి వైద్యులకు సమాచారం అందించారు. అరగంటపాటు ఐదేళ్ల బాబుని విచారించగా అమ్మపేరు శైలజ, తన పేరు సాయి, చెల్లి పేరు మానస, ఊరిపేరు గోంస్లా అంటూ బుడి బుడి మాటలతో చెబుతూ ఏడ్చాడు. అక్కడే ఉన్న ఓ మహిళ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి అమ్మలా ప్రేమను పంచింది. ఏరా ..ఏమైంది..అమ్మ ఎక్కడికి వెళ్లింది.. నాన్న కొట్టాడా అంటూ ఆప్యాయంగా అడిగింది. నాన్న అమ్మను కొట్టాడు.. అమ్మమ్మ ఇంటికి వెళ్లి పొమ్మన్నాడు అంటూ తడబడుతూ చెప్పాడు. వెంటనే పోలీసులు ఆస్పత్రిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. తల్లి తన ఇద్దరు పిల్లలతో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇక్కడకు వచ్చినట్లు నిర్ధారించుకున్నారు. కుమారుడు సాయి మాట్లాడే భాషను క్షుణ్ణంగా పరిశీలించగా.. ఖమ్మంగా జిలాకు చెందిన వారా లేదా ఏపీకి చెందిన వారా అని ఆరా తీస్తున్నారు. రైలులో వచ్చి ఆస్పత్రి వరకు ఆటోలో వచ్చినట్లు చిన్నోడు సాయి చెబుతున్నాడు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులే రైలును బండి అనడంతో..అక్కడి వారుగా భావిస్తున్నారు. ఇటుక, బొగ్గు, సీసీ రింగులు, భవన నిర్మాణ కార్మికులు పొట్టకూటి కోసం చాలా మంది ఆంధ్ర ప్రాంత వాసులు జిల్లాలో బతుకుతున్నారు. పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వివరాలను రాత్రికి రాత్రే రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఈ విషయమై డీసీపీ మల్లారెడ్డి స్థానిక పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పిల్లలను ఐసీడీఎస్ ప్రతినిధులకు అప్పగించారు. -
చిన్నారిపై బాలుడి అఘాయిత్యం
నెక్కొండ(నర్సంపేట) వరంగల్ : అభం, శుభం తెలియని ఓ చిన్నారిపై ఆటలాడిస్తానంటూ నమ్మబలికి ఓ బాలుడు అఘాయిత్యానికి ఒడిగట్టిన సంఘటన మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెక్కొండ మండలంలోని రెడ్లవాడ శివారు విద్యుత్ సబ్స్టేషన్ తండాకు చెందిన 16 ఏళ్ల బాలుడు అదే తండాకు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఇంటికి తరచూ వస్తుంటారన్నారు. బాలిక తండ్రి బట్టల వ్యాపారం చేసేందుకు వెళ్లగా, ఆమె తల్లి వ్యవసాయ పనులకు వెళ్లింది. ఈ క్రమంలో ఈ నెల 17న ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలుడు వచ్చి తండా సమీపంలోని ఓ గుడి వద్దకు బాలికను తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపారు. అనంతరం ఇంటికి వచ్చిన తండ్రి ఏ డ్చుకుంటూ ఉన్న బాలికను గమనించి వ్యవసా య పనులకు పోయిన తల్లి దగ్గరకు తీసుకువెళ్లా డు. దీంతో కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో జరిగిన విషయాన్ని గమనించింది. పెద్ద మనుషులు జోక్యం చేసుకొని బాలుడి కుటుంబ సభ్యుల ను నిలదీశారు. పెద్ద మనుషుల సలహాతో సోమవారం చిన్నారి తల్లి సుజాత పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగు చూసింది. దీంతో ఏసీపీ సునీతామోహన్ తండాకు చేరుకొని దర్యాప్తు చేసి, చిన్నారిని వైద్య పరీక్షలకు పంపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అనుమానంతో గొంతునులిమి..
దుగ్గొండి(నర్సంపేట): మూడు ముళ్లు.. ఏడడుగులు వేసి పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు. అంతలోనే భార్యపై అనుమానంతో గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొండి రమేష్కు ఇదే మండలం రేబల్లె గ్రామానికి చెందిన గోరంటాల విశ్వనాథం, సరోజన దంపతుల కూతురు కొండి రజిత(35)ను ఇచ్చి 19 ఏళ్ల క్రితం వివాహం చేశారు. భార్యభర్తలు ఇద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి (మహేశ్వరీ, భార్గవ్, కార్తీక్) ముగ్గురు పిల్లలు జన్మించారు. అయితే గత కొంతకాలంగా రజిత అనారోగ్యంతో బాధపడుతుంది. రెండు నెలల క్రితం గర్భసంచికి పుండు రావడంతో ఆపరేషన్ చేయించుకుని పుట్టింటిలోనే ఉంటుంది. నాలుగు రోజుల క్రితం రజిత అత్తారింటికి వచ్చింది. తాగుడుకు బానిసగా మారిన భర్త రమేష్ అత్తారింటికి వచ్చిన భార్య రజితను అనుమానిస్తూ గొడవకు దిగేవాడని స్థానికులు చెప్పారు. ఆదివారం రాత్రి నిద్రపోతున్న రజితను విచక్షణరహితంగా గొంతు నులిమి చంపి పారిపోయాడన్నారు. సోమవారం తెల్లవారినా.. తల్లి నిద్రలోంచి లేవక పోవడంతో పిల్లలు ఇరుగు పొరుగు వారికి చెప్పారు. స్థానికులు వెళ్లి చూడగా రజిత అప్పటికే మృతి చెంది ఉంది. తల్లి అరుపులు విని నిద్రలేచిన పిల్లలు.. రజితను ఆమె భర్త రమేష్ గొంతు నులుముతుండగా రజిత ఏడుస్తుంటే పిల్లలు నిద్రలేచారన్నారు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావని పిల్లలు ప్రశ్నించగా తలనొప్పిగా ఉండటంతో జండుబామ్ రాసుకుంటున్నానని పిల్లలకు చెప్పి నిద్రపుచ్చారని స్థానికులు తెలి పారు. పిల్లలు పడుకు న్న అనంతరం గొంతు నులిమి హత్య చేశాడని పలువులు చర్చించుకుంటున్నారు. కాగా అమ్మా..లే అమ్మా.. అంటూ తల్లి మృతదేహంపై పిల్లలు పడి రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. అందరితో కలివిడిగా ఉండే రజిత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ.. సంఘటన స్థలాన్ని దుగ్గొండి సర్కిల్ సీఐ బోనాల కిషన్, ఎస్సై ఊరడి భాస్కర్రెడ్డిలు పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతురాలి సోదరుడు గొరంటాల రంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
తల్లీకొడుకును బలిగొన్న బస్సు
వరంగల్ క్రైం: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తల్లీ, కొడుకులను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు బలితీసుకుంది. కళ్లముందే కట్టుకున్న భార్య, కన్న కొడుకు ఇద్దరు రక్తం మడుగులో కొట్టుకుంటుంటే ఆ తండ్రి పడిన వేదన అందరి చేత కంటతడి పెట్టించాయి. సీఐ సంపత్కుమార్ కథనం ప్రకారం.. ఆత్మకూర్ మండలానికి చెంగిన పాపని సరిత (32), శ్రీనివాస్ దంపతులు బ్రాహ్మణవాడలో అద్దెకు ఉంటున్నారు. వారికి కుమారుడు రుత్విక్ (7) ఉన్నాడు. శ్రీనివాస్ కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. సరిత, రిత్విక్ ఆదివారం ఉదయం ఇంటర్నెట్లో పని ఉండి హన్మకొండ చౌరస్తాకు వచ్చారు. పని ముగించుకొని భర్త శ్రీనివాస్కు ఫోన్ చేయగా తాను కూడా చౌరస్తాకు వచ్చానని, అశోకా జంక్షన్ దగ్గర ఉండాలని ఫోన్లో చెప్పాడు. సరిత, రిత్విక్ ఇద్దరు చౌరస్తా నుంచి అశోక్ జంక్షన్ వైపు నడుచుకుంటూ వస్తున్నారు. వారి వెనక సుమారు 5 నుంచి 10 మీటర్ల దూరంలో వెనక నుంచి శ్రీనివాస్ నడుచుకుంటూ వస్తున్నాడు. ఉదయం 10.43 గంటలకు హన్మకొండ పెట్రోల్ పంపు నుంచి బస్టాండ్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు జంక్షన్లో మూల తిరుగుతూ రోడ్డు దాటుతున్న సరిత, రిత్విక్ను బస్సు ఢీకొట్టి వారి మీది నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన చూసిన స్థానికులు బస్సును నిలిపి వేశారు. రిత్విక్ తల పగిలి అత్యంత దారుణంగా అక్కడికక్కడే మృతిచెందగా.. కొనఊపిరితో ఉన్న సరితను ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు సీఐ సంపత్రావు తెలిపారు. తన కళ్ల ముందే భార్య సరిత, కొడుకు రిత్విక్లు ఇద్దరు రక్తం మడుగులో కొట్టుకుంటుంటే శ్రీనివాస్ గుండెలవిసెలా విలపించిన తీరు అందరి చేత కన్నీరు పెట్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యం.. హన్మకొండ పెట్రోల్పంపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు అశోక జంక్షన్లో మూల తిరగాల్సిన దగ్గర తిరగకుండా, చౌరస్తా నుంచి బస్టాండ్ వైపుకు ఉన్న ఫ్రీ లెప్ట్ నుంచి బస్సు మూల మలుపు తిరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల మూలమలుపులో నీళ్లు నిలిచిఉన్నాయి. డ్రైవర్ అజాగ్రత్తగా, మూలమలుపులో కూడా వేగంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మిన్నంటిన బంధువుల రోదనలు.. ఎంజీఎం: రోడ్డు ప్రమాదంలో తల్లితో సహా కొడు కు సైతం మృతిచెందడంతో వారి బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఆ మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం స్వగ్రామమైన ఆత్మకూర్కు మృతదేహాలను తరలించారు. కాగా, మా ర్చురీ వద్ద కుటుంబసభ్యులను పరకాల ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి, ధర్మరాజు పరామర్శించారు. -
