World Economic Forum
-
వచ్చే ఐదేళ్లలో కొలువులు కోకొల్లలు
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఉద్యోగాల తీరుతెన్నులు మారుతున్నాయి. సాంకేతికత, సస్టెయినబిలిటీ, ఆటోమేషన్తో పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన మానవ వనరులకు భవిష్యత్తులో ఎక్కువ డిమాండ్ ఉంటుందని నివేదికలు తెలియజేస్తున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సిద్ధం చేసిన ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025’లో 2030 నాటికి అత్యంత వేగంగా అభివృద్ధి చెందే కొన్ని ఉద్యోగాల జాబితాను విడుదల చేసింది.బిగ్ డేటా స్పెషలిస్టులుప్రస్తుత కాలంలో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం ప్రామాణికంగా మారింది. భవిష్యత్తులోనూ ఈ విభాగంలో ఉద్యోగులకు డిమాండ్ నెలకొంటుంది. ముఖ్యంగా డేటా అనాలిసిస్, డేటా మేనేజ్మెంట్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ నిపుణులకు కొలువులు ఎక్కువగా ఉంటాయి.ఫిన్ టెక్ ఇంజినీర్లుడిజిటల్ ఫైనాన్స్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత ఫైనాన్షియల్ టూల్స్ వినియోగం పెరిగింది. దాంతో ఆయా విభాగాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఇతర లావాదేవీలను మెరుగ్గా నిర్వహించేందుకు ఫైనాన్షియల్ టెక్నాలజీ నిపుణులు అవసరం.ఏఐ, మెషిన్ లెర్నింగ్ స్పెషలిస్టులుఆటోమేషన్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్లు అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఇవి రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఏఐ డెవలప్మెంట్, అల్గారిథమ్ ఆప్టిమైజేషన్లో నిపుణులు ఈ పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తారు.సాఫ్ట్వేర్, అప్లికేషన్స్ డెవలపర్లుకస్టమైజ్డ్ డిజిటల్ సొల్యూషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లు, క్లౌడ్-ఆధారిత ప్లాట్ఫామ్లకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇది సాఫ్ట్వేర్ విభాగంలో మరింత మందికి ఉపాధిని కల్పిస్తుంది.సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్లుడేటా ప్రొటెక్షన్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ థ్రెట్ మిటిగేషన్, ఏఐ ఆధారిత సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ప్రస్తుత టెక్ వ్యాపారాలకు ఎంతో కీలకం. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. దీన్ని సమర్థవంతంగా అదుపు చేస్తున్నప్పటికీ మరిన్ని ఆవిష్కరణలు రావాల్సి ఉందనే అభిప్రాయాలున్నాయి. భవిష్యత్తులో ఈ రంగం అధికంగా ఉద్యోగాలకు నెలవుగా మారుతుంది.డేటా వేర్హౌసింగ్ నిపుణులుటెక్ కంపెనీలు భారీ డేటాసెట్లను నిర్వహిస్తున్నాయి. డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ స్టోరేజ్, డేటా వేర్హౌసింగ్ సొల్యూషన్లలో నిపుణులకు విలువ పెరుగుతోంది.ఎలక్ట్రిక్ వెహికల్ స్పెషలిస్టులుప్రపంచవ్యాప్తంగా వాతావరణంలోని కాలుష్య కారకాలను తగ్గించాలనే లక్ష్యంతో దాదాపు చాలా ఆటోమొబైల్ కంపెనీ సుస్థిర రవాణా వైపు అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. ఈవీ టెక్నాలజీ, బ్యాటరీ ఆవిష్కరణలు, సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థల్లో నైపుణ్యం కలిగిన ఇంజినీర్లకు గిరాకీ ఏర్పడుతుంది.యూజర్ ఇంటర్ఫేజ్ డిజైనర్లుటెక్ కంపెనీల్లో పోటీ తీవ్రతరం అవుతుండడంతో యూజర్ సెంట్రిక్ ప్రొడక్ట్ డిజైన్, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్, మొబైల్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్లో రాణించే డిజైనర్లకు బాగా డిమాండ్ ఉంటుంది.ఇదీ చదవండి: చైనా నడ్డి విరిచేలా అమెరికా కొత్త సుంకాలుఅభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్లో ముందుండాలంటే ఉద్యోగార్థులు తమ నైపుణ్యాలు పెంచుకోవడం, క్రాస్ డిసిప్లినరీ లెర్నింగ్, టెక్ పోకడలపై దృష్టి సారించాలి. ఆటోమేషన్, కృత్రిమ మేధ రంగాలు వృద్ధి పథంలో దూసుకుపోతున్న క్రమంలో మానవ నైపుణ్యం అనివార్యంగా అవసరం అవుతుంది. భవిష్యత్తు సృజనాత్మకతతోనే ముడిపడి ఉందనే విషయాన్ని నిత్యం గుర్తు చేసుకోవాలి. -
ఏఐ ఉందా జాబ్ ఇంద..
సాక్షి, స్పెషల్ డెస్క్: ‘ఒకప్పుడు ఐటీలో ఉద్యోగం చేయాలంటే ఆఫీసుకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనం లేదా కారు ఉంటే సరిపోయేది. ఇప్పుడలా కాదు. అభ్యర్థికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానం తప్పనిసరి..’ఇవి ఒక ప్రముఖ కంపెనీ హెచ్ఆర్ హెడ్ చేసిన వ్యాఖ్యలు. ఆయన మాటలు ప్రస్తుత జాబ్ మార్కెట్లో వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. సంప్రదాయ విద్యార్హతలకు మించి మార్కెట్కు తగ్గట్టుగా ఉద్యోగులూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటేనే విజయం సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏఐ రెడీ వర్క్ఫోర్స్ ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఒక్క భారత్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు ఉంది. సాంకేతిక పురోగతి వైపు ప్రపంచ జాబ్ మార్కెట్ పయనిస్తోంది. కంపెనీల లేఆఫ్లకు కారణాల్లో ఒకటైన ఏఐ.. కొత్త ఉద్యోగ అవకాశాలకూ వేదిక అవుతోంది. భారత్లో 2027 నాటికి ఏఐలో 23 లక్షల ఉద్యోగావకాశాలు వెల్లువెత్తుతాయని బెయిన్ అండ్ కంపెనీ ఇటీవలి నివేదికలో వెల్లడించింది. నిపుణుల సంఖ్య మూడేళ్లలో 12 లక్షలకు చేరుకుంటుందని, కొరత 10 లక్షలకు పైమాటే అని వివరించింది. బడా కంపెనీల్లో లేఆఫ్స్..ఏఐ సృష్టిస్తున్న ప్రభంజనం ప్రభావం లేఆఫ్స్ రూపంలో కనిపిస్తోంది. కంపెనీల ఆదాయాల్లో వృద్ధి లేకపోవడం, ఉత్పాదకత పడిపోవడం, వ్యయాలు అధికం కావడం, లాభాల కోసం ఇన్వెస్టర్ల ఒత్తిడి.. ఉద్యోగుల తీసివేతలకు కారణమవుతున్నాయి. టెక్నాలజీ కంపెనీలకు అగ్రరాజ్యంగా చెప్పుకునే యూఎస్లో ఉద్యోగుల తీసివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. 2025లో ఇప్పటివరకు 89 టెక్ కంపెనీలు అంతర్జాతీయంగా సుమారు 23,400 మందిని ఇంటికి పంపించాయి. వీటిలో గూగుల్, మెటా, డిస్నీ, సిటీ గ్రూప్, హెచ్పీ, వాల్మార్ట్, ఫోర్డ్, స్టార్బక్స్ వంటి దిగ్గజాలు ఉన్నాయి. అమెజాన్ 18 వేల మందికి, ఐబీఎం 9 వేల మందికి, బోయింగ్ 10% మందికి ఉద్వాసన పలుకుతున్నాయని సమాచారం. సేల్స్ఫోర్స్ 30% మందిని ఇంటికి పంపనున్నట్టు తెలుస్తోంది. 2024లో 549 కంపెనీలు 1.52 లక్షల మందికి గుడ్బై చెబితే.. 2023లో ఏకంగా దాదాపు 1,200 కంపెనీలు 2.64 లక్షల మంది టెకీలను సాగనంపాయి. యూఎస్లో టెక్, సంబంధిత రంగాల్లో నిరుద్యోగిత రేటు 2022తో పోలిస్తే 2024లో 2.9 నుంచి 4.4 శాతానికి చేరుకుంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సర్వే ప్రకారం 41 శాతం అంతర్జాతీయ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వచ్చే ఐదేళ్లలో శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. భారత్లో అంత లేదు.. భారత్లో ఐటీ కంపెనీలు నిశ్శబ్దంగా లేఆఫ్లు చేపడుతున్నాయి. ఒక్క బెంగళూరులోనే ఏడాదిలో 50,000 మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయారని సమాచారం. అయితే తీసివేతలు ఆందోళన కలిగించే స్థాయిలో లేవన్నది నిపుణుల మాట. హైదరాబాద్లో మాత్రం కంపెనీలు గతంలో మాదిరి ఇబ్బడిముబ్బడిగా కాకుండా ఆచితూచి నియామకాలు చేపడుతున్నాయి. టీసీఎస్ 1,80,000 నియామ కాలకు శ్రీకారం చుట్టింది. ఇక మొత్తం లేఆఫ్లలో ఏఐ ప్రభావానికి గురైనవి 10% మాత్రమేనట. కరోనా కాలంలో కంన్జ్యూమర్ టెక్పై వ్యయాలు పెరగడంతో అందుకు తగ్గట్టుగా కంపెనీలు నియామకాలు చేపట్టాయి. నాటి రిక్రూట్మెంట్లో పరిమిత నైపుణ్యం గల వారు సైతం ఉన్నారు. వీరి వల్ల ఉత్పాదకతలో అసమతుల్యత ఏర్పడి కంపెనీలు క్లయింట్ల ఆగ్రహానికి లోనయ్యాయి. ఇటువంటి వారిపైనే ఇప్పుడు కత్తి వేలాడుతోంది. మరోవైపు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) భారత్కు వెల్లువెత్తుతున్నా యి. ఈ కేంద్రాల్లో రిక్రూట్మెంట్ కొనసాగుతోంది. ప్రతి ఉద్యోగి నిత్య విద్యార్థిగా ఉండాలి ప్రీమియం, క్వాలిటీ స్కిల్స్ ఉన్నవారికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఏఐ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ కొరత ఉంది. డిమాండ్కు తగ్గ నైపుణ్యం పెంచుకోవడమే ఇప్పుడున్న మార్గం. కంపెనీలపై ఆధారపడకుండా సొంతంగానైనా నైపుణ్యం అందిపుచ్చుకోవాలి. టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే. – వెంకారెడ్డి, హెచ్ఆర్ రంగ నిపుణులు క్యాంపస్లోనే కొట్టాలి.. విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లోనే జాబ్ కొట్టాలి. విఫలం అయితే కాస్త కష్టపడాల్సిందే. దొరికినా రూ.2.5 లక్షల లోపు వార్షిక ప్యాకేజీతోనే. నైపుణ్యం ఉన్నవారికి జీసీసీలు అధిక వేతనాలు ఆఫర్ చేస్తున్నా యి. నియామకాల్లో జీసీసీల హవా కొనసాగుతోంది. – నానబాల లావణ్య కుమార్, కో–ఫౌండర్, స్మార్ట్స్టెప్స్ -
తాగునీరే కాదు... తప్పుడు సమాచారమూ సవాలే!
సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో మన దేశం ప్రధానంగా రెండు సవాళ్లను ఎదుర్కోనుంది. వాటిలో ఒకటి తాగునీటి సరఫరా కాగా... మరొకటి తప్పుడు సమాచారం. ఈ రెండు 2025–2027 మధ్య దేశానికి అత్యంత క్లిష్టమైన సమస్యలుగా మారుతాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) హెచ్చరించింది. ఈ సమస్యలను ఇప్పటి నుంచే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాలని సూచించింది. ఇటీవల దావోస్లో జరిగిన వార్షిక సమావేశానికి ముందు డబ్ల్యూఈఎఫ్ వార్షిక గ్లోబల్ రిస్క్ రిపోర్టు–2025ను విడుదల చేసింది.ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువగా నీటి సరఫరా కష్టాలు ఎదుర్కొనే దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉందని ఈ నివేదిక వెల్లడించింది. మొదటి నాలుగు స్థానాల్లో మెక్సికో, మొరాకో, ట్యునీషియా, ఉజ్బెకిస్తాన్ ఉన్నట్టు ప్రకటించింది. మానవ తప్పిదాలు, పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలతోపాటు పర్యావరణ వ్యవస్థ దెబ్బతినడం వంటి అంశాలు తాగునీటి సమస్యకు కారణమవుతున్నట్లు వివరించింది. నీటి సరఫరా కొరతను ఎదుర్కొనే ‘టాప్ రిస్క్’ దేశాల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతున్నట్టు తెలిపింది. 2024లో నీటి సరఫరా సంక్షోభాన్ని ఏడు దేశాలు ఎదుర్కోగా, 2025 ప్రారంభంలో ఆ సంఖ్య 27కి పెరిగింది. రానున్న కాలంలో మరిన్ని దేశాల్లో ఈ సంక్షోభం తీవ్రతరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.రెండో స్థానంలో తప్పుడు సమాచారం భారతదేశం రానున్న రెండేళ్లలో నీటి సరఫరా సమస్యతోపాటు మరో నాలుగు ప్రమాదాలను ఎదుర్కోనుందని గ్లోబల్ రిస్క్ రిపోర్ట్–2025 వివరించింది. వీటిలో తప్పుడు సమాచారం రెండో స్థానంలో, మానవ హక్కుల ఉల్లంఘన–పౌర స్వేచ్చ క్షీణత మూడో స్థానంలోను, కాలుష్యం నాలుగో స్థానంలోను, కార్మికుల కొరత–ప్రతిభ కొరత ఐదో స్థానంలో ఉంటాయని వెల్లడించింది.గాలి, నీరు, నేల కాలుష్యం వల్ల భారతదేశానికి గణనీయమైన ఆరోగ్య, ఆర్థిక నష్టాలను కలిగిస్తుందని హెచ్చరించింది. వచ్చే రెండేళ్లల్లో ప్రపంచం ఎదుర్కొనే మరో అత్యంత తీవ్రమైన ప్రమాదం విపరీతమైన వాతావరణ మార్పులేనని కూడా ఈ నివేదిక తెలిపింది. అదేవిధంగా విపరీత వాతావరణ మార్పులు మానవ వినాశనానికి దారితీస్తున్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వార్షిక నివేదిక ప్రకటించింది. విపరీత వాతావరణ మార్పుల కారణంగా 2024లో దేశవ్యాప్తంగా 3,238 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. ఇది 2022తో పోలిస్తే 18 శాతం పెరిగినట్లు వెల్లడించింది. -
‘పెద్దలు’ దావోస్ వెళ్లేది అందుకేనా..?
వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF)దావోస్లో పెట్టుబడుల సదస్సు అంటూ జనవరి 20-24 తేదీల మధ్య నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం అబాసుపాలైంది. ఈ సదస్సులో పెట్టుబడులు,వ్యాపారం,పరిశ్రమల స్థాపన,ఆయా రంగాల్లో నిపుణులు,అనుభవజ్ఞులతో చర్చలు, ఉపచర్చలు అంతిమంగా ఆరోగ్యకరమైన పారిశ్రామిక విధానాల రూపకల్పన వంటివి ఉంటాయనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. అసలా సదస్సు ఉద్దేశ్యం అదే అయినా..వెళ్లినవారి ఉద్దేశాలు వేరని అందరూ అక్కడికి విలాసాలకు కులాసాలకు మాత్రమే వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి హోటల్స్ రిసార్ట్స్ బుకింగ్స్ బట్టి ఇదే అర్థం అవుతోందని జాతీయ,అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.అక్కడికి వచ్చేవారికి వారి కోరికమేరకు 'వ్యక్తిగత సేవలు' అందించే సంస్థలకు భారీ గిరాకీ దక్కిందని ఈ సర్వీసుల సేవల విలువ దాదాపు రూ.పదికోట్ల పైమాటే అని ఆ కథనాల్లో వివరిస్తున్నారు.పెట్టుబడులు,పారిశ్రామిక విధానాలు,వాతావరణ మార్పుల మీద చర్చలకన్నా అక్కడికి ధనికులు 'గాలి మార్పు' రిలాక్సేషన్ కోసమే ఎక్కువ తాపత్రయపడినట్లు ఓ అంతర్గత నివేదిక బయటకు వచ్చింది. స్విట్జర్లాండ్ లో అలాంటి సేవలు అందించే సంస్థలకు దావోస్ సదస్సు టైమ్లో డిమాండ్ గణనీయంగా పెరిగింది అంటూ బ్రిటన్ నుంచి వెలువడే డైలీ మెయిల్ పత్రిక,వెబ్ సైట్ ఒక సంచలన కథనాన్ని వెలువరించింది. ఇలాంటి బుకింగ్స్ అందుబాటులో ఉంచే ఒక వెబ్ సైట్ ఐతే మొదటి రెండు మూడు రోజుల్లోనే దాదాపు రూ.3 కోట్లు ఆర్జించింది.గత ఏడాది ఈ సర్వీసులు కేవలం 170 సంస్థలు మాత్రమే అందించగా ఈసారి వాటి సంఖ్య దాదాపు మూడు వందలకు పెరిగిందట.దావోస్లో పెట్టుబడులు అంటూ వెళ్లే పెద్దలు..పెద్దల ముసుగులో వెళ్లే నాయకులూ అక్కడకు వెళ్లి చేసే రాచకార్యాలు ఇవీ అంటూ హిందూస్తాన్ టైమ్స్,ఎకనామిక్ టైమ్స్ తో పాటు పలు వెబ్ సైట్స్ కూడా బోలెడు ఇన్సైడర్ కథనాలు ప్రచురించాయి.దీనిమీద సోషల్ మీడియాలోనూ పంచులు పేలుతున్నాయి. ఓ నెటిజన్ అయితే దావోస్ సదస్సుమీద వ్యంగ్యంగా పాట కూడా రాశారు..గుడివాడ యెల్లాను... గుంటూరు పొయ్యాను... దావోసూ పోయాను... ఎన్నెన్నో చూశాను. యాడ చూసినా, ఎంత చేసినా ఏదో కావాలంటారు... నోళ్ళు... ‘పెట్టుసచ్చిబడుల వేటకు వచ్చినోళ్ళు’. అంటూ పాట రాశారు. మొత్తానికి పెట్టుబడుల వేట అంటూ వెళ్లిన వేటగాళ్లు.. అసలు పనికన్నా కొసరూపానికి ప్రాధాన్యం ఇచ్చారని.. మీడియా.. సోషల్ మీడియా కోడై కూస్తోంది..-- సిమ్మాదిరప్పన్న -
జ్ఞానోదయం కలిగేది ఎప్పుడు?
విజన్ ఉన్న ఏ నాయకుడు కూడా విధ్వంసాన్ని ప్రేరేపించడు. అలా చేసేవారు పాలకులైతే పెట్టుబడులు రాకపోవడం అటుంచి ఉన్న పరిశ్రమలూ వేరే చోటుకు తరలిపోతాయి. దావోస్లో ఇటీవల జరిగిన ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ సదస్సుకు కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి నారా వారు చేసిన పెట్టుబడుల సాధన పర్యటన నీరు గారిపోయింది. ఇందుకు కారణం వారి ‘రెడ్బుక్ రాజ్యాంగం’ ప్రకారం సృష్టించిన విధ్వంసకాండే అనేది వేరే చెప్పవలసిన పనిలేదు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఎంతోమంది పారిశ్రామిక దిగ్గజాలను కలిసినా వారితో ఒక్క మెమోరాండం ఆఫ్ అండర్స్టాడింగ్ (ఎంఓయూ)ను కూడా ఏపీ ప్రభుత్వం కుదుర్చుకోలేక పోయింది. ‘ఉద్యోగం కోసం... ఉపాధి కోసం నువ్వీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లు. నువ్వు అక్కడకు వెళ్లే లోపే నీ చరిత్ర అక్కడ టేబుల్ మీద ఉంటుంది’ అని ఓ ఇంగ్లీష్ సామెత ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలో చిందించిన రక్తాన్ని దావోస్కి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు, వారి తాలూకు ప్రతినిధులు ఎలా మర్చిపోగలరు? లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ధాటికి పెట్టుబడులు కూడా ముఖం చాటేశాయి. సాధారణంగా పారిశ్రామిక వేత్తలు వ్యాపారానికి అనుకూల పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లోనే పెట్టుబడులు పెడతారు. ముఖ్యంగా శాంతిభద్రతలు బాగుంటేనే కొత్త పరిశ్రమలు వస్తాయి. విధ్వంసం, రక్తపాతాన్ని ప్రోత్సహించేవారు పాలకులుగా ఉన్న రాష్ట్రాల్లో నయాపైసా పెట్టుబడి పెట్టినా వ్యర్థమని పారి శ్రామికవేత్తలు అనుకుంటారు. ఇప్పుడు దావోస్లో ఏపీ ప్రభుత్వం సంప్రదించినవారు ఇందుకే పెట్టు బడులకు ఆసక్తి చూపించలేదని పరిశీలకుల అంచనా. అధికారంలోకి వచ్చీ రాగానే రెడ్బుక్ చేతిలో పట్టుకుని చూపిస్తూ... తమ వ్యతిరేకులను అక్ర మంగా అరెస్టుచేసి జైళ్లలో కుక్కడం, దాడులు, హత్యలు చేయడంతో ప్రజలతో పాటు పెట్టుబడి దారులు కూడా భయపడిపోయారు. ‘సింగిల్విండో’ విధానంలో అన్ని అనుమతులు ఇస్తా మన్నా ఏపీలో పెట్టుబడులు పెట్టే ప్రసక్తే లేదని ముక్తకంఠంతో తీర్మానించుకున్నట్లున్నారు పారి శ్రామికవేత్తలు. అందుకే ఒక్కరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు. నేను చేసేది చేసేదే. ఇది నా రాజ్యం. ఇది నా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నట్లు రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి వ్యవహరిస్తుంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? దావోస్ వేదికగా ఇది ఏపీకి జరిగిన అవమానం కాక మరేమిటి? తండ్రీ – కొడుకులు చేసిన తప్పిదాలే ఇప్పుడు ఏపీ ప్రజలకు శాపాలుగా పరిణమించాయి. ఈ అవమానంనుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికి ఇంకో ‘కల్తీ తిరుమల లడ్డు’ను తెరమీదకు తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. పెట్టుబడులు తీసు కొస్తామని దావోస్ వెళ్లి నయాపైసా పెట్టుబడి తేకుండా వచ్చిన మన ప్రభుత్వ నిర్వాకం వల్ల అయిన ఖర్చు దాదాపు 75 కోట్ల రూపాయల పైమాటే! మరి ఇంత డబ్బూ బూడిదలో పోసిన పన్నీరేనా? పాలకులకు ఎకౌంటబిలిటీ ఉండాల్సిన అవసరం లేదా? ఈ ప్రజా ధన నష్టానికి బాధ్యత వహిస్తూ ఏమి చేయగలరో సీఎం, ఐటీ మంత్రులే చెప్పాలి.తాజాగా దావోస్లో తెలంగాణ ప్రభుత్వం రూ. 1.79 లక్షల కోట్లు, మహా రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 లక్షల కోట్ల మేర ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ముందు శాంతి భద్రతల మీద పట్టు సాధించి ఆ దిశగా పురోగమిస్తే ఏ రాష్ట్రమైనా ఇటువంటి పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అంతే తప్ప... రెడ్ బుక్ రాజ్యాంగాలు అమలు చేసే నెత్తుటి గడ్డలపై ఉన్న పాలకులు ‘మేం సుద్దపూసలం. మా రాష్ట్రం వెన్నపూస’ అంటే అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు ఎంత మాత్రమూ విశ్వసించే పరిస్థితి లేదు. ఇది మన రాష్ట్ర ప్రస్తుత పాలకులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. – ఆర్కేడి నాయుడు ‘ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
అమెరికాలో ఉత్పత్తి చేయండి లేదంటే టారిఫ్ కట్టండి
దావోస్: అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోగానే డజన్ల కొద్దీ కార్యనిర్వాహక ఉత్తర్వులతో అమెరి కన్లనేకాదు ప్రపంచదేశాలనూ విస్మయపరిచిన వివాదాస్పద నేత డొనాల్డ్ ట్రంప్ తన హెచ్చరికల ఖడ్గాన్ని ఈసారి పారిశ్రామికవేత్తలపై ఝలిపించారు. ఏకంగా ప్రపంచ వాణిజ్య సదస్సు వార్షిక సమావేశం సాక్షిగా అంతర్జాతీయ వాణిజ్యవేత్తలకు తనదైన శైలిలో ‘సూచనలు’ చేశారు. అమెరికాలో వస్తూత్పత్తిని పెంచాలని, ఈ మేరకు తమ కర్మాగారాలను అమెరికాకు తరలించాలని పిలుపునిచ్చారు. అమెరికాలో తయారు చేయకపోతే దిగుమతిచేసుకునే వస్తువులపై మరింత టారిఫ్ భారం మోపుతామని పరోక్షంగా హెచ్చరించారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ వాణిజ్య సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో గురువారం ట్రంప్ వర్చువల్గా ప్రసంగించారు. ‘‘ ప్రపంచంలోనే ప్రతి వస్తూత్పత్తి సంస్థకు నేను చాలా సులభమైన సలహా ఇస్తున్నా. అమెరికాకు వచ్చి ఇక్కడే ఉత్పత్తి మొదలెట్టండి. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత అత్యల్ప పన్నులను విధిస్తాం. అయితే తమ ఉత్పత్తులను ఏ దేశంలో తయారు చేయాలనే పూర్తి స్వేచ్ఛ ఆయా కంపెనీలకు ఉంది. అయితే అమెరికా ఆవల తయారయ్యే ఉత్పత్తుల విషయంలో, వాటి ఆర్థికఅంశాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాటి పర్యావసానాలు ఎలా ఉంటాయి అనేది అమెరికానే నిర్ణయిస్తుంది. నేను ఇంతచెప్పినా మీరు అమెరికాలో తయారుచేయబోమని భీష్మించుకుని కూర్చుంటే, మీరు అధిక టారిఫ్ చెల్లించక తప్పదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. సౌదీ.. రేట్లు తగ్గించుకో..‘‘చమురు ధరలను సౌదీ అరేబియా తగ్గించాలి. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పినట్లు 600 బిలియన్ డాలర్లుకాకుండా సౌదీ మా దేశంలో ఒక ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలి. హాస్యాస్పదమైన, ఏకపక్షంగా ఉన్న పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికాను ఉపసంహరించా. అమెరికాలో మొత్తం వాహనాల్లో నిష్పత్తిలో కొంతమేరకు అత్యంత ఖరీదైన విద్యుత్ వాహనాలనే తప్పకుండా వాడాలనే నిబంధనను రద్దుచేశా. అధిక చమురు ధరలను సౌదీ అరేబియా తగ్గించాల్సిందే. చమురు ధరలు తగ్గితే రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కూడా ఒక ముగింపునకు వస్తుంది’’ అని ట్రంప్ అన్నారు. -
రూపాయి పడినా ఇంకా విలువైనదే..
అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి(Rupee) మారకం విలువ ఇటీవల భారీగా క్షీణిస్తోంది. అయినా అంతర్జాతీయ మార్కెట్లో ఇతర పోటీ కరెన్సీలతో పోలిస్తే రూపాయి ఇంకా అధిక విలువ కలిగి ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్(Rajan) పేర్కొన్నారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF)లో రూపాయి భవిష్యత్తు గమనంపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదుఅమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని రాజన్ అన్నారు. అనేక ఇతర కరెన్సీలు కూడా ఇదే ధోరణిని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి రియల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్ (ఆర్ఈఈఆర్) ఇప్పటికీ అధిక విలువను సూచిస్తోందన్నారు. ఈ ఓవర్ వాల్యుయేషన్ రూపాయి మరింత పతనం అయ్యేందుకు అవకాశం ఉన్నట్లు సూచిస్తుందని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి అధిక విలువ కలిగి ఉండడం వల్ల భవిష్యత్తులో భారతీయ ఎగుమతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.ఆర్బీఐ జోక్యం తగదురూపాయి విలువను కాపాడేందుకు కరెన్సీ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని రాజన్ అన్నారు. ప్రాథమిక ఆర్థిక సర్దుబాట్లకు ప్రతిస్పందనగా, కరెన్సీ విలువను పెంచేలా కేంద్ర బ్యాంకులు జోక్యం చేసుకోవడం మానుకోవాలని, స్వల్పకాలిక అస్థిరతను అరికట్టడానికి మాత్రమే చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. రూపాయి క్షీణత, అమెరికా డాలర్ బలపడటం, ఇతర ప్రపంచ ఆర్థిక అంశాలు సహజ మార్కెట్ ప్రతిస్పందనగానే భావించాలని రాజన్ తెలిపారు.ఇదీ చదవండి: ఇన్ఫీలో మూర్తి కుటుంబం కంటే రెట్టింపు వాటాఅమెరికా కరెన్సీ యుద్ధంప్రపంచ కరెన్సీలను అమెరికా ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉందని రాజన్ హెచ్చరించారు. ఇతర దేశాలపై ఆర్థిక సుంకాలు విధించడానికి అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరెన్సీలపై పెరుగుతున్న ఈ ఆర్థిక యుద్ధం ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకర్లకు ఆందోళన కలిగిస్తుందన్నారు. -
వచ్చే 10 ఏళ్లలో ప్రపంచానికి అతి పెద్ద ముప్పు ఏంటో తెలుసా?
ఈ ప్రపంచం వచ్చే రెండేళ్లలో, అలాగే వచ్చే పదేళ్లలో ఎదుర్కొనే అతి పెద్ద ముప్పు (Global Risk) ఏమిటి? వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) ఇదే ప్రశ్న రాజకీయ, వ్యాపార, విద్యా రంగాలకు చెందిన 900 మంది నిపుణులకు వేసింది. వారి సమాధానాల ఆధారంగా తన వార్షిక గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ను విడుదల చేసింది. దాని ప్రకారం వచ్చే రెండేళ్లలో.. ఉద్దేశపూర్వకంగా లేదా తెలియకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం అన్నది అతి పెద్ద ముప్పుగా నిలిచింది. ఇలాంటి అసత్య సమాచార వ్యాప్తి పెద్ద పెద్ద సమస్యలకు దారి తీస్తుందని, సమాజంలో అశాంతి తలెత్తేలా చేస్తుందని హెచ్చరించింది.వచ్చే పదేళ్ల లెక్క తీసుకుంటే.. వాతావరణ మార్పులు, దాని వల్ల కలిగే దుష్ఫలితాలు అతి పెద్ద ముప్పుగా పేర్కొంది. వాతావరణ పరిస్థితుల్లో వచ్చే విపరీత మార్పులు.. స్వల్పకాలంలోనూ అలాగే దీర్ఘకాలంలోనూ ఈ ప్రపంచానికి అతి పెద్ద సమస్యగా మారనుందని తెలిపింది. జీవన వ్యయం, ద్రవ్యోల్బణం (inflation) పెరగడం లాంటి వాటిని ఆయా రంగాల నిపుణులు ఇప్పుడు పెద్ద సమస్యలుగా చూడటం లేదని ఈ నివేదిక పేర్కొంది. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్లో ఈ సమాచారాన్ని సేకరించారు. ఈ నివేదిక ప్రకారం టాప్–10 ముప్పులివీ.. ఇదీ చదవండి: రోమ్లో 2 వేల ఏళ్ల నాటి బాత్ హౌస్! -
అంతర్జాతీయ అనిశ్చితిలోనూ భారత్ పురోగతి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆర్థికవేత్తలలో అధికశాతం మంది 2025లో బలహీన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నారు. అయితే కొంత మందగమన సంకేతాలు ఉన్నప్పటికీ, భారతదేశం బలమైన వృద్ధిని కొనసాగించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు విడుదలైన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) చీఫ్ ఎకనమిస్ట్ అవుట్లుక్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. సర్వేలో అభిప్రాయం వ్యక్తం చేసిన ఆర్థికవేత్తలో 56 శాతం 2025లో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉంటాయని భావిస్తున్నారు. కేవలం 17 శాతం మెరుగుదల ఉంటుందని అభిప్రాయపడ్డారు. 2025లో భారత్, అమెరికాలు మాత్రం చక్కటి పురోగతి సాధిస్తాయని అంచనా. యూరోప్ ఎకా నమీ బలహీనంగా ఉంటుందని సర్వేలో పాల్గొన్న వారిలో 74 శాతం మంది అభిప్రాయడ్డారు. చైనా వృద్ధిపై కూడా అనుమానాలే వ్యక్తం మయ్యాయి. -
దీర్ఘకాలిక వృద్ధిని పెంచగలదా?
2023–24 ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందింది. తద్వారా పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్ అత్యంత వేగంగా ముందుకు సాగు తున్న దేశంగా నిలబడింది. దీన్నిబట్టి, గత పదేళ్లలో సాధించినదాని పట్ల కేంద్ర ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నట్టుంది! కానీ అధిక వృద్ధి ఫలాలను పెద్ద సంఖ్యలో ప్రజలు పొందుతున్నారా? బడ్జెట్ రూపకల్పన వారికి అనుగుణంగా జరిగిందా? వృద్ధి ఊపందుకున్నప్పటికీ, పేదరికం కారణంగా వినియోగ డిమాండ్ తక్కువగానే ఉంది. ఈ వృద్ధి నిలకడగా ఉండాలంటే, కార్మికులు మెరుగైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. హ్రస్వ దృష్టితో చూస్తే బడ్జెట్ వాస్తవికంగానే కనబడుతుంది. కానీ దీర్ఘకాలిక వృద్ధిని నిర్ధారించే అంశాలను అది పరిష్కరించకుండా వదిలేసింది.ప్రతి సంవత్సరం, ఆర్థిక సర్వే, బడ్జెట్లను ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి సమ ర్పిస్తుంది. ఈ సర్వే ద్వారా ఆర్థిక వ్యవస్థ ఎలా దూసుకు పోతోందో వివరించేందుకు ప్రయత్నిస్తుంది. బడ్జెట్ ద్వారా, తన మనస్సులో ఏ కార్యాచరణ ప్రణాళిక ఉందో వివరించడానికి ప్రయ త్నిస్తుంది. రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు ఉండాలి: ప్రస్తుత పరిస్థితిలో ఏమి చేయాలి? విషయాలు సరైన దిశలో వెళ్ళే అవకాశం ఉందా? చూస్తుంటే గత పదేళ్లలో సాధించినదానిపట్ల ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నట్టుంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందింది. తద్వారా అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారతదేశాన్ని అత్యంత వేగంగా ముందుకు కదలిపోయేదేశంగా నిలబెట్టింది. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2 శాతమే పెరిగింది. 2024–25లో ప్రధాన ద్రవ్యోల్బణాన్ని 4.5 శాతానికికట్టడి చేయగలమనే విశ్వాసంతో ప్రభుత్వం ఉంది. కానీ ఈ కథ పూర్తిగా ఆశాజనకంగా లేదు. 2023–24లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం 7.5 శాతం వరకు ఉంటూ, మరింత ఆందోళనకరంగా మారింది. మొత్తంమీద, ఈ విషయంలో బాగా పనిచేసినందున, కింది వృద్ధి వ్యూహాన్ని ఆర్థిక సర్వే సూచించింది; తద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవచ్చని చెప్పింది: స్థిరంగావృద్ధి చెందడానికి ప్రైవేట్ రంగం దాని సొంత మూలధనాన్ని ఏర్పాటుచేసుకోవాల్సి ఉంది. దేశంలో హరిత పరివర్తన జరగడా నికి ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహించాలి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తమ వృద్ధిని కొనసాగించేలా ప్రభుత్వం ఖాళీలను పూడ్చాలి. దేశం అభివృద్ధి చెందడానికి వీలుగా నైపుణ్యాల అంతరాన్ని పూరించడానికి ఒక విధానం అవసరం. ఈ విధానాన్ని రూపొందించాలంటే, రాష్ట్ర యంత్రాంగ సమర్థత, వ్యవస్థ ఒకేలా ఉండాలి.ఇది పావు శతాబ్దానికి దీర్ఘకాలిక లక్ష్యం అయితే, మనం ఇప్పుడు ఎక్కడ నుండి ప్రారంభించాలి? ముందుగా, పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. నిర్ణీత తగ్గింపు (స్టాండర్డ్ డిడక్షన్) రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచుతున్నారు. రూ.17,000 వరకు ఉద్యోగులకు ఆదా అయ్యేలా శ్లాబుల్ని మెలితిప్పారు. ఉద్యోగాల్లో చేరేందుకు ప్రొఫెషనల్స్ ప్రోత్సా హకాలు పొందబోతున్నారు. దీని వల్ల రెండు లక్షల మంది యువ కులు ప్రయోజనం పొందనున్నారు. కేవలం జీతం ఆదాయం మాత్రమే కాదు, పెట్టుబడిపై లాభాలు ఆర్జించే వారికి మూలధన లాభాలకు మినహాయింపు కూడా పెరుగుతోంది.ఈ లెక్కన తక్కువ పన్నులు చెల్లించాల్సిన మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్ తోడ్పడుతుంది. తమాషా ఏమిటంటే, ఆదాయపు పన్ను చెల్లించే అవసరం లేని పేదలు, వారు తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిన వస్తువులు అన్నింటికీ వాస్తవ చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఇది జీఎస్టీ పరిధిలోకి వస్తుంది. ఏకాభిప్రాయం సాధించడం ఎల్లప్పుడూ కష్టమైనప్పటికీ, మరిన్ని జీఎస్టీ–అనుబంధ సంస్కరణలను కేంద్రం, రాష్ట్రాలు చేపట్టవచ్చు. అంతేకాకుండా, రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని సెస్ నుండి కేంద్రం ప్రయోజనం పొందడం అన్యాయం. పేద పిల్లలు చదువుకునేలా చేయడం వంటి అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే ప్రాజెక్ట్ల కోసం సేకరించగలిగే మొత్తం ఆదాయం రాష్ట్రాలకు అవసరం.నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూనీ, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీనీ సంతోషపెట్టడానికి అనేక భారీ ప్రాజెక్టులకు కూడా బడ్జెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన ప్రాజెక్టులలో పట్నా–పూర్నియా, బక్సర్–భాగల్పూర్ ఎక్స్ప్రెస్వేలు ఉన్నాయి. అంతేకాకుండా, బిహార్లోని బక్సర్ జిల్లాలో గంగా నదిపై రెండు లేన్ల వంతెనను నిర్మించనున్నారు. అదనంగా, భాగల్పూర్లోని పీర్పైంతిలో 2,400–మెగావాట్ల పవర్ ప్లాంట్ రానుంది. ఆంధ్రప్రదేశ్కు రైల్వే, రోడ్డు మార్గాల ప్రాజెక్టులను ప్రకటించారు. కొత్త రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15,000 కోట్లు ప్రకటించారు.బడ్జెట్ అనేది రాజకీయ చర్య. దానికి స్పష్టమైన లక్ష్యంఉంది. బీజేపీ సంకీర్ణ భాగస్వాములు, మధ్యతరగతి సంతృప్తిచెందేలా చూసుకోవడమే దాని లక్ష్యం. ప్రధాన పార్టీపై ఆధిపత్యం చలాయించే రాజకీయ వ్యాపారుల వెరపులేని ధీమా కారణంగానేసంకీర్ణ భాగస్వాములను సంతోషపెట్టాలనే లక్ష్యం నడుస్తుంటుంది. పూర్తిగా సంఖ్యల పరంగానే, చిన్న మధ్యతరగతి ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేదు. పాలకవర్గం అంతిమ ఉద్దేశ్యం జనబాహు ళ్యాన్నిసంతోషపెట్టడమే.అయితే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి మంచి జరగనుంది. ప్రపంచ వ్యాఖ్యాతలు కూడా భారత్ అధిక వృద్ధి రేటును ప్రశంసించారు. కానీ వృద్ధి నిలకడగా ఉండాలంటే, కార్మికులు మెరుగైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ కీలక సమస్యలను పరిష్కరించడానికి బడ్జెట్ సంకేత పథకాలను మాత్రమే ప్రవేశపెట్టింది. అందుకే, అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్లను బాగా అర్థం చేసుకున్నా, దూరదృష్టితో వ్యవహరించడం లేదనేది మొత్తం భావన.ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతోందనే దానితోసంబంధం లేకుండా, బడ్జెట్ అంచనాలు కూడా పరిష్కరించాల్సిన మూడు సమస్యలను ఎత్తిపట్టాయి. వృద్ధి ఊపందు కున్నప్పటికీ, వినియోగ డిమాండ్ తక్కువగానే ఉంది. పైగా ఉపాధి చాలా వెనుకబడి ఉంది. అధిక ఆర్థిక వృద్ధి ఫలాలను పెద్దసంఖ్యలో ప్రజలు పొంద లేకపోతున్నారా? ఇది కొంచెం ఎక్కువగా సాంకేతికమైనది. తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం అనేది ఛేదించగలిగే టంత దృఢంగా ఉందా?నోట్ల రద్దు, కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో, వృద్ధి రేటు అనుకున్నంత ఎక్కువగా లేదని చాలా మంది వాదించారు. కాబట్టి, ఒక విధంగా, ఆర్థిక వ్యవస్థ కేవలం తేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రజలు ఎక్కువ పొదుపు చేయడం వల్ల కాదు కానీ, రెండు ఎదురుదెబ్బల ఫలితంగా ఆదాయ వనరును కోల్పోయినప్పుడు వారు తీసుకున్న భారీ అప్పును తిరిగి చెల్లించ డానికి ప్రయత్నిస్తున్నందున వినియోగం కుంచించుకుపోయింది. రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నది సమృద్ధిగా ఉన్న సరఫరాల వల్ల కాదు. ప్రజలు తాము కోరుకున్న వాటిని వినియోగించుకోలేక పోవడం వల్ల.ఇక్కడ శక్తిమంతమైన వైరుధ్యం కూడా ఉంది. ఆర్థిక వ్యవస్థ, వ్యాపారాలు బాగా కొనసాగాలంటే, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తక్కు వగా ఉంచాలి. అయితే, ఎక్కువ డిపాజిట్లను సంపాదించడానికి బ్యాంకులు అధిక వడ్డీ రేటును ఎలా చెల్లించగలవు? అందు వల్ల, బ్యాంకులు రుణాలు, పొదుపు మధ్య అసమతుల్యతను చూస్తున్నాయి. మొత్తంమీద, హ్రస్వ దృష్టితో చూస్తే బడ్జెట్ వాస్తవికంగానే కనబడుతుంది. కానీ ఇది మధ్యతరగతి ద్వారా, మధ్యతరగతి కోసం చేసే ఒక కసరత్తు. అది దీర్ఘకాలిక వృద్ధిని నిర్ధారించే అంశాలను పరిష్కరించకుండా వదిలివేసింది.- వ్యాసకర్త సీనియర్ ఆర్థిక విశ్లేషకులు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- సుబీర్ రాయ్ -
దావోస్లో సీఎం బృందం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు దావోస్కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పలు భేటీల్లో పాల్గొంటోంది. ఐటీ, జీవ, వైద్య రంగాల్లో తెలంగాణ శక్తిని ప్రపంచానికి చాటడంతో పాటు, భారీ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా కీలక చర్చలను ప్రారంభించింది. తొలిరోజు డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సమావేశమైన సీఎం, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఇథియోపియా ఉప ప్రధాని డెమెక్ హసెంటోతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్ మ్యాప్పై చర్చించారు. సీఎం, పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జాని ఘోష్తోనూ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల కల్పనకు సాయం అందించడంపై సంప్రదింపులు జరిపారు. తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు.. డబ్ల్యూఈఎఫ్ సదస్సులో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా ‘వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్’నినాదంతో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేశారు. బతుకమ్మ, బోనాల పండుగలు, చారిత్రక వారసత్వ సంపదకు చిహ్నం చారి్మనార్తో పాటు చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్, టీ హబ్తో పాటు విభిన్న రంగాల విజయాలు చాటే లా పెవిలియన్ను తీర్చిదిద్దారు. భారీగా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ అనుకూలతలను వివరించేలా నినాదాలు ఏర్పాటు చేశారు. జ్యూరిచ్లో ప్రవాస భారతీయుల స్వాగతం మూడు రోజుల పాటు జరిగే డబ్ల్యూఈఎఫ్ 54వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన సీఎం రేవంత్ బృందానికి మార్గం మధ్యలోని జ్యూరిచ్లో ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. సమ్మిళిత, సంతులిత అభివద్ధి ద్వారా ప్రజలందరి పురోగతి తమ లక్ష్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నవ తెలంగాణ నిర్మాణం కోసం మొదలైన తమ ప్రభుత్వ ప్రయత్నంలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావటంపై హర్షం వ్యక్తం చేశారు. -
ఇంధన డిమాండ్ తగ్గితే ఏటా 2 లక్షల కోట్ల డాలర్ల ఆదా
న్యూఢిల్లీ: ఈ దశాబ్దం ఆఖరు నాటికి ఇంధన వినియోగ డిమాండ్ తీవ్రతను తగ్గించుకునేలా తగిన చర్యలు తీసుకోగలిగితే ప్రపంచ ఎకానమీకి ఏటా 2 లక్షల కోట్ల (ట్రిలియన్) డాలర్లు ఆదా కాగలవని ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఒక నివేదికలో వెల్లడించింది. వృద్ధికి ఊతమిచ్చేందుకు, గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించేందుకు ఇవి ఉపయోగపడగలవని పేర్కొంది. జనవరి 15–19 మధ్య దావోస్లో వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో డబ్ల్యూఈఎఫ్ ఈ నివేదికను విడుదల చేసింది. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీతో కలిసి తయారు చేసిన ఈ రిపోర్టు రూపకల్పనలో 120 మంది పైగా గ్లోబల్ సీఈవోలు సహాయ, సహకారాలు అందించారు. ప్రభుత్వాలు విధానపరంగా సరైన చర్యలు తీసుకుంటే వృద్ధి.. ఉత్పాదకతకు తో డ్పాటు లభించగలదని, కంపెనీలు నిధులను ఆదా చేసుకోగలవని, కాలుష్యకారక ఉద్గారాలను తగ్గించగలవని నివేదిక పేర్కొంది. ఫ్యాక్టరీ లైన్లను డిజైన్ చేయడంలో కృత్రిమ మేథను ఉపయోగించుకోవడం, విద్యుత్ వినియోగంలో సమర్ధతను మెరుగుపర్చుకోవడం, రవాణా వ్యవస్థను విద్యుదీకరించ డం మొదలైన చర్యలను పరిశీలించవచ్చని సూచించింది. -
అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నా.. భారత్ భేష్
న్యూఢిల్లీ: రాజకీయ, ఆర్థిక అస్థిరతల మధ్య వచ్చే సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని చాలా మంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే 90 శాతం కంటే ఎక్కువ మంది దక్షిణాసియా, ముఖ్యంగా భారతదేశంలో మధ్య తరహా లేదా బలమైన వృద్ధి నమోదవుతుందని విశ్వసిస్తున్నారు. ఈ మేరకు తమ అధ్యయనంలో అభిప్రాయాలు వ్యక్తం అయినట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తాజా ‘చీఫ్ ఎకనమిస్ట్ ఔట్లుక్’ నివేదిక పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో తీవ్ర ప్రతికూలతల నేపథ్యంలో చైనా అవుట్లుక్ మసకబారింది. ► ప్రపంచం రాజకీయ, ఆర్థిక అస్థిరతతో పోరాడుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి నిర్దేశిస్తున్న సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) చేరుకోవడంలో పురోగతి బలహీనంగా ఉంటుందని దాదాపు 10 మందిలో ఆరుగురు విశ్వస్తున్నారు. ► ప్రత్యేకించి ఆహార భద్రత, వాతావరణ పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణతో సహా ఎస్డీజీకి సంబంధించి పలు లక్ష్యాల్లో మందగమనం ఉంటుంది. 2030లో అర బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు తీవ్ర పేదరికంలో జీవిస్తారు. ► ఇటీవల అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినప్పటికీ కఠిన ఫైనాన్షియల్ పరిస్థితులు కొనసాగుతాయని మెజారిటీ (86 శాతం) అంచనా. ఆయా అంశాల నేపథ్యంలో వ్యాపార రుణాలపై ఒత్తిడి, కార్పొరేట్ రుణ ఎగవేతలలో పెరుగుదల, ఆస్తి–ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర దిద్దుబాట్లు తప్పదు. ► 74 శాతం మంది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరికొన్ని సంవత్సరాలు తప్పదని భావిస్తున్నారు. ► అమెరికాలో మే నుండి అవుట్లుక్ బలపడింది. ప్రతి 10 మందిలో ఎనిమిది మంది 2023, 2024 అమెరికా ఒక మోస్తరు లేదా లేదా బలమైన వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నారు. ► యూరోప్ విషయంలో ఎకానమీ బలహీనం లేదా మరీ బలహీన పరిస్థితులు ఈ ఏడాది ఉంటాయని 77 శాతం మంది భావిస్తున్నారు. 2024లో పరిస్థితులు కొంత మెరుగుపడవచ్చని అంచనా. -
మెరుగ్గా వ్యవహరించిన భారత్
అంతర్జాతీయ పరిణామాలు సవాలు విసురుతున్న సమయంలో గత ఏడాది భారతదేశం జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. కోవిడ్–19 మహమ్మారి ప్రభావం నుండి ప్రపంచం క్రమంగా కోలుకున్నప్పటికీ, ప్రపంచ వృద్ధి ఇంకా దుర్బలంగానే ఉంది. ద్రవ్యోల్బణం కూడా మొండిగాఉంది. విపరీతమైన వాతావరణ ఘటనలు పెరుగుతున్న తరుణంలో (రికార్డుల పరంగా జూలై అత్యంత వేడి అయిన నెల అని గ్రహించాలి), వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై ఈ ‘కార్యాచరణ దశాబ్ది’లో తక్షణ చర్యలు అవసరం. అయితే, అంతర్జాతీయ సహకారాత్మక చర్యకు సంబంధించిన ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ – భౌగోళిక రాజకీయ పోటీ, ఘర్షణ ప్రమాదాలు ఆ సహకారానికి అడ్డుగా నిలుస్తున్నాయి. ఈ కష్టతరమైన ప్రపంచ ముఖచిత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటే, బహుశా భారతదేశ అత్యంత పరిణామాత్మకమైన, అత్యంత బోధనాత్మకమైన నిర్ణయం, జీ20 చర్చా ప్రక్రియకు ఉపక్రమించడం! చెప్పాలంటే,ఇండియా చేయాల్సినదాని కంటే ఎక్కువ చేసింది. అత్యంత సంఘటిత ప్రక్రియను నడిపించడం ద్వారా సహకార విధానంలోకి మొగ్గు చూపింది. భౌగోళిక కమ్యూనిటీలు అన్నింటికీ స్వరాలు ఉండాల్సిన ఈ బహుముఖ, బహుళ వాటాదారుల విధానం... ప్రపంచ సహకారాన్ని పునరుజ్జీవింపజేయడానికి ఒక నమూనాగా ఉపయోగపడుతుంది. మన భాగస్వామ్య ప్రాధాన్యాలపై పురోగతి సాధించడానికి ప్రపంచం తక్షణమే మార్గాలను కనుగొనాల్సిన తరుణంలో ఇది చాలా కీలకమైనది. ప్రపంచ జనాభాలో 85 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణార్ధ దేశాల సమూహానికి బహుముఖ సంభాషణలలో తరచుగా చోటివ్వరు. అయితే దక్షిణార్ధ ప్రపంచ (గ్లోబల్ సౌత్) వాణికి అవకాశం ఇవ్వడం ద్వారా భారతదేశం భౌగోళికంగా జీ20 చర్చలను విస్తరించింది. జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మొదటి నెలల్లో భారతదేశం 125 దేశాలకు చెందిన నాయకులు, మంత్రుల భాగస్వామ్యంతో కూడిన ‘వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్’ శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జీ20 కూటమిలో ప్రాతినిధ్యం వహించని దేశాలతో సంప్రదింపులు జరపడం, వారి ప్రాధాన్యాలను అర్థం చేసుకోవడమే దీని లక్ష్యం. అటువంటి ప్రాధాన్యాల్లో ఒకటి ప్రపంచ సార్వభౌమాధికార దేశాల రుణ సమస్య. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 50 శాతం దేశాలు తీవ్రమైన రుణ బాధలో ఉన్నట్టు అంచనా. ఈ రుణ విచికిత్స కోసం భారతదేశం గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇచ్చింది. 3 ట్రిలియన్ డాలర్ల సామూహిక జీడీపీ ఉన్న 55 ఆఫ్రికన్ రాజ్యాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆఫ్రికన్ యూనియన్ను జీ20లో చేర్చాలని కూడా భారతదేశం వాదించింది (ఈ మేరకు సఫలమైంది కూడా). విభిన్న భౌగోళిక ప్రాంతాల నుండి పెట్టుబడులను తీసుకువచ్చే బహుముఖ ప్రక్రియకు నాయకత్వం వహించడంతో పాటు, భారతదేశం కమ్యూనిటీలలో కూడా వాటాదారులతో చర్చలు జరిపింది. ఉదాహరణకు, థింక్20 కమ్యూనిటీ అనేది, జీ20కి ‘ఐడియా బ్యాంక్’గా పనిచేస్తుంది. అదే సమయంలో, ప్రపంచ వాణిజ్య కమ్యూనిటీకి ప్రాతి నిధ్యం వహించే అధికారిక డైలాగ్ ఫోరమ్గా బి20 వ్యవహరిస్తుంది. గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్కు మొట్ట మొదటిసారిగా ‘స్టార్టప్20 ఎంగేజ్మెంట్ గ్రూప్’ ప్రాతినిధ్యం వహిస్తుంది. జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారత్, సాధారణ సవాళ్లను పరిష్కరించడానికి ఒక సాధనంగా అంతర్జాతీయ బహుళ వాటాదారుల సహకారానికి ప్రాముఖ్యమిస్తోంది. ఈ విధానం స్పష్టమైన హామీని కలిగి ఉంది. పెరుగుతున్న సంక్లిష్ట ప్రపంచంలో– భౌగోళికాలు, వ్యాపార రంగాలు, పర్యావరణ వ్యవస్థలు, కమ్యూనిటీలలోని సవాళ్లను పరిష్కరించడానికి బహుళ వాటాదారుల విధానం చాలా అవసరం. సమ్మిళిత జీ20 ప్రక్రియను తీర్చి దిద్దడానికి చేసిన భారత ప్రయత్నాలను సులభంగా తీసేయకూడదు. జనాభాలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశం భారత్. ప్రస్తుతం నిట్టనిలువుగా ఎదుగుతున్న పథంలో ఉంది. అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో వరుసగా మూడేళ్లుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతేకాకుండా 2030 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. 100 కంటే ఎక్కువ స్టార్టప్ యునికార్న్స్ (1 బిలి యన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్లు) కలిగివుంది. ఇటీవలి సంవత్సరాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెరుగుదలను చూసింది. ఇవి 2021–22 ఆర్థిక సంవత్సరంలో 85 బిలియన్ డాలర్ల కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం, ప్రపంచం త్వరలో కొత్త జీ3 యుగానికి స్వాగతం పలుకుతుంది. ఈ అంచనా అమెరికా, చైనాతోపాటు ప్రపంచంలోని ఉత్కృష్ట దేశాలలో భారతదేశాన్ని కూడా చేర్చింది. ఇది మరోలా ఉండి వుంటే, ఈ పరిణామాలు వేరుగా ఉండేవి. ఇదంతా భారతదేశం దాని తలలోకి ఎక్కించు కొని ఉండవచ్చు. అందరినీ కలుపుకొని పోవడం కాకుండా, కొందరితో ప్రత్యేకంగా చర్చలు జరిపి వుండొచ్చు. కానీ భారతదేశం స్వభావరీత్యా పైనుంచి కిందివరకూ చర్చలను నడిపించడానికి ప్రోత్సహించింది. జీ20 అధ్యక్షతలో తొలి నుండీ ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ మకుటంతో, మరింత సంపన్నమైన, సురక్షితమైన భవి ష్యత్తును రూపొందించడానికి ఏకైక మార్గం సహకారమే అని గుర్తు చేసింది. సహకారం పట్ల అంతర్జాతీయ నిబద్ధత క్షీణిస్తున్న తరుణంలో, భారతదేశ జీ20 అధ్యక్షత ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత్రధారులు తమ సహకార విధానాలకు మళ్లీ కట్టుబడి ఉండాలని గుర్తుచేస్తోంది. బోర్గే బ్రెండే వ్యాసకర్త వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు; నార్వే మాజీ విదేశాంగ మంత్రి -
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు.. మంత్రి కేటీఆర్కు ఆహ్వానం
చైనాలోని టియాంజిన్ వేదికగా ఈ ఏడాది జూన్ 27 నుంచి 29వ తేదీ వరకు ప్రపంచ ఆర్థిక వార్షిక సదస్సు (wef) జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందించింది. వలర్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్గె బ్రెండే మంత్రి కేటీఆర్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. నేషనల్ డెవలప్మెంట్, రిఫోర్మ్ కమిషన్లు చైనాతో కలిసి ఈ సమాశం ఏర్పాటు చేసింది. కోవిడ్-19 వరుస పరిణామల అనంతరం పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కొత్త కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాయి. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు కీలకమైన ఈ సమయంలో చైనాలో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు , విద్యా సంస్థలకు చెందిన సుమారు 1500 మంది గ్లోబుల్ లీడర్స్ ఈ సదస్సులో పాల్గొననున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. -
World Economic Forum: వచ్చే ఐదేళ్లలో నికరంగా... 1.4 కోట్ల కొలువులకు కోత
జెనీవా: వచ్చే ఐదేళ్లలో ఉద్యోగాల సృష్టిలో భారీ తగ్గుదల నమోదవుతుందని వరల్డ్ ఎకనామిక్ ఫో రం (డబ్ల్యూఈఎఫ్) అంచనా వేసింది. కొత్తగా 6.9 కోట్ల ఉద్యోగాల సృష్టి జరగనుండగా ఏకంగా 8.3 కోట్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయని పేర్కొంది. నికరంగా 1.4 కోట్ల ఉద్యోగాలకు కోత పడుతుందని ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’ పేరిట ఆదివారం విడుదల చేసిన ద్వై వార్షిక నివేదికలో వివరించింది. ప్రస్తుతం మొత్తం ప్రపంచ ఉద్యోగితలో ఇది 2 శాతం. వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 23 శాతం ఉద్యోగుల వలస చోటుచేసుకోవచ్చని పేర్కొంది. భారత్లో ఇది 22 శాతం దాకా ఉండొచ్చని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 45 పెద్ద ఆర్థిక వ్యవస్థలు, 27 భారీ పారిశ్రామిక క్లస్టర్లు, 800 దిగ్గజ కంపెనీల్లోని దాదాపు 67.3 కోట్ల ఉద్యోగాలపై డబ్ల్యూఈఎఫ్ విస్తృతంగా సర్వే జరిపింది. విశేషాలు... ► వచ్చే ఐదేళ్లలో సప్లై చైన్స్, రవాణా, మీడియా, వినోద, క్రీడా రంగాలకు ఉద్యోగుల వలసలు ఎక్కువగా ఉంటాయి. ► ప్రపంచవ్యాప్తంగా నూతన ఉద్యోగాల సృష్టిలో చాట్జీపీటీ వంటి కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీలదే కీలక పాత్ర. ► 75 శాతం కంపెనీలు, సంస్థలు, కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీలను అందిపుచ్చుకుంటాయి. ► ఫలితంగా ఏకంగా 44 శాతం మంది ఉద్యోగుల నైపుణ్యాలకు పూర్తిగా కాలదోషం పట్టనుంది. ► సమర్థ పనితీరును కొనసాగించాలంటే ప్రతి 10 మంది ఉద్యోగుల్లో కనీసం ఆరుగురికి శిక్షణ అవసరమవుతుంది. ► దాంతో ఏకంగా 45 శాతం వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, కంపెనీలు ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధిపై హెచ్చు నిధులు వెచ్చిస్తాయి. ► ప్రపంచవ్యాప్తంగా ఆటోమేషన్ వేగం గత అంచనాల కంటే తగ్గింది. ప్రస్తుతం కేవలం 34 శాతం టాస్కులు ఆటోమేషన్తో నడుస్తున్నాయి. ఇది 2020తో పోలిస్తే కేవలం 1 శాతమే ఎక్కువ. కంపెనీలు కూడా ఆటోమేషన్ అంచనాలను కుదించుకున్నాయి. తొలుత 2025 నాటికి 47 శాతం టాస్కులను ఆటోమేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా తాజాగా దాన్ని 2027 నాటికి కేవలం 42 శాతానికి పరిమితం చేసుకున్నాయి. ► కృత్రిమ మేధ రాకతో బ్యాంక్ క్యాషియర్లు, క్లర్కులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు వంటి 2.6 కోట్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయి. ► ఏఐ, మెషీన్ లెర్నింగ్ స్పెషలిస్టులు, ఫిన్టెక్ ఇంజనీర్లు, డేటా అనలిస్టులు, సైంటిస్టులు, అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ ఆపరేటర్లు వంటి ఉద్యోగాలు బాగా పెరుగుతాయి. ► స్వచ్ఛ ఇంధనం, వ్యర్థాల నిర్వహణ, సహజ వనరుల సమర్థ వినియోగం వంటి రంగాల్లో మేనేజర్లు, విండ్ టర్బైన్ టెక్నీషియన్లు, సోలార్ కన్సల్టెంట్లు, ఎకాలజిస్టులు, పర్యావరణ స్పెషలిస్టుల వంటి ఉద్యోగాలు కూడా భారీగా పెరుగుతాయి. ఈ రంగంలో భారత్తో సహా టాప్ 10 దేశాలు పర్యావరణ లక్ష్యాలు చేరుకోవాలంటే కనీసం 1.2 కోట్ల ఉద్యోగాల సృష్టి జరగాలి. భారత్లో సామాజికేతర రంగాల్లోనే ఉద్యోగ సృష్టి ► కరోనా అనంతరం భారత్లో విద్య, ఆరోగ్యం వంటి సామాజిక రంగాలతో పోలిస్తే సామాజికేతర రంగాల్లోనే ఉద్యోగాల సృష్టి ఎక్కువగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. భారత్లో వచ్చే ఐదేళ్లలో కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీ ఆధారిత రంగాలకు ఉద్యోగుల వలస అత్యధికంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. ► పర్యావరణ, సామాజిక, పాలన రంగాల్లో ఉపాధి వృద్ధి ఊపందుకుంటుందని భారత్లో సర్వేలో పాల్గొన్న వారిలో 61 శాతం మంది పేర్కొన్నారు. తర్వాత కొత్త టెక్నాలజీలకు 59 శాతం, డిజిటల్ యాక్సెస్కు 55 శాతం, వాతావరణ మార్పులు, పెట్టుబడుల రంగాలకు 53 శాతం ఓటేశారు. ► అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలను పెంచుకునేందుకు తమ యాజమాన్యమే అవకాశం కల్పించడం మేలని సర్వేలో పాల్గొన్న భారతీయ ఉద్యోగుల్లో ఏకంగా 97 శాతం అభిప్రాయపడ్డారు. ఇది ప్రభుత్వపరంగా జరగాలన్నవారు 18 శాతమే. ► ఉపాధి సృష్టిపై డేటా అనలిటిక్స్ పెను ప్రభావం చూపుతుందని 62 శాతం కంపెనీలు నమ్ముతున్నాయి. తర్వాతి స్థానాన్ని ఎన్క్రిప్షన్–సైబర్ సెక్యూరిటీ (53 శాతం), డిజిటల్ ప్లాట్ఫాంలు, అప్లికేషన్లు (51), ఇ–కామర్స్ (46 శాతం)కు ఇచ్చాయి. భారత్లో వచ్చే ఐదేళ్లలో ఉద్యోగుల వలస ఏఐ, మెషీన్ లెర్నింగ్ 38% డేటా అనలిస్టులు, సైంటిస్టులు 33% డేటా ఎంట్రీ క్లర్కులు 32% ఫ్యాక్టరీ కార్మికులు 18% ఆపరేషన్స్ మేనేజర్స్ 14% అకౌంటెంట్లు, ఆడిటర్లు 5% -
1.4 కోట్ల ఉద్యోగాలు ఉఫ్! ప్రపంచ ఆర్థిక వేదిక సంచలన రిపోర్ట్
భారత జాబ్ మార్కెట్పై ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సంచలన నివేదిక వెలువరించింది. దేశంలో వచ్చే ఐదేళ్లలో భారత జాబ్ మార్కెట్ 22 శాతం క్షీణిస్తుందని, ప్రపంచ వ్యాప్తంగా 1.4 కోట్ల ఉద్యోగాలు ఊడిపోనున్నాయని ఆ రిపోర్ట్ పేర్కొంటోంది. ఇదీ చదవండి: International labour Day: 23 దేశాల్లో జీతాలు రూ.లక్షకుపైనే.. మరి భారత్లో...? అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. గత కొన్ని నెలలుగా అనేక కంపెనీలు లేఆఫ్స్ అమలు చేస్తున్నాయి. అమెజాన్, గూగుల్ వంటి పెద్ద పెద్ద టెక్ దిగ్గజాలు సైతం వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ జాబ్ మార్కెట్పై 800కు పైగా కంపెనీలతో సర్వే నిర్వహించిన డబ్ల్యూఈఎఫ్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. వచ్చే ఉద్యోగాల కన్నా పోయేవే ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా 2027 నాటికి 69 మిలియన్ల (6.9 కోట్లు) కొత్త ఉద్యోగాలు వస్తాయని, ఇదే సమయంలో 83 మిలియన్ల (8.3 కోట్లు) ఉద్యోగాలు ఊడిపోతాయని డబ్ల్యూఈఎఫ్ సర్వే ద్వారా అంచనా వేసింది. అంటే కొత్తగా వచ్చే ఉద్యోగాల కన్నా ఊడిపోయే ఉద్యోగాల సంఖ్యే ఎక్కువగా ఉంది. మొత్తంగా 1.4 కోట్ల ఉద్యోగాలు ఊడిపోనున్నాయని డబ్ల్యూఈఎఫ్ నివేదిక ద్వారా తెలుస్తోంది. జాబ్ మార్కెట్ క్షీణత భారత్లో 22 శాతంగా ఉంటుందని అంచనా వేసిన డబ్ల్యూఈఎఫ్ ప్రపంచ వ్యాప్తంగా 23 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, డేటాసెట్ విభాగాల్లో ఉన్న 673 మిలియన్ (67.3 కోట్లు) ఉద్యోగాల్లో 83 మిలియన్ (8.3 కోట్లు) ఉద్యోగాలను వచ్చే ఐదేళ్లలో తొలగించాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో 69 మిలియన్ (6.9 కోట్లు) ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. ఫలితంగా 14 మిలియన్ల (1.4 కోట్లు) ఉద్యోగాలు పోతాయి. ఇది ప్రస్తుతం ఉపాధిలో 2 శాతం. ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కంపెనీలు అవలంబించడమే ఇందుకు కారణమని డబ్ల్యూఈఎఫ్ వెల్లడించింది. ప్రమాదంలో ఉన్న ఉద్యోగాలు ఇవే.. పెరుగుతున్న సాంకేతికత, డిజిటలైజేషన్ కారణంగా బ్యాంక్ టెల్లర్లు, క్యాషియర్లు డేటా ఎంట్రీ క్లర్క్ల వంటి క్లరికల్ ఉద్యోగాలు వేగంగా తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే డేటా అనలిస్టులు, డేటా సైంటిస్టులు, బిగ్ డేటా నిపుణులు, ఏఐ మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టుల ఉద్యోగాలు 2027 నాటికి సగటున 30 శాతం పెరుగుతాయని అంచనా. ఇదీ చదవండి: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్.. 44 వేల జాబ్ ఆఫర్లు.. అందరికీ ఉద్యోగాలు! -
భూతాపం.. పర్యావరణంపై ప్రతాపం
భూ గ్రహం వేగంగా వేడెక్కుతోంది. మానవ అనుచిత ప్రవర్తన వాతావరణ సంక్షోభాన్ని సృష్టిస్తోంది. పర్యావరణ క్రియాశీలతలో పెనుమార్పులు తీసుకొస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అడవులు ధ్వంసం కావటం గ్లోబల్ వార్మింగ్ సంకేతాలను బలంగా వినిపిస్తోంది. భూమిపై కర్బన ఉద్గారాల్లో దాదాపు 15 శాతం అటవీ నిర్మూలన కారణంగానే వెలువడుతుండగా.. ఏటా 10 మిలియన్ హెక్టార్లలో ఉష్ణమండల అడవులు తరిగిపోతున్నాయి. దీనిని 2030 నాటికి అరికట్టకుంటే గ్లోబల్ వార్మింగ్ను 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే పెరగకుండా పరిమితం చేయడం అసాధ్యమని వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక హెచ్చరిస్తోంది. – సాక్షి, అమరావతి ఉష్ణ మండలంలో 2002 నుంచి 60 మిలియన్ హెక్టార్ల కంటే ఎక్కువ అడవుల్ని కోల్పోయామని.. ఇది ఫ్రాన్స్ దేశ పరిమాణానికి సమానమని డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొంది. ఉష్ణ మండల అడవుల నరికివేతలో 80 శాతం కంటే ఎక్కువ వ్యవసాయం కోసం చేస్తున్నట్టు గుర్తించింది. 2021లోనే 11.0 మిలియన్ హెక్టార్లలో చెట్లు అంతరించిపోగా.. ఇందులో 3.75 మిలియన్ హెక్టార్లు ఉష్ణ మండల ప్రాథమిక వర్షారణ్యాల ధ్వంసం ఫలితంగా 2.5 గిగా టన్నుల కర్బన ఉద్గారాలు వెలువడ్డాయి. ఇవి భారతదేశంలో వెలువడే వార్షిక శిలాజ ఇంధన ఉద్గారాలతో సమానంగా ఉండటం గమనార్హం. గ్రీన్హౌస్ వాయువులు, కర్బన ఉద్గారాలను 2030 నాటికి కనీసం 43 శాతానికి, 2035 నాటికి 60 శాతానికి తగ్గించాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. భూతాపం కట్టడి చేయకపోతే.. పారిశ్రామిక విప్లవానికి ముందునాటి పరిస్థితులతో పోలిస్తే ప్రపంచంలో సగటున 1.15 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అంటే.. భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే పెరగకుండా కట్టడి చేయకపోతే సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతాయి. ఫలితంగా తీరప్రాంత దేశాలైన భారత్, బంగ్లాదేశ్, చైనా, నెదర్లాండ్స్ వంటి దేశాలకు చాలా ప్రమాదం. కైరో, లాగోస్, మపుటో, బ్యాంకాక్, ఢాకా, జకార్తా, ముంబై, షాంఘై, కోపెన్హాగెన్, లండన్, లాస్ ఏంజిలిస్, న్యూయార్క్, బ్యూనస్ ఏరిస్, శాంటియాగో వంటి నగరాలకు ముప్పు వాటిల్లుతుంది. మునుపటి శతాబ్దాల కంటే 1900 నుంచి ప్రపంచ సగటు సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్ మించి పెరగకుండా పరిమితం చేయగలిగితే.. వచ్చే 2 వేల సంవత్సరాలలో ప్రపంచ సగటు సముద్ర మట్టం 2 నుంచి 3 మీటర్లు పెరుగుతుంది. 2 డిగ్రీల సెల్సియస్ పెరుగుదలతో సముద్రాలు 6 మీటర్లు, 5 డిగ్రీల సెల్సియస్ పెరుగుదలతో సముద్రాలు 22 మీటర్లు వరకు పెరగవచ్చు. దీనివల్ల లోతట్టు ప్రాంతాలు, మొత్తం దేశాలు జలసమాధి అవుతాయి. భూతాపం పెరిగితే అది తీవ్రమైన కరువు, కార్చిచ్చు, వరదలు లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది. ఇది భూ తాపంపై 1.50 డిగ్రీల సెల్సియస్ కంటే పెరగకుండా ఉంచేందుకు అడవులను కాపాడాలని డబ్ల్యూఈఎఫ్ సూచిస్తోంది. ఇందుకు 100 బిలియన్ల డాలర్ల నుంచి 390 బిలియన్ల డాలర్ల వరకు ఖర్చవుతుందని భావిస్తోంది. ప్రపంచ జీడీపీలో సగాని కంటే ఎక్కువ.. అంటే దాదాపు 44 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక విలువ ప్రకృతిపై ఆధారపడి ఉంటుందని.. దాదాపు 1.60 బిలియన్ల మంది ప్రజలు ఆహారం, నీరు, కలప, ఉపాధి కోసం అడవులపై ఆధారపడుతున్నారని వెల్లడించింది. మన దేశంలో ఏటా గ్రీస్ దేశమంత అడవికి నష్టం 2021లో భారతదేశంలో వెలువడిన ఇంధన ఉద్గారాల కంటే వర్షారణ్యాల ధ్వంసం ద్వారా వచ్చిన కార్బన్డైఆౖMð్సడ్ ఎక్కువ ఉన్నట్టు నివేదిక చెబుతోంది. ఇక్కడ ఏటా జరిగే అటవీ నిర్మూలన శాతం గ్రీస్ దేశ పరిమాణానికి దగ్గరగా ఉందని వివరించింది. అటవీ నిర్మూలన, మానవ నివాసాల విస్తరణ, వ్యవసాయం, అడవుల్లో అధికంగా పశువులను మేపడం వంటి కారణాలతో మానవ, జంతువుల మధ్య దాడులకు దారి తీస్తున్నాయి. అడవులు తగ్గిపోతుండటంతో వన్యప్రాణులు తమ భూ భాగాలను కోల్పోతున్నాయి. ఆహారం, ఆశ్రయం లేకపోవడంతో పెద్దఎత్తున బాహ్య ప్రపంచంలోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లోని మూడు ప్రధాన పులుల అభయారణ్యాలలో చుట్టుపక్కల మానవ–జంతు సంఘర్షణ పెరిగినట్టు నివేదిక పేర్కొంది. -
‘అట్టడుగు’కు చేరేలా అంతరాలు తగ్గేలా..
ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే ఆఫీసులో పనులు చక్కబెట్టుకోవచ్చు.. సంగీతం, సినిమాల వంటి వినోదమూ దొరుకుతుంది. మరి ఇంటర్నెట్ కారణంగా కూలీల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, వారి ఆరోగ్యం బాగుపడుతుందని ఎంత మందికి తెలుసు? అట్టడుగు వర్గాల వారికి చదువు అవకాశాలతోపావారిజీవితాలు బాగుపడతాయనీఎందరికి తెలుసు? కొన్ని సంస్థలు, ప్రభుత్వాల కృషితో ఇంటర్నెట్ విషయంలో ధనికులు– పేదలు, విద్యావంతులు– అత్తెసరు చదువరుల మధ్యఇప్పుడు అంతరం తగ్గుతోంది! 2025 నాటికి ఇది మరింత తగ్గనుంది! ఇందుకు బాటలు వేస్తున్న ‘ఎడిసన్ అలయన్స్’గురించి ఈ ప్రత్యేక కథనం.. ప్రపంచ జనాభా సుమారు 800 కోట్లు! వీరిలో 270 కోట్ల మందికి ఇంటర్నెట్ అందుబాటులో లేదు. దీనికి కారణాలెన్నో. ఈ పరిస్థితిని మార్చేందుకు 2021లో ఓ పెద్ద ప్రయత్నమే మొదలైంది. అదే ‘ఎడిసన్ అలయన్స్ (ఎసెన్షియల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వి సెస్ నెట్వర్క్ అలయన్స్’. 2025 నాటికి అదనంగా కనీసం వంద కోట్ల మందిని ఇంటర్నెట్ సూపర్ హైవేలోకి చేర్చాలన్నదే దీని లక్ష్యం. ఏదో వినోదం పంచేందుకు ఈ ప్రయత్నం జరగడం లేదు. ఆరోగ్యం, విద్య, ఆర్థిక సేవలు సమాజంలోని అట్టడుగు వర్గాల వారికీ చేరాలన్న ఉదాత్త లక్ష్యాన్ని ఈ అలయన్స్ తన భుజాలపైన వేసుకుంది. ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్, రుణాల వంటి ఆర్థిక సేవలు అందుబాటులోకి వస్తే వారి జీవితాలు మారిపోతాయని భావించింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలోని ఆసక్తికరమైన అంశం.. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలూ భాగస్వాములు కావడం. పేద దేశాలు, లేదా డిజిటల్ సేవలు అందుబాటులో లేనివారికి వాటిని సులువుగా అందించడం, వాడుకునేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడం వంటివి ఈ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నాయి. సూటిగా చెప్పాలంటే ఇంటర్నెట్ సౌకర్యం చౌకగా అందించేందుకు, డిజిటల్ నైపుణ్యాలను నే ర్పించేందుకు, విద్య, వైద్యం అందించేందుకు జరుగుతున్న కృషి ఇది. రెండేళ్ల క్రితం మొదలైన ఎడిసన్ అలయన్స్ ఇప్పటివరకూ సాధించిందేమిటన్న దానిపై వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఇటీవలే ఒక నివేదికను విడుదల చేసింది. రానున్న రెండేళ్లలో సాధించాలనుకుంటున్న లక్ష్యాలను సమీక్షించింది. లక్ష్యంలో ఇప్పటికే సగం.. 2021 జనవరిలో ప్రారంభమైన ఎడిసన్ అలయన్స్ తన భాగస్వాముల సాయంతో ఇప్పటివరకు సుమారు 45.4 కోట్ల మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపిందని వరల్ఎకనమిక్ ఫోరమ్ విడుదల చేసిన తాజా నివేదిక తెలిపింది. మొత్తం 90 దేశాల్లో 250కిపైగా కార్యక్రమాలు మొదలయ్యాయి. 2021లో మొత్తం 140 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్ కానీ, రుణ వసతి గానీ లేకపోయింది. ఎడిసన్ అలయన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటివరకూ కనీసం 28 కోట్ల మందికి ఈ–బ్యాంకింగ్, మొబైల్ వ్యాలెట్స్, ఎల్రక్టానిక్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే సుమారు తొమ్మిది కోట్ల మంది ఆరోగ్యాన్ని డిజిటల్ ఆరోగ్య సేవల రూపంలో పరిరక్షించడం సాధ్యమైంది. టెలిహెల్త్, టెలిమెడిసిన్ వంటి టెక్నాలజీల సాయంతో వేర్వేరు ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్నారు. విద్య విషయానికొస్తే 2021లో ప్రపంచవ్యాప్తంగా 24.4 కోట్ల మంది (ఆరు నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులు) పాఠశాలలకు దూరం కాగా.. ఎడిసన్ అలయన్స్ భాగస్వాములు ఆన్లైన్ విద్య, రిమోట్ లెర్నింగ్ సొల్యూషన్స్ సాయంతో కోటీ 18 లక్షల మందికి విద్యను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ఉద్యోగం చేసేందుకు అవసరమైన నైపుణ్యాలపైనా శిక్షణ ఇవ్వడం గమనార్హం. ఎంతమందికి.. ఏయే రకంగా? ఎడిసన్ అలయన్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి డిజిటల్ టెక్నాలజీ లాభాలు అందాయనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. డిజిటల్ రంగం మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టిన ఖర్చుతోనే 6.4 కోట్ల మందికి లబ్ధి చేకూరిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నివేదిక చెబుతోంది. అయితే 250 మంది భాగస్వాముల్లో మూడొంతుల మంది ఆన్లైన్ విద్యపై దృష్టిపెట్టినా దీనివల్ల బాగుపడిన వారి సంఖ్య కొంచెం తక్కువగానే ఉంది. నాణ్యమైన ఆన్లైన్ విద్యకు అవసరమైన వనరులు లేకపోవడం దీనికి కారణంగా చెప్తున్నారు. మొబైల్ బ్రాడ్బ్యాండ్, ఇంటర్నెట్ ఆధారిత పరికరాలు, ఆన్లైన్ సర్వి సుల ఖర్చులు తగ్గడం 12.8 కోట్ల మందికి ఉపయోగపడింది. దాదాపు 27 కోట్ల మందికి కనెక్టివిటీ లేదా డిజిటల్ సేవలు లభించడం మొదలైంది. ముందున్న సవాళ్లు.. ఇంకో మూడేళ్లలో 55 కోట్ల మందికి డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఎడిసన్ అలయన్స్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగస్వాములు కావాల్సిందిగా మరిన్ని కంపెనీలను ఆహా్వనిస్తోంది. ప్రస్తుత భాగస్వాముల్లో కేవలం 12 శాతం మంది మాత్రమే 50 శాతం మేర లక్ష్యాన్ని అందుకోవడంపై అలయన్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సగం మంది భాగస్వాములు లక్ష్యంలో 20 శాతాన్ని మాత్రమే చేరుకోవడంపై అసంతృప్తిగా ఉంది. వచ్చే రెండేళ్లలో పాత, కొత్త భాగస్వాములు వేగంగా లక్ష్యాల సాధనకు పూనుకోవాలని కోరింది. పర్వత ప్రాంతాలకు అపోలో ఆరోగ్య సేవలు ప్రఖ్యాత వైద్యసేవల సంస్థ అపోలో హాస్పిటల్స్, అపోలో టెలిహెల్త్ సర్వి సులను ఎడిసన్ అలయన్స్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వంటి పర్వత ప్రాంతాల్లో అందిస్తోంది. ఆ రాష్ట్రంలో వైద్యసేవలు, నిపుణుల కొరత ఎక్కువగా ఉండటంతో.. ఆ సమస్యను అధిగమించేందుకు డిజిటల్ టెక్నాలజీల సాయం తీసుకుంటున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నాలుగు కీలక ప్రాంతాల్లో టెలిమెడిసిన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 2021 జూలై నాటికి 22,727 టెలికన్సల్టేషన్లు అందించారు. 1,300కుపైగా ఎమర్జెన్సీ కేసులను డిజిటల్ పద్ధతిలోనే ఎదుర్కొని పరిస్థితిని చక్కదిద్దారు. టెలి డిస్పెన్సరీల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండటం ఒక విశేషమైతే.. రక్తహీనత, అసాంక్రమిక వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 4,000 మందితో విస్తృత ప్రయత్నం జరుగుతుండటం ఇంకో విశేషం. ‘‘ఎడిసన్ అలయన్స్లో భాగస్వామి అయిన మేం మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఐదు డిజిటల్ డిస్పెన్సరీలు ప్రారంభించాం. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం. వ్యాధుల నివారణ, నిర్దిష్ట సమస్యలపై టెలికన్సల్టేషన్ సర్వి సులు కూడా అందిస్తున్నాం’’అని అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభన కామినేని చెప్పారు. అగ్రరాజ్యంలో వెరిజాన్ సేవలు అమెరికా టెక్ దిగ్గజ సంస్థ వెరిజాన్ ఆ దేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని విద్యార్థులకు ఎడిసన్ అలయన్స్లో భాగంగా కనెక్షన్లు అందించే ప్రయత్నం చేస్తోంది. అమెరికాలో లక్షల మంది విద్యార్థులకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో లేదని.. ఈ కాలపు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు తగ్గట్టుగా నైపుణ్యాలు లేక విద్యార్థులు నష్టపోతున్నారని వెరిజాన్ గుర్తించింది. దీనిని అధిగమించేందుకు వెరిజాన్ ఇన్నోవేటివ్ లెర్నింగ్ సాయంతో స్కూల్ డిస్ట్రిక్స్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు కూడా టెక్నాలజీ వినియోగంలో శిక్షణ ఇస్తోంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ (స్టెమ్) రంగాలకు సంబంధించిన శిక్షణ కూడా ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. 2021–22లో ఆ దేశవ్యాప్తంగా సుమారు 500 పాఠశాల్లో 6.5 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారని అంచనా. ఈ కార్యక్రమం కోసం వెరిజాన్ వందకోట్ల డాలర్లకుపైగా ఖర్చు పెడుతోంది. - కంచర్ల యాదగిరిరెడ్డి -
మనిషి ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి? బతుకుడెట్లా?
పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది ప్రపంచం పరిస్థితి ఇప్పుడు! కోవిడ్ నుంచి గట్టెక్కామని ఊపిరి పీల్చుకుంటుండగానే బోలెడన్ని ఇతర సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి! రెండేళ్ల వృద్ధిని అందుకొనే క్రమంలో కర్బన ఉద్గారాలు పెరిగిపోతూండటం ఒకవైపు... రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని అదుపుతప్పిన ద్రవ్యోల్బణం ఇంకోవైపు... పలు దేశాల ఆర్థిక విధానాల్లో మార్పుల కారణంగా పేద, ధనిక అంతరాలూ పెరిగిపోతున్నాయి! ఈ నేపథ్యంలో మనిషి ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి? రానున్న రెండేళ్లలో ఏమైనా మార్పులొస్తాయా? దీర్ఘకాలం అపరిష్కృతంగా ఉండే చిక్కుల మాటేమిటి? ఈ అంశాలన్నింటిపై ఇటీవలే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక సర్వే నిర్వహించింది. గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే ప్రకారం ఇప్పటి ప్రధాన సమస్య ఏమిటో తెలుసా? బతకడానికయ్యే ఖర్చుల్లో పెరుగుదల! కాస్ట్ ఆఫ్ లివింగ్! రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధానికి ఏడాది పూర్తయ్యింది. కోవిడ్ అనంతర పరస్థితుల్లో మొదలైన ఈ యుద్ధం అనేక రంగాల్లో ప్రపంచ స్థితిగతులను మార్చేసిందనడంలో సందేహం లేదు. పైగా ఇప్పుడిప్పుడే యుద్ధం ముగిసే సూచనలు కనపడని నేపథ్యంలో ప్రపంచం మొత్తం మీద పెరిగిపోతున్న జీవన వ్యయంపై ప్రజల్లో తీవ్రమైన ఆందోళన నెలకొందని గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే చెబుతోంది. ఇంకో రెండేళ్లపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని సర్వేలో పాల్గొన్న అధికులు అభిప్రాయపడ్డారు. కోవిడ్కు ముందు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు పరిశ్రమలకు, కంపెనీలకు బ్యాంకుల ద్వారా చాలా సులువుగా అప్పులు పుట్టేవని, ఇప్పుడా స్థితి లేకపోవడం, మాంద్యం భయంతో ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటం కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్పై ఆందోళనలు పెరిగేందుకు కారణమైందని ఆ సర్వే తేల్చింది. ఈ నేపథ్యంలో గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే రాగల రెండేళ్లు, పదేళ్ల కాలవ్యవధుల్లో ఎదుర్కొనే అవకాశమున్న ఐదు అతిపెద్ద ముప్పులపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సిద్ధం చేసిన గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే 40కిపైగా దేశాల్లోని వివిధ రంగాల నిపుణుల నుంచి సమాచారాన్ని సేకరించారు. విద్య, వ్యాపార రంగాలతోపాటు ప్రభుత్వ అధికారులు పలువురు నిపుణుల బృందంలో ఉన్నారు. ఈ సర్వేలో రిస్క్ లేదా ముప్పుగా పరిగణించిన అంశాలు ప్రపంచ స్థూల ఉత్పత్తిపై లేదా ప్రజలు, ప్రకృతి వనరులపై దుష్పభావం చూపగలిగేవి. రానున్న రెండేళ్లలో ఈ ముప్పుల తీవ్రత, పరిణామాలు, ప్రభుత్వాల సన్నద్ధత వంటి అంశాలను కూడా ఈ సర్వేలో పొందుపరిచారు. అన్ని ప్రియమవుతున్న వేళ కోవిడ్ కంటే ముందు కూడా ప్రపంచవ్యాప్తంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెద్ద సమస్యగానే ఉండేది. కానీ మహమ్మారి పుణ్యమా అని సరఫరాలు నిలిచిపోవడం, డిమాండ్, సరఫరాల మధ్య అంతరం పెరగడంతో పరిస్థితి మరింత దిగజారింది. గతేడాది చివరి నాటికి ద్రవ్యోల్బణం కారణంగా సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఆహారం, నివాసం వంటి కనీస అవసరాలు కూడా అందనంత స్థాయికి చేరుకున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ఇంధన సరఫరాలపై పలు దేశాలు నియంత్రణలు విధించాయి. ఇది ద్రవ్యోల్బణం తద్వారా కనీస అవసరాల ఖర్చులు పెరిగిపోయేలా చేసింది. నల్ల సముద్రం నుంచి ఆహారధాన్యాల ఎగుమతికి చేసుకున్న ఒప్పందం నుంచి రష్యా తొలగిపోయేందుకు సిద్ధమవుతుండటంతో భవిష్యత్తులో పరిస్థితి మరింత దిగజారుతుందని యూరప్ దేశాల సమాఖ్య ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది మార్చిలో ప్రపంచం సాధారణ ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది విషయానికి వస్తే ఇంధన ధరలు గతేడాది జనవరితో పోలిస్తే దాదాపు 46 శాతం వరకూ ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. చైనాలో కోవిడ్ నియంత్రణలను సడలించడం వల్ల వినియోగం మరింత పెరిగి ఇంధన, ఆహార ధరలు ఇంకా పెరుగుతాయని, ఇది బ్యాంకుల వడ్డీరేట్ల పెంపునకు కారణమవుతుందన్న భయాందోళనలు అధికమవుతున్నాయని అంతర్జాతీయ ఆర్థిక సంస్థ బ్లూమ్బర్గ్ పేర్కొనడం గమనార్హం. వాణిజ్య యుద్ధాలతో తీవ్ర నష్టం ఒకప్పుడు దేశాల మధ్య యుద్ధాలు ఆయుధాలతో జరిగేవి. ఇప్పుడు వాణిజ్య ఆర్థికాంశాలపై ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. దీని ప్రభావం ఆయా దేశాలకే పరిమితం కావడం లేదు. ఇతర దేశాలతోపాటు అనేక రంగాలకు విస్తరిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సందర్భంలో భారత్, రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయడం ఎంత దుమారం రేపిందో తెలియనిది కాదు. రానున్న పదేళ్లలో దేశాల మధ్య ఘర్షణలు మరింత పెరుగుతాయని, అవి వాణిజ్య యుద్ధాలకు దారితీస్తాయని గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వేలో పాల్గొన్న నిపుణులు భావిస్తున్నారు. కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తుండటం, దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచుతుండటాన్ని దీనికి నిదర్శనంగా వారు చూపుతున్నారు. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా నియంత్రణలు, నిషేధాలు విధించినట్లే భవిష్యత్తులోనూ ఆర్థికాంశాలపై దాడులు తీవ్రతరం కానున్నాయని అంచనా. ఆసియా, తూర్పు ఆసియా ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడనుంది. సమాజంలో వైషమ్యాల పెరుగుదల విలువలు, సమానత్వాల మధ్య అంతరం పెరిగిపోతుండటం కూడా స్వల్పకాలిక ముప్పుగా పరిగణిస్తున్నారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో వచ్చే విభజన క్రమేపీ రాజకీయాలకు విస్తరిస్తుందని, వలసలు, లింగవివక్ష, జాతి, కులం, మతం ఆధారంగా ఘర్షణలు పెరిగేందుకు కారణమవుతుందని అంచనా. ప్రపంచం నలుమూలలా పలు దేశాల్లో ఘర్షణలు, ఉద్యమాలు పెరిగిపోతుండటం ఇందుకేనని చెబుతున్నారు. ధరల నియంత్రణలో వైఫల్యం, అక్రమ ఆర్థిక వ్యవహారాలపై అదుపు లేకపోవడం వల్ల సమాజం తీవ్రమైన మానసిక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని అత్యధికులు ఆందోళణ వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులు వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రపంచం ఇప్పుడు అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోంది. సుమారు 30 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నా చెప్పుకోదగ్గ ముందడు ఏదీ ఇప్పటిదాకా పడలేదు. వాతావరణంలో ఈనాటి కర్బన ఉద్గారాలను పరిగణనలోకి తీసుకుంటే భూమి సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ స్థాయికి పెంచరాదన్న లక్ష్యం నెరవేరే అవకాశం కనిపించట్లేదు. గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతం మంది వాతావరణ మార్పులపై ప్రస్తుత స్థితిని తప్పుబట్టారు. 2030 నాటికే సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్కు చేరే అవకాశాలు ఇప్పుడు 50 శాతమని ఐపీసీసీ అంచనా వేస్తుండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. మరోవైపు పరిస్థితిని ఎదుర్కొనేందుకు జీ–7 దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం లేదు. పారిస్ ఒప్పందాన్ని ధనిక దేశాలే తుంగలో తొక్కిన కారణంగా 2050 నాటికే ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువకు చేరుకొనే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు శాస్త్రీయంగా చేయాల్సిన పనులు కాకుండా రాజకీయంగా ఉపయోగకరమైన వాటిపైనే దేశాలు ఆధారపడటం పరిస్థితిని దిగజారుస్తోంది. యూరోపియన్ యూనియన్ తాజాగా శిలాజ ఇంధన ఆధారిత ఫ్యాక్టరీల మరమ్మతులకు, ఇంధనాల కోసం ఏకంగా 5000 కోట్ల యూరోలు ఖర్చు చేస్తుండటం ఇందుకు తార్కాణం. ఈ పరిస్థితి రానున్న రెండేళ్లలోనూ మెరుగయ్యే అవకాశాలు లేవని, దీర్ఘకాలంలో అంటే రానున్న పదేళ్ల వరకూ కూడా వాతావరణ మార్పులపై పోరు మందగమనం ప్రపంచానికి ఒక సమస్యగానే మిగలనుందని అంచనా. టర్కీలో ఇటీవలి భారీ భూకంపం, గతేడాది అకాల వర్షాలు, వరదలు, కరవులు అన్నీ వాతావరణ మార్పులను సూచిస్తున్నా ధనిక దేశాలిప్పటికీ మేలుకోకపోవడం ఆందోళనకరమేనని గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వేలో పాల్గొన్న స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ పర్యావరణ విభాగం అధిపతి క్రిస్ ఫీల్డ్ అన్నారు. - కంచర్ల యాదగిరిరెడ్డి -
ఈ రంగాల్లో 2030 నాటికి 7.6 కోట్ల ఉద్యోగాలు అవసరం: ప్రపంచ ఆర్థిక వేదిక సర్వే
న్యూఢిల్లీ: వ్యవసాయం, విద్య, ఇంధన రంగాలు వచ్చే దశాబ్ద కాలానికి ఉపాధి పరంగా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనవిగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) పేర్కొంది. ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ రంగాల్లో సాంకేతికత, ఆవిష్కరణలను పెట్టుబడులతో ప్రోత్సహించాల్సిన అవసరాన్ని సూచించింది. వీటిని రేపటి ఉపాధి మార్కెట్లుగా అభివర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది కంపెనీల ఎగ్జిక్యూటివ్లతో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 120 ఆర్థిక వ్యవస్థల్లో అగ్రిటెక్, ఎడ్టెక్, ఇంధన ఆధారిత టెక్నాలజీలు వచ్చే పదేళ్ల కాలానికి వ్యూహాత్మకంగా ఎంతో కీలకమని డబ్ల్యూఈఎఫ్ సర్వే గుర్తించింది. ‘రేపటి మార్కెట్లు 2023’, ‘ప్రపంచ వృద్ధి, ఉపాధి కల్పనకు కావాల్సిన సాంకేతికతలు, రేపటి ఉద్యోగాలు’ పేరుతో రెండు నివేదికలను డబ్ల్యూఈఎఫ్ విడుదల చేసింది. భవిష్యత్తు మార్కెట్లు, ఉపాధి కల్పన కోసం ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు రెట్టింపు స్థాయిలో టెక్నాలజీలను అమల్లో పెట్టాలని సూచించింది. కేవలం 10 ఆర్థిక వ్యవస్థల్లోనే విద్య, వ్యవసాయం, హెల్త్, ఎనర్జీ సహా పర్యావరణ అనుకూల, సామాజిక రంగాల్లో 2030 నాటికి 7.6 కోట్ల ఉద్యోగాల అవసరం ఉంటుందని తెలిపింది. భారత్తోపాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, జర్మనీ, ఇండియా, జపాన్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, యూకే, అమెరికాలను పది ఆర్థిక వ్యవస్థలుగా ఉదహరించింది. హెల్త్కేర్లో వ్యక్తిత సంరక్షకులు 1.8 కోట్లు, చిన్నారుల సంరక్షకులు, శిశువిద్యా టీచర్లు 1.2 కోట్లు, ప్రాథమిక, సెకండరీ విద్యా టీచర్లు 90 లక్షల మంది అవసరమని పేర్కొంది. చదవండి: అదానీకి మరో షాక్.. ఒకదాని తర్వాత మరొకటి, 3 రోజుల్లోనే -
పెట్టుబడులు, ఆవిష్కరణలతో ఉపాధికి ఊతం
న్యూఢిల్లీ: వ్యవసాయం, విద్య, ఇంధన రంగాలు వచ్చే దశాబ్ద కాలానికి ఉపాధి పరంగా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనవిగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) పేర్కొంది. ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ రంగాల్లో సాంకేతికత, ఆవిష్కరణలను పెట్టుబడులతో ప్రోత్సహించాల్సిన అవసరాన్ని సూచించింది. వీటిని రేపటి ఉపాధి మార్కెట్లుగా అభివర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది కంపెనీల ఎగ్జిక్యూటివ్లతో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 120 ఆర్థిక వ్యవస్థల్లో అగ్రిటెక్, ఎడ్టెక్, ఇంధన ఆధారిత టెక్నాలజీలు వచ్చే పదేళ్ల కాలానికి వ్యూహాత్మకంగా ఎంతో కీలకమని డబ్ల్యూఈఎఫ్ సర్వే గుర్తించింది. ‘రేపటి మార్కెట్లు 2023’, ‘ప్రపంచ వృద్ధి, ఉపాధి కల్పనకు కావాల్సిన సాంకేతికతలు, రేపటి ఉద్యోగాలు’ పేరుతో రెండు నివేదికలను డబ్ల్యూఈఎఫ్ విడుదల చేసింది. భవిష్యత్తు మార్కెట్లు, ఉపాధి కల్పన కోసం ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు రెట్టింపు స్థాయిలో టెక్నాలజీలను అమల్లో పెట్టాలని సూచించింది. కేవలం 10 ఆర్థిక వ్యవస్థల్లోనే విద్య, వ్యవసాయం, హెల్త్, ఎనర్జీ సహా పర్యావరణ అనుకూల, సామాజిక రంగాల్లో 2030 నాటికి 7.6 కోట్ల ఉద్యోగాల అవసరం ఉంటుందని తెలిపింది. భారత్తోపాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, జర్మనీ, ఇండియా, జపాన్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, యూకే, అమెరికాలను పది ఆర్థిక వ్యవస్థలుగా ఉదహరించింది. హెల్త్కేర్లో వ్యక్తిత సంరక్షకులు 1.8 కోట్లు, చిన్నారుల సంరక్షకులు, శిశువిద్యా టీచర్లు 1.2 కోట్లు, ప్రాథమిక, సెకండరీ విద్యా టీచర్లు 90 లక్షల మంది అవసరమని పేర్కొంది. -
పుతిన్ బతికే ఉన్నాడా! తెలియడం లేదు!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు జెలెన్స్కీ గురువారం దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్)లోని వీడియో కాల్లో ప్రసంగిస్తూ..నాకు పుతిన్ బతికే ఉన్నారో లేదో తెలియడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశంలో శాంతి చర్చలు ఎప్పుడూ ప్రారంభమవుతాయన్న అంశంపై ప్రశ్నలు రావడంతో జెలెన్స్కీ ఈ విధంగా స్పందించారు. అయినా పుతిన్ తాను ఉనికిలో ఉండేందుకే ఇష్టపడరంటూ విమర్శించారు. ఆ సమావేశంలోని బ్రేక్ఫాస్ట్ ఈవెంట్లో జెలెన్స్కీ మాట్లాడుతూ..ఈ రోజు ఎవరితో దేని గురించి మాట్లాడాలో అస్సలు అర్థం కావడం లేదు. ఆయన గ్రీన్ స్క్రీన్(శాంతికి)కి వ్యతిరేకంగా కనిపించే పుతిన్ సరైన వారని అనిపించడం లేదు. అసలు ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడో లేదా అక్కడ ఇంకోకరెవరైనా ఆయన స్థానంలో ఉండి నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియడం లేదంటూ పుతిన్పై జోక్లు పేల్చారు. మీరంతా యూరోపియన్ నాయకులకు శాంతి చర్చలు గురించి ఎలా వాగ్దానం చేస్తారో నాకు పూర్తిగా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన శాంతి అంటూనే తర్వాత రోజే పూర్తి స్థాయిలో దళాలతో దాడులు నిర్వహిస్తాడు. అందువల్ల తనకు శాంతి చర్చలు అంటే ఎవరితోనో తనకు అర్థం కావడం లేదంటూ జెలెన్స్కీ తనదైన శైలిలో రష్యాకి గట్టి కౌంటరిచ్చారు. జెలెన్స్కీ ప్రసంగం అయిన కొద్ది గంటల్లోనే క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. "దీన్ని బట్టి రష్యా, పుతిన్, ఉక్రెయిన్, జెలెన్స్కీ ఒక పెద్ద సమస్య అని స్పష్టంగా తెలుస్తోందని గట్టి కౌంటరిచ్చారు. అదీగాక జెలెన్స్కీ మానసికంగా రష్యా లేదా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఉనికిలో ఉండకుండా ఉండేందుకు ఇష్టపడుతున్నారని ప్రత్యక్షంగానే అవగతమవుతోంది. అంతేగాదు రష్యా ఉనికిలోనే ఉంటుంది, తమ దేశ అధ్యక్షుడు పుతిన్ కూడా ఉనికిలోనే ఉంటారు. అదే ఉక్రెయిన్ వంటి దేశానికి మంచిది" అని పెస్కోవ్ ధీటుగా సమాధానమిచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్లింట తెగ వైరల్ అవుతోంది. కాగా పుతిన్ ఇటీవల కాస్త పబ్లిక్ ఇవెంట్లకి దూరంగా ఉండటంతో జెలెన్ స్కీ పుతిన్ని అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అదీగాక పుతిన్ కూడా డిసెంబర్లో జరగాల్సిన వార్షిక విలేకరులు సమావేశాన్ని సైతం రద్దు చేసుకున్నట్లు సమాచారం. ⚡️Zelensky refuses to negotiate with Putin because he is not sure that the Russian president is alive. Zelensky said this at the Ukrainian Breakfast in Davos this morning🤣 pic.twitter.com/KphpbM1eND — nicolasorin (@alocin96983806) January 20, 2023 (చదవండి: నో డౌట్! రష్యా గెలుపు పక్కా!: పుతిన్) -
దావోస్ లేఖపై తప్పుడు ప్రచారం... ఏపీ ప్రభుత్వం హెచ్చరిక
సాక్షి, అమరావతి: దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనావిుక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానిస్తూ రాసిన లేఖపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఎంను ఆహ్వానిస్తూ నవంబర్ 25న వరల్డ్ ఎకనావిుక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెండే రాసిన లేఖ నకిలీదంటూ పచ్చ మీడియా తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తొలుత దావోస్కు సీఎంకు ఆహ్వానం అందలేదంటూ చేస్తున్న ప్రచారం అబద్ధమని తేలడంతో, ఆ లేఖ నకిలీదని మరో తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఈఎఫ్ రాసిన లేఖను యథాతథంగా విడుదల చేశామని, దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని గురువారం ప్రభుత్వం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. Due to the brutal nature of the negative campaign on the authenticity of the Invitation letter from @wef, we are reiterating, that any false claim will attract legal action. The Invitation letter is authentic and was shared as received.@GummallaSrijana@AP_EDB@ApiicOfficial https://t.co/pyeN1lMYax — FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) January 19, 2023 -
వ్యాక్సిన్తో తగ్గని కరోనా.. ఫైజర్ సీఈవోకి చుక్కలు చూపించిన జర్నలిస్ట్లు!
దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరయిన ఫైజర్ సీఈవో అల్బర్ట్ బౌర్లకు చేదు అనుభవం ఎదురయింది. కరోనా కట్టడి విషయంలో .. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నా.. ఫలితం మాత్రం అంత గొప్పగా లేదంటూ కొందరు మీడియా ప్రతినిధులు అల్బర్ట్ను ప్రశ్నించారు. వరల్డ్ ఎకనామిక్ సదస్సు నుంచి బయటకు వచ్చి రూం వైపు అడుగులు వేస్తుండగా అల్బర్ట్ను చుట్టుముట్టారు మీడియా ప్రతినిధులు. మానవాళిని తప్పుదోవ పట్టించి.. అసత్యాలు, అబద్దాలతో తప్పుడు ప్రచారం చేశారని, వ్యాక్సిన్ల విక్రయించేముందు ఎంతో భరోసా ఇచ్చినా అవేవీ అమలు కాలేదని ప్రశ్నించారు. ఫైజర్ కంపెనీని నమ్మి వ్యాక్సిన్లు తీసుకున్న ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా.. అల్బర్ట్ మాత్రం నోరు మెదపలేదు. వ్యాక్సిన్ వల్ల వైరస్ సంక్రమణ పూర్తిగా ఉండదని ముందుగానే తెలిసినా.. దాన్ని రహస్యంగా ఉంచారా అని విలేకరులు ప్రశ్నించారు. కరోనా వల్ల చనిపోయిన వారికి ఏం సమాధానం చెబుతావని నిలదీశారు.నీ మీద ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టకూడదని అడిగినా..అల్బర్ట్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. కరోనా విక్రయాల ద్వారా 2.3 బిలియన్ డాలర్లు ఫైజర్కు వచ్చాయని, అసలు ఈ మొత్తం వ్యాక్సిన్ తతంగం వెనక ఎవరు కమీషన్లు ఇచ్చారని అడిగారు. కరోనా వ్యాప్తిని అడ్డుకుని మానవుల ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశ్యంతో 2020 ఏప్రిల్లో వ్యాక్సిన్ను తీసుకొచ్చింది ఫైజర్. అమెరికా ప్రభుత్వం ఆమోదించిన తొలి కోవిడ్ కట్టడి వ్యాక్సిన్ కూడా ఇదే. ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు ఫైజర్ను మాత్రమే ఎంపిక చేసుకున్నాయి. దాదాపు ఒకటిన్నర బిలియన్ డోసులను ఫైజర్ విక్రయించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వ్యాక్సిన్లు తీసుకున్న కొందరిలో గుండెపోటు సమస్యలు తలెత్తాయని ఫిర్యాదులు వచ్చినా.. అవి వ్యాక్సిన్ వల్లే వచ్చాయని శాస్త్రీయంగా పూర్తి స్థాయిలో నిరూపితం కాలేదు. 🚨WE CAUGHT HIM! Watch what happened when @ezralevant and I spotted Albert Bourla, the CEO of Pfizer, on the street in Davos today. We finally asked him all the questions the mainstream media refuses to ask. Full story: https://t.co/wHl204orrX SUPPORT: https://t.co/uvbDgOk19N pic.twitter.com/c3STW8EGH3 — Avi Yemini (@OzraeliAvi) January 18, 2023 -
రాష్ట్రంలో డబ్ల్యూహెచ్వో టీకా కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా మహమ్మారి వల్ల వైద్య రంగంలో ఉన్న లోపాలు ప్రపంచవ్యాప్తంగా కనిపించాయన్నారు, కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో తమ దగ్గర కావాల్సినన్ని వెంటిలేటర్లు లేవని న్యూయార్క్ గవర్నర్ అన్నారని, ఆ పరిస్థితుల్ని అంచనా వేస్తే లైఫ్ సైన్సెస్కు పెద్దపీట వేయాలన్న ఆలోచన కలిగిందన్నారు. ఈ మేరకు చేసిన కృషి వల్ల ప్రపంచంలోకెల్లా మూడో వంతు వ్యాక్సిన్లు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. తెలంగాణలోనే 40 శాతం ఫార్మసీ ఉత్పత్తులు తయారవుతున్నాయని చెప్పారు. కరోనా తరహాలో మరే ఇతర మహమ్మారులు వచ్చినా ఎదుర్కొనే రీతిలో టీకాలు అవసరమని గుర్తించి ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల ఉత్పత్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను సంప్రదించామని, అందుకు ఆ సంస్థ కూడా ఆసక్తి ప్రదర్శించిందని... త్వరలోనే తెలంగాణలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ హబ్ను డబ్లు్యహెచ్వో ఏర్పాటు చేయబోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అత్యధిక వృద్ధి రేటు తెలంగాణలోనే.. దేశంలో అత్యధిక వృద్ధి రేటు తెలంగాణలోనే ఉన్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. కోవిడ్ ఉన్నా.. నోట్ల రద్దు చేసినా.. కేంద్రం సహకరించకున్నా.. తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటులో దూసుకువెళ్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో సమ్మిళిత వార్షిక వృద్ధిరేటు 15 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఒకవేళ కేంద్రం తమకు సహకరించి ఉంటే తెలంగాణ మరింత వేగంగా వృద్ధి సాధించేదని పేర్కొన్నారు. తెలంగాణ తరహాలో ఇతర రాష్ట్రాలన్నీ పనిచేసుంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల మార్కును దాటేదన్నారు. మోదీ సర్కార్ అప్పు రూ.100 లక్షల కోట్లు.. మోదీ ప్రధాని కావడానికి ముందు దేశ అప్పు రూ. 56 లక్షల కోట్లుగా ఉండగా మోదీ పాలనలో దేశం కొత్తగా రూ. 100 లక్షల కోట్ల మేర అప్పులపాలైనట్లు మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గత 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఖజానాకు పన్నుల రూపంలో రూ. 3.68 లక్షల కోట్లు అందించినా తమ ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చింది కేవలం రూ. 1.68 లక్షల కోట్లేనని కేటీఆర్ తెలిపారు. -
ప్రపంచాన్ని నియంత్రించే వేదిక
దేశ సరిహద్దులను చెరిపి ప్రపంచ పాలన సాధించే దిశగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అడుగులు వేస్తున్నది. ప్రపంచీకరణను ఇంకా లోతుల్లోకి తీసుకెళ్లేలా కొత్త వ్యూహాలను రచిస్తున్నది. పర్యావరణం పట్ల శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తుంది కానీ తమ సభ్యులు ఆధిపత్యం కోల్పోని విధంగా ‘పరిష్కారాలు’ తెర మీదకు తేవడం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రపంచంలో జరిగే కార్పొరేట్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే నిరసనల మీద ‘డబ్ల్యూఈఎఫ్’ ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నది. ప్రజా ఉద్యమాలను నిర్వీర్యం చేయడంలో దీని పాత్ర ఉందని నమ్ముతున్నారు. అనేక రూపాలలో ప్రపంచ ఆలోచనలను, పరిశోధనలను, వ్యక్తులను, వ్యవస్థలను నియంత్రించే రీతిలో ఈ సంస్థ పని చేస్తున్నది. గత నాలుగు దశాబ్దాలుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాల్లో వేలాది మంది అగ్రశ్రేణి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు,బ్యాంకర్లు, ఫైనాన్షియర్లు, దేశాధినేతలు, ఆర్థిక, వాణిజ్య మంత్రులు, ధనిక దేశాల విధాన నిర్ణేతలు పాల్గొంటున్నారు. అన్ని ప్రధాన అంతర్జాతీయ సంస్థల అధిపతులు కూడా అక్కడికి వెళ్తుంటారు. ఇంతమంది నాయకులు, ప్రముఖులు అక్కడ పోషించే పాత్ర ఏమిటో తెలియదు. ప్రజాధనం ఎంత ఖర్చు అవుతుందో చెప్పరు. ఈ సంవత్సరం కనీసం ముగ్గురు ముఖ్యమంత్రులు దావోస్(స్విట్జర్లాండ్) పోతున్నారు– మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. తెలంగాణా నుంచి దావోస్ ప్రతి సమావేశంలో పాల్గొనే మంత్రి గారు వెళ్తున్నారు. ఈ సమావేశాలు నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఒక ప్రైవేటు సంస్థ. దీని ఆలోచనలు, వ్యూహాలు తెలుసుకోవడం అవసరం. సాధారణంగా ప్రపంచంలో రెండు పెట్టుబడిదారీ నమూనాలు ఉన్నాయి. మొదటిది: చాలా పాశ్చాత్య సంస్థలు స్వీకరించిన ‘షేర్ హోల్డర్ క్యాపిటలిజం’. దీని ప్రకారం ఒక కార్పొరేషన్ ప్రాథమిక లక్ష్యం దాని లాభాలను గరిష్ఠంగా పెంచడం, తద్వారా వాటాదారు లకు లాభాలు పంచడం. రెండవ నమూనా: ‘స్టేట్ క్యాపిటలిజం’. ఇందులో దేశ ఆర్థిక వ్యవస్థ దిశను నిర్ణయించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వమే పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. చైనా, ఇంకా కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ తరహ వ్యవస్థ ఇటీవల ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ రెండింటికి భిన్నంగా, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధినేత క్లాస్ శ్వాబ్ ప్రతిపాదించిన మూడవ తరహా ‘స్టేక్ హోల్డర్ పెట్టుబడిదారీ విధానం’లో ప్రైవేట్ కంపెనీలకు సమాజం, పర్యావరణం పట్ల బాధ్యత ఉంటుంది. ఇది ఒక విధంగా మన దేశంలో అమలవుతున్న సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ) లాంటిది. ఇది మంచిదేగా అనిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే, దేశ సరిహద్దులను చెరిపి ప్రపంచ పాలన సాధించే దిశగా ఈ సంస్థ అడుగులు వేస్తున్నది. వైఫల్యం చెందినప్పటికీ ప్రపంచీకరణను ఇంకా లోతుల్లోకి తీసుకెళ్లేలా కొత్త వ్యూహాలను రచిస్తూ, ప్రపంచ పరిపాలన మీద దృష్టి పెడుతున్నది. పర్యావరణం పట్ల శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఏ సమస్యలో అయినా ‘డబ్ల్యూఈఎఫ్’ సభ్యులు తమ ఆధిపత్యం కోల్పోని విధంగా ‘పరిష్కారాలు’ తెర మీదకు తేవడం ఈ సంస్థ ప్రత్యేకత. ఈ ఆలోచనలతో క్లాస్ శ్వాబ్ రాసిన పుస్తకం: ‘ది గ్రేట్ రీసెట్’. దీనిలో భాగస్వామ్య పెట్టుబడిదారీ విధానంతో పాటు తనదైన మార్క్సిజం బ్రాండ్తో ప్రపంచాన్ని పూర్తిగా పునర్నిర్మించాలని పిలుపు ఇచ్చాడు. దశాబ్దాలుగా ఒక క్లబ్ మీటింగ్ తరహాలో ఇక్కడ వార్షిక సమావేశాలు జరుగుతున్నాయి. నయా ఉదారవాదం పునాదిగా కార్పొరేట్ వాణిజ్య ఒప్పందాల వ్యాప్తి, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తులను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విలీనం చేయడం ఇక్కడి ప్రక్రియలో భాగం. ప్రపంచ వాణిజ్య మార్కెట్లకు దన్నుగా ‘గ్లోబల్ గవర్నెన్స్’ను ప్రోత్సహించడానికి ఈ సమావేశాలను వాడుకుంటున్నారు. వాస్తవానికి, ఈ ఆర్థిక వేదిక ప్రధాన ఉద్దేశ్యం ప్రపంచీకరణ ద్వారా ఉన్నత వర్గాల, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలను కాపాడ టమే. 1990లో నెల్సన్ మండేలా జైలు నుండి విడుదలైనప్పుడు గనులు, బ్యాంకులు, గుత్తాధిపత్య పరిశ్రమలను ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయం చేస్తుందని ప్రకటించారు. కాగా, అధ్యక్షుడైన వెంటనే 1992 జనవరిలో ‘డబ్ల్యూఈఎఫ్’ సమావేశాలకు హాజరై తన అభిప్రాయాలను మార్చుకుని ‘పెట్టుబడిదారీ విధానం, ప్రపంచీకరణ’ను స్వీకరించారు. చైనా, వియత్నాం, కంబోడియా వంటి కమ్యూనిస్ట్ దేశాలు కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటే తమ దేశానికి పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నాయి. 1997లో అమెరికా రాజకీయ శాస్త్రవేత్త శామ్యూల్ హంటింగ్టన్ ‘దావోస్ మగవాడు’ (దావోస్ మ్యాన్) అనే పదాన్ని సృష్టించారు. ‘దేశ సరిహద్దులను కనుమరుగవుతున్న అవరోధాలుగా, జాతీయ ప్రభు త్వాలను గతానికి అవశేషాలుగా చూస్తూ– అటువంటి ప్రభుత్వాలకు ఉండే ఏకైక ఉపయోగకరమైన పని ఉన్నత వర్గాల పుడమి స్థాయి కార్యకలాపాలను సులభతరం చేయడమే అని నమ్మేవారు’ అంటూ ఈ పదాన్ని ఆయన విశ్లేషించారు. ఏటా దావోస్ సమావేశాలకు హాజరయ్యేవాళ్ళు తమ పరపతి, వనరులు పెంచుకోవడానికీ, ఇతరులతో కలిసి తమ ఆధిపత్యానికి అడ్డంకులు తొలగించుకోవడానికీ ఈ వేదికను ఉపయోగించుకుంటున్నారు. ఒకానొక సమావేశంలో, బోరిస్ బెరెజోవ్స్కీ నేతృత్వంలోని ఏడుగురు రష్యన్ నేతలు బోరిస్ యెల్ట్సిన్ తిరిగి ఎన్నిక కావడానికి నిధులు సమకూర్చాలనీ, ‘తమ దేశ భవిష్యత్తును పునర్నిర్మించడానికి’ కలిసి పనిచేయాలనీ నిర్ణయించుకున్నారు. ఈ కూటమి అనుకున్నది సాధించింది. ఇది వారందరినీ ఇంకా ధనవంతులను చేసింది. 2009 సంవత్సరంలో అంతర్జాతీయ బ్యాంకులు, ప్రపంచ ఆర్థిక సంస్థలపై ప్రజలకు విశ్వాసం తగ్గినప్పటికీ, ప్రైవేటు ఆర్థిక సంస్థల ప్రయోజనాలను పరిరక్షించడానికి కట్టుబడి దావోస్ పని చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఫౌండేషన్ బోర్డు (దాని అత్యున్నత పాలక సంస్థ)లో ప్రపంచ కుబేరులు ఉన్నారు. 2002లో ఏర్పాటైన మరొక పాలక మండలి ‘ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్’ను 100 మంది ప్రముఖులతో ఏర్పాటు చేశారు. వ్యూహాత్మక సలహాలు ఇస్తూ, వార్షిక సమావేశ ఎజెండా తయారీకి ఈ మండలి ఉపయోగపడుతుంది. ఇందులో ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు. 2015 నాటికి ‘డబ్ల్యూఈఎఫ్’ వార్షిక వ్యూహాత్మక భాగస్వామి హోదా పొందాలంటే దాదాపు 7 లక్షల డాలర్ల రుసుము కట్టాలి. ఇందులో వ్యూహాత్మక భాగస్వామి సభ్యులుగా బ్యాంక్ ఆఫ్ అమెరికా, బార్క్లేస్, బ్లాక్ రాక్, బీపీ, చెవ్రాన్, సిటీ, కోకాకోలా, క్రెడిట్ సూయిజ్, డ్యూష్ బ్యాంక్, డౌ కెమికల్, ఫేస్బుక్, జీఈ, గోల్డ్మాన్ శాక్స్, గూగుల్, హెచ్ఎస్బీసీ, జేపీ మోర్గాన్ ఛేజ్, మోర్గాన్ స్టాన్లీ, పెప్సికో, సీమెన్స్, టోటల్, యూబీఎస్ లాంటి సంస్థలు ఉన్నాయి. ప్రపంచంలో జరిగే కార్పొరేట్, ఆర్థిక శక్తి ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే నిరసనలు, ప్రతిఘటన ఉద్యమాల మీద ‘డబ్ల్యూఈఎఫ్’ ఆసక్తి చూపిస్తున్నది. 1999లో ప్రపంచ వాణిజ్య సంస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగిన నిరసనల నేపథ్యంలో ఈ ఆసక్తి స్పష్టమైంది. అప్పటి నిరసనల వల్ల సియాటెల్ నగరంలో కీలక వాణిజ్య చర్చలకు అంతరాయం ఏర్పడింది. ఈ నిరసనలను పెరుగుతున్న ‘ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమం’గా ‘డబ్ల్యూఈఎఫ్’ అభివర్ణించింది. ప్రజా ఉద్యమాలను నిర్వీర్యం చేయడంలో, లేదా నిరంకుశంగా అణిచివేయడంలో దీని పాత్ర ఉందని నమ్ముతున్నారు. 2001 జనవరిలో దావోస్ సమావేశాలకు అంతరాయం కలగకుండా అసాధారణ భద్రతా చర్యలు తీసుకున్నారు. దావోస్ పట్టణం చుట్టూ కాంక్రీట్ బ్లాక్లు అమర్చి, కంచెకు అవతలి వైపునే వేలాది పోలీసులు నిరసనకారులను నిలువరించారు. అదే సమయంలో, దావోస్కు ప్రతి వేదికగా బ్రెజిల్లోని పోర్టో అలెగ్రేలో ఏర్పడిన వరల్డ్ సోషల్ ఫోరమ్ కాలక్రమేణా బలహీనపడగా, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ బలపడింది. అన్ని దేశాల ఒప్పందం మేరకు ఏర్పాటైన ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటీవలి సంవత్సరాలలో బలహీనపడగా, ఒక ప్రైవేటు సంస్థ అయిన ‘డబ్ల్యూఈఎఫ్’ బలపడుతున్నది. తన దగ్గర ఉన్న కోట్లాది సొమ్ముతో అనేక రూపాలలో ప్రపంచ ఆలోచనలను, పరిశోధనలను, వ్యక్తులను, వ్యవస్థలను నియంత్రించే రీతిలో ఈ సంస్థ పని చేస్తున్నది. కరోనా మహమ్మారి గురించిన వివిధ దేశాల ప్రభుత్వాల స్పందనను, విధానాలను శాసించే స్థితికి కూడా ఈ సంస్థ చేరిందని వ్యాఖ్యానించేవారూ ఉన్నారు. డాక్టర్ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త విధాన విశ్లేషకులు -
సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్స్ జాబితాలో మంత్రి కేటీఆర్కు చోటు!
