Department of Water Resources
-
కుడి ఎడమల దగా!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ద్రోహం చేసింది. ఇప్పటికే నీటి నిల్వ మట్టాన్ని 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వం అంగీకరించడం ద్వారా పోలవరం రిజర్వాయర్ను బ్యారేజ్గా మార్చేసింది. తాజాగా కుడి కాలువ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులతో చేపట్టిన పనులకే బిల్లులు ఇస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చి చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపక పోవడం విస్తుగొలుపుతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం ఎడమ కాలువను, కృష్ణా డెల్టాకు నీటి కరువన్నదే లేకుండా చేసేందుకు 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి కాలువను 2004లో చేపట్టారు. విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. తాజా ధరల మేరకు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు 2017 ఆగస్టు 17న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన రెండో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదన(డీపీఆర్–2)లో కుడి కాలువ సామర్థ్యాన్ని 11 వేలు, ఎడమ కాలువ సామర్థ్యాన్ని 8 వేల క్యూసెక్కులుగా తప్పుగా పేర్కొంది. దాని ఫలితంగానే కేంద్ర జల్ శక్తి శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.4,753.93 కోట్ల భారం పడుతుందని జల వనరుల శాఖ అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.చిరకాల స్వప్నం సాకారమైన వేళ.. గోదావరిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన 1941లో చేసినా, 2004 వరకు ఆ ప్రాజెక్టు పనులు చేపట్టే సాహసం ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టును సాకారం చేస్తూ నిర్మాణ పనులు చేపట్టారు. కొత్తగా 3.2 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 80 టీఎంసీలను మళ్లించి కృష్ణా డెల్టాలో 13.06 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేలా 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి కాలువను చేపట్టారు. కొత్తగా 4 లక్షల ఎకరాలకు నీళ్లందించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 63.2 టీఎంసీను మళ్లించి 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో ఎడమ కాలువను చేపట్టారు. గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చిన మేరకు 45.72 మీటర్లు (150 అడుగులు) గరిష్ట నీటి మట్టంతో 194.6 టీఎంసీల నీటి నిల్వ.. 960 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్కేంద్రం.. 449.78 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి డెల్టాలో 10.5 లక్షల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీలు.. కుడి, ఎడమ కాలువల సమీపంలోని 540 గ్రామాల్లోని 28.50 లక్షల మంది దాహార్తి తీర్చేలా ఈ ప్రాజెక్టును చేపట్టారు.డీపీఆర్–2లో తప్పుల పర్యవసానమే.. విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడంతోపాటు అన్ని రకాల అనుమతులు తీసుకుని, వంద శాతం వ్యయంతో తామే నిర్మించి ఇస్తామని రాష్ట్రానికి హామీ ఇచ్చింది. ఆ మేరకు విభజన చట్టంలో సెక్షన్–90లో స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టడం కోసం పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని 2014 మే 28న ఏర్పాటు చేసింది. 2015 మార్చి 12న నిర్వహించిన తొలి సర్వసభ్య సమావేశంలోనే.. తాజా ధరల మేరకు పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలు ఇవ్వాలని అప్పటి పీపీఏ సీఈవో దినేష్కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కానీ.. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను సమర్పించడంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఎట్టికేలకు 2017 ఆగస్టు 17న రెండో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను పీపీఏకు సమర్పించింది. ఆ ప్రతిపాదనల్లో కుడి, ఎడమ కాలువ సామర్థ్యాన్ని తప్పుగా పేర్కొంది. ఇదే అంశాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎత్తిచూపి.. తాజా పరిమాణాల ఆధారంగా ప్రాజెక్టు పనులకు అయ్యే వ్యయాన్ని, విభాగాల వారీగా విధించిన పరిమితులను ఎత్తేసి రీయింబర్స్ చేయాలని చేసిన విజ్ఞప్తికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు. ఆ మేరకు నిధులు ఇస్తామని స్పష్టం చేస్తూ 2023 జూన్ 5న నోట్ జారీ చేశారు. కానీ.. ఇప్పుడు కుడి కాలువ సామర్థ్యం 11 వేలు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులతో చేపట్టిన పనులకే బిల్లులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది.కళ్ల ముందు కరిగిపోతున్న స్వప్నం నీటి నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల పోలవరం రిజర్వాయర్ బ్యారేజ్గా మారిపోయింది. గోదావరికి వరద వచ్చే రోజుల్లో మాత్రమే కుడి, ఎడమ కాలువలు.. పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల కింద ఉన్న 1.58 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించడానికి అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కింద మిగతా 5.62 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కృష్ణా డెల్టాలో 13.06 లక్షల ఎకరాలు, గోదావరి డెల్టాలో 10.50 లక్షల ఎకరాల స్థిరీకరణ అసాధ్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, విశాఖ పారిశ్రామిక, తాగు నీటి అవసరాలకు నీళ్లందించడం వీలు కాదని స్పష్టం చేస్తున్నారు. జల విద్యుదుత్పత్తి పూర్తి స్థాయిలో చేపట్టడమూ అసాధ్యమే. అంటే కళ్ల ముందే చిరకాల స్వప్నం కరిగి పోతుండటంతో రైతులు, సాగు నీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ఎత్తును తగ్గించడం ద్వారా భూసేకరణ, పునరావాసం వ్యయం రూపంలో ఇప్పటికే రూ.23,622 కోట్లను కేంద్రం మిగుల్చుకుంది. తాజాగా కుడి, ఎడమ కాలువ పనుల పరిమాణాన్ని తగ్గించడం ద్వారా మరో రూ.4,753.98 కోట్లనూ మిగుల్చుకుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
