Beauty
-
‘బ్యూటీ’ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డు
‘బ్యూటీ’ అనే చిత్రంతో నీలఖి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను గీతా సుబ్రమణ్యం, ‘హలో వరల్డ్’ ఫేమ్ వర్ధన్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య హీరోగా, నీలఖి హీరోయిన్గా నటించారు.నీలఖి తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టకముందే ఒడిశాలో తన ప్రతిభను చాటుకున్నారు. ఒడిశాలోని ప్రముఖ ఛానెల్ తరంగ్ టీవీ నిర్వహించిన ‘తరంగ్ సినీ ఉత్సవ్’ కార్యక్రమంలో ‘యంగ్ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ - డెబ్యూ ఫీమేల్’ విభాగంలో నీలఖి అవార్డును గెలుచుకున్నారు. తెలుగు ప్రేక్షకులను కూడా తన నటనతో ఆకట్టుకుంటారని ‘బ్యూటీ’ టీమ్ గట్టి విశ్వాసంతో ఉంది.ఇప్పటికే విడుదలైన ‘బ్యూటీ’ సినిమా పోస్టర్లు, టీజర్లో నీలఖి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె నటనలో భావోద్వేగాలను అద్భుతంగా పండించారని టీమ్ గతంలోనే వెల్లడించింది. ‘బ్యూటీ’ చిత్రంతో నీలఖి తెలుగు సినిమా పరిశ్రమలోకి ఘనంగా అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.వానరా సెల్యులాయిడ్ బ్యానర్పై మారుతి టీమ్తో కలిసి జీ స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
గ్రీన్ శారీలో బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ (ఫోటోలు)
-
వడలిపోయిన ముఖాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి?
నడివయసుకు చేరుకుంటున్న సమయంలో వయసుతో వచ్చే మార్పుల్లో, శరీరంలోని కండరాల్లో దారుఢ్యం సడలి, కొలతలు మారిపోవడం ప్రధాన సమస్యగా మారుతుంటుంది. శరీర నిర్మాణంలోనే కాదు, ముఖంలోనూ ఆ మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. జిమ్కి వెళ్తే శరీరాన్ని దృఢంగా తీర్చిదిద్దుకోవచ్చు. మరి వడలిపోయిన ముఖాన్ని ఎలా తీర్చి దిద్దుకోవాలి? ఇదిగో చిత్రంలోని ఈ ఫేస్ జిమ్ టూల్, ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా నిలుస్తుంది. మునివేళ్లతో పట్టుకుని వాడుకోగలిగే ఈ పరికరంతో శిల్పాన్ని మలచుకున్నట్లుగా ఎవరికి వారే తమ ముఖాన్ని చక్కగా తీర్చి దిద్దుకోవచ్చు. ఈ పరికరంతో మర్దన చేసుకుంటే ముఖ కండరాల్లో రక్త ప్రసరణ మెరుగుపడి, ముఖం పునర్యవ్వనం పొందుతుంది. సురక్షితమైన నాణ్యమైన మెటీరియల్తో రూపొందిన ఈ గాడ్జెట్ ఎలాంటి చర్మానికైనా హాని కలిగించదు. పైగా పట్టుకోవడానికి, మసాజ్ చేసుకోవడానికి అనువుగా ఇది రూపొందింది. దీనికి ఒకవైపు ఐదు దువ్వెన పళ్లులాంటి ఊచలు, వాటి చివర బాల్స్ ఉండగా.. మరోవైపు మెలితిరిగిన మృదువైన కొన, దానికో గుండ్రటి బాల్ అటాచ్ అయ్యి ఉంటుంది. మీ చర్మానికి సరిపడే సీరమ్ లేదా క్రీమ్ అప్లై చేసుకుని ఈ టూల్తో మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చిత్రంలో చూపిన విధంగా, చర్మానికి ఆనించి, కింది వైపు నుంచి పైకి మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి.(చదవండి: 'ఫైట్ ఎగైనెస్ట్ ఒబెసిటీ'కి ప్రధాని మోదీ పిలుపు..! ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే..) -
అందాల భామలకు ఆతిథ్యం! యాదగిరిగుట్టకు ప్రపంచ సుందరీమణులు
అందాల భామలకు అతిథ్యమిచ్చేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా సిద్ధమవుతోంది. హైదరాబాద్లో మే 7 నుంచి 31 వరకు 72వ ఎడిషన్ మిస్ వరల్డ్–2025 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పోటీలకు 140 దేశాల నుంచి మూడు వేల మంది అందాల భామలు, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. వారిద్వారా హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పర్యాటక కేంద్రాలకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. అందులో భాగంగా అందాల భామలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్పోచంపల్లి, యాదగిరిగుట్ట, నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఇలా వివిధ దేశాల అందాల భామలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావడం ద్వారా ఆయా ప్రాంతాలకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. మే 15న ఇక్కత్ వస్త్రాలతో ర్యాంప్వాక్..ఇక్కత్ వస్త్రాలకు అంతర్జాతీయంగా పేరుగాంచిన భూదాన్పోచంపల్లికి మిస్వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు మే 15వ తేదీన రానున్నారు. వీరు ఇక్కడి చేనేత కార్మికులతో ముఖాముఖి మా ట్లాడుతారు. అనంతరం మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలిస్తారు. తరువాత చేనేత చీరలు ధరించి ర్యాంప్వాక్ చేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. మిస్వరల్డ్ పోటీల ఈవెంట్లను నిర్వహించే పోచంపల్లి ఇక్కత్వస్త్రాల విశిష్టతను వీడియోగ్రఫీ చేస్తున్నారు. ఫలితంగా చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మరింత పేరును తీసుకురావడమే ఈవెంట్ల ముఖ్య ఉద్దేశమని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ పేర్కొంటోంది. ఇప్పటికే అనేక ఫ్యాషన్ ఈవెంట్లకు వేదికైన పోచంపల్లికి ఇప్పుడు మరోసారి ప్రపంచ సుందరీమణులు వస్తుండడంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ ఖ్యాతి పొందనుంది.ఇటీవలే యాదగిరి క్షేత్రాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా ఇటీవల యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని మిస్ వరల్డ్ –2024 క్రిస్టినా పిస్కోవా సందర్శించారు. ఆలయం అద్భుతమని కొనియాడారు. వాస్తు శిల్పం, ప్రశాంతమైన పరిసరాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం యాదగిరి క్షేత్రాన్ని తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశమని ఆమె పేర్కొన్నారు. ఆమె ప్రకటనతో మే 15న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందెగత్తెలంతా యాదగిరి క్షేత్ర సందర్శనకు వచ్చి, ఆధ్యాత్మిక అనుభూతిని పొందనున్నారు. విజయ విహార్లో విడిదిప్రపంచదేశాల బౌద్ధులను ఆకర్షించేందుకు నాగార్జునసాగర్లోని కృష్ణానది తీరంలోని బుద్దవనాన్ని ప్రపంచ అందెగత్తెలు మే 12న సందర్శనున్నారు. బౌద్దుల చరిత్ర, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని వారు తెలుసుకోనున్నారు. వారికి ఇక్కడి బౌద్ధసంస్కృతిని పరిచయం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతంగా గుర్తింపు దక్కేలా తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మిస్వరల్డ్ పోటీదారులు సాగర్లో ఇక్కడ విడిది చేయడానికి గాను విజయవిహార్లోని గదులను ఆధునీకరిస్తున్నారు. రూ.5 కోట్ల వ్యయంతో అన్ని హంగులు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆయా పనులు ప్రారంభించారు. వారి విడిదికి సకల హంగులు కల్పిస్తూ.. విజయ విహార్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. వీరి పర్యటన నేపథ్యంలో శనివారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ, నల్లగొండ కలెక్టర్, ఉన్నతాధికారులు నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో సమావేశం నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక నగరికి.. మే 15వ తేదీనే అందాల భామలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12గంటల నుంచి 2 గంటల వరకు ఇక్కడ గడపనున్నారు. వారు 15వ తేదీన హైదరాబాద్ నుంచి నేరుగా యాదగిరికొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్కు చేరుకుని.. అక్కడి నుంచి యాదగిరి క్షేత్రానికి వస్తారు. విష్ణు పుష్కరిణిలో సంకల్ప పూజలు చేసి, ప్రధానాలయం సమీపంలో ఉన్న అఖండ దీపారాధన పూజల్లో పాల్గొంటారు. శ్రీస్వామి వారి దర్శనం తర్వాత ప్రధానాలయ పునః నిర్మాణాన్ని మిస్ వరల్డ్ పోటీ దారులు పరిశీలించి, ఇక్కడే ఒక డాక్యుమెంటరీ సైతం చేయనున్నట్లు తెలుస్తోంది. మిస్ వరల్డ్ పోటీదారులతో యాదగిరిక్షేత్ర వైభవం ప్రపంచ స్థాయికి వెళ్లనుంది. (చదవండి: -
ఈ మేకప్ బాక్స్ ఉపయోగించడం చాలా ఈజీ..!
మేకప్ ఉత్పత్తులను దాచిపెట్టుకోవడం, అవసరానికి వాటిని వెతుక్కోవడం పెద్ద సమస్య. ఇక మేకప్ సామగ్రికి బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి చేరకుండా జాగ్రత్తపడటం మరో సమస్య. ఆ సమస్యను ఈ మేకప్ బాక్స్ ఇట్టే దూరం చేయగలదు. పైగా మిర్రర్, ఫ్యాన్, లైట్ వంటి వాటితో రూపొందిన ఈ మేకప్ బాక్స్ వాడుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది.క్రీమ్స్, సీరమ్స్, లోషన్స్, ఫౌండేషన్స లిప్స్టిక్స్, ఐ లైనర్స్, పౌడర్స్ ఇలా రోజువారీ వినియోగించే మేకప్ సామాన్లను ఈ బాక్స్లో చక్కగా సర్దిపెట్టుకోవచ్చు. ఈ కాస్మెటిక్ స్టోరేజ్ బాక్స్కి ఒకవైపు అద్దం ఉంటుంది. మరోవైపు స్టోరేజ్ కంటైనర్ ఉంటుంది. దీనికున్న అద్దాన్ని 360 డిగ్రీల్లో ఎలా అయినా తిప్పుకోవచ్చు. కూర్చునే కాదు, నిలబడి కూడా మేకప్ వేసుకోవచ్చు. వేసుకున్న మేకప్ త్వరగా ఆరడానికి దీనిలో ఫ్యాన్ కూడా ఉంటుంది. ఇక దీనిలో పర్ఫ్యూమ్స్, నెయిల్ పాలిష్లు, నెయిల్ రిమూవర్స్ వంటివన్నీ దాచుకోవచ్చు. అద్దం వెనుక భాగంలో కూడా కొన్ని మేకప్ వస్తువులను పెట్టుకోవచ్చు. ఈ కాస్మెటిక్ స్టోరేజ్ బాక్స్లో మరో నాలుగు చిన్నచిన్న సొరుగులు ఉంటాయి. దీనికి ఎల్ఈడీ లైట్ అమర్చి ఉండటంతో, కరెంట్ లేనప్పుడు కూడా మేకప్ వేసుకోవడానికి వీలవుతుంది. ఈ లైట్ మూడు వేర్వేరు కాంతుల్లో వెలిగేందుకు ఆప్షన్స్ ఉంటాయి. వాటిని మార్చుకుంటూ మేకప్ ముఖానికి సరైన విధంగా ఉందో లేదో చూసుకోవచ్చు. మనకు కావాల్సిన అన్ని రకాల మేకప్ ఉత్పత్తులను ఇందులో భద్రపరచుకోవచ్చు. ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. దీన్ని బాత్ రూమ్లో, బెడ్ రూమ్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలాంటి మేకప్బాక్సులు చాలానే, రకరకాల మోడల్స్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి రకరకాల రంగుల్లో లభిస్తున్నాయి. దీని ధర సుమారుగా మూడు లేదా నాలుగు వేలు ఉంటుంది. మోడల్ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. వీటిలో కొన్నింటిని ముందే చార్జింగ్ పెట్టుకుని వాడుకోవచ్చు. కొన్నింటిని బ్యాటరీలతో వినియోగించుకోవచ్చు.ముఖ కాంతికి చికిత్స..:ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి రకరకాల చిట్కాలు ఉన్నాయి. రకరకాల సౌందర్య లేపనాలు, అధునాతన పరికరాలు ఉన్నాయి. ఇవేవీ ఫలించనప్పుడు నిపుణులు చేసే చికిత్స పద్ధతులు ఉన్నాయి. ముఖ సౌందర్యాన్ని త్వరగా మెరుగుపరచడానికి ఇటీవలి కాలంలో ‘లో లెవల్ లేజర్ లైట్ థెరపీ’ అందుబాటులోకి వచ్చింది. ఈ పద్ధతిలో తక్కువ స్థాయిలో లేజర్ లైట్ను వెదజల్లే పరికరాన్ని ఉపయోగిస్తారు. టార్చ్లైట్లా ఉండే ఈ పరికరం ద్వారా ముఖచర్మంపై లేజర్ కాంతిని ప్రసరింపజేస్తారు. దీనివల్ల ముఖ కండరాల్లో కొలాజెన్ ఉత్పత్తి పెరిగి, సడలిపోయిన ముఖం తిరిగి బిగుతుదేరుతుంది. ముఖంపై ఏర్పడిన ముడతలు, మచ్చలు, మొటిమలు కూడా క్రమంగా నయమవుతాయి. పలు దేశాల్లో చర్మవైద్య నిపుణులు ఈ పద్ధతిలో చికిత్సను అందిస్తున్నారు. (చదవండి: ఇంధన స్పృహ కలిగిన ఇల్లులా ఆరోగ్యకరంగా మార్చేద్దాం..!) -
అందంలో సాయిపల్లవికే పోటీ ఇస్తున్న చెల్లి! (ఫొటోలు)
-
హద్దులు చెరిపేసి... నిరూపిస్తున్నారు
ఇరవై ఏళ్లుగా 35 దేశాల్లో జరిగిన బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఈవెంట్లకు హోస్ట్గా, జడ్జ్గా, గ్రూమర్గా ఉన్నాను. ఒకప్పుడు పదిమంది అమ్మాయిలు ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి వస్తే చాలు అనుకునేవాళ్లం. కానీ, నేడు అమ్మాయిలే కాదు, అమ్మలు అయ్యాక తమని తాము నిరూపించుకోవడానికి వచ్చే మహిళల శాతం 50 నుంచి 60 శాతానికి పెరిగింది. ప్రతి ఒక్కరికీ కల ఉంటుంది. దానిని నెరవేర్చుకునే క్రమంలో మహిళలకు సరైన ΄్లాట్ఫారమ్ దొరక్కపోవడం,ప్రొఫెషనల్ గా లేకపోవడం, తర్వాత చేద్దాం అనుకోవడం, కుటుంబ బాధ్యతలు అడ్డుగా ఉండటం .. వీటన్నింటి వల్ల టైమ్ దాటిపోతుంటుంది. కానీ, ఏదో ఒక సమయంలో రియలైజ్ అయి, ఆలస్యంగా అయినా తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇప్పుడు ‘మిసెస్ బ్యూటీ’ పోటీలలో పాల్గొనే గృహిణుల సంఖ్య పెరిగింది. ‘నేను స్టేజీ మీద వాక్ చేయాలి, మంచి గ్లామరస్ డ్రెస్సులు వేసుకోవాలి, కాన్ఫిడెంట్గా సమాధానాలు చెప్పగలగాలి...’ ఇలా ఆలోచిస్తున్నారు. గత తరం వరకు సమాజంలో ఒక ఫ్యాషన్ స్టిగ్మా ఉండేది. దాని నుంచి బయటకు వచ్చేస్తున్నారు. మహిళా దినోత్సవం ఉద్దేశం కూడా అదే. అందుకు తగినట్టుగానే ఇప్పుడు చాలా వేదికలు ముందుకు వచ్చాయి. మిసెస్ కేటగిరీలోకి వచ్చే మహిళల మైండ్ సెట్, ఔట్ లుక్ పూర్తిగా మారింది. ఇప్పుడు కావాల్సింది టాలెంట్, కాన్ఫిడెన్స్. మహిళ జీవితమే ఒక ఛాలెంజ్. అందుకే, ఫ్యాషన్ ఇండస్ట్రీలో మహిళలు సవాళ్లను చాలా సులవుగా అధిగమిస్తున్నారు. ఒక కాలేజీ అమ్మాయి మిస్ కాలేజీ తర్వాత మిస్ ఇండియా ఆ తర్వాత మిస్ యూనివర్స్ గురించి ఆలోచిస్తున్నట్టే, గృహిణులుగా ఉన్నవారు కూడా అలాగే క్లారిటీగా ఆలోచిస్తున్నారు. గ్లామర్ రంగంలో గతంలో అమ్మాయిల గురించి ఉన్న నెగిటివిటీ స్థానంలో పాజిటివిటి చేరింది. ఇది చాలా మంచి మార్పు. జూన్లో మిసెస్ అండ్ మిస్టర్ గ్రాండ్– సి వరల్డ్ని హోస్ట్ చేస్తున్నాను. దీనికి గృహిణులుగా ఫ్యాషన్ షోలలో పాల్గొనేవారికి శిక్షణ ఇస్తున్నాను.– వాలెంటీనా మిశ్రా, క్రియేటివ్ డైరెక్టర్, మిసెస్ అండ్ మిస్టర్ గ్రాండ్– సి వరల్డ్ హోస్ట్ -
డిజిటల్ యాడ్లో మెరిసిన సిద్ధార్థ్, అదితీ
ప్రపంచపు నంబర్ 1 బ్యూటీ బ్రాండ్ లోరియల్ ప్యారిస్ (L'Oréal Paris) తమ కొత్త డిజిటల్ ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఇందులో ప్రముఖ బాలీవుడ్ జంట అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ నటించారు. తొలి క్యాంపెయిన్ విజయవంతమైన నేపథ్యంలో అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ నటించిన కొత్త డిజిటల్ క్యాంపెయిన్ లోరియల్ ప్యారిస్ ఆవిష్కరించింది.ఇందులో 2003 క్లాసిక్ సినిమా ‘బాయ్స్’ను గుర్తు చేసేలా ఫన్రీల్తో సిద్ధార్థ్ ఇన్స్టాగ్రాంలో కనిపిస్తారు. దుమ్మూ, చెమట లాంటి కారణంగా తలపై నూనె పేరుకుపోవడం, జిడ్డుగా మారడంలాంటి జుట్టు కష్టాల గురించి సిద్ధార్థ్ సరదాగా ముచ్చటిస్తారు. సరిగ్గా ఈ టైంలో సిద్ధార్థ్ స్వీట్హార్ట్ అదితి ఎంట్రీ ఇచ్చి లోరియల్ ప్యారిస్ హయాలురోన్ ప్యూర్ షాంపూను అందించి, అందులోని కీలకాంశాలైన శాలిసిలిక్ యాసిడ్, హయాలురోనిక్ యాసిడ్ ప్రయోజనాల గురించి ముచ్చటిస్తుంది. సరదాగా సాగే మాటల మధ్యలో, తాను ఈ ప్రొడక్ట్కి ఫ్యాన్నే అయినప్పటికీ, అదితినే అధికారిక బ్రాండ్ అంబాసిడర్ అని సిద్ధార్థ్ గుర్తు చేస్తాడు ఈ డిజిటల్ ఫిలింకి భారీ స్పందన లభించడం విశేషం. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వీక్షణలను సాధించింది. ఆన్-స్క్రీన్పై సిద్ధార్థ్, అదితి జంట కెమిస్ట్రీకి అభిమానుల ప్రశంసలు దక్కడంతో ఈ క్యాంపెయిన్, సోషల్ మీడియా సెన్సేషన్గా మారింది. View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth)ఈ సందర్భంగా లోరియల్ ప్యారిస్ కుటుంబానికి తోడ్పాటు అందిస్తున్న, సిద్ధార్థ్ అదితి రావు హైదరీకి లోరియల్ ప్యారిస్ ఇండియా జనరల్ మేనేజర్ డేరియో జిజ్జీ (Dario Zizzi) కూడా ధన్యవాదాలు తెలిపారు. సౌందర్యాన్ని మెరుగుపర్చే వినూత్న ఉత్పత్తులను ఆవిష్క రించేందుకు లోరియల్ ప్యారిస్ కట్టుబడి ఉందన్నారు. లోరియాల్ ప్యారిస్ హయాలురోన్ ప్యూర్ షాంపూ తల మీద నూనె పేరుకుపోవడాన్ని నివారించి, జుట్టు తేలికగా, పరిశుభ్రంగా, తాజాగా ఉంచుతుందని వివరించారు. -
ముడతలు లేని ఆరోగ్యకరమైన చర్మం కోసం..!
చర్మం గరుకుగా పొడిబారినట్లుగా అయిపోయి వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తున్నాయా..?. అందుకోసం చర్మ సంరక్షణ ఉత్పత్తులపై ఆధారపడటానికి బదులుగా తీసుకునే ఆహారంపై శ్రద్ధ చూపితే మేలు అని చెబుతున్నారు చర్మ నిపుణులు. మొక్కల ఆధారిత ఆహారాలు చర్మ ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలతో నిండి ఉంటాయని పలు పరిశోధనల్లో నిరూపితమైంది కూడా. వీటిలో చర్మానికి కావాల్సిన విటమిన్ సీ, ఈ, బీటా కెరోటిన్, పాలీఫెనాల్స్, ఫినోలిక్ ఆమ్లాలు వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, చర్మంపై వచ్చే మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు చర్మం ఆకృతికి, ఆర్థ్రీకరణను ప్రోత్సహించడానికి సహాయపడతాయని చెబుతున్నారు. మరీ అందుకోసం తీసుకోవాల్సిన సూపర్ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఏంటో చూద్దామా..!.జర్నల్ ఆఫ్ ది అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెక్స్ 2022లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం..నిర్దిష్ట పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్ళు , పాలీఫెనాల్ అధికంగా ఉండే పానీయాలు తదితరాలు మెరుగ్గా ఉండే ఆరోగ్యకరమైన చర్మంలో కీలకపాత్ర పోషిస్తాయని తేలింది. ఈ ఆహారాలు యవ్వనంతో నిగనిగలాడే చర్మాన్ని అందిస్తాయని పరిశోధన వెల్లడించింది. మరి యవ్వన చర్మానికి దోహదపడే మొక్కల ఆధారిత ఆహారాలు ఏవంటే..నారింజ: ఇది విటమిన్ 'సీ'కి అద్భుతమైన మూలం. ఇది కొల్లాజెన్ సంశ్లేషణ, చర్మం మరమత్తులో కీలకపాత్ర పోషిస్తుంది. ముదురుఎరుపు రంగు కండ కలిగిన బ్లడ్ ఆరెంజ్లతో మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. సుమారు 20 నుంచి 27 ఏళ్ల వయసు గల యువత 21 రోజుల పాటు ప్రతిరోజూ 600 ఎంఎల్ బ్లడ్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల డీఎన్ఏ నష్టం తగ్గడం తోపాటు విటమిన్ సీ, కెరోటినాయిడ్ల స్థాయిలు పెరిగినట్లు పరిశోధనలో వెల్లడైంది.టమోటాలు..దీనిలో లైకోపీన్ ఉంటుంది. ఇది చర్మానికి శక్తిమంతమైన యాంటీ ఆక్సీడెంట్లను అందిస్తుంది. పెద్దలు ప్రతిరోజు ఆలివ్నూనె తోపాటు 55 గ్రాముల టమోటా పేస్ట్ తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు గణనీయంగా తగగుతాయని పరిశోధనలో తేలింది. దీనిలో చర్మ నష్టం నుంచి రక్షించే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు సూర్యరశ్మి, కాలుష్యం, పర్యావరణ ఒత్తిళ నుంచి చర్మాన్ని రక్షించడంలో టమోటాలు సమర్థవంతంగా ఉంటాయని అన్నారు.బాదంపప్పుబాదంపపపులో మోనోఅన్శాచురేటెడ్ కొవ్వులు(ఎంయూఎఫ్ఏ), విటమిన్ ఈ, పాలీఫైనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మరక్షణకు దోహదం చేస్తాయి. రుతుక్రమం ఆగిపోయిన మహిళలు 16 వారాల పాటు మొత్తం రోజువారీ కేలరీల్లో 20% బాదంపప్పులు తీసుకోవడంతో గణనీయమైన మార్పులు కనిపించాయని అన్నారు. సోయబీన్స్..దీనిలో ఐసోఫ్లేవోన్లుగా పిలిచే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి ఈస్ట్రోజెన్తో సమానమైన నిర్మాణాలను కలిగి ఉంటాయి. రుతువిరతి సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం తోపాటు చర్మం పొడిబారడం, గాయలయ్యే అవకాశాలు ఎక్కుగా ఉంటాయట. ఎప్పుడైతే సోయాబీన్ తీసుకోవడం మొదలుపెడతామో..అప్పటినుంచి చర్మ స్థితిస్థాపకతలో మంచి మార్పుల తోపాటు ఆర్థ్రీకరణ పెరిగి గీతలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కోకోకోకోలో ఫ్లేవనోల్స్ నిండి ఉన్నాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరిచి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. పరిశోధనలో 24 వారాలపాటు ఓ వృద్ధ మహిళ ప్రతిరోజూ కోకో పానీయం తీసుకోవడంతో ఆమె చర్మంలో ముడతలు, గరుకుదనం తగ్గి యవ్వనపు కాంతి సంతరించుకుందని శాస్తవేత్తలు చెబుతున్నారు. అందువల్ల పోషకాలు అధికంగా ఉండే ఈ మొక్కల ఆధారిత ఆహారాలను డైట్లో చేర్చుకోవడం వల్ల చర్మ ఆర్థ్రీకరణ, స్థితిపాకత తోపాటు మొత్తం రూపాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్యకరమైన యవ్వన చర్మాన్ని ప్రోత్సహించడంలో కీలకంగా ఉంటాయని చెబుతున్నారు చర్మ నిపుణులు. (చదవండి: మహిళల రక్షణకు ఉపకరించే చట్టాలివే..) -
జోరు.. హుషారుగా : మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్-బ్యూటీఫుల్ ఆడిషన్స్
నగరంలో జరుగుతున్న మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ – బ్యూటీఫుల్ ఆడిషన్స్ ఆకట్టుకున్నాయి. మాసాబ్ ట్యాంక్లోని జేఎన్ఎఫ్ యూలో శుక్రవారం యువతులతో పాటు వివాహిత మహిళలకు ఈ ఆడిషన్స్ నిర్వహించారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో విభిన్న రంగాలకు చెందిన వారు ఈ పోటీల్లో హుషారుగా పాలుపంచుకున్నారు. కార్యక్రమంలో సినీనటుడు జోయల్, మిస్ ఇండియా రన్నరప్ నిషితా తదితర ఫ్యాషన్ రంగ ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ ఆడిషన్స్ ద్వారా ఎంపికైన వారు మార్చి 29న జరిగే ఫైనల్స్లో పోటీ పడతారని నిర్వాహకురాలు కిరణ్మయి అలివేలు తెలిపారు. – సాక్షి, సిటీబ్యూరో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి : హైదరాబాద్ : ఆకట్టుకున్న మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ ఆడిషన్స్ (ఫొటోలు) శిల్పారామానికి గోల్డ్ గార్డెన్మాదాపూర్ : మాదాపూర్ శిల్పారామం అరుదైన పురస్కారాన్ని అందుకుంది. తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టీకల్చర్ ఎనిమిదో గార్డెన్ ఫెస్టివల్లో మాదాపూర్ శిల్పారామానికి ల్యాండ్స్కేప్ గార్డెన్ నిర్వహణకు గానూ గోల్డ్గార్డెన్ సర్టిఫికెట్, జ్ఞాపికను అందజేశారు. ఈ అవార్డు ఇచ్చినందుకు శిల్పారామం ప్రత్యేక అధికారి జి.కిషన్రావు సంతోషం వ్యక్తం చేశారు .డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టీకల్చర్ ఎనిమిదో ఫెస్టివల్లో ప్రదానం -
పువ్వులు పంచే అందం..!
ఈ సీజన్లో రకరకాల పువ్వులు మనకు కనువిందు చేస్తుంటాయి. అవి మన చర్మానికి, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. కొన్నింటి సువాసనల వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంటుంది. మరికొన్ని పువ్వులు బ్యూటీ ట్రీట్మెంట్లలో చేరి, తమ గొప్పతనాన్ని చాటుతుంటాయి. బంతిపువ్వులు క్రిమినాశకంగా పనిచేస్తాయి. చర్మంపై దద్దుర్లు, చికాకులకు, మొటిమల సమస్యలు ఉన్నవారికి ఔషధంలా పనిచేస్తుంది. బంతి పువ్వు రేకలను కొద్దిగా నూరి, మొటిమలపై రుద్ది, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మొటిమల సమస్య దూరం అవుతుంది. లావెండర్ మనసుకు శాంతిని కలిగించడంలోనూ, చర్మానికి యాంటీ బాక్టీరియల్గానూ ఉపయోగపడుతుంది. మసాజ్ల కోసం లావెండర్ నూనెలు, చర్మం డీ హైడ్రేట్ కాకుండా లావెండర్ వాటర్ స్ప్రే చేస్తే తిరిగి కళగా మారుతుంది.మల్లెలతో చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. పొడి చర్మం గలవారు జాస్మిన్ ఆయిల్, జాస్మిన్ ఫేస్ ప్యాక్లు వాడితే మృదువుగా మారుతుంది. ఒత్తిడి ఉపశమనానికి జాస్మిన్ సువాసనలు ఎంతో మేలు చేస్తాయి. గులాబీ – లావెండర్ ఫ్లవర్ ప్యాక్ కప్పు రోజ్ వాటర్, టీస్పూన్ ఎండిన లావెండర్ పువ్వులు, 5–6 చుక్కల లావెండర్ నూనె తీసుకోవాలి. రోజ్ వాటర్ను మరిగించి, ఎండిన లావెండర్ పువ్వులను అందులో వేయాలి. కొద్దిసేపు అలాగే ఉంచి, మిశ్రమాన్ని చల్లబరచాలి. తర్వాత వడకట్టి, ఏదైనా నూనె కలిపి రాసుకోవచ్చు. మందార పువ్వులు నిస్తేజంగా ఉన్న శిరోజాలకు కండిషనర్గా ఉపయోగపడి మెరుపును తీసుకువస్తాయి. మాడుపై ఉండే చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. గుప్పెడు మందార పువ్వులను తీసుకొని, వాటిని మెత్తని పేస్ట్లా తయారు చేసి,అందులో కొద్దిగా పెరుగు కలిపి తలకు ప్యాక్ వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. పొడిబారి ఉన్న శిరోజాలు మృదువుగా అవుతాయి. ‘గులాబీపువ్వులలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకే కాదు ఔషధంగా పనిచేసే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. టోనర్గా రోజ్వాటర్, ఫేస్ మాస్క్లు, చర్మ సంరక్షణలో రోజ్ ఆయిల్ను ఉపయోగించవచ్చు. (చదవండి: అరుదైన కేసు: ఆ తల్లి కవలలకు జన్మనిచ్చింది..అయితే డీఎన్ఏ టెస్ట్లో..!) -
అందం అసూయపడుతుందని ఇలా మార్చేశారా?.. ఈమె ఎవరో గుర్తుపట్టారా? (ఫోటోలు)
-
యవ్వన కాంతితో కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఉండాలంటే..
వయసు పెరిగే కొద్ది, చర్మంలో చాలా మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా కంటి చుట్టూ నల్లటి వలయాలు, మచ్చలు, గీతలు, ముడతలు అందాన్ని చెడగొడుతుంటాయి. అలాంటి సమస్యకు చెక్ పెడుతుంది ఈ ‘ఐ రీజెనరేటింగ్ టూల్’. దీన్ని వినియోగించడంతో కళ్లు మిరుమిట్లు గొలిపే అందంతో మృదువుగా మారతాయి. ముఖం యవ్వనకాంతితో మెరుస్తుంది.ముందుగా కళ్ల కింద చర్మానికి అనువైన క్రీమ్స్, సీరమ్స్ అప్లై చేసుకుని, అనంతరం ఈ డివైస్ సాయంతో మసాజ్ చేసుకోవాలి. కేవలం క్రీమ్ అప్లై చేసి వదిలేయడానికీ, క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఈ టూల్తో మసాజ్ చేయడానికీ తేడా స్పష్టంగా కనిపిస్తోందని, ఈ టూల్ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తోందని చాలా మంది వినియోగదారులు రివ్యూస్ ఇస్తుండటంతో ఇలాంటి పరికరాలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది.ఈ పరికరంతో క్రీమ్ లేదా సీరమ్ను కంటి కింద అప్లై చేసుకుంటే, చర్మం 53 శాతం వేగవంతం రికవరీ అవుతోందట! నల్లటి వలయాలను 18 శాతం, పొడిబారిన చర్మం 32 శాతం, గీతలు, ముడతలు 16 శాతం తగ్గుతున్నాయని ఐ రీజెనరేటింగ్ టూల్ని రూపొందించిన కంపెనీ వెల్లడిస్తోంది. హె ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్తో, 38–42 డిగ్రీల సెల్సియస్ హీట్ థెరపీతో ఈ మసాజ్ డివైస్ పని చేస్తుంది. దీనిలోని లిఫ్టింగ్ మోడ్.. కంటి కండరాలను ఉత్తేజపరచేందుకు, కొలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి ఉపయోగపడుతుంది.ఈ మసాజ్ హెడ్ కంటికి అనువుగా, చికిత్సకు వీలుగా డబుల్–కాంటాక్ట్ ప్రాంగ్లతో రూపొందింది. దీని హెడ్పైన రెండు సెమీ–కర్వ్డ్ హైపోఅలెర్జెనిక్ మెటల్ ఎలక్ట్రోడ్ పోల్స్ ఉండటంతో మసాజ్ చేసుకునేటప్పుడు అవి కంటి చర్మంపై సున్నితంగా జారుతూ, మంచి ఫలితాన్ని ఇస్తాయి. (చదవండి: మెనోపాజ్లో నిద్రలేమితో సతమతమవుతున్నారా..? బీకేర్ఫుల్..!) -
చర్మం మృదువుగా కోమలంగా ఉండాలంటే..!
పొడి చర్మం గలవారు ఏ ఫేస్ ప్యాక్ పడితే అది వేసుకోవడం మంచిది కాదు. అందులోనూ వాళ్ల చర్మం డ్రైగా అయిపోయి, ర్యాషస్ ఈజీగా వచ్చేస్తాయి. అలాంటి వారు చర్మాన్ని తేమగా ఉంచి మృదువుగా చేసే ఫేస్ ప్యాక్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. వీళ్లు ఆయిల్తో కూడిన ప్యాక్లు ఉపయోగిస్తే చర్మం కోమలంగా మెరుస్తూ ఉంటుంది. అందుకోసం హెల్ప్ అయ్యే బెస్ట్ ఫేస్ ప్యాక్లు ఏంటో చూద్దామా..!.పూలలోని పుప్పొడి, నల్లనువ్వులు, బార్లీ గింజలు సమపాళ్లలో తీసుకొని, పొడి చేసి, ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని, తగినన్ని నీళ్లు కలిపి, ముఖానికి, శరీరానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మం మృదువుగా, కాంతిమంతంగా అవుతుంది. అర టీ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజర్లా ఉపయోగపడుతుంది. రోజ్వాటర్తో పోర్స్ శుభ్రపడి ముఖ చర్మం కాంతిమంతమవుతుంది. ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడిబారే చర్మతత్త్వం గలవారు మాయిశ్చరైజర్ గా ఉపయోగించవచ్చు. చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. కార్న్ఫ్లేక్స్ని పొడి చేసి అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దన చేయాలి. ఫలితంగా మృతకణాలు తొలగి΄ోయి, చర్మం మృదువుగా మారుతుంది. మూడు టీ స్పూన్ల కొబ్బరి నూనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నీళ్లు కలిపి మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక ముఖానికి రాసి, మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఆయిల్ ΄్యాక్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. (చదవండి: జుట్టు రాలిపోవడంతో 40 కిలోలు బరువు తగ్గింది..! 80/20 రూల్తో..) -
ఎమోషనల్ బ్యూటీ
అంకిత్ కొయ్య, నీలఖి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్యూటీ’. వర్ధన్ దర్శకత్వంలో వానరా సెల్యులాయిడ్, జీ స్టూడియోస్, మారుతీ టీమ్ ప్రోడక్ట్ పతాకాలపై అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ ఈ సినిమాను నిర్మించారు.ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు. ‘‘ఓ అందమైన ప్రేమకథతో పాటు మిడిల్ క్లాస్ ఎమోషన్స్ను ప్రేక్షకులు ఈ మూవీలో చూస్తారు’’ అని తెలిపింది యూనిట్. ఈ సినిమాకు సంగీతం: విజయ్ బుల్గానిన్. -
అందాన్ని చెడగొట్టే పులిపిరులను సులభంగా తొలగించుకోండిలా..!