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్స్ లిస్ట్లో చోటు దక్కించుకున్నారు. స్విర్జర్లాండ్లోని దావోస్ వేదికగా జనవరి 16 నుంచి జనవరి 20 వరకు వరల్డ్ ఎకనమిక్స్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా డబ్ల్యూఈఎఫ్ ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్స్ జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో మంత్రి కేటీఆర్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్లో కేటీఆర్ 12వ స్థానాన్ని దక్కించుకోగా.. రాఘవ్ చద్దా 23వ స్థానంలో నిలిచారు. ఇక కేటీఆర్ హ్యాండిల్ చేసే ట్విటర్ అకౌంట్ @కేటీఆర్టీఆర్ఎస్కు 12వ ర్యాంక్, @మినిస్టర్కేటీఆర్ అకౌంట్కు 22 ర్యాంక్ ఇచ్చింది. @truckdriverpleb @CyrilRamaphosa @ValaAfshar @rwang0 @AlinejadMasih @montymetzger @MinisterKTR @raghav_chadha @EU_Commission @vonderleyen @GBBCouncil @Oxfam @Gabucher @LassoGuillermo @ODI_Global https://t.co/KiTyPCbJIz#WEF23 #WEF #Davos #socialmedia #smm pic.twitter.com/AMjO0RKion — Jim Harris #WEF23 (@JimHarris) January 17, 2023 -
భారత అపర కుబేరుల సంపద.. దిమ్మతిరిగి పోయే వాస్తవాలు
మన దేశంలో ధనికుల సంపద.. దాని గురించి దిమ్మ తిరిగి పోయే వాస్తవాలు ఒక అధ్యయనం వెల్లడించింది. భారత్ లో సంపన్నులు 1 శాతం ఉంటే.. దేశం మొత్తం సంపద లో 40 శాతం వాళ్ళ దగ్గరే ఉంది. ఇక సగం జనాభా దగ్గర ఉన్న సంపద కేవలం 3 శాతం మాత్రమే!!.. దావోస్ వేదికగా జనవరి 16 నుంచి జనవరి 20 వరకు వరల్డ్ ఎకనమిక్స్ ఫోరమ్ వార్షిక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లోని తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రారంభమైన స్వచ్ఛంద సంస్థ ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ ‘సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో మనదేశ సంపన్నుల వివరాలు, వారి వద్ద ఉన్న సంపదతో ఏమేమి చేయొచ్చో పొందుపరిచింది. పిల్లలను బడుల్లో చేర్పించవచ్చు టాప్ 100 భారతీయ బిలియనీర్లకు 2.5 శాతం పన్ను విధించడం లేదా టాప్ 10 భారతీయ బిలియనీర్లపై 5 శాతం పన్ను విధించడం వల్ల పేదరికం కారణంగా చదువుకు దూరమైన పిల్లలను బడుల్లో చేర్పించవచ్చని తెలిపింది. అదాని అవాస్తవిక లాభాలపై ట్యాక్స్ విధిస్తే ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. 128.3 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో భారత్కు చెందిన గౌతమ్ అదానీ మూడో స్థానంలో ఉన్నారు. అయితే అదానీ 2017 నుంచి 2021 వరకు సంపాదించిన అవాస్తవిక లాభాలపై ఒక్కసారి ట్యాక్స్ విధిస్తే 1.79లక్షల కోట్లను సమీకరించవచ్చు. ఆ మొత్తాన్ని సంవత్సరానికి ఐదు మిలియన్లకు పైగా భారతీయ ప్రాథమిక పాఠశాల్లో ఉపాధ్యాయుల్ని నియమించుకునేందుకు సరిపోతుంది. పోషక ఆహార లోపం తగ్గించొచ్చు పోషకాహార లోపం.. చిక్కిపోయిన (ఐదేండ్లలోపు పిల్లలు) (ఎత్తుకు తగ్గ బరువులేని పిల్లలు), ఎదుగుదలలేని పిల్లలు (వయస్సుకు తగ్గ ఎత్తులేని పిల్లలు) పిల్లల మరణాలు వంటి నాలుగు పారామీటర్స్ ఆధారంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (ప్రపంచ ఆకలి సూచీ)-2022లో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా 121 దేశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులను విడుదల చేయగా భారత్ 107వ స్థానాన్ని దక్కించుకుంది. తాజా ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ ‘సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్’ నివేదికలో.. భారత్లో ఉన్న బిలియనీర్లలో ఒక్కసారి 2శాతం ట్యాక్స్ విధిస్తే రూ.40,423కోట్లను సమీకరించవచ్చు. ఆ మొత్తంతో వచ్చే మూడేళ్లలో దేశ మొత్తంలో పోషక ఆహార లోపంతో బాధపడుతున్న వారికి బలవర్ధకమైన ఆహారాన్ని అందించవచ్చు. 1.5 రెట్లు ఎక్కువ భారత్లో ఉన్న 10 మంది బిలియనీర్లపై ఒక్కసారి 5శాతం ట్యాక్స్ విధిస్తే రూ.1.37లక్షల కోట్లు సమీకరించవచ్చు. ఆ మొత్తం ఎంతంటే? 2022-23లో కేంద్ర సంక్షేమ పథకాలైన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ (రూ.86,200 కోట్లు), మినిస్ట్రీ ఆఫ్ ఆయిష్ (రూ.3,050 కోట్లు) అంచనా వేసిన నిధుల కంటే 1.5 రెట్లు ఎక్కువ. పురుషుడి సంపాదన రూపాయి, మహిళ సంపాదన 63 పైసలు లింగ అసమానతపై నివేదిక ప్రకారం..ఒక పురుషుడు రూపాయి సంపాదిస్తే.. అందులో మహిళ సంపాదించేది 63 పైసలు సంపద రోజుకు రూ.3,608 కోట్లు పెరిగింది కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి 2022 నవంబర్ వరకు భారతదేశంలోని బిలియనీర్లు తమ సంపద 121 శాతం లేదా రోజుకు రూ. 3,608 కోట్ల మేర పెరిగినట్లు ఆక్స్ఫామ్ తెలిపింది. 3శాతం జీఎస్టీ వసూళ్లు మరోవైపు, 2021-22లో దేశ వ్యాప్తంగా మొత్తం రూ. 14.83 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు అయ్యాయి. ఆ జీఎస్టీ దేశంలోని అట్టడుగు వర్గాల నుంచి 64 శాతం వస్తే, భారత్లో ఉన్న టాప్ 10 బిలియనీర్ల నుంచి కేవలం 3శాతం జీఎస్టీ వసూలైంది. పెరిగిపోతున్న బిలియనీర్లు భారతదేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 2020లో 102 కాగా 2022 నాటికి 166కు పెరిగిందని ఆక్స్ఫామ్ తెలిపింది. ఆక్సోఫామ్ ఆధారాలు ఎలా సేకరించిందంటే దేశంలోని సంపద అసమానత, బిలియనీర్ల సంపదను పరిశీలించేందుకు ఫోర్బ్స్,క్రెడిట్ సూయిస్ వంటి దిగ్గజ సంస్థల నివేదికల్ని ఆక్సోఫామ్ సంపాదించింది.అయితే నివేదికలో చేసిన వాదనలను ధృవీకరించడానికి ఎన్ఎస్ఎస్, యూనియన్ బడ్జెట్ పత్రాలు, పార్లమెంటరీ ప్రశ్నలు మొదలైన ప్రభుత్వ నివేదికలు ఉపయోగించింది. చివరిగా::: అవాస్తవిక లాభాలంటే వాణిజ్య భాషలో అవాస్తవిక లాభాలంటే ఉదాహరణకు..రమేష్ అనే వ్యక్తి ఏడాది క్రితం ఓ కంపెనీకి చెందిన ఓక్కో స్టాక్ను రూ.100 పెట్టి కొనుగోలు చేస్తే.. ఆ స్టాక్ విలువ ప్రస్తుతం రూ.105లకు చేరుతుంది. అలా పెరిగిన రూ.5 అవాస్తవిక లాభాలంటారు. చదవండి👉 చైనాపై అదానీ సెటైర్లు, ‘ఇంట కుమ్ములాటలు.. బయట ఏకాకి!’ -
దావోస్కు కేటీఆర్ బృందం
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్లోని దావోస్లో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు నేతృత్వంలో అధికారుల బృందం శనివారం రాత్రి బయలుదేరి వెళ్లింది. నేడు జూరిచ్కు చేరుకోనున్న కేటీఆర్ బృందం రోడ్డు మార్గంలో దావోస్కు చేరుకుంటుంది. 2018లో తొలిసారిగా తెలంగాణ నుంచి దావోస్కు ప్రతినిధులు వెళ్లగా 2019, 2020, 2022లోనూ హాజరయ్యారు. దావోస్ సమావేశాలకు తెలంగాణ నుంచి ప్రత్యేక బృందం వెళ్లడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. ప్రతీ ఏటా జనవరిలో వరల్డ్ ఎకనామిక్ సమావేశాలు జరగనుండగా కోవిడ్ పరిస్థితుల్లో గత ఏడాది మేలో జరిగాయి. ‘కో ఆపరేషన్ ఇన్ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్’ నినాదంతో జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సు ఆల్పైన్ పర్వత సానువుల్లో సముద్రమట్టానికి 1,500 మీటర్ల ఎత్తున ఉన్న విడిది పట్టణం దావోస్ ఆతిథ్యమిస్తోంది. కాగా దావోస్లో ఏర్పాటయ్యే తెలంగాణ పెవిలియన్లో పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు చెందిన అధినేతలతో భేటీకావడంతో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో భాగంగా జరిగే రౌండ్ టేబుల్ భేటీల్లో కేటీఆర్ పాల్గొంటారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థల నుంచి తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడం ద్వారా ప్రైవేటు రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం లక్ష్యంగా కేటీఆర్ ప్రసంగాలు, భేటీలు ఉంటాయి. -
రూ.23 లక్షల కోట్లు అవసరం..ఎలక్ట్రిక్ వెహికల్స్గా మర్చేందుకు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు పూర్తిగా ఎలక్ట్రిక్కు మారేందుకు సుమారు రూ.23 లక్షల కోట్లు అవసరమని ఒక నివేదిక వెల్లడించింది. నీతి అయోగ్ భాగస్వామ్యంతో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ రూపొందించిన ఈ శ్వేత పత్రం ప్రకారం..చివరి గమ్యస్థానం కోసం, అలాగే పట్టణాల్లో డెలివరీకి ఉపయోగించే వాహనాలే దేశంలో ఎలక్ట్రిక్ టూ, త్రీవీలర్ల స్వీకరణను ముందుండి నడిపిస్తున్నాయి. పూర్తిగా ఎలక్ట్రిక్కి మారబోయే మొదటి విభాగాలుగా వీటిని చెప్పవచ్చు. ముందస్తు కొనుగోలు ఖర్చు ఎక్కువగా ఉండడం, కొత్త సాంకేతికతపై విశ్వాసం లేకపోవడం, హామీ లేని విశ్వసనీయత, పునఃవిక్రయం విలువ స్థిరీకరించకపోవడం కారణంగా ఎలక్ట్రిక్కు మారడానికి డ్రైవర్–కమ్–ఓనర్లు వెనుకాడుతున్నారు. దేశంలో అమ్ముడవుతున్న మొత్తం వెహికిల్స్లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల వాటా ఏకంగా 80 శాతం ఉంది. కొన్నేళ్లుగా ఈవీల వాడకం పెరుగుతోంది. నిర్వహణ ఖర్చు తక్కువ.. భారత్లో ధ్రువీకరణ పొందిన 45 కంపెనీలు ఎలక్ట్రిక్ టూ, త్రీవీలర్ల తయారీలో ఉన్నాయి. ఇవి ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్లను విక్రయించాయి. 25 కోట్ల మొత్తం ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో ఎలక్ట్రిక్ టూ, త్రీవీలర్ల వాటా అతిస్వల్పమే. భారత్లో పెరుగుతున్న ఆదాయాలు, వాహన యాజమాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ద్విచక్ర, త్రిచక్ర వాహనాల సంఖ్య మొత్తం 27 కోట్లకు పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. వీటిలో 26.4 కోట్ల యూనిట్ల ఎలక్ట్రిక్ టూవీలర్లు ఒక్కొక్కటి సగటున రూ.80,000 చొప్పున, అలాగే 60 లక్షల యూనిట్ల ఈ–త్రీవీలర్లు ఒక్కొక్కటి సగటున రూ.2.8 లక్షలుగా లెక్కించారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నప్పటికీ.. వాటి నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. యాజమాన్య ఖర్చుతో అంచనా వేసినప్పుడు రోజువారీ అధికంగా వినియోగించే రైడ్–హెయిలింగ్, లాస్ట్–మైల్ డెలివరీ ఫ్లీట్స్కు ఈవీలు ఇప్పటికే అనువైనవని పరిశ్రమ గుర్తించిందని నివేదిక వివరించింది. -
డబ్ల్యూఈఎఫ్ లైట్హౌస్ నెట్వర్క్లో డాక్టర్ రెడ్డీస్ ప్లాంటు
న్యూఢిల్లీ: గ్లోబల్ లైట్హౌస్ నెట్వర్క్ (జీఎల్ఎన్)లో కొత్తగా 11 ఫ్యాక్టరీలు, పారిశ్రామిక సైట్లను చేర్చినట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వెల్లడించింది. ఈ జాబితాలో భారత్ నుంచి దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) హైదరాబాద్ ప్లాంటు, శ్రీసిటీలోని మాండెలీజ్ ఫ్యాక్టరీ, ఇండోర్లోని సిప్లా ప్లాంటు ఉన్నాయి. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3డీ ప్రింటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి విప్లవాత్మకమైన సాంకేతికతలను ఉపయోగించడంలో ముందుంటున్న 100 పైగా తయారీ సంస్థలు జీఎల్ఎన్లో ఉన్నాయి. ఎప్పటికప్పుడు మారిపోతున్న నాణ్యత ప్రమాణాల అంచనాలను అందుకునేందుకు డీఆర్ఎల్ హైదరాబాద్ ప్లాంటు భారీ స్థాయిలో డిజిటలీకరణ చేపట్టినట్లు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. తయారీ వ్యయాలను 43 శాతం మేర తగ్గించుకున్నట్లు పేర్కొంది. పాతికేళ్ల హైదరాబాద్ ప్లాంటుకు డిజిటల్ లైట్హౌస్ ఫ్యాక్టరీ హోదా దక్కడం గర్వకారణమని డీఆర్ఎల్ గ్లోబల్ హెడ్ (తయారీ విభాగం) సంజయ్ శర్మ తెలిపారు. మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ ఆటోమేషన్స్ మొదలైన వాటితో శ్రీ సిటీలోని ప్లాంటులో మాండెలీజ్ సంస్థ తయారీ వ్యయాలను 38 శాతం తగ్గించుకుందని, కార్మికుల ఉత్పాదకతను 89 శాతం మేర పెంచుకుందని డబ్ల్యూఈఎఫ్ వివరించింది. అంతర్జాతీయంగా మాండెలీజ్కు ఉన్న ఫ్యాక్టరీలకు ఈ ప్లాంటు ప్రామాణికంగా మారిందని తెలిపింది. లైట్హౌస్ నెట్వర్క్లోని నాలుగు సంస్థలకు అత్యుత్తమమైన సస్టెయినబిలిటీ లైట్హౌస్ల హోదా ఇచ్చినట్లు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. -
వినూత్నం, ఆదర్శం.. ఏపీకి నీతిఆయోగ్ సలహాదారు ప్రశంస
సాక్షి, అమరావతి: ఏపీలో కాలుష్యానికి తావులేని పర్యావరణహిత పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 2070 నాటికి కర్బన ఉద్గారాలు లేకుండా చేయాలన్న లక్ష్యంలో భాగంగా గ్రీన్ ఎనర్జీతో పాటు ఎలక్ట్రికల్ వాహన రంగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ‘షేపింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది మొబిలిటీ’ పేరుతో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. చదవండి: అరచేతిలో 87 రకాల సేవలు.. ఈ యాప్ ఉంటే మీ వెంట పోలీస్ ఉన్నట్టే! ఇందులో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి. సృజన, ఏపీ ఈడీబీ సీఈఓ జవ్వాది సుబ్రమణ్యంలతో పాటు 60కిపైగా ఎలక్ట్రిక్ వాహన రంగానికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. అత్యధిక పెట్టుబడులు ఆకర్షించేలా చర్యలు ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ.. 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహన రంగంలో భారత్లోకి రూ.50,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారని, ఇందులో అత్యధిక భాగం రాష్ట్రానికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం మూడంచెల విధానంలో ముందుకెళ్తున్నామని, 2029 నాటికి దేశంలో అత్యధిక పెట్టుబడులు ఆకర్షించే రాష్ట్రంగా.. 2050 నాటికి అంతర్జాతీయంగా పెట్టుబడులకు అత్యంత అనువైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమర్నాథ్ తెలిపారు. ఇందుకు అనుగుణంగా పారిశ్రామిక కారిడార్లలో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నామన్నారు. జీడీపీ 5 శాతం పెరుగుతుంది జవ్వాది సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ఒకపక్క ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు దేశంలో గణనీయంగా పెరుగుతున్నప్పటికీ అదే సమయంలో ఏటా 20 లక్షల మంది వాయు కాలుష్యంవల్ల మరణించడం ఆందోళన కలిగించే అంశమన్నారు. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా వీటిని అరికట్టవచ్చని, తద్వారా దేశ జీడీపీ మరో 5 శాతం పెరుగుతుందన్నారు. పెట్టుబడులకు రాష్ట్రం చాలా అనువైనదని, సింగిల్ విండో విధానంలో కేవలం 21 రోజుల్లోనే అనుమతులను మంజూరు చేస్తున్నట్లు జవ్వాది తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంలో భాగంగా చార్జింగ్ స్టేషన్లు వంటి కీలక మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారిస్తోందన్నారు. 2030 నాటికి గ్రీన్ ఎనర్జీ వాటా 45శాతం ప్రస్తుతం రాష్ట్ర ఇంధన వినియోగంలో 30 శాతం వరకు సౌర, పవన విద్యుత్ నుంచి సమకూర్చుకుంటున్నామని, 2030 నాటికి గ్రీన్ ఎనర్జీ వాటాను 45 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విజయానంద్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వినియోగించుకోవాల్సిందిగా పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి. సృజన కోరారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహన రంగానికి చెందిన పలువురు ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తంచేశారు. ఏపీకి నీతిఆయోగ్ సలహాదారు ప్రశంస ఇక ఏదైనా అనుకుంటే దానిని వెంటనే చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ముందుంటుందని సమావేశంలో నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు సిన్హా ప్రశంసించారు. ఒక ఆలోచన వస్తే వెంటనే ఆచరణలో పెట్టడంలోగానీ, ఒక బృందాన్ని ఏర్పాటుచేసుకుని ప్రణాళికతో లక్ష్యాన్ని చేరడంలోగానీ ఏపీ తీరు ఆదర్శమని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఏపీ మార్గదర్శిగా నిలుస్తుందని సిన్హా అభిప్రాయపడ్డారు. -
లింగ సమానత్వం.. 146 దేశాల సూచికలో భారత్ ర్యాంక్ 135!
న్యూఢిల్లీ: లింగ సమానత్వం విషయంలో ఐస్లాండ్ ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ నిలిచాయి. మొత్తం 146 దేశాల సూచికలో భారత్ ర్యాంక్ 135! అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, కాంగో, ఇరాన్, చాద్ తదితర దేశాలు అట్టడుగులు స్థానాల్లో నిలిచాయి. జెనీవాలోని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) ‘వార్షిక జెండర్ గ్యాప్ రిపోర్ట్–2022’ను బుధవారం చేసింది. లింగ సమానత్వంలో ప్రపంచ దేశాలకు ర్యాంక్లను కేటాయించింది. లింగ అంతరం పూర్తిగా సమసిపోవడానికి మరో 132 ఏళ్లు పడుతుందని అంచనా వేసింది. లింగ సమానత్వంలో భారత్ వెనుకంజలో ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లో వారి భాగస్వామ్యం పెరుగుతుండడం సంతోషకరమని పేర్కొంది. మహిళా ప్రజాప్రతినిధులు తదితరుల సంఖ్యలో పెరుగుదల కన్పించింది. చదవండి: లంకాధ్యక్షుడి జంప్ జిలానీ.. గొటబయ గో! అంటే ముల్లేమూటా సర్దాల్సిందే! -
ఆర్థికశాస్త్ర దిగ్గజాల సరసన భారతీయురాలు.. తొలి మహిళగా రికార్డు
‘అర్థం కావాలేగానీ ఆర్థికశాస్త్ర విషయాలు చందమామ కథల కంటే ఎక్కువగా ఆకర్షిస్తాయి’ అంటారు. అది ఎంత వరకు నిజమో తెలియదుగానీ, గీతా గోపీనాథ్కు ఆర్థికశాస్త్రం అనేది శ్వాస! సివిల్ సర్వీసులలో చేరాలనేది తన మొదటి కల. అయితే ఆర్థికశాస్త్రంపై ఆసక్తి ఆమెను వేరే దారిలోకి తీసుకెళ్లింది. ప్రపంచ ఆర్థికశాస్త్ర దిగ్గజాల సరసన చేర్చింది... ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి) గోడ (వాల్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ ఎకనామిస్ట్స్)పై ఆ సంస్థ తరపున పనిచేసిన ప్రముఖ ఆర్థికవేత్తల ఫోటోలు వరుసగా కనిపిస్తాయి. ఒక్కో ఫొటో చూస్తూ వెళుతుంటే ఆర్థికరంగంలో వారి మేధోకృషి గుర్తుకు వస్తుంటుంది. అపురూపమైన చిత్రాలు అవి. ఇప్పుడు ఆ ఫొటోల వరుసలో ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ ఫోటో చేరింది. ఐఎంఎఫ్ వాల్ ఫొటోల వరుసలో కనిపించిన తొలి మహిళా ఆర్థికవేత్తగా గీతా గోపీనాథ్ తనప్రత్యేకతను చాటుకుంది. ట్రెండ్ను బ్రేక్ చేస్తూ ప్రఖ్యాత ఆర్థికవేత్తల ఫొటోల వరుసలో తన ఫోటో ఏర్పాటు చేసినందుకు ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తం చేసింది గీత. ఇండియన్–అమెరికన్ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్న గీతా గోపినాథ్ కోల్కతాలో జన్మించింది. మైసూర్లోని నిర్మల కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది. దిల్లీలో లేడి శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్లో బీఏ, యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్లో ఎం.ఏ. చేసింది. ప్రిన్స్టన్ యూనివర్శిటీ నుంచి పీహెచ్డి పట్టా అందుకుంది. Breaking the trend 👊💥…I joined the wall of former Chief Economists of the IMF 😀 pic.twitter.com/kPay44tIfK— Gita Gopinath (@GitaGopinath) July 6, 2022 చదువు పూర్తయిన తరువాత హార్వర్డ్ యూనివర్శిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేసింది. ఏడవ తరగతి వరకు గీతకు 45 శాతం లోపు మార్కులు వచ్చేవి. తల్లిదండ్రులెప్పుడూ మార్కుల విషయంలో ఒత్తిడి తెచ్చేవారు కాదు. అయితే ఏడవ తరగతి తరువాత మాత్రం గీత చదువులో దూసుకుపోయింది. మార్కులే మార్కులు! అంతమాత్రాన చదువే లోకం అనుకోలేదు. హాయిగా ఆటలు ఆడేది. పాటలు పాడేది. గిటార్ వాయించేది. ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. గణితం నుంచి సైన్స్ వరకు ఎంత జటిలమైన విషయాన్ని అయిన నాన్న గోపీనాథ్ ఇంట్లో ఉన్న వస్తువులను ఉదహరిస్తూ సులభంగా అర్థమయ్యేలా చెప్పేవాడు. బహుశా గీతకు ఆ లక్షణమే వచ్చి ఉంటుంది. జటిలమైన ఆర్థిక విషయాలను వేగంగా అర్థం చేసుకోవడంలోనే కాదు, వాటిని సులభంగా బోధించడంలో పట్టు సాధించింది. గీత పరిశోధన పత్రాలు టాప్ ఎకనామిక్స్ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ‘యంగ్ గ్లోబల్ లీడర్’ (2011) పురస్కారాన్ని అందుకుంది. 2014లో ‘టాప్ 25 ఎకనామిస్ట్స్ అండర్ 45’ జాబితాలో చోటు సంపాదించింది. భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అందుకుంది. ఐఎంఎఫ్లో చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేసిన గీత ప్రస్తుతం ఐఎంఎఫ్–డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో ఉంది. -
భూగోళమంతటా ప్లాస్టిక్ భూతం.. సవాళ్లు ఎన్నున్నా.. స్వచ్ఛ సాగరం
ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. దాదాపు భూగోళమంతటా విస్తరించిన భూతం. చెరువులు, నదులు, సముద్రాల్లోనూ తిష్టవేసుకొని కూర్చుంది. విలువైన జలవనరులను కలుషితం చేస్తోంది. జలచరాల ఆయువును కబళిస్తోంది. తనను సృష్టించిన మనిషికే ముప్పుగా పరిణమిస్తోంది. సముద్రాల్లో మాటువేసిన ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచదేశాలకు ఇప్పుడొక పెద్ద సమస్యగా మారిపోయింది. భూమిపై అన్ని సముద్రాల్లో 19.90 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు నిపుణుల అంచనా. వీటిని తొలగించి, మహాసాగరాలను పరిశుభ్రంగా మార్చడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఎంతోమంది పరిశోధకులు, ఇంజనీర్లు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. కృత్రిమ మేధ(ఏఐ) బీచ్ బగ్గీలు, ప్లాస్టిక్ను తినేసే కృత్రిమ ఎంజైమ్లు, ప్లాస్టిక్ ఇంటర్సెప్టర్లు, అక్వాటిక్ డ్రోన్లు వంటివి కొన్ని పరిష్కార మార్గాలుగా చెబుతున్నారు. ఎంజైమ్లతోపాటు మైక్రోబ్ నెట్లు, మ్యాగ్నెటిక్ లిక్విడ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వాటర్షార్క్లు సముద్రాల్లో మారుమూల ప్రాంతాలకు కూడా ప్లాస్టిక్ రక్కసి చొచ్చుకెళ్తోంది. మానవ సంచారం లేని అంటార్కిటికాలో కురిసిన మంచులోనూ సూక్ష్మ ప్లాస్టిక్ ఆనవాళ్లు బయటపడ్డాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) అంచనా ప్రకారం సముద్రాల్లో 199 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వివిధ రూపాలు, పరిణామాల్లో ఉంది. తక్కువ బరువు కలిగిన మైక్రోప్లాస్టిక్లు ఉపరితలంపై తేలుతుండగా, అధిక బరువు కలిగినవి అడుగు భాగానికి చేరుకున్నాయి. నీటిపై తేలుతున్న ప్లాస్టిక్ను తొలగించడానికి అక్వాటిక్ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. నీటి పై భాగంలోని చిన్నచిన్న ప్లాస్టిక్ ముక్కలను సైతం సులువుగా సేకరిస్తాయి. వీటిని వాటర్షార్క్లుగా వ్యవహరిస్తున్నారు. బీచ్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ను ఏరివేయడానికి కృత్రిమ మేధతో పనిచేసే బగ్గీలు (చిన్నపాటి వాహనాలు) వాడుతున్నారు. కంటికి కనిపించని సూక్ష్మ ప్లాస్టిక్ను నిర్మూలించడానికి మ్యాగ్నటిక్ నానో–స్కేల్ స్ప్రింగ్లను తయారు చేస్తున్నారు. మరికొన్ని ప్రయోగాలు అభివృద్ధి దశలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్లాస్టిక్ను భక్షించే ఎంజైమ్ నదులు, సముద్రాల్లోని ప్లాస్టిక్ను తినేసే ఎంజైమ్ను 2016లో కనిపెట్టారు. దీన్ని పెటేస్ అని పిలుస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ ఎంజైమ్ నిర్వీర్యం అవుతుండడంతో పెద్దగా ఉపయోగించడం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక పాలిమర్ను డిజైన్ చేశారు. ప్లాస్టిక్ను తినేసే ఎంజైమ్ను అధిక ఉష్ణోగ్రతల్లోనూ కాపాడుతుందని అంటున్నారు. మోంటానా స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్మౌత్ పరిశోధకులు టీపీఏడీఓ అనే మరో ఎంజైమ్ను అభివృద్ధి చేశారు. జల వనరుల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించడానికి ఇది చక్కగా ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు. సీబిన్ వాక్యూమ్ క్లీనర్లు సౌరశక్తితో పనిచేసే ప్లాస్టిక్ ఇంటర్సెప్టర్లను పలు దేశాల్లో ఉపయోగిస్తున్నాయి. ఇందులో ఇంటర్సెప్టర్కు పొడవైన చేతుల్లాంటి ఉంటాయి. నీటిలోని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, కన్వేయర్ బెల్ట్ ద్వారా ఇంటర్సెప్టర్లోని బుట్టల్లోకి పంపిస్తాయి. బుట్టలు నిండిపోయిన తర్వాత ఒడ్డుకు చేరుస్తారు. ఇదే తరహాలో పనిచేసే వాటర్–వీల్ పవర్డ్ ప్లాస్టిక్ కలెక్టర్ను అమెరికాలో వాడుతున్నారు. సీబిన్ వాక్యూమ్ క్లీనర్లను 2015లో ఆస్ట్రేలియాలో రూపొందించారు. ఇవి ప్లాస్టిక్తో వ్యర్థాలతో కూడిన నీటిని యంత్రంలోకి సేకరిస్తాయి. రెండింటినీ వేరుచేసి, నీటిని మాత్రమే బయటకు పంపిస్తాయి. ప్లాస్టిక్ ముక్కలన్నీ క్లీనర్లోని సంచిలోకి చేరుకుంటాయి. ప్రపంచమంతటా ఇప్పుడు 860 సీబిన్ వాక్యూమ్ క్లీనర్లలో వాడుకలో ఉన్నాయి. తుపాన్ల దిశను గుర్తించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ అభివృద్ధి చేసిన సైక్లోన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(సీవైజీఎన్ఎన్ఎస్) సముద్రాలు, నదుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల కదలికలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుండడం గమనార్హం. ప్లాస్టిక్ ముక్కలు ఏ ప్రదేశంలో అధికంగా ఉన్నాయో తెలుసుకొని, సేకరించడానికి ఈ పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నారు. హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ పరిశోధకులు అతుక్కునే గుణం ఉన్న బయోఫిల్మ్తో కూడిన మైక్రోబ్ నెట్లను రూపొందించారు. నెట్లను నీటిలోకి జారవిడిస్తే అక్కడున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు అతుక్కుపోతాయి. పైకి లాగితే వాటితోపాటు వ్యర్థాలు వచ్చేస్తాయి. వామ్మో ప్లాస్టిక్ ... ► ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోవాలంటే వేల సంవత్సరాలు పడుతుంది. సముద్రాల్లో కోట్లాది ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. వీటి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ► నీటిలోని సూక్ష్మ ప్లాస్టిక్ను పూర్తిగా ఫిల్టర్ చేసే పరిజ్ఞానం ఇంకా అందుబాటులోకి రాలేదు. ► 2050 నాటికి సముద్రాల్లోని మొత్తం చేపల బరువు కంటే ప్లాస్టిక్ బరువే ఎక్కువగా ఉంటుందని 2016లో విడుదల చేసిన ఓ నివేదికలో నిపుణులు తేల్చిచెప్పారు. ► ప్రపంచంలో కుళాయి ద్వారా సరఫరా చేస్తున్న నీటిలో 80 శాతం నీరు ప్లాస్టిక్తో కలుషితమైందేనని 2017లో ఒక అధ్యయనంతో తేలింది. ► కుళాయి నీటిలో ప్లాస్టిక్ కాలుష్యం ముప్పు అధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా, లెబనాన్, భారత్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఫ్రాన్స్, జర్మనీ, యూకే చిట్టచివరి స్థానాల్లో ఉన్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నీటి నమూనాలను సేకరించి, పరీక్షించగా.. 83 శాతం నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ కనిపించింది. ఈ మైక్రోప్లాస్టిక్ మనిషి శరీర అంతర్భాగాల్లోకి సులభంగా చొచ్చుకెళ్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లను దూరం పెట్టడమే మంచిదని సూచిస్తున్నారు. ► సూక్ష్మ ప్లాస్టిక్లో విషపూరితమైన రసాయనాలు ఉంటాయి. ► భూగోళంపై నివసిస్తున్న అన్ని రకాల జీవులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్లాస్టిక్ను స్వీకరిస్తున్నాయి. ప్లాస్టిక్ వల్ల ప్రభావితమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మహిళా సాధికారత.. 135.6 ఏళ్లు దూరం!
ఆకాశంలోసగం.. కానీ అవకాశాల్లో మాత్రం ఎంతో దూరం.. ఇక్కడ, అక్కడ అని కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా మహిళల పరిస్థితి ఇదే. దీనిపై విస్తృతంగా అధ్యయనం చేసిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఇటీవల ‘ప్రపంచ లింగ అసమానత్వ నివేదిక (గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు)–2021’ను విడుదల చేసింది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎంతగా వెనుకబడ్డారన్న వివరాలను పొందుపర్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయని, కానీ ఈ వేగం చాలదని డబ్ల్యూఈ ఎఫ్ స్పష్టం చేసింది. ఇప్పుడున్నట్టుగానే కొనసాగితే.. మహిళలు పురుషులతో సమానంగా నిలిచేందుకు ఏకంగా 135.6 ఏళ్లు పడుతుందని పేర్కొంది. –సాక్షి, సెంట్రల్డెస్క్ 156 దేశాల్లో.. 4 అంశాలపై డబ్ల్యూఈఎఫ్ ప్రపంచవ్యాప్తంగా 156 దేశాల్లో మహిళల పరిస్థితిని పరిశీలించింది. ముఖ్యంగా నాలుగు అంశాల (ఉద్యోగ, ఉపాధి అవకాశాలు; విద్య; వైద్యం–ఆరోగ్యం; రాజకీయ సాధికారత)ను పరిగణనలోకి తీసుకుంది. వీటన్నింటినీ కలిపి ఒక శాతానికి స్కోర్ను నిర్ణయించింది. ఒకటి వస్తే మహిళల సాధికారత బాగున్నట్టు.. సున్నా స్కోర్ వస్తే మహిళల పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నట్టు లెక్కించారు. భారత్ స్థానం140 ♦మహిళా సాధికారతలో మొత్తం 156 దేశాలకుగాను భారతదేశం ♦62 స్కోర్తో 140వ స్థానంలో నిలిచినట్టు డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొంది. ♦దక్షిణాసియాలో బంగ్లాదేశ్ (65వ స్థానం), నేపాల్ (106), శ్రీలంక (16), భూటాన్ (130) మన దేశం కన్నా ముందుండగా.. పాకిస్తాన్ (153) వెనుక నిలిచింది. ♦2020 నివేదికలో మొత్తం 153 దేశాలకుగాను భారత్ 112వ స్థానంలో నిలవగా.. తర్వాతి ఏడాదికి వచ్చేసరికి ఏకంగా 140వ స్థానానికి పడిపోయింది. ప్రాంతాల వారీగా మహిళా సాధికారత తీరు(స్కోరు) ఊహించలేనంత సంపద! డబ్ల్యూఈఎఫ్ నివేదిక ప్రకారం.. పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తే ప్రపంచ ఎకానమీకి అదనంగా సమకూరే మొత్తం ఎంతో తెలుసా? ♦28 ట్రిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 22,22,66,240 కోట్లు (సులువుగా చెప్పుకోవాలంటే 22.22 కోట్ల కోట్లు అన్నమాట) -
సీఎం జగన్కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: ఇటీవల దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2022 వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని చూపిన చొరవపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం మంగళవారం కృతజ్ఞతలు తెలిపింది. ‘చరిత్రలో మలువు, ప్రభుత్వ విధానాలు, వ్యాపార వ్యూహాలు’ అనే ఇతివృత్తంపై నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్న సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా అత్యంత సవాల్గా ఉన్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక నేపథ్యాల్లో సమావేశం జరిగిందని, ప్రపంచానికి ఈ క్లిష్ట సమయాన దావోస్లో వ్యూహాత్మక సంభాషణల్లో మీ (సీఎం జగన్) సహకారం చాలా ముఖ్యమైనదని ఫోరం అధ్యక్షుడు బోర్జ్ బ్రెండే ముఖ్యమంత్రి జగన్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. వాతావరణ మార్పు వంటి సమస్యలపై సమిష్టి చర్యలను వేగవంతం చేయడానికి అంతర్జాతీయ సమాజాన్ని సమీకరించడం, శాంతి, ఆర్థిక పునరుద్ధరణను కాపాడటంపై సదస్సులో చర్చించినట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రభుత్వ, వ్యాపార, ఇతర వర్గాలకు చెందిన 2,500 మందిని ఈ సమావేశం ఒకచోట చేర్చిందన్నారు. వార్షిక సమావేశంలో బలమైన స్వరంతో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించినందుకు సీఎం జగన్కు ఫోరం ధన్యవాదాలు తెలిపింది. దావోస్లో మీ (సీఎం జగన్) అనుభవం ఫలవంతమైందని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మీ నిరంతర సహకారం కోసం ఫోరం ఎదురుచూస్తుందని తెలిపింది. గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్స్, ఫోరం మూవింగ్ ఇండియాతో అనుసంధానమైందని, గ్రీన్ మొబిలిటీకి పరివర్తనను వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ చొరవ ఎంతో దోహదపడుతుందని ఫోరం తెలిపింది. -
CM YS Jagan Davos Tour: రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశాల్లో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయి. అభివృద్ధిని, పర్యావరణ హితాన్ని సమతుల్యం చేసుకుంటూ పారిశ్రామికంగా రాష్ట్రాన్ని శక్తివంతంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం దావోస్ వేదికగా చక్కటి ఫలితాలు సాధించింది. రేపటి ప్రపంచంతో పోటీపడుతూ, సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఈ వేదికను చక్కగా వినియోగించుకుంది. విఖ్యాత సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంతో అవగాహన కుదుర్చుకున్నారు. 27,700 మెగావాట్ల క్లీన్ గ్రీన్ ఎనర్జీ నాలుగోతరం పారిశ్రామికీకరణకు ప్రధాన కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చాలన్న లక్ష్యంతో గ్రీన్ ఎనర్జీకి సంబంధించి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులపై అదానీ, గ్రీన్కో, అరబిందోలతో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం కుదుర్చుకుంది. పంప్డ్ స్టోరేజీ లాంటి వినూత్న విధానాలతో మొత్తంగా 27,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ రాష్ట్రంలోకి రాబోతోంది. గ్రీన్ కోతో కలిసి తాము ప్రపంచంలోనే తొలిసారిగా గ్రీన్ ఎనర్జీపై ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్లు, ఈ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు ప్రపంచ ప్రసిద్ధ కంపెనీ ఆర్సిలర్ మిట్టల్ ప్రకటించింది. ముఖ్యమంత్రి.. సంస్థ సీఈఓ ఆదిత్య మిట్టల్ ఈ ప్రకటన చేశారు. ఏపీలో పారిశ్రామిక విధానాలు చాలా సానుకూలంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు. స్టీల్తోపాటు, ఎనర్జీ, నిర్మాణ, మైనింగ్, రవాణా, ప్యాకేజింగ్ తదితర రంగాల్లో ఉన్న 76.571 బిలియన్ డాలర్ల ఆర్సిలర్ మిట్టల్ గ్రూపు తొలిసారిగా గ్రీన్ ఎనర్జీకి వేదికగా రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంది. కర్బన రహిత పారిశ్రామికీకరణపై దృష్టి కొత్త తరం ఇంధనాలు హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తులపైనా దావోస్లో ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిపెట్టారు. కర్బన రహిత పారిశ్రామికీకరణకు ఏపీ కేంద్రంగా నిలుస్తోందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ కితాబిచ్చారు. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకుని పారిశ్రామిక ఉత్పత్తులు దిశగా మచిలీపట్నంలో ఒక ఎస్ఈజెడ్ను తీసుకురానుండడం దావోస్ ఫలితాల్లో ఒకటి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడంతోపాటు, అత్యాధునిక పద్ధతుల్లో ఉత్పత్తులు సాధించేందుకు వీలుగా ఈ జోన్ను అభివృద్ధి చేస్తారు. పారిశ్రామిక రంగానికి డబ్ల్యూఈఎఫ్ సహకారం కాలుష్యాన్ని తగ్గించడం.. పర్యావరణ సమతుల్యతకు, నాణ్యతకు పెద్దపీట వేయడం, గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడం, టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ ప్రపంచస్థాయి ఉత్పత్తులు సాధించేలా పరిశ్రమలకు తోడుగా నిలవడానికి అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దావోస్లో అడుగులు వేసింది. దీనికి సంబంధించి డబ్ల్యూఈఎఫ్తో ఒప్పందం కూడా చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. డబ్ల్యూఈఎఫ్ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి అత్యాధునికతను, కాలుష్యంలేని విధానాలను జోడించడానికి డబ్ల్యూఈఎఫ్ తగిన సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రంలోకి కొత్తగా నాలుగు పోర్టులు వస్తున్న దృష్ట్యా పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణపైనా కూడా దావోస్ సభలో సీఎం దృష్టిపెట్టారు. దస్సాల్ట్ సిస్టమ్స్, మిట్సుయి ఓఎస్కే లైన్స్తోనూ జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి జగన్ ఇవే అంశాలపై దృష్టిపెట్టారు. సముద్ర మార్గం ద్వారా రవాణాను మూడు రెట్లు పెంచే ఉద్దేశ్యంతో ఇదివరకే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. దీనికి సంబంధించిన వివరాలను వీరి ముందు ఉంచింది. తాము త్వరలో కాకినాడలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు మిట్సుయి ఓఎస్కే లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈఓ తకీషి హషిమొటో ప్రకటించారు. సీఎం విజ్ఞప్తి మేరకు, లాజిస్టిక్ రంగాలపైనా దృష్టిపెడుతున్నామన్నారు. ప్రపంచంలోనే ఓడల ద్వారా అత్యధిక మొత్తంలో సరుకు రవాణా చేస్తున్న కంపెనీ ఇది. బైజూస్ పరిశోధన కేంద్రం ఏర్పాటు ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామని.. పరిశోధక కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని బైజూస్ ప్రకటించింది. పాఠ్యప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామని సీఎంతో జరిగిన సమావేశంలో సంస్థ సీఈఓ రవీంద్రన్ వెల్లడించారు. సమగ్ర భూ సర్వే రికార్డులను నిక్షిప్తం చేయడంలో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని కాయిన్స్విచ్ క్యూబర్ ప్రకటించింది. విశాఖకు ప్రత్యేక గుర్తింపు ఇక రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం, కార్యనిర్వాహక రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకున్న విశాఖపట్నానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ వేదికగా విశేష కృషిచేశారు. ► హైఎండ్ టెక్నాలజీకి వేదికగా ఈ నగరాన్ని తీర్చిదిద్దుతున్నామని ప్రకటించారు. ఈ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి హైఎండ్ టెక్నాలజీపై పాఠ్యప్రణాళిక రూపకల్పనలో భాగస్వామ్యానికి టెక్ మహీంద్ర అంగీకారం తెలిపింది. కంపెనీ కార్యకలాపాలను విస్తరించడంపైనా చర్చించారు. ► మేజర్ టెక్నాలజీ హబ్గా విశాఖను తీర్చిదిద్దాలని సీఎం సంకల్పంతో ఉన్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ప్రధాన కేంద్రంగా ఆయన విశాఖను తీర్చిదిద్దాలనుకుంటున్నారని టెక్ మహీంద్ర సీఈఓ గుర్నాని ముఖ్యమంత్రితో భేటీ అనంతరం వెల్లడించారు. ► ఐబీఎం చైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణతోనూ ఇవే అంశాలను సీఎం జగన్ చర్చించారు. ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న ఆవిష్కరణలకు, ఆ అంశాల్లో శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి అంశాలపై వీరితో ప్రధానంగా చర్చలు జరిగాయి. ► అలాగే, యూనికార్న్ స్టార్టప్స్కూ వేదికగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దడానికి సీఎం దావోస్ వేదికగా గట్టి ప్రయత్నాలు చేశారు. వివిధ యూనికార్న్ స్టార్టప్స్ వ్యవస్థాపకులు, సీఈఓలతో దావోస్లో సీఎం భేటీ అయ్యారు. ► ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి తమవంతు చేయూతనిస్తామని, రవాణా రంగానికి తోడుగా నిలుస్తామని ఈజ్మై ట్రిప్ వెల్లడించింది. విశాఖ వేదికగా కార్యకలాపాలపైనా ప్రణాళికలను వారు సీఎంతో పంచుకున్నారు. -
Telangana: హ్యుందాయ్ పెట్టుబడులు రూ.1,400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా తెలంగాణ గురువారం మరో భారీ పెట్టుబడి సాధించింది. రాష్ట్రంలో ఏర్పా టుచేస్తున్న మొబిలిటీ క్లస్టర్లో దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ కంపెనీ హ్యూండాయ్ రూ.1,400 కోట్ల పెట్టుబడిని పెడుతున్నట్లు ప్రక టించింది. మాస్టర్కార్డ్, జీఎంఎం ఫాడ్లర్, ఈఎం పీఈ తదితర సంస్థలూ రాష్ట్రంలో పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలపై కీలక ప్రకటనలు చేశాయి. కేటీఆర్తో హ్యుందాయ్ ప్రెసిడెంట్ భేటీ హ్యుందాయ్ ప్రెసిడెంట్ యంగ్చో చి గురువారం కేటీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలం గాణలో పెట్టుబడిపై ప్రకటన చేశారు. మొబిలిటీ క్లస్టర్లో పెట్టుబడులకే పరిమితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీ లోనూ భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది. తెలంగాణలో ఏర్పాటు చేసే యూనిట్ ద్వారా టెస్ట్ ట్రాక్లతో పాటు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తుంది. హ్యుందాయ్ రాకతో మొబిలిటీ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి పౌరసేవలే లక్ష్యంగా.. డిజిటల్ టెక్నాలజీల ద్వారా తెలంగాణ పౌరులకు ప్రపంచ స్థాయి పౌర సేవలు అందించేందుకు అమెరికాకు చెందిన ‘మాస్టర్ కార్డ్’తో రాష్ట్ర ప్రభుత్వం గురువారం పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులతో పాటు ఇతర పౌర సేవా రంగాల్లో ఈ ఒప్పందం కీలకమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పౌర సేవలు, చిన్న తరహా వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యకలాపాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను తమ ఎంవోయూ వేగవంతం చేస్తుందని మాస్టర్ కార్డ్ వైస్ చైర్మన్ మైఖేల్ ఫ్రొమన్ వెల్లడించారు. ఈఎంపీఈ డయోగ్నొస్టిక్స్ యూనిట్ క్షయ వ్యాధి డయోగ్నొస్టిక్ కిట్ల అంతర్జాతీయ తయారీ యూనిట్ను హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నట్లు స్వీడన్కు చెందిన ‘ఈఎంపీఈ డయోగ్నొస్టిక్స్’ ప్రకటించింది. రూ.25 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ యూనిట్లో నెలకు 20 లక్షల కిట్లను తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తారు. తర్వాతి దశలో రూ.50 కోట్ల పెట్టుబడి పెడతామని సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓ పవన్ అసలాపురం చెప్పారు. హైదరాబాద్లో జీఎంఎం ఫాడ్లర్ విస్తరణ ఫార్మా కంపెనీలకు అవసరమైన గ్లాస్ రియాక్టర్, ట్యాంక్, కాలమ్లను తయారు చేసే జీఎంఎం ఫాడ్లర్ హైదరాబాద్లో తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. సంస్థ ఇంటర్నేషనల్ బిజినెస్ సీఈఓ థామస్ కెహ్ల్, డబ్ల్యూఈఎఫ్ డైరెక్టర్ అశోక్ జె పటేల్ గురువారం కేటీఆర్తో భేటీ అయ్యారు. రెండేళ్ల క్రితం రూ.48 కోట్లకు పైగా పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన జీఎంఎం ఫాడ్లర్ అదనంగా మరో రూ.28 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు ఈ సందర్భంగా వారు ప్రకటించారు. ఈ పెట్టుబడి ద్వారా సంస్థలో ఉద్యోగుల సంఖ్య 300కు చేరుకుంటుంది. కాగా హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టులోనూ భాగస్వామిగా ఉండేందుకు సంస్థ ఆసక్తి చూపింది. -
దావోస్ పర్యటనలో నాలుగో రోజు సీఎం జగన్ (ఫొటోలు)
-
అంతర్జాతీయ పర్యాటక సూచిలో...భారత్ డౌన్
దావోస్: ప్రపంచ దేశాలకు ప్రయాణాలు, అంతర్జాతీయ పర్యాటక అభివృద్ధి సూచీలో భారత్ 54వ స్థానంలో నిలిచింది. 2019లో 46 స్థానాన్ని దక్కించుకున్న మన దేశం ఎనిమిది స్థానాలు తగ్గిపోయి 54వ స్థానానికి పడిపోయింది. అయినప్పటికీ దక్షిణాసియాలో టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. పర్యాటక రంగంలో ప్రపంచ దేశాల్లో జపాన్ మొదటి స్థానంలో నిలిస్తే, ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, యూకే, సింగపూర్, ఇటలీలు నిలిచాయి. ప్రయాణాలు, పర్యాటకం అనే అంశంలో రెండేళ్లకు ఒకసారి అధ్యయనం చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నివేదిక విడుదల చేస్తూ ఉంటుంది. గత రెండేళ్లు కరోనాతో విలవిలలాడిపోయిన ప్రపంచ దేశాల్లో ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం గాడిన పడుతోందని, అయినా ఇంకా ఎన్నో సవాళ్లు మిగిలే ఉన్నాయని ఆ నివేదిక వెల్లడించింది. మొత్తం 117 దేశాల్లో పర్యాటక రంగ పురోగతిని సమీక్షించి ఈ నివేదిక రూపొందించారు. అమెరికా మినహా టాప్–10 జాబితాలో నిలిచినవన్నీ యూరప్, ఆసియా ఫసిఫిక్ ప్రాంతానికి దేశాలే కావడం గమనార్హం. కరోనా సంక్షోభానికి ముందున్న పరిస్థితులు ఇంకా రానప్పటికీ అన్ని దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరడం వల్ల ప్రజలు ధైర్యంగా ప్రయాణాలు చేయగలుగుతున్నారని, ప్రకృతి అందాలున్న దేశాల్లో పర్యటకానికి అధిక డిమాండ్ ఏర్పడిందని ఈ నివేదిక పేర్కొంది. -
దావోస్ పర్యటనలో మూడోరోజు సీఎం జగన్ (ఫొటోలు)
-
దావోస్ WEF సదస్సులో ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పీచ్
-
వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ఏమిటి..?