వృద్ధుడి వద్ద డబ్బులు అపహరణ
వర్ధన్నపేట వరంగల్ : తన ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు బ్యాంకుకు వెళ్లిన ఓ వృద్ధుడి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులను అపహరించిన సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై ఉపేందర్రావు కథనం ప్రకారం... వర్ధన్నపేట పట్టణానికి చెందిన బోయినపెల్లి కమలాకర్రావు తన కొడుకు పంపిన రూ.4.20లక్షలు ఈ నెల 6న బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి వెళ్లాడు. డీనామినేషన్ ఓచర్ నింపి క్యాష్కౌంటర్ వద్ద డబ్బులు జమచేయడానికి క్యూలో నిల్చున్నాడు. తనవంతు రాగానే కౌంటర్లో ఓచర్, డబ్బులు క్యాషియర్కు అందజేశాడు. క్యాషియర్ ఆ డబ్బులు లెక్కించి ఓచర్లో ఉన్న నగదుకు రూ.20వేలు తక్కువ వచ్చాయని చెప్పాడు. దీంతో తాను తాను పలుమార్లు లెక్కించి తెచ్చానని, ఆ డబ్బు కౌంటర్ వద్దే మాయమయ్యాయని వాదించాడు. మేనేజర్ దృష్టికి తీసుకెళ్దామంటే వారం రోజులు సెలవులో ఉన్నారు. బ్యాంకు మేనేజర్ రాగానే సీసీ ఫుటేజీ పరిశీలిస్తే విషయం తేలిపోతుందని బ్యాంకు సిబ్బంది కమలాకర్రావుకు నచ్చజెప్పి పంపారు. వారమవుతున్నా సమాచా రం లేకపోవడంతో అ తడు ఈనెల 13న పోలీ స్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బ్యాంకు మేనేజర్ గురువారం విధులకు రాగా సీసీ ఫుటేజీలను పరిశీలించారు. కమలాకర్ రావు డబ్బులు చేతిలో పట్టుకుని క్యూలైన్లో నిల్చుని ఉండగా యువకులు చుట్టూ ఉండగా, ఓ యువకుడు డబ్బు కట్టల నుంచి నెమ్మదిగా లాగి ఆ డబ్బు కాగితంలో చుట్టి తీసుకుని బయటకు వెళ్లి నట్లు స్పష్టంగా రికార్డయ్యింది. ఇటీవల జనగామ జిల్లా బచ్చన్నపేట బ్యాంక్లో సైతం ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. -
ఫ్యామిలీ గెటప్లో గంజాయి రవాణా
కరీమాబాద్ : చేతిలో చంటిపిల్లలు.. భుజాలకు హ్యాండ్ బ్యాగులు..కుటుంబ సభ్యులందరూ పం డుగకు రైల్లో ఊరెళ్తున్నట్లుగా ఉంటారు.. కానీ వా రు గంజాయి రవాణా చేస్తున్నారని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఆయా వ్యాపారులు రైల్లో మహిళలు, మహిళా కూలీలను ఉపయోగిస్తున్నారు. ఇటీవల వరంగల్ రైల్వేస్టేషన్లో రెండు వేర్వేరు రైళ్లలో హర్యానా, ఒడిషాకు చెందిన రెండు ముఠాలు పో లీసులకు పట్టుబడటమే ఉదాహరణ.ఇందులో ఆ రుగురు మహిళలతోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వారివద్ద117కిలోల ఎం డు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా, విశాఖపట్టణం నుంచి రైళ్లలో చంటిపిల్లలున్న మ హిళలను, మహిళా కూలీలను ఒక్కొక్కరికి రూ. 5 వేల చెల్లిస్తూ గంజాయి రవాణాకు ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా కోనార్క్,ఈస్ట్కోస్ట్,ఏపీ,గౌతమి ఎక్స్ప్రెస్ రైళ్లలో గంజాయి రవాణా సాగుతోంది. ఏడాది కాలంలో.. గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు రైళ్లలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని వరంగల్ జీఆర్పీ పోలీసులు దశలవారీగా పట్టుకున్నారు. ఇందులో మొత్తం 620 కిలోల గంజాయిని పట్టుకోగా 11 కేసులు కూడా నమోదయ్యాయి. ఇందులో 33 మందిని అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.60లక్షలు ఉంటుంది. ఈ కేసుల్లో పురుషులతోపాటు మహిళలు ఉన్నారు. అరెస్టయిన మహిళలు.. ఒడిషా, విశాఖపట్నం ప్రాంతాల్లోని గంజాయి డా న్లు మహిళల ద్వారా గంజాయిని ఢిల్లీ, మహా రాష్ట్ర ప్రాంతాలకు వందలాది కిలోలు రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా జనరల్ బోగీల్లో ప్రయానిస్తూ ఆంధ్రప్రదేశ్లోని పలు రైల్వేస్టేషన్లు దాటి వరంగల్కు వచ్చి ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్లే రైళ్లలో ఎక్కే క్రమంలో పోలీసులకు దొరికిపోతున్నారు. ఇప్పటివరకు మహారాష్ట్రకు చెందిన రానీ రాజ్నా యుడు, ఆర్తి రవిదేవర్,రేవటీనాయక్,హర్యానాకు చెందిన గీతాబౌరీ,కమలా బగిడె,పూజా బౌరీ, గం గా బౌరీ, ఒరిస్సాకు చెందిన మీరాసేతీ, పూనమ్ ముత్యం, పంకజ్ నిషల్, నిస్తా లిమా, గౌరీ పెదనూయి, దీప్తి మిషల్ తదితరులు అరెస్టయ్యారు. వారందరూ కూలీలే.. ఒడిశా, విశాఖపట్టణం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఎక్కువగా మహారాష్ట్ర, ఢిల్లీ ప్రాంతాలకు ఎండు గంజాయి రవాణా అవుతోంది. గంజాయి డాన్లు దళారులను ఏర్పాటు చేసుకుని రైళ్లలో పేద, మధ్యతరగతి కూలీ మహిళలను ఎంచుకుని వారితో సరఫరా చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రూ.500 కిలోల గంజాయి కొని, వాటిని ప్యాకెట్లుగా చేసి సంచుల్లో పెట్టి దళారుల ద్వారా ఒక్కో మహిళకు ట్రిప్కు రూ.5వేల చొప్పున ఇస్తుండడంతో వారు ఆశపడి రవాణా చేస్తూ పోలీసులకు దొరికిపోతున్నారు. కాగా పట్టుబడిన మహిళలు తాము ఎందుకు ఈ దందాలోకి ఎందుకు వచ్చామా అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. పోలీసులు ప్రశ్నించిన సందర్భాల్లో వారు తమకు గంజాయి అప్పగించిన వ్యక్తుల గురించి తెలియజేయడంలేదు. అయినప్పటికీ ఇటీవల వైజాగ్కు చెందిన సహదేవ్ అనే గంజాయి వ్యాపారి గురించి మాత్రం తెలుసుకోగలిగారు. గంజాయి రవాణా చేస్తే కేసులు గంజాయి రవాణా చేస్తే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నాం. రైళ్లలో తనిఖీలు చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశాం. ఎలాంటి అనుమానం వచ్చినా సోదా చేస్తున్నాం. ఇటీవల అక్రమ గంజాయి రవాణాలో కుటుంబ సభ్యుల్లా మహిళలు బ్యాగుల్లో గంజాయి తరలిస్తుండటం గమనించి పట్టుకున్నాం. గంజాయి తరలించి జైలు పాలు కావొద్దు. – జూపల్లి వెంకటరత్నం, సీఐ వరంగల్ జీఆర్పీ -
నకిలీ నక్సలైట్ అరెస్ట్
వరంగల్ క్రైం : సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఛతీస్ఘడ్ రాష్ట్రం భూపాలపట్టణం తారుడు గ్రామానికి చెందిన పులాయిల భానయ్య నక్సలైట్ పేరు చెప్పి నగరంలో డబ్బు వసూళ్లు చేయడానికి వస్తున్నట్లు వచ్చిన ముందస్తు సమాచారంతో భానయ్యను అరెస్టు చేసినట్లు సీసీఎస్ ఇన్స్పెక్టర్ డేవిడ్రాజ్ తెలిపారు. వివరాలు ఏటురునాగారంలో రాక్ స్పోకెన్ ఇంగిష్ తరగతులను నిర్వహిస్తున్న భానయ్య కోచింగ్ సెంటర్లో నష్టం రావడంతో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో నగరానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. హర్యానాలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి రూ.15 వేలు పెట్టి తపంచను కొనుగోలు చేసినట్లు డేవిడ్రాజ్ తెలిపారు. నక్సలైట్ పేరు చెప్పి తన ఇంట్లో ఉన్న తపంచ, రెండు కత్తులు తన కళాశాల బ్యాగులో పెట్టుకొని హన్మకొండకు వచ్చినట్లు ఆయన తెలిపారు. క్రైమ్ అడిషనల్ డీసీపీ బిల్లా అశోక్కుమార్కు వచ్చిన సమాచారంతో హన్మకొండ బస్టాండ్ ప్రాంతంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ డేవిడ్రాజ్, హన్మకొండ ఎస్సై ప్రవీన్కుమార్లు సిబ్బందితో భానయ్యను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. భానయ్యను విచారించగా తాను వేసుకున్న ప్రణాళికను ఒప్పుకున్నాట్లు ఆయన పేర్కొన్నారు. తపంచ,కత్తులు స్వాధీనం నిందితుడు భానయ్య నుంచి ఒక తపంచ, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు డేవిడ్రాజ్ తెలిపారు. ఎలాంటి సంఘటన జరుగకుండా నిం దితుడిని సకాలంలో అరెస్టు చేయడంలో జాగ్రత్త పడిన క్రైం అడిషనల్ డీసీపీ అశోక్కుమార్, ఏసీపీ బాబురావు, ఇన్స్పెక్టర్ డేవిడ్రాజ్, ఎస్సై ప్రవీన్కుమార్, హెడ్కానిస్టేబుల్ జంపయ్య, కానిస్టేబుళ్లు రాజశేఖర్, చంద్రశేఖర్లను వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్ అభినందించారు. -
గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యం
నర్సింహులపేట(డోర్నకల్): గుర్తు తెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యమైన సంఘటన నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం పరిధిలో వస్రాంతండా శివారు పాశంబోడు గుట్టలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజువారీగా గొర్రెలను మేపేందుకు గొర్రెల కాపరులు పాశంబోడు గుట్టకు వెళ్లారు. ఈ తరుణంలో కాలిపోయిన గుర్తు తెలియని అస్థి పంజరాన్ని చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మొదటగా సీఐ చేరాలు, ఎస్సై సందర్శించారు. స్థానికుల నుంచి సమాచారం సేకరించారు.. అనంతరం సంఘటనా స్థలానికి ఎస్పీ కోటిరెడ్డి, డీఎస్పీ రాజారత్నం సందర్శించారు. పరిసరాలను పరిశీలించారు. గొర్రెల కాపరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడారు. గొర్రెల కాపరులు, స్థానికుల సమాచారం మేరకు కాలిపోయిన గుర్తు తెలియని వ్యక్తి ఆనవాళ్లను గుర్తించామని తెలిపారు. వ్యక్తిని కాల్చి హత్య చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయన్నారు. అనుమానస్పద హత్యగా కేసు నమోదు చేశామని, కేసును వేగవంతం చేయడానికి ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు. తహసీల్దార్ ప్రసాదరావు, వీఆర్వో వీరసోములు, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు టేకుల యాదగిరిరెడ్డి ఘటనా స్థలిని సందర్శించారు. -
వేర్వేరు ఘటనల్లో ముగ్గురి ఆత్మహత్య
ఉమ్మడి వరంగల్లో జిల్లాలో వేర్వేరు ఘటనల్లో గురువారం ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని నారబోయినగూడెంలో రైతు, మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో యువతి, వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నెపల్లిలో ఆటోడ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో వారి గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. పాలకుర్తి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక మండలంలోని నారబోయినగూడెం గ్రామంలో చిక్కుడు సుధాకర్(28) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చిక్కుడు సుధాకర్కు భార్య లావణ్య, ఇద్దరు పిల్లలున్నారు. ఆ కుటుంబానికి సుమారు రూ.4 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. అవి తీర్చలేక మానసికాందోళనకు గురై గురువారం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతుడు తండ్రి రాంచంద్రు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపారు. కురవిలో యువతి.. కురవి : జీవితంపై విరక్తి చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కురవి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై నాగభూషణం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని 747 కాలనీలో 21 సంవత్సరాల దివ్యాంగ యువతి కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది. మూడు నెలల క్రితం ఆమెపై లైంగిక దాడి జరిగింది. దీంతో బుధవారం రాత్రి సదరు యువతి ఇంట్లో ఉన్న పురుగుల మందును తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. యువతి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా మండల కార్యదర్శి గంధసిరి పద్మ, నాయకులు నాగమ్మ, వీరలక్ష్మి, హచ్చాలి, యాదమ్మ డిమాండ్ చేశారు. లక్నెపల్లిలో ఆటోడ్రైవర్.. నర్సంపేట రూరల్ : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నెపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లక్నెపల్లి గ్రామానికి చెందిన కుడికందుల రాము (34) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్యలత, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు మతిస్థిమితం సరిగా లేదు. ఇటీవల డిజిల్ ధరలు పెరిగి, కిరాయిలు తగ్గడంతో కుటుంబ పోషణ భారమైంది. ఆటో కిస్తీలు, ఇతర ఫైనాన్స్లు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవల మద్యానికి బానిసై గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాము కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో యూనియన్ అధ్యక్షుడు కళ్లెపల్లి సురేష్, టీఆర్ఎస్ మండల నాయకుడు కోడారి రవి, గ్రామ అధ్యక్షుడు గోడిశాల శ్రీను, మాజీ ఉపసర్పంచ్ భగ్గి నర్సింహారాములు కోరారు. -
పాలకుర్తి నృసింహరామశర్మ సిద్ధాంతి కన్నుమూత
కొడకండ్ల : శ్రీవిద్యాలంకార, దైవజ్ఞకుల శిరోమణి, వైదిక ఆగమ శిరోమణి, స్మార్త సరస్వతిగా ఖ్యాతి గడించిన జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వేదపండితుడు, సిద్ధాంతి పాలకుర్తి నృసింహరామశర్మ(96) పరమపదించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తొర్రూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. పాలకుర్తి లక్ష్మీనారాయణ శాస్త్రి–రాధమ్మ దంపతుల కుమారుడు నృసింహరామశర్మ సిద్ధాంతి 1922 జూలై 20న జన్మించారు. తొమ్మిదేళ్ల ప్రాయంలోనే పితృ వియోగం కావడంతో కుటుంబ భారం పైనపడడంతో విద్యాభ్యాసానికి స్వస్తి పలకాల్సి వచ్చింది. సంచార బ్రహ్మణుడిగా గ్రామానికి వచ్చిన సత్యవాద రామమూర్తి శాస్త్రి వద్ద సంస్కృత భాష నేర్చుకున్నారు. సీతారామ శాస్త్రి వద్ద శ్రీవిద్యోపాసన పొందారు. మండల కేంద్రంలో శ్రీయోగలింగేశ్వర సహిత రాజరాజేశ్వరీ ఆలయాన్ని స్వయంగా నిర్మించారు. అందులోనే గురువు గారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి గురుభక్తిని చాటుకున్నారు. అసంఖ్యాక దేవాలయాల నిర్మాణానికి ప్రోత్సహించి ఆయన తన జీవితాన్ని ధర్మ ప్రచారానికి అంకిత చేశారు. నిరంతర గ్రంథ పరిశీలకుడు నృసింహరామశర్మ నిరంతరం ఏదో ఒక గ్రంథ పరిశీలనలో గడిపేవారు. మూడు వేలకు పైగా దేవాలయాల ప్రతిష్ఠాపనులు చేశారు. 