ముఖం ఎంత అందంగా ఉన్నా, పులిపిరికాయలు వచ్చాయంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మొటిమలైతే రెండు మూడు రోజుల్లో నయమవుతాయి గాని, పులిపిరి వస్తే దానంతట అది తగ్గదు. పులిపిరులు ముఖంపై మాత్రమే కాకుండా, శరీరంలో చర్మపు మడతల్లో ఎక్కువగా ఏర్పడతాయి. అందాన్ని చెడగొట్టే పులిపిరుల సమస్యకు ఈ పరికరం చెక్ పెడుతుంది. ఇది ఎలాంటి నొప్పి లేకుండా, ఇతర దుష్ప్రభావాలేవీ లేకుండా పులిపిరులను సురక్షితంగా తొలగిస్తుంది. ఇది ఇంట్లో ఉన్నట్లయితే, పులిపిరులను తొలగించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లనక్కర్లేదు. శస్త్రచికిత్సలు, రసాయనిక చికిత్సలతో పనిలేకుండానే ఈ పరికరం సాయంతో పులిపిరులను సులువుగా తొలగించుకోవచ్చు.ఈ 2 ఇన్ 1 మైక్రో టు లాడ్జ్ ఆటో స్కిన్ ట్యాగ్ రిమూవర్ కిట్లో.. 2 మిమీ – 8 మిమీ సైజుల్లోని చాలా రకాల బ్లేడ్స్ ఉంటాయి. వాటిని అవసరాన్ని బట్టి మార్చుకోవాల్సి ఉంటుంది. వాటికి అనువైన రెండు రకాల హెడ్స్ డివైస్తో పాటు లభిస్తాయి. వాటిని అడ్జస్ట్ చేసుకుని పులిపిరులను సులభంగా తొలగించుకోవచ్చు. పట్టుకోవడానికి, వాడుకోవడానికి ఈ పరికరం చాలా అనువుగా ఉంటుంది ఈ పరికరాన్ని ఉపయోగించి, పులిపిరులను తీసిన తర్వాత చర్మంపై మచ్చ ఉండిపోతుందేమోనన్న భయం అక్కర్లేదు. ఆ మచ్చలు కూడా చాలా వేగంగా తగ్గిపోతాయి. ఇలాంటి పరికరాలు మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి పరికరాలను నిపుణులను సంప్రదించి ఉపయోగించడం మంచిది. (చదవండి: ఉమ్మనీరు పోతే ఎలా తెలుసుకోవాలి?) -
కుర్రకారుని తెగ అట్రాక్ట్ చేస్తున్న లైలా హీరోయిన్ ఆకాంక్ష శర్మ అందాలు
-
కొత్త బిజినెస్లోకి అడుగుపెట్టనున్న అనన్య బిర్లా (ఫోటోలు)
-
కొత్త బిజినెస్లోకి అనన్య బిర్లా: ఇషా అంబానీకి పోటీ!?
అందానికి ప్రాధాన్యత ఇచ్చేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో.. చాలామంది ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు భారతీయ ధనవంతులలో ఒకరు.. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ 'కుమార్ మంగళం బిర్లా' పెద్ద కుమార్తె 'అనన్య బిర్లా' (Ananya Birla) చేరనున్నారు. ఈమె బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు.ఫిబ్రవరి 5న, అనన్య బిర్లా ఒక బ్యూటీ బ్రాండ్ను ప్రారంభించాలనే తన ప్రణాళికలను వెల్లడించింది. ఇది టాటాస్, హిందుస్తాన్ యూనిలీవర్ (HUL), లోరియల్ (L'Oréal) వంటి వాటితో పాటు ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ 'తిరా'కు కూడా పోటీ ఇవ్వనున్నట్లు సమాచారం.భారతదేశంలో అందానికి సంబంధించిన ఉత్పత్తుల వినియోగం పెరుగుతోంది. కాబట్టి ఈ రంగం ఏటా 10-11 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ఇది 2028 నాటికి 34 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. దీనిని దృష్టిలో ఉంచుకుని మేకప్, సువాసనలతో సహా అన్ని విభాగాలలో వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని.. దశలవారీగా తమ వ్యాపారం ప్రారంభమవుతుందని అనన్య బిర్లా వెల్లడించారు.అనన్య బిర్లా ప్రారంభించనున్న వెంచర్ పేరు, అది ఏ బ్రాండ్స్ అందిస్తుందనే విషయాలు అధికారికంగా వెల్లడికాలేదు. ప్రపంచ స్థాయి ఉత్పత్తులను భారత మార్కెట్కు తీసుకురావడం లక్ష్యంగా ఈ వెంచర్ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఈమె ప్రారంభించనున్న వ్యాపారానికి బాలీవుడ్ నటి 'జాన్వీ కపూర్' బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం.అనన్య బిర్లాఅనన్య బిర్లా.. ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత, దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన కుమార మంగళం బిర్లా కుమార్తె. సాంప్రదాయ వ్యాపారాలను విడిచిపెట్టి తనకంటూ సొంత మార్గాన్ని ఎంచుకుంది. ఒక్క బిజినెస్లోనే కాకుండా వివిధ రంగాల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు.. సింగర్, రైటర్ కూడా.అనన్య బిర్లా ముంబైలోని అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది. ఆ తరువాత యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉన్నత చదువులు చదివింది. చదువు పూర్తయిన తరువాత ప్రారంభించిన 'స్వతంత్ర మైక్రోఫైనాన్స్' సంస్థ గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అల్పాదాయ వర్గాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సేవలను అందిస్తోంది. ఈ సంస్థకు ఆమె సీఈవోగా కూడా ఉన్నారు. అలాగే క్యూరోకార్టే అనే లగ్జరీ ఈ-కామర్స్ సంస్థను కూడా ఆమె ప్రారంభించారు. హస్త కళాకృతులు, శిల్పకళా ఉత్పత్తులను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది.ఇదీ చదవండి: రతన్ టాటా ఫ్రెండ్.. శంతనుకు టాటా మోటార్స్లో కీలక బాధ్యతలుస్వతంత్ర మైక్రోఫిన్అనన్య బిర్లా తన 17ఏళ్ల వయసులోనే.. మైక్రో లెండింగ్ కంపెనీ 'స్వతంత్ర మైక్రోఫిన్' ప్రారంభించింది. ఈ సంస్థ ఇప్పుడు దేశంలోని రెండో అతిపెద్ద ఎన్బీఎఫ్సీ ఎంఎఫ్ఐగా రికార్డ్ సృష్టించింది. అంతే కాకుండా ఈమె ఏఐ ప్లాట్ఫామ్ బీటా వెర్షన్ను కూడా ప్రారంభించింది. ఇప్పుడు ముచ్చటగా మూడో వెంచర్ ప్రారభించడానికి సిద్ధమైంది. -
నిమ్మరసంతో గురకకు చెక్పెట్టండి..!
భారతదేశంలోని అనేక మెట్రోపాలిటన్ నగరాల్లో నివసించే ప్రజలు సరైన నిద్రపోవడం లేదని ఓ సర్వేలో తేలింది. అంటే ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు నిద్రలేమి వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దేశంలోని 59 శాతం మంది ప్రజలు రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారు. మొబైల్ వాడకమే అందుకు కారణం. నిమ్మరసం రోజూ తాగటం వలన మ్యూకస్ ఉత్పత్తి అదుపులో ఉండి గురకలను తగ్గిస్తుంది. ఒక చెంచా తాజా నిమ్మరసాన్ని రోజు ఉదయాన తాగటం వల్ల ఈ గురకల నుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా, చక్కెర కలపని నిమ్మరసం మీ శ్వాస గొట్టాలను శుభ్రంగా ఉంచి దగ్గు, జలుబులకు దూరంగా ఉంచుతుంది.స్నానం చేసేటప్పుడు శరీరానికి సోప్ అప్లై చేశాక లూఫాతో రుద్దుతుంటాం. అయితే చాలాసార్లు స్నానం తర్వాత లూఫాను శుభ్రం చేయకుండా వదిలేస్తాం. మరుసటి రోజు మళ్లీ అదే లూఫాతో ఒంటిని రుద్దుతాం. ఇలా చేయడం వల్ల ఆ లూఫాలో పేరుకు పోయిన బాక్టీరియా శరీరాన్ని చేరి అలర్జీ సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి లూఫాను శుభ్రం చేశాకే వాడాలి. (చదవండి: కోటీశ్వరుడిగా అవ్వడమే శాపమైంది..! మానసిక అనారోగ్యంతో..) -
సెలబ్రిటీ సీక్రెట్: అద్భుతమైన వెయిట్ లాస్ డ్రింక్!
పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ జ్యూస్ను తీసుకుంటే బరువు తగ్గడమే కాదు బాడీ మొత్తం డిటాక్స్ కూడా అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం... ఆ జ్యూస్ ఏంటీ..? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి..? వంటి విషయాలపై ఓ లుక్కేసేద్దామా..ముందుగా ఒక క్యారెట్, ఒక కీర దోసలను తీసుకోవాలి. వాటికి చెక్కు తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పియర్ పండును కూడా తీసుకుని ముక్కలుగా తరుక్కోవాలి. ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, కీరదోస ముక్కలు, పియర్ పండు ముక్కలు, గింజ తొలగించిన మూడు ఖర్జూరాలు, చిటికెడు పింక్ సాల్ట్, చిటికెడు దాల్చిన చెక్క ΄÷డి, ఒకటిన్నర గ్లాసుల నీళ్ళు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.అంతే! రుచికరమైన, ఆరోగ్యకరమైన క్యారెట్–కీర–పియర్ జ్యూస్ సిద్ధమైనట్లే. ఈ జ్యూస్ను రోజూ ఉదయాన్నే తీసుకోవడం వల్ల అందులో ఉండే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర ΄ోషకాలు శరీరంలోని వ్యర్థాలను తొలగించి బాడీని డిటాక్స్ చేస్తాయి. అలాగే అధిక కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి. అతి ఆకలి సమస్యను దూరం చేస్తాయి. కాబట్టి, ఎవరైతే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారో.. వారు తప్పకుండా ఈ జ్యూస్ను తీసుకునేందుకు ప్రయత్నించండి. ఇదీ చదవండి: చిన్నపుడే పెళ్లి, ఎన్నో కష్టాలు, కట్ చేస్తే.. నిర్మలా సీతారామన్కు చేనేత పట్టుచీర Union Budget 2025 మఖానా ట్రెండింగ్ : తడాఖా తెలిస్తే అస్సలు వదలరు! -
గ్లోబల్ పాప్ స్టార్ జెన్నీ స్కిన్ కేర్ సీక్రెట్ : రెండే రెండు ముక్కల్లో!
అందమైన, మెరిసే చర్మం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ఇది వారి వారి జీవన శైలి, జెనెటిక్ ప్రభావాలు, పని పరిస్థితులు, మానసిక, శారీరక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఉన్న రంగు, ప్రకాశవంతమైన చర్మాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి చాలా శ్రమ, ఓర్పు అవసరం అనడంలో ఆశ్చర్యం లేదు. దీని కోసం సెలబ్రిటీలు చాలా కేర్ తీసుకుంటారు. వారిలో గ్లోబల్ పాప్ స్టార్, జెన్నీ కిమ్ ఒకరు. కిమ్ లాంటి షైనింగ్ స్కిన్ కావాలంటే ఏం చేయాలి? తెలుసుకుందామా?గ్లోబల్ స్టార్, జెన్నీ కిమ్ ముఖం మచ్చలేని చంద్రబింబంలా మెరిసిపోతూ ఉంటుంది. బ్లాక్పింక్గా పేరొందిన జెన్సీ మచ్చలేని, మెరిసే చర్మానికి పాపులర్. అసలు ఆమె స్కిన్ టోన్ చూసిన సౌందర్య నిపుణులు, అభిమానులు ఆశ్చర్యపోతారంటే అతిశయోక్తి కాదు. అంత అద్భుతమైన ముఖ సౌందర్యం ఆమె సొంతం.చర్మ సంరక్షణకోసం ఆమె ఏం చేస్తుంది?జెన్నీ సహజమైన మెరుపు కోసం, చర్మ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. స్కిన్కేర్కు ఆమె అనుసరించే పద్ధతులు చాలా సరళమైనవి, పైగా ప్రభావ వంతమైవి. ఏదైనా పెద్ద ఈవెంట్లకు ముందు ఆమె ముఖాన్ని ఐసింగ్ (ఐస్వాటర్లో ఫేస్ను ముంచడం) చేస్తుంది. డబుల్ క్లెన్సింగ్, ఎక్స్ఫోలియేషన్ వంటి ముఖ్యమైన పద్ధతులను పాటిస్తుంది. ప్రీ-ఈవెంట్ బ్యూటీ హ్యాక్ సందర్భంగా తన బ్యూటీ సీక్రెట్స్ను పంచుకుంది. ఖరీదైన ఉత్పత్తులే అవసరం లేదు, కేవలం ఐస్-కోల్డ్ వాటర్ లాంటివి కూడా సరిపోతాయని తెలిపింది.ఐస్ వాటర్ ట్రిక్ఏదైనా ప్రధాన కార్యక్రమానికి ముందు తన ముఖాన్ని ఐస్ వాటర్ గిన్నెలో కాసేపు ఉంచుతుంది. ఈ చర్మ సంరక్షణలో పురాతన ట్రిక్ తనకు చాలా ఇష్టమైనదనీ, ఇది చర్మాన్ని బిగుతుగా చేయడంతోపాటు, ఉబ్బును తగ్గించి, మెరుపును పెంచుతుందని తెలిపింది.ఈ టెక్నిక్ను స్కిన్కేర్ ప్రిపరేషన్ స్టెప్గా ఉపయోగిస్తున్నప్పటికీ, ప్రయోజనాలు మేకప్కు మించి అందంగా చేస్తాయని పేర్కొంది. అలాగే చల్లని నీరు రక్త నాళాలను టైట్ చేస్తుందనీ, చర్మాన్ని తాజాగా కనిపించేలా చేస్తుందని చెప్పింది. తద్వారా ముఖంలోని చర్మానికి తక్షణ బూస్ట్ ఇస్తుందని వివరించింది.హైడ్రేషన్ కోసం ఫేస్ మాస్క్జెన్నీ ఫేస్ మాస్క్లకు పెద్ద అభిమాని, హైడ్రేషన్ , పోషణను నిర్వహించడానికి ఈమాస్క్ వేసుకోవడం దినచర్యలో ఒక భాగంగా చేసుకుంటుందట. ఫేస్ మాస్క్లు, ముఖ్యంగా షీట్ మాస్క్లు, కొరియన్ స్కిన్కేర్లో ప్రధానమైనవి. ఇవి చర్మం తాజాగా ఉండటానికి సహాయపడతాయి.డీప్ క్లీన్ స్కిన్ కోసం డబుల్ క్లెన్సింగ్జెన్నీ స్కిన్కేర్ రొటీన్లో మరో ముఖ్యమైన భాగం డబుల్ క్లెన్సింగ్. దీని కోసం ముందుగా మేకప్, సన్స్క్రీన్ అదనపు నూనెలను తొలగించడానికి ఆయిల్ ఆధారిత క్లెన్సర్ను ఉపయోగిస్తుందట. ఆ తరువాత మురికి మలినాలను తొలగించడానికి వాటర్ ఆధారిత క్లెన్సర్ను వాడుతుంది. డబుల్ క్లెన్సింగ్ చర్మం అవసరమైన తేమను తొలగించకుండా పూర్తిగా శుభ్రంగా ఉండేలా చేస్తుంది.చదవండి: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : తీసుకున్నోడికి తీసుకున్నంత!స్మూత్ స్కిన్ కోసం రెగ్యులర్ ఎక్స్ఫోలియేషన్జెన్నీ తన చర్మాన్ని మృదువుగా , మృత చర్మ కణాలను తొలగించుకునేందుకు ఎక్స్ఫోలియేషన్ ( స్క్రబ్బింగ్) రొటీన్గా ఆచరిస్తుంది. ఎక్స్ఫోలియేటింగ్ పోర్స్ను ఓపెన్ చేసి, ఛాయను ప్రకాశవంతం చేస్తుంది. అలాగే మనం వాడే చర్మ సంరక్షణ ఉత్పత్తుల శోషణను మెరుగుపరుస్తుంది. అతిగా ఎక్స్ఫోలియేషన్ చేయడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి పరిమితంగా ఈ పద్థతిని పాటిస్తుంది. ఐ క్రీమ్లు , సీరమ్లుజెన్నీ స్కిన్కేర్ రొటీన్లో కీలకమైన భాగం ఐ క్రీమ్లు ,సీరమ్. ఐ క్రీమ్లు ద్వారా కంటికింద మచ్చలు, కళ్ల ఉబ్బులాంటి సమస్యలకు చెక్ పెడుతుంది. మరోవైపు, సీరమ్స్ ద్వారా స్కిన్ డ్రై అయిపోకుండా ఉంటుందని, హెల్తీగా ఉంటుందని తెలిపింది. వీటిన్నితోపాటు, పుష్కలంగా నీరు తాగుతుంది. ఇక కొరియన్ చర్మ సంరక్షణలో ముఖ్య భాగమైన ప్రతీరోజూ సన్స్క్రీన్ను వాడుతుంది. దీని ద్వారా అకాల వృద్ధాప్యాన్ని కాకుండా ఉంటుందనీ, అలాగే హానికరమైన UV కిరణాల నుండి చర్మానికి రక్షణఉంటుందని వివరించింది.ఇదీ చదవండి: సినిమాను మించిన సింగర్ లవ్ స్టోరీ : అదిగో ఉడుత అంటూ ప్రపోజ్! -
ఈ డివైజ్ ఇట్టే వయసుని దాచేస్తుంది..!
వయసును దాచుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వయసును దాచుకోవడం కుదరక ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారి కోసం అందుబాటులోకి వచ్చింది ఈ హోమ్ స్కిన్కేర్ టూల్. దీని పేరు లక్సేన్ బ్యూటీ ఫర్మాగ్లో బాడీ మైక్రోడెర్మాబ్రేషన్ డివైస్. ఇది ఇట్టే వయసును దాచేస్తుంది. యాంటీ ఏజింగ్, స్కిన్ టైటెనింగ్ వంటి ప్రయోజనాలను అందించే ఈ పరికరం శరీరంలోని ప్రతిభాగాన్నీ యవ్వనం తొణికిసలాడేలా తీర్చిదిద్దుతుంది. ఇది కాళ్లు, చేతులు, తొడలు, నడుము, వీపు, పొట్ట తదితర భాగాలకు చక్కని మర్దన అందిస్తుంది.అరచేతి పరిమాణంలో ఉండే ఈ పరికరం చర్మాన్ని తేలికగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. చర్మం బిగిని పునరుద్ధరిస్తుంది. మృతకణాలను తొలగించి, కొలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ముడతలను తగ్గిస్తుంది. ఈ పరికరం ముఖం సహా శరీర భాగాల్లోని చర్మం పైపొరను సున్నితంగా తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. చర్మంపై ముడతలు, వయసుతో వచ్చే మచ్చలు సహా చిన్నచిన్న సౌందర్య సమస్యలను తగ్గిస్తుంది. ఇది మంచి స్క్రబర్లా, బ్రష్లా పనిచేసి చర్మానికి కొత్త మెరుపునిస్తుంది.ఇది మన్నికైన, సరసమైన, సులభమైన మాన్యువల్ సాధనం కావడంతో దీనికి మార్కెట్లో డిమాండ్ ఉంది. వారానికి ఐదే ఐదు నిమిషాలు కేటాయించి.. పైనుంచి కింద వరకూ ఆయిల్ లేదా క్రీమ్ ఏదైనా అప్లై చేసుకుని, దీనిని రబ్ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. దీన్ని చాలా తేలికగా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని ఎక్కడికైనా వెంట తీసుకుని వెళ్లొచ్చు. ఈ పరికరాన్ని శుభ్రం చేసుకోవడం చాలా తేలిక. దీని ధర 149 డాలర్లు. అంటే 12,810 రూపాయలు. (చదవండి: షాదీ అంటే విధ్వంసం..! బారాత్ అటే బాంబ్!) -
రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో బ్యూటీ సెన్సేషన్ ప్రొడక్ట్..!
సౌందర్య ప్రియులు, బ్యూటీ ఇండస్ట్రీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫౌండేషన్ ప్రొడక్ట్ షీగ్లామ్(SheGlam) ఇండియాలో లాంచ్ అయ్యింది. మేకప్ ప్రియులు ఇష్టపడే ఈ ప్రొడక్ట్ని రిలయన్స్ రిటైల్(Reliance Retail)కు చెందిన టిరా(Tira) ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మేకప్ ప్రోడక్ట్స్లో ది బెస్ట్ షీగ్లామ్ ప్రొడక్ట్స్. బ్యూటీ ప్రియులు అత్యంత మెచ్చే ప్రోడక్ట్ ఇది. ఈ షీగ్లామ్ ప్రొడక్ట్స్లో గ్లో బ్లూమ్ లిక్విడ్ హైలైటర్, డైనమాట్ బూమ్ లాస్టింగ్ లిప్స్టిక్లు, స్కిన్ఫైనెట్ హైడ్రేటింగ్ ఫౌండేషన్ వంటి ఇతర ఉత్పత్తలు అందుబాటలో ఉంటాయి. ఇవి ముఖానికి చక్కటి అందమైన మేకప్(Make Up)ని ఇస్తాయి. అంతేగాక సరసమైన ధరలో లభించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ల, మేకప్ ఆర్టిస్ట్లు తక్కవ ధరలోనే మంచి నాణ్యతతో కూడిన ఉత్పత్తి లభిస్తుందని ప్రశంసించిన ప్రొడక్ట్ ఇది. ఇప్పుడు టిరాలో షెగ్లామ్ అరంగేట్రంతో అందాల ఔత్సాహికులకు చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది. సమగ్ర సౌందర్యానికి భారతదేశాన్ని గమ్యస్థానంగా చేసేలా టిరా ఈ ప్రొడక్ట్ లాంచ్తో బలపరుస్తోంది. యావత్తు ప్రపంచం మెచ్చిన ఈ బ్రాండ్ని టిరా వెబ్సైట్లో, యాప్లలో అందుబాటులో ఉంటుందని రిలయన్స్ రిటైల్ టిరా ప్రకటించింది. ఇక త్వరలో టిరా స్టోర్లలో కూడా అందుబాటులో ఉండనుందని పేర్కొంది.చర్మ సంరక్షణ జాగ్రత్తలు..ఎంతటి బ్రాండెడ్ ఉత్పత్తులైనా.. చర్మానికి సరిపోతుందో లేదో పరీక్షించాలిఅవసరమైతే చర్మ నిపణలను సంప్రదించి వినియోగించడం మంచిదిఏ బ్యూటీ ప్రొడక్స్ట్ అయినా.. అతిగా వాడితే ప్రమాదమేనిద్రించే సమయంలో తప్పనిసరిగా మేకప్ని తొలగించుకోవాలి. (చదవండి: మహాకుంభమేళాలో ఆకర్షణగా మరో వింత బాబా..ఏకంగా తలపైనే పంటలు..!) -
సోనాలి బింద్రే మెరిసే చర్మం రహస్యం ఇదే..!
ప్రముఖ మోడల్, నటి సోనాలి బింద్రే(Sonali Bendre) తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించి వేలాది అభిమానులను సొంతం చేసుకుంది. ఆమెకు బాలీవుడ్ నటిగానే ఎక్కువగా గుర్తింపు లభించింది. ఎందుకంటే ఎక్కువ సినిమాలు హిందీలోనే చేసింది. ఇక మన తెలుగులో అగ్ర హీరోల సరసన నటించి మంచి హిట్లతో ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. అంతేగాదు సోనాలి అత్యంత అందమైన నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అదీగాక చూడటానికి కుందనపు బొమ్మల ఆకర్షణీయంగా ఉంటుంది. ఓ ఇంటర్వ్వూలో ఆమె గ్లామర్ రహస్యం(beauty secret) గురించి షేర్ చేసుకంది. తన మెరిసే చర్మం రహస్యం ఆ మొక్కేనని అంటోంది.. మన భారతీయ సంప్రదాయంలో పూజలందుకునే ఈ మొక్క ఔషధ గుణాలను అందరూ ఉపయోగించుకోవాలని చెబుతోంది. అదేంటో చూద్దామా..!.ఐదు పదుల వయసులో అంతే గ్లామర్తో అభిమానులను ఫిదా చేస్తుంటారామె. ఆమె ముఖంలో ఉట్టిపడే కాంతి ఎవ్వరినైనా కట్టిపడేస్తుంది. అంతలా చర్మం ప్రకాశవంతంగా కనిపించేందుకు స్కిన్ కేర్ తీసుకుంటానని అన్నారు. మన భారతీయ సంప్రదాయంలో పూజలందుకునే వేప మొక్క తన మెరిసే చర్మానికి కారణమంటుంది. తాను రోజకి రెండసార్లు వేప ఉత్పత్తుల(Neem products)తో చర్మాన్ని శుభ్రపరుస్తానని అంటున్నారు. దీంతోపాటు తాను చేసే వ్యాయమం కూడా చర్మాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేయడంలో ఉపకరిస్తుందని చెబుతున్నారు. "మనం భారతీయులం కచ్చితంగా ఈ వేప మొక్క గుణాలను పిల్లలకు తెలియజేయాలి. ఈ మొక్కచేసే మాయాజాలం గురించి సవివరంగా చెప్పాలి. వేప చర్మానికే కాదు ఆరోగ్యానికి కూడా మంచిదే. తేమ వాతావరణంలో ఉండే వాళ్లకు వేప చాలా బాగా పనిచేస్తుంది. అయితే నేను బ్యూటీ ప్రొడక్ట్(Beauty Products)లను ఎక్కవగా ఉపయోగించను తరచుగా మాత్రం ముఖాన్ని శుభ్రపరుచుకోవడానికి బద్దకించను. అలాగే వీటి తోపాటు ఆర్యోగకరమైన ఆహారం తప్పనిసరిగా తీసుకుంటాను." అని చెబుతున్నారు సోనాలి. వేపతో కలిగే లాభాల..వేపని 'వండర్ హెర్బ్'గా చెబుతుంటారు. ఇది చర్మం, జుట్టు, రక్తం తదితర శరీర భాగాలన్నింటి శ్రేయస్సుకి సమర్థవంతమైనది. జీవశాస్త్రపరంగా దాదాపు 130 రకాలుగా ఉపయోగపడుతుందట. 2018లో ది హిమాలయ డ్రగ్ కంపెనీ వేప చర్మానికి ఒనగూర్చే ప్రయోజనాలు గురించి సవివరంగా వెల్లడించింది.ఆయుర్వేదంలో వేప చాలా ప్రభావవంతమైన మొటిమల నివారిణి.చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో కీలకంగా ఉంటుందటఅలాగే బ్లాక్/వైట్ హెడ్స్ని నివారిస్తుంది.దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా, హానికరమైన ప్రభావాలను తగ్గిస్తుందట. దద్దుర్లు, కాలిన గాయాల తాలుకా ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ముఖ్యంగా తేలికపాటి చర్మ సమస్యలను సమూలంగా నివారిస్తుందని చెబుతున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివారాలను వ్యక్తిగత వైద్య నిపుణలను సంప్రదించి అనుసరించడం ఉత్తమం. -
అలనాటి రాణుల బ్యూటీ సీక్రెట్ తెలిస్తే కంగుతింటారు..!
మెరిసే గ్లాస్స్కిన్ కోసం కే బ్యూటీ అంటూ రకరకలా బ్యూటీ ప్రొడక్ట్లు, సౌందర్య చిట్కాలు కోకొల్లలుగా వచ్చేస్తున్నాయి. అవన్నీ ఎలా ఉన్నా పూర్వకాలంలో కొందరు ప్రసిద్ధ రాణుల అందాల గరించి కవులు వర్ణించి చెప్పినట్లు కథకథలగా విన్నాం. అయితే ఆ రాణులు(Queens) ఆ కాలంలోనే తమ అందం కోసం ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో వింటే విస్తుపోతారు. అందుకోసం ఎలాంటి వాటిని సౌందర్య సాధనాలు(Beauty Secret)గా ఉపయోగించారో వింటో వామ్మో..! అని నోరెళ్లబెడతారు.క్లియోపాత్రా గాడిద పాలతో స్నానం..ఈజిప్ట్ టోలెమిక రాజ్యం రాణి క్లియోపాత్రా(Cleopatra) చర్మ సంరక్షణ కోసం గాడిద పాలతో స్నానం చేసేదట. అందుకోసం రోజు సేవకులు బిందెల కొద్ది గాడిద పాలను పితికి రెడి చేసేవారట. అవి విరిగిపోయాక వాటితో స్నానం చేసేదట. అందుకోసం దాదాపు 700 గాడిద పాలను వినియోగించేవారట. రోజంతో గాడిద పాల బాత్తో మునిగిపోయేదట. ఎలిసబెత్..దూడ మాంసం మాస్క్.. 'సిసి' అని పిలిచే ఆస్ట్రియా సామ్రాజ్ఞి ఎలిసబెత్(Elisabeth) 19 శతాబ్దంలో అందానికి ప్రసిద్ధి చెందిన రాణి. ఆమె మచ్చలేని తెల్లటి పింగాణీలా మెరిసే చర్మం కోసం స్ట్రాబెర్రీల ప్యాక్ ముఖానికి రాసేదట. అలాగే చర్మ ఆరోగ్యం కోసం ఆలివ్ నూనెతో స్నానాలు చేసేదట. ముఖ్యం కాంతిగా కనిపించాలని దూడ చర్మాన్ని మాస్క్గా వేసుకుని నిద్రించేదట. ఇక ఆమె వొత్తైన జుట్టు గురించి కథలుకథలుగా చెప్పుకునేవారట. ప్రతి మూడు వారాలకొకసారి పచ్చి గుడ్లు, బ్రాందీల మిశ్రమాన్ని అప్లై చేసుకునేదట. అది ఆరిపోయే వరకు మారథాన్లా వాక్ చేస్తూ ఉండేదని చరిత్రకారులు పేర్కొన్నారు. మేరీ ఆంటోయినెట్: పావురాలు ఉడికించిన నీళ్లు..ఫ్రాన్స్ రాణి మేరీ ఆంటోయినెట్(Marie Antoinette) అందం కోసం ఎన్నో విలక్షణమైన సౌందర్య సాధనాలను ఉపయోగించేది. ఆమె ముఖాన్ని యూ కాస్మెటిక్ డి పిజియన్తో కడుక్కునేదట. ఇది పండ్ల రసం, పూల సారం, మూడు ఫ్రెంచ్ రోల్స్, బోరాక్స్, 17 రోజల పాటు ఉడికించి పులియబెట్టిన ఎనిమిది పావురాల మిశ్రమం అట.ఎలిజబెత్ I: అత్యంత విషపూరితమైన సీసం..క్వీన్ ఎలిజబెత్ I(Elizabeth I) పాలనలో "వెనీషియన్ సెరూస్" అనే సీసాన్ని సౌందర్య సాధనంగా ఉపయోగించేవారట. ఈ సీసం(Lead), వెనిగర్ల మిశ్రమాన్ని తెల్లటి కాంతి వంతమైన రంగు కోసం చర్మానికి పూసేవారట. ఇవి చికెన్పాక్స్(తట్టు, అమ్మవారు) వంటి చర్మవ్యాధుల తాలుకా మచ్చలను నివారించి మచ్చలేని చర్మంలా ప్రకాశవంతంగా చేస్తుందట. అయితే ఈ రాణి చిన్నవయసులోనే అకాల మరణం చెందింది. అందుకు ఆమె ఉపయోగించిన ఈ సీసమే కారణమని అంటుంటారు. ఎందుకంటే లెడ్ సల్ఫైడ్(సీసం) ఖనిజ రూపమైన బ్లాక్ పౌడరే ఈ వెనీషియన్ సెరూస్. ఇది ముఖానికి పూస్తే లేత గులాబీ రంగు ఛాయతో మెరుస్తుంటుందట. అంతేగాదు కళ్లు చక్కగా కనిపించేలా ఐలైనర్లాగా కూడా వాడేవరట. అయితే ఇందులో ఉండే సీసం అత్యంత హానికరమైనది. ఇది అనారోగ్యం బారినపడేలా చేసి మరణానికి కారణమవుతుందంటూ ప్రస్తుతం బ్యాన్ చేశారు అధికారులు. (చదవండి: ఆ థెరపీ పేరెంట్స్ని అర్థం చేసుకోవడానికి సహాయపడింది..!: ఇరాఖాన్) -
హీరోయిన్ రమ్యకృష్ణ ఫిట్నెస్ రహస్యం.. ఇప్పటికీ అదే ఫాలో అవుతూ!
టాలీవుడ్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కథనాయికిగానూ, విలన్గానూ మెప్పించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న గొప్ప నటి. ఒక హీరోయిన్ విలన్ పాత్రలో నటిస్తే తన విలువ పడిపోతుందేమోనని చేసేందుకు ముందుకు రాని ఆ కాలంలో అలవోకగా చేసి ఆ అపోహను పారద్రోలింది. ఇలా రెండు పాత్రల ద్వారా ఎక్కువ ఆఫర్లు అందుకుని విలక్షణమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హీరో తల్లిపాత్రల్లోనూ కూడా అంతే గ్లామర్గా అదే ఫిట్నెస్తో అలరిస్తోంది. కుర్ర హీరోయిన్లకు తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. ఈ అందాల భామ వన్నెతరగని అందం వెనుకున్న రహస్యాన్ని ఆమె కుటుంబ సభ్యుడు, డాక్టర్ గుగనాథ్ శివకదక్షమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అదెంటో తెలుసుకుందామా..!.ఐదు పదుల వయసు దాటిన తర్వాత లీన్ కండరం అనేది బంగారం కంటే విలువైనదని చెబుతున్నారు కార్డియాలజిస్ట్ వైద్యుడు శివకదక్షమ్(Guganath Sivakadaksham). మెడిటేరియన్ డైట్(అడపాదడపా ఉపవాసం)తో బాడీని ఫిట్గా ఉంచుతుందని చెప్పారు. అందాల బామ రమ్యకృష్ణ(Ramya Krishnan) కూడా ఈ డైట్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. అలాగే నటి రమ్య యోగా, తేలికపాటి కార్డియో వెయిట్ ట్రైనింగ్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. జిహ్వ చాపల్యాన్ని అదుపులో ఉంచుకుంటుందట. అలాగే వర్కౌట్లలో తప్పనిసరిగా బరువులు ఎత్తే వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తుందని అన్నారు. ఇవి ఆమె కండరాలను బలోపేతం చేసి మజిల్స్(muscle) స్ట్రాంగ్గా ఉండేలా చేస్తాయట. అందువల్ల ఆమె బాడీ షేప్అవుట్ అవ్వకుండా ఉందని చెప్పారు. అలాగే యాభై ఏళ్లు దాటక బాడీలో లీన్ కండర ద్రవ్యరాశి తగ్గి ఎముకలు పటుత్వం కోల్పోయి శరీరం ఆకృతి మారిపోతుందట. అందువల్ల ఇలాంటి శక్తిమంతమైన వ్యాయమాలతో కండరాలను బలోపేతం చేసుకుంటే ఎముకలకు సంబంధించిన గాయాలను నివారించగలుగుతామని అన్నారు. ముఖ్యంగా మహిళలకు మెనోపాజ్ దశ(menopause)లో ఎముకలు, కీళ్లకు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. అందువల్ల ఇవి తప్పనరిగా చేయాల్సిన పవర్ఫుల్ వ్యాయామాలు. అంతేగాదు ప్రతి సెషన్లో ఈవ్యాయామాలు కనీసం 6-12 సార్లు రిపీట్ చేయాలన్నారు. తద్వారా కండరాల క్షీణతను నివారించగలమని తెలిపారు. దీంతోపాటు అందుకు తగ్గా డైట్ కూడా ఉండాలన్నారుడైట్(diet)..పోషకాహారం పరంగా కండరాల మరమత్తు, పెరుగుదలకు తోడ్పడేలా అధిక ప్రోటీన్ ఆహారాన్ని తీసుకోవాలి. కోళ్లు, చేపలు, పాల ఉత్పత్తులు వంటి ఆహారాలను తప్పనిసరిగా డైట్లో భాగమయ్యేలా చూడాలి. ఈ వ్యాయామాలను శిక్షగా కాకుండా శరీరాన్ని పిట్గా ఉంచేలా ఎంజాయ్ చేస్తూ చేయాలని చెబుతున్నారు. ఎక్కువ కండరాల ద్రవ్యరాశి అనేది కీళ్ల పనితీరు, కదలిక సామర్థ్యాలను పెంచుతుంది. అలాగే ఇది బరువు నిర్వహణలో కూడా సహాయపడుతుందట. అంతేగాదు ఇది మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలను దూరం చేస్తుందని చెబుతున్నారు వైద్యుడు శివకదక్షమ్ . కాబట్టి యాభైలలో కూడా ఫిట్గా, గ్లామర్గా ఉండేలా అందాల భామ రమ్య కృష్ణలా వర్కౌట్లే చేసేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. View this post on Instagram A post shared by Guganath Sivakadaksham (@idoctorg)s (చదవండి: మూడు పూటలా భోజనం, నడకతో ఏకంగా 124 ఏళ్లు..!) -
కిక్ బాక్సింగ్తో రష్మిక...ఫ్లెక్సిబులిటీ కోసం జాన్వీ...!
బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా సినీ తారలంతా ఇప్పుడు వర్కవుట్స్ మీద దృష్టి పెడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఫిట్గా కనిపిస్తున్నారు. తారలే స్వయంగా ఇంటర్వ్యూల్లో వెల్లడించిన ప్రకారం... కొందరు తారల గ్లామర్–ఫిట్నెస్ రొటీన్ ఇదీ...ఫ్లెక్సిబులిటీ కోసం ఈ బ్యూటీ... చుట్టమల్లే చుట్టేత్తాంది తుంటరి చూపు అంటూ టాలీవుడ్ దేవరను ప్రేక్షకుల్ని ఒకేసారి కవ్వించిన జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ తెరపై గ్లామర్ డోస్ని విజృంభించి పంచే హీరోయిన్స్లో టాప్లో ఉంటుంది. తన తల్లి శ్రీదేవిలా కాకుండా పూర్తిగా అందాల ఆరబోతనే నమ్ముకున్న ఈ క్యూటీ...దీని కోసం ఫిజిక్ ను తీరైన రీతిలో ఉంచుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తించింది. తన శరీరపు ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవడానికి స్ట్రెచింగ్, ట్రెడ్మిల్ లపై దృష్టి పెడుతుంది. తన ఫిట్నెస్ రొటీన్లో బెంచ్ ప్రెస్లు, డెడ్లిఫ్ట్లు, స్క్వాట్లు, షోల్డర్ ప్రెస్లు పుల్–అప్ల ద్వారా బాడీ షేప్ని తీర్చిదిద్దుకుంటుంది. టిని ఆమె రోజువారీ వ్యాయామాలు ఆమె టోన్డ్ ఫిజిక్ను నిర్వహించడానికి మాత్రమే కాదు ఆమె కండరాలలో బలాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడతాయి.‘కిక్’ ఇచ్చేంత అందం...వత్తుండాయి పీలింగ్సూ, వచ్చి వచ్చి చంపేత్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సూ... అంటూ పుష్పరాజ్ మాత్రమే కాదు ప్రేక్షకులు సైతం తనను చూసి పిచ్చెత్తిపోవాలంటే ఏం చేయాలో రష్మికకు తెలుసు. అందుకే వారానికి 4–5 సార్లు జిమ్కి వెళుతుందామె. ఆమె ఫిట్నెస్ రొటీన్లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్, కార్డియోతో పాటు ముఖ్యంగా నడుం దగ్గర ఫ్యాట్ని పెంచనీయని, అదే సమయంలో క్లిష్టమైన డ్యాన్స్ మూమెంట్స్కి ఉపకరించే కోర్ వర్కౌట్లు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఫిట్గా ఉండటానికి ఇంట్లో పవర్ యోగా, స్విమ్మింగ్ చేస్తుంది. ఇటీవలే రష్మిక తన ఫిట్నెస్ మెనూలో అధిక–తీవ్రత గల కిక్బాక్సింగ్ సెషన్లను కూడా చేర్చుకుంది, ఇది తన ఒత్తిడిని తగ్గించడానికి, కేలరీలను బర్న్ చేయడానికి ఆమె జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది.దీపికా...అందం వెనుక...జవాన్ సినిమాలో దీపికా పదుకొణెను చూసినవాళ్లు తెరపై నుంచి కళ్లు తిప్పుకోవడం కష్టం. పెళ్లయిన తర్వాత ఈ ఇంతి ఇంతింతై అన్నట్టుగా మరింతగా గ్లామర్ హీట్ను పుట్టిస్తోంది. ఇంతగా తన అందాన్ని తెరపై పండించడానికి తీరైన ఆకృతి చాలా అవసరమని తెలిసిన దీపిక.. దీని కోసం బ్లెండింగ్ యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కార్డియోను సాధన చేస్తుంది. అవే కాదు... స్విమ్మింగ్, పిలాటిస్, వెయిట్ ట్రైనింగ్ కూడా చేస్తుంది, ఆమె శారీరక థృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతనిస్తూ తన వర్కవుట్ రొటీన్ను డిజైన్ చేసుకుంటుంది.కార్డియో...ఆలియా...ఆర్ఆర్ఆర్ సినిమాలో మెరిసిన బ్యూటీ క్వీన్ అలియా భట్ తాజాగా జిగ్రా మూవీతో ప్రేక్షకుల్ని మెప్పించింది. అటు గ్లామర్, ఇటు యాక్షన్ రెండింటినీ పండించే ఈ థర్టీ ప్లస్ హీరోయిన్.. ఫిట్గా ఉండటానికి కార్డియో అవసరమని అర్థం చేసుకుంది. అది ట్రెడ్మిల్పై నడుస్తున్నా లేదా స్పిన్నింగ్ చేసినా, ఆమె స్టామినాను పెంచుకోవడంపైనే దృష్టి పెడుతుంది వర్కవుట్స్లో ఆటల్ని కూడా మిళితం చేసే అలియా తాజాగా పికిల్ బాల్ ఫ్యాన్ క్లబ్లోని సెలబ్రిటీస్ లిస్ట్లో తానూ చేరింది.కత్తిలా..కత్రినా..తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన కనిపించిన మల్లీశ్వరి కత్రినా కైఫ్...నాజూకు తానికి మరోపేరులా కనిపిస్తుంది. మైనేమ్ ఈజ్ షీలా, చికినీ చమేలీ వంటి పాటల్లో కళ్లు తిరిగే స్టెప్స్తో అదరగొట్టిన కత్రినా.. తన వ్యాయామాల్లో డ్యాన్స్, పిలాటì స్, యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ల సమ్మేళనాన్ని పొందుపరిచింది. అందమైన ఆ‘కృతి’...ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన సీత...కృతి సనన్ అంతకు ముందు దోచెయ్ సినిమా ద్వారానూ తెలుగు తెరకు చిరపరిచితమే. అద్భుతమైన షేప్కి కేరాఫ్ అడ్రస్లా కనిపించే ఈ పొడగరి... తన శరీరాన్ని సన్నగా బలంగా ఉంచుకోవడానికి పిలాటిస్, కోర్ వర్కౌట్లతో శ్రమిస్తుంటుంది. వ్యాయామాల ద్వారా తన పోస్చర్ను మెరుగుపరచడానికి కూడా ఈమె తగు ప్రాధాన్యత ఇస్తుంది. -
చలికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన ‘సూపర్ పండు’ ఎన్ని లాభాలో!
ప్రకృతి చాలా మహమాన్వితమైంది. సీజన్కు తగ్గట్టు మనకు ఎన్నో అద్భుతమైన ఫలాలను అందిస్తుంది. అందుకే ఏ కాలంలో దొరికే పళ్లు, కూరగాయలు ఆకాలంలో విరివిగా తినాలని పెద్దలు చెబుతారు. మరి శీతాకాలంలో మాత్రమే దొరికే ఒక అద్భుతమైన చిట్టి పండు గురించి తెలుసుకుందాం. రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఏమిటా పండు? దాని లాభాలేంటి? చూద్దామా. శీతాకాలంలో మాత్రమే దొరికే రేగి పండు(jujube fruit)తీపి పులుపు కలగలిపిన అద్భుతమైన రుచి. చూడ్డానికి చిన్నగా కనిపించినా పోషక విలువలు మాత్రం మెండుగా లభిస్తాయి. అందుకే ఆయుర్వేద చికిత్సలో, ఔషధాల్లో ప్రాముఖ్యత కూడా ఉంది. రేగు పండ్లు తరచూ జ్వరం, జలుబు రాకుండా చేస్తాయి. తలనొప్పి, డయేరియా, రక్త విరేచనాలను అరికట్టడానికి రేగి చెట్టు బెరడును ఉపయోగిస్తారు. బెరడు కషాయం మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది.ఈ పండ్లను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతగానో ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా రేగు పళ్లతో చేసే ఒడియాలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్కసారి అలవాటు పడితే తినకుండా ఉండలేం. వీటి రుచి మహాగమ్మత్తుగా ఉంటుంది. రేగి పళ్ళపై ఉప్పు కారం చల్లుకుని తింటారు. ఇంకా వీజామ్లూ, జెల్లీలూ, జ్యూస్, టీ, వినెగర్, క్యాండీలూ లాంటి వాటిని కూడా తయారు చేస్తారు. రేగుపళ్లలో పురుగులు బాగా ఉంటాయి. చూసుకొని తినాలి రేగు పండ్లలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ కారణంగా శరీరం దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. రేగిపండులో ఉన్న పోటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.రక్తహీనతతో బాధపడేవారికి రేగుపళ్లు చాలా మేలు చేస్తాయి. గర్భిణీ స్త్రీలు కూడా తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే వేవిళ్లు, వాంతుల సమయంలో రేగుపళ్లుతో తయారు చేసిన రేగుపళ్లను కొద్ది కొద్దిగా చప్పరిస్తూ ఉంటే నోటికి పుల్లగా బావుంటుంది. అలాగే వాంతులు కూడా తగ్గే అవకాశాలున్నాయి. అద్బుతమైన ప్రయోజనాలురేగిపండులోని విటమిన్ సీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ పళ్లలోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని వైరస్లు, బాక్టీరియా వంటి హానికరమైన సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తాయి శీతాకాలంలో వచ్చే సీజనల్ జలుబు, దగ్గు వంటి ఇతర ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. సహజసిద్ధమైన చక్కెరలు , బీ విటమిన్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.రక్తహీనతను (Anaemia) నివారిస్తుంది. రేగిపండులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా రక్తహీనత తగ్గుతుంది. అనీమియాసమస్యలతో బాధపడేవారు కొన్ని రేగిపండ్లను రోజూ తీసుకుంటే రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు.రేగిపండులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని పాడతాయి. ముఖంపై మచ్చలు, ముడతలు , తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి,చర్మానికి మెరుపునిస్తుంది. సౌందర్యం కోసం రేగిపండును ఫేస్ ప్యాక్ లాగా కూడా ఉపయోగిస్తారు.అంతేనా...ఇంకాదీర్ఘకాలిక ఆందోళన, ఒత్తిడితో బాధపడేవాళ్లకి రేగుపండ్లు ఔషధంలా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లు తింటే డిప్రెషన్ దూరం అవుతుంది. అలాగే నిద్రలేమి (Insomnia) సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ మతిమరుపూ ఆల్జీమర్స్ రాకుండానూ అడ్డుకుంటుందని ఒక అధ్యయనంలో తేలింది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ (Phytochemicals) వల్ల రక్తంలో ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రేగిపండును (మితం) తీసుకోవచ్చు.రేగిపండులో కూడా క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. కనుక బరువు పెరుగుతామనే బెంగ అవసరం లేదు. పైగా ఇది కడుపుని తేలికగా,తృప్తిగా ఉంచుతుంది. రేగిపండులో కేల్షియం, ఫాస్పరస్, మ్యాగ్నీషియం ఎముకలను బలపరుస్తాయి. ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల సమస్యలకు ఉపశమనం పనిచేస్తాయి.రేగిపండులో యాంటీ-క్యాన్సర్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాల వృద్ధిని నియంత్రిస్తాయి . ప్రత్యేకంగా బ్రెస్ట్ క్యాన్సర్ , లివర్ క్యాన్సర్ ముప్పును తగ్గించే అవకాశం ఉంది.ఎవరు తినకూడదుయాంటీ డిప్రెసెంట్ మందులువాడేవారుమూర్చ వ్యాధితో బాధపడుతున్న వారుస్కిన్ అలెర్జీ, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నవారు.ఆస్తమా వ్యాధితోబాధపడుతున్నారు కూడా రేగుపళ్ళను అతిగా తినకూడదు.ఎక్కువగా తింటే విరేచనాలు అయ్యే ప్రమాదముంది గనుక, ఇప్పటికే ఈ సమస్యతో బాధపడేవారు కూడా దూరంగా ఉండాలి. నోట్: ఇది అవగాహన కోసం అందించిన మాత్రమే. ఏదైనా అతిగా తినకూడదు. అతిగా తింటే కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు. గొంతులో కఫం పెరగడం, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. -
ఇలాంటి మేకప్ నైపుణ్యం ఉంటే ఏ వధువైనా అదుర్స్..!
మేకప్ అనగానే వేసుకున్నప్పుడూ అతిలోక సుందరిలా..తీసేశాక ఆమెనా అన్నంత సందేహం వస్తుంది. ముఖ్యంగా కలర్ తక్కువగా ఉండే వాళ్ల గురించి ఇక చెప్పాల్సిన పని లేదు. అందుకే చామనఛాయా ఉన్న చాలమంది వధువులు, కాస్త రంగు తక్కువగా ఉన్నవారు మేకప్ వేసుకునేందుకు సుముఖత చూపించరు. ఎందుకంటే మేకప్ తర్వాత వాళ్ల లుక్ మారిపోతుంది. దీంతో ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అదే తమ రంగుకి అనుగుణమైన మేకప్తో అందంగా కనిపించేలా చేస్తే ఆత్మవిశ్వాసంగా, నిండుగా ఉంటుంది. అలాంటి మేకప్ నైపుణ్యంతో ఇక్కడొక కళాకారిణి అందరి హృదయాలను దోచుకుంటోంది. ఎవ్వరైనా ఆమె మేకప్ నైపుణ్యతకు ఫిదా అయిపోతారు. ఇంతకీ ఎవరంటే ఆమె..!చెన్నై(Chennai)కి చెందిన మేకప్ ఆర్టిస్ట్(makeup artist) నిర్మలా మోహన్ స్కిన్ టోన్కు సరిపోయే మేకప్లతో ఆకట్టుకుట్టోంది. రంగు తక్కువగా ఉన్నా కూడా ఇనుమడింప చేసే మేకప్తో అందంగా కనిపించేలా చేస్తోంది. అందానికి అసలైన నిర్వచనం చెప్పేలా మేకప్ నైపుణ్యంతో ఫిదా చేస్తోంది. చర్మం కలర్(skin colour) నలుపుగా ఉన్నవాళ్లని తెల్లగా కనిపించేలా మేకప్ వేస్తారు చాలామంది. ఆ తర్వాత అసలు రంగు ఇదా అని ముఖం మీదే అనడంతో కలర్ తక్కువగా ఉండే అమ్మాయిలు మేకప్ వేసుకునేందుకు భయపడుతున్నారు. అలా కాకుండా వారి రంగుకి సరిపోయే మేకప్తో వాళ్ల చర్మం రంగులోనే మరింత అందంగా కనిపించేలా తీర్చిదిద్దితుంది నిర్మల. ఇదే ఆమె బ్యూటీ ట్రిక్కు. అందుకు సంబంధించిన వీడియోలను ఇన్స్టాలో షేర్ చేయడంతో అందరూ ఆమె కళా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Nirmala Mohan 💃🏻 (@nirmala_makeupartistry) ఇలా రంగు తక్కువగా ముదురు గోధుమ రంగులో ఉండే వాళ్ల స్కిన్ టోన్కి అనుగుణమైన రంగులోనే కాంతిమంతంగా కనిపించేలా చేస్తే.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపినవాళ్లం అవుతాం. వారి ముఖాలు కూడా కాంతిగా వెలుగుతాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి వాళ్లకు వైట్ వాష్ చేయకూడదు. మేకప్ వేస్తేనే అందం లేదంటే చూడలేం అన్నట్లు ఉండకూడదు. సహజ సౌందర్యం ఉట్టిపడేలా తీర్చిదిద్దే మేకపే అమ్మాయిలకు గౌరవంగా ఉంటుందని అంటోంది నిర్మల. దీంతో వాళ్లు మునుపటి రూపాన్ని చూపించేందుకు వెనడుగు వేయరని నమ్మకంగా చెబుతోంది. View this post on Instagram A post shared by Nirmala Mohan 💃🏻 (@nirmala_makeupartistry) (చదవండి: తల్లే కూతురు పెళ్లిని ఆపేసింది..! ట్విస్ట్ ఏంటంటే..) -
మేకప్ బ్రష్లు శుభ్రం చేస్తున్నారా..?
సాధారణంగా ముఖానికి మేకప్ వేసుకున్నాక, కొన్ని గంటల్లోనే దాన్ని క్లీన్స్ చేస్తుంటాం. చాలా శ్రద్ధగా చర్మం పాడవకుండా చూసుకుంటాం. మరి మేకప్ కోసం రోజూ వాడే బ్రష్ల సంగతేంటి? వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేస్తున్నారా? ఆ తర్వాత ఆరబెడుతున్నారా? బ్యాక్టీరియా చేరకుండా జాగ్రత్త పడుతున్నారా? లేదంటే యమ డేంజర్ అంటున్నారు నిపుణులు. కనీసం ప్రతి రెండు వారాలకు ఒకసారి మీ మేకప్ బ్రష్లను శుభ్రం చేసుకోమని హెచ్చరిస్తున్నారు. చేతులతో శుభ్రం చేస్తే బ్రష్లు పూర్తిగా శుభ్రపడవని అనుకుంటున్నారా? మేకప్ బ్రష్లను సులువుగా శుభ్రం చేయడానికే ఈ మేకప్ బ్రష్ క్లీనర్ అందుబాటులోకి వచ్చింది. చిత్రంలోని ఎలక్ట్రిక్ మేకప్ బ్రష్ క్లీనర్ తరచుగా మేకప్ వేసుకునే వారికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇది అన్ని సైజ్లలోని కాస్మెటిక్ మేకప్ బ్రష్ కిట్లకు అనువుగా ఉంటుంది. ఇది బ్రష్లను పూర్తిగా శుభ్రం చేయడమే కాకుండా, వెంటనే పొడిగా ఆరబెడుతుంది కూడా! బ్రష్ కుచ్చు ఊడిపోకుండా, బ్రష్కు ఏమాత్రం డ్యామేజ్ కాకుండా శుభ్రం చేస్తుంది. మేకప్ అవశేషాలను, నూనె లేదా క్రీమ్స్తో వచ్చే జిడ్డును, మలినాలను పూర్తిగా తొలగిస్తుంది. దీనిని వాడుకోవడం చాలా తేలిక. ఐషాడో బ్రష్ల నుంచి పౌడర్ బ్రష్ల వరకు అన్నింటినీ దీనితో క్లీన్ చేసుకోవచ్చు. గర్ల్ ఫ్రెండ్, వైఫ్, మదర్ లేదా సిస్టర్ ఇలా రిలేషన్స్ ఏదైనా వారి స్పెషల్ డేకి ఈ డివైస్ని అందిస్తే పర్ఫెక్ట్ గిఫ్ట్ అవుతుంది. దీని ధర కేవలం రూ.600 మాత్రమే. ఇతర కంపెనీల్లో క్వాలిటీని బట్టి ధరల్లో తేడా ఉండొచ్చు. రివ్యూలను పరిశీలించి, ఇలాంటి పరికరాలను కొనుగోలు చేసుకోవచ్చు. (చదవండి: వాన చినుకులలో వడ్డన..!) -
జుట్టు రాలిపోతోందా? డోంట్ వర్రీ..టీ వాటర్తో ఇలా చేస్తే..!
Tea Water for Hair: జుట్టు రాలడం చాలా సహజమైనదే. అయితే ఎప్పడికప్పుడు కొత్త జుట్టు వస్తూ ఉంటుంది. జుట్టు రాలిన విషయంమనకు తెలియకుండానే ఈప్రక్రియ జరిగిపోతుంది.అయితే అకారణంగా, చాలా ఎక్కువగా జుట్టురాలిపోవడం ఆందోలన కలిగించే అంశం. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య. దీనిని ఎదుర్కోవడానికి లెక్కలేనన్ని ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజమైన పద్ధతులను ఎంచుకోవడం మంచిది. అలాంటి వాటిట్లో ఒకటి టీ నీటితో జుట్టును కడగడం. యాంటీఆక్సిడెంట్లు , పోషకాలతో సమృద్ధిగా ఉన్న టీ, జుట్టును బలోపేతం చేస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మాడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మరి దీని తయారీ, ఎలా ఉపయోగించాలో చూద్దాం.టీ వాటర్ ఎలా తయారు చేయాలిహెయిర్ వాష్ కోసం టీ వాటర్ ను తయారు చేయడం చాలా సులభంకావాల్సిన పదార్థాలు:2–3 టీ బ్యాగులు (బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ)2–3 కప్పుల నీరుకావాలంటే ఇందులో లావెండర్ లేదా రోజ్మేరీ ఆయిల్ కూడా కలుపుకోవచ్చు. ఎలా తయారు చేయాలి? ఎలావాడాలి?నీటిని మరిగించి, అందులో టీ బ్యాగులను 5–10 నిమిషాలు నానబెట్టాలి.ఇందులో కొద్దిగా లావెండర్, రోజ్మేరీ ఆయిల్ చుక్కలు కలపాలి.చల్లారిన తరువాత టీ నీటిని శుభ్రమైన స్ప్రే బాటిల్ లేదా కంటైనర్లో పోసుకోవాలి.ఇపుడు తేలికపాటి, సల్ఫేట్ లేని షాంపూతో జుట్టును శుభ్రంగా వాష్ చేయాలి.షాంపూ చేసిన తర్వాత జుట్టుంతా తడిచేలా స్ప్రే చేయాలి. తర్వాత 5–10 నిమిషాలు పాటు చేతులతో సున్నితంగా మసాజ్ చేయాలి.15-20 నిమిషాలు పాటు ఉంచుకుని సాధారణ నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి.ఇదీ చదవండి: మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియోప్రయోజనాలు జుట్టు సిల్కీగాఅవుతుంది. కొత్త మెరుపువస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది, యాంటీఆక్సిడెంట్లు ,కెఫిన్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడం తగ్గుతుంది.మాడు ఆరోగ్యానికి కూడా మంచిది. చుండ్రు, దురద లాంటి సమస్యలు తగ్గుతాయి. టీ వాటర్ జుట్టు క్యూటికల్ను మూసివేస్తుంది.కెఫిన్ కారణంగా రక్త ప్రసరణ బాగా జరిగిన జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తుంది. హెయిర్ ఫోలికల్స్ ను ఉత్తేజపరిచి, జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ జుట్టు రాలడానికి కారణమవుతుంది. ఇది ఈ హార్మోన్ల ప్రభావాలను తగ్గించి జుట్టు రాలడాన్ని నిరోధించే సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. కనుక ఈ ప్రక్రియ చాలామంచిది. జుట్టు చిట్లడం అనే సమస్యను కూడా దూరం చేస్తాయి.ఇదీ చదవండి : Sankranti 2025: పండక కళ, పేస్ గ్లో కోసం ఇలా చేయండి! -
Kamakshi Bhaskarla: గ్లామర్ డోస్ పెంచిన ‘పొలిమేర’ బ్యూటీ
-
ఎర్ర కలబందతో ఎన్నో ప్రయోజనాలు : తెలిస్తే, అస్సలు వదలరు!
కలబంద ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పటివరకూ చాలా విన్నాం. తరతరాలుగా సౌందర్య పోషణలో,చర్మ సంరక్షణలో కూడా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ కోవలోకి ఇపుడు మరో కొత్త రకం కలబంద వచ్చి చేరింది. అదే రెడ్ కలబంద. ఈ రెడ్ కలబంద ఇప్పుడు చర్మ సంరక్షణ మార్కెట్లోకి వేగంగా దూసుకొస్తోంది. ముదురు ఎరుపు రంగుకు ప్రసిద్ధి చెందిన ఈ రకంలో చర్మ ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.రెడ్ కలబంద ప్రయోజనాలు:ఆకుపచ్చ కలబందతో పోలిస్తే ఎరుపు రంగు కలబంద ఎక్కువ ఔషధ గుణాలు, ప్రయోజనాలున్నాయి. అందుకే ‘కింగ్ ఆఫ్ అలోవెరా’గా పేరు తెచ్చుకుంది. రెడ్ కలబంద వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.పోషకాలు: రెడ్ కలబందలో విటమిన్ ఎ (బీటా కెరోటిన్), విటమిన్ సి, ఇ, బి12, ఫోలిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షిస్తాయి. కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది పెద్ద మొత్తంలో అమైనో ఆమ్లాలు, పాలిసాకరైడ్లను కలిగి ఉంటుంది. ఇది జుట్టు, చర్మం, కళ్ళకు ఒక వరంలాంటిదట.యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం: ఎరుపు కలబంద ఆంథోసైనిన్స్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల కారణంగా దాని రంగు ఎర్రగా ఉంటుందని ర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ జుష్యా భాటియా సారిన్ చెప్పారు. పర్యావరణ ఒత్తిడి ప్రభావాలను తగ్గించడానికి ఎరుపు కలబంద ఫేస్ సీరం ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే కొల్లాజెన్ చర్మం యవ్వనాన్ని కాపాడుతుంది. ఈ సమ్మేళనాలు కాలుష్యం, ఒత్తిడి, వృద్ధాప్యం వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయని. ఎర్ర కలబంద యాంటీఆక్సిడెంట్లు, హైడ్రేటింగ్ మూలకాల శక్తివంతమైన మిశ్రమమని ఆమె తెలిపారు.రోగనిరోధక శక్తికి: ఎర్ర కలబంద రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది బాక్టీరియా, ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. జలుబు, దగ్గు సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన సమస్యల నుంచి కూడా చక్కటి పరిష్కారం లభిస్తుంది.మేనికి మెరుపు : విటమిన్లు A, C , E చర్మాన్ని ప్రకాశవంతంగా, దృఢంగా మారుస్తుంది. దీని ఆధారిత మాయిశ్చరైజర్ చర్మం యొక్క సహజ మెరుపును కాపాడుతుంది. చర్మానికి చల్లదనాన్నిస్తుంది. ముఖంపై మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. రెడ్ కలడంద జ్యూస్తో శరీరంలోని మలినాలన్నీ తొలగిపోతాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలిన గాయాలు, గాయాలు, సోరియాసిస్ నివారణలో మేలు చేస్తుంది.గుండెకు మేలు : ఎర్ర కలబంద జ్యూస్తో గుండె ఆరోగ్యం బలపడుతుంది. బీపీ అదుపులో ఉంటుంది. డయాబెటిస్ : రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్లో పరిమిత రూపంలో దీని వినియోగం ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.ఈ జ్యూస్ తాగడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్గా మారడంతో పాటు నొప్పి కూడా తగ్గుతుంది ఎర్ర కలబందను జుట్టు మీద అప్లై చేయడం వల్ల జుట్టు సిల్కీగా, మెరిసేలా చేస్తుంది. దీంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. -
వేడి నీళ్లతో ఫేస్ వాష్ చేసుకుంటే.. ఏమవుతుందో తెలుసా?
వేడి నీళ్లతో స్నానం చేస్తే హాయిగా ఉంటుంది. అలసట తీరుతుంది. ముఖ్యంగా చలికాలంలో వేడి నీటి (Hot water) స్నానం ఇంకా ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే దుమ్ము ధూళితో నిండిపోయిన ముఖాన్ని (Face) వేడినీళ్లతో కడుక్కుంటే ప్రశాంతంగా ఉంటుంది. అయితే వేడి వేడి నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉందట. ఇది వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుందట. వేడి నీరు మీ చర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఏం చేయాలి? ఈ కథనంలో తెలుసుకుందాం.వేడి-నీరు అకాల వృద్ధాప్యం వేడి నీరు ప్రశాంతంగా అనిపించినప్పటికీ, ముఖ చర్మంపై తీరని ప్రభావాన్ని చూపిస్తుంది అంటున్నారు చర్మ వ్యాధి నిపుణులు. ఎలా అంటే.. మన శరీరంలోని మిగిలిన భాగాలతో పోలిస్తే ముఖం చర్మం భిన్నంగా ఉంటుంది. చాలా సున్నితంగా, చిన్న కేశనాళికలతో నిండి ఉంటుంది. ఉష్ణోగ్రత వంటి బాహ్య కారకాలకు తొందరగా ప్రభావితయ్యే ఉండే రంధ్రాలతో నిండి ఉంటుంది. వేడి నీరు అప్పటికపుడు ఊరటనిచ్చినా ఆ తరువాత అనేక సమస్యలను కలిగిస్తుంది అంటున్నారు.వేడి నీళ్లు ముఖంపై ఉండే సూక్ష్మకేశనాళికలకు హాని కలిగిస్తుంది. ఇరిటేషన్, చర్మం ఎర్రబారడం లాంటి సమస్యలు రావచ్చు. సున్నితమైన చర్మం లేదా రోసేసియా వంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది.నేచురల్ ఆయిల్స్కు నష్టంవేడి నీటి వలన ముఖంపై ఉండే సహజ నూనెలకు హాని కలుగుతుంది. ఇవి సెబమ్ను ఉత్పత్తి చేసి, తేమను కాపాడుతుంది. మృదువుగా ఉంచుతుంది. కానీ వేడి నీరు ఈ నూనెలకు నష్టం కలిగించి మృదుత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. ముఖం మీద చర్మం తొందరగా ముడతలు పడేలా చేస్తుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తి మందగిస్తుంది. దీంతో చర్మం సహజత్వాన్ని కోల్పోయి, ముడతలు తొందరగా వస్తాయి. ఫలితంగా వయసుకుమించి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ. వయసు పెరుగుతున్న కొద్దీ కొల్లాజెన్,ఎలాస్టిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అతినీలలోహిత (UV) కిరణాలు కొల్లాజెన్ ఎలాస్టిన్ను విచ్ఛిన్నం చేస్తాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులు వంటి సూర్యరశ్మికి గురయ్యే ప్రదేశాలలో, ఎండలేకపోయినా కూడా చర్మాన్ని రక్షించు కునేందుకు సన్ స్క్రీన్ వాడాలి. ముఖాన్ని ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. అలాగే మొహాన్ని పదే పదే కడగడం వల్ల మెరుపు తగ్గిపోతుంది.కెమికల్స్తో కూడిన సబ్బులు, హానికరమైన రసాయన బ్యూటీ ప్రాడక్ట్స్ను అస్సలు వాడకూడదు.అలాగే అధిక కార్బోహైడ్రేట్లు, ముఖ్యంగా శుద్ధి చేసిన పిండి పదార్థాలు ,చక్కెరలు, గ్లైకేషన్ అనే ప్రక్రియకు దారితీయవచ్చు. కొల్లాజెన్ను దెబ్బతీసి, తొందరగా ముసలి తనం వచ్చేలా చేస్తుంది. అందుకే పిండి పదార్ధాలను తగ్గించి, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంపై దృష్టి పెట్టాలి.మెరిసే చర్మం కోసం హైడ్రేటెడ్గా ఉండటం చాలా ముఖ్యం. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగాలి.ఎలాంటి మచ్చలు లేకుండా, మెరిసిపోతూ, ప్రకాశవంతమైన కాంప్లెక్షన్ రావాలంటే శుభ్రంగా తినాలి. విటమిన్లు అధికంగా ఉండే ఆహారం, ముఖ్యంగా విటమిన్ సి, ఆకుకూరలు, సోయా, చిక్కుళ్ళు, చేపలు, చికెన్ తాజా పండ్లు తీసుకోవాలి. అవసరమైతే చర్మ ఆరోగ్యానికి, ముఖ్యంగా బీటా-కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండే సప్లిమెంట్లను తీసుకోవాలి. -
ఎన్ని సౌందర్య సాధనాలు వచ్చినా ఇవే ఎవర్గ్రీన్..!