-
నా సోదరుడితో గొప్ప సమావేశం జరిగింది: సీఎం జగన్తో కేటీఆర్
హైదరాబాద్: విదేశీ గడ్డపై అరుదైన కలయిక జరిగింది. దావోస్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్గారితో గొప్ప సమావేశం జరిగింది అంటూ మంత్రి కేటీఆర్ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. వీళ్లిద్దరూ ఎంతసేపు భేటీ అయ్యారు, ఏయే అంశాలపై చర్చించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ వరుసగా సమావేశం అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఇంకోవైపు మంత్రి కేటీఆర్ కూడా తెలంగాణ పెట్టుబడుల ఆహ్వాన విషయంలో దూసుకుపోతున్నారు. Had a great meeting with my brother AP CM @ysjagan Garu pic.twitter.com/I32iSJj05k — KTR (@KTRTRS) May 23, 2022 -
30 గంటలకు ఒక కొత్త బిలియనీర్
దావోస్: కరోనా వైరస్ మహమ్మారి వెలుగు చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అసమానతలు పెరిగిపోయినట్టు ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ తెలిపింది. కరోనా కాలంలో ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్ (బిలియన్ డాలర్లు అంతకుమించి సంపద కలిగినవారు) కొత్తగా పుట్టుకువచ్చినట్టు చెప్పింది. ఈ ఏడాది ప్రతి 33 గంటలకు సుమారు పది లక్షల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని ఈ సంస్థ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం సందర్భంగా దావోస్లో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికకు ‘ప్రాఫిటింగ్ ఫ్రమ్ పెయిన్’ (బాధ నుంచి లాభం/కరోనా కాలంలో పేదల కష్టాల నుంచి లాభాలు పొందడం) అని పేరు పెట్టింది. పెరిగిన ధరలతో బిలియనీర్లకు పంట దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయినట్టు తెలిపింది. దీంతో ఆహారం, ఇంధన రంగాల్లోని బిలియనీర్లు తమ సంపదను ప్రతి రెండు రోజులకు బిలియన్ డాలర్లు (రూ.7,700 కోట్లు) చొప్పున పెంచుకున్నట్టు వివరించింది. 573 మంది కొత్త బిలియనీర్లు కరోనా విపత్తు సమయంలో (రెండేళ్ల కాలంలో) కొత్తగా 573 మంది బిలీయనీర్లు పుట్టుకొచ్చినట్టు ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించింది. దీన్ని ప్రతి 30 గంటలకు ఒక బిలీయనీర్ ఏర్పడినట్టు తెలిపింది. 26 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి ఈ ఏడాది 26.3 కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని అంచనా వేస్తున్నట్టు ఆక్స్ఫామ్ ప్రకటించింది. ప్రతి 33 గంటలకు పది లక్షల మంది పేదరికంలోకి వెళ్తారని వివరించింది. 23 ఏళ్ల కంటే రెండేళ్లలో ఎక్కువ కరోనాకు ముందు 23 ఏళ్లలో ఏర్పడిన సంపద కంటే కరోనా వచ్చిన రెండేళ్లలో బిలియనీర్ల సంపద ఎక్కువ పెరిగినట్టు ఆక్స్ఫామ్ నివేదిక తెలిపింది. ‘‘ఇప్పుడు ప్రపంచంలోని బిలియనీర్ల సంపద విలువ ప్రపంచ జీడీపీలో 13.9 శాతానికి సమానం. 2000లో ప్రపంచ జీడీపీలో బిలియనీర్ల సంపద 4.4 శాతమే’’అంటూ ప్రపంచంలోని అసమానతలను ఆక్స్ఫామ్ తన నివేదికలో ఎత్తి చూపింది. ‘‘కార్మికులు తక్కువ వేతనానికే, దారుణమైన పరిస్థితుల మధ్య ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. అధిక సంపద పరులు వ్యవస్థను దశాబ్దాలుగా రిగ్గింగ్ చేశారు. వారు ఇప్పుడు ఆ ఫలాలను పొందుతున్నారు. ప్రైవేటీకరణ, గుత్తాధిపత్యం తదితర విధానాల మద్దతుతో ప్రపంచ సంపదలో షాక్కు గురిచేసే మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు’’అని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ ఈడీ గ్యాబ్రియెల్ బుచెర్ అన్నారు. ఆకలి కేకలు.. ‘‘మరోవైపు లక్షలాది మంది పస్తులు ఉండాల్సిన పరిస్థితి. మనుగడ కోసం వారు తదుపరి ఏం చేస్తారన్నది చూడాలి. తూర్పు ఆఫ్రికా వ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒక వ్యక్తి ఆకలితో చనిపోతున్నారు. ఈ స్థాయి అసమానతలు మానవత్వంతో మనుషులు కలిసి ఉండడాన్ని విచ్ఛిన్నం చేస్తోంది. ఈ ప్రమాదకరమైన అసమానతలను అంతం చేయాలి’’అని బుచెర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఐదు అతిపెద్ద ఇంధన సంస్థలైన బీపీ, షెల్, టోటల్ ఎనర్జీ, ఎక్సాన్, చెవ్రాన్ కలసి ప్రతి సెకనుకు 2,600 డాలర్ల లాభాన్ని పొందాయని ఆక్స్ఫామ్ నివేదిక తెలిపింది. రికార్డు స్థాయి ఆహార ధరలతో శ్రీలంక నుంచి సూడాన్ వరకు సామాజికంగా అశాంతిని చూస్తున్నాయని.. 60% తక్కువ ఆదాయం కలిగిన దేశాలు రుణ సంక్షోభంలో ఉన్నాయని తెలిపింది. సంపన్నుల ఐశ్వర్యం ‘‘2,668 బిలియనీర్ల వద్ద 12.7 లక్షల కోట్ల డాలర్ల సంపద ఉంది. ప్రపంచంలో అట్టడుగున ఉన్న 301 కోట్ల ప్రజల (40 శాతం) ఉమ్మడి సంపద కంటే టాప్ 10 ప్రపంచ బిలియనీర్ల వద్దే ఎక్కువ ఉంది. సమాజంలో దిగువ స్థాయిలో ఉన్న వ్యక్తి 112 ఏళ్లు కష్టపడితే కానీ.. అగ్రస్థానంలో ఒక వ్యక్తి ఏడాది సంపాదనకు సరిపడా సమకూర్చుకోలేని పరిస్థితి నెలకొంది’’అని ఆక్స్ఫామ్ నివేదిక తెలిపింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాలు ఈ నెల 22న దావోస్లో ప్రారంభం కాగా, 26న ముగియనున్నాయి. -
దావోస్లో ఏపీ ధగధగ
సాక్షి, అమరావతి: దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా రెండో రోజైన సోమవారం పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. విద్యారంగంలో ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్కు చెందిన సాఫ్ట్వేర్ సంస్థ దస్సాల్ట్ సిస్టమ్స్ ప్రకటించింది. విశాఖను హైఎండ్ టెక్నాలజీ హబ్గా మార్చేలా సహకారం అందించేందుకు టెక్ మహీంద్రా ముందుకొచ్చింది. జపాన్కు చెందిన ప్రముఖ లాజిస్టిక్ కంపెనీ మిట్సుయి కాకినాడలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు సంసిద్ధత తెలిపింది. స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హై ఎండ్ టెక్నాలజీ హబ్గా విశాఖ విశాఖను హైఎండ్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలో భాగస్వామి కానున్నట్లు టెక్ మహీంద్రా ప్రకటించింది. దావోస్లోని ఏపీ పెవిలియన్లో టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమై నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులు లాంటి అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ యూనివర్సిటీతోపాటు 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, 175 స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరిస్తూ వీటిని ఐటీ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించాలని కోరారు. విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేలా ఇంటర్న్షిప్, అప్రెంటిషిప్ కార్యకలాపాల్లో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై గుర్నానీ స్పందిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీ లాంటి అత్యాధునిక పరిజ్ఞానంలో ఆంధ్రప్రదేశ్తో కలసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. యువత నైపుణ్యాలకు పదును పెట్టేందుకు హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో యూనివర్సిటీతో కలసి ప్రత్యేకంగా పాఠ్యప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు. దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్తో ముఖ్యమంత్రి రూ.250 కోట్లతో అసాగో ఇథనాల్ ప్లాంట్ మహీంద్రా గ్రూపు అనుబంధ కంపెనీ అసాగో ఇండస్ట్రీస్ రాష్ట్రంలో రూ.250 కోట్లతో ఇథనాల్ తయారీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనను సీఎం దృష్టికి తెచ్చింది. ఇథనాల్ యూనిట్ ఏర్పాటుకు అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. విద్యారంగంలో ‘దస్సాల్’ పెట్టుబడులు విద్య, నైపుణ్యాభివృద్ధి లాంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్కు చెందిన సాఫ్ట్వేర్ సంస్థ దస్సాల్ట్ సిస్టమ్స్ ప్రకటించింది. దావోస్లో దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు పోర్టులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సహకారం అందించాలని సీఎం కోరారు. టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో సమావేశమైన సీఎం వైఎస్ జగన్ ఏపీలో నైపుణ్యాభివృద్ధి అవకాశాలను మెరుగుపరచడంపై ప్రధానంగా చర్చించినట్లు అనంతరం ఫ్లోరెన్స్ వెర్జలెన్ తెలిపారు. ఏపీతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నామని, విద్యారంగంలో పెట్టుబడులు పెట్టడానికి దస్సాల్ సిస్టమ్స్ ఆసక్తిగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. కొత్త తరహా ఇంధనాలపై కూడా చర్చించామని, త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనున్నట్లు ఫ్లోరెన్స్ తెలిపారు. కాకినాడకు జపాన్ లాజిస్టిక్ దిగ్గజం సుదీర్ఘ తీర ప్రాంతం కలిగి ఉండటంతో పాటు ఏపీలో కొత్తగా నిర్మించే నాలుగు పోర్టుల ద్వారా లభించే లాజిస్టిక్ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై జపాన్కు చెందిన లాజిస్టిక్ కంపెనీ మిట్సుయి ఓ ఎస్కే లైన్స్ ఆసక్తి వ్యక్తం చేసింది. మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 4 గ్రీన్ఫీల్డ్ పోర్టులతో సరుకు రవాణాను ఏటా 507 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, దీనికి సంబంధించి కంటైనర్ హబ్, లాజిస్టిక్ రంగాలపై దృష్టి సారించాలని సీఎం కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హషిమొటో కాకినాడలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్ ఈవీ వాహనాలపై ‘హీరో’తో చర్చలు రాష్ట్రంలో వ్యాపార విస్తరణ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ అంశాలపై హీరో గ్రూపు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజల్తో సీఎం జగన్ చర్చించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన హీరో గ్రూపు అథెర్ ఎనర్జీలో ఇప్పటికే 36 శాతం వాటాను కొనుగోలు చేయడమే కాకుండా తైవాన్కు చెందిన బ్యాటరీ టెక్నాలజీ గగొరోలో భాగస్వామిగా చేరింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, హీరో గ్రూప్ విస్తరణ అవకాశాలపై చర్చలు జరిగాయి. సీఎం జగన్తో స్విట్జర్లాండ్లో భారత రాయబారి సంజయ్ భట్టాచార్య తదితరులు విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్లో భాగంగా పరిశ్రమలకు నీటి వనరులను సమకూర్చడంలో భాగంగా తిరుపతి సమీపంలో ఉన్న హీరో కంపెనీకి కండలేరు నుంచి నీటిని ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. అంతకుముందు భారత సంతతికి చెందిన స్విస్ ఎంపీ నిక్లాజ్ శామ్యూల్ గుగెర్తో కూడిన స్విస్ పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో సీఎం జగన్ సమావేశమై ఏపీలో వ్యాపార అవకాశాలపై చర్చించారు. భారత రాయబారి సంజయ్ భట్టాచార్య కూడా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు. -
Davos: ఆర్థిక విచ్ఛిన్నంతో విపరిణామాలు
దావోస్: ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంతో మరింత విపరిణామాలు చూడాల్సి వస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఆర్థికవేత్తలు హెచ్చరించారు. డబ్ల్యూఈఎఫ్ వేదికగా వీరు నివేదికను విడుదల చేశారు. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలు ఎక్కువగా ఉండడం, యూరోప్, లాటిన్ అమెరికాలో వాస్తవ వేతనాలు తగ్గిపోవడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ఇటీవలి కాలంలో ప్రపంచం అతిపెద్ద ఆహార సంక్షోభాన్ని (భద్రతలేమి) ఎదుర్కొంటోందని, ముఖ్యంగా ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలో ఈ పరిస్థితులు నెలకొన్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక కార్యకలాపాల వేగం తగ్గడం, అధిక ద్రవ్యోల్బణం, తక్కువ వేతనాలు, అతిపెద్ద ఆహార అభద్రత అన్నవి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ విచ్చిన్నం కారణంగా తలెత్తే విపరిణామాలని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీకి సంబంధించి గత అంచనాలను తగ్గించేసింది. అమెరికా, చైనా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా, పసిఫిక్, తూర్పు ఆసియా, మధ్యప్రాచర్యం, ఉత్తర ఆఫ్రికాలో మోస్తరు ఆర్థిక వృద్ధి ఉండొచ్చని పేర్కొంది. -
దావోస్ పర్యటనలో రెండోరోజు సీఎం జగన్ (ఫొటోలు)
-
వరల్డ్ ఎకనామిక్ ఫోరం: ప్రముఖులతో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకి హాజరయ్యారు. ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు సీఎం జగన్తో పాటు మంత్రులు దావోస్ సదస్సుకు వెళ్లారు. అందులో భాగంగా సమావేశం తొలిరోజు సీఎం జగన్.. డబ్ల్యూఈఎఫ్(WEF) హెల్త్ విభాగాధిపతి శ్యాం బిషేన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. ఆయనతో ఆరోగ్య రంగంపై చర్చించారు. అనంతరం, డబ్ల్యూఈఎఫ్ మొబిలిటీ, సస్టైనబిలిటీ విభాగాధిపతి పెట్రో గొమేజ్తో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో డబ్ల్యూఈఎఫ్లో ప్లాట్ఫాం పార్టనర్షిప్పై ఒప్పందం చేసుకున్నారు. సదస్సులో భాగంగానే బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హాన్స్ పాల్ బక్నర్తో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా.. సీఎం జగన్ను మహారాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ఆదిత్య ఠాక్రే మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం, సీఎం జగన్తో అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతం అదానీ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్తో సమావేశమయ్యారు. అదే సమయంలో దావోస్లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం జ్యోతిప్రజ్వాలన చేశారు. ఏపి పెవిలియన్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఇది కూడా చదవండి: వరల్డ్ ఎకనామిక్ ఫోరం: ఏపీ పెవిలియన్ ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దావోస్ పర్యటనలో తొలిరోజు సీఎం జగన్ (ఫొటోలు)
-
6 అంశాల్లో సహకారంపై WEF - రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం
-
డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్తో సమావేశమైన సీఎం జగన్
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకి హాజరైన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్తో సమావేశమయ్యారు. ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు సీఎం జగన్తో పాటు మంత్రులు దావోస్ సదస్సుకు వెళ్లారు. 2022 మే 22 నుంచి 26 వరకు ఈ సదస్సు జరగనుంది. అందులో భాగంగా సమావేశం తొలిరోజు డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్తో సీఎం జగన్ చర్చలు జరిపారు. పారిశ్రామిక రంగానికి ఏపీలో ఉన్న సానుకూల అంశాలను సవివరంగా సీఎం జగన్ తెలిపారు. ఏపీ పెవిలియన్ ప్రారంభం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా దావోస్లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం జ్యోతిప్రజ్వాలన చేశారు. ఏపి పెవిలియన్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఆ తర్వాత సీఎం జగన్ నేతృత్వంలో మంత్రులు, ఎంపీలు సమావేశాలకు బయల్దేరి వెళ్లారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి👉దావోస్లో సీఎం జగన్కు ఘన స్వాగతం -
దావోస్ పర్యటనకు సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(శుక్రవారం) దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఈనెల 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. రెండేళ్ల కోవిడ్ విపత్తు తర్వాత వరల్డ్ఎకనామిక్ ఫోరం సదస్సు ప్రత్యక్షంగా సమావేశం కానుంది. మే 22నుంచి 26వరకూ జరగనున్న ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పాటు మంత్రులు, అధికారుల బృందం పాల్గొనున్నారు. కోవిడ్ లాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని దావోస్ వేదికగా వినిపించనుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లకు పరిష్కారం కోసం ఈవేదిక ద్వారా ఏపీ భాగస్వామ్యం కానుంది. నాలుగో పారిశ్రామిక విప్లవం (ఇండస్ట్రియలైజేషన్ 4.0)దిశగా వేయాల్సిన అడుగులపై దావోస్ వేదికగా సీఎం జగన్ కీలక చర్చలు కూడా జరపనున్నారు. ఇందులో భాగంగా పెట్టుబడులకు ఉన్న అవకాశాలనుకూడా ఈ సదస్సులో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఇది కూడా చదవండి: ఏపీలో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభం -
లండన్కు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రత్యేకతలను వివరించడం లక్ష్యంగా దావోస్లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం (ప్రపంచ ఆర్థిక వేదిక) సదస్సులో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ మంగళవారం బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట ఐటీ, పరిశ్రమల శాఖ అధికారుల బృందం వెళ్లింది. బుధవారం ఉదయం లండన్కు కేటీఆర్ చేరుకోనున్నారు. 4 రోజులు అక్కడే ఉంటారు. ఈ నెల 18 నుంచి 21 వరకు యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్, తెలంగాణ ప్రభు త్వం భాగస్వామ్యంతో జరిగే వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమోటివ్ పరిశ్రమల దిగ్గజ సంస్థలతో భేటీ అవుతారు. ప్రముఖ కంపెనీల సీఈవోలతో భేటీ ఆ తర్వాత వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనేందుకు కేటీఆర్ బయలుదేరి వెళ్తారు. ఈ నెల 22 నుంచి 26 వరకు సదస్సులో పాల్గొంటారు. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రముఖ కంపెనీల సీఈవోలు, యాజమాన్యాలతో భేటీ అవుతారు. సీఈవో స్థాయి సమావేశాలు, చర్చాగోష్టులు, ప్రాజెక్టులు, వర్క్ షాప్ల్లో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 35 మంది ప్రముఖులతో వ్యక్తిగతంగా భేటీ అవుతారు. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా సమావేశాలు ఉంటాయని ఆయన వెంట వెళ్లిన అధికారులు తెలిపారు. భారత్ నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 2వేల మంది ప్రతినిధులు దావోస్ సదస్సులో పాల్గొనను న్నారు. సదస్సు తర్వాత ఈ నెల 27న కేటీఆర్ రాష్ట్రానికి చేరుకుంటారు. -
దావోస్ సదస్సుకు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హాజరవుతారు. ఈ నెల 22 నుంచి 26 వరకు సదస్సు జరగనుండగా, కేటీఆర్ ఈ నెల 17న బయల్దేరి వెళ్తారు. సదస్సు ముగిసిన తర్వాత ఈ నెల 27న తిరిగి హైదరాబాద్కు కేటీఆర్ చేరుకుంటారు. ఈ ఏడాది జనవరిలోనే సదస్సు జరగాల్సి ఉన్నా కోవిడ్ మూలంగా వాయిదా పడింది. -
డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సుకు వైఎస్ జగన్!
న్యూఢిల్లీ/దావోస్: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్వార్షిక సదస్సు మే 22 నుంచి 26 దాకా స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగనుంది. పలు దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు హాజరవుతారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు సీనియర్ కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్, కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే తదితరులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
రేట్లు రయ్ రయ్..దేశంలో కనుమరుగు కానున్న శిలాజ ఇంధనాల వినియోగం!
న్యూఢిల్లీ: పెరుగుతున్న ఇంధన ధరల వల్ల తమ వ్యయ శక్తి గణనీయంగా పడిపోతోందని ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ వినియోగదారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాంప్రదాయ (శిలాజ) ఇంధన వనరుల వినియోగం నుంచి తమ దేశాలు వేగంగా వైదొలగడమే మంచిదని కోరుకుంటున్నారు. ఈ మేరకు డిమాండ్ చేస్తున్న ప్రధాన దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్–ఇప్సోస్ మొత్తం 30 దేశాల్లో 22,534 మంది అభిప్రాయాలను స్వీకరించి ఈ నివేదిక విడుదల చేసింది. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4 మధ్య జరిగిన సర్వేలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ప్రతి పది మందిలో సగటున ఎనిమిది మంది వచ్చే ఐదేళ్లలో తమ దేశం శిలాజ ఇంధనాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. భారత్ దేశానికి సంబంధించి సర్వేలో పాల్గొన్న వారి విషయంలో ఈ నిష్పత్తి దాదాపు 90 శాతం కంటే ఎక్కువగా ఉంది. ► 84 శాతం మంది తమ స్వంత దేశం స్థిరమైన ఇంధన వనరులకు మారాలని సూచించారు. ► ధరల పెరుగుదలకు తమ ప్రభుత్వాల వాతావరణ విధానాలే కారణమని 13 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► రోజువారీ ఖర్చుల్లో ఏ విభాగం కొనుగోలు శక్తిని భారీగా దెబ్బతీస్తోందన్న అంశంపై సర్వే దృష్టి సారించింది. ఇంధనం, రవాణా, ఎయిర్ కండీషనింగ్, వంట, విద్యుత్ ఉపకరణాల వినియోగం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. సగటున 30 దేశాలలో సగానికి పైగా వినియోగదారులు (55 శాతం) ఇంధన ధరల పెరుగుదల వల్లే తమ కొనుగోలు శక్తి గణనీయంగా ప్రభావితమవుతోందని తెలిపారు. అయితే దేశాల వారీగా ఈ శాతం విభిన్నంగా ఉంది. దక్షిణాఫ్రికా విషయంలో ఈ రేటు 77 శాతం ఉంటే, జపాన్, టర్కీ విషయంలో 69 శాతంగా ఉంది. స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్లో ఈ శాతం తక్కువ స్థాయి లో 37 శాతంగా ఉంది. భారత్కు సంబంధించి 63 శాతంగా నమోదయ్యింది. భారత్ రెస్పాండెంట్లలో 63 శాతం మంది తాము ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. ► ఇంధన ధరల పెరుగుదలకు కారణాలు కూడా విభిన్నంగా ఉండడం గమనార్హం. ► చమురు, గ్యాస్ మార్కెట్లలో అస్థిరత దీనికి కారణమని 28 శాతం మంది అభిప్రాయపడితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణాన్ని 25 శాతం మంది పేర్కొన్నారు. మరో 18 శాతం మంది పెరిగిన డిమాండ్, సరఫరాల సమస్య కారణమని పేర్కొన్నారు. 16 శాతం మంది తమకు ఖచ్చితంగా తెలియదని చెప్పారు. 13 శాతం మంది మాత్రమే తమ ప్రభుత్వాల వాతావరణ మార్పు విధానాలను నిందించారు. దేశాల వారీగా సర్వేలో పాల్గొన్న వారిలో ఈ శాతాన్ని పరిశీలిస్తే భారత్ 24 శాతంలో ఉండగా, జర్మనీ, పోలాండ్లలో వరుసగా 20 శాతం, 19 శాతాలుగా నమోదయ్యాయి. ► ప్రభుత్వాలు అనుసరిస్తున్న వాతావరణ విధానాలే ఇంధన ధరల పెరుగుదలకు కారణమని ఏ దేశంలోనూ మెజారీటీ రెస్పాండెంట్లు పేర్కొనలేదు. భారత దేశంలో సర్వేలో పాల్గొన్నవారు ఇంధన ధరల పెరుగుదలకు ప్రధాన కారణం చమురు, గ్యాస్ మార్కెట్ అస్థిరత, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లేనని అభిప్రాయపడ్డారు. తరు వాతి స్థానంలో సరఫరాలు తగినంతగా లేకపోవడం, ప్రభుత్వాలు అనుసరిస్తునన వాతావరణ మార్పు విధానాలు దీనికి కారణంగా ఉన్నాయి. ► రాబోయే ఐదేళ్లలో శిలాజ ఇంధనాల నుండి మరింత వాతావరణ అనుకూలమైన–స్థిరమైన ఇంధన వనరులకు దేశాలు మారడం ఎంత ముఖ్యమన్న విషయంపై ప్రధాన ప్రశ్నను సంధించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సర్వే లో పాల్గొన్న వారిలో 84 శాతం మంది (సగటున ఐదుగురిలో నలుగురి కంటే ఎక్కువ మంది) ఇది తమకు ఎంతో కీలకమని చెప్పారు. ఈ విషయంలో రష్యాలో అతి తక్కువగా 72 శాతంతో ఉంది. అమెరికాలో ఈ రేటు 75 శాతం ఉండగా, భారత్ విషయంలో 89 శాతం. దక్షిణాఫ్రికా, పెరూలో 93 శాతం మంది దీనికి అనుకూలంగా వోటు వేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలు ప్రధానంగా ఈ డిమాండ్ చేస్తున్నారు. ► శిలాజ ఇంధనాల నుంచి దూరంగా జరగాలని భావిస్తున్న వారిలో పురుషుల కంటే (81%) మహిళలు (87%) అధికంగా ఉన్నారు. -
మేకపాటి మృతి పట్ల వరల్డ్ ఎకనామిక్ ఫోరం దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాలమరణం పట్ల వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో పా టు పలు విదేశీ సంస్థలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ మధ్యనే ఢిల్లీలో మేకపాటితో కలిసి చర్చలు జరిపామని, ఇంతలోనే ఇటువంటి వార్త దిగ్భాంత్రికి గురిచేసిందంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన సంతాప సందేశంలో పేర్కొంది. వారం రోజుల క్రితమే రాష్ట్రంలో పెట్టుబడుల గురించి ఆయన సమక్షంలో ఒప్పందం చేసుకున్నామని, ఆయన మరణించినా రాష్ట్రంలో పెట్టుబడుల సంబంధాన్ని కొనసాగించడం ద్వారా ఆయ న ఆత్మకు శాంతిని చేకూరుస్తామని రీజెన్సీ గ్రూపు చైర్మన్ ఎస్బీ హాము హజీ పేర్కొన్నారు. చదవండి: (ఏపీ కేబినెట్ భేటీ మార్చి 7కి వాయిదా) దుబాయ్ పర్యటనలో మంత్రిగా మేకపాటి నిబద్ధత, నిరాడంబరత మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుందని, వారం రోజు ల్లోనే ఇలాంటి వార్త హృదయాలను కలచివేసిందని షరాఫ్ గ్రూపు వైస్ చైర్మన్ షరాబుద్ధీన్ షరాఫ్ పేర్కొన్నారు. జీ42 గ్రూపు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా దుబాయ్ చాప్టర్ మేకపాటి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశాయి. -
భారత్ నుంచి రికార్డు స్థాయిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు..: మోదీ
న్యూఢిల్లీ: వచ్చే పాతికేళ్లలో స్వచ్ఛమైన, పర్యావరణ హితమైన, స్థిరమైన వృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనపై శ్రద్ధ పెడుతున్నామని, అందువల్ల భారత్లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణమని ప్రధాని నరేంద్ర మోదీ ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ దావోస్ అజెండా 2022 సదస్సునుద్దేశించి ‘ప్రపంచ స్థితిగతులు (స్టేట్ ఆఫ్ ద వరల్డ్)’ అనే అంశంపై ఆయన సోమవారం ప్రసంగించారు. ఆర్థిక సంస్కరణలు, వ్యాపారనుకూల వాతావరణ రూపకల్పనకు భారత్ కట్టుబడి ఉందన్నారు. వ్యాపారంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం పలు సంస్కరణలు తెచ్చిందన్నారు. ఇందులో భాగంగా అనేక రంగాల్లో నిబంధనల సడలింపు, వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు మార్గం సుగమం చేయడం వంటివి చేపట్టామన్నారు. ఒకప్పుడు భారత్లో లైసెన్స్ రాజ్ నడిచేదని, కానీ తాము కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించి వ్యాపారానికి ఉత్తేజాన్నిచ్చామని అన్నారు. పప్రంచం ఎదుర్కొంటున్న క్రిప్టో కరెన్సీ లాంటి నూతన సవాళ్లకు అన్ని దేశాలు కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ద్రవ్యోల్బణం, వాతావరణ మార్పు, సరఫరా వ్యవస్థల్లో (సప్లై ఛైన్స్) ఆటంకాల్లాంటివి ఆర్థికవ్యవస్థలకు సమస్యలుగా అభివర్ణించారు. నవ భారత్ రికార్డులు ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ భారత్లో ఉందని, ఒక్క డిసెంబర్లోనే భారత్లో యూపీఐ ద్వారా 440 కోట్ల లావాదేవీలు జరిగాయని, భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఫార్మా ఉత్పత్తిదారని మోదీ గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంపై భారత్కు ఎనలేని నమ్మకమన్నారు. దేశంలో పలు భాషలు, భిన్నసంస్కృతులున్నా అంతా కలిసి మానవాభివృద్ధికి కృషి చేస్తాయని చెప్పారు. దేశంలో సుమారు 50 లక్షల మంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉన్నారని, ప్రపంచంలోని పలుదేశాల్లో భారతీయ నిపుణులు సేవలనందిస్తున్నారని తెలిపారు. భారత్ ప్రపంచంలో మూడో అత్యధిక యూనికార్న్స్ (100 కోట్ల డాలర్ల విలువైన స్టార్టప్ కంపెనీ) ఉన్న దేశమని, గత ఆరునెలల్లోనే 10వేలకు పైగా కొత్త స్టార్టప్స్ రిజిస్టరయ్యాయని మోదీ తెలిపారు. భారత యువత వ్యవస్థాపక స్ఫూర్తితో పాటు సరికొత్త ఆవిష్కరణలు చేయడంలో, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉందన్నారు. -
17 నుంచి డబ్ల్యూఈఎఫ్ వర్చువల్ సదస్సు
న్యూఢిల్లీ: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఐదు రోజుల వర్చువల్ సమావేశం 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలిరోజే ప్రధాని నరేంద్రమోదీ సదస్సును ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ వృద్ధి వంటి అంశాలపై ప్రపంచవ్యాప్త దేశాల నాయకులు ప్రసంగించనున్నారు. సమావేశం డిజిటల్గా జరగడం ఇది వరుసగా రెండవసారి. కోవిడ్–19, సాంకేతిక సహకారం, అంతర్జాతాయ సామాజిక సహకారం, వ్యాక్సిన్ విస్తృతి, ఇంధన బదలాయింపు, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ వాణిజ్యంలో విశ్వాసాన్ని పాదుగొల్పడం, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల అవుట్లుక్, భవిష్యత్ సవాళ్లకు సంసిద్ధత వంటి అంశాలు ఐదు రోజుల సమావేశ అజెండాలో ప్రధాన అంశాలు కానున్నాయి. భౌతిక సమావేశం వేసవికి వాయిదా... కొత్త సంవత్సరం జనవరి 17 నుంచి 21వ తేదీ వరకూ ఐదు రోజులు జరగాల్సిన దావోస్ 2022 వార్షిక భౌతిక సమావేశాన్ని వేసవి కాలానికి వాయిదా వేస్తున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఇప్పటికే తెలిపింది. స్విట్జర్లాండ్ దావోస్లోని స్విస్ ఆల్పైన్ స్కీ రిసార్ట్ లో జరగాల్సిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికవేత్తలు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు స్వయంగా పాల్గొనాల్సి ఉంది. వీరితోపాటు పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ధ్యేయంగా వివిధ దేశాల నాయకులు సమావేశంలో భాగస్వాములు అవుతారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభించడానికి ముందు వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2020 జనవరిలో దావోస్ సదస్సు నిర్వహించింది. అటు తర్వాత సమావేశం వాయిదా పడ్డం ఇది వరుసగా రెండవసారి. పెట్టుబడులకు సంబంధించి పరస్పర సహకారం కోసం ఉద్దేశించి జెనీవా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సంస్థ– వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తొలుత 2021 వార్షిక సమావేశాన్ని దావోస్ కాకుండా స్విట్జర్లాండ్లోని మరొక ప్రదేశానికి మార్చాలని నిర్ణయించింది. అటు తర్వాత సింగపూర్కు మార్చాలని భావించింది. చివరకు దానినీ రద్దు చేసింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో 2022 భౌతిక సమావేశం కూడా వాయిదా పడ్డం గమనార్హం. -
ఒక్క నిమిషానికి ఇంటర్నెట్లో జరిగే విధ్వంసం గురించి తెలుసా?
ఇంటర్నెట్ ఒక గ్లోబల్ కంప్యూటర్ నెట్వర్క్. ఈ భూమ్మీద అతిపెద్ద కమ్యూనికేషన్ వ్యవస్థ. యూజర్లకు వివిధ రకాల సమాచారంతో పాటు పరస్పర సంభాషణల కోసం సౌకర్యాలు అందిస్తున్న వేదిక. అలాంటి వేదికపై ఒక్క నిమిషంలో జరిగే విధ్వంసం ఎలా ఉంటుందో తెలుసా? వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెబ్సైట్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. 2021లో వివిధ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్(సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కలిపి)లో ఒక్క నిమిషంలో ఏమేం జరిగిందో వివరించింది. బ్రౌజింగ్, స్ట్రీమింగ్, అప్లోడ్, డౌన్లోడ్.. ఇలా మొత్తం వివరాల ఆధారంగా ఈ డేటాను సేకరించి లోరీ లూయిస్ అనే ఆవిడ.. ఈ వివరాల్ని ఆల్యాక్సెస్ వెబ్సైట్లో పొందుపరిచింది. వీటి ఆధారం ఏం తేలిందంటే.. యూట్యూబ్.. 500 గంటల నిడివి ఉన్న కంటెంట్ కేవలం ఒక్క నిమిషంలోనే అప్లోడ్ అయ్యింది. ఇంటర్నెట్లో 197 మిలియన్లకు పైగా ఈమెయిల్స్ పంపించుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ మెసేంజర్లలో నిమిషానికి 69 మిలియన్ల మెసేజ్లు పంపించుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో నిమిషానికి దాదాపు ఏడు లక్షల స్టోరీలు షేర్ అవుతున్నాయి. ప్రొఫెషనల్ సైట్ లింక్డిన్లో సుమారు పదివేల మంది కనెక్ట్ అవుతున్నారు. టిక్టాక్ లాంటి వీడియో కంటెంట్ జనరేటింగ్ యాప్లో ఐదు వేల డౌన్లోడ్లు చేస్తున్నారు నెట్ఫ్లిక్స్లో నిమిషానికి 28 వేలకు పైగా సబ్స్క్రయిబర్స్ వీక్షణ కొనసాగుతోంది. నోట్: మరికొన్ని అంశాలపై పరిశోధన జరిగినప్పటికీ.. పూర్తి స్థాయి లెక్కలు తేలకపోవడంతో ఈ లిస్ట్లో జత చేర్చలేదు. ఆన్లైన్ షాపింగ్, మరికొన్ని ప్లాట్ఫామ్ల వివరాలు పొందుపర్చలేదు. ఇది కేవలం ఆల్యాక్సెస్ డేటా మాత్రమే!. ►ఇంటర్నెట్ ఉపయోగం వల్ల లాభాలు మాత్రమే కాదు.. భూమ్మీదకు కర్బన ఉద్గారాలు విడుదలై వినాశం వైపు అడుగులు కూడా వేస్తోంది. అందుకే ఇంటర్నెట్ యూసేజ్ను తగ్గించాలని, పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు పర్యావరణ నిపుణులు. ►ఇంటర్నెట్లో డాటాను లెక్కించడం కష్టమే!. ఒక అంచనా ప్రకారం మాత్రం.. ఒకరోజులో 1.145 ట్రిలియన్ ఎంబీ క్రియేట్ అవుతోంది. చదవండి: మళ్లీ అదే అంధకారమా!.. 20 ఏళ్లు వెనక్కి వెళ్లక తప్పదా? -
దావోస్ సదస్సుపై ఒమిక్రాన్ నీడ!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలపై తన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. కొత్త సంవత్సరం జనవరి 17 నుంచి 21వ తేదీ వరకూ ఐదు రోజులు జరగాల్సిన దావోస్ 2022 వార్షిక సమావేశాన్ని వేసవి కాలానికి వాయిదా వేస్తున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సోమవారం తెలిపింది. స్విట్జర్లాండ్ దావోస్లోని స్విస్ ఆల్పైన్ స్కీ రిసార్ట్లో జరగాల్సిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికవేత్తలు,పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు పాల్గొంటారు. వీరితోపాటు పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ధ్యేయంగా వివిధ దేశాల నాయకులు సమావేశంలో భాగస్వాములవుతారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభించడానికి ముందు వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2020 జనవరిలో దావోస్ సదస్సు నిర్వహించింది. అటు తర్వాత సమావేశం వాయిదా పడ్డం ఇది వరుసగా రెండవసారి. పెట్టుబడులకు సంబంధించి పరస్పర సహకారం కోసం ఉద్దేశించి జెనీవా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సంస్థ– వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తొలుత 2021 వార్షిక సమావేశాన్ని దావోస్ కాకుండా స్విట్జర్లాండ్లోని మరొక ప్రదేశానికి మార్చాలని నిర్ణయించింది. అటు తర్వాత సింగపూర్కు మార్చాలని భావించింది. చివరకు దానినీ రద్దు చేసింది. కొత్త వేరియంట్ భయాలతో 2022 సమావేశం కూడా వాయిదా పడ్డం గమనార్హం. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, సీఈఓలుసహా దాదాపు 100కిపైగా భారత్ నుంచి 2022 సదస్సులో పాల్గొనడానికి తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. -
ఒమిక్రాన్ పంజా..! మరో కీలక భేటీ వాయిదా...!
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. ఇప్పటికే 89 దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ పాకింది. ఈ కొత్త వేరియంట్ కారణంగా బ్రిటన్, యూరప్ దేశాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా దేశాలు లాక్డౌన్ను ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఒమిక్రాన్ ఎఫెక్ట్తో ఇప్పటికే పలు అంతర్జాతీయ సమావేశాలకు ఆటంకం ఏర్పడింది. ఒమిక్రాన్ వ్యాప్తిపై కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో దావోస్లో జరగాల్సిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశం వాయిదా పడింది. ఒమిక్రాన్ కారణంగా ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఫోరమ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 17-21 మధ్య స్విట్జర్లాండ్లోని దావోస్-క్లోస్టర్స్లో జరగాల్సిన వార్షిక సమావేశం వేసవి ప్రారంభంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు కఠినమైన ఆరోగ్య ప్రోటోకాల్స్ ఉన్నప్పటికీ, ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి రేటు ఎక్కువగా ఉండడంతో సమావేశాలను వాయిదా వేసినట్లు డబ్ల్యూఈఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రొఫెసర్ క్లాస్ స్క్వాబ్ మాట్లాడుతూ...కోవిడ్-19 మహమ్మారిపై ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు సమిష్టిగా పోరాడుతున్నాయని అభిప్రాయపడ్డారు. కాగా ఒమిక్రాన్ అలజడితో జెనీవాలో జరగాల్సిన డబ్య్లూటీవో మినిస్టీరియల్ (ఎంసీ12)య వాయిదా పడిన విషయం తెలిసిందే. చదవండి: 4 Day Work Week: ఇకపై అందరికీ వారానికి నాలుగు రోజులపాటే పని...! కొత్త లేబర్కోడ్స్ అమలులోకి వస్తే..! -
సీఎం జగన్ను ఆహ్వానించిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్
న్యూఢిల్లీ: ఏపీ సీఎం వైఎస్ జగన్కు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆహ్వానం పంపింది. 2022లో జనవరి 17-21 మధ్య దావోస్లో నిర్వహించే సదస్సులో పాల్గొనాలని కోరింది. ఈ మేరకు డబ్ల్యూఈఎఫ్ ప్రతినిధి బోర్జ్ బ్రెండె..మంత్రి గౌతమ్ రెడ్డిని కలిశారు. ఈ సారి ‘వర్కింగ్ టుగెదర్, రీస్టోరింగ్ ట్రస్ట్’ నేపథ్యంలో సమావేశం జరగనున్నట్లు బోర్జ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీ ఆర్థికవృద్ధికి సీఎం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక విధానాన్ని మంత్రి గౌతం రెడ్డి ఆయనకు వివరించారు. కాగా కోవిడ్-19 నియంత్రణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నా చర్యలను బోర్ట్ బ్రెండె ప్రశంసించారు. పారిశ్రామిక విధానం, ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి వికేంద్రీకరణ తదితరవిషయాలపై బ్రెండె ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు. చదవండి: ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు -
దావోస్కు రండి
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశానికి రావాలంటూ ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావుకు మరోమారు ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21 వరకు దావోస్లో జరగనున్న ఈ సమావేశానికి హాజరుకావాలని ఫోరం కోరింది. కోవిడ్–19 సంక్షోభం తర్వాత వినూత్న టెక్నాలజీ, విధానాలతో ఆర్థిక వ్యవస్థ రికవరీ కోసం చేపట్టిన కార్యక్రమాల గురించి తన అనుభవాలను పంచుకోవాలని డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్గ్ బ్రాండె కేటీఆర్ను కోరారు. అధునాతన సాంకేతికతను సామాన్యుల ప్రయోజనాలకు వినియోగించుకునే అంశంపైనా తన అభిప్రాయాలను చెప్పాలని కోరారు. ‘ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని నివారించడం కోసం రాజకీయ, వ్యాపారరంగాలతోపాటు పౌర సమాజం కలిసి పనిచేయాల్సి ఉంది. ఆ దిశలో అందరం కృషి చేద్దాం’అని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది. ప్రగతికి దక్కిన గుర్తింపు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి అందిన ఆహ్వా నం తెలంగాణ వినూత్న విధానాలకు, ప్రగతి ప్రస్థానానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని మంత్రి కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. డబ్ల్యూఈఎఫ్ ఆహ్వానం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ఈ వేదికగా తెలంగాణను మరోమారు ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను ప్రపంచ దిగ్గజాలకు తెలియజేసి, రాష్ట్రానికి రావాలని కోరతానని వెల్లడించారు. తనకు ఆహ్వానం పంపిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు ధన్యవాదాలు తెలిపారు. -
సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: కోవిడ్ సమయంలో ప్రభుత్వ సేవల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసించింది. సంక్షేమ పథకాల అమల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్న తీరును మెచ్చుకోవడమే కాకుండా ఈ అనుభవాన్ని ప్రపంచంతో పంచుకోవాలని కోరింది. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు బోర్గ్ బ్రండే.. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతమ్రెడ్డికి లేఖ రాశారు. కోవిడ్–19 తర్వాత ప్రజా సేవలు, ఆర్థికాభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ప్రపంచానికి తెలిసొచ్చిందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్లో ‘గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ సమ్మిట్’ పేరిట జపాన్ రాజధాని టోక్యోలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సును ప్రత్యక్షంగా లేదా వర్చువల్గా నిర్వహించబోతున్నామని, ఇందులో పాల్గొని రాష్ట్రం తన అనుభవాలను పంచుకోవాలని కోరారు. ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రభుత్వాధినేతలతోపాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, వ్యాపార, వాణిజ్య రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. -
ఆక్స్ఫాం నివేదిక.. చేదు నిజాలు
ఏటా విడుదలయ్యే నివేదికల్లో ప్రపంచవ్యాప్తంగా వున్న ఆర్థిక అసమానతలనూ, వాటి పర్యవసానంగా ఏర్పడే ఇతరత్రా అంతరాలనూ ఆక్స్ఫాం ఏకరువు పెడుతుంది. ఏడాదిగా ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టి పీడిస్తోంది గనుక ఈసారి నివేదిక మరింత గుబులు పుట్టించేదిగా వుంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్లు్యఈఎఫ్) సదస్సు సందర్భంగా ఆక్స్ఫాం నివేదికలు విడుదలవుతుంటాయి. ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణలు మామూలు గానే అన్ని దేశాల్లోనూ వ్యత్యాసాలు పెంచాయి. కానీ సంక్షోభం తలెత్తినప్పుడు, విలయం విరుచుకు పడినప్పుడు ఇక చెప్పేదేముంటుంది? కొన్ని నెలలక్రితం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై నివేదిక వెలువరిస్తూ తీవ్రమైన ఒత్తిళ్ల ఫలితంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ తలకిందులు కాబోతున్నాయని, కోట్లాదిమంది పేదరికంలోకి జారుకునే ప్రమాదం వున్న దని హెచ్చరించింది. ఆ నివేదిక వచ్చాక మన దేశంతో సహా అనేక దేశాలు సంక్షోభాన్ని అధిగమిం చటం కోసం ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాయి. అట్టడుగు వర్గాలకు చేయూతనందించే అనేక పథ కాలు రూపొందించాయి. వేరే దేశాల మాటెలావున్నా మన దేశంలో మాత్రం వాటివల్ల పెద్దగా ఫలితం రాలేదని తాజా ఆక్స్ఫాం నివేదిక తెలియజెబుతోంది. భారత్ను అసమానత అనే వైరస్ పట్టి పీడిస్తున్నదని, పర్యవసానంగా సంపన్నులు మరింత సంపద పోగేసుకోగా, అంతో ఇంతో పొట్ట పోషించుకునేవారు సైతం ఉపాధి కోల్పోయి కొత్తగా దారిద్య్రంలోకి జారుకున్నారని నివేదిక వ్యాఖ్యా నించటం గమనించదగ్గది. కరోనా వైరస్ విజృంభిస్తున్న కాలంలో ఆ వైరస్ను కొందరు ‘సోషలిస్టు వైరస్’గా చమత్కరిం చారు. ధనిక, పేద తేడా లేకుండా అందరినీ అది కాటేసిందని, దాని పర్యవసానంగా అందరూ ఒక్క లాగే ఇబ్బందులు పడ్డారని అనుకున్నారు. సంపన్నుల్లోనూ ఆ వ్యాధి వచ్చినవారూ, మరణించిన వారూ వుండొచ్చు. కానీ ఆ వర్గానికి అందుబాటులో వుండే ఆధునిక వైద్య సౌకర్యాలు ఇతరులకు లేవు. అలాగే వారికుండే ఆర్థిక వెసులుబాటు ఇతరులకు వుండదు. ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలతో పాటు జెండర్ మొదలుకొని అనేకానేక అంశాల్లో వుండే అసమానతల వల్ల మనలాంటి సమాజాల్లో ఏర్పడే ఏ సంక్షోభాలైనా వాటిని మరింత పెంచుతాయి. అందువల్లే భిన్న రంగాలను శాసిస్తున్న మోతుబరులు లాక్డౌన్ కాలంలో తమ సంపద అపారంగా పెంచుకుంటే సాధారణ పౌరులు మాత్రం బతుకు భయంతో తల్లడిల్లారని ఆక్స్ఫాం నివేదిక ఎత్తిచూపుతోంది. మన దేశంలో లాక్డౌన్ సమయంలో భాగ్యవంతుల సంపద 35 శాతం పెరగ్గా లక్షలాదిమంది సాధారణ పౌరులు జీవిక కోల్పోయారని గణాంకాలంటున్నాయి. నిరుడు మార్చి మొదలుకొని ఇంతవరకూ వందమంది శత కోటీశ్వరుల సంపద 12,97,822 కోట్ల మేర పెరగ్గా... ఒక్క ఏప్రిల్ నెలలోనే ప్రతి గంటకూ 1,70,000 మంది చొప్పున సాధారణ పౌరులు ఉపాధి కోల్పోయారని నివేదిక వెల్లడిస్తోంది. అంటే శత కోటీశ్వరులు వున్న సంపదను కాపాడుకోవటమే కాదు... దాన్ని మరిన్ని రెట్లు పెంచుకోలిగారు. కరోనా ప్రమాదం ముంచుకొచ్చాక మన దేశంలో కఠినమైన లాక్డౌన్ అమలైంది. అది ప్రభుత్వాల సంసిద్ధతను పెంచటంతోపాటు, వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తుందని అందరూ ఆశించారు. కానీ ఆ రెండు అంశాల్లోనూ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. ఇటలీవంటిచోట్ల మన మాదిరిగా వలస కార్మికుల సమస్య లేదు గనుక లాక్డౌన్ అక్కడ సమర్థవంతంగా అమలైంది. మన దేశంలో మాత్రం పనిలేక, ఆకలిదప్పులకు తట్టుకోలేక భారీ సంఖ్యలో వలస కార్మికులు స్వస్థలాలకు నడక దారిన తరలివెళ్లటం మొదలుపెట్టారు. వారిని ఎక్కడికక్కడ నిలువరించటానికి పోలీసులు ప్రయత్నించటం, వారి కళ్లుగప్పి గమ్యస్థానాలు చేరడానికి సాధారణ ప్రజానీకం ప్రయత్నించటం కొన్ని నెలలపాటు మన దేశంలో నిత్యం కనబడిన దృశ్యం. దారిపొడవునా ఆ క్రమంలో బలైనవారెందరో! దానికితోడు సరైన పోషకాహారం లభించక, జాగ్రత్తలు పాటించటం సాధ్యంకాక ఎందరో కరోనా బారినపడ్డారు. ఎన్నో రాష్ట్రాల్లో వైరస్ కేసుల సంఖ్య చూస్తుండగానే పెరిగి కలవరపరిచింది. ఆ మహమ్మారి కాటేసిన దేశాల వరసలో అమెరికా తర్వాత మనదే రెండో స్థానం. కోటీ 6 లక్షలమందికిపైగా జనం కరోనా బారిన పడితే 1,53,525 మంది మరణించారు. కానీ ప్రాణాలు నిలబెట్టుకున్నవారి స్థితిగతులు దుర్భరంగా మారాయని ఆక్స్ఫాం నివేదిక చాటుతోంది. త్వరలో 2021–22 సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్స్ఫాం నివేదికలోని అంశాలు పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వపరంగా చేయాల్సివేమిటో ఆలోచించటం అవసరం. లాక్డౌన్ పర్యవసానంగా ఏర్పడ్డ సంక్షోభాన్ని అధిగమించటానికి ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలు ఏమేరకు ప్రభావం కలిగించాయన్నది కూడా సమీక్షించాలి. నిరుడు ఏప్రిల్–నవంబర్ మధ్య కేంద్ర ప్రభుత్వ వ్యయం వాస్తవ గణాంకాల ఆధారంగా లెక్కేస్తే తగ్గిందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అంతక్రితం సంవత్సరం అదే కాలంతో పోలిస్తే ఈ ఎనిమిది నెలలకాలంలో ప్రభుత్వ వ్యయం 4.7 శాతం పెరిగినట్టు కనబడుతున్నా, 6 శాతంకన్నా ఎక్కువగా వున్న ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నాక ఆ వ్యయం గణనీయంగా తగ్గిన వైనం వెల్లడవుతోంది. విద్య, వైద్యం, ఉపాధి వగైరా రంగాలన్నిటా ఇప్పటికే వున్న వ్యత్యాసాలను కరోనా అనంతర పరిస్థితులు ఎన్ని రెట్లు పెంచాయో ఆక్స్ఫాం నివేదిక తేటతెల్లం చేస్తోంది. ఈ రంగాల్లో ప్రభుత్వ వ్యయం అపారంగా పెరిగితే తప్ప... నేరుగా ప్రజానీకం చేతుల్లో డబ్బులుండేలా చర్యలు తీసుకుంటే తప్ప ఈ వ్యత్యాసాలు ఆగవు. సంక్షోభాలకు మూలం ఎక్కడుందో తెలుసుకుని సకాలంలో నివారణ చర్యలు తీసుకున్నప్పుడే సమాజం సజావుగా సాగు తుంది. లేనట్టయితే అది అశాంతిలోకి జారుకుంటుంది. -
కరోనాపై అవగాహనలో టెక్నాలజీదే కీలక పాత్ర
సాక్షి, హైదరాబాద్: కరోనాను కట్టడి చేయడంతో పాటు ప్రజలను చైతన్యపర్చడంలో టెక్నాలజీ ఎంతో మేలు చేసిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నా రు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో సాంకేతికత సమస్యల పరిష్కారంతో పాటు, నూతన అవకాశాలను సృష్టిస్తోందని చెప్పారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఆధ్వర్యంలో గురువారం జరిగిన ‘రీజినల్ యాక్షన్ గ్రూప్ ఫర్ సౌత్ ఏసియా’సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ‘కోవిడ్ వైరస్ను ఎదుర్కోవడంలో ఎమర్జింగ్ టెక్నాలజీ పాత్ర’అనే అంశంపై ఇందులో ప్రసంగించారు. కరోనా నివారణకు కేంద్రంతో పాటు జిల్లా, గ్రామస్థాయి అధికారులతో మాట్లాడేందుకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడిందన్నారు. పట్టణాల్లో డ్రోన్ల ద్వారా క్రిమిసంహారకాల పిచికారీ, లాక్డౌన్ సమయంలో ప్రజల కదలికల నియంత్రణకు డ్రోన్ల విని యోగం తదితర అంశాలను కేటీఆర్ ప్రస్తావించారు. కోవిడ్ సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు ప్రత్యేక యాప్, వెబ్సైట్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని చెప్పారు. రేషన్ సరుకుల పంపిణీలోనూ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించామని వెల్లడించారు. టెక్నాలజీతోనే జీవితాల్లో మార్పు.. ప్రజల జీవితాల్లో మార్పు తేలేని టెక్నాలజీ వృథా అని, అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ వినియోగానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా నేపథ్యంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు నూతన సాంకేతిక పరిష్కారాలు వస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సమావేశంలో కేటీఆర్తో పాటు మాల్దీవుల ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి ఫయాజ్ ఇస్మాయిల్, సింగపూర్ ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఎస్.ఈశ్వరన్, వరల్డ్ ఎకానామిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్జే బ్రెండెలు మాట్లాడారు. వీరితో పాటు వివిధ దేశాల మేధావులు, నిపుణులు తదితరులు పాల్గొన్నారు. -
వాతావరణ శాస్త్రంపై భారతీయుల్లో విశ్వాసం
దావోస్: వాన రాకడ, ప్రాణం పోకడ తెలుసుకోలేమని అంటారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక వాతావరణాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి ప్రయత్నాలైతే సాగుతున్నాయి. అయితే ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాస్త్రం పట్ల సగానికి సగం దేశాలు విశ్వాసం కోల్పోతున్నట్టు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) తాజా సర్వేలో వెల్లడైంది. అయితే భారతీయులు మాత్రం వాతావరణ శాస్త్రం పట్ల అత్యంత విశ్వాసంతో ఉన్నారు. ఈ శాస్త్రాన్ని నమ్మిన దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంటే, బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉన్నాయి. ఇక గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులకు మానవ కార్యకలాపాలే కారణమని అత్యధికులు నిందిస్తున్నట్టు డబ్ల్యూఈఎఫ్ సర్వే వెల్లడించింది. సర్వే ఇలా..: శాప్, క్వాలట్రిక్స్ సంస్థలతో కలిసి వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఈ సర్వే నిర్వహించింది. మొత్తం 30 దేశాల్లో, 10,500 మందిని ప్రశ్నించింది. ప్రపంచ ఆర్థిక సమాఖ్య 50వ వార్షిక సదస్సుని పురస్కరించుకొని ఈ అధ్యయనం చేసింది. సమైక్య ప్రపంచం దిశగా నివేదికలో అమెరికా, దక్షిణాసియా మినహా మిగిలిన ప్రాంతాల ప్రజలు నాణ్యమైన విద్య ఎండమావిగా మారిందని అభిప్రాయపడ్డారు. చాలా దేశాల్లో విద్యావిధానం, విద్యార్థులకు ఇచ్చే శిక్షణ వారిని నిపుణులుగా తీర్చిదిద్దడం లేదన్న అభిప్రాయాలే వ్యక్తమయ్యాయి. చేయి చేయి కలపాలి: డబ్ల్యూఈఎఫ్ వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పుల కారణంగా ఆర్థికంగా, సామాజికంగా పడుతున్న తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచదేశాల్లో అన్ని వర్గాలు చేయి చేయి కలపాల్సిన అవసరం ఉందని డబ్ల్యూఈఎఫ్పేర్కొంది. ప్రభుత్వాలు,పారిశ్రామిక వర్గాలు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కలసికట్టుగా ఈ సవాళ్లను ఎదుర్కోవాలని తెలిపింది. -
ఆ ఒక్క దేశం మినహా..
