Ambati Rayudu
-
ఓపెనర్లగా కాన్వే, రవీంద్ర.. సీఎస్కే ప్లేయింగ్ ఎలెవన్ ఇదే?
ఐపీఎల్-2025 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అన్ని విధాల సిద్దమవుతోంది. చెపాక్లోని చిదంబరం స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో సీఎస్కే ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత సీజన్లో గ్రూపు స్టేజికే పరిమితమైన సీఎస్కే.. ఈ ఏడాది సీజన్లో మాత్రం అదరగొట్టాలన్న పట్టుదలతో ఉంది.రికార్డు స్ధాయిలో ఆరో ఐపీఎల్ ట్రోఫీపై మెన్ ఇన్ ఎల్లో కన్నేసింది. అందుకోసం సీఎస్కే తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఈ ఏడాది సీజన్ కోసం సామ్ కుర్రాన్, డెవాన్ కాన్వే, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్టార్ ఆటగాళ్లు సీఎస్కే జట్టులోకి వచ్చారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, శివమ్ దూబే, ధోని వంటి ఆటగాళ్లతో సీఎస్కే బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కన్పిస్తోంది. బౌలింగ్లోనూ పతిరానా, నాథన్ ఈల్లీస్, నూర్ ఆహ్మద్ వంటి యువ సంచలనాలతో సీఎస్కే బలంగా ఉంది. ఈ ఏడాది సీజన్లో సీఎస్కే తమ తొలి మ్యాచ్లో మార్చి 23న చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఈ క్రమంలో సీఎస్కే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ను ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు అంచనా వేశాడు.సీఎస్కే ఇన్నింగ్స్ను రుతురాజ్ గైక్వాడ్తో పాటు డెవాన్ కాన్వే ప్రారంభించాలని రాయుడు అభిప్రాయపడ్డాడు. కాగా గత సీజన్లో గైక్వాడ్కు ఓపెనింగ్ భాగస్వామిగా రచిన్ రవీంద్ర వచ్చాడు. కానీ గత సీజన్లో రవీంద్ర తన మార్క్ చూపించలేకపోయాడు. ఈ క్రమంలోనే రవీంద్రను మూడో స్దానంలో బ్యాటింగ్కు పంపించాలని రాయుడు సూచించాడు. అదేవిధంగా నాలుగో స్ధానం కోసం దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ మధ్య పోటీ ఉంటుందని ఈ భారత మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ఇక ఆల్రౌండర్ల కోటాలో శివమ్ దూబే, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజాలకు అంబటి చోటు ఇచ్చాడు. ఫాస్ట్ బౌలర్లగా మతీషా పతిరాన, అన్షుల్ కాంబోజ్.. స్పెషలిస్టు స్పిన్నర్గా అశ్విన్కు తుది జట్టులో అతడు అవకాశమిచ్చాడు. కాగా ఐపీఎల్-18 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఈడెన్గార్డెన్స్ వేదికగా కేకేఆర్-ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి.రాయుడు ఎంపిక చేసిన సీఎస్కే ప్లేయింగ్ ఎలెవన్ ఇదే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా/రాహుల్ త్రిపాఠి/విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, సామ్ కర్రాన్, మతీషా పతిరణ, అన్షుల్ కాంబోజ్బెంచ్: ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, షేక్ రషీద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, శ్రేయాస్ గోపాల్, వంశ్ బేడి, ఆండ్రీ సిద్ధార్థ్, జామీ ఓవర్టన్చదవండి: IPL 2025: చరిత్రకు అడుగు దూరంలో రహానే.. -
RCB ఫ్యాన్స్ ను కెలికిన రాయుడు
-
హోలీ వేళ క్రికెట్ గాడ్ సచిన్ హంగామా.. వైరల్ వీడియో
హోలీ పండుగ వేళ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ సంబురాలు అంబరాన్నంటాయి. సందర్భం ఏదైనా రిజర్వ్డ్గా కనిపించే సచిన్.. ఈసారి హోలీ ఉత్సవాల్లో చెలరేగిపోయాడు. చిన్నపిల్లాడిలా మారి సహచరులను రంగులతో ముంచెత్తాడు. సచిన్.. సహచర క్రికెటర్లు యువరాజ్ సింగ్, అంబటి రాయుడు, ఇర్ఫాన్ పఠాన్ను రంగులతో ముంచెత్తిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో సచిన్ రంగులతో నింపిన వాటర్ గన్తో యువీ, రాయుడు, ఇర్ఫాన్లపై దాడి చేశాడు.Sachin Tendulkar, Yuvraj Singh and Yusuf Pathan celebrating Holi. 😂👌 pic.twitter.com/PYEaMoNbHV— Mufaddal Vohra (@mufaddal_vohra) March 14, 2025కాగా, సచిన్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో బిజీగా ఉన్నాడు. యువరాజ్, ఇర్ఫాన్, రాయుడు కూడా ఈ టోర్నీలో భారత మాస్టర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ టోర్నీలో భారత జట్టుకు సచిన్ సారథ్యం వహిస్తున్నాడు. తొలిసారి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో భారత్ ఫైనల్కు చేరింది. నిన్న జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాను 94 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సచిన్ (42), యువరాజ్ (59), స్టువర్ట్ బిన్నీ (36) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇన్నింగ్స్లో చివర్లో పఠాన్ సోదరులు కూడా చెలరేగిపోయారు. ఇర్ఫాన్ 10 బంతుల్లో 23, యూసఫ్ 7 బంతుల్లో 19 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో సచిన్కు జతగా ఓపెనర్గా వచ్చిన అంబటి రాయుడు 5, పవన్ నేగి 14, గురుకీరత్ సింగ్ 1 పరుగు చేశారు. ఆసీస్ బౌలర్లలో డేనియల్ క్రిస్టియన్, దోహర్తి చెరో 2 వికెట్లు పడగొట్టగా.. హిల్ఫెన్హాస్, స్టీవ్ ఓకీఫీ, కౌల్టర్ నైల్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. భారత బౌలర్ షాబాజ్ నదీమ్ (4-1-15-4) విజృంభించడంతో 18.1 ఓవర్లలో 126 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్లలో షాబాజ్తో పాటు వినయ్ కుమార్ (2-0-10-2), ఇర్ఫాన్ పఠాన్ (3.1-0-31-2), స్టువర్ట్ బిన్నీ (3-0-20-1), పవన్ నేగి (3-0-13-1) కూడా రాణించారు. ఆసీస్ ఇన్నింగ్స్లో బెన్ కట్టింగ్ (39) టాప్ స్కోరర్గా నిలువగా.. షాన్ మార్ష్ (21), బెన్ డంక్ (21), నాథన్ రియర్డాన్ (21), దోహర్తి (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ టోర్నీలో మూడు సెంచరీలు చేసి భీకర ఫామ్లో ఉన్న ఆసీస్ కెప్టెన్ షేన్ వాట్సన్ (5) ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు. డేనియల్ క్రిస్టియన్ 2, కౌల్టర్ నైల్ 0, హిల్ఫెన్హాస్ 2, ఓకీఫీ 0, మెక్గెయిన్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య ఇవాళ (మార్చి 14) జరిగే రెండో సెమీఫైనల్లో విజేతతో భారత్ ఫైనల్లో తలపడుతుంది. ఫైనల్ మ్యాచ్ మార్చి 16న జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ దేశాలకు చెందిన దిగ్గజ క్రికెటర్లు పాల్గొనగా.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్కు చేరుకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. -
ఆర్సీబీని అవహేళన చేసిన రాయుడు.. మాజీ కోచ్ స్పందన ఇదే
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu)కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుRCB) మాజీ కోచ్ సంజయ్ బంగర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ప్రతిసారీ ఆర్సీబీని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని.. తాను ఇలాంటివి సహించలేనని పేర్కొన్నాడు. కాగా అంబటి రాయుడు గతంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చెన్నై, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై టైటిళ్లు గెలిచిన సందర్భాల్లో అతడు జట్టులో ఉన్నాడు. రికార్డుల రారాజు ఉన్న జట్టుఇక ఐపీఎల్లో ఏకంగా ఐదుసార్లు చాంపియన్లుగా నిలిచిన ఈ రెండు జట్లకు ఉన్నంత స్థాయిలో ఆర్సీబీకి కూడా క్రేజ్ ఉంది. ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినా బెంగళూరు ఫ్యాన్బేస్ రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదనడంలో సందేహం లేదు.ఇందుకు ప్రధాన కారణం రికార్డుల రారాజు, టీమిండియా ముఖచిత్రం విరాట్ కోహ్లి మొదటి నుంచి ఆ జట్టులో భాగం కావడమే! అయితే, రాయుడు మాత్రం అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆర్సీబీని కించపరిచే విధంగా మాట్లాడతాడనే అభిప్రాయం ఉంది. ఇటీవల ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ఆర్సీబీ ఏదో ఒకరోజు ట్రోఫీ గెలుస్తుందని.. అయితే, ఆ సమయం ఎప్పుడూ రాకూడదని తాను ఎల్లప్పుడూ ప్రార్థిస్తానని వ్యాఖ్యానించాడు.అన్ని జట్లకూ సాధ్యం కాదుఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ వేళ కామెంట్రీ చేస్తున్న సమయంలోనూ అంబటి రాయుడు మరోసారి ఆర్సీబీని అవహేళన చేశాడు. ఈ ఫ్రాంఛైజీ గురించి మాజీ కోచ్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. ‘‘గత నాలుగైదేళ్లుగా జట్టు నిలకడైన ప్రదర్శన కనబరుస్తోంది. నాలుగు సందర్భాల్లో ప్లే ఆఫ్స్ చేరింది.గతేడాది వరుసగా ఏడు మ్యాచ్లు ఓడిన తర్వాత కూడా టాప్-4లో అడుగుపెట్టగలిగింది. వరుస పరాజయాల తర్వాత ఇలా తిరిగి పుంజుకోవడం అన్ని జట్లకూ సాధ్యం కాదు. కాబట్టి త్వరలోనే వాళ్లు ప్రతి అవాంతరాన్ని అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఇది తప్పుఇందుకు అంబటి రాయుడు బదులిస్తూ.. ‘‘నిజమే.. సంజయ్ భాయ్.. వచ్చేసారి ఆర్సీబీ అవాంతరాలు దాటుతుంది. క్వాలిఫయర్ 2 వరకైనా వెళ్తుంది’’ అని నవ్వాడు. ఇందుకు స్పందనగా.. ‘‘ఇది చాలా తప్పు. మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. నేను ఇలాంటివి సహించలేను. ఆర్సీబీ అభిమానులు మిమ్మల్ని చూస్తున్నారు’’ అంటూ నవ్వుతూనే రాయుడు వ్యాఖ్యల్ని బంగర్ తప్పుబట్టాడు.ఇందుకు రాయుడు.. ‘‘చూస్తే చూడనివ్వండి’’ అంటూ మరోసారి ఆర్సీబీని అపహాస్యం చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో బెంగళూరు ఫ్రాంఛైజీ ఫ్యాన్స్ రాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూర్ఖత్వంతను హైలైట్ అయ్యేందుకు ప్రతిసారీ ఆర్సీబీని తక్కువ చేసి చూపుతున్నాడని.. ఆ జట్టుకు ఉన్న క్రేజ్లో వీసమైంత గుర్తింపు అయిన దక్కించుకోవాలని భలే ఆరాటపడుతున్నాడని సెటైర్లు వేస్తున్నారు.ఒక జట్టును పదే పదే కించపరచడం ద్వారా తన స్థాయి పెరుగుతుందని భావిస్తున్నాడని.. అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదంటూ రాయుడుకు చురకలు అంటిస్తున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీల పట్ల రాయుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. నీదే పబ్లిసిటీ స్టంట్కాగా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్లో టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు చిరంజీవి, సుకుమార్ తదితరులు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, వారిని ఉద్దేశించి.. టీవీల్లో కనిపించాలని ఇలాంటి వారు ఇక్కడికి వస్తారంటూ రాయుడు వ్యాఖ్యానించాడు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని పేర్కొన్నాడు. దీంతో అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ ఇప్పుడదే మాటను రాయుడు ఆపాదించడం గమనార్హం.చదవండి: 'ప్రపంచ క్రికెట్ని భారత్ శాసిస్తుంది’ -
యువీ స్పిన్ మ్యాజిక్.. రాయుడు మెరుపులు! సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్
ఇంటర్నేషనల్ మాస్టర్స్ టీ20 లీగ్ టోర్నీలో ఇండియా మాస్టర్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం వడోదర వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. భారత బౌలర్లు చెలరేగడంతో 13.5 ఓవర్లలో కేవలం 85 పరుగులకే ఆలౌటైంది.భారత బౌలర్లలో స్పిన్నర్ రాహుల్ శర్మ, దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ మూడు వికెట్లతో సత్తాచాటారు. రాహుల్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇవ్వగా.. యువీ రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 12 పరుగులు ఇచ్చాడు. వీరిద్దరితో పాటు నేగీ, బిన్నీ తలా రెండు వికెట్లు సాధించారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో హెన్రీ డేవిడ్స్(38) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారురాయుడు ఆజేయంగా..అనంతరం 86 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 11 ఓవర్లలోనే ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అంబటి రాయుడు(34 బంతుల్లో 7 ఫోర్లతో 41) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. అతడితో పాటు పవన్ నేగి(21 నాటౌట్) రాణించాడు. అయితే భారత కెప్టెన్ సచిన్ టెండూల్కర్ మాత్రం ఈ మ్యాచ్లో తన మార్క్ను చూపించలేకపోయాడు. సచిన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక మూడు వికెట్లతో సత్తాచాటిన రాహుల్ శర్మకు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్లో మార్చి 5న వడోదర వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది.చదవండి: Champions Trophy: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి.. -
భారత్-పాక్ మ్యాచ్లో టాలీవుడ్ సినీతారలు.. అంబటి రాయుడు వివాదాస్పద కామెంట్స్!
భారత్- పాక్ మ్యాచ్ అంటే చాలు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ప్రతి బాల్కు నరాలు తెగే ఉత్కంఠగా ఉంటుంది. భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటారు. అంతలా క్రేజ్ ఉన్న మ్యాచ్ ప్రపంచ క్రికెట్లో పాక్- ఇండియా పోరు మాత్రమే. ఇలాంటి మ్యాచ్ను లైవ్లో చూడాలని ఎవరూ కోరుకోరు. ఆ అదృష్టం రావాలే కానీ ఎంతైనా సరే టికెట్ కొని మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాంటి ప్రాముఖ్యత ఉన్న ఇలాంటి మ్యాచ్కు మన టాలీవుడ్ సినీతారలు పెద్దఎత్తున హాజరయ్యారు. దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్కు హాజరైన వారిలో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ సుకుమార్ కూడా ఉన్నారు.అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కెమెరాలు మన సినీ తారలను హైలెట్ చేస్తూ టీవీల్లో చూపించారు. మన డైరెక్టర్ సుకుమార్ను సైతం కెమెరాల్లో చాలాసేపు చూపించారు. తెలుగు సినిమా ప్రైడ్ డైరెక్టర్ సుకుమార్ అని కామెంట్రీ చెబుతున్న వ్యక్తి అన్నాడు. ఇలాంటి మ్యాచ్లు సప్లై తక్కువ.. డిమాండ్ ఎక్కువ అని వ్యాఖ్యనించాడు.కానీ ఇదే సమయంలో అక్కడే తెలుగు కామెంట్రీ బాక్స్లో ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మాత్రం వివాదాస్పద రీతిలో మాట్లాడారు. సప్లై కాదు.. ఇలాంటి మ్యాచ్ అంటే టీవీల్లో ఎక్కువగా కనిపిస్తారు కదా.. ఇతర మ్యాచ్ల్లో కనిపించడం చాలా తక్కువ.. పబ్లిసిటీ స్టంట్ అది..' అంటూ అంబటి రాయుడు మాట్లాడారు. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అంబటి రాయుడిపై పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అంబటి రాయుడిపై మండిపడుతున్నారు. మన తెలుగు సినిమా గొప్ప దర్శకుడిని అలా ఎలా అంటారని అంబటిని ప్రశ్నిస్తున్నారు. పబ్లిసిటీ స్టంట్ అంటూ హేళన చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. Chiranjeevi , Sukumar cricket match ki vellatam oka Publicity Stunt :- Ambati Rayudu @KChiruTweets @SukumarWritings pic.twitter.com/ztbCgHBJES— Songs Lover (@Songs_Lover_) February 23, 2025 -
అంబటి రాయుడు అంటే విరాట్ కోహ్లికి నచ్చేది కాదు.. రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై సంచలన ఆరోపణలు చేశాడు. టీమిండియా మాజీ ఆటగాడు, ఆంధ్ర ప్లేయర్ అంబటి రాయుడు అంటే విరాట్ కోహ్లికి నచ్చేది కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ కారణంగానే రాయుడు 2019 వన్డే వరల్డ్కప్ జట్టు నుంచి చివరి నిమిషంలో తప్పించబడ్డాడని అన్నాడు. వరల్డ్కప్కు సంబంధించిన కిట్బ్యాగ్లు, బట్టలు, సూట్లు రాయుడు ఇంటికి చేరాయని, ఆతర్వాత కోహ్లి జోక్యం చేసుకోవడంతో రాయుడుకు వరల్డ్కప్ బెర్త్ దక్కలేదని బాంబు పేల్చాడు.కోహ్లికి ఎవరైనా నచ్చకపోతే జట్టులో చోటు దక్కేది కాదని అన్నాడు. టీమిండియా కెప్టెన్గా కోహ్లి తీసుకున్న నిర్ణయాలను ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూ సందర్భంగా ఎండగట్టాడు. అంబటి రాయుడు విషయంలో కోహ్లి చాలా అన్యాయంగా ప్రవర్తించాడని దుయ్యబట్టాడు. రాయుడుకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని వాపోయాడు. రాయుడు వరల్డ్కప్ జట్టులో ఉంటానని ఎన్నో కలలు కన్నాడని, అలాంటి వ్యక్తికి చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. కాగా, 2019 వన్డే వరల్డ్కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో అంబటి రాయుడును కాదని చివరి నిమిషంలో తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. విజయ్ శంకర్ త్రీడి ప్లేయర్ అని.. అందుకే రాయుడు స్థానంలో అతన్ని ఎంపిక చేశామని అప్పటి చీఫ్ సెలెక్టర్, తెలుగువాడు ఎంఎస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. దీనిపై రాయుడు త్రీడి అద్దాలు పెట్టుకుని బహిరంగంగా తన అసంతృప్తికి వెల్లగక్కాడు.కోహ్లితో పోలిస్తే రోహిత్ గ్రేట్ లీడర్రాబిన్ ఉతప్ప కోహ్లి కెప్టెన్సీని రోహిత్ శర్మ కెప్టెన్సీతో కంపేర్ చేశాడు. కెప్టెన్గా నిర్ణయాలు తీసుకున్న తర్వాత వాటిని అమలు చేయడంలో కోహ్లికి రోహిత్ శర్మకు చాలా తేడా ఉందని అన్నాడు.రాయుడుకు జరిగినట్టే 2024 టీ20 వరల్డ్కప్ ఫైనల్కు ముందు సంజూ శాంసన్కు జరిగిందని గుర్తు చేశాడు. అయితే ఆ సందర్భంలో రోహిత్ సంజూ శాంసన్ దగ్గరికి వెళ్లి అతన్ని ఎందుకు పక్కకు పెట్టాల్సి వచ్చిందో స్పష్టంగా వివరించాడని తెలిపాడు. రోహిత్ సర్ది చెప్పాక శాంసన్ ఆ విషయాన్ని పెద్దగా పట్టంచుకోలేదని పేర్కొన్నాడు. ఇలాంటి విషయాలను హ్యాండిల్ చేయడంలో కోహ్లితో పోలిస్తే రోహిత్ చాలా బెటర్ అని కొనియాడాడు.కాగా, 2024 వరల్డ్కప్ ఫైనల్లో సంజూ శాంసన్ ఆడాల్సి ఉండిది. అయితే చివరి నిమిషంలో శాంసన్ స్థానంలో శివమ్ దూబే తుది జట్టులోకి వచ్చాడు. ఫైనల్ మ్యాచ్ టాస్ తర్వాత రోహిత్ శాంసన్ దగ్గరికి పర్సనల్గా వెళ్లి అతన్ని ఎందుకు పక్కకు పెట్టాల్సి వచ్చిందో వివరించాడు. రోహిత్ వివరణ తర్వాత శాంసన్ కామ్ అయిపోయాడు. ఈ విషయంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.యువరాజ్ సింగ్ కెరీర్ ముగియడానికి కూడా కోహ్లినే కారణం..!రాయుడు విషయాన్ని ప్రస్తావించడానికి ముందు ఉతప్ప కోహ్లికి వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు చేశాడు. సిక్సర్ల వీరుడు, వన్డే, టీ20 వరల్డ్కప్ విన్నర్ యువరాజ్ సింగ్ కెరీర్ అర్దంతరంగా ముగిసిపోవడానికి కూడా కోహ్లినే కారణమని అన్నాడు. క్యాన్సర్పై విజయం సాధించిన అనంతరం యువరాజ్ కోహ్లి కోరుకున్నట్లు ఫిట్నెస్ సాధించలేకపోయాడని.. ఈ కారణంగానే కోహ్లి యువరాజ్కు మెల్లమెల్లగా చెక్ పెట్టాడని వ్యాఖ్యానించాడు. -
అంబటి రాయుడిని అప్పట్లో నెక్ట్స్ సచిన్ అన్నారు: హీరో శ్రీ విష్ణు
చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. కానీ తెలుగు హీరో శ్రీ విష్ణు మాత్రం క్రికెటర్ కాబోయి హీరో అయినట్లు ఉన్నాడు. గతంలో ఓసారి చెప్పాడు. ఇప్పుడు మరోసారి తన క్రికెట్ కెరీర్ గురించి బయటపెట్టాడు. అదే టైంలో అంబటి రాయుడు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: నాలుగో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి.. డేట్ ఫిక్స్)అతిథి పాత్రలతో కెరీర్ మొదలుపెట్టిన శ్రీ విష్ణు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ పలు చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు హీరోగా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. ఇతడు నాలుగు పాత్రల్లో నటించిన 'స్వాగ్' మూవీ అక్టోబరు 4న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ఓ పాడ్ కాస్ట్లో తన క్రికెట్ జర్నీ గురించి రివీల్ చేశాడు.తాను ఆంధ్రా జట్టు తరఫున అండర్-19 క్రికెట్ ఆడానని, తన టైంలో అంబటి రాయుడు.. హైదరాబాద్ తరఫున ఆడేవాడని, అప్పట్లో అతడిని నెక్స్ట్ సచిన్ అని పిలిచేవారని శ్రీ విష్ణు చెప్పుకొచ్చాడు. నిజ జీవితంలో క్రికెటర్ కానప్పటికీ 'అప్పట్లో ఒకడుండేవాడు' అనే మూవీలో మాత్రం శ్రీ విష్ణు క్రికెటర్గా నటించాడు. రాయుడు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్) View this post on Instagram A post shared by Permit Room (@thepermitroommedia) -
IND VS PAK: రాయుడు, యూసఫ్ విధ్వంసం.. పాక్ చిత్తు! టోర్నీ విజేతగా భారత్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ విజేతగా ఇండియా ఛాంపియన్స్ నిలిచింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ టైటిల్ను ముద్దాడింది.ఈ ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో షోయబ్ మాలిక్(41) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.అతడితో పాటు కమ్రాన్ ఆక్మల్(24), మసూద్(21) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అనురీత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. వినయ్ కుమార్, నేగి, ఇర్ఫాన్ పఠాన్ తలా వికెట్ సాధించారు.రాయుడు ఫిప్టీ.. యూసఫ్ విధ్వంసంఅనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఛాంపియన్స్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ ఓపెనర్ అంబటి రాయుడు మెరుపు హాఫ్ సెంచరీతో మెరిశాడు.30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు చేసి 50 పరుగులు చేసి రాయుడు ఔటయ్యాడు. ఆఖరిలో యూసఫ్ పఠాన్(16 బంతుల్లో 30 పరుగులు, 1 ఫోర్, 3 సిక్స్లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో యమీన్ రెండు వికెట్లు పడగొట్టగా.. షోయబ్ మాలిక్,అఫ్రిది, రియాజ్ తలా వికెట్ సాధించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అంబటి రాయుడు నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు యూసఫ్ పఠాన్కు వరించింది. -
ఆరెంజ్ క్యాప్ తో ఐపీఎల్ ట్రోఫీని గెలవలేరు.. కోహ్లిపై రాయుడు ఫైర్!?
ఐపీఎల్-2024 ఛాంపియన్స్గా కోల్కతా నైట్రైడర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం చెపాక్ వేదికగా జరిగిన ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తు చేసి కేకేఆర్ ముచ్చటగా మూడో సారి టైటిల్ను ఎగరేసుకుపోయింది. అయితే కేకేఆర్ విజయం అనంతరం మాట్లాడిన టీమిండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు.. సంబంధం లేకుండా ఆర్సీబీ ప్రస్తావన తీసుకువచ్చాడు. అంతేకాకుండా ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లిని రాయుడు మరోసారి టార్గెట్ చేశాడు. ఆరెంజ్ క్యాప్లతో టైటిల్ గెలవలేమని, సమష్టి ప్రదర్శనలే ఛాంపియన్గా నిలబెడుతాయని పరోక్షంగా కోహ్లిపై రాయుడు విమర్శలు గుప్పించాడు. కాగా ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్లో నిష్క్రమించినప్పటకి.. ఆ జట్టు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి తన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన విరాట్.. 61.75 సగటుతో 741 పరుగులు చేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా విరాట్ నిలిచాడు.ఛాంపియన్స్గా నిలిచిన కేకేఆర్కు కంగ్రాట్స్. సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్ వంటి దిగ్గజ ఆటగాళ్లకు ఆ జట్టు అండగా నిలిచింది. ఈ దిగ్గజాలు జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించేలా సపోర్ట్ చేసింది.ఐపీఎల్లో ఓ జట్టు గెలుపొందాలంటే సమిష్టి కృషి అవసరం. అంతే తప్ప ఆరెంజ్ క్యాప్లతో టైటిల్ గెలవలేం. జట్టులోని చాలా మంది ఆటగాళ్లు 300 లేదా 400 పరుగులు చేస్తేనే జట్టు విజయం సాధ్యమవుతోందని"జియో సినిమా షోలో రాయుడు పేర్కొన్నాడు. కాగా విరాట్పై రాయుడు విమర్శల గుప్పించం ఇదేమి తొలిసారి కాదు. ఎలిమేనిటర్లో ఆర్సీబీ ఓడిపోయిన తర్వాత కూడా విరాట్ను పరోక్షంగా ఉద్దేశించి రాయుడు ఓ పోస్ట్ చేశాడు. జట్టు ప్రయోజనాల కంటే వ్యక్తిగత మైలురాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం టీమ్కు మంచిది కాదుంటా రాయుడు ఎక్స్లో రాసుకొచ్చాడు. -
SRH vs RR: ‘సన్రైజర్స్ కాదు!.. రాజస్తాన్కే గెలిచే ఛాన్స్’
ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ రాయల్స్.. ఆ తర్వాత చతికిల పడింది. వరుస ఓటములతో విమర్శలు మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికే పరిమితమైంది.ఈ క్రమంలో అమీ తుమీ తేల్చుకోవాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్లోనూ రాజస్తాన్ గెలిచే అవకాశాల్లేవంటూ విశ్లేషకులు పెదవి విరిచారు. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ స్వదేశానికి వెళ్లిపోవడం.. యశస్వి జైస్వాల్ స్థాయికి తగ్గట్లు రాణించకపోవడం.. బౌలింగ్ విభాగంలోనూ లోపాలు అంటూ రాజస్తాన్ను విమర్శించారు.ఆర్సీబీని చిత్తుచేసి.. క్వాలిఫయర్-2లోఇక సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం ఆర్సీబీ- రాజస్తాన్ వార్ వన్సైడ్ అంటూ బెంగళూరు జట్టుకు మద్దతు పలికారు. ఈ క్రమంలో రాజస్తాన్ ఆర్సీబీకి ఊహించని షాకిచ్చింది. అహ్మదాబాద్లో బుధవారం నాటి మ్యాచ్లో బెంగళూరును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.ఫైనల్ రేసులో నిలిచే క్రమంలో చెన్నై వేదికగా శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.రాజస్తాన్ రాయల్స్ ఫేవరెట్సన్రైజర్స్- రాజస్తాన్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఫేవరెట్గా కనిపిస్తోంది. వాళ్లు ఇక్కడిదాకా చేరుకున్న తీరు అద్బుతం.చెన్నై పిచ్ పరిస్థితులు కూడా రాజస్తాన్ స్పిన్నర్లకు బాగా నప్పుతాయి. కాబట్టి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసేటపుడు ఆటగాళ్లు తమ మెదళ్లను బాగా ఉపయోగించాలి.అది హైదరాబాద్ వికెట్ కాదు. చెన్నైలో మీరు వికెట్లు తీయలేరు. అందుకే బ్యాటింగ్పై దృష్టి సారించాలి. నిజానికి చెన్నై పిచ్ మీద పరుగులు రాబట్టాలంటే కచ్చితంగా ఆచితూచి ఆడుతూ బ్యాట్స్మన్షిప్ చూపాలి’’ అని అంబటి రాయుడు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఫైర్అయితే, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ రాయుడు వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారు. సన్రైజర్స్ ఆటగాళ్లను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని మండిపడుతున్నారు. రాజస్తాన్ మాదిరే సన్రైజర్స్ కూడా ఆది నుంచి దూకుడుగా ఆడుతూ ఇక్కడిదాకా వచ్చిందని పేర్కొంటున్నారు.హైదరాబాద్ జట్టులోనూ షాబాజ్ అహ్మద్, మయాంక్ మార్కండే, విజయకాంత్ వియస్కాంత్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్నర్లు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అనుభవం లేకపోయినా మొమెంటమ్ తీసుకురావడంలో వీళ్లు సఫలమవుతారంటూ అంబటి రాయుడుకి కౌంటర్లు వేస్తున్నారు. కాగా రాజస్తాన్ రాయల్స్ జట్టులో చెన్నై దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్తో పాటు యజువేంద్ర చహల్ రూపంలో ఇద్దరు మేటి స్పిన్నర్లు ఉన్న విషయం తెలిసిందే.చదవండి: Hardik Pandya: భార్యతో హార్దిక్ పాండ్యాకు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్ వైరల్ -
MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను ఉద్దేశించి ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కే సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని పట్ల వారి అభిమానం తనకు, రవీంద్ర జడేజాకు చిరాకు తెప్పించేందన్నాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై ఒకటి. దీనికి ముఖ్య కారణం టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అనడంలో అతిశయోక్తి లేదు. ఎంతో మంది యువ ఆటగాళ్లు అతడి సారథ్యంలో మెరికల్లా తయారై జాతీయ జట్ల తరఫున అదరగొడుతున్నారు.ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో జట్టుపై నిషేధం పడినా.. తిరిగి సీఎస్కేను నిలబెట్టిన ఘనత ధోని సొంతం. రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్) తర్వాత రికార్డు స్థాయిలో ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన కెప్టెన్గా ధోని మాత్రమే నిలవగలిగాడు.తదుపరి తన వారసుడిగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగిస్తే.. ఒత్తిడి తట్టుకోలేక 2022 మధ్యలోనే బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో 42 ఏళ్ల ధోని 2023లో టైటిల్ సాధించిన తర్వాత.. ఈ ఏడాది రుతురాజ్ గైక్వాడ్కు తన బాధ్యతలను బదిలీ చేశాడు.ఇక చాలా ఏళ్లుగా సీఎస్కే ముఖచిత్రమైన మిస్టర్ కూల్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తలా అని ముద్దుగా పిలుచుకునే తమ నాయకుడిని చూసేందుకు కేవలం చెన్నై ఫ్యాన్స్ మాత్రమే కాదు.. దేశంలో ఎక్కడున్నా అతడి అభిమానులు మ్యాచ్ చూసేందుకు మైదానానికి పోటెత్తుతారు.ఈ క్రమంలో అతడు త్వరగా బ్యాటింగ్కు రావాలంటూ కోరుకునే అభిమానులు బ్యాటింగ్ ఆర్డర్లో ముందున్న జడ్డూ లాంటి వాళ్లు త్వరగా అవుట్ కావాలంటూ గతంలో ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో జడ్డూ వాళ్లపై అసహనం వ్యక్తం చేస్తూ విరుచుకుపడ్డాడు. దీంతో ఫ్యాన్స్ సైతం అతడికి ధీటుగానే బదులిచ్చారు.ఈ నేపథ్యంలో అంబటి రాయుడు తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. "మనం సిక్స్, ఫోర్ కొట్టినా ప్రేక్షకులు సైలెంట్గా ఉంటారు. జడేజాకు, నాకు ఈ విషయం విసుగు తెప్పించేది.నిజానికి సీఎస్కే ఫ్యాన్స్ ముందు జట్టుకు అభిమానులు కాదు.. వాళ్లు కేవలం ధోని అభిమానులు మాత్రమే. అందుకే జడ్డూకు కూడా చిరాకు వచ్చేది. కానీ అతడు మాత్రం ఏం చేయగలడు అని వ్యాఖ్యానించాడు. కాగా 2018 నుంచి 2023 వరకు సీఎస్కే ఆడిన అంబటి రాయుడు గతేడాది ఐపీఎల్కు వీడ్కోలు పలికాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో సీఎస్కే పదమూడింట ఏడు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. -
టీ20 వరల్డ్కప్కు భారత జట్టు ఇదే .. ఆ ముగ్గరు స్టార్ క్రికెటర్లకు నో ఛాన్స్?
టీ20 వరల్డ్కప్-2024లకు అమెరికా, వెస్టిండీస్లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్1న అమెరికా, కెనడా మధ్య జరగనున్న తొలి మ్యాచ్తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే ఈ టోర్నీలో భాగమయ్యే ఆయా జట్లు తమ వివరాలను మే1లోపు ఐసీసీకి సమర్పించాలి. ఈ క్రమంలో భారత జట్టును మరో వారం రోజుల్లో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది.ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపికను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. ఈ సెలక్షన్ మీటింగ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గోనున్నాడు. అయితే సెలక్టర్లు కంటే ముందు చాలా మంది మాజీ ఆటగాళ్లు టీ20 వరల్డ్కప్లో భాగమయ్యే భారత జట్టును అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి భారత మాజీ బ్యాటర్ అంబటి రాయుడు చేరాడు.టీ20 ప్రపంచకప్కు తన 15 మంది ప్రాబబుల్స్ని రాయుడు ఎంచుకున్నాడు. రాయుడు ఎంచుకున్న జట్టులో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు. హార్దిక్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్కప్ జట్టులో అతడి స్ధానం ప్రశ్నార్థకంగా మారింది.అదేవిధంగా ఐపీఎల్లో అదరగొడుతున్న పేస్ సంచలనం మయాంక్ యాదవ్.. రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్లకు రాయడు తన ఎంపిక చేసిన జట్టులో ఛాన్స్ ఇచ్చాడు. అయితే అనుహ్యంగా రాయుడు వికెట్ కీపర్ కోటాలో రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, సంజూ శాంసన్లను కాకుండా దినేష్ కార్తీక్కు చోటు ఇవ్వడం గమనార్హం.దినేష్ కార్తీక్ ఈ ఏడాది సీజన్లో దుమ్ములేపుతున్నాడు. ఫినిషర్గా వచ్చి డీకే అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే రాయుడు కార్తీక్కు అవకాశమిచ్చాడు. అంబటి ఎంచుకున్న జట్టులో టాప్-4లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి,సూర్యకుమార్లకు చోటు దక్కింది. ఆల్రౌండర్ కోటాలో శివమ్ దూబే, రవీంద్ర జడేజాలకు రాయుడు అవకాశమిచ్చాడు. ఫాస్ట్ బౌలర్లగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్లకు చోటు దక్కింది. స్పెషలిస్టు స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ను రాయుడు ఎంపిక చేశాడు. #IncredibleStarcast expert @RayuduAmbati has picked 15 ambitious players for his #TeamIndia squad ahead of #T20WorldCup2024 & there's only one all-rounder, @imjadeja! 👀Participate in the biggest opinion poll ever on our social media handles (23rd April-1st May) and see if you… pic.twitter.com/1PB3TwATc8— Star Sports (@StarSportsIndia) April 24, 2024 -
LSG VS CSK: గెలిచినప్పుడు ధోనిని పొగిడి, ఓడితే రుతురాజ్ను నిందిస్తారా..?
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సీఎస్కేతో నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సీఎస్కే నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో మూడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. స్టోయినిస్ అజేయమైన మెరుపు శతకంతో (63 బంతుల్లో 124 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) లక్నోను విజయతీరాలకు చేర్చాడు. స్టోయినిస్కు పూరన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ హుడా (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సహకరించారు. గెలిస్తే ధోని ఓడితే రుతురాజా..?మ్యాచ్ అనంతరం జరిగిన డిబేట్లో నవ్జ్యోత్ సింగ్ సిద్దూ, అంబటి రాయుడు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సీఎస్కే ఓటమికి రుతురాజ్ చెత్త కెప్టెన్సీ కారణమని రాయుడు అంటే.. గెలిచినప్పుడు ధోని పేరు చెప్పి ఓడినప్పుడు రుతురాజ్ నిందించడం సమంజసం కాదని సిద్దూ అభిప్రాయపడ్డాడు. Ambati Rayudu - Poor field placements in deaths overs by Ruturaj. We clearly saw lack of experience as captainN. Sidhu - If you credit Dhoni for CSK wins then blame him for the losses too. Dhoni is still the main think tank#LSGvsCSK #CSKvLSG #CSKvsLSG pic.twitter.com/R4VnEwWUKY— Richard Kettleborough (@RichKettle07) April 24, 2024 తొలుత రాయుడు మాట్లాడుతూ.. డెత్ ఓవర్లలో రుతురాజ్ ఫీల్డింగ్ను మొహరించడంలో విఫలమయ్యాడు. కెప్టెన్గా అతని అనుభవ రాహిత్యం స్పష్టంగా బయటపడింది. స్టోయినిస్ విధ్వంసకర మూడ్లో ఉన్నప్పుడు రుతురాజ్ సిల్లీ ఫీల్డ్ సెటప్ చేసి అతను మరింత రెచ్చిపోయేలా చేశాడని అన్నాడు.ఇందుకు సిద్దూ కౌంటరిస్తూ.. సీఎస్కే గెలిచినప్పుడు ధోనికి క్రెడిట్ ఇచ్చి, ఓడినప్పుడు రుతురాజ్ను నిందించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. గెలిచినప్పుడు ధోనిని పొగిడిన నోళ్లు ఓడినప్పుడు కూడా అతన్నే నిందించాలని అన్నాడు. సీఎస్కే కెప్టెన్సీని ధోనినే ఇంకా మోస్తున్నాడన్న విషయం బహిరంగ సత్యమని తెలిపాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రుతురాజ్ గైక్వాడ్ మెరుపు సెంచరీతో (60 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. రుతురాజ్ మెరుపులకు శివమ్ దూబే (27 బంతుల్లో 66; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం తోడు కావడంతో సీఎస్కే భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. తొలి ఓవర్లోనే డికాక్ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే స్టోయినిస్.. పూరన్, హుడా సహకారంతో లక్నోకు అపురూప విజయాన్ని అందించాడు. చివరి ఓవర్లో లక్నో గెలుపుకు 17 పరుగులు అవసరం కాగా.. మస్తాఫిజుర్ బౌలింగ్లో ప్టోయినిస్ వరుసగా 6, 4, 4, 4 పరగులు సాధించాడు. ఫలితంగా లక్నో ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. -
టీ20 వరల్డ్కప్ జట్టులో దినేష్ కార్తీక్..? అతడికి అంత సీన్ లేదు!
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్, భారత వెటరన్ దినేష్ కార్తీక్ అదరగొడుతున్నాడు. లేటు వయస్సులో ఖతర్నాక్ ఇన్నింగ్స్లతో కార్తీక్ దుమ్మలేపుతున్నాడు. ఆఖరిలో బ్యాటింగ్కు వచ్చి మెరుపులు మెరిపిస్తున్నాడు. గత సీజన్లో నిరాశపరిచిన కార్తీక్ ..ప్రస్తుత సీజన్లో మాత్రం పూర్తి భిన్నంగా కన్పిస్తున్నాడు. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కార్తీక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో డీకే అద్బుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఓ దశలో మ్యాచ్ను ఫినిష్ చేసేలా కన్పించిన కార్తీక్.. ఆఖరికి నటరాజన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. దినేష్ కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్స్లతో 83 పరుగులు చేశాడు. ఓవరాల్గా ఈ ఏడాది సీజన్లో 7 మ్యాచ్లు ఆడిన కార్తీక్ 226 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కార్తీక్కు టీ20 వరల్డ్కప్ 2024 భారత జట్టులో చోటు ఇవ్వాలని చాలా మంది మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలోకి భారత మాజీ క్రికెటర్ అంబటి రాయడు చేరాడు. డీకేను టీ20 వరల్డ్కప్లో ఆడించాలని రాయడు అన్నాడు. "కార్తీక్ తన కెరీర్లో ఎక్కువగా ఎంఎస్ ధోనితో పోటీపడ్డాడు. ధోని కెప్టెన్గా, రెగ్యూలర్ వికెట్ కీపర్గా జట్టులో ఉండడంతో కార్తీకు పెద్దగా ఆడే అవకాశాలు రాలేదు. అయితే డీకే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అతడికి తన కెరీర్లో చివరిసారిగా వరల్డ్కప్లో ఆడే అవకాశం దక్కుతుందని నేను భావిస్తున్నానను. అతడికి ఛాన్స్ ఇస్తే టీమిండియాకు మ్యాచ్ విన్నర్గా మారే అవకాశముంది. అంతేకాకుండా భారత్కు వరల్డ్కప్ను అందించి, తన కెరీర్ను ఘనంగా ముగించిడానికి కార్తీక్కు కూడా ఇది మంచి అవకాశం. కాబట్టి డికేనే వరల్డ్కప్కు ఎంపిక చేయాలని సెలక్టర్లను కోరుతున్నానని" రాయడు స్టార్స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. ఇక ఇదే షోలో పాల్గోన్న భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. రాయడు అభిప్రాయాన్ని వ్యతిరేకించాడు. పఠాన్ నవ్వుతూ ఐపీఎల్ వేరు, వరల్డ్కప్ వేరు అంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా వరల్డ్కప్ వంటి టోర్నీల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండదని, కచ్చితంగా తీవ్రమైన ఒత్తడి ఉంటుందని పఠాన్ చెప్పుకొచ్చాడు. -
IPL 2024: ఆర్సీబీ లాంటి జట్లు ఎప్పటికీ ట్రోఫీ గెలవలేవు!
"This is why they have not won the IPL for so many years": రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘స్టార్ల’ వైఫల్యం కారణంగానే ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదని వ్యాఖ్యానించాడు. కోట్లకు కోట్లు తీసుకునే అగ్ర శ్రేణి అంతర్జాతీయ క్రికెటర్లు మైదానంలో కంటే డ్రెసింగ్ రూంలోనే ఎక్కువగా ఉండటం వల్లే ఆర్సీబీ రాత మారడం లేదని రాయుడు అభిప్రాయపడ్డాడు. కాగా 2008 నుంచి బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్ డుపెస్లిస్, మహ్మద్ సిరాజ్ వంటి టాప్ క్లాస్ ఆటగాళ్లు ఉన్నా ఆర్సీబీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. తాజాగా ఐపీఎల్-2024లోనూ పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 28 రన్స్తో ఓడి మూడో ఓటమిని చవిచూసింది. బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యం కారణంగా సొంత మైదానంలో పరాభవం మూటగట్టుకుంది. A win at home followed by a win away from home for the Lucknow Super Giants! 👏👏 They move to number 4⃣ on the Points Table! Scorecard ▶️ https://t.co/ZZ42YW8tPz#TATAIPL | #RCBvLSG pic.twitter.com/uc8rWveRim — IndianPremierLeague (@IPL) April 2, 2024 స్టార్లు ఒక్కసారైనా రాణించారా? ఈ నేపథ్యంలో అంబటి రాయుడు మాట్లాడుతూ.. ‘‘ వాళ్ల బౌలర్లు ఎల్లప్పుడూ అత్యధికంగా పరుగులు సమర్పించుకుంటూనే ఉంటారు. ఇక బ్యాటర్లేమో స్థాయికి తగ్గట్లు ఆడరు. ఆర్సీబీ కష్టాల్లో ఉన్న సమయంలో.. మేటి బ్యాటర్గా పేరున్న ఒక్క ఆటగాడు కూడా రాణించడం ఇంత వరకు చూడలేదు. అలాంటి జట్లు ఎప్పటికీ టైటిల్ గెలవలేవు. అందుకే ఇన్నేళ్లుగా ఆర్సీబీ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ సాధించలేకపోయింది. బిగ్ ప్లేయర్లంతా టాపార్డర్లో ఉంటారు. కేక్ తినగా మిగిలిన క్రీమ్ను వదిలేసినట్లు డౌన్ ఆర్డర్లో ఉన్న యువ ఆటగాళ్లపై భారం వేస్తారు. ఒత్తిడిలో యువ ఆటగాళ్లతో పాటు దినేశ్ కార్తిక్ మాత్రమే ఆడటం చూస్తున్నాం. పదహారేళ్లుగా ఆర్సీబీ కథ ఇదే ఒత్తిడిలో మరింత మెరుగ్గా రాణించాల్సిన ఆర్సీబీలోని అగ్ర శ్రేణి అంతర్జాతీయ ప్లేయర్లు ఎప్పుడు బాధ్యత తీసుకున్నారు? వాళ్లంతా ఎక్కువగా డ్రెసింగ్ రూంలోనే ఉంటారు. ఈ ఒక్కరోజు మాత్రమే ఇలా జరగలేదు. పదహారేళ్లు ఆర్సీబీ కథ ఇదే’’ అని అంబటి రాయుడు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు.. కోహ్లి, మాక్స్ వెల్, డుప్లెసిస్, కామెరాన్ గ్రీన్ వంటి ఆటగాళ్లను ఉద్దేశించే రాయుడు ఇలా అని ఉంటాడని భావిస్తున్నారు. ఆ అదృష్టం అందరికీ ఉండదు బ్రో! అయితే, ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం రాయుడు అభిప్రాయంతో విభేదిస్తున్నారు. ఒక్కోసారి అదృష్టం కలిసి వస్తే కూడా ఆరుసార్లు టైటిల్ గెలిచిన జట్లలో భాగమయ్యే ఛాన్స్ ఉందని రాయుడును ఉద్దేశించి సెటైర్లు వేస్తున్నారు. కాగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన అంబటి రాయుడు ఆ జట్లు ట్రోఫీలు గెలిచిన సందర్భాల్లో(మూడేసి సార్లు) జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. గతేడాది సీజన్ తర్వాత ఐపీఎల్కు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: రూ.11 కోట్లు టైమ్కి తీసుకుంటాడు.. అతడికేమో 17 కోట్లు! మరి ఆట? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
#Dhoni: బ్యాడ్న్యూస్.. ఈ ఇన్నింగ్స్ తర్వాత ఇక అంతే!