75 సంవత్సరాలుగా శాక్తేయ ధీక్ష చేపట్టారు. ప్రతి ఏటా పదిహేను రోజులపాటు తన ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలను నిర్వహించారు. రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల్లో వైదిక కార్యక్రమాలు, వేల సంఖ్యలో చండీయాలు నిర్వహించారు. ఆగమ, ధర్మ శాస్త్ర జ్ఞాన సంపన్నుడైన ఆయన ఎటువంటి సందేహాలు అడిగినా సశాస్త్రీయంగా, సంతృప్తికరంగా సమాధానాలు ఇచ్చేవారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలి గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శృంగేరి భారతీ తీర్థ స్వామిని ఆహ్వానించారు. విశిష్ట పీఠాధిపతులతో అనుబంధం ప్రముఖ విశిష్ట పీఠాధిపతులతోనూ సిద్ధాంతికి అనుబంధం ఉంది. శృంగేరి జగద్గురువులు, కంచికామకోటి జగద్గురువులు, హంపి పీఠాధిపతులు, శ్రీకరపాత్ర స్వామి, బసవకళ్యాణ్ శ్రీమదనానంద సరస్వతీ స్వామి, తంజావూరు రాంబాబా, కుర్తాళం పీఠాధిపతులు, సిద్ధేశ్వరానంద భారతీ స్వామి, చిన్నజీయర్ స్వామి, పుష్పగిరి పీఠాధీపతి, విజయదుర్గ పీఠాధిపతి, శ్రీకృష్ణానంద సరస్వతీ స్వామి, శ్రీమాధవానంద సరస్వతీ స్వామి, సద్గురు శివానందమూర్తి వంటి ఎందరో మహనీయులతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. రచించిన గ్రంథాలు నృసింహరామశర్మ ధర్మశాస్త్రానికి సంబంధించిన అనేక గ్రంథాలను రచించారు. శ్రీ నిత్య పారాయణ పద్ధతి, శ్రీవిద్యా సపర్య, శ్రీవిద్య లఘుచక్ర పూజ, రుద్ర స్వాహాకార పద్ధతి, శ్రీ విద్యా నిత్యాహ్నకము, సర్వ ప్రతిష్టా మందారం, చండీ హోమం విధానం, గురుపూజా విధానం, శ్రీ రుద్ర స్వాహాకార పద్ధతి, శ్రీక్రమోక్త కలశ స్థాపన విధి వంటి గ్రంథాలను రచించారు. ధార్మిక వరేణ్య బిరుదాంకితుడు పలు అవార్డులతో పాటు అనేక సన్మానాలు పొందిన సిద్ధాంతి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1999లో అప్పటి సీఎం నారా చంద్రాబాబునాయుడు, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రెండు మార్లు ఉగాది పురస్కారాలను అందుకున్నారు. ‘దర్శనం’ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక తొమ్మిదో వార్షికోత్సవంలో సిద్ధాంతికి స్వర్ణ కంకణం, జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేసి ధార్మిక వరేణ్య బిరుదును ఇచ్చారు. కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై సిద్ధాంతి పల్లకీ సేవలో పాల్గొని మోయడం విశేషం. పుట్టినరోజుకు రెండు రోజుల ముందే.. సిద్ధాంతి పుట్టిన రోజును శనివారం ఘనంగా నిర్వహించడానికి కుటుంబసభ్యులు అవసరమైన ఏ ర్పాట్లు చేయడంతోపాటు బంధు, మిత్రులు, భక్తులు, శిష్యులను ఆహ్వానించారు. నాలుగు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొంత కొలుకోవడంతో గురువారం ఇంటికి తీసుకెళ్ల వచ్చని వైద్యులు సూచించారు. ఆ మేరకు సిద్ధమవతుండగానే ఒక్కసారిగా అస్వస్తతకు గురై కన్నుమూశారు. విషయం తెలియగానే రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బంధు, మిత్రులు, భక్తులు తరలివచ్చారు. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు సాయంత్రం జరిగాయి. రాష్ట్రం లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు, సిద్ధాంతులు, వేదపండితులు, బంధువులు, భక్తులు, శిష్యులు తరలివచ్చి సిద్ధాంతిని కడసారి వీక్షించి పాదాభివందనం చేశారు. పలువురు నివాళి నృసింహరామశర్మకు పలువురు నివాళులర్పించారు. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ గాంధీనాయక్, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, జెడ్ఆర్సీసీయూ మెంబర్ అన్నావజ్జుల సూర్యప్రకాష్, కేసీఆర్ గురువు మృత్యుంజయశర్మ, దర్శనం ఎడిటర్ వెంకటరమణ, సిద్ధాంతులు దివ్యజ్ఞాని, జెడ్పీటీసీ బాకి లలితప్రేమ్కుమార్, ఎంపీపీ జ్యోతి వెంకన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుందూరు వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యు డు సిందె రామోజీ, మండల కన్వీనర్ ధీకొండ వెంకటేశ్వర్రావు, మాజీ సర్పంచ్ జక్కుల విజయమ్మ నివాళులర్పించిన వారిలో ఉన్నారు. రాష్ట్ర జ్యోతిష్య సభల ప్రాంగనానికి సిద్ధాంతి పేరు.. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈనెల 13, 14 తేదీల్లో ప్రభుత్వం తరఫున నిర్వహించే రాష్ట్ర జ్యోతిష్య మహాసభల ప్రాంగణానికి పాలకుర్తి నృసింహరామశర్మ నామకరణం చేస్తామని దర్శనం ఎడిటర్ వెంకటరమణ, జ్యోతిష్యపండితుడు దివ్యజ్ఞాని, బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నంపెల్లి జగన్మోహన్శర్మ తెలిపారు. -
స్కూల్ వ్యాన్ బోల్తా
మలాపూర్ : ఓ ప్రైవేట్ స్కూల్వ్యాన్ అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లి బోల్తాపడిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని కానిపర్తి శివారులో బుధవారం జరి గింది. ఈ ప్రమాదంలో టీచర్, క్లీనర్ సహా ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. హసన్పర్తితోపాటు కమలాపూర్లో హైటెక్ ఇంటర్నేషనల్ స్కూల్ను నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంస్థకు చెందిన స్కూల్ వ్యాన్లలో హసన్పర్తితోపాటు కమలాపూర్లోని తమ పాఠశాలలకు విద్యార్థులను తరలిస్తుంటారు. బుధవారం కమలాపూర్ పాఠశాలకు విద్యార్థులను తరలించిన అనంతరం ఏపీ 36 టీఏ 1764 స్కూల్వ్యాన్ను హసన్పర్తికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో స్కూల్ వ్యాన్ కానిపర్తి శివారులోని ఓ పంట కాల్వ కల్వర్టు వద్దకు రాగానే ఎదురుగా ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ వస్తుండడంతో డ్రైవర్ వ్యాన్ను కొంతమేర రోడ్డుకు కిందికి దింపి వెళ్తూ ఎదురుగా వస్తున్న వాహనాలకు సైడ్ ఇచ్చాడు. అక్కడ ఉన్న పంట కాల్వ కల్వర్టు వద్ద ఇరువైపులా రోడ్డు కోతకు గురై రోడ్డు కుదించుకుపోయి ఉండడాన్ని డ్రైవర్ గమనించకపోవడంతో వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. కాల్వ పక్కనే ఉన్న ఓ చెట్టు ఆసరాతో వ్యాన్ పూర్తిగా పడిపోకుండా ఓ పక్కకు పూర్తిగా ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ఉన్న క్లీనర్ కొడారి శ్రీకాంత్, హసన్పర్తి పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న పాఠశాల నిర్వాహకుల సోదరి, మండలంలోని గూడూరుకు చెందిన బింధు, కవలలైన ఆమె కుమారులు అయ్యప్ప, మణికంఠకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా చెట్టు ఆసరాతో వ్యాన్ పూర్తిగా పల్టీ కొట్టకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. సమాచారం అందుకున్న ఎస్సై సూర్యప్రకాష్, తహసీల్దార్ సత్యనారాయణ యాదవ్, ఎంఈఓ రాంకిషన్రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రమాదకరంగా పంట కాల్వ కల్వర్టు.. కమలాపూర్-హన్మకొండ మార్గంలో కానిపర్తి శివారులో ఉన్న పంట కాల్వ ప్రమాదకరంగా మారింది. రోడ్డు నిర్మాణ సమయంలో అక్కడ కల్వర్టు నిర్మించకుండా వదిలేయడంతో రోడ్డు కోతకు గురవుతూ కుచించుకుపోతోంది. ఇప్పటికే అక్కడ ఒక ధాన్యం ట్రాక్టర్తోపాటు పలు వాహనాలు పడిపోయి పలువురు గాయపడ్డారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. వ్యాన్ ఫిట్నెస్పై అనుమానాలు.. కానిపర్తి శివారులో బోల్తాపడ్డ వ్యాన్ ఫిట్నెస్పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాన్ ఫిట్నెస్ లేకపోవడంతోపాటు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉందని, నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే డ్రైవర్కు అక్కడ రోడ్డు కోతకు గురైన కల్వర్టు ఉందనే విషయం తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యాన్ తోలడంతోనే ప్రమాదం జరిగిందని, కొన్ని స్కూల్ వ్యాన్లలో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి ఫిట్నెస్ లేని స్కూల్ వ్యాన్లను సీజ్ చేయాలని కోరుతున్నారు. -
వేర్వేరు ఘటనల్లో ముగ్గురి ఆత్మహత్య