అందాన్ని పెంపొందించుకునేందుకు కొన్ని సాధారణ పదార్థాలను ఎప్పటి నుంచో మనం వాడుతూనే ఉన్నాం. ఇప్పటికే ఎన్నో కొత్త కొత్త సౌందర్యసాధనాలు అందుబాటులోకి వచ్చాయి గానీ నేచురల్గా లభ్యమయ్యే ఈ మామూలు పదార్థాలతోనే మేనినీ, జీవితాన్ని చాలా అందంగా చేసుకోవచ్చని అనాది కాలం నుంచి నిరూపితమైంది. ఎన్ని రకాల సౌందర్య సాధనాలు వచ్చినా ఇవి మాత్రం ఆరోగ్యకరమైనవిగా కాలపరీక్షను తట్టుకుని నిలబడ్డాయి. సౌందర్య సాధానాలుగా మనం ఉపయోగిస్తున్న కొన్ని ఇంటి, వంటింటి పదార్థాల గురించి తెలుసుకుందాం. శనగపిండి: ముఖానికి ఉన్న జిడ్డును తొలగించడానికి శనగపిండిని ప్యాక్లా వేసుకోవడమన్నది చాలామంది ఎప్పటి నుంచో అనుసరిస్తున్న పద్ధతే. దీన్ని పసుపు, పాలు, వెన్న, తేనె వంటి వాటితో కలిపి మిశ్రమంలా ముఖానికి రాసుకోవడం వల్ల మేని ఛాయ మెరుగవుతుందని చాలామంది నమ్మకం.పసుపు : పసుపును పసుపు మొక్క వేళ్ల నుంచి తయారుచేస్తారు. పసుపుకొమ్ములుగా పేర్కొనే ఆ మొక్కల వేళ్లను పొడిగా మార్చి పొడి చేసి, అలా వచ్చిన పౌడర్ను ఓ సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. పసుపును వంటలో సైతం వాడతారు. ఇది క్రిమినాశినిగా పనిచేస్తుంది. తెలుగువారి ఎన్నో సాంస్కృతిక ఉత్సవాల్లో కాళ్లకు పసుపు రాసుకునే సంప్రదాయం ఉంది. దాంతోపాటు ముఖానికి కూడా సౌందర్యసాధనంగా పసుపు రాసుకుంటారు. దాంతో మెరుగైన చాయ వస్తుంది. అయితే దీర్ఘకాలం పసుపును ముఖానికి రాయడం అంత మంచిది కాదు. దాని వల్ల ముఖం తడి కోల్పోయి విపరీతంగా పొడిబారి ముఖంపై ముడుతలు వచ్చే అవకాశం ఉంది.చందనం : తెలుగు వారి సంస్కృతిలోని ఎన్నో ఉత్సవాల్లో కాళ్లకు పసుపుతోపాటు... మెడపై గంధం రాసుకునే సంప్రదాయం కూడా ఉంది. అందుకే చాలా సందర్భాల్లో పసుపూ–చందనం అంటూ ఈ రెండింటినీ కలిపి చెబుతుంటారు. దీన్నిబట్టి సౌందర్య సా«ధనాలను ఆరోగ్యకరమైన రీతిలో వేడుకలకు ఉపయోగించడం మన సంస్కృతిలో ఎప్పటినుంచో ఉన్నదే అన్న విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. చందనాన్ని ఒక పరిమళ ద్రవ్యంగా ఉపయోగించడంతో పాటు చలువ చేసేందుకు వాడే వస్తువుగా కూడా పరిగణిస్తారు. సంప్రదాయంగా చందనం చెక్కను రాతి మీద అరగదీసి గంధాన్ని తయారు చేసి వాడతారు. ఇటీవల ఈ చందనాన్ని ముఖానికి రాసుకునే పౌడర్లలో, పెర్ఫ్యూమ్స్లో, సబ్బుల్లో ఉపయోగిస్తున్నారు. చందంతో ముఖానికి ప్యాక్ వేయడం వల్ల నిగారింపు వస్తుందన్న నమ్మకం అనాదిగా ఉన్నదే.గోరింటాకు : ఇటీవల మెహందీ పేరిట చెబుతున్న ఈ ఆకును నూరి తయారు చేసే ఈ ఉత్సాదనను మన సంస్కృతిలో ఎప్పటినుంచో ఓ సౌందర్య సాధనంగా ఉపయోగిస్తున్నారు. ఇది రంగును ఇచ్చే కలరింగ్ ఏజెంట్గా మాత్రమే కాకుండా... చల్లదనాన్ని ఇచ్చే సౌందర్య సాధనంగా పేరు పొందింది. ఇటీవల దీన్ని తలకు వేసే రంగుల కోసం ‘హెన్నా’ అని కూడా ఉపయోగిస్తున్నారు. నిజానికి పెండ్లి వేడుకల సందర్భంగా, అలాగే అనేక పర్వదినాల్లో... ముందుగా దీన్ని రాసుకోవడం అన్నది అనాదిగా మన సంప్రదాయంలో ఒక సాంస్కృతిక వేడుక.సాంబ్రాణి : ఇది కొన్ని రసాయనాలతోపాటు కొన్ని మొక్కల బెరడుల నుంచి తీసే మిశ్రమం. ఇది సుగంధ పరిమళ సాధనమే అయినా చిన్న పిల్లల్లో ఆరోగ్యం కోసం దీన్ని ఉపయోగిస్తారు. ప్రతిరోజూ చంటి పిల్లల స్నానం తర్వాత సాంబ్రాణిని నిప్పులపై వేస్తారు. అందులోంచి వచ్చే పొగ క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. దానితో పాటు చంటిపిల్లలు ఉన్న గదిలో వచ్చే దుర్వాసనను పోగొడుతుంది. అంటే అక్కడ పేరుకునే హానికారక బ్యాక్టీరియాను దూరం చేస్తుండటం వల్ల దుర్వాసన దూరమవుతుంది. కొబ్బరి నూనె : ఇది ముదురు కొబ్బరి నుంచి తీసే నూనె. శుభ్రమైన ఈ నూనెను మన సంస్కృతిలో తలకు రాయడం ఒక ఆనవాయితీ. తలకు రాసే ఎన్నో నూనెల కంటే అది శ్రేష్ఠమైనదని నమ్మకం. దీనితోపాటు ఆరోగ్యకరమైన కేశాల కోసం మందార ఆకులు, ఉసిరి కలిపి వాడటం కూడా సాధారణంగా జరుగుతుంటుంది. (చదవండి: దటీజ్ మధురిమ బైద్య..! మైండ్బ్లాక్ అయ్యే గెలుపు..) -
మేకప్ వేసుకుంటున్నారా..? ఈ పొరపాట్లు చెయ్యకండి..
మేకప్ అందంగా కనిపించడానికే కాదు ఆత్మవిశ్వాసాన్నీ కలిగిస్తుంది. అయితే, మేకప్ ఉత్పత్తుల ఎంపికలోనూ, వాడకంలోనూ సాధారణంగా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వాటిని నివారించడానికి సరైన అవగాహన ఉండాలి. వాతావరణానికి తగిన విధంగా మేకప్ ఉత్పత్తులు సీజన్ని బట్టి వాడేవి ఉంటాయి. అందుకని, బ్రాండ్ అని కాకుండా ప్రొడక్ట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. వేడి, చలి వాతావరణానికి తగిన నాణ్యమైన ఉత్పత్తులను ఎంచుకోవాలి. దీంతో పాటు అవి తమ చర్మ తత్త్వానికి ఎలా ఉపయోగపడతాయో చెక్ చేసుకోవాలి. అందుకు ప్రొడక్ట్స్ అమ్మేవారే స్కిన్ టెస్ట్కి అవకాశం ఇస్తారు. శుభ్రత ముఖ్యంమేకప్ వేసుకోవడానికి ముందు ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. చాలా మంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోరు. కానీ, అప్పటికే చర్మంపై పేరుకుపోయిన జిడ్డు, దుమ్ము కణాలు చేరుతాయి. ముఖం శుభ్రం చేయకుండా మేకప్ వేసుకుంటే బ్యాక్టీరియా ఎక్కువ వృద్ధి చెందుతుంది. దీనివల్ల కూడా ముఖ చర్మం త్వరగా పాడవుతుంది. సాధారణ అవగాహన లైనర్, ఫౌండేషన్, కాజల్.. ఇలా ఏ మేకప్ ప్రొడక్ట్ ఉపయోగించినా కొన్ని మిస్టేక్స్ సహజంగా జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు మేకప్ పూర్తిగా తీసేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఫౌండేషన్ అయితే బ్లెండింగ్ బాగా చేయాలి. ఎంత బాగా బ్లెండ్ చేస్తే లుక్ అంత బాగా వస్తుంది. బ్యూటీ ప్రొడక్ట్ ఎంత అవసరమో అంతే వాడాలి. లేదంటే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. మేకప్లో ఫేస్ షేప్, స్కిన్ టోన్, బాడీకి తగినట్టు కూడా మేకప్ ఉంటుంది. ఇందుకు ముందుగా నిపుణుల సూచనలు తీసుకోవచ్చు.మరికొన్ని...నాణ్యమైనవి, ఖరీదైనవి అని కాకుండా తమ స్కిన్ టోన్కి తగిన మేకప్ ప్రొడక్ట్స్ ఎంపిక చేసుకోవాలి. మేకప్కి ఒకరు వాడిన టవల్, బ్రష్, స్పాంజ్ వంటివి మరొకరు ఉపయోగించకూడదు. వాటిని పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతనే తిరిగి వాడాలి. రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా మేకప్ తొలగించాలి. లేక;yతే స్వేదరంధ్రాలు మూసుకు;yయి, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. ఫౌండేషన్ని ఒకసారి ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తే హెవీగా కనిపిస్తుంది. తక్కువ మొత్తాన్ని అప్లై చేసి, పూర్తిగా బ్లెండ్ చేయాలి.మేకప్ ట్రెండ్స్ని అనుసరించడం కన్నా, తమ ముఖానికి నప్పే అలంకరణను ఎంచుకోవడం మేలు. రోజంతా ఉన్న మేకప్ పైన మరొకసారి టచప్ చేయకపోవడమే మంచిది. మస్కారా వంటివి మరొక కోట్ వేయకుండా బ్రష్ను తడిపి, కనురెప్పలపై అద్దవచ్చు. లిప్స్టిక్ను ఉపయోగించే ముందు లిప్ బ్రష్ను వాడితే, అలంకరణ నీటుగా వస్తుంది. – శ్రీలేఖ, మేకప్ ఆర్టిస్ట్ -
Kanchan Bamne: అందంతో అల్లాడించే 'పెళ్లివారమండి' వెబ్ సిరీస్ బ్యూటీ (ఫోటోలు)
-
'మెగా' ట్యాగ్.. నిహారికకు ప్లస్తో పాటు మైనస్ కూడా!? (ఫోటోలు)
-
అందమైన శరీరాకృతికి బీబీఎల్ సర్జరీ: అంటే ఏంటి..?
మోడల్స్, ప్రముఖులు, సెలబ్రిటీలు మంచి తీరైన శరీరాకృతి కోసం ఏవేవో సర్జరీలు చేయించుకుంటుంటారు. శరీర ఒంపు సొంపులు పొందికగా శిల్పాంలా కనిపించాలని ఆరాటపడుతుంటారు. అందుకోసం చేయించుకునే కాస్మెటిక్ సర్జరీలో అత్యంత ప్రసిద్ధిగాంచింది బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ (బీబీఎల్). బొటాకస్, ఫిల్లర్, ఫేస్ లిఫ్ట్లు వంటి కాస్మెటిక్ విధానాలు గురించి విన్నాం. కానీ ఇలా తీరైన ఆకృతి కోసం చేసే ఈ బీబీఎల్ సర్జరీ అంటే ఏంటీ..?. నిజంగానే మంచి విల్లు లాంటి ఆకృతిని పొందగలమా అంటే..విదేశాల్లోని మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్లు, హీరోయిన్లు ఎక్కువుగా ఈ బీబీఎల్ కాస్మొటిక్ సర్జరీని చేయించుకుంటుంటారు. ఇది అక్కడ అత్యంత సర్వసాధారణం. అయితే దీనితో అందంగా కనిపించడం ఎలా ఉన్నా..వికటిస్తే మాత్రం ప్రాణాలే కోల్పోతాం. అలానే ఇటీవల 26 ఏళ్ల బ్రిటిష్ మహిళ ఈ ప్రక్రియతో ప్రాణాలు కోల్పోయింది. సోషల్ మీడియాలో ఈ బీబీఎల్ సౌందర్య ప్రక్రియ గురించి విని టర్కీకి వెళ్లి మరీ చేయించుకుంది. అయితే ఆపరేషన్ చేసిన మూడు రోజుల్లోనే మరణించింది. ఈ ప్రక్రియలో ఏం చేస్తారంటే..లైపోసెక్షన్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే ఇందులో కొవ్వుని అంటుకట్టుట చేస్తారు. ఇందేంటి అనుకోకండి. యవ్వనంగా, వంపుగా కనిపించేలా ఆయా ప్రాంతాల్లో కొవ్వుని ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మొదటి దశలో శరీరంలోని తొడలు లేదా పార్శ్వాలు వంటి భాగాల్లో అదనపు కొవ్వును తొలగిస్తారు. ఆ తర్వాత లైపోసెక్షన్ టెక్నిక్ ఉపయోగించి శుద్ది చేయబడిన కొవ్వుని ఇంజెక్ట్ చేస్తారు. ఈ క్రమంలో కొన్ని దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే..ఈ ఇంజెక్ట్ చేసిన కొవ్వు రక్తప్రవాహంలోకి ప్రవేశించి రక్తనాళాలను అడ్డుకుంటే మాత్రం అప్పుడే పరిస్థితి ప్రాణాంతకంగా మారింది. అదీగాక ఈ సర్జరీకి అందరి శరీరాలు ఒకవిధంగా స్పందించవు. ఇక ఆ బ్రిటిష్ మహిళ సర్జరీ చేయించుకున్న తదుపరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంత మరణించిందన సమాచారం. నిజానికి ఇలాంటి.. సౌందర్యానికి సంబంధించిన కాస్మెటిక్ సర్జరీలు చేయిచుకునేటప్పుడు అనుభవజ్ఞుడైన వైద్యుడి పర్యవేక్షణలోనే చేయించుకోవడం అనేది ఎంద ముఖ్యమో, అలానే ఆ తదుపరి కూడా అంతే కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ బీబీఎల్ శస్త్ర చికిత్స 1960లలో బ్రెజిలియన్ సర్జన్ ఐవో పిటాంగి పరిచయం చేశారు. అయితే 2010 నుంచి ఈ శస్త్ర చికిత్స అత్యంత ప్రజాదరణ పొందింది.(చదవండి: హతవిధీ..! నిద్రలో పళ్ల సెట్ మింగేయడంతో..!) -
స్కిన్ గ్లో శాశ్వతంగా ఉండాలంటే..ఇలా చేయండి!
చర్మం నిగారింపును అందరూ కోరుకుంటారు. అందుకు సౌందర్య ఉత్పత్తుల వాడకం, ఫేషియల్స్, స్కిన్ ట్రీట్మెంట్లు చేయించుకుంటూ ఉంటారు. ఈ విషయాల్లో సరైన అవగాహన లేక ఉపయోగించే పద్ధతులు ఒక్కోసారి రివర్స్ అవుతుంటాయి. ముఖ్యంగా.. మొటిమలు/యాక్నే సమస్య ఉన్నవారు పార్లర్లో ఫేషియల్స్ చేయించుకుంటారు. మళ్లీ ఇంట్లో కొన్ని రకాల మసాజ్లు చేస్తుంటారు. వీటివల్ల సమస్య మరింత పెరుగుతుంది. నిపుణుల ఆధ్వర్యంలో కెమికల్ పీల్ చేయించుకుంటారు. కానీ, ట్రీట్మెంట్కి ముందు–తర్వాత వాడే ప్రొడక్ట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోరు. దీనివల్ల సాధారణంగా ఉండే సమస్య మరింత పెరిగి, చర్మం దెబ్బతింటుంది.మచ్చలు తగ్గాలంటే..నలుపు/తెలుపు మచ్చలు కనిపించినప్పుడు మొదట సొంతంగా హోమ్ రెమిడీస్ చేస్తుంటారు. వీటి వల్ల కొన్ని రివర్స్ అవుతుంటాయి. దీర్ఘకాలపు సమస్యగా కూడా మారుతుంటాయి. క్రీములు, మెడిసిన్స్.. సమస్య మొదట్లోనే గుర్తించి, వాడితే చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.లేజర్ చికిత్సమచ్చలకు, కొన్ని రకాల చర్మ సమస్యలకు లేజర్ చికిత్స అవసరం అవుతుంటుంది. చికిత్స తర్వాత సరైన క్రీములను ఉపయోగించకపోతే చర్మం పొడిబారుతుంది. కొత్త మచ్చలు కూడా పుట్టుకు వస్తుంటాయి. ఇదీ చదవండి: ఫోర్బ్స్'అత్యంత శక్తివంతమైన మహిళల' జాబితా : మరోసారి నిర్మలా సీతారామన్ ప్రొడక్ట్స్ .. అలెర్జీలు ఆహారం పడకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో సరైనది ప్రొడక్ట్ ఉపయోగించక పోతే చర్మానికి అలాంటి అలెర్జీలు ఉత్పన్నం అవుతుంటాయి. అందుకే, ఏదైనా కొత్త ప్రొడక్ట్ వాడాలనుకున్నప్పుడు ముందుగా చర్మంపై టెస్ట్ ప్యాచ్ చేసుకోవాలి. చలికాలం పొడి చర్మం గలవారికి స్కిన్ అలెర్జీ ఎక్కువ ఉంటుంది. క్రీములు, నూనెల వాడకంలో మరికొంత జాగ్రత్త తీసుకోవాలి. చర్మం నిగారింపు, హెయిర్ సాఫ్ట్నెస్ కోసం పర్మనెంట్ గ్లో వంటి చికిత్సల వైపు మొగ్గుచూపుతుంటారు. కానీ, శాశ్వత పరిష్కారం అంటూ ఉండదు. సమస్య ఉత్పన్నం కాకుండా తీసుకునే ఆహారం, పానీయాలు, తమ శరీర తత్త్వానికి ఉపయోగపడే క్రీములను వాడుతూ ఉండాలి. – డా.స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్ -
మాల్దీవులు బీచ్లో హన్సిక అందాల హోయలు (ఫోటోలు)
-
ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసిన ‘రాజా సాబ్’ బ్యూటీ (ఫోటోలు)
-
పెదవులు బొద్దుగా కనిపించాలంటే..!
ఇంట్లో దొరికే వాటినే సౌందర్య సాధనాలుగా ఉపయోగించుకుని అందాన్ని సంరక్షించుకోవడం చూశాం. వాటిల్లో ఎక్కువగా సెనగపిండి, బియ్య పిండి, మొక్కల ఆధారితమైనవే. ఇక్కడొక ఇన్ఫ్లుయెన్సర్ ఏకంగా పచ్చిమిర్చి కూడా అందానికి ఉపయోగపడుతుందంటూ ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఢిల్లీకి చెందిన శుభంగి ఆనంద్ అనే ఇన్ఫ్లుయెన్సర్ వివాదాస్పదమైన బ్యూటీ టిప్ని షేర్ చేసింది. అందులో పచ్చిమిరపకాయలతో లిప్స్టిక్ వేసుకున్నట్లు చూపించింది. సహజమైన బొద్దు పెదవుల కోసం ఇది ప్రయత్నించమంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకుంది. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. View this post on Instagram A post shared by SHUBHANGI ANAND 🧿👑 (@shubhangi_anand__) View this post on Instagram A post shared by SHUBHANGI ANAND 🧿👑 (@shubhangi_anand__)strong> ఘాటుతో ఉండే పచ్చిమిర్చి వంటివి చర్మానికి హాని కలిగించేవని. ఇలాంటి పిచ్చిపిచ్చి టిప్స్ షేర్ చేయొద్దని తిట్టిపోశారు. పెద్దాలు బొద్దుగా ఉండటం అటుంచితే..అవి కాలిన గాయాల వలే వాచిపోయి అసహ్యంగా మారతాయని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. అయినా అందానికి సంబంధించినవి సమంజసంగా హానికరం కానివి పెట్టాలి. ఏదో సోషల్ మీడియా క్రేజ్ కోసం ఇలా చేస్తే..వ్యూస్ రావడం మాట దేవుడెరగు అస్సలు ఆ అకౌంట్కి సంబంధించిన వీడియోలను అసహ్యించుకునే ప్రమాదం లేకపోలేదు.(చదవండి: నడవలేనంత అనారోగ్య సమస్యలతో వినోద్ కాంబ్లీ: ఆ వ్యాధే కారణమా..?) -
ఏఐ బ్యూటీషియన్ రంగాన్ని కూడా శాసించగలదా..?
ఏఐ సాంకేతికత ప్రపంచాన్నే మారుస్తోంది. ప్రస్తుతం ఏఐ విద్యా, వైద్య, మార్కెటింగ్,సేల్స్, ఫైనాన్స్ , కంటెంట్ క్రియేషన్ వంటి పలు రంగాలను ప్రభావితం చేసింది. దీంతో ఇక భవిష్యత్తులో ఉద్యోగాలు ఉంటాయా? అనే భయాన్ని రేకెత్తించేలా శరవేగంగా దూసుకుపోతుంది. ఇక మిగిలింది సౌందర్యానికి సంబంధించిన బ్యూటిషయన్ రంగం ఒక్కటే మిగిలి ఉంది. ఇందులో కూడా ఆ సాంకేతికత హవా కొనసాగుతుందా అంటే..సందేహాస్పదంగా సమాధానాలు వస్తున్నాయి నిపుణుల నుంచి. ఎందుకంటే చాలా వరకు మానవ స్పర్శకు సంబంధించిన రంగం. ఇంతకీ ఈ సాంకేతికత ప్రభావితం చేయగలదా? అలాగే ఈ రంగంలో ఏఐ హవాను తట్టకునేలా ఏం చెయ్యొచ్చు.. బ్యూటీషియన్ రంగంలో ఐఏ సాంకేతిక వస్తే.. సరికొత్త ఇన్నోవేషన్తో.. వర్చువల్ టూల్స్ని మెరుగుపర్చగలదు. అంటే ఎలాంటి మేకప్లు సరిపడతాయి, చర్మ నాణ్యత తదితర విషయాల్లో సలహాలు, సూచనలు ఇవ్వగలదు. మానవునిలా ప్రభావవితం చేయలేదు. ఎందుకంటే ఇది సృజనాత్మకత, భావోద్వేగం, టచ్తో కూడిన కళ. 2020లో మహమ్మారి సమయంలో ఈసాంకేతికత ప్రభంజనంలా దూసుకుపోయిందే తప్ప మరేంకాదని కొట్టేపడేస్తున్నారు నిపుణులు. అయితే బ్యూటీషియన్ రంగంలోని మేకప్ పరిశ్రమను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇక్కడ కస్టమర్ మనోగతం ఆధారంగా అందమైన రూపు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఏఐ సరైన మేకప్ని కస్టమర్లకు ఇవ్వడం అన్నది సాధ్యం కానీ విషయం. ఓ మోస్తారుగా ఇలాంటి మేకప్ ఇస్తే ఇలా ఉంటుందని వర్చువల్ ఐడియానే అందివ్వగలదే తప్ప కస్లమర్కి నచ్చినట్టుగా క్రియేటివిటీతో కూడిన మేకప్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. అలాగే క్లయింట్లకు ఎలాంటి బ్యూటీప్రొడక్ట్లు వాడితే బెటర్ అనేది, చర్శ తత్వం తదితరాలకు మాత్రమే ఐఏ ఉపయోగపడవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఐఏ అందానికి సంబంధివచి ప్రభావితం చేయాలేని కీలక అంశాలు గురించి కూడా చెప్పారు. అవేంటంటే..కళాత్మక క్రియేటివిటీ : బ్యూటీషియన్ నిపుణులే మూఖాకృతి తీరుకి సరైన మేకప్తో ఒక మంచి రూపాన్ని ఇవ్వగలరు. ఇది నిశితమైన అంతర్దృష్టికి సంబంధించిన క్రియేటివిటీ. ఎమోషనల్ కనెక్షన్: కస్టమర్ల సౌందర్య సంప్రదింపుల్లో ఇది అత్యంత కీలకమైంది. క్లయింట్ వ్యక్తిగతంగా ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారనేది అర్థం చేసుకుని సలహాలు, సూచనలివ్వాల్సి ఉంటుంది. స్పర్శ సేవ: షేషియల్, మసాజ్ వంటి సౌందర్య చికిత్సలలో టచ్ అనేది కీలకం. బ్యూటీషియన్ అనుభవం ఆధారంగా కస్టమర్లకు దొరికే మంచి అనుభూతిగా చెప్పొచ్చు. ఒక వేళ ఏఐ సౌందర్య రంగాన్ని ప్రభావితం చేసినా..బ్యూటీషియన్లు ఈ సవాలుని స్వీకరించేందుకు సిద్ధపడాలి. అలాగే కస్టమర్లకు మెరగైన సేవను అందించి సాంకేతికత కంటే..మనుషుల చేసేదే బెటర్ అనే నమ్మకాన్ని సంపాదించుకునే యత్నం చేయాలి. బ్యూటీషియన్లంతా ఈ రంగంలో అచంచలంగా దూసుకునిపోయేలా ఏఐని స్నేహితుడిగా మలుచుకుంటే మరిన్న ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. అలాంటి వారే ఎలాంటి సాంకేతిక ఆటను ఈజీగా కట్టడి చేయగలరు అని నమ్మకంగా చెబుతున్నారు విశ్లేషకులు. (చదవండి: 40 ఏళ్ల నాటి గౌనులో యువరాణి అన్నే..!) -
ఈ డివైజ్తో మొటిమలు, మచ్చలు ఇట్టే మాయం..!
మొటిమలు, వాటి వల్ల ఏర్పడే మచ్చలు ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంటాయి. ముఖ్యంగా టీనేజ్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. చిత్రంలోని ‘సోలావేవ్ లైట్ థెరపీ డివైస్’ ముఖంపై పేరుకున్న జిడ్డును, మొటిమలను, వాటి కారణంగా కలిగిన మచ్చలను ఇట్టే తొలగిస్తుంది. అంతేకాకుండా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.ఈ డివైస్.. చర్మానికి పూర్తిగా సురక్షితమైనది. బ్లూ కలర్ లేదా రెడ్ కలర్ అనే రెండు ఆప్షన్స్తో ఇది ఏమాత్రం నొప్పి లేకుండా చికిత్స అందిస్తుంది. దీన్ని సుమారు తొమ్మిదిసార్లు వినియోగిస్తే, 90 శాతం వరకు ఫలితం కనిపిస్తుంది. దీన్ని ఉపయోగించడం చాలా తేలిక. పరికరాన్ని ఆఫ్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా ముందున్న బటన్ని ఒక సెకను పాటు ప్రెస్ చేసి ఉంచితే సరిపోతుంది. ఈ మెషిన్ని సుమారు 3 నిమిషాలు ఆన్ చేసి, ఆప్షన్ ఎంపిక చేసుకుని, సమస్య ఉన్న ప్రదేశంలో ఉంచితే సరిపోతుంది. నిజానికి ఈ డివైస్ ప్రతి మూడు నిమిషాలకొకసారి ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఇది వేలెడంత పొడవుతో చేతిలో ఇమిడేంత చిన్నగా ఉంటుంది. దాంతో దీన్ని పట్టుకోవడం, ఇతర ప్రదేశాలకు తీసుకుని వెళ్లడం చాలా సులభం. ముందుగా క్లీనింగ్ జెల్ని అవసరం అయిన చోట అప్లై చేసుకుని, మొటిమలు లేదా మచ్చలున్న భాగంలో ఈ డివైస్ హెడ్ని ఆనించి ఉంచితే ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇది బ్యాటరీ సాయంతో పని చేస్తుంది. దీని ధర 69 డాలర్లు (రూ.5,825). ఇలాంటి డివైస్లకు ఆన్లైన్లో మంచి డిమాండ్ ఉంది. ముందే వినియోగదారుల రివ్యూస్ ఫాలో అయ్యి ఆర్డర్ చేసుకోవడం ఉత్తమం. (చదవండి: ఏంటిది.. చేపకు ఆపరేషన్ చేశారా..!) -
స్పా ఉద్యోగిని ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ఢిల్లీ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాగలగుంట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బ్యూటీ స్పాలో పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన సోనియా (24) మృతురాలు. ఆత్మహత్యకు గల కారణాలు తెలిసిరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.ప్రేమలో మోసపోయానని..ప్రేమలో మోసపోయానని అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దక్షిణ కన్నడ జిల్లా బెళ్తండగి తాలూకా మిత్రబాగిలు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అమ్మాయి (17)ని బంధువు అయిన ప్రవీణ్ అనే యువకుడు ప్రేమ పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని వదిలేశాడు. దీంతో విరక్తి చెందిన యువతి 20వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. ప్రవీణ్పై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రింగుల జుట్టు, చిక్కని చిరునవ్వు, చక్కనమ్మ అందం (ఫోటోలు)
-
ముసలమ్మలా మారిపోయిన హాట్ బ్యూటీ అషూరెడ్డి (ఫొటోలు)
-
బిగ్బాస్ బ్యూటీ చీర సింగారం (ఫోటోలు)
-
ఇద్దరు బిడ్డల తల్లి : ఒకే రోజు ఆరు బ్యూటీ సర్జరీలు.. చివరికి!
ఐశ్వర్య అంత అందంగా కనిపించాలి, ఎత్తుపెరగాలి.. ఆరడుగులు డార్లింగ్గా మారిపోవాలి...ఆధునిక యువతలో ఇదో పెద్ద క్రేజ్. ఈ పిచ్చినే కొంతమంది స్వార్థపరులు క్యాష్ చేసుకుంటున్నారు. అందంకోసం ఆరాటపడి ప్రాణాలనే పొగొట్టుకున్న షాకింగ్ సంఘటన ఒకటి చైనాలో చోటు చేసుకుంది. దీంతో ఉన్నదానితో సంతృప్తి పడే కాలం పోయింది. లేని దాని కోసం అర్రులు చాచడం ఒక వేలం వెర్రిగా మారిపోయిందంటన్న నెటిజన్లు కామెంట్లు వైరల్గా మారాయి.దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్లోని గుయిగాంగ్లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళ 24 గంటల వ్యవధిలో ఆరు కాస్మెటిక్ సర్జరీలు చేసుకుంది. కానీ తన అందాన్ని తనివి తీరా చూసుకోకముందే తనువు చాలించింది. సుమారు రూ. 4.7 లక్షలు ( 40వేల యువాన్లు) అప్పు చేసి మరీ నన్నింగ్లోని ఒక క్లినిక్లో చేరింది.. ఒకే రోజు కళ్లు, ముక్కు, ఉదరం కోసం సర్జరీలు చేయించుకుంది. తరువాత ఆమె తొడలలోని కొవ్వును తీసి ముఖం, రొమ్ములలోకి ఇంజెక్ట్ చేసే లైపోసక్షన్ సర్జరీలు చేయించుకుంది. అయితే ఆ మహిళ డిశ్చార్జి కాగానే క్లినిక్లోని లిఫ్ట్ ముందేఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వైద్యులు చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. లైపోసక్షన్ తర్వాత పల్మనరీ ఎంబోలిజం కారణంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్య రావడంతో చనిపోయిందని పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. ఆమెకు ఎనిమిదేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు.మరోవైపు మహిళ మరణంపై కుటుంబ సభ్యులు తమకు న్యాయం కావాలంటూ క్లినిక్పై కేసు వేశారు . అయితే 2 లక్షల యువాన్ల నష్టపరిహారం ఇవ్వడానికి అంగీకరించింది. అయితే, అతను కనీసం 10 లక్షల యువాన్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆమె భర్త కోర్టును ఆశ్రయించాడు. దీన్ని విచారించిన కోర్టు చివరికి సుమారు 70 లక్షల రూపాయలు (590,000 యువాన్ల ) నష్టపరిహారంచెల్లించాలని ఆసుపత్రిని ఆదేశించింది. పరిస్థితిని సరిగ్గా గమనించకుండా, కొన్ని వైద్యపరమైన తప్పులు చేసిందని న్యాయమూర్తి లి షాన్ వ్యాఖ్యానించారు. తపుడు వాగ్దానాలతో అప్పు చేసి మరీ ఆపరేషన్లు చేయించుకునేలా ప్రేరేపించిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.2020ల నాటి ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అందంకోసం అతిగా పోతే అనర్థం తప్పదంటూ కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానించగా , డబ్బులు కోసం ఎంతకైనా తెగిస్తారా అంటూ క్లినిక్పై కొందరు, ఒకే రోజులో ఆరు సర్జరీలు? క్లినిక్కి ఇంగితజ్ఞానం లేదా? ముఖ్యంగా రక్తం గడ్డకట్టడానికి దారితీసే లైపోసక్షన్తో సమస్యల ప్రమాదాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? అంటూ మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. (వైరల్ వీడియో: కీరవాణిగారూ.. ఒక్క ఛాన్స్ ప్లీజ్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్)చైనాలో లైపోసక్షన్ ఆపరేషన్లు చాలా సాధారణంగా మారిపోతున్నాయి. అందంగా, స్లిమ్గా ఉండాలనే కోరికతో మహిళలు కాస్మొటిక్ సర్జరీలవైపు మొగ్గు చూపుతున్నారు. చాలామంది చనిపోతున్నారు. మరికొంతమంది తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. -
కిడ్స్ మేకప్ కోసం ఈ బ్యూటీ కిట్..!
చాలామంది చిన్నారులు తమ తల్లుల్లాగానే మేకప్ వేసుకోవడం, స్పాకి వెళ్లడం వంటి పనులను ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఈ పనుల్లో తల్లులను అనుకరించాలని తహతహలాడతారు. అలాంటి వారికి మార్కెట్లో చాలానే డివైస్లు, కిట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. హెయిర్ స్టైల్స్ మెషిన్స్ మ్యానిక్యూర్– పెడిక్యూర్ కిట్స్, మేకప్ బాక్సెస్ ఇలా చాలానే ఉన్నాయి. వాటిపై ఓ లుక్ వేద్దామా?చిత్రంలోని ఈ కిట్ వెంట ఉంటే.. చిన్నారులంతా తమ చేతులను, కాళ్లను అందంగా మార్చుకోవచ్చు. ఫుట్ స్పా బాత్ సెట్, ఐ మాస్క్, నెయిల్ ఫ్యాన్ డ్రైయర్, వాటర్ ప్రూఫ్ స్టిక్కర్స్, మసాజ్ స్టోన్స్, గ్లిట్టర్ పౌడర్ ఇలా చాలానే ఈ కిట్లో లభిస్తాయి. 3 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు ఇది బెస్ట్ బహుమతి అవుతుంది. ఈ కిట్ ఇంట్లో ఉంటే చిన్నారులకు ఇంట్లోనే స్పా ఫీలింగ్ కలుగుతుంది. ఈ కిట్తో పిల్లలే చక్కగా నెయిల్స్ని క్లీన్ చేసుకోవచ్చు, నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు, కాళ్లను శుభ్రం చేసుకోవచ్చు. ఇలా తమ అందాన్ని తామే కాపాడుకుంటూ మెరిసిపోవచ్చు.మీ లిటిల్ ప్రిన్సెస్కి ఈ కిట్ని కొనిచ్చేస్తే.. వారి మేకప్ వారే వేసుకోవడం అలవాటు చేసుకుంటారు. ఇందులో బ్రష్లు, ఐ షాడోస్, బ్లష్లు, లిప్స్టిక్, నెయిల్ పాలిష్లు, నెయిల్ స్టిక్కర్స్, ప్రత్యేకమైన కిరీటం, హెయిర్ యాక్సెసరీస్ వంటివి చాలానే ఉంటాయి. మందపాటి మృదువైన ప్లాస్టిక్తో తయారు చేసిన ఈ కిట్ను తేలికగా ఓపెన్, క్లోజ్ చేసుకోవడానికి జిప్ ఉంటుంది. ఇలాంటి కిట్స్ ఆన్లైన్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. క్వాలిటీపైన, వినియోగించే తీరుపైన రివ్యూస్ చదివి చేసుకుంటే మంచిది. చిత్రంలోని ఈ డై హెయిర్ టూల్ బోలెడన్ని జడలల్లేస్తుంది. కొత్తకొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేసే అవకాశాన్నిస్తుంది. ఈ ‘రియలిస్టిక్ డై రోప్ హెయిర్ బ్రైడర్’ అందంగా క్యూట్గా కనిపించేందుకు రకరకాల హెయిర్ స్టైల్స్ను అందిస్తుంది. ఈ డివైస్ సెట్లో నాణ్యమైన ఎలక్ట్రానిక్ బ్రెయిడింగ్ మెషిన్, హెయిర్ రబ్బర్లు, ఒక దువ్వెన, హెయిర్ స్ప్లిటర్, బ్రెయిడింగ్ మెషిన్లో ఉపయోగించే త్రీ హుక్స్, వివిధ హెయిర్ యాక్సెసరీలు ఉంటాయి. దీన్ని పిల్లలకు బహుమతిగా అందివ్వొచ్చు. ఇలా తేలికగా పిల్లలు వారి జడలను వారే వేసుకునేలా మార్కెట్లో చాలా మెషిన్స్ అందుబాటులోకి వచ్చాయి.(చదవండి: చిన్నారుల ఆరోగ్యకరమైన అలవాట్ల కోసం తల్లిదండ్రులు చేయాల్సినవి..) -
దీపికా పదుకొణె బ్యూటీ రహస్యం..! ఇలా చేస్తే జస్ట్ మూడు నెలల్లో..