IPL 2024 CSK vs DC: విశాఖపట్నంలో అద్భుత బ్యాటింగ్తో అసలైన టీ20 మజాను అందించాడు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో తనదైన శైలిలో షాట్లు బాదుతూ ప్రేక్షకులకు కనువిందు చేశాడు. నలభై రెండేళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటూ ఐపీఎల్-2024లో బ్యాటింగ్ వచ్చిన తొలిసారే తన పవరేంటో చూపించాడు. ముఖ్యంగా ఒంటిచేత్తో ధోని బాదిన షాట్ అతడి ఇన్నింగ్స్కే కాదు మ్యాచ్లోనూ హైలెట్గా నిలిచిందనడంలో సందేహం లేదు.అయితే.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి ఇంత చేసినా ధోని సీఎస్కేను గెలిపించకపోవడం అభిమానులను కాస్త నిరాశ పరిచింది. కానీ.. తదుపరి మ్యాచ్ నుంచి ధోని బ్యాటింగ్ మెరుపులు చూసే అవకాశం తప్పక వస్తుందనే నమ్మకం కుదిరిందని సంతోషిస్తున్నారు. అయితే, మాజీ క్రికెటర్, సీఎస్కు ఆడిన అంబటి రాయుడు మాత్రం ఇప్పుడే అంతగా సంబరపడిపోవద్దని అంటున్నారు. ఇకపై బ్యాటింగ్ ఆర్డర్లో ధోని ముందు వచ్చే ఛాన్స్ ఉందా ప్రశ్నకు బదులిస్తూ ఈమేరకు వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత అతడు కచ్చితంగా బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రాడు.ఎందుకంటే.. లోయర్ ఆర్డర్లో వచ్చి సీఎస్కేను గెలిపించగల సత్తా ఉన్న ధోని ఆత్మవిశ్వాసం ఈ ఇన్నింగ్స్తో మరింత పెరిగిందని చెప్పవచ్చు. నిజానికి.. ధోని ఇంకాస్త ముందుగానే బ్యాటింగ్కు వస్తే చూడాలనుకునే మనలాంటి వాళ్ల ఆశలకు ఇక గండిపడినట్లే’’ అని అంబటి రాయుడు పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో కామెంటేటర్గా ఉన్న రాయుడు స్టార్ స్పోర్ట్స్ షోలో.. ఇలా తన అభిప్రాయం పంచుకున్నాడు.కాగా ఐపీఎల్-2024 సందర్భంగా కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించిన వికెట్ కీపర్ బ్యాటర్ ధోని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో సీఎస్కే ఆడిన మూడు మ్యాచ్లలో రెండు గెలిచింది. ధోని .. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. -
#Dhoni: బ్యాడ్న్యూస్.. ఈ ఇన్నింగ్స్ తర్వాత ఇక అంతే!
IPL 2024 CSK vs DC: విశాఖపట్నంలో అద్భుత బ్యాటింగ్తో అసలైన టీ20 మజాను అందించాడు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో తనదైన శైలిలో షాట్లు బాదుతూ ప్రేక్షకులకు కనువిందు చేశాడు. నలభై రెండేళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటూ ఐపీఎల్-2024లో బ్యాటింగ్ వచ్చిన తొలిసారే తన పవరేంటో చూపించాడు. ముఖ్యంగా ఒంటిచేత్తో ధోని బాదిన షాట్ అతడి ఇన్నింగ్స్కే కాదు మ్యాచ్లోనూ హైలెట్గా నిలిచిందనడంలో సందేహం లేదు. అయితే.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి ఇంత చేసినా ధోని సీఎస్కేను గెలిపించకపోవడం అభిమానులను కాస్త నిరాశ పరిచింది. కానీ.. తదుపరి మ్యాచ్ నుంచి ధోని బ్యాటింగ్ మెరుపులు చూసే అవకాశం తప్పక వస్తుందనే నమ్మకం కుదిరిందని సంతోషిస్తున్నారు. అయితే, మాజీ క్రికెటర్, సీఎస్కు ఆడిన అంబటి రాయుడు మాత్రం ఇప్పుడే అంతగా సంబరపడిపోవద్దని అంటున్నారు. ఇకపై బ్యాటింగ్ ఆర్డర్లో ధోని ముందు వచ్చే ఛాన్స్ ఉందా ప్రశ్నకు బదులిస్తూ ఈమేరకు వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత అతడు కచ్చితంగా బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రాడు. ఎందుకంటే.. లోయర్ ఆర్డర్లో వచ్చి సీఎస్కేను గెలిపించగల సత్తా ఉన్న ధోని ఆత్మవిశ్వాసం ఈ ఇన్నింగ్స్తో మరింత పెరిగిందని చెప్పవచ్చు. నిజానికి.. ధోని ఇంకాస్త ముందుగానే బ్యాటింగ్కు వస్తే చూడాలనుకునే మనలాంటి వాళ్ల ఆశలకు ఇక గండిపడినట్లే’’ అని అంబటి రాయుడు పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో కామెంటేటర్గా ఉన్న రాయుడు స్టార్ స్పోర్ట్స్ షోలో.. ఇలా తన అభిప్రాయం పంచుకున్నాడు. కాగా ఐపీఎల్-2024 సందర్భంగా కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించిన వికెట్ కీపర్ బ్యాటర్ ధోని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో సీఎస్కే ఆడిన మూడు మ్యాచ్లలో రెండు గెలిచింది. ధోని .. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. There is nothing beyond Thala's reach 🔥💪 #IPLonJioCinema #Dhoni #TATAIPL #DCvCSK pic.twitter.com/SpDWksFDLO — JioCinema (@JioCinema) March 31, 2024 -
IPL 2024: రోహిత్ శర్మను సీఎస్కే కెప్టెన్గా చూడాలని ఉంది..!
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తన మాజీ కెప్టెన్ (ముంబై ఇండియన్స్) రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాయుడు రోహిత్పై తన మనసులో దాగి వున్న విషయాలను బహిర్గతం చేశాడు. తన మరో కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైరయ్యాక రోహిత్ సీఎస్కే సారథ్య బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించాడు. ఇదే సందర్భంగా రాయుడు రోహిత్పై ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్కు మరో ఐదారేళ్లు ఐపీఎల్ ఆడగల సత్తా ఉందని ఆకాశానికెత్తాడు. ధోని తర్వాత రోహిత్ సీఎస్కే సారథ్య బాధ్యతలు చేపడితే చూడాలని ఉందని అన్నాడు. రోహిత్ కావాలనుకుంటే విశ్వవ్యాప్తంగా జరిగే ఏ లీగ్లోనైనా కెప్టెన్సీ చేపట్టగలడని తెలిపాడు. రోహిత్ గడిచిన పదేళ్లలో ముంబై ఇండియన్స్ను అద్భుతంగా ముందుండి నడిపించాడని కితాబునిచ్చాడు. రోహిత్ మరో సీజన్ పాటు ముంబై ఇండియన్స్ కెప్టెన్గా కొనసాగాల్సి ఉండిందని అన్నాడు. రోహిత్ విషయంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం తొందరపడిందేమోనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రోహిత్ ఇంకా టీమిండియా కెప్టెన్గా కొనసాగుతున్నాడన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఎంఐ యాజమాన్యం కెప్టెన్గా హార్దిక్ ట్రాక్ రికార్డును పరిగణలోకి తీసుకుని ఉంటుందని తెలిపాడు. గుజరాత్ పరిస్థితులతో పోలిస్తే ముంబై ఇండియన్స్ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని.. ముంబై ఇండియన్స్కు ముందుండి నడిపించడం ఆషామాషీ విషయం కాదని పరోక్షంగా తన మద్దతు రోహిత్ శర్మకు తెలిపాడు. అంతిమంగా కెప్టెన్సీ చేపట్టాలా వద్దా అన్నది రోహిత్ వ్యక్తిగతమని అభిప్రాయపడ్డాడు. అంబటి రాయుడు.. రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్కు.. ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడాడు. ఈ తెలుగు క్రికెటర్ గతేడాదే ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా, 36 ఏళ్ల రోహిత్ శర్మ 2013-2020 మధ్యలో ముంబై ఇండియన్స్ను ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిపాడు. ఇంతటి విజయవంతమైన కెప్టెన్ను ముంబై ఇండియన్స్ ఇటీవలే సారథ్య బాధ్యతల నుంచి తొలగించి, అతని స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పజెప్పింది. రోహిత్ ఇష్టపూర్వకంగానే ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడని కొందరంటుంటే, మరికొందరేమో హార్దిక్ పాండ్యా కోసం ఎంఐ యాజమాన్యం హిట్మ్యాన్ను అవమానించిందని అనుకుంటున్నారు. -
తుస్సుమన్పించిన అంబటి రాయుడు.. కేవలం ఒక్క పరుగుకే
ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2024ను టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు పేలవంగా ఆరంభించాడు. ఈ లీగ్లో ముంబై ఇండియన్స్కు చెందిన ఎంఐ ఎమిరేట్స్ ఫ్రాంచైజీకి రాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం దుబాయ్ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రాయుడు దారుణంగా విఫలమయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన రాయుడు 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. సికిందర్ రాజా బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా ఐపీఎల్ 2023 విజయానంతరం అన్ని రకాల క్రికెట్కు రాయుడు గుడ్బై చెప్పాడు. బీసీసీఐతో పూర్తిగా బంధాన్ని తెంచుకున్న రాయుడు కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023 సీజన్లో భాగమయ్యాడు. అనంతరం ఐఎల్ టీ20 టోర్నీ-2024లో ఆడేందుకు ఎంఐ ఎమిరేట్స్తో రాయుడు ఒప్పందం కుదర్చుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై ఎమిరెట్స్పై 7 వికెట్ల తేడాతో దుబాయ్ క్యాపిటల్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో ముహమ్మద్ వసీం(51) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని దుబాయ్ క్యాపిటల్స్ కేవలం 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దుబాయ్ బ్యాటర్లలో హ్మనుల్లా గుర్బాజ్(89) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. చదవండి: గొడవకు దిగిన టీమిండియా కెప్టెన్.. కొట్టుకునేంత పని చేశారుగా! వీడియో వైరల్ -
వృద్దాప్యంలో ఉన్నారు కదా! రామోజీ కళ్లకు కాస్త మసక వచ్చి ఉండొచ్చు..
పదేళ్లపాటు ఎంపీగా పనిచేసిన వ్యక్తి పెద్దవాడవుతాడా? లేక ఒక క్రికెటర్గా ఉండి రిటైరైన వ్యక్తి పెద్ద వ్యక్తి అవుతారా? ఎవరైనా ఏమంటాం. ఒక రాజకీయ వేత్తగా రెండుసార్లు ఎంపీగా గెలిచారంటేనే అతనికి ప్రజాభిమానం ఉందనే కదా! దేశంలో చట్టాలు చేసే అత్యున్నత చట్టసభలో ఉండడం కన్నా గొప్ప విషయం ఏమి ఉంటుంది. రాజకీయాలలో అదే కదా ఎవరైనా కోరుకునేది. క్రికెటర్గా రాణించడం మంచి విషయమే. కాదనం. ఆయన రాజకీయాలలోకి వచ్చి ప్రజాదరణ పొందితే అది వేరే సంగతి. పదేళ్లు ఎంపీగా ఉన్న నేత చిన్నవాడట ఒక పార్టీలో చేరి వారం రోజులకే మనసు మార్చుకున్న వ్యక్తి చాలా పెద్దవాడట. పదేళ్లుగా ఎంపీగా ఉన్న నేత చాలా చిన్నవాడట. ఇది ఈనాడు మీడియా అధిపతి రామోజీరావు చిత్రీకరణ. తెలుగుదేశం పార్టీకి ఏది అనుకూలం అయితే అదే కరెక్ట్ అనేంత పతనావస్తకు ఈనాడు మీడియా చేరింది. క్రికెటర్ అంబటి రాయుడు కొద్ది రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన అంతకుముందు ఏపీలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లు, ఇతర సంస్థలలో జరుగుతున్న అభివృద్దిని చూసి మెచ్చుకున్నారు. వాటికి ఆకర్షితులై ఆయన పార్టీలో చేరానన్నారు. తదుపరి ఆయన రాజకీయాలకు దూరం అవుతున్నానని ప్రకటించారు. అంతే! మోసపూరిత కథనాలతో తప్పుడు కథనాలు ఈనాడు మీడియాకు కోతికి కొబ్బరికాయ దొరికిన చందం అయిపోయింది. మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో అచ్చేసి ఆనందపడింది. పైగా దీనికి వంచన అంటూ మరో ముక్తాయింపు ఇచ్చింది. ముఖ్యమంత్రి జగన్ ఈయనను వంచించేశారట. ఇలాంటి మోసపూరిత కథనాలు రాసి ప్రజలను తప్పుదారి పట్టించాలని ఈనాడు ఎంత నీచంగా ప్రయత్నిస్తోందో అర్ధం అవుతుంది. ఏబీఎన్తో పోటీ పడి నిసిగ్గుగా మద్దతు పదేళ్లపాటు ఎంపీగా ఉన్న కేశినేని అటు ఎంపీ పదవికి, ఇటు తెలుగుదేశం సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెబితే మాత్రం దానిని చాలా చిన్న విషయంగా పది లైన్ల వార్తగా ఇచ్చి సరిపెట్టుకుంది. అంటే దీనిని బట్టి ఏమి అర్దం అవుతుంది. ఈనాడు మీడియా ఆంద్రజ్యోతితో పోటీ పడి తెలుగుదేశం పార్టీకి నిస్సిగ్గుగా మద్దతు ఇస్తోందనే కదా!అదేమీ కొత్త విషయం కాకపోయినా, ఒకటికి రెండుసార్లు ఈ విషయం చెప్పి వక్కాణించవలసి వస్తోంది. కేశినేని నాని 2014లో మొదటిసారి విజయవాడ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ వేవ్ను కూడా తట్టుకుని నిలబడి స్వల్ప ఆధిక్యంతో అయినా గెలవగలిగారు. కేశినేని కుటుంబంలో లోకేష్ చిచ్చు అలాంటి వ్యక్తి తన కుటుంబంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిచ్చుపెట్టారని అంటున్నారు. తన సోదరుడు చిన్నిని లోకేష్ ఎంకరేజ్ చేసి డబ్బు ఖర్చు పెట్టించి, తనకు పోటీగా తయారు చేశారని, అందుకే తనకు టికెట్ లేదని చంద్రబాబు ప్రకటించారని అంటున్నారు. ఇవేవి ఎల్లో మీడియాకు విశేషాలు కావు. టీడీపీలో చంద్రబాబు పెత్తనం కన్నా లోకేష్దే ఎక్కువ ఆధిపత్యం అని ఈ ఘటన తెలియచేస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 2014-19 కాలంలో తన కొడుకు లోకేష్ను ఎమ్మెల్సీని చేసి, మంత్రిగా నియమించారు. ఆ తర్వాత ప్రభుత్వంలో అంతా తానై లోకేష్ చక్రం తిప్పారు. జోక్యం చేసుకోవద్దని స్థానిక ఎంపీకే చెబుతారా? చంద్రబాబు చాలా సందర్భాలలో నిస్సహాయంగా చూస్తు ఉండిపోయారని కొందరు అంటారు. అంతేకాక, తనవద్ద ఎవరైనా పనులకు వస్తే లోకేష్ను కలిశావా అని అడిగేవారని కూడా కొందరు చెబుతారు. అంటే దాని అర్ధం తెలుసుకదా! ఈ నేపథ్యంలో లోకేష్ తన సొంత టీమ్ను తయారు చేసుకుంటున్నారన్నమాట. ముఖ్యమంత్రి జగన్ వాళ్లను కలవలేదు. వీళ్లను కలవలేదు అని ఎల్లో మీడియా వారు తప్పుడు ప్రచారం చేస్తుంటారు? కనీసం కేశినేని నానిని పిలిచి టికెట్ విషయం ఎందుకు చర్చించలేదని మాత్రం కథనం ఇవ్వరు. అదేదో పరాయి వ్యక్తికి చెప్పినట్లు నలుగురు మనుషులను పంపించి టికెట్ ఇవ్వడం లేదని నానికి చెప్పిస్తారా? తిరువూరు సభ ఏర్పాట్లలో జోక్యం చేసుకోవద్దని స్థానిక ఎంపీకే చెబుతారా? పైగా తెల్లవారి లేస్తే ప్రజాస్వామ్యం అని ఒకటే సోది చెబుతారు! ఎంపీ రాజీనీమా పెద్ద వార్త కాదా? చంద్రబాబు ఎవరికైనా టిక్కెట్లు ఇవ్వకపోతే అదేదో పార్టీ ప్రయోజనాల కోసం. వేరే పార్టీవారు అదే పని చేస్తే అన్యాయం, వంచన చేసినట్లట! దీనిని ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియా భుజాన వేసుకుని తప్పుడు ప్రచారం చేస్తుంటాయి. కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేస్తే అది పెద్ద వార్తకాదని ఈ దిక్కుమాలిన మీడియా అబిప్రాయం. అసలు రాజకీయాలలోకి దాదాపు రాని, కేవలం వారం రోజుల వ్యవధిలో తప్పుకుంటే మాత్రం అది వంచన అని, ఇంకేవో రాసిపారేశారు. ఈనాడు చెత్తరాతలు అంబటి రాయుడుకు గుంటూరు టికెట్ ఇస్తానని జగన్ చెప్పారని, ఇప్పుడు నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలును గుంటూరు నుంచి పోటీచేమంటున్నారని ఇది మోసం అని ఈనాడు చెత్తరాతలు రాసింది. పార్టీ అవసరాల కోసం ఒకవేళ టికెట్ మార్చుకుంటే అది వంచన అవుతుందా? అదే పార్టీ ఎంపీగా పోటీచేసి రెండుసార్లు గెలిచిన కేశినేని నాని ఇంటిలో స్వయంగా చంద్రబాబో లేక లోకేషో చిచ్చు పెడితే అది మోసం కాదా? నాని ఇప్పుడు తన కార్యాయలం నుంచి టీడీపీ జెండాలు కూడా పీకేశారట. అయినా ఎల్లో మీడియా దానిని వార్తగా ఇవ్వదు. నోరు మూసేసుకుంది. అంబటి రాయుడు స్టోరీని అడ్డుపెట్టుకుని ఇంతకు ముందు రాసిన విషయాలనే మళ్లీ, మళ్లీ రాసి పాఠకులను విసిగించింది. ఈ మద్యకాలంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్టీ కార్యకలాపాలకు అంటిముట్టనట్లు ఉంటున్నారని చెబుతున్నారు. అయినా అవేవి ఈనాడు రామోజీరావు కళ్లకు వార్తలు కావు. ఎంతైనా వృద్దాప్యంలో ఉన్నారు కదా! రామోజీరావు కళ్లకు కాస్త మసక వచ్చి ఉండవచ్చు. వివరణ ఇవ్వని అనైతిక పరిస్థితి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం అంబటి రాయుడు ఊపీఎల్ పోటీలలో ఆడడానికి ఎంపికయ్యారు. వారు ఏ రాజకీయపార్టీలలో ఉండకూడదట. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. దీంతో ఈనాడు మీడియాకు నోరు పడిపోయినంత పనైంది. తాను రాసింది తప్పుడు వార్త అని తెలిసినా కనీసం వివరణ కూడా ఇవ్వని అనైతిక పరిస్థితికి ఈనాడు మీడియా వెళ్లింది. నెల్లూరు నుంచి వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రబాకరరెడ్డి పోటీచేయడం లేదని, ఆయన టీడీపీ వైపు చూస్తున్నారంటూ ఒకటే ప్రచారం చేసింది. అన్నిసార్లు రాస్తే నమ్మకపోతారా అన్నది వారి గోబెల్స్ ఆలోచన అన్నమాట. తీరా వేమిరెడ్డి తానే నెల్లూరునుంచి వైఎస్సార్సీపీ నుంచి పోటీచేస్తున్నానని స్పష్టంగా చెప్పారు. ఎన్నిసార్లు వీరు వదంతులు సృష్టిస్తారు? పైగా ఆయన ఒక మాట అన్నారు. ఎన్నిసార్లు వీరు వదంతులు సృష్టిస్తారు! తనకు విసుగువచ్చి పదే, పదే జవాబు ఇవ్వడం మానివేశానని అన్నారు. ఈనాడు తదితర ఎల్లో మీడియా అంత అసహ్యంగా మారాయనే కదా ఆయన వ్యాఖ్యల సారాంశం. వైఎస్సార్సీపీ తమ అభ్యర్దులను మార్చినా వ్యతిరేక ప్రచారమే. మార్చకపోయినా దుష్ప్రచారమే. చంద్రబాబు కాంగ్రెస్ వారితో కలిసి మంతనాలు జరిపితే అది వ్యూహం. అదే వేరే వారు చేస్తే కుట్ర. కేశినేని నాని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొన్నారట. దానిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారట. టీడీపీ జెండాలు పీకేస్తే ఎందుకు రాయలేదు ఎవరైన వైఎస్సార్సీపీ నేతను పార్టీ అధిష్టానం ఏదైనా అంశంపై ప్రశ్నిస్తే ఇంకేముంది.. ఇదేనే ప్రజాస్వామ్యం అని ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా ప్రశ్నిస్తూ నీచంగా కథనాలు ఇస్తాయి. కేశినేని నాని తన ఆఫీస్ వద్ద టీడీపీ జెండాలు పీకేశారట. మరి దానికి టీడీపీ జెండా పీకేశారని ఈనాడు మీడియా ఎందుకు రాయలేదు? అంటే టీడీపీపై వల్లమానిన ప్రేమ. తన స్వార్ధ వ్యాపార రాజకీయం కోసం రామోజీరావు ఎంతకైనా దిగజారుతున్నారు. ఆంద్రజ్యోతి రాధాకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషం చిమ్మించడానికి యత్నించారు. రాధాకృష్ణ బ్లాక్ మెయిల్ జగన్ ఫోన్ చేసి పలకరించలేదని చెప్పించారు. ఓకే. ఇదే రాధాకృష్ణ అంతకుముందు ఒకసారి రేవంత్కు జగన్ ఫోన్ చేయడానికి ప్రయత్నించారని, కాని రేవంత్ సిద్దపడలేదని రాసిందే. మరి దాని గురించి ఏమంటారు. ఇందులో ఏది నిజం? ఏది అబద్దం అంటే వారికే తెలియాలి. రాజకీయవర్గాలలో ఒక ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాధాకృష్ణ బ్లాక్ మెయిల్ చేసి తన వద్దకు ఇంటర్వ్యూ నిమిత్తం రప్పించుకున్నారని అంటున్నారు. తొలుత రేవంత్ ఒక టీవీ చానల్కు వెళితే మిగిలిన చానళ్లు కూడా అడుగుతాయని అనుకుని వద్దని చెప్పారట. కాని రాధాకృష్ణ బ్లాక్ మెయిల్కు తట్టుకోలేక ఇంటర్వ్యూ ఇచ్చారట. సహజంగానే రాదాకృష్ణ మానసికి పరిస్థితిని బట్టి అది నిజమేనేమో అనిపిస్తుంది. అదే ఏపీ ముఖ్యమంత్రి జగన్ను ఎవరూ బ్లాక్ మెయిల్ చేయలేరు కదా! అందుకే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణల ఏడుపు అని అనుకోవాలి. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
అందుకే రాజీనామా చేశా
-
క్రికెట్ కోసమే రాజకీయాలకు దూరం: అంబటి రాయుడు
టీమిండియా మాజీ క్రికెట్ అంబటి తిరుపతి రాయుడు మళ్లీ బ్యాట్ పట్టనున్నట్లు ప్రకటించాడు. వృత్తిపరమైన క్రీడను ఆడుతున్నందున రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ఎక్స్లో ట్వీట్ చేసిన అంబటి రాయుడు.. త్వరలో దుబాయ్లో జరుగనున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో ఆడనున్నట్లు వెల్లడించారు. ప్రొఫెషన్ క్రికెట్ లీగ్లో ఆడాలంటే ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండకూడదు. అందుకే వైసీపీ రాజీనామా చేసినట్లు రాయుడు చెప్పుకొచ్చాడు. ఇంటర్నేషనల్ లీగ్లో రాయుడు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో జతకట్టనున్నాడు. రాయుడు గతంలో ఐసీఎల్లోనూ ముంబై ఇండియన్స్కు ఆడాడు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ జనవరి 20 నుంచి ప్రారంభంకానుంది. I Ambati Rayudu will be representing the Mumbai Indians in the upcoming ILt20 from jan 20th in Dubai. Which requires me to be politically non affiliated whilst playing professional sport. — ATR (@RayuduAmbati) January 7, 2024 -
YSRCPలో చేరిన తరువాత అంబటి రాయుడు ఫస్ట్ ఇంటర్వ్యూ
-
YSRCPలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు
-
పాలిటిక్స్ .. నా సెకండ్ ఇన్నింగ్స్ : అంబటి రాయుడు
సాక్షి,అమరావతి: టీమిండియా క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలిటిక్స్ .. నా సెకండ్ ఇన్నింగ్స్ రాజకీయాలు తన సెకండ్ ఇన్నింగ్స్ అని టీమిండియా అంబటి తిరుపతి రాయుడు తెలిపారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. మొదటి నుంచి సీఎం జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని, ఆయన కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టినట్లు పేర్కొన్నారు. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని అంబటి రాయుడు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్కళ్యాణ్ చాలా ఆరోపణలు చేశారని, అయితే ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తారని ప్రశి్నంచారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అంబటి రాయుడు అన్నారు. యువత ఆకాంక్షలకు అద్దం పడుతున్న రాయుడి అరంగేట్రం రాజకీయాల్లో నైతిక విలువలకు పట్టం కట్టి, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి, సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్కు ప్రజల్లో ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. ప్రధానంగా యువతలో జగన్కు మద్దతు నానాటికీ అధికమవుతోంది. పలు సంస్కరణలతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా రాష్ట్రంలోని విద్యార్థులను తీర్చిదిద్దుతుండడం.. విదేశీ, స్వదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ భారీ ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుండడమే ఇందుకు నిదర్శనం. రాజకీయాల్లో నైతిక విలువలకు వలువలు వదిలి, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను అమలు చేయకుండా మోసం చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. ఆయనకు వంతపాడుతున్న జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్కళ్యాణ్ను మెజార్టీ ప్రజలు చీదరించుకుంటున్నారు. ప్రధానంగా వారిద్దరి రాజకీయ వ్యవహారశైలిపై యువతలో అసహనం పెల్లుబికుతున్నది. ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి.. వైఎస్సార్సీపీలో చేరడం రాష్ట్రంలో యువత ఆకాంక్షలకు అద్దంపడుతున్నదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు క్రికెట్కు వీడ్కోలు పలకక ముందు రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధిని గుర్తుచేస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురిపించేవారు. క్రికెట్కు వీడ్కోలు పలికాక అంబటి రాయుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తృ తంగా పర్యటించారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలనకు ప్రజలు జేజేలు పలుకుతుండడం.. ప్రధానంగా యువతలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండడాన్ని గమనించారు. అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు యువత ఆకాంక్షలకు అద్దం పడుతూ.. వైఎస్సార్సీపీలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన అంబటి రాయుడు
సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో రాయుడికి వైఎస్సార్సీపీ కండువా కప్పిన సీఎం జగన్.. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు. పాలిటిక్స్.. నా సెకండ్ ఇన్నింగ్స్: రాయుడు అనంతరం సాక్షి టీవీతో క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ..రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని తెలిపారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరటం సంతోషంగా ఉందని తెలిపారు. మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని.. ఆయన కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టినట్లు పేర్కొన్నారు. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పని చేస్తానని అంబటి రాయుడు చెప్పారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ గతంలో చాలా ఆరోపణలు చేశారని.. ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తారని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. కాగా గత కొన్నాళ్లుగా జిల్లాల్లో పర్యటిస్తోన్న అంబటి రాయుడు.. విద్యార్థులు, యువతను కలిసి మాట్లాడుతున్న విషయం తెలిసిందే. చదవండి: రాయచోటి: సామాజిక జైత్రయాత్ర.. ఇదీ సీఎం జగన్ పాలన ఘనత -
క్రికెట్ అంటే చిన్ననాటి నుంచే మక్కువ! ఆంధ్ర క్రికెటర్ల కోసం రాష్ట్రంలో..
పాఠశాల స్థాయి నుంచే జగన్కు క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువ.. ముఖ్యంగా క్రికెట్ అంటే మరీ ఇష్టం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నిహితులు చెప్పే మాట ఇది! హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించిన వైఎస్ జగన్.. క్రికెట్తో పాటు బాస్కెల్ బాల్ వంటి ఇతర క్రీడల్లోనూ భాగమయ్యే వారు. ఆ సమయంలో వైఎస్ కుటుంబం బంజారాహిల్స్లో నివాసం ఉండేవారు. కేవలం పాఠశాలలోనే కాకుండా.. ఇంటి దగ్గర కూడా స్నేహ బృందం ఏర్పాటు చేసుకున్న జగన్.. వారితో కలిసి క్రికెట్ ఆడుతూ ఉండేవారు. స్కూలైనా.. బయట అయినా ఫ్రెండ్స్ గ్యాంగ్లో నాయకుడిగా ఉండేందుకే ఇష్టపడే జగన్.. హెచ్పీఎస్లో హౌజ్ కెప్టెన్గా అరుదైన ఘనత దక్కించుకున్నారు. పన్నెండవ తరగతిలో ఉన్నపుడు.. మిగితా మూడు హౌజ్ల జట్లను ఓడించి రెడ్ హౌజ్కు ఆల్రౌండర్ చాంపియన్షిప్ అందించారు జగన్. కేవలం ఆటలే కాకుండా వ్యాసరచన వంటి పోటీలలోనూ తమ టీమ్ ముందుండేలా చేసి తన నాయకత్వ పటిమతో టైటిల్ సాధించారు. ఈ విషయాలను యువకెరటం పుస్తకంలో ఎఎస్ఆర్ మూర్తి, బుర్రా విజయశేఖర్ వెల్లడించారు. ఏపీఎల్తో ఆంధ్ర క్రికెటర్లకు మరింత ప్రోత్సాహం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడా రంగంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న క్రికెట్లో ఆంధ్ర క్రీడాకారుల సంఖ్య పెరిగేలా చొరవ తీసుకుంటోంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. సీఎస్కే ముందుకు వచ్చేలా చర్యలు ఇందులో భాగంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు కావాల్సినంత ప్రోత్సాహం అందిస్తోంది. అంతేకాదు.. విశాఖపట్నంలో మరో అత్యాధునిక క్రికెట్ స్టేడియం నిర్మించే దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది. విశాఖలో ఉన్న వైఎస్సార్ స్టేడియంను క్రీడలకు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉంది. అంతేకాదు రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చేలా చర్యలు చేపట్టింది. ఇక వైఎస్ జగన్ హయాంలోనే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పేరిట ఏసీఏ సరికొత్త క్రికెట్ టోర్నీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2022లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ టీ20 లీగ్లో రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్, వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ పేరిట ఆరు జట్లు బరిలోకి దిగాయి. విజయవంతంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండు సీజన్లు అరంగేట్ర ఎడిషన్ను విజయవంతంగా పూర్తి చేసిన ఏసీఏ.. తాజాగా రెండో సీజన్ను కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేసింది. ఏపీఎల్ తొలి సీజన్లో కోస్టల్ రైడర్స్ విజేతగా నిలవగా.. ఈ ఏడాది రాయలసీమ కింగ్స్ టైటిల్ సాధించింది. కాగా దేశవాళీ క్రికెట్తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ రాణించిన ఆటగాళ్లకే ఇటీవలి కాలంలో బీసీసీఐ సెలక్టర్లు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఔత్సాహిక ఆంధ్ర క్రికెటర్లు కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడేలా ఏసీఏ ఇలా ఏపీఎల్ పేరిట తమ వంతు ప్రయత్నం చేస్తోంది. క్రికెట్ దిగ్గజాలను ఆహ్వానిస్తూ 1983 వరల్డ్కప్ విజేత క్రిష్ణమాచారి శ్రీకాంత్ సహా టీమిండియా క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ తదితరులను ఈ ఈవెంట్లకు ఆహ్వానించడం ద్వారా జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక.. కొత్త ప్రభుత్వ హయాంలో ఏపీ క్రీడల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందంటూ బీసీసీఐ చీఫ్ సెలక్టర్గా పనిచేసిన ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం విశేషం. ఏపీ సీఎం కప్, ఆడుదాం ఆంధ్రా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్ ప్రభుత్వం.. ఏపీ సీఎం కప్ పేరిట క్రికెట్తో పాటు క్రికెటేతర క్రీడల్ని కూడా ప్రోత్సహిస్తోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల క్రీడా ఆణిముత్యాలను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్రా పేరిట క్రీడా సంబరానికి శ్రీకారం చుట్టింది. అంబాసిడర్గా అంబటి రాయుడు ఈ ఈవెంట్కు బ్రాండ్ అంబాసిడర్గా టీమిండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్లో అరుదైన ఘనతలు సాధించిన అంబటి రాయుడిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి ఖ్యాతి తీసుకువచ్చిన పీవీ సింధు(బ్యాడ్మింటన్), జ్యోతి సురేఖ వెన్నం(ఆర్చరీ), కేఎస్ భరత్(క్రికెటర్) తదితరులను సమున్నతరీతిలో సత్కరించింది. -
ఏలూరులో కదంతొక్కిన విద్యార్థులు
ఏలూరు టౌన్: ‘వన్స్ మోర్ సీఎం వైఎస్ జగన్... జయహో జగన్..’ నినాదాలతో ఏలూరు నగరం మార్మోగింది. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏలూరులో విద్యార్థి సాధికారత ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నిర్వహించిన ఈ ర్యాలీలో నగరంలోని పలు కళాశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల దినేష్రెడ్డి నేతృత్వంలో ఏలూరు ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథులుగా భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ హాజరయ్యారు. తొలుత ఏలూరు జెడ్పీ కార్యాలయ ప్రాంతం నుంచి ఫైర్స్టేషన్ సెంటర్ వద్దకు ర్యాలీగా వచ్చారు. అక్కడ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం ఫైర్స్టేషన్ సెంటర్, కోర్టు సెంటర్, ఏలూరు జీజీహెచ్ మీదుగా రామచంద్రరావుపేట వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేస్తున్న సీఎం జగన్: రాయుడు అంబటి రాయుడు మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాటలు వేస్తూ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ‘ఆడుదాం–ఆంధ్ర’లో ప్రతి విద్యార్థి, యువత పాల్గొని తమ ప్రతిభను చాటాలని సూచించారు. ఎంపీ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి వర్గాల పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలతో విద్యార్థులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎంఆర్ పెద్దబాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి భరత్రెడ్డి, ఏలూరు అధ్యక్షుడు ఏలూరు అంజి, జేసీఎస్ జిల్లా కో–ఆర్డినేటర్ వైఎన్వీ శివరావు తదితరులు పాల్గొన్నారు. -
అంబటి రాయుడు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు
-
దేశంలో ఏ సీఎం చేయలేనిది జగన్ చేసారు: అంబటి రాయుడు
-
దేశంలో ఏ సీఎం చేయలేనిది జగన్ చేసారు అంబటి రాయుడు ప్రశంసలు
-
విశాఖలో ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీ బైక్ ర్యాలీ
-
‘ఆడుదాం ఆంధ్ర’పై అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: ఆడుదాం ఆంధ్ర పేరుతో విశాఖపట్నంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. విశాఖ వెస్ట్, నార్త్ నియోజక సమన్వయకర్తలు ఆడారి ఆనంద్, కేకే రాజు అధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఎన్ఏడీ నుంచి డీఎల్బీ గ్రౌండ్ వరకు భారీ బైక్ ర్యాలీ కొనసాగింది. బైక్ ర్యాలీలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ విచ్చేశారు. ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ.. ఆడుదాం ఆంధ్ర అద్భుతమైన కార్యక్రమం. ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమాన్ని దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రీడలను ప్రొత్సహించేందుకు అద్భుతమైన కార్యక్రమం తీసుకువచ్చారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ బయటపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మంచి క్రీడాకారులకు మంచి ప్లాట్ఫామ్ను సీఎం జగన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల ప్రతిభ బయటకు వస్తుంది. దీంతో, క్రీడాకారులను గుర్తించడమే కాకుండా వారికి కావాల్సిన ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. సరైన అవకాశాలు లేక క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ మరుగున పడిపోతోంది. ఆడుదాం ఆంధ్ర ద్వారామట్టిలో మాణిక్యాలను వెతికి తీయవచ్చు’ అంటూ కామెంట్స్ చేశారు. ( ఫైల్ ఫోటో ) మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. క్రీడలకు రాజకీయాలను ముడి పెట్టవద్దు. క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెతికి తీయడం కోసమే ఆడుదాం ఆంధ్ర. ఓటు హక్కు లేని వారు కూడా ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో పాల్గొంటున్నారు. నాడు-నేడు ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు సీఎం జగన్ మేలు చేస్తున్నారు. మీరందరికి ఓట్లు లేవన్న సంగతి ప్రతిపక్షాలు గుర్తుపెట్టుకోవాలి అని అన్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడా పోటీల విజేతలకు ప్రభుత్వం భారీగా నగదు బహుమతులు ప్రకటించింది. గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి ఐదు దశల్లో పోటీలను నిర్వహించనుంది. ప్రతి దశలోనూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంతో పాటుగా విజేతలను సర్టిఫికెట్స్, మెమెంటోలు, నగదు పురస్కారాలతో సత్కరించనుంది. క్రీడా చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో 15ఏళ్లు పైబడిన వయస్కులు (మెన్, ఉమెన్) అందరూ పోటీల్లో భాగస్వాములయ్యేలా ‘ఓపెన్ మీట్’ను చేపడుతున్నది. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఐదు క్రీడా విభాగాలైన.. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనుంది. మరోవైపు ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ సాంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్ పోటీలను ఏర్పాటు చేస్తోంది. -
అదే అతడి బలం.. టీమిండియా కెప్టెన్ కాగలడు: అంబటి రాయుడు
టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్పై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసలు కురిపించాడు. రుతు ప్రతిభావంతుడని.. భవిష్యత్తులో భారత జట్టు కెప్టెన్ కాగల సత్తా ఉన్నవాడని పేర్కొన్నాడు. బీసీసీఐ అతడి సేవలను దీర్ఘకాలం పాటు ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు రాబట్టవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్ర కెప్టెన్గా జట్టును ముందుండి నడిపిస్తున్న రుతురాజ్ గైక్వాడ్.. బ్యాటర్గానూ అద్భుతంగా రాణిస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచ రికార్డులు సాధిస్తున్న ఈ రైట్హ్యాండ్ బ్యాటర్.. టీమిండియా తరఫున వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో మూడో మ్యాచ్ సందర్భంగా సంచలన సెంచరీతో మెరిశాడు. 52 బంతుల్లోనే 100 పరుగుల మార్కును అందుకున్న రుతురాజ్ గైక్వాడ్.. 57 బంతుల్లో 123 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాటర్ అంబటి రాయుడు ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ ఒకప్పటి తన సహచర ఆటగాడు రుతు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “ప్రస్తుతం భారత క్రికెట్ ఎక్కువగా ఉపయోగించుకుంటున్న ఆటగాడు ఎవరంటే రుతురాజ్ గైక్వాడ్ పేరు చెప్పొచ్చు. అతడు అత్యంత ప్రతిభావంతుడు. భవిష్యత్తులో జట్టుకు మరింత ఉపయోగపడతాడు. తనకున్న టాలెంటే తన బలం. షాట్ సెలక్షన్, అనుకున్న రీతిలో తన వ్యూహాలను అమలు పరిచే విధానం.. అన్నింటికీ మించి ఫిట్నెస్ విషయంలో శ్రద్ధ రుతును మరింత ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. కూల్గా తన పని తాను చేసుకుపోతాడు. ఏం చేయాలో.. ఏం చేయకూడదో తనకు తెలుసు. సైలెంట్గా ఉంటూనే దూకుడు ప్రదర్శించగలడు. టీమిండియాకు దొరికిన విలువైన ఆటగాడు. ఇలా చెప్పడం తొందరపాటే అయినా.. ధోని భాయ్ రిటైర్ అయిన తర్వాత సీఎస్కే కెప్టెన్గా రుతుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో టీమిండియా సారథి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే ఆసియా క్రీడల్లో జట్టును ముందుండి నడిపించాడు” అని అంబటి రాయుడు పేర్కొన్నాడు. కాగా చైనాలో జరిగిన ఏసియన్ గేమ్స్ లో కెప్టెన్గా వ్యవహరించిన రుతు భారత్కు స్వర్ణ పతకం అందించాడు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా సారథిగా రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టనుండగా.. శ్రేయస్ అయ్యర్తో పాటు ఇప్పుడు రుతురాజ్ పేరు కూడా వార్తల్లో నిలుస్తోంది. -
IPL 2024: అన్నంత పని చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆ ముగ్గురిని వదిలించుకుంది
ఐపీఎల్ 2024కి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ (నిలబెట్టుకోవడం), రిలీజ్ (వదిలించుకోవడం) ప్రక్రియకు ఇవాళ (నవంబర్ 26) ఆఖరి తేదీ కావడంతో అన్ని ఫ్రాంచైజీలు తాము నిలబెట్టుకునే ఆటగాళ్ల జాబితాను, వదిలించుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అన్ని ఫ్రాంచైజీల కంటే ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ తాము వదిలించుకోబోయే ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ముందుగా అనుకున్న ప్రకారం సీఎస్కే ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు అల్విదా చెప్పింది. కోట్లు కుమ్మరించి కొనుక్కున్న బెన్ స్టోక్స్ (16.25 కోట్లు), అంబటి రాయుడు (6.75), కైల్ జేమీసన్ను (1 కోటి) వివిధ కారణాల చేత రిలీజ్ చేసింది. వీరితో పాటు సీఎస్కే మరో ఐదుగురికి కూడా గుడ్బై చెప్పింది. విదేశీ ఆటగాళ్లు డ్వేన్ ప్రిటోరియస్ (50 లక్షలు), సిసండ మగాల (50 లక్షలు)తో పాటు లోకల్ ప్లేయర్స్ ఆకాశ్ సింగ్ (20 లక్షలు), భగత్ వర్మ (20 లక్షలు), సుభ్రాన్షు సేనాపతిలను (20 లక్షలు) సీఎస్కే రిలీజ్ చేసింది. ఈ ఎనిమిది మందిని రిలీజ్ చేశాక సీఎస్కే పర్స్లో 32.2 కోట్లు మిగిలాయి. ప్రస్తుతం ఆ జట్టుకు ఆరుగురిని కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. ఇందులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు. కెప్టెన్గా మళ్లీ ధోనినే.. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనిని రికార్డు స్థాయిలో 15వ సారి తమ కెప్టెన్గా ఎంపిక చేసింది. రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాతో పాటు తాము నిలబెట్టుకునే ఆటగాళ్ల జాబితాను కూడా ప్రకటించిన సీఎస్కే ముందుగా ధోని పేరును ప్రకటించి, అతడే 2024 సీజన్కు కూడా మా కెప్టెన్ అని స్పష్టం చేసింది. ధోని ఐపీఎల్ మొదలైనప్పటి (2008) నుంచి (మధ్యలో 2016, 2017 సంవత్సరాలు మినహా) సీఎస్కే కెప్టెన్గా కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. బెన్ స్టోక్స్ (16.25 కోట్లు) అంబటి రాయుడు (6.75 కోట్లు) కైల్ జేమీసన్ (కోటి) డ్వేన్ ప్రిటోరియస్ (50 లక్షలు) సిసండ మగాల (50 లక్షలు) ఆకాశ్ సింగ్ (20 లక్షలు) భగత్ వర్మ (20 లక్షలు) సుభ్రాన్షు సేనాపతి (20 లక్షలు) సీఎస్కే రీటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే.. ఎంఎస్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, షేక్ రషీద్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, మొయిన్ అలీ, శివమ్ దూబే, నిషాంత్ సింధు, అజయ్ మండల్, రాజ్వర్ధన్ హంగార్గేకర్, దీపక్ చాహర్, మహీష తీక్షణ, ముకేశ్ చౌదరీ, ప్రశాంత్ సోలంకి, సిమ్రన్జీత్ సింగ్, తుషార్దేశ్ పాండే, మతీశ పతిరణ -
సీఎం జగన్ గురించి అంబటి రాయుడు గొప్ప మాటలు
-
ఏపీలో విద్యా వ్యవస్థ భేష్ అంబటి రాయుడు ప్రశంసలు
-
యువత ఎంచుకునే రంగలో రాణించాలి: అంబటి రాయుడు
-
విద్యారంగంలో ప్రభుత్వం సమూల మార్పులు తెచ్చింది: అంబటి రాయుడు
-
వరల్డ్ కప్ లో టాప్ గేర్ లో దూసుకెళ్తున్న టీమ్ ఇండియా
-
సీఎం జగన్ ప్రభుత్వంపై అంబటి రాయుడు ప్రశంసల జల్లు
-
కార్పొరేట్ స్కూళ్ల కంటే ఏపీ ప్రభుత్వ బడులు అద్భుతం: అంబటి రాయుడు
సాక్షి, తెనాలి : కార్పొరేట్ స్కూళ్ల కంటే ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కొనియాడారు. తెనాలి నియోజకవర్గం సంగం జాగర్లమూడిలోని రైతు భరోసా కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ పాఠశాలను రాయుడు పరిశీలించారు. విద్యార్థులు కూడా తమ భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఉన్నారని తెలిపారు. ‘ఏపీలో స్కూళ్లలో ఉన్న సదుపాయాలు దేశంలో ఎక్కడా లేవు. మధ్యాహ్న భోజన పథకంలో ఇచ్చే ఆహారం రుచికరంగా ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. వైద్య ఆరోగ్య రంగంలో ఏ రాష్ట్రం మన రాష్ట్రంతో సరితూగలేదు. రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులు ఆనందంగా ఉన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు సంక్షేమ పథకాలతో ప్రజలంతా ఆనందంగా ఉన్నారు’ అని రాయుడు అన్నారు. ఇదీచదవండి... ఎమ్మెల్యే డోల శ్రీబాలవీరాంజనేయస్వామికి ఝలక్ -
చంద్రబాబు జీవితమే అక్రమ రాజకీయం
సాక్షి, అమరావతి: చంద్రబాబు జీవితాంతం అన్యాయాలు, అక్రమాలు, మోసాలతోనే రాజకీయాలు చెలాయించారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సోమవారం ప్రశ్నోత్తరాల అనంతరం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. దేశంలో రాజకీయాలను డబ్బు మయం చేసిన వ్యక్తి చంద్రబాబేనని మండిపడ్డారు. ఇక్కడ దొరికినవి ఒకట్రెండు స్కామ్లేనని.., అధికారంలోకి రాగానే ప్రజా ధనాన్ని దోచుకోవడానికి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు అనేక తప్పిదాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజా ఖజానా నుంచి డబ్బును విపరీతంగా దోచుకున్నారని చెప్పారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు కుటుంబ సభ్యులూ ఏం మాట్లాడట్లేదన్నారు. కొడుకు ఢిల్లీలో కూర్చుంటే.. మద్దతిస్తానని వచి్చన వ్యక్తి ఎక్కడున్నారో తెలీదని, చంద్రబాబుకు మద్దతే కరవైందని ఎద్దేవా చేశారు. న్యాయస్థానం తగిన ఆధారాలతోనే చంద్రబాబు వేసిన ప్రతి పిటిషన్ను తిరస్కరిస్తోందని, కేసులో బలం, తీవ్రతకు ఇది అద్దం పడుతోందని చెప్పారు. దీనిద్వారా స్కిల్ స్కామ్పై ఆధారాలతో సహా దొరికిన దొంగ ఇక తప్పించుకోలేరన్న విషయం ప్రపంచానికి అర్థమైందన్నారు. ప్రభుత్వానికి రాజకీయంగా క్షక్ష సాధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రెండు రోజుల విచారణలో సీఐడీకి చంద్రబాబు సహకరించలేదని, కోర్టుకు మాత్రం సహకరించానంటూ అసత్యాలు చెబుతున్నారని అన్నారు. అంతకుముందు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు ముగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత వాతావరణంలో సంపూర్ణంగా ప్రశ్నోత్తరాలు పూర్తవడం సంతోషంగా ఉందన్నారు. ప్రశ్నలు అడిగిన సభ్యులు సభలో ఉన్నా, లేకున్నా.. ప్రజలకు సమాధానాలు అందించడంలో సభ తన కర్తవ్యాన్ని నిష్పాక్షికంగా నెరవేర్చిందన్నారు. దీనికి మంత్రి అంబటి స్పందిస్తూ.. ప్రశ్నోత్తరాలు ప్రశాంతంగా జరగడం శుభ పరిణామమన్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షం సభలో లేకపోవడం బాధాకరమన్నారు. స్కిల్ స్కామ్పై చర్చించాల్సి వస్తుందనే భయంతోనే టీడీపీ సభ్యులు అసెంబ్లీలో రెండు రోజులు చిత్రవిచిత్ర విన్యాసాలు చేసి ఈలలు ఊదుకుంటూ పారిపోయారని అన్నారు. -
ముచ్చటగా 3 మ్యాచ్లు ఆడి ఇంటికొచ్చేసిన అంబటి రాయుడు
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2023లో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రయాణం మూన్నాళ్ల ముచ్చటగా సాగింది. వ్యక్తిగత కారణాల చేత రాయుడు సీపీఎల్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. ప్రవీణ్ తాంబే తర్వాత కరీబియన్ లీగ్ ఆడిన రెండో భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కిన రాయుడు.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్కు ప్రాతినిథ్యం వహిస్తూ మూడు మ్యాచ్లు ఆడాడు. ఇందులో ఓ మ్యాచ్లో (తొలి మ్యాచ్) డకౌట్ కాగా.. మిగతా రెండిటిలో 32, 15 పరుగులు చేశాడు. 3 మ్యాచ్ల్లో రాయుడు 15.66 సగటున 117.50 స్ట్రయిక్రేట్తో 47 పరుగులు చేసి నిరాశపర్చాడు. ఐపీఎల్ 2023 తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు, భారత దేశవాలీ క్రికెట్కు గుడ్బై చెప్పిన రాయుడు బీసీసీఐతో బంధాన్ని తెంచుకుని కరీబియన్ ప్రీమియర్ లీగ్లో ఆడాడు. 37 ఏళ్ల రాయుడు ఐపీఎల్ 2023 ఎడిషన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్లో సభ్యుడిగా ఉండిన విషయం తెలిసిందే. మరోవైపు అంబటి రాయుడుతో పాటు జింబాబ్వే పేస్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ కూడా కరీబియన్ ప్రీమియర్ లీగ్ నుంచి మధ్యలోనే నిష్క్రమించాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్కే ప్రాతినిథ్యం వహిస్తున్న ముజరబానీ కూడా వ్యక్తిగత కారణాలచే సీపీఎల్ను మధ్యలోనే వీడాడు. ఇతను కూడా రాయుడు లాగే మూడంటే మూడే మ్యాచ్లు ఆడాడు. ఈ 3 మ్యాచ్ల్లో అతను కేవలం ఒకే వికెట్ పడగొట్టి దారుణంగా విఫలమయ్యాడు. రాయుడు, ముజరబానీ జట్టును వీడటంతో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ వీరికి రీప్లేస్మెంట్గా ఇంగ్లండ్ ఆటగాళ్లు విల్ స్మీడ్, బెన్నీ హోవెల్లను తమ పంచన చేర్చుకుంది. వీరిలో స్మీడ్ విధ్వంసకర బ్యాటర్ కాగా.. హోవెల్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఉన్నాడు. ఇదిలా ప్రస్తుత సీపీఎల్ ఎడిషన్లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ప్రదర్శన దారుణంగా ఉంది. ఆ జట్టు ఇంత వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. తొలి 2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు కాగా.. ఆతర్వాత ఆడిన 4 మ్యాచ్ల్లో ఎవిన్ లెవిస్ సేన ఓటమిపాలైంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో కొనసాగుతుంది. -
CPL 2023: రాణించిన రాయుడు.. అయినా..!