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలోని ఎల్గూరురంగంపేట, రాయపర్తి మండలం కాట్రపల్లి, జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని వనపర్తి గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. సంగెం: భార్య చనిపోయిందని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఎల్గూర్రంగంపేట గ్రామానికి చెందినబోనాల రాజు (35), రజిత దంపతులు స్రవంతి, మానస కుమార్తెలతో జీవనం సాగిస్తున్నారు. రాజు తాగుడుకు బానిసయ్యాడు. దీంతో దంపతుల మధ్య తరచుగా గొడవలు జరిగాయి. మనస్తాపం చెందిన రజిత ఈ ఏడాది ఏప్రిల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. రాజు నెల రోజుల క్రితం పురుగుల మందుతాగి చికిత్స పొందాడు. మంగళవారం మధ్యాహ్నం మళ్లీ పురుగుల మందు తాగి పడిపోయాడు. తండ్రి పోశయ్య అరవడంతో చుట్టు పక్కల వారు వచ్చి హుటాహుటిన 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తల్లి ఆగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సంపత్రావు తెలిపారు. అనాథలైన కుమార్తెలు.. తల్లిదండ్రుల ఆత్మహత్యతో ఇద్దరు బాలికలు అనాథలయ్యారు. పెద్ద కుమార్తె స్రవంతి 9వ తరగతి, చిన్న కుమార్తె మానస 6వ తరగతి చదువుతున్నారు. వీరిని చూసుకోవడానికి మంచాన పడిన తాత పోశయ్య, వృద్ధాప్యంలో ఉన్న నానమ్మ మాత్రమే ఉన్నారు. తల్లిదండ్రలను కోల్పోయిన బాలికలను చూసిన వారంత గుండలవిసేలా రోదిస్తున్నారు. చిన్నారులను ప్రభుత్వం చేయూతనివ్వాలని స్థానికులు కోరుతున్నారు. కాట్రపల్లిలో వృద్ధుడు.. రాయపర్తి: అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మండలంలోని కాట్రపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. రాయపర్తి ఎస్సై శ్రీధర్ కథనం ప్రకారం.. కాట్రపల్లి గ్రామానికి చెందిన ఎండీ.వలీపాషా(60)కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కూతుళ్ల పెళ్లిల్లు చేసి అప్పుల పాలయ్యాడు. అప్పులు ఇచ్చినవారు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటిలో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆతహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు రాజ్మహ్మద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. వనపర్తిలో రైతు.. లింగాలఘణపురం: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని వనపర్తి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చుంచు రాజు (30) సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు పత్తి చేను వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. రాత్రి వరకు కూడా ఇంటికి రాకపోవడంతో మంగళవారం ఉదయం వ్యవసాయ బావుల వద్దకు వెళ్లిన సమీప రైతులు గమనించి చూడగా అప్పటికే చనిపోయాడు. మృతుడు రాజుకు భార్య రజిత, ఇద్దరు కుమార్తెలు, 18 నెలల కొడుకు ఉన్నాడు. కొడుకు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుండగా చికిత్స నిమిత్తం రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. అయినప్పటికీ ఆరోగ్యం బాగుపడకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాజు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ముగ్గురిని బలిగొన్న వివాహేతర బంధం
ఆత్మకూరు(పరకాల) వరంగల్ : తన తండ్రి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఓ యువకుడు విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు. క్షణికావేశంతో ఓ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి ముగ్గురి మృతికి కారణమయ్యాడు. ఈ ఘటనలో మహిళతోపాటు నిందితుడి తండ్రి, నానమ్మ కూడా మృతిచెందా రు. దామెర మండలం కంఠాత్మకూరులో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దామెర మండలం కంఠాత్మకూరుకు చెందిన మామిడి కుమారస్వామి(50), తన భార్య కౌసల్య, కుమారుడు, కుమార్తెతో హన్మకొండలోని ఇందిరానగర్ కాలనీలో నివాసముంటున్నాడు. ప్లంబర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి కంఠాత్మకూరు సమీప గ్రామమైన పులుకుర్తికి చెందిన వితంతువు పోతరాజు సుమలత(38)తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమెకు గతంలో హసన్పర్తికి చెందిన ఓ వ్యక్తితో వివాహం కాగా భర్త మృతిచెందడంతో ప్రస్తుతం పైడిపల్లి సమీపంలో నివాసముంటోంది. ఈ క్రమంలో సుమలత, కుమారస్వామి పరిచయం పెరిగి తరచు కంఠాత్మకూరుకు వచ్చివెళ్తున్నారు. అప్పటి నుంచి అతడు హన్మకొండకు రాకుండా కుటుం బాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీంతో కుమారస్వామి కుమారుడు కార్తీక్ సుమలతపై కక్ష పెంచుకున్నాడు. ఆదివారం అతడు తన తండ్రికి ఫోన్ చేయగా కంఠాత్మకూరులో ఉన్నట్లు చెప్పాడు. దీంతో కార్తీక్ ఆగ్రహంతో వెంటనే కంఠాత్మకూరుకు బయల్దేరాడు. నేరుగా రాత్రి ఇంట్లోకి పెట్రోల్ డబ్బాతో ప్రవేశించాడు. ముందుగా సుమలతపై పెట్రోల్ పోస్తుండగా కుమారస్వామి అడ్డుకోబోయాడు. ఈ క్రమంలో కుమారస్వామిపై కూడా పెట్రోల్ పడింది. వెంటనే సుమలతకు కార్తీక్ నిప్పంటించాడు. దీంతో కుమారస్వామి మంటలార్పే ప్రయత్నం చేయగా అతడిపై కూడా పెట్రోల్ ఉండడంతో అతడు కూడా అగ్నికీలల్లో దగ్ధమయ్యాడు. అదేసమయంలో మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి కుమారస్వామి తల్లి మామిడి రాజమ్మ(70) మంటల్లో కాలిపోయింది. మంటలు ఎగిసిపడడంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన జరుగుతుండగానే కుమారస్వామి తండ్రి లింగయ్య ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసుల అదుపులో నిందితుడు? నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మోహన్బాబు తెలిపారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, డీసీపీ సంఘటనా స్థలాన్ని డీసీపీ వెంకటేశ్వర్లు , ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించారు. పూర్తిస్థాయిలో కేసు దర్యాప్తు చేసి దర్యాప్తు చేస్తామని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. కాలిన మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఘటన వివరాలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అడిగి తెలుసుకున్నారు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే.. వేరొక మహిళతో కుమారస్వామి వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే కార్తీక్ సజీవ దహనానికి పాల్పడినట్లు స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. గతంలో ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోలేదని, దీంతో కార్తీక్ తరచుగా ఇదే విషయంలో తండ్రితో గొడవపడేవాడని స్థానికులు వెల్లడించారు. -
వాహనాల్లో డీజిల్ చోరీ
బయ్యారం(ఇల్లందు) : నిలిపి ఉన్న వాహనాలను లక్ష్యంగా చేసుకుని కొన్ని రోజులుగా రాత్రివేళల్లో బయ్యారంలో డీజిల్ దొంగతనాలు జరుగుతున్నాయి. మానుకోటకు చెందిన వర్సటైల్ పాఠశాల బస్సును గత నెల 22న బయ్యారం సంత సమీపంలో నిలిపి ఉంచారు. రాత్రి వేళ బస్సు డీజిల్ ట్యాంకు మూతను పగులకొట్టి డీజిల్ను మాయం చేశారు. ఆ తర్వాత డీజిల్ చోరీకి మరో రెండు స్కూల్ బస్సుల ట్యాంకు మూతలను సైతం పగులకొట్టేందుకు విఫలయత్నం చేశారు. అలాగే గత నెల 30న మానుకోటకు చెందిన హోలీఏంజిల్స్ పాఠశాల బస్సు డీజిల్ట్యాంకు మూతను రాత్రి వేళ పగులగొట్టి డీజిల్ను అపహరించారు. శనివారం రాత్రి బయ్యారంలోని శ్రీనివాస్రావు తన ఇంటి సమీపంలో నిలిపి ఉన్న టిప్పర్ లారీ డీజిల్ ట్యాంకు మూత పగులగొట్టి వంద లీటర్ల వరకు డీజిల్ అపహరించారు. వరుసగా జరుగుతున్న డీజిల్ చోరీలతో తమ వాహనాలను బయటపెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ చోరీలపై బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు సైతం చేశారు. కాగా ఈ విషయంపై ఎస్సై రవీందర్ను ‘సాక్షి’ వివరణ కోరగా విషయం తమ దృష్టికి వచ్చిందని, చోరీలకు పాల్పడుతున్న వారి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నామన్నారు. -
చెట్టుకు కట్టేసి.. ఒంటికి నిప్పంటించి..