జల భద్రతతోనే సుస్థిర సాగు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: గోదావరి మిగులు జలాలను కృష్ణా, పెన్నా బేసిన్లకు మళ్లించడం, యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేయడం, భూగర్భజలాలను పరిరక్షించడం ద్వారా రాష్ట్రానికి జలభద్రత చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని జలవనరుల శాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ (ఈఎన్సీ) సి.నారాయణరెడ్డి చెప్పారు. విశాఖపట్నంలో జరుగుతున్న ఐసీఐడీ (ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్) సిల్వర్ జూబ్లీ కాంగ్రెస్లో రాష్ట్రంలో జలవనరుల వినియోగం, సుస్థిర సాగునీటి నిర్వహణకు చేపట్టిన చర్యలపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతినిధులకు వివరించారు. సదస్సులో ఆయన ఏం చెప్పారంటే.. ♦ రాష్ట్రంలో ఐదు పెద్ద నదులు, 35 చిన్న నదులు ఉన్నాయి. సాగుకు యోగ్యంగా 2 కోట్ల ఎకరాలున్నాయి. ఇప్పటిదాకా 1.067 కోట్ల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం ఉంది. ఇందులో సాగునీటి ప్రాజెక్టుల కింద 90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ♦ రాష్ట్రంలో ఏడాదికి సగటున 967 మి.వీు.ల వర్షపాతం కురుస్తుంది. దీని పరిమాణం 1,811 టీఎంసీలు. ఇందులో 54.8 శాతం అంటే 617.34 టీఎంసీలు భూమిలోకి ఇంకుతాయి. 510.03 టీఎంసీలు ఉపరితలంలో ప్రవహిస్తాయి. మొత్తం ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 983.39 టీఎంసీలు. ♦ జలయజ్ఞం కింద 54 ప్రాజెక్టులు చేపట్టాం. ఇందులో 14 పూర్తిగా, రెండు పాక్షికంగా పూర్తయ్యాయి. వీటి ద్వారా కొత్తగా 49.8 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. 33.3 లక్షల ఎకరాలు స్థిరీకరిస్తాం. 1.17 కోట్ల మందికి తాగునీరు అందుతుంది. ♦ పోలవరం ప్రాజెక్టు ద్వారా 322.73 టీఎంసీలను వినియోగించుకుంటాం. 960 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి అందుబాటులోకి వస్తుంది. ♦ దేశంలో మొదటిసారిగా 1863–70 సంవత్సరాలలో కేసీ (కర్నూల్–కడప) కెనాల్ ద్వారా తుంగభద్ర–పెన్నా నదులను అనుసంధానం చేశారు. గోదావరి నుంచి ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే.. కృష్ణాతో పాటు పెన్నా బేసిన్లో వర్షాభావం వల్ల ఏటా 100 నుంచి 500 టీఎంసీల కొరత ఏర్పడుతోంది. ♦ గోదావరి జలాలను కృష్ణా, పెన్నా నదులకు మళ్లించే పనులను దశలవారీగా చేపడతాం. శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. రాయలసీమకు గ్రావిటీపై నీళ్లందించాలంటే.. గోదావరి జలాలను ఆ ఎత్తుకు ఎత్తిపోయాలి. తక్కువ ఖర్చుతో కృష్ణా, పెన్నా బేసిన్లకు నీటిని తరలించే విధానాలను సూచించాలని కోరుతున్నాం. ♦ రాష్ట్రంలో 1,254 ఫిజియోవీుటర్లను ఏర్పాటు చేసి.. 15 లక్షల బోరుబావులను జియోట్యాగింగ్ చేసి భూగర్భజలాల వినియోగాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి, పరిరక్షిస్తున్నాం. 2017తో పోలిస్తే 2022 నాటికి భూగర్భజలమట్టం 5.65 మీటర్లకు పెరిగింది. దేశంలో భూగర్భజలాల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ♦ నీటి వృథాకు అడ్డుకట్ట వేయడం కోసం పైప్డ్ ఇరిగేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చాం. ♦ 33.34 లక్షల ఎకరాల్లో డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా నీళ్లందిస్తున్నాం. దీనివల్ల 11.90 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. 201.3 టీఎంసీలు ఆదా అవుతున్నాయి. ♦ చిన్ననీటివనరులను మరమ్మతు చేయడం, ఆధునీకరించడం ద్వారా వాటి నిల్వ సామర్థ్యాన్ని 84.5 టీఎంసీలకు పెంచి.. 6.9 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నాం. -
విశాఖలో ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల ప్రారంభం (ఫొటోలు)
-
ఏపీకి అవకాశం.. అదృష్టంగా భావిస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్ సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం జగన్ అన్నారు. ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోంది. వర్షం కురిసేది తక్కువ కాలమే.. ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలి. సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: అసామాన్యులకు సత్కారం -