కరీబియన్ ప్రీమియర్ లీగ్లో భారత ఆటగాడు అంబటి తిరుపతి రాయుడు ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. సీపీఎల్-2023లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయుడు.. గయానా వారియర్స్తో నిన్న (ఆగస్ట్ 25) జరిగిన మ్యాచ్లో ఓ మోస్తరు స్కోర్తో (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. అయితే రాయుడు రాణించినా అతని జట్టు సెయింట్ కిట్స్ మాత్రం ఓటమిపాలైంది. రాయుడుతో పాటు ఎవిన్ లెవిస్ (24 బంతుల్లో 48; ఫోర్, 6 సిక్సర్లు) చెలరేగాడు. సెయింట్ కిట్స్ ఇన్నింగ్స్లో రాయుడు, లెవిస్, జాషువ డిసిల్వ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. గయానా బౌలర్ గుడకేశ్ మోటీ (4-0-29-4) తన స్పిన్ మాయాజాలంతో సెయింట్ కిట్స్ పతనాన్ని శాశించాడు. మోటీకి ఇమ్రాన్ తాహిర్ (2/35), ఓడియన్ స్మిత్ (1/13), కీమో పాల్ (1/25), రొమారియో షెపర్డ్ (1/14), డ్వేన్ ప్రిటోరియస్ (1/12) సహకరించారు. అంతకుముందు గయానా తొలుత బ్యాటింగ్ చేస్తూ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. షాయ్ హోప్ (54) అర్ధసెంచరీతో రాణించగా.. సైమ్ అయూబ్ (31), హెట్మైర్ (26), కీమో పాల్ (25), రొమారియో షెపర్డ్ (25 నాటౌట్) పర్వాలేదనిపించారు. సెయింట్ కిట్స్ బౌలర్లలో ఓషేన్ థామస్ 3 వికెట్లు పడగొట్టగా.. డోమినిక్ డ్రేక్స్ 2, కాట్రెల్, నవీద్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 198 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన సెయింట్ కిట్స్.. మోటీ ధాటికి 16.5 ఓవర్లలోనే (132 ఆలౌట్) చాపచుట్టేసింది. -
అయ్యో రాయుడు.. తొలి మ్యాచ్లోనే ఇలా? వీడియో వైరల్
భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సెయింట్ కిట్స్ నెవిస్ అండ్ పేట్రియాట్స్ తరపున కరేబియన్ ప్రీమియర్ లీగ్లో అరంగేట్రం చేశాడు. అయితే తన తొలి మ్యాచ్లోనే రాయుడు నిరాశపరిచాడు. గురువారం జమైకా తల్లావాస్తో జరిగిన మ్యాచ్లో రాయుడు డకౌట్గా వెనుదిరిగాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. సెయింట్స్ కిట్స్ ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన సల్మాన్ ఇర్షద్ బౌలింగ్లో రాయుడు భారీ షాట్కు ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్తీసుకుని థర్డ్మాన్ ఫీల్డర్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో ఇమాద్ వసీం క్యాచ్ను అందుకున్నాడు. దీంతో నిరాశతో రాయుడు మైదాన్ని వీడాడు. అతడు ఔట్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయ్యో రాయుడు తొలి మ్యాచ్లోనే ఇలా జరిగిందేంటి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా సీపీఎల్లో ఆడిన రెండో భారత ఆటగాడిగా రాయుడు నిలిచాడు. ఇక ఐపీఎల్-2023 తర్వాత అన్నిరకాల ఫార్మాట్లకు రాయుడు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఐదోసారి చెన్నైసూపర్ కింగ్స్ ఛాంపియన్స్గా నిలవడంలో రాయుడు కీలక పాత్ర పోషించాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్తో జరిగిన ఫైనల్లో రాయుడు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫైనల్లో 8 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేశాడు. ఇక సీఎస్కే విజయంతో ఓ అరుదైన ఘనతను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు విజేతగా నిలిచిన జట్టులో భాగమైన రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. రాయుడు మొత్తంగా ఆరుసార్లు (ముంబై ఇండియన్స్ తరఫున 3, సీఎస్కే తరఫున 3)టైటిల్స్ సాధించిన జట్లలో రాయుడు భాగంగా ఉన్నాడు. రాయుడు కంటే ముందు ఈ ఘనత సాధించిన జాబితాలో రోహిత్ శర్మ ముందన్నాడు. ఇక ఐపీఎల్లో 203 మ్యాచ్లు ఆడిన అంబటి.. 4348 పరుగులు చేశాడు. అతడి ఐపీఎల్ కెరీర్లో ఒక సెంచరీ ఉంది. చదవండి: Virat Kohli: యో- యో టెస్టులో పాసయ్యాను.. ఫొటో షేర్ చేసిన కోహ్లి! స్కోరెంతంటే.. Super Salman 🇵🇰 Salman Irshad takes the wickets of Ambati Rayudu, Andre Fletcher and Corbin Bosch in the same over 🤯 #CPL23 #SKNPvJT #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/eNS4sS2Kib — CPL T20 (@CPL) August 23, 2023 -
దుబాయ్ క్యాపిటల్స్లోకి వార్నర్, వుడ్.. అఫ్రిది, షాదాబ్ ఖాన్ మరో జట్టుతో..!
యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషన్ లీగ్ టీ20 సీజన్-2 (2024) కోసం ఆయా ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. లీగ్లో పాల్గొనే ఆరు జట్లు తమ పాత ఆటగాళ్లను కొందరిని రిటైన్ చేసుకోవడంతో పాటు కొత్తగా 50 మంది ఆటగాళ్లతో డీల్ కుదుర్చుకున్నాయి. అబుదాబీ నైట్రైడర్స్ 8, డెజర్ట్ వైపర్స్ 6, దుబాయ్ క్యాపిటల్స్ 11, గల్ఫ్ జెయింట్స్ 5, ఎంఐ ఎమిరేట్స్ 8, షార్జా వారియర్స్ 12 మంది ఆటగాళ్లను తమ పంచన చేర్చుకున్నాయి. కొత్తగా లీగ్లోకి ఎంట్రీ ఇచ్చే వాళ్లలో డేవిడ్ వార్నర్ (దుబాయ్ క్యాపిటల్స్), మార్క్ వుడ్, షాదాబ్ ఖాన్ (డెజర్ట్ వైపర్స్), షాహీన్ అఫ్రిది (డెజర్ట్ వైపర్స్), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (గల్ఫ్ జెయింట్స్), అంబటి రాయుడు (ఎంఐ ఎమిరేట్స్), కోరె ఆండర్సన్ (ఎంఐ ఎమిరేట్స్), మార్టిన్ గప్తిల్ (షార్జా వారియర్స్) లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఆటగాళ్ల ఎంపిక సంబంధించిన మొత్తం తంతును ఆయా ఫ్రాంచైజీలు ఇవాళ (ఆగస్ట్ 21) పూర్తి చేశాయి. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 సీజన్-2 వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. DP వరల్డ్ ILT20 సీజన్ 2 కోసం ఆయా ఫ్రాంచైజీ ఆటగాళ్ల పూర్తి జాబితా.. అబుదాబి నైట్ రైడర్స్ కొత్త ఆటగాళ్లు: బ్రాండన్ మెక్ముల్లెన్, డేవిడ్ విల్లీ, జేక్ లింటాట్, జోష్ లిటిల్, లారీ ఎవాన్స్, మైఖేల్ పెప్పర్, రవి బొపారా, సామ్ హైన్ రిటెన్షన్స్: అలీ ఖాన్, ఆండ్రీ రసెల్, చరిత్ అసలంక, జో క్లార్క్, సాబిర్ అలీ, సునీల్ నరైన్, మర్చంట్ డి లాంజ్, మతియుల్లా ఖాన్ డెజర్ట్ వైపర్స్ కొత్త ఆటగాళ్లు: ఆడమ్ హోస్, ఆజం ఖాన్, బాస్ డి లీడ్, మైఖేల్ జోన్స్, షాదాబ్ ఖాన్, షాహీన్ ఆఫ్రిది రిటెన్షన్స్: అలెక్స్ హేల్స్, అలీ నసీర్, కొలిన్ మున్రో, దినేష్ చండిమాల్, గుస్ అట్కిన్సన్, ల్యూక్ వుడ్, మతీష పతిరణ, రోహన్ ముస్తఫా, షెల్డన్ కాట్రెల్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, టామ్ కర్రన్, వనిందు హసరంగ దుబాయ్ క్యాపిటల్స్ కొత్త ఆటగాళ్లు: ఆండ్రూ టై, దసున్ షనక, డేవిడ్ వార్నర్, మార్క్ వుడ్, మాక్స్ హోల్డెన్, మొహమ్మద్ మొహ్సిన్, రహ్మానుల్లా గుర్బాజ్, నువాన్ తుషార, రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్, సదీర సమరవిక్రమ, సామ్ బిల్లింగ్స్ రిటెన్షన్స్: దుష్మంత చమీర, జో రూట్, రాజా అకిఫ్, రోవ్మన్ పావెల్, సికందర్ రజా గల్ఫ్ జెయింట్స్ కొత్త ఆటగాళ్లు: డొమినిక్ డ్రేక్స్, జోర్డాన్ కాక్స్, కరీం జనత్, ముజీబ్-ఉర్-రెహ్మాన్, సౌరభ్ నేత్రవల్కర్ రిటెన్షన్స్: అయాన్ అఫ్జల్ ఖాన్, కార్లోస్ బ్రాత్వైట్, క్రిస్ జోర్డాన్, క్రిస్ లిన్, గెర్హార్డ్ ఎరాస్మస్, జేమ్స్ విన్స్, జేమీ ఓవర్టన్, రెహాన్ అహ్మద్, రిచర్డ్ గ్లీసన్, సంచిత్ శర్మ, షిమ్రాన్ హెట్మైర్ ఎంఐ ఎమిరేట్స్ కొత్త ఆటగాళ్లు: అకీల్ హోసేన్, అంబటి రాయుడు, కోరె అండర్సన్, కుశాల్ పెరీరా, నోస్తుష్ కెంజిగే, ఓడియన్ స్మిత్, విజయకాంత్ వియాస్కాంత్, వకార్ సలాంఖైల్ రిటెన్షన్స్: ఆండ్రీ ఫ్లెచర్, డేనియల్ మౌస్లీ, డ్వేన్ బ్రేవో, ఫజల్ హాక్ ఫారూకీ, జోర్డాన్ థాంప్సన్, కీరన్ పొలార్డ్, మెక్కెన్నీ క్లార్క్, ముహమ్మద్ వసీమ్, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, విల్ స్మీడ్, జహూర్ ఖాన్ షార్జా వారియర్స్ కొత్త ఆటగాళ్లు: క్రిస్ సోల్, డేనియల్ సామ్స్, దిల్షన్ మధుశంక, జేమ్స్ ఫుల్లర్, జాన్సన్ చార్లెస్, కుశాల్ మెండిస్, లూయిస్ గ్రెగొరీ, మహేశ్ తీక్షణ, మార్క్ వాట్, మార్టిన్ గప్తిల్, సీన్ విలియమ్స్, కైస్ అహ్మద్ రిటెన్షన్స్: క్రిస్ వోక్స్, జో డెన్లీ, జునైద్ సిద్ధిక్, మార్క్ దెయాల్, ముహమ్మద్ జవాదుల్లా, టామ్ కోహ్లర్-కాడ్మోర్ -
మళ్లీ ముంబై ఇండియన్స్ గూటికి అంబటి రాయుడు
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు మరోసారి ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో చేరాడు. 2010 నుంచి 2017 వరకు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించిన రాయుడు.. యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 సీజన్-2 (2024) కోసం మళ్లీ ముంబై ఇండియన్స్తో జతకట్టాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఎంఐ ఎమిరేట్స్గా బరిలోకి దిగే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ, వచ్చే సీజన్ కోసం 8 మంది కొత్త ఆటగాళ్లతో డీల్ కుదుర్చుకుంది. వీరిలో రాయుడుతో పాటు కోరె ఆండర్సన్ (న్యూజిలాండ్), ఓడియన్ స్మిత్ (వెస్టిండీస్), అకీల్ హొసేన్ (వెస్టిండీస్), కుశాల్ పెరీరా (శ్రీలంక) లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. వీరితో పాటు శ్రీలంక యువ ఆటగాడు విజయకాంత్ వియాస్కాంత్, వకార్ సలామ్కీల్, నోష్తుష్ కెంజిగే లాంటి కొత్త ఆటగాళ్లు కూడా ఎంఐ ఫ్యామిలీలో చేరారు. పై పేర్కొన్న 8 మంది చేరికతో ఎంఐ ఎమిరేట్స్ జట్టు సంఖ్య 20కి చేరింది. ఇక ఎంఐ ఫ్యామిలీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల విషయానికొస్తే.. ఎంఐ ఎమిరేట్స్ 12 మంది పాత వారిని తిరిగి తమతో చేర్చుకుంది. విండీస్ ఆటగాళ్లు కీరన్ పోలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ఆండ్రీ ఫ్లెచర్, న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, ఫజల్ హక్ ఫారూఖీ, ముహ్మమద్ వసీం, జహూర్ ఖాన్, జోర్డన్ థాంప్సన్, విలియమ్ స్మీడ్, మెక్కెన్నీ క్లార్క్, డేనియల్ మోస్లీలను ఎంఐ ఎమిరేట్స్ తిరిగి రిటైన్ చేసుకుంది. కాగా, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 సీజన్-2 వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కరీబియన్ లీగ్ 2023లో రాయుడు.. ఐపీఎల్ సూపర్ స్టార్ అంబటి రాయుడు ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం కొద్ది కాలంపాటు గ్యాప్ తీసుకుని, ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్లో ఆడుతున్నాడు. ఈ లీగ్లో రాయుడు సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ప్రవీణ్ తాంబే తర్వాత కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్న రెండో భారత క్రికెటర్గా రాయుడు రికార్డుల్లోకెక్కాడు. 2020 సీజన్లో ప్రవీణ్ తాంబే ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరఫున సీపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. -
కరీబియన్ ప్రీమియర్ లీగ్ బరిలోకి అంబటి రాయుడు.. రేపే ముహూర్తం
టీమిండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్ సూపర్ స్టార్ అంబటి తిరుపతి రాయుడు కరీబియన్ ప్రీమియర్ లీగ్లో అధికారికంగా జాయిన్ అయ్యాడు. రేపు (ఆగస్ట్ 19) ట్రిన్బాగో నైట్రైడర్స్తో జరిగే మ్యాచ్తో సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్ తరఫున సీపీఎల్ అరంగేట్రం చేయనున్నాడు. సౌతాఫ్రికా ఆల్రౌండర్ ట్రిస్టన్ స్టబ్స్కు ప్రత్యామ్నాయంగా రాయుడు రేపటి మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు. దీంతో ప్రవీణ్ తాంబే తర్వాత కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడనున్న రెండో భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కనున్నాడు. 2020 సీజన్లో ప్రవీణ్ తాంబే ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరఫున సీపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. Awesome to be back on the park.. excited to be a part of the @sknpatriots and the @CPL.. pic.twitter.com/dsHC4xtsi8 — ATR (@RayuduAmbati) August 17, 2023 సీపీఎల్లో తన తొలి మ్యాచ్కు ముందు రాయుడు తన ట్విటర్ ఖాతా ద్వారా ఓ మెసేజ్ షేర్ చేశాడు. మళ్లీ బ్యాట్ పట్టి బరిలోకి దిగడం అద్భుతంగా ఉంది.. కరీబియన్ లీగ్లో, ముఖ్యంగా సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్లో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందంటూ పేట్రియాట్స్ జెర్సీలోని తన ఫోటోను షేర్ చేశాడు. ఇదిలా ఉంటే, 2023 సీజన్ తర్వాత ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. ఇటీవల అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగుతాడని అంతా అనుకున్నారు. అయితే, ఏదో బలమైన కారణం చేత రాయుడు ఆ లీగ్లో ఆడలేకపోయాడు. మరోవైపు రాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. -
అంబటి రాయుడు కీలక నిర్ణయం.. మళ్లీ బ్యాట్ పట్టనున్న ఆంధ్ర ఆటగాడు
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి అభిమానలను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఈ నెల ఆఖరిలో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్లో రాయుడు బరిలోకి దిగనునున్నాడు. ఈ లీగ్లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుకు రాయుడు ప్రాతినిథ్యం వహించనున్నాడు. తద్వారా సీపీఎల్లో ఆడనున్న రెండో భారత క్రికెటర్గా అంబటి రికార్డులకెక్కనున్నాడు. అంతకముందు 2020 సీజన్లో భారత స్పిన్నర్ ప్రవీణ్ తాంబే ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరపున సీపీఎల్లో ఆడాడు. అయితే బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం సీపీఎల్లో ఆడేందుకు రాయుడుకు అటంకం కలిగే ఛాన్స్ ఉంది. కూలింగ్ ఆఫ్ పీరియడ్ రూల్ ప్రకారం.. ఇటీవల కాలంలో రిటైర్డ్ అయిన భారత క్రికెటర్లు ఇతర దేశాల ప్రాంఛైజీ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగం కాకుడదు. ఈ నిబంధన కారణంగానే అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ టి20 టోర్నమెంట్లో భాగం కాలేదు. లేదంటే ఈ ఏడాది సీజన్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు తరపున రాయుడు ఆడాల్సింది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత అన్నిఫార్మాట్ల క్రికెట్ నుంచి రాయుడు తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక సెయింట్ కిట్స్ ఫ్రాంచైజీతో కుదుర్చుకోవడంపై రాయుడు స్పందించాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుతో జత కట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది సీపీఎల్లో సెయింట్ కిట్స్కు నావంతు సహకారం అందిస్తానని రాయుడు పేర్కొన్నాడు. కాగా సీపీఎల్-2023 సీజన్ ఆగస్టు 16 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: IND vs WI: వెస్టిండీస్తో నాలుగో టీ20.. గిల్పై వేటు! విధ్వంసకర ఆటగాడికి మరో ఛాన్స్ -
చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి కెప్టెన్ అతడే: అంబటి రాయుడు
ఐపీఎల్లో ధోని తర్వాత చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్ ఎవరన్న విషయంపై చాలా రోజుల నుంచి చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే వచ్చే ఏడాది సీజన్లో ధోని ఆడుతాడో లేదో కచ్చితంగా తెలియదు. వచ్చే సీజన్లో ఆడేది, ఆడకపోవడం తన ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుందని ఐపీఎల్-2023 ఫైనల్ అనంతరం మిస్టర్ కూల్ సృష్టం చేశాడు. ఈ నేపథ్యంలో సీఎస్కే తదుపరి కెప్టెన్ రుత్రాజ్ గైక్వాడ్ అవుతాడని ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు జోస్యం చెప్పాడు. "రుత్రాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆటగాడు. అదే విధంగా అతడికి గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. నాకు తెలిసి మహీ బాయ్ మరో సీజన్ ఆడుతాడు. కాబట్టి భవిష్యత్తులో రుత్రాజ్ కచ్చితంగా చెన్నై సారధి అవుతాడు. అతడు 7 నుంచి 8 ఏళ్ల పాటు సీఎస్కేకు కెప్టెన్గా ఉండగలడు. రుతు ఇప్పటికే ధోని, హెడ్కోచ్ ఫ్లెమింగ్ నేతృత్వంలో రాటుదేలాడు. ఇక అతడు భారత జట్టు తరపున కూడా అన్ని ఫార్మాట్లలో అదరగొడతాడు. కానీ జట్టు మెనెజ్మెంట్ కూడా తగినన్ని అవకాశాలు ఇవ్వాలి" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు పేర్కొన్నాడు.కాగా రుత్రాజ్ ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్నాడు. విండీస్తో టెస్టు, వన్డే జట్టులో రుత్రాజ్కు చోటు దక్కింది. కానీ టెస్టు సిరీస్లో మాత్రం అతడికి ఆడే అవకాశం రాలేదు. చదవండి: Deodhar Trophy 2023: క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్.. చూస్తే మైండ్ బ్లాంక్! వీడియో వైరల్ -
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు అంబటి రాయుడు అదిరిపోయే కౌంటర్
-
బురద చల్లుతూనే ఉంటారు.. పట్టించుకోవద్దు: అంబటి రాయుడు
సాక్షి, గుంటూరు: స్వచ్ఛందంగా సేవలందించే వలంటీర్లను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోల్చటాన్ని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు తప్పుబట్టారు. వలంటీర్లకు దురుద్దేశాలను ఆపాదించడంపై ఆయన స్పందిస్తూ.. ‘‘వలంటరీ వ్యవస్థ గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువే. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారు. వాటిని మనం పట్టించుకోకూడదు. వలంటీర్లు అందరూ ధైర్యంతో ముందుకు వెళ్లాలి’’ అంటూ అంబటి రాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని అంబటి అన్నారు. వలంటరీ వ్యవస్థ మన రాష్ట్రానికి ఫ్లాగ్ షిప్. దేశంలో 70 సంవత్సరాల నుంచి జరగనది మన రాష్ట్రంలో వలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతోంది. ప్రతి మనిషికి ఏది అందాలో అది వలంటరీ ద్వారా అందుతుందన్నారు. చదవండి: పవన్ అడ్డంగా దొరికిపోయాడు.. తన బట్టలు తానే ఊడదీసుకుని.. ‘‘వలంటరీ వ్యవస్థ ఏర్పాటు ఒక గొప్ప ఆలోచన. వలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది. ప్రజలకు మంచిగా సేవలందించే వలంటరీ వ్యవస్థ మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదు. కరోనా సమయంలో వలంటీర్లు తమ ప్రాణాన్ని ఫలంగా పెట్టి అందరికీ సేవలందించారు. జీవితాంతం ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అని అంబటి రాయుడు పేర్కొన్నారు. చదవండి: పవన్ వ్యాఖ్యలపై వలంటీర్ల ఆగ్రహ జ్వాల -
రాయుడు రిటైర్ అయ్యాడు.. మీకు తప్పకుండా జట్టులో చోటిస్తాం.. కానీ: ధోని
MS Dhoni Hilarious Response Over Yogi Babu Wanting To Join CSK: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మైదానంలో ఎంత చురుగ్గా ఉంటాడో.. ఆఫ్ ది ఫీల్డ్ అంతే సరదాగా ఉంటాడు. ఆటలో కెప్టెన్సీ నైపుణ్యాలతో ఆకట్టుకునే తలా.. ప్రస్తుతం సినీ నిర్మాతగా కొత్త అవతారమెత్తిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్తో పెనవేసుకున్న బంధాన్ని మరింత పదిలం చేసుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో ధోని ఎంటర్టైన్మెంట్ పేరిట నిర్మాణ రంగంలోకి దిగాడు. లెట్స్ గెట్ మ్యారీడ్ తమ బ్యానర్పై తెరకెక్కిన తొలి సినిమా LGM (Let's Get Married) ట్రైలర్, ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. చెన్నైలో జరిగిన ఈ ఈవెంట్లో ధోని, అతడి సతీమణి సాక్షి తమ చేతుల మీదుగా ట్రైలర్ను ఆవిష్కరించారు. LGMలో నటించిన హరీశ్ కళ్యాణ్, నదియా, ఇవానా, కమెడియన్ యోగిబాబు, ఆర్జే విజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎస్కేకు ఆడాలని ఉంది ఈ సందర్భంగా యోగిబాబు తనదైన శైలిలో హాస్యం పండించాడు. అంతేకాదు తనకు చెన్నై సూపర్ కింగ్స్లో భాగం కావాలని ఉందంటూ తన మనసులో ఉన్న కోరికను ధోని ముందు బయటపెట్టాడు. ఇందుకు ధోని కూడా అంతే సరదాగా స్పందించాడు. ‘‘రాయుడు రిటైర్ అయ్యాడు. కాబట్టి సీఎస్కేలో మీకు తప్పకుండా చోటు ఉంటుంది. మేనేజ్మెంట్తో నేను మాట్లాడతాను. కానీ మీరిప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నారు కదా!నేనైతే మీరు ఎల్లప్పుడు జట్టుతో ఉంటూ నిలకడగా ఆడాలని కోరుకుంటా. కానీ వాళ్లు మాత్రం ఫాస్ట్ బౌలింగ్తో మిమ్మల్ని గాయపరుస్తారు మరి జాగ్రత్త’’ అని తలా యోగిబాబుకు బదులిచ్చాడు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. రాయుడు అరుదైన ఘనత అంబటి రాయుడు ఐపీఎల్-2023 తర్వాత క్యాష్ రిచ్ లీగ్కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఈ ఎడిషన్లో చెన్నై టైటిల్ గెలిచి ఏకంగా ఐదోసారి చాంపియన్గా నిలవడంతో రాయుడు అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో మొత్తంగా ఆరుసార్లు(ముంబై ఇండియన్స్ తరఫున 3, సీఎస్కే తరఫున 3) విజేతగా నిలిచిన జట్టులో భాగమైన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ముంబై సారథి రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్గా నిలిచాడు. చదవండి: సిక్సర్ల రింకూ.. ఎక్కడా తగ్గేదేలే! వీడియోతో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా! తల్లిదండ్రుల కష్టం ఏమిటో అర్థం చేసుకోలేని స్థితిలోనూ! శెభాష్ బిడ్డా.. -
అంబటి రాయుడు కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: ఐపీఎల్నుంచి రిటైర్మెంట్ ప్రకటించి త్వరలో అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)లో పాల్గొనేందుకు సిద్ధమైన అంబటి రాయుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అతను ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్కింగ్స్కే చెందిన టెక్సాస్ సూపర్ కింగ్స్కు రాయుడు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. ‘వ్యక్తిగత కారణాలతో రాయుడు తొలి ఎంఎల్సీలో పాల్గొనడం లేదు’ అని టెక్సాస్ టీమ్ ప్రతినిధి ప్రకటించారు. అయితే విదేశీ లీగ్లలో పాల్గొనే విషయంలో బీసీసీఐ తాజాగా చేసిన ప్రతిపాదన అతను ఆడకపోవడానికి కారణం కావచ్చు. ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా కనీసం ఏడాది పాటు ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ ముగిసిన తర్వాతే వారిని అనుమతించాలని బోర్డు భావిస్తోంది. అధికారికంగా నిబంధన అమల్లోకి రాకపోయినా ఇదే కారణంతో రాయుడు వెనక్కి తగ్గినట్లు సమాచారం. -
కంగ్రాట్స్ తిలక్.. అక్కడ కూడా దుమ్మురేపాలి: రాయుడు
వెస్టిండీస్ టీ20 సిరీస్కు హైదారాబాద్ యువ ఆటగాడు తిలక్ వర్మ ఎంపికయ్యాడు. ఈ సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టులో తిలక్ వర్మకు చోటు దక్కింది. కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తూ.. ఐపీఎల్లో చెలరేగడంతో తిలక్ వర్మకు సెలెక్టర్లు పిలుపునిచ్చారు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో కూడా తిలక్ వర్మ అద్బుతమైన ప్రదర్శరన కనబరిచాడు. గతేడాది సీజన్లో 14 మ్యాచ్లాడిన తిలక్.. 36.09 సగటుతో 303 పరుగులు చేసి ముంబై తరఫున రెండో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో కూడా అతడు అదరగొట్టాడు. 11 మ్యాచ్ల్లో 42.87 సగటుతో 343 పరుగులు సాధించాడు. ఇక తొలిసారి భారత జట్టుకు ఎంపికైన తిలక్ వర్మకు టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు అభినందనలు తెలిపాడు. "భారత జట్టుకు ఎంపికైనందుకు హృదయపూర్వక అభినందనలు. ప్రతీ ఫార్మాట్లో టీమిండియా తరపున అద్భుతంగా రాణిస్తావని ఆశిస్తున్నాను. ఆల్ది బెస్ట్ తిలక్" అంటూ రాయుడు ట్వీట్ చేశాడు. అదే విధంగా టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కూడా తిలక్ వర్మ ఎంపికపై స్పందిచాడు. "తొలిసారి భారత టీ20 జట్టుకు ఎంపికైనందుకు అభినందనలు. తిలక్ జట్టులోకి రావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నా. అతనితో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా" అని సూర్య ట్విటర్లో పేర్కొన్నాడు. విండీస్తో టి20 సిరీస్కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. Hearty congratulations @TilakV9 on being picked for the Indian team.. I am sure you will have a super career in every format for India.. wishing you all the very best.. — ATR (@RayuduAmbati) July 6, 2023 చదవండి: IND vs WI: అతడిని ఎందుకు సెలక్ట్ చేశారు.. ఏం చేశాడని! పాపం రుత్రాజ్ -
విద్యారంగంలో ప్రభుత్వం మంచి మార్పులు తీసుకొచ్చింది
-
అందుకే సీఎం జగన్ను కలిశాను.. రైతులు సంతోషంగా ఉన్నారు: అంబటి రాయుడు
సాక్షి, గుంటూరు: విద్యారంగంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మంచి మార్పులు తీసుకువచ్చిందని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఎంతో బాగున్నాయంటూ ప్రశంసలు కురిపించారు. ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్కు కూడా గుడ్బై చెప్పిన అంబటి రాయుడు ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా.. తెనాలి రూరల్ మండలం కొలకలూరులో రైతు భరోసా కేంద్రాన్ని(ఆర్బీకే) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన.. రైతులతో కాసేపు ముచ్చటించారు. రైతులు సంతోషంగా ఉన్నారు ‘‘రైతు భరోసా కేంద్రాలను పరిశీలించాను. అన్ని ప్రాంతాలు తిరిగి విషయాలు తెలుసుకుంటున్నాను. రైతులందరూ ప్రభుత్వపరంగా తమకు మంచి మద్దతు అందుతుందని చెప్తున్నారు. తాము సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు’’ అని అంబటి రాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు బాగున్నాయన్నారు. అందుకే సీఎం జగన్ను కలిశాను విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం బాటలు వేస్తోందని కొనియాడారు. ఇక స్పోర్ట్స్ గురించి మాట్లాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశానన్న అంబటి రాయుడు.. రాష్ట్రంలో క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలని తమ తాత నుంచి నేర్చుకున్నానన్న అంబటి రాయుడు.. గత కొన్నాళ్లుగా ప్రజలతో మమేకమవుతూ పర్యటనలు చేస్తున్నారు. అరుదైన ఘనత కాగా ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన అంబటి రాయుడు.. ఆ జట్టు ట్రోఫీ గెలవడంతో అరుదైన రికార్డులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సుదీర్ఘకాలం పాటు ముంబై ఇండియన్స్, సీఎస్కేకు ఆడిన రాయుడు.. ఏకంగా ఆరుసార్లు టైటిల్ చాంపియన్గా నిలిచాడు. ముంబై మూడు, చెన్నై మూడుసార్లు విజేతగా నిలిచిన సందర్భాల్లో జట్టులో భాగమై.. రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్గా నిలిచాడు. చదవండి: గుంటూరులో క్రికెటర్ అంబటి, ప్రజలతో మమేకం, త్వరలో ప్రకటన -
మాజీ సెలెక్టర్ MSK ప్రసాద్తో విభేదాలపై స్పందించిన రాయుడు
-
AP: ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో క్రీడా సంబురాలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో క్రీడలు, యువజన సర్వీసులశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబురాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రతీ ఏటా ఈ ఆటల పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. అంబటి రాయుడు, కేఎస్ భరత్ సేవలను మనం వినియోగించుకోవాలన్నారు. పోటీల కోసం ప్రతీ మండలంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామం/వార్డు, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆటల పోటీలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబాడీ, ఖో–ఖో పోటీలు నిర్వహిస్తారు. బాలురు, బాలికలకు పోటీలతో పాటుగానే, 3 కి.మీ మారథాన్, యోగా, టెన్నీకాయిట్, సంప్రదాయ ఆటల పోటీలు ప్రభుత్వం నిర్వహించనుంది. సచివాలయాల స్థాయిలో మొదలుకుని, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మ్యాచ్లు జరుగనున్నాయి. మొత్తం 46 రోజులపాటు ఆటలు కొనసాగుతాయి. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ గ్రౌండ్లు, మున్సిపల్ స్టేడియంలు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, యూనివర్సిటీ గ్రౌండ్లు తదితర మైదానాల్లో పోటీలు జరుగనున్నాయి. సీఎం జగన్ ఏమన్నారంటే.. – ప్రతిఏటా కూడా ఈ ఆటల పోటీలు నిర్వహించాలి: – క్రికెట్ లాంటి ఆటలో సీఎస్కే మార్గదర్శకం చేస్తుంది, నిర్వహణలో పాల్గొంటారు. – భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ లాంటి జట్టు సహాయం కూడా తీసుకుంటాం. – ప్రస్తుతం చెన్నై సూపర్కింగ్స్కు మూడు క్రికెట్ స్టేడియంలలో శిక్షణ కార్యక్రమాలు అప్పగిస్తాం. – భవిష్యత్తులో ఏపీ నుంచి కూడా ఒక ఐపీఎల్ టీం దిశగా ముందుకుసాగాలి. – దీనివల్ల ప్రొఫెషనలిజం బాగా పెరుగుతుంది. – అంబటిరాయుడు, కేఎస్ భరత్ లాంటి వాళ్లు రాష్ట్రంలోని యువకులకు స్ఫూర్తిదాయకులు. – వీరి సేవలను మనం వినియోగించుకోవాలి. – మొదట జిల్లాస్థాయిలో, తర్వాత నియోజకవర్గ స్థాయిలో ప్రొఫెషనల్గా క్రికెట్ ఆడించే పరిస్థితి ఉండాలి. – ప్రస్తుతం నిర్వహిస్తున్న పోటీలకోసం ప్రతి మండలంలో కూడా క్రీడా మైదానాలు ఏర్పాటు చేసుకోవాలి. – ఈ పోటీల్లో మండలస్థాయికి వచ్చేసరికి ప్రొఫెషనలిజానికి ప్రాధాన్యత ఇవ్వాలి. – గ్రామస్థాయిలో ఆడేవారికి కూడా క్రీడా సామగ్రిని అందించాలి. – ఆటల్లో గెలిపొందిన వారికి బహుమతులతో పాటు కీడ్రా సామగ్రితో కూడిన కిట్లను కూడా అందించాలి. – భవిష్యత్తులో సచివాలయానికి కూడా క్రీడా సామగ్రితో కూడిన కిట్లను ఇచ్చే ఆలోచన చేయాలి. – ప్రభుత్వ పాఠశాలల్లో కూడా క్రీడా సామగ్రిని ఏర్పాటు చేసేదిశగా చర్యలు తీసుకోవాలి. – హైస్కూల్ ఆ పైస్థాయిలో తప్పనిసరిగా క్రీడాసామగ్రిని ఏర్పాటు చేయాలి. – ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలి. – భవిష్యత్తులో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేయాలి. దీనిపై ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, క్రీడలు, యువజన సర్వీసులుశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ జి.వాణీమోహన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఎస్ఎఎపీ) ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ వీసీ అండ్ ఎండీ కె.హర్షవర్ధన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇది కూడా చదవండి: మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు, జియో టవర్లను వర్చువల్గా ప్రారంభించిన సీఎం జగన్ -
వరల్డ్కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు
2019 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాటి సెలెక్షన్ కమిటీలోని కీలక సభ్యుడితో తనకు మనస్పర్దలు ఉండేవని, అతనితో కలిసి క్రికెట్ ఆడే రోజుల్లో విభేదాలు ఏర్పడ్డాయనని, నన్ను వరల్డ్కప్ జట్టుకు ఎంపిక చేయకపోవడానికి అదే కారణం అయ్యుండొచ్చని అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఓ లోకల్ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, నాటి జాతీయ సెలెక్టర్లైన ఎంఎస్కే ప్రసాద్ (చీఫ్ సెలెక్టర్), దేవాంగ్ గాంధీ, శరణ్దీప్ సింగ్, గగన్ ఖోడా, జతిన్ పరంజపేలు.. అప్పటి ఐపీఎల్ సీజన్లో టాప్ ఫామ్లో ఉండిన రాయుడును కాదని త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్ను 2019 వన్డే వరల్డ్కప్కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆ వరల్డ్కప్లో రాయుడు స్థానంలో టీమిండియాకు ఎంపికైన విజయ్ శంకర్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ అంశంపై అప్పట్లో పెద్ద చర్చలే జరిగాయి. రాయుడు సైతం సెలెక్టర్ల వైఖరిని బహిరంగంగా విమర్శించాడు. ఫామ్లో ఉన్న తనను ఎంపిక చేయకపోవడంతో మనస్థాపం చెందిన రాయుడు.. ఉన్నపలంగా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఆ తర్వాత తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నప్పటికీ టీమిండియా అవకాశాలు దక్కలేదు. ఇదిలా ఉంటే, అంబటి రాయుడు ఇటీవల ముగిసిన ఐపీఎల్-2023 సీజన్తో క్యాష్ రిచ్ లీగ్కు కూడా వీడ్కోలు పలికేశాడు. సీఎస్కే టైటిల్ గెలిచిన జట్టులో రాయుడు సభ్యుడిగా ఉన్నాడు. ఇటీవలే అతను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా కలిశాడు. రాయుడు తన రాజకీయ అరంగేట్రం కోసమే ఏపీ సీఎం చుట్టూ తిరుగుతున్నాడని ప్రచారం జరుగుతుంది. -
సీఎం వైఎస్ జగన్ను కలిసిన అంబటి రాయుడు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు తాడేపల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. అంబటి రాయుడితో పాటు సీఎస్కే ఫ్రాంచైజీ ఓనర్ ఎన్.శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్ కూడా సీఎం జగన్ను కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల తమ జట్టు గెలిచిన ఐపీఎల్ 2023 ట్రోఫీని సీఎంకు చూపించారు. ఈ సందర్భంగా ఏపీలో క్రీడారంగం అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు సీఎం జగన్కు అంబటి రాయుడు వివరించారు. వారి సూచనల మేరకు పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఐపీఎల్లో అంబటి రాయుడు ప్రాతినిధ్యం వహించిన సీఎస్కే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను మట్టికరిపించి, ఐదో సారి విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్కు ముందు రాయుడు ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫైనల్ మ్యాచ్ ఆడి రాయుడు ఐపీఎల్ కెరీర్కు ముగింపు పలికాడు. కాగా, రాయుడు.. సీఎం జగన్ కలవడం ఇటీవలికాలంలో ఇది రెండోసారి. ఐపీఎల్ ఫైనల్కు ముందు కూడా రాయుడు ఓసారి సీఎంను కలిశారు. ఆ సందర్భంగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై రాయుడు సీఎం జగన్తో చర్చించారు.- మిడుతూరి జాన్ పాల్, సాక్షి వెబ్ డెస్క్ చదవండి: ఐపీఎల్కు గుడ్బై చెప్పిన అంబటి రాయుడు -
అంబటి రాయుడికి ట్విస్ట్ ఇచ్చిన బీసీసీఐ అనిల్ కుంబ్లే షాకింగ్ రియాక్షన్..!
-
అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్,నెట్వర్త్ గురించి తెలుసా?