పర్వతగిరి : వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం తూర్పుతండాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తే కాలయముడైయ్యాడు. వివాహేతర సంబంధం, మద్యం తాగటాన్ని ప్రశ్నించినందుకు బానోత్ రజిత(28)ను భర్త బానోత్ బాలు చెట్టుకు కట్టేసి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనానికి పాల్పడ్డాడు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ మండలం భూపతిపుటకు చెందిన లక్ష్మికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె రజితను గత 9 సంవత్సరాల క్రితం పర్వతగిరి మండలం తూర్పుతండాకు చెందిన బానోత్ బాలుకు ఇచ్చి వివాహం చేశారు. బాలు, రజిత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కొద్ది రోజులు కాపురం సజావుగా సాగినప్పటికీ బాలు అదే గ్రామానికి చెందిన బంధువుతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్నారు. దీనిపై స్థానిక పీఎస్లో కేసు నమోదుతో పాటు కోర్టుకు కూడా హాజరైనాడు. కొద్ది రోజులుగా సమసిపోయిన సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. మళ్లీ అక్రమ సంబంధం కొనసాగించడంతో పాటు నిత్యం మద్యం తాగి వచ్చి భార్య రజితతో గొడవ జరిగేదని చెప్పారు. వద్దని పలుమార్లు చెప్పినా వినకపోయేవాడని స్థానికులు అంటున్నారు. అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో భార్యను కొట్టడంతో పాటు నింద కూడా వేసేవాడని పలువులు అంటున్నారు. అదే క్రమంలో శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకు బాలు మద్యం మత్తులో ఇంటికి చేరుకుని భార్య రజితపై గొడవ చేశాడని తెలిపారు. అయితే గతంలో అనేకమార్లు గొడవలకు భయపడి రజిత ఇతరుల ఇంట్లో తలదాచుకునేదన్నారు. అలా తప్పించుకోకుండా భర్త బాలు రజితను ఇంటి పక్కనే ఉన్న చెట్టుకు కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అరుపులు కేకలు చుట్టు పక్కల వారికి వినపడకుండా నోట్లో గుడ్డ నొక్కాడన్నారు. నోట్లో ఉన్న గుడ్డ కాలిపోవడంతో రజిత అరుపులు కేకలు వేసింది. మద్యం మత్తు నుంచి జారుకున్న బాలు భార్యను కట్లు విప్పే ప్రయత్నం చేశాడు. దీంతో బాలుకు కూడా చేతులు, కాళ్లు కాలిపోయాయి. గమనించిన చుట్టు పక్కల వారు సంఘటన స్థలానికి చేరుకుని రజితను కాపాడే ప్రయత్నం చేశారు. 108లో ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. రజిత మృతితో తూర్పుతండాలో విషాదం చోటుచేసుకుంది. చుట్టు పక్కల వారితో కలుపుగోలుగా ఉండేదని స్థానికులు విలపించారు. మత్తులో ఉంటే చిత్రహింసలే.. మద్యం మత్తులో ఉన్నంత వరకు భార్యను చిత్రహింసలకు గురి చేసే వాడని, మత్తు దిగిన తర్వాత ఏమీ తెలియని అమాయకుడిలా ఉండే వాడని స్థానికులు అంటున్నారు. గతంలో మద్యం మత్తులో రజితను భూమిలోపల తల భాగం పైకి కనిపించే విధంగా పాతిపెట్టినట్లు వారు వాపోయారు. అనంతరం గమనించిన స్థానికులు భూమిలో నుంచి బయటకు తీసినట్లు చెప్పారు. అయితే విచ్చలవిడిగా అర్ధరాత్రి వరకు బెల్టు షాపులు తెరచి ఉండటంతోనే బాలు మద్యం తాగి వచ్చే వాడని తండా వాసులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీసీపీ తూర్పుతండాలో జరిగిన సంఘటన స్థలాన్ని డీసీపీ ఆర్. వెంకటేశ్వర్లు. ఏసీపీ శోభన్కుమార్లు పరిశీలించారు. స్థానికులు, బంధువులను సంఘటనకు దారి తీసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రజిత తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు బాలుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కరుణాకర్రావు తెలిపారు. -
భర్త అక్రమ సంబంధం.. భార్యను చెట్టుకు కట్టేసి..