న్యూఢిల్లీ: భారత్ పొరుగు దేశాల్లో ఒక్కటి(పాకిస్తాన్) మినహా అన్ని దేశాలు ప్రాంతీయ సహకారం విషయంలో కలిసికట్టుగా పని చేస్తున్నాయని, పరస్పరం చక్కగా సహకరించుకుంటున్నాయని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో భారత ఆర్థిక సదస్సు సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బొర్జి బ్రెండేతో మాట్లాడారు. ప్రాంతీయ సహకారం విషయంలో ఆ ఒక్క దేశం కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్లో జాతీయవాదాన్ని ప్రతికూల అంశంగా చూడొద్దని చెప్పారు. ఇమ్రాన్ వ్యాఖ్యలు దారుణం ఆర్టికల్ 370 అంశంపై పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ తరచూ బాధ్యతారాహిత్యమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ విమర్శించారు. ఇమ్రాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇమ్రాన్ తన హోదాకు తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. భారత్కు వ్యతిరేకంగా జిహాద్ కు ఇమ్రాన్ బహిరంగంగా పిలుపునివ్వడం దారుణమని అన్నారు. అంతర్జాతీయ సంబంధాల గురించి ఆయనకు తెలియదని తప్పుపట్టారు. -
దేశాన్ని నడిపిస్తున్నది పట్టణ ప్రాంతాలే
సాక్షి, హైదరాబాద్: ‘జాతిపిత మహాత్మాగాంధీ చెప్పినట్లు ఇప్పటికీ భారతదేశం గ్రామాల్లోనే ఉంది. అయితే, దేశాన్ని, రాష్ట్రాలను ఆర్థికంగా నడిపిస్తున్నవి మాత్రం పట్టణ ప్రాంతాలే’అని ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారకరామారావు అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఎకనామిక్ సమ్మిట్లో కేటీఆర్ పాల్గొన్నారు. సదస్సులో భాగంగా మేఘాలయ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులతో కూడిన ‘‘యూనియన్ అఫ్ స్టేట్స్’’సెషన్లో కేటీఆర్ ప్రసంగించారు. ఆర్థిక ప్రగతి సాధించడంలో కేంద్ర, రాష్ట్రాల సంబంధాల తీరుపై కేటీఆర్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఉన్నతమైన అవకాశాల కోసం ప్రజలు పట్టణాలవైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పట్టణాల్లో మౌలిక వసతుల్లో సంక్షోభం తలెత్తుతోందని పేర్కొన్నారు. మెరుగైన జీవన ప్రమాణాల కోసం అనుసరించాల్సిన ప్రణాళికలపై దేశంలో నూతన ఆలోచనలకు కొరతలేదని, పెట్టుబడుల కొరత మాత్రమే ఉం దని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పట్టణాల్లో మౌలిక వసతుల రంగంలో పెట్టుబడుల కోసం అనేక విదే శీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని, అయితే కేంద్ర ప్రభుత్వ నియంత్రణతో రాష్ట్రాల్లో స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టే అవకాశం లేదన్నారు. పట్టణ ప్రాం తాల్లో మౌలికవసతులను పెంచడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచవచ్చని అన్నారు. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే ప్రగతి ఆర్థిక పురోగతిపై దూరదృష్టితో కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంగా పనిచేసినప్పుడే ఆర్థిక ప్రగతి వేగవంతమవుతుందని కేటీఆర్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర జాబితాలతోపాటు ఉమ్మడిజాబితా అంటూ రాజ్యాంగం ప్రత్యేకంగా అధికారాలను నిర్ణయించిందని, అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి జాబితాలో ఉన్న అనేక అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని కేటీఆర్ అన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే ఆర్థిక పురోగతి వేగవంతమవుతుందని, అధికార వికేంద్రీకరణలో భాగంగానే తెలంగాణలో 33 కొత్తజిల్లాలతోపాటు 3,500 పం చాయతీలు, పలు రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రగతిశీల నాయకత్వంతోనే అభివృద్ధి ఐదున్నరేళ్లలో తెలంగాణలో అద్భుతమైన పారిశ్రామిక ప్రగతి సాధ్యమైందని, అనేక విధానాలను కేంద్రం నిర్ణయిస్తున్నా వాటి అమలు మాత్రం రాష్ట్రాల్లోనే జరుగుతుందని కేటీఆర్ అన్నారు. ప్రగతిశీల నాయకత్వం ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా ఎదుగుతాయనేందుకు తెలంగాణను ప్రత్యక్ష ఉదాహరణగా అభివరి్ణంచారు. టీఎస్ఐపాస్ ద్వారా అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ఈ చట్టం ద్వారా పరిశ్రమల అనుమతులపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసిందన్నారు. టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా 11 వేలకుపైగా అనుమతులను ఇచ్చామని, ఇందులో 8,400 పైగా అనుమతులు కార్యరూపం దాల్చగా,12 లక్షలమందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందని వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా వివిధ కంపెనీల ప్రతినిధులను కేటీఆర్ ఆహ్వానించారు. సదస్సులో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
బ్రాండ్థాన్తో ఏపీకి బ్రాండింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే తక్షణ కర్తవ్యంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం బ్రాండ్థాన్ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని.. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించే విధంగా సరికొత్త ఆలోచనలు, సలహాలను స్వీకరించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. పారదర్శకత, సుపరిపాలనకు పెద్దపీట వేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే తమ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పమని మంత్రి తెలిపారు. ఢిల్లీలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక సమాఖ్య సదస్సులో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మంత్రి గౌతమ్రెడ్డి, ముఖ్యమంత్రి స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. పీవీ రమేష్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. రజత్ భార్గవ పాల్గొన్నారు. మేకపాటి మీడియాతో మాట్లాడుతూ.. నైపుణ్యంలేని ఉద్యోగాలు అందించడం కాకుండా ఆయా రంగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణనిచ్చి స్థానికులకే 75 శాతం ఉద్యోగాలను అందించేందుకు శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. యువత నుంచి సూచనలు ఆహ్వానం ఏపీకి సరికొత్త బ్రాండింగ్ను సృష్టించే దిశగా ‘బ్రాండ్థాన్’ను నిర్వహించనున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. ఇందులో భాగంగా దేశం నలుమూలల నుంచి సృజనాత్మక యువత నుంచి సూచనల ఆహ్వానించినట్లు తెలిపారు. అక్టోబర్ 3 నుంచి 28 వరకు ఎంట్రీలను httpr://bit. y/2m1KVml పోర్టల్లో స్వీకరించనున్నట్లు మంత్రి వివరించారు. అత్యుత్తమ ఆలోచనల్లో మొదటి బహుమతికి రూ.50 వేలు, రెండో బహుమతికి రూ.25 వేలు, మూడో బహుమతికి రూ.10వేలు నగదు బహుమతి అందజేస్తామని గౌతమ్రెడ్డి వెల్లడించారు. అంతకుముందు.. దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో మంత్రి గౌతమ్రెడ్డి మాట్లాడుతూ.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు గల ఏకైక పట్టణం విశాఖపట్నమని అన్నారు. ప్రస్తుతం అమరావతిని పాలనా పరంగా అనుకూలమైన నగరంగా మలచుకుంటున్నట్లు వెల్లడించారు. హిండ్వైర్, మిత్సుబిషి సంస్థలతో భేటీ సదస్సు సందర్భంగా హిండ్వైర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జపాన్కు చెందిన మిత్సుబిషి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ప్రతినిధులు మంత్రి మేకపాటితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ వాహనాలకు ప్రభుత్వం పెద్దపీట వేయనున్న నేపథ్యంలో కంపెనీ ప్రతినిధులతో మేకపాటి చర్చించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా పాల్గొన్నారు. 13 జిల్లాల్లో ఇండస్ట్రియల్ జోన్లు బ్రాండ్థాన్తో పారిశ్రామికవృద్ధిని పరుగులు పెట్టించేందుకు కృషిచేయనున్నట్లు మేకపాటి వివరించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారని.. పారదర్శకతను ఆచరణలో చూపుతున్న ఏపీలో వాణిజ్యానికి పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారన్నారు వివరించారు. రాష్ట్రంలో 31 ఎంఎస్ఎంఈ క్లస్టర్ల ఏర్పాటుతో పాటు 13 జిల్లాలను ఇండస్ట్రియల్ జోన్లుగా మార్చడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమి తీసుకురావడమే ధ్యేయంగా ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వానికి బాసటగా ఏపీ తనదైన ముద్ర వేస్తుందనడంలో సందేహం లేదన్నారు. -
తెలంగాణ దేశానికే ఆదర్శం : కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక పాలసీలో దేశానికే ఆదర్శమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ ఎకనామిక్ సమ్మిట్లో భాగంగా జరిగిన యూనియన్ ఆఫ్ స్టేట్స్ సెషన్లో ప్రసంగించారు. గత ఐదు సంవత్సరాలుగా తెలంగాణ అద్భతమైన పారిశ్రామిక ప్రగతిని సాధించిందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారానే పారిశ్రామిక ప్రగతి సాధ్యమయిందని తెలిపారు. విజనరీ లీడర్ షిప్ ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయనేందుకు తెలంగాణే నిదర్శమని అన్నారు. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్రాలు బృహత్తర లక్ష్యం కోసం సమన్వయంతో పని చేసినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు రాష్ట్రాలకు అనుగుణంగా కేంద్ర పాలసీలు మరింత సరళతరం కావాల్సిన అవసరముందని సూచించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితాలోని అనేక అంశాలను రాష్ట్రాలకు అప్పగించాలని కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నది పట్టణాలు, నగరాలేనని అన్నారు. -
కేటీఆర్కు అరుదైన గౌరవం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావుకు అరుదైన గౌరవం దక్కింది. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆన్ ఇండియా’పేరుతో నిర్వహించే సమావేశానికి గౌరవ అతిథిగా హాజరు కావాలని ఆ ఫోరం కేటీఆర్ను కోరింది. సీఐఐ భాగస్వామ్యంతో ఈ ఏడాది అక్టోబర్ 3, 4 తేదీల్లో ఢిల్లీలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఫోరం తెలిపింది. మూడు దశాబ్దాలుగా ఇండియా ఎకనామిక్ సమ్మిట్ పేరుతో నిర్వహిస్తున్న సదస్సులకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశం జరగనున్నట్లు తెలిపింది. ‘మేకింగ్ టెక్నాలజీ వర్క్స్ ఫర్ ఆల్’అనే థీమ్తో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఫోరం తన ఆహ్వానంలో పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటని, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లోనూ సరైన అభివృద్ధిని నమోదు చేసిందని ఫోరం తెలిపింది. భారత్ సైతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రపంచం సైతం భారత్లో ఉన్న అవకాశాలపై అవగాహన చేసుకోవలసిన అవసరమున్న నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఉందని వెల్లడించింది. భారత్లోని ఆదర్శవంతమైన కార్యక్రమాలపై చర్చించడానికి ముఖ్యమైన వక్తలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు దీనికి హాజరవుతారని వివరించింది. కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అనేక రంగాల్లో ముందంజ వేసిన విషయాన్ని ఫోరం ప్రత్యేకంగా ప్రస్తావించింది. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో ఇన్నోవేషన్, టెక్నాలజీ రంగాల్లో వినూత్న కార్యక్రమాలను చేపట్టి దేశం దృష్టిని ఆకర్షించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఈ సమావేశానికి హాజరై తన అనుభవాలను పంచుకోవాలి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోరింది. -
సమానత్వానికి మరో 200 ఏళ్లు
మానవుడు అంతరిక్షంలోకి దూసుకుపోతున్నా లింగ వివక్షత మాత్రం తగ్గడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో లింగ భేదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆర్థికం, రాజకీయం, ఉద్యోగం ఇలా దాదాపు అన్ని రంగాల్లో ఇంకా మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. ఈ లింగ వివక్షతను దాటి స్త్రీపురుష సమానత్వం సాధించడానికి ఇంకా 200 ఏళ్లు పడుతుందట. అంతర్జాతీయంగా అధ్యయనం చేసి వరల్డ్ ఎకనమిక్ ఫోరం తేల్చిన సత్యమిది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2018 భారత్లో స్త్రీపురుష సమానత్వానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని చెప్పకనే చెప్పింది. దేశంలోని ఆర్థిక రంగంలో ఉన్న లింగ అసమానతలను పరిష్కరించుకోవాల్సిన తక్షణ ఆవశ్యకతను అది నొక్కి చెప్పింది. దేశంలో, ప్రపంచవ్యాప్తంగా నాలుగు కీలకాంశాల ఆధారంగా లింగపరమైన ఆర్థిక అసమానతలను అంచనా వేసింది. ఆర్థిక అవకాశాలు, రాజకీయ సాధికారత, విద్య, ఆరోగ్య రంగాల్లో స్త్రీపురుష అంతరాలను కొలమానంగా తీసుకుని మన దేశంలో కొనసాగుతున్న అసమానతలపై దృష్టి సారించాలని చెప్పింది. గత దశాబ్దకాలంగా ఆరోగ్యం విషయంలో ప్రపంచంలోనే మన దేశం చివరి నుంచి మూడోస్థానంలో ఉండటం ప్రమాదానికి సంకేతంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం భావించింది. స్త్రీపురుషుల మధ్య ఆర్థిక అసమానతలు తొలగడానికి రెండు శతాబ్దాల కాలం పడుతుందని స్పష్టం చేసింది. అమెరికా కన్నా బెటర్... రాజకీయ సాధికారతలో మాత్రం ప్రపంచ వ్యాప్తంగా 54వ స్థానంలో ఉన్న అమెరికా, 33వ స్థానంలో ఉన్న యుకె కన్నా మెరుగైన ఫలితాలను కనబర్చి మన దేశ మహిళలు ప్రపంచంలోనే 15వ స్థానంలో నిలిచినట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరం రిపోర్టు వెల్లడించింది. పది ప్రధాన ప్రమాణాలను గమనిస్తే.. బంగ్లాదేశ్, శ్రీలంకతో పోలిస్తే మన దేశం లింగ అసమానతలను జయించాలంటే చాలా విషయాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. అయితే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. 100 ప్రధాన కంపెనీల్లో కేవలం 5 శాతం మంది మహిళలు మాత్రమే కీలక స్థానాల్లో ఉన్నారు. అలాగే అతి కొద్ది మందికి మాత్రమే నూతన కంపెనీల స్థాపనకు ఆర్థిక తోడ్పాటునిచ్చినట్లు తేలింది. నిర్వహణ రంగం స్త్రీ భాగస్వామ్యం - ముంబై స్టాక్ ఎక్చేంజీలోని టాప్ 100 కంపెనీల్లో సీఈఓలుగా ఉన్న మహిళలు 2018 జనవరి నాటికి ఐదుగురు మాత్రమే. అలాగే 2019 జనవరి నాటికి ఇందులో ఎలాంటి మార్పు లేదు. - ముంబై స్టాక్ ఎక్సేంజీలోని టాప్ 500 కంపెనీల్లో సీఈఓలుగా ఉన్న స్త్రీలు 2018 జనవరి నాటికి 18 మంది కాగా, 2019 జనవరి నాటికి 25 మందికి చేరారు. - ముంబై స్టాక్ ఎక్చేంజీలోని టాప్ 100 కంపెనీల్లో బోర్డు సభ్యులుగా ఉన్న మహిళలు 2018 నాటికి 172 మంది ఉండగా, 2019 జనవరి నాటికి 180 మందికి చేరారు. - టాప్ 482 కంపెనీల్లో మొత్తం డైరెక్టర్లలో మహిళలు 2018 నాటికి 14.08 శాతం ఉండగా, 2019 జనవరి నాటికి 14.49 శాతానికి పెరిగింది. మెరుగ్గా ఐస్లాండ్... ప్రపంచ దేశాల్లో ఐస్లాండ్ గత పదేళ్లుగా మహిళా సాధికారతలో మెరుగ్గా ఉంది. మహిళా శాసనకర్తలు, సీనియర్ అధికారులు, మేనేజర్లు మాత్రం ఐస్లాండ్లో గతంకన్నా కొద్దిగా తగ్గినప్పటికీ.. మిగిలిన దేశాలకన్నా అసమానతలు ఈ దేశంలో తక్కువగా ఉన్నట్లు తేలింది. గత అక్టోబర్లో ఐస్లాండ్ ప్రధాని కత్రిన్ జాకోబ్స్డాటిర్తో సహా ఐలాండ్ మహిళలంతా వేతనాల్లో అసమానత్వానికి, లైంగిక వేధింపులకు నిరసనగా పనిమానేసి వీ«ధుల్లోకొచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఆధారంగా రాజకీయాలు, పనిలో భాగస్వామ్యం, ఆరోగ్యం, విద్యారంగాల్లో అంతరాలను అధిగమించడంలో ప్రపంచవ్యాప్తంగా 0.1 శాతం మెరుగుదల సాధించాం. ఈ లెక్కన సమానతకు ప్రపంచం చాలా దూరంలో ఉంది. స్త్రీ పురుష సమానత్వం కోసం ఇంకా 202 ఏళ్లు ఎదురుచూడటం చాలా సుదీర్ఘ ప్రయాస అని యుఎన్ ఉమన్ రీజనల్ డైరెక్టర్ అన్నా కరీన్ జాట్ఫోర్స్ వ్యాఖ్యానించారు. సమాన వేతన విధానాలు, మహిళల అవసరాలకు తగినట్లుగా గర్భిణులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, అవకాశాలు కల్పించడం, ప్రసవానంతరం మహిళలకు చట్టబద్ధమైన ఉద్యోగ భరోసా ఇవ్వడం ద్వారా స్త్రీ పురుషుల ఆర్థిక అంతరాలను కొంతవరకైనా తగ్గించవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 200 ఏళ్లు ఆగాల్సిందే.. జెనీవాకు చెందిన అంతర్జాతీయ సంస్థ 149 దేశాల్లో విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు, రాజకీయ సాధికారత తదితర రంగాల్లో కొనసాగుతున్న అసమానతలను రికార్డు చేసింది. ఈ యేడాది విద్య, ఆరోగ్యం, రాజకీయ భాగస్వామ్యంలో ఉన్న అంతరాలను ప్రపంచ ఆర్థిక సంస్థ వెల్లడించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ నైపుణ్యం తదితర విషయాల్లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉన్నట్లు ఈ రిపోర్టు గుర్తించింది. పశ్చిమ యూరప్ దేశాలు మరో ఆరు దశాబ్దాల్లో ఆర్థిక అంతరాలను అధిగమిస్తారని, మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికాలో లింగ వివక్షను అధిగమించేందుకు మరో 153 ఏళ్లు వేచిచూడాల్సిందేనని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెల్లడించింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా స్త్రీపురుషుల మధ్య అసమానతలు పూడ్చటానికి కనీసం 202 ఏళ్లు పడుతుందని ఫోరం అంచనా వేసింది. -
ఆధునికతకు అద్దం పట్టే ‘గిఫ్ట్’
న్యూఢిల్లీ : హాంకాంగ్, సింగపూర్ సహా అంతర్జాతీయ వాణిజ్య హబ్లకు దీటుగా అహ్మదాబాద్లో అత్యంతాధునిక వసతులతో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (గిఫ్ట్) రూపొందుతోంది. అంతర్జాతీయ దిగ్గజ సంస్ధలకు తగిన మౌలిక వసతులు, సౌకర్యాలతో పాటు నైపుణ్యాలతో కూడిన భారతీయ యువత అందుబాటులో ఉంటాయని ఈ మెగా ప్రాజెక్టు నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారత వాణిజ్య సేవల రంగం అత్యంత వేగంగా పురోగమిస్తూ 2020 నాటికి కోటికిపైగా ఉద్యోగాలను సమకూర్చుతుందని, జీడీపీకి రూ రెండు లక్షల కోట్లను సమకూర్చనుందని ఈ డ్రీమ్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నఅధికారులు పేర్కొన్నారు. గిఫ్ట్ సిటీలో భాగంగా అహ్మదాబాద్, గాంధీనగర్ల మధ్య మెరుగైన మౌలిక వసతులు, రవాణా కనెక్టివిటీలతో సెంట్రల్ బిజినెస్ డిస్ర్టిక్ట్ను అభివృద్ధి చేయనున్నారు. క్యాపిటల్ మార్కెట్లు, వాణిజ్య, ఐటీ రంగాల్లో పది లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు లక్షలాది మందికి పరోక్ష ఉపాధి కల్పిస్తామని డెవలపర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7 శాతం పైగా ఉంటుందన్న ఐఎంఎఫ్ అంచనాలూ గిఫ్ట్ సిటీలో నూతనోత్తేజం నింపాయి. గిఫ్ట్తో మారనున్న రూపురేఖలు పెరుగుతున్న జనాభాతో పాటు కాలుష్యం, ఇతర రిస్క్లతో ప్రపంచ నగరాలు సవాళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో చెత్త నుంచి అత్యాధునిక సౌకర్యాలతో గిఫ్ట్ వంటి నగరాల నిర్మాణం వినూత్న పరిణామంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం నివేదిక పేర్కొంది. నాలుగో పారిశ్రామిక విప్లవానికి ప్రపంచ నగరాలు సంసిద్ధం కావాల్సి ఉందని ఈ నివేదిక పిలుపు ఇచ్చింది. ఆధునిక భవంతులు, స్మార్ట్ ఇన్ఫ్రాస్ర్టక్చర్లతో గిఫ్ట్ వంటి నగరాల ఆవశ్యకత ఉందని పేర్కొంది. -
అంతులేని అంతరం
ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుష అంతరాలకు అద్దంపట్టే ‘గ్లోబల్ ర్యాంకింగ్’లో భారత పరిస్థితి ఏ మాత్రం మారలేదు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) 149 దేశాలపై వెలువరించిన జెండర్ గ్యాప్ రిపోర్టు, 2018 ప్రకారం భారత్ ర్యాంకు 108. గత సంవత్సరంలోనూ భారత్ ఇదే ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఆర్థిక భాగస్వామ్యం– అవకాశాలు, విద్య, ఆరోగ్యం– మనుగడ, రాజకీయ సాధికారత అంశాల (సబ్ ఇండెక్స్) ఆధారంగా డబ్ల్యూఈఎఫ్ఈ ర్యాంకులిచ్చింది. నివేదిక ప్రకారం భారత్ వేతన వ్యత్యాసాలను తగ్గించడంలో కొంత ప్రగతి సాధించింది. విద్యా రంగంలో 114వ స్థానంతో మెరుగైన పనితీరు కొనసాగించింది. స్త్రీలను ఆర్థికవ్యవహారాల్లో భాగస్వామిగా చేయడం, అవకాశాలు కల్పించడంలో వెనకబడింది. ఈ విభాగంలో భారత్ 142వ ర్యాంక్తో సరిపెట్టుకుంది. రాజకీయ సాధికారత విషయంలో గత ఏడాది 15వ ర్యాంక్రాగా, ఈసారి 19కి పడిపోయింది. స్త్రీల ‘ఆరోగ్యం– మనుగడ’ సూచీలో అట్టడుగుకు చేరింది. గత సంవత్సరం 141 స్థానంలో వుండగా ఈ యేడాది 147 స్థానానికి దిగజారింది. ఆర్మీనియా (148), చైనా (149) చివరి రెండు స్థానాల్లో వున్నాయి. ఈ విభాగంలో ఒకటో స్థానానికి చేరిన దేశాల్లో శ్రీలంక కూడా వుండటం విశేషం. ర్యాంకింగ్పరంగా తొలి 8 స్థానాల్లోని దేశాలు తమ దేశాల్లో 80 శాతం వరకు అసమానతలను రూపు మాపాయని నివేదిక తెలిపింది. ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే స్త్రీ పురుష అంతరాలను పూడ్చే దిశగా దక్షిణాసియాలో మెరుగైన కృషి జరిగిందని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సగటు తీసుకుంటే రాజకీయ సాధికారత విషయంలో ఎక్కువ అంతరం (77.1శాతం)ఉంది. ఆర్థిక భాగస్వామ్యం– అవకాశాల విషయంలోనూ (41.9శాతం) అంతరం ఎక్కువగా వుంది. విద్య (4.4శాతం),ఆరోగ్యం– మనుగడ (4.6శాతం) అంశాల్లో వ్యత్యాసాలను బాగా తగ్గించగలిగారు. మార్పు ఇలా మందగమనంతో సాగితే స్త్రీ పురుషుల మధ్య అంతరాలను మొత్తంగా రూపు మాపాలంటే మరో 108 ఏళ్లు పడుతుందని నివేదిక పేర్కొంది. 48వ ర్యాంకు సాధించిన బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ దక్షిణాసియా విభాగంలో టాప్ ర్యాంకు (48) సాధించింది. రాజకీయ సాధికారత విషయంలో ముందడుగేసి బంగ్లాదేశ్ మెరుగైన ర్యాంక్ పొందింది. అంతర్జాతీయంగా 8వ ర్యాంకు సాధించిన ఫిలిప్పీన్స్.. ఆసియాలో ర్యాంకింగ్ పరంగా తొలి స్థానంలో వుంది. చైనా 100 నుంచి 103కి దిగజారింది. పాకిస్తాన్ చివరి నుంచి రెండో స్థానంలో వుండగా, యుద్ధంతో సతమతమవుతున్న యెమెన్ చివరి స్థానంలో వుంది. అగ్రస్థానాన ఐస్ల్యాండ్ ఐరోపాలోని ఐస్ల్యాండ్, నార్వే, స్వీడన్ వరసగా మొదటి మూడు ర్యాంకులు సాధించాయి. ఫిన్లాండ్, నికరాగువా, రువాండా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి. బ్రిటన్ 15, కెనడా 16, అమెరికా 51, ఆస్ట్రేలియా 53వ ర్యాంకులు సొంతం చేసుకున్నాయి. -
అమెరికాలో తెలుగు వెలుగు
అమెరికాలో అతి వేగంగా అభివృద్ధి చెందుతోన్న భాష తెలుగు భాషేనని ఓ అమెరికా సంస్థ తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచ వాణిజ్య సదస్సు(వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్) అంచనా ప్రకారం అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 2010–17కాలంలో ఏకంగా 86 శాతానికి పెరిగింది. సెన్సస్ గణాంకాలను సేకరించే అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ సంస్థ యూఎస్లో మాట్లాడే భాషలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 2010–17 కాలంలో ఇంగ్లిష్ మినహా అక్కడి ఇళ్ళల్లో మాట్లాడే భాషపై ఈ అధ్యయనం చేశారని బీబీసీ తెలిపింది. 2017లో యూఎస్లో 4 లక్షలకు పైగా తెలుగు మాట్లాడేవారున్నారు. ఈ సంఖ్య 2010నాటితో పోల్చితే రెట్టింపు. అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టాప్–10 భాషల్లో ఏడు దక్షిణాసియావే కావడం విశేషం. ఇంత వేగంగా తెలుగుమాట్లాడేవారి సంఖ్య పెరగడానికి 1990లలో యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఏర్పడిన డిమాండే కారణమని ‘తెలుగు పీపుల్ ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ప్రసాద్ కూనిశెట్టి చెప్పారు. కొన్నేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల నుంచి అధిక సంఖ్యలో యూఎస్కు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకోసం వెళ్తున్నారని బీబీసీ తెలిపింది. అమెరికాలోని 32 కోట్ల జనాభాలో 6 కోట్ల మంది ఇంగ్లీషేతర భాషలు మాట్లాడుతున్నారు.అందులో అధికంగా స్పాని ష్ మాట్లాడే వాళ్లున్నారు. యూఎస్లో భారతీ య భాషల్లో హిందీ మాట్లాడుతున్నవారు టాప్లో ఉంటే తర్వాతి స్థానాన్ని గుజరాతీ చేజిక్కించుకుంది. బెంగాలీ భాషను తెలుగు అధిగమించింది. అయితే, తెలుగు కంటే తమిళం మాట్లాడే వారు అమెరికా అంతటా ఉన్నారని ఈ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని ఇలినాయీస్ స్టేట్, న్యూయార్క్, వాషింగ్టన్, ఓరెగాన్, కాలిఫోర్నియా, పెన్సిల్వేనియాల్లో తెలుగువారు ఎక్కువ. అమెరికాలో తెలుగు మాట్లాడే వారిలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మొదలుకొని మిస్ అమెరికా కిరీటాన్ని దక్కించుకున్న తొలి భారతీయురాలు నీనా దావులూరి వరకు ప్రముఖులెందరో ఉన్నారు. అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హైదరాబాదీలే. -
ముగిసిన కేటీఆర్ దావోస్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగిసింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న కేటీఆర్ పలు సమావేశాల్లో ప్రసంగించడంతో పాటు అంతర్జాతీయ కంపెనీల సీఈవోలు, చైర్మన్లతో చర్చలు జరిపారు. కేటీఆర్ బృందం నిర్వహించిన ఈ పర్యటన విజయవంతమైందని ఆయన కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, టీఎస్ఐపాస్ పనితీరు, సింగిల్ విండో విధానంలో అనుమతులు తదితర అంశాలపై కేటీఆర్ వివరించారని పేర్కొంది. ఈ సదస్సులో జరిగిన చర్చల ద్వారా వరంగల్లో టెక్ మహీంద్ర కార్యాలయం ఏర్పాటుకు కంపెనీ యాజమాన్యం అంగీకరించడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు ఇది అద్భుత స్పందన అని పేర్కొన్నారు. స్థానిక సమస్యలకు స్థానిక పరిష్కారాలు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో స్థానిక సమస్యలకు చక్కటి పరిష్కారాలు చూపొచ్చని కేటీఆర్ తెలిపారు. శనివారం సదస్సులో భాగంగా జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఓ ప్రాంతంలోని సమస్యలకు పరిష్కారాలను కనుగొనే సమయంలో స్థానిక సంస్కృతి, భాష, ప్రాంతీయ వైవిధ్యాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఓ ప్రాంతంలో ఉపయోగపడే పరిష్కారాలు ఇతర ప్రాంతాల్లో పనిచేయకపోవచ్చని వివరించారు. స్థానిక సమస్యలకు పరిష్కారాలను చూపడంలో ప్రజలకు సహకరించడం, గ్లోబల్ కంపెనీలు స్థానికంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. -
'నాకు 15 మంది దోస్తులయ్యారు.. డిన్నర్ చేశాం'
దావోస్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కొత్తగా 15 మంది స్నేహితులు అయ్యారు. ఆ విషయాన్ని ట్రంప్ స్వయంగా చెప్పారు. వారితో కలిసి డిన్నర్ కూడా చేసినట్లు వెల్లడించారు. వారిలో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన వారున్నట్లు తెలిసింది. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ట్రంప్ 20 నిమిషాలపాటు ప్రసంగించిన తర్వాత స్వల్ప కాలంపాటు డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాస్ శ్వాబ్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ట్రంప్ సమాధానం చెప్పారు. దావోస్లో కొత్తగా ఎవరితో పరిచయాలు అయ్యాయని ట్రంప్ను ప్రశ్నించగా పదిహేను మంది అని చెప్పారు. 'నేను గురువారం మధ్యాహ్నం దావోస్కు వచ్చాను. అదే రోజు రాత్రి 15 మంది కొత్త మిత్రులతో భోజనం చేశాను. నాకు తెలిసిన వారు అందులో ఒక్కరు కూడా లేరు. కానీ, వీరందరి గురించి మాత్రం ఎన్నో ఏళ్లుగా తెలుసుకుంటున్నాను. నాకు ఇక్కడ 15మంది మిత్రులు దొరికేలా చేసిన వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి, దాని వ్యవస్థాపకులైన మీకు నా ధన్యవాదాలు' అని ట్రంప్ చెప్పారు. వైట్ హౌస్ తెలిపిన వివరాల ప్రకారం స్విస్ ఫార్మా దిగ్గజం నోవార్టిస్కు త్వరలో రానున్న సీఈవో వ్యాస్ నరసింహన్, నోకియా సీఈవో రాజీవ్ సూరి, డెలాయిట్ సీఈవో పునిత్ రేంజెన్తోపాటు, బేయర్, సైమెన్స్, ఏపీ వోల్వో, శ్యాప్, అడిదాస్, స్టాటోయిల్, నెస్ట్లే, ఏబీబీ, హెచ్ఎస్బీసీవంటి సంస్థల సీఈవోలతో ట్రంప్ భేటీ అయినట్లు తెలిసింది. -
పరిశోధనలతోనే పరిష్కారాలు!
సాక్షి, హైదరాబాద్: దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు అరుదైన గౌరవం లభించింది. ‘సమాజ ఉన్నతికి డిజిటల్ పరిజ్ఞాన ప్రయోజనాల ఉపయోగం’అనే అంశంపై శుక్రవారం జరిగిన చర్చాగోష్టిలో ఆయన ప్రసంగించారు. ఈ చర్చాగోష్టిలో కేటీఆర్ ఒక్కరే ఒక రాష్ట్ర మంత్రిగా ప్రాతినిథ్యం వహించే అవకాశం లభించింది. బెల్జియం, బ్రెజిల్, డెన్మార్క్, పోర్చుగల్, మయన్మార్, ఇండొనేసియా, నైజీరియా, లెబనాన్, బంగ్లాదేశ్, ఖతార్, పాకిస్తాన్ దేశాల కేంద్ర మంత్రులు ఇందులో పాల్గొన్నారు. డిజిటల్ తెలంగాణ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ) అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. ఇంటింటికీ తాగునీరందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో భాగంగానే ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు టీ–ఫైబర్ ప్రాజెక్టు కింద ఫైబర్గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సేవలన్నింటినీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. పరిశోధనలకు మరింత ప్రాధాన్యం దేశంలో పరిశోధనలకు మరింత ప్రాధాన్యం పెరగాల్సిన అవసరముందని, ఇందుకు దేశంలోని పరిశోధన సంస్థలు, ఉన్నత విద్యాసంస్థలు మరింత చొరవ చూపాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఇన్వెస్ట్ ఇండియా అధ్వర్యంలో దావోస్లో నిర్వహించిన ‘భారత్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్’అంశంపై నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ప్రైవేటు రంగంలో పెద్ద సంస్థలు చేస్తున్న పరిశోధనలతో దేశంలోని విద్యా సంస్థల పరిశోధనలను అనుసంధానం చేస్తే మెరుగైన ఫలితాలొస్తాయని సూచించారు. సిలికాన్ వ్యాలీ గొప్ప విజయాలు అందుకోవడానికి అక్కడి పరిశోధన సంస్థలే కారణమని పేర్కొన్నారు. హైదరాబాద్లోని 50 పరిశోధన సంస్థలను అనుసంధానం చేస్తూ రీసెర్చ్ అండ్ ఇన్నొవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్) ఏర్పాటు చేశామన్నారు. ఇస్రో లాంటి భారతీయ సంస్థలు తమ పరిశోధనల పటిమ, సాంకేతిక సత్తాను ప్రపంచానికి చాటాయని, అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఫలితాలు సాధించొచ్చని ఇస్రో విజయాలు నిరూపించాయన్నారు. రానున్న రోజుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద కంపెనీల నుంచి కాకుండా స్టార్టప్స్ నుంచే వస్తాయని, అందుకే తెలంగాణలో ఈ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగంలో ఆసక్తి ఉన్న కంపెనీలు టీ–హబ్, టీ–వర్క్స్, రిచ్లతో భాగస్వాములు అయ్యేందుకు ముందుకు రావాలన్నారు. పరిశోధనల ప్రోత్సాహానికి టీ–వర్క్స్ హార్డ్వేర్ రంగంలో స్టార్టప్ల ద్వారా పరిశోధనలు ప్రోత్సహించేందుకు టీ–వర్క్స్ ఇంక్యూబేటర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరిశోధనల ద్వారానే అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలకు సత్వర పరిష్కారాలు లభిస్తాయని కేటీఆర్ తెలిపారు. పరిశోధన ఫలితాలు, మేధో సంపత్తిని కాపాడేందుకు తెలంగాణ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్ యూనిట్ (టిప్కు)ను ఏర్పాటు చేశామన్నారు. సమావేశం అనంతరం కేటీఆర్ కేంద్ర మంత్రి సురేశ్ ప్రభుతో సమావేశమయ్యారు. సేల్స్ ఫోర్స్ కంపెనీ సీఈవో మార్క్ బేనియఫ్ దావోస్లో కేటీఆర్ కోసం విందు ఏర్పాటు చేశారు. అనంతరం సేల్స్ ఫొర్స్ సంస్థ ప్రెసిడెంట్ అమీ వీవర్తో కేటీఆర్ సమావేశమయ్యారు. సుజ్లాన్ చైర్మన్తో భేటీ సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం ముందు వరుసలో ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రముఖ పవన విద్యుత్ కంపెనీ సుజ్లాన్ చైర్మన్ తులసి తంతితో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పవన విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సుజ్లాన్ ఆసక్తిగా ఉన్నదని తులసి తంతి తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం బలోపేతం కోసం చేస్తున్న చర్యల వల్ల భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని పేర్కొన్నారు. దావోస్లో గణతంత్ర వేడుకల్లో కేటీఆర్ దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు ప్రాంగ ణంలోని ఇన్వెస్ట్ ఇండియా పెవిలియన్ వద్ద గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం జాతీయ పతాకాన్ని ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో పాటు ఏపీ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. -
దావోస్లో దక్కిందేమిటి?
జాతిహితం ప్రధానమంత్రి, పలువురు కీలక కేంద్ర మంత్రులు, సీఎంల హాజరుతో ఇంత కృషి జరిగినా దావోస్ సమావేశ ఫలితాలు పరిమితమనే చెప్పాలి. ప్రధాని మోదీ సహా భారత ప్రతిని ధులు ఎంతటి చక్కటి సందేశాలిచ్చినాగానీ చివరికి వారు ప్రపంచ వ్యాపార సంస్థలకు ఇవ్వజూపేది ఏంటనేదే కీలకమవుతుంది. ఇండియాలో వృద్ధి రేటు ఏడు శాతం ఉంటే మంచిదే. కాని, చైనా జనాభాకు సరిసమానమైన జనం, దానిలో ఐదో వంతు మాత్రమే ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు ప్రయోజనాలు పరిమితంగానే ఉంటాయి. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశానికి భారత్ హాజరుకావడం ఇది మూడోసారి. 2006లో ‘అన్ని చోట్లా ఇండియా’ అనే నినాదంతో, 2011లో ‘సమ్మిళిత భారత్’ పేరిట దావోస్లో పాల్గొనడానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఈ రెండు సందర్భాలకు భిన్నంగా ఇప్పుడు భారత ప్రధాని దావోస్ వెళ్లారు. ఇంతకు ముందు దావోస్ సదస్సుకు హాజ రైన చివరి ప్రధాని హెచ్డీ దేవెగౌడ. 1997 నాటి ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ విషయ పరిజ్ఞానంతో పాటు తనకంటూ సొంత శైలి ఉన్న నేత. ఆయన సర్కారుకు పార్లమెంటులో భారీ మెజారిటీ ఉంది. బీజేపీ, దాని మిత్రపక్షాలు 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ఇందిరాగాంధీ తర్వాత పార్టీపై మోదీకి ఉన్నంత పట్టు మరే ప్రధా నికీ లేదు. నేడు మరే ఇతర పెద్ద ప్రజాస్వామ్య దేశంలోనూ ఏ ఒక్క నాయ కునికీ ఇంతటి నియంత్రణ లేదనేది మనం గుర్తుంచుకోవాలి. విదేశీ ప్రయా ణం హుషారుగా చేసే అలవాటు ఉన్న మోదీకి ప్రపంచనేతలతో మంచి సంబంధాలున్నాయి. ప్రపంచదేశాల నేతల శిఖరాగ్రసభల్లో వారిని సుదీర్ఘ గాఢాలింగనం చేసుకోవడం మోదీ ప్రత్యేక ముద్రగా మారింది. దావోస్లో ఆయన పాల్గొనడం డబ్ల్యూఈఎఫ్కు, దాని స్థాపకుడు క్లాజ్ ష్వాబ్కు నిజంగా ఘనవిజయం. ఆర్థిక వేదిక సదస్సులో మోదీ ఏం చేశారనే విషయం అలా ఉంచితే, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయనకు దావోస్తో మంచి అనుభ వం, అనుబంధమే ఉంది. ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే ఆయన డబ్ల్యూఈఎఫ్ సమావేశాలకు హాజరవడంతోపాటు 2007లో దాలియన్లో జరిగిన వేసవి దావోస్ సదస్సులో పాల్గొన్నారు. అక్కడ జరిగిన ఓ చర్చకు నేను సమన్వయకర్తగా వ్యవహరించాను. భారత రాజకీయాలపై అనేక ప్రశ్న లడిగినా, ఆయన మాత్రం తాను రాజకీయనేతగా ఇక్కడికి రాలేదనీ, దేశ సమ స్యలను చర్చంచనని మోదీ తెగేసి చెప్పారు. మోదీకి ఆహ్వానం గిట్టని యూపీఏ సర్కారు! భారత పారిశ్రామికవేత్తలకు మోదీపై మోజు పెరిగేకొద్దీ దావోస్ సదస్సులో దేశ రాజకీయాల ప్రస్తావన, వాటిపై చర్చ తప్పలేదు. మోదీకి ఆహ్వానం పంపడం తమకు ఇష్టంలేదనే విషయాన్ని కూడా ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వా హకులకు అప్పటి యూపీఏ సర్కారు తెలిపింది. రాజకీయ ఒత్తిడి కారణం గానే తనకు ఆహ్వానం రాలేదని మోదీ నమ్మడంలో తప్పేమీ లేదు. అందుకే గత మూడేళ్లలో దావోస్ శిఖరాగ్ర సదస్సుపై ఆయన సర్కారు ఆసక్తి చూప లేదు. తర్వాత పరిస్థితిని చక్కదిద్దడానికి డబ్ల్యూఈఎఫ్ చేయాల్సిందంతా చేసింది. ప్రారంభ ప్లీనరీ సమావేశంలో ప్రసంగించే అవకాశం మోదీకి ఇచ్చారు. అగ్రదేశాల నేతలకు లభించే ఈ అవకాశం కిందటేడాది చైనా అధ్య క్షుడు షీ జిన్పింగ్కు దక్కింది. ఈ ఏడాది దీనికి గట్టి పోటీ ఏర్పడింది. డబ్ల్యూ ఈఎఫ్ సదస్సుకు డొనాల్డ్ ట్రంప్, ఇమాన్యుయేల్ మాక్రాన్, జస్టిన్ ట్రూడో, థెరిజా మే, బెంజిమిన్ నెతన్యాహూ, ఏంజెలా మెర్కెల్ వంటి హేమాహే మీలు హాజరయ్యారు. కిటకిటలాడిన మోదీ సభ! మోదీ ప్రసంగించిన సభా ప్రాంగణం నేతలతో కిక్కిరిసింది. ట్రంప్ పాలన లోని అమెరికాపైనా, జిన్పింగ్ నాయకత్వాన నడుస్తున్న చైనాపైనా మోదీ కొన్ని చెప్పుకోదగ్గ వ్యాఖ్యలు చేశారు. ప్రాచీన భారత సంస్కృతి, జ్ఞానం ఆధారంగా ఆయన ప్రపంచ దేశాల నేతలకు ఎన్నో సలహాలు, సూచనలు అందించారు. మోదీ ఉపన్యాసం సదస్సు అంతటా చర్చనీయాంశమైంది. ఆయన ప్రారంభ ప్రసంగం చేసిన నాలుగు రోజుల వరకూ నాకు ఎదురైన ప్రతి భారతీయుడూ, ‘ప్రధాని ఉపన్యాసంపై మీరేమనుకుంటున్నారు?’ అని ప్రశ్నించాడు. దీనికి జవాబివ్వడానికి ముందే, తన అభిప్రాయం చెప్పాడు. పొగడ్తల వర్షం కురిపించాడు. ఇక్కడే ఓ విశేషముంది. భారతీయుడు కాని ఏ వ్యక్తీ ఈ ప్రశ్న అడగలేదు. అలాగే, అంతర్జాతీయ వార్తా ప్రచారసాధనాలు మోదీ ప్రసంగాన్ని పెద్దగా పట్టించుకోలేదు. చైనాతో పాశ్చాత్య దేశాలతో పాటు, బడా అంతర్జాతీయ వ్యాపార సంస్థలు విసిగిపోయి ఉన్నాయి. చైనా అంటే వాటికి చికాకు. చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియా విజయవంత మైన పాత్ర పోషించాలని, తమ పెట్టుబడులకు మంచి కేంద్రంగా మారాలని అవి కోరుకుంటున్నాయి. చైనాలో వ్యతిరేక ఫలితాలతో నష్టపోయే అంతర్జా తీయ కంపెనీల సంఖ్య పెరిగేకొద్దీ గత కొన్నేళ్లుగా ఇండియాపై వాటికి అభి మానం పెరుగుతూ వస్తోంది. ఇండియా ఆర్థికశక్తిగా విజయం సాధించాలని అవి కోరుకుంటున్నాయి. అయితే, నేడు ఇండియా ఈ విషయంలో వాగ్దానం చేసేది ఎక్కువ– సాధించేది తక్కువ అనే పరిస్థితి ఉంది. మోదీ ప్రధాని పదవి చేపట్టాక దేశంలో మరిన్ని భారీ సంస్కరణలు వస్తాయని, అదే స్థాయిలో ఆర్థిక, వ్యూహాత్మక సుస్థిరత నెలకొంటుందని అంచనాలు సాగాయి. భారత్కు సంబంధించి దావోస్లో ఇలాంటి చర్చలు, ఊహాగానాలు ఇటీవల పెరి గాయి. ప్రపంచ ఆర్థికాభివృద్ధి రేటు మరోసారి భారీగా అంటే 3.9 శాతానికి పెరగడంతో ఇండియాపై ఆశలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. వాస్తవానికి లాభసాటి ఒప్పందాలు చేసుకోడానికి సరైన వేదిక దావోస్. పైకి ప్రపంచ పరిస్థితులు మెరుగుపరచాల్సిన అవసరం గురించి నేతలందరూ మాట్లాడు తున్నా, తెర వెనుక జరిగేది వేరు. పోటీపడిన రాష్ట్రాలు దావోస్లో ఇండియాకు సంబంధించిన వ్యవహారాలు బాగానే నడిచాయి. భారత ప్రభుత్వం–సీఐఐ, చంద్రబాబు నాయుడి ఆంధ్ర, దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో–ఇలా పలు రాష్ట్ర ప్రభుత్వాలు బడా కంపెనీలు తమ బృందాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అన్ని చోట్లా గట్టి ప్రయత్నాలే చేశాయి. ప్రధానమంత్రి, పలువురు కీలక కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల హాజరుతో ఇంత కృషి జరిగినా ఫలితాలు పరి మితమనే చెప్పాలి. ప్రధాని మోదీ సహా భారత ప్రతినిధులు ఎంతటి చక్కటి సందేశాలిచ్చినాగానీ చివరికి వారు ప్రపంచ వ్యాపార సంస్థలకు ఇవ్వజూపేది ఏంటనేదే కీలకమవుతుంది. ఇండియాలో వృద్ధి రేటు ఏడు శాతం ఉంటే మంచిదే. కాని, చైనా జనాభాకు సరిసమానమైన జనం, దానిలో ఐదో వంతు మాత్రమే ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు ప్రయోజనాలు పరిమితంగానే ఉంటాయి. ఇది వాస్తవానికి క్రూర ప్రపంచమని చెప్పాలి. ఇది ఇబ్బందికర ప్రశ్నలనే అడుగుతుంది. ఇప్పుడు మీది నిజంగా బలమైన ప్రభుత్వమే అయితే వోడాఫోన్ కంపెనీని వెనుకటి కాలానికి పన్ను చెల్లించమని చేసిన చట్టసవరణను ఇంకా ఎందుకు రద్దు చేయలేదు? వంటి ప్రశ్నలు ఈ వేదికపై తలెత్తాయి. దశాబ్దం క్రితం ఇండియా దావోస్లో ఆర్భాటంగా తన బలం ప్రదర్శించినపుడు అప్పట్లో దేశంలో వృద్ధి రేటు 9 శాతం (పాత సూత్రం ప్రకారం) దాటుతోంది. టెక్నాలజీ కంపెనీలు పరుగులు పెడుతున్నాయి. ఐటీ సేవల ఔట్సోర్సింగ్ కారణంగా బెంగళూరు కొత్త సిలికాన్ వ్యాలీగా అవతరిం చింది. ఈ పరిస్థితుల్లో మన్మోహన్సింగ్ వంటి నియమితుడైన ప్రధాని సైతం దావోస్ వచ్చి ప్రసంగిస్తే కొంత ప్రభావం చూపించేవారు. వాగ్ధాటిలో మోదీకి పోటీ శక్తి ఆయనకు ఏ మాత్రం లేదనే విషయం పక్కనబెట్టినా డాక్టర్ సింగ్ మంచి ఫలితాలే సాధించేవారని భావించవచ్చు. మన్మోహన్ దావోస్ వెళ్లాల నుకున్నారు. కాని, ప్రపంచీకరణను వ్యతిరేకించే వామపక్షాలు ఆయనను వెళ్లనీయలేదు. దావోస్ సదస్సుకు సింగ్ హాజరైతే మద్దతు ఉపసంహరిస్తా మని అవి బెదిరించాయి. ఈ విషయం రాహుల్ బజాజ్ ఇక్కడి మీడియాకు వెల్లడించారు. నాయకుడు బలవంతుడేగాని పరిస్థితి అనుకూలంగా లేదు! ఏ సందేశం ఎలా ఇవ్వాలో తెలిసిన ప్రపంచస్థాయి బలమైన నాయకుడు భారత్ను పరిపాలిస్తున్నాడు. అయితే, పరిస్థితులు ఉత్సాహపూరితంగా లేవు. 2006 నుంచి 2011 వరకూ, మళ్లీ అప్పటి నుంచి 2018 వరకూ ఆహార పదార్థాలు, వంటకాలు ( ఆంధ్ర సహా దేశంలో చాలా ఎక్కువ) బాలీవుడ్ సినిమాలు, ఆధ్యాత్మికత, (ఇప్పుడు) యోగా– రంగాల్లో తన ప్రత్యే కతలు, విజయాల గురించే ఇండియా గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. కాని ఈ రంగాల్లో ఒకదేశానికి ఉన్న శక్తియుక్తులు దాన్ని ఉన్నత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి చాలా పరిమితులున్నాయి. ఇలాంటి కొన్ని ప్రత్యేక అంశాల్లో సాధించిన ప్రగతి థాయిలాండ్ వంటి చిన్న దేశానికి ప్రయోజన కరం కావచ్చు. కిందటేడాది ఈ దేశానికి మూడు కోట్ల 60 లక్షల మంది పర్యాటకులు రాగా, ఇండియాను కోటీ రెండు లక్షల మంది టూరిస్టులు సందర్శించారు. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోరుకుంటున్న ఇండియా ఓ సైనిక శక్తిలా గట్టిగా మాట్లాడాలని ప్రపంచదేశాలు కోరుకుంటున్నాయి. ప్రపంచ రక్షణ, భద్రత, వ్యూహాత్మక విషయాలపై ఇండియా ఎందుకు మాట్లా డదని ప్రపంచ నేతలు అడుగుతున్నారు. ఈ అంశాలపై కొన్ని ప్రకటనలు చేస్తే ఇండియాకు, మోదీకి గొప్ప ప్రచారం లభించేది. దావోస్లో భారత్ కొన్ని ప్రత్యేక రంగాల్లో తన శక్తియుక్తుల గురించి ప్రచారం చేసుకుంది. రిపబ్లిక్ దినోత్సం రోజున పది మంది ఆగ్నేయాసియా నేతలను ముఖ్య అతిధులుగా ఆహ్వానించి తన సైనికపాటవాన్ని ఢిల్లీలో ప్రద ర్శించింది. సముద్రయానంలో నిబంధనల ప్రకారం నడుచుకోవడం, దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం వంటి అంశాలపై ఇండియా గట్టి సందేశ మిచ్చి ఉంటే బాగుండేది. దావోస్ సందేశానికి రిపబ్లిక్ డే దౌత్యం తోడైతే గొప్ప ఫలితాలు అందేవి. ఈ అవకాశాన్ని జారవిడుచుకుంది. గత పదేళ్లలో ఇండియా చెప్పింది ఎక్కువ–చేసింది తక్కువ అనే భావన ఇతర దేశాల్లో కనిపిస్తోంది. అయితే, ఈసారి కూడా తన స్వభావానికి భిన్నమైన ప్రదర్శనకు దిగింది. తన శక్తిసామర్థ్యాలను తగినంతగా ప్రపంచానికి అర్థమయ్యేలా చూపించలేకపోయింది. దావోస్లో పదేళ్ల క్రితం కనిపించిన భారతీయ ప్రము ఖులే ఈసారి కనిపించారు. ఇండియా తరఫున జరిపిన భేటీలకు వివిధదేశాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరైతే తప్ప ప్రపంచపటంలో భారత్కు తగిన గుర్తింపు, ప్రయోజనం ఉండదు. మన గురించి ఎంత గొప్పగా మనం చెప్పు కున్నా జరిగేది ఇంతే. - శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఏపీని ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నాం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబుఅన్నారు. ఇన్విజిబుల్ గవర్నమెంట్, విజిబుల్ గవర్నెన్స్ తమ విధానమన్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మూడో రోజు బుధవారం ‘ఇంటరాక్టివ్ లంచ్ఆన్ ప్రోగ్రాం’లో ‘టెక్నాలజీ ఫర్ ఇన్నోవేషన్స్’ అంశంపై ఆయన మాట్లాడారు. మీ ఫోకస్ ఏమిటని ఓ ప్రతినిధి అడగ్గా.. ప్రభుత్వానికి వచ్చే ప్రతి వినతిని పరిష్కరించడమేనని సీఎం చెప్పారు. కాగా, సీఐఐ రౌండ్టేబుల్ సమావేశంలో సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఐఐని కోరారు. కాగా దావోస్లో చంద్రబాబు బుధవారమూ పలు సంస్థల అధిపతులతో సమావేశ మయ్యారు. వ్యవసాయ యూపీఎల్ సంస్థ గ్లోబల్ సీఈవో జై షరోఫ్తో భేటీ అయ్యారు. సింగపూర్లోని నన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ ప్రెసిడెంట్ సుబ్రా సురేష్తో కూడా సమవేశమయ్యారు. బ్లాక్చైన్ టెక్నాలజీకి చెందిన ఎథేరియం వ్యవస్థాపకుడు జో లుబిన్తో సమావేశమై.. బ్లాక్ చైన్ టెక్నాలజీ 3 నెలల కోర్సును ప్రారంభించాలని కోరారు. హెచ్పీ త్రీడీ ప్రింటింగ్ హెడ్ స్టీఫెన్ నిగ్రోతోనూ, ఎయిర్బస్ డిఫెన్స్ సంస్థ సీఈవో డిర్క్ హోక్తో సమావేశమయ్యారు. రహేజా గ్రూప్ ప్రతినిధి రవి రహేజాతోనూ సమావేశమయ్యారు. -
‘దావోస్’ దారి మార్చుకోవాలి
జనావళిపై ప్రపంచీకరణను రుద్ది, దానిద్వారా దేశదేశాల్లోని సహజ వనరులను అపరిమితంగా కొల్లగొట్టిన అగ్రరాజ్యాలు స్వరం మార్చి ఇప్పుడు రక్షణాత్మక విధానాలకు తిరోగమిస్తున్న వేళ స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఈఎఫ్) సమావేశాలు ప్రారంభమయ్యాయి. ‘ప్రపంచాన్ని బాగా కలవర పెడుతున్న అంశాలపై చర్చించడానిక’ంటూ డబ్ల్యుఈఎఫ్ 1971లో ఈ వార్షిక సమావేశాలకు అంకురార్పణ చేసింది. వర్తమాన ప్రపంచ ధోరణులపైనా, పర్య వసానంగా పుట్టుకొచ్చిన సమస్యలపైనా, వాటివల్ల కలిగే ప్రమాదాలపైనా మేధో మథనం చేయడం, పరిష్కారాలను సూచించడం ఈ సమావేశాల ఉద్దేశం. ఎప్పటిలానే ఈసారి కూడా దావోస్కు దాదాపు వంద దేశాల నుంచి ప్రపంచ కుబేరులు, రాజకీయ నాయకులు, వివిధ దేశాల అధినేతలు, ఆర్థికమంత్రులు, బ్యాంకర్లు, కార్పొరేట్ అధిపతులు, మేధావులు, పాత్రికేయులు 3,000మంది హాజరయ్యారు. డబ్ల్యుఈఎఫ్ తో సమస్యేమంటే ప్రపంచంలో పెరిగిపోతున్న అసమానతల గురించి అక్కడ అందరూ కూర్చుని మాట్లాడుకోవడమే తప్ప కార్యాచరణ శూన్యం. పేద, గొప్ప తారతమ్యాలు అంతకంతకూ పెరగడమే తప్ప తగ్గుతున్న దాఖలాలు లేవు. ఇందుకు ఏటా విడుదలవుతున్న ఆక్స్ఫామ్ నివేదికలే సాక్ష్యం. ఈ సదస్సునుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ భారత్ సాధించిన ప్రగతి గురించి చెబుతూ వెల్లడించిన గణాంకాలు సదస్సులో పాల్గొన్నవారిని సహజంగానే ఆకట్టుకుని ఉంటాయి. 1997లో అప్పటి ప్రధాని దేవెగౌడ ఈ సదస్సులో పాల్గొన్నప్పుడు భారత్ జీడీపీ దాదాపు రూ. 26 లక్షల కోట్లుంటే ఇప్పుడది ఆరు రెట్లు పెరిగిందని చెప్పారు. అభివృద్ధిలో అందరినీ భాగస్వా ములను చేసి, ఆ ఫలాలు అందరికీ దక్కేటందుకు అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. కానీ ఆయన ప్రసంగానికి ముందురోజే ఆక్స్ఫామ్ విడుదల చేసిన నివేదిక ఈ అభివృద్ధి తీరుతెన్నులను ఎత్తిచూపింది. కేవలం 1 శాతంగా ఉన్న సంపన్నుల వద్ద 73 శాతం సంపద చిక్కుకున్నదని తెలిపింది. ఆదాయాల్లో వ్యత్యాసాలు, సంపద పంపిణీలో అసమతుల్యత అంతిమంగా సామాజిక అశాంతికే దారితీస్తాయి. ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన నివేదిక ఈ వ్యత్యాసాల గురించి మరింత లోతుగా పరిశీలించింది. ప్రభుత్వాలు ఆర్థికా భివృద్ధికి ప్రాధాన్యమిచ్చినంతగా సామాజిక సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వక పోవడాన్ని ప్రస్తావించింది. సమ్మిళిత వృద్ధిలో మన పొరుగునున్న పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ కన్నా దిగువనున్నామని ఆ నివేదిక చెప్పడాన్నిబట్టి మోదీ ప్రస్తావించిన ఆర్థిక ప్రగతంతా ఎవరి గుప్పిట చిక్కుకున్నదో ఇట్టే అర్ధమవుతుంది. ఎంతసేపూ వృద్ధి రేటు చుట్టూ తిరుగుతూ దాన్నే నిజమైన వృద్ధిగా పరిగ ణించొద్దని సామాజికార్థిక నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఒక దేశం నిజమైన అభివృద్ధి అక్కడి పౌరుల ఆర్థిక భద్రతలో, వారి సామాజిక అభివృద్ధిలో, అక్కడి ఉద్యోగితలో, జీవనప్రమాణాల్లో ఉంటుంది తప్ప జీడీపీలో కాదు. అసమానతలను పారదోలేందుకు, సంపద పంపిణీ సక్రమంగా ఉండేందుకు ఎలాంటి చర్యలూ లేకపోవడం వల్ల గణాంకాలు ఘనంగా కనబడుతున్నా సగటు పౌరుల జీవనం మెరుగుపడటం లేదు. ఏడెనిమిదేళ్లుగా మన దేశం ఆర్థికంగా నిలదొక్కుకున్నదంటే దానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో క్షీణిం చిన చమురు ధరల పర్యవసానమని మరువకూడదు. గత కొన్ని వారాలుగా అవి మళ్లీ పైపైకి పోతున్నాయి. ఇంధన వినియోగం దేశంలో నిరుటితో పోల్చినా రెట్టింపయింది. నిరుడు చమురు డిమాండు రోజుకు 93 వేల బ్యారెళ్లు ఉంటే ఇప్పుడది 1,90,000 బ్యారెళ్లు అయింది. మనకు కావలసిన చమురులో 80 శాతం దిగుమతుల ద్వారానే లభిస్తుంది. కనుక చమురు ధర పైపైకి ఎగిసేకొద్దీ ఆమేరకు విదేశీ మారకద్రవ్య నిల్వలు హరించుకుపోతాయి. అందువల్ల తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మన ఆర్థిక వ్యవస్థను కట్టుదిట్టం చేసుకోవడం అవసరం. నిరుడు సదస్సుకు చైనా ప్రధాని షీ జిన్పింగ్ హాజరై హడావుడి చేయడం వల్ల కావొచ్చు ఈసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే తదితరులు వస్తున్నారు. మన ప్రధాని ఒకరు దావోస్ సదస్సుకు వెళ్లడం రెండు దశాబ్దాల తర్వాత ఇదే ప్రథమం. 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దావోస్ వచ్చారు. మళ్లీ ఇన్నేళ్లకు ఆ దేశాధినేత అడుగుపెడుతున్నారు. అయితే తాను వెళ్లేది ‘అమెరికాకే అగ్ర ప్రాధాన్యం’ అన్న తన నినాదాన్ని నొక్కి చెప్పడానికేనని ట్రంప్ ప్రకటించారు. అగ్రరాజ్యాల ప్రయోజనాలను నెరవేర్చే స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలను ఇన్నేళ్లుగా బడుగు దేశాలకు అంటగట్టి వాటిని ప్రపంచీకరణలో భాగస్వాములను చేయడంలో ప్రపంచ ఆర్థిక వేదిక పాత్ర తక్కు వేమీ కాదు. ఆ వేదిక పైనుంచే ప్రపంచీకరణ స్ఫూర్తికి విరుద్ధమైన అభిప్రాయాలు ఆయన వ్యక్తం చేస్తే అది ఆసక్తిదాయకమే. ఆక్స్ఫామ్ 2010నాటి నివేదిక ప్రపంచ జనాభాలోని సగంమంది ఆస్తికి సమానమైన సంపద కేవలం 388మంది కుబేరుల వద్ద కేంద్రీకృతమైందని తెలి పింది. మరో ఆరేళ్లకు... అంటే 2016లో విడుదలైన సంస్థ నివేదిక ప్రకారం ఆ సగం సంపదా మొత్తం 62మంది కుబేరుల వద్దకు చేరిందని వెల్లడించింది. తాజా నివేదిక ఇప్పుడా సంపద కేవలం 8మంది వద్ద ఉన్నదంటున్నది. ఆ కుబేరులు పన్నుల బెడదలేని మారుమూల దేశాల్లో 7.6 లక్షల కోట్ల డాలర్ల సంపద దాచి పెట్టారని చెబుతోంది. ప్రపంచ ఆర్థిక ప్రగతి దేనికి దారితీస్తున్నదో, చివరికెలాంటి ఫలితాలిస్తున్నదో ఈ నివేదిక అద్దం పడుతోంది. దీన్ని గురించి దావోస్లో ఆత్మ పరిశీలన చేసుకుంటేనే... సరైన పరిష్కారానికి ప్రయత్నిస్తేనే ఈ సదస్సుకొక అర్ధం, పరమార్ధం ఉంటుంది. లేనట్టయితే ఎప్పటిలా ఊకదంపుడు ఉపన్యాసాల వేదికగా మిగిలిపోతుంది. -
20 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ది చెందింది
-
24వ క్రిస్టల్ అవార్డు అందుకున్న షారుఖ్ ఖాన్
-
భారత్ అంటేనే బిజినెస్ : ప్రధాని మోదీ
దావోస్ : ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పలువురు అంతర్జాతీయ కంపెనీల సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దేశ ఆర్థిక పురోగమనాన్ని వారికి వివరించి, పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. దావోస్లో మోదీ రౌండ్ టేబుల్ భేటీకి సంబంధించిన వివరాలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. భారత్ అంటే.. : సీఈవోలతో మాట్లాడుతూ మోదీ.. భారత్కు సరికొత్త నిర్వచనం చెప్పారు. ‘‘భారతదేశం అంటేనే వ్యాపారం.. వ్యాపరమంటేనే భారతదేశం. ప్రపంచంలోనే వేగవంతంగా అభివృద్ధిచెందుతోన్న ఆర్థిక వ్యవస్థ మాది. అవకాశాలగని కూడా. మీరంతా పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో అనువైన దేశం’’ అని వ్యాఖ్యానించారు. ఐదురోజులపాటు జరిగే దావోస్ సదస్సులో ప్రధాని ఒకరోజు మాత్రమే పాల్గొన్నారు. అంతర్జాతీయ కంపెనీల సీఈవోలతో సమావేశం అనంతరం వివిధ దేశాధి నేతలతో ద్వైపాక్షిక చర్చలు చేస్తారు. 20 ఏళ్ల తర్వాత.. : 1997లో నాటి ప్రధాని దేవేగౌడ అనంతరం.. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటున్న తొలి భారత ప్రధానిగా ప్రధాని మోదీ నిలిచారు. ప్రపంచంలో కీలక ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్లో వివిధ వ్యాపారాలకున్న అవకాశాలను ఈ సదస్సులో మోదీ వివరించారు. ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సురేశ్ ప్రభు, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు దావోస్ వెళ్లారు. -
సమ్మిళిత వృద్ధిలో అట్టడుగున భారత్!