Andhra Pradesh: వేగంగా ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రాధాన్యత ప్రాజెక్టుల పనుల ప్రగతిని సమీక్షిస్తూ గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఆయా ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతులకు ఫలాలను అందించాలన్నారు. పోలవరంతోపాటు ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న వెలిగొండ, వంశధార ఫేజ్–2 స్టేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం, గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ తదితర ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల పనుల్లో ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ముఖ్యమంత్రికి నివేదించారు. సీమ ప్రాజెక్టులను వరదనీటితో నింపేలా.. గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్(సొరంగం)లో ఫాల్ట్ జోన్ (మట్టి పొరలు పెలుసుగా ఉన్న ప్రాంతం)లో పాలీయురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ పద్ధతిలో పనులు పూర్తి చేసినట్లు అధికారులు సీఎం జగన్కు వివరించారు. నాన్ ఫాల్ట్ జోన్లో మరో 149 మీటర్ల లైనింగ్ పనులు మాత్రమే మిగిలాయని, వాటిని జూలై లోగా పూర్తి చేసి ఆగస్టులో ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత డిజైన్ మేరకు పూర్తి సామర్థ్యం ప్రకారం గాలేరు–నగరి ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించి దుర్భిక్ష రాయలసీమను సుభిక్షం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 – 40 రోజుల్లోనే నీటిని ఒడిసిపట్టి రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ► వెలిగొండలో మొదటి టన్నెల్, హెడ్ రెగ్యులేటర్ ఇప్పటికే పూర్తైనట్లు అధికారులు తెలిపారు. రెండో టన్నెల్లో 18,787 మీటర్లకుగానూ ఇప్పటికే 17,461 మీటర్ల పనులు పూర్తయ్యాయి. మరో 1,326 మీటర్ల పనులు మాత్రమే మిగిలినట్లు అధికారులు తెలిపారు. రెండో టన్నెల్ అక్టోబర్కు పూర్తవుతుందన్నారు. రెండో టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు 92.14 శాతం పూర్తైనట్లు చెప్పారు. ఆగస్టు నాటికి రెండో టన్నెల్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్లో గొట్టిపడియ, కాకర్ల డ్యామ్, తీగలేరు అప్రోచ్ కెనాల్, హెడ్ రెగ్యులేటర్తోపాటు ఈస్ట్రన్ మెయిన్ కెనాల్, హెడ్ రెగ్యులేటర్ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ సొరంగాల ద్వారా నల్లమలసాగర్లోకి నీటిని తరలించేందుకు వీలుగా మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ► వంశధార ఫేజ్–2 స్టేజ్–2 ప్రాజెక్టు పనులను డిస్ట్రిబ్యూటరీలతో సహా ఈ ఏడాదే పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. గొట్టా బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతం నుంచి వంశధార జలాలను ఎత్తిపోసి స్టేజ్–2లో అంతర్భాగమైన హీరమండలం రిజర్వాయర్ను నింపే పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ► తోటపల్లి బ్యారేజీలో మిగిలిపోయిన పనులు, తారకరామ తీర్థసాగరం, మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ తదితర ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్షించారు. ఆ ప్రాజెక్టుల పనులన్నీ వేగంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ► హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు దాదాపు పూర్తి కావచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లో వేగం పెంచాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. శరవేగంగా పోలవరం.. ► పోలవరం పనుల ప్రగతిపై సీఎం జగన్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. గోదావరి వరదల ఉద్ధృతికి కోతకు గురై ఈసీఆర్ఎఫ్(ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్)–1 నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాథాలను ఇప్పటికే ఇసుకతో నింపి వైబ్రో కాంపాక్షన్తో యథాస్థితికి తెచ్చే పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ► ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో అగాథాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చే పనులు చురుగ్గా సాగుతున్నట్లు వెల్లడించారు. ఈ పనులు పూర్తయ్యాక గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్వాల్కు సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి పాత దానితో అనుసంధానం చేస్తామన్నారు. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి జలాశయాన్ని పూర్తి చేస్తామన్నారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ పోలవరం జలాశయం నిర్మాణం పూర్తయ్యేలోగా ఎడమ కాలువ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ► గైడ్ బండ్లో జారిన ప్రాంతాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ నియమించిన నిపుణుల కమిటీ, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అధికారులు ఈనెల 15, 16వతేదీల్లో పరిశీలించిన అంశాన్ని అధికారులు సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. నేల స్వభావంలో మార్పుల వల్లే గైడ్ బండ్లో కొంత ప్రాంతం జారి ఉండవచ్చని నిపుణుల కమిటీ అనుమానాలు వ్యక్తం చేసిందన్నారు. గైడ్ బండ్లో దెబ్బతిన్న ప్రాంతాన్ని రాక్ డంప్, సిమెంట్ స్లర్రీతో నింపి గాబియన్లు వేయడం ద్వారా తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని కమిటీ సూచించిందన్నారు. ఆ మేరకు పనులు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. గైడ్ బండ్ను పూర్తిగా