సాక్షి, వరంగల్ : జిల్లాలోని పర్వతగిరి మండలంలో దారుణం చోటుచేసుకుంది. భర్త అక్రమ సంబంధం విషయం తెలిసి.. భార్య నిలదీసినందుకు ఆమెను చెట్టుకు కట్టేసి నిప్పంటించాడు భర్త. ఈ సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తూర్పుతండాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తూర్పుతండాకు చెందిన రజిత అనే మహిళ తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసి నిలదీసింది. దీంతో ఆగ్రహించిన రజిత భర్త ఆమెను చెట్టుకు కట్టేసి నిప్పంటించాడు. మంటల్లో కాలి తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. -
ఎఫ్ఎస్ఎల్కు చేరిన హార్డ్ డిస్క్
వరంగల్ క్రైం : వరంగల్ కాశిబుగ్గ కోటిలింగాల గుడి ప్రాంతంలో భద్రకాళి ఫైర్వర్క్స్లో జరిగిన బాంబు పేళుళ్లలతో వరంగల్ నగరం ఉలిక్కిపడింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెంది నేటికి నెల రోజులైంది. జూలై 4న జరిగిన ఈ పేలుళ్లను పోలీసు అధికారులు తీవ్రంగా పరిగణించి భద్రకాళి ఫైర్ వర్క్స్ యజమాని గుళ్లపెల్లి రాజ్కుమార్ను సంఘటన జరిగిన రాత్రే అరెస్టు చేసి జైలుకు పంపించారు. జనావాసాల్లో ప్రమాదకరమైన ఫైర్ వర్క్స్ను కొనసాగించటం, దానిని కొన్ని ప్రభుత్వ శాఖలు అనుమాతులు ఇవ్వడం, పోలీసు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్లే ఇలాంటి భయంకరమైన ప్రమాదాలు జరిగాయని ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో పోలీసులు ఘటనకు కారణమైన నిందితుడిని అరెస్టు చేయడంతో అతడికి సంబంధించిన గోడౌన్లను సీజ్ చేశారు. ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు సహితం వినిపించాయి. దర్యాప్తునకు సాంకేతిక అడ్డంకులు... బాంబు పేలుళ్ల సంఘటన స్థలంలో పోలీసు అధికారులు కంప్యూటర్ హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు భద్రకాళి ఫైర్వర్క్స్లోకి పనికి వచ్చే కార్మికులకు సంబంధించిన హాజరు రిజిష్టర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్ హార్డ్ డిస్క్ను హైదరాబాద్లోని సైబర్ క్రైం విభాగానికి పంపించారు. అక్కడ దానిని ఓపెన్ చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని అధికారులు చెప్పడంతో తిరిగి హార్డ్డిస్క్ను హైదరాబాద్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ(ఎఫ్ఎస్ఎల్)కు పంపించారు. ప్రస్తుతం హార్డ్ డిస్క్ హైదరాబాద్లోని ఎఫ్ఎస్ఎల్లో ఉంది. దీనిని ఓపెన్ చేయటానికి ముంబై నుంచి నిపుణులు రావాల్సి ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో తీవ్రమైన వేడి, మంటలకు హార్డ్ డిస్క్ భాగం దెబ్బతిన్నట్లు తెలిసింది. దీంతో నిపుణుల సమక్షంలోనే దానిని ఓపెన్ చేయటానికి అధికారులు నిరీక్షిస్తున్నట్లు సమాచారం. హార్డ్ డిస్క్లో నిక్షిప్తమై ఉన్న సమాచారంపైనే కేసు ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. కొనసాగుతున్న విచారణ... ప్రమాదం జరిగి నెల రోజులు గడుస్తోంది. దీంతో బాధిత కుటుంబాల నుంచి ప్రజల నుంచి అధి కారులపై ఒత్తిడి పెరుగుతోంది. పోలీసులు దర్యాప్తులో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. భద్రకాళి ఫైర్ వర్క్స్ యజమాని గుళ్లపెల్లి రాజ్కుమార్ బయటకు రావటానికి ఇప్పటికే నాలుగు సార్లు కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా పోలీసులు కౌంటర్ దాఖలు చేసినట్లు తెలిసింది. దీంతో ఇప్పటి వరకు అతడికి బెయిల్ మంజూరు కాలేదు. ప్రమాదం జరిగిన రోజున అనుమానాస్పదంగా ఉన్న మల్లికార్జున్, రాకేష్ మృతదేహాలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించి నివేదికలను తెప్పించడంలో వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్ తీవ్రంగా కృషి చేశారు. ఫోరెనిక్స్ సైన్స్ ల్యాబరేటరీ ఫలితాలు వస్తే పోలీసులు ఈ కేసులో చార్జీషీట్ దాఖలు చేస్తారని చెబుతున్నారు. మృతుల్లో 10 మంది.. జులై 4న వరంగల్ కాశిబుగ్గలోని కోటిలింగాల గుడి ప్రాంతంలో భద్రకాళి ఫైర్ వర్క్స్లో జరిగిన పేళుళ్లలో మొత్తం 10 మంది మృతి చెందారు. సంఘటన జరిగిన రోజు 8 మందిని గుర్తించగా ఆ తరువాత ఇద్దరి మృత దేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి మొత్తం 10 మంది మరణించినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. మృతుల్లో ... కాశిబుగ్గ తిలక్రోడ్కు చెందిన గాజుల హరిక్రిష్ణ (38), సుందరయ్య నగర్ ఓంసాయి కాలనీకి చెందిన కోమటి శ్రావణి(33), బేతి శ్రీవాణి(25), ఏనుమాముల మార్కెట్ రోడ్డులోని బాలాజీ నగర్కు చెందిన రంగు వినోద్(24), కాశిబుగ్గకు చెందిన వలసదాసు అశోక్కుమార్(30),కాశిబుగ్గ సాయిబాబా గుడి ప్రాంతానికి చెందిన బాలినే రఘపతి (40), కీర్తి నగర్కు చెందిన కందకట్ల శ్రీదేవి(34), సుందరయ్యనగర్కు చెందిన బాస్కుల రేణుక(39), కొత్తవాడకు చెందిన మల్లికార్జున్(35), కరీమాబాద్కు చెందిన వంగరి రాకేష్(22) బాంబు పేలుళ్లలో మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. వీరందరి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం అందజేసింది. శోకసంద్రంలో బాధిత కుటుంబాలు భద్రకాళి ఫైర్ వర్క్స్లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల పరిస్థితి దారుణంగా మారింది. ప్రమాదంలో కుటుంబ పెద్ద, తల్లుల కోల్పోయిన పిల్లలు, భర్తలను కోల్పోయిన భార్యలు ఇలా... ఒక్కో కుటుంబంలో ఒక్కో రకమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించిన ఆ కుటుంబాలకు ఆసరా నివ్వలేక పోతున్నాయి. ప్రమాదంలో మరణించిన మృతులంతా నిరుపేద కుటుంబానికి చెందిన వారే కావడంతో అన్ని కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వం , ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాలకు ఏదైన ఉపాధి అవకాశాలు చూపెడితే తప్ప కోలుకోలేని స్థితుల్లో ఆ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. దర్యాప్తు వేగవంతం చేస్తున్నాం.. భద్రకాళి ఫైర్ వర్క్స్లో జరిగిన ప్రమాదాన్ని తీవ్రంగా పరిగిణించి దర్యాప్తును వేగవంతం చేస్తున్నాం. సాధారణంగా డీఎన్ఏ రిపోర్టు రావటానికి నాలుగైదు నెలలు పడుతుంది. కాని మూడు నాలుగు రోజుల్లో డీఎన్ఏ రిపోర్ట్ తెప్పించి వారికి కూడా ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చేశాం. కంప్యూటర్ హార్డ్ డిస్క్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీలో ఉంది. దానిని ఓపెన్ చేసి నివేదిక తెప్పించటానికి సంబంధిత అధికారులతో మాట్లాడాం. దీంతోపాటు నిందితుడు బయటకు రాకుండా చర్యలు తీసుకున్నాం. ఫైర్, విద్యుత్ శాఖల నివేదికలు కూడా రావాల్సి ఉంది. త్వరలో జన సంచార ప్రదేశాల్లో ఉన్న షాపులన్నింటికి నోటీసులు జారీ చేస్తాం. దీంతో వారి అనుమతులు రద్దవుతాయి. బాధితులకు పోలీసు శాఖపరంగా అన్ని విధాలా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ విశ్వనాథ రవీందర్ పోలీసు కమిషనర్ -
ఒకరిని కాపాడబోయి మరొకరు..