దావోస్: సమ్మిళిత వృద్ధిలో పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్ల కన్నా కూడా భారత్ అట్టడుగు స్థాయిలో ఉంది. వర్ధమాన దేశాలకు సంబంధించిన సమ్మిళిత వృద్ధి సూచీలో 62వ స్థానంలో నిల్చింది. చైనా 26, పాకిస్తాన్ 47వ స్థానాల్లో ఉండటం గమనార్హం. వర్ధమాన దేశాల జాబితాలో లిథువేనియా అగ్రస్థానంలో నిల్చింది. సంపన్న దేశాల జాబితాలో అత్యంత సమ్మిళిత ఆర్థిక వ్యవస్థగా నార్వే అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. వార్షిక సదస్సు నేపథ్యంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఈ సూచీ విశేషాలు విడుదల చేసింది. జీవన ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ, రుణభారాల నుంచి భవిష్యత్ తరాలను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్ని ఇచ్చినట్లు డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. ఆర్థిక అభివృద్ధికి జీడీపీ గణాంకాలే కొలమానంగా తీసుకోవడం స్వల్పకాలిక ధోరణులనే చూపుతోందని, అసమానతలకు ఆజ్యం పోస్తోందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో సమ్మిళిత వృద్ధి సాధన కోసం ప్రపంచ దేశాల నేతలు మరో కొత్త విధానాన్ని తక్షణం కనుగొనాల్సిన అవసరం ఉందని సూచించింది. గతేడాది 79 దేశాల వర్ధమాన దేశాల జాబితాలో భారత్ 60వ స్థానంలో నిల్చింది. చైనా 15, పాకిస్తాన్ 52వ స్థానాల్లో నిలిచాయి. తాజాగా 2018 సూచీలో భారత్ 60వ స్థానం నుంచి 62 స్థానానికి పడిపోగా.. పాకిస్తాన్ మాత్రం 47వ స్థానానికి ఎగబాకింది. సమ్మిళిత వృద్ధి సూచీలో మొత్తం 130 దేశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో 29 సంపన్న దేశాలు, మిగతా 74 వర్ధమాన దేశాలు ఉన్నాయి. భారత్ ఓవరాల్ స్కోరు తక్కువగానే ఉన్నప్పటికీ.. పురోగమిస్తున్న టాప్ టెన్ వర్ధమాన దేశాల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది. ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే.. సంపదపరంగానూ, ఆదాయాలపరంగానూ అసమానతలు పెరిగిపోవడానికి కారణం.. దశాబ్దాలుగా సామాజిక సమగ్రాభివృద్ధి కన్నా ఆర్థికాభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటమేనని డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. దీంతో వృద్ధి ఫలాలు అందరికి అందేలా చర్యలు తీసుకోవడం ద్వారా పర్యావరణాన్ని దెబ్బతియ్యకుండా, భవిష్యత్ తరాలపై రుణభారాన్ని మోపకుండా చూడగలిగే అవకాశాన్ని ప్రభుత్వాలు కోల్పోయాయని తెలిపింది. దేశ ఆర్థిక పనితీరును లెక్కగట్టేందుకు ఆర్థిక వేత్తలు, విధానకర్తలు ఎక్కువగా స్థూల దేశీయోత్పత్తి గణాంకాలపైనే ఆధారపడుతుండటం కూడా ప్రధాన సమస్యల్లో ఒకటని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. జీడీపీ కేవలం వస్తు, సేవల ఉత్పత్తి లెక్కింపునకు మాత్రమే పరిమితవుతుందే తప్ప.. అవి ఉద్యోగావకాశాలు, ఆర్థిక భద్రత, జీవన ప్రమాణాలు మెరుగుదలను ప్రతిఫలించదని వివరించింది. టాలెంట్ ర్యాంకింగ్ మెరుగు .. ప్రతిభావంతులను ఆకర్షించడంలో భారత్ ర్యాంకింగ్ మెరుగుపర్చుకుంది. గతేడాది 92వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి 81వ స్థానానికి ఎగబాకింది. టాలెంట్ను ఆకర్షించడంలో పోటీతత్వానికి సంబంధించిన సూచీ వివరాలను డబ్ల్యూఈఎఫ్ ప్రకటించింది. భారత్కి తీవ్రమైన మేధోవలస రిస్కు పొంచి ఉందని పేర్కొంది. స్విట్జర్లాండ్ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సింగపూర్, అమెరికా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మరిన్ని విశేషాలు.. ⇒సంపన్న దేశాల సమ్మిళిత వృద్ధి సూచీలో నార్వే టాప్లో ఉండగా, ఐర్లాండ్, లగ్జెంబర్గ్, స్విట్జర్లాండ్, డెన్మార్క్ టాప్ 5లో ఉన్నాయి. ⇒వర్ధమాన దేశాల్లో లిథువేనియా అగ్రస్థానంలో, హంగరీ, అజర్బైజాన్, లాత్వియా, పోలాండ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ⇒పొరుగు రాష్ట్రాలైన శ్రీలంక (40), బంగ్లాదేశ్ (34), నేపాల్ (22 వ ర్యాంకు) భారత్ కన్నా మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. -
ప్రపంచ వేదికపై రామ్దేవ్ శిష్యుల మ్యాజిక్
సాక్షి, న్యూఢిల్లీ : దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రదర్శించే అవకాశం దక్కింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలతో నిత్యం ఒత్తిడికి గురయ్యే నేతలకు యోగా పాఠాలతో ఉపశమనం కలిగించనున్నారు. వారికి పతంజలి యోగా గురువులు.. ఆచార్య భరద్వాజ్, ఆచార్య స్మిత్ యోగాసనాలు నేర్పించనున్నారు. ఈ విషయాన్ని యోగా గురువు బాబా రామ్దేవ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. ప్రధాని మోదీ ప్రతినిధి బృందంలో భాగస్వాములైన ఈ ఇద్దరు యోగా గురువులు వచ్చేవారం నుంచి పాఠాలు మొదలుపెడతారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సహా సుమారు 70 మంది ప్రముఖులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ దేశాలకు చెందిన ఉన్నతశ్రేణి బ్యాంకర్లు ఇందులో భాగం కానున్నారు. ప్రపంచ వేదికపై భారత సౌరభం: రమేశ్ అభిషేక్ భారత సంస్కృతి, వారసత్వాలతోపాటు సాధించిన విజయాలు, భారతీయ వంటకాల రుచులు, యోగాను ప్రదర్శించేందుకు, దానికి ప్రచారం కల్పించేందుకు ప్రపంచ ఆర్ధిక వేదికను వినియోగించుకోనున్నామని పారిశ్రామిక విధాన, ప్రచార సారథి రమేశ్ అభిషేక్ చెప్పారు. చైనా తర్వాత ప్రపంచ ఆర్థికవ్యవస్థను అత్యంత ప్రభావితం చేయగలిగే శక్తి భారత్కు మాత్రమే ఉందని పేర్కొన్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో హాజరయ్యేందుకు ప్రధాని మోదీ కూడా బయలుదేరారు. 1997లో అప్పటి ప్రధాని హెచ్. డి. దేవెగౌడ పాల్గొనగా దాదాపు 20 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని ఈ సదస్సులో పాల్గొనడం ఇదే తొలిసారి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారత ఎకానమీ 2.3 ట్రిలియన్ డాలర్లకు చేరి, ప్రపంచంలోనే 7వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పరిణమించిన నేపథ్యంలో మోదీ దావోస్ సదస్సులో పాలుపంచుకుంటున్నారు. ఎయిర్బస్, హిటాచి, ఐబీఎమ్ వంటి దాదాపు 60 ప్రధాన అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. ఐదు రోజులపాటు జరగనున్నఈ సదస్సులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి సురేశ్ ప్రభు, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లతోపాటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. మోదీ కేవలం ఒక్కరోజు మాత్రమే అక్కడ బస చేయనున్నారు. -
'దావోస్లో మోదీ గ్రేట్ స్టోరీ చెప్పబోతున్నారు'
దావోస్ : ప్రపంచ ఆర్థిక వేదికపై (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) చెప్పడానికి ప్రధాని నరేంద్రమోదీ వద్ద గొప్ప కథ ఉందని, అది భారత్వైపు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుందని స్పైస్ జెట్ చీఫ్ అజయ్ సింగ్ అన్నారు. ఆ కథను నరేంద్రమోదీ కంటే ఎవరు కూడా గొప్పగా చెప్పలేరని అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వ హయాంలో గొప్పగా తీసుకొచ్చిన సంస్కరణలు అయిన జీఎస్టీ, డిజిటలైజేషన్, పెద్ద నోట్ల రద్దువంటి అంశాలన్నీ కూడా ఆయన ప్రపంచ వేదికపై వివరించబోతున్నారన్నారు. ప్రపంచంలో మరే దేశ నేతకు లేనంత అవకాశం మోదీకి ఉందని, ఆయన మరోసారి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడం ఖాయం అని చెప్పారు. సంస్కరణల భారతం, 1.4బిలియన్ల భారతీయులు, యువ జనాభా, ప్రపంచానికి భారత్ అతిపెద్ద మార్కెట్వంటి అంశాలన్నీ కూడా మోదీ ప్రస్తావించనున్నారన్నారు. ప్రపంచ దేశాల అధినేతలతోపాటు ప్రధాని మోదీ కూడా దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)లో ప్రసంగించనున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత్కు చెందిన ఓ ప్రధాని ఈ కార్యక్రమంలో పాల్గొననుండటంతో ఇది భారత్కు అతి ముఖ్యమైన కార్యక్రమంగా నిలవనుంది. 'గత ఏడాది జీ జిన్పింగ్ను చూసినప్పుడు మనందరి ఫోకస్ చైనాపైనే ఉంది. కానీ, ఈసారి మాత్రం దృష్టి అంతా భారత్పైనే' అని అజయ్ సింగ్ చెప్పారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం ప్రారంభం కానున్న ఫోరం సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్న విషయం తెలిసిందే. మంగళవారం ఫోరం అధికారిక సెషన్స్లో ఆయన ప్రసంగిస్తారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీనే కావడం విశేషంగా చెప్పవచ్చు. చివరిసారిగా, 1997లో అప్పటి ప్రధానమంత్రి ఎచ్డీ దేవెగౌడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నారు. ప్రపంచ దేశాలన్నింటికి కూడా భావి ఆర్థిక అవకాశాలు కూడా దావోస్లోని ప్రపంచ ఆర్థిక వేదికపైనే ఆవిష్కృతమవుతాయనీ అంటుంటారు. -
నిప్పు కనిక
ఆరో క్లాసులో అగ్నిపరీక్ష ఒకటి కనికను, స్నేహితురాళ్లను, కుటుంబాన్ని మసకబార్చింది. స్కూల్లోని ఒక వేడుకలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది! కానీ కనికను ఆ అగ్నిపరీక్షే కాదు. జీవితంలోని ఏ అగ్నిపరీక్షా ఆపలేకపోయింది. బ్రేవ్ గర్ల్. స్విట్జర్లాండ్లోని దావోస్లో ఈ నెల 23 నుంచి 26 వరకు జరుగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’లో పాల్గొనేందుకు హైదరాబాద్కు చెందిన ఇద్దరు అమ్మాయిలు ఎంపికయ్యారు. ఆ ఇద్దరిలో ఒకరైన కనికా కుమార్ (ఇంకొకరు దీపికా ప్రసాద్) ముంబైలోని ‘ఇంటెల్క్యాప్’కి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సమావేశానికి హాజరవుతున్న సందర్భంలో కనిక పరిచయమిది.కనికా కుమార్ పుట్టి, పెరిగింది హైదరాబాద్లోనే. సెయింట్ ఆన్స్లో పాఠశాల విద్య, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. కనిక ఆరవ తరగతిలో ఉన్నప్పుడు స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది.అందులో కనికా గాయపడ్డారు. కోలుకోవడానికి దాదాపు నాలుగు నెలలు పట్టింది. ఆ ప్రభావం ఇప్పటికీ మొహం మీద కనిపిస్తుంటుంది. ‘‘బయటవాళ్లు చాలామంది అడుగుతారు ఏమైంది? అని. చెప్పగానే.. ‘అయ్యో పెళ్లి ఎలా అవుతుందమ్మా?’ అంటూ జాలిపడ్తారు. ఆ మాటలకు మనసులోనే నవ్వుకుంటా. ఎందుకంటే ఇలాంటివి అధిగమించే స్థయిర్యాన్ని నేను ఏనాడో సాధించాను. చిన్నప్పుడు జరిగిన ఆ ప్రమాదం ఒక రకంగా నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’’ అని చెప్తుంది కనికా. లండన్ స్కూల్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక కనికా లండన్ వెళ్లారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో డిప్లొమా కోర్స్ చేశారు. తిరిగొచ్చాక ముంబైలోని ఒక అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలో కొన్నాళ్లు పనిచేశారు. హైదరాబాద్లో ‘బాలకళాకార్’ టీమ్లో ఆమె ఓ భాగస్వామి. పేదపిల్లల్లో ఉన్న కళలను వెలికితీసి, వాళ్లను ప్రోత్సహిస్తుంటుంది ఈ సంస్థ. ‘‘ఇప్పటి వరకు 3 వేల మంది పిల్లల్లోని క్రియేటివ్ స్కిల్స్కు ఒక డయాస్ కల్పించాం. పెయింటింగ్, డాన్స్, సాంగ్స్ వంటి వాటిల్లో వాళ్లను ప్రోత్సహిస్తున్నాం. ఆ పిల్లలు వేసిన పెయింటింగ్స్తో ఎగ్జిబిషన్ కూడా పెట్టాం’ అని చెప్తారు కనిక. ఇంటెల్క్యాప్ యాడ్ ఏజెన్సీలో పనిచేశాక ఇంటెల్క్యాప్లో జాయిన్ అయ్యారు కనిక. ప్రస్తుతం అందులోని కార్పొరేట్ స్ట్రాటజీ టీమ్ను లీడ్ చేస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో సోషల్ ఎంట్రప్రెన్యూర్షిప్ కోసం కృషిచేస్తున్నారు. బాధ్యతల్లో భాగంగా ఆఫ్రికాలో కొన్నాళ్లున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఇనిషీయేటివ్ ప్రోగ్రామ్ అయిన ది గ్లోబల్ షేపర్స్ (ముంబై)లో కూడా ఆమె పాలుపంచుకుంటున్నారు. ప్రయాణాలంటే చాలా ఇష్టపడే కనిక తను చూసిన, పనిచేస్తున్న ప్రపంచంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను దగ్గరగా చూశారు. ‘‘వ్యక్తిగతంగా ఇటు ఇంట్లో, అటు బయట నేనెలాంటి వివక్షనూ ఎదుర్కోకపోయినా.. అలాంటి పరిస్థితినైతే చూశాను. నిజానికి మా ఇంట్లో నాకు సంబంధించి.. అంటే చదువు, జాబ్ ఎవ్రీథింగ్ నా ఇష్టమే. ఆఫీస్లో కూడా నేనెలాంటి వివక్షకు లోను కాలేదు. మగవాళ్లకు ఎలాంటి అవకాశాలు వచ్చాయో నాకూ అలాంటి అవకాశాలే వచ్చాయి. వాళ్లు డీల్ చేసిన కఠినతరమైన సవాళ్లను నేనూ డీల్ చేశాను. పదోన్నతులను కూడా అంతే సమానంగా పొందాను. కాని నేను బాగుండగానే నా చుట్టూ ఉన్న ఆడవాళ్లు బాగున్నట్టు కాదు కదా! వివక్షకు గురి అయిన అమ్మాయిలను చాలామందిని చూశాను. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో వాస్తవాలు ఏంటో నాకు తెలుసు. ఆడవాళ్లను చులకనగా చూస్తారు. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకునే మహిళలకు లోన్స్ కూడా దొరకని స్థితి. ప్రాపర్టీ ఉన్నా ఆమె పేరున ఉండదు. అంతా భర్త అధికారం కిందే, ఆయన అనుమతితోనే సాగాలి. ఈ చాలెంజెస్ అన్నిటినీ తట్టుకొని నిలబడ్డ వాళ్లను చూశాను. ఇవన్నీ గ్రహించాకే మహిళల కోసం ఏమన్నా చేయాలి అనిపించింది. అందుకే మా సంస్థలో ‘క్రెడిట్ ట్రీ’ ఏర్పాటు చేశాం. ఈ క్రెడిట్ ట్రీ కింద ఒంటరి స్త్రీలకు కూడా లోన్స్ ఇప్పిస్తాం. వ్యాపార, వాణిజ్య రంగాల్లో వాళ్లూ రాణించడానికి హెల్ప్చేస్తున్నాం’ అని వివరించారు కనికా కుమార్. గర్వంగా ఉంది ఇంత చిన్న వయసులో మా అమ్మాయి సాధించిన విజయం చూస్తుంటే గర్వంగా అనిపిస్తోంది. పని అంటే ప్యాషన్ ఆమెకు. చేస్తున్న పనిపట్ల నిజాయితీ, నిబద్ధతతో ఉంటుంది. సహాయం, సేవ ఆమె నైజం. తన పనితో సమాజంలో ఒక ఇంపాక్ట్ ఉండాలని తపన పడుతుంది. ఆత్మవిశ్వాసం మెండు. ఇవ్వాళ్టి అమ్మాయిలకు కావల్సింది కూడా అదే. ఫిజికల్ బ్యూటీ కాదు ఇన్నర్ బ్యూటీ చాలా ఇంపార్టెంట్. అదే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తల్లిదండ్రులు కూడా ఆ దిశగానే పిల్లల్లో విశ్వాసం పెంపొందింపచేయాలి. – అనిల్కుమార్, సీమా కుమార్ (కనికా కుమార్ తల్లిదండ్రులు) – సరస్వతి రమ -
దావోస్ సదస్సులో షారుఖ్కు క్రిస్టల్ అవార్డు
న్యూఢిల్లీ/జెనీవా: దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో బాలీవుడ్ హీరో షారుఖ్ఖాన్ అరుదైన గుర్తింపు దక్కనుంది. సదస్సు సందర్భంగా ఈ నెల 22వ తేదీన హాలీవుడ్ హీరోయిన్ కేట్ బ్లాంచెట్, ప్రఖ్యాత గాయకుడు ఎల్టన్ జాన్తోపాటు షారుఖ్ క్రిస్టల్ అవార్డు అందుకోనున్నారు. షారుఖ్ ఖాన్ గత 30 ఏళ్లుగా భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారని డబ్ల్యూఈఎఫ్ తన ప్రకటనలో పేర్కొంది. దేశంలో స్త్రీలు, పిల్లల హక్కుల ఆయన సాగిస్తున్న పోరాటానికి ఈ అవార్డు ఇస్తున్నట్లు తెలిపింది. యాసిడ్ దాడి, అగ్ని ప్రమాద బాధితులను ఆదుకునేందుకు మీర్ ఫౌండేషన్ను నడుపుతున్నారని, కేన్సర్ బాధిత చిన్నారులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారని వివరించింది. గతంలో ఈ అవార్డును అందుకున్న ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్, మల్లికా సారాభాయ్, ఏఆర్ రెహమాన్, షబానా అజ్మి తదితరులున్నారు. -
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు హాజరు కావాలంటూ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుకు ఆహ్వా నం అందింది. జనవరి 23–26 తేదీల్లో జరగనున్న ఈ సదస్సుకు హాజరు కావాలని ఓ రాష్ట్ర మంత్రికి ఆహ్వానం లభించడం ఇదే తొలిసారి. ఏటా జరిగే ఈ సదస్సుకు 2,500 మంది వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రతినిధులు, ఆర్థికవేత్తలు హాజరవుతారు. సాధారణంగా కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకే ఈ సదస్సుకు ఆహ్వానం దక్కుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడం పట్ల ఫోరం అభినందనలు తెలిపింది. ఇందుకు చురుగ్గా పనిచేసిన కేటీఆర్కు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానం పంపుతున్నట్లు పేర్కొంది. ఈ సదస్సులో ప్రపంచ దేశాల నుంచి రానున్న పలు కంపెనీల సీఈవోలు, చైర్మన్లతో కేటీఆర్ సమావేశమవుతారని ఆయన కార్యాలయం తెలిపింది. కాగా, ఫోరం నుంచి ఆహ్వానం లభించడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సదస్సు ద్వారా ప్రపంచం ముందు ఉంచుతామని పేర్కొన్నారు. ఈ సదస్సుకు మంత్రి కేటీఆర్తో పాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ రెసిడెంట్ కమిషనర్ అరవింద్కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ హాజరవుతారు. గతంలో చైనాలోని డాలియాన్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సీఎం కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే. -
సమానత్వానికి సుదూరంలో...
జెనీవా/న్యూఢిల్లీ: ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల పరిమిత పాత్ర, తక్కువ వేతనాల కారణంగా ప్రపంచ లింగ వ్యత్యాస సూచీలో భారత్ 108వ స్థానంలో నిలిచింది. 2016 నాటి ర్యాంకింగ్తో పోల్చితే 21 స్థానాలు దిగజారిన భారత్ పొరుగు దేశాలు బంగ్లాదేశ్(47), చైనా(100) కన్నా వెనకబడింది. ప్రపంచ ఆర్థిక ఫోరం(డబ్ల్యూఈఎఫ్) గురువారం విడుదల చేసిన ఈ నివేదిక భారత్లో ఆర్థిక, విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, రాజకీయాల్లో మహిళల స్థితిగతులను పూసగుచ్చింది. డబ్ల్యూఈఎఫ్ లింగ వ్యత్యాసాన్ని గణించడం ప్రారంభించిన 2006 నాటితో పోల్చితే ఈ ఏడాది భారత్ పది ర్యాంకులు నష్టపోవడం గమనార్హం. విద్యలో ఎంతో పురోగతి సాధించినా, ఆరోగ్యం, ఆయుః ప్రమాణాల్లో లింగ వ్యత్యాసం ఎక్కువగా ఉండటం భారత్ వెనకబాటుతనాన్ని సూచిస్తోంది. జాబితాలో ఐస్లాండ్ తొలి స్థానంలో నిలవగా, తర్వాత నార్వే(2), ఫిన్లాండ్(3), రువాండా(4), స్వీడన్(5) ఉన్నాయి. నివేదిక ముఖ్యాంశాలు: ► మొత్తం మీద 108వ ర్యాంకు సాధించిన భారత్ ఆర్థిక కార్యకలాపాలు, అవకాశాలు... ఆరోగ్యం విషయంలో మహిళల పాత్రకు సంబంధించి వరసగా 139, 141వ స్థానాల్లో నిలిచింది. ► ఇక పనిచేసే చోట లింగ వ్యత్యాసం, మహిళలకు వేతన చెల్లింపుల్లో 136వ స్థానంలో ఉంది. ► భారత్లో సగటున 66 శాతం మంది మహిళలకు వేతనాలు చెల్లించడం లేదు. పురుషుల్లో అయితే ఈ రేటు 12 శాతంగా ఉంది. ► రాజకీయ సాధికారత, ఆయుః ప్రమాణం, అక్షరాస్యతలో లింగ వ్యత్యాసం పెరగడమే భారత్ ఈ ర్యాకింగ్లో వెనకబడటానికి ప్రధాన కారణం ► భారత్ లింగ వ్యత్యాసాన్ని 67% పూరించింది. ఇది బంగ్లాదేశ్, చైనాలతో పోల్చితే తక్కువే ► ప్రాథమిక, మాధ్యమిక విద్యలో లింగ వ్యత్యాసాలు తగ్గడం భారత్లో ఒక సానుకూల అంశం. ఉన్నత విద్యలో తారతమ్యాలు తొలిసారి దాదాపు శూన్య స్థాయికి చేరుకోవడం విశేషం. ► ఆరోగ్యం విషయంలో లింగ వ్యత్యాసానికి సంబంధించి భారత్ చివరి నుంచి నాలుగో స్థానంలో నిలవడం ఆందోళన కలిగించేదే. గత దశాబ్ద కాలంలో ఈ ఉపసూచీలో భారతే అతి తక్కువగా అభివృద్ధి చెందింది. ► ప్రపంచ వ్యాప్తంగా కూడా లింగ వ్యత్యాస స్థితిగతుల్లో పెద్దగా పురోగతి లేకపోగా తొలిసారి తారతమ్యాలు పెరిగాయి. ► ప్రపంచ వ్యాప్తంగా 68 శాతం లింగ వ్యత్యాసాన్ని పూరించారు. 2016లో ఇది 68.3 శాతంగా ఉంది. ► ఇలాగే వృద్ధి జరిగితే సగటున లింగ సమా నత్వం సాధించాలంటే మరో వందేళ్లు పడుతుంది. ► ఇక పనిచేసే చోట తారతమ్యాలు తొలగించాలంటే 217 ఏళ్లు పడుతుంది. ► అధ్యయనం చేపట్టిన 144 దేశాల్లో సగం దేశాలు ఏడాది కాలంలో మెరుగైన స్కోరు సాధించాయి. -
‘చైనాపై ఆధారపడుతున్న అమెరికా’
డర్బన్: తమది పేద దేశం కాదని జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే అన్నారు. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా తర్వాత తమదే అభివృద్ధి చెందిన దేశమని పేర్కొన్నారు. ఆర్థికంగా చైనాపై ఆధారపడిన అమెరికా పేద దేశమని వ్యాఖ్యానించారు. తమది విఫలదేశం కాదనడానికి 90 శాతం అక్షరాస్యత నమోదు కావడమే నిదర్శనమన్నారు. సుదీర్ఘ కాలంగా జింబాబ్వేకు అధ్యక్షుడిగా ఉన్న ముగాబే పాలనలో ఇటీవల కాలంలో ఆర్థిక సంక్షోభం తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. ‘మాది పేద దేశం కాదు. దుర్భర దేశం కాదు. అమెరికాను దుర్భర దేశంగా పిలుస్తాను. ఎందుకంటే చైనాపై అమెరికా ఎక్కువగా ఆధారపడుతోంది. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా తర్వాత మాదే అత్యంత అభివృద్ధి చెందిన దేశమ’ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్యానల్ డిస్కసన్లో ముగాబే అన్నారు. 2000 సంవత్సరం నుంచి జింబాబ్వే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. నిరుద్యోగం ఆకాశాన్నంటింది. -
చంద్రబాబు దావోస్ పర్యటనపై సీఎంవో వివరణ
విజయవాడ: చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఆదివారం మరోసారి వివరణ ఇచ్చింది. ప్రపంచ ఆర్థిక సదస్సుల్లో పాల్గొనేందుకు తనకు ప్రత్యేక ఆహ్వానం వచ్చిందంటూ సీఎం చంద్రబాబు ఘనంగా చెప్పుకోగా.. అలాంటి ఆహ్వానం లేనేలేదని, రూ.కోట్ల ఫీజు చెల్లించి వెళ్లారని ‘సాక్షి’ బయటపెట్టిన నేపథ్యంలో సీఎంవో వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వైపాక్షిక సమావేశాలతోపాటు ఇతర సదస్సుల్లో చంద్రబాబు పాల్గొన్నారని తెలిపిన సీఎంవో.. ‘సాక్షి’ లేవనెత్తిన ప్రశ్నకు.. ప్రధాన వేదికపై ప్రసంగించే వక్తల జాబితాలో చంద్రబాబు ఉన్నారా? లేరా? అనేదానికి మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. (చంద్రబాబు దావోస్ పర్యటనల ఆంతర్యమిదే) దావోస్లో గతవారం జరిగిన 47వ ప్రపంచ ఆర్థిక సదస్సుకు ప్రత్యేకంగా తనకు ఆహ్వానం వచ్చిందని చంద్రబాబు చెప్పడం, అక్కడ పలు సంస్థల అధిపతులతో ఆయన చర్చలు జరిపినట్లు రోజూ ఎల్లో మీడియాలో ప్రముఖంగా ఫొటోలు కనిపించడం తదితర అంశాలపై ‘సాక్షి’ ఆరా తీయగా బాబువన్నీ డ్రామాలేనని తేలింది. దీనిపై ప్రచురితమైన ’స్టాల్ పెట్టు.. ప్రచారం కొట్టు’ కథనంతో చంద్రబాబు దావోస్ పర్యటనలన్నీ తననో ఆర్థిక మేధావిగా చూపించుకునేందుకు అబద్ధాలు, అభూత కల్పనలతో సాగిన కట్టుకథలేనని ప్రజలకు స్పష్టమైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారీ క్రమం తప్పకుండా చేస్తున్న ఈ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనమూ లేకపోగా ఖజానాపై మాత్రం రూ.కోట్ల భారం తప్పడంలేదని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. (దావోస్ సదస్సుకు టికెట్ కొనాల్సిందే!) -
‘దావోస్’ తేల్చేదేమిటి?
అమెరికా అధికార పగ్గాలు డోనాల్డ్ ట్రంప్ స్వీకరించబోతున్న పర్యవసానంగా ప్రపంచమంతటా ఏర్పడిన ఒక అయోమయ వాతావరణంలో ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాలు స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రారంభమయ్యాయి. వివిధ దేశాల అధి నేతలు, రాజకీయ నేతలు, ప్రపంచ కుబేరులు, వివిధ రంగాల్లోని ప్రముఖులు ఈ వార్షిక సమావేశాలకు హాజరవుతున్నారు. సమావేశాల ముగింపు రోజైన 20వ తేదీన అమెరికాలో ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తారు. వాస్తవా నికి ఈ సమావేశాలు కొండంత ఉత్సాహంతో ప్రారంభం కావాల్సి ఉంది. ఎందుకంటే స్వల్ప స్థాయిలోనే కావొచ్చుగానీ... చాన్నాళ్ల తర్వాత ఈమధ్యే మార్కెట్ల నుంచి కాస్త అనుకూల వార్తలు వినిపిస్తున్నాయి. మార్కెట్లలో కదలిక వచ్చింది. స్టాక్ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. చమురు ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఏడాదిక్రితం వరకూ అందరినీ భయపెట్టిన చైనా ఆర్ధిక వ్యవస్థ మందగమనాన్ని తగ్గించుకుని చురుకందుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. అదీగాక ఎప్పుడూ ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాల్లో పాల్గొనడానికి పెద్దగా ఉత్సాహం ప్రదర్శించని చైనా ఈసారి అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆధ్వర్యంలో భారీ ప్రతినిధి బృందంతో హాజరవుతోంది. కానీ వీటన్నిటినీ ట్రంప్ పీడ తుడిచిపెట్టేసింది. నిజానికి ట్రంప్ వల్ల మాత్రమే కాదు... ఆయనను అధికార పీఠం వరకూ తీసుకెళ్లిన ధోరణులు ప్రపంచమంతటా కనబడటమే, అవి నానాటికీ బలపడుతుండటమే దావోస్ సద స్సును కలవరపరుస్తున్న ప్రధాన సమస్య. 47 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఏటా వార్షిక సమావేశాలను నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్ధిక వేదిక పన్నెండేళ్లనుంచి సమా వేశాలకు ముందు సర్వేలు జరుపుతోంది. అదేవిధంగా పలువురు ఆర్ధిక రంగ నిపు ణులు తమ తమ అధ్యయనాలను ప్రకటిస్తున్నారు. వీటన్నిటినీ సక్రమంగా అర్ధం చేసుకోవడంలో, పరిష్కారాలు వెదకడంలో ప్రపంచ ఆర్ధిక వేదిక విఫలమైంది. మౌలికంగా ప్రపంచ ఆర్ధిక వేదిక ఉన్నతశ్రేణి, సంపన్నవర్గాల ప్రయోజనాలకు, శ్రేయస్సుకు ప్రాతినిధ్యం వహించే సంస్థ. ఎనిమిదేళ్లక్రితం ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఆర్ధిక మాంద్యం ఇంకా సమసి పోలేదు. సంపన్నులకూ, నిరుపేదలకూ మధ్య అగాథం నానాటికీ పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. ఈ సంగతిని ప్రపంచ ఆర్ధిక వేదిక తాజా నివేదిక సైతం అంగీకరిస్తున్నది. దాని పర్యవసానంగా ప్రజానీకంలో అసంతృప్తి, ఆగ్రహావేశాలు పెరగడం...వాటిని ఆసరా చేసుకున్న పార్టీలు, వ్యక్తులు ప్రజామోదాన్ని పొందడం కళ్లముందు కనబడుతున్న వాస్తవం. పలుచోట్ల కొత్త పార్టీలు, రాజకీయాలకు కొత్త అయిన వ్యక్తులు సైతం జనాదరణలో ముందుంటున్నారు. అమెరికాలో ట్రంప్ విజయం సాధించడానికి ముందే బ్రిటన్ రిఫరెండంలో బ్రెగ్జిట్ వాదులు విజయం సాధించడం, అప్పటి ప్రధాని డేవిడ్ కామెరాన్ తప్పుకోవాల్సి రావడం తెలిసిందే. ఇటలీలో సైతం రాజ్యాంగ సంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నించిన ప్రధాని పదవినుంచి తప్పుకోవాల్సివచ్చింది. అక్కడ సైతం ఆర్ధిక సంక్షోభం, దాని పర్యవ సానంగా ఏర్పడిన పరిస్థితులే జనం అసంతృప్తికి కారణం. ‘ప్రపంచీకరణ కాదు... అమెరికాకే ప్రాధాన్యత’ నినాదంతో విజయం సాధించిన ట్రంప్ అంతర్జాతీయ ఒప్పందాలకు వ్యతిరేకంగనుక తన మద్దతుదార్లెవరినీ దావోస్ సదస్సుకు పంపడం లేదు. ఇంకా ఒబామా అధికారంలో ఉండబట్టి అమెరికా నుంచి అధికార బృందం వస్తున్నదిగానీ అందువల్ల ఒరిగేదేమీ లేదు. ఏతావాతా ఈసారి ప్రపంచీకరణ నినా దాన్ని కమ్యూనిస్టు చైనా నెత్తినెత్తుకున్నట్టు కనబడుతోంది. వర్తమాన ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అనేకానేక సమస్యలపై చర్చించి, వాటి విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టవలసి ఉన్నదో నిర్ధారించడం దావోస్ సదస్సు అజెండా. ఆదాయాల్లో తీవ్ర వ్యత్యాసాలు, సంపద పంపిణీలో అసమతుల్యతలు అసంతృప్తిని రగిల్చిన పర్యవసానంగా కొత్త రాజకీయ ధోరణులు రంగ ప్రవేశం చేసి ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తున్నాయన్నది ఈ అంశాల్లో ప్రధానమైనది. అలాగే పర్యావరణానికి కలుగుతున్న ముప్పుపై కూడా సదస్సు సమీక్షిస్తుంది. సంపద పంపిణీ అవకతవకలు చక్కదిద్దకపోతే ఆయా దేశాల్లో సామాజిక సంఘీ భావం దెబ్బతినడం మాత్రమే కాదు... అంతిమంగా ప్రపంచ రాజకీయ, ఆర్ధిక సహకారం ధ్వంసమవుతుందని వేదిక అధ్యయనం భావిస్తోంది. సంపన్నులకూ, పేదలకూ మధ్య అంతరాలు పెరిగిపోవడం గురించి మాట్లాడేవారిని కమ్యూ నిస్టులుగా లేదా వారి అనుకూలురుగా ముద్రేయడం ప్రపంచంలో అన్నిచోట్లా ఉన్నదే. ఆ వాదనను ఖండించే పెట్టుబడిదారీ ప్రపంచం నుంచి ఇప్పుడు అదే తరహా మాటలు వినబడటం ఆశ్చర్యకరమే. కానీ ఎన్నికైన ప్రభుత్వాల విధానాలు చెల్లుబాటు కాకుండా చేసి, ఆ అధినేతల మాటలకు విలువ లేకుండా చేసింది తానేనని ప్రపంచ ఆర్ధిక వేదిక మరువకూడదు. బడుగు దేశాలపై అగ్రరాజ్యాల ద్వారా ఒత్తిళ్లు తెచ్చి అప్రజాస్వామికమైన పలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను అమలు చేయించిందీ... సంపన్న ప్రపంచం మరింత బలపడటానికి, బడుగు దేశాలు బక్కచిక్కడానికి దోహదపడిందీ ఆ సంస్థే. ఈ విధానాలవల్ల సంపన్న దేశాల్లో సైతం వ్యత్యాసాలు పెరిగాయి. ఆక్స్ఫామ్ విడుదల చేసిన తాజా నివేదిక ఈ స్థితికి అద్దం పడుతుంది. మన దేశంలోనే చూస్తే దేశ సంపదలో 58 శాతం కేవలం ఒక శాతం గుప్పెట్లో ఉంది. 84 మంది కుబేరుల వద్ద 24,800 కోట్ల డాలర్ల (సుమారు రూ. 16 లక్షల 87వేల కోట్లు) సంపద ఉన్నదని ఆ నివేదిక అంచనా. అంతర్జాతీయంగా చూస్తే కేవలం 8మంది వ్యక్తులు ప్రపంచ జనాభాలో సగభాగం సంపదను గుప్పెట్లో పెట్టుకున్నారని తేల్చింది. ప్రధాన స్రవంతి రాజకీయాలపై ఏహ్యభావం ఏర్పడ టానికి, జాత్యహంకార ధోరణులు పెరగడానికి ఈ అమానవీయ దోపిడీయే కారణ మవుతున్నదని ఆ నివేదిక తేల్చింది. ఇప్పటికైనా దావోస్ సదస్సు కళ్లు తెరిచి తన పాపాలను, వైఫల్యాలను అంగీకరిస్తుందా? సరైన పరిష్కారాలను అన్వేషిస్తుందా? నాలుగు రోజుల అనంతరం ఆ సంగతి తేలుతుంది. -
కేసీఆర్కు దావోస్ నుంచి ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరిలో దావోస్లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను ఫోరమ్ ఆహ్వానించింది. ఈజ్ ఆఫ్ డూరుుంగ్ బిజినెస్ (ఈఓడీబీ)లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవడం పట్ల వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వ్యవస్థాపకుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రొఫెసర్ క్లాస్ శ్వాబ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ప్రపంచ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక శాఖ ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడం, కేసీఆర్ నాయకత్వానికి, రాష్ట్రం పట్ల ఆయనకున్న దార్శనికతకు నిదర్శనమన్నారు. సీఎంతో పాటు మంత్రివర్గాన్ని అభినందిస్తూ బుధవారం ఆయన సందేశాన్ని పంపారు. -
శ్రమలో మహిళలదే పైచేయి
భారత్లో పురుషుల కన్నా సగటున 50 రోజులు ఎక్కువ పని లండన్: భారత్లో మహిళలు పురుషులకన్నా సగటున ఏడాదికి 50 రోజులు ఎక్కువ పనిచేస్తారని ప్రపంచ ఆర్థిక ఫోరం ఒక నివేదికలో తెలిపింది. ప్రపంచం మొత్తంలో చూస్తే ఇది 39 రోజులుగా ఉంది. మహిళలు, పురుషుల మధ్య ఆర్థిక అసమానతలు తొలగిపోవడానికి 170 ఏళ్లు పడుతుందని ఈ నివేదిక పేర్కొంది. కేవలం ఆరు దేశాల్లోనే పురుషులు మహిళల కన్నా ఎక్కువ పనిచేస్తారని తెలిపింది. ఆ ఆరింటిలో మూడు దేశాలు స్కాండినేవియా, ఫిన్ల్యాండ్, ఐస్ల్యాండ్. వేతనం లభించే పని వరకే చూస్తే పురుషులే మహిళల కన్నా 34 శాతం ఎక్కువగా కష్టపడుతున్నారు. దీనికి కారణం మహిళలు కార్యాలయాల్లో చేసే పని కన్నా వేతనం రానటువంటి ఇంటిపని, పిల్లలు, వృద్ధుల సంరక్షణ వంటి పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. -
భారతీయ మహిళలు ఎంత పనిచేస్తారో తెలుసా?
పని చేయడంలో మగవాళ్ల కంటే మగువలు ముందుంటారని పరిశోధకులు చెబుతున్నారు. రోజు మొత్తమ్మీద మగవాళ్ల కంటే ఆడాళ్లే ఎక్కువ సేపు పనిచేస్తారట. ప్రపంచవ్యాప్తంగా చూస్తే సగటున ఏడాదికి మహిళలు 39 రోజులు ఎక్కువ పనిచేస్తారు. అదే భారతదేశంలో అయితే 50 రోజులు ఎక్కువ పనిచేస్తారని అంటున్నారు. సగటున పురుషుల కంటే మహిళలు 50 నిమిషాలు ఎక్కువగా పనిచేస్తారని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నివేదిక తెలిపింది. ప్రపంచంలో కేవలం ఆరు దేశాలలో మాత్రమే మహిళల కంటే పురుషులు ఎక్కువ గంటలు పనిచేస్తారట. అయితే వీటిలో మూడు దేశాల్లో తల్లిదండ్రులకు ఇచ్చే సెలవులను పురుషులు, మహిళలు సమానంగా పంచుకోవచ్చు. భార్యాభర్తలలో ఒకరు ఉద్యోగానికి వెళ్తే, మరొకరు పిల్లల సంరక్షణ బాధ్యతను చూసుకుంటారని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో డేటా ఎనలిస్టుగా పనిచేస్తున్న వెసెలినా రచేవా చెప్పారు. మహిళల కంటే పురుషులకు 34 శాతం వరకు ఎక్కువ జీతాలున్నా, మహిళలే ఎక్కువ సేపు పనిచేస్తున్నారంటున్నారు. చాలావరకు ఇంటి పని, పిల్లల సంరక్షణ, వృద్ధుల సంరక్షణ లాంటి పనులు చేస్తున్నా, వాటికి జీతభత్యాలు ఏమీ ఉండవని చెప్పారు. దీంతో కలిపి చూసుకుంటేనే ఏడాది మొత్తమ్మీద పురుషుల కంటే ఎక్కువసేపు మహిళలు పనిచేస్తున్నారని చెప్పారు. భారతదేశం, పోర్చుగల్, ఈస్టోనియా దేశాల్లో మహిళలు ఏడాది మొత్తమ్మీద 50 రోజులు ఎక్కువ పనిచేస్తున్నారన్నారు. -
అది మహిళల ప్రాథమిక హక్కు
న్యూఢిల్లీ: స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం అనే అంశం చర్చకు రాగానే ఎవరైనా పనిచేసే చోట లింగభేదం లేకుండా సమాన వేతనం ఇవ్వాలని ఠక్కున అనేస్తారు. ప్రపంచవ్యాప్తంగా సహస్రాబ్దుల్లో 60 శాతం మంది దీనికే ఓటేశారని ‘ది గ్లోబల్ షాపర్స్’ వార్షిక సర్వే కూడా ఇటీవల వెల్లడించింది. ఇంట్లో మరుగుదొడ్లు, ముఖ్యంగా మహిళల సౌకర్యార్థం ఏర్పాటు చేసినప్పుడు నిజమైన సమానత్వం సాధించినట్లు అవుతుందనేది ఎంత మంది అంగీకరిస్తారో తెలియదు. గ్రామీణ భారతంలో ఇప్పటికీ మహిళలు రోడ్డు పక్కన బహిర్భూమికి వెళుతున్నారంటే పౌరులుగా మనం సిగ్గు పడాల్సిందే. తెల్లవారకముందే లేదా చీకటి పడ్డాక బహిర్భూమికి మహిళలు వెళ్లడం ఎంత కష్టం. తేళ్లు, పాములు కరిచే ప్రమాదమే కాకుండా మానవ మృగాలు కూడా కాటువేసే ప్రమాదం వారికి పొంచి ఉంటుంది. దేశంలో టాయ్లెట్ల కన్నా సెల్ఫోన్లు పెరిగిపోయిన నేటి పరిస్థితుల్లో ఆలయాలకన్నా ముందు మరుగుదొడ్లు నిర్మించాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునివ్వడం ఎంతో సమంజసం. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ దేశంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఓ ఉద్యమంలా చేపట్టాలని పదే పదే ఉద్బోధించారు. దేశంలో 63.60 కోట్ల మంది భారతీయులకు మరుగుదొడ్లు లేవనే విషయాన్ని గుర్తించిన ఆయన వీటి నిర్మాణం కోసం వంద కోట్ల డాలర్లను విడుదల చేశారు. ఇప్పటికీ దేశంలో 2.40 కోట్ల మరుగుదొడ్లను ప్రభుత్వం నిర్మించిందని ఇటీవల ఆయన ఓ సందర్భంలో తెలిపారు. 2019 నాటికి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం ఉండాల్సిందేనని ఆయన ఆశించారు. మరుగుదొడ్లు కలిగి ఉండడం మహిళల ప్రాథమిక హక్కుకాగా, వాటిని ఏర్పాటు చేయడం మనందరి బాధ్యత. (ఢిల్లీలో ఆరు, ఏడు తేదీల్లో జరుగుతున్న భారత ఆర్థిక సమ్మేళనం సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రచురించిన వ్యాసం నుంచి) -
స్త్రీ, పురుష వేతనాల్లో ఇంత వ్యత్యాసమా?
లండన్: ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషుల మధ్య వేతన వ్యత్యాసం అలాగే కొనసాగుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వేతన వ్యత్యాసం ఎక్కువగా ఉండడం ఆశ్చర్యకరం. ప్రపంచ ఆర్థిక ఫోరమ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం బ్రిటన్లో స్త్రీ, పురుషుల మధ్య వేతన వ్యత్యాసం 66 శాతం ఉండగా, చైనాలో 65 శాతం, అమెరికాలో 64 శాతం, కెనడాలో 62 శాతం, ఫ్రాన్స్లో 50 శాతం కొనసాగుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో స్త్రీ, పురుషుల మధ్య వేతన వ్యత్యాసం బ్రిటన్లోనే ఎక్కువగా ఉంది. అక్కడ ఒకే ఉద్యోగానికి పురుషులకు చెల్లిస్తున్న వేతనాల్లో మూడో వంతు మాత్రమే స్త్రీలకు చెల్లిస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో బ్రిటన్ ప్రభుత్వం 250 మందికన్నా మించి ఉద్యోగులున్న కంపెనీలు తప్పనిసరిగా స్త్రీలకు చెల్లిస్తున్న వేతనాలు, బోనస్ ఎంతో, అలాగే పురుషులకు చెల్లిస్తున్న వేతనాలు, బోనస్ ఎంతో వివరాలను ప్రకటించాలంటూ కొత్త నిబంధనలను జారీ చేసింది. అలాగే ఏ ర్యాంకులో ఎంతు మంది పురుషులు, ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేయాలని కూడా పేర్కొంది. ఈ నిబంధనను 2018 సంవత్సరం నుంచి తప్పనిసరిగా అమలు చేయాలని కోరింది. స్త్రీ, పురుషుల వేతనాల వ్యత్యాసాన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వ నిబంధనలు ఎంతగానో తోడ్పడతాయని లింగ వివక్షతకు వ్యతిరేకంగా బ్రిటన్లో పోరాటం చేస్తున్న ఫాసెట్ సొసైటీ వ్యాఖ్యానించింది. అయితే వ్యత్యాస నిర్మూలనకు ఈ నిబంధనలు దోహదపడవని, వ్యత్యాసం చూపిస్తున్న కంపెనీలకు జరిమానాలు విధిస్తేనే వ్యత్యాసాన్ని నిర్మూలించవచ్చని అభిప్రాయపడింది. అమెరికా కూడా ఇలాంటి నిబంధనలను తీసుకరావాలని యోచిస్తోంది. వంద మందికన్నా ఎక్కువ ఉద్యోగులను కలిగివున్న కంపెనీలు జాతి, మత, లింగపరంగా చెల్లిస్తున్న వేతనాలను వెల్లడించాలని దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవలనే ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై చర్చలు కొనసాగుతున్నాయి. -
50 లక్షల ఉద్యోగాలు స్వాహా....
