adah sharma
-
వేడిలో సెగలు పుట్టిస్తున్న అదా శర్మ ఫోటోస్
-
ఓటీటీకి టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ది కేరళ స్టోరీ ఫేమ్ ఆదా శర్మ, విశ్వంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ సీడీ (క్రిమినల్ ఆర్ డెవిల్). ఈ ఏడాది మే 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంత చేసుకుంది. ఈ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి కృష్ణ అన్నం దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నెల 26 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్ను రిలీజ్ చేసింది. కాగా.. దెయ్యం కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కిచారు. రిలీజైన దాదాపు ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోంది. -
ఫారిన్ గర్ల్ అనుకున్నారు... నేనూ నిజం చెప్పలేదు!
బాలీవుడ్ బ్యూటీ అదా శర్మ తొలిసారి కెమెరా ముందు నటించిన చిత్రం 1920. ఈ హారర్ చిత్రంతోనే ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీ చిత్రీకరణ సమయంలో చాలామంది తనను చూసి విదేశీ నటి అనుకున్నారట! తాజాగా ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. '1920 సినిమా షూటింగ్ ఎక్కువ భాగం లండన్లోనే జరిగింది. విదేశీ అమ్మాయి అనుకున్నారుఅక్కడ ఎండ అనేదే లేదు. దానికి తోడు విపరీతమైన చలి. అప్పుడు నేను బ్లూ లెన్స్ పెట్టుకున్నాను. నన్నలా చూసి చాలామంది నేను విదేశీ అమ్మాయి అనుకున్నారు. నాకసలు హిందీయే రాదని అభిప్రాయపడ్డారు. చాలాకాలం అదే భ్రమలో ఉండిపోయారు. కానీ నేను భారతీయురాలినే, నాకు హిందీ వచ్చు అని ఏనాడూ క్లారిటీ ఇవ్వాలనిపించలేదు. సోషల్ మీడియాా తెలీదుపైగా అప్పట్లో సోషల్ మీడియా అంటేనే అంతగా తెలియదు. ఇన్స్టాగ్రామ్లో కూడా లేను' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే అదా నటించిన రీటా సాన్యల్ వెబ్ సిరీస్ హాట్స్టార్లో అక్టోబర్ 14 నుంచి ప్రసారం కానుంది.బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టాలీవుడ్ హీరోయిన్కి అరుదైన వ్యాధి.. షాకింగ్ విషయాలు రివీల్
హీరోయిన్లు పైకి అందంగా కనిపిస్తారు. కానీ కొన్నిసార్లు వ్యాధుల బారిన పడుతుంటారు. సమంత కొన్నాళ్ల ముందు మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఇప్పుడు మెల్లమెల్లగా బయటపడుతోంది. తాజాగా అదాశర్మ కూడా తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని రివీల్ చేసింది. దీని వల్ల ఎంతలా బాధపడాల్సి వస్తుందో ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది.'హార్ట్ ఎటాక్' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అదాశర్మ.. ఆ తర్వాత టాలీవుడ్లో వరస సినిమాలు చేసింది. కానీ పెద్దగా పేరు అయితే రాలేదు. మరోవైపు బాలీవుడ్కి షిఫ్ట్ అయిపోయి.. 'ద కేరళ స్టోరీ', 'బస్తర్' లాంటి మూవీస్తో కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ బయటపెట్టింది.(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!)'కేరళ స్టోరీ మువీలో నటించినప్పుడు కాలేజీ అమ్మాయిలా కనిపించడానికి బరువు తగ్గాల్సి వచ్చింది. ఆ తర్వాత 'బస్తర్' చిత్రంలో నటించినప్పుడు బరువు పెరిగాను. ఎందుకంటే ఆ చిత్రంలో బరువైన గన్స్ మోయాలి కాబట్టి లావుగా కనిపించడంతో పాటు కాస్త బలంగా ఉండటానికి రోజు 10-12 అరటిపళ్లు తిన్నాను. అలానే గింజలు, డ్రై ఫ్రూట్స్, ఫ్లాక్ సీడ్స్ ఉన్న లడ్డూలని నాతో పాటు షూటింగ్కి తీసుకెళ్లాను. నిద్రపోయే అరగంట ముందు రెండు లడ్డూలు తినేదాన్ని''కానీ ఇప్పుడు మళ్లీ బరువు తగ్గాల్సి వచ్చింది. ఇలా నెలల వ్యవధిలో బరువు తగ్గడం-పెరగడం వల్ల నా బాడీలో రకరకాల మార్పులు చోట్ చేసుకోవడంతో పాటు ఒత్తిడికి గురయ్యాను. ఇది కాదన్నట్లు ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు తేలింది. దీని వల్ల పీరియడ్స్ ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఈ జబ్బు కారణంగా దాదాపు 48 రోజుల పాటు నాన్ స్టాప్ పీరియడ్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను' అని అదాశర్మ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: నటి ఇంట్లో చోరీ.. 10 తులాల బంగారం, డబ్బు దొంగతనం) -
హీరో ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్లో హీరోయిన్ మకాం
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ పేరు చెప్పగానే చాలామంది ఎమోషనల్ అవుతారు. ఎందుకంటే ఎంతో పెద్ద కెరీర్ ఉన్న హీరో.. ఊహించని విధంగా తన ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. హిందీ ఇండస్ట్రీలోని నెపోటిజం వల్ల ఇలా జరిగిందని రచ్చ రచ్చ జరిగింది.(ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్ నుంచి త్వరలో గుడ్ న్యూస్?)అలాంటిది ఆ ఫ్లాట్లో యంగ్ హీరోయిన్ అదాశర్మ మకాం పెట్టేసింది. దాదాపు నాలుగు నెలల క్రితమే తాను ఈ ప్లేసులోకి షిఫ్ట్ అయినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. 'ద కేరళ స్టోరీ' సినిమాతో పాన్ ఇండియా రేంజులో గుర్తింపు తెచ్చుకున్న అదా.. సుశాంత్ ఫ్లాట్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.'నేను నాలుగు నెలల క్రితమే ఈ ఫ్లాట్లోకి షిఫ్ట్ అయ్యాను. కానీ నా సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉండటం వల్ల సర్దుకోవడం కుదర్లేదు. ఈ మధ్య పూర్తిగా వస్తువులు, సామాన్లు అన్నీ సర్దేసుకున్నాను. ఇక్కడంతా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. కేరళ, ముంబయిలోని మా ఇళ్ల చుట్టూ చెట్లు ఉంటాయి. అందుకే చుట్టూ పచ్చని వాతావరణం ఉన్న ఈ ఇంటికి మారాను. అలానే ఈ ఫ్లాట్లోకి వేరే ఏం ఆలోచించకుండా మారిపోయాను' అని అదాశర్మ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ప్రేమికులే హంతకులైతే? ఇంట్రెస్టింగ్గా 'పరువు' ట్రైలర్) -
హారర్ థ్రిల్లర్తో వస్తోన్న ఆదాశర్మ.. చాలా ఏళ్లకు తెలుగులో!
అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సీడీ(క్రిమినల్ ఆర్ డెవిల్). ఈ చిత్రంతో చాలా కాలం తర్వాత అదా శర్మ తెలుగు వారిని పలకరించనున్నారు. కృష్ణ అన్నం దర్శకత్వం వహించిన ఈ మూవీని ఎస్ఎస్సీఎం ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ మూవీకి గిరిధర్ నిర్మాతగా వ్యవహరించారు.హారర్ థ్రిల్లర్గా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పోస్టర్ చూస్తే సినిమా కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో రాబోతుందని అర్థమవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ను జారీ చేశారు. మే 24న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.ఈ మూవీలో విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించారు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
‘ది కేరళ స్టోరీ’తో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది అదాశర్మ. అంతకు ముందు పలు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు. తెలుగులో హార్ట్ అటాక్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించినా.. అదా శర్మను మాత్రం స్టార్ హీరోయిన్గా చేయలేకపోయింది. దీంతో ఈ భామ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ పలు లేడి ఓరియెంటెండ్ చిత్రాల్లో నటించినా.. ఫేమ్ రాలేదు. దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకొని ‘ది కేరళ స్టోరీ’తో రీఎంట్రీ ఇచ్చింది. గతేడాదిలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడంతో పాటు అదా శర్మను పాన్ ఇండియా హీరోయిన్గా మార్చేసింది. అదే జోష్లో ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ సుదీప్తోసేన్తోనే ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ అనే సినిమా చేసింది. ఈ ఏడాది మార్చి 15న థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రం తొలి రోజే నెగెటివ్ టాక్ సంపాదించుకొని అట్టర్ ప్లాప్గా నిలిచింది. అయితే విడుదలకు ముందు ఈ మూవీ పలు వివాదాల్లో చిక్కుకుంది. ఇందులో కేవలం మావోయిస్టుల హింసనే ఎక్కువ చూపించారని, సంచలనం కోసమే ఈ చిత్రాన్ని తెరకెక్కించారనే విమర్శలు వచ్చాయి. విడుదల తర్వాత ప్లాప్ టాక్ రావడంతో ఎవరూ ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మే 17 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ 5 సంస్థ ఎక్స్(ట్విటర్) వేదికగా తెలియజేస్తూ పోస్టర్ని రిలీజ్ చేసింది. ఇందులో అదాశర్మ మావోయిస్టులను అణచివేయడానికి నియమితురాలైన ఐపీఎస్ అధికారి నీరజా మాధవన్గా నటించింది. An internal war that has the country divided into two fractions. Watch the gruesome story of Naxal violence.#Bastar premieres 17th May, only on #ZEE5. Available in Hindi and Telugu. #BastarOnZEE5 pic.twitter.com/IUFXrNnkqq— ZEE5 (@ZEE5India) May 8, 2024 -
బిర్యానీ పార్టీకి పిలిస్తే మంచివాళ్లా?.. హీరోయిన్పై నెటిజన్ ట్రోల్స్!
బాలీవుడ్ భామ ఆదా శర్మ నటించిన వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ' సంచలన విజయం సాధించింది. కేరళలోని అమ్మాయిలను మతం పేరుతో విదేశాలకు తరలించారనే నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ ఏడాది బస్తర్ సినిమాతో మార్చి 15న ప్రేక్షకులను పలకరించింది. గతంలో బస్తర్లో జరిగిన మావోయిస్టుల దాడి ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే తాజాగా ఆదా శర్మ ముంబైలో జరిగిన ఓ ఇఫ్తార్ విందుకు హాజరైంది. ప్రముఖ రాజకీయ నాయకుడు బాబా సిద్ధిక్ నిర్వహించిన ఇఫ్తార్ పార్టీలో మెరిసింది. ఈ విందుకు సల్మాన్ ఖాన్, ఇమ్రాన్ హష్మీ, మునావర్ ఫరూఖీ, ప్రీతి జింటా, ప్రియాంక చాహర్ చౌదరి, షెహనాజ్ గిల్ లాంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. ది కేరళ స్టోరీ సినిమా తర్వాత ఆదాశర్మ ఇఫ్తార్ విందుకు హాజరు కావడంపై ఓ నెటిజన్ ప్రశ్నించారు. ‘ఎంత మోసం.. ముస్లింలపై ద్వేషపూరిత సినిమాలు తీస్తారు.. ఇప్పుడేమో బిర్యానీ కోసం ఆహ్వానించగానే మంచివాళ్లు అయిపోయారా?’ అంటూ ఆదా శర్మ పార్టీలో ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై ది కేరళ స్టోరీ నటి స్పందించింది. దీనిపై అదా శర్మ స్పందిస్తూ.. 'అప్పుడైనా..ఇప్పుడైనా ఉగ్రవాదులు అంటే విలన్లు. అంతేకాని ముస్లింలు కాదు' అంటూ రిప్లై ఇచ్చింది. కాగా.. కేరళలో అమ్మాయిలను బలవంతంగా మతమార్పిడి చేసి విదేశాలకు తరలించారనే నేపథ్యంలోనే ది కేరళ స్టోరీని రూపొందించారు. అయితే గతంలో తాము ఈ సినిమాను ఏ మతానికి వ్యతిరేకంగా నిర్మించలేదని తెలిపారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఉన్నవారంతా మా పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. కాగా.. ఈ చిత్రంలో యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రల్లో నటించారు. On odd and even days dear sir terrorists are villains . Not muslims. — Adah Sharma (@adah_sharma) March 26, 2024 What a fraud she is!!! On Odd Days Muslims are Villains for these people and you make hate movies against them!!! On Even Days Muslims are great for these people because you get invited for a Biryani!!! pic.twitter.com/ygNhPNMnkO — Sridhar Ramaswamy శ్రీధర్ రామస్వామి ✋🇮🇳 (@sridharramswamy) March 25, 2024 -
వేశ్య అని తిడుతున్నారు: హీరోయిన్
హారర్ సినిమాతో తన కెరీర్ మొదలుపెట్టింది అదా శర్మ. హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, క్షణం, కల్కి సినిమాల్లో తళుక్కుమని మెరిసింది. కానీ ఇక్కడ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తోంది. ద కేరళ స్టోరీ, బస్తర్: ద నక్సల్ స్టోరీ వంటి వైవిధ్య చిత్రాల్లో నటించి సెన్సేషనల్ నటిగా మారింది. వివాదాస్పద సినిమాల్లో నటించిన అదాను చాలామంది తిట్టిపోస్తున్నారు. అందులో ఏం లేదు తాజాగా ఆమె ఈ సినిమాల గురించి, ట్రోలింగ్ గురించి పెదవి విప్పింది. అదా శర్మ మాట్లాడుతూ.. 'బస్తర్ మూవీ డైరెక్టర్ నన్నొక సున్నితమైన అమ్మాయిగా భావించొద్దన్నాడు. అడవుల్లో తిరిగే మనిషిగా కనిపించాలన్నాడు. అబ్బాయి ఎలా తుపాకీలు పట్టుకుని తిరుగుతాడో, అతడికి ఎలా కండలుంటాయో అలా కనిపించాలన్నాడు. నిజానికి ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు అందులో నేను లేను. ఆ ఫోటోలో అడవులు.. దానిపై బస్తర్ అన్న టైటిల్ మాత్రమే ఉంది. అయినా సరే ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ సినిమా తీస్తున్నారంటూ రకరకాలుగా విమర్శించారు. నోటికొచ్చింది తిడుతున్నారు సినిమా రిలీజ్ కాకముందే ఇంత ట్రోలింగా అనిపించింది. అప్పుడసలు ఎలా రిలాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. సినిమా చూడకముందే విమర్శలు గుప్పించాలనుకుంటే అది మీ ఇష్టం. ఏది పడితే అది కామెంట్స్ చేసే హక్కు మీకు ఉన్నట్లే నచ్చిన సినిమాలు తీసే హక్కు మాకూ ఉంది. కొందరైతే నేను ఏ పోస్ట్ పెట్టినా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వేశ్య అని కామెంట్స్ చేస్తున్నారు' అని చెప్పుకొచ్చింది. కాగా అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన బస్తర్ మార్చి 15న విడుదలైంది. కానీ పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. చదవండి: మొన్నే ప్రియుడితో ఎంగేజ్మెంట్.. కుమారుడితో కలిసి పార్టీ ఇచ్చిన హీరోయిన్ కంగనా రనౌత్ పుట్టినరోజు.. ఈ బ్యూటీ అమ్మ గురించి తెలుసా? -
'ది కేరళ స్టోరీ మేకర్స్'.. మరో సెన్సేషనల్ మూవీ వచ్చేస్తోంది!
ది కేరళ స్టోరీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సుదీప్తో సేన్. అదా శర్మ ప్రధాన పాత్రలో మెప్పించిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. వివాదాలు చుట్టుముట్టినప్పటీకి ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం రిలీజైన దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీకి వచ్చింది. ప్రస్తుతం జీ5 స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వస్తోంది. కేరళలో అమ్మాయిలను బలవంతంగా విదేశాలకు తరలించారన్న నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించారు. ది కేరళ స్టోరీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మేకర్స్ మరో కాంట్రవర్షి మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆదాశర్మ- సుదీప్తో సేన్ కాంబినేషన్లో బస్తర్ అనే మరో చిత్రం వస్తోంది. నక్సలిజం ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా చత్తీస్గఢ్లోని బస్తర్లో జరిగిన మారణహోమం ఆధారంగా రూపొందించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ చిత్రంలో ఆదాశర్మ ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 15న థియేటర్లలో విడుదల కానుంది. -
రెండు వారాల నుంచి టాప్ ట్రెండింగ్లో.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?
అప్పుడప్పుడు కొన్ని సినిమాలు కాంట్రవర్సీ అవుతుంటాయి. ఎంతలా అంటే వాటి గురించి దేశమొత్తం మాట్లాడుకునేలా! అలాంటి చిత్రాల్ని థియేటర్లలో మిస్ అయిన వాళ్లు.. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని చూస్తుంటారు. వచ్చిన తర్వాత మాత్రం అస్సలు విడిచిపెట్టరు. అలా రీసెంట్గా ఓటీటీలో రిలీజైన ఓ మూవీ.. ట్రెండింగ్లో ఉండటంతో పాటు రికార్డ్ సృష్టించింది. ఇంతకీ ఏ సినిమా? ఏంటా రికార్డ్? (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) పైన చెప్పినదంతా కూడా 'ద కేరళ స్టోరీ' సినిమా గురించే. కేరళలో జరిగిన అమ్మాయిలు అక్రమ రవాణా, మత మార్పిడి, విదేశాల్లో ఉగ్రదాడులు.. ఇలా చాలా కాంట్రవర్సీ కాన్సెప్ట్తో తీశారు. గతేడాది మే నెలలో థియేటర్లలో విడుదలైంది. పలు వివాదాలు ఏర్పడినప్పటికీ దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పలు వివాదాల వల్ల 'ద కేరళ స్టోరీ' సినిమా ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 15న జీ5 ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. గత 15 రోజుల నుంచి టాప్ ట్రెండింగ్లో కొనసాగుతున్న ఈ చిత్రం.. 300 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అయ్యి రికార్డ్ సృష్టించినట్లు సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) The world is tuning in to hear their stories! 💯 With 300 million watching minutes, have you seen it yet?#TheKeralaStory streaming now, only on #ZEE5#TheKeralaStoryOnZEE5 #VipulAmrutlalShah #TheKeralaStory #SaveOurDaughters@sudiptoSENtlm @Aashin_A_Shah @sunshinepicture… pic.twitter.com/150BhPCpKc — ZEE5 (@ZEE5India) March 2, 2024 -
ఓటీటీలోకి వచ్చేసిన సంచలన సినిమా.. అప్పుడే ట్రెండింగ్!
కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్నే కాదు ఇన్ఫర్మేషన్నూ ఇస్తాయి. అలాంటి కోవలోకే వస్తుంది ది కేరళ స్టోరీ. కేరళలో ఓ వర్గానికి చెందిన యువతులను మతం మార్చి ఉగ్రవాదులుగా తయారు చేసిన ఉదంతాలను ఆధారంగా తీసుకుని తెరకెక్కిందీ చిత్రం. ఈ సినిమా ప్రకటించిననాటి నుంచే ఎన్నో విమర్శలు చుట్టుముట్టాయి. రిలీజైనప్పుడు కూడా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది. మే నెలలో రిలీజ్.. అయినప్పటికీ అన్నింటినీ దాటుకుంటూ ప్రేక్షకాదరణ పొందింది. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించాడు. గతేడాది మేలో రిలీజైన ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ ఫిబ్రవరి 16న జీ5లో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అప్పుడే ట్రెండింగ్లో.. ముందుగా చెప్పినట్లుగానే శుక్రవారం నాడు ది కేరళ స్టోరీని జీ5లో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అలా ఓటీటీలో విడుదలైందో లేదో ఇలా ట్విటర్లో ట్రెండ్ అవుతోందీ సినిమా. థియేటర్లో చూడటం మిస్ అయినా లేదంటే మరోసారి చూడాలనిపించినా ఆలస్యం చేయకుండా వెటనే ఓటీటీలో ది కేరళ స్టోరీపై ఓ లుక్కేయండి.. She said yes to love but what followed was nothing short of a nightmare.#TheKeralaStory streaming now, only on #ZEE5#TheKeralaStoryOnZEE5 #VipulAmrutlalShah pic.twitter.com/YcQgNb8zlQ — ZEE5 (@ZEE5India) February 16, 2024 చదవండి: హీరోయిన్ కన్నడ సీరియల్ నటి.. త్వరలోనే అక్కడ కూడా! -
గ్రీన్ డ్రెస్లో ఆపరేషన్ వాలెంటైన్ భామ.. బీచ్లో చిల్ అవుతోన్న ప్రగ్యా జైశ్వాల్!
గ్రీన్ డ్రెస్లో ఆపరేషన్ వాలెంటైన్ భామ హోయలు బీచ్లో ఎంజాయ్ చేస్తోన్న ప్రగ్యా జైస్వాల్.. ట్రెండీ లుక్లో ది కేరళ స్టోరీ భామ ఆదా శర్మ.. అలాంటి లుక్తో మతి పోగోడుతున్న నిధి అగర్వాల్ View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) -
పవర్ఫుల్ పాత్రలో ఆదా శర్మ.. మరో కాంట్రవర్సీ అవుతుందా?