విశ్లేషించాక శాశ్వత మరమ్మతులపై కమిటీ సూచనలు చేయనుంది. సీడబ్ల్యూసీ సూచనల మేరకు గైడ్ బండ్ను పటిష్టం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ► పోలవరం తొలిదశ పూర్తి చేసేందుకు రూ.12,911.15 కోట్లు ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయం తీసుకోగా కేబినెట్ నోట్ తయారీపై వివిధ శాఖల మధ్య సంప్రదింపులు కొలిక్కి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం జగన్ సూచించారు. ► పోలవరం పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను కేంద్రం రీయింబర్స్ చేయడంలో జాప్యం చేస్తుండటం వల్ల ఖజానాపై భారం పడుతోందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు ముందుగా నిధులు విడుదల చేసిన తరహాలోనే పోలవరానికి కూడా ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ► పోలవరంలో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి వచ్చే ముంపు గ్రామాల్లో 20,946 నిర్వాసిత కుటుంబాలకుగానూ ఇప్పటికే 12,658 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మిగిలిన 8,288 కుటుంబాలకు కూడా పునరావాసం కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. సకాలంలో ఆయకట్టుకు నీటి విడుదల ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా క్యాలెండర్ ప్రకారం నీటి లభ్యత ఆధారంగా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు సమీక్షలో అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, తోటపల్లి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేశామన్నారు. మిగతా ప్రాజెక్టుల కింద నీటి లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామన్నారు. ఉత్తమ యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసి ఆయకట్టుకు పుష్కలంగా నీటిని అందించాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. అంబటి, అధికారులకు సీఎం అభినందనలు నాలుగో జాతీయ జల అవార్డుల్లో (నేషనల్ వాటర్ అవార్డ్స్–2022) ఆంధ్రప్రదేశ్ నాలుగు అవార్డులను దక్కించుకోవడంపై మంత్రి అంబటి రాంబాబు, అధికారులను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. జలæ వనరుల సంరక్షణ, నీటి నిర్వహణకుగాను ఉత్తమ రాష్ట్రాల విభాగంలో ఆంధ్రప్రదేశ్ తృతీయ స్థానంలో నిలిచింది. శనివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగ్దీప్ దన్కర్ చేతుల మీదుగా అందుకున్న అవార్డును జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి సీఎం జగన్కు చూపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ ఆదిత్య, వివిధ ప్రాజెక్టుల సీఈలు పాల్గొన్నారు. -
Fact Check: ‘గేటు’పై ఈనాడు అడ్డగోలు అబద్ధాలు
సాక్షి, అమరావతి: వరద ఉధృతికి కొట్టుకుపోయిన పులిచింతల గేటు బిగింపు పనులు, మరమ్మతులు తుదిదశకు చేరుకున్నాయని పసిగట్టిన ‘ఈనాడు’ ఆదరాబాదరగా ఓ అడ్డగోలు కథనాన్ని అచ్చేసి చంకలు గుద్దుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక వంటకాన్ని సిద్ధం చేయాలనే ఆదుర్దాతో ‘పులిచింతల గేటు ఏర్పాటు ఎప్పటికి?’ అంటూ బురద చల్లేందుకు ప్రయత్నించింది. మరో 15 రోజుల్లో గేటు బిగింపు పూర్తి కానుండగా 30 శాతం పనులే జరిగాయంటూ పచ్చి అబద్ధాలను ప్రచురించింది. గేట్ల బిగింపు పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. కాలినడక వంతెన పనులు 70 శాతం పూర్తి కాగా 23 పియర్ల కాంటీలివర్ భాగంలో కాంక్రీట్ గ్రౌటింగ్ కూడా పూర్తైంది. ఈనాడు ఆరోపణ: వరదలకు కొట్టుకుపోయిన 16వ గేటు స్థానంలో కొత్తది ఏర్పాటు, మరమ్మతుల పనులకు పరిపాలన ఆమోదం కోసం 9 నెలల సమయం పట్టింది. వాస్తవం: ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిపుణుల కమిటీని నియమించింది. ప్రాజెక్టు పరిస్థితిపై సాంకేతికంగా మదింపు చేసి మిగిలిన 23 గేట్ల పనితీరును నిశితంగా పరిశీలించిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. మిగిలిన పియర్స్ కాంటీలివర్ భాగంలో కాంక్రీట్ గ్రౌటింగ్ చేయాలని సూచించింది. కమిటీ సూచనల మేరకు జల వనరుల శాఖ రూపొందించిన అంచనాలకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. నిపుణుల కమిటీతో సమగ్ర అధ్యయనం జరిపించింది. పనులను రెండు భాగాలుగా విభజించి బెకెమ్ సంస్థకు అప్పగించారు. కాలినడక వంతెన పనులను స్వప్న కన్స్ట్రక్షన్స్కు కేటాయించారు. ఆరోపణ: నిధులు ఇవ్వక పోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. వాస్తవం: గేట్లకు సంబంధించి రూ.1.59 కోట్లు, కాలినడక వంతెన పనులకు సంబంధించి రూ.1.29 కోట్ల బిల్లులను ప్రభుత్వం త్వరలో చెల్లించనుంది. ఆరోపణ: గేటు తయారీ, బిగింపులో ఆలస్యం జరుగుతోంది. వాస్తవం: గేటు తయారీలో అతి ప్రధానమైన ట్రూనియన్ బుష్ బేరింగ్లను జపాన్ నుంచి ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. గేటును పియర్స్కు బిగించడానికి అవసరమైన కాంక్రీట్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. క్యూరింగ్కు 15 రోజులు పడుతుంది. గేటు తయారీ పూర్తయింది. మిగిలిన పియర్స్ కాంటీలివర్ భాగంలో కాంక్రీట్ గ్రౌటింగ్ పూర్తయింది. 15 రోజుల్లో గేటు బిగింపు పూర్తి కానుండగా ‘ఈనాడు’ 30 శాతం పనులే పూర్తయినట్లు అవాస్తవాలు అచ్చేసింది. కాలినడక వంతెన పనుల్లో కూడా 70 శాతం (16వ గేటు వరకూ) పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి ప్రతి గేటుకు స్టాప్లాగ్ గేటు అమర్చి రబ్బర్ సీళ్లను అమర్చే పనులు చేపట్టారు. ప్రణాళికాబద్ధంగా వాటిని పూర్తి చేసి ఈ సీజన్లో పూర్తి సామర్థ్యం మేరకు 45.77 టీఎంసీలను నిల్వ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