బాలీవుడ్ ప్రసిద్ధ నటి దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయంతో వేలాది అభిమానులను సంపాదించుకుంది. ఆమె ఇటీవలే పండటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక గ్లామర్ పరంగా దీపికాకి సాటిలేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆమె మేని ఛాయ, కురులు కాంతిలీనుతూ ఉంటాయి. చూడగానే ముచ్చటగొలిపే తీరైన శరీరాకృతి చూస్తే..ఇంతలా ఎలా మెయింటెయిన్ చేస్తుందా? అనిపిస్తుంది కదూ. ఇంతకీ ఆమె బ్యూటీ రహస్యం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంతేగాదు దీన్ని రెగ్యులర్గా పాటిస్తే జస్ట్ మూడునెలల్లో దీపికాలాంటి మెరిసే చర్మం, జుట్టుని సొంతం చేసుకోవచ్చట. అదేంటో చూద్దామా..!.మనం తీసుకునే ఆహరమే చర్మం, జుట్టు ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే తాజా పండ్లు, కూరగాయాలకు ప్రాధాన్యత ఇవ్వండని పదేపదే సూచిస్తుంటారు. అయితే ఇటీవల ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ పూజ అనే మహిళ జ్యూస్ రెసిపీతో కూడిన వీడియో పోస్ట్ చేసింది. అందులో ఇది బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకు మూడు నెలల్లో మెరిసే చర్మం, మెరిసే జుట్టుని పొందడంలో సహయపడిందని పేర్కొనడంతో ఈ విషయం నెట్టింట తెగ వైరల్గా మారింది. నిజానికి ఆ జ్యూస్ రెసిపీలో ఉపయోగించిన పదార్థాలన్నీ ఆరోగ్యకరమైనవే. పైగా శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉన్నాయి. ఆ జ్యూస్ ఏంటంటే..వేప, కరివేపాకు, బీట్రూట్, పుదీనాలతో చేసిన జ్యూస్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, బయోస్కావెంజర్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉపయోగించినవన్నీ మంచి చర్మాన్ని, బలమైన జుట్టుని పొందడంలో ఉపయోగపడేవే. ప్రయోజనాలు..వేప ఆకులు: ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి వేప ఆకులు శరీర నిర్విషీకరణకు దోహదం చేస్తాయి. ఇది మొటిమలను నియంత్రించి చర్మ కాంతివంతంగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. బీట్రూట్: ఇందులో ఐరన్, ఫోలేట్, విటమిన్ సీలు ఉన్నాయి. ఇవి రక్త ప్రసరణకు, శరీరంలో కొత్త కణాలు ఏర్పడటానికి ముఖ్యమైనవి. ఇది చర్మాన్ని మృదువుగానూ, ఆర్యోకరమైన రంగుని అందిస్తుంది. అలాగే జుట్టు స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొత్తిమీర ఆకులు: దీనిలో విటమిన్ ఏ, సీ కేలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్దీ చేసి మేని ఛాయను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే ఇది జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచడమే గాక హైడ్రేటెడ్గా ఉండేలా చేస్తుంది.పుదీనా ఆకులు: పుదీనా యాంటీఆక్సిడెంట్ లక్షణాల తోపాటు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది వేడిని తగ్గించి శరీరాన్ని లోపలి నుంచి పునరుజ్జీవింపజేపసి మొటిమలను నివారిస్తుంది. తయారీ విధానం..కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు, కరివేపాకు, వేపాకులు, కొత్తిమీర, పుదీనా వంటి పదార్థాలన్ని మిక్కీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పిప్పితో సహా తాగడం కష్టంగా ఉంటే..వడకట్టుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది. దీన్ని ఉదయాన్నే తాజాగా తీసుకోవాలి. ఇలా క్రమంతప్పకుండా కనీసం మూడు నెలలు ఈ జ్యూస్ని తీసుకుంటే కాంతివంతమైన మేని ఛాయ, ఒత్తైన జుట్టు మీ సొంతం.(చదవండి: అమెరికాలో ... శాస్త్రీయ నృత్య రూపకంగా దుర్యోధనుడు) -
ఏళ్లు గడుస్తున్నా యంగ్గానే..!
వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. అది యవ్వనంలో ఉండే మెరుపును, బిగుతును కోల్పోతుంది. చర్మంలోని బిగుతూ, మిసమిస పది కాలాల పాటు ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం...చర్మంపై వయసు ప్రభావం కనపడనివ్వకుండా చేసుకోడానికి అన్నిరకాల పోషకాలు ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోండి. అందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్లో ఈ పోషకాలు ఎక్కువ. ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటంతో పాటు శరీరంలోని లవణాలను కోల్పోకుండా చూసుకోండి. దీనివల్ల హైడ్రేటెడ్గా ఉంటారు. ఫలితంగా చర్మం ఆరోగ్యకరమైన మేని మెరుపు తో నిగారిస్తూ ఉంటుంది. గోరువెచ్చని నీళ్లతో... తక్కువ గాఢత ఉన్న మైల్డ్ సోప్లు వాడటమే మంచిది. మంచి మాయిశ్చరైజేషన్ లోషన్స్తో చర్మాన్ని పొడిబారకుండా చూసుకోవాలి. రోజూ ఎండకు వెళ్లే వారు మంచి సస్స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి. చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్స్ను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వయసు పెరుగుతున్నప్పటికీ చర్మం ఏజింగ్ ప్రభావానికి గురికాకుండా ఉంటుంది. (చదవండి: గంటలకొద్ది కూర్చొని పనిచేసే వాళ్లకు ది బెస్ట్ వర్కట్లివే..!) -
టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ జుట్టు సంరక్షణ చిట్కాలు..!
ఏజ్-రివర్సల్ ఔత్సాహికుడు టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ తన యాంటీ ఏజింగ్ ప్రయోగాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను నెటిజన్లతో ఎప్పటికప్పుడూ షేర్ చేసుకుంటుంటారు. ఆ ప్రక్రియలకు సంబంధించి..కాంతివంతమైన చర్మం కోసం ఏం చేయాలో ఇంతకమునుపు పంచుకున్నారు. తాజాగా జుట్టు రాలు సమస్యను అరికట్టడం, సంరక్షణకు సంబంధించిన కొన్ని చిట్కాలను షేర్ చేశారు. జన్యుపరంగా బ్రయాన్కి బట్టతల రావాల్సి ఉంది. అయితే ఆయన వృద్ధాప్యాన్ని నెమ్మదించే ప్రక్రియల్లో భాగంగా తీసుకుంటున్న చికిత్సలు కారణంగా ఆ సమస్య బ్రయాన్ దరిచేరలేదు. ఆ క్రమంలోనే బ్రయాన్ తాను జుట్టు రాలు సమస్యకు ఎలా చెక్పెట్టి కురులను సంరక్షించుకునే యత్నం చేశారో వెల్లడించారు. తనకు 20 ఏళ్ల వయసు నుంచి జుట్టు రాలడం ప్రారంభించి బూడిద రంగులో మారిపోయిందట. అలాంటి తనకు మళ్లీ ఇప్పుడూ 47 ఏళ్ల వయసులో జుట్టు మంచిగా పెరగడం ప్రారంభించింది. అలాగే జుట్టు రంగు కూడా మంచిగా మారిందని చెప్పుకొచ్చారు. జుట్టు పునరుత్పత్తికి తాను ఏం చేశానో కూడా తెలిపారు బ్రయాన్. ముఖ్యంగా ప్రోటీన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, జుట్టుని పునరుద్ధరించడంలో కీలకపాత్ర పోషించాయని అన్నారు. మెలటోనిన్, కెఫిన్, విటమిన్ డీ-3 వంటి పోషకాహారం తోపాటు రెడ్ లైట్ థెరపీని కూడా తీసుకున్నానని అన్నారు. అంతేగాదు ఈ రెడ్లైట్ థెరపీని రోజంతా తీసుకునేలా ప్రత్యేకమైన టోపీని కూడా ధరించినట్లు వివరించారు. ముఖ్యంగా తలనొప్పి వంటి రుగ్మతలు దరిచేరకుండా జాగ్రత్త పడాలి. దీంతోపాటు మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం వంటివి చేస్తే కచ్చితంగా జుట్టు రాలు సమస్యను నివారించగలమని అన్నారు. అలాగే తాను జుట్టు సంరక్షణ కోసం ఎప్పటికప్పుడూ హెయిర్ గ్రోత్ థెరపీలను అందిస్తున్న కంపెనీలతో టచ్లో ఉండేవాడినని చెప్పారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలడం గురించి ఆలోచించాల్సిన పని ఉండదని, భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కాగా, బ్రయాన్ వృద్ధాప్యాన్ని తిప్పి కొట్టేలా యవ్వనంగా ఉండేందుకు ఇప్పటి వరకు అత్యాధునికి వైద్య చికిత్సల నిమిత్తం సుమారు రూ. 16 కోట్లు దాక ఖర్చు పెట్టిన వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. ఆ ప్రక్రియలో భాగంగా శరీరంలోని మొత్తం ప్లాస్మాని కూడా మార్పిడి చేయించుకున్నారు బ్రయాన్ . (చదవండి: 'స్వీట్ స్టార్టప్': జస్ట్ కప్ కేక్స్తో ఏడాదికి ఏకంగా..!) -
శ్రద్ధా కపూర్ బ్యూటీ సీక్రెట్ ఇదే..! ఇష్టంగా పోహా..!
బాలీవుడ్ స్టార్ క్వీన్ శ్రద్ధా కపూర్ స్త్రీ 2 మూవీ బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసింది. ఆ విజయోత్సాహంలో మునిగితేలుతుంది. శ్రద్ధా తన విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుంటుంది. అంతేగాదు శ్రద్ధా నటనకు, గ్లామర్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. పాపులారిటీ పరంగా భారతదేశంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటీనటులలో శ్రద్ధా కపూర్ కూడా ఒకరు. అలాంటి శ్రద్ధాకి ఆరోగ్య స్ప్రుహ కూడా ఎక్కువే. ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో ఎలాంటి ఆహారం తింటే మంచి ఫిట్నెస్తో ఆరోగ్యంగా ఉంటామో తన అభిమానులతో షర్ చేసుకుంటుంటుంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా..ఇప్పటికి అలానే వన్నె తరగని అందంతో కట్టిపడేస్తుంది. అందుకు కారణం శ్రద్ధా పాటించే ఆహార నియమాలే. అవేంటో చూద్దామా..!2010లో తీన్ పట్టితో బాలీవుడ్లో అరంగేట్రం చేసిన శ్రద్ధా ఇప్పటికీ అలానే అంతే అందంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే యంగ్గా ఫిట్నెస్తో ఉండేందుకు మంచి జీవనశైలిని పాటిస్తుంది. అలాగే రోజువారీ వ్యాయామాలు తప్పనిసరి అంటోంది. అంతేగాదు ఇటీవల ఇంటర్యూలో శ్రద్ధా కపూర్ తాను కొన్నేళ్లక్రితం శాకాహారిగా మారానని చెప్పుకొచ్చింది. తన భోజనంలో పూర్తిగా స్వచ్ఛమైన శాకాహారమే ఉంటుందని తెలిపింది. ఇక ఆమె ఫిట్నెస్ ట్రైనర్ మాహెక్ నాయర్ కూడా శ్రద్ధా పోహా, ఉప్మా, దలియా, ఇడ్లీ లేదా దోస వంటి ఆరోగ్యకరమైన ఇంటి భోజనంతో ప్రారంభిస్తుందని చెబుతున్నారు. కక్డీ చి భక్రి వంటి సాధారణ మహారాష్ట్ర వంటకం, దాల్ చావల్, ఊరగాయలంటే మహా ఇష్టమని చెబుతున్నారు. ఇలా వైవిధ్య భరితమైన వంటకాలని ఇష్టపడే ఆమెకు ఈ డైట్ప్లాన్ని అనుసరించాలని చెప్పడం కాస్త కష్టమని చెప్పారు. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) అందువల్లే ఆమె రోజులో మూడు సార్లు విభిన్నంగా తినేందుకే ఇష్టపడుతుందట. కూరగాయల్లో బెండకాలయంటే ఇష్టమని, పండ్లలో మామిడి పండు అంటే మహా ఇష్టమని పేర్కొంది శ్రద్ధా. తన సినిమాల పరంగా ఎక్కువ డ్యాన్స్తో కూడిన వాటికి గానూ మితమైన కార్బ్, ప్రోటీన్, ఫ్యాట్ డైట్లు తీసుకుంటుందని శ్రద్ధా ట్రైనర్ చెబుతున్నారు. అలాగే బికినీ పాత్రలకు అనుగుణంగా మంచి టోన్ స్కిన్ కోసం అధిక ఫైబర్తో కూడిన పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వుతో కూడిన లీన్ డైట్ని తీసుకుంటుంది. ఆమె భోజనంలో తప్పనిసరిగా స్ప్రౌట్ సలాడ్లు, ఓట్స్ ఉంటాయి. అయితే ఏదైనా పండుగ సమయాల్లో మాత్రం డైట్ని పక్కన పెట్టేసి మరీ తనకిష్టమైన మోదకాలు, స్వీట్లు లాగించేస్తుంది. అయితే లిమిట్ దాటకుండా తీసుకుంటుదట. అంతేగాదు ఆమెకు ఫ్రెంచ్ ఫ్రైస్, వడ పావ్, పానీ పూరీ వంటివి కూడా చాలా ఇష్టమని చెబుతోంది శ్రద్ధా. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) (చదవండి: యాపిల్స్లోని ఈ రకాలు ట్రై చేసి చూశారా..!) -
బిగ్బాస్ బ్యూటీ శోభాశెట్టి ట్రెడిషనల్ లుక్.. అదిరిందిగా! (ఫొటోలు)
-
అమ్మచీరచుట్టుకున్న ఆనందంలో బిగ్ బాస్ బ్యూటీ (ఫొటోలు)
-
బ్యూటీ విత్ నేచర్!
అందం అంటే.. ఒకప్పుడు ఆడవారి సొంతం అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా అందరూ అందంగా ఉండేందుకు తాపత్రయపడుతున్నారు. నగరంలో సౌందర్య సాధనాల మార్కెట్ భారీగా నడుస్తోంది. అయితే ఇప్పుడున్న యువత తాము వాడుతున్న బ్యూటీ ప్రొడక్ట్స్పై చాలా కచి్చతత్వంగా ఉంటున్నారు. ఎంతలా అంటే ప్రతి ఉత్పత్తిలో ఉన్న పదార్థాలను తరచి తరచి చూస్తున్నారు. వాటి గురించి గూగుల్లో వెతికి అవి తమపై ఎలా ప్రభావితం చేస్తాయి.. తమ శరీర తత్వానికి ఎలా సరిపోతాయి.. వాటిని వాడితే ఎంత ప్రమాదకరం వంటి అంశాలను తెలుసుకుంటున్నారు. మరికొందరు కెమికల్స్ తక్కువగా ఉండే హెర్బల్ ఉత్పత్తులను మాత్రమే వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకొందరైతే ప్యూర్ నేచురల్ ప్రొడక్ట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. యువతలో పెరుగుతున్న అవగాహన చర్మ సౌందర్యంతో పాటు, కేశ సంరక్షణ విషయంలో చాలా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత కాలంలో జుట్టు రాలిపోవడం సర్వసాధారణంగా మారింది. ఇక చర్మం కూడా నిగనిగలాడాలని, తెల్లగా ఉండాలని అనేక సౌందర్య సాధనాలను వాడుతున్నారు. అయితే వాటిలో కూడా కెమికల్స్ లేని నేచురల్ ప్రొడక్ట్స్ వాడితే భవిష్యత్తులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవని నిర్ధారణ చేసుకున్న తర్వాతే వాటి జోలికి వెళ్తున్నారు. ముఖానికి వాడే ఉత్పత్తుల దగ్గరి నుంచి జుట్టుకు వాడే నూనెల వరకూ దాదాపు సహజసిద్ధంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఉదాహరణకు కొబ్బరినూనె దుకాణాల్లో కొనడం కన్నా ఎక్కడైనా నేచురల్గా దొరుకుతుందేమోనని ఆన్లైన్లో వెతుకుతున్నారు. కోల్డ్ ప్రెస్స్డ్ కొబ్బరినూనె, ఆముదం నూనె కొనేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలా ప్రతి సౌందర్యసాధనం సహజసిద్ధంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.కాస్త జాగ్రత్త మరి.. సహజసిద్ధంగా తయారు చేసిన ఉత్పత్తులు బాగానే పనిచేసినా.. గుడ్డిగా ఏదీ నమ్మకూడదని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎవరికి ఎలాంటివి పనిచేస్తాయో.. ఎవరి శరీర తత్వానికి ఎలాంటి రెమెడీలు వాడితే బాగుంటుందో తెలుసుకున్న తర్వాతే వాడటం మంచిదని చెబుతున్నారు. ముందు మన చర్మ తత్వం, జుట్టు సాంద్రత తెలుసుకోవాలని పేర్కొంటున్నారు. కాగా, అన్ని వస్తువులు, అన్ని ఔషధాలూ అందరికీ సరిపోవని, ఎవరికి ఎలాంటివి వాడితే మంచిదో ఓ అవగాహనకు రావాలంటున్నారు. ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఒకసారి డెర్మటాలజిస్టును సంప్రదించి, దాని గురించి వారితో చర్చిస్తే మంచిదని సూచిస్తున్నారు. నిర్మొహమా టంగా వాడాలనుకుంటున్న ఉత్పత్తుల గురించి చెప్పి.. వారి సలహా మేరకు వాడాలని పేర్కొంటున్నారు. లేదంటే ఎంతకాలం ఎలాంటి ప్రొడక్ట్స్ వాడినా ప్రయోజనం ఉండకపోవచ్చని, అనవసరంగా సమయంతో పాటు డబ్బులు వృథా చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు చెట్టు నుంచి తీసిన పసరు వంటివి కూడా ఎంత మోతాదులో వాడుతున్నామో తెలియకుండా వాడితే దుష్పరిణామాలు ఉంటాయని, ఏదీ మోతాదుకు మించి వాడటం సరికాదని చెబుతున్నారు.అందరికీ అన్నీ సెట్ కావు.. ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పిన రెమెడీలు అందరి చర్మతత్వం, కేశాలకు సరిపడకపోచ్చు. అందుకే ఏదీ గుడ్డిగా నమ్మడం సరికాదు. మనకు ఎలాంటి రెమెడీలు సరిపోతాయో చూసుకున్న తర్వాతే వాడటం మంచిది. ఏదైనా దీర్ఘకాలిక సమస్య ఉన్పప్పుడు హోం రెమెడీలు వాడటం అస్సలు మంచిది కాదు. సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఏ సమస్యకైనా 60 శాతం మేర చికిత్స అవసరం పడుతుంది. 20 శాతం నేచురల్ ఉత్పత్తులు వాడటం వల్ల మెరుగవుతుంది. మరో 20 శాతం మేర రోజువారీ ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. హోం రెమెడీలతో సమస్యలను తీవ్రతరం చేసుకుని మా వద్దకు చాలామంది వస్తుంటారు. అందుకే నిపుణులను సంప్రదించాకే ఏది వాడాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. – డాక్టర్ లాక్షనాయుడు, కాస్మెటిక్ డెర్మటాలజీ, ఏస్తటిక్ మెడిసిన్ఇన్స్టాలో వీడియోలు చూసి..సమాజంపై సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందో మనకు తెలిసిందే. ఇటీవల సౌందర్యాన్ని పెంపొందించేవంటూ.. పూర్వ కాలంలో పెద్దవాళ్లు వాడే వారంటూ పలు రకాల మొక్కల గురించి సామాజిక మాధ్యమాల్లో తెగ వీడియోలు చేస్తున్నారు. కొందరేమో వంటింట్లో సౌందర్యసాధనాలు అంటూ వీడియోలు పెడుతున్నారు. వాటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్గా అందంగా కనిపిస్తారని, చర్మ సమస్యలు తగ్గుతాయని, జుట్టు రాలిపోకుండా.. ఒత్తుగా పెరుగుతుందని సూచిస్తున్నారు. దీంతో చాలా మంది వీడియోలను చూసుకుంటూ ఇంట్లోనే సహజసిద్ధంగా ఉత్పత్తులను తయారుచేసుకుంటున్నారు. మళ్లీ పూర్వకాలంలోకి వెళ్తున్నారని చెప్పొచ్చు. -
దేవకన్యలా దేవర బ్యూటీ, అమ్మను తలపించేలా! (ఫొటొలు)
-
ఒక్క చేతికే రెండు డజన్ల గాజులు.. మృణాల్ కొత్త ఫ్యాషన్ (ఫొటోలు)
-
ఘనమైన ఎరుపు, పారాణి మెరుపు : సోనమ్ కపూర్ సౌందర్యం (ఫొటోలు)
-
ఇది.. మైక్రోకరెంట్ ఫేస్ లిఫ్ట్ డివైస్!
ఈరోజుల్లో సౌందర్యాభిలాషులకు తమ వయసును దాచే అద్భుతమైన పరికరాలు మార్కెట్లోకి చాలానే వస్తున్నాయి. ముడతలు, మచ్చలు, గీతలు లేకుండా చర్మానికి నిగారింపునిచ్చి, యవ్వనంతో కళకళలాడేలా మార్చే ఇలాంటి డివైస్లు వెంట ఉంటే, అందాన్ని కాపాడుకోవడం చాలా తేలిక. చిత్రంలోని ఈ మైక్రోకరెంట్ ఫేస్ లిఫ్ట్ మెషిన్ అధునాతన రేడియో ఫ్రీక్వెన్సీ, ఎలక్ట్రికల్ మజిల్ స్టిములేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది.ఈ ప్రొఫెషనల్ ఫేషియల్ మసాజర్ వడలిపోయిన చర్మాన్ని బిగుతుగా మార్చడానికి, చర్మానికి ఉండే సహజ స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి, చర్మం నిగారింపును పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఈ పోర్టబుల్ మెషిన్ చూడటానికి టార్చ్లైట్లా కనిపిస్తుంది. రీచార్జ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది.ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనిలోని రెడ్ లైట్ థెరపీ చర్మాన్ని బిగుతుగా మార్చడంతో పాటు దెబ్బతిన్న కొలాజెన్ పొరను సరిదిద్దడానికి సహాయపడుతుంది. అలాగే దీనిలోని బ్లూ కలర్ లైట్ థెరపీ మొటిమలను, మొటిమల వల్ల ఏర్పడే మచ్చలను తొలగిస్తుంది. దీనిలోని రెండు రకాల లైట్ థెరపీలకు మూడు స్థాయిల్లో వైబ్రేషన్ స్పీడ్ను కోరుకున్న విధంగా మార్చుకోవచ్చు. ఈ మెషిన్ ఆన్ అయిన ఆరు నిమిషాల్లో ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. దీని ధర 84 డాలర్లు (రూ.7,044) మాత్రమే!ఇవి చదవండి: అందాలొలికే ఈ బొమ్మలు.. సుమనోహరం! -
Janhvi Kapoor: చీరలో అదిరిపోయిన దేవర బ్యూటీ (ఫోటోలు)
-
పండగల వేళ : చందమామలా మెరిసిపోవాలంటే!
వరుస పండుగల సీజన్ వచ్చేస్తోంది. వినాయక చవితి మొదలు తెలుగుముంగిళ్లు దసరా, దీపావళి,సంక్రాంతి సంబరాలతో కళకళలాడతాయి. అంతేనా ఆడబిడ్డలు పట్టుచీరలు, కొత్త నగలు అంటూ షాపింగ్తో సందడిగా ఉంటారు. దీనికి తోడు గృహిణులు, కొత్తకోడళ్లు, కొత్త పెళ్లి కూతుళ్లు తమ అందానికి మెరుగులు దిద్దుకునే పనిలో బిజీబిజీగా ఉంటారు. మరి ముఖం, చర్మం, మెరుస్తూ చందమామలా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పవు. అవేంటో ఒకసారి చూద్దాం.చర్మం నిగనిగలాడుతూ ఉండాలంటే, చక్కటి ఆహారం తీసుకోవాలి. పండగల సందడిలో స్వీట్లు వగైనా ఎక్కువగా తినేస్తాం కాబట్టి ఒంటికి కాస్తంత పని చెప్పాలి. కనీసం ఓ అరగంట పాటైనా వాకింగ్, యోగా లాంటి వ్యాయామం తప్పని సరి. అలాగే రోజుకు సరిపినన్ని నీళ్లు తాగేలా జాగ్రత్త పడాలి. ఒక ఆరోగ్య సంరక్షణ, ముఖ సౌందర్య విషయానికి వస్తే... కొవ్వు పదార్థాలకు దూరంగా, అప్పుడప్పడు కొన్ని ఆరోగ్యమైన ద్రవాలను తాగుతూఉండాలి. అందమైన చందమామ లాంటి ముఖం కోసం సహజంగా దొరికే వస్తువులో ప్యాక్ వేసుకుంటూ ఉండాలి. ఫేస్ మాస్క్రోజ్ వాటర్తో ముఖం మెరుస్తూ కనిపిస్తుంది. రోజ్ వాటర్, కలబంద, తేనె సహాయంతో మంచి మాస్క్ వేసుకుంటే ముఖం కొత్త కళతో మెరిసిపోతుంది. రోజ్ వాటర్లో మరికొన్ని సహజసిద్ధమైన ఉత్పత్తులను ఉపయోగించి ఆరోగ్యకరమై ఫేస్ మాస్క్లను తయారు చేసుకోవచ్చు. ఇంకా చర్మాన్ని బట్టి పసుపు, శెనగపిండి, పెరుగు, అలోవెరా మిశ్రమాలతో ప్యాక్ వేసుకొని, ఆ తరువాత ఐస్ ముక్కలతో మృదువుగా మసాజ్ చేసుకోవాలి.కీరా, పైనాపిల్ జ్యూస్కీరదోసలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉన్నందు వల్ల చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సహజత్వాన్ని కాపాడతాయి ఇక పైనాపిల్లో ఉండే బ్రొమెలిన్ అనే ఎంజైమ్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వాపులను తగ్గిస్తుంది.కీర, పైనాపిల్ ముక్కలు, తాజా పుదీనా ఆకులు వేసి జ్యూస్ చేసుకొని, దీనికి రుచుకోసం నిమ్మరసం, కొద్దిగా తేనె కలుపుకొని తాగితే చర్మం యవ్వనంగా, కాంతిమంతంగా మారుతుంది.ముఖంపై మంగు మచ్చులాంటివి కూడా తగ్గుతాయి. క్యారెట్, బీట్రూట్ యాపిల్ జ్యూస్ (ఏబీసీ)ఆపిల్, బీట్రూట్ క్యారెట్ కాంబినేషన్లో జ్యూస్ తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయి. యాపిల్, క్యారెట్లో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటే బీట్ రూట్ పోషకాలు మయం.శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. కంటి , చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.ఇంకాజంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. పచ్చని ప్రకృతిలోగడిపితే ఆరోగ్యానికి ఆరోగ్యం మానసిక వికాసం కూడా. అంతేకాదు స్వచ్ఛమైన గాలి, సూర్యకాంతితో డీ విటమిన్ అందుతుంది. అందమైన చర్మం కోసం ఇది చాలా అవసరం. -
చీరలో ఉంగరాల జుట్టుతో సీరియల్ బ్యూటీ విష్ణుప్రియ (ఫొటోలు)
-
బిగ్బాస్ షోలో మరో ఆర్జీవీ బ్యూటీ.. ఈమె కరాటే ఫైటర్ (ఫొటోలు)
-
'సరిపోదా శనివారం' బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫోటోలు)
-
బిగ్ బాస్ బ్యూటీ కృష్ణాష్టమి సందడి మామూలుగా లేదుగా! (ఫోటోలు)
-
Janhvi Kapoor: ఎరుపు రంగు చీరలో సరికొత్త లుక్తో జాన్వీ కపూర్ (ఫోటోలు)
-
Aditi Rao Hydari: హీరామండి బ్యూటీ ఆదితిరావు హైదరీ స్టన్నింగ్ లుక్స్.. (ఫోటోలు)
-
ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలా! అయితే ఇలా చేయండి...
కొందరు ఏ వయసులోనైనా సహజత్వాన్నే కోరుకుంటారు. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలని తహతహలాడతారు. అలాంటి వారికి ఈ ఫేషియల్ టోనర్ చక్కగా పని చేస్తుంది. దీన్ని చాలా సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు.చీక్ బోన్స్స కోసం ప్రత్యేకంగా రూపొందిన ఈ ఫేషియల్ టోనర్.. ముఖంలో సహజ సౌందర్యాన్ని, యవ్వన రూపాన్ని మెరుగుపరచడానికి.. ఎంతగానో సహకరిస్తుంది. ఇది.. సహజమైన, సౌకర్యవంతమైన గాడ్జెట్గా.. మార్కెట్లో మాంచి డిమాండ్ను అందుకుంటోంది. ఇందులో 3 ప్రోగ్రామ్స్ను మార్చిమార్చి సెట్ చేసుకోవచ్చు. పది నిమిషాలు, పదిహేను నిమిషాలు, ఇరవై నిమిషాల టైమింగ్తో.. వేరియబుల్ ట్రీట్మెంట్ లెవెల్స్తో ఉన్న ఈ డివైస్.. హ్యాండ్ హోల్డ్ కంట్రోలర్గా పని చేస్తుంది.హెడ్సెట్ బేస్డ్ డెలివరీ సిస్టమ్తో తయారైన ఈ డివైస్ని.. తల వెనుక నుంచి ముఖానికి అటాచ్ చేసుకోవచ్చు. చార్జ్ చేసుకుని వాడుకునే వీలు ఉండటంతో.. దీన్ని ఎక్కడైనా సులభంగా వినియోగించుకోవచ్చు. ఈ టోనర్ ముఖ కండరాలను దృఢంగా మార్చేస్తుంది. ముఖాన్ని నాజూగ్గా చేసేస్తుంది. వారానికి ఐదుసార్లు దీనితో ట్రీట్మెంట్ తీసుకుంటే.. ఫలితం ఉంటుంది. అయితే ప్రతి ట్రీట్మెంట్ 20 నిమిషాల వరకు ఉండేలా చూసుకోవాలి. సుమారు 12 వారాలు ఈ టోనర్ ట్రీట్మెంట్ తీసుకుంటే.. 40 దాటినవారు కూడా 20లా కనిపిస్తారట.డివైస్కి ఉండే రెండు జెల్ ప్యాడ్స్ని ముఖ చర్మానికి ఆనించి.. చిత్రంలో ఉన్న విధంగా పెట్టాలి. ప్యాడ్స్ పెట్టుకునే ముందు.. ఆ భాగంలో లోషన్ లేదా క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇక ఈ మెషిన్ ని ముఖానికి పెట్టుకునేప్పుడు ఖాళీగా ఉండాల్సిన పనిలేదు. ల్యాప్ టాప్ వర్క్ కానీ.. వ్యాయామాలు కానీ.. ఇంటి పని కానీ ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఈ మోడల్స్లో బ్లాక్, వైట్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. -
వాడేసిన టీ పొడితో అందాన్ని పెంచుకోవచ్చు! ఎలాగో తెలుసా..!
టీ తయారు చేశాక సాధారణంగా టీ పొడిని వడకట్టి బయటపడేస్తారు. అలాగే టీ బ్యాగులను కూడా పడేస్తారు. అందులో మిగిలిన టీ పొడితో అందాన్ని పెంచుకోవడమే కాదు, ఇంటిని మెరిపించుకోవచ్చు. చాలామందికి టీతోనే రోజు ప్రారంభమవుతుంది. చెప్పాలంటే.. దాదాపు ప్రతి ఇంట్లో ఉదయం, సాయంత్రం టీ తాగాల్సిందే. టీ తయారు చేసిన తర్వాత, టీ పొడి మిగిలిపోతుంది. దీనిని తరచూ చెత్తగా భావించి చెత్తబుట్టలో వేస్తాం. ఈ పనికిరాని టీ పొడితో ఇంటి శుభ్రతను నుంచి అందం వరకు పలు రకాలుగా ఉపయోగించొచ్చు. అదెలాగో సవివరంగా చూద్దాం. !అద్దాలు శుభ్రం చేసేందుకు..టీ పొడితో ఇంటి అద్దాలను పాలిష్ చేయవచ్చు. దీని కోసం, మిగిలిన టీ ఆకులను నీటిలో మరిగించండి. ఈ నీటిని స్ప్రే బాటిల్ లో నింపి దాని సహాయంతో అద్దాలను శుభ్రం చేస్తే అద్దాలు తళతళ ప్రకాశిస్తాయి. దీనితో పాటు, గ్యాస్ బర్నర్లు ఎంత నల్లగా మారినా, మీరు వాటిని నిమిషాల్లో శుభ్రం చేయవచ్చు. టీ నీటిలో కొద్దిగా డిష్ వాష్ మిక్స్ చేసి బ్రష్ సహాయంతో క్లిన్ చేస్తే గ్యాస్ బర్నర్లను తళతళ మెరిసిపోతాయి..పాదాల దుర్వాసనరోజంతా బూట్లు ధరించడం వల్ల పాదాల్లో తరచూ దుర్వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు మిగిలిపోయిన టీ పొడిని నీటిలో బాగా మరిగించి చల్లారాక ఆ నీటిలో మీ పాదాలను 10 నుండి 15 నిమిషాలు ఉంచండి. ఇలా రోజూ చేస్తే పాదాల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.నేచురల్ షైనింగ్..మిగిలిపోయిన టీ పొడి జుట్టుకు ఒక వరం. ఇది శిరోజాలకు నేచురల్ షైన్ జోడించడానికి పనిచేస్తుంది. అలాగే జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దీని కోసం, టీ పొడిని శుభ్రమైన నీటిలో మరిగించాలి. మరిగిన తర్వాత నీళ్లు చల్లారనివ్వాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత చివరగా ఈ నీటితో తలస్నానం చేయాలి. కొద్ది రోజుల్లోనే జుట్టు సిల్కీగా మెరుస్తూ ఉంటుంది. మొక్కలకు ఎరువుగా..ఇంట్లో పెంచుకునే మొక్కలకు సహజ ఎరువుగా టీ పొడి ఉపయోగపడుతుంది. ఇంట్లో చెట్లు, మొక్కలు ఉంటే ఈ టీ పొడివాటి ఎదుగుదల రెట్టింపు అయ్యేలా చూసుకోవచ్చు. మిగిలిపోయిన టీ పొడిని కంపోస్టులా మొక్కల కుండీల్లో వేసేయండి. ఇది మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అయితే పంచదార కలిపిన టీ పొడిని మాత్రం బాగా కడిగి అప్పుడు వినియోగించండి.(చదవండి: క్రీడా నైపుణ్యం, మాతృత్వం రెండింటిని ప్రదర్శించిన ఆర్చర్ !) -
Ashika Ranganath: ఫస్ట్ సినిమా ఫట్.. కానీ చిరంజీవి మూవీలో ఛాన్స్.. అందాల ఆషిక (ఫొటోలు)
-
ఈ ఎలక్ట్రిక్ రెడ్ లైట్ థెరపీతో.. చాలా ప్రయోజనాలు పొందవచ్చు!
అందాలను అందించే గాడ్జెట్స్ కోసం సౌందర్యాభిలాషులు నిరంతరం అన్వేషిస్తుంటారు. అలాంటి వారికి ఈ మసాజర్ ఒక మంత్రదండం లాంటిది. ఇది అందించే ఎలక్ట్రిక్ రెడ్ లైట్ థెరపీతో చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ఈ హీటెడ్ అండ్ వైబ్రేషన్ ఫేస్ మసాజర్ వయసుని ఇట్టే తగ్గించేసి, ముఖానికి నవయవ్వన కాంతినిస్తుంది. చేతిలో ఇట్టే ఇమిడిపోయే ఈ పరికరం చర్మం మీదనున్న ముడతలు, గీతలను పోగొట్టి, మృదువుగా మారుస్తుంది.ఈ ఫేషియల్ మసాజర్ 3 లెవెల్ హీటింగ్ మోడ్తో, వైబ్రేషన్ మోడ్తో ప్రత్యేకంగా రూపొందింది. చర్మానికి పైపైనే కాకుండా లోతుగా ట్రీట్మెంట్ అందించి, చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా ముఖం, మెడ, వీపు, పొట్ట, నడుము, కాళ్లు, చేతులు ఇలా ప్రతిభాగాన్నీ అందంగా మలచుకోవచ్చు.ఈ పరికరం శరీరంలోని ఆక్యుపాయింట్లను ఉత్తేజపరుస్తుంది. దీన్ని ఎవరికి వారు స్వయంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇది ఎల్ఈడీ డిస్ప్లే స్క్రీ¯Œ తో ఉంటుంది. ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి కూడా ఇది చాలా బాగుంటుంది.ఈ ఫేస్ లిఫ్టర్ మసాజర్ చూడటానికి చిన్నగా, క్యూట్గా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. ఏ సమయంలోనైనా దీనితో సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అలాగే చర్మానికి ఆయిల్ లేదా నచ్చిన లోష¯Œ అప్లై చేసుకుని, అనంతరం దీనితో మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీని ధర 37 డాలర్లు. అంటే 3,097 రూపాయలు. ఇలాంటి మోడల్స్లో ఎప్పటికప్పుడు అప్డేట్ వెర్షన్స్ అందుబాటులోకి రావడంతో వీటికి డిమాండ్ బాగా పెరుగుతోంది. -
'కాంతార' బ్యూటీ.. షార్ట్లో భలే అందంగా ఉంది! (ఫొటోలు)
-
డిఫరెంట్ స్టైలిష్ లుక్స్తో దేవర భామ.. ఫోటోలు
-
ఒక్క సినిమాతో సెన్సేషన్.. టాలీవుడ్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
త్వరగా.. మేకప్ వేసుకోవాలనుకుంటున్నారా? అయితే దీనిని వాడండి..