గతేడాది 'ది కేరళ స్టోరీ' మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన భామ ఆదా శర్మ. సుదీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వివాదానికి దారితీసింది. కేరళలోని ముగ్గురు అమ్మాయిల కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సన్షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్లాల్ షా నిర్మించారు. అయితే ఈ చిత్రంపై విమర్శలు వచ్చినప్పటికీ.. కమర్షియల్గా సక్సెస్ సాధించింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా తర్వాత ఆదా శర్మ నటిస్తోన్న మరో కాంట్రవర్సీ చిత్రం బస్తర్. నక్సలిజం బ్యాక్డ్రాప్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ది కేరళ స్టోరీ ఫేమ్ సుదీప్తో సేన్ బస్తర్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అదాశర్మ నీర్జా మాధవన్ అనే ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని గతంలో ఛత్తీస్గఢ్లోని బస్తర్లో 76 మంది జవానులు ప్రాణాలు కోల్పోయిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నారు. టీజర్ చూస్తే ఆదా శర్మ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో పవర్ఫుల్గా కనిపిస్తోంది. నక్సలైట్లతో జరిగిన పోరాటంలో కన్నుమూసిన జవానుల గురించి అదాశర్మ చెప్పిన డైలాగ్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. బోర్డర్లో పాకిస్థాన్తో పోరాడి కన్నుమూసిన జవాన్ల కంటే.. నక్సలైట్లతో పోరులో మరణించిన జవాన్ల సంఖ్యే ఎక్కువగా ఉందంటూ అదాశర్మ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. బస్తర్లో జరిగిన మారణహోమంలో 76 మంది జవానులను నక్సలైట్లు పొట్టన పెట్టుకుంటే జేఎన్యూ స్టూడెంట్స్ సంబరాలు చేసుకున్నారంటూ టీజర్లో వివాదాస్పద డైలాగ్స్ కనిపిస్తోన్నాయి. ది కేరళ స్టోరీ మూవీ టీమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. -
ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ద కేరళ స్టోరీ'.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఎట్టకేలకు 'ద కేరళ స్టోరీ' సినిమా ఓటీటీ రిలీజ్కి రెడీ అయిపోయింది. గతేడాది వేసవిలో థియేటర్లలోకి వచ్చినప్పుడు పలు వివాదాల్లో చిక్కుకుంది. ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. అప్పుడు ఇప్పుడని అన్నారు. కానీ చివరకు ఇప్పుడు అధికారికంగా ఓటీటీ పార్ట్నర్, స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన అదాశర్మ.. 'ద కేరళ స్టోరీ' మూవీలో ప్రధాన పాత్ర పోషించింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. సన్షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్లాల్ షా నిర్మించారు. థియేటర్ రిలీజ్కి ముందే డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న జీ5.. కాంట్రవర్సీ వల్లో ఏమో గానీ స్ట్రీమింగ్ తేదీ లాంటివి ఏం చెప్పకుండా వచ్చింది. (ఇదీ చదవండి: రెమ్యునరేషన్ పెంచేసిన రష్మిక.. తెలుగులో ఈమెనే టాప్?) ఫైనల్ ఇప్పుడు ముహూర్తం కుదిరినట్లు ఉంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుందని అధికారికంగా ట్వీట్ పెట్టి మరీ ప్రకటించింది. దీంతో మూవీ లవర్స్ ఎగ్జైట్ అయిపోతున్నారు. నెక్స్ట్ వీకెండ్లో పక్కా చూసేయాలని ప్లాన్ వేసుకుంటున్నారు. 'ద కేరళ స్టోరీ' సినిమా కథ విషయానికొస్తే.. ముగ్గురు అమ్మాయిలు ప్రధానంగా ఉంటుంది. ఇందులో షాలినీ (అదా శర్మ) కథ మెయిన్ పార్ట్. ఈ అమ్మాయిలు ముగ్గురిని ప్రేమ పేరుతో మభ్యపెట్టి వేసుకొని ఇస్లాం మతంలోకి మార్చి విదేశాలకు తీసుకెళ్లి ఉగ్రవాదులుగా మార్చాలని కొందరు ప్రయత్నిస్తారు. షాలినీని అఫ్గానిస్థాన్కు చెందిన ఓ వ్యక్తి.. అలానే పెళ్లి చేసుకొని తీసుకెళతాడు. చివరకు షాలినీ పరిస్థితి ఏమైంది? తప్పించుకోగలిగిందా? అనేదే ఈ మూవీ. (ఇదీ చదవండి: అందుకే ఇన్నేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చాం: ఉపాసన) The wait is officially over! The most anticipated film is dropping soon on ZEE5!#TheKeralaStory premieres on 16th February, only on #ZEE5#TheKeralaStoryOnZEE5 #VipulAmrutlalShah pic.twitter.com/4mBGyTTp4S — ZEE5 (@ZEE5India) February 6, 2024 -
ఓటీటీకి రూ.300 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రం రిలీజై నెలలు గడుస్తున్నా ఓటీటీలో రాలేదు. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా కొత్త ఏడాదిలో ఈ చిత్రం ఓటీటీ రానున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జీ5 సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీంతో ఈ మూవీ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నారు మేకర్స్. చిన్న సినిమాగా వచ్చిన ది కేరళ స్టోరి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. వివాదాలు ఎదురైనప్పటికీ అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కొత్త ఏడాదిలో సంక్రాంతి కానుకగాా ఈ చిత్రాన్ని జనవరి 12న లేదా జనవరి 19న స్ట్రీమింగ్ వచ్చే అవకాశమున్నట్లు సినీ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా.. కేరళలోని బాలికలను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో సుదీప్తో సేన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ ప్రధాన పాత్రలలో నటించారు. వివాదాస్పదంగా మారిన ఈ సినిమా 2023 మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
నెలలోపే ఓటీటీ వస్తుంటే.. ఈ సినిమాలకేమైంది?
ప్రస్తుత సినిమా ప్రపంచంలో ఓటీటీలదే హవా. తమ అభిమాన స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడొస్తాయా అని చూస్తున్నారు అభిమానులు. సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే.. ఏ ఓటీటీలో వస్తుంది? ఏ రోజు స్ట్రీమింగ్ అవుతుందని తెలుసుకోవాలని తహతహలాడుతుంటారు. పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు, బ్లాక్ బస్టర్స్ సైతం నెల తర్వాతే ఓటీటీల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రిలీజై నెలల గడుస్తున్నా కొన్ని సినిమాలు ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఇంతకీ ఆ సినిమాలేవీ? ఎందుకు రాలేదు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం. అఖిల్ ఏజెంట్… అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఏప్రిల్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో కనిపించారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ను సోనీ లివ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అసలు కథేంటంటే? రామకృష్ణ అలియాస్ రిక్కీకి రా(RAW) ఏజెంట్ కావాలనేది కల. దానికోసం మూడుసార్లు పరీక్ష రాసి పాస్ అయినా రిజెక్ట్ అవుతాడు. మహాదేవ్(మమ్ముట్టి) రా చీఫ్. భారతదేశాన్ని టార్గెట్ చేసిన ది గాడ్ (డినో మోరియా)ని అంతం చేయాలనేది ఈయన లక్ష్యం. అందుకోసం ఓ మిషన్ ప్లాన్ చేస్తాడు. అనుకోకుండా ఈ మిషన్లో భాగమవుతాడు. ఇంతకు మహాదేవ్.. రిక్కీకి ఏం చేయమన్నాడు? రిక్కీ రా ఏజెంట్ కల నేరవేరిందా? మహాదేవ్ మిషన్ పూర్తయిందా? లేదా? అన్నదే 'ఏజెంట్' స్టోరీ. నయనతార కనెక్ట్… లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కనెక్ట్. థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం రిలీజ్ కాలేదు. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలైంది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ మూవీని నిర్మించాడు. కనెక్ట్ ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ సినిమా మాత్రం ఇప్పటివరకు ఓటీటీ రిలీజ్ కాలేదు. ఆదా శర్మ.. ది కేరళ స్టోరీ ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం రిలీజ్ నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఓటీటీకి రావడం లేదు. సెన్సిటివ్ కంటెంట్ కావడంతోనే ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. -
ఆ ఫ్లాట్లో హీరో సూసైడ్.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్!
ఈ ఏడాది ది కేరళ స్టోరీ సినిమాతో క్రేజ్ దక్కించుకున్న భామ ఆదా శర్మ. కేరళలో జరిగిన బాలికల మిస్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా ఆదా శర్మకు మరింత గుర్తింపును తీసుకొచ్చింది. ఇటీవల కమాండో వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ అవుతోంది. అయితే తాజాగా ఆదా శర్మకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: సినిమాల్లో కూడా అవకాశాలొచ్చాయి.. కానీ: అభిషేకం సీరియల్ నటి) ఎంఎస్ ధోని చిత్రంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్. ఊహించని పరిణామాలతో ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని బాంద్రాలోని మాంట్ బ్లాంక్ అపార్ట్మెంట్స్లో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ ఇంటిని ది కేరళ స్టోరీ స్టార్ ఆదా శర్మ కొనుగోలు చేసినట్లు బీటౌన్ సమాచారం. అయితే గతంలో సుశాంత్ ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆ ఇంటికి సుశాంత్ నెలకు రూ.4.5 లక్షలు అద్దె చెల్లించేవారట. అయితే ఈ విషయంపై ఆమె ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పెద్దఎత్తున వైరలవుతోంది. అయితే త్వరలోనే ఆ ఇంటికి మారబోతున్నట్లు కూడా తెలుస్తోంది. కాగా.. 2009లో హిందీ హారర్ చిత్రం 1920తో రజనీష్ దుగ్గల్ సరసన బాలీవుడ్లోకి అడుగుపెట్టింది ఆదాశర్మ. (ఇది చదవండి: క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న 'క్రిమినల్' !) View this post on Instagram A post shared by Tellychakkar Official ® (@tellychakkar) -
హారర్ సీడీ
‘ది కేరళ స్టోరీ’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత అదా శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సీడీ’. ‘క్రిమినల్ ఆర్ డెవిల్’ అనేది ఉపశీర్షిక. కృష్ణ అన్నం దర్శకత్వంలో ఎస్ఎస్సీఎమ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సైకలాజికల్ అండ్ హారర్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘‘ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చే చిత్రం ఇది. త్వరలోనే రిలీజ్ డేట్ను ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. విశ్వంత్, ‘జబర్దస్త్’ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆర్ఆర్ ధృవన్, కెమెరా: సతీష్ ముత్యాల. -
మరో హిట్కు సిద్ధమైన ఆదాశర్మ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
ది కేరళ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ ఆదాశర్మ. ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ కథలో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే హారర్ జానర్తో అలరించేందు సిద్ధమైంది. సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ సీడీతో ఆదాశర్మ మన ముందుకు రాబోతోంది. డిఫరెంట్ ఫీలింగ్ కలిగింగ్ సరికొత్త స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న అదా శర్మ మరో లీడ్ రోల్ సినిమాలో ఆసక్తి పెంచుతోంది. (ఇది చదవండి: ‘స్టార్ మా’లో సరికొత్త సీరియల్) సీడీ (క్రిమినల్ ఆర్ డెవిల్) చిత్రాన్ని కృష్ణ అన్నం దర్శకత్వంలో తెరకెక్కిస్కున్నారు. ఎస్ఎస్సీఎమ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై.. గిరిధర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మూవీ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దెయ్యాల చేతుల మధ్యన ఆదాశర్మ లుక్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. పోస్టర్ చూస్తే అదా శర్మ సీరియస్ లుక్, ఆ చుట్టూ డెవిల్స్ హ్యాండ్స్ కనిపిస్తుండటం చిత్రంలోని వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఆడియన్స్లో మరింత ఆసక్తిని పెంచేశారు. ఈ చిత్రంలో విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మేకర్స్ ప్రకటించారు. (ఇది చదవండి: ఆ హీరోతో నటించాలని కోరిక.. కానీ ఆ పాత్ర చేయను: రాశి) -
'అలాంటివాళ్లు దయచేసి ఈ ఫోటోలు చూడొద్దు'.. స్టార్ హీరోయిన్ పోస్ట్ వైరల్!
అదా శర్మ బీ టౌన్తో పాటు తెలుగువారికి సైతం పరిచయం అక్కర్లేని పేరు. హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగులో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ.. ఇటీవల ది కేరళ స్టోరీ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బ్లాక్ బస్టర్ హిట్తో ఇప్పుడు అదా శర్మ పేరు ఇండియా అంతా మార్మోగిపోయింది. అయితే ఇటీవలే ఆస్పత్రిలో చేరిన అదా శర్మ.. తన ఆరోగ్యానికి సంబంధించి ఇన్స్టాలో పంచుకుంది. ప్రస్తుతం తన హెల్త్ కండీషన్ గురించి అభిమానులతో పంచుకుంది. (ఇది చదవండి: మనవరాలు ఇంటికి వచ్చిన శుభవేళ... ఉపాసన తల్లి ఏం చేసిందంటే? ) ఇన్స్టాలో అదా శర్మ రాస్తూ..' గత కొన్ని రోజులుగా నేను చర్మవ్యాధితో బాధపడుతున్నా. నా చర్మంపై దద్దుర్లు వచ్చాయి. అందువల్ల ఫుల్గా ఉండే డ్రెస్సులు ధరించాను. కానీ ఇటీవల ఒత్తిడి వల్ల నా ముఖంపై కూడా దద్దుర్లు ఏర్పడ్డాయి. వీటి కోసం నేను కొన్ని మందులు వాడాను. కానీ మందువల్లే దద్దుర్లు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఇతర మెడిసిన్స్ వాడుతున్నా. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటానని అమ్మకు మాటిచ్చా. అయినప్పటికీ ఫుల్ స్లీవ్స్ ధరించిన ప్రమోషన్స్ చేస్తా. ఆ తర్వాత ఆరోగ్యం కోసం కొన్ని రోజులు విరామం తీసుకుంటున్నా. త్వరలోనే ఆయుర్వేది చికిత్స తీసుకోబోతున్నా. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా. కమాండో సిరీస్పై ఇన్స్టాలో అప్డేట్స్ ఇస్తూనే ఉంటా.' అంటూ పోస్ట్ చేసింది. దయచేసి భయపడేవారు ఉంటే ఈ ఫోటోలు చూడొద్దని కోరుతున్నా.. ఎందుకంటే కొన్ని భయంకరమైన పిక్స్ ఇందులో ఉన్నాయి అంటూ సరదాగా అభిమానులకు సూచించింది. ప్రస్తుతం అదా శర్మ నటించిన కమాండో వెబ్ సిరీస్ ఈనెల 11న ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్స్లో బిజీగా పాల్గొంటున్న ఆమె అస్వస్థతకు గురి కావడంతో ఇటీవలే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. తాజాగా తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. కాగా.. అదా శర్మ తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీతో అదా శర్మకు మరింత ఫేమ్ దక్కింది. కేరళలో 32 వేలమంది మహిళలు అదృశ్యమయ్యారనే నేపథ్యంలో సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. (ఇది చదవండి: వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్.. ఫోటోలు పంచుకున్న నమ్రత!) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
ఆస్పత్రిలో చేరిన ది కేరళ స్టోరీ నటి.. కారణమిదే !
ఇటీవలే ది కేరళ స్టోరీ మూవీతో సూపర్ కొట్టిన హీరోయిన్ అదా శర్మ. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రంపై విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. అయితే తాజాగా అదా శర్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. తీవ్రమైన ఫుడ్ ఎలర్జీ, డయేరియాతో ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమెను వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా... ఆగస్టు 1న ఆదా శర్మ తన రాబోయే షో 'కమాండో' ప్రమోషన్కు ముందు అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. (ఇది చదవండి: ఇకపై నరేశ్ ఇంట్లోకి రమ్య రఘుపతికి నో ఎంట్రీ.. కోర్టు తీర్పు) అదా శర్మకు తీవ్రమైన డయేరియా, ఫుడ్ అలర్జీ ఉన్నట్లు నిర్ధారణ అయిదని ఆమె సన్నిహితులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె ప్రస్తుతం నటించిన కమాండో అనే వెబ్ సిరీస్లో కనిపించనుంది. ఇందులో ఆమె భావనా రెడ్డి పాత్రను పోషిస్తోంది. ఈ సిరీస్లో నటి అదాతో పాటు ప్రేమ్, అమిత్ సియాల్, తిగ్మాన్షు ధులియా, ముఖేష్ ఛబ్రా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'ది కేరళ స్టోరీ' సక్సెస్ తర్వాత ఆదాశర్మ నటించిన వెబ్ సిరీస్ ఇదే. ఈ సిరీస్కు విపుల్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 11న డిస్నీ+ హాట్స్టార్లో విడుదల కానుంది. (ఇది చదవండి: రాజకీయాల్లోకి స్టార్ హీరో ఎంట్రీ.. అప్పుడే స్టార్ట్ చేశారు!) -
చీరలో నభా నటేశ్.. గిటార్తో అదాశర్మ
చీరలో నభా నటేశ్ సెక్సీ పోజులు మృణాల్ ఠాకుర్ మెల్టింగ్ పోజులు వెకేషన్లో హీరోయిన్ రీతూవర్మ జైలర్ బ్యూటీ క్యూట్ స్టిల్స్ క్లాస్ లుక్ లో మెహరీన్ ఫ్రాన్స్ లో హన్సిక బ్లాక్ ఔట్ఫిట్లో ప్రియా వారియర్ గిటార్తో అదాశర్మ View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
ఓటీటీకి 'ది కేరళ స్టోరీ'.. ఆలస్యం అందుకేనన్న ఆదాశర్మ!
ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ 50 రోజులు పూర్తి కావడంతో ఆదాశర్మ స్పందించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడం మొత్తం సినిమా ఇండస్ట్రీకే మంచిదని తెలిపారు. ఈ మూవీ ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి తీయలేదని చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడబోతున్న బుల్లితెర నటి..!) నటి అదా శర్మ మాట్లాడుతూ.. 'ఈ విజయం నటీనటులకు, నిర్మాతలకు మాత్రమే కాదు.. మొత్తం పరిశ్రమకు కూడా వేడుక లాంటిది. ఈ రోజుకు మేము బిగ్ స్క్రీన్పై 50 రోజులు పూర్తి చేసుకున్నాం. ఈ సినిమా త్వరలోనే ఓటీటీకి వస్తుందని భావిస్తున్నా.' అని అన్నారు. కాగా.. ఇప్పటికే ఈ చిత్రం జూన్ 23న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగాఈ వార్తలపై హీరోయిన్ ఆదా శర్మ స్పందించారు. నిర్మాతలు ఈ సినిమాను ఏ ఓటీటీ ప్లాట్ఫామ్కు ఇవ్వాలనే విషయంపైనే ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చింది. థియేటర్లలో సూపర్ హిట్ కావడంతో.. ఓటీటీ విడుదలలో కూడా ఆలోచనాత్మక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. కాగా.. కేరళలోని బాలికలను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో సుదీప్తో సేన్ తెరకెక్కించారు. (ఇది చదవండి: ఆ సూపర్ హిట్ సినిమాకు పార్ట్-2 ఉంది: వెట్రిమారన్) -
'ద కేరళ స్టోరీ' సినిమాకు ఓటీటీ కష్టాలు.. కారణం అదేనా?
ప్రస్తుతం థియేటర్లలోకి వచ్చిన ఏ సినిమా అయినా.. ఓటీటీల్లోకి రావడానికి పెద్దగా టైమ్ పట్టట్లేదు. కొన్నిసార్లు థియేటర్ లో ఉండగానే ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. 'బలగం' చిత్రానికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అలాంటిది దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన 'ద కేరళ స్టోరీ'ని మాత్రం ఓటీటీలు పట్టించుకోవట్లేదు. విడుదలై దాదాపు రెండు నెలలు కావస్తున్న.. ఇప్పటికీ స్ట్రీమింగ్ కి నోచుకోవట్లేదు. దీనికి కారణమేంటి? 'ద కేరళ స్టోరీ' కథేంటి? కేరళలోని కాసర్గాడ్ ఊరిలో షాలినీ(అదాశర్మ), గీతాంజలి(సిద్ది ఇద్నానీ), నిమా(యోగితా భిహాని) నర్సింగ్ చదువుతుంటారు. అసిఫా(సోనియా బలానీ)తో హాస్టల్ రూమ్ షేర్ చేసుకుంటారు. ఐసిస్ లో అండర్కవర్ గా చేస్తున్న అసిఫా.. అమ్మాయిలకు మాయమాటలు చెప్పి ఇస్లాంలోకి మార్చే మిషన్ కోసం పనిచేస్తుంటుంది. ప్లాన్ లో భాగంగా ఇద్దరబ్బాయిలనీ రంగంలోకి దించి.. షాలినీ, గీతాంజలిని లవ్ జిహాద్ లోకి లాగుతుంది. ఆ తర్వాత ఏమైందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!) ఇంతకీ గొడవేంటి? 'ద కేరళ స్టోరీ' ట్రైలర్ విడుదలైనప్పుడు.. లవ్ జిహాద్ ఉచ్చులోకి దాదాపు 32వేల మంది అమ్మాయిలని దింపినట్లు చూపించారు. థియేటర్లలో సినిమా వచ్చేసరికి ఆ సంఖ్యని ముగ్గురు అమ్మాయిలుగా మార్చారు. అయినాసరే గొడవలు ఆగలేదు. సినిమా కాస్త రాజకీయం అయిపోయింది. పశ్చిమ బెంగాల్ లాంటి కొన్ని రాష్ట్రాలు ఈ చిత్రంపై నిషేధం విధించాయి. అలా దాదాపు మేలో 10-20 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఈ మూవీ చర్చనీయాంశంగా మారింది. ఓటీటీ గందరగోళం 'ద కేరళ స్టోరీ'.. జూన్ 23న జీ5లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ తేదీ వచ్చి వెళ్లిపోయినా సరే ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీలోకి రాలేదు. కారణం ఏంటా అని ఆరా తీస్తే.. నిర్మాతలు డిమాండ్ చేస్తున్న మొత్తానికి కొనేందుకు ఓటీటీలు ముందుకు రావట్లేదని, అందుకే స్ట్రీమింగ్ ఆలస్యమవుతుందని సమాచారం. డీల్ కుదిరన వెంటనే ఓటీటీలో ఈ చిత్రం విడుదలైపోతుందని అంటున్నారు. చూడాలి మరి ఎప్పుడొస్తుందో? (ఇదీ చదవండి: ఓటీటీలోకి మన సూపర్హీరో మూవీ.. తెలుగులోనూ!) -
ముఖం నిండా గాయాలతో అదా శర్మ.. ఇది మేకప్ కాదు!