తిక్క లెక్క ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రోబోల వాడకం వల్ల లేదా వాటి కృత్రిమ మేధ వల్ల రానున్న 5 ఏళ్లలో దాదాపు 15 దేశాలలో సుమారు 50 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని తాజా అధ్యయనం తెలుపుతోంది. దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ (డబ్ల్యు.ఇ.ఎఫ్) వార్షిక సమావేశాలలో ఆ మేరకు నివేదిక విడుదలైంది. వాస్తవానికి 70 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని, అయితే ఈ కృత్రిమ మేధను ఉపయోగంలోకి తేవడానికి అవసరమైన 20 లక్షల కొత్త ఉద్యోగాలు అవసరమైనందుకు స్థూలంగా 50 లక్షల ఉద్యోగాలు పోకతప్పదని నిర్థారిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయేవాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ శాతం ఉండొచ్చట. సేల్స్, అడ్మినిస్ట్రేషన్, గుమస్తాగిరి వీటిలో ఎక్కువగా ఉండేది మహిళా ఉద్యోగులే కనుక రోబోల వాడకం ఇక్కడే ఎక్కువ కానున్నది కనుక భారీ నష్టం ఆడవారికేనని తాజా హెచ్చరిక. సో... రోబోలకు చిక్కని మేధో ఉపాధి మార్గాలలోకి స్త్రీలు బదిలీ కాకతప్పదేమో. -
అమరావతికి ఆహ్వానం
ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలకు సీఎం పిలుపు ♦ దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఇండియన్ కమ్యూనిటీ సమావేశంలో చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచశ్రేణిలో నిర్మిస్తున్నామని, పెట్టుబడులతో వచ్చి కార్యాలయాలు ప్రారంభించాలని ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలకు సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్లో మంగళవారం రాత్రి వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఇండియన్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘‘పారిశ్రామిక దిగ్గజాలైన మీకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మా నూతన రాజధాని అమరావతికి వచ్చి కార్యాలయాలు ప్రారంభించండి.. ప్రపంచంలోనే జీవయోగ్య నగరంగా అమరావతిని తీర్చిదిద్దనున్నాం. అక్కడ పరిశ్రమలు పెట్టి ఉత్పాదన పెంచుకోవచ్చు. లాభపడవచ్చు. మీకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ డెస్క్ విధానం ద్వారా అన్ని అనుమతులను ఒకే ఛత్రం కింద 21 రోజుల్లో ఇస్తున్నాం’’ అని చెప్పారు. సమావేశంలో బజాజ్ గ్రూప్ ఛైర్మన్ రాహుల్ బజాజ్, ఇన్ఫోసిస్ ఎండీ, అమెరికన్ సీఈవో విశాల్ సిక్కా, భారతి ఎంటర్ ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్, పిరమిల్ గ్రూప్ ఛైర్మన్ అజయ్ పిరమల్, సుజనాల్ రిన్యువబుల్ ఎనర్జీ ఛైర్మన్ తులసి తంతి తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన ఏపీ బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు పరకాల ప్రభాకర్, ఉన్నతాధికారులు పీవీ రమేష్, జి.సాయిప్రసాద్, అజయ్జైన్, ఎస్ ఎస్ రావత్లతో పాటు జాస్తి కృష్ణకిషోర్, కార్తికేయ మిశ్రా ఉన్నారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్లో ‘ఫ్యూచర్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ సర్వీసెస్’ అనే అంశంపై జరిగిన సమావేశంలో సీఎంప్రసంగిస్తూ రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లు, సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని పనిచేస్తున్న తీరు, రాజధాని నిర్మించుకునేందుకు దక్కిన అరుదైన అవకాశాన్ని వివరించారు. అమరావతి భూముల సమీకరణ విధానంపై సదస్సులో పలువురు ప్రముఖులు ఆసక్తి కనబర్చారు. ఏపీ పర్యాటకంపై శ్రీలంక ప్రధాని ఆసక్తి ఆంధ్రప్రదేశ్లో పర్యాటకరంగంలో ఉన్న అవకాశాలపై శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే ఆసక్తి కనబరిచారు. రణిల్ విక్రమ సింఘే, ఆర్థిక మంత్రి రవి కరుణనాయకే, బెల్జియం ప్రిన్సెస్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనను శ్రీలంక ప్రధానమంత్రి విందుకు ఆహ్వానించారు. సదస్సులో సీఎంని కలిసిన టాటా చైర్మన్ సైరస్ మిస్త్రీ ఏపీలో విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచిన నెస్లే సీఈవో పౌల్ బుల్కె పాల ఉత్పత్తులు, కాఫీ సెక్టారులలో పెట్టుబడులు పెడతామని చెప్పారు. కేపీఎంజీ నెదర్లాండ్ చైర్మన్ రిచర్డ్ రెఖేతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన సీఎం తీరప్రాంత అభివృద్ధిలో నెదర్లాండ్ సాధించిన విజయాలను, అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. శ్రేయ్ ఇంటర్నేషనల్ ఫండ్ మేనేజర్స్ ఎండీ హేమంత్ కనోరియాసీఎంతో సమావేశమై ఏపీలో మౌలిక వసతులు, తయారీ రంగంలో ఆసక్తి చూపారు. కేంబ్రిడ్జి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సర్ లెజెక్ బోరీ స్యూయిజ్తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీ-కేంబ్రిడ్జి వర్సిటీ పరస్పర సహాయ సహకారాలపై అధ్యయనానికి వర్సిటీ నుంచి 18 మంది స్కాలర్స్ను త్వరలో రాష్ట్రానికి పంపనున్నటు వీసీ చెప్పారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్కు చెందిన ప్రొఫెసర్ కిషోర్ మెహబూబాని సీఎంతో సమావేశమై ప్రజా విధానాలు, వాణిజ్యం, పోటీతత్వంలో ఏపీకి ఉన్న అవకాశాలను శోధిస్తున్నామని, త్వరలోనే నివేదిక అందిస్తామని తెలిపారు. ఏపీని విద్య, వైజ్ఞానిక హబ్గా తీర్చిదిద్దేందుకు నేషనల్ వర్సిటీ ఆఫ్ సింగపూర్కు అనుబంధంగా ఉన్న లీ ఖాన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ముందుకొచ్చింది. -
'ఏపీ బ్రాండ్' కోసమే దావోస్ పర్యటన
హైదరాబాద్: స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో ఈ నెల 20 నుంచి 23 వ తేదీ వరకూ జరగనున్న 46 వ ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు అత్యున్నత అధికారుల బృందంతో సోమవారం సాయంత్రం బయలుదేరి వెళ్తారు. 24 న తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు. ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీ ప్రముఖులు పాల్గొంటారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ లు పలు ప్లీనరీ సదస్సుల్లో మాట్లాడనున్నారు. ‘నాలుగో పారిశ్రామిక విప్లవం’ ప్రధానాంశంగా (theame) నిర్వహించే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఈ అంశంపై మరింత పరిజ్ఞానం సాధించి రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి బాటవేయటమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. 'ఏపీ బ్రాండ్' కోసం దావోస్ పర్యటన ఉపకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. బయోటెక్నాలజీ, రోబోటిక్స్ , త్రిడీ ప్రింటింగ్ వంటి శాస్ర్త సాంకేతిక అంశాలు, మానవుడిపై వాటి ప్రభావం తదితర విషయాలపై దావోస్ సదస్సులో చర్చలు ఉంటాయని పరకాల వెల్లడించారు. ఇలావుంటే సదస్సుకొచ్చే వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడి దారుల్ని ఆకర్షిచేందుకు దావోస్ పర్యటన లో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. ‘మేక్ ఆంధ్రప్రదేశ్ యువర్ బిజినెస్’ పేరుతో రూపొందించిన ప్రచార రథం దావోస్ వీధుల్లో విహరిస్తూ సంచలనం సృష్టిస్తూ స్థానికులను ఆకర్షిస్తోంది. ఇందుకోసం వినూత్నంగా ఏర్పాటు చేసిన హోర్డింగులు దావోస్ నగరంలో ఆకర్షణగా నిలిచాయి. -
మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతా
ఆర్థికలోటు ఉన్నా ప్రణాళికబద్ధంగా రాష్ట్ర అభివృద్ధి : సీఎం సాక్షి ప్రతినిధి, కడప: ‘‘రాష్ట్ర విభజన హేతుబద్ధంగా చేపట్టలేదు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్. ఆదాయం లేదు.. అప్పులున్నాయి. అధైర్యపడితే ముందుకెళ్లలేం. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకునేందుకు ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తున్నా. 2029 నాటికి భారతదేశంలో నంబర్-1గా, 2050 నాటికి ప్రపంచంలోనే మేటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నా’నని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కడప కార్పొరేషన్ 49వ డివిజన్ పరిధిలోని ఆలంఖాన్పల్లెలో శనివారం నిర్వహించిన జన్మభూమి-మా ఊ రు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అన్ని వనరులున్న ఆంధ్రప్రదేశ్లో 900 కిలోమీటర్లు కోస్టల్ కారిడార్ ఉందని, పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేస్తూ లక్ష్యం సాధిస్తామని చెప్పారు. పట్టిసీమ పథకం ద్వారా 8 టీఎంసీల నీరు డెల్టాకు తెచ్చామని, ఆ మేరకు శ్రీశైలం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసి రాయలసీమకు అందిస్తామని చెప్పారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కొత్తగా కొత్తగా ఆలోచించాలని సీఎం పిలుపునిచ్చారు. కడపలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలు ప్రదానం చేశారు. సంక్రాంతి కానుకలో అవినీతి సహించం సాక్షి, విజయవాడ బ్యూరో: చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీలో అవినీతి, అక్రమాలు జరిగితే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంపై ఆయన శనివారం కాకినాడ నుంచి రాష్ట్రంలోని 8 వేల మంది అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 19న దావోస్కు బాబు సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుఈ నెల 19న దావోస్ (స్విట్జర్లాండ్) వెళ్లనున్నారు. 24వ తేదీ వరకు ఆయన అక్కడే ఉంటారు. ఆయన వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, పలువురు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. -
పెట్టుబడులతో రండి
-
పెట్టుబడులతో రండి
⇒ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో సీఎం కేసీఆర్ ⇒ కలసి పనిచేద్దాం.. ప్రగతి సాధిద్దాం ⇒ హైదరాబాద్లో కావాల్సినంత ⇒ భూమి ఉంది.. మాది ప్రపంచంలోనే వినూత్న పారిశ్రామిక విధానం ⇒ అడ్డంకులు, ఆటంకాలు లేని అత్యుత్తమ విధానం ఇదొక్కటే ⇒ భారత్ వృద్ధిలో రాష్ట్రాలది కీలక పాత్ర ⇒ ప్రధాని మోదీ సారథ్యంలో ముఖ్యమంత్రులతో టీం ఇండియా ⇒ భారత్ సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంతో దూసుకెళ్తోందన్న కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘‘పెట్టుబడులతో రండి.. కలిసి పనిచేద్దాం.. కలిసి అభివృద్ధి చెందుదాం..’’ అని ప్రపంచ పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. భారత్ పెట్టుబడులకు స్వర్గధామమని అన్నారు. తెలంగాణలో.. ప్రత్యేకంగా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని కోరారు. అనువైన వాతావరణంతో పాటు పరిశ్రమలకు కావాల్సినంత భూమి హైదరాబాద్లో అందుబాటులో ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన పారిశ్రామిక విధానం ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు. సింగిల్ విండో విధానాలు చాలా దేశాల్లో ఉన్నప్పటికీ.. ఆటంకాలు, అడ్డంకుల్లేని అత్యున్నత విధానం ఇదొక్కటేనన్నారు. చైనాలోని డేలియన్ నగరంలో బుధవారం వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన న్యూ ఛాంపియన్స్-2015 సదస్సులో సీఎం పాల్గొన్నారు. ‘ఎమర్జింగ్ మార్కెట్స్ ఎట్ క్రాస్రోడ్స్’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... కొత్త రాష్ట్రంలో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం, ఇంటింటికీ మంచినీరు, అత్యుత్తమ పారిశ్రామిక విధానం, హైదరాబాద్కు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ఇప్పటి చైనా వేరు.. చైనాను చూసి ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. 30 ఏళ్ల కిందటి చైనా వేరు. ఇప్పుడున్న చైనా వేరు. అనూహ్యమైన అభివృద్ధితో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. భారత్ కూడా ఇలాగే ముందుకు వెళ్తోంది. అంతర్జాతీయ పరిణామాలు మాకు అనుకూలంగా ఉన్నాయి. అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో ఉన్నప్పటికీ.. చమురు ధరలు తగ్గడం శుభ పరిణామం. ఈ లాభాన్ని పేదల మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించే వీలుంది. తద్వారా సమ్మిళిత అభివృద్ధికి అడుగులు వేస్తాం. సంపన్నులు సంపన్నులుగానే, పేదలు పేదలుగానే మిగిలిపోతే లాభం లేదు. అలాంటి అవాంఛనీయమైన పరిస్థితులు తలెత్తకుండా సమతుల్యతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తాం. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలెలా ఉన్నా.. భారత ఆర్థిక వ్యవస్థ చౌరస్తాలో దిక్కులు చూసే పరిస్థితిలో లేదు. సంస్కరణలతో శరవేగంగా దూసుకెళ్తోంది. నీతి ఆయోగ్... టీమ్ ఇండియా! భారత్ అభివృద్ధిలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు, నిధులను పంపిణీ చేసింది. గతంలో ఉన్న ప్రణాళికసంఘం బదులుగా ప్రధా ని సారథ్యంలో ముఖ్యమంత్రుల భాగస్వామ్యం తో ‘నీతి ఆయోగ్’ ఏర్పాటైంది. దీన్ని టీమ్ ఇండియాగా చెప్పుకుంటున్నాం. ప్రధాని నేతృత్వంలో ముఖ్యమంత్రులంతా కలిసికట్టుగా దేశాభివృద్ధితో పాటు రాష్ట్రాల అభివృద్ధికి ప్రణాళికలు రూ పొందిస్తున్నాం. భారత్లో ఫెడరల్ వ్యవస్థ గొప్ప గా పని చేస్తోంది. కొత్తగా.. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. నవ రాష్ట్రమైనప్పటికీ అద్భుతమైన పారిశ్రామిక విధానాన్ని తెచ్చాం. గడిచిన 2 నెలల్లోనే 56 కంపెనీలకు అనుమతులు జారీ చేశాం. దాదాపు రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించాం. ఈ పరిణామాలు భారత్ అనుసరిస్తున్న దృక్పథాన్ని ప్రపంచానికి చాటి చెపుతున్నాయి. అభివృద్ధిలో నూతన శిఖరాలను అధిరోహించాలన్నదే మా ప్రయత్నం. సంస్కరణల దిశగా దృష్టి సారించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఎంతో సమర్థంగా పని చేస్తున్నారు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా గొప్ప విజయం సాధించారు. రాష్ట్రానికి సహకరించండి వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో భాగంగా నగరాల అభివృద్ధి, సవాళ్లు అనే అంశంపైనా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలను విశ్లేషించారు. చైనాలో అభివృద్ధి చెందిన జుయాంగ్జో, యువీ నగరాలకు చెందిన మేయర్లు, డిప్యూటీ మేయర్లతో తన అభిప్రాయాలు పంచుకున్నారు. నగరాల అభివృద్ధిలో తమ అనుభవాలను తెలియజెప్పి.. తెలంగాణకు సహకారం అందించాలని కోరారు. హైదరాబాద్లో సదస్సు నిర్వహించండి: కేసీఆర్ భవిష్యత్తులో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సును హైదరాబాద్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. హైదరాబాద్ ఆతిథ్యం స్వీకరించాలని ఫోరం ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. బుధవారం సదస్సు ప్రారంభానికి ముందు వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఎక్స్క్యూటివ్ చైర్మన్ ప్రొఫెసర్ క్లాస్ స్క్వాబ్తో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అరగంటకుపైగా చర్చలు జరిపారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సామాజిక ఆర్థిక పరిస్థితులను సీఎం ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. అంతర్జాతీయ స్థాయి నగరంగా పేరొందిన హైదరాబాద్కు ఉన్న విశిష్టతలను పంచుకున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం సత్ఫలితాలు అందిస్తోందన్నారు. సామాజిక, ఆర్థిక ఆవిష్కరణలతో తెలంగాణ అందరినీ ఆకర్షిస్తోందని ఈ భేటీ అనంతరం స్క్వాబ్ అభిప్రాయపడ్డారు. స్క్వాబ్ను కలుసుకోవటం తాను మరిచిపోలేనని, ఆయనతో భేటీ ఎంతో స్ఫూర్తినిచ్చిందని కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రితోపాటు మంగోలియా ప్రధాని, చైనా ఐటీ మంత్రి, రష్యా ఉప ప్రధాని.. స్క్వాబ్ను కలుసుకున్నారు. ఇదే సందర్భంగా సీఎం.. స్క్వాబ్ ఫౌండేషన్ చైర్పర్సన్ హిల్డే స్క్వాబ్తో సమావేశమయ్యారు. 1998 నుంచి క్షేత్రస్థాయిలో సేవలందించటంతో పాటు సామాజిక నిబద్ధతతో పని చేసిన వారిని ఈ సంస్థ ప్రత్యేకంగా గుర్తిస్తోంది. ప్రతి ఏడాది భారత్లో సోషల్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా పేరుతో ఒకరిని ఎంపిక చేస్తోంది. సామాజిక రంగంలో ఈ ఫౌండేషన్ చేస్తున్న కృషిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటివరకు ఈ అవార్డులు అందుకున్న వారిలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారే ఉన్నారని గుర్తు చేశారు. -
ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో కేసీఆర్
-
వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కేసీఆర్ ప్రసంగం
బీజింగ్: భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థ గొప్పగా పనిచేస్తోందని, దేశాభివృద్ధిలో రాష్ట్రాలదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. చైనాలో పర్యటిస్తున్న కేసీఆర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగించారు. భారత్లో 29 వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని, అభివృద్దిలో నూతన శిఖరాలను అధిరోహించాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు. పారిశ్రామిక అనుమతుల కోసం తెలంగాణలో ఐపాస్ రూపంలో గొప్ప పాలసీని ప్రవేశపెట్టామని కేసీఆర్ వెల్లడించారు. అసెంబ్లీలో చట్టాన్ని తెచ్చి రెండు వారాల్లో అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి విషయంలో ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందని, సంస్కరణల విషయంలో ప్రధాని మోదీ గట్టిగా పనిచేస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. -
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో కేసీఆర్
హైదరాబాద్ : చైనాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన మూడోరోజూ కొనసాగుతోంది. డలియన్లో ప్రారంభమైన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు కేసీఆర్తో పాటు రాష్ట్రం నుంచి వెళ్లిన పారిశ్రామిక ప్రతినిధి బృందం పాల్గొన్నారు. 'ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు...అభివృద్ధి చెందుతున్నమార్కెట్లు' అనే అంశంపై కేసీఆర్ ఈ సదస్సులో ప్రసంగిస్తారు. అలాగే ఎకనామిక్ ఫోరం వేదిగా తెలంగాణలో పెట్టుబడులను కేసీఆర్ కోరనున్నారు. -
సమ్మిళిత వృద్ధిలో అట్టడుగున భారత్
డబ్ల్యూఈఎఫ్ నివేదిక జెనీవా: అభివృద్ధి, సమ్మిళిత వృద్ధి అంశాల్లో భారత్ దాదాపు అట్టడుగు స్థానంలో ఉందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఒక నివేదికలో పేర్కొంది. అయితే, వ్యాపారం.. రాజకీయాల్లో నైతికత విషయంలో మాత్రం అంతర్జాతీయంగా మెరుగైన స్థితిలోనే ఉన్నట్లు వివరించింది. 112 ఎకానమీలపై దాదాపు రెండేళ్ల పాటు అధ్యయనం అనంతరం విడుదల చేసిన సమ్మిళిత వృద్ధి మరియు అభివృద్ధి నివేదికలో డబ్ల్యూఈఎఫ్ ఈ అంశాలు పేర్కొంది. ఇందులో ర్యాంకింగ్స్ ప్రకారం .. మధ్యస్థాయి ఆదాయాల దేశాల జాబితాలోని 38 దేశాల్లో భారత్ దాదాపు చివరి స్థానాల్లో ఉంది. ఆర్థిక ప్రయోజనాల బదలాయింపు అంశంలో 37వ స్థానంలో ట్యాక్స్ కోడ్ అమల్లో 32వ స్థానంలో, సామాజిక భద్రత విషయంలో 36వ స్థానంలో ఉంది. ఇక చిన్న వ్యాపారాల యాజమాన్యం అంశంలో గ్రూప్లోని మిగతా అన్ని దేశాల కన్నా అట్టడుగున 38వ స్థానంలో నిల్చింది. అయితే, వ్యాపార, రాజకీయ నైతికత విషయంలో మెరుగ్గా 12వ స్థానంలోనూ, పెట్టుబడులు ఉత్పాదకతకు ఉపయోగపడుతున్నాయన్నది సూచిస్తూ ఆర్థిక మధ్యవర్తిత్వం అంశంలో 11వ స్థానంలో ఉంది. అసెట్ నిర్మాణం, ఔత్సాహిక వ్యాపారవేత్తలను తీర్చిదిద్దడంపై భారత్ దృష్టి సారించాల్సి ఉంటుందని డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. -
చైనా పర్యటనకు బయల్దేరిన కేసీఆర్
-
చైనా పర్యటనకు బయల్దేరిన కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం చైనా పర్యటనకు బయల్దేరారు. ఆయనతో పాటు 15మందితో కూడిన రాష్ట్ర ప్రతినిధి బృందం ఈ పర్యటనలో ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం ఆధ్వర్యంలో చైనాలోని డేలియన్ నగరంలో జరగనున్న 'న్యూ చాంపియన్స్-2015' సదస్సులో పాల్గొనడంతో పాటు అక్కడి ప్రధాన నగరాలైన బీజింగ్, షాంఘై, డేలియన్, హాంకాంగ్, షెంజన్లను ఈ బృందం సందర్శించనుంది. ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు 10 రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో కేసీఆర్ అక్కడి పలు సంస్థలతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శించనున్నారు.రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన బృందంలో: రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ కె. మధుసూదనా చారి, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, అదనపు ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, నిఘా విభాగం ఐజీ శివధర్రెడ్డి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఐజీ మహేశ్ భగవత్, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, టీఎస్ఐఐసీ వీసీ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, సీఎం కార్యాలయం నుంచి ఎం.సంతోష్, సుభాష్రెడ్డి, మిషన్ మేనేజర్లు జగదీశ్ రామడుగు, శివాని శంకర్ ఉన్నారు. -
'టీ'బ్రాండ్... చలో చైనా
తెలంగాణ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పర్యటన ♦ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే బయలుదేరుతున్న సీఎం బృందం ♦ రేపు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణం ♦ పెట్టుబడులు, పరిశ్రమలపై ప్రత్యేకంగా దృష్టి ♦ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రసంగించనున్న కేసీఆర్ ♦ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో ప్రతినిధి బృందం ♦ శనివారమే చైనాకు చేరుకున్న ఇద్దరు ఐఏఎస్లు ♦ పది రోజులపాటు పర్యటన.. 16న తిరిగి రాష్ట్రానికి సీఎం బృందం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బ్రాండ్ ఇమేజీని ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చైనా పర్యటన జరగనుంది. దాదాపు పది రోజుల పాటు రాష్ట్ర ప్రతినిధి బృందం జరపనున్న ఈ పర్యటనకు... ప్రభుత్వం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది. దేశంలోనే వినూత్నంగా సింగపూర్ తరహాలో ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రచారం చేయాలని... దేశ విదేశాల నుంచి భారీస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. అంతేకాదు ఔషధ రంగానికి హైదరాబాద్లో ఉన్న అనుకూల పరిస్థితులను చాటి చెప్పనుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ కంటే ఒకరోజు ముందుగానే (సోమవారం ఉదయమే) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం చైనా పర్యటనకు బయల్దేరుతోంది. అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘న్యూ చాంపియన్స్-2015’ సదస్సులో సీఎం కేసీఆర్పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా బహుళ జాతి సంస్థలు, వివిధ దేశాలు, పౌర సమాజాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే ఈ సదస్సులో... నూతన ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి అంశాలపై చర్చ జరుగనుంది. 9 నుంచి 11వ తేదీ వరకు చైనాలోని డేలియన్లో జరిగే ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎండీ ఫిలిఫ్ రోస్లర్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణీకరణ, నూతన ఆవిష్కరణలతో కూడిన అభివృద్ధి తదితర అంశాల్లో జరిగే చర్చలో అభిప్రాయాలు పంచుకోవాలని కోరారు. విధానాల రూపకల్పనలో కొత్త పంథాను అనుసరించటం వల్లే తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షిస్తోందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇప్పటికే ప్రశంసించడం గమనార్హం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో జరిగే సదస్సు కావటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పర్యటనకు మొగ్గు చూపింది. కేసీఆర్ ఈనెల 9న ఈ సదస్సులో ప్రసగించనున్నారు. టార్గెట్ బ్రాండ్ ఇమేజీ రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్, విద్యుత్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి చైనాలోని పలు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. వీటితో పాటు హార్డ్వేర్ పరిశ్రమల స్థాపనకు అక్కడి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది ఆగస్టులో చైనాకు చెందిన డాంగ్ఫాంగ్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ప్రతినిధులు హైదరాబాద్కు వచ్చి సీఎం కేసీఆర్తో సంప్రదింపులు జరిపారు. రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి, విద్యుత్ పరికరాల తయారీకి సహకారం అందిస్తామని కూడాప్రకటించారు. ఇక సిచువాన్ ప్రావిన్స్తో సంబంధాలు మెరుగు పరుచుకునేందుకు చెంగ్డూ పట్టణాన్ని సందర్శించాలంటూ అక్కడి విదేశీ వ్యవహారాల కార్యాలయం గత ఏడాది నవంబర్లో సీఎం కేసీఆర్కు ఆహ్వాన లేఖ పంపింది. ఈ నేపథ్యంలో వరల్డ్ ఎకనామిక్ సదస్సును పురస్కరించుకొని చైనా పర్యటనకు వెళ్లడం ద్వారా బహుళ ప్రయోజనాలు ఉంటాయని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దాంతోపాటు తెలంగాణ బ్రాండ్ ఇమేజీని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని యోచిస్తున్నారు. ప్రత్యేక విమానంలో.. సోమవారం ఉదయం పది గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎంతో పాటు మొత్తం 15 మందితో కూడిన ప్రతినిధి బృందం చైనా పర్యటనకు బయల్దేరుతుంది. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీశ్రెడ్డి, ఎంపీ కె.కేశవరావు, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, ఇంటెలిజిన్స్ ఐజీ శివధర్రెడ్డి, సెక్యూరిటీ వింగ్ ఐజీ భగవత్ మహేష్ మురళీధర్, సీఎం వ్యక్తిగత కార్యదర్శి జోగినిపల్లి సంతోష్కుమార్, రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సుభాష్రెడ్డి ఈ బృందంలో ఉన్నారు. ఇక సీఎం పర్యటన ఏర్పాట్ల నిమిత్తం పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్కుమార్, రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ నర్సింహారెడ్డి శనివారమే చైనాకు వెళ్లారు. పది రోజుల ట్రిప్ ఖరారైన షెడ్యూల్ ప్రకారం 7వ తేదీ నుంచి 16 వరకు పది రోజుల పాటు కేసీఆర్ చైనా పర్యటన కొనసాగుతుంది. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న ప్రభుత్వ ప్రతినిధి బృందం రాత్రికి చైనాలోని డేలియన్కు చేరుకుంటుంది. మూడు రోజుల పాటు అక్కడ బస చేస్తుంది. అక్కడ 9వ తేదీన జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఈ బృందం పాల్గొంటుంది. 10న డేలియన్ నుంచి బయల్దేరి షాంఘై చేరుకుని, అక్కడ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి జరిపి, షోజ్హో ఇండస్ట్రియల్ పార్క్ను సందర్శిస్తారు. 11న షాంఘై నుంచి బీజింగ్ చేరుకుంటారు. 14వ తేదీన షెంఝెన్ ఇండస్ట్రియల్ పార్కును సందర్శిస్తారు. అదేరోజున హాంగ్కాంగ్కు చేరుకుంటారు. 16న మధ్యాహ్నం హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. -
ప్రపంచ ఆర్థిక సదస్సుకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 8 నుంచి 15వ తేదీ వరకు చైనాలో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సదస్సు మేనేజింగ్ డైరెక్టర్ నుంచి సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందింది. ఈ పర్యటనలో సీఎం, ఆరుగురు ఐఏఎస్ అధికారుల బృందం వెళ్లనుంది. సీఎం ముఖ్య కార్యదర్వి ఎస్.నర్సింగ్ రావు, అదనపు ముఖ్య కార్యదర్శి ఎ.శాంతికుమారి, ఇంటెలిజెన్స్ ఐజీ బి.శివధర్ రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి ఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ బృందంలో వుండనున్నారు. ఈ మేరకు అనుమతులు జారీ చేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. -
వచ్చే నెలలో తెలంగాణ అసెంబ్లీ
-
వచ్చే నెలలో అసెంబ్లీ
మొదటి లేదా మూడో వారంలో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం హైదరాబాద్: వచ్చేనెల మొదటి వారం లేదా మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి తుది నిర్ణయం మేరకు ఈ తేదీలు ఖరారవుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సదస్సులో పాల్గొనేందుకు సెప్టెంబర్ 9న సీఎం కేసీఆర్ చైనా పర్యటనకు బయల్దేరనున్నారు. 14న ఆయన తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు. పారిశ్రామిక ప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులను వెంట బెట్టుకొని ప్రత్యేక విమానంలో సీఎం చైనా వెళ్లనున్నారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం ఏర్పాట్లు కూడా ప్రారంభించింది. సీఎం చైనా పర్యటన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. సెప్టెంబర్ మొదటి వారంలో అయిదు రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని సీఎం ఇటీవల తన మంత్రివర్గ సహచరులతో ప్రస్తావించారు. అయితే చైనా పర్యటన నుంచి వచ్చాక ఈ సమావేశాలు నిర్వహించాలని ఆలోచన ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రశ్నలకు సమాధానాలపై సీఎస్ సమీక్ష గత అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు.. వాటికి అందించాల్సిన రాతపూర్వక సమాధానాలపై మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ సమీక్ష నిర్వహించారు. వివిధ విభాగాల కార్యదర్శులతో వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వచ్చే సమావేశాల దృష్ట్యా పెండింగ్లో ఉన్న వాటికి సమాచారం అందించాలని సూచించారు. సమావేశాల సమయంలో అధికారులు, సిబ్బంది సెలవులు పెట్టవద్దని, మంత్రులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. -
సీఎంకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఆహ్వానం
చైనాలో జరిగే సదస్సులో పాల్గొనాలని లేఖ సాక్షి, హైదరాబాద్: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్.. చైనాలో నిర్వహిస్తున్న ’న్యూ చాంపియన్స్-2015’ సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు జరిగే ఈ సదస్సులో పాల్గొనాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మేనేజింగ్ డెరైక్టర్ ఫిలిప్ రోస్లర్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళ జాతి సంస్థలు, ప్రభుత్వాలు, మీడియా, అకాడమీ, పౌర సమాజాలకు సంబంధించిన దాదాపు 1,500 మంది ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతారు. నూతన ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. 2015లో అద్భుత ఫలితాలు సాధించిన ప్రగతి సాధకులు.. భావితరాలకు భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఈ వేదికపై దిశానిర్దేశం చేస్తారు. ఈ క్రమంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అద్వితీయంగా అభివృద్ధి వైపు పరుగులెత్తిస్తున్న పని విధానానికి సంబంధించిన అభిప్రాయాలను పంచుకోవాలని కేసీఆర్కు రాసిన లేఖలో ఫిలిప్ రోస్లర్ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణీకరణ, నూతన ఆవిష్కరణలతో కూడిన అభివృద్ధి తదితర అంశాల్లో జరిగే చర్చలో కేసీఆర్ అభిప్రాయాలు అవసరమనే ఉద్దేశంతోనే ఆహ్వానిస్తున్నట్లు లేఖలో ప్రస్తావించారు. సీఎంతో పాటు వ్యాపార ప్రతినిధి బృందాన్ని కూడా వెంట తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు సహకారంతో నడిచే అంతర్జాతీయ సంస్థగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు అధికారిక గుర్తింపు ఉందని.. ఈ నేపథ్యంలో సదస్సు సందర్భంగా ఉన్నత స్థాయిలో జరిగే చర్చలు సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు ఆర్థిక సుస్థిరతకు దోహదపడే విధంగా ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తన లేఖలో ప్రశంసించడం గమనార్హం. -
అకృత్యాల బలిపీఠంపై భారతనారి
‘‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’’.. స్త్రీలను ఎక్కడ పూజిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని నమ్మిన దేశం మనది. భరతమాత, భూమాత, ప్రకృతి మాత.. ఇలా ఎటు చూసినా స్త్రీ ప్రతిరూపంగా పూజించే వారు భారతీయులు. ఆకాశంలో సగం మేమే అంటూ స్త్రీలు సాధికారతవైపు అడుగులు వేస్తుంటే.. మరో వైపు కుటుంబంలో, సమాజంలో వివక్షకు గురవుతూనే ఉన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం విడుదల చేసిన నివేదిక చూస్తే నాగరిక కాలంలోనే ఉన్నామా అనిపించేలా ఉంది. దీనికి సభ్య సమాజమే సమాధానం చెప్పాలి... వివక్ష, అసమానతలతో కూడిన భారతీయ సమాజంలో మహిళల మీద అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒకవైపు మహిళా సాధికారతకు ప్రభుత్వం, పౌర సమాజం కృషి చేస్తుంటే, ఇంకోవైపు వారిమీద జరిగే అత్యాచారాలు, హింస నానాటికీ పెచ్చరిల్లుతోంది. కఠిన చట్టాలు, విస్తృతమైన విద్యా ఉపాధి అవకాశాలు కొంతమేర హింస తగ్గడానికి దోహదపడ్డాయి. మహిళలకు స్వేచ్ఛా పూరిత వాతావరణాన్ని కల్పించి, పురుషులతో సమానస్థితికి చేర్చాలంటే ఇంకా ఎంత కాలం వేచి ఉండాలో? నివేదికలు - సిగ్గుపడే నిజాలు ప్రపంచ ఆర్థిక వేదిక 2014లో విడుదల చేసిన 142 దేశాల జాబితా లింగ వ్యత్యాస నివేదిక ప్రకారం... భారతదేశం లింగవివక్ష విషయంలో 114వ స్థానంలో నిలిచింది. ఐస్ల్యాండ్ అగ్రస్థానంలో ఉండగా, ఇటీవల అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న యెమెన్ దేశం అట్టడుగున ఉంది. ఆర్థిక కార్యకలాపాల్లో భారత మహిళల భాగస్వామ్యాన్ని పరిశీలిస్తే.. 134వ స్థానంలోనూ, విద్యారంగంలో 126, ఆరోగ్యం, మనుగడలో 141 స్థానాల్లో మన దేశం నిలవడం విచారకరం. రాజకీయ సాధికారతలో మాత్రం 15వ స్థానంతో ఫరవాలేదనిపించింది. జాతీయ నేర గణాంకాల నివేదిక - 2014 మేరకు అతివలపై కొనసాగుతున్న నేరాలు కింది స్థాయిలో ఉన్నాయి. భర్తల హింసాత్మక చర్యలకు గురవుతున్న భార్యల సంఖ్య: 1,20,000 వేధింపులకు గురవుతున్న వారు: 70,000 అపహరణలు: 55,000 అత్యాచార బాధితులు: 35,000 అవమానానికి గురయ్యేవారు: 10,000 వరకట్న చావులు: 10,000 వ్యభిచార వృత్తికి బానిసలు: 5,000 జాతీయ నేర గణాంకాలు తెలిపిన వివరాలు అధికారికమైనవి మాత్రమే. ఇవి వాస్తవాల్ని ప్రతిబింబించేలా లేవు. మహిళల మీద జరిగే నేరాల్ని భౌగోళిక పరంగా విశ్లేషిస్తే.. దేశం మొత్తం జరిగే నేరాల్లో 20 శాతం అవిభక్త ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోనే నమోదవుతున్నాయి. ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల్లో ముఖ్యంగా నాగాలాండ్లో మహిళల మీద జరిగే అత్యాచారాలు అతి తక్కువ. వరకట్నానికి సంబంధించిన కేసుల సంఖ్య ఒడిశా రాష్ట్రంలో అధికంగా ఉంటే, అత్యాచారాలకు సంబంధించిన కేసుల సంఖ్య మధ్యప్రదేశ్లో ఎక్కువ. ఇటీవల కాలంలో మహిళలు అత్యాచారానికి గురికావడం, దానిమీద ప్రచార మాధ్యమాలు విస్తృత ప్రచారాన్ని కల్పించడం మనకు తెలిసిందే. 2012లో జరిగిన నిర్భయ ఉదంతమే ఇందుకు నిదర్శనం. నిర్భయ ఘటనతో స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలపై పెద్ద ఎత్తున పోరాటానికి యువత ముందుకొచ్చింది. దీనికి మీడియా సైతం విస్తృత ప్రచారాన్ని కల్పించి ప్రాధాన్యమిచ్చింది. పాపం... ఆడపిల్లలు జాతీయ నేర గణాంకాల నివేదిక - 2014 ప్రకారం అత్యాచారానికి గురైనవారిలో ఎక్కువ శాతం 14-18 ఏళ్ల మధ్య వయస్కులే. పదేళ్లలోపు బాలికల మీద జరిగిన అత్యాచారాల సంఖ్య 110, 10-14 ఏళ్ల మధ్య వారిపై 130, 14-18 ఏళ్లలోపు 150, 18-30 సంవత్సరాల మధ్య వారిపై 120, 30-50 ఏళ్ల మధ్య వారిపై 30, 50 సంవత్సరాలు ఆపైన వారిమీద 5 కేసులు నమోదయ్యాయి. నిజానికి నమోదుకాని కేసులు వీటికి నాలుగు రెట్లున్నాయి. ఈ నివేదికలో దిగ్భ్రాంతికరమైన విషయమేమిటంటే 94 శాతం కేసుల్లో అత్యాచారాలకు పాల్పడింది కుటుంబ సభ్యులే.మహిళల మీద కొనసాగుతున్న హింస కేవలం లింగ పరమైందే కాదు. మత, సామాజిక పరంగా, కొన్ని సందర్భాల్లో అభివృద్ధి అనే నెపంతో మహిళలపై దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. రాజ్యాంగం ప్రాథమిక హక్కుల ద్వారా సమాన హక్కులు కల్పించింది. పార్లమెంట్, రాష్ట్ర శాసన సభలు అతివలపై వివక్షను నిషేధిస్తూ ఎన్నో చట్టాలు తీసుకొచ్చాయి. అయినా అత్యాచారాల పర్వం ఆగడం లేదు. సరికదా ఆ సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ‘అబలై’ పోతోంది ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వే ప్రకారం ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు పురుషుని చేతిలో దెబ్బలు తినడం, అత్యాచారానికి బలవడం, అవమానానికి లోనవడం జరుగు తోంది. ఎక్కువ సందర్భాల్లో ఈ అకృత్యాలకు పాల్పడుతున్న వ్యక్తులు కుటుంబ సభ్యులే కావడం దురదృష్టకరం. ప్రతి నలుగురు గర్భిణీ స్త్రీలలో ఒకరు వేధింపులకు గురవుతున్నారు. భారతమాతగా భాసిల్లుతోన్న మన దేశంలో లింగ వివక్ష ద్వారా ఇప్పటిదాకా కొన్ని మిలియన్ల అబలలు అదృశ్యమయ్యారు. బలవంతపు గర్భస్రావం, ఆడశిశువుల్ని చంపడం మన దేశంలో పరిపాటైపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 70 శాతం మహిళా హత్యలు వారి భర్తల చేతుల్లోనే జరుగుతున్నాయి. 10-20 శాతం మహిళలు తమ జీవిత కాలంలో భాగస్వామివల్ల లేదా పూర్వ భాగస్వామి వల్ల బలవంతపు లైంగిక కార్యకలాపాలకు గురవుతున్నారు. ఇక మన దేశంలోనైతే ప్రతి పది మంది మహిళల్లో నలుగురు గృహహింసకు లోనవుతున్నారు. 45 శాతం మంది కనీసం ఒక్కసారైనా శారీరక, మానసిక హింసకు, 55 శాతం గర్భిణీ స్త్రీలు శారీరక గాయాలకు, ప్రతిరోజూ కనీసం 30 మంది అబలలు వరకట్న దాహానికి విగత జీవులవుతున్నారు. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. వాస్తవంగా జరుగుతున్నవెన్నో.. హింస - లైంగిక హింస అంటే? ఒక మహిళ పురుషుని కంటే ఎన్నో రెట్లు హింసకు గురి కావడమే లింగపరమైన వివక్ష. 2002లో గుజరాత్లో జరిగిన మత పరమైన హింసాకాండలో ముస్లింలు, ముఖ్యంగా ము స్లిం మహిళలు బలయ్యారు. కొన్ని సందర్భాల్లో పురుషులు కూడా హింసకు గురయ్యారు. హిజ్రాలను వేధించడం, కొట్టడం, తిట్టడం, చంపడం కూడా ఈ కోవలోకే వస్తాయి. మహిళలపై హింస - రకాలు 1. మానసిక హింస: మహిళల్ని తిట్టడం, హేళన చేయడం, అవమానించడం, మానసిక దిగ్బంధానికి గురిచేయడం. 2. శారీరక హింస: కొట్టడం, హింసించడం, అవయవాల్ని తొలగించడం, చంపడం. 3. లైంగిక హింస: అత్యాచారానికి ఒడిగట్టడం 4. ఆర్థిక హింస: మహిళలకు ఎలాంటి ఆస్తి హక్కుల్లేకుండా చేయడం, వారి ఆదాయాన్ని పురుషులే ఖర్చు చేయడం, అర్హతలున్నప్పటికీ ఉద్యోగ అవకాశాల్లేకుండా చేయడం. 5. ఆధ్యాత్మిక హింస: మహిళలకు ఇష్టం లేని మతపరమైన, సాంస్కృతిక ఆచారాల్ని పాటించమని ఒత్తిడిచేయడం.ఈ అంశాల్ని దృష్టిలో పెట్టుకొని ఐక్యరాజ్యసమితి మహిళా హింసను ఇలా నిర్వచించింది. ‘లింగపరమైన వివక్షతో మహిళల్ని శారీరకంగా, లైంగికంగా, మానసికంగా వేధించి వారి స్వేచ్ఛను హరించడమే మహిళా హింస’. ఐరాస ప్రకారం హింసకు కారణాలు చారిత్రాత్మకంగా పురుషులు స్త్రీలపై రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో పెత్తనం చె లాయించడం. మహిళల లైంగిక స్వేచ్ఛను నియంత్రించడం,హింస ద్వారా అబలలపై పురుషులు ఆధిపత్యం చెలాయించడం. సాంప్రదాయాలు, ఆచారాలు పేరిట స్త్రీని ఎల్లప్పుడూ పరాధీన స్థితిలో ఉంచడం.గోప్యత సిద్ధాంతం నెపంతో కుటుంబంలో మహిళలపై జరిగే హింసను సమాజంలో చర్చ జరగకుండా నివారించడం.అంతర్జాతీయ ఘర్షణలు జరిగినప్పుడు సైనికులు ప్రత్యర్థి దేశాలకు చెందిన అబలలను ఎత్తుకుపోవడం, అత్యాచారానికి ఒడిగట్టడం, ఆపై హత్య చేయడం జరుగుతుంది. చివరికి అగ్నికి ఆజ్యం తోడైనట్లు పాలక ప్రభుత్వాల నిర్లిప్తత అతివలపై మరిన్ని అకృత్యాలు జరగడానికి కారణమని చెప్పవచ్చు. ప్రపంచీకరణ నేపథ్యంలో పెట్టుబడిదారీ విధానం మహిళా హింసకు మరింత ఊతమిస్తుందని చెప్పవచ్చు. నానాటికి పెరిగిపోతున్న వినిమయతత్వం (ఇౌటఠఝ్ఛట జీటఝ) మరిన్ని వరకట్న చావులకు కారణమవుతోంది. సమాజంలో స్త్రీ విలువ దిగజారిపోతోంది. హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో మగపిల్లలకు ప్రాధాన్యమిస్తూ, లింగనిర్ధారణ పరీక్ష జరిపి ఆడశిశువని నిర్ధారణైతే గర్భస్రావాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇది పెట్టుబడిదారీ విధాన ఫలితమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కష్టాలు... కన్నీళ్లు భారతదేశంలో సగం మంది మహిళలు 18 ఏళ్ల వయసుకు ముందే వివాహితులవుతున్నారు. వారు శారీరకంగా ఎదగకముందే గర్భం ధరించడం, పిల్లల్ని కని పాలివ్వడం లాంటివి ఒక రకంగా వారిని హింసించడమే. మన దేశంలో మాతృ, శిశు మరణాల సంఖ్య అధికంగా ఉండటానికి ప్రధాన కారణం చిన్న వయసులోనే వారికి పెళ్లి చేసి, కుటుంబ బాధ్యతలనే బంధంలో సంకెళ్లు వేయడమే. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా దళిత స్త్రీలు ఎక్కువగా వివక్షను ఎదుర్కొంటున్నారు. వారికి భూమి మీద హక్కులేదు. బాలికలైతే మరింత వివక్షకు గురవుతున్నారు. 2006లో మహారాష్ట్రలోని కైర్లాంజి అనే గ్రామంలో దళిత మహిళ సురేఖ తన కూతురు ప్రియాంకలను వివస్త్ర చేసి, గ్రామ నడిబొడ్డున బహిరంగంగా అత్యాచారానికి ఒడిగట్టి ఆపై హత్య చేశారు. గ్రామస్థులు ఈ దమనకాండకు ప్రేక్షకులుగా మిగిలిపోయారు. చట్టం ఏం చెబుతోందంటే? అత్యాచారం: భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్ 375,376 ప్రకారం అత్యాచారం నేరం. కానీ భర్త భార్యపై చేసే అత్యాచారం నేరం కాదు. అయితే సరైన ఆధారాలు లేవనే నెపంతో లేదా మహిళ అంగీకారంతోనే లైంగిక చర్య జరిగిందనే సాకుతో ఎక్కువ సందర్భాల్లో ఈ కేసులు వీగిపోతున్నాయి. చాలామంది మహిళలు బిడియంతో కేసుపెట్టడానికి వెనుకాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వార్ని భయపెట్టడం జరుగుతుంది. వ్యభిచార వృత్తిలో ఉన్నవారి విషయానికి వస్తే పరిస్థితి మరీ దయనీయం. తమపై అత్యాచారం జరిగిందని కేసుపెట్టినా అటు పోలీసులు, ఇటు న్యాయస్థానాల నుంచి సరైన న్యాయం జరగడం లేదు. బాలికల్ని లైంగికంగా వేధించడం తరచుగా కుటుంబసభ్యులు, తెలిసినవారు అమాయకులైన పసి మొగ్గల మీద అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇలాంటి నేరానికి సంబంధించి మన దేశంలో ఎలాంటి చట్టాలూ ఇంకా ప్రాణం పోసుకోలేదు. బహుశా రాజ్యాంగ రచన క్రమంలో ఇంతటి నీఛమైన ఘోరాలు జరుగుతాయని మేథావులు ఊహించకపోయి ఉండవచ్చు. పనిచేసే చోట లైంగిక వేధింపులు పనిచేసే చోట సహచరులు, పైఅధికారుల వేధింపులకు మహిళలు తరచుగా గురవుతున్నారు. చాలామంది తమ జీవనభృతిని కోల్పోతామేమోనన్న భయంతో బాధను భరిస్తున్నారు. ఇంకొంతమంది చేసేదేమీలేక శారీరక, మానసిక వేధింపులకు బానిసలవుతున్నారు. 1997లో సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనాత్మక తీర్పు (విశాఖ కేసు) మహిళా ఉద్యోగులకు కొంతమేర ఊరట కలిగించినప్పటికీ, అసంఘటిత రంగంలో పనిచేసే వారికి ఈ తీర్పుపై అంత అవగాహన లేదన్నది నిజం. ఒకవేళ ఉన్నా అమలు చేయడం కష్టతరమే. గృహ హింస: మహిళలకు తమ ఇళ్లలో తగిన రక్షణ కల్పించే ఉద్దేశంతో 2005 గృహ హింస నిరోధక చట్టం రూపు దాల్చింది. కానీ ఎంతమంది తమ భర్తలపై కేసులు పెట్టి జైలుకు పంపడానికి ఇష్టపడతారు? కుటుంబ బాధ్యతలు, సాంప్రదాయాలు, గౌరవం అనే బాంధవ్యాల ఛట్రంలో ఈ చట్టం ఆశించినంతగా అమలుకావడం లేదు. సాధికారతే సరైన చికిత్స ఎ) మహిళా సాధికారతకు కృషి: 1. సమానమైన పనికి సమాన వేతన సూత్రం అమలు చేయాలి 2. హిళల్లో సామాజిక చైతన్యాన్ని కల్గించాలి . ఆర్థిక వనరుల్ని అందుబాటులోకి తీసుకురావాలి 4. నిర్ణయీకరణలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలి. బి) హింసను ఖండించడం, ఇలాంటి సంఘటనల్ని సర్కారు దృష్టికి తీసుకురావాలి. సి) చట్టాలపట్ల సరైన అవగాహన కల్పించాలి. డి) స్నేహితులు, సహచరులతో కలిసి సంఘీభావాన్ని నెలకొల్పాలి. ఇ) మహిళా హ క్కుల ఉద్యమకారులతో చేతులు కలపాలి. ఎఫ్) తనకున్న హక్కులను తెలుసుకొని, వాటిని పొందేందుకు పోరాడాలి. జి) పురుషులతో చేతులు కలిపి ఉమ్మడిగా ఉద్యమించి మహిళలపై హింసను అరిక ట్టాలి. మహాత్ముని మాటలే మననంగా సృష్టికి మూలాధారం స్త్రీ. ఆమె లేనిదే మనం లేమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. అమ్మగా, చెల్లిగా, భార్యగా....ఇలా అన్ని పాత్రల్లో పురుష లోకాన్ని ముందుకు నడిపించేది మహిళలే అని తెలుసుకోవాలి. వ్యక్తిగత విచక్షణతో మెలగాలి. ఇలా ప్రతి ఒక్కరిలో పరివర్తన కలిగినప్పుడే అర్థరాత్రివేళ ఆడపిల్ల నడిరోడ్డుపై సంచరించిననాడే భారత దేశానికి నిజమైన స్వాతంత్య్రం అన్న మహాత్ముని మాటకు సార్థకత చేకూరుతుంది. -
పెట్టుబడులకు ఏపీ అనుకూలం
పరిశ్రమల స్థాపనకు ముందుకు రండి పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనమిక్ ఫోరం-డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలమని వివరిస్తూ.. పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, ఖనిజ సంపద, జలవనరుల లభ్యత, రవాణా సదుపాయాలు, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరా తదితర అంశాల గురించి వివరించారు. పట్టణాభివృద్ధిపై నిర్వహించిన సదస్సులో చ్రందబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ దేశాల ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన సందర్భంగా విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీ గా రూపొందించేందుకు సహకారమందిస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హామీ ఇవ్వడాన్ని గుర్తుచేశారు. తిరుపతి, విజయవాడలతోపాటు జిల్లాకో స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమని, గ్రిడ్లు, వివిధ మిషన్లద్వారా మౌలిక వసతులు పెంచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నట్టు ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. భేటీలు సాగిందిలా.. రాయల్ ఫిలిప్స్ సీఈవో ఫ్రాన్స్ వ్యాన్హటన్, మహీంద్రా అండ్ మహీంద్రా ప్రతినిధి అనీష్ షా, లులూ గ్రూప్ ఎండీ యూసుఫ్ఆలీ, సంస్థ ప్రతినిధులు షంషేర్ వేయల్లీ, అదీబ్ అహ్మద్, ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కాలతో సమావేశైమై రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని సీఎం కోరారు.ళీఇస్పాత్ ఎండీ వినీత్ మిట్టల్తో సమావేశమైన చంద్రబాబు కడప జిల్లాలో ఏర్పాటు చేయబోయే ఉక్కు పరిశ్రమ గురించి చర్చించారు.ళీబుధవారం పొద్దుపోయాక చంద్రబాబు గ్లోబల్ వాటర్ డెవలప్మెంట్ పార్టనర్స్ సీఈవో ఉషారావుతో సమావేశమై సమీకృత జలవనరుల నిర్వహణ, కరువు నిర్వహణ, వ్యర్థజలాల నిర్వహణ, రాజధానిలో జల నిర్వహణ, విద్యుత్, రవాణా, బిందుసేద్యం గురించి చర్చించారు. గ్లోబల్ ఎజెండా కౌన్సిల్ ఆన్ ఇండియా సభ్యులతో భేటీలో.. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. మరోసారి అబుధాబీలో ఏపీ అధికారులతో సమావేశం కావాలని తీర్మానించారు. చంద్రబాబుతో సమావేశమైన భారత్ ఫోర్జ్ చైర్మన్ బాబా ఎన్ కల్యాణీ రక్షణ రంగంలో ముఖ్యంగా మిస్సైల్స్ తయారీరంగం, పవన విద్యుత్ తయారీ పరికరాల ఉత్పత్తి, ఆటోమొైబె ల్ యూనిట్ స్థాపన పట్ల ఆసక్తి వెలిబుచ్చారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలోని అనుకూల అంశాలను చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా స్పానిష్ ప్రతినిధులు తమ దేశంలో పర్యటించాలంటూ బాబును ఆహ్వానించారు. స్విస్ సోలార్ టెక్నాలజీ కన్సార్టియంతోనూ సీఎం భేటీ అయ్యారు. మలేషియా ప్రధానితో భేటీ దావోస్ పర్యటనలో మలేషియా ప్రధాని నజీబ్ రజాక్తో బాబు గురువారం సమావేశమయ్యారు. ఆయిల్పామ్, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై ప్రతిపాదనలు పంపితే పరిశీలించేందుకు మలేషియా బృందాన్ని పంపిస్తామని రజాక్ చెప్పారు. స్వైన్ప్లూపై చంద్రబాబు ఆరా.. ఆంధ్రప్రదేశ్లో స్వైన్ఫ్లూ నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలపై దావోస్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఆరా తీశారు. వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్తో గురువారం ఫోన్లో మాట్లాడారు. -
నల్లధనంపై భారత్ వద్ద తగిన ఆధారాలు
ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ * సమాచారం ఇచ్చేందుకు స్విస్ ఓకే! దావోస్: స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న తన పౌరుల గురించి భారత్ ఇప్పటికే తగిన వివరాలు సమీకరించిందని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ఇక్కడ పేర్కొన్నారు. ఈ విషయంలో పూర్తి సహకారాన్ని అందించడానికి, సమాచారాన్ని అందిపుచ్చుకోడానికి స్విట్జర్లాండ్ అంగీకరించిందని కూడా తెలిపారు. అంతకుముందు ఆయన స్విట్జర్లాండ్ ఆర్థికమంత్రి విండ్మిర్-ష్వాలూంఫ్తో దాదాపు 40 నిముషాల పాటు చర్చలు జరిపారు. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సమావేశాలను పురస్కరించుకుని ఆర్థికమంత్రి పలు దేశాల ఆర్థికమంత్రులతో సమావేశమవుతున్నారు. 9 శాతం వృద్ధి సాధన సత్తా కాగా భారత్కు 9 శాతం వృద్ధి రేటు సాధించే సత్తా ఉందని ఆర్థికమంత్రి అన్నారు. గురువారం ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ, వచ్చే ఏడాది వృద్ధి మరింత మెరుగుపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొద్ది కాలంలో ద్రవ్యలోటును 3 శాతం దిగువకు తగ్గించడానికి తాము ఒక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. క్రూడ్ ధరలు దిగువ స్థాయిల్లో కొనసాగుతున్నందున ద్రవ్యోల్బణం కట్టడి సాధ్యమేనని కూడా స్పష్టం చేశారు. కిరోసిన్ విభాగంలో సంస్కరణలు కాగా భారత్లో సబ్సిడీలు దుర్వినియోగం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. వీటి హేతుబద్దీకరణకు తగిన ప్రయత్నమంతా కేంద్రం చేస్తుందని తెలిపారు. ఈ దిశలో సత్వర సంస్కరణలకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. వ్యయ నియంత్రణలో భాగంలో కిరోసిన్ సబ్సిడీ సంస్కరణకు కూడా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. అయితే దీనర్థం సబ్సిడీలను ఉపసంహరిస్తామని కాదని, కేవలం పేదలకు పూర్తి ప్రయోజనం చేకూర్చేలా ఈ సబ్సిడీ విధానాన్ని హేతుబద్దీకరించడం ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసం)ను 4.1 శాతానికి కట్టడి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సంయుక్త సమావేశాలు... వస్తువులు, సేవల పన్నుల (జీఎస్టీ) బిల్లు రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం పొందుతుందన్న విశ్వాసాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. బీమా బిల్లు ఆమోదం పొందకపోయినా లేదా ఈ విషయంలో ఆరు నెలలకు మించి ఆలస్యం జరిగినా కేంద్రం సంయుక్త పార్లమెంటు సమావేశం నిర్వహించి దీని ఆమోదానికి చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో పటిష్టవంతమైన పన్నుల వ్యవస్థను ప్రవేశపెట్టడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పెద్ద ఆశలు పెట్టను: జైట్లీ కాగా బడ్జెట్కు సంబంధించి పన్నుల అంశాలుసహా పలు విధానాల్లో భారీ ఆశలేవీ పెట్టబోనని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28న బడ్జెట్ సమర్పించనున్న నేపథ్యంలో ఆయన ఈ కామెంట్ చేశారు. అయితే సంస్కరణల ప్రక్రియ కొనసాగింపు దిశలో నిర్ణయాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మాత్రం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘బడ్జెట్ ఒకరోజు మాత్రమే. ఏడాదిలో ఇంకా 364 రోజులు ఉంటాయి’ అని కూడా జైట్లీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బడ్జెట్ను శనివారం ప్రవేశపెట్టిన తరువాత సోమవారం నాడు స్టాక్ మార్కెట్ ర్యాలీ ఉంటుందని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు అది మార్కెట్ నిర్ణయించే అంశమన్నారు. -
దావోస్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు
-
సబ్కా సాత్-సబ్కా వికాస్ నినాదంతో కేంద్ర బడ్జెట్
- స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనమిక్ ఫోరం- డబ్ల్యూఈఎఫ్) 44వ ప్రపంచ ఆర్థిక సదస్సు జనవరి 21 నుంచి 25 వరకు జరిగింది. - జింబాబ్వేలో చలామణి అవుతున్న కరెన్సీ జాబితాలో భారత రూపాయికి చోటు దక్కింది. ఈ మేరకు రిజర్వ బ్యాంక్ ఆఫ్ జింబాబ్వే జనవరి 29న ప్రకటించింది. - 2013-14 జీడీపీ అంచనాలను కేంద్ర గణాంక కార్యాలయం ఫిబ్రవరి 7న విడుదల చేసింది. 2013-14లో వృద్ధి రేటు 4.9 శాతంగా అంచనా వేసింది. 2012-13లో వృద్ధి రేటు 4.5 శాతంగా పేర్కొంది. - పన్ను చెల్లింపుదారుల్లో విశ్వసనీయతను పెంచి, ఆదాయపన్ను నిబంధనలను క్రమబద్ధీకరించే చర్యల్లో భాగంగా పన్నుల పరిపాలనా సంస్కరణల కమిషన్ను కేంద్రం ఏర్పాటు చేసింది. - దేశంలో మరో రెండు నూతన బ్యాంకుల ఏర్పాటుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్ 2న సూత్రప్రాయమైన అనుమతిని మంజూరు చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ సంస్థ ఐడీఎఫ్సీ, మైక్రోఫైనాన్స్ సంస్థ బంధన్లకు నూతన బ్యాంకులను ఏర్పాటు చేసుకోవడానికి ఆర్బీఐ అనుమతినిచ్చింది. - ఐఎంఎఫ్ ఏప్రిల్ 8న విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 2014లో 5.4 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. కాగా 2014-15లో భారత వృద్ధిరేటు 5.7 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. - కాగ్నిజెంట్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్. చంద్రశేఖరన్ 2014-15 సంవత్సరానికి నాస్కామ్ చైర్మన్గా ఏప్రిల్ 9న నియమితులయ్యారు. - 2011లో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని ప్రపంచ బ్యాంకుకు చెందిన ఇంటర్నేషనల్ కంపారిజన్ ప్రోగ్రాం ఏప్రిల్ 30న విడుదల చేసిన నివేదిక తెలిపింది. అమెరికా మొదటి స్థానంలో, చైనా రెండో స్థానంలో నిలిచాయి. - విదేశీ బ్యాంకుల్లో అక్రమంగా ఉన్న నల్లధనాన్ని వెలికి తీసి, స్వదేశానికి తెచ్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం మే 27న ప్రకటించింది. ఈ బృందానికి చైర్మన్గా పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.బి.షా, వైస్ చైర్మన్గా రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అరిజిత్ పసాయత్ వ్యవహరిస్తారు. - మన దేశంలో 2013 నాటికి 1.75 లక్షల మంది లక్షాధికారుల కుటుంబాలు ఉన్నట్లు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తన 14వ వార్షిక నివేదికలో వెల్లడించింది.. - ప్రభుత్వ యాజమాన్యంలోని నమోదిత కంపెనీలన్నింటిలో ప్రజలకు కనీసం 25 శాతం షేర్లు (మినిమమ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్) ఉండాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిర్దేశించింది. - ప్రభుత్వ రంగ సంస్థ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, నేషనల్ బిల్డింగ్స్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్కు ప్రతిష్టాత్మక నవరత్న హోదా లభించింది. ఈ రెండు కంపెనీలతో నవరత్న హోదా పొందిన వాటి జాబితా 16 కు చేరింది. - ఉల్లి, బంగాళాదుంపలను నిత్యావసర వస్తువుల చట్టం 1955 కిందకు తెచ్చేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) జూలై 2న ఆమోదం తెలిపింది. తద్వారా ఉల్లి, బంగాళాదుంపల లభ్యతను పెంచేందుకు, వాటి ధరల నియంత్రణకు వీలవుతుంది. - 2011-12లో భారత్లో పేదరికం 29.6 శాతం ఉన్నట్లు రంగరాజన్ కమిటీ పేర్కొంది. - 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ. 17,94,892 కోట్లతో కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ జూలై 10న లోక్సభకు సమర్పించారు. అందరితో కలిసి... అందరి వికాసానికి (సబ్కా సాత్-సబ్కా వికాస్) నినాదంతో రూపొందించిన బడ్జెట్లోని ముఖ్యాంశాలు... ప్రణాళిక వ్యయం రూ.5,75,000, ప్రణాళికేతర వ్యయం రూ.12,19,892 కోట్లు, మొత్తం బడ్జెట్ వ్యయం రూ. 17,94,892 కోట్లు. - ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ 2013-14 ఆర్థిక సర్వేను జూలై 9న పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ముఖ్యాం శాలు.. జీడీపీ వృద్ధిరేటు 2014-15లో 5.4-5.9 శాతంగా ఉండొచ్చు. ఇది 2015-16లో 7-8 శాతానికి పెరిగే అవకాశం ఉంది. 2014-15లో కరెంట్ ఖాతా లోటును జీడీపీలో 2.1 శాతానికి పరిమితం చేయాలి. - ప్రపంచంలో 1.2 బిలియన్ల మంది అత్యంత పేదరికంలో ఉన్నారు. వారిలో మూడోవంతు భారత్లోనే ఉన్నారని ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల-2014 నివేదిక పేర్కొంది. భారత్లో 1994లో 49.4 శాతంగా ఉన్న పేదరికం 2010 నాటికి 32.7 శాతానికి తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. - టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కంపెనీల విలువ జూలై 23న రూ. 5 లక్షల కోట్లకు చేరుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయగా కంపెనీగా రికార్డు సృష్టించింది. - రక్షణ రంగంలో 49 శాతం, రైల్వేల్లో కొన్ని విభాగాల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర కేబినెట్ ఆగస్టు 6న అంగీకరించింది. - దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్గా టాటా గ్రూపు నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో ఎల్ఐసీ, ఎస్బీఐ నిలిచాయి. - దేశంలో అందరికీ బ్యాంకు ఖాతా ఉండాలనే ఉద్దేశంతో చేపట్టిన ప్రధానమంత్రి జన్-ధన్ యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 28న న్యూఢిల్లీలో ప్రారంభించారు. - ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పరిధిలోని పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ రూ. 1,000గా నిర్ణయిస్తూ కేంద్రం ఆగస్టు 29న నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే సామాజిక భద్రత పథకాల కింద ఈపీఎఫ్ చందాదారుల వేతన పరిమితిని రూ. 15,000గా నిర్ణయించింది. - భారత్ తరపున ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్గా సుభాష్చంద్ర గార్గ్ సెప్టెంబర్ 10న నియమితులయ్యారు. ఆయన రాజస్థాన్ కేడర్కు చెందిన 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. - వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రపంచ పోటీ జాబితాలో భారత్ 71వ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 3న జెనీవాలో విడుదల చేసిన నివేదిక ప్రకారం మొత్తం 144 దేశాలు పోటీపడగా స్విట్జర్లాండ్, సింగపూర్, అమెరికా మొద టి మూడు స్థానాల్లో నిలిచాయి. - ఓఎన్జీసీ, సీఐఎల్, ఎన్హెచ్పీసీలలో వాటాలను విక్రయించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సెప్టెంబర్ 10న ఆమోదం తెలిపింది. ఈ మూడు కంపెనీల్లో వాటాల విక్రయం వల్ల రూ. 43,800 కోట్లు సమకూరనున్నాయి. - అపర కుబేరుల (బిలియనీర్) ప్రపంచ జాబితాలో భారత్ ఆరోస్థానంలో నిలిచింది. వెల్త్-ఎక్స్, యూబీఎస్ బిలియనీర్ సెన్సెస్-2014 సెప్టెంబర్ 17న వివరాలను వెల్లడించింది. భారత్లో ఈ ఏడాది 100 మంది బిలియనీర్లు ఉన్నట్లు తేల్చింది. - చిన్న ిపిల్లలు సొంతంగా బ్యాంకు ఖాతాల నిర్వహణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకులు సెప్టెంబర్ 24న అనుమతించాయి. పదేళ్లు వయసు దాటిన వారికి ఈ సదుపాయాన్ని కల్పించారు. - మేక్ ఇన్ ఇండియా ప్రచార కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 25న న్యూఢిల్లీలో ప్రారంభించారు. భారత దేశాన్ని అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. - పన్నులకు సంబంధించిన కేసులను పరిష్కరించేందుకు జాతీయ పన్ను ట్రైబ్యునల్ చట్టాన్ని ఏర్పాటు చేస్తూ 2005లో పార్లమెంట్ ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 25న తీర్పునిచ్చింది. - ఫోర్బ్స్ విడుదల చేసిన 2014 భారత కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సారథి ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. సన్ ఫార్మాస్యూటికల్ అధిపతి దిలీప్ సంఘ్వి రెండో స్థానం, విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ మూడోస్థానం దక్కించుకున్నారు. - ప్రపంచ ఆకలి సూచీలో భారత్కు 55వ స్థానం దక్కింది. ప్రపంచ ఆర్థిక వేదిక-2014 లింగ అసమానత్వ సూచీలో భారత్ 114 వ స్థానంలో నిలిచింది. - ప్రముఖ ఆర్థిక వేత్త అరవింద్ సుబ్రమణియన్ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా అక్టోబరు 16న బాధ్యతలు చేపట్టారు. - యూరోమనీ మ్యాగజైన్ ఉత్తమ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అవార్డును వాషింగ్టన్లో అక్టోబరు 10న భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ అందుకున్నారు. - ఏిషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఎఐఐబీ) అక్టోబరు 24న బీజింగ్ కేంద్రంగా ఏర్పాటైంది. ఎఐఐబీ 2015 నుంచి పనిచేస్తుంది. - డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తివేస్తూ కేంద్రం అక్టోబరు 18న నిర్ణయం తీసుకుంది. - పని చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే దేశాల్లో భారత్ 18వ స్థానంలో నిలిచింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు అక్టోబరు 6న విడుదల చేసిన నివేదికలో అమెరికా మొదటి స్థానంలో, రెండు మూడు స్థానాల్లో బ్రిటన్, కెనడా ఉన్నాయి. - 2014-15లో జీడీపీ వృద్ధి రేటు 5.6 శాతంగా ఉంటుందని ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ పేరుతో అక్టోబరు 27న విడుదల చేసిన నివేదికలో ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ఈ వృద్ధి రేటు 2015-16లో 6.4 శాతం, 2016-17లో 7 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. - ప్రపంచ బ్యాంకు అక్టోబరు 29న విడుదల చేసిన వ్యాపార అనుకూల దేశాల జాబితాలో భారత్ 142వ స్థానంలో నిలిచింది. సింగపూర్, న్యూజిలాండ్, హాంకాంగ్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. - ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు చైర్పర్సన్గా అనితా కపూర్ నవంబరు 5న నియమితులయ్యారు. - ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన మాజీ ఉద్యోగులు పింఛను పొందేందుకు ఉద్దేశించిన జీవన్ ప్రమాణ్ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ నవంబరు 10న న్యూఢిల్లీలో ప్రారంభించారు. - 2014కు సంబంధించి దేశంలో అధిక ఆదాయం పొందుతున్న సంస్థలతో రూపొందించిన ‘ఫార్చ్యూన్ 500 జాబితా’ను ఫార్చ్యూన్ ఇండియా డిసెంబర్ 14న విడుదల చేసింది. ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రథమ స్థానంలో నిలిచింది. రిలయన్స్ రెండు, భారత్ పెట్రోలియం మూడో స్థానంలో ఉన్నాయి. - టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రేటు నవంబర్లో సున్నాగా నమోదైంది. అంటే 2013 నవంబర్లో ఉన్న స్థాయిలోనే 2014 నవంబర్లో కూడా టోకు ధరలు ఉన్నట్లు. గత ఐదున్నరేళ్లలో ఇదే కనిష్టం. - వ్యాపారానికి అనుకూల దేశాలకు సంబంధించి ఫోర్బ్స్ విడుదల చేసిన 9వ వార్షిక ర్యాంకింగ్స్లో డెన్మార్క్ మొదటి స్థానంలో ఉంది. హాంకాంగ్, న్యూజిలాండ్లు రెండు, మూడో స్థానాలను దక్కించుకున్నాయి. ఈ జాబితాలో భారత్ 93వ స్థానంలో నిలిచింది. - వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ డిసెంబర్ 20న లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రవేశపన్ను, ఆక్ట్రాయ్, సేవా పన్ను వంటి అనేక పన్నులు ప్రత్యేకంగా లేకుండా ఒకటే పన్ను విధానాన్ని 2016, ఏప్రిల్ నుంచి అమలు చేసే లక్ష్యంతో ఈ బిల్లును రూపొందించారు. 122వ రాజ్యాంగ సవరణ బిల్లుగా దీన్ని తీసుకొచ్చారు. - బొగ్గు గనులు, బీమా రంగానికి సంబంధించిన రెండు ఆర్డినెన్సులపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డిసెంబర్ 26న సంతకాలు చేశారు. దీంతో బీమా రంగంలో మరింతగా విదేశీ పెట్టుబడుల రాకకు వీలు కానుంది. అలాగే సుప్రీం కోర్టు గతంలో రద్దు చేసిన బొగ్గు గనులను తిరిగి కేటాయించేందుకూ సాధ్యపడనుంది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) మానవాభివృద్ధి నివేదిక-2013ను జూలై 24న విడుదల చేసింది. 187 దేశాల ఈ జాబితాలో భారత్ 135వ స్థానంలో నిలిచింది. కాగా తొలి మూడు స్థానాల్లో నార్వే, ఆస్ట్ట్రేలియా, స్విట్జర్లాండ్లు ఉన్నాయి. వీసా, మాస్టర్ కార్డ్ల లాంటి చెల్లింపులకు ఉపయోగించే రూపే కార్డును రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ మే 8న ఆవిష్కరించారు. భారత సొంత చె ల్లింపుల గేట్వే రుపేను నేషనల్ సిమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. -
ఇంజనీర్ టు సీఈవో
ప్రపంచంలోని వివిధ సంస్థల్లో ముఖ్య కార్యనిర్వహణాధికారులు (సీఈవో)గా పనిచేస్తున్న వారిలో అత్యధికులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లే. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో తేలిన విషయమిది. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోని 50 అత్యుత్తమ కంపెనీల్లో సీఈవోలుగా విధులు నిర్వహిస్తున్న వారిలో చాలామంది ఇంజనీరింగ్ విభాగం నుంచి వచ్చినవారే. ఇంజనీరింగ్తోపాటు పేరున్న విద్యాసంస్థ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకోవడం వీరికి అదనంగా కలిసి వస్తున్న అంశం. ఇతర విభాగాల వారితో పోలిస్తే ఇంజనీరింగ్+ఎంబీఏ గ్రాడ్యుయేట్లే సీఈవోలుగా దూసుకుపోతున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను దీనికి ప్రముఖ ఉదాహరణగా పేర్కొనవచ్చు. జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బెర్రా, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వ్యవస్థాపకుడు ఇవెన్ చ్వాబ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దదవుతుంది. ఫార్చ్యూన్-500 సీఈవోల జాబితాలో ఇంజనీరింగ్ డిగ్రీ హోల్డర్లు అందరి కంటే ముందంజలో ఉన్నారు. ప్రధాన కారణాలివే.. చాలామంది ఇంజనీర్లు ప్రముఖ కంపెనీల్లో సీఈవో స్థాయికి ఎదగడానికి గల ప్రధాన కారణాలను విశ్లేషిస్తే.. సహజంగా ఆ విభాగానికి చెందిన అభ్యర్థులకు ఉన్న లక్షణాలే వారిని ఆ స్థాయిలో నిలపడానికి తోడ్పడు తున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. సమస్యల సాధన ద్వారా ఆలోచనా శక్తిని మెరుగుపరచుకోవడం; వివరణా త్మకంగా, విశ్లేషణాత్మకంగా అభ్యసించడం; వైవిధ్యంగా ఆలోచించడం; కష్టపడి పనిచేయడం; అవసరాలు, అవకాశాలకు అనుగుణంగా కెరీర్లో మార్పులు చేసుకోవడం లాంటి లక్షణాలు వారిలో ఉంటున్నాయి. చరిత్ర ఆధారంగా పరిశీలించినా మనకు ఇవే లక్షణాలు ప్రస్ఫుటమవుతాయి. థామస్ అల్వా ఎడిసన్, జాన్ స్టీవెన్స్, హెన్రీ ఫోర్డ్, హెర్బర్ట్ హోవర్ లాంటి ప్రముఖు లు వారి పరిశోధనల్లో భాగంగా అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. గణితం, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో విషయ పరిజ్ఞానం, సవాళ్లను స్వీకరించే తత్వం, సాంకేతిక నైపుణ్యాలు, నియమనిబద్ధత, నాయకత్వ లక్షణాలు, మేనేజ్మెంట్ స్కిల్స్, పరిస్థితులకు అనుగుణంగా స్పందించడం (ఎమోషనల్ ఇంటెలిజెన్స్), భావవ్యక్తీ కరణ నైపుణ్యాలతో ఇంజనీరింగ్ అభ్యర్థులు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. వీటన్నింటితో పాటు డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఎలాంటి కష్టన ష్టాలను ఎదుర్కోవడానికైనా సాహసించడం వల్లే ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నట్లు వెల్లడైంది. డబ్బే సర్వస్వం కాదనేది వాస్తవమైనా.. ఉద్యోగులు తమ స్థానాలను మెరుగుపరచుకోవడానికి అది ఆక్సిజన్లా పనిచేస్తోంది. కెరీర్.. వైవిధ్యభరితం ఎక్కువ కాలం ఒకే రకమైన విధులను నిర్వహించడం విసుగు తెప్పించడంతో వైవిధ్యభరితమైన కెరీర్ వైపుగా దృష్టి సారించడం వల్ల సీఈవో లాంటి ఉన్నత పదవులకు చేరుకోగలుగుతున్నామని మరికొందరు పేర్కొంటున్నా రు. వాస్తవానికి ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నత పదవులకు సంబంధించి అంతగా ఆలోచించరని, ఇచ్చిన పనిని సమర్థంగా చేసుకుంటూ పోతే అవకాశాలు వాటం తట అవే వస్తాయని ఇంకొందరి అభిప్రాయం. ఇంజనీర్ల తర్వాత ఇలాంటి ఉన్నత అవకాశాలను సొంతం చేసుకుం టున్నవారు మెడికల్ అభ్యర్థులే. హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ లాంటి ఇతర విభాగాలకు చెందిన వారితో పోలిస్తే ఇంజనీర్లు, మెడికోలు ఎక్కువగా కష్టపడాల్సి రావడమే దీనికి ప్రధాన కారణంగా గుర్తించారు. అర్హతలు.. అదృష్టం సాధారణంగా మేనేజ్మెంట్ నైపుణ్యాలు అంతంత మాత్రంగానే ఉన్నా, టెక్నికల్ మెరిట్స్ ఉన్న ఇంజనీరింగ్ అభ్యర్థులు ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది. ఒక సీఈవో నుంచి మరో సీఈవోకు సాంకేతిక అంశంపై వెచ్చించే సమయంలో చాలా తారతమ్యం ఉంటున్నట్లు గుర్తించారు. సీఈవో పదవికి కావాల్సిన అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ అనేక కంపెనీల్లో చాలామంది అభ్యర్థులు సాధారణ విధులనే నిర్వహిస్తూ ఉండటం సర్వేలో తేలిన మరో ఆసక్తికర విషయం. దీనికి వివిధ కారణాలున్నాయి. కెరీర్ గ్రాఫ్లో ఉన్నత స్థానానికి ఎదగడానికి అర్హతలతోపాటు అదృష్టమూ తోడవ్వాలని ఇలాంటి ఉదంతాల ద్వారా గమనించవచ్చు. నైపుణ్యాలు పెంచుకోవాలి! ‘‘ఇంజనీరింగ్ విద్యార్థుల్లో తార్కిక, విశ్లేషణాత్మక నైపుణ్యాలు పుష్కలంగా ఉంటాయి. చాలా కంపెనీల సీఈవోలుగా రాణిస్తున్న వారు ఇంజనీర్లే కావడం విశేషం. కానీ ఇంజనీరింగ్ చదివిన వారు మాత్రమే సీఈవోలుగా రాణిస్తారని చెప్పలేం. అకడమిక్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా నిరంతర శ్రమ, వ్యక్తిగత సామర్థ్యాలుంటే కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. అయితే ఈ విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు అధిక అవకాశాలుంటాయని చెప్పొచ్చు. ఇంజనీరింగ్ విద్యార్థిగా నేను నేర్చుకున్న అంశాలు, సమస్యా సాధన నైపుణ్యాలు నా కెరీర్లో ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్రతి విషయాన్ని లాజికల్గా ఆలోచిస్తాను. అనాలిసిస్ చేసి తగిన నిర్ణయం తీసుకుంటాను. సంస్థ అభివృద్ధిలో సారథిదే ప్రధాన పాత్ర. కంపెనీని నడిపించే సీఈవోల్లో ప్రధానంగా మూడు అంశాలు సహజంగా కనిపిస్తాయి... విజన్, గోల్, మిషన్. సంస్థ అభివృద్ధికి ఏం చేయాలనే దానిపై సీఈవోలకు స్పష్టమైన విజన్ ఉంటుంది. దాన్ని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంటారు. తర్వాత దాని సాకారానికి పటిష్టమైన మిషన్ ఏర్పాటు చేసుకుంటారు. ప్రతి ఒక్కరు ఈ నైపుణ్యాలను విద్యార్థి దశలోనే సొంతం చేసుకుంటే కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు’’ - బీవీఆర్ మోహన్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సైయంట్ (గతంలో ఇన్ఫోటెక్) -
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును వచ్చే ఐదేళ్లలో ....2 శాతం పెంచాలి
సిడ్నీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును వచ్చే ఐదేళ్లలో ఇప్పటి స్థాయి నుంచి 2 శాతం మేర పెంచాలని జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, గవర్నర్ల సమావేశం పిలుపునిచ్చింది. అదేవిధంగా ఆటోమేటిక్గా పన్నుల సమాచారాన్ని పంచుకోవడం, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) సంస్కరణల అమలుపైనా కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించింది. భేటీ ముగింపు అనంతరం ఆదివారం ఇక్కడ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ అంశాలను పేర్కొన్నారు. భారత్ వంటి వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపైన కూడా సమావేశంలో దృష్టిపెట్టారు. ‘ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటును రానున్న ఐదేళ్లలో 2 శాతం పైగా పెంచాల్సిన అవసరం ఉంది. అంటే మరో 2 లక్షల కోట్ల డాలర్లకు పైగా జతకావాలి. ఇదే జరిగితే గణనీయమైన స్థాయిలో ఉద్యోగాల సృష్టికి దోహదం చేస్తుంది. ఇప్పుడున్న విధానాల స్థానంలో మరింత వాస్తవికతతో కూడిన పాలసీలను తీసుకొచ్చేలా ప్రతిష్టాత్మక చర్యలతోనే ఇది సాధ్యం’ అని సంయుక్త ప్రకటన వెల్లడించింది. ఆటోమేటిక్గా పన్ను వివరాలను షేర్ చేసుకునేందుకు ఉద్దేశించిన కొత్త ప్రమాణాలను అమలు విషయంలో అన్నిపక్షాలతోనూ కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రమాణాలను 2015 చివరికల్లా జీ-20 దేశాలన్నీ ఆచరణలోకి తీసుకురావాలని నిర్ణయించారు. నల్లధనం, పన్ను ఎగవేతల సమస్యల పరిష్కారానికి ఈ సమాచార షేరింగ్ అనేది సజావుగా జరగాలని భారత్ ఎప్పటినుంచో ఒత్తిడి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా బహుళజాతి కంపెనీలు(ఎంఎన్సీలు) లాభాలను ఎక్కడైతే ఆర్జిస్తున్నాయో అక్కడే పన్నుకట్టాలన్న డిమాండ్కు కూడా జీ20 సమావేశం మద్దతు పలికింది. ఈ ఏడాది(2014) గ్లోబల్ వృద్ధి రేటు 3.7%గా ఉండొచ్చనేది ఐఎంఎఫ్ తాజా అంచనా. ఐఎంఎఫ్ సంస్కరణలపై... ఐఎంఎఫ్లో కోటా, పాలనపరమైన సంస్కరణల అమలు జాప్యం కావడం పట్ల(అమెరికా దీనికి ఇంకా ఆమోదముద్ర వేయాల్సి ఉంది)జీ20 సమావేశం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఏప్రిల్లో జరగనన్ను తదుపరి భేటీ నాటికి ఈ సంస్కరణలకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేసింది. 2010లో అంగీకరించిన ఈ కోటా సంస్కరణలను ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేయాల్సి ఉంది. వీటివల్ల భారత్ వంటి వర్ధమాన దేశాలకు ఐఎంఎఫ్లో బలం పెరుగుతుంది. జీ20 కూటమిలో అమెరికా, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలతోపాటు భారత్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి వర్ధమాన దేశాలున్నాయి. మొ త్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వీటి పరిమాణం 85%. -
పేదరికమే పెనుముప్పు
ఈ నెల 22-25 మధ్య దవోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం విపరీతంగా పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలే ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పని అందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ సంపన్నుల వేదిక సమస్యను గుర్తించిందేగానీ పరిష్కారాల వేపు కన్నెత్తి చూడలేదు. ‘రానున్న దశాబ్దంలో ప్రపంచం ఎదుర్కోనున్న అతిపెద్ద ముప్పు’ ఏమిటని అడిగితే ‘పెరిగిపోతున్న ధనిక, పేద వ్యత్యాసాలే’నని ‘కాలం చెల్లిన’ మార్క్సిజాన్ని పట్టుకు వేలాడే చాదస్తపు కమ్యూనిస్టులుగాక మరెవరు అనగలరు? అదేం వైపరీత్యమో గానీ హఠాత్తుగా కమ్యూనిస్టు భూతం ప్రపంచ కుబేరులందరినీ ఆవహించినట్టుంది. లేకపోతే వంద దేశాల కుబేరులంతా కలిసి ప్రపంచ వృద్ధి రథాన్ని రోదసి బాట పట్టించాలని నిర్వహించిన దవోస్ ‘యజ్ఞ వేదిక’పై నుంచి... పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతల వంటి వినరాని మాటలు వినిపిస్తాయా? ఈనెల 22-25 మధ్య స్విట్జర్లాండ్లోని దవోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 44వ వార్షిక సమావేశం జరిగింది. ‘అతి సంపన్నులకు, అతి పేదలకు మధ్య పెరిగిపోతున్న అంతరం సామాజిక, ఆర్థిక సుస్థిరతతో పాటూ ఆర్థికాభివృద్ధికి కూడా ముప్పుగా మారుతోంది’ అని డబ్ల్యూఈఎఫ్ నివేదిక ప్రకటించింది. వేదిక ప్రధాన ఆర్థిక శాస్త్రవేత్త జెన్నిఫర్ బ్లాంకె మరో అడుగు ముందుకేసి ‘ప్రబలుతున్న అసంతృప్తి సమాజంలో నిరాశానిస్పృహలు ప్రబలే పరిస్థితికి దారితీస్తుం ది. ప్రత్యేకించి యువతీయువకులు భవిష్యత్తు లేదని భావించినప్పుడు జరిగేది అదే’నని ప్రకటించారు. అవును, యూరోజోన్లోని కొన్ని దేశాల్లో 50 నుంచి 60 శాతం యువత అలాంటి నిరాశామయస్థితిలోనే ఉంది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ కోలుకుంటోందని అంటున్న కుబేరుల్లో ఈ నైరాశ్యం ఏమిటి? పోగేసుకున్న అపార సంపదలే పీడకలలై వేధించడమేమిటి? గుర్రం కాదు గాడిద- గాడిద కాదు గుర్రం అమెరికా పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి మంగళవారం అధ్యక్షుడు బరాక్ ఒబామా ‘దేశ పరిస్థితి’పై ఉపన్యసించారు. రిపబ్లికన్లు కాదంటే ఒంటరిగానైనా ఆర్థిక అసమానతలను రూపుమాపుతామని గర్జించారు. అమెరికాను స్వర్గ సీమగా భావించే భారత్లో పేదరికం, ఆర్థిక అసమానతలు అనే మాటలు వినిపిస్తేనే ఆర్థిక ‘నిపుణుల’కు, జాతీయ మీడియా ‘విశ్లేషకుల’కు చిర్రెత్తుతుంది. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన అంటూ ప్రభుత్వ సొత్తును ప్రజలకు పందారం చేసే ‘జనాకర్షక పథకాల’ను దుమ్మెత్తి పోయనివాడు మేధావే అనిపించుకోడు. ప్రజా సంక్షేమానికి కోత పెట్టి ద్రవ్యలోటును తగ్గిస్తే తప్ప వృద్ధి సాధ్యం కాదనే అమెరికా విరచిత ఆర్థిక విధానాలను వారంతా వల్లె వేస్తుంటే ఇంతకాలం నోళ్లు తెరుచుకుని వింటున్నాం. ప్రభుత్వాలు ఎన్ని వాతలు పెడుతున్నా, కోతలు కోస్తున్నా కిమ్మనకుండా భరిస్తున్నాం. ఇంతలో ఇదేమిటి? నిన్న మనం గుర్రం అంటే, కాదు కాదు గాడిద అని అనిపించినవాళ్లే... వాళ్ల మాట మేరకే గాడిద అంటున్న దాన్ని ‘కాదు కాదు అది గాడిద కాదు గుర్రం’ అనడమా? ఒబామా అదే చేస్తున్నారు. నిజానికి గత ఏడాది డిసెంబర్ 4న ‘అసమానత నైతికంగా తప్పు, దుష్ట అర్థశాస్త్రం’ అంటూ అసమానతలపై యుద్ధం ప్రకటిం చారు. ‘ఆర్థిక అసమానత వల్ల వృద్ధి మరింత బలహీనపడిపోతోంది, అసమానతలు అధికంగా ఉన్న దేశాల్లోనే ఆర్థిక తిరోగమనాలు తరచుగా సంభవిస్తున్నాయి’ అని అక్షర సత్యాలను చెప్పారు. గత ఐదేళ్లుగా ఆయన అమలు చేస్తున్న ఆర్థిక విధానాలకు ప్రాతిపదిక మార్కెట్ అర్థశాస్త్రమే. ఆ విధానాల మేరకే 2007లో బద్ధలైన సంక్షోభానికి విరుగుడుగా లక్షల కోట్ల డాలర్ల ప్రభుత్వ ధనాన్ని సంపన్నులకు బెయిలవుట్లుగా ఇచ్చారు. లోటు బడ్జెటు, ద్రవ్యలోటు మహా పాపమంటూ ప్రభుత్వ వ్యయాలపై కోతలు పెడుతూ వచ్చారు. సంపన్నులు మరింత సంపన్నులు కావడానికి, సామాన్యులు పేదరికంలోకి దిగజారడానికి కారకులయ్యారు. ఫలితంగా అమెరికాలోని 1 శాతం అతి సంపన్నుల సంపద రికార్డు స్థాయిలో విస్తరించి దేశ సంపదలో 50.4 శాతానికి చేరింది (1917 తర్వాత ఇదే అత్యధికం). ఆ ఒక్క శాతం ఆదాయాలు 2008-2012 మధ్య 31.4 శాతం పెరిగాయి. జనాభాలో మిగతా 99 శాతం ఆదాయాల పెరుగుదల సున్నాకు రవ్వంత ఎక్కువ... 0.4 శాతం. వృద్ధిలో కాసింత కదలికకు మించి మరేమీ లేని తిరోగమనంలో సంపన్నులు మరింత సంపన్నులెలా అయ్యారు? కాలిఫోర్నియా ఆర్థిక శాస్త్రవేత్త ఇమాన్యుయెల్ సోజే అది విడమరిచారు. ‘ఆర్థిక వ్యవస్థకు వాస్తవంగా ఎలాంటి లబ్ధి కలగకుండానే వాళ్లు కేంద్ర బ్యాంకు నుంచి, ప్రభుత్వం నుంచి లబ్ధిని పొందారు.’ ఒబామాకు కమ్యూనిస్టు దెయ్యం... డబ్బున్నవారి దగ్గరికే డబ్బు నడిచిపోదు, ప్రభుత్వ విధానాలే ఆ పని చేస్తాయి. బ్రెజిల్, భారత్, దక్షిణ ఆఫ్రికా, స్పెయిన్, బ్రిటన్, అమెరికా తదితర దేశాలలో డిసెంబర్లో జరిగిన సర్వేలో ఆయా దేశాల ప్రజలు తమ దేశంలో... చట్టాలు, ప్రభుత్వాలు సంపన్నులకు అనుకూలంగా ఉన్నాయని నమ్ముతున్నట్టు తేలింది. గత ఆరేళ్లుగా సంపన్నుల సేవలో తరించిన ఒబామాకు జ్ఞానోదయమయిందో లేక కమ్యూనిస్టు దయ్యం పట్టిందో గానీ ‘అప్పుల పాలైపోయిన కుటుంబాలు తక్కువగానే ఖర్చు చేయగలుగుతాయి, పోగుబడ్డ సంపద వినియోగ వ్యయంగా మారే అవకాశం తక్కువ’ అంటూ ఆర్థిక అసమానతలే వృద్ధికి ఆటంకమనే చెప్పరాని ఆర్థిక సత్యాన్ని కూడా చెప్పారు. ఉత్పత్తికి ప్రోత్సాహం పేరిట బడా కుబేరులకు ప్రభుత్వ ఆస్తులను, సహజ వనరులను, రాయితీలను ధారపోసి, పేదలకు ఆసరాగా ఉండే సబ్సిడీలను, సంక్షేమ పథకాల వ్యయాలకు కోత వేయాలనే మన విధానకర్తలకు, విశ్లేషకులకు గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లు కాలేదా? రిపబ్లికన్ల వ్యతిరేకతను లెక్క చేయక, ఒంటరిగానే ఉద్యోగితను పెంచుతామని, ఆర్థిక వ్యత్యాసాలను తగ్గిస్తామని ఒబామా చెబుతున్నారు. అంతేకాదు... ఫెడరల్ కాంట్రాక్టు ఉద్యోగుల కనీస వేతనాలను రోజుకు 7.25 డాలర్ల నుంచి 10.10 డాలర్లకు పెంచారు. దీంతో 2.1 కోట్ల మందికి మేలు జరుగుతుంది. రిపబ్లికన్లతో బరిగీసి తలపడటానికి సిద్ధమైన ఒబామా నిజాయితీ అప్రస్తుతం. ఆయన చెప్పిన సత్యాలే ప్రస్తుతం. ‘నయా నిరంకుశత్వం’ ‘విశృంఖల పెట్టుబడిదారీ విధానపు నయా నిరంకుశత్వం కారణంగా ఎక్కీతొక్కీ ఉన్నవారికి, మెతుకులతో సరిపెట్టుకునే వారికి మధ్యన అంతరం తీవ్రంగా పెరిగిపోతోంది’ అని డిసెంబర్లో పోప్ ఫ్రాన్సిస్ హెచ్చరించాల్సిన స్థాయికి ‘మెరుగైన ప్రపంచం’లోని అసమానతలు పెరిగిపోయాయి. అవి పెట్టుబడిదారీ వ్యవస్థ అస్థిత్వానికే ముప్పును కలిగించే స్థితికి చేరుతున్నాయి. అందుకే అపార సంపదలే కాటేసే కాలనాగులుగా కుబేరులను భయపెట్టే పరిస్థితి ఏర్పడింది. అసాధారణమైన రీతిలో పోప్... వృద్ధి ఫలితాలు సమాజపు పైపొరల్లోంచి అట్టడుగుకు బొట్టుబొట్టుగా ఇంకి మెల్లగా అందుతాయనే ‘ట్రికిల్ డౌన్’ సిద్ధాంతాన్ని ప్రవచించే ప్రపంచ మన్మోహన్లందరికీ చెవి మెలి పెట్టి మరీ పాఠం చెప్పినంత పనిచేశారు. ‘కొందరు వ్యక్తులు స్వేచ్ఛా విపణి నుంచి లభించే ప్రోత్సాహంతో ఆర్థిక వృద్ధి, సామాజిక న్యాయం సాధ్యమని ఇంకా నమ్ముతూనే ఉన్నారు’ అంటూ మన్మోహన్ చిదంబరాల స్వేచ్ఛా విపణి సిద్ధాంతాలపై ప్రత్యక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు. మంత్రాలకు చింతకాయలు... విశృంఖల పెట్టుబడిదారీ విధానపు నిరంకుశత్వంతోనే ఆర్థిక మాంద్య కాలంలో సైతం సంపదలను పోగేసుకున్న ప్రపంచ సంపన్నులు మరింత సంపన్నులయ్యారు. ‘సంపద ఆరాధకులు’ దవోస్లో ఆర్థిక అసమానతల నుంచి రానున్న ముప్పును తలుచుకుని భయపడ్డారే గానీ... పరిష్కారాల దిశగా కన్నెత్తి చూడలేదు. ప్రపంచ సంపన్నులలో కేవలం 85 మందికి ఉన్న ఆస్తులే ప్రపంచ జనాభాలో సగం అంటే 350 కోట్ల మంది అస్తులకు సమానమని ఆక్స్ఫామ్ సంస్థ డిసెంబర్ 20న వెల్లడించింది. గత ఏడాది కాలంలోనే 210 మంది కొత్తగా బిలియనీర్లు (100 కోట్లు పైబడ్డ) అయ్యారు. మన దేశంలో గత దశాబ్ద కాలంగా మన్మోహన్ స్వేచ్ఛావిపణి విధానాల ఫలితంగా మన దేశంలో బిలియనీర్ల సంఖ్య 6 నుంచి 61కి చేరింది. ఇలాంటి కుబేరులు దవోస్లో ఆర్థిక అసమాన తల సమస్యను చూసి భయపడ్డారే తప్ప పరిష్కారాల కోసం అన్వేషించింది లేదు. తామే అసమానతలకు సృష్టికర్తలమని తెలియకపోతేగా! మంత్రాలకు చింతకాయలు రాలినట్టుగా అసమానతల జపంతో సమానత్వం వచ్చేస్తుందో, ఏమో 2035కు ప్రపంచంలో పేద దేశాలే ఉండవని బిల్ గేట్స్ జోస్యం చెప్పారు. - పిళ్లా వెంకటేశ్వరరావు -
పరిస్థితులు మెరుగుపడతాయ్
దావోస్: అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడగలవన్న ఆశాభావంతో ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు శనివారం ముగిసింది. అయిదు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో అసమానతలు, మధ్యప్రాచ్య సంక్షోభం, బాధ్యతాయుత పెట్టుబడిదారీ విధానం తదితర అంశాలపై ప్రపంచ నేతలు, వ్యాపార దిగ్గజాలు చర్చించారు. భారత్ సహా పలు దేశాల నుంచి మొత్తం 2,500 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. భారత నేతలు దేశ వృద్ధిపైన, సంస్కరణల కొనసాగింపుపైన ఇన్వెస్టర్లకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఇన్వెస్టర్లు భారత్లో త్వరలో ఎన్నికల పరిణామాలపై ఆసక్తి కనపర్చారు. చివరి రోజున సమావేశాల్లో పాల్గొన్న సందర్భంగా భారత్ ఆర్థిక సంస్కరణలకు కట్టుబడి ఉందని ప్రణాళిక సంఘం డిప్యుటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా స్పష్టం చేశారు. -
ప్రస్తుతం వీలుకాదు
దావోస్: బంగారం దిగుమతులపై సుంకాన్ని తగ్గించాలన్న డిమాండ్పై చర్య తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరగా, ఇప్పట్లో అలాంటి ఆలోచనేదీ లేదని ప్రభుత్వం పేర్కొంది. దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలనీ, పసిడి దిగుమతులను ఎగుమతులతో ముడిపెడుతున్న నిబంధనను సవరించాలన్న ఆభరణాల ఎగుమతిదారుల విజ్ఞప్తిని పరిశీలించాలని సోనియా గురువారం కేంద్ర వాణిజ్య శాఖకు లేఖ రాశారు. అయితే, కరెంటు అకౌంట్ లోటు(క్యాడ్)పై గట్టి పట్టు సాధించిన తర్వాతే బంగారం దిగుమతులపై ఆంక్షలను ఉపసంహరించుకోగలమని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం తేల్చిచెప్పారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఈఎఫ్) సదస్సులో మంత్రి ప్రసంగించారు. పుత్తడి దిగుమతులపై ఆంక్షలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. 8 శాతం వృద్ధి రేటును మళ్లీ అందుకుంటాం... సంస్కరణలు, సత్వర నిర్ణయాలు సత్ఫలితాలిచ్చాయని చిదంబరం అన్నారు. పాత తప్పిదాలు పునరావృతం కాకుంటే భారత్ 8% వృద్ధి రేటును మళ్లీ అందుకుంటుందని ఉద్ఘాటించారు. డబ్ల్యుఈఎఫ్ సదస్సులో భాగంగా బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలపై గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘మేం మరింత నిర్ణయాత్మకంగా ఉండాలని ఏడాదిన్నర క్రితం నిర్ణయించాం. ఆ ఫలితాలు ఇపుడు కళ్లెదుటే కన్పిస్తున్నాయి. వచ్చే మూడేళ్లలో క్రమంగా 8% వృద్ధిరేటును మళ్లీ చేరుకుంటామనడంలో ఎలాంటి సందేహం లేదు..’ అని చిదంబరం ధీమా వ్యక్తంచేశారు. ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాదు... ఇండియాతో పాటే దక్షిణాఫ్రికాలోనూ ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న విషయాన్ని మీడియా ప్రస్తావించగా, ‘దక్షిణాఫ్రికా పరిస్థితి సంతోషకరం. అక్కడి పాలక పక్షం మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశముంది. కానీ భారత్లో పరిస్థితి అలా లేదు. ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశం కన్పించడం లేదు’అన్నారు. 10 కోట్ల ఉద్యోగాల కల్పన: ఆనంద్ శర్మ తయారీ రంగంలో 10 కోట్ల మంది నిపుణులకు ఉద్యోగాలు కల్పించాలని భారత్ యోచిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంతి ఆనంద్ శర్మ తెలిపారు. జీడీపీలో ప్రస్తుతం 16%గా ఉన్న తయారీరంగం వాటాను 25%కు పెంచడం ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. దావోస్లో తయారీరంగంపై నిర్వహించిన సెషన్లో ఆయన ప్రసంగించారు. ఇదీ 80:20 నిబంధన పసిడి దిగుమతులపై ఆంక్షలను, 80:20 దిగుమతుల నిబంధనను సడలించాలని వజ్రాలు, ఆభరణాల పరిశ్రమ చేస్తున్న డిమాండుపై తగిన చర్య తీసుకోవాలంటూ వాణిజ్య శాఖకు సోనియా గురువారం లేఖ రాశారు. బంగారం దిగుమతిపై 10%గా ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 2%కు తగ్గించాలని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వ్యాపార సమాఖ్య సోనియాకు రాసిన లేఖలో కోరింది. 80:20 నిబంధనను సవరించాలని విజ్ఞప్తి చేసిం ది. 80:20 నిబంధన ప్రకారం అంతకుముందు దిగుమతి చేసుకున్న పసిడిలో 20%ను ఎగమతి చేసే వరకూ కొత్త దిగుమతులను అనుమతించరు. -
‘ఆప్’పై ఆర్థిక దిగ్గజాల దృష్టి
లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావంపై ఆరా దావోస్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగ దిగ్గజాల దృష్టి పడింది. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) ప్రతీ ఏటా జరిపే కార్యక్రమంలో భారత్కు సంబంధించిన అనధికారిక చర్చల్లో ఆప్, రానున్న లోక్సభ ఎన్నికలు.. ఈ రెండే ప్రధానాంశాలయ్యాయి. లోక్సభ ఎన్నికల్లో ఆప్ చూపనున్న ప్రభావం గురించి విదేశీ నేతలు, పెట్టుబడిదారులు భారతీయ ప్రతినిధులను లోతుగా ప్రశ్నించారు. ఆప్ ఢిల్లీ వరకే పరిమితమని, భారత్లో ఆప్లాంటి కార్యాచరణ కలిగిన పార్టీలు మనజాలవని వారికి భారతీయ నేతలు వివరించారు. అయితే, సుపరిపాలనపై ఆప్ లేవనెత్తిన అంశాలను కొట్టిపారేయలేమని వారు అంగీకరించారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవచ్చన్న వార్తలపై కూడా విదేశీయులు భారతీయ ప్రతినిధులను ప్రశ్నించారు. ఆప్ తెరపైకి రావడంతో అనిశ్చితి పెరిగిందని, అందువల్ల విదేశీ కార్పొరేట్లు ఆప్తో కూడా సంప్రదింపుల కోసం యత్నిస్తున్నాయని ఆ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రతినిధులు ‘ఆఫ్ ది రికార్డ్’గా మీడియాకు వెల్లడించారు. మిగతా పార్టీలతో సంప్రదింపులు జరిపినట్లుగానే ఆప్తోనూ జరుపుతామని భారతీయ పారిశ్రామిక సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తెలిపారు. సుపరిపాలన, బాధ్యతాయుత ప్రభుత్వం.. ఆప్ వల్ల ఈ రెండు కీలకాంశాలకు ప్రాధాన్యత లభించిందన్నారు. -
వచ్చే ఏడాది వృద్ధి 6% పైనే: చిదంబరం
దావోస్: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల ఉపసంహరణ(ట్యాపరింగ్) ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) సదస్సులో మాట్లాడుతూ విదేశీ ఇన్వెస్టర్లకు ఆయన ఈమేరకు భరోసానిచ్చారు. భారత్లో ఆర్థిక వ్యవస్థ గాడిలోపడుతోందన్న విత్తమంత్రి... ఈ ఏడాది(2013-14) 5% వృద్ధి రేటు సాధించగల విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది 6% పైగానే వృద్ధి ఉండొచ్చని చెప్పారు. 2012-13లో వృద్ధి దశాబ్దపు కనిష్టమైన 5%కి పడిపోవడం తెలిసిందే. కొద్ది సంవత్సరాల్లో కచ్చితంగా 8%వృద్ధిరేటును అందుకోగల సత్తా ఉంది’ అని చిదంబరం పేర్కొన్నారు. నెలకు 85 బిలియన్ డాలర్ల బాండ్ల కొనుగోలు(సహాయ ప్యాకేజీ)లో ఈ నెల నుంచి 10 బిలియన్ డాలర్ల కోతను ఫెడ్ ప్రకటించడం విదితమే. ఇంకా చిదంబరం ఏమన్నారంటే... సబ్సిడీల కోత ఇతరత్రా ఆర్థిక క్రమశిక్షణపై భారత ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. సంస్కరణల ప్రభావంతో భారత్లోకివిదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ) జోరందుకోనున్నాయి. ఆర్థికవేత్తగా పేరొందిన ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్.. గొప్ప ఆలోచనా పరుడు కూడా. పాలసీ నిర్ణయాల్లో సమర్ధంగా వ్యవహరిస్తారు. -
ఎక్కడ బాబూ సీఎం ‘శాఖ’..!?
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ యూరప్ పర్యటనకు వెళుతూ ఆయన వద్దనున్న శాఖల బాధ్యతలు ఎవరికి అప్పగించారో స్పష్టంగా తెలియరాలేదు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలతో పాటు కాంగ్రెస్ మంత్రుల్లో గందరగోళం నెలకొంది. చవాన్ వద్ద నగరాభివృద్ధి, గృహ నిర్మాణ, న్యాయ శాఖ, సామాన్య పరిపాలన విభాగం తదితర శాఖలున్నాయి. పర్యటనకు వెళుతూ ఈ శాఖల బాధ్యతలు అధికారికంగా అప్పగించకున్నప్పటికీ ఆయన తిరిగి వచ్చేంతవరకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉండవచ్చని మంత్రులు భావిస్తున్నారు. యూరప్లో జరిగే ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ సదస్సులో పాల్గొనేందుకు చవాన్ సోమవారం అర్ధరాత్రి ముంబై నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటన ఐదు రోజులు ఉంటుందని మంత్రాలయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సదస్సులో ఉద్యోగ, ఆర్థిక పెట్టుబడులపై చర్చలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. సాధారణంగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లే సమయంలో తన బాధ్యతలను ఉపముఖ్యమంత్రికి అప్పగిస్తారు. లేదా కనీసం తన వద్దనున్న శాఖలు తమ పార్టీకి చెందిన ఇతర మంత్రులకు అప్పగిస్తారు. కాని పృథ్వీరాజ్ చవాన్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. తన బాధ్యతలు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కే కాదు కనీసం తమ పార్టీకి చెందిన ఇతర మంత్రులకు కూడా అప్పగించలేదని తెలుస్తోంది. ముఖ్యంగా పర్యటన షెడ్యూలు ఖరారు కాగానే తన వద్దనున్న శాఖలు ఎవరికి అప్పగించాలనే దానిపై చర్చలు జరుపుతారు. తర్వాత బాధ్యతలు ఎవరికి అప్పగిస్తున్నారనేది అధికారికంగా ఒక ప్రకటన జారీ చేస్తారు. దీంతో వివిధ పనుల నిమిత్తం మంత్రాలయకు వచ్చే సామాన్య ప్రజలు ప్రకటనలో పొందుపర్చిన విధంగా ఆయా మంత్రుల దగ్గరకు వెళతారు. కానీ మంగళవారం సాయంత్రం వరకు ఎలాంటి జీవో విడుదల కాకపోవడంతో ఈ ఐదు రోజులపాటు చవాన్ వద్ద ఉన్న శాఖలను ఎవరు చూడాలనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా పనుల నిమిత్తం వచ్చిన ప్రజలను ఎవరి వద్దకు పంపించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కదలికలేని పోలీసుల బదిలీ ఫైల్ .. ఇదిలాఉండగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి ఇంతవరకు పోలీసు అధికారుల బదిలీల అంశం ఊసే ఎత్తడం లేదు. ఆయన యూరప్ పర్యటన ముగించుకుని తిరిగి ముంబైకి ఈ నెలాఖరులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ నెలలో కూడా పోలీసుల బదిలీలు జరిగే సూచనలు కనిపించడం లేదు. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం ఏమైనా బదిలీలు ఉంటే ఫిబ్రవరి 15 తేదీ లోగా ప్రక్రియ పూర్తచేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఫత్వా జారీ చేసింది. దీనిని బట్టి ఆ తర్వాత ఎప్పుడైనా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలులోకి వచ్చే సూచనలున్నాయి. లోక్సభ ఎన్నికల తంతు పూర్తికాగానే శాసనసభ ఎన్నికలు దగ్గరపడతాయి. మళ్లీ బదిలీల ప్రక్రియ ముందుకు కదిలే అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి, వచ్చే నెల 15 లోపే పోలీస్ శాఖలో బదిలీల పర్వాన్ని పూర్తిచేస్తే కొంతవరకు ఊరట లభిస్తుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. -
భారత కంపెనీలు..వ్యాక్సిన్ హీరోలు
దావోస్: భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని కంపెనీలు వ్యాక్సిన్లను తక్కువ ధరకు అందిస్తున్నాయని ప్రపంచ కుబేరుడు, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్మన్ బిల్ గేట్స్ కితాబిచ్చారు. ఒక్క డోస్ వ్యాక్సిన్ను ఒక్క డాలర్లోపు ధరలకు అందించడం ద్వారా చిన్నారులను ప్రాణాంతక వ్యాధులనుంచి ఈ కంపెనీలు రక్షిస్తున్నాయని ఆయన ప్రశంసించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశానికి వచ్చిన ఆయన డబ్ల్యూఈఎఫ్ బ్లాగ్లో ఈ విషయాలు వెల్లడించారు. గతంలో మనమెన్నడూ వినని కొన్ని కంపెనీలు- సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ, చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్, తదితర కంపెనీలు అంతర్జాతీయంగా ఆరోగ్యాన్ని పెంపొందించే తమ భాగస్వామ్య కంపెనీల్లో కొన్నని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల ఆరోగ్యం పట్ల గతంలో కంటే ఎక్కువ భరోసాని ఈ వ్యాక్సిన్ కంపెనీలు కల్పిస్తున్నాయని బిల్గేట్స్ పేర్కొన్నారు. అధిక నాణ్యత గల వ్యాక్సిన్లను చౌక ధరలకే ఈ కంపెనీలు అందిస్తున్నాయని ఆయన ప్రశంసించారు. -
స్విట్జర్లాండ్లో మినీ ప్రపంచం!
దావోస్: పర్యాటకుల స్వర్గధామమైన స్విట్జర్లాండ్లోని దావోస్ నగరం ఒక మినీ ప్రపంచంలా మారిపోనుంది. ఏంటి వింతగా ఉందా? ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనమిక్ ఫోరం- డబ్ల్యూఈఎఫ్) సదస్సు కోసం ఇక్కడికి వస్తున్న దేశాధినేతలు, ప్రభుత్వ ప్రతినిధులు, కార్పొరేట్ దిగ్గజాలు, కంపెనీల సీఈఓలతో దావోస్ చిన్నసైజు ప్రపంచాన్ని తలపించబోతోంది. చుట్టూ మంచుతో స్కీయింగ్ రిసార్ట్గా పేర్కొందిన ఈ నగరంలో 43వ వార్షిక డబ్ల్యూఈఎఫ్ సదస్సు నేటి నుంచి 5 రోజుల పాటు జరగనుంది. దీనికి భారత్ నుంచి కేంద్ర మంత్రులు, అనేక కంపెనీల అధినేతలు సహా మొత్తం 125 మంది భారీ ప్రతినిధుల బృందం హాజరవుతోంది. మంగళవారం సాయంత్రం ఈ సదస్సును డబ్ల్యూఈఎఫ్ చైర్మన్ క్లాస్ స్క్వాబ్ అధికారికంగా ప్రారంభిస్తారు. 22-25 వరకూ చర్చలు, సంప్రదింపుల సెషన్స్ జరుగుతాయి. ఇవీ వివరాలు... సదస్సు ఎక్కడ: స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో ఇది ఎన్నోసారి: ఇక్కడ 43వ సారి జరుగుతోంది ఎప్పటిదాకా: ఈ నెల 21 నుంచి 25 వరకూ(5 రోజులు) ఎంతమంది వస్తున్నారు: మొత్తం 2,500 మంది. వీరిలో 1,500 మంది వ్యాపార ప్రతినిధులే. ఈ ఏడాది థీమ్: మారుతున్న ప్రపంచం: సమాజం, రాజకీయాలు, వ్యాపారంపై దీని ప్రభావం ఎవరెవరు ఉంటారు: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాల ప్రతినిధులు. ఇందులో 40 దేశాల అధిపతులు, నాయకులు, కార్పొరేట్ వర్గాలు ప్రధానంగా ఉంటారు. ఆతిథ్య స్విట్జర్లాండ్ సహా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్, ఇరాన్, ఇజ్రాయెల్, బ్రెజిల్, ఇటలీ, మారిషస్, కొరియా, భారత్ తదితర దేశాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్, జపాన్ ప్రధాని షింజో అబే, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ సహా పలువురు జీ-20 కూటమి దేశాధినేతలు సైతం ప్రసంగించనున్నారు. వందలకొద్దీ టాప్ కంపెనీల సీఈఓలు. పేరొందిన అపర కుబేరులు కూడా రానున్నారు. సదస్సులో ఏం చేస్తారు: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులపై చర్చ. దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక సంప్రదింపులు, వాణిజ్య అంశాలూ ఇందులో ప్రధానంగా ఉంటాయి. యూరోజోన్లో సంక్షోభం నేపథ్యంలో దీని భవిష్యత్తుపైనా దృష్టిసారించే అవకాశం. అంతర్జాతీయ సంస్థల చీఫ్లు కూడా: ఐక్యరాజ్య సమితి(యూఎన్) సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డ్, ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) డెరైక్టర్ జనరల్ రోబర్టో అజెవెడో తదితరులు కొలువుదీరనున్నారు. అంతర్జాతీయ కంపెనీల క్యూ: పెప్సీకో, ఆర్సెలర్ మిట్టల్, గూగుల్, టోటల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, మైక్రోసాప్ట్, బ్రిటిష్ పెట్రోలియం, సిటీ గ్రూప్, డాయిష్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ, ఫోక్స్వ్యాగన్, యూబీఎస్, యూనిలీవర్, స్టాన్చార్ట్ వంటివి ఇందులో కొన్ని. భారత్ నుంచి పాల్గొంటున్నదెవరు ఆర్థిక మంత్రి పి. చిదంబరం, వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ, ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, పట్టణాభివృద్ధి-పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్, భారీ పరిశ్రమలు-ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్, విద్యుత్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రభుత్వం తరపున ప్రధానంగా హాజరుకానున్నారు. మన కార్పొరేట్లలో ముఖ్యులు.. భారత్ నుంచి మొత్తం 100 మంది కార్పొరేట్ దిగ్గజాలు ఉన్నారు. వీరిలో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ, గోద్రెజ్ గ్రూప్ అధినేత ఆది గోద్రెజ్, జీఎంఆర్ గ్రూప్ అధిపతి జీఎం రావు, బజాజ్ గ్రూప్ చైర్మన్ రాహుల్ బజాజ్, భారతీ గ్రూప్ సీఎండీ సునీల్ మిట్టల్, గౌతమ్ అదానీ, సీఐఐ ప్రెసిడెంట్ క్రిస్ గోపాలకృష్ణన్, పవన్ ముంజాల్, నైనా లాల్ కిద్వాయ్, నరేశ్ గోయెల్ తదితర ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. 2014 సదస్సుకు సహాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న వారిలో క్రిస్ గోపాలకృష్ణన్ కూడా ఒకరు. సమావేశాల్లో బాలీవుడ్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ను కూడా నిర్వహించనుండటం గమనార్హం.