వడివడిగా ‘వెలిగొండ’.. సాకారమవుతున్న ఆ మూడు జిల్లాల దశాబ్దాల కల
ఆలమూరు రామగోపాలరెడ్డి, వెలిగొండ ప్రాజెక్టు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల స్వప్నం వెలిగొండ ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్కు నీటిని తరలించడానికి వీలుగా 18.8 కి.మీల పొడవున మొదటి సొరంగం, హెడ్ రెగ్యులేటర్ పనులను 2021 నాటికే ప్రభుత్వం పూర్తిచేసింది. కన్వేయర్ బెల్ట్ తెగిపోతుండటం, టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)లో సమస్యలు ఉత్పన్నమవుతుండటంతో.. ఓ వైపు టీబీఎంతో సొరంగం తవ్వుతూనే మరోవైపు మనుషులతో తవ్వకం పనులు చేపట్టాలని జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గతేడాది దిశానిర్దేశం చేశారు. దీంతో 2022–23లో 5.52 కి.మీల పొడవున సొరంగం తవ్వి.. ప్రాజెక్టు చరిత్రలోనే రికార్డు సృష్టించారు. మరోవైపు.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే నల్లమలసాగర్ పూర్తయింది. దీని నుంచి తీగలేరు కెనాల్ను అనుసంధానిస్తూ 550 మీటర్ల పొడవున సొరంగం పనులను ఇటీవల ప్రభుత్వం పూర్తిచేసింది. అలాగే, తీగలేరు కెనాల్కు నల్లమలసాగర్ నుంచి నీటిని విడుదల చేయడానికి వీలుగా హెడ్ రెగ్యులేటర్ పనులను వేగవంతం చేసింది. తూర్పు ప్రధాన కాలువను నల్లమలసాగర్తో అనుసంధానం చేస్తూ 150 మీటర్ల పొడవున సొరంగం పనులను ఇటీవలే పూర్తిచేసిన ప్రభుత్వం.. హెడ్ రెగ్యులేటర్ నిర్మాణ పనులకూ శ్రీకారం చుట్టింది. యుద్ధప్రాతిపదికన తొలిదశ పనులను పూర్తిచేసి.. ఈ ఏడాది నల్లమలసాగర్కు శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వడివడిగా అడుగులేస్తున్నారు. వెలి‘గొండంత’ చిత్తశుద్ధి.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని వర్షాభావ ప్రాంతాల్లో 4,37,300 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. అక్కడి 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చవచ్చు. అందుకే ఈ ప్రాజెక్టును ఆ మూడు జిల్లాల ప్రజల వరదాయినిగా అభివర్ణిస్తారు. – నిజానికి.. 1996లో లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసినా పనులు చేపట్టలేదు. – పైగా.. 1995 నుంచి 2004 వరకూ ఈ ప్రాజెక్టుకు కేవలం రూ.పది లక్షలు మాత్రమే ఖర్చుచేశారు. అదీ శంకుస్థాపన సభ కోసమే. – 2004లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక.. ఈ ప్రాజెక్టును జలయజ్ఞంలో భాగంగా చేపట్టారు. – శ్రీశైలం నుంచి నల్లమలసాగర్కు రోజుకు 3,001 క్యూసెక్కులు తరలించేందుకు ఒక సొరంగం తవ్వేలా 1994లో డీపీఆర్ను మహానేత వైఎస్ సమూలంగా మార్చేశారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం రోజులు తగ్గిన నేపథ్యంలో.. రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా రెండు సొరంగాలు తవ్వేందుకు డీపీఆర్ను తయారుచేయించారు. – ఇలా శ్రీశైలానికి వరద వచ్చే 43 రోజుల్లోనే వెలిగొండలో అంతర్భాగమైన నల్లమలసాగర్ను నింపాలన్నది మహానేత వైఎస్ ఆలోచన. – ఇక జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చుచేసి.. నల్లమలసాగర్తోపాటు సొరంగాల్లో సింహభాగం పనులు పూర్తిచేయించారు. సొరంగాలను నల్లమలసాగర్ను అనుసంధానం చేసేలా 23 కిమీల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేందుకు ఫీడర్ ఛానల్ పనులను చేయించారు. అలాగే, తీగలేరు కెనాల్, తూర్పు ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు. చంద్రబాబు వెలి‘గొండంత’ దోపిడీ విభజన నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వెలిగొండ ప్రాజెక్టును దోపిడికి అడ్డాగా మార్చుకున్నారు. అప్పటి నుంచి 2019 వరకు రూ.1,414.51 కోట్లు ఖర్చుచేసినా పనుల్లో ఎలాంటి ప్రగతి కన్పించకపోవడమే ఇందుకు నిదర్శనం. జీఓ–22 (ధరల సర్దుబాటు), జీఓ 63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.650 కోట్లకు పైగా దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తిచేస్తామని ప్రకటించి.. టీబీఎంల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు దండుకున్నారు. మళ్లీ 2018, 2019 నాటికి పూర్తిచేస్తామన్న చంద్రబాబు.. కమీషన్లు వసూలుచేసుకుని, ప్రాజెక్టు పనులను గాలికొదిలేశారు. సీఎం జగన్ హయాంలో వడివడిగా.. మహానేత వైఎస్ చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసే దిశగా సీఎం వైఎస్ జగన్ ఆది నుంచి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిమీల పనులను 2019, నవంబర్లో ప్రారంభించి.