ది కేరళ స్టోరీ.. కల్పితం అంటారు కొందరు.. యదార్థ కథను కళ్లకు కట్టినట్లు చూపించారంటారు మరికొందరు. ఏదైతేనేం.. విమర్శల నడుమ మంచి వసూళ్లు రాబట్టింది. మే 5న విడుదలైన ఈ సినిమా రూ.230 కోట్లమేర వసూలు చేసింది. చూస్తుంటే మరికొద్ది రోజుల్లో రూ.250 కోట్ల మైలురాయిని చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఊహించని సక్సెస్తో ఉబ్బితబ్బిబవుతున్న అదాశర్మ ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడిందో తెలియజేస్తూ ఆసక్తికర ఫోటోలు షేర్ చేసింది. కేరళ స్టోరీ సినిమా షూటింగ్లో భాగంగా అఫ్ఘనిస్తాన్లో దిగిన ఫోటోలను వదిలింది. ఇందులో అదా ముఖానికి గాయాలయ్యాయి. 'మైనస్ 16 డిగ్రీల వాతావరణంలో 40 గంటలు ఉన్నాం. డీహైడ్రేషన్ కారణంగా నా పెదాలు పగిలిపోయాయి. ఫోటోలో కనిపిస్తున్న పరుపు నేను కింద పడే సమయానికి వేద్దామనుకున్నారు. కానీ అది జరగలేదు. దీంతో నా ముఖానికి దెబ్బలు తగిలాయి. ఏదైతేనేం.. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది, అందుకు ఆనందంగా ఉంది' అని రాసుకొచ్చింది. మరో వీడియోలో కుక్కపిల్లతో కాలక్షేపం చేసింది అదా శర్మ. 'ఇషాన్ నన్ను కొట్టడానికి వచ్చే సీన్ అది.. ఆ సన్నివేశాన్నంతా దగ్గరుండి చూసిన ఈ శునకం తర్వాత నేనెలా ఉన్నానో చూడటానికి నా దగ్గరకు వచ్చింది. అప్పటికే ఏడ్చి ఏడ్చి కళ్లు నొప్పిపెడుతున్నాయి. మరోపక్క తలనొప్పి.. ఇంకోపక్క గర్భిణిలా కనిపించేందుకు ప్రోస్థటిక్ మేకప్.. అది చాలా బరువుగా ఉంది. నడిచి నడిచి అలిసిపోయాను. ఆ సమయంలో నాకు ఈ శునకం నుంచి హగ్ దొరికింది' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) చదవండి: డబ్బు కోసమే సల్మాన్ చెల్లితో పెళ్లి? నా వల్ల పైకి వచ్చినవారే గీత దాటారు: అల్లు అరవింద్ -
హీరోల కోసం హీరోయిన్లను వెయిట్ చేయించేవారు: ఆదాశర్మ
'ది కేరళ స్టోరీ' సినిమాతో సంచలన విజయం సొంతం చేసుకుంది హీరోయిన్ ఆదాశర్మ. ఈ సినిమాతో పాన్ఇండియా లెవల్లో క్రేజ్ను సొంతం చేసుకుంది. సినిమా రిలీజ్కు ముందు, ఆ తర్వాత ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా ఏమాత్రం బెరుకు లేకుండా జాతీయ స్థాయిలో ప్రమోషన్స్లో పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ బ్యూటీ. హార్ట్ఎటాక్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఆదాశర్మ తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ది కేరళ స్టోరీ విజయంతో ఊహించని స్థాయిలో స్టార్డమ్ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆమె ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇన్నేళ్ల ప్రయాణంలో హీరోయిన్గా తనకు ఎదురైన సవాళ్లను సైతం వివరించింది. ముఖ్యంగా బాలీవుడ్లో చాలాసార్లు హీరోలు సెట్స్కి లేటుగా వస్తారు. వాళ్లు వచ్చేవరకు షూటింగ్ మొదలు అవ్వదు. కానీ హీరోయిన్లను మాత్రం ముందుగా రమ్మనేవారు. హీరోలు వచ్చేవరకు వెయిట్ చేయించేవారు. షూటింగ్ ప్రశాంతంగా సాగాలంటే అది డైరెక్టర్ యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇకపై నేను ఎంచుకునే స్ట్రిప్ట్లు చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. -
తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన ప్రముఖ డైరెక్టర్!
ఆదాశర్మ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఇటీవల మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న సుదీప్తో సేన్ ఆస్పత్రిలో చేరారు. విరామం లేకుండా ప్రయాణాలు చేయడం వల్లే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో ఈ సినిమాపై నిరసనలు వస్తున్నప్పటికీ ప్రమోషన్లలో పాల్గొన్నారు. (ఇది చదవండి: బేబీ బంప్తో ఇలియానా సెల్ఫీ.. మొత్తానికి ఆ విషయం బయట పెట్టేసిందిగా!) మే 5న విడుదలైన 'ది కేరళ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల మార్కును అధిగమించింది. అస్వస్థతకు గురైన ఆస్పత్రిలో చేరిన సుదీప్తో సేన్ కొన్ని ప్రచార కార్యక్రమాలకు విరామం ప్రకటించారు. ఈ చిత్రంలో అదా శర్మతో పాటు యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రల్లో నటించారు. కేరళకు చెందిన అమ్మాయిలు బలవంతంగా ఐసిస్లో చేరారన్నకథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. (ఇది చదవండి: సొంతింటి కల సాకారం చేసుకున్న రీతూ చౌదరి) -
ది కేరళ స్టోరీ నటికి బిగ్ షాక్.. ఆ వివరాలు లీక్ చేసిన నెటిజన్!
ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు సృష్టించింది. తాజాగా ఇటీవల రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఊహించని వసూళ్లు రాబడుతూ అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలకు ముందు కొన్ని వివాదాలు చుట్టిముట్టినా అవేవీ సినిమాపై పెద్దగా ప్రభావితం చూపలేకపోయాయి. విపుల్ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 5న విడుదలైంది. (ఇది చదవండి: 'ది కేరళ స్టోరీ' ప్రభంజనం.. ఆలియా భట్ సినిమా రికార్డ్ బ్రేక్!) తాజాగా ఆదా శర్మకు మరో షాక్ తగిలింది. సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి ఆమె వ్యక్తిగత వివరాలను లీక్ చేశారు. అదా శర్మ ఫోన్ నంబర్ను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఈ సంఘటన తర్వాత అదా శర్మకు వేధింపులు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. అయితే ఆదా శర్మ వివరాలు షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ యూజర్ అకౌంట్ను వెంటనే డీ యాక్టివేట్ చేశారు. అంతే కాకుండా ఆమె కొత్త కాంటాక్ట్ నంబర్ను లీక్ చేస్తానని బెదిరించినట్లు సమాచారం. (ఇది చదవండి: ఉపాసనకు ప్రెగ్నెన్సీ.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్!) కాగా.. ఆదా శర్మ, దర్శకుడు సుదీప్తో సేన్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ది కేరళ స్టోరీ బృందం కరీంనగర్లో జరిగే హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనాల్సి ఉండగా.. రోడ్డు ప్రమాదం జరగడంతో విరమించుకున్నారు. ఈ విషయాన్ని ఆదా శర్మ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. -
'ది కేరళ స్టోరీ' ప్రభంజనం.. ఆలియా భట్ సినిమా రికార్డ్ బ్రేక్!
ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఊహించని వసూళ్లు రాబడుతూ అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలకు ముందు కొన్ని వివాదాలు చుట్టిముట్టినా అవేవీ సినిమాపై పెద్దగా ప్రభావితం చూపలేకపోయాయి. విపుల్ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 5న విడుదలైంది. రిలీజ్ అయిన పది రోజుల్లోనే దాదాపుగా రూ.136 కోట్లు రాబట్టింది. దీంతో బాలీవుడ్లో ఆదా శర్మ టాప్ ప్లేస్ దక్కించుకుంది. (ఇది చదవండి: ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్, హీరోయిన్ ఆదా శర్మకు రోడ్డు ప్రమాదం) అంతకుముందు అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గంగుభాయి కతియావాడి పది రోజుల్లో రూ.129.1 కోట్లు వసూళ్లు సాధించింది. తాజాగా ది కేరళ స్టోరీ చిత్రం ఈ రికార్డును అధిగమించింది. ఈ రికార్డుతో బాలీవుడ్ హీరోయిన్లలో ఆదా శర్మ టాప్లో నిలిచింది. తాజాగా ఈ చిత్ర విజయంపై నటి ఆదా శర్మ స్పందించింది. ఈ మూవీ ఇంత పెద్ద విజయం సాధిస్తుందని తాను ఊహించలేదని తెలిపింది. ఈ విజయానికి కారణం అభిమానులేనని చెప్పుకొచ్చింది. ఆదా శర్మ మాట్లాడుతూ.. 'నేను ఇంత ఘనవిజయం సాధిస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇది నా చేతిలో ఉందో లేదో నాకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ నేను చేస్తున్న పనిని కొనసాగిస్తాను. ఇలాంటి సినిమా తీస్తానని నేనెప్పుడూ ప్లానింగ్ చేయలేదు. ఏది జరగాలనుకుంటే అది జరుగుతుంది. అలాంటి అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. మిమ్మల్ని ఎవరైనా గట్టిగా నమ్మితేనే ఇలాంటి పాత్ర చేసే అవకాశం వస్తుంది.' అని అన్నారు. ది కేరళ స్టోరీ ఆదివారం ఒక్కరోజే రూ.23 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమా విడుదలైన మొదటి వారంలో రూ.81.14 కోట్లు రాగా.. రెండో వారాంతంలో రూ.55.60 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో ఆదా శర్మతో పాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు. కొంతమంది మహిళలను బలవంతంగా మతమార్పిడి చేసి ఉగ్రవాద సంస్థ ఐసిస్లో రిక్రూట్ చేయబడ్డారన్న కథాంశంగా తెరకెక్కించారు. (ఇది చదవండి: స్కూల్ రోజుల్లోనే ప్రేమ.. లవ్ లెటర్ కూడా రాశా: హీరోయిన్) ఇందులో కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరి శిక్షణ పొంది పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన్నట్లు చూపించడంతో వివాదాలకు దారి తీసింది. ఈ సినిమాను కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్తో సహా పలువిపక్షాలు భారీ ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. ఈ చిత్రంలో కేరళ రాష్ట్రాన్ని, అప్పటి ప్రభుత్వాన్ని కించపరిచేలా రూపొందించారని మండిపడుతున్నాయి. Woahhh !! Audience 🙏❤️ thank u ! This is just ....... *no words' 👀😱❤️ https://t.co/6kV2j07Aq7 — Adah Sharma (@adah_sharma) May 15, 2023 -
ది కేరళ స్టోరీ టీమ్కు యాక్సిడెంట్.. స్పందించిన హీరోయిన్
మొన్నటి వరకు హార్ట్ ఎటాక్ హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకున్న అదా శర్మ ఇప్పుడు ది కేరళ స్టోరీతో జాతీయ స్థాయిలో సెన్సేషన్ అవుతోంది. వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా కేవలం 9 రోజుల్లోనే వంద కోట్లు రాబట్టంది. సంబరాలు చేసుకోవాల్సిన సమయంలో ది కేరళ స్టోరీ డైరెక్టర్ సుదీప్తో సేన్, హీరోయిన్ అదా శర్మ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముంబైలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తున్న దారిలో ఈ ప్రమాదం జరగడంతో గాయపడ్డ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా తనకు జరిగిన యాక్సిడెంట్పై అదాశర్మ స్పందించింది. 'యాక్సిడెంట్ అయిందని తెలియడంతో చాలామంది నా యోగక్షేమాలను ఆరా తీస్తూ మెసేజ్లు చేస్తున్నారు. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. కేరళ స్టోరీ సినిమా టీమ్ అంతా బాగానే ఉన్నాం. పెద్ద ప్రమాదమేమీ కాదు, కంగారుపడాల్సిన పని లేదు' అని ట్వీట్ చేసింది. ఈ ప్రమాదం వల్ల కరీంగనర్లో హిందూ ఏక్తాయాత్రకే కేరళ స్టోరీ టీమ్ హాజరు కాలేకపోయింది. ఈ సినిమా విషయానికి వస్తే కేరళలో తప్పిపోయిన నలుగురమ్మాయిలు తప్పని పరిస్థితుల్లో ఐసిస్లో చేరడం, ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టం, అందుకు దారి తీసిన పరిస్థితులను చూపించారు. విపుల్ షా నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదలైంది I'm fine guys . Getting a lot of messages because of the news circulating about our accident. The whole team ,all of us are fine, nothing serious , nothing major but thank you for the concern ❤️❤️ — Adah Sharma (@adah_sharma) May 14, 2023 Today we're supposed to visit Karimnagar to talk about our film at a youth gathering. Unfortunately we could not travel due some emergency health issue. Heartfelt apology to the people of Karimnagar. We made the film to save our daughters. Pls keep supporting us #HinduEkthaYatra pic.twitter.com/LUr2UtQWfj — Sudipto SEN (@sudiptoSENtlm) May 14, 2023 చదవండి: యాక్సిడెంట్కు గురైన ది కేరళ స్టోరీ సినిమా డైరెక్టర్, హీరోయిన్ -
‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్, హీరోయిన్ ఆదా శర్మకు రోడ్డు ప్రమాదం
వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఊహించని వసూళ్లు రాబడుతూ అద్భుతాలు సృష్టిస్తోంది. విడుదలకు ముందే వివాదాలు చుట్టిముట్టినప్పటికీ అవేవీ సినిమాను ప్రభావితం చేయలేకపోయాయి. విపుల్ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 5న విడుదలైంది. రిలీజ్ అయిన తొమ్మిది రోజుల్లోనే రూ. 112.87 కోట్లు రాబట్టి 100 కోట్ల క్లబ్లో చేరింది. కాగా తాజాగా ది కేరళ స్టోరి డైరెక్టర్ సుదీప్తో సేన్, హీరోయిన్ ఆదా శర్మ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముంబైలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తుండగా వీరికి యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో గాయపడిన డైరెక్టర్ సుదీప్తో సేన్, ఆదా శర్మను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కరీంనగర్లో సాయంత్రం జరిగే హిందూ ఏక్తాయాత్రకు కేరళ స్టోరీ టీమ్ హాజరుకావాల్సి ఉండగా... ప్రమాదం జరగడంతో తాము రాలేకపోతున్నట్లు డైరెక్టర్ సుధీప్తో సేన్ ట్వీట్ చేశారు. ఆదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాను కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతలు ఏమయ్యారు, ఎక్కడున్నారనే ఇతివృత్తంతో తెరకెక్కించారు. ఇందులో కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరి శిక్షణ పొంది పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన్నట్లు చూపించడంతో వివాదాలకు దారి తీసింది. ఈ సినిమాను కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్తో సహా పలువిపక్షాలు భారీ ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. ఈ చిత్రంలో కేరళ రాష్ట్రాన్ని, అప్పటి ప్రభుత్వాన్ని కించపరిచేలా రూపొందించారని మండిపడుతున్నాయి. చదవండి: నా నిజాయితీని అపహాస్యం చేశారు.. ‘ది కేరళ స్టోరీ’పై అదా శర్మ ఆసక్తికర పోస్ట్ -
బ్లూ వేల్ గేమ్ నేపథ్యంలో సినిమా, హీరోయిన్గా అదా శర్మ
‘ది కేరళ స్టోరీ’ వంటి వివాదాత్మక సినిమా తర్వాత హీరోయిన్ అదా శర్మ ఓ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ‘హేట్ స్టోరీ 2’ ఫేమ్ విశాల్ పాండ్య దర్శకత్వంలో శ్రేయాస్ తల్పాడే హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది గేమ్ ఆఫ్ గిర్జిట్’. ఈ చిత్రంలో అదా శర్మ నటిస్తున్నట్లు చిత్రయూనిట్ గురువారం ప్రకటించింది. ఇటీవల కాలంలో యువతలో బాగా ప్రాచుర్యం పొందిన ‘బ్లూ వేల్ గేమ్’ (బ్లూ వేల్ ఛాలెంజ్) నేపథ్యంలో థ్రిల్లర్గా ఈ కథ సాగుతుంది. ఇందులో అదా శర్మ పోలీస్ పాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘గతంలో ‘కమాండో’ సినిమాలో భావనా రెడ్డి అనే పోలీస్ పాత్ర చేశాను. ఆ పాత్ర మంచి ప్రజాదరణ పొందింది. ఇప్పుడు ‘ది గేమ్ ఆఫ్ గిర్జిట్’లో గాయత్రీ భార్గవ్ అనే పోలీస్ పాత్ర చేస్తున్నాను. నా పాత్ర సరదాగా, విభిన్నంగా ఉంటుంది’’ అన్నారు. -
The Kerala Story : నటి అదా శర్మ బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
-
ఆ ఓటీటీలోకి రానున్న ది కేరళ స్టోరీ!