ఈరోజుల్లో చిన్నచిన్న పార్టీలకైనా.. పెద్దపెద్ద ఫంక్షన్స్కైనా వేసుకున్న డ్రెస్కి తగ్గట్టుగా.. మేకప్ చేసుకోవడం కామన్ అయిపోయింది. దాన్ని చక్కగా సరిదిద్దుతుంది ఈ న్యూడెస్టిక్స్ కన్సీలర్ పెన్సిల్.వేగంగా మేకప్ వేసుకునేటప్పుడు.. ఐలైనర్స్, మస్కారా, ఐబ్రో పెన్సిల్ వంటివి పక్కకు అంటుకుని.. అందాన్ని చెడగొడుతుంటాయి. దాన్ని సరిచేయడానికి బోలెడు సమయం పడుతుంది. అలాంటి శ్రమను దూరం చేస్తుందీ పెన్సిల్. మేకప్ చెదిరిన చోట ఈ పెన్సిల్తో లైట్గా రుద్దుకుంటే చాలు.. మెరిసిపోతుంది ముఖం.అంతేకాదు ముఖం మీది చిన్న చిన్న మచ్చల్ని, గీతల్నీ దీంతో పోగొట్టుకోవచ్చు. అలాగే కంటి కిందున్న నల్లటి వలయాలను కనిపించకుండా చేసుకోవచ్చు. ఇందులో స్కిన్ కలర్ షేడ్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. మన స్కిన్ టోన్కి సరిపడా పెన్సిల్ని ఎంచుకుంటే సరిపోతుంది. దీనితో అవసరం అయిన చోట.. ముందుకు వెనుకకు రుద్ది, పొడిగా ఉండేలా.. వేలికొనలతో ఒత్తినట్లుగా రుద్దుకోవాలి. ఈ పెన్సిల్కి ఒక షార్పెనర్ కూడా లభిస్తుంది. ఇదే మోడల్లో చాలా రంగుల్లో ఈ పెన్సిల్స్ అందుబాటులో ఉన్నాయి.దీని తయారికీ.. విటమిన్ ఈ, నేచురల్ మాయిశ్చరైజర్, యాంటీ ఆక్సిడెంట్, షియా బటర్ వంటివి చాలానే వాడతారు. దాంతో దీన్ని డైరెక్ట్గా ఫేస్కి మేకప్లా అప్లై చేసుకోవచ్చు. ఇదే పెన్సిల్లో లిప్ స్టిక్స్ కలర్స్ కూడా లభిస్తున్నాయి. దీని ధర 24 డాలర్లు. అంటే 2,006 రూపాయలన్న మాట.ఇవి చదవండి: ఈ బీచ్బబుల్ టెంట్లకి.. ప్రత్యేకత ఏంటో తెలుసా!? -
Monal Gajjar: వర్షంలో బిగ్బాస్ బ్యూటీ ఆటలు (ఫోటోలు)
-
బాలీవుడ్ మెరుపుతీగ కృతిసనన్ బర్త్ డే.. ఈమె చెల్లి కూడా హీరోయినే (ఫొటోలు)
-
'విశ్వంభర' బ్యూటీ.. జీన్స్లో అందమే అసూయపడేలా! (ఫొటోలు)
-
ఈ హెయిర్ రిమూవల్ మెషిన్ పనితీరుకి.. ఎవరైనా షాక్ అవాల్సిందే..!
ఐస్ కూలింగ్ టచ్తో.. లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్తో ఆకట్టుకుంటున్న ఈ హెయిర్ రిమూవల్ మెషిన్ పనితీరుకి సౌందర్య ప్రియులంతా ముగ్ధులు అవాల్సిందే. ఈ మెషిన్తో అవాంఛిత రోమాలను నొప్పి లేకుండా తొలగించుకోవచ్చు. దీనితో క్రమం తప్పకుండా ట్రీట్మెంట్ కొనసాగిస్తే.. చర్మం మీది వెంట్రుకలు పలుచపడి.. కొంత కాలానికి మొదలుకంటా తొలగిపోతాయి.3 వారాల నుంచి ఫలితం కనిపిస్తుంటుంది. 5 వారాలకు స్పష్టమైన రిజల్ట్ని చూడొచ్చు. అయితే దీని లేజర్ ట్రీట్మెంట్ అందుకునే ముందు.. అవాంఛిత రోమాలున్న చోట షేవ్ చేసుకుని.. క్లాత్తో క్లీన్ చేసుకుని.. ఆ తర్వాతే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ సమయంలో ఈ డివైస్.. చల్లదనాన్నిస్తుంది.చేతులు, కాళ్లు, ముఖం, నడుము, పొట్టభాగం, అండర్ ఆర్మ్స్, బికినీ లైన్ ఇలా ప్రతిచోట దీనితో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇన్ టెన్ ్స పల్స్డ్ లైట్ టెక్నాలజీ .. ఆటో ఫ్లాషింగ్ .. 3 మోడ్స్ ఆప్షన్ ్సతో ఈ మెషిన్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ హెయిర్ రిమూవల్ మెషిన్ ని.. మహిళలతో పాటు పురుషులూ వినియోగించుకోవచ్చు. అయితే పచ్చబొట్టు ఉన్న ప్రదేశాల్లో, ట్యాన్ ఎక్కువగా ఉన్న చోట, గాయలున్న భాగాల్లో దీన్ని యూజ్ చేయకపోవడమే మంచిది. అలాగే గర్భిణీలు ఈ ట్రీట్మెంట్కి దూరంగా ఉండాలి.ఇక ఈ పరికరాన్ని ఉపయోగించే సమయంలో.. పవర్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి. ముందే చార్జింగ్ పెట్టుకుని వినియోగించుకునే వీలు ఉండదు. తెల్లగా .. కాస్త చామన ఛాయలో ఉన్నవారికి మాత్రమే ఈ మెషిన్ ఉపయోగపడుతుంది. బ్లాక్, బ్రౌన్ , డార్క్ బ్రౌన్ , లైట్ బ్రౌన్ కలర్స్లో ఉన్న వెంట్రుకలను మాత్రమే ఈ మెషిన్ గుర్తించగలదు. వైట్ కలర్, రెడ్ కలర్ వెంట్రుకలను తొలగించలేదు. దీని ధర 239 డాలర్లు. అంటే 19,951 రూపాయలు. -
ఆరోగ్యంగా, అందంగా యంగ్ లుక్ కావాలా.. ఈ చిట్కాలు పాటించండి!
వయసు పైబడుతున్న కొద్దీ అందంగా, ఫిట్గా కనిపించమేమోననే బెంగ అందర్నీ పట్టి పీడిస్తూ ఉంటుంది. అయితే, కొన్ని సూచనలు పాటిస్తే ఆరోగ్యంతోపాటు, మెరిసే చర్మాన్ని కాపాడకోవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఒకసారి చూద్దాం.వయసు 40 దాటే సరికి, ముఖ వర్చస్సు తగ్గడం, ముడతలు, చర్మం సాగడం వంటి సమస్యలు మొదలవుతాయి. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ మార్పులు చాలా తొందరగా కనిపిస్తాయి. చర్మం నిగారింపు కోల్పోతుంటుంది. పెళ్లి, పిల్లలు తరువాత స్త్రీలలో జరిగే శారీరక మార్పులు, హార్మోన్ల ప్రభావమే దీనికి కారణం.జీవన శైలి, ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని మాత్రమేకాదు, బయటికి మనం కనిపించే తీరును కూడా ఎంతగానో ప్రభావితం చేస్తాయి. వృద్ధాప్య ఛాయలు తొందరగా కనిపించకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో సరిపడా పోషకాలు ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పని వ్యాయామం కూడా కీలకమే. ఆరోగ్యంగా ఉండాలంటే, చక్కటి ఆహారం, సరిపడా నిద్ర, క్రమం తప్పని వ్యాయామం. వ్యాయామం శరీరాన్ని యవ్వనంగా ఉంచుతుంది. వాకింగ్, స్విమ్మింగ్, యోగా, ధ్యానం, ఏరోబిక్ వ్యాయామాలు శారీరక దృఢత్వాన్ని పెంచుతాయి. వ్యాయామం కొల్లాజెన్ ఉత్పత్తికి సాయం చేస్తుంది.యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, చేపలు, గింజలు ఆహారంలో చేర్చుకోవాలి.సరిపడా నీళ్లు తాగాలి.చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొల్లాజెన్ అవసరం. ఇది చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయం చేస్తుంది. ఎముకలు బలంగా, దృఢంగా ఉండేలా చేస్తుంది.విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.ఎక్కువ ఎండకు, ఎక్కువ చలికి ఎక్స్పోజ్ కాకూడదు. రసాయన రహిత క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్ వాడకం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖం చర్మం సాగిపోకుండా, బిగుతుగా ఉంచేందుకు ఫేషియల్ మాస్కులు కొంతవరకు పనిచేస్తాయి.అలాగే ప్రభావవంతమైన యాంటీ ఏజింగ్ స్కిన్కేర్ ఉత్పత్తులు, యాంటీ ఏజింగ్ క్రీమ్లు, హైడ్రేటింగ్ సీరమ్లు, హైలురోనిక్ యాసిడ్, విటమిన్లు, నర్చరింగ్ ఆయిల్స్, షియా బటర్ ఉన్న మాయిశ్చరైజర్లను వైద్య నిపుణుల పర్యవేక్షణలో వాడవచ్చు.నోట్ : మనిషికి ముసలితనం రావడం, యవ్వనంలోని అందాన్ని కోల్పోవడం సహజం. అయితే ఆరోగ్యంగా ఉండేందుకు, పోషకాలతో నిండిన ఆహారం, చక్కటి వ్యాయామం, ఇతర ఆరోగ్య సూత్రాలను పాటించాలి. మానసిక,శారీరక ఆరోగ్యం బాహ్య సౌందర్యాన్ని ప్రభావితం చేస్తాయి. -
Shanaya Kapoor: పిస్తా కలర్ లెహంగాలో హీరోయిన్.. ఇప్పుడిదే ట్రెండ్ (ఫోటోలు)
-
అనంత్ అంబానీ పెళ్లిలో ధగధగ మెరిసిపోతున్న దేవర భామ.. పోటోలు
-
కాస్ట్ లీ కారు కొన్న సీరియల్ బ్యూటీ లహరి (ఫొటోలు)
-
కల్కి 'కైరా' ఫోటోలు వైరల్.. ఈ విషయాలు తెలుసా..?
-
Mouni Roy: సొగసరి చీర కడితే.. (ఫోటోలు)
-
ఆలియా లుక్ చూశారా? వావ్ అనాల్సిందే! (ఫోటోలు)
-
బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Tejaswi Madivada: ఈ తెలుగందాన్ని ఎవరూ పట్టించుకోరే..! (ఫోటోలు)
-
Kajal Aggarwal: బ్లాక్ డ్రెస్లో ‘చందమామ’ మెరుపులు (ఫొటోలు)
-
'మీర్జాపుర్' బ్యూటీ.. ధగధగా మెరిసిపోతూ మరింత అందంగా (ఫొటోలు)
-
ఉప్పెన బ్యూటీ.. న్యూలుక్, అస్సలు గుర్తుపట్టలేరు (ఫోటోలు)
-
శివావీ రాజశేఖర్ బర్త్డే స్పెషల్.. క్యూట్ అండ్ హాట్నెస్ తగ్గేదే లే! (ఫొటోలు)
-
Janhvi Kapoor: పూలగౌనులో దేవర బ్యూటీ సోయగాలు (ఫోటోలు)
-
Triptii Dimri: యానిమల్ బ్యూటీ గ్లామర్ షో (ఫోటోలు)
-
ఫేస్ అండ్ బాడీ మసాజర్..
ఈ ఫేస్ అండ్ బాడీ మసాజర్.. ఆయుర్వేద పద్ధతులతో ప్రేరణ పొందిన వెల్నెస్ టూల్. నాణ్యమైన కాంస్యంతో రూపొందిన ఈ మసాజర్తో మసాజ్ చేసుకుంటే బాడీకి చక్కటి విశ్రాంతి కలుగుతుంది. ఒత్తిడి, అలసట వంటివి మాయమై రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం పునరుజ్జీవమవుతుంది.ముఖం, కంటి చుట్టూ ఉండే కండరాలను బిగుతుగా చేసి, వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. టేక్వుడ్ హ్యాండిల్, సీడ్ ఫ్రీ–బ్రాంజ్ మెటల్ క్యాప్తో.. తేలికగా.. వినియోగించడానికి అనువుగా ఉంటుంది. ఈ టూల్ని స్వయంగా ఎవరికి వారే ఉపయోగించుకోవచ్చు.ముఖం, పాదాలు, చేతులు, ఇతర ప్రాంతాలకు ఇష్టమైన సీరం లేదా నూనెను అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి. ఈ టూల్కి ఒకవైపున్న చిన్న వృత్తాకారపు భాగాన్ని ముఖం, నుదురు ప్రాంతాల్లో ఆనించి.. గుండ్రంగా కదిలించాలి. అలా కంటివైపు క్రమంగా కదులుతూ.. కనుబొమ్మలు, బుగ్గలు, చెవుల చుట్టూ, గడ్డం, పెదవుల చుట్టూ, మెడవైపూ సున్నితంగా గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసుకోవాలి.మసాజ్ తర్వాత ఈ టూల్ లోహపు భాగాలను సబ్బుతో లేదా తడి గుడ్డతో క్లీన్ చేసుకోవాలి. ఈ మసాజర్స్లో పలు మోడల్స్ల్లో, పలు సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి మార్కెట్లో 5 వందల రూపాయల నుంచీ అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో బుక్ చేసుకునే ముందు రివ్యూస్ చూసి కొనుగోలు చెయ్యడం మంచిది. -
పచ్చిమిర్చితో అందమా? అస్సలు ఊహించలేరు!
పచ్చి మిరపకాయలేని కూరను ఊహించలేం కదా. పచ్చిమిర్చి అనగానే సహజంగా సుర్రున మండే కారం, కూరల్లో వాటి ప్రాధాన్యత, ఇంకాస్త ముందుకెడితే ఊరబెట్టిన మిరపకాయలు గుర్తొస్తాయి కదా. కానీ మన శరీరానికి కావాల్సిన విటమిన్లు పచ్చి మిర్చిలో పుష్కలంగా ఉంటాయి. జుట్టు అందాన్ని, చర్మమెరుపును సాధించవచ్చు. రోగ నిరోధక వ్యవస్థను పెంచే విటమిన్ సీ, చర్మ సంరక్షణకు తోడ్పడి, కంటి చూపును మెరుగు పరిచే విటమిన్ ‘ఏ’ కూడా వీటి ద్వారా లభ్యమవుతుంది తెలుసా? మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.పచ్చిమిర్చిని శాస్త్రీయంగా క్యాప్సికమ్ ఫ్రూట్సెన్స్ అంటారు. మిర్చిల్లో క్యాప్సైసిన్ అనే పదార్థమే దీని రుచి కారంగా ఉండడానికి కారణం. దీన్ని ఏడాది పొడవునా సాగు చేస్తారు. దాదాపు 400 రకాల పచ్చి మిరప కాయలు వినియోగంలో ఉన్నాయట. వీటిల్లో ఒక్కొక్కటి ఒక్కో స్థాయిలో ఘాటు కలిగి ఉంటాయి.యాంటీమైక్రోబయల్ లక్షణాలతోపాటు, పచ్చి మిరపకాయలలో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, టానిన్లు, స్టెరాయిడ్స్ , క్యాప్సైసిన్ వంటి అనేక మొక్కల సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. పచ్చి మిరపకాయల్లో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలతో పాటు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయని పరిశోధనలో తేలింది.పచ్చి మిరపకాయల వల్ల కలిగే ప్రయోజనాలుదీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణడయాబెటిస్కు రోగులకు ఉపయోగపడుతుంది.రక్తహీనతను నయం చేయడంలో సహాయపడుతుందిబరువు తగ్గడానికి సహాయం చేయడంచలికాలంలో శరీర ఉష్ణోగ్రతలను బ్యాలెన్స్ చేస్తుందిపొట్టలో అల్సర్లను తగ్గిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ కారణంగా పచ్చిమిర్చి నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. బోలు ఎముకల వ్యాధి నివారణలో సహాయం చేస్తుందిజీర్ణక్రియను మెరుగుపరుస్తుందిఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది.వీటిల్లోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడితే, విటమిన్ ఈ వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందిశరీరంలో రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. జలుబు, దగ్గు సమస్యలకు పచ్చిమిర్చి దివ్యౌషధం.నోట్: ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కదా అని దేన్నీ అతిగా తినడం మంచిది కాదు. శృతిమించితే ప్రయోజనాలు లభించక పోగా అనారోగ్యాన్ని చేతులారా కొని కొంటామనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. -
'బిగ్బాస్' బ్యూటీ శ్రీ సత్య బర్త్డే.. ఈమె స్మైల్ వేరే లెవల్ (ఫొటోలు)
-
నిషా కళ్ల వయ్యారి.. చేస్తోంది జాదూగరి (ఫొటోలు)
-
కళ్లు చెదిరే చీర అందాలు... ప్రేమమ్ బ్యూటీ (ఫొటోలు)
-
మెరుపు తీగలా మెరుస్తున్న ఈ ష్యాషన్ క్వీన్ని చూశారా? (ఫొటోలు)
-
భర్తతో హీరోయిన్ ఆలియా భట్ క్యూట్ (ఫొటోలు)
-
అల్ట్రా స్టైలిష్ లుక్స్లో దసరా బ్యూటీ (ఫొటోలు)
-
వడాపావ్ అమ్ముతూ రోజుకు రూ.40 వేల సంపాదన.. ఎవరీ బ్యూటీ! (ఫోటోలు)
-
ఆహా.. అనిపించేలా నేహా లుక్స్ (ఫొటోలు)
-
అందం అంటే..?
‘అందమె ఆనందం’ అని ఒక సినిమా కవి అందాన్ని నిర్వచించాడు, ఆనందానికి నిర్వచనం ఇవ్వ బోతూ. ఆనందాన్ని కలిగించ కలిగింది మాత్రమే అందమని కవిహృదయం. ఎవరికి దేని వల్ల ఆనందం కలుగుతుందో చెప్పలేము. అందుకని అందం చూసే వాళ్ళ కళ్లలో ఉంటుందే కానీ వస్తువులో కాదు అనే ఆంగ్ల సామెత వచ్చింది. పైగా అందం వ్యక్తిగతం.‘‘లోకో భిన్న రుచిః’’ అన్నట్టు ఒక్కొక్కరి కళ్ళకి అందంగా కనిపించింది వేరొకరికి అందంగా కనిపించక పోవచ్చు. అందం విషయంలో చాలామంది దృష్టి చర్మం దగ్గర ఆగిపోతుంది. కానీ,‘‘నిజమైన అందం శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుంది’’ అంటాడు ఆంగ్లకవి జాన్ కీట్స్.అందం అన్నది వస్తుగతం కాదు అనే విషయం పాశ్చాత్యులు కూడా బాగా అర్థం చేసుకున్నారు అని అర్థమయింది కదా!అందానికి సంబంధించి ఒక్కొక్క దేశంలో ప్రమాణాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. చైనా దేశంలో స్త్రీల పాదాలు ఎంత చిన్నవిగా ఉంటే అంతటి అందగత్తెలుగా పరిగణిస్తారు. ముక్కు కొస పైకి ఉండి, ముక్కు రంధ్రాలు కనపడేట్టు ఉండటం అందంగా కొన్ని పాశ్చాత్య దేశాలలో పరిగణించబడుతుంది. భారతీయులు అందంగా పరిగణించే పొడవుగా, కోటేరు వేసినట్టు ముక్కు ఉంటే ఏనుగు ముక్కు అని వేళాకోళం చేస్తారట కూడా. ఆఫ్రికా దేశంలో పెదవులు ఎంత పెద్దగా ఉంటే అంత అందంగా ఉన్నట్టు. అందుకోసం చిన్నతనంలో పెదవులకి చిన్న చిన్న చిడతల వంటి వాటిని తగిలిస్తారట! భారతీయుల సౌందర్య దృష్టిలో కూడా పారమార్థికత ఉంది. సౌందర్యం పరమాత్ముడి లక్షణాలు, లేక తత్వాలలో ఒకటి. సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ తత్త్వం ‘‘సత్యం, శివం, సుందరం’’.సృష్టిలోని అందమంతా మూర్తీభవించిన పురుషరూపం శివుడు.ఆయనే చొక్కనాథుడు, సుందరేశ్వరుడు. అదే స్త్రీ రూపమైతే లలితా త్రిపురసుందరి. భౌతికమైన అందం శాశ్వతం కాదు. ముద్దుముద్దుగా చూడగానే ముచ్చట గొలిపే పాలబుగ్గల పసివాడు చూస్తూ ఉండగానే పెద్దవాడు అవుతాడు. అప్పుడు పాలబుగ్గలు అందానికి హేతువు కాదు అని అర్థమవుతుంది.ఈ భౌతికరూపాన్ని అధిగమించిన అందాన్ని గురించి మాత్రమే భారతీయ ఋషులు, దార్శనికులు ప్రస్తావించారు. ఆ ప్రమాణాలని అనుసరించే ్రపాచీన కవులు సౌందర్య వర్ణన చేశారు. చేతులని, పాదాలని, ముఖాన్ని, కన్నులని కూడా పద్మాలతో పోల్చుతారు. కారణం వాటి ఆకారం అట్లా ఉందని కాదు. పద్మం అందమైనది.ఆహ్లాదకరమైనది, మృదువైనది, శుభప్రదమైనది, పవిత్రమైనది. కనుక ఆ అవయవాలు అంతటి పవిత్రమైనవి అని సూచించటం.ఇతరమైన ఉపమానాలు కూడా అటువంటివే. పైకి భౌతికరూప వర్ణనలాగా అనిపించినా అంతరార్థం వేరు. బాహ్యసౌందర్యం ఆత్మసౌందర్య వ్యక్తీకరణ మాత్రమే. భారతీయులకి అందం వస్తువు లేక మనిషికి సంబంధించింది కాదు. మనస్సుకి ఆత్మకి సంబంధించింది. ఆత్మసౌందర్యం మొదలైన పదబంధాలని వింటూనే ఉన్నాము. అంటే అందం వస్తువు లేక మనిషి మూలతత్త్వానికి సంబంధించింది. ఉదాహరణకి బెల్లం చూడటానికి అందంగా కనిపించదు. దాని అందం అంతా దాని రుచిలో ఉంటుంది. మనిషి మనసు స్వచ్ఛంగా ఉంటే అందంగా ఉన్నట్టు అనిపిస్తారు. నిజానికి వారి అవయవాల్లో ఒక్కటి కూడా అందాల పోటీల వాళ్ళ కొలతలకి సరిపోవు. అవయవాల పొందిక వల్ల అందంగా ఉన్నట్టు కనిపిస్తారు. పొందికకి తోడు వారి ప్రేమపూరితమైన మనస్సు. దయ, సుహృద్భావం వంటి సద్భావనలతో మనస్సు నిండి ఉంటే ఆ సానుకూల భావతరంగాలు మనసు నుండి కనుల ద్వారా వెలువడి ముఖాన్ని కాంతిమంతంగా చేస్తాయి. అప్పుడు అందంగా కనిపించదా? దీన్ని వర్చస్సు అని కూడా చెప్పవచ్చు. – డా.ఎన్.అనంతలక్ష్మి -
Shraddha Kapoor: పింక్ డ్రెస్లో అదరగొట్టిన సాహో హీరోయిన్ (ఫోటోలు)
-
శ్రీలీల బాత్రూం స్టిల్స్.. గ్లామర్ డోస్ పెంచేసింది! (ఫొటోలు)
-
పల్లెటూరి పొలం గట్లపై రచ్చచేస్తున్న పాపులర్ బ్యూటీ ఫోటోలు వైరల్
-
'ప్రేమలు' బ్యూటీ బర్త్ డే స్పెషల్.. రేర్ అండ్ క్యూట్ ఫొటోలు
-
Beauty Tips: పండులాంటి ప్యాక్..!
ముఖంలో నిగారింపు, చర్మంలో కోమలత్వం తగ్గుతుందని దిగులు చెందుతున్నారా..! అయితే ఈ సింపుల్, బెస్ట్ బ్యూటీ చిట్కాలు మీకోసమే..ఇలా చేయండి..– అరటితొక్కతో సహా పండుని ముక్కలుగా తరిగి పేస్టు చేయాలి.– ఈ పేస్టుకు రెండు టీస్పూన్ల పచ్చిపాలు పోసి మరోసారి గ్రైండ్ చేసి పదిహేను నిమిషాలు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి.– తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా అప్లై చేసి ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి.– అరటి పండులో ఉన్న విటమిన్ బి6, బి12, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియంలు చర్మానికి పోషణ అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి.– ఈ ప్యాక్ను వారానికి రెండుసార్లు వేసుకోవడం వల్ల ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.– క్రమం తప్పకుండా వాడితే ఫలితం త్వరగా కనిపిస్తుంది.ఇవి చదవండి: ఇంకు, తుప్పు వంటి మొండి మరకలు సైతం తొలగించాలంటే..? ఇలా చేయండి.. -
ఇంతకీ ఎవరీ శతవరి? చరిత్రలో తొలిసారిగా..
‘కృత్రిమ నవ్వు’ అని వెక్కిరిస్తాం. ‘వారి మాటల్లో అంతా కృత్రిమత్వమే’ అని విమర్శిస్తాం. ‘కృత్రిమత్వం’ ‘సహజత్వం’ భిన్న ధ్రువాలు అనే వాస్తవాన్ని కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తిరగ రాసింది. కృత్రిమ మేధస్సు నుంచి పుట్టిన అందాల యువతులు నవ్వితే ఆ నవ్వులో ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. మాట్లాడితే... మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుందేగానీ ఎక్కడా కృత్రిమ ఛాయ కనిపించదు.మానవులతో పోటీ పడుతూ ‘ఎక్కడా తగ్గేదేలే’ అంటున్న డిజిటల్ సొగసరులకు ఏఐ సబ్స్క్రిప్షన్ ప్లాట్ఫామ్ ‘ఫ్యాన్ వ్యూ’ అందాల పోటీ నిర్వహించింది. ‘మిస్ ఏఐ’ పోటీ జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. ‘మిస్ ఏఐ’ పోటీలో ప్రపంచవ్యాప్తంగా పదిహేను వందల ఏఐ మోడల్స్, డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్లు పోటీ పడ్డారు. ‘టాప్ –10’ ఫైనలిస్ట్ జాబితాలో మన దేశం నుంచి డిజిటల్ దివా జరా శతవరి చోటు సాధించింది.బ్యూటీ, టెక్ స్కిల్స్, సోషల్ మీడియాలో వీరి ప్రభావం ఎంత... మొదలైన అంశాలు ‘మిస్ ఏఐ’ ఎంపిక ప్రక్రియలో ఉంటాయి. న్యాయ నిర్ణేతలలో ఇద్దరు ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు ఉండడం విశేషం. ‘మిస్ ఏఐ విజేత’ ఎవరవుతారో అనే ఆసక్తికంటే ‘ఎవరీ జరా శతవరి?’ అనే ఆరా ఎక్కువ అయింది. అందానికి అక్షరాలా నిర్వచనంలా ఉన్న ఈ శతవరి ఎవరో తెలుసుకుందాం..ఒక మొబైల్ కంపెనీ యాడ్ ఏజెన్సీకి కో–ఫౌండర్ అయిన రాహుల్ చౌదరి శతవరి సృష్టికర్త. శతవరిని ‘డిజిటల్ మీడియా మేధావి’గా అభివర్ణించాడు రాహుల్. ‘మిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’లో శతవరికి ‘టాప్–10’ చోటు దక్కిన సందర్భంగా తన లింక్డ్ ఇన్ పోస్ట్లో సంతోషాన్ని వ్యక్తం చేశాడు రాహుల్.‘ఈ గుర్తింపు ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ కమ్యూనిటీకి జరా శతవరి చేసిన విశేష కృషిని తెలియజేస్తుంది. ప్రపంచ వేదికపై భారత్, ఆసియాకుప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తాను. శతవరి భారత్ నుంచి ఏకైక ఫైనలిస్ట్, ఆసియా నుంచి ఇద్దరిలో ఒకరు’ అని పోస్ట్లో స్పందించాడు రాహుల్.కృత్రిమ మేధస్సు మంచి చెడుల గురించి చర్చ జరుగుతున్న సమయంలో ‘శతవరి’ని ఎలా చూడాలి?’ అనే ప్రశ్నకు ‘వందశాతం పాజిటివ్’గానే అనే సమాధానం వినిపిస్తోంది. అందం, సోషల్ మీడియాలోని అభిమాన గణం మాత్రమే శతవరి విలువకుప్రాతిపదిక కాదు. హార్మోన్ సమస్యల నుంచి కుంగుబాటు వరకు ఎన్నో అంశాలపై మహిళలకు అవగాహన కలిగిస్తుంది. కృత్రిమ మేధస్సులోని సానుకూల కోణానికి సంపూర్ణంగా అద్దం పడుతుంది.‘ఏ.ఐ. సామర్థ్యం గురించి ప్రజలకు అవగాహన కలిగించడం ఆమె లక్ష్యం’ అంటున్నాడు జరా శతవరి సృష్టికర్త రాహుల్. కృత్రిమ మేధస్సు మంచి చెడుల గురించి చర్చ జరుగుతున్న సమయంలో ‘శతవరి’ పనితీరును ఎలా చూడాలి? ’ అనే ప్రశ్నకు ‘వందశాతం పాజిటివ్’గానే అనే సమాధానం వినిపిస్తుందిశతవరి శక్తి ఇది...– ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్లో ఏఐ–పవర్డ్ సోషల్ మీడియా స్ట్రాటజీ, ఎనాలటిక్స్ నేర్చుకుంది.– 2023 నుంచి పీఎంహెచ్ బయోకేర్కు ‘బ్రాండ్ అంబాసిడర్’గా ఉంది.– ‘ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ టాలెంట్ మేనేజర్’గా తన టాలెంట్ను చూపించింది.– సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా ‘వావ్’ అనిపించింది. ఇన్స్టాగ్రామ్లో సుమారు 8000 మంది ఫాలోవర్లు ఉన్నారు.– స్ట్రాటిజిక్ ప్లానింగ్, కంటెంట్ డెవలప్మెంట్, డేటా ఎనాలసిస్, బ్రాండ్ ఎవేర్నెస్, బ్రాండ్ అడ్వకసీ, ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్, క్రియేటివ్ ఐడియేషన్, ట్రెండ్–సావి, హెల్త్ అండ్ వెల్నెస్ కన్సల్టింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, ఫ్యాషన్ స్టైలింగ్, కెరీర్ డెవలప్మెంట్ లాంటి విభాగాలలో ప్రతిభ చాటుతోంది. -
మిస్ ఏఐ అందాల పోటీలో టాప్ 10 ఫైనలిస్ట్గా జరా శతావరి!
ప్రపంచంలోనే తొలిసారి ఏఐతో రూపొందించిన మోడల్ల కోసం అందాల పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ అందాల పోటీల్లో టాప్ టెన్ ఫైనలిస్ట్గా భారతదేశానికి చెందిన జరా శతావరి నిలిచారు. ఆమె పీసీఓఎస్ , డిప్రెషణ యోధురాలు. ప్రపంచంలోనే తొలిసారిగా జరుగుతున్న వర్చ్యువల్ హ్యుమన్ అందాల పోటీల్లో పాల్గొన్న దాదాపు 1500 మంది అభ్యర్థులో భారతకి ప్రాతినిధ్యం వహిస్తున్న శతావరి ఎంపక కావడం విశేషం. అయితే ఈ పోటీల్లో అందం, సాంకేతికత, సోషల్ మీడియా ప్రభావం ఆధారంగా ఈ నెలాఖరులోగా విజేతలను నిర్ణయించడం జరుగుతుంది. ఇంతకీ ఎవరీమె అంటే..ఎవరీ జరా శతావరి.?ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో దాదాపు ఏడువేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. జరాకి భోజనం, ట్రావెలింగ్ అంటే మహా ఇష్టం. ప్రజలను ఆరోగ్యం, వృత్తి, అభివృద్ధి, ఫ్యాషన్ పరంగా మంచి జీవితాన్ని గడిపేలా శక్తిమంతం చేయడం ఆమె లక్ష్యం. ఇక ఆమె వర్చువల్ ప్రయాణంలో జూన్ 2023 నుంచి పీఎంహెచ్ బయోకేర్కి బ్రాండ్ అంబాసిడర్" ఉంది. అలాగే ఆగస్టు 2024లో డిజిమోజో ఈ సర్వీస్ ఎల్ఎల్పీలో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ టాలెంట్ మేనేజర్గా చేరింది.అంతేగాదు ఆమె 13 రంగాల్లో నైపుణ్యం కలిగి ఉంది. వ్యూహాత్మక ప్లానింగ్లో, కంటెంట్ అభివృద్ధి, డేటా విశ్లేషణ, బ్రాండ్ అవగాహన, బ్రాండ్ అడ్వకేసీ, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, సృజనాత్మక ఆలోచన, ఆరోగ్యం అండ్ సంరక్షణ కౌన్సిలింగ్, ఫ్యాషన్ స్టైలింగ్ అండ్ కెరీర్ డెవలప్మెంట్ గైడెన్స్లలో మంచి నైపుణ్యం ఉంది ఆమెకు. తనని తాను డిజిటల్ మీడియా మావెన్గా అభివర్ణించే రాహుల్ చౌదరి మిస్ ఏఐ అందాల పోటీల్లో శతావరి టాప్ 10లో ఉందని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. దాదాపు 1500 మంది పాల్గొనే ఈ పోటీల్లో ఆమెకు టాప్ 10లో చోటు దక్కడం విశేషం అని చెప్పారు. అంతేగాదు ఇన్ఫ్లుయెన్సర్ కమ్యూనిటీకి ఆమె చేసిన అత్యుత్తమ సహకారానికి నిదర్శనమే ఫ్యాన్వ్యూ వరల్డ్ ఏఐ క్రియేటర్స్ అవార్డ్స్ ద్వారా వచ్చే ఈ గుర్తింపు అని రాహుల్ ప్రశంసించారు కూడా. ఈ ప్రపంచ వేదికపై ఆమె భారతదేశానికి, ఆసియాకి ప్రాతినిధ్యం వహించడం నిజంగా చాలా గొప్ప గౌరవం అని అన్నారు. అలాగే ఆసియా నుంచి పాల్గొన్ని ఇద్దరిలో శతావరి భారత నుంచి ఎంపికైన ఏకైక ఫైనలిస్ట్ కావడం విశేషం అన్నారు బ . కాగా, ఈ మిస్ ఏఐ తొలి మూడు విజేతల నగదు మొత్తం రూ. 16 లక్షలకు పైనే ఉంటుందట. అలాగే మిస్ ఏఐ క్రియేటర్ రూ. 4 లక్షల నగుదు బహుమితి అందుకోగా, ఏఐ మెంటర్ షిప్ ప్రోగ్రామ్లు, పీఆర్ సేవలకు మరిన్ని నగదు బహుమతులు పొందే అవకాశం ఉందని సమాచారం. (చదవండి: -
మెట్ గాలా–2024లో ఇండియన్ బ్యూటీ ఫోటోలు వైరల్
-
పసుపుతో అందం, ఆరోగ్యం, ఈ టిప్స్ ఎపుడైనా ట్రై చేశారా?