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021, జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను పూర్తిచేయించారు. – రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్కు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచిపెట్టారు. కానీ, సీఎం జగన్ వీటిని రద్దుచేసి.. రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తిచేసేందుకు ముందుకొచ్చిన మేఘా సంస్థకు పనులు అప్పగించారు. – రెండో సొరంగంలో టీబీఎంకు కాలంచెల్లడంతో రోజుకు ఒక మీటర్ పని జరగడం కష్టంగా మారింది. దీంతో.. మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు సీఎం జగన్ చెప్పడంతో అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్విస్తున్నారు. – ఇక 2022–23లో రెండో సొరంగంలో 5.52 కిమీల పొడవున సొరంగం తవ్వారు. ఇది వెలిగొండ ప్రాజెక్టు చరిత్రలో రికార్డని ఆ పనులను పర్యవేక్షిస్తున్న ఏఈ అనుదీప్ ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుతం రోజుకు 12 మీటర్ల మేర పనులు చేస్తున్నామని.. ఆగస్టు నాటికి రెండో సొరంగంలో మిగిలిన 1.889 కిమీల పనులను పూర్తిచేస్తామన్నారు. – మరోవైపు.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సొరంగాల ద్వారా విడుదల చేసిన నీటిని నల్లమలసాగర్కు తరలించేందుకు 23 కిమీల పొడవున తవ్విన ఫీడర్ ఛానల్ను పటిష్టం చేసే పనులను చేపట్టామని.. ఆగస్టు నాటికి వాటిని పూర్తిచేస్తామని ఆ పనులను పర్యవేక్షిస్తున్న డీఈ ఆవుల లక్ష్మి చెప్పారు. – అలాగే, నల్లమలసాగర్ నుంచి తీగలేరు కెనాల్, తూర్పు ప్రధాన కాలువకు నీటిని విడుదలచేసే హెడ్ రెగ్యులేటర్ పనులు ఆగస్టు నాటికి పూర్తిచేస్తామని ఈఈ రమణ తెలిపారు. పునరావాసం పనులు వేగవంతం నల్లమలసాగర్లో 11 గ్రామాలు ముంపుకు గురవుతాయి. వీటిల్లోని 7,318 నిర్వాసిత కుటుంబాల్లో ఇప్పటికే 96 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మిగతా 7,222 నిర్వాసిత కుటుంబాలకు రూ.868.27 కోట్లతో పునరావాసం కల్పించే పనులను వేగవంతం చేశారు. అలాగే, వెలిగొండ ప్రాజెక్టు కోసం 24,158.56 ఎకరాల భూమి అవసరం. ఇందులో ఇప్పటికే 20,760.47 ఎకరాల భూమిని సేకరించారు. మిగిలిన భూమిని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రాజెక్టు పనులకు ఇప్పటిదాకా రూ.679.79 కోట్లను వ్యయంచేసి.. పనులను సీఎం వైఎస్ జగన్ పరుగులు పెట్టిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంజినీరింగ్ అద్భుతం.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపున ఉన్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్–1 ద్వారా 3,001 క్యూసెక్కులు, టన్నెల్–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవ్వి.. ప్రకాశం జిల్లాలో పశ్చిమాన నల్లమల పర్వతశ్రేణుల్లో కొండల మధ్య ఖాళీ ప్రదేశాల (గ్యాప్)లను కలుపుతూ కాంక్రీట్ డ్యామ్లు నిర్మించడం ద్వారా 53.85 టీఎంసీలు నిల్వచేసేలా నల్లమలసాగర్ సహజసిద్ధంగా రూపుదిద్దుకుంటోంది. ఇది ఇంజనీరింగ్ అద్భుతంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇక్కడ తవ్వుతున్న రెండు సొరంగాలు ఆసియాలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు. ఈ ఏడాదే తొలిదశ పూర్తి ఈ ప్రాజెక్టు తొలిదశను ఈ ఏడాదే పూర్తిచేసేందుకు పనులను వేగవంతం చేశాం. ఇప్పటికే తొలి సొరంగం పూర్తయింది. ఫీడర్ ఛానల్ సిద్ధంగా ఉంది. నల్లమలసాగర్ పూర్తయింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఈ ఏడాది పది టీఎంసీలను నల్లమలసాగర్లో నిల్వచేస్తాం. ఆ తర్వాత 30 టీఎంసీలు.. చివరగా 53.85 టీఎంసీలను నిల్వచేస్తాం. – సి. నారాయణరెడ్డి, ఈఎన్సీ మహానేత ముందుచూపునకు నిదర్శనం శ్రీశైలంలో 840 అడుగుల నీటి మట్టం నుంచే సొరంగాల ద్వారా వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్కు నీటిని తరలించవచ్చు. 879 అడుగుల స్థాయిలో శ్రీశైలంలో నీరునిల్వ ఉంటే.. పూర్తి సామర్థ్యం మేరకు రోజుకు 11,583 క్యూసెక్కులను నల్లమలసాగర్కు తరలించవచ్చు. శ్రీశైలానికి వరద వచ్చే 40–43 రోజుల్లోనే నల్లమలసాగర్ను నింపేలా ప్రాజెక్టు డిజైన్ను మార్చడం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపునకు తార్కాణం. – మురళీనాథ్రెడ్డి, సీఈ, ప్రకాశం జిల్లా సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధివల్లే.. ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధివల్లే వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతోంది. టీబీఎంలకు కాలం చెల్లడం, కన్వేయర్ బెల్ట్లు పనిచేయకపోవడంవల్ల సొరంగాల తవ్వకం 2014 నుంచి ముందుకు కదల్లేదు. మనుషుల ద్వారా సొరంగాలను తవ్వాలని సీఎం జగన్ నిర్ణయంవల్లే ఇప్పుడు ఆ పనులు పూర్తవుతున్నాయి. 2022–23లో రెండో సొరంగంలో 5.52 కిమీల పొడవున తవ్వాం. ప్రాజెక్టు చరిత్రలో ఇదో రికార్డు. – అబూ తలీమ్, ఎస్ఈ -
నీటి లెక్కలు తేల్చకుండా వాడుకోవద్దని ఎలా అంటారు?
సాక్షి, అమరావతి: నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టుకు నీళ్లందించడానికి సాగర్ కుడి కాలువ ద్వారా నీటిని వాడుకోవద్దంటూ కృష్ణా బోర్డు ఆదేశించడంపై రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోటా నీటిని తాగు నీటి అవసరాల కోసం వాడుకుంటున్నామని, దాన్ని ఆపేయాలని ఆదేశించడమేమిటని మండిపడుతున్నారు. సాగర్ ఎడమ కాలువలో రాష్ట్ర కోటా కింద మిగిలిన 13 టీఎంసీలను విడుదల చేసేలా తెలంగాణ అధికారులను ఎందుకు ఆదేశించలేదని బోర్డును నిలదీస్తున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు వాడుకున్న నీటి లెక్కలు తేల్చాకే ఇతర అంశాలపై చర్చిద్దామని స్పష్టం చేస్తున్నారు. లెక్కలు తేల్చకుండా నీటిని వాడుకోవద్దని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై సోమవారం