ది కేరళ స్టోరీ సినిమాపై వివాదం ముసురుకుంటోంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలన్న డిమాండ్ నుంచి ఏకంగా ఇందులో నటించినవాళ్లు బయట కనిపిస్తే చంపేస్తామంటూ బెదిరింపుల దాకా వచ్చింది వ్యవహారం. ఓపక్క పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సినిమాపై ఆ రాష్ట్రంలో నిషేధం విధించగా మరో పక్క ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సినిమాకు ట్యాక్స్ ఫ్రీ కల్పించడం గమనార్హం. ప్రశంసలు, విమర్శల మధ్య ది కేరళ స్టోరీ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ దొరుకుతోంది. నాలుగు రోజుల్లో ఈ చిత్రం రూ.45.72 కోట్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందని ఆరా తీస్తున్నారు అభిమానులు. ది కేరళ స్టోరీ ఓటీటీ హక్కులను జీ5 ఇదివరకే సొంతం చేసుకుంది. థియేటర్లో సక్సెస్గా దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడప్పుడే ఓటీటీలోకి వచ్చే అవకాశమే లేదు. ది కేరళ స్టోరీని జీ5లో చూడాలంటే వచ్చే నెల వరకు ఆగాల్సిందే! హీరోయిన్ అదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది కేరళ స్టోరీ. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విపుల్ అమృత్లాల్ నిర్మించారు. కేరళలో తప్పిపోయిన 32వేల మంది యువతలు ఏమయ్యారు? ఎక్కడున్నారు? అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చదవండి: బాలీవుడ్ నటి సోదరుడు అరెస్ట్ -
ది కేరళ స్టోరీ: యోగి సర్కార్ కీలక నిర్ణయం
ది కేరళ స్టోరీ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు.. విడుదలకు ముందే రాజకీయ రంగు పులుముకున్న ఈ వివాదం.. రోజులు గడుస్తున్న కొద్దీ తీవ్రతరమవుతోంది. వివిధ పార్టీలు. ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజేస్తోంది. ఈ సినిమాను కేరళ ప్రభుత్వం సహా కాంగ్రెస్, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేరళను కించపరిచేలా, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా రూపొందించారంటూ నిరసనలు వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో సినిమాను విడుదల చేస్తే అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని తమిళనాడులోని మల్టిప్లెక్స్ థియేటర్లలో కేరళ స్టోరీ షోలను రద్దు చేశారు. మరోవైపు సమాజంలో అశాంతి. అలజడులను సృష్టించే అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్లోని కేరళ స్టోరీని నిషేధిస్తున్నట్లు మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఎక్కడైనా ప్రదర్శిస్తున్నట్లు తేలితే కఠిన చర్యలుంటాయని చెప్పారు. చదవండి: ‘ది కేరళ స్టోరీ’కి భారీ షాక్.. అయితే వివాదాస్పద ది కేరళ స్టోరి సినిమాకు బీజేపీ మాత్రం మద్దతు తెలుపుతోంది. బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాల్లో కేరళ స్టోరీకి పన్ను మినహాయింపులు కూడా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్ సినిమాకు టాక్స్ ఫ్రీ కల్పించగా... తాజాగా ఈ జాబితాలోకి ఉత్తర ప్రదేశ్ సైతం చేరింది. 'ది కేరళ స్టోరీ'ని ఉత్తరప్రదేశ్లో పన్ను రహితంగా ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. సీఎం తన క్యాబినెట్తో కలిసి ప్రత్యేక స్క్రీనింగ్లో సినిమాను వీక్షించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన మంత్రి మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సినిమాను చూశారు. ఉగ్రవాద ప్రమాదకర కుట్రను ఈ చిత్రం బహిర్గతం చేస్తుందని పేర్కొన్నారు. సినిమాను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్పై విమర్శలు గుప్పించిన ఆయన.. ప్రతిపక్ష పార్టీ ఓటు బ్యాంకు కోసం ఉగ్రవాదాన్ని కప్పి ఉంచిందని మండిపడ్డారు. ది కేరళ స్టోరీ' ఏ రాష్ట్రం లేదా మతానికి సంబంధించినది కాదని జేపీ నడ్డా పేర్కొన్నారు. కాగా సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విపుల్ అమృత్లాల్ నిర్మించారు. ఆదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు. కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతలు ఏమయ్యారు, ఎక్కడున్నారనే ఇతివృత్తంతో తెరకెక్కించారు. కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరి శిక్షణ పొంది పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన్నట్లు చూపించడంతో వివాదాలకు దారి తీసింది. -
ఇదీ.. అసలైన పాన్ ఇండియా సినిమా: ఆర్జీవీ
ది కేరళ స్టోరీ.. దేశమంతటా ప్రకంపనలు రేపుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం దూసుకుపోతోంది. కొందరు సినిమా బాగుందని మెచ్చుకుంటే మరికొందరు మాత్రం ఓ వర్గాన్ని కించపరిచిందని నొచ్చుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాపై సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించాడు. 'తమిళ/ మలయాళీ అమ్మాయి హీరోయిన్. గుజరాతీ నిర్మాత, బెంగాలీ డైరెక్టర్.. ఈ హిందీ సినిమా అన్ని భాషల్లో బ్లాక్బస్టర్గా దూసుకుపోతోంది. ఇదీ అసలైన పాన్ ఇండియా చిత్రమంటే!' అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు 'నువ్వు పాజిటివ్గా స్పందించావంటే ఆశ్చర్యంగా ఉంది', 'పాన్ ఇండియా సినిమా అంటున్నారు కానీ బాగుందా? బాలేదా? అని ఏమీ చెప్పట్లేదు ఏంటి?' అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే 2018-19లో 32,000 మంది అమ్మాయిలు కనబడకుండా పోయారు.. వారు ఎక్కడున్నారు? ఏమైపోయారు? అని పట్టించుకునేవాళ్లే లేరు. ఆ కథనే ది కేరళ స్టోరీ పేరిట సినిమాగా తెరకెక్కించారు డైరెక్టర్ సుదీప్తోసేన్. బాలీవుడ్ హీరోయిన్ అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాను విపుల్ అమృత్లాల్ షా నిర్మించారు. మొదటి రోజు రూ.8.02 కోట్లు, రెండో రోజు రూ.11.22 కోట్లు రాబట్టిన ఈ చిత్రం ఆదివారం ఏకంగా రూ.16 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఇప్పటివరకు ఈ మూవీ రూ.35 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది. A Tamil/Malyali girl playing the lead , a Gujrati producer , a bengali director, a Hindi film now a BLOCKBUSTER in all languages ..A TRUE PAN INDIAN FILM #TheKeralaStory — Ram Gopal Varma (@RGVzoomin) May 8, 2023 #TheKeralaStory is UNSTOPPABLE and UNSHAKABLE... PHENOMENAL biz on Day 2 and 3 makes it a SMASH-HIT… Withstands two mighty opponents: #Hollywood film #GotGVol3 and #IPL2023… Fri 8.03 cr, Sat 11.22 cr, Sun 16 cr. Total: ₹ 35.25 cr. #India biz. #Boxoffice Growth / Decline… ⭐️… pic.twitter.com/kAL2jLbCQr — taran adarsh (@taran_adarsh) May 8, 2023 చదవండి: తొక్క తీస్తా.. ఆర్ఆర్ఆర్ మాస్ వార్నింగ్.. క్షమాపణలు చెప్పిన రాజస్థాన్ రాయల్స్ -
‘ది కేరళ స్టోరీ’కి భారీ షాక్.. తమిళనాడులో షోలు రద్దు
ది కేరళ స్టోరీ.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తోంది. విడుదలకు ముందే వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ మూవీ అనేక అడ్డంకుల నడుమ మే 5న ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తర్వాత కూడా సినిమాను రాజకీయ వివాదం వదలడం లేదు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. మధ్యప్రదేశ్ మాత్రం ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ కల్పించింది. తాజాగా ది కేరళ స్టోరీ సినిమాకు తమిళనాడలో భారీ షాక్ తగిలింది. తమిళనాడులోని అన్ని మల్టిప్లెక్స్ థియేటర్లలో సినిమా ప్రదర్శనలను నిలిపివేశాయి. చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలంతోపాటు ముఖ్య నగరాల్లో మల్టీప్లెక్స్లో షోలు రద్దు చేశారు. సినిమా విడుదలకు వ్యతిరేకంగా తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి పార్టీ శనివారం చెన్నైలో నిరసనకు దిగింది. సినిమాకు వ్యతిరేకంగా చెన్నై అన్నానగర్ అర్చ్ స్కై వాక్ మాల్ వద్ద పార్టీ అధినేత నటుడు, దర్మకుడు సీమన్ నేతృత్వంలో కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. సినిమాను బ్యాన్ చేయాలంటూ జెండాలు పట్టుకొని థియేటర్లలోకి ప్రవేశించి నినాదాలు చేశారు. చదవండి: The Kerala Story: ది కేరళ స్టోరీ రెండో రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా? సినిమాను ప్రదర్శించవద్దని థియేటర్ల యజమానులను, చూడవద్దని ప్రేక్షకులను సీమన్ విజ్జప్తి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా.. తమిళ నాడులోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆదివారం నుంచి ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వమే కాకుండా తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు సైతం సినిమాను ప్రదర్శిస్తే.. థియేటర్లను సీజ్ చేస్తామని హెచ్చరించడంతో థియేటర్ల యజమానులు ఈ సినిమాను ప్రదర్శించేందుకు ఆసక్తి చూపడం లేదు. కేరళ స్టోరీ సినిమా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఉందని, పుదుచ్చేరి, తమిళనాడు ప్రభుత్వాలు ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ గతంలో సీమాన్ డిమాండ్ చేశారు. కాగా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై రాజకీయ దుమారం మొదలైన విషయం తెలిసిందే. కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతలు ఏమయ్యారు, ఎక్కడున్నారనే ఇతివృత్తంతో దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించారు. ఇందులో కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరి శిక్షణ పొంది పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన్నట్లు చూపించడంతో వివాదాలకు దారి తీసింది. చదవండి: కాక రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’ ఈ సినిమాను కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్తో సహా పలువిపక్షాలు భారీ ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. ఈ చిత్రంలో కేరళ రాష్ట్రాన్ని, అప్పటి ప్రభుత్వాన్ని కించపరిచేలా రూపొందించారని మండిపడుతున్నాయి. దీని వెనక ఆరెస్సెస్, బీజేపీలున్నాయని ఆరోపిస్తున్నాయి.సినిమాను విడుదల చేయకుండా అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. కోర్టు మెట్లు కూడా ఎక్కిన ప్రయోజనం లేకుండా పోయింది. కేరళ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సినిమా విడుదలకే మొగ్గు చూపింది, -
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ది కేరళ స్టోరీ, రెండో రోజు ఎంత వచ్చిందంటే?
ది కేరళ స్టోరీ.. ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి ఈ సినిమాపై వివాదం చెలరేగింది. బలవంత మతమార్పిడికి గురై ఐసిస్లో చేరిన మహిళల కథే కేరళ స్టోరీ. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. విపుల్ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 5న విడుదలైంది. ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్న ఈ సినిమాను నిషేధించాలంటూ కేరళ, తమిళనాడుల్లోకి కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు సైతం జరిగాయి. ఈ వివాదాల మధ్య కేరళ స్టోరీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు రూ.8.03 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజుకు అంతకుమించిన వసూళ్లు రాబట్టింది. శనివారం ఒక్కరోజే రూ.11.22 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు 39.73% వృద్ధి కనబర్చింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.19.25 కోట్లు వసూలు చేసింది. ఆదివారం కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బల్రానీ ముఖ్య పాత్రలు పోషించారు. చాలామంది ఈ సినిమాను వ్యతిరేకిస్తుంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ది కేరళ స్టోరీ సినిమాకు ట్యాక్స్ రద్దు చేయడం విశేషం. #TheKeralaStory is SENSATIONAL, sets the #BO on 🔥🔥🔥 on Day 2… Shows BIGGG GAINS across all circuits… Hits double digits, a REMARKABLE ACHIEVEMENT for a film that’s *not* riding on stardom, but word of mouth… Fri 8.03 cr, Sat 11.22 cr. Total: ₹ 19.25 cr. #India biz.… pic.twitter.com/3FDHvSApjt — taran adarsh (@taran_adarsh) May 7, 2023 చదవండి: బలవంతంగా బంధాల్లో ఉండేకంటే ఒంటరిగా ఉండటమే బెటర్: సదా -
ది కేరళ స్టోరీ విడుదల వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి హెచ్చరిక
ది కేరళ స్టోరీ సినిమాపై రాజకీయ దుమారం చల్లారడం లేదు. ఎక్కడ విన్నా ఇప్పుడు ‘ది కేరళ స్టోరీ’ పేరే మార్మోగుతోంది. అంతలా సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. మే 5న విడుదల కానున్న ఈ సినిమాను రిలీజ్ చేయవద్దంటూ కేరళ ప్రభుత్వంతో సహా కాంగ్రెస్, సీపీఐ వంటి పార్టీలు, ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ది కేరళ స్టోరీ విద్వేషపూరితంగా చీత్రికరించారని, సినిమా విడుదల చేస్తే సమాజంలో మత సామరస్యాలు దెబ్బతింటాయంటూ ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ సినిమా వివాదం కేరళలోనే కాకుండా పక్క రాష్ట్రమైన తమిళనాడుకు కూడా పాకింది. రిలీజ్ డేడ్ సమీపిస్తన్న తరుణంలో తమిళనాడు ప్రభుత్వాన్నికి ఇంటెలిజెన్స్ బృందాలు అలెర్ట్ జారీ చేశాయి. తమిళనాడులో మూవీ విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. తమిళనాడులో కేరళ స్టోరీ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి సూచన చేసింది. అయితే ఇప్పటి వరకు తమిళనాడులో సినిమాను విడుదల చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని రాష్ట్ర పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ రిలీజ్ చేస్తే వచ్చే సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన్నట్లు తెలిపాయి. అన్ని థియేటర్లలో పీఎస్-2(పొన్నియన్ సెల్వన్) నడుతస్తోందని, ప్రభుత్వంతోపాటు ధియేటర్ యాజమానులు ది కేరళ స్టోరీని ఇప్పట్లో రిలీజ్ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని పేర్కొన్నాయి. బ్యాన్ కోరుకోవడం లేదు.. కానీ సినిమా మేకర్స్పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం విమర్శలు గుప్పించారు. ఈ సినిమా హిందూ, ముస్లిం మధ్య ద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని, దీనిని ఆర్ఎస్ఎస్, బీజేపీ అబద్ధపు ప్రచారంగా అభివర్ణించారు. తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కూడా సినిమాను వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. కేరళను తప్పుగా చిత్రీకరిస్తూ చిత్రాన్ని రూపొందించారని విమర్శించారు. తాను సినిమాను బ్యాన్ చేయాలని కోరుకోవడం లేదంటూనే.. భావప్రకటనా స్వేచ్ఛను తప్పుగా చిత్రీకరించారదని మండిపడ్డారు. వాస్తవికతను తప్పుగా చూపించారని, దీనిపై గొంతెత్తి నినాదించే హక్కు కేరళ ప్రజలకు ఉందని ఉందని తెలిపారు. మరోవైపు ది కేరళ స్టోరీ చిత్రానికి బీజేపీ మద్దతిస్తోంది. Let me stress, I am not calling for a ban on the film. Freedom of expression does not cease to be valuable just because it can be misused. But Keralites have every right to say loud & clear that this is a misrepresentation of our reality. https://t.co/sEIG91mjSP — Shashi Tharoor (@ShashiTharoor) May 1, 2023 కాగా సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు విపుల్ అమృత్లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు. కేరళలో 2016-17 మధ్య 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడ అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి ఐసిస్లో చేరి ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో కథ చూపించడం వివాదానికి దారితీసింది. ది కేరళ స్టోరీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఏప్రిల్ 26న విడుదలవ్వగా అప్పటి నుంచే దీనిపై రాజకీయ రగడ మొదలైంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడంతో మే5న విడుదలకు సిద్ధంగా ఉంది. -
విడుదలకు ముందే వివాదాలు.. ‘ది కేరళ స్టోరీ’కి సుప్రీంలో ఊరట
విడుదలకు ముందే వివాదాలను మూటగట్టుకుంది కేరళ స్టోరీ’ చిత్రం.. ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా.. విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై వివాదాలు చినికి చినికి గాలివానలా మారాయి. కేరళలోని అధికార ప్రభుత్వంతోపాలు పలు విపక్షాలు సైతం ఈ చిత్రంపై విమర్శల స్వరం వినిపిస్తున్నాయి. సీఎం పినరయి విజయన్ సైతం సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ది కేరళ స్టోరీ రాజకీయ ప్రకంపనలకు కేంద్ర బిందువుగా మారింది. తాజాగా ఈ పంచాయితీ న్యాయస్థానం వరకు చేరింది. సినిమా విడుదలను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ది కేరళ స్టోరీ విద్వేషపూరితంగా చీత్రికరించారని, సినిమా విడుదల చేస్తే సమాజంలో మత సామరస్యాలు దెబ్బతింటాయంటూ పిటిషన్లో ఆరోపించాయి. అయితే సుప్రీంకోర్టులో ది కేరళ స్టోరీకి భారీ ఊరట లభించింది. సినిమా రిలీజ్పై స్టే కోరుతూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. చదవండి: The Kerala Story: నిరూపిస్తే కోటి రూపాయలు! సినిమా విడుదలకు ఇప్పటికే సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. కావాలంటే పిటిషనర్లు సినిమా సర్టిఫికేషన్ను సవాల్ చేస్తూ సంబంధిత అధికారులను ఆశ్రయించవచ్చని సుప్రీం సూచించింది. జస్టిస్ కేఎమ్ జోసెఫ్, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం దీనిపై మంగళవారం విచారణ చేపట్టింది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, నిజాం పాషాల తమ వాదనలు వినిపించారు. అయితే ద్వేషపూరిత ప్రచారం వంటి కేసుతో సినిమాను కలపలేమని.. మూవీ విడుదలపై స్టే కోరడానికి ఇది సరైన కారణం కాదని తెలిపింది. ముందు హైకోర్టుకు వెళ్లండి ఇందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన అవసరంలేదని సర్టిఫికేషన్ బోర్డు లేదా హైకోర్టుకు వెళ్లవచ్చని తెలిపింది. అయితే హైకోర్టుకు వెళ్లే సమయం లేదని సినిమా శుక్రవారం విడుదలవుతుందని అందుకే సుప్రీంకోర్టు తలుపు తట్టినట్లు అడ్వకేట్ నిజాం పాషా చెప్పారు. పాషా వాదనలను ధర్మాసనం తిరస్కరించింది. ఈ విషయంపై ముందుగా సంబంధిత హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతించిందని గుర్తుచేసింది. చిత్రం సర్టిఫికేషన్ ప్రక్రియ ద్వారా వెళ్ళిందని.. సర్టిఫికేషన్ను సవాలు చేస్తే తప్ప, బెంచ్ ఏమీ చేయలేదని చెప్పింది. చదవండి: ఎన్సీపీ చీఫ్ పదవికి శరద్ పవార్ రాజీనామా సినిమా నేపథ్యం ఇదీ సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. విపుల్ అమృత్లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు. కేరళలో 2016-17 మధ్య 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడ అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి ఐసిస్లో చేరి ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో కథ చూపించడం వివాదానికి దారితీసింది. ది కేరళ స్టోరీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఏప్రిల్ 26న విడుదలవ్వగా అప్పటి నుంచే దీనిపై రాజకీయ రగడ మొదలైంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడంతో మే5న విడుదలకు సిద్ధంగా ఉంది. -
వివాదంలో మరో బాలీవుడ్ చిత్రం, ఎఫ్ఐఆర్ నమోదు
చాలా గ్యాప్ తర్వాత నటి అదా శర్మ నటిస్తున్న బాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘ది కేరళ స్టోరీ’. తాజాగా ఆ మూవీ చిక్కుల్లో పడింది. ఇటీవల విడుదలైన టీజర్లో అదా చెప్పిన ఓ డైలాగ్ కేరళనాట ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. కేరళ వాసుల ఈ మూవీపై తీవ్ర వ్యతీరేకత వస్తోంది. అసలు సంగతేంటంటే.. ఆదా శర్మ ప్రధాన పాత్రలో ది కేరళ స్టోరీ రూపొందుతుంది. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అదా అపహరణ గురై బలవంతపు మత మార్పిడికి గురైన షాలిని ఉన్ని కృష్ణన్ అనే యువతి పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో రీసెంట్గా రిలీజైన ఈ మూవీ టీజర్లో అదా బుర్ఖ ధరించి కనిపించింది. చదవండి: తన స్థానంలోకి కొత్త యాంకర్ ఎంట్రీ.. స్పందించిన రష్మీ గౌతమ్ ఇందులో అదా మాట్లాడుతూ.. ‘ఆమె నర్సు కావాలని కలలు కనేది. కానీ కిడ్నాప్కి గురవుతుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి ఆఫ్ఘనిస్తాన్లోని జైలులో ఉగ్రవాదిగా ఉంది’ అంటూ తన కథ చెబుతూ కన్నీటీ పర్యంతరం అవుతుంది. అంతేకాదు తను మాత్రమే కాదని తనలాంటి మరో 32 వేల మంది కేరళ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి విదేశాలకు పంపించి ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారంటూ అదా చెప్పుకొచ్చింది. దీంతో టీజర్లో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు కేరళనాట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ అంశంపై కొందరు అభ్యంతరం తెలుపుతూ కేరళ సీఎం పినరయి విజయన్కు ఫిర్యాదు చేశారు. ఈ సినిమాను వెంటనే ఆపేయాలని, తప్పుడు లెక్కలతో కేరళ యువతుల పట్ల తప్పుడు ప్రచారం చేస్తున్న ఈ మూవీ టీంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఆసక్తిగా గీతూ రాయల్ పారితోషికం.. 9 వారాలకు ఎంత ముట్టిందంటే! దీంతో ఆ రాష్ట్ర డీజీపీ అనిల్ కాంత్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణకు ఆదేశించారు. ఇదిలా ఉంటే కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానంద గతంలో ఇచ్చిన ఓ ప్రసంగాన్ని తప్పుగా సబ్ టైటిల్స్ వేసి చూపిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ సనిమా సుదీప్తో సేన్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాను పుల్ అమృత్లాల్ షా నిర్మిస్తున్నారు. కేరళలో అపహరణకు గురైన 32వేల మంది (యూనిట్ పేర్కొన్న లెక్క) మహిళల మత మార్పిడి, ఉగ్రవాదులుగా మార్చడం తదితర అంశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని వచ్చే ఏడాది విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. Fun fact: We also found another promo for #TheKeralaStory where Sen has misrepresented the words of another former CM VS Achuthanandan. The promo shows a 17-second clip of former CM VS Achuthanandan. Guess what? The eng subtitles had no similarities with what was being said. pic.twitter.com/neCBAri2N5 — Shinjinee Majumder (@shinjineemjmdr) November 8, 2022 -
‘ది కేరళ స్టోరీ’: నర్సు కావాలనుకున్న ఆమె టెర్రరిస్ట్గా ఎలా మారింది?