పసుపు శుభ్రపదమైందే కాదు ఆరోగ్యంకరమైంది. కూడా. అందుకే భారతీయ వంటకాల్లో, ఇతర ఆహార పదార్థాల తయారీలో విరివిగా వినియోగిస్తారు. వంటింట్లో దివ్యౌషధం పసుపు. యాంటీ బయాటిక్, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్న పసుపు కేవలం ఆహార పదార్థాల్లోనే కాదు, సౌందర్య పోషణలోనూ చాలా ఉపయోగపడుతుంది.ఆరోగ్య ప్రయోజనాలు ⇒ పసుపును ఆహారంలో రెగ్యులర్ చేసుకోవడం వల్ల డయాబెటిస్ ముప్పు నుండి దూరంగా ఉండొచ్చట. ⇒ సేంద్రీయ పసుపు వాడటం వల్ల కొన్ని రకాల కేన్సర్లనుంచి కూడా దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతారు.⇒ చలికాలంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులకు పసుపు, తులసి, మిరియాల కషాయం బాగా పనిచేస్తుంది. ⇒ జలుబు చేసినపుడు వేడినీటిలో చిటికెడంత పసుపు వేసుకొని ఆవిరి పడితే ఉపశమనం లభిస్తుంది. ⇒ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. చర్మ సమస్యలను తగ్గించడానికి పసుపు చక్కని పరిష్కారం.⇒ పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణక్రియ సవ్యంగా సాగేందుకు పసుపు తోడ్పడుతుంది.పసుపుతో అందంపసుపు, పెరుగు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుని, బాగా ఎండిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ముఖంమృదువుగా కాంతివంతంగా మారి మెరుస్తుంది. ఇదే మిశ్రమాన్న ఒంటికి నలుగులాగా కూడా వాడుకోవచ్చు. ముఖం మీది మచ్చలు తొలగి పోవాలంటే.. పసుపు, టమాటా గుజ్జు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.పసుపు, కలబంద గుజ్జు కలిపి ఫేస్ ప్యాక్ వేస్తుంటే ముఖంపై ఉండే ముడతలు పోయి యవ్వనంగా కనిపిస్తారు.పసుపు, నిమ్మరసం, తేనె కలిపి ఫేస్ ప్యాక్ వేస్తుంటే ముఖంపై ఉండే డార్క్ స్పాట్స్ ,మొటిమలు పోతాయి.పసుపు, తాజా కలబంద గుజ్జు కలిపి ఫేస్ ప్యాక్ వేస్తుంటే జిడ్డు చర్మం తొలగి ఫ్రెష్గా మారుతుంది. -
చెక్ రిపబ్లిక్ అందాలు ఆస్వాదిస్తున్న సైనా.. మరో బ్యూటీ ఎవరంటే? (ఫొటోలు)
-
గ్లామ్ అప్ ఫెస్ట్ 2024 సెకండ్ ఎడిషన్ లాంచ్, మూడు రోజులపాటు
భారతదేశంలోని అతిపెద్ద బ్యూటీ ఈవెంట్ ‘గ్లామ్ అప్ ఫెస్ట్ 2024’ రెండో ఎడిషన్ షురూ అయింది. స్వదేశీ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ద్వారా జూన్ 14 నుండి జూన్ 17 వరకు జరిగే ఈ ఈవెంట్లో గ్లామ్ అప్ సేల్తో పాటు ప్రీమియం, స్వదేశీ D2C బ్రాండ్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. అందం, సౌందర్య సాధనాలు, చర్మ సంరక్షణ, సువాసన ఉత్పత్తుల అద్భుతమైన డీల్స్ అందిస్తుంది. ఇంకా సరికొత్త లాంచ్లు, డీల్స్ , సిగ్నేచర్ కలెక్షన్స్, బ్రాండ్ లాంచింగ్స్, ఇంటరాక్టివ్ యాక్టివిటీలు, ఫ్యాషన్ షో, ప్రోడక్ట్ ట్రయల్స్ డెడికేటెడ్ ఫోటో అండ్ వీడియో స్టేషన్లు ఉంటాయి.ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ప్రకటించిన ఈ గ్లామ్ అప్ ఫెస్ట్ సెకండ్ ఎడిషన్లో 3,500+ బ్యూటీ అండ్ లైఫ్స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్ఏకం చేసే ఈ గ్రాండ్ ఈవెంట్లో 70కిపైగా టాప్ బ్రాండ్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. గ్లామ్ అప్ ఫెస్ట్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్ల కోసం అద్భుతమై ప్లాట్ఫారమ్ను అందిస్తోందని ఫ్లిప్కార్ట్ FMCG అండ్ జనరల్ మర్చండైజ్ బిజినెస్ హెడ్ మంజరీ సింఘాల్ తెలిపారు. తమ కస్టమర్లకు ఈ ఈవెంట్ చక్కటి బ్యూటీ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందన్నారు.స్థానిక, అంతర్జాతీయ బ్రాండ్లను ఒకే తాటిపైకి తీసుకువస్తూ, ఈ ఏడాది ఫ్లిప్కార్ట్ గ్లామ్ అప్ ఫెస్ట్ను తాప్సీ పన్ను, సిద్ధాంత్ చతుర్వేది, రోహిత్ సరాఫ్, అదా శర్మ , పష్మీనా రోషన్లతో సహా పలువురు ఈ ఫెస్ట్ను సెలబ్రేట్ చేసుకుంటారు. వర్చువల్ ట్రై-ఆన్, వీడియో కామర్స్, స్కిన్ ఎనలైజర్లు లాంటి వినూత్న సాధనాలతో ఫ్లిప్కార్ట్ , AR , VR సామర్థ్యాలను కూడా ఉపయోగించుకోవచ్చు. -
బర్త్డే గర్ల్ 'శ్రీలీల' అరుదైన ఫోటోలు చూశారా..?
-
Beauty Tips: పాదాలు అందంగా కనిపించాలా? అయితే ఈ టూల్ని..
తల వెంట్రుక నుంచి కాలి గోరు వరకు ఆరోగ్యంగా ఉంటేనే అందం సొంతమవుతుంది. కేశ సౌందర్యం ముఖానికి ఆకర్షణ కాబట్టి.. దానిపట్ల ఎలాగూ శ్రద్ధ పెడతాం! పాదాలనే పెద్దగా పట్టించుకోం! పాదాలే కదా అని పెదవి విరవకుండా.. ఇదిగో ఈ టూల్ని తెచ్చుకోండి.. వాటిని చక్కగా సంరక్షించి.. ఆరోగ్యం, అందం రెంటినీ చేకూరుస్తుంది.చిత్రంలోని ఈ డెడ్ స్కిన్ రిమూవర్లో.. 2 లెవెల్స్లో స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. డివైస్తో పాటుగా రీప్లేసబుల్ గ్రైండింగ్ హెడ్స్ లభిస్తాయి. వాటిలో 2 స్క్రబ్ హెడ్స్తో పాటు.. ఒక రోలర్ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్తో పోర్టబుల్ డివైస్గా ఉన్న ఈ రోలర్.. యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది.హ్యాండిల్తో.. తేలికగా, ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటుందీ డివైస్. తడి లేదా పొడి చర్మాలకు అనువైనది. అలాగే స్త్రీ, పురుషులు ఎవరైనా వాడొచ్చు. దీన్ని శుభ్రపరచడం తేలిక. కాళ్లు, గోళ్లు, గోళ్ల చుట్టూ ఉండే చర్మం.. ప్రతి భాగాన్ని శుభ్రపరచి మృదువుగా మారుస్తుంది.ఈ ఎలక్ట్రిక్ మేకప్ రిమూవర్ ఫుట్ స్క్రబ్ డెడ్ స్కిన్ ఎక్స్ఫోలియేషన్.. హై హీల్స్ వాడేవారికి.. పాదాలు కనిపించేలా డ్రెస్సులు వేసుకునేవారికి చక్కగా ఉపయోగపడుతుంది. అందమైన పాదాలను కోరుకునేవారికి.. ఇది చక్కటి బహుమతి అవుతుంది. ఈ ఫుట్ స్పా బ్యూటీ రోలర్ ఇంట్లో ఉంటే.. పెడిక్యూర్ కోసం పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ధర కేవలం 449 రూపాయలు. దీన్ని స్నేహితులకు, శ్రేయోభిలాషులకు గిఫ్ట్గానూ ఇవ్వచ్చు.ఇవి చదవండి: ఏకంగా శునకాలకై.. అమెరికన్ కంపెనీ 'కడీ' పేరుతో.. -
74 ఏళ్ల 'ఏజ్లెస్ బ్యూటీ'..చూస్తే టీనేజ్ అమ్మాయిలా..!
ఎవ్వరైనా కనీసం 50 దాటితేనే ఏజ్డ్గా కనిపించేస్తారు. ఎంతలా మేకప్తో కవర్ చేద్దామన్నా..ముడతలు పడ్డ చర్మాన్ని దాచడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా మెడ, చేతులు, ముసలివాళ్లైనట్లు క్లియర్గా కనిపించేస్తుంది. అలాంటిది ఈ బామ్మ ఏజ్లో ఉన్న ఈ మహిళను చూస్తే వామ్మో అంటారు. అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోకండి. ఆ రహస్యం ఏంటో ఆమె మాటల్లోనే విందామా..!అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ వెరా వాండ్ వయసు 74 ఏళ్లు. కానీ ఆమె అందానికే అందానివే.. అన్నంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమెను చూడగానే ఎవ్వరూ కూడా ఆమెకు అంత ఏజ్ ఉంటుందని అస్సలు అనుకోరు. అంతేగాదు తాను ఎప్పుడూ మెరిసిన జుట్తుతో అస్సలు కనిపించనని చాలా ధీమాగా చెప్పేస్తోంది. అయితే ఒకనొక మీడియా ఇంటర్యూలో మాత్రం తన తలకు రంగు వేస్తానని ఒప్పుకుంది. అయినప్పటికీ స్కిన్ అంత టైట్గా యువకుల మాదిరిగా ఉండటం మాత్రం ఆశ్చర్యమే. View this post on Instagram A post shared by Vera Wang (@verawang) ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ పేరుగాంచిన వాంగ్ని తన బ్యూటీ రహస్యం ఏంటని పలు మీడియాలు ప్రశ్నించగా.."తాను 19 ఏళ్ల నుంచి ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నాను. తానెప్పుడూ యవ్వనం గురించి ఆలోచించలేదని చెబుతోంది. ఎందుకంటే..ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళలతో రోజూ పని చేస్తుంటాను కాబట్టి నాకు ఆ ఆలోచనే రాదంటోంది. వాళ్లను చూస్తు ఉత్సాహాంగా పనిచేయడం వల్ల తాను ఇలా యంగ్గా కనిపిస్తున్నాని అంటోంది." వాంగ్. నిజంగా గ్రేట్ కదా ఆమె. ఈ ఏజ్లో కూడా టీనేజ్ అమ్మాయి లుక్ మెయింటైన్ చేస్తోందంటే మాములు విషయం కాదు కదా..! View this post on Instagram A post shared by Vera Wang (@verawang)(చదవండి: అనుష్క శర్మ బుడ్డి హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే..నోరెళ్లబెట్టడం ఖాయం!) -
Cannes 2024: సన్నజాజి తీగలా సొట్ట బుగ్గల సుందరి (ఫొటోలు)
-
ఈ మినీ మెషిన్తో.. స్కిన్ సమస్యలకు చెక్!
వయసు పెరిగే కొద్ది కళ్ల చుట్టూ ముడతలు, పెదవుల చుట్టూ గీతలు పడటం సర్వసాధారణం. అయితే దాన్ని.. చిత్రంలోని ఈ మైక్రోకరెంట్ లైన్ స్మూతింగ్ ఇన్స్టంట్ ప్లంపర్ డివైస్తో తగ్గించుకోవచ్చు. ఈ మినీ మెషిన్.. ఆ సమస్యను కేవలం వారం రోజుల్లోనే పరిష్కరించేస్తుంది.ఈ మినీ మెషిన్ తో ట్రీట్మెంట్ తీసుకుంటే.. కళ్లు కాంతిమంతమవుతాయి. పెదవులు ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఈ డివైజ్కి ఒకవైపు రెండు చిన్న చిన్న బాల్స్ లాంటి మసాజర్ హెడ్స్ ఉంటాయి. వాటిని చర్మానికి ఆనించి మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టూల్కి మధ్యలో చిన్న రోలర్ బాటిల్ ఉంటుంది. అందులో సీరమ్ ఉంటుంది.మసాజ్ చేసుకునేముందు ఆయా ప్రదేశాల్లో ఆ సీరమ్ని అప్లై చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి. సీరమ్ రోలర్ని డివైస్ నుంచి బయటికి తీసుకోవచ్చు.. తిరిగి అక్కడే అటాచ్ చేసుకోవచ్చు. ఈ సీరమ్ .. యాంటీ ఆక్సిడెంట్ కెఫిన్, క్రాన్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్, రోజ్ వాటర్, ఫర్మింగ్ నియాసినామైడ్, విటమిన్ బి5 వంటి 95% సహజ పదార్థాలతో తయారైంది.ఈ మెషిన్ తో సుమారు ఏడు రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే.. కళ్లు, పెదవుల చుట్టూ ఉన్న ముడతలు, గీతలు పోయి సహజమైన అందం సొంతమవుతుంది. ఈ డివైస్కి చార్జింగ్ పెట్టుకుని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ మసాజర్లో 5 లెవల్స్తో కూడిన ఆప్షన్్స ఉంటాయి. దాంతో అవసరాన్ని బట్టి పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ధర 186 డాలర్లు. అంటే 15,530 రూపాయలన్నమాట.ఇవి చదవండి: ఇవి మార్జాల పుష్పాలనుకుంటున్నారా! -
ఏఐతో మరింత అందంగా: రిలయన్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో భాగంగా ఉన్న టీరా బ్యూటీకేర్ కృత్రిమ మేధను వాడుతున్నట్లు కంపెనీ మార్కెటింగ్ హెడ్ తేజస్ కపాడియా తెలిపారు. తమ కస్టమర్లను మరింత అందంగా మార్చేందుకు కంపెనీ కొత్త టెక్నాలజీని పరిచయం చేసిందని చెప్పారు.ఈ సందర్భంగా కపాడియా మాట్లాడుతూ..‘ఆర్ఐఎల్ కొత్త వెంచర్ తిరా బ్యూటీ సెక్టార్లో వినియోగదారులకు సేవలందిస్తోంది. ఈ రంగంలో ఇప్పటికే ఉన్న పోటీదారులకంటే ప్రత్యేకంగా కస్టమర్లను ఆకర్షించేందుకు టెక్నాలజీను వాడుతున్నాం. వినియోగదారుల స్కిన్టోన్ను ఫొటోతీసి వారికి కావాల్సిన బ్యూటీ ప్రొడక్ట్లను సిఫార్సు చేసేలా ఏఐను ఏర్పాటుచేశాం. ఇందులో స్కిన్ఎనలైజర్ టెక్నాలజీ ఉపయోగించాం. దీని సహాయంతో తమకు ఇష్టమైన ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు. కంపెనీ వెబ్సైట్లో మేకప్, చర్మ సంరక్షణ పాఠాలను కూడా అందిస్తున్నాం’ అని చెప్పారు.వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారాల్లో బ్యూటీ సెక్టార్ ఒకటి. ఇందులో రిలయన్స్ వంటి దిగ్గజ కంపెనీ ప్రవేశించడంతో చాలా కంపెనీల ఉత్పత్తులపై ప్రభావంపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖేశ్అంబానీ కుమార్తె ఇషా నేతృత్వంలోని టీరా కంపెనీ ఇప్పటికే స్కిన్కేర్ బ్రాండ్ కికో మిలానో, ఎల్బీఎంహెచ్ గ్రూప్నకు చెందిన బ్యూటీ రిటైలర్ సెఫోరాను కొనుగోలు చేసింది. ఈ కంపెనీ రాకతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాటా గ్రూప్నకు చెందిన పాలెట్, నైకా వంటి బ్రాండ్లపై ప్రభావం ఉండనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: బంగారుకొండను పేరుస్తున్న ఆర్బీఐ..!భారత్లో ఈ బిజినెస్కు భవిష్యత్తులో ఆశించిన మార్కెట్ ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లు కూడా దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. 2023లో జపాన్కు చెందిన షిసిడో యాజమాన్యంలోని ‘నార్స్ కాస్మెటిక్’ షాపర్స్ స్టాప్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది పాప్స్టార్ రిహన్న తన కాస్మెటిక్స్ కంపెనీ ఫెంటీ బ్యూటీ ఉత్పత్తులను నైకాతో కలిసి భారత్లో ప్రవేశపెట్టారు. -
‘జెల్లె స్కామ్’.. డబ్బులు పోగొట్టుకున్న అమెరికన్ బ్యూటీ
అమెరికన్ బ్యూటీ బ్రియానా సియాకా ‘జెల్లె స్కామ్’లో డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ స్కామ్ పట్ల అందరూ అప్రమత్తంగా హెచ్చరించారు. అసలేంటీ స్కామ్, డబ్బులు ఎలా పోగొట్టుకున్నది ఆమె వివరించారు.న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. యూఎస్లో మాజీ మిస్ న్యూయార్క్ అయిన బ్రియానా సియాకా టిక్టాక్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఇద్దరు యువకులు తన నుంచి 2,000 డాలర్లు (రూ. 1.66 లక్షలు) ఎలా లాక్కున్నారో వివరించారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న సియాకా, తాను మాడిసన్ స్క్వేర్ పార్క్లో కూర్చుని పాడ్కాస్ట్ వింటుండగా ఇద్దరు కుర్రాళ్లు తన వద్దకు వచ్చి తమ బాస్కెట్బాల్ జట్టు కోసం నిధులు సేకరిస్తున్నామని, తమకు సహాయం చేయాలని కోరారని చెప్పారు.తాను వారికి కొంత డబ్బు ఇవ్వడానికి అంగీకరించానని, కానీ తన వద్ద నగదు లేకపోవడంతో జెల్లె యాప్ ద్వారా చెల్లించేందుకు ఒప్పుకొన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తమ అకౌంట్ వివరాలు నమోదు చేసేందుకు తన ఫోన్ తీసుకున్నాడని, మరో కుర్రాడు తనను మాటల్లో పెట్టగా అతను తన అకౌంట్ నుంచి 2,000 డాలర్లు వారి ఖాతాకు మళ్లించుకున్నారని వివరించారు. న్యూయార్క్ పోలీసుల ప్రకారం, ఇది చాలా సాధారణమైన స్కామ్. దీని దుండగులు విరాళాల పేరుతో డబ్బును స్వాహా చేస్తారు."నేను ఆశ్చర్యపోయాను. ఈ అబ్బాయిలు చాలా మంచిగా, అమాయకంగా మాట్లాడితే వారు నిజంగానే తమ జట్టు కోసం విరాళాలు సేకరిస్తున్నారని అనుకున్నాను" అని సియాకా చెప్పారు. జెల్లె (Zelle) అనేది జేపీ మోర్గాన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికాతో సహా ఏడు బ్యాంకుల యాజమాన్యంలోని పీర్-టు-పీర్ నెట్వర్క్. 2017లో ప్రారంభమైన జెల్లె అతిపెద్ద యూఎస్ పీర్-టు-పీర్ చెల్లింపుల నెట్వర్క్లలో ఒకటిగా ఎదిగింది. -
అమెరికా : చర్మం రంగు.. కోటి తిప్పలు!
శామ్ పిట్రోడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఆయన ఈ మధ్య ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ మనది చాలా వైవిద్యమున్న దేశం, ఇక్కడ దక్షిణాదివాళ్ళు ఆఫ్రికన్లలా, ఉత్తరాదివాళ్లు శ్వేతజాతీయుల్లా, తూర్పువాళ్ళు చైనీయుల్లా, పశ్చిమ వాసులు అరబ్బుల్లా కనబడుతారు, అయినా మనమంతా ఒక్కటే! అన్నాడు. ఆయన మాటల్లో తప్పుందా? లేదా అన్నది పక్కనబెడితే ఆర్య, ద్రావిడ అంతరాల చర్చ మనకు కొత్తేమి కాదు. కానీ ఇది ఎన్నికల సమయం కావడంతో రాజకీయ పార్టీల మధ్య అదో వివాదాస్పద విషయం అయింది. అమెరికాలో భారత సంతతి వారిని మామూలుగానైతే బ్రౌన్స్( Wheatish ) అంటే గోధుమవర్ణం కలవారని అంటుంటారు. అంతమాత్రాన ఒక ఉప ఖండమంత ఈ దేశంలో ఉన్నవారందరూ అదే రంగు కలవారు కాదు కదా! ఈ గోధుమ వర్ణం చాలావరకు ఉత్తరాది వాళ్లకు వర్తిస్తుంది, దక్షిణాదిలో నలుపు వర్ణస్తులే ఎక్కువ. తెలుపు పాశ్చాత్యుల రంగు. అమెరికాలోని 70 శాతానికి పైగా ప్రజలు కాకేసియన్ (యూరోపియన్) జాతివారు, మిగతా 30 శాతంలో లాటినో, ఆఫ్రికా అమెరికన్స్, ఆసియన్స్ వారి రంగు, రూపురేఖలు వేరువేరుగా ఉంటాయి. అయితే చాలామంది ముఖ్యంగా స్త్రీలు ఏ దేశస్తులైనా వారికి జన్మతో సహజంగా వచ్చిన శరీర వర్ణంపై, అందంపై అంతగా తృప్తి ఉన్నట్లు కనబడదు. భారత్లో పసుపు, కుంకుమ, కాటుకలే గొప్ప సౌందర్య సాధనాలు, మధ్యకాలంలో వచ్చినవి స్నోలు, పౌడర్లు, ఇప్పుడైతే లెక్కకు మిక్కిలి. రంగు పెంచుకునే పాట్లు..అమెరికాలో నల్లవారైతే కాస్త తెల్లగా కనబడాలని, బ్రౌన్ కలర్ వున్నవారు కొంత తెల్లబడాలని, పూర్తి తెల్లవారు ఆ కలర్ కాస్త తగ్గితే బాగుండునని, ఉన్న శరీర వర్ణ సౌష్టవాన్ని మరింత పెంచుకోవాలని అందుకు శతప్రయత్నాలు చేస్తున్నారు. మహిళల సౌందర్య తృష్ణ ఫలితంగా అక్కడ మూడు పువ్వులు ఆరు కాయలుగా పెరుగుతున్న బ్యూటీ సెలూన్లు, పార్లర్లు, క్లినిక్లు, జిమ్లు, స్పాలు, మసాజ్, ట్యానింగ్ ( చర్మశుద్ధి ), బ్లీచింగ్ ( చర్మాన్ని తెల్లబరచడం ) బాడీ టోనింగ్ ( కండరాల వృద్ధి), హెయిర్ టోనర్ వగైరా సెంటర్లు నడుస్తున్నాయి. నేను అమెరికా వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక సముద్రతీర సందర్శన ఉండనే ఉంటుంది. అలా ఏ రాష్ట్రంలోని ఏ బీచ్ కు వెళ్లినా ‘ సన్ బాత్ ’ చేసే స్త్రీ పురుషులతో అవి కిటకిట లాడడం గమనించాను. సూర్య స్నానాలువీటివల్ల సూర్యకాంతి సోకి చర్మశుద్ధి అవుతుంది, చర్మంలో మార్పు వస్తుంది, శరీరానికి విటమిన్ డి లభిస్తుంది, ఎముకలు ధృడమౌతాయి, మనిషిలోని ఒత్తిడి తగ్గుతుంది, మంచినిద్ర కూడా వస్తుందంటారు. కానీ ఇలాంటి ‘సూర్య స్నానాలు’ సూర్యోదయం నుండి ఉదయం 10 గంటల వరకు పర్వాలేదు, ఆ తర్వాత సాయంత్రం ముందు వరకు సూర్యుని నుండి సోకే యూఏబి కిరణాలవల్ల చర్మ క్యాన్సర్ ప్రమాదం ఉందన్నది డాక్టర్ల హెచ్చరిక. ఎందుకొచ్చిన ‘అవుట్ డోర్ ట్యానింగ్’ అనుకునే వారికోసం ప్రత్యామ్నాయంగా వచ్చినవి, అమెరికన్ మహిళల ఫ్యాషన్ అయినవి ‘ఇండోర్ ఆర్టిఫిషల్ అల్ట్రా వయలెట్ సెంటర్లు . ఇందులో అతి నీలలోహిత వికిరణాలను విడుదలచేసే పరికరాలు, ట్యానింగ్ లేదా సన్ బెడ్స్ ఉంటాయి. ఇక్కడ చర్మానికి హాని చేయని విధంగా కృత్రిమ కాంతిని నియంత్రిత పద్దతిలో వాడి చికిత్స చేస్తున్నారు. అయితే ఈ చికిత్స 16-25 సంవత్సరాల వయసులో ఉన్నవారికేనట. సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు వున్నవారికి కూడా ఈ చర్మశుద్ధి చికిత్సలు ఉపయోగపడుతున్నాయంటున్నారు. ఇలా ట్యానింగ్ వల్ల వచ్చిన కలర్ శాశ్వతం మాత్రం కాదు సుమా! ప్రపంచం లోనే స్వీడెన్ దేశ స్త్రీలు అందమైన వారు అంటారు, భారత్ లో హిమాచల్, జమ్మూ కాశ్మీర్, అస్సాం, రాజస్థాన్ మహిళల గురించి చెబుతారు. ఎవరి వర్ణం గొప్ప , అతిలోక సుందరులు ఎవరు? అంటే అది చూసేవారి దృష్టిని బట్టి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యవంతులు, ఉన్నంతలో తృప్తిగా, ఆనందంగా ఉండేవారే అందమైనవారు అనడం సమంజసంగా ఉంటుంది !వేముల ప్రభాకర్(చదవండి: US : రిటైర్మెంట్ హోమ్స్.. మంచికా.? చెడుకా?) -
నువ్వుల నూనెతో మాయ చేద్దాం రండి!
వేసవి వచ్చిందంటే పచ్చళ్ల సీజన్ మొదలవుతుంది. పచ్చళ్లు అనగానే అందరికీ గుర్తొచ్చేది నువ్వుల నూనె. అద్భుతమైన రుచితోపాటు, ఏడాది పాటు నిల్వ ఉండే పచ్చళ్ల కోసం నువ్వుల నూనెను ఎక్కువగా వాడతారు. అమ్మమ్మల కాలంలో ముఖ్యంగా ఎదిగే అమ్మాయిలకు, బాలింతలకు నువ్వులతో చేసిన వంటకాలను, పదార్థాలను ఇచ్చే వారు. దాదాపు ఆరు నెలల వరకు బాలింతలకు నువ్వుల నూనెతో వండిన ఆహారాలను అందించే వారంటే దీని విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. ఇక పండుగలు పబ్బాలు వచ్చాయింటే నువ్వుల నూనెతో నలుగులు, మసాజ్లు ఆ సందడే వేరుగా ఉండేది. వేల ఏళ్లుగా మన సంస్కృతిలో, మన ఆహార పదార్థాల్లో కీలకమైనవి నువ్వులు. నువ్వులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఉదాహరణకు గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్ నుండి రక్షణ పొందవచ్చు. నువ్వుల నూనెను కేవలం ఆరోగ్యం కోసమే కాదు, సౌందర్యపోషణలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బీ, ఈ కాల్షియం, జింక్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి.ఫైబర్ ఎక్కువనువ్వుల గింజలలో పైబర్ ఎక్కువగా లభిస్తుంది. కొన్ని అధ్యయనాలు క్రమం తప్పకుండా నువ్వులు తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్లను తగ్గించుకోవచ్చని తెలుస్తోంది. కండరాల నుండి హార్మోన్ల వరకు ప్రోటీన్ చాలా అవసరం. ఆ కొరతను నువ్వుల ద్వారా తీర్చుకోవచ్చు. రక్తపోటును తగ్గించడంలోనువ్వులలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయ పడుతుంది అధిక రక్తపోటు అనేది గుండె జబ్బులు , స్ట్రోక్లకు ప్రధాన ప్రమాద కారకం. అలాగే కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. ఇది ఎముకలకు మంచి శక్తినిస్తుంది. సౌందర్య పోషణలోనువ్వుల నూనెను చర్మానికి మర్దనా చేసుకోవడం వల్ల.. యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. నువ్వుల నూనెతో ముఖానికి, కాళ్లు, చేతులకు రాసుకుని మాసాజ్ చేసుకుంటే మృత కణాలు తొలగిపోతాయి. రక్త ప్రసరణ బాగా జరిగి ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. నువ్వుల నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల చర్మానికి ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. నువ్వుల నూనెను జుట్టు రాసుకుని తలస్నానం చేయడం వల్ల జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంటుంది. ఈ నూనెతో మాడును మసాజ్ చేస్తే కుదుళ్లు బలంగా తయారవుతాయి. రోజూ నువ్వుల నూనెను మర్దనా చేసుకుని స్నానం చేస్తే మేని ఛాయ మెరిసిపోతుంది. -
77వ కేన్స్ చిత్రోత్సవాల్లో ఐశ్వర్య రాయ్ అందాలు (ఫోటోలు)
-
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
-
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
కాసింత ఒళ్లు చేస్తే చాలు.. చాలామందికి డబుల్ చిన్ వచ్చేస్తుంది. దాంతో ముఖంలోని కళే పోతుంది. ఇది వి షేప్ ఫేస్ కోరుకునేవాళ్ల ఆత్మస్థైర్యంతో భలే ఆడుకుంటుంది. మెడ, తలను అటూ ఇటూ తిప్పుతూ.. ఎన్ని ఎక్స్సైజులు చేసినా.. ముఖాన్ని V షేప్లోకి తెచ్చుకోవడం కష్టమే అవుతుంది. అందుకోసమే చిత్రంలోని ఈ డివైస్.ఈ ఎర్గోనామిక్ ఫేస్ లిఫ్టింగ్ మసాజర్.. ముఖాన్ని చక్కటి ఆకృతిలోకి తెస్తుంది. ఈ ఫోల్డబుల్ చిన్ రెడ్యూసర్ను అన్ని వేళలా సులభంగా వాడుకోవచ్చు. చదివేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, ఇంటి పని చేస్తున్నప్పుడు దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ డివైస్తో పాటు సాఫ్ట్ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ కంఫర్టబుల్ కోర్డ్ (ఛిౌటఛీ.. చెవి పట్టీ) లభిస్తుంది. అవసరాన్ని బట్టి ఈ మెషిన్ ని చేత్తో పట్టుకుని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు మాత్రం ఆ చెవి పట్టీ సాయంతో డివైస్ను చెవులకు బిగించుకుంటే చాలు.. గడ్డం కింద మెషిన్ దాని పని అది చేసుకుంటుంది. దీన్ని చార్జింగ్ పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. దీనితో ప్రయాణాల్లోనూ ట్రీట్మెంట్ పొందొచ్చు. ధర 28 డాలర్లు. అంటే 2,341 రూపాయలు అన్నమాట!ఇవి చదవండి: Health: లోయర్ బ్యాక్ పెయిన్తో ఇబ్బందా! ఆలస్యం చేశారో?? -
Black Salt Benefits : బ్లాక్ సాల్ట్తో ఇన్ని లాభాలా?
కోవిడ్-19 సంక్షోభం తరువాతఅందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. పోషకాహారంపై దృష్టి పెడుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను గురించి ఆలోచిస్తున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి బ్లాక్ సాల్ట్ లేదా నల్ల ఉప్పు. నల్ల ఉప్పుతో ఎలాంటి ప్రయోజ నాలున్నాయో తెలుసుకుందాంఉప్పులేని వంటిల్లు లేదు. కానీ మనం రెగ్యులర్గా వాడే తెల్ల ఉప్పుతో కంటే కూడా బ్లాక్ సాల్ట్ ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు కలిగిన బ్లాక్సాల్ట్ ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తుంది. ఇది రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలో సహాయపడే ఈ నల్ల ఉప్పు చాలాబాగా పనిచేస్తుంది. అలాగే నల్ల ఉప్పును తీసుకుంటే ఆరోగ్యానికే కాదు చర్మానికి, జుట్టుకు కూడా మంచిది. నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని చాలా మందికి తెలియదు.ఎసిడిటీ, మెరుగైన జీర్ణక్రియ తరచుగా గ్యాస్ ,అసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి నల్ల ఉప్పు నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కాలేయ ఆరోగ్యానికి కూడా మంచిదని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. నల్ల ఉప్పును సరైన పరిమాణంలో తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. బ్లాక్ సాల్ట్ చాట్ లేదా సలాడ్ అయినా వాటి రుచిని పెంచుతుంది. ఇది అనేక యాంటీఆక్సిడెంట్లు కలిగిన పోషకాల నిధి.గుండె ఆరోగ్యానికి చెడు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి కూడా దీని వినియోగం చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్ను నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మితిమీరి ఎలాంటిది తీసుకున్నా హానికరం కాబట్టి, దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.బరువు తగ్గడానికినల్ల ఉప్పులో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి ప్రభావవంతంగా ఉంటుంది.సలాడ్, పానీయం వంటి మొదలైన వాటిల్లో నల్ల ఉప్పును వేసుకుంటే మంచిది.నోటి ఆరోగ్యం గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు వేసి నిద్రించే ముందు పుక్కిలిస్తే దంతాలు బలపడతాయి. దీంతో పంటి నొప్పి, కుహరం సమస్యలు కూడా నయం అవుతాయి. చిగుళ్ళు వాపు, నోటి దుర్వాసన సమస్యను కూడా వదిలించుకోవచ్చు.చర్మ సమస్యలు నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. అందుకే నల్ల ఉప్పును జుట్టుకు, చర్మానికి మంచిది. సబ్బులూ, టూత్ పేస్ట్ ల తయారీలోనూ వాడుతుంటారు. నోట్: ఇది కేవలం సమాచారంగా మాత్రమే అని గమనించగలరు. బీపీ రోగులు ఉప్పును ఎంత పరిమితంగా వాడితే అంత మంచిది. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. -
కే బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ కూతురు!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్ స్టన్నింగ్ లుక్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. సార్ గ్లాస్లాంటి స్కిన్తో అత్యంత అందంగా ఉంటుంది. ఇప్పటికే ఆమె 2021లో అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్ సెల్ఫ్ పోర్ట్రెయిట్ ప్రకటనల్లో కనిపించి మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడూ గ్లామర్ రంగంలో ఎంట్రీ ఇస్తూ..ప్రఖ్యాత భారతీయ కొరియన్ స్కిన్ కేర్ బ్రాండ్ లానీజ్ అంబాసిడర్గా వ్యవవహరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. సారా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ..ఆరోగ్యకరమైన మెరస్తున్న చర్మం కోసం లానీజ్ బ్రాండ్ని ఎంపిక చేసుకుని సరికొత్త ముఖంతో థ్రిల్గా ఉన్నాను. మీరు కూడా నాలాగే ప్రకాశవంతమైన చర్మంతో ఉండటానికి సిద్ధంగా ఉండండి అంటూ సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చింది. తాను ఆ బ్రాండ్ ఆవిష్కరణ, నిబద్ధతను అభినందిస్తున్నాని చెప్పింది. తాను కొంతకాలంగా ఈ ఉత్పత్తులను వినయోగిస్తున్నట్లు తెలిపింది. ప్రతి వ్యక్తి కాంతివంతంగా ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు. తాను ఈ లానీజ్తో మరింత అందంగా కనిపించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చింది అని రాసుకొచ్చింది సారా. సారా గ్లామర్ పరంగా సింపుల్ మేకప్తో క్యూట్ లుక్తో సందడి చేస్తుంది. మస్కరాతో నిండిన కనురెప్పలతో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుంది. పైగా అందమంతా గుది గుచ్చినట్లుగా ఉంటుంది సారా. అందుకు తగ్గట్లు ఆమె ధరించే డిజైన్వేర్లు ఆమె అందాన్ని మరింత ఇనమడింప చేస్తాయి. View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) ( చదవండి: ఈ ఏడాది మెట్ గాలాలో మరోసారి సందడి చేయనున్న సుధారెడ్డి! ఎవరీమె..?) -
కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్ ఫోటోలు
-
Beauty Tips: చూడటానికి ఇది ల్యాండ్ ఫోన్లాగా.. కానీ ఇదొక బ్యూటీ మసాజర్..!