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్తో జరగబోయే ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచే తనకు చివరి మ్యాచ్ అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఈ సందర్బంగా అంబటి రాయుడు ఏం చేయబోతున్నాడు. అతని ఆస్తి, నికర విలువ ఎంత అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. (యాపిల్ లవర్స్ బీ రెడీ: రూ. 8,900కే యాపిల్ ఐప్యాడ్) ఫ్యాన్స్ అభిమానంగా రాయుడు అని పిలుచుకునే ఆల్ రౌండర్గా అత్యుత్తమ ప్రదర్శనతో భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. భారత క్రికెట్ జట్టులో రైట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ,రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్గా క్రికెట్లోకి ప్రవేశించాడు. 2010లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చి సుదీర్ఘకాలం అంటే 2017 దాకా ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2013 సీజన్లో ఐపీఎల్ టైటిల్ సాధనలోనూ, ఆ తరువాత 2018లో సీఎస్కే జట్టులోకి మారిన తరువాత 2018, 2021లో టైటిల్ గెలిచిన కీలక ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. (IPL 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్వర్త్ ఎంతో తెలుసా?) నికర విలువు అంబటి రాయుడు మొత్తం నికర విలువ దాదాపు రూ. 50 కోట్లు. సంవత్సరానికి రూ 7 కోట్లకు పైనే. ఐపీఎల్ ద్వారా లభించిన ఫీజు 6.25కోట్లు. లగ్జరీ కార్ల విలువ 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు. అలాగే బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కోటి దాకా ఆర్జిస్తాడనేది తాజా నివేదికలద్వారా తెలుస్తోంది. (CSK ఓనరు, నికర విలువ ఎంత? ఈ విషయాలు తెలుసా?) అంబటి రాయుడు ఇల్లు కార్లు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో లగ్జరీ డిజైనర్ ఇల్లు ఉంది. అలాగే దేశవ్యాప్తంగా అనేక రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వికారాబాద్ అనంతగరిలో రిసార్ట్ బిజినెస్, సిద్దిపేట వైపు ఫార్మింగ్ బిజినెస్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. అధిక బ్రాండ్ వాల్యుయేషన్ కారణంగా గత కొన్నేళ్లుగా అంబటి రాయుడు నికర విలువ 40 శాతం పెరిగిందట. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా రాయుడి నికర ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుందనేది నిపుణుల మాట. వ్యవసాయ చేసుకుంటూ ఫామ్హౌస్లో ఎక్కువ సమయం గడుపుతానని ఒక ఇంటర్వ్యూలో అంబటి చెప్పినప్పటికీ ఐపీఎల్కు గుడ్ బై చెప్పిన తరువాత ఫ్యామిలీకి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న నేపథ్యంలో రాజకీయాల్లో చేరతాడనే ఊహాగానాలున్నాయి. కార్లు : రూ. 1.5 నుంచి 2 కోట్లు అంబటి రాయుడు కార్ల కలెక్షన్ చాలా చిన్నది. అయినా ఆడి కారుతోపాటు ప్రపంచంలోని ది బెస్ట్ లగ్జరీ కార్లు కొన్ని అంబటి రాయుడు సొంతం. కరియర్ 2004 అండర్-19 ప్రపంచకప్లో అంబటి రాయుడు కెప్టెన్ ఇంగ్లండ్పై అజేయంగా 177 పరుగులు చేసి టైటిల్ సాధించాడు వయసు కేవలం 16 ఏళ్లు. ఇక అప్పటినుంచి మరో సచిన్ పేరు తెచ్చుకున్నాడు.తరువాత హైదరాబాద్ దేశవాళీ జట్టుకు ఎంపిక, కేవలం 17 సంవత్సరాల వయస్సులో నే ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు . భారత జట్టులో ఎంపికై 2013లో జింబాబ్వేపై మ్యాచ్లో రావడం 63 పరుగులతో అజేయంగా పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో 203 ఐపీఎల్ మ్యాచులాడిన రాయుడు. 127.26 స్ట్రైక్రేట్తో 4,329 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1985, సెప్టెంబర్ 23న గుంటూరులో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు అంబటి రాయుడు. 1992లో మూడో తరగతి చదువుతున్నప్పుడే రాయడిని తండ్రి హైదరాబాద్లోని విజయ్ పాల్ క్రికెట్ అకాడమీలో చేర్చించారు. 14 ఫిబ్రవరి 2009న తన స్నేహితురాలు విద్యను పెళ్లి చేసుకున్నాడు రాయుడు. ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
అది చాలా పెద్ద తప్పు.. అంబటి రాయుడికి అన్యాయం చేశారు: కుంబ్లే
భారత మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు అంబటి రాయుడు ఐపీఎల్కు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023 ఫైనల్ అనంతరం తన ఐపీఎల్ కెరీర్కు రాయుడు ముగింపు పలికాడు. కాగా ఐపీఎల్లో రాయుడు ఆరు టైటిల్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు టైటిల్స్ ముంబై ఇండియన్స్ తరపున సాధించగా.. మరో మూడు టైటిల్స్ సీఎస్కే తరపున గెలుచుకున్నాడు. ఇక ఐపీఎల్ విషయాన్ని పక్కన పెడితే.. రాయుడి వంటి అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆటగాడికి బీసీసీఐ మాత్రం అన్యాయం చేసిందనే చెప్పుకోవాలి. భారత్ తరపున రాయుడు కేవలం 55 వన్డేలు, ఆరు టీ20లు మాత్రమే ఆడాడు. 2018-19 మధ్య కాలంలో భారత జట్టులో నాలుగో స్థానంలో సరైన ఆటగాడు లేని లోటు సృష్టంగా కన్పించింది. Throw back to an india -A game which was almost 2 decades ago.. when you see that 99% of the guys you have played with are either commentators, coaches,mentors and some politicians..you realise that it’s been quite a journey but the end is near.. 😂 pic.twitter.com/qm7iX7HCrV— ATR (@RayuduAmbati) May 3, 2023 ఈ సమయంలో రాయుడు నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అద్భుతంగా రాణించాడు. దీంతో భారత జట్టు కష్టాలు తీరి పోయాయి అని, నాలుగో స్ధానానికి సరైన ఆటగాడు దొరికాడని అంతా భావించారు. ఇదే సమయంలో 2019 వన్డే ప్రపంచకప్లో రాయుడు అడుతాడని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటుచేసుకుంది. 2019 వన్డే ప్రపంచకప్కు రాయుడును కాదని ఆల్రౌండర్ విజయ్ శంకర్ను ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ క్రమంలో తనను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర నిరాశ చెందిన రాయుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. అయితే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ భారత్ తరపున ఆడే అవకాశం రాలేదు. ఇక ఇదే విషయంపై తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పందించాడు. "రాయుడు 2019 ప్రపంచకప్ ఆడాల్సింది. అందులో ఎలాంటి సందేహం లేదు. అది సెలక్షన్ కమిటీతో పాటు జట్టు మేనెజ్మెంట్ చేసిన పెద్ద తప్పు. అతడిని నాలుగో స్థానం కోసం సిద్ధం చేశారు. అటువంటిది ఆ తర్వాత జట్టులో స్థానం లేకుండా చేశారు. అది చాలా ఆశ్చర్యం కలిగించింది" అని ఐపీఎల్ ఫైనల్ తర్వాత జియో సినిమాలో మాట్లాడుతూ కుంబ్లే పేర్కొన్నాడు. కాగా ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్గా విరాట్ కోహ్లి, హెడ్ కోచ్గా రవిశాస్త్రి ఉన్నారు. చదవండి: WTCFinal2023: ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన ఆ ఐదుగురు! ఫోటోలు వైరల్ -
అచ్చం నాలాగే.. రాయుడుకు ఆ అలవాటు లేదు
-
'అచ్చం నాలాగే.. రాయుడుకు ఆ అలవాటు లేదు'
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్ అనంతరం సీఎస్కే స్టార్ అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా సీఎస్కేలో అంబటి రాయుడు కీలకపాత్ర పోషించాడు. గతంలో సీఎస్కే టైటిల్స్ సాధించడంలోనూ రాయుడు పాత్ర కీలకం. కాగా తన చివరి ఐపీఎల్ మ్యాచ్లోనూ రాయుడు తన ఇంపాక్ట్ చూపించాడు. వర్షంతో 15 ఓవర్లలో 171 పరుగుల టార్గెట్ ఫిక్స్ చేయడంతో సీఎస్కే బ్యాటర్స్ వేగంగా ఆడేందుకే ప్రయత్నించారు. ఈ క్రమంలో రాయుడు ఐదో స్థానంలో వచ్చి 8 బంతుల్లో రెండో సిక్సర్లు, ఒక ఫోర్తో 19 పరుగుల దనాధన్ ఇన్నింగ్స్ ఆడి ఔటయ్యాడు. అయితే రాయుడు మెరుపు ఇన్నింగ్స్ సీఎస్కే లక్ష్యాన్ని కరిగించిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో అంబటి రాయుడుపై సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రశంసల వర్షం కురిపించాడు. రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడుతో తన అనుబంధాన్ని ధోని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నాడు. ''మైదానంలో ఉన్నప్పుడు 100 శాతం శ్రమించడం రాయుడు లక్షణం. మేమిద్దరం ఒకప్పుడు ఇండియా ‘ఎ’ తరఫున కలిసి ఆడాం. అటు పేస్ను, ఇటు స్పిన్ను సమర్థంగా ఆడగల నైపుణ్యం అతని సొంతం. అతను జట్టు కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయగలడని నేను ఎప్పుడైనా నమ్మేవాడిని. నాలాగే రాయుడుకు కూడా ఎక్కువగా ఫోన్ వాడే అలవాటు లేదు'' అని ధోని అన్నాడు. కాగా 2010లో ముంబై ఇండియన్స్ తరఫున.. ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు.. తర్వాత చెన్నై సూపర్కింగ్స్కు మారాడు. ముంబై ట్రోఫీ గెలిచిన మూడు సందర్భాల్లో ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న రాయుడు.. మొత్తంగా ఆరో టైటిల్తో తన ఐపీఎల్ కెరీర్ ముగించాడు. కాగా 37 ఏళ్ల అంబటి రాయుడు తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో 203 మ్యాచ్లాడి 4348 పరుగులు సాధించాడు. ఆరుసార్లు.. విజేతగా నిలిచిన జట్లలో భాగమై ట్రోఫీలను ముద్దాడాడు. అదే విధంగా ఆటగాడిగా టీమిండియా సారథి రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్గా చరిత్రకెక్కాడు. చదవండి: #MSDhoni: దాయాది అభిమానులే మెచ్చుకునేలా! -
ఇంతకంటే నాకింకేం కావాలి.. జీవితాంతం నవ్వుతూనే ఉండొచ్చు: అంబటి రాయుడు
IPL 2023- Ambati Rayudu: ‘‘అవును.. ఐపీఎల్ కెరీర్ అద్భుతంగా ముగిసింది. ఇంతకంటే నాకింకేం కావాలి. అసలు ఇది నమ్మశక్యంగా లేదు. ఇది నిజంగా అదృష్టమనే చెప్పాలి’’ అని టీమిండియా మాజీ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు హర్షం వ్యక్తం చేశాడు. It feels so great to finally hold the trophy for a sixth time..been a great night for csk and also me personally… pic.twitter.com/Il5RNDGJwr — ATR (@RayuduAmbati) May 30, 2023 కాగా 2010లో ముంబై ఇండియన్స్ తరఫున.. ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు.. తర్వాత చెన్నై సూపర్కింగ్స్కు మారాడు. ముంబై ట్రోఫీ గెలిచిన మూడు సందర్భాల్లో ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న రాయుడు.. మొత్తంగా ఆరో టైటిల్తో తన ఐపీఎల్ కెరీర్ ముగించాడు. 2 great teams mi nd csk,204 matches,14 seasons,11 playoffs,8 finals,5 trophies.hopefully 6th tonight. It’s been quite a journey.I have decided that tonight’s final is going to be my last game in the Ipl.i truly hav enjoyed playing this great tournament.Thank u all. No u turn 😂🙏 — ATR (@RayuduAmbati) May 28, 2023 చెన్నై ఐదోసారి.. రాయుడు ఖాతాలో ఆరు ఐపీఎల్-2023 ఫైనల్కు ముందు తాను క్యాష్ రిచ్ లీగ్కు గుడ్ బై చెప్పనున్నట్లు అంబటి రాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా చెన్నై- గుజరాత్ టైటాన్స్ మధ్య మే 28న జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్డేకు మారింది. ఈ క్రమంలో సోమవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్ను ఓడించి చెన్నై ఐదోసారి చాంపియన్గా అవతరించింది. pic.twitter.com/rwUaptbvSr — ATR (@RayuduAmbati) May 30, 2023 ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఐదుసార్లు చాంపియన్ జట్టులో సభ్యుడిగా ఉన్న అంబటి రాయుడు ఖాతాలో మరో టైటిల్ చేరింది. దీంతో రాయుడు ఉద్వేగానికి లోనయ్యాడు. తనకు ఇంతకంటే గొప్ప బహుమతి ఏదీ ఉండదని వ్యాఖ్యానించాడు. In life and sport ups and downs are a constant part. We need to be positive and keeping working hard and things will turn around.. results are not always a measure of our effort. So always keeping smiling and enjoy the process.. pic.twitter.com/1AYAALkGBM — ATR (@RayuduAmbati) April 28, 2023 మా నాన్న వల్లే చెన్నై విజయానంతరం కామెంటేటర్ హర్షా భోగ్లేతో అంబటి రాయుడు మాట్లాడుతూ.. ‘‘ఇక నేనిలాగే జీవితాంతం చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోవచ్చు. గత 30 ఏళ్లుగా హార్డ్వర్క్ చేస్తున్నా. నా ప్రయాణంలో నాకు సహాయసహకారాలు అందించిన నా కుటుంబానికి, ముఖ్యంగా మా నాన్నకు ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ల మద్దతు లేకుండా ఇదంతా సాధ్యమయ్యేదే కాదు. నాకు ఇంతకంటే ఇంకేం కావాలి’’ అని ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఈ సీజన్లో అంబటి రాయుడు మొత్తంగా 12 ఇన్నింగ్స్లలో కలిపి 158 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్తో ఫైనల్ మ్యాచ్లో 8 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేశాడు. Photo Credit : AFP రోహిత్ శర్మ తర్వాత రాయుడు ఇన్నింగ్స్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లు ఉన్నాయి. కాగా 37 ఏళ్ల అంబటి రాయుడు తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో 4348 పరుగులు సాధించాడు. ఆరుసార్లు.. విజేతగా నిలిచిన జట్లలో భాగమై ట్రోఫీలను ముద్దాడాడు. అదే విధంగా ఆటగాడిగా టీమిండియా సారథి రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్గా చరిత్రకెక్కాడు. కాగా రిజర్వ్ డే మ్యాచ్లో డక్వర్త్ లూయీస్ పద్ధతిలో సీఎస్కే 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. చదవండి: జడేజాను ఎత్తుకుని ధోని సెలబ్రేషన్! ఇంతకంటే ఏం కావాలి? వీడియో వైరల్ ఇలా జరగాలని రాసి పెట్టి ఉందంతే! ధోని చేతిలో ఓడినా బాధపడను: హార్దిక్ Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
చెన్నై పాంచ్ పటాకా
-
ఐపీఎల్కు గుడ్బై చెప్పిన అంబటి రాయుడు
టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నైసూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్-2023 ఫైనల్ అనంతరం ఈ క్యాష్రిచ్ లీగ్ నుంచి తప్పుకోనున్నట్లు రాయుడు తెలిపాడు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఆదివారం రాయుడు వెల్లడించాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరగనున్న తుదిపోరులో చెన్నైసూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఇక 2010లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన రాయుడు.. ఇప్పటివరకు 202 మ్యాచ్లు ఆడాడు. 2010 నుంచి 2017 సీజన్ వరకు ముంబైఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం 2018 సీజన్లో చెన్నైసూపర్కింగ్స్ జట్టులోకి రాయుడు చేరాడు. 2013, 2015,2017 సీజన్లో ఛాంపియన్గా నిలిచిన ముంబై జట్టులో రాయుడు భాగంగా ఉన్నాడు. "ముంబై, సీఎస్కే వంటి రెండు అద్భుతమైన జట్లకు ప్రాతినిద్యం వహించినందుకు చాలా గర్వంగా ఉంది. 204 మ్యాచ్లు, 14 సీజన్లు, 11 ప్లేఆఫ్లు, 8 ఫైనల్స్, 5 ట్రోఫీలు నా కెరీర్లో ఉన్నాయి. ఈ రోజు ఆరో టైటిల్ సాధిస్తాని ఆశిస్తున్నాను. ఈ ఫైనల్ మ్యాచ్తో ఐపీఎల్కు గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నాను. నా ఈ అద్భుతప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు. మళ్లీ యూ టర్న్ తీసుకోను" అంటూ ట్విటర్లో రాయుడు పేర్కొన్నాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 202 మ్యాచ్లు ఆడిన రాయుడు.. 4329 పరుగులు సాధించాడు. అతడి కెరీర్లో ఒక సెంచరీ ఉంది. చదవండి: IPL 2023 Final: అప్పుడు అంచనాలే లేవు.. కానీ ఇప్పుడు! అచ్చం ధోనిలాగే.. 2 great teams mi nd csk,204 matches,14 seasons,11 playoffs,8 finals,5 trophies.hopefully 6th tonight. It’s been quite a journey.I have decided that tonight’s final is going to be my last game in the Ipl.i truly hav enjoyed playing this great tournament.Thank u all. No u turn 😂🙏 — ATR (@RayuduAmbati) May 28, 2023 -
సీఎం వైఎస్ జగన్ను కలిసిన అంబటి రాయుడు
సాక్షి, తాడేపల్లి: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇవాళ (మే 11) తాడేపల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై రాయుడు సీఎం జగన్తో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, 2019లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
కంగ్రాట్స్ రాయుడు! ఆ రెండు ఇన్నింగ్స్ నా ఫేవరెట్! థాంక్యూ ఆకాశ్!
IPL 2023- Ambati Rayudu: తెలుగు క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అంబటి రాయుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. గత కొన్నేళ్లుగా సీఎస్కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ రైట్హ్యాండ్ బ్యాటర్.. బుధవారం నాటి మ్యాచ్తో ఐపీఎల్లో 200 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా సీఎస్కేతో పాటు ముంబై ఇండియన్స్ కూడా అంబటి రాయుడు అరుదైన ఘనతను గుర్తిస్తూ ట్రిబ్యూట్ ఇచ్చింది. మూడు ట్రోఫీలు కాగా గతంలో ముంబై ఫ్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహించిన రాయుడు ఆ జట్టు తరఫున 114 మ్యాచ్లు ఆడాడు. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ట్రోఫీలు గెలిచిన మూడు సందర్బాల్లో జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ముంబై ఫ్రాంఛైజీ యజమాని ఆకాశ్ అంబానీ రాయుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఆ రెండు ఇన్నింగ్స్ నా ఫేవరెట్ ఇందుకు సంబంధించిన వీడియోను ఎంఐ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ‘‘హాయ్ అంబటి.. ఐపీఎల్లో 200 మ్యాచ్లు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు. ముంబై ఇండియన్స్ విజయాల్లో నీకూ భాగం ఉంది. ముంబై తరఫున నువ్వు ఆడిన ఇన్నింగ్స్లో రెండు నా ఫేవరెట్. ఒకటి.. రాజస్తాన్ రాయల్స్ మీద 10 బంతుల్లో 30 పరుగులు చేశావు. 2014 నాటి ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆడిన అత్యుత్తమ మ్యాచ్లలో అదీ ఒకటి అని కచ్చితంగా చెప్పగలను. ఇక రెండోది.. బెంగళూరులో మ్యాచ్లో నువ్వూ, పొలార్డ్ కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ ఇన్నింగ్స్ కూడా నాకిష్టం. ముంబై ట్రోఫీలు గెలిచిన ప్రతీ సందర్భంలో నీ వంతు పాత్ర పోషించావు. కెరీర్లో నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. 200 మ్యాచ్లు పూర్తి చేసుకున్న నీకు మరోసారి శుభాకాంక్షలు. నీ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలి’’ అని ఆకాశ్ అంబానీ.. అంబటి రాయుడుకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. థాంక్యూ ఆకాశ్ ఇక ముంబై ఇండియన్స్ తనపై కురిపించిన ప్రేమకు బదులిస్తూ.. ‘‘నాపై నమ్మకం ఉంచి 2010 నుంచి నాకు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించారు. ముంబైతో నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ట్రోఫీ గెలిచిన సందర్భాలు ఎల్లప్పుడూ నా మదిలో మెదులుతూ ఉంటాయి. థాంక్యూ సో మచ్ ఆకాశ్. ఎంఐ పల్టన్’’ అంటూ అంబటి రాయుడు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్తో బుధవారం నాటి మ్యాచ్తో అంబటి రాయుడు 200 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో 17 బంతులు ఎదుర్కొన్న రాయుడు 23 పరుగులు సాధించాడు. ఇక చెపాక్లో జరిగిన ఈ మ్యాచ్లో సీఎస్కే ఢిల్లీపై 27 పరుగుల తేడాతో గెలుపొందింది. చదవండి: Virat Kohli-SKY: కాలం మారుతుంది! సూర్య అవుట్ కాగానే దగ్గరికి వచ్చిన కోహ్లి.. ఆ తర్వాత; వీడియో వైరల్ Thank you so much Akash and mi paltan..it really means a lot and have immense gratitude for giving me an opportunity and believing in me from 2010..I have such great memories with mi and I have cherished each and every trophy win that I have been a part of… 😊😊😊🙏🙏 https://t.co/BLuAEn8A5p — ATR (@RayuduAmbati) May 10, 2023 ATR going double the Ton Distance!🔥#CSKvDC #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/HbwBr8vRM4 — Chennai Super Kings (@ChennaiIPL) May 10, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నేను బ్యాటింగ్కు రాగానే వారికి నిరాశ! వీడెప్పుడు అవుట్ అవుతాడా అని..
IPL 2023- CSK Vs DC: మహేంద్ర సింగ్ ధోని.. ఆ పేరే ఓ పవర్హౌజ్. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించడంతో పాటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ను నాలుగు సార్లు చాంపియన్గా నిలిపిన ఈ మిస్టర్ కూల్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధోని క్రీజులో ఉంటే చాలు ప్రేక్షకులు పూనకంతో ఊగిపోతారు. ఒక్క షాట్ కొట్టినా చాలు తనదైన శైలిలో ఒక్క షాట్ కొట్టినా చూడాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఇక ఐపీఎల్-2023 ధోనికి చివరి సీజన్ అన్న వార్తల నేపథ్యంలో సీఎస్కే ఆడే ప్రతీ మ్యాచ్లోనూ.. స్టేడియం ఏదైనా ధోని నామస్మరణతో దద్దరిల్లిపోతోంది. మ్యాచ్ చెన్నైలోనా లేదంటే ప్రత్యర్థి సొంతమైదానంలోనా అన్న తేడా లేకుండా పసుపు వర్ణంతో స్టేడియం నిండిపోతోంది. ఎక్కడ చూసినా ధోని నామస్మరణే ఈడెన్ గార్డెన్స్లో ఇటీవల ధోనికి మద్దతుగా వేలాది మంది తరలిరావడం ఇందుకు ఓ ఉదాహరణ. ఇక ముంబైలోని వాంఖడే స్టేడియంలో ధోనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాకున్నా తన పేరును జపిస్తున్న ఫ్యాన్స్ కోసం ప్యాడ్స్ కట్టుకుని సమాయత్తమవుతున్నట్లు నటించి వారిని కాసేపు మురిపించాడు ధోని. అలాంటిది చెపాక్లో బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే.. ఊరుకుంటాడా?! యాడ్ కూడా వేయలేదు ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో అంబటి రాయుడు అవుట్ కాగానే క్రీజులోకి వచ్చిన ధోని.. 9 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్స్ల సాయంతో ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. తన మెరుపు ఇన్నింగ్స్తో అభిమానులను ఖుషీ చేశాడు. ఇక ధోని క్రేజ్ దృష్ట్యా బ్రాడ్కాస్టర్ యాడ్ కూడా వేయకుండా అతడు మైదానంలో అడుగుపెడుతున్న దృశ్యాలను చూపించిందంటే తలా క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు అవుట్ అవుతానా అని ఎదురుచూశారు! ఈ నేపథ్యంలో సీఎస్కే ప్రధాన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఏడో స్థానంలో నేను బ్యాటింగ్కు రాగానే ప్రేక్షకులు నిరాశ చెందారు. మహీ భాయ్ నామస్మరణ మొదలుపెట్టారు. ఒకవేళ నేను ఎక్కువ సేపు క్రీజులో ఉంటే.. వీడు ఎప్పుడెప్పుడు అవుట్ అవుతాడా అని వేచి చూసేవారేమో!’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. జడ్డూ ఆల్రౌండ్ ప్రతిభతో ఈ మ్యాచ్లో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన జడ్డూ 16 బంతుల్లో 21 పరుగులు చేశాడు. అదే విధంగా 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఒక వికెట్ తీశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ స్కోరర్ రిలీ రొసోవ్(35) రూపంలో కీలక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా ధోని క్రేజ్ గురించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: అతడిని బాగా మిస్ అవుతున్నాం.. కానీ తప్పదు! చాలా అరుదుగా ఉంటారు: ధోని అదృష్టం కలిసొచ్చింది.. ప్రపంచకప్కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా Super show with the ball from @ChennaiIPL! 👏 👏 The @msdhoni-led unit beat #DC by 2⃣7⃣ runs in Chennai to seal their 7⃣th win of the season! 👌 👌 Scorecard ▶️ https://t.co/soUtpXQjCX#TATAIPL | #CSKvDC pic.twitter.com/SnF0uo2uu4 — IndianPremierLeague (@IPL) May 10, 2023 Super show with the ball from @ChennaiIPL! 👏 👏 The @msdhoni-led unit beat #DC by 2⃣7⃣ runs in Chennai to seal their 7⃣th win of the season! 👌 👌 Scorecard ▶️ https://t.co/soUtpXQjCX#TATAIPL | #CSKvDC pic.twitter.com/SnF0uo2uu4 — IndianPremierLeague (@IPL) May 10, 2023 Spinning and Winning! That’s the trick! 🪄#CSKvDC #WhistlePodu #Yellove 🦁💛 @imjadeja pic.twitter.com/mzWIb9pnoF — Chennai Super Kings (@ChennaiIPL) May 11, 2023 -
'పొరపాటులో మరిచిపోయాడు.. వదిలేయండి!'
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా బుధవారం చెన్నై వేదికగా సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. అయితే టాస్ సమయంలో ధోని సీఎస్కే తుది జట్టు విషయంలో చిన్న పొరపాటు చేశాడు. టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకున్న ధోని.. తుది జట్టులో ఏమైనా మార్పులు ఉన్నాయా అని అడగ్గా.. ''అవును.. దూబే స్థానంలో రాయుడు జట్టులోకి వచ్చాడు'' అని పేర్కొన్నాడు. అయితే వాస్తవానికి దూబే తుది జట్టులో ఉన్నాడు. అంబటి రాయుడు కూడా జట్టులో ఉన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ పేరు చెప్పబోయి పొరపాటున దూబే పేరు చెప్పాడు. ఇది చూసిన కొంతమంది యాంటీ సీఎస్కే ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. ''తుది జట్టులో ఎవరున్నారన్న దానిపై కెప్టెన్కే క్లారిటీ లేదు'' అంటూ కామెంట్ చేశారు. దీనిపై ఆగ్రహించిన సీఎస్కే ఫ్యాన్స్.. ''అంత సీన్ లేదు.. కెప్టెన్ అన్నప్పుడు ఒత్తిడి ఉంటుంది.. అయినా ఏదో పొరపాటులో మరిచిపోయాడు.. ఇక్కడితో వదిలేయండి'' అంటూ పేర్కొన్నారు. WON THE TOSS, BATTING FIRST AND RAYUDU IN PLACE OF DUBE. pic.twitter.com/314EXJ6mS3 — Heisenberg ☢ (@internetumpire) May 10, 2023 చదవండి: ఆస్కార్ గెలిచిన వీరులతో ఎంఎస్ ధోని -
CSK VS SRH: మార్కండే సూపర్ డెలివరీ..అయ్యో ఎంత పని జరిగిపోయింది!
ఐపీఎల్ 2023లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో నిన్న (ఏప్రిల్ 21) జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ధోని దళం ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి, సూపర్ విక్టరీ సాధించింది. జడేజా అదిరిపోయే బౌలింగ్ పెర్ఫార్మెన్స్ (4-0-22-3), డెవాన్ కాన్వే (77 నాటౌట్) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో సీఎస్కేకు సునాయాస విజయాన్ని అందించారు. వీరితో పాటు జట్టులోని అందరూ తలో చేయి వేయడంతో సీఎస్కే కంఫర్టబుల్ విక్టరీ సాధించింది. తద్వారా 8 పాయింట్లు (0.355) ఖాతాలో వేసుకుని, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ రాయల్స్ (1.043), లక్నో సూపర్ జెయింట్స్ (0.709) సైతం ఎనిమిదే పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. Deceived and How! A beaut of a delivery THAT by Mayank Markande 🔥 Follow the match ▶️ https://t.co/0NT6FhLKg8#TATAIPL | #CSKvSRH pic.twitter.com/bgvGctoeCN — IndianPremierLeague (@IPL) April 21, 2023 ఇన్ని సానుకూల అంశాల నడుమ సీఎస్కేను ఒక్క విషయం మాత్రం తీవ్రంగా బాధిస్తుంది. అదే, ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ అంబటి రాయుడు ఫామ్ లేమి. ప్రస్తుత సీజన్లో రాయుడు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. లక్నో (27 నాటౌట్), ముంబై (20 నాటౌట్)లపై ఓ మోస్తరు ప్రదర్శనలు మినహాయించి, మిగతా 4 మ్యాచ్ల్లో అతను దారుణంగా విఫలమయ్యాడు. ఈసారి ఎలాగైనా టైటిల్ నెగ్గి కెరీర్ను ఘనంగా ముగించాలనుకుంటున్న అతనికి, అతని కెప్టెన్ ధోనికి ఈ విషయం అస్సలు సహించడం లేదని సమాచారం. మరి ముఖ్యంగా సన్రైజర్స్తో మ్యాచ్లో రాయుడు ఔటైన విధానం, కెప్టెన్తో పాటు ఫ్యాన్స్కు సైతం విస్మయాన్ని కలిగించింది. మయాంక్ మార్కండే బౌలింగ్లో బంతిని జడ్జ్ చేయడంలో విఫలమైన రాయుడు (9).. చాలా చీప్గా క్లీన్ బౌల్డయ్యాడు. రాయుడు చీప్ డిస్మిసల్పై సీఎస్కే ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ట్యాగ్ చేస్తూ.. రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏమయ్యా రాయుడు.. మరీ ఇంత చీప్గా బౌల్డ్ అయిపోతివి అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ప్రజలందరి నమ్మకం మీపైనే.. సీఎం జగన్పై అంబటి రాయుడు ప్రశంసలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసలు కురిపించారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి మూలస్తంభమైన మూలపేట పోర్టుకు బుధవారం శంకుస్థాపన చేసిన తర్వాత.. సీఎం జగన్ నౌపడలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని వైఎస్సార్సీపీ ట్విట్టర్లో పోస్టు చేసింది. దానిని అంబటి రాయుడు రీట్వీట్ చేస్తూ.. ‘మన సీఎం వైఎస్ జగన్ ప్రసంగం అత్యద్భుతం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పూర్తిగా నమ్మేది, విశ్వసించేది మిమ్మల్నే సర్’ అంటూ కొనియాడారు. ఈ యుద్ధంలో నా ధైర్యం, నా నమ్మకం, నా ఆత్మవిశ్వాసం మీరే!! #CMYSJagan #MaaNammakamNuvveJagan pic.twitter.com/0qYpgtMtVp — YSR Congress Party (@YSRCParty) April 19, 2023 -
GT Vs CSK: ప్లీజ్.. అతడిని తప్పించండి! ఒక్కడి వల్ల ఇన్ని అనర్థాలు!
Gujarat Titans vs Chennai Super Kings: టీమిండియా పేస్ ఆల్రౌండర్ శివం దూబేపై చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు మండిపడుతున్నారు. జిడ్డు బ్యాటింగ్తో సీఎస్కే ఓటమికి కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి మ్యాచ్లో అతడిని తప్పించాలంటూ సోషల్ మీడియా వేదికగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2023 మెగా ఈవెంట్కు శుక్రవారం తెరలేచిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్తో చెన్నై తలపడింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ధోని సేనకు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(92) శుభారంభం అందించాడు. కానీ మిగతా వాళ్ల నుంచి అతడికి సహకారం లభించలేదు. ముఖ్యంగా అంబటి రాయుడు, శివం దూబే బంతులు వృథా చేశారు. రాయుడు 12 బంతుల్లో 12 పరుగులు సాధించగా.. దూబే 18 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 20 ఓవర్లలో 178 పరుగులు చేసిన చెన్నై.. లక్ష్య ఛేదనలో గుజరాత్ విజయవంతం కావడంతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా శివం దూబేపై విమర్శల వర్షం కురుస్తోంది. నీ స్వార్థం కారణంగా చెన్నై ఓడిపోయింది. ఒక్కడి వల్ల ఇన్ని అనర్థాలు ‘‘శివం దూబే వల్లే జోష్ మీదున్న గైక్వాడ్ మొమెంటమ్ కోల్పోయాడు. సెంచరీ చేజార్చుకున్నాడు. ధోని అభిమానులకు ఒక్క సిక్సర్ కూడా చూసే అవకాశం లేకుండా పోయింది. ఐపీఎల్-2023లో సీఎస్కేకు ఆరంభ మ్యాచ్లోనే ఓటమి ఎదురైంది. ఇన్నిఅనర్థాలకు దూబేనే కారణం’’ అని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. కాగా శివం దూబే తమకు ఆప్షన్ మాత్రనేనని, ఏదేమైనా బ్యాటర్లు మెరుగ్గా రాణించాల్సిందంటూ ధోని తమ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యం కారణమని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అంబటి రాయుడు స్థానంలో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ తుషార్ దేశ్పాండే నోబాల్స్తో పాటు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతడిపై కూడా ఫ్యాన్స్ మండిపడుతున్నాడు. కొత్త రూల్ వల్ల ఈ మహానుభావుడిని ఆడించి సీఎస్కే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2023: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రుతురాజ్.. తొలి భారత క్రికెటర్గా! WC 2023: చెలరేగిన మగల, బవుమా.. వెస్టిండీస్ పాలిట శాపంలా సౌతాఫ్రికా! ‘ప్రపంచకప్’ రేసులో.. We Had Lost This Match Because Dube And Rayudu .Especially Shivam Dube .Because He Had Wasted The Lots Of Balls And Overs. So Especially Kindly Drop These 2 Players In Upcoming Every Matches — Sam (@samkutty865) April 1, 2023 Because of Shivam Dube: -Gaikwad lost his momentum to score hundred. -Jaddu lost his wicket. -Dhoni fans not able to see more than 1 six. -CSK lost their momentum and gave below par target(yes its below par for this pitch). -CSK lost their opening match against GT.#CSKvsGT pic.twitter.com/VEMHDeFLpF — 𝐑𝐮𝐠𝐠𝐚™ (@LoyalYashFan) March 31, 2023 Shivam Dube just retire hurt man. What a selfish cricketer. Thank God, we have sleeper cell in Vijay Shankar ik opposite team. Or else we'd be screwed — VRS (@azizdopleganger) March 31, 2023 -
సిద్దిపేటలో హీరో నాని, క్రికెటర్ అంబటి రాయుడు సందడి..
-
కేసీఆర్ కారణజన్ముడు
సాక్షి, సిద్దిపేట: కే.. అంటే కారణజన్ముడు.. సీ.. అంటే చిరస్మరణీయుడు.. ఆర్.. అంటే మన తలరాతలను మార్చిన మహనీయుడు కేసీఆర్ అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అభివర్ణించారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుక్రవారం. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సిద్దిపేట జయశంకర్ క్రికెట్ స్టేడియంలో కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్–3ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘దసరా’సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో హీరో నాని మాట్లాడుతూ 373 టీమ్లతో ప్రపంచంలో ఎక్కడ కూడా క్రికెట్ టోర్నమెంట్ జరగలేదన్నారు. ఇంత పెద్ద టోర్నమెంట్ను నిర్వహిస్తున్న మంత్రి హరీశ్ను అభినందించారు. క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ తాను కేసీఆర్ అభిమానినన్నారు. -
అప్పుడు రాయుడు.. ఇప్పుడు సంజూకు అన్యాయం: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు మరోసారి నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్తో మూడో వన్డేకు కూడా శాంసన్కు భారత తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ క్రమంలో భారత జట్టు మేనేజేమెంట్పై విమర్శల వర్షం కురిస్తోంది. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కీలక వాఖ్యలు చేశాడు. వరుసగా విఫలమవుతున్న రిషబ్ పంత్ స్థానంలో సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లకు ఇవ్వకపోవడం పట్ల బీసీసీఐపై కనేరియా విమర్శల వర్షం కురిపించాడు. అదే విధంగా భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడుకు జరిగిన ఆన్యాయమే ఇప్పుడు శాంసన్కు జరుగుతోంది అని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్ వేదికగా జరిగిన జరిగిన 2019 వన్డే ప్రపంచకప్కు భారత జట్టులో అద్భుతమైన ఫామ్లో ఉన్న రాయుడుకి చోటు దక్కుతుందని అంతా భావించారు. అయితే ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనూహ్యంగా రాయుడిని ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో ఆల్ రౌండర్ విజయ్ శంకర్కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. దీంతో నిరాశకు గురైన రాయుడు 2019లోనే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. రాయుడికి జరిగిన అన్యాయమే ఇప్పుడు సంజూకు "సంజూ శాంసన్ లాంటి అద్భుతమైన ఆటగాడికి తరుచూ ఆన్యాయం జరుగుతోంది. ప్రతీ ఒక్క ఆటగాడికి కొంతవరకే సహనం, ఓపిక ఉంటుంది. అతడు నిరాశకు గురై రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అప్పుడు భారత జట్టు ఒక మంచి ఆటగాడిని కచ్చితంగా కోల్పోతుంది. ఏ జట్టు అయినా మంచి ఫుల్ పాట్లు, ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు ఆడే ఆటగాడు కావాలని భావిస్తోంది. కానీ భారత జట్టు మాత్రం సంజూ లాంటి అద్భుతమైన ఆటగాడిని పక్కన పెడూతూ వస్తుంది. అంబటి రాయుడు కెరీర్ కూడా ఇలాగే ముగిసింది. అతడు భారత తరపున అద్భుతంగా రాణించాడు. కానీ అతడి పట్ల బీసీసీఐ చిన్నచూపు చూసింది. బీసీసీఐ, సెలక్షన్ కమిటీ అంతర్గత రాజకీయాలకు రాయడు బలైపోయాడు" అని తన యూట్యూబ్ ఛానల్లో కనేరియా పేర్కొన్నాడు. -
బరోడా జట్టుకు ఆడనున్న అంబటి రాయుడు
సీనియర్ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు దేశవాళీ క్రికెట్లో మరోసారి బరోడా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని బరోడా క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ శిశిర్ హట్టంగడి ధ్రువీకరించారు. గత సీజన్ వరకు రాయుడు ఆంధ్ర తరఫున ఆడాడు. దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్, ఆంధ్ర, విదర్భలతో పాటు 2012–14 మధ్య రాయుడు బరోడా తరఫునే బరిలోకి దిగాడు. కాగా గతంలో బరోడాకు ప్రాతినిథ్యం వహించిన 36 ఏళ్ల రాయుడు.. మరోసారి ఈ జట్టుకు ఆడాలని ఉందని బీసీఏను సంప్రదించిన నేపథ్యంలో ఈ మేరకు సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. అతడు ప్రొఫెషనల్ కేటగిరీలో ఆడనున్నాడు. ఇక అంబటి రాయుడు టీమిండియాకు 55 వన్డేలు, 6 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. చివరిసారిగా 2019 మార్చిలో జాతీయ జట్టుకు ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. చదవండి: ICC World Cup Super League: వన్డే సిరీస్ రద్దు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్! ప్రపంచకప్ రేసు నుంచి తప్పుకొన్నట్లేనా? Ravichandran Ashwin: అదే జరిగితే వన్డేల అస్తిత్వం ప్రమాదంలో పడ్డట్లే! -
బరోడా జట్టు తరపున ఆడనున్న అంబటి రాయుడు
టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు రాబోయే దేశవాళీ సీజన్లో బరోడా జట్టు తరపున ఆడునున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. రాయుడు ఇప్పటికే బరోడా క్రికెట్ అసోసియేషన్తో చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా రాయుడు తన కెరీర్లో ఇప్పటికే బరోడా తరఫున నాలుగు సీజన్లు ఆడాడు. కాగా జూన్లో బరోడా సన్నాహక శిబిరంలో రాయుడు చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతేడాది సీజన్లో బరోడా సారథి కృనాల్ పాండ్యాతో విభేదాలు ఏర్పాడిన తర్వాత.. దీపక్ హుడా బరోడా జట్టు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే దీపక్ హుడా ప్రస్తుతం రాజస్థాన్ తరపున ఆడుతున్నాడు. అయితే అతడి స్థానంలో రాయుడును భర్తీ చేయాలని బరోడా క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది. చదవండి: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్.. ఉమ్రాన్, డీకేలకు అవకాశం -
CSK VS GT: అందుకే రాయుడిని పక్కకు పెట్టారట..!
ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ఇవాళ (మే 15) గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ స్లోగా మారుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం (బ్యాటింగ్) తీసుకున్నట్లు ఆ జట్టు కెప్టెన్ ధోని తెలిపాడు. టాస్ గెలిచిన అనంతరం ధోని మాట్లాడుతూ.. ఈ సీజన్లో తీక్షణ, డెవాన్ కాన్వే అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడాడు. నామమాత్రపు మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ కోసం భారీ మార్పులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. సీనియర్లైన రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో, మహీశ్ తీక్షణలను బెంచ్కు పరిమితం చేసి యువ ఆటగాళ్లు ఎన్ జగదీషన్, ప్రశాంత్ సోలంకీ, మతీష పతిరన, మిచెల్ సాంట్నర్లను అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపాడు. కొత్తవారికి అవకాశం కల్పించేందుకు సీనియర్లకు రెస్ట్ ఇచ్చామని వివరణ ఇచ్చాడు. అయితే సీఎస్కే జట్టులో ఈ స్థాయి మార్పులు జరగడంపై అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్తో మ్యాచ్కు ముందు రోజే అంబటి రాయుడు రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించి ఆ తర్వాత తిరిగి వెనక్కు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రాయుడుపై వేటు పడిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక మిగతా సీనియర్లు ఊతప్ప, బ్రావోలను ఇంటికి పంపేందుకే (వచ్చే ఏడాది) ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని సందేహాలు కలుగుతున్నాయి. మొత్తంగా సీఎస్కేలో ఏదో జరుగుతుందని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే, గుజరాత్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (49 బంతుల్లో 53; 6 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించగా.. జగదీషన్ (33 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ధోని (10 బంతుల్లో 7) మరోసారి దారుణంగా నిరుత్సాహపరిచాడు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి సీఎస్కేను కట్టడి చేశారు. షమీ 2 వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, అల్జరీ జోసఫ్, సాయికిషోర్ తలో వికెట్ సాధించారు. తుది జట్లు.. సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, శివం దూబే, ఎన్ జగదీషన్, ఎంఎస్ ధోని(కెప్టెన్), మిచెల్ సాండ్నర్, ప్రశాంత్ సోలంకి, సిమ్రన్జిత్ సింగ్, మతీష పతిరన, ముఖేశ్ చౌదరి గుజరాత్ టైటాన్స్: శుభ్మన్ గిల్, వృద్దిమాన్ సాహా(కీపర్), మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, సాయి కిషోర్, యశ్ దయాల్ చదవండి: సైమండ్స్ మృతికి సంతాపం.. నల్ల బ్యాండ్లతో బరిలోకి దిగిన గుజరాత్, చెన్నై ఆటగాళ్లు.. -
తూచ్.. రిటైర్ కావట్లేదు.. రిటైర్మెంట్ ప్రకటనపై వెనక్కు తగ్గిన రాయుడు
Ambati Rayudu Deletes Retirment Tweet: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు.. రిటైర్మెంట్ (ఐపీఎల్) విషయంలో మనసు మార్చుకున్నట్లున్నాడు. ఈ సీజన్ (2022) తర్వాత ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ (మే 14) ఉదయం ట్వీట్ చేసిన రాయుడు.. నిమిషాల వ్యవధిలో ఆ ట్వీట్ను డిలీట్ చేశాడు. రాయుడు ఇచ్చిన ఈ ట్విస్ట్తో అభిమానులు కన్ఫ్యూజన్లో పడిపోయారు. రాయుడు రిటైర్మెంట్పై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ స్పందించాడు. రాయుడు రిటైర్ కావట్లేదని క్లారిటీ ఇచ్చాడు. గత కొంత కాలంగా సరైన ప్రదర్శన చేయలేకపోతున్నానన్న బాధలో రాయుడు ఉన్నాడని, ఆ నిరాశలోనే అతను రిటైర్మెంట్ ప్రకటన చేశాడని, వచ్చే సీజన్ కూడా రాయుడు తమతోనే ఉంటాడని వివరణ ఇచ్చాడు. 36 ఏళ్ల రాయుడు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 12 మ్యాచ్ల్లో 27.10 సగటున 271 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో సంతృప్తి చెందకనే రాయుడు రిటైర్మెంట్ ప్రకటన చేసినట్లు సీఎస్కే సీఈవో పేర్కొన్నాడు.రాయుడు తన ట్వీట్లో ఈ విధంగా స్పందించాడు. 'ఐపీఎల్లో ఇదే నా ఆఖరు సీజన్ అని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున తన 13 ఏళ్ల ఐపీఎల్ ప్రస్థానం చాలా సంతృప్తిని ఇచ్చింది.. ఆ రెండు జట్లతో గొప్ప క్షణాలు గడిపాను.. ముంబై, సీఎస్కేకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ (2010-2017), సీఎస్కే (2018 నుంచి) జట్లకు ప్రాతినిధ్యం వహించిన రాయుడు.. 187 మ్యాచ్ల కెరీర్లో 127.26 స్ట్రైయిక్ రేట్తో 29.28 సగటున 4187 పరుగులు చేశాడు. 2022 మెగా వేలంలో సీఎస్కే రాయుడుని 6.75 కోట్లకు తిరిగి దక్కించుకుంది. ఈ సీజన్లో సీఎస్కే తరఫున రుతురాజ్ (313 పరుగులు), శివమ్ దూబే (289) తర్వాత అత్యధిక పరుగులు చేసింది రాయుడే (271) కావడం విశేషం. చదవండి: సీఎస్కే షాకిచ్చిన స్టార్ క్రికెటర్.. అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటన -
సీఎస్కే షాకిచ్చిన స్టార్ క్రికెటర్.. అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటన
Ambati Rayudu Retires From IPL: ఐపీఎల్ 2022 సీజన్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్కు అస్సలు కలిసి రాలేదు. వరుస గాయాలు, పరాజయాలు, కెప్టెన్సీ మార్పు, సీనియర్ ఆటగాళ్ల పేలవ ప్రదర్శన, అంపైరింగ్ తప్పిదాలు.. ఇలా ప్రతి ఒక్క విషయంలో ఆ జట్టును దురదృష్టం వెంటాడింది. వరుసగా పరాజయాలను ఎదుర్కొని ఆతర్వాత కెప్టెన్ మార్పుతో తిరిగి విన్నంగ్ ట్రాక్ ఎక్కినప్పటికీ.. కీలక మ్యాచ్లో దారుణ పరాజయాన్ని (ముంబై) మూటగట్టుకుని ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. మరో రెండు మ్యాచ్లు ఆడితే ఈ సీజన్లో సీఎస్కే ప్రస్థానం ముగుస్తుంది. I am happy to announce that this will be my last ipl. I have had a wonderful time playing it and being a part of 2 great teams for 13 years. Would love to sincerely thank Mumbai Indians and Csk for the wonderful journey. — Ambati Rayudu (@RayuduAmbati) May 14, 2022 ఇదిలా ఉంటే, లీగ్ నుంచి నిష్క్రమించిన బాధలో ఉన్న చెన్నై జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. సీనియర్ ప్లేయర్, తెలుగు ఆటగాడు అంబటి రాయుడు ఈ సీజన్తో ఐపీఎల్కు గుడ్బై చెబుతున్నట్లు ట్విటర్ వేదికగా షాకింగ్ ప్రకటన చేశాడు. రాయుడు అకస్మాత్తుగా ఈ ప్రకటన చేయడంతో సీఎస్కే యాజమాన్యానికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ధోని, రాయుడు లాంటి సీనియర్లు వచ్చే సీజన్కు అందుబాటులో ఉండకపోతే తమ పరిస్థితి ఏంటని వారు ఆలోచనలో పడ్డారు. మరో పక్క రాబిన్ ఉతప్ప, డ్వేన్ బ్రావో లాంటి వెటరన్లు కూడా రిటైర్మెంట్కు దగ్గర పడ్డారు. కెప్టెన్సీ వివాదం కారణంగా జడేజా కూడా సీఎస్కేతో బంధం తెంచుకుంటే ఆ జట్టు భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారనుంది. ప్రస్తుతానికి ఆ జట్టు ఆశలన్నీ రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, ముకేశ్ చౌదరీపైనే ఉన్నాయి. కాగా, అంబటి రాయుడుకి ఐపీఎల్లో సీఎస్కేతో చాలా అనుబంధం ఉంది. రాయుడు.. తన 13 ఏళ్ల క్యాష్ రిచ్ లీగ్ కెరీర్లో ముంబై ఇండియన్స్ తర్వాత అత్యధిక సీజన్లు సీఎస్కేతోనే ఉన్నాడు. ఐపీఎల్లో మొత్తం 187 మ్యాచ్లు ఆడిన రాయుడు 29.28 సగటున 4187 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: IPL 2022: ధోని తర్వాత సీఎస్కే కెప్టెన్గా రుతురాజ్..! -
సీఎస్కేకు మరో బిగ్ షాక్.. ఆ ఒక్కడు కూడా..!
Ambati Rayudu Injury: డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ 2022 సీజన్ బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు ఏదీ కలిసి రావట్లేదు. ఓ పక్క వరుస పరాజయాలు, మరో పక్క గాయాల బెడద ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలకు దాదాపుగా గండికొట్టాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ఆ జట్టుకు తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. మిడిలార్డర్లో అడపాదడపా రాణిస్తున్న అంబటి రాయుడు గాయం బారిన పడ్డాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా అతని గాయం తీవ్రతరమైందని ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించాడు. ఆ మ్యాచ్లో సుడిగాలి ఇన్నింగ్స్(39 బంతుల్లో 78; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆడి ప్రత్యర్ధికి ముచ్చెమటలు పట్టించిన రాయుడికి అప్పటికే గాయమైందని, గాయంతోనే అతను బ్యాటింగ్ కొనసాగించాడని, దాంతో గాయం మరింత తీవ్రమైందని ఫ్లెమింగ్ తెలిపాడు. మే 1న సన్రైజర్స్తో మ్యాచ్ సమయానికి రాయుడు కోలుకుంటాడన్న నమ్మకం లేదని ఆయన పేర్కొన్నాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇచ్చిన అప్డేట్ను బట్టి చూస్తే.. సీఎస్కే ఆడబోయే తదుపరి మ్యాచ్లకు రాయుడు అందుబాటులో ఉండడని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుత సీజన్లో రాయుడు 8 మ్యాచ్ల్లో 35.14 సగటున 129.47 స్ట్రైక్ రేట్తో 246 పరుగులు చేశాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ 78. ఇదిలా ఉంటే, రాయుడుతో కలుపుకుని ఈ సీజన్లో గాయాల కారణంగా సీఎస్కేకు దూరమైన ఆటగాళ్ల సంఖ్య మూడుకి చేరింది. తొలుత దీపక్ చాహర్, ఆ తర్వాత ఆడమ్ మిల్నే గాయాల కారణంగా వైదొలిగారు. చదవండి: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్గా అతడే.. హెడ్కోచ్గా గ్యారీ కిర్స్టన్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రనౌట్ విషయంలో రాయుడు చెత్త రికార్డు
సీఎస్కే ఆటగాడు అంబటి రాయుడు రనౌట్ల విషయంలో చెత్త రికార్డు నమోదు చేశాడు. కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో నరైన్ బౌలింగ్లో జడేజా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఇంతలో సమన్వయలోపంతో రాయుడు సగం క్రీజు దాటి వచ్చేశాడు. అప్పటికే బంతిని అందుకున్న శ్రేయాస్ అయ్యర్ మెరుపు వేగంతో త్రో విసిరాడు. రాయుడు క్రీజులోకి చేరుకునేలోపే నరైన్ బెయిల్స్ ఎగురగొట్టాడు. దీంతో రాయుడు నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో రాయుడు ఒక చెత్త రికార్డు సాధించాడు. ఇప్పటివరకు రాయుడు తాజా దానితో కలిపి 15 సార్లు రనౌట్ అయ్యాడు. ఐపీఎల్లో అత్యధికసార్లు రనౌట్ అయిన ఆటగాళ్లలో సురేశ్ రైనాతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. 16 సార్లు రనౌట్తో ధావన్, గంభీర్లు తొలి స్థానంలో ఉన్నారు. ఇక ఏబీ డివిలియర్స్ 14 సార్లు రనౌట్ అయి మూడో స్థానంలో ఉన్నాడు. రాయుడు రనౌట్ ఇక్కడ కోసం క్లిక్ చేయండి -
IPL 2022: చెన్నై, కేకేఆర్ ఆటగాళ్లను ఊరిస్తున్న ఆ అరుదైన రికార్డులేంటో చూద్దాం..!