‘‘ఆమె నర్సు కావాలని కలలు కనేది. కానీ కిడ్నాప్కి గురవుతుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి ఆఫ్ఘనిస్తాన్లోని జైలులో ఉగ్రవాదిగా ఉంది’’ అంటూ కన్నీటి పర్యంతమవుతూ తన కథ చెప్పింది షాలినీ ఉన్నికృష్ణన్. ‘ది కేరళ స్టోరీ’ చిత్రం ట్రైలర్లోని కథ ఇది. షాలినీ ఉన్నికృష్ణన్ని ‘ఫాతిమా’గా మార్చి, ఐఎస్ఐ తీవ్రవాదిగా ఎలా తయారుచేశారని కూడా ఈ టీజర్లో షాలినీ పేర్కొంది. ఈ పాత్రను అదా శర్మ చేస్తుండగా, సుదీప్తో సేన్ దర్శకత్వం వహిస్తున్నారు.‘‘ఈ సినిమా కోసం సుదీప్తో నాలుగేళ్లు పరిశోధించారు. ఆయన చెప్పిన ఘటనలు విని, కన్నీళ్లు ఆగలేదు. అప్పుడే ఈ సినిమా నిర్మించాలని నిర్ణయించేసుకున్నాను. వాస్తవ ఘటనలను చూపించనున్నాం’’ అన్నారు చిత్రనిర్మాత విపుల్ అమృత్లాల్ షా. కేరళలో అపహరణకు గురైన 32వేల మంది (యూనిట్ పేర్కొన్న లెక్క) మహిళల మత మార్పిడి, ఉగ్రవాదులుగా మార్చడం తదితర అంశాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఈ చిత్రం టీజర్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
బప్పి లహరితో నీకు పోలికేంటి? హీరోయిన్ను ఏకిపారేస్తున్న నెటిజన్లు
Adah Sharma Trolled By Netizens: హార్ట్ ఎటాక్ హీరోయిన్ అదా శర్మ చేసిన పనికి నెటిజన్లు ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. కొంచెమైనా బుద్ధుండక్కర్లేదా? నువ్వు ఫేమస్ అవడం కోసం ఏదైనా చేస్తావా? అని దుయ్యబడుతున్నారు. ఇంతకీ అందరూ ఆగ్రహించేలా ఆమె ఏం చేసిందంటే... అదా శర్మ ఫేస్బుక్లో బప్పి లహరి ఫొటో పక్కన తన ఫొటోను జోడించింది. ఇందులో ఒంటి నిండా బంగారు నగలు ధరించి, వేళ్లకు ఉంగరాలు తొడుక్కుని బప్పి లహరి స్టైల్లో ఫొటోకు పోజిచ్చింది. అంతేకాదు, ఎవరి ఫొటో బాగుంది? అని అర్థం వచ్చేలా ఓ క్యాప్షన్ జోడించింది. ఇది చూసిన నెటిజన్లు అంత పెద్ద సింగర్తో నీకు పోలికేంటి? అని ప్రశ్నిస్తున్నారు. 'లెజెండ్ ఎప్పటికీ లెజెండే, నువ్వు కనీసం ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేవు', 'భౌతికంగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయిన వ్యక్తితో నిన్ను నువ్వు పోల్చుకుంటున్నావా?, నీ సరదాల కోసం మరీ ఇలా దిగజారుతావా?', 'ఛీ, నీమీద ఉన్న గౌరవమంతా పోయింది' అంటూ అదాను ఏకిపారేస్తున్నారు. కాగా గ్రేట్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి ఫిబ్రవరి 16న మరణించారు. ఈయన అటు బాలీవుడ్లో, ఇటు సౌత్లో ముఖ్యంగా తెలుగు తమిళం, కన్నడ పరిశ్రమలో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నారు. 'ఆకాశములో ఒక తార', 'రాధా రాధా మదిలోన మన్మథ బాధ', 'భద్రాచలం కొండ', 'వానా వానా వెల్లువాయే', 'చిలుకా క్షేమమా', 'మావా మావా మావా..' వంటి ఎన్నో హిట్ సాంగ్స్ ఆయన సంగీతం అందించినవే! -
‘మిస్టర్ ప్రేమికుడి’గా ప్రభుదేవా
ప్రభుదేవా, అదా శర్మ, నిక్కీ గల్రాని హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం ‘చార్లీ చాప్లిన్ 2’. శక్తి చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎమ్.వి. కృష్ణ సమర్పణలో వి. శ్రీనివాసరావు, గుర్రం మహేశ్ చౌదరి ‘మిస్టర్ ప్రేమికుడు’ పేరుతో తెలుగులో ఈ నెల 29న విడుదల చేస్తున్నారు. వి. శ్రీనివాసరావు, గుర్రం మహేష్ చౌదరి మాట్లాడుతూ.. ‘‘పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. పాటలతో పాటు సెకండాఫ్లో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్గా నిలుస్తాయి. ప్రభుదేవా నటన, డ్యాన్స్తో పాటు అదా శర్మ, నిక్కీ గల్రాని అందం, అభినయం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. చాలా కాలం తర్వాత ప్రభుదేవా తరహా హాస్యంతో పాటు ఆయన డ్యా¯Œ ్సని మరోసారి తెలుగు ప్రేక్షకులు చూస్తారు’’ అన్నారు. -
షాకిచ్చిన స్నేహా ఉల్లాల్, రకుల్ కష్టాలు, థ్యాంక్స్ చెప్పిన అరియాన
దసరా శుభాకాంక్షలు తెలిపిన శ్రియా సరన్, బిగ్బాస్ దివి, స్నేహా ఉల్లాల్, ఆదా శర్మ దుర్గమ్మ అవతారమెత్తిన అదా శర్మ సాయి ధరమ్ తేజ్కు బర్త్డే విషెస్ తెలిపిన వరుణ తేజ్, వరుణ్, సాయిల చిన్ననాటి ఫొటో వైరల్ బతకడం కోసం తినాలి అంటూ వీడియో షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ తాళిబోట్టు, సిందూరంతో షాకిచ్చిన స్నేహా ఉల్లాల్ View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Ariaana & Viviana Manchu (@ariviviofficial) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Sneha Ullal (@snehaullal) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
చెన్నై హోటల్లో తారక్ ఫ్యాన్స్తో జగ్గూ భాయ్, ఆ ఫొటో షేర్ చేయనన్న చిట్టి
ప్రామిస్ ఇదే చివరిది ఇక ఆ ఫొటో షేర్ చేయనన్న చిట్టి మనల్ని మనం ప్రేమించుకోవడమే సంతోషానికి తొలి మెట్టు అంటున్న సదా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్తో చెన్నై హోటల్లో జగ్గూ భాయ్ లంచ్ కూతురితో అనుష్క శర్మ, లిటిల్ వామికకు అష్టమి శుభాకాంక్షలు View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
సమంత వర్కవుట్స్, ఎందుకో అర్థం కాదన్న ఊర్వశి
♦ అదంటే తనకు ప్యార్ అంటోన్న సిమ్రత్ కౌర్ ♦ బుర్జ్ ఖలీఫా మీద సిద్ధార్థ్ ఫొటో ♦ సాయంత్రాలను ఎంజాయ్ చేస్తున్న సింగర్ సునీత ♦ దీన్ని చూసినట్లుగా ఇంకెవర్నీ చూడలేదంటోన్న రాశీ ఖన్నా ♦ నైట్ షూటింగ్ అయినా రెడీనే అంటోన్న నిఖిల్ ♦ జిమ్లో వర్కవుట్స్ చేసిన సమంత ♦ స్పైడర్మ్యాన్ ఒకటే డ్రెస్ ఎందుకు వేసుకుంటాడో అర్థం కాదంటున్న ఊర్వశి రౌతేలా ♦ స్విమ్మింగ్ పూల్లో సేద తీరుతున్న అమీ జాక్సన్ ♦ టైటిల్ పోస్టర రిలీజ్ చేసిన రష్మికకు థ్యాంక్స్ చెప్పిన అవికా గోర్ View this post on Instagram A post shared by Simrat Kaur (@simratkaur_16) View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Naina Ganguly ❤ (@nainaganguly) View this post on Instagram A post shared by Naina Ganguly ❤ (@nainaganguly) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
చింపాంజీతో అదాకు పోలిక, స్టెప్పేసిన కృతీసనన్
♦ కవ్విస్తోన్న ఖుషీ కపూర్ లుక్స్ ♦ నన్ను చదివేయడానికి మీరేమీ గ్రాడ్యుయేట్స్ కాదంటోన్న రకుల్ ప్రీత్ సింగ్ ♦ ఎల్లో డ్రెస్లో బంగారంలా మెరిసిపోతున్న ఆత్మిక ♦ కెమెరాను ప్రశ్నిస్తోన్న ప్రియాంక జవాల్కర్ ♦ రచ్చబాబుతో డ్యాన్స్ చేసిన శ్రీముఖి ♦ పరంసుందరి పాటకు చిందేసిన కృతీ సనన్ ♦ ఫొటోగ్రాఫర్కు థ్యాంక్స్ చెప్పిన శ్రియా ♦ ఈ డ్రెస్ చింపాంజీకి బాగుందా? లేక తనకు బాగుందా అని అడుగుతోన్న అదా శర్మ ♦ సౌత్ సినిమా చేస్తున్న సన్నీలియోన్ ♦ స్టార్లా మెరిసిపోవాలంటున్న నిహారిక View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkkar) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Aathmika 🦁 (@iamaathmika) View this post on Instagram A post shared by Aathmika 🦁 (@iamaathmika) View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) -
హల్చల్: శృతీ హాసన్ పాటలు, అదా శర్మ ఆటలు
♦ రౌడీ బాయ్స్ డబ్బింగ్ ఇలా సాగిపోతోందంటోన్న అనుపమ పరమేశ్వరన్ ♦ మీ నుంచి ఎంతో నేర్చుకున్నామంటూ దిలీప్ కుమార్కు నివాళులు అర్పించిన తమన్నా భాటియా ♦ విజయ్ సేతుపతిని కలిసిన శివానీ నారాయణన్ ♦ సముద్ర తీరాన నిహారిక కొణిదెల ♦ రోడ్డు మీద అరియానా విన్యాసాలు ♦ వైట్ డ్రెస్లో మెరిసిపోతున్న నియా శర్మ ♦ రోజురోజుకీ ఈ యువరాణి మరింత నిగారిస్తోందంటోన్న సాక్షి అగర్వాల్ ♦ షూటింగ్లో సీరియస్ లుక్లో శ్రద్ధా దాస్ ♦ పియానో వాయిస్తూ పాట పాడిన శృతీ హాసన్ ♦ కథక్ రిహార్సల్ చేసిన శ్రియా ♦ కొత్త ఫ్రెండ్స్ను ఎలా పరిచయం చేసుకోవాలో చెప్తున్న అదా శర్మ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Shivani Narayanan (@shivani_narayanan) View this post on Instagram A post shared by Shivani Narayanan (@shivani_narayanan) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Hamsa Nandini | Actress (@ihamsanandini) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
Meet Cute Movie: నాని సినిమా అదాశర్మ!
‘హార్ట్ ఎటాక్’ బ్యటీ అదా శర్మ ఇక క్యూట్ గాళ్ అట. విషయం ఏంటంటే... ‘మీట్ క్యూట్’ త్రంలో ఓ లీడ్ రోల్కి అదాని తీసుకున్నారు. హీరో నాని సోదరి దీప్తీ ఘంట ‘మీట్ క్యూట్’ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కానున్నారు. పూజా కార్యక్రమాలతో ఇటీవల ఈ సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రంలో మొత్తం ఐదురగురు కథానాయికలు ఉంటారు. ఐదుగురిలో అదా ఓ క్యూట్ గాళ్ అన్నమాట. ఈ చిత్రంలో తాను చేయనున్న పాత్ర గురించి అదా శర్మ మాట్లాడుతూ– ‘‘తెలుగు చిత్రాల్లో నేను ఇప్పటివరకు చేయని ఓ డిఫరెంట్ రోల్ను ఈ సినిమాలో చేయనున్నాను. ‘హార్ట్ ఎటాక్’ సినిమాలో నాది లైట్ హార్టెడ్ రోలే అయినప్పటికీ ఆ సినిమా మేజర్గా కమర్షియల్ పంథాలో సాగుతుంది. కానీ ‘మీట్ క్యూట్’ చిత్రం డిఫరెంట్. ఈ సినిమాలో కొత్త అదాను చూస్తారు’’ అని పేర్కొన్నారు. హీరో నాని నిర్మిస్తున్న ఈ ‘మీట్ క్యూట్’లో ఐదుగురు హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ పేరు ఉందనే ప్రచారం సాగుతున్న తెలిసిందే. -
హల్చల్: లావణ్య అందాలు, కాజల్ కవ్వింపులు
♦ పీచ్ కలర్ సారీలో అనసూయ అందాలు ♦ సెల్ఫీతో హాయ్ చెప్పిన అనన్య పాండే ♦ చాక్లెట్ షేక్ రెడీ చేసుకుని తాగిన అనన్య నాగళ్ల ♦ ఇది నా ఫేవరెట్ సాంగ అంటోన్న అరియానా గ్లోరీ ♦ కిస్ మీ అంటోన్న సన్నీలియోన్ ♦ మీకు ఎక్కువ సంతోషాన్నిచ్చేది ఏదని అడుగుతోన్న అదా శర్మ ♦ కాజల్ నుదుటి మీద భర్త గౌతమ కిచ్లూ ముద్దుల వర్షం ♦ ఆకుపచ్చ చీరలో నందిత శ్వేత సోయగం ♦ నల్లటి చీరలో ప్రియాంక జవాల్కర్ మెరుపులు ♦ లాక్డౌన్లో ఇలా ఎంజాయ్ చేస్తున్నానంటోన్న సాక్షి అగర్వాల్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkkar) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkkar) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Swetha Naidu 🇮🇳 (@swethaa_naidu) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Swetha Naidu 🇮🇳 (@swethaa_naidu) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) -
స్నానం చేయిస్తున్న అదా, జలపాతానికి చేరువలో సన్నీ
► ఫొటోషూట్ తర్వాత మేకప్ ఎలా తీసేయాలో వీడియో షేర్ చేసిన శ్రీముఖి ► పిల్లి బొమ్మకు స్నానం చేయిస్తున్న అదా శర్మ ► జలపాతం దగ్గర సన్నీలియోన్ స్టిల్స్ ► స్విమ్మింగ్ పూల్లో సేద తీరుతున్న రాయ్ లక్ష్మీ ► యోగా నేర్పిస్తానంటోన్న మలైకా అరోరా ► కోవిడ్తో ఎలా పోరాడాలో చెప్తోన్న కంగనా రనౌత్ View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Anchor Shilpa Chakravarthy (@tvshilpa) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Anchor Shilpa Chakravarthy (@tvshilpa) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ali Reza (@i.ali.reza) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Malvika Nair (@malvikanairofficial) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Dakkshi (@dakkshi_guttikonda) -
అనసూయ బర్త్డే పార్టీ, బిర్యానీ వండిన రవి
► వర్షంలో గొడుగుతో విహరిస్తున్న ఫొటోను షేర్ చేసిన ధన్య బాలకృష్ణ ► ఒక్కసారి ప్రేమిస్తే వదలనంటున్న అఖిల్ సార్థక్ ► ఇప్పుడు అందరికీ అవసరమైన ప్రేమను ఎమోజీ రూపంలో సెండ్ చేస్తానంటోన్న శృతీ హాసన్ ► నా పిల్ల ఎక్కడుందో అని ప్రేమ పాటలు పాడుకుంటున్న మెహబూబ్ దిల్సే ► లాస్ట్ ఫొటోతో భయపెట్టేసిన అదా శర్మ ► క్వారంటైన్ బర్త్డే జరుపుకున్న అనసూయ భరద్వాజ్ ► కూతురి కోసం మటన్ బిర్యానీ వండిన యాంకర్ రవి View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Dakkshi (@dakkshi_guttikonda) View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) -
మనసు జారిందన్న దీప్తి, ఇదే ఫస్ట్ టైమ్ అన్న అఖిల్
► తన పిల్లి క్లారా చేష్టలను వీడియోలో బంధించిన శృతీ హాసన్ ► కొడుకు అల్లరి వీడియోను షేర్ చేసిన యాంకర్ శ్యామల ► బర్త్డే విషెస్ తెలుపుతూ రాసిన లేఖలు చాలా బాగున్నాయన్న అదా శర్మ ► ఈ మామిడికాయలు తినాలని ఎవరు మాత్రం ఉవ్విళ్లూరరు అంటోన్న సమీరా భరద్వాజ్ ► అరెరె.. అరెరె.. మనసే.. జారే అంటోన్న దీప్తి సునయన ► యువరాణి కళ్లారా చూడటం ఇదే తొలిసారి అంటూ మోనాల్కు బర్త్డే విషెస్ తెలిపిన అఖిల్ ► మేకప్ లేకుండా స్వాతి దీక్షిత్ View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Sameera Bharadwaj (@sameerabharadwaj) View this post on Instagram A post shared by Sameera Bharadwaj (@sameerabharadwaj) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Swathi deekshith✨ (@swathideekshith) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by disha patani (paatni) (@dishapatani) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Dakkshi (@dakkshi_guttikonda) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) -
వాట్ ఏ క్రియేటివీ అదాశర్మ... వీడియో వైరల్
‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ అదాశర్మ. ఆ మూవీ తర్వాత ఈ అందాల భామకు టాలీవుడ్లో ఎక్కువ అవకాశాలు రాలేదు. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్, వెబ్ సిరీస్లపై ఫోకస్ పెట్టింది. ఇక సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది అభిమానులను సంపాంధించుకుంటుంది అందాల ముద్దుగుమ్మ అదా శర్మ. నిత్యం కొత్త కొత్త స్టైల్లో రెడీ అయి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు కిక్కెక్కిస్తోంది. వింత వింత విన్యాసాలు చేస్తూ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మదర్స్డే సందర్భంగా అదా శర్మ షేర్ చేసిన ఓ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ‘అదా శర్మ ప్రతి విజయం వెనుక అమ్మ ఉంటుంది’అంటూ ఆ వీడియోని షేర్ చేసింది అదా శర్మ. అందులో ఆదా తల్లితో కలిసి ఓ హింది పాటకి డాన్స్ చేసింది. అయితే వీడియో ఎండింగ్ వరకు ఆమె వెనుక తల్లి ఉందన్న విషయం బయటపడదు. తన తల్లితో కలిసి చేసిన ఈ డాన్స్ విన్యాసం నెటిజన్లు తెగ ఆకట్టుకుంటుంది. అదా క్రియేటివిటీకి అభిమానులంతా ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
చాయ్ గ్లాస్తో తెలుగమ్మాయి, పంచ్ ఇచ్చిన అదా
♦ కరోనాకు పంచ్ ఇస్తున్న అదా శర్మ ♦ చాయ్ గ్లాస్తో తెలుగమ్మాయి శోభితా ధూళిపాల ♦ మీరు పుడమిని రక్షిస్తే.. అది మిమ్మల్ని రక్షిస్తుంది అని నినాదమిస్తున్న కీర్తి సురేశ్ ♦ ప్రకృతి స్పెషల్ ఫొటోషూట్లో ప్రణవి మానుకొండ ♦ ఈ పాట కింద కామెంట్ చేసేవాళ్లలో ఓ ప్రత్యేక వ్యక్తికి అంకితమంటున్న సిమ్రత్ కౌర్ ♦ అన్ని రంగులు ఉండే క్రేయాన్స్ బాక్స్ లాంటిదే మన జీవితం కూడా అంటోది మోనాల్ గజ్జర్ ♦ అందుకే ఇలా ఆగి పోజిస్తున్నానంటోన్న హిందీ దృశ్యం నటి ఇషితా దుత్తా ♦ ఎల్లో ఎల్లో.. అంజలి బ్యూటిఫెల్లో.. ♦ ప్రేమలో పడటం భలేగుంది అంటున్న దివ్య భారతి ♦ 13 మిలియన్ల ఫాలోవర్లను అందుకున్నానోచ్ అంటున్న పూజా హెగ్డే View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) -
లంగా ఓణీలో అనసూయ, లెహంగాలో నభా.. కవ్విస్తున్న భామలు
ఎలా ఉన్నానో చెప్పడంటూ కళ్ల జోడు పెట్టుకుని ఉన్న ఫోటోని ఇన్స్ట్రాగ్రామ్లో షేర్ చేసింది నిధి అగర్వాల్ లంగా ఓణీలో కవ్విస్తున్న అనసూయ చూపులతో కుర్రకారుకు మత్తెక్కిస్తున్న దిశాపటాని సమ్మర్లో ఉపశమనం కోసం స్విమ్మింగ్ పూల్లో జలకాలాట ఆడుతున్న యంగ్ హీరో ఆది సాయికుమార్ ఆరోగ్యంగా, ఫిట్గా ఉండేందుకు ఏం చేయాలో వివరిస్తున్న బాలీవుడ్ భామ మలైకా అరోరా View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by disha patani (paatni) (@dishapatani) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by ActorAadi (@aadipudipeddi) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Divi Vadthya (@divi.vadthya) View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) -
సముద్ర తీరాన అదా మరో విన్యాసం.. వీడియో వైరల్
పూరీ జగన్నాథ్ ‘హార్ట్ ఎటాక్’ సినిమా ద్వారా టాలీవుడ్కు పరిచమైన హీరోయిన్ అదాశర్మ. ఆ మూవీ తర్వాత ఈ అందాల భామకు టాలీవుడ్లో ఎక్కువ అవకాశాలు రాలేదు. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్, వెబ్ సిరీస్లపై ఫోకస్ పెట్టింది. ఇక సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది అభిమానులను సంపాంధించుకుంటుంది అందాల ముద్దుగుమ్మ అదా. నిత్యం కొత్త కొత్త స్టైల్లో రెడీ అయి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు కిక్కెక్కిస్తోంది. వింత వింత విన్యాసాలు చేస్తూ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల సముద్రపు ఒడ్డున చీరకట్టులో పల్టీ జంప్స్ కొడుతూ దర్శనం ఇచ్చిన ఈ భామ.. తాజాగా నాంచాక్ తిప్పుతూ కనిపించింది. సముద్రతీరంలో వైట్ అండ్ వైట్ కరాటే డ్రెస్ ధరించి నాంచాక్ తిప్పింది. అత్యంత వేగంగా అదా ఆ ఫీట్ చేసింది. ఆ పోస్ట్ చూస్తూ నేటిజన్లు ఈ సొగసరి నాంచాక్ తిప్పడం కూడా అందంగానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆదా డేర్ వీడియో వైరల్ అవుతోంది. -
చీరకట్టులో అదాశర్మ విన్యాసాలు.. వీడియో వైరల్
అదా శర్మ.. పూరీ జగన్నాథ్ హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా టాలీవుడ్కు పరిచమైన హీరోయిన్. ఆ మూవీ తర్వాత ఈ బ్యూటీకి ఎక్కువ సినిమా అవకాశాలు రాలేదు. మధ్య మధ్య చిన్న చిన్న సినిమాలు చేసినా.. అంతగా గుర్తింపు రాలేదు. అయితే ఆమె సినిమాల ద్వారా ప్రత్యేకమైన పేరు రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఎప్పుడు ఇన్స్ట్రాగ్రామ్లో యాక్టీవ్ గా ఉంటూ వింత వింత విన్యాసాలు చేస్తూ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి కుర్రకారుల మతులు పోగొడుతోంది. తాజాగా ఈ భామ చీర కట్టులో పల్టీలు కొడుతూ దర్శనం ఇచ్చింది. సముద్రతీరాన చీరకట్టులో ఆమె చేసిన విన్యాసాలను చూపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అదా శర్మ విన్యాసాలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అదా శర్మ చివరిసారిగా సౌల్సతి అనే షార్ట్ ఫిల్మ్లో కనిపించింది. అంతకు ముందు పాటి పత్ని అనే వెబ్ సిరీస్లో నటించింది. -
పూలనే చుట్టేయమంటా...