గార్ల(ఇల్లందు) : వ్యవసాయ మోటార్ ఆన్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైన కొడుకు, అతడిని కాపాడేందుకు వెళ్లిన తల్లి మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంజనాపురంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మూడు రాములు, శాంతి(38) దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రాములుకు గ్రామ సమీపంలో 20 గుంటల భూమి ఉంది. వ్యవసాయ బావి అన్నదమ్ముల పొత్తుల ఉండటంతో వంతులవారీగా నీరు వాడుకుంటున్నారు. వీరి వంతు రావడంతో పొలాన్ని దమ్ము చేసేందుకు నీళ్లు పెట్టాలని శుక్రవారం తెల్లవారుజామున శాంతి, పెద్ద కొడుకు సతీష్(21) కలిసి వెళ్లారు. సతీష్ మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై విలవిలా కొట్టుకుంటున్నాడు. ఇది చూసిన తల్లి శాంతి కేకలు వేసి రక్షించేందుకు వెళ్లి అతడిని తాకింది. దీంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతిచెందారు. వారి కేకలు విన్న రవి అనే యువకుడు వెళ్లి చూడగా ఇద్దరు విగతజీవుల్లా పడి ఉన్నారు. సతీష్ కొన ఊపిరితో ఉండటంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. సతీష్ ఖమ్మంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ, కానిస్టేబుల్ కోచింగ్కు వెళ్తున్నాడు. శాంతి రోజూ ఖమ్మంలో కూలీ పనులకు వెళ్తుండేది. భర్త రాములు కూలీ పనులకు వెళ్తున్నాడు. చిన్న కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందడంతో అంజనాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
నకిలీ నంబర్ ప్లేట్స్
ఇసుకను అదనంగా దోచుకు పోవడానికి లారీ ఓనర్లు కొత్త దందాకు తెరలేపారు. క్వారీల్లో సీరియల్ త్వరగా రావాలనే ఉద్దేశంతో నకిలీ నంబర్ ప్లేట్లను వినియోగిస్తున్నారు. మహదేవపూర్ పోలీసులు నంబర్ ప్లేట్లు మార్చిన మూడు లారీలను పట్టుకోవడంతో విషయం బయటపడింది. ఈ వ్యవహారం ఎప్పటినుంచో జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్వాటర్ నిల్వ ఉండటానికి సు మారు 55 కిలోమీటర్ల మేర ఇసుకను తోడేం దుకు రెండేళ్ల క్రితం ఇసుక క్వారీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కాటారం, మహదేవపూర్ మండలాల్లో 22 క్వారీలకు అనుమతివ్వగా ప్రస్తుతం సుమారు 14కు పైగా క్వారీల్లో ఇసుకను తోడి హైదరాబాద్కు తరలిస్తున్నారు. వారం రోజులకు ఓ లారీకి సీరియల్.. క్వారీల నుంచి లారీల్లో ఇసుకను తీసుకెళ్లడానికి ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. తరువాత సంబంధిత క్వారీ పేరు, ఏరోజు ఇసుక లోడ్ అవుతుందో స్లాట్లో వివరాలతో కూడిన పత్రం ఇస్తారు. ఇలా చేయడం వల్ల ఒక నంబర్ లారీకి రెండో స్లాట్ బుక్ కావడా ని సుమారు వారం రోజులు పడుతోంది. దీంతో కొంత మంది త్వరగా సీరియల్ రావడం కోసం ఏకంగా నకిలీ నంబర్ ప్లేట్లను తయారు చేయించి లారీలకు తగిలిస్తున్నారు. లారీలకు సంబం«ధించిన అసలు పత్రాలకు, చెసీ వివరాలు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. దీంతో పోలీసులు తనిఖీలు చేస్తున్న సందర్భంగా కొందరు దొరుకుతున్నారు. మరికొందరు పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటున్నట్లు సమాచారం. ఈ దందా కొంత కాలంగా నడుస్తున్నట్లు తెలిసింది. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా తనిఖీలు, సోదాలు పకడ్బందీగా చేస్తున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ కాగితాలు, ఇన్సూరెన్స్ తదితర అంశాలను çపక్కాగా పరిశీలిస్తుండడంతో లారీల నంబర్ ప్లేట్ల బాగోతం మంగళవారం సాయంత్రం బయటపడింది. మూడు లారీలపై కేసు నమోదు చేసి సీజ్ చేశారు. క్వారీల వద్ద కొరవడిన నిఘా.. ఇసుక క్వారీల్లోకి లారీల ఆన్లైన్ స్లాట్ బుకింగ్ చేసిన పత్రం తీసుకు వెళ్తారు. క్వారీలో ఉన్న టీఎస్ఎండీసీ సిబ్బంది ఆ స్లాట్ను ఆన్లైన్లో పరిశీలించాల్సి ఉంటుంది. లారీ, చెసీ నంబర్లు సరిపోలితేనే లోనికి పంపించాలి. కొంత మంది టీఎస్ఎండీసీ సిబ్బంది వీటిని పట్టించుకోవడం లేదనే ఆరోణలున్నాయి. మరి కొందరు డబ్బులకు ఆశపడి తేడా కనిపించినా వదిలేస్తున్నారని తెలిసింది. ఇదే అదునుగా లారీ యజమానులు నంబర్ ప్లేట్లు మార్పుచేసి దందా సాగిస్తున్నట్లు సమాచారం. టీఎస్ఎండీసీ అధికారుల అజమాయిషీ కొరవడడంతో యథేచ్ఛగా అక్రమ నంబర్ ప్లేట్ల వ్యవహారం కొనసాగుతోంది. ఆర్టీఏ తనిఖీలు శూన్యం.. కాళేశ్వరం నుంచి హైదరాబాద్కు నిత్యం వందల సంఖ్యలో ఇతర నంబర్ ప్లేట్లతో లారీలు తిరుగుతుంటే ఆర్టీఏ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. లారీలకు ఆర్జీఏ జారీ చేసిన నంబర్లు కాకుండా నంబర్ ప్లేట్లపై సొంతంగా రాసుకువస్తున్నట్లు తెలిసింది. ఈవిషయమైన మహదేవపూర్ టీస్ఎండీసీ ప్రాజెక్టు అధికారి జగన్మోహన్ను వివరణ కోరడానికి ప్రయత్నించగా అందుబాటులో లేరు. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం.. మహదేవపూర్ మండలంలో క్వారీల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్ట పరమైన కేసులు నమోదు చేస్తాం. ఓవర్లోడు, నకిలీ నంబర్ ప్లేట్ల దందాలకు పాల్పడితే లారీలు సీజ్ చేస్తాం. ఇప్పటికే ఓవర్లోడు లారీలను పట్టుకొని మైనింగ్ అధికారులకు అప్పచెప్పాం. నంబర్ ప్లేట్లు మార్చి న మూడు లారీలను పట్టుకున్నాం. ఇసుక క్వారీ ల్లో అక్రమాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తాం. – రంజీత్కుమార్, సీఐ, మహదేవపూర్ సర్కిల్ -
అదనపు కట్నం కోసం భార్యను హత్యచేసిన భర్త
స్టేషన్ఘన్పూర్ వరంగల్ : మూడుముళ్లు వేసి కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్య నందనబోయిన రాధిక(21)ను భర్త రాజ్కుమార్ హత్య చేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి మండలంలోని నమిలిగొండలో జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు నారబోయిన నర్సయ్య, రాజమణి తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్ఘన్పూర్కు చెందిన నర్సయ్య, రాజమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. వారి పెద్ద కుమార్తె రాధికను మూడేళ్ల క్రితం నమిలిగొండ గ్రామానికి చెందిన నందనబోయిన రాజ్కుమార్కు ఇచ్చి వివాహం చేశారు. వివాహ సమయంలో కట్నంగా రూ.4లక్షలు, నాలుగున్నర తులాల బంగారు నగలు ముట్టజెప్పారు. గతేడాదిగా కట్నం డబ్బులు సరిపోలేదని, మరో రూ.2లక్షలు కట్నం ఇవ్వాలని రాధికను భర్త, అత్తమామలు వేధించ సాగారు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం మరో రూ.50వేలు ఇచ్చారు. రాధిక అత్తమామలు భూలచ్చమ్మ, కొమురయ్య కొండాపూర్ నుంచి ఘన్పూర్కు వచ్చి సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో వచ్చి రాధికకు కడుపులో నొప్పి లేచిందంటూ చెప్పి వెళ్లారు. రాధిక కుటుంబ సభ్యులు నమిలిగొండకు వెళ్లేసరికి ఆమె శవమై ఉందని తల్లిదండ్రులు బోరున విలపించారు. రాధికను తీవ్రంగా కొట్టి హింసించి ముఖంపై మెత్త పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారని వారు ఆరోపించారు. ఆమె చేతులు, నోరు, మెడ, తొడపై గాయాలున్నాయని, నోటి వెంట రక్తం కారి ఉందని తెలిపారు. అదనపు కట్నం కోసం హత్య చేశారని ఆరోపించారు. గ్రామస్తులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని చూసి విచారం వ్యక్తం చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ సీఐ రావుల నరేందర్, ఎస్సై రవి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు పాల్పడిందా, హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం ఏసీపీ వెంకటేశ్వరబాబు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. భర్త రాజ్కుమార్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అదనపు కట్నం కోసం భార్యను హతమార్చిన భర్తను కఠినంగా శిక్షించాలని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య డిమాండ్ చేశారు. -
తండ్రి చేతిలో తనయుడి హతం
నర్సింహులపేట : మద్యానికి బానిసై.. కన్న తల్లిని ధూషించడం.. అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొడుకును తండ్రి ఉరివేసి చంపిన సంఘటన శుక్రవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం శివారు గోపాతండాలో చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్సై సంతోష్రావు కథనం ప్రకారం.. గోపాతండాకు చెందిన అజ్మీరా లక్ష్మణ్, బుజ్జి దంపతుల కుమారుడు అజ్మీరా సుమన్(23) మద్యానికి బానిసై నిత్యం తల్లిదండ్రులను వేధించేవాడు. దీంతో సుమన్ భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే సుమన్ గురువారం అర్ధరాత్రి కన్నతల్లిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో విసుగు చెందిన తండ్రి లక్ష్మణ్.. తన కొడుకుకు తాడుతో ఉరివేసి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న సీఐ చేరాలు, ఎస్సై సంతోష్రావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం సుమన్ మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.