Bravo, Rahane, Rayudu Eye Big Milestones: ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచ్లో ఇవాళ (మార్చి 26) డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్ నుంచి సీఎస్కే, కేకేఆర్ జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. చెన్నై జట్టుకు రవీంద్ర జడేజా, కేకేఆర్ను శ్రేయస్ అయ్యర్ ముందుండి నడిపించనున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న సీఎస్కే.. క్యాష్ రిచ్ లీగ్లో ఇప్పటికే 4 టైటిళ్లు సొంతం చేసుకుని మరో టైటిల్ కోసం తహతహలాడుతుండగా, 2 ఐపీఎల్ టైటిళ్లను సాధించిన కేకేఆర్ సైతం కొత్త కెప్టెన్ నేతృత్వంలో ప్రత్యర్ధులకు ఛాలెంజ్ విసురుతుంది. బలాబలాల విషయానికొస్తే.. ఇరు జట్లు క్యాష్ రిచ్ లీగ్లో ఇప్పటివరకు 26 సార్లు తలపడగా, సీఎస్కే 17, కేకేఆర్ 8 సందర్భాల్లో విజయాలు సాధించాయి. మరో మ్యాచ్లో ఫలితంగా తేలలేదు. ఇక, నేటి మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. అవి ఏంటంటే. సీఎస్కే సీనియర్ బ్యాటర్ అంబటి రాయుడు ఈ మ్యాచ్లో మరో 84 పరుగులు చేస్తే ఐపీఎల్ 4000 పరుగుల క్లబ్లో చేరతాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో (167) ఈ మ్యాచ్లో మరో 4 వికెట్లు తీస్తే ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన మలింగ (170 వికెట్లు) రికార్డును బద్దలు కొడతాడు. ఈ సీజన్లో కేకేఆర్ తరఫున ఆడుతున్న వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే ఐపీఎల్లో నాలుగు వేల పరుగులు పూర్తి చేసేందుకు మరో 59 పరుగుల దూరంలో ఉన్నాడు. చదవండి: IPL 2022: శివాలెత్తిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు.. ఇక ప్రత్యర్ధులకు చుక్కలే..! -
ఐపీఎల్లో ఆడుతున్న తెలుగు ఆటగాళ్లు ఎవరో తెలుసా?
ఐపీఎల్-2022 సమరానికి రంగం సిద్ధమైంది. శనివారం(మార్చి 26)న వాంఖడే వేదికగా కోల్కతా- చెన్నై మధ్య జరగనున్న మ్యాచ్తో ఈ క్యాష్ రిచ్ లీగ్కు తెరలేవనుంది. అయితే ఆ మెగా టోర్నమెంట్లో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు సత్తా చాటడానికి సిద్దమమ్యారు. ఈ సారి ఐపీఎల్లో ఆయా జట్లకు ఆడుతున్న హైదరాబాద్, ఆంధ్ర జట్ల ఆటగాళ్లో ఎవరో ఓ లూక్కేద్దం. ఆంధ్ర జట్టు నుంచి అంబటి రాయుడు, భగత్ వర్మ, కోన శ్రీకర్ భరత్.. హైదరాబాద్ జట్టు నుంచి సీవీ మిలింద్, మొహమ్మద్ సిరాజ్, రాహుల్ బుద్ధి, ఠాకూర్ తిలక్ వర్మ ఐపీఎల్లో భాగమయ్యారు. ఐపీఎల్-2022లో అంబటి రాయుడు, భగత్ వర్మ చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతనిద్యం వహిస్తుండగా.. కోన శ్రీకర్ భరత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. అదే విధంగా సీవీ మిలింద్, మొహమ్మద్ సిరాజ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతుండగా.. రాహుల్ బుద్ధి, ఠాకూర్ తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ జట్టులో భాగమయ్యారు. చదవండి: IPL 2022: "మా నాన్నని నేను చాలా మిస్ అవుతున్నా".. ఐపీఎల్ ముంగిట పంత్ భావోద్వేగం -
చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్.. మరో స్టార్ ఆటగాడు దూరం!
ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్కు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డాడు. ఐపీఎల్ 2022 సన్నాహకాల్లో భాగంగా సూరత్లోని లాల్భాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో ప్రాక్టీస్ క్యాంప్లో చెన్నై సూపర్కింగ్స్ జట్టు బిజీబిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే రాయుడు చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. తాజాగా సీఎస్కే నెట్ బౌలర్ రాకీ బర్త్డే సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సెలబ్రేషన్స్కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో సీఎస్కే పోస్టు చేసింది. ఈ వీడియోలో రాయుడు చేతికి బ్యాండేజ్ వేసుకుని కనిపించాడు. ఇక రాయుడు గాయం నుంచి కోలుకోవడానికి కొన్ని వారాలు సమయం పట్టనున్నట్లు సమాచారం. దీంతో రాయుడు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఐపీఎల్ మెగా వేలంలో రాయుడుని చెన్నై రూ.6.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ఆ జట్టు స్టార్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా ఐపీఎల్ సగం సీజన్కు దూరమైన సంగతి తెలిసిందే. కాగా మార్చి 26న కోల్కతా నైట్రైడర్స్తో వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి మ్యాచ్లో తలపడనుంది. చెన్నైసూపర్ కింగ్స్ జట్టు: ఎంఎస్ ధోని (12 కోట్లు), రవీంద్ర జడేజా(16 కోట్లు), మొయిన్ అలీ (8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్( 6 కోట్లు), దీపక్ చాహర్( 14 కోట్లు), అంబటి రాయుడు(6.75 కోట్లు), డ్వేన్ బ్రావో (4.4 కోట్లు), శివమ్ దూబే( 4 కోట్లు), క్రిస్ జోర్డాన్( 3.6 కోట్లు), రాబిన్ ఉతప్ప(2 కోట్లు), మిచెల్ సాంట్నర్ (1.9 కోట్లు), ఆడమ్ మిల్నే (1.9 కోట్లు), విక్రమ్ సోలంకి(1.2 కోట్లు), రాజ్వర్థన్(1.5 కోట్లు), డేవాన్ కాన్వే (రూ. కోటి), మహీష్ తీక్షణ (70 లక్షలు), ప్రిటోరియస్ ( 50 లక్షలు), కేఎమ్ అసిఫ్ (20 లక్షలు), తుషార్ దేశ్పాండే (20 లక్షలు), సిమ్రన్జీత్ సింగ్ (20 లక్షలు), శుభ్రాన్ష్ సేనాపతి (20 లక్షలు), ముకేశ్ చౌధరి (20 లక్షలు), జగదీశన్ (20 లక్షలు), హరి నిషాంత్(20 లక్షలు) చదవండి: IPL 2022: నెట్ బౌలర్ జన్మదిన వేడుకలను దగ్గరుండి జరిపించిన ధోని .@MSDhoni and team celebrates 'Net Bowler's' birthday in Surat camp 💛🦁#WhistlePodu | #IPL2022pic.twitter.com/VHndesiqVb — CSK Fans Army™ 🦁 (@CSKFansArmy) March 9, 2022 -
మెగా వేలానికి ముందు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన తెలుగు క్రికెటర్
ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగే ఐపీఎల్ మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు, తెలుగు క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. మెగా వేలంలో కేవలం బ్యాటర్గా అయితే భారీ ధర పలికే అవకాశం లేదని, వికెట్కీపర్ కమ్ బ్యాటర్గా రిజిస్టర్ చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. వేలంలో పాల్గొనే తుది జాబితా వెలువడ్డాక ఈ విషయం వెలుగుచూసింది. అయితే, వేలంలో రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రాయుడుకు వికెట్ కీపింగ్ కొత్తేమీ కాదు. గతంలో పలు మార్లు దేశవాళీ క్రికెట్తోపాటు ఐపీఎల్లోనూ వికెట్ కీపర్గా దర్శనమిచ్చాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించిన సమయంలో చాలా సందర్భాల్లో వికెట్కీపింగ్లోనూ మెరిశాడు. ఐపీఎల్ వేలంలో ఎప్పుడూ బ్యాటర్ల విభాగంలోనే పోటీ పడే రాయుడు.. ఈసారి వేలంలో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ల విభాగంలో పేరు నమోదు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాయుడు వయసు 36 ఏళ్లు కావడంతో వేలంలో కఠిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిసి ఇలా చేసి ఉంటాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, సీఎస్కే.. గతేడాది రాయుడును రూ. 2.20 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. గతేడాది లీగ్లో 16 మ్యాచ్లు ఆడిన అతను 28 సగటుతో 257 పరుగులు చేశాడు. ఓవరాల్గా రాయుడు తన ఐపీఎల్ కెరీర్లో మొత్తం 175 మ్యాచ్లు ఆడి 29 సగటుతో 3916 పరుగులు చేశాడు. ఇందులో 21 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి. చదవండి: టీమిండియాపై చెలరేగిన దక్షిణాఫ్రికా క్రికెటర్కు కరోనా.. -
ఈ క్రికెటర్లకు భారీ డిమాండ్, రికార్డు ధర ఖాయం.. అంబటి రాయుడు కనీస విలువ ఎంతంటే!
IPL 2022 Auction: Do You Know Ambati Rayudu And Hanuma Vihari Base Price: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ సందడి మొదలైంది. ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో జరిగే మెగా వేలం జరుగనున్న విషయం విదితమే. ఈ క్రమంలో జనవరి 22న మొత్తం 1,214 మంది తమ పేర్లను నమోదు చేసుకోగా, ఫ్రాంచైజీల సూచనల ప్రకారం దీనిని కుదించి మంగళవారం బీసీసీఐ తుది జాబితాను ప్రకటించింది. ఫలితంగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల సంఖ్య 590గా ఖరారైంది. ఇందులో భారత క్రికెటర్లు 370 మంది ఉండగా, విదేశీ ఆటగాళ్లు 220 మంది ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో గరిష్టంగా ఆస్ట్రేలియా నుంచి 47 మంది వేలం బరిలో నిలిచారు. 590 మందిలో 228 మంది ఆయా దేశాల తరఫున ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ ఆడగా... 355 మంది ‘అన్క్యాప్డ్’ ఆటగాళ్లు, మరో 7 మంది అసోసియేట్ దేశాలకు చెందినవారు ఉన్నారు. ఐపీఎల్లో పాల్గొనే ఒక్కో జట్టులో గరిష్టంగా 25 మంది ఉంటారు. వేలానికి ముందు ఎనిమిది జట్లు 27 మంది ఆటగాళ్లను అట్టి పెట్టుకోగా... రెండు కొత్త టీమ్లు మరో 6 మందిని ఎంచుకున్నాయి. మొత్తంగా ఈ 33 మంది ని తగ్గిస్తే... 217 స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. భారీ డిమాండ్ ఖాయం... రూ. 2 కోట్ల కనీస విలువతో 48 మంది ఐపీఎల్ వేలంలోకి అడుగు పెడుతుండగా, రూ. 1.5 కోట్ల జాబితాలో 20 మంది, రూ. 1 కోటి కనీస ధరతో 34 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చాలా ఏళ్ల తర్వాత జరుగుతున్న ‘మెగా వేలం’ కావడం, రెండు కొత్త జట్లు రావడంతో స్టార్ ఆటగాళ్లకు భారీ డిమాండ్ ఖాయం. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, కమిన్స్ (ఆస్ట్రేలియా), డి కాక్, రబడ, డుప్లెసిస్ (దక్షిణాఫ్రికా), ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), శ్రేయస్ అయ్యర్, అశ్విన్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, షమీ (భారత్), బెయిర్స్టో (ఇంగ్లండ్), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), జేసన్ హోల్డర్ (వెస్టిండీస్) వంటి ప్లేయర్లను అన్ని ఫ్రాంచైజీలు కోరుకుంటున్నాయి. వేలంలో వీరికి రికార్డు ధర పలకవచ్చు. ఫ్రాంచైజీలు వద్దనుకున్న భారత ఆటగాళ్లు భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్, రహానే, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్, చహల్, శార్దుల్ ఠాకూర్ లపై కూడా అందరి కన్నూ ఉంది. అంబటి రాయుడు రూ. 2 కోట్ల కనీస విలువతో ఆసక్తికరంగా తన పేరును వికెట్ కీపర్ జాబితాలో నమోదు చేసుకోవడం విశేషం! హనుమ విహారి రూ. 50 లక్షల కనీస విలువతో బరిలో ఉన్నాడు. చదవండి: IPL 2022 Auction: వేలంలో మనవాళ్లు 23 మంది.. అంబటి, హనుమ విహారి, తన్మయ్, మనీశ్ రెడ్డి.. ఇంకా.. Icc U 19 World Cup 2022: మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా 🚨 NEWS 🚨: IPL 2022 Player Auction list announced The Player Auction list is out with a total of 590 cricketers set to go under the hammer during the two-day mega auction which will take place in Bengaluru on February 12 and 13, 2022. More Details 🔽https://t.co/z09GQJoJhW pic.twitter.com/02Miv7fdDJ — IndianPremierLeague (@IPL) February 1, 2022 -
IPLAuction: వేలంలో మనవాళ్లు 23 మంది.. అంబటి, హనుమ విహారి, తన్మయ్.. ఇంకా..
IPL 2022 Mega Auction: ఐపీఎల్ వేలం-2022 తుది జాబితా ఖరారైంది. 217 స్థానాలకు 590 మంది క్రికెటర్లు పోటీ పడుతున్నారు. రూ. 2 కోట్ల కనీస విలువతో 48 మంది క్రికెటర్లు తమ పేరు నమోదు చేసుకున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో మెగా వేలం జరుగనున్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్ వేలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నుంచి 8 మంది (అంబటి రాయుడు, అశ్విన్ హెబర్, రికీ భుయ్, హరిశంకర్ రెడ్డి, పృథ్వీ రాజ్, స్టీఫెన్, బండారు అయ్యప్ప, గిరినాథ్ రెడ్డి) పాల్గొనబోతున్నారు. అదే విధంగా... హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నుంచి 15 మంది (హనుమ విహారి, తిలక్ వర్మ, బి.సందీప్, తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, సీవీ మిలింద్, రాహుల్ బుద్ధి, యుధ్వీర్, కార్తికేయ, భగత్ వర్మ, రక్షణ్ రెడ్డి, మనీశ్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, మికిల్ జైస్వాల్, మొహమ్మద్ అఫ్రిది) ఈ మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. చదవండి: ICC U 19 World Cup 2022: మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా 🚨 NEWS 🚨: IPL 2022 Player Auction list announced The Player Auction list is out with a total of 590 cricketers set to go under the hammer during the two-day mega auction which will take place in Bengaluru on February 12 and 13, 2022. More Details 🔽https://t.co/z09GQJoJhW pic.twitter.com/02Miv7fdDJ — IndianPremierLeague (@IPL) February 1, 2022 -
"నాకు ఐపీఎల్లో ఆ జట్టుకే ఆడాలి అని ఉంది"
IPL 2022- Ambati Rayudu: ఐపీఎల్-2022 సీజన్కు ముందు మెగా వేలం మరి కొద్ది రోజులో జరగనుంది. ఇప్పటికే ఆటగాళ్ల రీటైన్ జాబితాను ఆయా ఫ్రాంచైజీలు ప్రకటించాయి. కాగా చాలా మంది స్టార్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోలేదు. దీంతో రానున్న మెగా వేలానికి ప్రాధన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు ఆసక్తికర వాఖ్యలు చేశాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు అంబటి రాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ.. ఐపీఎల్-2022 సీజన్కు సీఎస్కే రాయుడిని రీటైన్ చేసుకోలేదు. అయితే, తనకు మాత్రం ఐపీఎల్లో మరో మూడేళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడాలని ఉందని రాయుడు మనసులోని మాటను బయటపెట్టాడు. రాబోయే వేలంలో సీఎస్కే తనని కొనుగోలు చేస్తుందని ఆశిస్తున్నాని రాయుడు తెలిపాడు. "సీఎస్కే తరుపున ఆడటానికి చాలా ఇష్టపడతాను. నాకైతే ఇప్పటివరకు జట్టు నుంచి ఎటువంటి సమాచారం లేదు. అయితే మరోసారి నన్ను కొనుగోలు చేస్తారని భావిస్తున్నాను. అదే విధంగా 2021 సీజన్లో విజయం మాకు చాలా ప్రత్యేకమైనది. అంతేకాకుండా ఈ విజయంలో నా వంతు పాత్ర పోషించాను. నేను ఏంటో నిరూపించుకోవడానికి సీఎస్కే నాకు గొప్ప అవకాశం ఇచ్చింది. జట్టులో ఏ స్దానంలోనైనా ఆడటానికి సిద్దంగా ఉన్నాను. మెగా వేలంలో యువ ఆటగాళ్ల కోసం ఎక్కువ పోటీ ఉంటుంది. ఈ ఏడాది వేలం ఆసక్తికరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను" అని అతడు పేర్కొన్నాడు. కాగా 2021 సీజన్లో రాయుడు 257 పరుగులు సాధించాడు. చదవండి: Ind vs Sa ODI Series: టీమిండియాకు ఎదురుదెబ్బ... వాళ్లిద్దరూ డౌటే.. రుతు, అయ్యర్, షారుఖ్కు బంపరాఫర్! -
Ravi Shastri: అంబటి రాయుడిని జట్టులోకి తీసుకోవాల్సింది.. కానీ..
Ravi Shastri: Had No Say Dropping Ambati Rayudu In 2019 World Cup Squad: రవిశాస్త్రి... 2017లో టీమిండియా హెడ్ కోచ్గా పగ్గాలు చేపట్టాడు. ఆయన హయాంలో టీమిండియా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించింది. రవిశాస్త్రి హెడ్కోచ్గా ఉన్న సమయంలో 43 టెస్టులు ఆడిన భారత జట్టు 25 గెలవగా.. ఐదింటిని డ్రా చేసుకుంది. ఇక 76 వన్డేల్లో సాధించిన విజయాలు 51. పొట్టి ఫార్మాట్ విషయానికొస్తే... అరవై ఐదింట.. 43 విజయాలు. మొత్తంగా 184 మ్యాచ్లలో 119 గెలుపొందింది. విజయాల శాతమే ఎక్కువగా ఉన్నా... ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. ముఖ్యంగా 2019లో వన్డే వరల్డ్కప్లో ఎన్నో అంచనాలతో బరిలోకి టీమిండియా కనీసం ఫైనల్కు కూడా చేరకపోవడం తీవ్రంగా నిరాశపరిచింది. అంతేగాక జట్టు సెలక్షన్ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడును కాదని.. విజయ్ శంకర్ను ఎంపిక చేయడం విమర్శలకు తావిచ్చింది. ఇక టీ20 వరల్డ్కప్-2021 టోర్నీ ముగిసిన తర్వాత హెడ్కోచ్ పదవి నుంచి తప్పుకొన్న రవిశాస్త్రి తాజాగా ఈ విషయాల గురించి మాట్లాడారు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో సంభాషించిన ఆయన... ‘‘2019 వరల్డ్కప్... జట్టు ఎంపిక విషయం గురించి నాకు పెద్దగా ఫిర్యాదులు లేవు. అయితే, ప్రపంచకప్ కోసం ముగ్గురు వికెట్ కీపర్లను సెలక్ట్ చేయడం సరికాదనిపించింది. నిజానికి అంబటి(అంబటి రాయుడు) లేదంటే శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రావాల్సింది. ఎంఎస్ ధోని, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్.. వికెట్ కీపర్ బ్యాటర్లు ఇంతమంది ఎందుకు అనిపించింది. కానీ సెలక్టర్ల నిర్ణయంలో నేను ఎక్కువగా జోక్యం చేసుకోలేదు. సాధారణ చర్చల్లో భాగంగా... ఫీడ్బాక్ అడిగినపుడు మాత్రమే కొన్ని విషయాలు చెప్పేవాడిని’’ అని పేర్కొన్నాడు. కాగా 2019లో జరిగిన వన్డే వరల్డ్కప్ సమయంలో... అద్భుత ఫామ్లో ఉన్న అంబటి రాయుడి కాదని, విజయ్ శంకర్ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీంతో విమర్శలు రాగా.... విజయ్ త్రీ డైమన్షనల్ ఆటగాడని అందుకే అతన్ని సెలెక్ట్ చేసినట్లు(బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) అప్పటి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రాయుడు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి.. ఆనక తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. చదవండి: IPL 2022 Auction- Avishka Fernando: 23 బంతుల్లో 53 పరుగులు.. సిక్సర్ల కింగ్.. ఐపీఎల్ వేలంలోకి వచ్చాడంటే! -
CSK VS MI: అప్పుడు అర్థ సెంచరీలు.. ఇప్పుడేమో డకౌట్లు
దుబాయ్: ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో సీఎస్కే బ్యాట్స్మెన్కు విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఐపీఎల్ 2020 సీజన్ను గుర్తు చేస్తూ సీఎస్కే దారుణ ఆటతీరును కనబరుస్తుంది. 10 పరుగుల లోపే మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఇక బ్యాట్స్మన్కు వచ్చిన విచిత్ర పరిస్థితి విషయానికి వస్తే.. ఈ సీజన్లో ముంబై, చెన్నై మధ్య తొలి మ్యాచ్ ఢిల్లీ వేదికగా జరిగింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే భారీ స్కోరు నమోదు చేసింది. డుప్లెసిస్ 50, మొయిన్ అలీ 58, అంబటి రాయుడు 72 పరుగులతో రాణించారు. కాగా తాజా మ్యాచ్లో మాత్రం ఈ ముగ్గురు సున్నా పరుగులకే వెనుదిరిగారు. ఇందులో డుప్లెసిస్, మొయిన్ అలీ డకౌట్లు కాగా.. రాయుడు సున్నా పరుగుల వద్దే దురదృష్టవశాత్తూ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. దీనిపై అభిమానులు వినూత్న రీతిలో స్పందిస్తున్నారు. అప్పుడు అర్థసెంచరీలు.. ఇప్పుడేమో డకౌట్లు అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం సీఎస్కే 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. రుతురాజ్ (17), జడేజా(0) పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: Glenn Maxwell: సూపర్ ఓవర్ టై.. మ్యాక్స్వెల్ క్లీన్బౌల్డ్ -
IPL 2021, CSK vs MI: చెన్నైపై పొలార్డ్ పిడుగు
విజయ లక్ష్యం 219 పరుగులు... ప్రత్యర్థి చెన్నై జట్టు అంటే అంత సులువు కాదు. ఒక దశలో 10.2 ఓవర్లలో 138 పరుగులు చేయాలి. కానీ ఈ అసాధ్యాన్ని ఒకే ఒక్కడు సుసాధ్యం చేసి చూపించాడు. వీర విధ్వంసం ప్రదర్శించిన కీరన్ పొలార్డ్ తన మెరుపు బ్యాటింగ్తో చివరి వరకు నిలిచి ముంబై ఇండియన్స్ను గెలిపించాడు. అతని బ్యాటింగ్ జోరు ముందు వ్యూహాలు కానరాక చివరకు చెన్నై తలవంచింది. అంతకుముందు అంబటి రాయుడు చూపించిన మెరుపు ప్రదర్శన కూడా పొలార్డ్ జోరు ముందు చిన్నబోయింది. న్యూఢిల్లీ: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మ్యాచ్లో ముంబై నాలుగు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అంబటి రాయుడు (27 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్ చేయగా... మొయిన్ అలీ (36 బంతుల్లో 58; 5 ఫోర్లు, 5 సిక్స్లు), ఫాఫ్ డు ప్లెసిస్ (28 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. డు ప్లెసిస్కు ఐపీఎల్లో ఇది వరుసగా నాలుగో అర్ధ సెంచరీ కావడం విశేషం. అనంతరం ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసి గెలించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పొలార్డ్ (34 బంతుల్లో 87 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్స్లు) అద్భుత ప్రదర్శన కనబర్చగా, కృనాల్ (23 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. శుభారంభం... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి శుభారంభం లభించింది. ఓపెనర్లు డి కాక్, రోహిత్ చకచకా పరుగులు సాధించారు. దీపక్ చహర్ వేసిన మూడో ఓవర్లో రోహిత్ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా, డి కాక్ ఒక సిక్స్ బాదడంతో 15 పరుగులు వచ్చాయి. స్యామ్ కరన్ వేసిన తర్వాతి ఓవర్లో రోహిత్ మళ్లీ రెండు వరుస బౌండరీలు బాదాడు. పవర్ప్లేలో ముంబై 58 పరుగులు సాధించింది. అయితే 11 పరుగుల వ్యవధిలో రోహిత్, సూర్యకుమార్ (3), డి కాక్లను అవుట్ చేసి చెన్నై పైచేయి సాధించింది. గెలుపు కోసం 62 బంతుల్లో 138 పరుగులు చేయాల్సిన స్థితిలో ముంబై నిలిచింది. పొలార్డ్ విధ్వంసం... గెలుపు బాధ్యతను తీసుకున్న ముంబై బ్యాట్స్మన్ పొలార్డ్ తనదైన తరహాలో చెలరేగిపోయాడు. జడేజా ఓవర్లో 3 సిక్స్లు బాదిన అతను ఇన్గిడి వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు కొట్టాడు. శార్దుల్ ఓవర్లో 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. అతనికి మరో ఎండ్లో కృనాల్ నుంచి తగిన సహకారం లభించింది. ఇన్గిడి ఓవర్లో కృనాల్ 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టడంతో ముంబై గెలుపు దిశగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే స్యామ్ కరన్ చక్కటి బంతితో ఈ భాగస్వామ్యాన్ని (44 బంతుల్లో 89 పరుగులు) విడదీయడంతో సీఎస్కే ఊపిరి పీల్చుకుంది. అయితే చివరి వరకు నిలబడిన పొలార్డ్ జట్టును గెలిపించాడు. డుప్లెసిస్ క్యాచ్ మిస్... చివరి 3 ఓవర్లలో మరింత డ్రామా సాగింది. శార్దుల్ వేసిన ఈ ఓవర్లో పొలార్డ్ వరుసగా 6, 4 బాదాడు. అయితే పొలార్డ్ వ్యక్తిగత స్కోరు 68 వద్ద లాంగాన్ వద్ద అతను ఇచ్చిన సునాయాస క్యాచ్ను అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడైన డు ప్లెసిస్ వదిలేశాడు. ఈ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ చెన్నై చేతుల్లోకి వచ్చేసేదేమో. 2 ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన స్థితిలో కరన్ బౌలింగ్లో తొలి రెండు బంతుల్లోనే హార్దిక్ పాండ్యా (7 బంతుల్లో 16; 2 సిక్స్లు) భారీ సిక్సర్లు కొట్టాడు. అయితే కరన్ చక్కటి బంతులతో హార్దిక్తో పాటు నీషమ్ (0)ను కూడా అవుట్ చేయడంతో సమీకరణం చివరి ఓవర్లో 16 బంతులకు చేరింది. ఇన్గిడి వేసిన ఈ ఓవర్లో తొలి బంతికి అవకాశం ఉన్నా సింగిల్కు నిరాకరించిన పొలార్డ్ తర్వాతి రెండు బంతులను ఫోర్లుగా మలిచాడు. నాలుగో బంతికీ సింగిల్ తీయని అతను ఐదో బంతికి భారీ సిక్సర్ కొట్టాడు. ఆఖరి బంతిని ఇన్గిడి బాగానే వేసినా... లాంగాన్ నుంచి ఫీల్డర్ బంతి విసిరే లోపు కావాల్సిన రెండో పరుగును పొలార్డ్ పూర్తి చేశాడు. సెంచరీ భాగస్వామ్యం... అంతకుముందు చెన్నై ఇన్నింగ్స్ నాలుగో బంతికే రుతురాజ్ (4) అవుట్ కావడంతో తొలి వికెట్ కోల్పోయింది. అయితే అద్భుత ఫామ్లో ఉన్న డు ప్లెసిస్, అలీ చెలరేగుతూ ఒకరితో మరికరు పోటీ పడి వేగంగా పరుగులు సాధించారు. ధావల్ ఓవర్లో ప్లెసిస్ ఫోర్, సిక్స్ కొట్టగా, బౌల్ట్ వేసిన తర్వాతి ఓవర్లో అలీ వరుస బంతుల్లో 6, 4 బాదాడు. పవర్ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరు 49 పరుగులకు చేరింది. ఆ తర్వాత రాహుల్ చహర్ ఓవర్లో వీరిద్దరు చెరో సిక్స్ కొట్టారు. నీషమ్ ఓవర్లో సిక్స్, 2 ఫోర్లు కొట్టిన అలీ 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బుమ్రా ఓవర్లో 17 పరుగులు రాబట్టిన ప్లెసిస్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను చేరుకోవడం విశేషం. అయితే అలీని అవుట్ చేసి బుమ్రా ఈ భాగస్వామ్యాన్ని (61 బంతుల్లో 108 పరుగులు) విడదీయగా... తర్వాతి ఓవర్లోనే పొలార్డ్ వరుస బంతుల్లో ప్లెసిస్, రైనా (2)లను వెనక్కి పంపించాడు. ఈ దశలో సరిగ్గా 12 ఓవర్లలో చెన్నై స్కోరు 116 పరుగులు. అయితే రాయుడు విధ్వంసానికి ఆఖరి 8 ఓవర్లలో టీమ్ ఏకంగా 102 పరుగులు సాధించడం విశేషం. బుమ్రా 4–0–56–1 గత మ్యాచ్లో సూపర్ స్పెల్తో రాజస్తాన్ను కట్టడి చేసిన టాప్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ మ్యాచ్లో కలిసి రాలేదు. తన ఐపీఎల్లో కెరీర్లోనే అత్యంత చెత్త గణాంకాలను అతను ఈ మ్యాచ్లో నమోదు చేశాడు. బుమ్రా తొలి ఓవర్లోనే అలీ సిక్స్ బాదడంతో 8 పరుగులు వచ్చాయి. అతని రెండో ఓవర్లో తొలి మూడు బంతులకు ప్లెసిస్ 6, 6, 4 కొట్టాడు (ఓవర్లో మొత్తం పరుగులు 17). తన తర్వాతి ఓవర్లో రాయుడు దెబ్బకు అతను ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాడు. బుమ్రా చివరి ఓవర్లో కూడా 10 పరుగులు వచ్చాయి. రాయుడు వీరోచిత ఇన్నింగ్స్... ఈ సీజన్లో ఇప్పటి వరకు రాయుడు ప్రభావం చూపించలేదు. నాలుగు ఇన్నింగ్స్లలో 23, 0, 27, 14 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఆ లోటును తీరుస్తూ ఇక్కడ చెలరేగిపోయాడు. పొలార్డ్ బౌలింగ్లో ఫోర్ కొట్టిన అనంతరం చహర్ ఓవర్లో స్క్వేర్ లెగ్ దిశగా కొట్టిన భారీ సిక్స్తో అతని జోరు మొదలైంది. ధావల్ ఓవర్లోనూ అతను వరుసగా రెండు సిక్స్లు బాదాడు. బుమ్రా ఓవర్లో ఎక్స్ట్రా కవర్ మీదుగా అతను కొట్టిన సిక్స్ ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచింది. ఇది నోబాల్ కావడంతో వచ్చిన ఫ్రీ హిట్ను కూడా రాయుడు బౌండరీకి తరలించాడు. బౌల్ట్ వేసిన తర్వాతి ఓవర్లో రాయుడు పండగ చేసుకున్నాడు. ఈ ఓవర్లో అతను 2 సిక్స్లు, ఫోర్ కొట్టాడు. ఈ క్రమంలో 20 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. ధావల్ వేసిన 20వ ఓవర్ చివరి రెండు బంతులను కూడా రాయుడు 6, 4 గా మలచడం విశేషం. మరోవైపు రవీంద్ర జడేజా (22 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు) మాత్రం తనదైన దూకుడు కనబర్చలేకపోయాడు. ఈ జంట ఐదో వికెట్కు అభేద్యంగా 56 బంతుల్లో 102 పరుగులు జత చేసింది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) హార్దిక్ (బి) బౌల్ట్ 4; డు ప్లెసిస్ (సి) బుమ్రా (బి) పొలార్డ్ 50; అలీ (సి) డి కాక్ (బి) బుమ్రా 58; రైనా (సి) కృనాల్ (బి) పొలార్డ్ 2; రాయుడు (నాటౌట్) 72; జడేజా (నాటౌట్) 22; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 218. వికెట్ల పతనం: 1–4, 2–112, 3–116, 4–116. బౌలింగ్: బౌల్ట్ 4–0–42–1, ధావల్ 4–0–48–0, బుమ్రా 4–0–56–1, రాహుల్ చహర్ 4–0–32–0, నీషమ్ 2–0–26–0, పొలార్డ్ 2–0–12–2. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి అండ్ బి) అలీ 38; రోహిత్ (సి) రుతురాజ్ (బి) శార్దుల్ 35; సూర్యకుమార్ (సి) ధోని (బి) జడేజా 3; కృనాల్ (ఎల్బీ) (బి) కరన్ 32; పొలార్డ్ (నాటౌట్) 87; హార్దిక్ (సి) డు ప్లెసిస్ (బి) కరన్ 16; నీషమ్ (సి) శార్దుల్ (బి) కరన్ 0; ధావల్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–71, 2–77, 3–81, 4–170, 5–202, 6–203. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–37–0, స్యామ్ కరన్ 4–0–34–3, ఇన్గిడి 4–0–62–0, శార్దుల్ 4–0–56–1, జడేజా 3–0–29–1, మొయిన్ అలీ 1–0–1–1. -
రాయుడు అరుదైన రికార్డు.. బుమ్రా చెత్త రికార్డు
ఢిల్లీ: ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో అంబటి రాయుడు సిక్సర్ల వర్షం కురిపించాడు. 27 బంతుల్లోనే 4 ఫోర్లు.. 7 సిక్సర్లతో 72 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అతని ధాటికి సీఎస్కే 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్లో రాయుడు అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో సీఎస్కే తరపున అత్యంత వేగంగా 50 పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా రాయుడు నిలిచాడు. 20 బంతుల్లో రాయుడు ఫిఫ్టీ మార్క్ను చేరుకొని మూడో స్థానంలో నిలిచాడు. ఓవరాల్గా సీఎస్కే తరపున సురేశ్ రైనా(2014) 16 బంతుల్లో అర్థశతకం సాధించి తొలి స్థానంలో ఉండగా.. ధోని(2012) 20 బంతుల్లో అర్థశతకం అందుకోగా .. తాజాగా రాయుడు కూడా 20 బంతుల్లో 50 పరుగుల మార్క్ను అందుకొని ధోనితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక సామ్ బిల్లింగ్స్(2018) 21 బంతులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఇదే మ్యాచ్లో బుమ్రా ఒక చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. ఐపీఎల్లో ఒక మ్యాచ్లో బుమ్రా 40 కంటే ఎక్కవ పరుగులు ఇవ్వడం ఇది నాలుగోసారి. 2017లో గుజరాత్ లయన్స్ మ్యాచ్లో 45 పరుగులు, 2015లో ఆర్సీబీతో మ్యాచ్లో 52, 2015లో ఢిల్లీ డేర్డెవిల్స్తో మ్యాచ్లో 55.. తాజాగా 2021లో సీఎస్కేతో మ్యాచ్లో 56 పరుగులు ఇచ్చి చెత్త రికార్డు నమోదు చేశాడు. చదవండి: సురేశ్ రైనా అరుదైన ఘనత ఎవరు బాగా ఆడితే వారే గెలుస్తారు: ధోని -
సురేశ్ రైనా, అంబటి రాయుడు వీడియో వైరల్
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అంచనాలకు తగ్గట్టు ఆడుతూ దూసుకుపోతోంది. ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్లు ఆడిన సీఎస్కే.. మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో ఓటమి తర్వాత సీఎస్కే ఒక్కసారిగా పుంజుకుంది. హ్యాట్రిక్ విజయాలతో దుమ్ములేపింది. ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగనున్న మ్యాచ్లో సీఎస్కే తలపడనుంది. బుధవారం(ఏప్రిల్ 21వ తేదీ) కేకేఆర్తో జరిగిన రసవత్తరంగా జరిగిన మ్యాచ్లో సీఎస్కే 18 పరుగుల తేడాతో గెలిచింది. సీఎస్కే ఆడబోయే తదుపరి మ్యాచ్కు నాలుగు రోజుల సమయం ఉండటంతో ఆటగాళ్లు ప్రాక్టీస్తో పాటు కాసేపు సేద తీరే అవకాశం దొరికింది. ఈ క్రమంలో అంబటి రాయుడు, సురేశ్ రైనాలు తమ కుకింగ్ స్కిల్స్ను బయటకు తీస్తున్నారు. సీఎస్కే క్యాంపులో చెఫ్లు వంటలు చేసేటప్పుడు వారి వద్దకు వెళ్లి మరీ వారి పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించారు. దీనికి సంబంధించి వీడియో వైరల్గా మారింది. ఇప్పటివరకూ పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్లపై సీఎస్కే విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ధోని సేన ఓటమి పాలైంది. Just @ImRaina & @RayuduAmbati showing off their cooking skills during the #IPL 🏏#SureshRaina #AmbatiRayudu #IPL2021 #ChennaiSuperKings #CSK #Foodie pic.twitter.com/3AxmVpXdOv — Hyderabad Times (@HydTimes) April 23, 2021 -
IPL2021: సీఎస్కే కు ఆ ముగ్గురు బ్యాటింగే సమస్య కానుందా
మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచిన చెన్నై జట్టు ఈ ఏడాది టైటిల్ సాధించేందుకు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. గత ఏడాది ప్రదర్శనను పునరావృతం కాకుండా ఐపిఎల్ 2021 లో తిరిగి తమ పాత ఫామ్ను అందుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. అయితే ధోని, రైనా, రాయుడు బ్యాటింగ్ ఫామే ఎల్లో ఆర్మీకి పెద్ద సవాలుగా మారనుందని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. గతేడాది చెన్నై వైఫల్యాలకు బ్యాటింగే ప్రధాన కారణమని ఈ సందర్భంగా చోప్రా గుర్తు చేశాడు. ఆ ముగ్గురు ఆడితేనే సీఎస్కే నిలబడుతుంది ఇటీవలి కాలంలో ధోని, రైనా, రాయుడు అంతర్జాతీయ క్రికెట్లోనే కాక ఏ ఇతర ఫార్మట్లోనూ ఆడలేదు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎస్కే బ్యాటింగ్ పరంగా కొంచెం బలహీనంగా ఉందనే చెప్పాలి. ఇదిలా ఉండగా, దేశవాళీ క్రికెట్లో రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్లు మంచి ఫామ్లో ఉండటం సీఎస్కేకు ఊరట కలిగించే అంశం. దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు డుప్లెసిస్ ఫామ్ సీఎస్కేకు అదనపు బలం కానుంది. ఏదిఏమైనప్పటికీ, ధోని, రైనా, రాయుడుల బ్యాటింగ్ ఫామ్ చెన్నై జట్టుని కలవరపెడుతోందని ఆకాశ్ పేర్కొన్నాడు. కాగా, చైన్నై జట్టు ముంబైలో మొత్తం 5 మ్యాచ్లు ఆడనుంది. ధోని నేతృత్వంలోని చెన్నై జట్టు ఏప్రిల్ 10న ముంబైలోని వాంఖడే స్టేడియంలో తమ మొదటి పోరులో ఢిల్లీతో తలపడనుంది. ఈ జట్టు ముంబైలో మొత్తం 5 మ్యాచ్లను ఆడనుంది. ఇతర వేదికలైన ఢిల్లీలో 4, బెంగళూరులో 3, కోల్కతాలో 2 మ్యాచ్లు ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం పేసర్లకే అనుకూలించే అవకాశం ఉండటంతో స్పిన్నర్లు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. -
తలైవా.. వెల్కమ్ టూ చెన్నై
చెన్నై: ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) ట్రైనింగ్ క్యాంప్ మార్చి 11 నుంచి చెపాక్ స్టేడియంలో ప్రారంభంకానున్నట్లు సమాచారం. ఈ క్యాంపు మొదటి రోజు నుంచే కెప్టెన్ ఎంఎస్ ధోనీతో పాటు ఇతర ఆటగాళ్లు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ధోనీ బుధవారం చెన్నై చేరుకున్నాడు. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా తీసిన ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. కాగా ధోనికి స్వాగతం పలుకుతూ.. ''సీఎస్కే టీమ్ వెల్కమ్ టూ చెన్నై తలైవా..'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ధోనితో పాటు ఆ జట్టు కీలక బ్యాట్స్మన్ అంబటి రాయుడు ఇప్పటికే చెన్నైలో అడుగుపెట్టాడు. బయో సెక్యూర్ వాతావరణంలో కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఈ క్యాంప్ నిర్వహించనున్నారు. మిగతా ఫ్రాంఛైజీలకన్నా ముందే చెన్నై ట్రైనింగ్ క్యాంప్ను నిర్వహించబోతున్నది. కాగా గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అంతగా ఆకట్టుకోలేదు. లీగ్ ప్రారంభంలో వరుసగా మ్యాచ్లు ఓడిపోయి ఒక దశలో పాయింట్లక పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అయితే లీగ్ చివర్లో మళ్లీ ఫుంజుకున్న చెన్నై వరుస విజయకాలు నమోదు చేసి ఏడో స్థానంలో నిలిచింది. ఏప్రిల్ మొదటి వారంలో ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. చదవండి: నాలుగో టెస్టు: కోహ్లి, స్టోక్స్ మధ్య వాగ్వాదం! పంత్ ట్రోలింగ్.. వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ Thalai-Vaa! 🙏🏽🦁 Smile with the Mass(k) on! Super Night! #DenComing #WhistlePodu #Yellove 💛 pic.twitter.com/zjjDowuOmL — Chennai Super Kings (@ChennaiIPL) March 3, 2021 -
‘రాయుడ్ని ఎంపిక చేయకపోవడం మా తప్పే’
న్యూఢిల్లీ: గతేడాది జరిగిన వన్డే వరల్డ్కప్లో అంబటి రాయుడుకు చోటు ఇవ్వకపోవడం తాము చేసిన తప్పిదాల్లో ఒకటని అప్పుడు సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్న దేవాంగ్ గాంధీ పేర్కొన్నారు. గత సెప్టెంబర్లో తన పదవీ కాలం ముగిసిన తర్వాత తొలిసారి వరల్డ్కప్ సెలక్షన్పై పెదవి విప్పాడు. ఆస్ట్రేలియా పర్యటనకు సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేయకపోవడంపై ఇప్పటికే వరుస చర్చలు కొనసాగుతుండగా, అంబటి రాయుడ్ని వరల్డ్కప్కు ఎంపిక చేయకపోవడాన్ని తమ తప్పిదంగానే దేవాంగ్ గాంధీ పేర్కొన్నారు. ‘ అవును.. అది మా తప్పిదమే. తప్పు జరిగింది. కానీ మేము కూడా మనుషులమే. ఏది సరైన కాంబినేషన్ అనే విషయంలోనే పొరపాటు చేశాం. ఆ కోణంలోనే ఆలోచించాం. ఆ తర్వాత చేసిన పొరపాటు తెలుసుకున్నాం. (‘ఐపీఎల్కు వెళ్లకుండా ఆపండి’) భారత జట్టు సెమీస్లోనే నిష్క్రమించింది. ఇక్కడ రాయుడు లేని లోటు కనిపించింది. కేవలం ఒక్క మ్యాచ్తో టీమిండియా అప్పటివరకూ ఆడింది అంతా పోయింది. సెమీస్ తప్పితే మిగతా టోర్నీ అంతా భారత్ బాగా ఆడింది. ఇక్కడ రాయుడు కోపాన్ని నేను అర్ధం చేసుకోగలను. అతని రియాక్షన్ను సమర్థించక తప్పదు. ఎవరైనా అలానే రియాక్ట్ అవుతారు’ అని దేవాంగ్ గాంధీ తెలిపారు. ఆ సమయంలో రాయుడ్ని పక్కకు పెట్టడంతో పెద్ద వివాదమే చెలరేగింది. రాయుడు స్థానంలో విజయ్ శంకర్కు చోటివ్వడమే కాకుండా అతనొక త్రీడీ ప్లేయర్ అని అప్పటి చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ విశ్లేషించాడు. దీనికి చిర్రెత్తుకొచ్చిన అంబటి రాయుడు.. వరల్డ్ కప్ మ్యాచ్లు చూడటానికి తాను త్రీడీ కళ్లద్దాలను ఆర్డర్ చేశానంటూ సెటైర్ వేశాడు. దాంతో వివాదం మరింత పెద్దదైంది. విజయ్ శంకర్ గాయం కారణంగా స్వదేశానికి వచ్చేసినా రాయుడుకు పిలుపు రాలేదు. అతని స్థానంలో రిషభ్ పంత్ను ఇంగ్లండ్కు పిలిపించారు. ఇది రాయుడికి మరింత ఆగ్రహం తెప్పించింది. ఆ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్కు రాయుడు వీడ్కోలు చెప్పడం, మళ్లీ నాటకీయ పరిణామాల మధ్య తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. -
బ్రేక్లో ఒక ప్లేయర్ను మిస్సయ్యాం..!
దుబాయ్: ఆర్సీబీతో ఆదివారం జరిగిన మ్యాచ్లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. రుతురాజ్ గైక్వాడ్ 51 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో అజేయంగా 65 పరుగులు సాధించి సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్సీబీ నిర్దేశించిన 146 పరుగుల టార్గెట్లో రుతురాజ్-ధోనిలు బాధ్యతాయుతంగా ఆడటంతో సీఎస్కే 18.4 ఓవర్లలో 150 పరుగులు చేసి విజయం సాధించింది. ధోని 21 బంతుల్లో 3 ఫోర్లతో అజేయంగా 19 పరుగులు చేశాడు. రాయుడు 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 39 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. (ఆర్చర్ ఆరేళ్ల క్రితం మాట.. ఇప్పుడెలా సాధ్యం?) కాగా, మ్యాచ్ జరిగేటప్పుడు టైమ్ ఔట్ సెషన్లో అంబటి రాయుడు ఫీల్డ్ను విడిచి బాత్రూమ్కు వెళ్లిన క్రమంలో గేమ్ చాలాసేపు ఆగిపోయింది. 2నిమిషాల 30 సెకన్ల బ్రేక్ పూర్తైన తర్వాత ఆటగాళ్లంతా ఎవరి స్థానాల్లో వారు వచ్చేస్తే, క్రీజ్లోకి రావాల్సిన ఉన్న రాయుడు కనిపించలేదు. దాంతో కామెంటేటర్లు తమదైన శైలిలో చలోక్తులు విసిరారు. ‘బ్రేక్లో ఒక ప్లేయర్ మిస్సింగ్’ అంటూ ఒక కామెంటేటర్ సరదాగా వ్యాఖ్యానించాడు. రాయుడు రావడం ఆలస్యం కావడంతో మ్యాచ్ చాలానిమిషాలు నిలిచిపోయింది. కాసేపటికి రాయుడు పరుగెత్తుకుంటూ ఫీల్డ్లోకి రావడమే కాకుండా ఆర్సీబీ వికెట్ కీపర్ ఏబీ డివిలియర్స్కు క్షమాపణలు తెలియజేశాడు. ప్యాడ్లు కట్టుకునే సమయంలో రాయుడితో ఏబీ ముచ్చటిస్తూ ముసిముసిగా నవ్వుకున్నాడు. అటు తర్వాత మూడు బాల్స్ మాత్రమే ఆడిన రాయుడు పెవిలియన్ చేరాడు. చహల్ వేసిన 14 ఓవర్ మూడో బంతికి రాయుడు బౌల్డ్ అయ్యాడు. -
రైనా, రాయుడు లోటు స్పష్టంగా తెలుస్తుంది
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో చెన్నై జట్టు వరుసగా రెండో ఓటమి నమోదు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 44 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. చెన్నై ఓపెనర్లు విఫలమైన వేళ మిడిలార్డర్లో డుప్లెసిస్కు సరైన సహకారం అందకపోవడం.. అంబటి రాయుడు, సురేశ్ రైనాలు లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇదే విషయమై చెన్నై ప్రధాన కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. 'చెన్నై జట్టు వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. రైనా, రాయుడు లాంటి ఆటగాళ్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్ లైనఫ్లో వారి స్థానాలను భర్తీ చేసేందుకు వివిధ రకాల కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నాం. కేదార్ జాదవ్, రుతురాజ్ గైక్వాడ్, శ్యామ్ కర్జన్ లాంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నా మ్యాచ్లను కోల్పోతున్నాం. నిజంగా రైనా టోర్నీకి దూరమవ్వడం బాధాకరం.. అతను నిన్నటి మ్యాచ్లో ఆడి ఉంటే జట్టుకు గెలిచే అవకాశాలు ఉండేవేమో. టాప్ ఆర్డర్, మిడిలార్డర్లో చేదించాల్సిన టార్గెట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒత్తిడికి తట్టుకొని నిలకడగా ఆడుతూ బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో కనిపించడం లేదు. (చదవండి : ధోని వ్యవహరిస్తున్న తీరు సరైనదే) 'ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. మా జట్టు స్పిన్ విభాగం మరింత బలహీనంగా తయారైంది. వరుసగా రెండు మ్యాచ్లు(రాజస్తాన్, ఢిల్లీ) చూసుకుంటే పియూష్ చావ్లా, రవీంద్ర జడేజా.. పరుగులు నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీనికి కారణం లేకపోలేదు.. చెన్నై జట్టు ఆడిన మూడు మ్యాచ్లు మూడు గ్రౌండ్స్లో ఆడింది. పిచ్ పరిస్థితులకు తగ్గట్టు ఏ విధమైన బౌలింగ్ శైలి నడుస్తుందన్నది చెప్పడం కష్టమైంది. ఐపీఎల్ మొదలైన వారం రోజుల్లో మూడు వేదికలపైన అవగాహన వచ్చింది. ఇక ముందు పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా బౌలర్లను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. పేస్ బౌలింగ్లో కూడా ఒక అంచనాకు వచ్చాం. రానున్న మ్యాచ్ల్లో వీటిపై దృష్టి సారిస్తూ.. తప్పులను సరిచేసుకుంటాం. 'అంటూ తెలిపాడు. (చదవండి : ఢిల్లీ కమాల్...) ఇక రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ధోని విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. అయితే అప్పటికే దాదాపు ఓటమి ఖరారైపోయింది. 24 బంతుల్లో 75 పరుగులు చేయాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన ధోని దాటిగా ఏం ఆడలేకపోయాడు. 12 బంతుల్లో 15 పరుగులు చేసి రబడ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఇక ఐపీఎల్లో చెన్నై టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ మరింత పటిష్టం కావాల్సి ఉంది. రాయుడు తిరిగి జట్టులోకి వస్తేనే టాప్ ఆర్డర్ బలంగా మారే అవకాశం ఉంది. ఇక వరుసగా రెండు ఓటమిలు చవిచూసిన చెన్నై తన తర్వాతి మ్యాచ్ అక్టోబర్ 2న సన్రైజర్స్తో ఆడాల్సి ఉంది. కాగా సన్రైజర్స్తో మ్యాచ్కు 6రోజులు విరామం దొరకడంతో చెన్నైకి రీచార్జ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. -
రాయుడి కసి.. కోహ్లికి అర్థమవుతుందా?