యవ్వనాన్ని కోరుకోంది ఎవరు! దాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఇంటి చిట్కాల నుంచి శస్త్రచికిత్సల దాకా అన్నిటినీ ప్రయత్నిస్తారు. అయినా పరిష్కారాన్ని అందనివ్వదు పెరిగే వయసు. ఆ వరుసలో ఇంకో ప్రయత్నంగా వచ్చింది ఇదిగో ఈ ‘కిస్కీస్ స్కిన్ రెజూవనేషన్ ఐ రికిల్ రిమూవర్ మెషిన్.’ నిత్య యవ్వనాన్ని ఇవ్వకపోయినా వృద్ధాప్యాన్నయితే వాయిదా వేస్తుంది.. కళ్ల దగ్గర ఏర్పడే మచ్చలు, ముడతలను పోగొట్టి!చూడటానికి ఇది ల్యాండ్ ఫోన్ మాదిరిగా ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసినట్లుగా.. దీని మసాజ్ హెడ్ని చేత్తో పట్టుకుని.. కళ్ల చుట్టూ ఉన్న ముడతలు, మచ్చల మీద మసాజ్ చేసుకోవాలి. ఈ మెషిన్ తోపాటు కాథోడ్ క్లిప్ ఒకటి లభిస్తుంది. ట్రీట్మెంట్ తీసుకునేవారు ఈ క్లిప్ని చేతికి అటాచ్ చేసుకుని మసాజ్ స్టార్ట్ చేసుకోవాలి.ఈ టూల్ సాయంతో ఐ బ్యాగ్స్, డార్క్ సర్కిల్స్ అన్నీ తొలగిపోతాయి. మొదట్లో పది రోజులకు ఒకసారి ఈ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆరు లేదా ఎనిమిదిసార్లు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రిజల్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. ధర 876 డాలర్లు. అంటే 73,265 రూపాయలు అన్నమాట. ఇలాంటి మోడల్స్ మార్కెట్లో చాలానే ఉన్నాయి. క్వాలిటీ, ఆన్లైన్ రివ్యూస్ని బట్టి కొనుగోలు చేయడం ఉత్తమం. మోడల్ని బట్టి.. ఒక్కో గాడ్జెట్.. ఒక్కో ధర ఉండొచ్చు.ఇవి చదవండి: గృహస్థాశ్రమ వైశిష్ట్యం : ఇష్టాయిష్టాలు కలిసాయా!? -
Malavika Mohanan: 'తంగలాన్' బ్యూటీ మాళవిక మోహనన్ గ్లామర్ ఫోటోలు వైరల్ (ఫొటోలు)
-
Nabha Natesh: హీరోయిన్ నభానటేష్ ఉగాది స్పెషల్ లుక్.. (ఫోటోలు)
-
Priyanka Jain HD Photos: తొలిసారి గ్లామర్ లుక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ 'ప్రియాంక' (ఫోటోలు)
-
కొరియన్ బ్యూటీ బ్రాండ్స్ వ్యవస్థాపకురాలిగా సత్తా చాటుతున్న టీచర్!
కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా ఆ ప్రొడక్ట్లన్నీ సహజసిద్ధమైన వాటితోనే తయారు చేయడంతో ఆ ప్రొడక్ట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. అందులోనూ కొరియన్ మహిళలు మచ్చలేని చందమామలా కనిపించడంతో ఆ దేశ ప్రొడక్ట్లను కొనేందుకు ప్రజలు ఎగబడుతుంటారు. ముఖ్యంగా వాళ్ల గ్లాస్ స్కిన్ మరింతగా కట్టిపడేస్తుంది. అలాంటి ప్రముఖ కొరియన్ బ్రాండ్లలో ఒక ప్రసిద్ధ బ్రాండ్ని ప్రారంభించి.. ఓ టీచర్ సత్తా చాటుంది. వ్యాపారవేత్తగా విజయపథంలో దూసుకుపోతోంది. ఆమె సక్సెస్ జర్నీ ఎలా ప్రారంభమయ్యిందంటే.. చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో కొరియన్ బ్రాండ్లదే అగ్రస్థానం అని చెప్పాలి. కొరియన్ల మచ్చలేని చర్మం కారణంగానే ఆ ప్రొడక్టలకు ఇంత ప్రజాధరణ అని చెప్పొచ్చు. ముఖ్యంగా కొరియన్ డ్రామాలు, సినిమాలకు భారత్ అంతటా వేలాదిగా అభిమానులు ఉన్నారు. బహుశా ఆ కారణం వల్ల కూడా ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్టలకీ మార్కెట్లో ఇంతలా డిమాండ్ ఉంది. అయితే ఈ కొరియన్ ప్రొడక్టలకీ కేవలం భారతదేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ ఉంది. అలాంటి కొరియన్ బ్యూటీ ప్రొడక్టలలో ప్రసిద్ధ బ్రాండ్ అయినా బ్యూటీ బార్న్ వ్యవస్థాపకురాలు నాగలాండ్కి చెందిన తోయినాలి చోఫీ . ఈ కే బ్యూటీ బ్రాండ్ని చోఫీ 2016లో స్థాపించింది. ఇందులో బార్న్ COSRX నత్త మ్యూసిన్, క్లైర్స్ జ్యూస్డ్ విటమిన్ డ్రాప్, హోలికా సిరమైడ్ క్రీమ్ తదితర ఫేమస్ బ్యూటీ ప్రొడక్ట్లను తయారు చేస్తారు. ప్రారంభంలో కేవలం 500 ఆర్డర్లు మాత్రమే వచ్చినట్లు చోఫీ పేర్కొంది. అయితే కాల క్రమేణ ఉత్పత్తుల నాణ్యత కారణంగా ఆ సంఖ్య విపరీతంగా పెరిగి, భారత్లో ఉన్న మిగతా ప్రసిద్ద కొరియన్ బ్రాండ్లలో ఇది కూడా ఒకటిగా దూసుకుపోవడం ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇక చోఫీ ఈ వ్యాపారం గురించి మాట్లాడుతూ ఆఫ్లైన్లో అమ్మకాలు బాగానే ఉన్నాయని చెప్పారు. అయితే ఈ బ్రాండ్ని తాను కేవలం నాగాలండ్కే పరిమితం చేయాలనుకోవడం లేదని, భారతదేశమంతటా విస్తరించనున్నట్లు తెలిపింది. ఇక తాను టీనేజ్లో ఉన్నప్పుడూ ముఖంపై వచ్చిన మొటిమలు, మచ్చలతో ఇబ్బంది పడుతుండేదాన్ని అని చెప్పారు. అప్పుడే తన స్నేహితులు ఈ కొరియన్ చర్మసంరక్షణ ప్రొడక్ట్లు బెటర్ అని సూచించడంతో తనకు వాటి గురించి తెలిసిందని చెప్పుకొచ్చింది. అవి తనకు బాగా పనిచేయడంతోనే ఈ బ్యూటీ ప్రొడక్టలను తయారు చేసే వ్యాపారం చేయాలని అనుకున్నట్లు తెలిపారు. ఆ ఆసక్తి కారణంగానే టీచర్ ఉద్యోగాన్ని వదిలి మరీ ఈ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టానని చెప్పుకొచ్చింది. ఇక ఆమె బ్రాండ్కి చెందిన అధికారిక ఇన్స్టాగ్రాంలో 45 వేల మందికి పైగా ఫాలోవర్లు, అభిమానులు ఉండటం విశేషం. ఆసక్తి ఉంటే టీ (చదవండి: డౌన్ సిండ్రోమ్తో డౌన్ అయిపోలే..! ఏకంగా మోడల్గా..!) -
కలబందతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో: సౌందర్యానికి కూడా
కలబందలేదా అలోవెరా ప్రతీ ఇంట్లో సర్వ సాధారణంగా ఉంటోంది. ఒకవిధంగా చెప్పాలంటే తులసి మొక్కకు ఇచ్చినంత ప్రాధాన్యతను కలబందకు కూడా ఇస్తున్నారంటూ అతిశయోక్తి కాదు. అందం నుంచి ఆరోగ్యం వరకు కలబంద ప్రయోజనాలు, వాడకం ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా చర్మ సౌందర్యానికి బాగా పనిచేస్తుంది. ఇంకా ఆయుర్వేద మందుల్లోను సౌందర్య ఉత్పత్తుల్లోనూ, దీన్ని విరివిగా వాడతారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం కలబందలో విటమిన్ ఏ , సీ, ఈ, బీ1, బీ2, బీ3, బీ6,బీ 12 లాంటి విటమిన్లతోపాటు ఫోలిక్ యాసిడ్, 18 రకాల అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఇంకా కాల్షియం, క్రోమియం, సెలెనియం, మెగ్నీషియం, జింక్, సోడియం, ఇనుము, పొటాసియం, కాపర్, మాంగనీస్ వంటి దాదాపు ఇరవై మినరల్స్ ఉంటాయి. కలబంద లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బయొటిక్, యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉంటాయి. అలోవెరా జెల్ పౌడర్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.ప్రీడయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో కలబంద సప్లిమెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించ గలదు. ఇది ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ని తగ్గిస్తుంది. కలబందలో లాటెక్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది మలబద్ధకానికి మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. కలబంద దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కలబందతో చేసిన మైత్ వాష్ వినియోగం ద్వారా చిగుళ్ల రక్తస్రావాన్ని తగ్గించవచ్చు. అలోవెరా కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఇది చర్మం తొందరగా సాగిపోకుండా నివారిస్తుంది. కలబందలో మ్యూకోపాలిసాకరైడ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మంలోని తేమను కాపాడతాయి. కలబంద గుజ్జును రాసుకుంటే, జుట్టు మెత్తగా, మెరిసేటట్టు మారుతుంది. జుట్టు తెగిపోవడాన్ని అరికడుతుంది. చక్కగా, ఒత్తుగా ఎదిగేలా తోడ్పడుతుంది. మాయిశ్చరైజర్ల నుండి ఫేస్ మాస్క్ల వరకు చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఇది చాలా కీలకం. దీనిలోని మాయిశ్చరైజింగ్, యాంటీ ఏజింగ్ లక్షణాలే దీనికి కారణం. అలోవెరా జెల్ కాలిన గాయాలకు చాలా ఉపశమనం ఇస్తుంది. గాయాలు, మచ్చలు తొందరగా మానేలా చేస్తుంది. సన్బర్న్ ఇన్ఫ్లమేషన్ను కూడా తగ్గిస్తుంది. కలబంద రెమ్మ పైన ఉండే తోలును తీసేసి అందులో తెల్లగా ఉన్న గుజ్జును తీసుకొని ఒక పాత్రలో వేయాలి ఇది ఒగరు ఒగరుగా, పుల్లగా కొన్ని చిరు చేదుగా కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం సుగర్ లేదా కొద్దిగా తేనె వేయాలి. దీన్ని మిక్సీలో వేసుకొని కలపాలి.అలా కలిపిన తర్వాత పూర్తిగా నీరు మాదిరిగా తయారవుతుంది. దీన్ని ఉదయాన్నే తాగవచ్చు. తేనె కలిపిన ఈ మిశ్రమాన్ని ముఖానికి, చర్మానికి కూడా అప్లయ్ చేసుకోవచ్చు. పెరటి మొక్కల పోషణలో కూడా కలబంద గుజ్జు, తోలు బాగా ఉపయోగ పడతాయి. ఇన్ని ప్రయోజనాలున్న కలబంద లక్షల్లో ఆదాయ తెచ్చిపెట్టే పంటగా కూడా మారిపోవడం గమనార్హం. -
గ్లాసీ స్కిన్ సీక్రెట్ : కొరియన్ బ్యూటీలు కూడా కుళ్లు కోవాల్సిందే!
మెరిసే చర్మం, మచ్చలేని అందమైన ముఖం అనేగానే అందరికీ గుర్తొచ్చేది కొరియన్ బ్యూటీస్. అందులోనూ ఇటీవల కొరియన్ బాండ్ మ్యూజిక్, సినిమాలు, సిరీస్లపై యూత్లో బాగా క్రేజ్ పెరిగింది. దీంతో కొరియన్ బ్యూటీల్లాగా గ్లాసీ స్కిన్తో మెరిసి పోవాలని కోరుకోవడం సహజమే. అందుకే మచ్చలేని మహారాణి, రాజులా మెరిసిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి. ఫేషియల్ ఎక్స్ర్సైజ్ ముందుగా వ్యాయామాలు చాలా ముఖ్యం. శరీర ఆకృతికి వ్యాయామాలు చేసినట్టుగానే ముఖానికి కొన్ని నిర్దేశిత వ్యాయామాలున్నాయి. రోజులో రెండు సార్లు కచ్చితంగా చేస్తే వీ-జాలైన్ మీ సొంతమవుతుంది. సరిపడినన్ని నీళ్లు తాగడం చాలా కీలకం. క్లెన్సింగ్ కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలంటే డీప్ క్లెన్సింగ్ కీలకం. నీరు, గ్లిజరిన్ వంటి మాయిశ్చరైజర్లు , తేలికపాటి సర్ఫ్యాక్టెంట్లనుతో తయారుచేసిన మైకెల్లార్ క్లెన్సింగ్ వాటర్తో ముఖాన్ని రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. ఇది ఆల్కహాల్ ఫ్రీ కూడా. చర్మాన్ని టోన్ చేస్తుంది. క్మురికి, మేకప్, ఆయిల్ను డీప్గా శుభ్రం చేస్తుంది. లేదంటే నిమ్మకాయ కలిపిన ఫేస్వాష్తో అయినా శుభ్రం చేసుకోవచ్చు. పులిసిన బియ్యం కడిగిన నీళ్లు ఫేస్వాష్లు, కెమికల్ సబ్బుల జోలికిపోకుండా రైస్ వాటర్ను ఫేస్ వాష్గా వాడతారట కొరియన్స్. ఇది న్యాచురల్ క్లెన్సర్లా పనిచేస్తుంది. చర్మాన్ని ఎక్కువసేపు హైడ్రేట్గా ఉంచుతుంది. శుభ్రంగా కడిగిన బియ్యం నానబెట్టిన నీటి, తరువాత వడకట్టుకోవాలి. 24 గంటలు దీన్ని పులియ నివ్వాలి. మేజిక్ వాటర్తో ముఖం కడుక్కుంటే ప్రకాశవంతంగా తేమగా ముఖం మెరిసిపోతుంది. చర్మ సంరక్షణలో పెరుగు చాలా ముఖ్యమైన భాగం. పెరుగులో కొద్దిగా కస్తూరి పసుపు కలిపి, ఈ మిశ్రమంతో మృదువుగా మసాజ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఫేస్ మాస్క్ తేనె, నిమ్మరసం మాస్క్, గ్రీన్ టీ మాస్క్, చార్కోల్ సీరమ్ ఫేస్ మాస్క్ లేదా గ్రీన్-టీ సీరమ్ షీట్ మాస్క్ని ఉపయోగించి గ్లాసీ స్కిన్ను కూడా పొందవచ్చు.గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని డిటాక్సిఫై చేస్తుంది. నిమ్మరసం, తేనె మాస్క్ చర్మంపై పేరుకున్న మలినాలను, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. తేనె చర్మానికి తేమనందిస్తుంది. నిమ్మరసం టాన్ తొలగించి, స్కిన్ టోన్ లైట్ చేస్తుంది. చర్మాన్నిఆరోగ్యంగా, ముడతల్లేకుండా ఉంచేందుకు వాష్క్లాత్లతో ముఖాన్ని మసాజ్ చేస్తారు. గోరువెచ్చని నీటిలో మెత్తని గుడ్డను ముంచి, సున్నితంగా (ఎగువ దిశలో) తుడవాలి. దీంతో దుమ్ము , ధూళిని తొలగి తేటగా అవుతుంది. ట్యాపింగ్ ఫేషియల్ రిలాక్సేషన్ కోసం ట్యాపింగ్ టెక్నిక్ను కొరియన్లు బాగా వాడతారు. ఇది చర్మానికి మంచి రక్షణ అందించడంతోపాటు, రక్త ప్రసరణను పెంచుతుంది. అంతేకాదు తొందరగా వయసు సంబంధిత ముడతలు రాకుండా కాపాడుతుంది. టోనింగ్ అండ్ క్లీనింగ్ కొరియన్ చర్మ సంరక్షణలో మరో ముఖ్యమైంది టోనింగ్. పురాతన కాలంలో, కొరియన్లు తమ చర్మాన్ని టోన్ చేయడానికి దోసకాయ, టమోటా, పుచ్చకాయ వంటి సహజంగా నీరు లభించే వాటిని ఉపయోగించేవారట. కాబట్టి ఏదైనా టోనర్ను కొనుగోలు చేసేటప్పుడు ఈ పదార్థాలను గుర్తు పెట్టుకొంటే మంచిది. వీటితోపాటు, జెన్సింగ్, గ్రీన్టీ రోస్ట్ బార్లీ టీకి కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఇక చివరగా రాత్రి పడుకునే ముందు ముఖచర్మ రక్షణ చర్యల్ని అస్సలు మర్చిపోరు. ప్రధానంగా అలెవెరా జెల్ను ముఖమంతా అప్లయ్ చేసుకుని, ఉదయం చల్లటి నీటితో కడుక్కుంటారు. -
తన ప్రత్యేకత సిల్వర్ స్క్రీనే కాదు.. ఇన్స్టా ప్యాషన్ కూడా..
ప్రియంకా మోహన్.. నటించబోయే నెక్స్›్ట మూవీ కోసం ఎంతమంది ఎదురుచూస్తారో.. సోషల్ మీడియాలో ఆమె నెక్స్›్ట ఫొటో కోసమూ అంతేమంది వేచి చూస్తుంటారు. దీన్నిబట్టే చెప్పొచ్చు స్టోరీస్ సెలెక్షన్లో ప్రియంకా ఎంత ప్రత్యేకంగా ఉంటుందో! సిల్వర్ స్క్రీన్ కథే కాదు.. ఇన్స్టాలోని ఫ్యాషన్ స్టోరీనూ! ఆ స్టోరీ టెల్లింగ్లో ఈ బ్రాండ్స్ కూడా పార్ట్నర్సే! అకోయ జ్యూలరీ.. ఇదొక ఆన్లైన్ జ్యూలరీ స్టోర్. ట్రెండ్కి తగ్గట్టు ఫ్యాషన్ జ్యూలరీని క్రియేట్ చేస్తూ యూత్లో తెగ క్రేజ్ సంపాదించుకుంటోంది. ఆ క్రేజే ఈ బ్రాండ్ను సెలబ్రిటీలకూ దగ్గర చేస్తోంది. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఆన్లైన్ లోనే కొనుగోలు చేసే వీలుంది. దేవ్నాగరి.. అక్కాచెల్లెళ్లు కవిత, ప్రియంకా.. ఒకరు ఇంజినీర్, మరొకరు డాక్టర్ కావాలనుకున్నారు. కానీ అమ్మమ్మ స్ఫూర్తితో చివరికి వారిద్దరి కల ఒక్కటే అయింది. అదే ఫ్యాషన్ డిజైనింగ్. ఆ ఆసక్తితోనే జైపూర్లో లభించే సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో 2013లో సొంతంగా ‘దేవ్నాగరి’ అనే ఓ ఫ్యాషన్ హౌస్ను ప్రారంభించారు. దేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకునే పండుగకైనా వీరి వద్ద దానికి తగ్గ ప్రత్యేకమైన డిజైన్స్ లభిస్తాయి. అదే వీరి బ్రాండ్ వాల్యూ. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్లో ఈ డిజైన్స్ లభిస్తాయి. చీర బ్రాండ్: దేవ్నాగరి, రూ. 57,000 జ్యూలరీ బ్రాండ్: అకోయ జ్యూలరీ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఇవి చదవండి: Alia Bhatt: తనకు 'ఆలూ' అనే ముద్దు పేరు ఎలా వచ్చిందో తెలుసా! -
మనతో పాటు గోళ్ళు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే..
మన జీవితంలో.. ఎన్నోవాటిపై మనం ముఖ్యతను చూపుతాం. మరెన్నో వాటిపై లీనమైపోతూ ఉంటాం. ఒక్కసారైనా ఆరోగ్యాన్ని పట్టించుకుంటామా..! మరెందుకు దీనిపై అశ్రద్ధ. అలాగే మన శరీరంలోని చేతిగోళ్ల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా..? వాటి అందం, రంగు గురించి ఎప్పుడైనా చూడడంగానీ, గమనించడంగానీ చేశారా..! ఓసారి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు ఈ నిజాలు తెలుస్తాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం..! ఈ విధంగా.. గోళ్లు అందంగా ఉండాలంటే దేహం ఆరోగ్యంగా ఉండాలి. గోళ్లలో చీలికలు, పొడిబారిపోవడం కనిపిస్తే విటమిన్ లోపం ఉన్నట్లు అర్థం.. తెల్ల చుక్కలు కనిపిస్తే ఎప్పుడూ నెయిల్ పాలిష్ వేస్తుంటారని లేదా మీకు గోళ్లు కొరికే అలవాటుందని అర్థం చేసుకోవాలి. అడ్డంగా గీతలు, గాడి ఏర్పడినట్లు ఉంటే విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు, తీవ్రమైన జ్వరం బారిన పడినట్లు అర్థం. ఉబ్బెత్తుగా ఉండాల్సిన గోరు గుంట పడినట్లు పలుచగా మారితే అది ఐరన్లోపానికి గుర్తు. సమతుల ఆహారం తీసుకుంటూ, దేహం డీ హైడ్రేషన్కు గురి కాకుండా తగినంత నీటిని తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్/ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనె వేసి వలయాకారంలో రుద్దుతూ ఉండాలి. అప్పుడు గోరు గులాబీరంగులో ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. ఇవి చదవండి: కుండలినీ యోగాతో అల్జీమర్స్కు చెక్: తాజా పరిశోధన -
ఢిల్లీలో తప్పక చూడాల్సిన ఐదు పర్యాటక ప్రాంతాలివే!
దేశ రాజధాని ఢిల్లీ చరిత్ర వందేళ్ల నాటిది. ఇక్కడ సందర్శించడానికి అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని తిలకించేందుకు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అందుకే ఢిల్లీలోని ఐదు ప్రముఖ పర్యాటక ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అక్షరధామ్ ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని స్వామినారాయణ దేవాలయం అని కూడా అంటారు. స్వామి నారాయణ్ శాఖకు చెందిన ఈ ఆలయం హిందూ ధర్మం, దాని ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. 2005, నవంబర్ 6న ఈ ఆలయాన్ని ప్రారంభించారు. అదే ఏడాది నవంబర్ 8 నుంచి సామాన్యులకు ప్రవేశం కల్పించారు. ఈ ఆలయ ప్రాంగణంలో బోట్ రైడ్, లైట్ షో, థియేటర్ ఉన్నాయి. ఆలయంలో తరచూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఇండియా గేట్ కర్తవ్యపథ్లోని ఇండియా గేట్ భారతదేశంలోని ప్రధాన చారిత్రక ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకుల రద్దీ ఉంటుంది. ఇండియా గేట్ 1931-1933 మధ్య కాలంలో నిర్మితమయ్యింది. ఇండియా గేట్ ఎత్తు సుమారు 42 మీటర్లు. వారాంతాల్లో పర్యాటకులతో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. కుతుబ్ మినార్ ఢిల్లీలోని అందమైన ప్రదేశాలలో కుతుబ్ మినార్ కూడా ఒకటి. 73 మీటర్ల ఎత్తయిన ఈ టవర్ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో కూడా చేరింది. దీనిని చూసేందుకు దేశం నుండే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి కూడా పర్యాటకులు తరలి వస్తుంటారు. ఎర్రకోట మొఘల్ చక్రవర్తుల రాజధాని ఢిల్లీ. ఎర్రకోటను మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1638- 1648 మధ్య కాలంలో నిర్మించారు. ఇక్కడి మ్యూజియంలో సాంప్రదాయ హస్తకళలకు సంబంధించిన అనేక విశేషాలను ఇక్కడ చూడవచ్చు. ఇక్కడి ఎరుపు రంగు గోడల కారణంగా సాయంత్రం వేళల్లో ఎర్రకోట మరింత కనువిందు చేస్తుంది. లోటస్ టెంపుల్ లోటస్ టెంపుల్ కలువ పూవు ఆకృతిని కలిగివుంటుంది. ఆలయం పాలరాయితో నిర్మితమయ్యింది. 1986లో దీనిని నిర్మించారు. లోటస్ టెంపుల్ను ‘బహాయి దేవాలయం’ అని కూడా అంటారు. దీనిని ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో గల ఒపెరా హౌస్తో పోలుస్తుంటారు. ఇక్కడ చుట్టూ పచ్చదనం కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఏ దేవుని విగ్రహం కూడా ఉండదు. ఇక్కడి వాతావరణం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. -
నలభైలో కూడా 20లా కనిపించాలంటే..!
చర్మం అందంగా కాంతులీనాలంటే మన ఇంట్లో దొరికే వాటితోనే అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఎలాంటి బ్యూటీ పార్లర్లకు వెళ్లాల్సిన పనిలేకుండా ఇంట్లో దొరికేవి, సహజసిద్ధమైన వాటితో చక్కటి అందాన్ని సొంతం చేసుకోవచ్చు. చర్మాన్ని ఆరోగ్య వంతంగా మార్చుకోవచ్చు. అలాగే వృధాప్య ఛాయలు దరిచేరనీకుండా కాపాడుకోవచ్చు. అందుకోసం ఫాలో అవ్వాల్సిన రెమిడీస్ ఏంటంటే.. చర్మం పేలవంగా ఉంటే స్వచ్ఛమైన కొబ్బరినూనె రాయాలి. రాత్రి పడుకునే ముందు ముఖానికి, మెడకు, చేతులకు కొబ్బరినూనె రాసి వేళ్లతో వలయాకారంగా మసాజ్ చేసుకుంటే చర్మం ఆరోగ్యవంతమవుతుంది. కొబ్బరినూనె సూర్యరశ్మిలోని అల్ట్రావయొలెట్ కిరణాల కారణంగా ఎదురయ్యే సమస్యల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ముఖం మీద మచ్చలు, ముడతలు, చర్మం చిరచిరలాడడం వంటి ఇబ్బందులు పోవాలంటే కలబంద గుజ్జు రాసి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. కలబంద చెట్టు నుంచి ఆకు విరిచి దాని నుంచి గుజ్జు తీసుకుని నేరుగా ముఖానికి రాయడమే. ఇంట్లో చెట్టు లేకపోతే రెడీమేడ్ అలోవెరా జెల్ వాడవచ్చు. పాలుగారే చర్మం కోసం రోజూ ముఖానికి మిల్క్ ఫేస్ ప్యాక్ వేయాలి. రెండు స్పూన్ల పాలలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ శనగపిండి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ప్యాక్ కలుపుకోవడానికి సమయం లేకపోతే పాలలో దూదిని ముంచి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత శుభ్రం చేసినా ఫలితం ఉంటుంది. చర్మం పొడిబారకుండా తేమగా ఉండాలంటే తేనె వాడాలి. సబ్బుతో ముఖం కడిగి తుడిచిన తర్వాత టీ స్పూన్ తేనెను అరచేతిలో వేసుకుని వేళ్లతో ముఖానికి పట్టిస్తూ వలయాకారంగా మసాజ్ చేయాలి. ముఖం, మెడకు పట్టించడం పూర్తయిన తర్వాత ఐదు నిమిషాల సేపు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. తరుముకొస్తున్న వార్ధక్య లక్షణాలను నిలువరించడంలో బొప్పాయి చాలా బాగా పని చేస్తుంది. బాగా పండిన బొప్పాయి పండు గుజ్జు టేబుల్ స్పూన్, టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ చర్మానికి బయటి నుంచి చేసే చికిత్సలు. దేహం ఆరోగ్యంగా ఉంటే చర్మం కూడా నిగారిస్తుంది. అందుకు రోజుకు పది గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలి. ఇక ఆహారం విషయానికి వస్తే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. శారీరక వ్యాయామం తగినంత ఉండాలి. అలాగే ఎనిమిది గంటల మంచినిద్ర కూడా. ఇవన్నీ పాటిస్తే మెదడు చురుగ్గా, దేహం ఉత్సాహంగా పని చేస్తాయి. స్వేదం రూపంలో వ్యర్థాలు వెళ్లిపోవడంతో చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది. (చదవండి: నెల రోజులు పాలు, పెరుగు మానేస్తే ఏమవుతుందో తెలుసా?) -
మహేశ్ సరసన ఇండోనేషియా బ్యూటీ
హీరో మహేశ్బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ ఓ హీరోయిన్గా నటిస్తారనే వార్త కొన్ని రోజులుగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్త నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో రాజమౌళిని ఫాలో అవుతున్నారు చెల్సియా. అలాగే మహేశ్బాబు– రాజమౌళి సినిమాల అప్డేట్స్ను ఇన్స్టాలో చెల్సియా ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. దాంతో మహేశ్కు జోడీగా చెల్సియా ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అంటున్నారు ఫిల్మ్నగర్ వాసులు. కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది వేసవిలో ప్రారంభం కానుందట. -
ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్! ఒక్కో ఇన్స్టా పోస్టే లక్ష..!
ఇటీవల యువతరం సంపాదన ఇలా కూడా ఆర్జించొచ్చు అని చూపిస్తోంది. కొందరూ టిక్టాక్ స్టార్లుగా వచ్చి ఇన్స్టాగ్రాం సెలబ్రెటీలుగా మారిపోతున్నారు. ఓ రేంజ్లో ఫాలోవర్స్ మెయింటైన్ చేస్తున్నారు. సంపాదన కూడా కళ్లు చెరిరేలా ఐదెంకెల్లో ఆర్జిస్తుండటం విశేషం. అలాంటి కోవకు చెందిందే ఈ బ్యూటీఖాన్.. బ్యూటీ ఖాన్ అసలు పేరు మముదా ఖాతున్. సొంతూరు కోల్కతా. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే యమ లవ్వు. డ్రీమ్డ్ అబౌట్ డాన్సర్ కావాలని. టిక్ టాక్ (మన దగ్గర నడిచినప్పుడు) స్టార్ .. ఇన్స్టా సెలబ్రిటీ అయింది. ఫ్యాషన్ బ్లాగర్, మోడల్, యాక్ట్రెస్ కూడా. షార్ట్ వీడియో కంటెంట్కి ఫేమస్. ఆమె ఇన్స్టా హ్యాండిల్కి 12.4 మిలియన్స్కి పైనే ఫాలోవర్స్ ఉన్నారు. అకార్డింగ్ టు సమ్ వెబ్సైట్స్.. ఆమె ఒక్కో ఇన్స్టా పోస్ట్కి 50 నుంచి 1 ల్యాక్ ’ చార్జ్ చేస్తుందట. ఆమె ఆమ్దనీ నెలకు అప్రాక్సిమేట్గా రెండు లక్షల వరకు ఉండొచ్చని ఆ వెబ్సైట్స్ అంచనా. బ్రాండ్ ఎండార్స్మెంట్స్, మోడలింగ్, యాక్టింగ్ .. ఆమె మెయిన్ ఇన్కమ్ సోర్సెస్. సోషల్ మీడియానా మజాకా! (చదవండి: వందేళ్ల నాటి కారు..హంసలా ఎంత వయ్యారంగా ఉందో తెలుసా!) -
దువ్వెనలా ఉండే ఈ డివైజ్ మీ వద్ద ఉంటే..అందం మీ సొంతం!
చిత్రంలోని పరికరం చూసి.. కేవలం దువ్వెన అనుకోవడంలో తప్పు లేదు కానీ ఇది మల్టీ డివైస్. తలకు మాత్రమే కాదు.. ముఖానికి, మొత్తం చర్మానికీ ఉపయోగపడుతుంది. జుట్టును, బాడీని అందంగా తీర్చిదిద్దుతుంది. ఈ మల్టీ–అటాచ్మెంట్ ఫేస్ స్కాల్ప్ కేర్ డివైస్.. ఎల్ఈడీ లైటింగ్తో, ఎలక్ట్రికల్ మజిల్స్ స్టిమ్యులేషన్ టెక్నాలజీతో, వైబ్రేషన్ తో పని చేస్తుంది. అయితే దీనికి ఉన్న మూడు వేరు వేరు హెడ్స్ని అవసరాన్ని బట్టి అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని వినియోగించుకోవడం చాలా సులభం. ఇది చర్మాన్ని ముడతలు, మచ్చలు లేకుండా మృదువుగా మారుస్తుంది. యవ్వనం తిరిగి వస్తుంది. అలాగే తలకు మసాజ్లానూ.. వెంట్రుకల గ్రోత్ని పెంచే విధంగానూ ఇది ట్రీట్మెంట్ని అందిస్తుంది. కండరాలను ఉత్తేజపరచేందుకు.. చిన్న చిన్న నొప్పులు తగ్గించుకునేందుకు మల్టీ హెడ్ (బాల్స్ అటాచై ఉన్న భాగం)ను ఈజీగా డివైస్కి అమర్చుకుంటే సరిపోతుంది. ఈ బ్యూటీ టూల్లో.. ‘లో/మీడియం/ హై’ ఆప్షన్స్తో పాటు.. స్కాల్ప్, ఫేస్, మల్టీ అనే మూడు హెడ్స్ని అవసరానికి మార్చుకునే వీలుండటంతో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంది. 3 గంటల పాటు చార్జింగ్ పెట్టుకుంటే.. వైర్లెస్గా వినియోగించుకోవచ్చు. ధర 911 డాలర్లు. అంటే రూ. 75,005లు. క్వాలిటీ, రివ్యూస్ ఆధారంగానే ఇలాంటి డివైస్లను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. (చదవండి: ఈ బ్యూటిప్స్ వాడారో.. ఇకపై ట్యాన్కు చెక్!) -
భారత్లో ‘మిస్ వరల్డ్-2024 ఈవెంట్, 28 ఏళ్ల తర్వాత
అందాల పోటీలకున్న క్రేజే అంతా ఇంతా కాదు. అందులోనూ ప్రపంచ అందగత్తెలంతా పోటా పోటీగా ఒక చోట చేరితే.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత దేశంలో ఇదే జరగబోతోంది. 71వ ప్రపంచ సుందరి పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. 1996 తరువాత మిస్ వరల్డ్ ఈవెంట్ జరగబోతోంది. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 సినీ శెట్టి మిస్ వరల్డ్ 2023కి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఈవెంట్ నిర్వాహకులు అందించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ పోటీలను అట్టహాసంగా నిర్వహించనున్నారు. మార్చి 9న నిర్వహించే ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. . ఫిబ్రవరి 20న న్యూఢిల్లీలోని హోటల్ అశోకాలో ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ITDC) ఆధ్వర్యంలో "ది ఓపెనింగ్ సెర్మనీ" , "ఇండియా వెల్కస్ ది వరల్డ్ గాలా"తో ఈవెంట్ షురూ అవుతుంది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్లీ స్వయంగా ఈ విషయాన్ని మిస్ వరల్డ్ అధికారిక పేజీ ట్విటర్ పేజీలో షేర్ చేశారు. మిస్ వరల్డ్కు ఆతిథ్యం ఇచ్చే దేశంగా భారతదేశాన్ని ప్రకటించడం గర్వంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. అందం, వైవిధ్యం సాధికారత మేళవింపుగా జరగబోతున్న ఈ అద్భుతమైన ప్రయాణానికి సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది. 2017లో మానుషి చిల్లార్ తర్వాత మరో ఇండియన్, మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకోలేదు. Chairman of Miss World, Julia Morley CBE stated "Excitement fills the air as we proudly announce India as the host country for Miss World. A celebration of beauty, diversity, and empowerment awaits. Get ready for a spectacular journey! 🇮🇳 #MissWorldIndia #BeautyWithAPurpose — Miss World (@MissWorldLtd) January 19, 2024 అందాల రాణులుగా నిలిచిన భారతీయ భామలు ఎవరో తెలుసా? రీటా ఫరియా - 1966 ఐశ్వర్యా రాయ్ - 1994 డయానా హేడెన్ - 1997 యుక్తా ముఖి - 1999 ప్రియాంకా చోప్రా - 2000 మానుషి చిల్లార్ - 2017