‘పూలనే కునుకేయమంటా... తను వచ్చెనంటా..’ పాట ‘ఐ’ సినిమాలోనిది. విక్రమ్, అమీ జాక్సన్లపై పూల మధ్య సాగే ఈ పాట కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు అదా శర్మ ‘పూలనే చుట్టేయమంటా..’ అంటున్నారు. అనడమే కాదు.. చుట్టుకున్నారు కూడా. పూల మొక్కలనే టాప్లా చేసుకుని, ధరించారామె. ఆ ఫొటోను షేర్ చేశారు అదా శర్మ. ‘ఈ సహజ సిద్ధమైన టాప్ చాలా బాగుంది. మీరు చాలా చాలా బాగున్నారు’ అంటూ అదా అభిమానులు ఆమెకు మెసేజ్ పెట్టారు. ఇలా ప్రత్యేకంగా తయారవ్వడం అదాకు ఇది మొదటిదేం కాదు. సమయం కుదిరినప్పుడల్లా ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఫొటోలను అభిమానులతో పంచుకుంటారామె. -
సమాధానం ఏంటి?
అదా శర్మ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘క్వశ్చన్ మార్క్ (?)’. విప్రా దర్శకత్వంలో గౌరు ఘనా సమర్పణలో శ్రీకృష్ణ క్రియేషన్స్ పతాకంపై గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ సందర్భంగా గౌరీకృష్ణ మాట్లాడుతూ– ‘‘కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని అందరి సహకారంతో సినిమా షూటింగ్ పూర్తి చేశాం. మా టైటిల్ ‘క్వశ్చన్ మార్క్ (?)’కి విశేష స్పందన లభించింది’’ అన్నారు. ‘‘మా నిర్మాతగారు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు విప్రా. ‘‘చక్కని హారర్ సినిమా ఇది. ‘క్వశ్చన్ మార్క్ (?)’ టైటిల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ప్రశ్నకు సమాధానం ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే’’ అన్నారు అదా శర్మ. ఈ చిత్రానికి కెమెరా: వంశీ ప్రకాష్, సంగీత దర్శకుడు: రఘు కుంచె. -
ఎంచుకున్న రాగమేంటి, చేస్తున్న స్టెప్పేంటి?
-
అదా శర్మ డ్యాన్స్ వీడియో వైరల్
కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్లో క్రేజ్ సంపాదించుకున్న అందాల నటి అదా శర్మ. అప్పుడెప్పుడో ‘హార్ట్ఎటాక్’తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన ఈ భామ తెలుగులో హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సన్ ఆఫ్ సత్యమూర్తి, క్షణం వంటి హిట్ చిత్రాల్లో అదాశర్మ పరిమిత పాత్రల్లోనే నటించింది. అయితే స్కిన్షోకు ఏమాత్రం వెనుకాడని ఈ ముద్దుగుమ్మ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా క్రిస్మస్ వేడుకల్లో ఆమె చేసిన హంగామాతో మరోసారి వార్తల్లో నిలిచింది. సాధారణంగా క్రిస్మస్ పండగకు అందరూ కేకులు కట్ చేస్తూ, గిఫ్ట్లు ఇచ్చుకుంటూ పార్టీలు చేసుకుంటారు. కానీ అదాశర్మ మాత్రం జింగిల్ బెల్ పాటకు కాళ్లకు గజ్జె కట్టి తన్మయత్వంతో నృత్యం చేసింది. అది కూడా క్లాసికల్ డ్యాన్స్ కావడంతో అందరూ కాసేపు ఆశ్చర్యపోయినా తర్వాత అదా పర్ఫార్మెన్స్ చూసి ముగ్ధులైపోయారు. ఈ వీడియోను అదాశర్మ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు అదా డ్యాన్స్కు ఫిదా అవుతుంటే మరికొందరు మాత్రం ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు. ‘మీరు ఎంచుకున్న రాగం ఏంటి చేస్తున్న డ్యాన్సు ఏంటి?’ అంటూ అదాపై చమత్కార కామెంట్లు విసురుతున్నారు. -
వరుడు వేటలో ఉన్నా!
పెళ్లి కొడుకు వేటలో ఉన్నానంటోంది నటి ఆదాశర్మ. తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ కోలీవుడ్లోనూ కొన్ని చిత్రాల్లో కనిపించింది. ముఖ్యంగా సంచలన జంట శింబు, నయనతార జంటగా నటించిన ఇదు నమ్మఆళు చిత్రంతో తమిళ సినిమాకు పరిచయమైంది. అందాలారబోతకు హద్దులు చెప్పని ఈ బ్యూటీని ఏ భాషలోనూ స్టార్డంను అందుకోలేకపోయింది. అయినా తరచూ ఫొటో సెషన్స్ నిర్వహించుకుంటూ ఆ ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్చేస్తూ వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది. అలాంటి ఆదాశర్మ దృష్టి పెళ్లిపైకి మళ్లిందట. అందుకే నేను పెళ్లికి రెడీ అయ్యాను. పెళ్లి కొడుకు వేటలో ఉన్నాను అంటూ తన ట్విట్టర్లో పేర్కొంది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఆ వచ్చేవాడికి ఈ జాణ పెట్టే కండిషన్లే కాస్త విచిత్రంగా ఉన్నాయి. అవేంటో కూడా ఆదాశర్మ బయట పెట్టేసింది. ముఖ్యంగా ఉల్లిపాయలు తినకూడదు. ఇంటిలో జీన్స్ డ్రెస్ వేసుకున్నా పర్వాలేదు గానీ, బయటకు వెళ్లేటప్పుడు మాత్రం కచ్చితంగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందే. ఇక అసలు విషయం ఏమిటంటే నిత్యం ముప్పూటలా చిరునవ్వు ముఖం మీద చెరగకుండా వంట చేయాలి. మద్యం, మాంసాహారాలు నిషిద్ధం. భారతీయ భాషలన్నింటినీ గౌరవించాలి వంటి నిబంధనలు పాఠించాలని పేర్కొంది. అంతేనా అంటే జాతి, మతం, రంగు, జాతకం, షూ సైజ్, వీసా, ఈతలో ప్రతిభ, ఇన్స్ట్రాగామ్ అకౌంట్ వంటి వాటి గురించి నాకేమీ అభ్యంతరాలు ఉండవు అని చెప్పింది. ఇదంతా సరే. ఈ లక్షణాలన్నీ కలిగిన పెళ్లి కొడుకు ఈ రోజుల్లో ఆదాశర్మకు దొరుకుతాడా అన్నదే ప్రశ్న. ఏదేమైనా తనకు కాబోయేవాడు ఇలా ఉండాలని ముందుగానే బయట పెట్టేసింది. ఆమె నిబంధనలు నచ్చితే ఎవరైనా భర్త పోస్ట్కు దరఖాస్తు చేసుకోవచ్చు. -
‘కల్కి’ మూవీ రివ్యూ
-
‘కల్కి’ మూవీ రివ్యూ
టైటిల్ : కల్కి జానర్ : ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తారాగణం : రాజశేఖర్, అదా శర్మ, నందితా శ్వేతా, రాహుల్ రామకృష్ణ, అశుతోష్ రాణా సంగీతం : శ్రావణ్ భరద్వాజ్ దర్శకత్వం : ప్రశాంత్ వర్మ నిర్మాత : సీ కల్యాణ్, శివాని, శివాత్మిక గరుడవేగ సినిమాతో సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన యాంగ్రీ హీరో రాజశేఖర్, అ! లాంటి డిఫరెంట్ మూవీతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ కల్కి. రాజశేఖర్ను మరోసారి యాంగ్రీ హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. తొలి సినిమాతో కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయిన ప్రశాంత్ వర్మ ఈ సినిమా రిజల్ట్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మరి ప్రశాంత్ వర్మ నమ్మకాన్ని కల్కి నిలబెట్టిందా..? ఈ థ్రిల్లర్తో రాజశేఖర్ మరో సక్సెస్ అందుకున్నాడా..? కథ : కల్కి.. కథ అంతా 1980ల కాలంలో సాగుతుంది. రజాకార్ల దాడుల్లో రాజు చనిపోవటంతో కొల్లాపూర్ సంస్థానం బాద్యతలు రాణీ రామచంద్రమ్మ తీసుకుంటారు. సంస్థానం మీద కన్నేసిన ఆ ప్రాంత ఎమ్మెల్యే నర్సప్ప (అశుతోష్ రాణా), పెరుమాండ్లు (శత్రు) రాణీని చంపి సంస్థానాన్ని హస్తగతం చేసుకొని ప్రజలను హింసిస్తుంటారు. తరువాత నర్సప్ప, పెరుమాండ్లు మధ్య కూడా గొడవలు రావటంతో ఊరు రణరంగంలా మారుతుంది. ప్రజలు నర్సప్ప అరాచకాల్ని భరించలేక, ఎదురుతిరగలేక బిక్కుబిక్కుమంటూ జీవిస్తుంటారు. అదే సమయంలో పట్నం నుంచి వచ్చిన నర్సప్ప తమ్ముడు శేఖర్ బాబు(సిద్దు జొన్నలగడ్డ)ను దారుణంగా హత్య చేస్తారు. హత్యకు కారణం నర్సప్ప అని కొందరు, కాదు పెరుమాండ్లు చంపాడని మరి కొందరు, కాదూ రాణీ రామచంద్రమ్మ దెయ్యం అయి వచ్చి చంపిందని మరికొందరు అనుకుంటుంటారు. ఈ హత్య కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి కల్కి(రాజశేఖర్)ని ప్రత్యేకంగా అపాయింట్ చేస్తారు. కొల్లాపూర్ వచ్చిన కల్కి, జర్నలిస్ట్ దేవదత్తా (రాహుల్ రామకృష్ణ) సాయంతో ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. కల్కి ఈ కేసు ఎలా చేదించాడు..? అసలు శేఖర్ బాబు ఎలా చనిపోయాడు.? ఎవరు చంపారు..? ఈ కథతో ఆసిమా(నందితా శ్వేత)కు సంబంధం ఏంటి.? అన్నదే మిగతా కథ. నటీనటులు : గరుడ వేగ సక్సెస్తో మంచి ఊపు మీదున్న రాజశేఖర్, కల్కి పాత్రలో జీవించాడు. అక్కడక్కడా లుక్ పరంగా కాస్త ఇబ్బంది పెట్టినా ఓవరాల్గా మరోసారి యాంగ్రీ హీరోగా సూపర్బ్ అనిపించాడు. యాక్షన్ సీన్స్లోనూ ఆకట్టుకున్నాడు. అదా శర్మ పోషించిన హీరోయిన్ పాత్రకు కథలో ఏ మాత్రం ప్రాదాన్యం లేదు. కేవలం ఓ పాట కోసమే ఆమెను తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కీలక పాత్రలో నటించిన నందితా శ్వేత.. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మంచి నటిగా పేరున్న నందితా ఈ సినిమాతో మరోసారి తన మీదున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. సినిమాను నడిపించే పాత్రలో రాహుల్ రామకృష్ణ ఆకట్టుకున్నాడు. సీరియస్ మోడ్లో సాగే కథనంలో అప్పుడప్పుడు తనదైన కామిక్ టైమింగ్తో మెప్పించాడు. విలన్గా అశుతోష్ రాణా తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇతర పాత్రల్లో శత్రు, నాజర్, సిద్దు జొన్నలగడ్డ, చరణ్దీప్, పూజితా పొన్నాడ తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : ఇది పూర్తిగా ప్రశాంత్ వర్మ మార్క్ సినిమా. రెండో ప్రయత్నంగా పీరియాడికల్ థ్రిల్లర్ను ఎంచుకున్న ప్రశాంత్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. డిఫరెంట్ స్క్రీన్ప్లే, థ్రిల్లింగ్ ట్విస్ట్లతో మంచి కథా కథనాలను రెడీ చేసుకున్నాడు. అయితే చెప్పాల్సిన కథ రెండున్నర గంటలకు సరిపడా లేకపోవటంతో కథనాన్ని కాస్త నెమ్మదిగా నడిపించాడు. కొన్ని సన్నివేశాల్లో అర్థంకాని స్క్రీన్ప్లే ప్రేక్షకులను తికమకపెడుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. హీరో హీరోయిన్ల ప్రేమకథ కమర్షియల్ ఫార్మాట్ కోసం కావాలనే ఇరికించినట్టుగా అనిపిస్తుంది. ద్వితీయార్థంలో థ్రిల్లింగ్ ట్విస్ట్లతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశాడు దర్శకుడు. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు ఆడియన్స్ను కట్టిపడేశాడు. సినిమాకు ప్రధాన బలం నేపథ్య సంగీతం, పాటలతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన శ్రావణ్ భరద్వాజ్ నేపథ్యం సంగీతంతో వావ్ అనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్ను డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. శివేంద్ర సినిమాటోగ్రఫి కూడా సూపర్బ్ అనిపించేలా ఉంది. 80ల నాటి లుక్ తీసుకురావటంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసిన కృషి తెర మీద కనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా నాసిరకంగా ఉన్నాయి. సీ కల్యాణ్తో కలిసి స్వయంగా సినిమాను నిర్మించిన రాజశేఖర్ ఖర్చుకు వెనకాడకుండా సినిమాను రూపొందించాడు. ప్లస్ పాయింట్స్ : నేపథ్య సంగీతం క్లైమాక్స్ ప్రశాంత్ వర్మ మార్క్ టేకింగ్ మైనస్ పాయింట్స్ : హీరోయిన్ పాత్ర స్క్రీన్ప్లే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ సాంగ్స్ - సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
కల్కి : ఆలస్యమైనా.. ఆసక్తికరంగా!
గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి. అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్కు మంచి రెస్పాన్స్ రావటంతో ట్రైలర్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సోమవారమే ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉన్నా సాంకేతిక సమస్యల కారణంగా మంగళవారం ఉదయం రిలీజ్ చేశారు. ట్రైలర్లోనే సినిమా లైన్ ఎంటో చెప్పేశారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే నరసప్ప తమ్ముడు శేఖర్ బాబు హత్య కేసు చుట్టూ తిరుగుతుంది కల్కి కథ. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ అధికారిగా రాజశేఖర్, జర్నలిస్ట్గా రాహుల్ రామకృష్ణలు కనిపించనున్నారు. రాజశేఖర్ సరసన అదా శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నందితా శ్వేత, పూజితా పొన్నాడ, నాజర్, స్కార్లెట్ మెలిష్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, అశుతోష్ రానా, శత్రులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సీ కల్యాణ్తో కలిసి రాజశేఖర్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
జాగ్రత్త ఆ కాపీరైట్స్ నావే!
తమిళసినిమా: ఆ కాపీరైట్స్ తనవే జాగ్రత్త అంటూ హెచ్చరిస్తోంది నటి ఆదాశర్మ. 2008లో నటిగా రంగప్రవేశం చేసిన ఈ ముంబై భామ మొదట్లో హిందీలో గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత దక్షిణాదికి తన నట పయనాన్ని విస్తరించుకుంది. హిందీలో 1920 అనే చిత్రంతో విజయాల ఖాతాను ప్రారంభించిన ఈ బ్యూటీ టాలీవుడ్లోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది. అయితే హిందీలో మాదిరి తెలుగులో హీరోయిన్గా పేరు తెచ్చుకోలేదు. హార్ట్ఎటాక్ చిత్రంలో నితిన్కు జంటగా హీరోయిన్గా నటించినా ఆ చిత్రం ఆమెను నిరాశపరిచింది. ఆ తరువాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సన్ ఆఫ్ సత్యమూర్తి, క్షణం వంటి హిట్ చిత్రాల్లో నటించినా ఆదాశర్మ పాత్రలు పరిమితమే. ఇకపోతే కోలీవుడ్లో చాలా కాలం క్రితమే శింబుతో ఇదునమ్మఆళు చిత్రంలో ఒక పాటకు ఆడింది. ఆ తరువాత ఇక్కడ ఈ అమ్మడిని గుర్తించుకున్నవారే లేరు. అలా చాలా గ్యాప్ తరువాత ప్రభుదేవాతో చార్లీ చాప్లిన్–2 చిత్రంలో నటించే అవకావాన్ని అందుకున్నా, ఆ చిత్రం కూడా ఆదాశర్మ కెరీర్కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. పనిలో పనిగా కన్నడంలోనూ నటించేసిన ఆదాశర్మ మాత్రం ఎప్పుడూ ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తూనే ఉంది. అందాలారబోతకు ఏ మాత్రం సంకోచించని ఈ స్కిన్షో బ్యూటీ వివిధ భంగిమలతో కూడిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది. తాజాగా ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్లో నటిస్తోంది. దీనికి ది హాలీడే అనే టైటిల్ను నిర్ణయించారు. సహజంగానే ఆదాశర్మ తన హేర్స్టైల్ను డిఫెరెంట్గా రూపు దిద్దుకోవడంలో ఆసక్తి కనబరుస్తుంది. అలా ప్రస్తుతం తాను నటిస్తున్న వెబ్ సిరీస్ కోసం తన హేర్ను త్రివర్ణంతో తీర్చిదిద్దుకుంది. పర్పల్, పింకు, ఆరెంజ్ రంగులతో కూడిన హేర్స్టైల్ కలిగిన ఒక అందమైన ఫొటోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. అది ఇప్పుడు ఈ అమ్మడికి పిచ్చి పబ్లిసిటీని తెచ్చి పెడుతోంది. ఇంత వరకూ బాగానే సాధారణంగా ఏదైనా డిఫెరెంట్గా ఉంటే మగువలు దాన్ని ఫాలో అవుతుంటారు. ఈ విషయాన్ని ఎరిగిన ఆదాశర్మ అలాంటి వారికే ఒక హెచ్చరిక చేసింది. తాను ది హాలీడే వెబ్ సిరీస్ కోసం తయారు చేసుకున్న ఈ త్రివర్ణ హేర్స్టైల్ను వేరెవరూ ట్రై చేయరాదు. దీని కాపీరైట్స్ పూర్తిగా తనవే. అలా ఎవరైనా ఆ స్టైల్కు ప్రయత్నిస్తే కాపీరైట్స్ రుసుము చెల్లించాలి. కాదని ఎవరైనా ప్రయత్నిస్తే కేసు వేస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించింది. -
హిజ్రా పాత్రలో అదా శర్మ
నితిన్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన భామ ఆదాశర్మ. గ్లామర్తో ఆకట్టుకున్న అదాశర్మ అవకాశాలను అందిపుచ్చుకోవటంతో మాత్రం ఫెయిల్ అయ్యారు. క్షణం, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ సినిమాలో నటించినా.. ఆ సక్సెస్ కెరీర్కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. దీంతో బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన అదా శర్మ అక్కడ కూడా స్టార్ స్టేటస్ అందుకోలేకపోయారు. తాజాగా ఈ భామ ఓ చాలెంజింగ్ రోల్కు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. అబీర్ సేన్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ సినిమా ‘మేన్ టు మేన్’లో అదా హిజ్రా పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు హిజ్రా పాత్రల్లో మేల్ ఆర్టిస్ట్లు మాత్రమే కనిపించారు. తొలిసారిగా ఓ నటి హిజ్రా పాత్రలో నటిస్తుండటంతో ‘మేన్ టు మేన్’ సినిమా కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. -
నానితో స్పెషల్ సాంగ్లో..!