వెబ్స్పెషల్: మనిషికి తీవ్రమైన అసంతృప్తి నుంచి పుట్టేదే కోపం. ఎక్కడైనా మనకు చేదు అనుభవం ఎదురైతే దానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురుచూస్తాం. ఎక్కడైతే అవమానం జరిగిందని భావిస్తామో, అక్కడ అందుకు బదులు తీర్చుకోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఇదే కోవలోకి వస్తాడు హైదరాబాద్ క్రికెటర్ అంబటి రాయుడు. గతేడాది వరల్డ్కప్ సందర్భంగా రాయుడికి జరిగిన అవమానం అంతా ఇంతా కాదు. అప్పటివరకూ జట్టులో చోటుపై కెప్టెన్ విరాట్ కోహ్లి నుంచి భరోసా వచ్చినా.. అది చివరినిమిషంలో తారుమారైంది. వరల్డ్కప్లో రాయుడ్ని ఆడించడం కోసమే ఎక్కువ మ్యాచ్లు ఆడించాం. రాయుడు నిరూపించుకుని నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అని కోహ్లి చాలాసందర్భాల్లోనే చెప్పాడు. నాల్గోస్థానంలో రాయుడి ఫిట్ అవుతాడో అంటూ కూడా ప్లేస్ను కూడా డిసైడ్ చేసేశాడు. ఇందుకు కారణం భారత క్రికెట్ జట్టుకు నాల్గో స్థానంలో ఉన్న లోటే. మరి తీరా చూస్తే చివరకు తుస్ మనిపించారు. రాయుడు కాదు.. విజయ్ శంకర్ అంటూ ప్రాబబుల్స్ను ప్రకటించేశారు. అందుకు వివరణ కూడా ఇచ్చేశారు.. విజయ్ శంకర్ త్రీ డైమన్షన్ ప్లేయర్ అని కితాబు కూడా ఇచ్చేశారు. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ చేసే విజయ్ శంకర్ అద్భుతం చేస్తాడని ఆశించారు. అది ఏమిటో చూడటానికి త్రీడీ కళ్లద్దాలకు ఆర్డర్ ఇచ్చానని రాయుడుకు మాటల యుద్ధానికి తెరలేపాడు. అయితే విజయ్ శంకర్ చేసే మ్యాజిక్ను రాయుడే కాదు.. మనం ఎవరూ చూడకపోగా తిరిగి భారత్ ఫ్లయిట్ ఎక్కేశాడు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్లు ఆడి స్వదేశానికి వచ్చేశాడు. మరి అప్పుడైనా రిజర్వ్ ఆటగాళ్ల బెంచ్లో ఉన్న రాయుడికి చోటిచ్చారా అంటే అదీ లేదు. పెద్దగా అనుభవం లేని రిషభ్ పంత్ను ఇంగ్లండ్కు వచ్చేయమని కబురు పంపారు. పంత్ కూడా తుస్మనిపించాడు. ఒక మెగా టోర్నీకి వెళ్లే జట్టు కూర్పు సరిగా లేకపోవడంతో భారత్ సెమీస్లోనే నిష్క్రమించింది. ఒత్తిడిని జయించలేక సాధారణ లక్ష్యాన్ని కూడా సాధించలేక కోహ్లి అండ్ గ్యాంగ్ నాకౌట్ బెర్తుతోనే సరిపెట్టుకుంది. రాయుడిలో అదే కోపం.. అప్పట్నుంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న అంబటి రాయుడు.. ఐపీఎల్ కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. అందరికీ ముందుగా ప్రాక్టీస్ మొదలుపెట్టి బ్యాటింగ్కు సానబెట్టాడు. ఇలా కొన్ని నెలల ప్రాక్టీస్ తర్వాత ఐపీఎల్కు వెళ్లిన రాయుడు తొలి మ్యాచ్లోనే మెరిశాడు. సీఎస్కే ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో రాయుడు ఇది నా బ్యాటింగ్ పవర్ అని నిరూపించాడు. ఎక్కడ తడబడకుండా 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 71 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఆదిలోనే రెండు వికెట్లు పడటంతో సీఎస్కే పని అయిపోయిందనుకున్న వారికి తాను ఉన్నానంటూ బ్యాట్తో జవాబిచ్చాడు రాయుడు. నాల్గో స్థానంలో బ్యాటింగ్ దిగి డుప్లెసిస్తో కలిసి 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి సీఎస్కే విజయానికి బాటలు వేశాడు. ఐపీఎల్ ప్రాక్టీస్ దగ్గర్నుంచీ తొలి మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకోవడం వరకూ చూస్తూ రాయుడిలో పట్టుదల కనిపించింది. తనను వరల్డ్కప్కు ఎందుకు ఎంపిక చేయలేదనే కోపం కనిపించింది. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలా ఆడాలి బాస్ అనే కసి కనిపించింది. (చదవండి: నా సక్సెస్ వెనుక కారణం అదే : రాయుడు) ధోని-కోహ్లి కెప్టెన్సీల అదే తేడా.. భారత క్రికెట్లో వీరిద్దరూ విజయవంతమైన కెప్టెన్లే. అటు ఆట పరంగానూ ఇటు కెప్టెన్సీ పరంగానూ ఇద్దరూ జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. కానీ ధోని కెప్టెన్సీకి కోహ్లి కెప్టెన్సీకి చాలా తేడా ఉంది. ధోని కెప్టెన్సీ ముక్కుసూటిగా ఉంటుంది. ఫీల్డ్లో ఎంత మిస్టర్కూల్గా ఉంటాడో జట్టు ఎంపికలో మాత్రం కచ్చితత్వాన్ని పాటిస్తాడు ధోని. తనకు పలానా ప్లేయర్ కావాలి, పలానా ప్లేయర్ వద్దు అని నికార్సుగా చెబుతాడు. ఒకవేళ జట్టు కష్టాల్లో ఉంటే ముందుండి నడిపించే బాధ్యతను కూడా తీసుకుంటాడు ధోని. పలానా ప్లేస్లో వెళ్లాలనుకుంటే అది ప్లేస్లో వెళ్లి దానికి న్యాయం చేస్తాడు. అలా కాబట్టే ఒక టీ20 వరల్డ్కప్, ఒక వన్డే వరల్డ్కప్, ఒక చాంపియన్స్ ట్రోఫీని కూడా జట్టుకు సాధించిపెట్టాడు. మరి కోహ్లిలో దూకుడు ఫీల్డ్లోనే ఉంటుందనేది కాదనలేని సత్యం. జట్టు సెలక్షన్ విషయంలో కెప్టెన్గా తన మార్కు కనబడదు. ఏదొక జట్టు ఆడేద్దాం.. అన్నట్లే ఉంటుంది. సెలక్టర్లు ఏది చెబితే ఓకే అనడమే కోహ్లికి తెలుసు. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న ఆర్సీబీ జట్టును చూస్తే ఇదే విషయం అర్ధమవుతుంది. ఆ జట్టుకు కెప్టెన్గా ఉన్న కోహ్లి.. వేలంలో కూడా పెద్దగా చొరవచూపలేదంట. ఈ సీజన్ ఐపీఎల్ కోసం ఆర్సీబీ సరైన వర్కౌట్ చేయలేదని మాజీ క్రికెటర్ ఆకాశ్చోప్రా బహిరంగంగానే విమర్శించాడు. కోహ్లికి తుది జట్టు ఎలా ఉండాలో తెలియదంటూ సెటైర్ వేశాడు. ‘ఈసాల కప్ నమ్దే’ అంటున్న కోహ్లి.. ఈ జట్టుతో ఎలా నెగ్గుకొస్తాడో అని చోప్రా కాస్త ఘాటుగానే మాట్లాడాడు. ఇవన్నీ చూస్తుంటే వరల్డ్కప్కు వెళ్లిన సమయంలో కూడా జట్టు గురించి కోహ్లి పెద్దగా కసరత్తు చేయలేదనే తెలుస్తోంది. రాయుడు లేకపోవడమే టీమిండియా వరల్డ్కప్ ఫైనల్కు వెళ్లకపోవడానికి కారణమని, ఇప్పటికైనా కోహ్లికి జ్ఞానోదయం అయి ఉంటుందని ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. (చదవండి: రాయుడో రాయుడా... ) -
'నా సక్సెస్ వెనుక కారణం అదే'
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో ముంబైతో ఆడిన మొదటి మ్యాచ్లోనే అంబటి రాయుడు చక్కటి ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. లక్ష్యచేదనలో ఏమాత్రం తడబడకుండా తనదైన శైలిలో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. రాయుడు తన ఇన్నింగ్స్లో మొత్తం 48 బంతులు ఎదుర్కొని 6ఫోర్లు, 4 సిక్సర్లతో 71పరుగులతో ఆకట్టుకొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. రైనా లేని లోటును భర్తీ చేస్తూ దాటిగా ఆడిన రాయుడు ఇన్నింగ్స్ ఆసాంతం కసిగా ఉన్నట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన అనంతరం రాయుడు తన ఇన్నింగ్స్పై స్పందించాడు. (చదవండి : రాయుడో రాయుడా... ) 'ఐపీఎల్ ప్రారంభానికి చాలా రోజుల ముందే మా జట్టు చెన్నైలో ప్రాక్టీస్ ఆరంభించింది. తర్వాత లాక్డౌన్లోనూ నా ప్రాక్టీస్ నిరంతరాయంగా కొనసాగింది. ఈ రెండింటి దగ్గర చేసిన ప్రాక్టీస్ నాకు ఎంతగానో ఉపయోగపడింది. నా సక్సెస్ వెనుక ఉన్న అసలు కారణం అదే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే దాటిగా ఆడాలని ముందు అనుకోలేదు.. పిచ్ పరిస్థితి ఏంటనేది అంచనా వేసుకున్నాక బ్యాట్ ఝూలిపించాను. మొదట ఒక పది బంతులను సమర్థంగా ఎదుర్కొన్న తర్వాత పిచ్ను అనుకూలంగా మార్చుకున్న తర్వాత పరుగులు వాటంతట అవే వచ్చాయి. రైనా లేని లోటును పూడ్చాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే వన్డౌన్లో వచ్చి బ్యాటింగ్ చేశా.' అంటూ అంబటి రాయుడు తెలిపాడు ఎమ్మెస్కేపై అభిమానుల ట్రోలింగ్ 2019లో జరిగిన వన్డే ప్రపంచ కప్లో మంచి ఫామ్లో ఉన్న అంబటి రాయుడిని సెలక్ట్ చేయకపోవడం అప్పట్లో విమర్శలకు దారి తీసింది. ఆపై విజయ్ శంకర్ త్రీ డైమన్షనల్ ఆటగాడని అందుకే అతన్ని సెలెక్ట్ చేసినట్లు(బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) అని అప్పటి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పడం తెలిసిందే. ఈ అంశం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. దీంతో రాయుడు మనస్తాపానికి లోనై అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. (చదవండి : ఫ్యాన్స్ లేరు.. స్టేడియం మాత్రం గోలగోల) అయితే ఇది తొందరపాటు చర్యగా భావించి రాయుడు మళ్లీ రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. రాయుడికి వరల్డ్ కప్ ఛాన్స్ రాకపోవడం, మరోవైపు అతడి స్థానంలో తీసుకున్న విజయ్ శంకర్ ఆ ఈవెంట్లో విఫలం కావడం క్రికెట్ అభిమానులను కలచివేసింది. తాజాగా చెన్నై గడ్డు పరిస్థితుల్లో ఉన్న సమయంలో, రైనా లేని లోటును సైతం భర్తీ చేస్తూ సీఎస్కేను డిఫెండింగ్ చాంపియన్ ముంబైను ఓడించే ఇన్నింగ్ ఆడడంతో క్రికెట్ ప్రేమికులు ప్రసాద్పై విపరీతమైన ట్రోల్స్ చేశారు. -
రాయుడో రాయుడా...
ఐపీఎల్లో అంబటి తిరుపతి రాయుడు అదరగొట్టాడు. ఇతర బ్యాట్స్మెన్ ఒక్కో పరుగు కోసం శ్రమిస్తున్న వేళ అలవోకగా పరుగులు సాధించి ఆకట్టుకున్నాడు. 13వ సీజన్ తొలి మ్యాచ్లో తన జట్టుకు శుభారంభం అందించాడు. రాయుడుకు తోడు డు ప్లెసిస్ బ్యాటింగ్, అంతకుముందు బౌలర్ల ప్రదర్శన వెరసి చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు ముంబైకి చెక్ పెట్టింది. రోహిత్ సేన చేతిలో వరుసగా ఐదు మ్యాచుల్లోనూ ఓడిన ధోని టీమ్ తాజా సీజన్ను విజయంతో మొదలు పెట్టింది. మరోవైపు బ్యాట్స్మెన్ వైఫల్యంతో లీగ్ తొలి మ్యాచ్లలో తమ పేలవ రికార్డును ముంబై కొనసాగించింది. 2013 నుంచి వరుసగా ప్రతీ సీజన్ను ఓటమితోనే ఆరంభించిన ముంబైకి ఈసారీ పరాజయం తప్పలేదు. తొలి రోజు విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శనలు లేకపోయినా... సగటు అభిమానికి ఐపీఎల్ సంతోషం మొదలైంది. అబుదాబి: ఐపీఎల్–2020లో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ బోణీ చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్లో చెన్నై 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సౌరభ్ తివారి (31 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. క్వింటన్ డి కాక్ (20 బంతుల్లో 33; 5 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. చెన్నై బౌలర్లలో ఇన్గిడి 3 వికెట్లు పడగొట్టగా... దీపక్ చహర్, రవీంద్ర జడేజా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అంబటి తిరుపతి రాయుడు (48 బంతుల్లో 71; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫాఫ్ డు ప్లెసిస్ (44 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు మూడో వికెట్కు 85 బంతుల్లో 115 పరుగులు జోడించారు. రోహిత్ ఫోర్తో మొదలు... టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబైకి శుభారంభం లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (12) తొలి బంతికి ఫోర్తో ఆట మొదలుపెట్టగా... డి కాక్ దూకుడును ప్రదర్శించాడు. వీరిద్దరు 28 బంతుల్లోనే 46 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరిని నాలుగు బంతుల వ్యవధిలోనే అవుట్ చేసి చెన్నై ఒత్తిడి పెంచింది. తర్వాతి బ్యాట్స్మెన్లో సౌరభ్ తివారి ఒక్కడే చెలరేగగా... మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడం ముంబైని దెబ్బ తీసింది. జడేజా బౌలింగ్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన హార్దిక్ పాండ్యా (14), ఆశలు పెట్టుకున్న పొలార్డ్ (18) కీలక సమయంలో వెనుదిరిగారు. చివరి 6 ఓవర్లలో 41 పరుగులు మాత్రమే చేయగలిగిన ముంబై 6 వికెట్లను కోల్పోయింది. శతక భాగస్వామ్యం... సూపర్ కింగ్స్ తమ ఛేదనను పేలవంగా ప్రారంభించింది. తొలి ఓవర్లోనే వాట్సన్ (4)ను బౌల్ట్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయగా... తర్వాతి ఓవర్ వేసిన ప్యాటిన్సన్... విజయ్ (1)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే డు ప్లెసిస్, రాయుడు భాగస్వామ్యం చెన్నైని ముందుకు నడిపించింది. రాయుడు దూకుడుగా ఆడగా, ప్లెసిస్ అతనికి అండగా నిలిచాడు. ప్లెసిస్ ప్రశాంతంగా తన బ్యాటింగ్ను కొనసాగిస్తూ 42 బంతుల్లో తన అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజా (10) అవుటైన సమయంలో చెన్నై విజయానికి 17 బంతుల్లో 29 పరుగులు కావాల్సి ఉండగా... స్యామ్ కరన్ (6 బంతుల్లో 18; 1 ఫోర్, 2 సిక్సర్లు) చకచకా ఆడి చెన్నైని విజయానికి చేరువగా తెచ్చాడు. ఆ రెండు క్యాచ్లు... ముంబై ఇన్నింగ్స్ 15వ ఓవర్లో డు ప్లెసిస్ అందుకున్న రెండు క్యాచ్లు హైలైట్గా నిలిచాయి. జడేజా వేసిన ఈ ఓవర్లో తొలి బంతికి సౌరభ్ తివారి కొట్టిన షాట్ను లాంగాన్ బౌండరీ వద్ద అద్భుతంగా అందుకున్న ప్లెసిస్... ఐదో బంతికి హార్దిక్ పాండ్యా షాట్కు లాంగాఫ్ బౌండరీ వద్ద ఎగిరి అందుకున్నాడు. ఇదే ఓవర్ ముంబైను నియంత్రించడంలో కీలకంగా మారింది. స్పెషల్ ఇన్నింగ్స్... 2 ఓవర్ల తర్వాత 2 వికెట్లకు 6 పరుగులు... ఈ స్కోరు వద్ద రాయుడు బ్యాటింగ్కు వచ్చాడు. ప్యాటిన్సన్ బౌలింగ్లో బ్యాక్ఫుట్పై కొట్టిన ఫోర్తో అతని జోరు మొదలైంది. బౌల్ట్ ఓవర్లో కొట్టిన కవర్ డ్రైవ్ బౌండరీ అయితే చూడముచ్చటగా అనిపించింది. బుమ్రా వేసిన వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ (ఫ్రీ హిట్) కొట్టిన అతను జోరు పెంచాడు. కృనాల్ బౌలింగ్లో మరో భారీ సిక్సర్ కొట్టిన అనంతరం రాయుడు... బుమ్రా ఓవర్లో కొట్టిన అద్భుతమైన స్ట్రెయిట్ బౌండరీతో 33 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా కొన్ని చూడచక్కటి షాట్లతో అలరించిన రాయుడు... చెన్నైకి గెలుపు బాట చూపించి రాహుల్ చహర్ బౌలింగ్లో వెనుదిరిగాడు. 436 రోజుల తర్వాత... మహేంద్ర సింగ్ ధోని అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడింది. మైదానంలో మహిని చూడాలని ఇంతకాలం ఎదురు చూసిన వారు ఐపీఎల్ తొలి మ్యాచ్లో ధోనిని చూసి సంబరపడ్డారు. తన గడ్డం స్టయిల్ను కూడా కాస్త మార్చుకొని అతను బరిలోకి దిగాడు. ధోని చివరిసారిగా 2019 జూలై 9–10 తేదీల్లో న్యూజిలాండ్తో జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్లో ఆడాడు. అంటే 436 రోజుల విరామం తర్వాత ఈ మాజీ కెప్టెన్ మళ్లీ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. అన్నట్లు ఆగస్టు 15న 19.29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని... ఇప్పుడు 19.30 గంటలకు మళ్లీ దేశవాళీ క్రికెట్ మ్యాచ్తో ఆటలోకి వచ్చాడు. స్లిప్లో ఫీల్డర్ను ఉంచవచ్చా... సరదాగా సింగిల్ పంచ్లు విసరడంలో ధోని తర్వాతే ఎవరైనా. మీడియా సమావేశాల్లో, మ్యాచ్ తర్వాత వ్యాఖ్యలు చేసే సమయంలో కూడా ఇది చాలా సార్లు కనిపించింది. తొలి మ్యాచ్లో టాస్ వేసే సమయంలో కూడా అతను ఇదే విషయాన్ని చెప్పాడు. ఐపీఎల్లో సోషల్ డిస్టెన్సింగ్ గురించి మాట్లాడుతూ ‘నేను కూడా రిఫరీని అడిగాను. ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ పక్కన మొదటి స్లిప్లో ఫీల్డర్ను ఉంచవచ్చా... లేక డిస్టెన్స్ పాటించాలా’ అని ధోని నవ్వుతూ చెప్పాడు. కరోనా బాధితుడితో మొదలు... ఐపీఎల్ యూఏఈకి తరలిపోవడం, సెప్టెంబర్లో ఎట్టకేలకు టోర్నీ జరగడం... ఇలా అన్నింటికీ కరోనాయే కారణమనేది అందరికీ తెలిసిందే. లీగ్లో పాల్గొంటున్న జట్లు యూఏఈ చేరుకున్న తర్వాత ఇద్దరు చెన్నై ఆటగాళ్లు కోవిడ్–19 బారిన పడ్డారు. వీరిలో పేసర్ దీపక్ చహర్ కోలుకొని మళ్లీ మైదానంలోకి వచ్చాడు. ఇప్పుడు టోర్నీ తొలి బంతిని అతనే వేశాడు. కరోనా నేపథ్యంలో మొదలైన ఐపీఎల్కు ఇంతకంటే సరైన ఆరంభం ఉండదేమో. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) కరన్ (బి) చావ్లా 12; డి కాక్ (సి) వాట్సన్ (బి) కరన్ 33; సూర్యకుమార్ (సి) కరన్ (బి) చహర్ 17; సౌరభ్ తివారి (సి) డు ప్లెసిస్ (బి) జడేజా 42; హార్దిక్ (సి) డు ప్లెసిస్ (బి) జడేజా 14; పొలార్డ్ (సి) ధోని (బి) ఇన్గిడి 18; కృనాల్ (సి) ధోని (బి) ఇన్గిడి 3; ప్యాటిన్సన్ (సి) డు ప్లెసిస్ (బి) ఇన్గిడి 11; రాహుల్ చహర్ (నాటౌట్) 2; బౌల్ట్ (బి) చహర్ 0; బుమ్రా (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–46; 2–48; 3–92; 4–121; 5–124; 6–136; 7–151; 8–156; 9–156. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–32–2; స్యామ్ కరన్ 4–0–28–1; ఇన్గిడి 4–0–38–3; పీయూష్ చావ్లా 4–0–21–1; జడేజా 4–0–42–2. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: విజయ్ (ఎల్బీ) (బి) ప్యాటిన్సన్ 1; వాట్సన్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 4; డు ప్లెసిస్ (నాటౌట్) 58; రాయుడు (సి అండ్ బి) రాహుల్ చహర్ 71; జడేజా (ఎల్బీ) (బి) కృనాల్ 10; స్యామ్ కరన్ (సి) ప్యాటిన్సన్ (బి) బుమ్రా 18; ధోని (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం (19.2 ఓవర్లలో 5 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–5; 2–6; 3–121; 4–134; 5–153. బౌలింగ్: బౌల్ట్ 3.2–0–23–1; ప్యాటిన్సన్ 4–0–27–1; బుమ్రా 4–0–43–1; కృనాల్ 4–0–37–1; రాహుల్ చహర్ 4–0–36–1. సాధారణంగా మేము వేసవి కాలంలోనూ ప్రాక్టీస్ చేస్తాం. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగాను. పిచ్ కూడా బాగుంది. ఉక్కబోత వాతావరణం ఉండే చెన్నై, దుబాయ్లలో ప్రాక్టీస్ చేయడం కలిసొచ్చింది. – ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రాయుడు -
చెన్నై ‘సూపర్’ విక్టరీ
అబుదాబి: ఐపీఎల్-13 వ సీజన్ ఆరంభపు మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ దుమ్ములేపింది. అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ దుమ్ములేపి తొలి విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. అంబటి రాయుడు(71; 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు) బ్యాటింగ్ పవర్ చూపించగా, డుప్లెసిస్(58 నాటౌట్; 44 బంతుల్లో 6 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడి విజయంలో సహకరించాడు. ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరుణంలో సీఎస్కేను రాయుడు, డుప్లెసిస్లు ఆదుకున్నారు. ఈ జోడి 115 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యాన్ని సాధించి విజయంలో కీలక పాత్ర పోషించింది. చివర్లో ఆల్రౌండర్ సామ్ కరాన్ ఆరు బంతుల్లో రెండు సిక్స్లు, 1 సిక్స్తో బ్యాట్ ఝుళిపించాడు. బౌల్ట్ వేసిన 20 ఓవర్ తొలి రెండు బంతుల్ని డుప్లెసిస్ వరుసగా ఫోర్లు కొట్టడంతో చెన్నై ఇంకా నాలుగు బంతులు ఉండగా విజయాన్ని ఖాతాలో వేసుకుంది.(చదవండి: జడేజా మ్యాజిక్.. డుప్లెసిస్ సూపర్) ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 163 లక్ష్య ఛేదనలో భాగంగా సీఎస్కే ఆరు పరుగులకే ఓపెనర్లు మురళీ విజయ్(1), షేన్ వాట్సన్(4) వికెట్లను ఆదిలోనే కోల్పోయినప్పటికీ రాయుడు మాత్రం చూడచక్కని షాట్లతో మెరిపించాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒకవైపు మంచి బంతుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా చెత్త బంతి అనిపిస్తే బౌండరీకి పంపించడానికి ఏమాత్రం వెనుకాడలేదు. బౌలర్ ఎవరైనా టైమింగ్తో దుమ్ములేపాడు. ఈ క్రమంలోనే డుప్లెసిస్తో కలిసి వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాంతో సీఎస్కే 14.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసి ఒక్కసారిగా ట్రాక్లోకి వచ్చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వాట్సన్ను పాటిన్సన్ ఎల్బీగా పెవిలియన్కు పంపగా, మురళీ విజయ్ను బౌల్ట్ ఎల్బీగా ఔట్ చేశాడు. దాంతో రెండో ఓవర్లోనే సీఎస్కే కష్టాల్లో పడింది. ఆ తరుణంలో రాయుడు-డుప్లెసిస్ల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లింది. కాగా, 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 71 పరుగులు చేసిన తర్వాత రాయడు మూడో వికెట్గా ఔటయ్యాడు.(చదవండి: ధాటిగా బ్యాటింగ్.. అంతలోనే!) ఈ మ్యాచ్లో తొలుత సీఎస్కే టాస్ గెలవడం ద్వారా బ్యాటింగ్కు దిగిన ముంబై 162 పరుగులు చేసింది. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్ మొదటి బంతినే రోహిత్ ఫోర్ కొట్టాడు. ఆపై డీకాక్కు కూడా బ్యాట్ ఝుళింపించాడు. వీరిద్దరూ నాలుగు ఓవర్ల ముగిసేసరికి 45 పరుగులు సాధించి రన్రేట్ను పదికి పైగా ఉంచారు. కాగా, మ్యాచ్ ఒక్కసారిగా ఛేంజ్ అయిపోయింది. సీఎస్కే స్పిన్నర్ పీయూష్ చావ్లా వేసిన ఐదో ఓవర్ నాల్గో బంతికి రోహిత్(12) తొలి వికెట్గా పెవిలియన్ చేరగా, క్వింటాన్ డీకాక్(33) ఆ తర్వాత ఓవర్లో పెవిలియన్ చేరాడు. పేసర్ సామ్ కరాన్ వేసిన ఆరో ఓవర్ తొలి బంతికి డీకాక్(33) రెండో వికెట్గా ఔటయ్యాడు. డీకాక్ 20 బంతుల్లో ఐదు ఫోర్లు కొట్టాడు. కరాన్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన డీకాక్.. వాట్సన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో సూర్యకుమార్ యాదవ్(17), సౌరవ్ తివారీల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి 44 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యాడు. అప్పుడు తివారీకి హార్దిక్ పాండ్యా కలవడంతో స్కోరు కాసేపు పరుగులు పెట్టింది. కానీ అది ఎంతోసేపు సాగలేదు. తివారీ,హార్దిక్లు వరుసగా పెవిలియన్ చేరడంతో ఆ తర్వాత వచ్చిన కృనాల్, పొలార్డ్లు కూడా రాణించకపోవడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఎన్గిడి మూడు వికెట్లు సాధించగా, జడేజా, దీపక్ చాహర్ తలో రెండు వికెట్లు సాధించారు, సామ్ కరాన్, పీయూష్ చావ్లా తలో వికెట్ తీశారు. -
రాయుడు అదరగొట్టాడు..
అబుదాబి: చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు బ్యాటింగ్లో సత్తాచాటాడు. తాను ఎంత విలువైన ఆటగాడో మరొకసారి నిరూపించుకున్నాడు. ఫోర్లు, సిక్స్లే కాకుండా అత్యంత నిలకడతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్-13 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 163 లక్ష్య ఛేదనలో భాగంగా సీఎస్కే ఆరు పరుగులకే ఓపెనర్లు మురళీ విజయ్(1), షేన్ వాట్సన్(4) వికెట్లను ఆదిలోనే కోల్పోయినప్పటికీ రాయుడు మాత్రం చూడచక్కని షాట్లతో మెరిపించాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. (చదవండి: జడేజా మ్యాజిక్.. డుప్లెసిస్ సూపర్) ఒకవైపు మంచి బంతుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా చెత్త బంతి అనిపిస్తే బౌండరీకి పంపించడానికి ఏమాత్రం వెనుకాడలేదు. బౌలర్ ఎవరైనా టైమింగ్తో దుమ్ములేపాడు. ఈ క్రమంలోనే డుప్లెసిస్తో కలిసి వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాంతో సీఎస్కే 14.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసి ఒక్కసారిగా ట్రాక్లోకి వచ్చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వాట్సన్ను పాటిన్సన్ ఎల్బీగా పెవిలియన్కు పంపగా, మురళీ విజయ్ను బౌల్ట్ ఎల్బీగా ఔట్ చేశాడు. దాంతో రెండో ఓవర్లోనే సీఎస్కే కష్టాల్లో పడింది. ఆ తరుణంలో రాయుడు-డుప్లెసిస్ల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లింది.కాగా, 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 71 పరుగులు చేసిన తర్వాత రాయడు మూడో వికెట్గా ఔటయ్యాడు. -
మూడో స్థానంలో రాయుడు ఆడాలి
న్యూఢిల్లీ: ఐపీఎల్ నుంచి అనూహ్యంగా తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ప్రధాన ఆటగాడు సురేశ్ రైనా స్థానాన్ని అంబటి రాయుడుతో భర్తీ చేయాలని న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ స్కాట్ స్టయిరిస్ అభిప్రాయపడ్డాడు. సీఎస్కే జట్టులో మూడో స్థానంలో బరిలో దిగేందుకు రాయుడే సరైనవాడని అతను పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా తానైతే అదే పని చేస్తానని ఈ కివీస్ మాజీ ఆల్రౌండర్ వ్యాఖ్యానించాడు. ‘రైనా లాంటి క్లాస్ క్రికెటర్ను, నిలకడగా రాణించే ఆటగాడిని, మైదానంలో పరుగుల వరద పారించడంతో పాటు ఫీల్డింగ్లో ఆకట్టుకునే ప్లేయర్ను వెతకడం చాలా కష్టం. చెన్నై జట్టులో నాణ్యమైన ఆటగాళ్లకు కొదవ లేనప్పటికీ మూడో స్థానంలో కుదురుకునే ప్లేయర్ను ఎంచుకోవడం ప్రస్తుతానికి సవాలే. రైనాతో పాటు హర్భజన్ కూడా లేకపోవడం జట్టుపై ప్రభావం చూపనుంది. మూడో స్థానంలో రాయుడు సరైన ఎంపిక. రైనా స్థానాన్ని అతను భర్తీ చేయగలడు. దీనితో పాటు టాపార్డర్లో ఇద్దరు విదేశీయులతో పాటు యువ రుతురాజ్ గైక్వాడ్ను ఆడిస్తే బావుంటుంది. భారీ హిట్టింగ్ చేసే ఆటగాడిని తీసుకున్నా మంచిదే’ అని స్టయిరిస్ వివరించాడు. -
అతను ఉంటే వరల్డ్కప్ గెలిచేవాళ్లం: రైనా
న్యూఢిల్లీ: హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడు గనుక 2019- వరల్డ్కప్ స్వ్కాడ్లో ఉండి ఉంటే టీమిండియా కప్ గెలుచుకునేదని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. రాయుడు కష్టపడే తత్వం గలవాడని, బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానానికి అతడే సరైన ఎంపిక అంటూ ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. కాగా గతేడాది జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్కప్ భారత జట్టులో చోటు కోసం ఎంతగానో ఎదురు చూసిన అంబటి రాయుడికి సెలక్టర్లు మొండిచేయి చూపిన సంగతి తెలిసిందే. అప్పటికి మెరుగైన రికార్డు ఉన్నప్పటికీ రాయుడిని పక్కనపెట్టి అతడి స్థానంలో విజయ్ శంకర్కు అవకాశమివ్వడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక ఈ తమిళనాడు క్రికెటర్ను ఎంపిక చేయడాన్ని సమర్థించుకుంటూ శంకర్ 3డీ ప్లేయర్(బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) అంటూ సెలక్టర్ ఎంఎస్కే చేసిన కామెంట్స్పై రాయుడు కూడా అంతే ఘాటుగా స్పందించడం వివాదానికి దారితీసింది.(రైనాకూ ప్రధాని లేఖ ) ఈ నేపథ్యంలో విజయ్ శంకర్ గాయంతో తిరిగి స్వదేశానికి వచ్చిన్పటికీ మరోసారి రాయుడికి హ్యాండిచ్చిన సెలక్టర్లు.. రిషభ్ పంత్ను ఇంగ్లండ్కు పిలిపించారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన రాయుడు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించి.. కొన్నాళ్ల తర్వాత తన మాట వెనక్కి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆనాటి పరిస్థితుల గురించి క్రిక్బజ్తో మాట్లాడిన సురేశ్ రైనా.. ‘‘ రాయుడు కష్టపడే తత్వం ఉన్నవాడు. తననెప్పుడూ నంబర్.4 ప్లేస్లో చూడాలని భావించేవాడిని. నిజానికి 2018 నాటి టూర్ను నేను ఏమాత్రం ఆస్వాదించలేకపోయాను. అప్పుడు రాయుడు ఫిట్నెస్ టెస్టులో విఫలం కావడంతో తన స్థానంలో నన్ను సెలక్ట్ చేయడం అంతగా నచ్చలేదు. అంతేకాదు ప్రపంచ కప్ సమయంలో కూడా తను జట్టుతో లేకపోవడం ప్రభావం చూపింది.('రైనా.. ఆఫ్రిదిలా యూటర్న్ తీసుకో') ఒకవేళ తను ఉండి ఉంటే మేం టోర్నమెంట్ గెలిచేవాళ్లం. చెన్నై సూపర్కింగ్స్కు ఆడే సమయంలో తన ఆటను దగ్గరగా గమనించాను. తనెంతో బాగా బ్యాటింగ్ చేస్తాడు’’అని రాయుడికి విషయంలో సెలక్టర్లు వ్యవహరించిన తీరును పరోక్షంగా ప్రస్తావించాడు. ఇక 2019 వరల్డ్ కప్లో లీగ్ దశలో అగ్రగామిగా నిలిచిన భారత్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలై ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. -
‘అందుకే అంబటి రాయుడ్ని తీసుకోలేదు’
న్యూఢిల్లీ: గతేడాది జరిగిన వన్డే వరల్డ్కప్లో భాగంగా అంబటి రాయుడు భారత క్రికెట్ జట్టులో చోటు కోసం చివరి వరకూ ఎదురుచూసినా నిరాశే ఎదురైంది. ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని అప్పటి సెలక్షన్ కమిటీ రాయుడ్ని పరిగణలోకి తీసుకోలేకపోవడంతో అది అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. వరల్డ్కప్కు రాయుడ్ని పక్కకు పెట్టిన సెలక్టర్లు.. విజయ్ శంకర్కు అవకాశం ఇచ్చారు. ఆ క్రమంలోనే విజయ్ శంకర్ ‘3డీ(బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) ప్లేయర్ అంటూ ఎంఎస్కే కామెంట్ చేయడంతో రాయుడిలో మరింత అసంతృప్తిని రేకెత్తించింది. (‘న్యూజిలాండ్ను సాకుగా చూపడం లేదు’) భారత జట్టు 3డీ ఆటను చూడటానికి 3డీ గ్లాసెస్ కోసం ఆర్డర్ చేశానంటూ సెటైరిక్గా రాయుడు స్పందించడం మరింత వివాదంగా మారింది. కాగా, విజయ్ శంకర్ గాయంతో తిరిగి వచ్చిన క్రమంలో కూడా రాయుడికి అవకాశం ఇవ్వకుండా, రిషభ్ పంత్ను ఇంగ్లండ్కు పిలిపించారు. దాంతో రాయుడు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. అటు తర్వాత తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న రాయుడు.. హైదరాబాద్ రంజీ జట్టుకు సైతం కెప్టెన్గా చేశాడు. కాగా, హెచ్సీఏపై అవినీతి ఆరోపణలు చేసిన రాయుడు గత కొంతకాలంగా క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. కాగా, అప్పుడు రాయుడ్ని వరల్డ్కప్లోకి ఎందుకు తీసుకోలేదనే దానిపై మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే మరొకసారి స్పందించాడు. స్పోర్ట్స్ స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబటి ఉద్వాసన గురించి అడగ్గా అందుకు ప్రసాద్ బదులిచ్చాడు. ‘ అంబటి రాయుడు కచ్చితంగా అనుభవం ఉన్న బ్యాట్స్మన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మేము వరల్డ్కప్ దృష్టిలో పెట్టుకుని అనుభవానికే పెద్ద పీట వేశాం. ఆ క్రమంలోనే అంబటి రాయుడు ఏడాది పాటు జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు. అయితే వరల్డ్కప్కు తీసుకునే నమ్మకాన్ని అతను మాకు కల్పించలేకపోయాడు. దాంతో రాయుడ్ని పక్కకు పెట్టాల్సి వచ్చింది. ఇక యువ క్రికెటర్లవైపు చూడటం కూడా మంచిది కాదనుకున్నాం. ఆ టోర్నమెంట్ ఇంగ్లండ్లో జరుగుతుండటంతో అన్ని రకాలుగా పకడ్బందీగా వెళ్లాలనుకున్నాం. 2016లో జింబాబ్వే పర్యటన తర్వాత రాయుడు టెస్టు సెలక్షన్పై ఫోకస్ చేసి ఉండాల్సింది. ఆ విషయాన్ని రాయుడికి చాలాసార్లు చెప్పాను కూడా. టెస్టు క్రికెట్పై ఎందుకు ఫోకస్ చేయడం లేదని చాలాసార్లు ఆడిగా’ అని ఎంఎస్కే చెప్పుకొచ్చాడు. (‘బుమ్రా యాక్షన్తో అతనికే చేటు’) -
మరో క్రికెటర్కి అమ్మాయి పుట్టింది!
క్రీడాకారులందరికీ.. ముఖ్యంగా ఇండియన్ క్రికెటర్లలో దాదాపు అందరికీ కూతుళ్లే అని ఈమధ్యే మీరు ‘ఫ్యామిలీ’ లో స్టోరీ చూసి వుంటారు. ఇప్పుడు లేటెస్టుగా మరో క్రికెటర్కి అమ్మాయి పుట్టింది! బ్యాట్స్మన్ అంబటి రాయుడు,ఆయన భార్య చెన్నుపల్లి విద్య.. బ్లెస్డ్ విత్ బేబీ గర్ల్. ఈ సంతోషకరమైన వార్తను అందరికంటే ముందుగా ఐ.పి.ఎల్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. లోకానికి వెల్లడించింది. తల్లీబిడ్డ, వారిద్దరికన్నా ఎక్కువగా చిరునవ్వులు చిందిస్తున్న తండ్రీ.. ఈ ముగ్గురూ ఉన్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ‘ఇప్పుడిక డాడీస్ ఆర్మీ నుంచి ఆఫ్ లైన్ పాఠాలను ఉపయోగంలోకి పెట్టుకోవాలి. (ముద్దుల కూతుళ్లు) విజిల్ పోడు’ అని సూపర్ కింగ్స్ కామెంట్ పెట్టింది. రాయుడుది గుంటూరు. రైట్ హ్యాండెడ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మాన్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు. క్రికెట్ రాజకీయాలకు విముఖుడు, విరక్తుడై గత ఏడాది ఇదే నెలలో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు ఇదే నెలలో తండ్రిగా నూతన జీవనోత్తేజంలోకి వచ్చేశాడు. జులై 12 న కూతురు పుట్టింది. మరో ఆడపిల్ల తండ్రి సురేష్ రైనా అతడికి శుభాభినందనలు తెలిపాడు. 34 ఏళ్ల రాయుడికి 2009లో పెళ్లయింది. -
తండ్రైన అంబటి రాయుడు
హైదరాబాద్ : చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి చెన్నుపల్లి విద్య ఆదివారం పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సీఎస్కే ట్విటర్ వేదికగా అభిమానులకు తెలియజేసింది. చిన్నారి, విద్యలతో కలిసి రాయుడు దిగిన ఫొటోను కూడా షేర్ చేసింది. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు రాయుడుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సీఎస్కే ఆటగాడు సురేష్ రైనా కూడా రాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘పండంటి పాపకు జన్మనిచ్చిన రాయుడు, విద్య దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. చిన్నారితో గడిపే ప్రతి ఒక్క క్షణాన్ని ఆనందించండి. మీరు ఎప్పుడూ ప్రేమ, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.(ఆసీస్ పర్యటనలో భారత క్రికెటర్లకు క్వారంటైన్ సమయం కుదించాలి) కాగా, రాయుడకు 2009 ఫిబ్రవరి 14న విద్యతో వివాహం అయింది. విద్య బయట ఎక్కువగా కనిపించరు. రాయుడు ఆడిన అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్లకు హాజరవుతుండేవారు. ఇక, క్రికెట్ విషయానికి వస్తే.. గతేడాది వన్డే వరల్డ్కప్ జట్టులో చోటు లభించకపోవడంతో రాయుడు ఆటకు గుడ్బై చెబుతున్నట్టు ప్రకటించాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. మరోవైపు గత కొన్ని సీజన్లుగా రాయుడు ఐపీఎల్లో సీఎస్కే తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే.(స్వదేశీ కోచ్లపై కేంద్రం చిన్నచూపు) -
ప్రతి వ్యక్తీ ఐదు మొక్కలు నాటాలి; అంబటి రాయుడు
యాచారం: ప్రతి వ్యక్తీ ప్రతి యేటా ఐదు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు కోరారు. ఆరో విడత హరితహారంలో భాగంగా గురువారం యాచారం మండల కేంద్రంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా హరితహారం నిర్వహించడం అభినందనీయమన్నారు. మొక్కలు నాటి సంరక్షణ చేయడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్యభాషా, జెడ్పీటీసీ సభ్యురాలు చిన్నోళ్ల జంగమ్మ, యాచారం సర్పంచ్ ముదిరెడ్డి శ్రీధర్రెడ్డి, ఉప సర్పంచ్ గొల్లపల్లి లలిత, ఎంపీడీఓ వినయ్కుమార్, తహసీల్దార్ నాగయ్య, పంచాయతీ కార్యదర్శి సురేష్రెడ్డి పాల్గొన్నారు. మొక్క నాటి నీళ్లు పోస్తున్న క్రికెటర్ అంబటి రాయుడు -
నీకు.. 3డీ కామెంట్ అవసరమా?: గంభీర్
న్యూఢిల్లీ: గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్లో భాగంగా భారత క్రికెట్ జట్టు సెలక్షన్ సమయంలో రాద్దాంతం అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రధానంగా మిడిల్ ఆర్డర్ ఆటగాడు అంబటి రాయుడ్ని కాదని విజయ్ శంకర్కు చోటు కల్పించడం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ముఖ్యంగా ఆల్రౌండర్ కోటాలో శంకర్కు చోటు కల్పించిన బీసీసీఐ సెలక్షన్ పెద్దలు.. దాన్ని అప్పట్లో సమర్ధించుకున్నారు కూడా. అప్పుడు బీసీసీఐ చీఫ్ సెలక్టర్గా ఉన్న ఎంఎస్కే ప్రసాద్.. విజయ్ శంకర్ను 3డీ ప్లేయర్గా అభివర్ణించడం అగ్గిరాజేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలను 3డీతో పోల్చాడు ఎంఎస్కే. దాంతో చిర్రెత్తుకొచ్చిన అంబటి రాయుడు.. భారత క్రికెట్ జట్టు ఆటను చూడటానికి 3డి కళ్లద్దాలకు ఆర్డర్ ఇచ్చానంటూ కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ఇదే అంశంపై ఇప్పుడు మరోసారి ఎంఎస్కే నిర్ణయాన్ని తప్పుపట్టాడు మాజీ ఓపెనర్ గౌతం గంభీర్. ఒక చీఫ్ సెలక్టర్(సెలక్షన్ చైర్మన్) హోదాలో ఆ మాట అనడం సరైనది కాదని గంభీర్ పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ‘క్రికెట్ కనెక్టెడ్’ షోలో గౌతం గంభీర్, కృష్ణమాచారి శ్రీకాంత్లతో పాటు ఎంఎస్కే ప్రసాద్ కూడా పాల్గొన్నాడు. ఈ షోలో ఎంఎస్కే ప్రశ్నించాడు గంభీర్.(ధోనిని ఏనాడు అడగలేదు: రైనా) ‘అంబటి రాయుడు విషయంలో ఏమి జరిగిందో చూశాం. ముఖ్యంగా వరల్డ్కప్కు ముందు రెండేళ్ల పాటు అతనికి జట్టులో చోటు కల్పిస్తూ వచ్చారు. ఆ రెండేళ్లు నాలుగో స్థానంలో రాయుడు బ్యాటింగ్ చేశాడు. మరి వరల్డ్కప్కు ముందు 3డీ అవసరమైందా.. ఒక చైర్మన్ హోదాలో మీరు ఆ మాట మాట్లాడటం భావ్యమా’ అని నిలదీశాడు. దీనికి ఎంఎస్కే బదులిస్తూ. ‘ఇంగ్లిష్ వాతావరణంలో ఆల్రౌండర్ ఉండాలనే ఉద్దేశంతోనే శంకర్ను ఎంపిక చేశాం. మనకు సీమ్ బౌలింగ్ పరంగా ఇబ్బంది ఉందనే శంకర్ను చివరి నిమిషంలో తీసుకొచ్చాం. శంకర్ దేశవాళీ రికార్డులను పరిశీలించిన పిదప అతనికి అవకాశం ఇచ్చాం’ అని తెలిపాడు. కాగా, ఎంఎస్కే నిర్ణయాన్ని షోలో ఉన్న శ్రీకాంత్ తప్పుబట్టాడు. ఇక్కడ గంభీర్ను వెనకేసుకొచ్చి మిమ్మల్ని కించపరచడం లేదంటూనే అంతర్జాతీయ క్రికెట్కు దేశవాళీ క్రికెట్కు చాలా తేడా ఉంటుందన్నాడు. బౌలింగ్ పరంగా శంకర్ ఓకే కావొచ్చు...కానీ బ్యాటింగ్లో టాపార్డర్లోనే దిగాలి కదా.. ఆ విషయాన్ని పట్టించుకోలేదా’ అని శ్రీకాంత్ ప్రశ్నించాడు. (మమ్మల్ని ఆడనివ్వండి.. నిజాయితీగా ఉండండి) -
అతని రీఎంట్రీ ఖాయం.. బెట్ వేస్తా: రాయుడు
న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా రీఎంట్రీపై సహచర సీఎస్కే ఆటగాడు అంబటి రాయుడు ధీమా వ్యక్తం చేశాడు. సురేశ్ రైనాకు ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉందని, అతను మళ్లీ భారత్ తరఫున ఆడటం పక్కా అని రాయుడు ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. సీఎస్కే ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో పలు విషయాల్ని రాయుడు పంచుకున్నాడు. దీనిలో భాగంగా సురేశ్ రైనా రీఎంట్రీపై ఆశాభావం వ్యక్తం చేశాడు. రైనా మళ్లీ భారత్ జట్టుకు ఆడతాడనే విషయంలో పందెం కూడా ఖాయడానికి కూడా సిద్ధమన్నాడు. అతనిలో ఇంకా బోలెడు క్రికెట్ మిగిలే ఉందని, అదే అతన్ని టీమిండియా తరఫున ఆడేలా చేస్తుందన్నాడు. అతను ఆటను చాలా దగ్గర్నుంచీ చూసిన వ్యక్తులలో తాను ఒకడినని, దాంతో రైనా పునరాగమనంపై కచ్చితంగా చెప్పగలుగుతున్నానన్నాడు. లాక్డౌన్కు ముందు సీఎస్కే నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో రైనాలో ఒక కొత్త ఆటగాడిని చూశానని అంబటి రాయుడు పేర్కొన్నాడు. మళ్లీ బ్లూ జెర్సీ ధరించడానికి రైనాకు ఎంతో సమయం పట్టదన్నాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్కప్లో అంబటి రాయుడు జట్టులోకి సెలక్ట్ అయ్యే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడనే చెప్పాలి. (విజయ్తో డిన్నర్కు ఓకే చెప్పిన ఎలిస్) రిజర్వ్ ఆటగాళ్లలో అంబటి రాయుడు ఉన్నప్పటికీ చివరి నిమిషంలో దాన్ని మిస్సయ్యాడు.విజయ శంకర్ గాయం కారణంగా స్వదేశానికి పయనమైన నేపథ్యంలో రాయుడు ఇంగ్లండ్కు పయనం అవుతాడని అంతా అనుకున్నారు. కానీ రిషభ్ పంత్కు అవకాశం ఇవ్వడంతో రాయుడుకు నిరాశే ఎదురైంది. ఆ ఊహించని పరిణామంతో క్రికెట్కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించిన రాయుడు.. కొన్ని రోజుల తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఆ క్రమంలోనే హైదరాబాద్ రంజీ జట్టుకు రాయుడు కెప్టెన్గా ఎంపిక కావడం జరిగింది.కాగా,హెచ్సీఏలో అవినీతి జరుగుతుందంటూ ఆరోపించిన రాయుడు తన కెప్టెన్సీ పదవిని వదులుకున్నాడు. ఎప్పుడూ తన మాటల ద్వారానే కాకుండా ఆటలో కూడా దూకుడుగా కనిపించే రాయుడు.. మళ్లీ భారత్ జట్టులో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు. గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్లో సీఎస్కే తరఫున ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే అదే జట్టుకు ఆడుతున్న రైనా రీఎంట్రీపై అంబటి రాయుడు తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఇక రైనా విషయానికొస్తే భారత్ తరఫున మ్యాచ్ ఆడి దాదాపు రెండేళ్లు అవుతుంది. 2018లో చివరిసారి మెన్ ఇన్ బ్లూ జెర్సీలో కనిపించిన రైనా కూడా రీఎంట్రీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. గతంలో ఒకానొక సందర్భంలో తనను కూడా పరిశీలనలోకి తీసుకోవాలని టీమిండియా సెలక్టర్లకు రైనా విన్నవించిన సంగతి తెలిసిందే. (కెప్టెన్సీపై తిరుగుబాటు చేశారు) -
అంబటి రాయుడు ఒక ముక్కోపి..!
ఆంటిగ్వా: టీమిండియా క్రికెటర్, హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడిపై డ్వేన్ బ్రేవో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అంబటి రాయుడు అనే వ్యక్తి ఒక ముక్కోపి అని బ్రేవో వ్యాఖ్యానించాడు. గత కొన్ని సీజన్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అంబటి రాయుడు-బ్రేవోలు కలిసి ఆడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రాయుడు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు బ్రేవో. సీఎస్కే ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్లో రాయుడితో ఆడిన సందర్భాల్లో తాను ఎలా ఉండేవాడినో బ్రేవో చెప్పుకొచ్చాడు. రాయుడితో ఐపీఎల్ మ్యాచ్లు కలిసి ఆడినప్పుడు చాలా విషయాల్లో తప్పుగా అర్ధం చేసుకున్నానని వ్యాఖ్యానించాడు. (‘ధోని వ్యూహాలకు తగ్గ కెప్టెన్లను తీసుకున్నాడు’) ‘అంబటి రాయుడు నా ఫేవరెట్ ప్లేయర్లలో ఒకడు. మేమిద్దరం ముంబై ఇండియన్స్కు ఆడాం. కానీ ఇద్దరం కలిసి ఆడిన సందర్భాలు చాలా తక్కువ. నా తరహాలోనే అతను ప్లేయర్. అతనొక ముక్కోపి. అతను కరెక్ట్ కాదని అనుకుడేవాడిని. ఆ విషయాల్ని తప్పని రాయుడు నిరూపించాడు. ‘‘నువ్వొక చెత్త.. మంచి వాడివి కాదు.. చెన్నై నిన్ను ఎందుకు కొనుగోలు చేసిందో’’ అనే వ్యాఖ్యలతో రాయుడ్ని ఏడిపించడం ఇష్టం. నేనే సీఎస్కేకు ఆడిన తొలి సీజన్లో ఎప్పుడూ నా పక్కనే కూర్చొని ఉండేవాడు. నాకు అతను నచ్చక నేను కూడా నెగిటివ్ విషయాల్నే మాట్లాడేవాడిని. రాయుడితో అంత సఖ్యత ఉండేది కాదు. అవి తప్పని రాయుడు నిరూపించాడు. అతనొక ప్రత్యేకమైన వ్యక్తి. మీరు ఏ వ్యక్తి గురించైనా తెలుసుకోవాలంటే ముందు అతనితో సఖ్యత ద్వారానే తెలుసుకుంటాం. ఒకవేళ తెలియకపోతే సదరు వ్యక్తి గురించి చెడు అభిప్రాయం వస్తుంది. రాయుడు నిజమైన క్రికెటర్. క్రికెట్ను బాగా ఆస్వాదిస్తాడు’ అని బ్రేవో తెలిపాడు. -
హైదరాబాద్ కెప్టెన్ గా తన్మయ్ అగర్వాల్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక అఖిల భారత రంజీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును బుధవారం ప్రకటించారు. అంబటి రాయుడు ఈ సీజన్ రంజీ ట్రోఫీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో జట్టు సారథ్యాన్ని తన్మయ్ అగర్వాల్కు అప్పగించారు. బావనక సందీప్ వైస్ కెప్టెన్ గా ఎంపికవగా, ఎన్. అర్జున్ యాదవ్ కోచ్గా వ్యవహరించనున్నారు. రంజీ ట్రోఫీలో భాగంగా ఈ నెల 9 నుంచి 12 వరకు సొంతగడ్డపై జరిగే తమ తొలి మ్యాచ్లో గుజరాత్తో హైదరాబాద్ జట్టు ఆడుతుంది. జట్టు వివరాలు తన్మయ్ అగర్వాల్, పి. అక్షత్ రెడ్డి, కె. రోహిత్ రాయుడు, బి. సందీప్, హిమాలయ్ అగర్వాల్, కొల్లా సుమంత్, మెహదీహసన్, సాకేత్ సాయిరామ్, ఎం. రవికిరణ్, మొహమ్మద్ సిరాజ్, సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజన్, జీఏ శశిధర్ రెడ్డి, యుద్వీర్ సింగ్, జె. మల్లికార్జున్. -
‘ఎక్కువ ఆలోచనే అనవసరం.. ఉరి తీయండి’
హైదరాబాద్: సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనపై టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు సైతం స్పందించాడు. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ట్వీటర్ అకౌంట్లో ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఇలాంటి ఘటన జరగడం చాలా దారుణమని, ఇది మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంబటి రాయుడు కూడా ఈ పాశవిక ఘటనపై తీవ్రంగా మండిపడ్డాడు. దీనికి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని, అత్యాచార నిందితుల్ని ఉరి తీయాల్సిందేనని ట్వీటర్లో పేర్కొన్నాడు. ‘ ఎవరైనా మహిళ శరీరాన్ని దోచుకోవాలని ఆలోచించే వారికి ఇదొక కనువిప్పు కావాలి. వారి మెడలను గట్టిగా బిగించి ఉరి తీయండి. ఇందుకు ఎక్కువ ఆలోచన అవసరం లేదు. ఉరే సరైనది’ అని అంబటి రాయుడు ట్వీట్ చేశాడు. Anyone who thinks of violating a woman's body should imagine the noose tightening around their neck.lets not think too much.its high time that we act. Hang the rapists.. — Ambati Rayudu (@RayuduAmbati) December 1, 2019 -
అంబటి రాయుడి అంశం తర్వాతే..!
హైదరాబాద్: హెచ్సీఏలో అవినీతి రాజ్యమేలుతోందని ఇటీవల టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలను అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ పెద్దగా సీరియస్గా తీసుకున్నట్లు కనుబడటం లేదు. తాజాగా అంబటి రాయుడి చేసిన అవినీతి వ్యాఖ్యలపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అన్న ప్రశ్నకు అజహర్ దాటవేత ధోరణి అవలంభించాడు. ఆ విషయాన్ని తర్వాత చూద్దామంటూ ముక్తసరిగా సమాధానమిచ్చారు. ‘ నేను ప్రస్తుతం డిసెంబర్ 6వ తేదీన వెస్టిండీస్-భారత్ జట్ల మధ్య హైదరాబాద్లో జరుగనున్న టీ20 మ్యాచ్పైనే దృష్టి పెట్టా. దానికి సంబంధించి నివేదిక మాత్రమే ఇప్పుడు పరిశీలిస్తున్నా. (ఇక్కడ చదవండి: ‘అజహర్ స్టాండ్’) హెచ్సీఏలో కరప్షన్ అంశంపై ఏమైనా మాట్లాడాలని అనుకుంటే డిసెంబర్ 6 తర్వాతే చూద్దాం. నేను మ్యాచ్కు సంబంధించి మాత్రమే ఆలోచిస్తున్నా. దీని కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి. ఒకవేళ వేరే అంశం ఏదైనా ఉంటే అది తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడదాం. మ్యాచ్ను సజావుగా జరపడం కష్టంతో కూడుకున్న పని. అందులోనూ అధ్యక్ష హోదాలో ఇది నా తొలి మ్యాచ్. నేను క్రికెట్ ఆడేటప్పుడు ఆడటం, హోటల్కు వెళ్లడం మాత్రమే ఉండేది. కానీ అధ్యక్ష హోదా అనేది భిన్నమైన బాధ్యతతో కూడుకున్నది’ అని అజహర్ పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగిన హెచ్సీఏ ఎన్నికల్లో అజహర్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. -
అంబటి రాయుడిపై చర్యలు!
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో అవినీతి రాజ్యమేలుతోందని క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. హెచ్సీఏలోని పెద్దల్ని అవమానపరుస్తూ రాయుడు చేసిన వ్యాఖ్యలపై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్సీఏలో ముఖ్యడొకరు పేర్కొన్నారు.దాంతో రాయుడిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ‘ఏడాదిలో చాలా మ్యాచ్లు ఉంటాయి.. ఫిట్గా ఉంటే అవకాశం తప్పకుండా వస్తుంది. హెచ్సీఏ గౌరవానికి భంగం కలిగించిన రాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారమే మేము నడుచుకుంటాం. మొదటగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సీఈవోను ఆదేశిస్తాం. నివేదిక సమర్పించిన తర్వాత అత్యున్నత మండలి అతనిపై అవసరమైన చర్యలు తీసుకుంటుంది' అని సదరు సభ్యుడు పేర్కొన్నారు హెచ్సీఏను దగ్గరి నుంచి చూసిన వ్యక్తి హైదరాబాద్కు చెందిన అంబటి రాయుడు సంఘంలో జరుగుతోన్న అవినీతిని బహిరంగంగా ఎండగట్టాడు. జట్టు ఎంపికలో డబ్బు, హోదా, రాజకీయ ఫలితాలు ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొంటూ ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు ట్వీట్ చేశాడు. పలు ఏసీబీ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు హైదరాబాద్ క్రికెట్ను శాసిస్తున్నారంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నాడు. ‘కేటీఆర్ సర్... దయచేసి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో ప్రబళిన అవినీతిపై దృష్టి సారించండి. జట్టు ఎంపికను డబ్బు, అవినీతి పరులు ప్రభావితం చేస్తుంటే హైదరాబాద్ క్రికెట్ ఎలా అభివృద్ధి చెందుతుంది? వారిపై చర్య తీసుకోండి. ఏసీబీ కేసుల్ని ఎదుర్కొంటోన్న పలువురు హైదరాబాద్ క్రికెట్ను శాసిస్తున్నారు’ అని రాయుడు ట్వీట్లో తీవ్రంగా ఆరోపించాడు. ఇలాంటి పరిణామాల మధ్య ఈ సీజన్ రంజీ ట్రోఫీలో ఆడలేనంటూ రాయుడు జట్టు నుంచి తప్పుకున్నాడు. దీనిపై హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంబటి రాయుడు తీవ్ర అసహనంలో ఉన్నాడంటూ పేర్కొన్నాడు. అయితే దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దని అజహర్కు అంబటి రాయుడు సూచించాడు. హెచ్సీఏ అభివృద్ధికి అందరం కలిసి పని చేద్దామని తెలిపాడు. -
అజహర్.. వ్యక్తిగతంగా తీసుకోవద్దు: అంబటి రాయుడు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. హెచ్సీఏలో అవినీతే రాజ్యమేలుతోందని, డబ్బుతో అసోసియేషన్ను ప్రభావితం చేసే వ్యక్తుల సంఖ్య పెరిగిపోయిందంటూ రాయుడు వ్యాఖ్యానించాడు. ఈ మేరకు ఐటీ శాఖామంత్రి కేటీఆర్కు సైతం ట్వీట్ చేశాడు. హెచ్సీఏను కాపాడాల్సిన బాధ్యత కేటీఆర్పై ఉందని పేర్కొన్నాడు. హైదరబాద్ కెప్టెన్గా తాను నిస్సాహాయ స్థితిలో ఉన్నానని, దాంతోనే వచ్చే రంజీ సీజన్లో జట్టుకు దూరంగా ఉండదల్చుకున్నానని పేర్కొన్నాడు. దీనిపై హెచ్సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాయుడు అసహనంతోనే ఆ వ్యాఖ్యలు చేశాడన్నారు. ఈ విషయంపై తిరిగి స్పందించిన రాయుడు.. ‘హాయ్ అజహర్. దీనిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. అంశం మనిద్దరికంటే పెద్దది. హెచ్సీయూలో ఏం జరుగుతోందో మనిద్దరికీ తెలుసు. హైదరాబాద్ క్రికెట్ను బాగు చేసేందుకు నీకు దేవుడు అవకాశమిచ్చాడు. పాతకాలపు తప్పుడు వ్యక్తులనుంచి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. అలా చేస్తే భవిష్యత్తు తరాల క్రికెటర్లను రక్షించినట్లవుతుంది’ అని తాజా పరిణామాలపై అజహర్కు రాయుడు సూచించాడు. -
హెచ్సీఏలో అవినీతి రాజ్యమేలుతోంది
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)పై పెద్ద పిడుగు పడింది. క్రికెట్ సంఘాలపై అవినీతి ఆరోపణలు తరచుగా వార్తల్లో కనిపించేవే. అయితే ఈసారి భారత క్రికెటర్, అత్యంత అనుభవజు్ఞడు, హెచ్సీఏను దగ్గరి నుంచి చూసిన వ్యక్తి హైదరాబాద్కు చెందిన అంబటి రాయుడు సంఘంలో జరుగుతోన్న అవినీతిని బహిరంగంగా ఎండగట్టాడు. జట్టు ఎంపికలో డబ్బు, హోదా, రాజకీయ ఫలితాలు ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొంటూ ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు ట్వీట్ చేశాడు. పలు ఏసీబీ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు హైదరాబాద్ క్రికెట్ను శాసిస్తున్నారంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నాడు. ‘కేటీఆర్ సర్... దయచేసి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో ప్రబళిన అవినీతిపై దృష్టి సారించండి. జట్టు ఎంపికను డబ్బు, అవినీతి పరులు ప్రభావితం చేస్తుంటే హైదరాబాద్ క్రికెట్ ఎలా అభివృద్ధి చెందుతుంది? వారిపై చర్య తీసుకోండి. ఏసీబీ కేసుల్ని ఎదుర్కొంటోన్న పలువురు హైదరాబాద్ క్రికెట్ను శాసిస్తున్నారు’ అని రాయుడు ట్వీట్లో తీవ్రంగా ఆరోపించాడు. ఇలాంటి పరిణామాల మధ్య ఈ సీజన్ రంజీ ట్రోఫీలో ఆడలేనంటూ రాయుడు జట్టు నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో బి. సందీప్ హైదరాబాద్కు సారథ్యం వహించనున్నాడు. అంబటి రాయుడు ఆరోపణలను హెచ్సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ తేలికగా తీసుకున్నారు. రాయుడు వ్యాఖ్యలపై స్పందిస్తూ అతను నిస్పృహలో ఉన్న క్రికెటర్ అని అన్నారు. -
హెచ్సీఏపై అంబటి రాయుడు తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన స్వల్ప వ్యవధిలోనే యూటర్న్ తీసుకుని హైదరాబాద్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఎంపికైన తెలుగు తేజం అంబటి రాయుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో అవినీతి పెరిగిపోయిందంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. దాంతో తాను వచ్చే రంజీ సీజన్లో హైదరాబాద్ జట్టుకు దూరంగా ఉంటానంటూ ప్రకటించాడు. దీనిలో భాగంగా హెచ్సీఏలో అవినీతిని నిరోధించాలంటూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు(కేటీఆర్కు) ట్వీట్ చేశారు. ‘హలో కేటీఆర్ సార్. హెచ్సీఏలో తీవ్రంగా ప్రబలిన అవినీతిపై దృష్టి పెట్టండి. అసలు హైదరాబాద్ క్రికెట్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి అవినీతే కారణం. హెచ్సీఏను డబ్బుతో ప్రభావితం చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. హెచ్సీఏను ఎవరైతే ప్రభావితం చేస్తున్నారో వారిపై చాలా ఏసీబీ కేసులు ఉన్నాయి. వారికే రెడ్ కార్పెట్ పరుస్తున్నారు’ అని అంబటి రాయుడు ట్వీట్ చేశాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లో భాగంగా హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన అంబటి రాయుడు.. జట్టులో రాజకీయాలు పెరిగిపోయాయని ఆరోపిస్తున్నాడు. ప్రస్తుత పరిణామాలతో జట్టులో మంచి వాతావరణం లేదన్నాడు. దాంతోనే తాను హైదరాబాద్ జట్టుకు దూరంగా ఉండదలుచుకున్నానని పేర్కొన్నాడు. ‘ నిజాయితీగా చెప్పాలంటే నేను రంజీ ట్రోఫీ ఆడదామనుకున్నా. కానీ ఒక కెప్టెన్గా నేను ఊహించినట్లు జరగడం లేదు. రాజకీయాలు పెరిగిపోయాయి. మంచి క్రికెట్ ఆడే వాతావరణం ఇప్పుడు హైదరాబాద్ జట్టులో లేదు. నేను హైదరాబాద్ క్రికెట్ జట్టులో సౌకర్యవంతంగా లేను’ అని ఒక ఇంటర్యూలో పేర్కొన్నాడు. Hello sir @KTRTRS, I request u to plz look into nd address the rampant corruption prevailing in hca. Hw can hyderabad be great when it's cricket team is influenced by money nd corrupt ppl who hav numerous acb cases against them which are being swept under the carpet. — Ambati Rayudu (@RayuduAmbati) November 23, 2019 -
విజయ్ హజారే ట్రోఫీ: ఆంధ్రపై హైదరాబాద్ విజయం
ఆలూరు(కర్ణాటక): దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైద రాబాద్ మరో విజ యాన్ని ఖాతాలో వేసుకుంది. గురు వారం ఆంధ్రతో జరిగిన మ్యాచ్లో 7 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. యువ ఆటగాడు తిలక్ వర్మ (83: 59 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధసెంచరీతో మెరిశాడు. మిగిలిన వారిలో తన్మయ్ అగర్వాల్(18), అంబటి రాయుడు(17), భవనాక సందీప్(28), హిమాలయ్ అగర్వాల్(11) రెండంకెల స్కోరు చేశారు. అక్షత్ రెడ్డి(3), సీవీ మిలింద్(5) నిరాశపరిచారు. ఆంధ్ర బౌలర్లలో పృథ్వీరాజ్ 2 వికెట్లు పడగొట్టగా, షోయబ్ ఎండీ ఖాన్, కేవీ శశికాంత్, దాసరి స్వరూప్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఛేదనలో శ్రీకర్ భరత్(2) రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగ్గా, ప్రణీత్(1) స్వల్పస్కోరుకే అవుటయ్యాడు. ఈ దశలో ప్రశాంత్ కుమార్(57: 42బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లు), కెప్టెన్ రికీ భుయ్(58: 40 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు) మూడో వికెట్కు 116 పరుగులు జోడించడంతో ఆంధ్ర విజయం దిశగా దూసుకెళుతున్నట్లు కనిపించింది. అయితే, వీరిద్దరూ వెనుదిరిగాక తడబడిన మిగిలిన వారు రాణించకపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్ 3, రవికిరణ్ 2 వికెట్లు పడగొట్టారు. -
హైదరాబాద్ విజయం
బెంగళూరు: కర్ణాటకతో మంగళవారం జరిగిన విజయ్ హజారే ట్రోఫీ వన్డే మ్యాచ్లో రాయుడు స్ఫూర్తిదాయక అర్ధ సెంచరీ (111 బంతుల్లో 87 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు)తో కదం తొక్కాడు. దీంతో హైదరాబాద్ 21 పరుగుల తేడాతో హేమాహేమీలున్న కర్ణాటకపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో హైదరాబాద్కిది రెండో గెలుపు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. హైదరాబాద్ ఒకదశలో 121/6తో కష్టాల్లో పడింది. ఈ దశలో రాయుడు ఓర్పుతో బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును నడిపించాడు. అతను సీవీ మిలింద్ (36; 4 ఫోర్లు)తో కలిసి ఏడో వికెట్కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం బెంగళూరు 45.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటై ఓడింది. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ (4/35), సిరాజ్ (2/38) ఆకట్టుకున్నారు. కర్ణాటక జట్టులో దేవదత్ పడిక్కల్ (60; 6 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
కెప్టెన్గా అంబటి రాయుడు
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన స్వల్ప వ్యవధిలోనే యూటర్న్ తీసుకున్న తెలుగు తేజం అంబటి రాయుడుకి హైదరాబాద్ క్రికెట్ జట్టు పగ్గాలు అప్పచెప్పారు. తాను మళ్లీ క్రికెట్ ఆడతానంటూ హెచ్సీఏకు రాయుడు లేఖ రాయగా, అందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ క్రికెట్ సారథ్య బాధ్యతలను రాయుడికి కట్టబెట్టారు. త్వరలో విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్న హైదరాబాద్ కెప్టెన్గా రాయుడ్ని నియమిస్తున్నట్లు హెచ్సీఏ ప్రకటించింది. ఈ మేరకు రాయుడు నేతృత్వంలోని జట్టును తాజాగా వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం తనకు క్రికెట్పై ఆసక్తి తగ్గలేదంటూ రాయుడు.. హెచ్సీఏకు లేఖ రాశాడు. తాను మళ్లీ క్రికెట్ ఆడటానికి అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో కోరాడు. అదే సమయంలో తనకు వీవీఎస్ లక్ష్మణ్, నోయల్ డేవిడ్లు అండగా నిలిచారంటూ పేర్కొన్నాడు. వీరిద్దరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. కాగా, రాయుడ్ని హైదరాబాద్ క్రికెట్ జట్టు కెప్టెన్గా నియమించిన తర్వాత నోయల్ డేవిడ్ స్పందించారు. ‘రాయుడికి ఇంకా ఐదేళ్ల క్రికెట్ మిగిలే ఉంది. దురదృష్టవశాత్తూ వరల్డ్కప్లో ఆడలేకపోయాడు. దాంతో నిరాశ చెందాడు. నేను, లక్ష్మణ్లు రాయుడితో మాట్లాడి అతన్ని ఓదార్చాం. ఫలితంగా అతని రిటైర్మెంట్పై వెనక్కి తగ్గాడు. రాయుడి అనుభవం యువ క్రికెటర్లకు ఉపయోగపడుతుంది. హైదరాబాద్కు కూడా రాయుడి సేవలు అవసరం’ అని నోయల్ డేవిడ్ తెలిపారు. హైదరాబాద్ విజయ్ హజారే ట్రోఫీ జట్టు ఇదే.. అంబటి రాయుడు(కెప్టెన్), బి సందీప్(వైస్ కెప్టెన్), అక్షత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, థాకూర్ వర్మ, రోహిత్ రాయుడు, సీవీ మిలింద్, మెహిద్ హసన్, సాకేత్ సాయి రామ్, మహ్మద్ సిరాజ్, మిక్కిల్ జైశ్వాల్, మల్లికార్జున్(వికెట్ కీపర్), కార్తీకేయ కాక్, టి రవితేజ, అయా దేవ్ గౌడ్ -
త్రీడీ ట్వీట్పై స్పందించిన రాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచకప్లో చోటు దక్కపోవడంతో చేసిన వివాదాస్పద 3డీ ట్వీట్పై క్రికెటర్ అంబటి రాయుడు తొలిసారి స్పందించాడు. ఈ ట్వీట్ చేసినందుకు ఎటువంటి పశ్చాత్తాపం లేదని ప్రకటించాడు. ఏ ఒక్కరినో ఉద్దేశించి ఆ ట్వీట్ పెట్టలేదని స్పష్టం చేశాడు. తనకు ఆటే ముఖ్యమని, మిగతా వాటి గురించి పట్టించుకోనని అన్నాడు. ప్రపంచకప్కు ఎంపిక కాకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని వెల్లడించాడు. ప్రపంచకప్ కోసం చాలా శ్రమించానని, సెలక్టర్లు వేరే రకంగా ఆలోచించారని చెప్పుకొచ్చాడు. ఫామ్లో ఉన్నప్పటికీ తనను జట్టులోకి తీసుకోకపోవడం దురదృష్టంగా రాయుడు వర్ణించాడు. గత ప్రపంచకప్ సెలక్షన్స్లో భాగంగా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే మాట్లాడుతూ రాయుడు మెరుగైన ఆటగాడని, అయితే విజయ్ శంకర్ను మూడు రకాలుగా ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై రాయుడు వ్యంగ్యంగా స్పందిస్తూ మూడు రకాలుగా (త్రీ డైమెన్షన్స్) అన్నందుకు ప్రపంచకప్ చూసేందుకు త్రీడి కళ్లద్దాలు ఆర్డర్ ఇచ్చానని రాయుడు ట్వీట్ చేసి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ప్రపంచకప్లో చోటు దక్కలేదన్న మనస్తాపంతో అంతర్జాతీయ క్రికెట్కు రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఇటీవల తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. (చదవండి: రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న రాయుడు) -
వాళ్లందరికీ థాంక్స్: అంబటి రాయుడు
న్యూఢిల్లీ: తాను గడ్డు సమయాన్ని ఎదుర్కొన్నప్పడు అండగా నిలిచిన వారికి తెలుగు తేజం అంబటి రాయుడు ధన్యవాదాలు తెలియజేశాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రాయుడు.. మళ్లీ అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. ఈ క్రమంలోనే తనకు మద్దతుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మేనేజ్మెంట్తో పాటు వీవీఎస్ లక్ష్మణ్, నోయల్ డేవిడ్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. దీనిలో భాగంగా హెచ్సీఏకు లేఖ రాసిన రాయుడు.. తన రిటైర్మెంట్ నిర్ణయం అనేది ఆవేశంలో తీసుకున్నదేనని స్పష్టం చేశాడు. తాను మళ్లీ క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. తనవరకూ చూస్తే ఆడాల్సిన క్రికెట్ చాలా ఉందంటూ తెలిపాడు. గత రెండేళ్లుగా భారత వన్డే ప్రపంచకప్ జట్టు ప్రణాళికల్లో ఉండి కూడా ప్రపంచకప్ ఆడలేకపోవడంతో రాయుడు ఆకస్మికంగా రిటైర్మెంట్ను ప్రకటించాడు. తాజాగా ఇప్పుడు అతను మనసు మార్చుకొని బ్యాట్ పట్టేందుకు సిద్ధమయ్యాడు. హెచ్సీఏ నిర్వహించే వన్డే, టి20 క్రికెట్ మ్యాచ్లకు అందుబాటులో ఉంటానని అతను చెప్పాడు. -
రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న క్రికెటర్
సాక్షి, హైదరాబాద్: తెలుగుతేజం, భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు మళ్లీ బరిలోకి దిగబోతున్నాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రాయుడు ఈ సీజన్లో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) నిర్వహించే పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్లు ఆడనున్నాడు. హెచ్సీఏ వన్డే, టి20 క్రికెట్ మ్యాచ్లకు అందుబాటులో ఉంటానని అతను చెప్పాడు. గత రెండేళ్లుగా భారత వన్డే ప్రపంచకప్ జట్టు ప్రణాళికల్లో ఉండి కూడా ప్రపంచకప్ ఆడలేకపోవడంతో రాయుడు ఆకస్మికంగా రిటైర్మెంట్ను ప్రకటించాడు. తాజాగా ఇప్పుడు అతను మనసు మార్చుకొని బ్యాట్ పట్టేందుకు సిద్ధమయ్యాడు. -
‘అది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు’
చెన్నై: ఇటీవల అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పేసిన తెలుగుతేజం అంబటి రాయుడు.. వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్కు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న టీఎన్సీఏ వన్డే లీగ్ ఆడుతున్న రాయుడు.. రాబోవు ఐపీఎల్ సీజన్లో కూడా తాను చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్టు తరఫునే ఆడతానని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే తాను అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పడంపై రాయుడు మరోసారి స్పందించాడు. అది ఆవేశంలో తీసుకున్న నిర్ణయమని చాలామంది విశ్లేషించిన క్రమంలో దానికి సమాధానమిచ్చాడు రాయుడు. ‘అది నేను ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదని కచ్చితంగా చెప్పగలను. గత నాలుగేళ్లలో నేను చాలా తీవ్రంగా శ్రమించాను అది కూడా వన్డే వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకునే నిరంతరం కష్టపడ్డాడు. అయితే నాకు వరల్డ్కప్లో చోటు దక్కకపోవడంతో చాలా కలత చెందా. ఆ నేపథ్యంలో అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని అనుకున్నా. నువ్వు కష్టపడినప్పుడు అందుకు తగ్గ ఫలితం రానప్పుడు ఆలోచనలో పడతాం. అలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే అది’ అని రాయుడు పేర్కొన్నాడు. గత రెండేళ్లుగా సీఎస్కే జట్టులో రాయుడు కీలక సభ్యుడిగా మారిపోయాడు. ప్రత్యేకంగా అతని బ్యాటింగ్ సామర్థ్యంతో ఏ స్థానంలో దింపినా సీఎస్కేకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. -
ఒక్క క్లిక్తో నేటి క్రీడా వార్తలు
తమిళ్ తలైవాస్ చేతిలో తెలుగు టైటాన్స్ ఓటమి. పీవీ సింధుకు నిరాశ. ఆర్మీ బెటాలియన్లో శిక్షణ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన దరఖాస్తుకు భారత ఆర్మీ నుంచి గ్రీన్ సిగ్నల్. కూర్పు వైవిధ్యం కారణంగానే రాయుడును ఎంపిక చేయలేదని అంతేకాని అతనిపై ఎలాంటి వివక్ష చూపలేదని తెలిపారు. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ మీ కోసం. మరిన్ని క్రీడా వార్తల కోసం కింది వీడియోను వీక్షించండి.. -
రాయుడు ట్వీట్ను ఆస్వాదించా : ఎమ్మెస్కే
న్యూఢిల్లీ : ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదన్న అసహనంతో అంబటి రాయుడు చేసిన త్రీడీ ట్వీట్ను ఆస్వాదించానని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. ప్రపంచకప్ జట్టుకు విజయ్ శంకర్ను ఎంపిక చేయడంపై రాయుడు స్పందిస్తూ త్రీడీ కళ్లజోడు కొనుక్కుని వరల్డ్ కప్ చూస్తానంటూ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో రాయుడు ఏకంగా క్రికెట్కే గుడ్ బై చెప్పాడు. రాయుడి రిటైర్మెంట్కు త్రీడీ ట్వీట్ కూడా ఓ కారణమేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే, తాజాగా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టును ప్రకటించిన తర్వాత చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ట్వీట్పై స్పందించాడు. ‘అంబటి రాయుడు ట్వీట్ను ఆస్వాదించాను. వ్యంగ్యంతో కూడిన ఆ ట్వీట్ చాలా బాగుంది. రాయుడి భావోద్వేగాలను అర్థం చేసుకున్నాం. జట్టు ఎంపికలో మాకు కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఎవరి విషయంలోనూ తమకు ద్వేషం, పక్షపాతం లేదు. రాయుడు టీ20 ప్రదర్శన ఆధారంగా వన్డేలకు ఎంపిక చేయాలనుకున్నప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా మేం అతని అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేశాం. అతను ఫిట్నెస్ టెస్ట్ ఫెయిలైనప్పుడు కూడా ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అండగా నిలిచాం. కొన్ని కాంబినేషన్స్ నేపథ్యంలో అతన్ని ప్రపంచకప్ తుది జట్టులోకి తీసుకోలేకపోయాం. అంత మాత్రానా సెలక్షన్ కమిటీ పక్షపాతంగా వ్యవహరించదనడం తగదు.’ అని పేర్కొన్నారు. ప్రపంచకప్ తుది జట్టులో చోటు ఖాయమని భావించిన రాయుడికి ఆఖరి నిమిషంలో విజయ్శంకర్ రూపంలో నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ త్రీ డైమన్షన్స్ నేపథ్యంలో ఎంపిక చేసినట్లు ఎమ్మెస్కే ప్రసాద్ అప్పట్టో వివరణ ఇచ్చాడు. దీనిపై రాయుడు 3డీ గ్లాస్ను ఆర్డర్ చేశానని కాస్త వ్యంగ్యంగా స్పందించాడు. ధావన్, విజయ్ శంకర్ గాయపడి స్వదేశం చేరుకున్నా.. స్టాండ్ బై ఆటగాడిగా ఉన్న రాయుడిని కాదని సెలక్టర్లు మయాంక్ అగర్వాల్కు అవకాశం ఇచ్చారు. దీనిపై తీవ్ర అసంతృప్తికి గురైన రాయుడు అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. చదవండి: విండీస్తో ఆడే భారత జట్టు ఇదే -
రాయుడు పేరును పరిశీలించండి: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెటర్ అంబటి రాయుడు ఉద్వేగంలో తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోకుండా జట్టు ఎంపికలో అతని పేరును పరిశీలించాలని పేర్కొంటూ మాజీ ఎంపీ, భారత క్రికెట్ సమాఖ్య చైర్మన్ వి. హనుమంతరావు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్కు లేఖ రాశారు. ప్రతిభావంతుడైన రాయుడులో ఇంకా చాలా ఆట మిగిలి ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. నం. 4లో బ్యాటింగ్తో పాటు అవసరమైన సమయాల్లో వికెట్ కీపింగ్ కూడా చేయగల సామర్థ్యం రాయుడుకు ఉందన్నారు. ప్రపంచకప్ ఎంపికలో తనపై చూపించిన నిర్లక్ష్యం కారణంగా నొచ్చుకున్న రాయుడు భావోద్వేగంలో రిటైర్మెంట్ను ప్రకటించాడని, బీసీసీఐ చొరవ తీసుకొని రాయుడుకు మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరారు. -
రాయుడు ఉంటే గెలిచేది కదా!
ప్రపంచకప్లో భారత్ పోరాటం సెమీస్తో ముగియడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టోర్నీ ఆధ్యాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న కోహ్లిసేన.. న్యూజిలాండ్ చేతిలో చావు దెబ్బతినడం మరిచిపోలేకపోతున్నారు. మ్యాచ్ జరిగి 48 గంటలు గడిచినా ఆ ఓటమి క్షణాలను మదిలోంచి తొలిగించలేకపోతున్నారు. భారత ఓటమికి గల కారణాలేంటని విశ్లేషిస్తున్నారు. ప్రతి టీకొట్టు దగ్గర అదే ముచ్చట.. ఆఫీసుల్లో సహోద్యోగుల మధ్య ఇదే చర్చ. ఇక సోషల్ మీడియా గురించి చెప్పనక్కర్లేదు. ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్.. టిక్ టాక్లు మ్యాచ్ విశ్లేషణలతో మారుమోగుతున్నాయి. పాండ్యా, పంత్లు కొద్దిసేపు ఉంటే మ్యాచ్ పరిస్థితి వేరేలా ఉండేదని ఒకరంటే.. అసలు రోహిత్, కోహ్లిలు ఔట్ కాకుంటే ఈ ఓటమే తప్పేదని మరొకరంటున్నారు. అసలు ధోని రనౌట్ కాకుంటే టైటిల్ రేసులో నిలిచేవారమని ఇంకోకరంటున్నారు. ఇలా ఎవరికీ తోచిన విశ్లేషణలు వారు చేస్తున్నారు. ఆ విశ్లేషణలేంటో చూద్దాం. అంబటి రాయుడు ఉంటే.. టాపర్డర్ విఫలమైన సందర్భంలో మిడిలార్డర్ బ్యాట్స్మన్ ఒక్కరు నిలిచున్నా ఫలితం వేరేలా ఉండేది. అయితే ఈ తరహా పరిస్థితుల్లో భారత్కు అండగా ఉండే బ్యాట్స్మన్ అంబటి రాయుడేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్లో భారత్ 18 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో రాయుడే 90 పరుగులతో భారత స్కోర్బోర్డ్ను 250 దాటించాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాయుడు ఉంటే భారత్కు ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడుతున్నారు. దురదృష్టవశాత్తు ఈ ఇన్నింగ్స్ మన సెలక్టర్లకు గుర్తుకులేదని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. We miss you @RayuduAmbati pic.twitter.com/28a2Za2c9k — Ifteqar Saqiß (@IfteqarSaqib) July 11, 2019 ధోని ముందు వచ్చి ఉంటే.. భారత్స్కోర్ 5/3 ఉన్న స్థితిలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు నీషమ్ అద్బుత క్యాచ్తో అతను వెనుదిరగడం భారత్ కొంపముంచింది. అయితే ఈ పరిస్థితుల్లో దూకుడుగా ఆడే హార్దిక్ పాండ్యాకు బదులు అనుభవం కలిగిన ధోనిని పంపించాల్సిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ధోని వచ్చి ఉంటే యువ క్రికెట్ రిషబ్ పంత్ను గైడ్ చేస్తూ.. సింగిల్స్తో ఇన్నింగ్స్ ముందుకు నడిపించేవాడని, అప్పుడు భారత్ విజయం దిశగా పయనించేదని, చివర్లో పాండ్యా, జడేజా గెలుపు బాధ్యతలు తీసుకునేవారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఫీల్డింగ్.. భారత ఫీల్డింగ్లో స్పిన్నర్ యజువేంద్ర చహల్ అలసత్వం కూడా కివీస్కు కలిసొచ్చింది. సునాయస ఫోర్లను ఆపకుండా చహల్ పరుగులిచ్చుకున్నాడు. ఇక కీవిస్ ఆటగాళ్లు మాత్రం అద్భుత ఫీల్డింగ్తో భారత బ్యాట్స్మన్పై ఒత్తిడి తీసుకొచ్చారు. ముఖ్యంగా పంత్, పాండ్యాల బ్యాటింగ్ అప్పుడు కష్టతరమైన బౌండరీలను కూడా ఆపి యువ ఆటగాళ్ల సహనానికి పరీక్షగా నిలిచారు. ఇక దినేశ్ కార్తీక్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ నీషమ్ అద్భుత ఫీల్డింగ్తో అందిపుచ్చుకోవడం, గప్టిల్ విసిరిన బంతి నేరుగా వికెట్లు తాకి భారత ఆశలను కూల్చడం మ్యాచ్కే హైలైట్. జట్టు కూర్పు.. కీలక సెమీస్ మ్యాచ్లో భారత జట్టు కూర్పు కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. 4 మ్యాచుల్లో 14 వికెట్లతో ఫామ్లో ఉన్న షమీని బెంచ్కు పరిమితం చేయడం.. ఇద్దరు స్పిన్నర్లు ఇద్దరు పేసర్లనే మూసధోరణి పద్దతిలో బరిలోకి దిగడం భారత విజయవకాశాలను దెబ్బతీసింది. చహల్ బదులు షమీని జట్టులోకి తీసుకుంటే పేస్కు అచ్చొచ్చిన పిచ్పై ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ విభాగం మరింత తేలిపోయేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందరూ పొదుపుగా బౌలింగ్ చేయగా చహల్ ఒక్కడే 63 పరుగులు సమర్పించుకోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఇక కివీస్ మాత్రం పిచ్ సరిగ్గా అంచనా వేసి ఒక్క స్పిన్నర్ మిచెల్ సాంట్నర్తోనే బరిలోకి దిగింది. India should take Dhoni to no 3/4 in the batting order, also should remove Chahal / Dinesh karthik from the team for sometime. Chahal had given much run in the same away as such in the previous matches... Can't understand why again retained him in the semi. @msdhoni @imVkohli — Vimal AK (@AKVimal) July 12, 2019 -
రాయుడు రిటైర్మెంట్.. కోహ్లిపై నెటిజన్స్ ఫైర్!
తెలుగుతేజం అంబటి తిరుపతి రాయుడు ఆవేదనతో తన ఆటను ముగించిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండుసార్లు తాజా ప్రపంచ కప్ జట్టులో స్థానం ఆశించి భంగపడిన అతను బుధవారం అనూహ్యంగా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లు, అన్ని స్థాయిల ఆటకు గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించాడు. నిలకడగా రాణించినా తనపై సెలక్షన్ కమిటీ నమ్మకముంచకపోవడం.. 2019 వరల్డ్ కప్ వరకు రాయుడికి అండగా నిలవాలంటూనే సారథి విరాట్ కోహ్లి మాట నిలబెట్టుకోకపోవడం.. గాయంతో ఇద్దరు ఆటగాళ్లు జట్టు నుంచి తప్పుకున్నా.. తనను పట్టించుకోకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన రాయుడు ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాయుడు రిటైర్మెంట్ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. 2018 ఆసియా కప్ ముగిసిన అనంతరం కోహ్లి రాయుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్లను షేర్ చేస్తూ.. అతన్ని తప్పుబడుతున్నారు. ‘2019 వరల్డ్ కప్ వరకు రాయుడికి మేం అండగా నిలవాల్సిన అవసరముంది’ అని నాడు బహాటంగా కోహ్లి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. గత ఏడాది అక్టోబరులో ‘నాలుగో స్థానానికి సరైనవాడు’ అంటూ ప్రశంసించిన కోహ్లి.. ఆ మూడు నెలలకే మాట మార్చి.. నాలుగో స్థానం ఇంకా ఖరారు కాలేదంటూ కొత్త చర్చను లేవనెత్తడాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రాయుడి రిటైర్మెంట్కు పరోక్షంగా కోహ్లినే కారణమని, రాయుడిని ఇలా అవమానకరంగా క్రికెట్నుంచి వైదొలిగేలా చేయడం బాధ కలిగిస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. రాయుడి రిటైర్మెంట్కు కోహ్లియే కారణమని, అతను రాజకీయాల్లోకి చేరితే బాగుంటుందని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా.. ప్రతిభావంతుడైన ఆటగాడికి అవకాశం ఇచ్చి ఉండాల్సింది.. ఈ విషయంలో చీప్ రాజకీయాలు చేయడం తగదని మరొక నెటిజన్ బీసీసీఐని తప్పుబట్టారు. తనకు భజన చేసే క్రికెటర్లను మాత్రమే కోహ్లి ప్రోత్సహిస్తాడని, అశ్విన్, జడేజా, అంబటి రాయుడు కెరీర్ను కోహ్లియే నాశనం చేశాడని, ఆర్సీబీలో తనతోపాటు ఆడుతున్నందుకే చాహల్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్లకు అవకాశాలు కల్పిస్తున్నాడని మరో నెటిజన్ మండిపడ్డారు. #Ambatirayudu @imVkohli is responsible for his retirement... Political party join kar le.. — Pawan Lohani (@PawanLohani8) July 3, 2019 Never mind @imVkohli only addresses those players in his team who have been chaploos to him. Ruined Career of Ashwin, ruining jadeja and now Ambati...Chahal and Mayank/Rahul are blooming as they played in RCB...wtf #Ambatirayuduretires #Ambatirayudu pic.twitter.com/grHfnLhOLo — Sanjeev Gurjar (@sanjeev_mukhiya) July 3, 2019 Virat Kohli about #AmbatiRayudu for his Performance in Asia cup (Oct 2018) with An Average of 44 pic.twitter.com/WvdcstOfRc — sahil kumar bansiwal✴️ (@sahil_bansiwal1) July 3, 2019 -
క్రికెట్ను వదిలేస్తున్నా...