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న జెర్సీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. హర్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన అదాశర్మ తరువాత ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయింది. దీంతో బాలీవుడ్ బాట పట్టిన ఈ భామకు అక్కడ కూడా పెద్దగా కలిసి రాలేదు. దీంతో స్పెషల్ సాంగ్స్మీద దృష్టి పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. అందుకే నాని జెర్సీలో ప్రత్యేక గీతంలో కనిపించేందుక అదా శర్మ రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. -
చార్లీ చాప్లిన్2 సినిమా ఫొటో గ్యాలరీ
-
అదా సంగతి
‘గరుడవేగ’ వంటి హిట్ సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా నటించనున్న చిత్రం ‘కల్కి’. ‘అ!’ సినిమా ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్కి జోడీగా అదా శర్మ నటించనున్నారు. 2016లో విడుదలైన ‘క్షణం’ సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో కనిపించలేదు అదా. తాజాగా రాజశేఖర్తో నటించే చాన్స్ అందుకున్నారామె. నిజానికి హీరోయిన్ల లిస్టులో పలువురి పేర్లు వినిపించినా, ఫైనల్గా అదా శర్మను ఖరారు చేశారు. ఈ పాత్రకు ఆమె అయితే కరెక్టుగా సరిపోతారని చిత్రవర్గాలు భావించి, అదాను సంప్రదించగా వెంటనే గ్రీన్సిగ్నల్ ఇచ్చారట. సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మించనున్న ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథాంశంతో 1983 నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో నందితా శ్వేత ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా, బ్రిటిష్ మోడల్ స్కార్లెట్ విల్సన్ ప్రత్యేక పాటతో అలరించనున్నారు. నవంబర్ 9న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
బ్యాడ్ లక్
సిల్వర్ స్క్రీన్పై యాక్షన్ సన్నివేశాలను చూసి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ యాక్షన్ సీన్స్ వెనక ఆర్టిస్టుల కష్టం దాగి ఉంటుంది. టైమ్ బాగా లేకపోతే యాక్టర్స్కి గాయాలు తప్పవు. అలా అదా శర్మ టైమ్ బాగోలేదు. అందుకే ఆమె ‘కమాండో 3’ సెట్లో గాయపడ్డారు. కమాండో ఫ్రాంచైజీలో రూపొందుతున్న థర్డ్ పార్ట్ ఇది. ఇందులో విద్యుత్ జమాల్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లోని ఓ యాక్షన్ సీన్లో భాగంగా కార్ డోర్ క్లోజ్ చేయబోయే ప్రాసెస్లో అదా శర్మ గాయపడ్డారు. ఆమె చిటికెన వేలు చితికిపోయింది. ఈ విషయాన్ని అదా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘‘రెండు చేతులకు కలపి తొమ్మిది వేళ్లు ఉన్నా కూడా నన్ను లవ్ చేస్తారు కదూ. దేవుడి దయ వల్ల ఆ మిగిలిన వేలు కూడా ఇంకా నా బాడీలో భాగమై ఉంది’’ అని పేర్కొన్నారు అదా శర్మ. ‘‘నిజానికి అదా శర్మ గాయపడ్డప్పుడు చాలా రక్తం పోయింది. కానీ ఆమె వెంటనే హస్పిటల్కి వెళ్లకుండా లొకేషన్లోనే ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని షూట్లో పాల్గొన్నారు. అదాకి ఇలా గాయం కావడం బ్యాడ్లక్’’ అని టీమ్ పేర్కొంది. -
అందాల నటి.. గుర్తుపట్టలేనంతగా..!
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఓ హీరోయిన్ ఇప్పుడు రోడ్డు మీద కూరగాయలు అమ్ముతున్నారు. రోడ్డు పక్కన బాగా మాసి, చినిగిన చీరకట్టుకొని నిద్రలేమితో, అలసిపోయినట్టుగా కనిపిస్తూ అభిమానులకు షాక్ ఇచ్చారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఈ హీరోయిన్ మరెవరో కాదు.. తెలుగు తెరకు హర్ట్ ఎటాక్ సినిమాతో పరిచయం అయిన అదా శర్మయే ఈ కూరగాయలమ్మే అమ్మాయి. హర్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన అందాల భామ అదా శర్మ. తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి, గరమ్ లాంటి సినిమాల్లో కనిపించిన అదా.. హీరోయిన్గా స్టార్ ఇమేజ్ను మాత్రం అందుకోలేకపోయారు. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం సినిమా సక్సెస్ తో పాటు అదా శర్మకు నటిగా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. తరువాత టాలీవుడ్కు గుడ్ బై చెప్పేసి బాలీవుడ్ బాట పట్టారు. ఇటీవల ఎక్కువగా ఫొటోషూట్స్తోనే కాలం గడిపేస్తున్న ఈ బ్యూటీ త్వరలో ఓ హాలీవుడ్ సినిమాలో నటించనున్నారు. ఆ సినిమా కోసమే అదా ఈ డీగ్లామర్ లుక్లో ఫొటో షూట్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అదా కూరగాయలమ్ముతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
కిరి కిరి
పబ్లిసిటీ పరుగెత్తాలంటే ఏం చెయ్యాలి? పరుగెత్తే కార్లోంచి దూకి, పరుగున డాన్స్ చెయ్యాలి. ఎన్ని వంకర్లు తిరిగితే అన్ని షేర్లు. ఎన్ని టింకర పనులు చేస్తే అన్ని లైకులు. నలుగురికి సాయం చేసో.. పదిమందికి అన్నం పెట్టో.. ఒకరికి చదువు చెప్పో.. ఒక అన్యాయాన్ని ఎదిరించో..అబ్బో.. అంత వద్దులెండి. కనీసం ఒక ప్లకార్డునైనా పట్టుకున్నా సమాజానికి సేవ చేసినట్లు అవుతుంది కానీ.. ఈ కీకీ లేమిటి? కిరికిరిలేమిటి? అమాయకమైన ఓ యువకుడి ఫొటో.. దండ వెళ్లాడుతూ! కింద ‘ఇన్ లవింగ్ మెమరీ ఆఫ్ కేకే.. లవింగ్ బాయ్ఫ్రెండ్ టు కీకీ.. డైడ్ వైల్ డూయింగ్ ది షిగ్గి.. (ఫిబ్రవరి 1995 – జూలై 2018) (కేకే ప్రేమస్మృతిలో కీకీ ప్రియతముడు.. షిగ్గీని చేస్తుండగా దుర్మరణం)’ అని రాసి ఉంది. దానికో రైటప్.. ‘డోంట్ చాలెంజ్ డెత్. బీ వైజ్.. కీప్ అవే ఫ్రమ్ సిల్లీ స్టంట్స్ అండ్ అడ్వైజ్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్ టు స్టే సేఫ్.(మృత్యువును సవాల్ చెయ్యకండి. తెలివిగా ఉండండి. వెర్రి విన్యాసాలకు దూరంగా ఉండండి. క్షేమంగా ఉండమని మీ స్నేహితులకు కూడా చెప్పండి.) ఇన్అవర్ఫీలింగ్స్#కీకీకిల్స్#ఇన్మైఫీలింగ్స్#కీకీచాలెంజ్#జైపూర్పోలీస్#సేఫ్జైపూర్సోషల్ మీడియాలో జైపూర్ పోలీస్లు పెట్టిన పోస్ట్ ఇది. ఇప్పుడు సంచలనం రేపుతోంది.. కీకీ చాలెంజ్కు కౌంటర్గా! ఏంటీ కిరి కిరి?! అరే.. ఈ దేశం.. ఆ దేశమని కాదు.. ఏ దేశంలోనైనా.. ఈ కారు ఆ కారని కాదు.. నానో నుంచి మెర్సిడెజ్బెంజ్ దాకా.. నడుస్తున్న కారు లోంచి దూకి.. ‘కీకీ డు యు లవ్ మీ’ అంటూ పాటకు డ్యాన్స్ చేయడం.. స్మార్ట్ ఫోన్తో షూట్ చేసుకోవడం.. ఆ వీడియోలను మీ టూ అంటూ కీకీ చాలెంజ్కు ట్యాగ్ చేసుకోవడం! ఇదీ కీకీ హ్యాష్ట్యాగ్ చాలెంజ్ లేదా ఇన్మైఫీలింగ్స్ చాలెంజ్. ఇప్పుడు లోకమంతా పిచ్చిపట్టినట్లు అవుతోంది దీని కోసమే. సోషల్ మీడియాలో వైరల్గా అంతా అవే పోస్ట్లు. సగటు మనుషుల నుంచి సెలబ్రెటీల దాకా అందరూ పిచ్చిగా ఫాలో అవుతోంది దీన్నే. మొన్నటికి మొన్న రెజీనా కసాండ్రా, అమ్రపాలీ కాస్ట్యూమ్స్లో ఆదా శర్మ.. కదులుతున్న కార్లోంచి దూకి పాటకు స్టెప్పులేసి ఆ వీడియోను పోస్ట్ చేశారు. బాలీవుడ్ ఏమీ తక్కువ అడుగులేయలేదు. కరిష్మా శర్మ తన్మయత్వంతో చిందేసింది. నోరా ఫతేహి, వరుణ్ శర్మ (ఫక్రే ఫేమ్) తమ తిక్కను నడుస్తున్న ఆటోలోంచి దూకి చూపించుకున్నారు. టాలీవుడ్, బాలీవుడ్డే కాదు కోలీవుడ్, శాండల్వుడ్ సహా హాలీవుడ్తోపాటు పాప్ ప్రపంచానికీ ఈ కీకీ చాలెంజ్ వెర్రి పాకేసింది. పోలీసులకూ సవాలే లైఫ్ బిందాస్గా ఉండాలి. ఆడుతూపాడుతూ రోజు గడవాలి. ఎప్పుడూ కొత్తగా ఉండాలి. దానికోసం ఎలాంటి వెర్రినైనా తలకెక్కించుకుంటాం.. ఎంతటి పాగల్ పనికైనా తెగబడతామని జనాలు చాలెంజ్ చేస్తే ‘ఊరుకోం’ అంటూ, పట్టుకెళ్లి జైల్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు పోలీసులు. సందులు, వీధులు, కూడళ్లు, రోడ్లు, హైవేలు.. ఎక్కడైనా చాలెంజ్కి రెడీ అంటూ.. నడుస్తున్న కార్లలోంచి దూకి డ్యాన్స్ చేస్తూ వీడియో తీసుకోవడం ట్రాఫిక్కు అంతరాయంగా మారుతోంది. మరీ కొంతమందైతే రెడ్ సిగ్నల్స్ను కూడా లెక్కచేయట్లేదట. ఈ చాలెంజ్ ఆట పోలీసులకు ప్రాణసంకటంగా మారింది. ఈ స్టంట్స్ చేస్తున్నవాళ్లకే కాదు ఇతర వాహనదారులకూ ప్రమాదాలను తెచ్చిపెడ్తోంది. పీక్కి వెళ్లిన ఈ పిచ్చిని ఆపడానికి ముంబై, ఢిల్లీ, జైపూర్, బెంగళూరు, యూపీ పోలీసులు తమ స్టిక్స్కి స్ట్రిక్ట్గానే పనిచెప్పనున్నారట. ఎవరైనా అలా నడుస్తున్న వాహనాల్లోంచి దూకి గంతులు వేస్తే అరెస్ట్ ఖాయమని.. హెచ్చరికలూ జారీ చేశారు. నిఘా కెమెరాలూ పనిచేస్తున్నాయి. మన పోలీసులు కూడా పేపర్లలో, టీవీల్లో, ఎఫ్ఎమ్ రేడియోల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రెండువైపులా పదునైన వేదిక సోషల్ మీడియా.. ఉద్యమాలను (ఉదా : జాస్మిన్ విప్లవం) పుట్టించి ప్రభుత్వాలను ఉరుకులు పెట్టించగలదు.. ‘మీ టూ’ లాంటి హ్యాష్ట్యాగ్స్ను సృష్టించి మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించగలదు. ఐస్ బకెట్ చాలెంజ్తో జబ్బుల మీద (మోటర్ న్యూరోస్ డిసీజ్) అవగాహన తెప్పించగలదు.. రైస్ బకెట్తో సామాజిక బాధ్యతను గుర్తుచేయగలదు. దేనికైనా తీవ్రంగా రియాక్ట్ కాగలదు.. దేన్నయినా లైట్గా కొట్టిపారేయగలదు. సీరియస్ పాలసీలను ప్యాక్ చేసి దాచేయగలదు.. వినోదాన్ని పంచి పెద్దగా స్ప్రెడ్ చేయగలదు. అదీ సోషల్ మీడియా ఐడెంటిటీ! ‘కీకీ’ కూడా అదే డయాస్గా వైరల్ అయింది. ఎక్కడిదీ కిర్రాక్? కెనడా ర్యాప్ సింగర్ డ్రేక్ తెలుసు కదా? ఆయన పాడిందే ‘కీకీ డు యు లవ్ మీ’. ఆయన లేటెస్ట్ ఆల్బమ్ ‘స్కార్పియన్’లోని ‘ఇన్ మై ఫీలింగ్స్’తో సాగుతుందీ పాట. అయితే చాలెంజ్ విసిరింది మాత్రం డ్రేక్ కాదు. బౌన్స్ ట్రాక్లో చాలా హుషారుగా సాగే ఈ సాంగ్ ప్రముఖ ఇంటర్నెట్ కమెడియన్ షిగ్గీకి తెగ నచ్చింది. ఉన్నదాన్ని దేన్నయినా తన స్టయిల్లో పాపులర్ చేయడమే కదా షిగ్గీ పని. అందుకే వీధుల్లో.. ఈ పాటకు డ్యాన్ చేసి.. ఈ ఎంజాయ్మెంట్ను మీరూ చాలెంజింగ్గా తీసుకోండి అంటూ ఆ వీడియోను జూన్ 30 న సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. షిగ్గీ చాలెంజ్ హ్యాష్ట్యాగ్, డూ ది షిగ్గీ హ్యాష్ట్యాగ్తో. ఈ వీడియోలో ఎక్కడా ఏ వెహికిలూ లేదు. కాని కొన్ని రోజులకు ఓడెల్ బెక్హమ్ (ఎన్ఎఫ్ఎల్ స్టార్) ఈ చాలెంజ్ను కార్లోంచి(ఆగి ఉన్న కారే) దిగి చేశాడు. ఆ తర్వాత కొంత మంది కదులుతున్న కార్లోంచి దిగి చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి కీకీ చాలెంజ్ను కదులుతున్న కార్లోంచి దిగి చేయడం మొదలుపెట్టారంతా. అమెరికన్ యాక్టర్ విల్ స్మిత్ అయితే ఇంకాస్త ముందుకెళ్లి డ్రోన్ కెమెరాలను పెట్టుకొని బుడాపెస్ట్ బ్రిడ్జి మీద డ్యాన్స్ చేశాడు. జరిమానాలు..అరెస్ట్లు అలా ఈ వెర్రి వయా హ్యాష్ట్యాగ్ ఖండాలన్నిటికీ వ్యాపించింది. ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను తెచ్చిపెట్టింది. దాంతో అన్ని దేశాల పోలీసులు కన్నెర్ర చేయక తప్పలేదు. అబుదాబీలో కీకీ చాలెంజ్ కోసం రోడ్డు ఎక్కితే జైలు, జరిమానా రెండూ విధిస్తున్నారు. దుబాయ్లో రెండువేల దిరమ్స్ ఫైన్, 23 బ్లాక్ పాయింట్స్ పనిష్మెంట్. అంతేకాదు అరవై రోజుల పాటు ఆ వెహికిల్ జప్తులో ఉంటుంది. అమెరికాలో అయితే రిమాండ్కు తరలిస్తున్నారట. స్పెయిన్లో నడ్డి విరిగే చార్జీలు విధిస్తున్నారట. కొన్నాళ్ల కిందట మన దగ్గర కొలవెర్రి కూసింది. ఇప్పుడు కీకీ కేకేస్తోంది. ఎక్సయిట్మెంట్ ఉండాలి.. ఎంజాయ్మెంటూ కావాలి. అవి జీవితంలో ఉత్సాహం నింపాలి కాని లైఫ్ను కిర్రాక్ చేయొద్దు. కదులుతున్న కారు కాదు.. నేను కదలని కార్లోంచే దిగి కీకీ చాలెంజ్ చేశాను. షూటింగ్లో ఉన్నాను కాబట్టి.. గ్యాప్ దొరికినప్పుడు ఆ కాస్ట్యూమ్స్తోనే డ్యాన్స్ చేశానంతే. కదులుతున్న కారులోంచి దూకి చేయలేదు కాబట్టి నేను రూల్స్ని, లాని వయలేషన్ చేయలేదనే అనుకుంటున్నా. గవర్నమెంట్ విల్ బి వెరీ హ్యాపీ విత్ మి. – అదా శర్మ, నటి కీకీ జోలికెళ్లొద్దు కీకీ చాలెంజ్ ఫన్ కోసమే అయినా క్షేమం కాదు. ప్రాణాలతో చెలగాటమే. ట్రాఫిక్ రూల్స్కి విరుద్ధం కూడా. ఇలాంటి వాటి జోలికి వెళ్లొద్దు. – లావణ్య త్రిపాఠి చట్ట వ్యతిరేక చర్యే కీకీ చాలెంజ్ పేరుతో నడుస్తున్న కారులోంచి దూకి స్టెప్పులేస్తుండటం క్షణికానందాన్ని కలిగించినా మన దగ్గర వాళ్లకు మాత్రం కన్నీటి శోకాన్ని మిగులుస్తుంది. అలా డ్యాన్స్ చేయడం వల్ల కారు ప్రమాదానికి గురై ప్రాణాలు పోతాయి. కొన్ని సందర్భాల్లో వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొట్టడం వల్ల వారు కూడా ప్రమాదం బారిన పడే అవకాశముంది. దీనికితోడు ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ఇలా చేయడం కూడా చట్టవ్యతిరేక చర్యే. సిటీ పోలీసు యాక్ట్ సెక్షన్ 70(బీ), మోటారు వెహికల్ యాక్ట్ సెక్షన్ 184, 188ల కింద కేసు నమోదు చేస్తాం. – మహేశ్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్ జీవితాన్ని చాలెంజ్గా తీసుకోండి కదులుతున్న కార్లోంచి బయటకు దూకి రోడ్లపై డ్యాన్స్లు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ఇలాంటి చాలెంజ్లు అనుసరించే బదులు యువత జీవితాన్ని చాలెంజ్గా తీసుకొని ఎదిగేందుకు ప్రయత్నించాలి. ఇటువంటి వాటితో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ప్రాణాలు తీసుకోవద్దు. – వీసీ సజ్జనార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎవరిని ఉద్ధరించడానికి! ఎందుకు? ఎవరిని ఉద్ధరించడానికి ఈ చాలెంజ్? ఏదైనా పనికొచ్చేవి చేసినా ప్రయోజనముంటుంది. తెలంగాణ గవర్నమెంట్ చేపట్టిన గ్రీన్చాలెంజ్ తీసుకోండి.. దేశం పచ్చగానైనా మారుతుంది. గిఫ్ట్ ఎ హెల్మెట్తో ప్రమాదాలు తగ్గుతాయి. ట్రాఫిక్ రూల్స్ మీద అవేర్నెస్ పెరుగుతుంది. అంతేకాని ఈ పిచ్చి చాలెంజ్లేంటి? వీటిని అరికట్టాలి. – మంచు లక్ష్మి, నటి, ప్రొడ్యూసర్ – శరాది -
మళ్లీ పోలీసాఫీసర్
ఫైట్స్ చేయడానికి లండన్లోని గల్లీ గల్లీ గాలిస్తున్నారు విద్యుత్ జమాల్ అండ్ టీమ్. ప్లేస్ ఫిక్స్ చేసిన తర్వాత అక్కడికి ‘హార్ట్ఎటాక్’ గాళ్ అదా శర్మ వెళ్తారట. బీ టౌన్లో రెండేళ్ల క్రితం రిలీజైన యాక్షన్ చిత్రం ‘కమాండో 2’. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రూపొందనుంది. ‘కమాండ్ 2’లో నటించిన విద్యుత్ జమాల్, అదా శర్మనే థర్డ్ పార్ట్లోనూ లీడ్ రోల్స్ చేయనున్నారని సమాచారం.‘కరణ్జీత్ కౌర్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్’ టైటిల్తో సన్నీలియోన్ బయోపిక్ను వెబ్ సిరీస్గా తెరకెక్కించిన ఆదిత్యా దత్ ‘కమాండో 3’ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. విపుల్ షా నిర్మిస్తారు. ‘కమాండో 2’లో అదా శర్మ పోలీసాఫీసర్ పాత్రలో నటించారు. థర్డ్ పార్ట్లో కూడా అదే రోల్లో నటించనున్నారని బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్కు చాన్స్ ఉంది. ఆ రోల్ కోసం కొందరి కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నారట కమాండో టీమ్. అలాగే యాక్షన్ డోస్ను కూడా పెంచేలా స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నారు టీమ్. ప్రస్తుతం ప్రభుదేవా హీరోగా నటిస్తోన్న ‘చార్లీచాప్లిన్ 2’ చిత్రంలో అదా శర్మ ఒక కథానాయికగా నటిస్తున్నారు. నిక్కీగల్రానీ మరో కథానాయిక. -
హీరోయిన్ ఫిట్నెస్.. 8 ప్యాక్స్ ఉచితం..
నటి అదా శర్మ తన ఫిట్నెస్తో అందరినీ ఆశ్చపరిచారు. ఇటీవల ఓ మేగజైన్ కోసం ఆమె ఫొటో షూట్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. వాటికి నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. అంత అందమైన శరీరాకృతిని ఎలా సాధించారు? అంటూ ఆమెను పలువురు అడిగారు. ఇందుకు స్పందించిన అదా శుక్రవారం ఓ వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు. తాడుతో కసరత్తులు చేసిన ఆమె రాత్రంతా ఇలా వేలాడుతూ నిద్రపోతే 8 ప్యాక్స్ ఉచితంగా వస్తాయని చెప్పారు. అయితే, తాడును బ్యాలెన్స్ చేయాలంటే అందుకు తగ్గ శక్తి, స్థిరత్వం మన శరీరానికి ఉండాలని పేర్కొన్నారు. అంతేగాక ఆమె అభిమానలకు అంతర్జాతీయ మల్లకంభ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిమ్నాస్ట్లు స్తంభం లేదా తాడుని పట్టుకుని తలకిందులుగా వేలాడుతూ చేసే కసరత్తులను మల్లకంభ అంటారు. You have all been asking me how I got the bikini body...So here...All you have to do is sleep like this (all night 😋) and 8 pack abs free free free ! On a serious note balancing on the rope calls for a lot of stability and core strength Today is International Mallakhambh day! pic.twitter.com/ZT8bm1zWIZ — Adah Sharma (@adah_sharma) June 15, 2018 -
అవకాశాల కోసం పాట్లు
తమిళసినిమా: అవకాశాల కోసం అభినయాన్ని నమ్ముకుంటే లాభం లేదని ఈ తరం తారలు స్ట్రాంగ్గా భావిస్తున్నట్లు చెప్పవచ్చు. గ్లామరే చరణం అని వారు నమ్ముకుంటున్నారు. అందుకు రకరకాల ఫీట్లు చేస్తున్నారు. సోషల్మీడియాను బాగా వాడుకుంటున్నారు. నటి ఆదాశర్మ ఇప్పుడు ఇదే పనిలో పడింది. ఈ ముంబై బ్యూటీ కొన్ని హింది, తెలుగు చిత్రాల్లో నటించినా పెద్దగా క్రేజ్ను సంపాదించుకోలేకపోయింది. ఇక కోలీవుడ్లో శింబు నయనతార జంటగా నటించిన ఇదు నమ్మఆళు చిత్రంలో గెస్ట్గా మెరిసింది. ఆ చిత్రంతో అక్కడ పాగా వేయాలని ఆశ పడినా అది జరగలేదు. దీంతో ఎలాగైనా అవకాశాలు సంపాదించుకోవాలన్న ఆరాటంతో ఉన్న ఆదాశర్మ ఇటీవల గ్లామరస్ దుస్తులను ధరించి వివిధ భంగిమలతో కూడిన ఫొటోలను తీయించుకుంది. ఇందుకోసం లక్షల్లో ఖర్చు చేసిందట. సముద్ర తీరంలో టూపీస్ దుస్తులు ధరించి ఫొటోలను తీయించుకుంది. ఆమె ధరించిన దుస్తులను చూసిన ఆ పరిసర ప్రాంత ప్రజలు ఆశ్చర్యపోయారట. కొందరైతే అలానే కళ్లప్పగించి చూస్తుండిపోయారట. అలా సముద్రతీర ప్రాంతంలో, ఓడలో గ్లామరస్గా ఫొటోలను తీయించుకుని వాటిని తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసింది. దీంతో పాటు ఒక కామెంట్ను కూడా చేసింది. అదేంటంటే మీరూ నాలాగా టూపీస్ దుస్తులు ధరించి గ్లామర్గా కనిపించాలనుకుంటున్నారా? అందుకు మీరు చేయవలసింది రెండే విషయాలు. ఒకటి టూపీస్ ఈత దుస్తులు కొనుక్కోండి. రెండు వాటిని మీ అందమైన ఒంటికి ధరించండి అంతే అని ఆదాశర్మ చేసిన కామెంట్కు తెగ లైక్లు వచ్చేస్తున్నాయట. ఆమె గ్లామర్ ఫొటోలను చూసి అభిమానులు పరవశించిపోతున్నారట. అంతా బాగానే ఉంది వ్రతం చెడ్డా ఫలితం దక్కేనా అన్న సామెతలా ఈ అమ్మడికి అవకాశాలు దరిచేరేనా? అన్నది చూడాలి. -
అదా సంగతి
అదా శర్మ.. కాన్ఫిడెన్స్కి కజిన్ సిస్టర్లా ఉంటారు. అసలు ఆడపిల్ల అంటేనే.. కాన్ఫిడెన్స్ అని ఆమె అంటారు! ప్రస్తుతం అదా చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ఒక్కో మూవీలో ఒక్కో క్యారెక్టర్. క్యారెక్టర్కు తగ్గట్టు తనని తను మలుచుకోవడం ఎప్పటికప్పుడు కష్టమే అయినా... అనుకుంటే అయి తీరుతుందని అదా నమ్ముతారు. ఫిట్నెస్కు టాప్ ప్రయారిటీ ఇచ్చే ఆదా.. కొన్ని బ్యూటీ టిప్లు కూడా ఇస్తున్నారు. ఇవే కాదు.. ‘అదా! సంగతి’ అనిపించే విశేషాలెన్నింటినో మీరీ ఇంటర్వ్యూలో చదవొచ్చు. రెండేళ్ల క్రితం ‘క్షణం’లో కనిపించారు. ఆ తర్వాత గతేడాది హిందీ సినిమా ‘కమాండో 2’ చేశారు. సినిమాల లెక్క తగ్గించేశారేంటి? అదాశర్మ: ఇప్పుడు లెక్క ఎక్కువైంది. నా చేతిలో 5 సినిమాలున్నాయి. తమిళంలో ప్రభుదేవాతో ‘చార్లీ చాప్లిన్ 2’, హిందీలో ‘కమాండో 3’, మరో రెండు సినిమాలు, ఇంగ్లీష్లో ‘సోల్మేట్’ చేస్తున్నా. ఫుల్ బిజీ. ఈ లిస్ట్లో ఒక్క తెలుగు సినిమా కూడా లేదే? ఒకేసారి మూడు నాలుగు భాషల్లో సినిమాలంటే కష్టం. అందుకే తెలుగు సినిమా సైన్ చేయలేదు. బట్ హీరోయిన్గా ‘హార్ట్ ఎటాక్’తో బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్కి దూరం కావడం నాకిష్టం లేదు. ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్స్ కోసం ఎదురు చూస్తున్నా. హీరోయిన్స్ కెరీర్ త్వరగా ముగిసిపోతుంది కాబట్టి.. గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలని కొందరు అంటారు. మరి మీరు ఒక సంవత్సరం గ్యాప్ తీసుకోవడం తెలివైన నిర్ణయమే అంటారా? ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్నే తీసుకోండి. బాలీవుడ్ని చాలా కాలంగా రూల్ చేస్తున్నారు. పరిధిని మించి ఆలోచించలేని వాళ్లు, చీప్ మెంటాలిటీ ఉన్నవాళ్లే ఈ ఇయర్స్ కౌంటింగ్ గేమ్ ఆడతారు. ఇంకొంతమంది ఉంటారు. ఎవరిదైనా సినిమా ఫ్లాప్ అయితే ఆనందిస్తారు. ఎందుకంటే వాళ్ల జీవితాల్లో సంతోషం అనేది ఉండదు కాబట్టి ఇతరుల ఫెయిల్యూర్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలాంటి వారి ఆలోచనల వల్ల కానీ, పనుల వల్ల కానీ మనం ఎఫెక్ట్ అవ్వకూడదు. బాధపడకపోవడమే ఉత్తమం అని నా ఉద్దేశం. లాస్ట్ ఇయర్ నా సినిమాల రిలీజ్లు లేకపోయేసరికి గ్యాప్ తీసుకున్నా అనుకుంటున్నారు.. అంతే. మరి.. రేస్ సంగతేంటి? ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నీ చూస్తే ఎవ్వరితోనూ పోటీ పడుతున్నట్లు మీకు అనిపించదు. అలా ఎప్పుడూ చేయను కూడా. నా కెరీర్ను హారర్ మూవీ (హిందీ మూవీ ‘1920’)తో స్టార్ట్ చేశాను. జనరల్గా హారర్ మూవీతో హీరోయిన్ అవ్వాలని ఎవ్వరూ అనుకోరు. కానీ ఆ సినిమాలో నాకు యాక్టింగ్కి స్కోప్ ఉంది కాబట్టి అదేం పట్టించుకోలేదు. నేను కథక్ నేర్చుకున్నాను. డ్యాన్స్ చాలా ఈజీగా చేయగలుగుతాను. అయినప్పటికీ తెలుగులో నా ఫస్ట్ సినిమా ‘హార్ట్ ఎటాక్’లో డ్యాన్స్కి స్కోప్ లేకపోయినా యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేశాను. నేను ‘క్షణం’ సైన్ చేసినప్పుడు చాలామంది రాంగ్ డెసిషన్ అన్నారు. కానీ నా దృష్టిలో నటిగా నాలో మరో కోణం చూపించుకోవడానికి చాన్స్ ఉన్న సినిమా అది. ‘కమాండో’ అనే హిందీ సినిమాలో తెలుగు యాసలో మాట్లాడాను. ఇవన్నీ చూస్తే మీకే అర్థం అవుతుంది.. నేను కొత్త రకమైన పాత్రలు ఎంచుకుంటానని, ఎవ్వరితోనూ పోటీ పడనని. సౌత్లో అవకాశాలు సంపాదించుకోవడం ఈజీయా? నార్త్లోనా? సౌత్లోనే ఈజీ. మనం యాక్ట్ చేసిన సినిమా హిట్టయితే చాలు అవకాశాలు ఈజీగా వచ్చేస్తాయి. అయితే బాలీవుడ్లో అవకాశాలు ఎలా వస్తాయి? అనే విషయంలో నాకింకా క్లారిటీ లేదు. నాకు ఇక్కడ గాడ్ ఫాదర్ లేరు. అఫ్కోర్స్ సౌత్లోనూ లేరనుకోండి. అయినా నేను లక్కీయే. ఎందుకంటే సౌత్తో పోల్చితే నార్త్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నా నాకు అవకాశాలు వస్తున్నాయి. హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది. టిప్స్ చెబుతారా? ప్రతిరోజూ తలస్నానం చేస్తాను. మా అమ్మగారు వెనిగర్, బేకింగ్ సోడా కలిపి షాంపూ తయారు చేస్తారు. ఎక్కువసార్లు అదే వాడతాను. లేకపోతే కెమికల్స్ తక్కువగా ఉన్న న్యాచురల్ షాంపూ యూజ్ చేస్తాను. మోస్ట్లీ ‘వీగన్ షాంపూ’ని ప్రిఫర్ చేస్తాను. మీ స్కిన్ చాలా బాగుంటుంది. ఏం చేస్తారు? ప్రతిరోజూ వీలయినంత ఎక్కువగా నీళ్లు తాగుతాను. ఒత్తిడికి గురైనప్పుడు నా స్కిన్ డల్ అవుతుంది. అందుకే దేనికీ పెద్దగా స్ట్రెస్ అవ్వను. రాత్రి నిద్రపోయే ముందు కచ్చితంగా మేకప్ రిమూవ్ చేసేస్తాను. ‘హైడ్రేటింగ్ ఆల్మండ్ ఫేస్ ప్యాక్’ వాడతాను. నా స్కిన్కి అది బాగా సూట్ అవుతుంది. ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. కానీ మీరు రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట (తమిళంలో) సినిమా చేస్తున్నారు. మీ మాతృభాషలో లేట్గా చాన్స్ రావడం గురించి? నేను పక్కా తమిళమ్మాయిని. ముఖ్యంగా ఫుడ్ విషయంలో చాలా పర్టిక్యులర్. ఎక్కడికెళ్లినా సౌత్ ఇండియన్ ఫుడ్ ఉండాల్సిందే. అంత ప్రేమ ఉన్నప్పుడు మదర్ టంగ్లో సినిమా చేయాలని ఎందుకు ఉండదు. ఈ నాలుగేళ్లలో కొన్ని అవకాశాలు వచ్చినా అవి అంత పెద్దగా ఎగై్జట్ చేయలేదు. తమిళంలో లాంచ్ అవ్వడానికి ‘చార్లీ చాప్లిన్–2’ పర్ఫెక్ట్ మూవీ అవుతుందనిపించి ఒప్పుకున్నాను. ఇప్పుడు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ హాట్ టాపిక్. దీని గురించి మీరేమంటారు? క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటానికి ఏమీ లేదు. ఆ కౌచ్ మీద ఉండాలా? వద్దా? అన్నది పూర్తిగా పర్సనల్ చాయిస్. ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు మనం అంటున్న ఈ ‘క్యాస్టింగ్ కౌచ్’ చాలా చోట్ల ఉంది. పని కోసం ‘సెక్సువల్ ఫేవర్’ చేయడానికి కొందరు వెనకాడటంలేదు. ఇంతకుముందు అన్నట్లు అది వారి చాయిస్. కానీ ‘ఇలా చేసే తీరాలి’ అని ఎవరినీ ఒత్తిడి చేయకూడదు. పవర్ని ఉపయోగించి మహిళల్ని లైంగికంగా ఎక్స్ప్లాయిట్ చేయడం నిజంగా హారిబుల్. మీరలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైనా ఎదుర్కొన్నారా? నో. నేనెప్పుడూ ఆ కౌచ్లో లేను. ఏ హీరోయిన్ అయినా యాక్టింగ్ విషయంలో ప్రూవ్ చేసుకుంటేనే అవకాశాలు తెచ్చుకోగలుగుతారు. కానీ వాళ్ల కష్టం గురించి పట్టించుకోకుండా కొందరు ఈజీగా మాటలనేస్తారు. అదెలా ఉంటుంది? బాధగానే ఉంటుంది. అయితే ‘ఇగ్నోర్’ చేయడం నేర్చుకోకపోతే ఇబ్బందిపడతాం. ఒకవేళ ఎవరైనా విమర్శించినప్పుడు అందులో నిజం ఉంటే అప్పుడు నన్ను నేను మార్చుకుంటా. అంతేకానీ ఊరికే మాటలనేస్తే పట్టించుకోను. ఇంత పేరు వస్తున్నప్పుడు కొంత విమర్శలూ వస్తాయి. తట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్.. హీరోయిన్లకు కాస్ట్యూమ్స్పై ఉన్న దృష్టి నటనపై లేదని ఒక తమిళ డైరెక్టర్ అన్నప్పుడు కొందరు కథానాయికలు ఖండించారు. ఇలాంటి స్టేట్మెంట్స్ విన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఇతరుల ఆలోచనా విధానాన్ని మార్చే శక్తి మనకు లేదు. మనది ప్రజాస్వామ్య దేశం. ఆలోచనలను వ్యక్తపరచే హక్కు అందరికీ సమానంగా ఉంది. అంతెందుకు మీ థింకింగ్, నా థింకింగ్ వేరుగా ఉంటాయి. హీరోయిన్ల గురించి ఆ దర్శకుడి అభిప్రాయం అదై ఉండొచ్చు. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటాడు. వేరేవాళ్లకు మంచి అభిప్రాయం ఉండి ఉండొచ్చు. వాళ్లు మా గురించి బాగా మాట్లాడతారు కదా. రైట్ మాట్లాడినప్పుడు మామూలుగా ఉంటాం. రాంగ్ స్టేట్మెంట్కి బాధపడతాం. డైరెక్టర్ అనే కాదు.. హీరోయిన్లను కించపరచే విధంగా ఎవరు మాట్లాడినా నేను సపోర్ట్ చేయను. హీరోయిన్స్ పబ్లిక్లోకి వస్తే ఏదో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కామన్. కామన్ గర్ల్స్పై అత్యాచారాలు కూడా కామన్ అయిపోయాయి. ఇలాంటి దారు ణాల పట్ల మీ అభిప్రాయం? ఆ మధ్య పూనాలో. తర్వాత జమ్మూలో. దారు ణాలు ఆగడంలేదు. వీటి గురించి మాట్లాడటానికి నేను సరైన వ్యక్తిని కాదేమో. ఎందుకంటే ఓ సెలబ్రిటీగా నా చుట్టూ సెక్యూర్టీ ఉంటుంది కాబట్టి ఐ యామ్ సేఫ్. బస్సుల్లో, లోకల్ ట్రైన్స్లో ప్రయాణించే మహిళలను, బయట సమాజంలోని ఇతర స్త్రీలను ఈ విషయం అడిగితే బాగుంటుంది. మహిళలపై అఘాయిత్యాలు తగ్గాలంటే అబ్బాయిల ప్రవర్తనలో మార్పు రావాలి. అందుకు పేరెంట్స్ బాధ్యత తీసుకుని వారిలో నైతిక విలువలను పెంపొందించాలి. మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో చెప్పాలి. అప్పుడే కొంతైనా ఈ సమస్యకు ఓ పరిష్కార మార్గం దొరుకుతుందని నా ఫీలింగ్. బరువు ఎలా పెరుగుతారు.. ఎలా తగ్గిస్తారు? ఆ సీక్రెట్ చెబుతారా? బరువు పెరగడం అంటే ఫుల్లుగా తినడమే. తగ్గాలంటే మాత్రం చిప్స్, జంక్ ఫుడ్కి దూరంగా ఉండాల్సిందే. వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకున్నప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను. నిజానికి నా శరీరం చాలా తొందరగా బరువు కోల్పోతుంది. తగ్గడానికి రన్నింగ్, వాకింగ్ చేసిన సందర్భాలు అరుదు. ‘క్షణం’లో పదహారేళ్ల కాలేజ్ అమ్మాయిలా నటించాల్సి వచ్చింది. ఫేస్ కొంచెం చబ్బీగా ఉండాలని, ఫిజిక్ మాత్రం స్లిమ్గానే ఉండాలనీ అన్నారు. అలానే చేశా. ‘కమాండో 2’కి వచ్చేసరికి ముఖం పెద్దగా కనిపించి, బాడీ థిన్గా ఉండాలన్నారు. అలానే వర్కవుట్ చేశా. ఒక ఆర్టిస్టుగా ఇలా ట్రాన్స్ఫామ్ కావడం నాకు హ్యాపీగా ఉంటుంది. క్యారెక్టర్ ఎలా డిమాండ్ చేస్తే అలా ఫిజిక్ని మార్చుకోవడానికి రెడీ అయిపోతారా? నా ఫస్ట్ మూవీ ‘1920’లోని క్యారెక్టరైజేషన్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ సినిమా ఫస్ట్ హాఫ్లో ఆ కాలంనాటి మహిళలా కనిపించడానికి ఇబ్బందిపడ్డాను. సెకండ్ హాఫ్ కోసం ఏకంగా 10 కేజీల బరువు తగ్గాను. లాస్ట్ ఇయర్ చేసిన హిందీ సినిమా ‘కమాండో 2’కి అంత ఇబ్బంది పడలేదు. నార్మల్ ఫిట్నెస్ మెయిన్టైన్ చేశాను. అయితే ఆ సినిమాలో నా ఫస్ట్ సీన్లో మూడు పేజీల డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. యాక్సెంట్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ‘దంగల్’లో ఆమీర్ ఖాన్కు, ‘తను వెడ్స్ మను’లో కంగనా రనౌత్లకు యాక్సెంట్ ట్రైనర్గా చేసిన సునీతగారే నాకూ ట్రైనింగ్ ఇచ్చారు. ఫిజికల్గా, యాక్సెంట్వైజ్గా, మెంటల్గా.. ఒక క్యారెక్టర్ వీటిలో ఏది డిమాండ్ చేసినా అది చేయడానికి నేను రెడీ. సెక్యూర్టీ విషయంలో కేర్ఫుల్గా ఉంటారా? నేనెక్కడికి వెళ్లినా పది మంది చుట్టూ ఉంటారు. కారు ఎక్కడానికి వెళ్లినా ఐదుగురు చుట్టూ ఉండేలా ప్లాన్ చేసుకుంటా. షాపింగ్ మాల్స్కు వెళ్లినప్పుడు బౌన్సర్ల సహాయం ఉంటుంది. నా వరకు నేను సేఫ్గానే ఉన్నాను. ఫైనల్లీ ఎలాంటి స్త్రీలను చూసి ఇన్స్పైర్ అవుతారు. మీరెలా ఉండాలనుకుంటారు? కాన్ఫిడెంట్గా ఉండే ఆడవాళ్లంటే చాలా ఇష్టం. అలాంటివాళ్లు ఇతరులకు ఇన్స్పిరేషన్గా నిలుస్తారు. నా మటుకు నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను. ‘అమ్మాయి’ అంటే ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్తో ఉండాలని కొందరు భావిస్తారు. అలా ఉంటే మన జీవితానికి మనమే చేటు చేసుకున్నవాళ్లం అవుతాం. అందుకే ‘బీ కాన్ఫిడెంట్’. – డి.జి. భవాని