తెలుగుతేజం అంబటి తిరుపతి రాయుడు ఆవేదనతో తన ఆటను ముగించాడు. ఒకటి కాదు రెండు సార్లు తాజా ప్రపంచ కప్ జట్టులో స్థానం ఆశించి భంగపడిన అతను పూర్తిగా క్రికెట్కే దూరం కావాలని నిర్ణయించుకున్నాడు. అన్ని ఫార్మాట్లు, అన్ని స్థాయిల ఆటకు గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించాడు. నిలకడగా రాణించినా తనపై నమ్మకముంచని సెలక్షన్ కమిటీపై చేసిన ఒకే ఒక్క వ్యంగ్య వ్యాఖ్య చివరకు అతని ఆటకే చిక్కు తెచ్చింది. ఫలితంగా ఆరేళ్ల అంతర్జాతీయ కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. భారత్ నుంచి వన్డేల్లో కనీసం వెయ్యి పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లి, ధోని, రోహిత్ తర్వాత అత్యధిక సగటు (47.05) రాయుడుదే. సాక్షి, హైదరాబాద్: భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. తన నిర్ణయాన్ని బుధవారం బీసీసీఐకి లేఖ ద్వారా తెలియజేశాడు. ఇందులో రిటైర్మెంట్కు కారణాలు వెల్లడించకపోయినా... ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ జట్టులో చోటు లభించకపోవడమే కారణమని అర్థమవుతోంది. ఏప్రిల్ 15న వరల్డ్ కప్ను టీమ్ను ప్రకటించిన సమయంలో 33 ఏళ్ల రాయుడుకు అందులో స్థానం లభించలేదు. అతనికి బదులుగా మూడు విభాగాల్లో సరైనవాడంటూ సెలక్టర్లు విజయ్ శంకర్ను ఎంపిక చేశారు. అయితే తర్వాతి రోజు ప్రకటించిన ఐదుగురు స్టాండ్బై ఆటగాళ్ల జాబితాలో రాయుడు ఉన్నాడు. ఈ కప్లో శిఖర్ ధావన్ గాయంతో తప్పుకోగా... సెలక్టర్లు రిషభ్ పంత్కు అవకాశం కల్పించారు. నాలుగో స్థానంలో ఆడిన విజయ్ శంకర్ గాయంతో వెనుదిరగడంతో అతనికి గతంలో పోటీగా నిలిచిన రాయుడు ఈ సారైనా తనకు స్థానం లభిస్తుందని ఆశించాడు. కానీ ఒక్క వన్డే కూడా ఆడని మయాంక్ అగర్వాల్ వైపు భారత టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపింది. దాంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రాయుడు ఆట నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాజా ప్రకటనతో రాయుడు ఇకపై ఐపీఎల్ల్లోనూ కనిపించే అవకాశం లేదు. నేను ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అన్ని ఫార్మాట్లు, అన్ని స్థాయిలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. క్రికెట్తో నా పాతికేళ్ల ప్రయాణం చాలా బాగా సాగింది. వేర్వేరు దశల్లో ఒడిదుడుకులు ఎదురైనా ఎంతో నేర్చుకునే అవకాశం కలిగింది. ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించి, మద్దతుగా నిలిచిన బీసీసీఐకి... కెప్టెన్లు ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు... రంజీ క్రికెట్ ఆడే అవకాశం ఇచ్చిన హైదరాబాద్, ఆంధ్ర, బరోడా, విదర్భ అసోసియేషన్లకు, ఐపీఎల్ టీమ్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యాలకు... నా కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా భావిస్తున్నా. – బీసీసీఐకి పంపిన లేఖలో అంబటి రాయుడు అంబరమంత ప్రతిభ ఉన్నా... ‘పదేళ్ల పాటు దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాత కూడా అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కోలేకపోయాననే నిరాశలో నేను ఉండదల్చుకోలేదు. ఇక్కడ ఆడితే ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతా. ఇప్పుడు జనం నా ఆటను టీవీలో చూస్తారు. నేనేంటే అప్పుడు అందరికీ తెలుస్తుంది. ఏదో ఒక రోజు భారత్కు ఆడకపోను’... 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో చేరే సమయంలో రాయుడు చెప్పిన మాటలు ఇవి. హైదరాబాద్ క్రికెట్ అధమ స్థాయికి చేరి యువ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి రాకుండా పోతున్న సమయంలో 22 ఏళ్ల రాయుడు ఎంచుకున్న దారి ఇది. ఐసీఎల్ వల్ల ఉపయోగం లేదని తెలిసిన తర్వాత హైదరాబాద్ టీమ్ను వదిలి బరోడా బాట పట్టింది కూడా టీమిండియాలో చోటుపై ఆశలతోనే. చివరకు 12 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్ తర్వాత కానీ అతని కల నెరవేరలేదు. ఎప్పుడో భారత్కు ఆడతాడని భావించిన రాయుడు దాదాపు 28 ఏళ్ల వయసులో 2013 జూలైలో సీనియర్ల గైర్హాజరులో తొలి సిరీస్ ఆడాడు. తన 55 వన్డేల స్వల్ప కెరీర్లో వచ్చిన ప్రతీ అవకాశాన్ని అతను సమర్థంగా వాడుకున్నాడు. ఓపెనింగ్ నుంచి 7వ స్థానం వరకు బరిలోకి దిగాడు. గత రెండేళ్లలో మరింత నిలకడగా ఆడి స్థానం ఖాయం చేసుకున్న తర్వాత 2019 ప్రపంచ కప్ జట్టులో భాగం కావాలనే అతని కల మాత్రం అనూహ్యంగా కుప్పకూలింది. 2015 ప్రపంచ కప్ జట్టులో ఉన్నా రాయుడుకి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం మాత్రం రాలేదు. టీనేజర్గా ఉన్నప్పుడు రాయుడు మరో సచిన్ అవుతాడని చాలా మంది భావించారు. చూడచక్కటి బ్యాటింగ్ శైలి, చక్కటి స్ట్రోక్మేకర్గా రాయుడు బ్యాటింగ్లో ప్రత్యేక ఆకర్షణ కనిపించింది. 2002లో అండర్–19 ఆటగాడిగా ఇంగ్లండ్పై వన్డేలో 177 పరుగులు చేసినప్పుడు అతని ప్రతిభ ఏమిటో అందరికీ తెలిసింది. 2004 అండర్–19 ప్రపంచ కప్లో అతను భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ టీమ్లో ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్, ధావన్ సభ్యులుగా ఉన్నారు! ఆ తర్వాత రంజీ ట్రోఫీలో రాణిస్తే జాతీయ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్న స్థితిలో అతను పదేపదే విఫలమయ్యాడు. పైగా వరుస వివాదాలు, గొడవలు రాయుడు ఆటను దెబ్బ తీశాయి. 2007లో ఐసీఎల్లోకి వెళ్లడంతో అతని కెరీర్కు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అయితే బీసీసీఐ క్షమాభిక్షతో మళ్లీ అవకాశం దక్కించుకున్న అతను బరోడా రంజీ జట్టులో చేరడంతో అతని జీవితం మరో మలుపు తిరిగింది. 2010 ఐపీఎల్లో రాయుడును సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ అతని ఆటతో సంతృప్తి చెంది వరుసగా ఎనిమిదేళ్ల పాటు కొనసాగించింది. మూడు టైటిల్స్ విజయాల్లో భాగమైన రాయుడు ఐపీఎల్తోనే క్రికెట్ ప్రపంచం దృష్టిలో మళ్లీ పడ్డాడు. గత రెండేళ్లు చెన్నై తరఫున ఆడిన అంబటి మరోసారి చాంపియన్గా నిలిచిన టీమ్లో భాగమయ్యాడు. వివాదాలతోనే సమస్య... వ్యక్తిగతంగా ఆవేశం కొంత ఎక్కువగా ఉండటం, భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం కూడా రాయుడు కెరీర్లో ఇబ్బందులు తెచ్చి పెట్టాయి. హైదరాబాద్ రంజీ ఆటగాడిగా ఉన్నప్పుడు కోచ్లు రాజేశ్ యాదవ్, వివేక్ జైసింహలతో గొడవలు, అనంతపురంలో అర్జున్ యాదవ్తో దాదాపు కొట్టుకున్నంత పరిస్థితి, మైదానంలో కూడా నియంత్రించుకోలేని దుందుడుకు స్వభావం, కొన్నాళ్ల క్రితం రోడ్డుపై ఒక వృద్ధుడిని దుర్భాషలాడటం రాయుడు ఇమేజ్ను తగ్గించాయి. అవేవీ అతను ఆటను దెబ్బ తీయలేదు కానీ రాయుడుపై ఒక ‘రెబల్’ ముద్ర పడిపోయింది. ‘3డి’ ట్వీట్ కూడా అదే తరహాలో ఆవేదన, ఆక్రోశం కలగలిపి చేసిందే. అదే ట్వీట్ అతడి కెరీర్ని ముగించిందని ఇప్పుడు సగటు క్రికెట్ అభిమానులందరూ నమ్ముతున్నారంటే తప్పు లేదు. రాయుడు జూనియర్ ఆటగాడిగా ఉన్నప్పుడు భారత్ కోచ్ ఉన్న రోజర్ బిన్నీ... ‘ఆట పట్ల రాయుడు అంకితభావం గొప్పది. అసలు ఓటమిని అంగీకరించేవాడు కాదు. గెలిచే మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే కూడా అతను ఏడ్చేశాడు. సరిగ్గా చెప్పాలంటే అండర్–19 స్థాయి ముగియగానే సెలక్టర్లు అతడిని ఎంపిక చేసి సరైన దిశానిర్దేశం చేయాల్సింది’ అనడం రాయుడు కెరీర్ గురించి ఒక్క మాటలో చెబుతుంది. రిటైర్మెంట్కు ఇలా దగ్గరై... ‘యు ఆర్ ఎ టాప్ మ్యాన్’... రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రాయుడు గురించి కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్య ఇది. అయితే అసలు సమయంలో రాయుడుపై కోహ్లి నమ్మకం కోల్పోవడమే తాజా పరిణామానికి కారణమైందనడంలో తప్పు లేదు. గత ఏడాది అక్టోబరులో ‘నాలుగో స్థానానికి సరైనవాడు’ అంటూ ప్రశంసలతో ముంచెత్తిన కెప్టెన్... మూడు నెలలు తిరిగే లోపే నాలుగో స్థానం ఇంకా ఖరారు కాలేదంటూ కొత్త చర్చను లేవనెత్తి రాయుడు ఆటపై సందేహాలు సృష్టించాడు. సహజమైన నైపుణ్యంతో మిడిలార్డర్లో సమర్థుడైన బ్యాట్స్మన్గా రాయుడు తనకు లభించిన పరిమిత అవకాశాలతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. వన్డేలపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు గత నవంబర్లో రాయుడు ఫస్ట్క్లాస్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఏడాదిన్నర విరామం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన అనంతరం రాయుడు ఆసియా కప్లో, ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్పై చక్కటి ప్రదర్శన కనబర్చాడు. ఆస్ట్రేలియాతో 2 మ్యాచ్లే ఆడినా... కివీస్పై సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఎక్కడైనా ఆడగల సామర్థ్యం ఉందని నిరూపించేందుకు చివరి మ్యాచ్లో కఠినమైన పిచ్పై అతను చేసిన 90 పరుగుల ఇన్నింగ్స్ చాలు! కానీ సెలక్టర్లు వేరేలా ఆలోచించారు. ‘3డి’ ఆటగాడు అంటూ విజయ్ శంకర్ను నాలుగో స్థానానికి తీసుకున్నారు. దాంతో సహజంగానే అసంతృప్తి చెందిన రాయుడు ‘ప్రపంచ కప్ చూసేందుకు ఇప్పుడే 3డి అద్దాలు కొన్నాను’ అంటూ ట్వీట్ చేయడం వివాదం రేపింది. నేరుగా దీనిపై బోర్డు అధికారులు ఆగ్రహం ప్రదర్శించకపోయినా... ఇప్పుడు దాని ప్రభావం కనిపించింది. రెండు సార్లు అవకాశం వచ్చినా సెలక్టర్లు ప్రపంచ కప్ జట్టులోకి రాయుడును మాత్రం ఎంపిక చేయలేదు. మున్ముందూ తనను ఎంపిక చేయకపోవచ్చని భావించిన రాయుడు మొత్తానికే గుడ్బై చెప్పేశాడు. రాయుడు గురించి చాలా బాధపడుతున్నా. అతని రిటైర్మెంట్కు సెలక్టర్లే కారణం. వారి ఎంపిక పద్ధతినే తప్పు పట్టాలి. ఐదుగురు సెలక్టర్లు కలిపి కూడా రాయుడు చేసినన్ని పరుగులు చేయలేదు. కెరీర్లో మంచి ప్రదర్శన కనబర్చిన అతని రిటైర్మెంట్ భారత క్రికెట్లో దుర్దినం. –గౌతమ్ గంభీర్ ప్రపంచ కప్కు ఎంపిక చేయకపోవడం రాయుడును నిజంగా చాలా బాధపెట్టి ఉంటుంది. భవిష్యత్లో అంతా మంచి జరగాలని ఆశిస్తున్నా –సెహ్వాగ్ బాగా ఆడిన తర్వాత కూడా వరల్డ్ కప్ జట్టులో స్థానం లభించకపోతే రాయుడు ఎంత బాధపడ్డాడో, ఆవేదన చెందాడో అర్థం చేసుకోగలను. జీవితంలోని రెండో ఇన్నింగ్స్ సంతోషంగా, శాంతితో సాగాలని కోరుకుంటున్నా. –వీవీఎస్ లక్ష్మణ్ -
రిటైర్మెంట్.. రాయుడు భావోద్వేగం
ముంబై: ప్రపంచకప్ జరుగుతున్న సమయంలోనే రిటైర్మెంట్ ప్రకటించి అంబటి తిరుపతి రాయుడు అందరనీ షాక్కు గురిచేశాడు. ఐపీఎల్తో సహా అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటిస్తూ బీసీసీఐకి లేఖ రాశాడు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు వద్ద రాయుడు భావోద్వేగానికి లోనయినట్లు తెలిసింది. టీమిండియా తరుపున ఆడినందుకు చాలా గర్వంగా ఉందని, తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి, కెప్టెన్లకి కృతజ్ఞతలు అంటూ బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. ముఖ్యంగా సారథి విరాట్ కోహ్లి తనపై పెట్టుకున్న నమ్మకానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. (చదవండి: ఆటకు రాయుడు గుడ్బై) ‘25 ఏళ్లుగా అన్ని లెవల్స్ క్రికెట్ ఆడాను. దేశం తరుపున ప్రాతినిథ్యం వహించడం గొప్ప గౌరవం. ఆ అవకాశం నాకు కల్పించిన బీసీసీఐకి, సారథులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల సారథ్యాలలో ఆడిన అనుభవం నాకు ఎంతగానో ఉపయోగపడింది. ముఖ్యంగా కోహ్లి నాపై పెట్టుకున్న గొప్ప నమ్మకానికి ప్రత్యేక కృతజ్ఞతలు. కష్టకాలంలో అనేకమార్లు నాకు అండగా నిలిచాడు. అవకాశాలు ఇచ్చి నన్ను ప్రొత్సహించాడు. ఐపీఎల్లో నాకు అండగా నిలిచి మద్దతు తెలిపిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ స్థాయికి రావడానికి సహకరించిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రత్యేక ధన్యవాదాలు’అంటూ రాయుడు పేర్కొన్నాడు. ఇక రాయుడు రిటైర్మెంట్పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తొందరపడ్డాడని కొందరంటే.. ఇంకా అవమానాలు భరించే ఓపికలేకే వీడ్కోలు పలికాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రపంచకప్లో చోటు దక్కడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, సెలక్టర్లు మాత్రం ‘త్రీడీ’ అంటూ విజయ్ శంకర్వైపు మొగ్గు చూపారు. దాంతో, 'త్రీడీ కళ్ళద్దాల కోసం ఆర్డర్ చేశాను..' అంటూ సోషల్ మీడియాలో అంబటి రాయుడి సెటైర్ వేయాల్సి వచ్చింది. ఆ సెటైరే ఈ తెలుగు క్రికెటర్ అవకాశాల్ని దెబ్బతీసిందని వాదనలూ వినిపిస్తున్నాయి. ప్రపంచకప్లో శిఖర్ ధావన్, విజయ్ శంకర్లిద్దరూ గాయాల బారిన పడినా రాయుడుకు బీసీసీఐ నుంచి పిలుపు రాలేదు. వీరిద్దరి స్థానాల్లో రిషబ్ పంత్, మయాంక్ అగర్వాల్లకు సెలక్టర్లు చోటు కల్పించడంతో రాయుడు తీవ్రంగా నిరుత్సాహపడ్డాడు. చదవండి: రాయుడి రిటైర్మెంట్; గంభీర్ ఫైర్ రాయుడును వీడని ‘3డి’ -
రాయుడి రిటైర్మెంట్; గంభీర్ ఫైర్
ముంబై: మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పడానికి సెలక్టర్లే కారణమని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ విమర్శించాడు. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వైఖరి వల్లే రాయుడు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడని మండిపడ్డాడు. ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడంతో కలత చెంది రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నాడని పేర్కొన్నాడు. సెలక్షన్ కమిటీలోని ఐదుగురు సభ్యులు కలిసి చేసిన పరుగులు కలిపినా రాయుడు తన కెరీర్లో సాధించిన స్కోరు కంటే తక్కువేనని ఎద్దేవా చేశాడు. ‘ఈ ప్రపంచకప్లో సెలక్టర్లు నన్ను తీవ్ర అసంతృప్తికి గురిచేశారు. వారి కారణంగానే రాయుడు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. అతడి నిర్ణయం నాకు బాధ కలిగించింది. గాయాల కారణంగా జట్టు దూరమైన ఆటగాళ్ల స్థానంలో రిషబ్ పంత్, మయాంక్ అగర్వాల్ను ఎంపిక చేశారు కానీ రాయుడికి మాత్రం చోటు కల్పించలేకపోయారు. ఇటీవల జరిగిన ఐపీఎల్లో రాయుడు బాగా ఆడాడు. దేశం కోసం చిత్తశుద్ధితో ఆడిన ఆటగాడు ఈవిధంగా రిటైర్ కావడం భారత క్రికెట్కు మంచిది కాద’ని గంభీర్ అన్నాడు. (చదవండి: ఆటకు రాయుడు గుడ్బై) -
అంబటి రాయుడు ఆటకు గుడ్బై
-
ఆటకు రాయుడు గుడ్బై
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ క్రికెట్కు టీమిండియా సీనియర్ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్లకూ వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ప్రపంచకప్లో చోటు ఖాయమని చివరకు ఊరించిన అవకాశం కాస్త విజయ్ శంకర్ రూపంలో తన్నుకుపోవడంతో ఈ హైదరాబాదీ క్రికెటర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. స్టాండ్బై ఆటగాడిగా ఉన్న కూడా ప్రపంచకప్లో చోటు దక్కకపోవడంతో రాయుడు కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే బుధవారం అన్ని ఫార్మాట్ల క్రికెట్ కెరీర్కు రాయుడు స్వస్తి పలుకుతున్నట్లు తెలుస్తోంది. కొంపముంచిన ‘3డీ’ రాయుడు కంటే విజయ్ శంకరే మూడు రకాలుగా ఉపయోగపడతాడన్న చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణపై రాయుడు వ్యంగ్యంగా స్పందించాడు. మూడు రకాలుగా (త్రీ డైమెన్షన్స్) అన్నందుకు ప్రపంచకప్ చూసేందుకు త్రీడి కళ్లద్దాలు ఆర్డర్ ఇచ్చానని రాయుడు ట్విట్టర్లో పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఈ దురుసుతనమే రాయుడు కల నెరవేరకుండా చేసింది. జట్టులో నాలుగో స్థానానికి ఎంపికైన విజయ్ శంకర్ గాయం నుంచి తప్పుకున్నా... అదే స్థానానికి చివరి వరకు పోటీ పడిన రాయుడుకు మాత్రం మరోసారి మొండిచేయి ఎదురైంది. ప్రపంచ కప్ స్టాండ్ బై ఆటగాళ్లలో అతని పేరు ఉన్నా, అసలు సమయానికి మాత్రం ఆ చాన్స్ మయాంక్ ఎగరేసుకుపోయాడు. పునరాగమనం తర్వాత నిలకడైన ప్రదర్శనతో ‘4’కు సరైనవాడు అని కోహ్లితో ప్రశంసలు పొందినా...న్యూజిలాండ్ గడ్డపై భారత టాప్ స్కోరర్గా నిలిచినా దురదృష్టవశాత్తూ రాయుడును సెలక్టర్లు గుర్తించలేదు. దీంతొ తీవ్రమనస్థాపానికి గురైన రాయుడు తన ఆటకు వీడ్కోలు పలికాడు. 55 వన్డేలాడిన ఈ హైదరాబాదీ బ్యాట్స్మన్ 47.05 సగటుతో 1694 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 124. ఇక తన 17 ఏళ్ల ఫస్ట్క్లాస్ క్రికెట్లో 16 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలతో 6151 పరుగులు చేశాడు. లిస్ట్-ఏలో 160 మ్యాచులాడి 5,103 పరుగులు చేశాడు. టీ20ల్లో 1 సెంచరీ, 24 హాఫ్ సెంచరీలతో 4,626 పరుగులు సాధించాడు. ప్రపంచకప్ సన్నాహకంలో భాగంగా ఎంపికైన రాయుడు పరిమిత ఓవర్లపై మరింత శ్రద్ధ పెట్టడం కోసమం ఫస్ట్ క్లాస్క్రికెట్కు కూడా గుడ్బై చెప్పాడు. ఆసీస్, కివీస్ పర్యటనల్లో 82.25 స్ట్రయిక్రేట్తో రాణించాడు. అయినా రాయుడికి అవకాశం దక్కలేదు. ఐపీఎలే చివరిది.. 2013 జులై 24న టీమిండియా-జింబాబ్వే మధ్య జరిగిన వన్డేల్లో అరంగేట్రం చేసిన రాయుడు.. చివరగా ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఆడాడు. 2014లో తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. 2016లో జింబాబ్వేతో జరిగిన టీ20నే అతడికి ఆఖరిది. ఈ ఏడాది మార్చిలో ముంబయి ఇండియన్స్తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున చివరిసారిగా ఆడాడు. ఐస్ లాండ్ క్రికెట్ ఆహ్వానం.. ప్రపంచకప్లో చోటు దక్కలేదనే బాధలో ఉన్న అంబటి రాయుడ్ని తమ దేశానికి వచ్చేయమంటూ.. ఐస్లాండ్ నుంచి ఆహ్వానం అందింది. ‘రాయుడు 3డీ గ్లాసెస్ను ఇప్పుడైనా పక్కనబెట్టు. మామూలు అద్దాలతో డాక్యుమెంట్లను చదువు. వచ్చి మాతో చేరు. రాయుడంటే మాకెంతో ఇష్టం’ అని ఐస్లాండ్ క్రికెట్ ట్వీట్ చేసింది. ఐస్లాండ్లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం కోసం సమర్పించాల్సిన డాక్యుమెంట్ల వివరాలను కూడా ఐస్లాండ్ క్రికెట్ మంగళవారం ట్వీట్ చేసింది. -
రాయుడును వీడని ‘3డి’
సాక్షి క్రీడా విభాగం: మరోసారి ప్రపంచ కప్ అవకాశం మన అంబటి తిరుపతి (ఏటీ) రాయుడు చేజారింది. జట్టులో నాలుగో స్థానానికి ఎంపికైన విజయ్ శంకర్ గాయం నుంచి తప్పుకున్నా... అదే స్థానానికి చివరి వరకు పోటీ పడిన రాయుడుకు మాత్రం మరోసారి మొండిచేయి ఎదురైంది. ప్రపంచ కప్ స్టాండ్ బై ఆటగాళ్లలో అతని పేరు ఉన్నా, అసలు సమయానికి మాత్రం ఆ చాన్స్ మయాంక్ ఎగరేసుకుపోయాడు. పునరాగమనం తర్వాత నిలకడైన ప్రదర్శనతో ‘4’కు సరైనవాడు అని కోహ్లితో ప్రశంసలు పొందినా...న్యూజిలాండ్ గడ్డపై భారత టాప్ స్కోరర్గా నిలిచినా దురదృష్టవశాత్తూ రాయుడును సెలక్టర్లు గుర్తించలేదు. ఇప్పుడు జట్టు ఉన్న పరిస్థితుల్లో మిడిలార్డర్లో సమర్థంగా ఆడగల సత్తా రాయుడుకి ఉందనడంలో సందేహం లేదు. ఓపిగ్గా ఇన్నింగ్స్ను నడిపించడంతో పాటు అవసరమైన సమయంలో ధాటిగా ఆడగల నైపుణ్యం అతని సొంతం. సెలక్టర్ల ఎంపిక ప్రక్రియే కాస్త ఆశ్చర్యకరంగా అనిపించింది. ఓపెనర్ ధావన్ గాయపడితే ఒక మిడిలార్డర్ బ్యాట్స్మన్ పంత్ను ఎంపిక చేశారు. ఇప్పుడు మిడిలార్డర్ బ్యాట్స్మన్ తప్పుకుంటే ఇప్పటి వరకు ఒక్క వన్డే కూడా ఆడని ఓపెనర్ను ఎంచుకున్నారు. తనను కాదని శంకర్ను ఎంపిక చేస్తూ ‘త్రీ డైమెన్షనల్ ఆటగాడు’ అంటూ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించడం... పరోక్షంగా దానిపై సెటైర్ విసురుతూ ‘వరల్డ్ కప్ చూసేందుకు 3డి అద్దాలు కొన్నాను’ అంటూ రాయుడు ట్వీట్ చేయడం వివాదం రేపింది. ఏదో స్థానం కోల్పోయిన బాధలో అన్నాడు పాపం కాబట్టి చర్య తీసుకోవడం లేదు అని బీసీసీఐ పెద్దలు కొందరు అప్పట్లో వ్యాఖ్యానించినా... ఆ విషయాన్ని వారంతా తేలిగ్గా వదిలి పెట్టలేదని అర్థమవుతోంది. తమనే ప్రశ్నించిన రాయుడుకు మళ్లీ అవకాశం ఇవ్వరాదనే సంకేతం తాజా ఎంపికలో కనిపించిందనడంలో సందేహం లేదు. ఇదీ మయాంక్ రికార్డు... భారత్ తరఫున ఆస్ట్రేలియాతో 2 టెస్టులు ఆడి ఆకట్టుకున్న కర్ణాటక బ్యాట్స్మన్ మయాంక్ పరిమిత ఓవర్ల మ్యాచ్లలో ఇంకా అరంగేట్రమే చేయలేదు. దేశవాళీ వన్డేల్లో (లిస్ట్ ఎ) 75 మ్యాచ్లలో 48.71 సగటుతో 3,605 పరుగులతో అతనికి చెప్పుకోదగ్గ రికార్డు ఉంది. అతని స్ట్రయిక్ రేట్ కూడా 100.72 కావడం విశేషం. ముఖ్యంగా గత రెండేళ్లలో అతను 61.60 సగటుతో వన్డేల్లో పరుగులు చేశాడు. ఐపీఎల్లో కూడా ఆకట్టుకున్న మయాంక్ అగర్వాల్... గత ఏడాది భారత ‘ఎ’ తరఫున ఇంగ్లండ్ గడ్డపై 4 వన్డేల్లో 71.75 సగటు, 105.90 స్ట్రయిక్ రేట్తో 287 పరుగులు సాధించడం అతని ఎంపికకు కారణమైంది. ప్రపంచ కప్కు ఎంపిక చేసేందుకు బీసీసీఐకి రాసిన లేఖలో ‘సరైన టాపార్డర్ బ్యాట్స్మన్’ కావాలని టీమ్ మేనేజ్మెంట్ కోరడాన్ని బట్టి చూస్తే అతడిని ఓపెనింగ్ స్థానానికే ఎంపిక చేశారని అర్థమవుతోంది. -
డియర్ అంబటి రాయుడు.. సారీ మ్యాన్!
ప్రస్తుత వరల్డ్ కప్లో టీమిండియా పరిస్థితి ఒకింత గందరగోళంగా తయారైంది. ఆటగాళ్లు వరుసగా గాయాలపాలవుతున్నారు. మరోవైపు సెలెక్టర్లు ఎన్నో ఆశలు పెట్టి.. ఎంపిక చేసిన ఆటగాళ్లు విఫలమవుతున్నారు. ఇప్పటికే గాయం కారణంగా డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచకప్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా విజయ్శంకర్ కూడా అదే దారిలో గాయాలతో ఇంటిబాట పట్టాడు. స్టార్ బౌలర్ భువనేశ్వర్ కూడా గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. మరోవైపు సెలక్టర్లు కొండంత నమ్మకముంచిన కేదార్ జాధవ్ తాజాగా ఇంగ్లండ్ మ్యాచ్లో అంచనాలకు తగ్గట్టు ఆడటంలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్ స్టార్ బ్యాట్స్మన్ అంబటి రాయుడి మీద పడింది. క్రికెట్ మెగా టోర్నీ వరల్డ్ కప్లో ఆడాలని ఈ వెటరన్ క్రికెటర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కొంతకాలంగా నిలకడగా ఆడుతూ వస్తూ.. సెలక్టర్ల దృష్టిలో కూడా పడ్డాడు. అయితే, వరల్డ్ కప్ జట్టు ఎంపిక చేసే సమయంలో యువ ఆటగాడు విజయ్శంకర్ అనూహ్యంగా తెరపైకి రావడం.. అంబటి ఆశలపై నీళ్లు కుమ్మరించింది. బ్యాటింగ్, బౌలింగ్తోపాటు ఫీల్డింగ్ కూడా చేయగల త్రీ డైమన్షన్ ఆటగాడు విజయ్శంకర్ అంటూ సెలెక్టర్లు అతన్ని ఆకాశానికెత్తారు. కానీ, తీరా వరల్డ్ కప్కు వచ్చేసరికి అతను ఆశించినమేర రాణించలేదు. సెలక్టర్లు చెప్పినట్టు ఏ డైమన్షన్లోనూ అతను ప్రతిభ చూపలేదు. అంతంతమాత్రం ఆటతీరుతో చివరకు గాయాలపాలై ఇంటిదారి పట్టాడు. (చదవండి: ‘త్రీడి కళ్లద్దాలు’ ఆర్డర్ ఇచ్చా: రాయుడు) ఐనా.. ఒకవైపు గాయాలతో ఆటగాళ్లు ఇంటిదారి పడుతున్నా.. టీమిండియా సెలక్టర్లు మాత్రం అంబటి రాయుడిపై దృష్టి సారించడం లేదు. అంబటి రాయుడు, రిషబ్ పంత్కు ప్రపంచకప్ ద్వారాలు మూసుకుపోలేదని, ఎవరైనా గాయాలపాలైతే.. వారిని జట్టులోకి తీసుకుంటామంటూ.. ఆ ఇద్దరిని స్టాండ్బై ఆటగాళ్లుగా బీసీసీఐ ప్రకటించింది కూడా. అయినా, ఇప్పటి క్లిష్ట పరిస్థితుల్లోనూ అంబటిని సెలక్టర్లు పట్టించుకోకపోవడం గమనార్హం. ధావన్ గాయంతో జట్టు నుంచి వైదొలగడంతో పంత్ను జట్టులోకి తీసుకున్నారు. తాజాగా విజయ్ శంకర్ నిష్క్రమణ నేపథ్యంలో అంబటికి అవకాశం ఉంటుందని భావిస్తే.. ఆ స్థానంలో మయాంక్ అగర్వాల్ను జట్టులోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. (చదవండి: స్టాండ్బైగా పంత్, రాయుడు) మరీ, అంబటి రాయుడిని స్టాండ్ బైగా ప్రకటించి.. ఎవరైనా ఆటగాళ్లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తే.. అవకాశమిస్తామని చెప్పడమెందుకని అంబటి అభిమానులు ఇటు బీసీసీఐని, అంటు సెలక్టర్లు ప్రశ్నిస్తున్నారు. విజయ్శంకర్ను జట్టులోకి తీసుకున్నప్పుడు.. వరల్డ్ కప్ చూసేందుకు త్రీడీ గ్లాసులు ఆర్డర్ ఇచ్చానని రాయుడు వ్యంగ్యంగా ట్విటర్లో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీసీసీఐ స్పందించి.. సీరియస్గా తీసుకోవడం లేదని పేర్కొంది. అయినా, రాయుడి వ్యాఖ్యలు సెలక్టర్లను తీవ్రంగానే హార్ట్ చేసి ఉంటాయోమో... అందుకే అతన్ని జట్టులోకి తీసుకునే అవకాశం వచ్చినా సెలక్టర్లు మొగ్గు చూపడం లేదని వినిపిస్తోంది. టీమిండియాకు ఇప్పుడు బ్యాటింగ్ స్పెషలిస్ట్ అవసరముంది. బ్యాటింగ్లో అపార అనుభవమున్న రాయుడిని కాదని.. పెద్దగా అనుభవం లేని జూనియర్ ఆటగాళ్లకు సెలక్టర్లు అవకాశం కల్పించడం పరిశీలకులను విస్తుగొల్పుతుంది. (చదవండి: విజయ్ శంకరానందం) ధావన్, విజయ్శంకర్ జట్టు నుంచి వైదొలిగినా.. అంబటికి అవకాశం ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో అతని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలక్టర్లు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని.. అంబటికి అండగా నిలుస్తున్నారు. తాజాగా నటుడు సిద్ధార్థ అంబటికి మద్దతుగా ట్వీట్ చేశారు. ‘డియర్ అంబటి రాయుడు.. నువ్వు దీని కన్నా ఎన్నోరెట్లు అర్హుడివి. సారీ మ్యాన్. ఈ చెత్తను పట్టించుకోకు. దృఢంగా ఉండు. నీ ప్రతిభకు, నీ పట్టుదలకు నీ నిలకడైన ఆటతీరుకు దీనికి ఏమాత్రం సంబంధం లేదు’ అంటూ అతన్ని జట్టులోకి తీసుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. Dear @RayuduAmbati, you deserve much much better. Sorry man! This is bullshit. Stay strong! This says nothing about your talent, commitment or consistency. https://t.co/tMDVGmnKrE — Siddharth (@Actor_Siddharth) July 1, 2019 -
విజయ్ శంకర్.. రాయుడు చూస్తున్నాడు!
మాంచెస్టర్: వన్డే వరల్డ్కప్కు భారత జట్టును ఎంపిక చేసే క్రమంలో విజయ్ శంకర్ను త్రీడైమన్షన్స్(బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) ఆటగాడిగా పోల్చుతూ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా అంబటి రాయుడికి అవకాశం ఇవ్వకుండా విజయ్ శంకర్ను ఎంపిక చేయడంపై ఇలా సరిపెట్టుకున్నాడు ఎంఎస్కే ప్రసాద్. దానికి అసహనం వ్యక్తం చేసిన రాయుడు.. వరల్డ్కప్ను చూడటానికి త్రీడి అద్దాలను ఆర్డర్ ఇచ్చా’ అంటూ సెటైర్ కూడా వేశాడు. అయితే మెగా టోర్నీలో అసలైన ఆటలోకి వచ్చేసరికి విజయ్ శంకర్ తేలిపోయాడనే చెప్పాలి. శిఖర్ ధావన్ గాయం కారణంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న విజయ్ శంకర్.. ఆ మ్యాచ్లో ఫర్వాలేదనిపించాడు. బౌలింగ్లో రెండు వికెట్లు తీయడంతో భారత మేనేజ్మెంట్ సంతృప్తి చెందింది. కండరాల గాయంతో భువనేశ్వర్ ఒక పూర్తి చేయకుండా పెవిలియన్కు చేరినప్పుడు మిగతా రెండు బంతుల్ని విజయ్ శంకర్ వేశాడు. తాను వేసిన తొలి బంతికి ఇమాముల్ హక్ను వికెట్లు ముందు దొరకబుచ్చుకుని భళా అనిపించాడు. ఆపై మరొక ఓవర్లో సర్ఫరాజ్ వికెట్ను కూడా దక్కించుకుని మొత్తంగా రెండు వికెట్లు తీశాడు. దాంతో అఫ్గానిస్తాన్, వెస్టిండీస్లతో జరిగిన మ్యాచ్ల్లో విజయ్ శంకర్ తుది జట్టులో ఎంపికకు మరో ఆలోచన లేకుండా పోయింది. కాగా, అఫ్గాన్తో మ్యాచ్లో 29 పరుగులు చేసి ఔటైన విజయ్ శంకర్.. విండీస్తో మ్యాచ్లో 14 పరుగులు చేసి నిరాశపరిచాడు. అది కూడా భారత్ జట్టుకు సవాల్గా మారిన నాల్గో స్థానంలో బ్యాటింగ్ దిగి విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో విజయ్ శంకర్పై విమర్శల వర్షం కురుస్తోంది. అసలు నాల్గో స్థానంలో విజయ్ శంకర్ను దింపడం ఏమిటని క్రికెట్ వ్యాఖ్యతలతో పాటు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ‘ విండీస్తో మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. కానీ బ్యాటింగ్లో ఇంకా లోపాలు కనబడుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా విజయ్ శంకర్ నిరాశపరుస్తున్నాడు. ఇలానే ఆడితే విజయ్ శంకర్కు అవకాశాలు రావడం కష్టం. నా వరకూ అయితే విజయ్ శంకర్కు మరో అవకాశం ఇచ్చి చూస్తారు’ అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. ఇక అభిమానులైతే విజయ్ శంకర్ను ఏకిపారేస్తున్నారు. ‘ విజయ్ శంకర్ను వెంటనే స్వదేశానికి పంపించండి. భారత ఎలెవన్లో అతను అనవసరం’ అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయగా, ‘ అతని బ్యాటింగ్ బుమ్రాలాగా ఉండగా, బౌలింగ్లో కోహ్లిని గుర్తుకు తెస్తున్నాడు’ అంటూ మరొక అభిమాని ఎద్దేవా చేశాడు. ‘ విజయ్ శంకర్ త్రీ డైమన్షనల్ ఆటను రాయుడు చూస్తున్నాడు’ అంటూ మరొకరు ట్వీట్లో సెటైర్ వేశారు. ‘ రిషభ్ పంత్కు అవకాశం ఇవ్వకుండా విజయ్ను కొనసాగించడం ఏమిటి. ఇది స్థానిక మ్యాచ్ కాదు. ఐసీసీ 2019 వరల్డ్కప్’ అని మరొక అభిమాని విమర్శించాడు. ఇలా విజయ్ శంకర్ ఆట తీరుపై విమర్శల పర్వం కొనసాగుతోంది. -
అంబటి రాయుడు ట్వీట్పై విజయ్ శంకర్ స్పందన
లండన్: ప్రపంచకప్ జట్టులోకి తనని ఎంపిక చేయకపోవడంతో కొద్దిరోజుల క్రితం అంబటి రాయుడు చేసిన త్రీడీ ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. గత నెలలో 15 మందితో కూడిన భారత్ జట్టుని సెలక్టర్లు ఎంపిక చేసిన సమయంలో రాయుడ్ని ఎంపిక చేస్తారని అంతా ఊహించారు. కాగా, అతని స్థానంలో విజయ్ శంకర్కి సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. రాయుడితో పోలిస్తే..? విజయ్ శంకర్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు కోణాల్లో (త్రీ డైమన్షన్స్) టీమ్కి ఉపయోగపడతాడని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అప్పడే వివరణ ఇచ్చారు. ప్రపంచకప్ జట్టు ప్రకటన మరుసటి రోజు చీఫ్ సెలక్టర్ వివరణపై అంబటి రాయుడు చురకలేస్తూ ఓ ట్వీట్ వదిలాడు ‘వరల్డ్ కప్ చూసేందుకు ఇప్పుడే త్రీడీ కళ్లద్దాలకి ఆర్డరిచ్చాను’ అని సెటైర్ వేశాడు. దీంతో విజయ్ శంకర్కి పరోక్షంగా రాయుడు కౌంటరిచ్చాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ.. దీనిపై రాయుడు, శంకర్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ తాజాగా ఎట్టకేలకి విజయ్ శంకర్ ఆ ట్వీట్పై పెదవి విప్పాడు. గౌరవ్ కపూర్ నిర్వహించిన ‘బ్రేక్ఫాస్ట్ విత్ చాంపియన్స్’ షోలో విజయ్ శంకర్ దానిపై స్పందించాడు. అప్పట్లో అంబటి రాయుడు చేసిన ‘త్రీడీ’ ట్వీట్ తనపై కాదన్నాడు. అదే సమయంలో రాయుడికి మద్దతుగా నిలిచాడు విజయ్ శంకర్. ‘జట్టులోకి ఎంపికవకపోతే సదరు క్రికెటర్ ఎంత బాధపడతాడో నాకు తెలుసు. అంబటి రాయుడు పరిస్థితిని ఓ క్రికెటర్గా నేను అర్థం చేసుకోగలను. అది బాధలో రాయుడు చేసిన ట్వీట్ మాత్రమే. ఆ త్రీడీ ట్వీట్ నా గురించి కాదు’ అని విజయ్ శంకర్ పేర్కొన్నాడు. -
అంబటి రాయుడికి చిగురిస్తున్న ఆశలు..
హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ 12లో కింగ్స్ పంజాబ్తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన కేదార్ జాదవ్కు ఇంకా కోలుకోలేదు. దీంతో ప్రపంచకప్ వరకు అందుబాటులో ఉంటాడా లేడా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే కోచ్ రవిశాస్త్రి మాత్రం జాదవ్కు తగిలింది పెద్ద గాయం కాదని.. ప్రపంచకప్కు బయల్దేరే సమయానికి కోలుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. దీనిపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఘమేఘాల మీద అతడిని తీసుకపోవడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని మండిపడుతున్నారు. పూర్తి ఫిట్నెస్ సాధించని ఆటగాడిని తీసుకపోవడం వలన జట్టుకు, అతడికి చాలా నష్టం వాటిల్లుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బీసీసీఐ కూడా సమాలోచనలో పడినట్లు సమాచారం. ఇప్పటికే జాదవ్ గాయంకు సంబంధించన విషయాలను, ఫిట్నెస్ గురించి రోజువారి రిపోర్టులను బీసీసీఐ పరిశీలిస్తుంది. అంతేకాకుండా ఐసీసీ నియామవళి ప్రకారం మే 23 వరకే ఆటగాళ్లను మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మార్చకుంటే ఇంగ్లండ్కు వెళ్లిన తర్వాతే. దీంతో ఈ లోపే జాదవ్ను తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. జాదవ్ను పక్కకు పెడితే అంబటి రాయుడినే ఎంపిక చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే జాదవ్ బౌలింగ్ చేసే సామర్థ్యం ఉండటంతో అతడి స్థానంలో ఆల్రౌండర్ అక్షర్పటేల్ను తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనలో కూడా సెలక్టర్లు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పంత్ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇండియా ఏ తరుపున ఆడుతున్న పంత్.. వెస్టిండీస్ ఏతో జరుగుతున్న సిరీస్లో రాణించి సెలక్టర్లు దృష్టిలో పడాలని ఆశపడుతున్నాడు. -
ఇద్దరూ ఒక్కటే!
ప్రపంచ కప్ రేసులో అంబటి రాయుడు ను వెనక్కి నెట్టి విజయ్ శంకర్ స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అసంతృప్తితో రాయుడు ‘3డి’ వ్యంగ్య వ్యాఖ్యానం కూడా చేశాడు. ఆ తర్వాతి నుంచి ఐపీఎల్లో వీరిద్దరి మధ్య పోలిక మొదలైంది. అయితే ఇప్పుడు సరిగ్గా లీగ్ మ్యాచ్లు ముగిసేసరికి ఇద్దరిలో ఎవరు మెరుగైన ఆటగాడో చెప్పలేని విధంగా వారిద్దరు గణాంకాలు నమోదు చేశారు. చెన్నై తరఫున రాయుడు, సన్రైజర్స్ తరఫున శంకర్ అన్ని మ్యాచ్లు (14) ఆడారు. ఇందులో ఒక మ్యాచ్లో శంకర్కు బ్యాటింగ్ అవకాశం రాలేదు. చివరకు ఇద్దరూ కూడా సరిగ్గా 219 పరుగులే నమోదు చేయగా... సగటు కూడా (19.90) ఒకేలా ఉండటం యాదృచ్ఛికం! ఒక అర్ధ సెంచరీ చేసిన రాయుడు బౌండరీల ద్వారా 92 పరుగులు సాధించగా... 40 పరుగుల అత్యధిక స్కోరు సాధించిన శంకర్ దాదాపు అదే విధంగా 96 పరుగులు బౌండరీల నుంచి రాబట్టాడు. బౌలింగ్లోనూ కేవలం 8 ఓవర్లే వేసి ఒక వికెట్ తీసిన శంకర్ ప్రదర్శన పెద్దగా చెప్పుకోదగింది కాదు. బ్యాటింగ్ స్ట్రయిక్రేట్లో మాత్రం రాయుడు (90.49)కంటే శంకర్ (120.32) కొంత మెరుగ్గా ఉన్నాడు. జాదవ్కు గాయం... మరోవైపు వరల్డ్ కప్ జట్టు సభ్యుడైన కేదార్ జాదవ్ మళ్లీ గాయం బారిన పడ్డాడు. పంజాబ్తో ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా జాదవ్ ఫీల్డింగ్ చేస్తూ కింద పడ్డాడు. దాంతో అతని భుజానికి గాయమైంది. జాదవ్కు సోమవారం ఎక్స్రే, స్కానింగ్ నిర్వహించనున్నట్లు చెన్నై కోచ్ ఫ్లెమింగ్ నిర్ధారించారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే మాత్రం అతను ప్రపంచ కప్కు దూరమైనట్లే! భారత వన్డే విజయాల్లో కీలక భాగంగా ఉన్న జాదవ్ ఐపీఎల్లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. 12 ఇన్నింగ్స్లలో కలిపి అతను 95.85 స్ట్రయిక్ రేట్తో 162 పరుగులు మాత్రమే చేశాడు. -
డియర్ బీసీసీఐ.. రాయుడిని ఎందుకు తీసుకోలేదు!
చెన్నై : హైదరాబాద్ క్రికెటర్ అంబటి రాయుడిని తుది వరకు ఊరించిన ప్రపంచకప్ బెర్త్.. అసలు ప్రణాళికలోనే లేని ఆల్రౌండర్ విజయ్శంకర్కు దక్కింది. రాయుడు కంటే విజయ్ శంకరే (3 డైమెన్షన్స్) మూడు రకాలుగా ఉపయోగపడతాడన్న చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణపై రాయుడు సెటైరిక్గా స్పందిస్తూ ప్రపంచకప్ చూసేందుకు త్రీడి కళ్లద్దాలు ఆర్డర్ ఇచ్చానని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై బీసీసీఐ స్పందించడం.. మాజీ క్రికెటర్లు రాయుడుకు అండగా నిలవడంతో 3Dఅనే పదం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక తాజాగా ముంబై ఇండియన్స్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాయుడు.. ధోని గైర్హాజరితో కీపర్గా కొత్త అవతారమెత్తాడు. దీంతో అభిమానులు బీసీసీఐని, ఎమ్మెస్కే ప్రసాద్ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ‘డియర్ బీసీసీఐ.. రాయుడిని ఎందుకు ఎంపిక చేయలేదు. ఐసీసీ మావాడి బౌలింగ్ను నిషేదించింది లేకుంటే మావోడు 4D(బ్యాటింగ్, ఫీల్డింగ్, కీపింగ్, బౌలింగ్) ఆటగాడు.’ అని ఒకరు.. ‘ఓ ఎమ్మెస్కే ప్రసాద్.. రాయుడు కూడా 3D ఆటగాడే ఏమంటావ్?’ అని మరొకరు.. ‘బీసీసీఐ 4D ఆటగాడిని దూరం చేసుకుంది’ అని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. ఇక మాజీ క్రికెటర్, ప్రస్తుత కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం రాయుడి కీపింగ్పై ట్వీట్ చేశారు. ‘ధోని గైర్హాజరితో కీపింగ్ బాధ్యతలు చేపట్టిన రాయుడు.. తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఇక ఈ సీజన్ ఐపీఎల్లో రాయుడు పేలవ ప్రదర్శన కనబర్చాడు. ఒకే ఒక హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. 4 మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. 55 అంతర్జాతీయ వన్డేలు ఆడిన రాయుడు 3 సెంచరీలు,10 అర్ధసెంచరీలతో 1694 పరుగులు చేశాడు. ప్రపంచకప్ బెర్త్ కోసం గత రెండేళ్లుగా రాయుడు తీవ్ర కసరత్తులు చేశాడు. కానీ అందివచ్చిన అవకాశం ఆఖరికి విజయ్శంకర్ రూపంలో కొట్టుకుపోయింది. Rayudu has donned the gloves in the absence of Dhoni....added another Dimension to his game. 😇 #CSKvMI #IPL — Aakash Chopra (@cricketaakash) April 26, 2019 Ambati rayudu is showing his 3D effect as well Batting, Fielding, now keeping ICC has banned his bowling unless he have 4D effect Take that MSK #CSKvMI — Ankit Pandey (@Cricket_Ankit) April 26, 2019 Ambati Rayudu 🕶️ keeping wickets. Damn, this guy is also 3-dimensional da MSK Prasad! #CSKvMI — CSK GauthaM 💛 (@GauthalVl) April 26, 2019