కృష్ణా బోర్డుకు లేఖ రాస్తామని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. సాగర్ కుడి కాలువ ద్వారా రోజూ 9 వేల క్యూసెక్కులను ఏపీ వాడుకుంటోందంటూ తెలంగాణ ఈఎన్సీ రాసిన లేఖకు స్పందించిన కృష్ణా బోర్డు.. ఆ నీటి వాడుకాన్ని ఆపేయాలని శుక్రవారం ఏపీ ఈఎన్సీకి లేఖ రాసింది. బోర్డు ఆదేశాలపై రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు మండిపడుతున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో వరద రోజుల్లో వాడుకున్నదిపోనూ మిగతా రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం కోటా కంటే 73.56 టీఎంసీలు ఎక్కువ వినియోగించుకుందని, ఏపీ కోటాలో ఇంకా 199.31 టీఎంసీలు మిగిలే ఉన్నాయని అధికారులు తెలిపారు. నీటి లెక్కలు తేల్చి.. మా కోటా నీటిని రబీలో సాగు, వేసవిలో తాగు నీటి అవసరాలకు విడుదల చేయాలని మార్చి 13న కృష్ణా బోర్డుకు లేఖ రాశామని ఏపీ ఈఎన్సీ గుర్తు చేస్తున్నారు. కోటా కంటే అధికంగా వాడుకున్న తెలంగాణను కట్టడి చేసి, సాగర్ ఎడమ కాలువ కోటా కింద ఏపీకి ఇంకా రావాల్సిన 13 టీఎంసీలను విడుదల చేసేలా ఆ రాష్ట్ర అధికారులను ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై సోమవారం లేఖ రాస్తామని అధికారులు చెప్పారు. నీటి లెక్కలు తేల్చేందుకు తక్షణమే సర్వ సభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరతామన్నారు. కోటా మేరకే తాగు అవసరాలకు సాగర్ కుడి కాలువ నుంచి నీటిని వాడుకుంటున్నామని, ఆపే ప్రశ్నే లేదని స్పష్టం చేస్తున్నారు. -
నీటిలెక్కలు తేల్చడానికి రెడీ
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను కోటా కంటే అధికంగా వాడుకున్నారంటూ రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో.. నీటిలెక్కలు తేల్చేందుకు కృష్ణాబోర్డు సిద్ధమైంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా బేసిన్లో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటిలెక్కలు తేల్చి.. కోటాలో మిగిలిన నీటిని లభ్యత ఆధారంగా కేటాయించేందుకు బోర్డు చైర్మన్ శివ్నంద్కుమార్ సిద్ధమయ్యారు. ఏప్రిల్ మొదటి వారంలో సర్వసభ్య సమావేశం నిర్వహించడానికి అనువైన రోజును ఎంపిక చేయాలని రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులను కృష్ణాబోర్డు కోరింది. 2022–23 నీటి సంవత్సరంలో ఫిబ్రవరి 28 వరకు దిగువ కృష్ణా బేసిన్లో 972.46 టీఎంసీల లభ్యత ఉందని.. ఇందులో ఏపీ వాటా 641.82 (66 శాతం) టీఎంసీలు, తెలంగాణ వాటా 330.64 (34 శాతం) టీఎంసీలని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి కృష్ణాబోర్డుకు లేఖ రాశారు. ఫిబ్రవరి వరకు రెండు రాష్ట్రాలు 846.72 టీఎంసీలను వాడుకున్నాయని తెలిపారు. అందులో ఏపీ 442.52 (52.2 శాతం) టీఎంసీలు, తెలంగాణ 404.20 (47.8 శాతం) టీఎంసీలు వాడుకున్నాయని వివరించారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీ కోటాలో ఇంకా 199.31 టీఎంసీలు మిగిలే ఉన్నాయని, తెలంగాణ ఆ రాష్ట్ర కోటా కంటే అధికంగా 73.56 టీఎంసీలు అదనంగా వాడుకుందని కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేశారు. ఇదిలాఉంటే.. ఉమ్మడి ప్రాజెక్టుల్లో కోటా కంటే ఏపీ ప్రభుత్వం అదనంగా 38.72 టీఎంసీలు వాడుకుందని, ఇకపై నీటిని వాడుకోకుండా కట్టడిచేయాలని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే నీటిలెక్కలు తేల్చి వివాదానికి తెరదించడానికి కృష్ణాబోర్డు సిద్ధమైంది. -
ఆఖరి ఆయకట్టు అంతేనా?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నాగార్జునసాగర్ చివరి ఆయకట్టు ఎండిపోతోంది. జలవనరుల శాఖ అధికారుల ప్రణాళికా లోపంతో ఆఖరి ఆయకట్టుకు నీరు చేరక సత్తుపల్లి, వైరా, మధిర ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి. ఇంకో నెలన్నరలో పంటలు చేతికి రావాల్సి ఉన్న వేళ ఈ పరిస్థితితో రైతుల్లో ఆందోళన నెలకొంది. సాగర్ జలాలు వస్తాయని.. ఖమ్మం జిల్లాలో 2,54,270 ఎకరాల సాగర్ ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు పరిధిలో యాసంగిలో 2,23,545 ఎకరాల సాగుకు 33.61 టీఎంసీల నీరు అవసరమని అధికారులు లెక్కలు వేశారు. గత ఏడాది డిసెంబర్ 15నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 14 వరకు మొత్తం 29.067 టీఎంసీల నీటిని వారబంధీ విధానంలో విడుదలకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక ఐడీసీ స్కీమ్స్ కింద 1.880 టీఎంసీలు, భక్తరామదాసు, వైరా ప్రాజెక్టు నుంచి 2.663 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని భావించారు. కానీ ఇటీవల పాలేరుకు ఇన్ఫ్లో భారీగా తగ్గడంతో చివరి ఆయకట్టు భూములకు సరిగ్గా నీరు అందక పంటలు ఎండిపోతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. బోనకల్ బ్రాంచి కెనాల్, సిరిపురం మేజర్ కాల్వ పరిధిలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. నీటి కోసం ఎదురుచూపులు.. పాలేరు జలాశయంలో నీరు లేకపోవడంతో దిగువకు నీటి విడుదల సాఫీగా సాగడం లేదు. తల్లాడ మండలం సిరిపురం మేజర్ కాల్వ పరిధి తల్లాడ, రేజర్ల, కొత్త వెంకటగిరి గ్రామాల ఆయకట్టుకు సాగర్ జలాలు అందక రైతులు ఈనెల 11న ఆందోళనకు దిగారు. అలాగే, బోనకల్ బ్రాంచి కెనాల్ పరిధిలోని 500 ఎకరాల మేర పంట దెబ్బతిన్నది. ఏప్రిల్ వరకు నీరందిస్తామని ఫిబ్రవరిలోనే చేతులెత్తేశారు.. తల్లాడ మండలం గాంధీనగర్ తండాకు చెందిన భూక్యా లక్ష్మి యాసంగిలో రెండున్నర ఎకరాలు రూ.50వేలకు కౌలుకు తీసుకుంది. తెలగవరం సబ్ మైనర్, సిరిపురం ఎన్నెస్పీ మేజర్ కాల్వ కింద రేజర్లలో 75 రోజుల క్రితం వరి నాట్లు వేయగా, నెల రోజులుగా నీరు రావడం లేదు. దీంతో వరి మొత్తం ఎండిపోగా.. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న లక్ష్మి, ఆమె భర్త తమను ఆదుకునే వారెవరని ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్ వరకు నీరందిస్తామన్న అధికారులు ఫిబ్రవరిలోనే ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. పరిహారం అందించాల్సిందే... బోనకల్ మండలం ఆళ్లపాడుకు చెందిన రైతు బొమ్మగాని సాంబయ్య ఐదెకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశాడు. ఆయన భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి రూ.2 లక్షల మేర పెట్టుబడి పెట్టాడు. కంకి దశలో ఉండగా సాగర్ జలాలు అందక పంట ఎండిపోయింది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఆళ్లపాడు మైనర్కు నీరు విడుదల చేయలేదని.. ఎండిపోయిన మొక్కజొన్న పంట సర్వే చేయించి పరిహారం అందించాలని సాంబయ్య కోరుతున్నాడు. ప్రణాళికా లోపం.. ఏప్రిల్ వరకు నీటి సరఫరా ఉంటుందని అధికారులు ప్రకటించడంతో రైతులు పంటల సాగు చేపట్టారు. కానీ నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారుల ప్రణాళికా లోపంతో ఫిబ్రవరిలోనే నీటి కటకట ఏర్పడింది. అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తే చివరి ఆయకట్టుకు కూడా కొంత మేర నీరు అందేది. ప్రస్తుతం పాలేరుకు ఇన్ఫ్లో తగ్గగా.. ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జలవనరుల సలహా మండలి సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. ఆ మేరకు ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో 5వేల క్యూసెక్కులను పాలేరు రిజర్వాయర్కు విడుదల చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చినా పూర్తిగా నెరవేరలేదు. ఒకటి, రెండు రోజులకే ఇన్ఫ్లో తగ్గడంతో పాలేరు రిజర్వాయర్లో నీటిమట్టం మళ్లీ 16 అడుగులకు చేరింది. -
జల పర్యాటకం, రవాణాకు పెద్దపీట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జల పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు జలరవాణా అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం బోటింగ్ టూరిజాన్ని మెరుగుపరుస్తూనే కొత్త జలవనరుల అన్వేషణకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ, ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ సంయుక్తంగా పనిచేయనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్సు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా నీటివనరులు, బీచ్లను పరిశీలించి పర్యాటక అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తిస్తుంది. కొత్త నదీమార్గాల అన్వేషణ రాజమహేంద్రవరం, విజయవాడ, నాగార్జునసాగర్, శ్రీశైలంలో పర్యాటకశాఖ ఎక్కువగా బోటింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీటితోపాటు ఇతర ప్రాంతాల్లోను అంతర్గత బోట్ల సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తూ బోటింగ్ రక్షణకు పెద్దపీట వేయనుంది. మరోవైపు చిన్నచిన్న బోట్ల దగ్గర నుంచి హౌస్ బోట్లు, క్రూయిజ్లను సైతం నడిపేలా, తీర్థస్థలాలు, వారసత్వ ప్రదేశాలను కలుపుతూ ఉండే నదీమార్గాలను అన్వేషిస్తోంది. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఏపీలో బీచ్లను ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దనుంది. ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీ ఇలా.. ఈ కమిటీకి ఏపీటీడీసీ ఎండీ చైర్మన్గా, ఇన్ల్యాండ్ వాటర్వేస్ ఈడీ కో–చైర్మన్గా, ఏడుగురు సభ్యులతో ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఏపీ టూరిజం అథారిటీ డిప్యూటీ సీఈవో, ఏపీటీడీసీ ఈడీ (ప్రాజెక్ట్స్), జలవనరులశాఖ చీఫ్ ఇంజినీర్, దేవదాయశాఖ జాయింట్ కమిషనర్, ఏపీటీడీసీ వాటర్ ఫ్లీట్ జీఎంలతో పాటు ఏపీటీడీసీ, ఇన్ల్యాండ్ వాటర్వేస్ నుంచి ఒక్కో నామినేటెడ్ వ్యక్తి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఇతర రాష్ట్రాలతో పాటు బెల్జియం, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో పర్యటించి అక్కడి జల పర్యాటకం, రవాణా సౌకర్యాలను పరిశీలిస్తుంది. సమగ్ర నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తుంది. గోదావరి, కృష్ణాలోను.. జలమార్గం చౌకైన రవాణా కావడంతో కేంద్రప్రభుత్వం జలమార్గాల అభివృద్ధిపై దృష్టి సారించింది. దేశంలో 50.1 శాతం రోడ్డు, 36 శాతం రైల్వే, 6 శాతం సముద్ర, 7.5 శాతం పైప్లైన్ రవాణా వ్యవస్థలున్నాయి. జలమార్గ రవాణా 0.4 శాతం మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా 680 మైళ్ల పొడవైన జలమార్గం జాతీయ రహదారులను కలుపుతోంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి మీదుగా ప్రయాణిస్తోంది. కోరమాండల్ తీరం వెంబడి కాకినాడ, ఏలూరు, కొమ్మమూరు, బకింగ్హామ్ కాలువలున్నాయి. ఏపీలో కృష్ణా, గోదావరి నదులు ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ క్రమంలో జల పర్యాటకం, రవాణా ప్రోత్సాహకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయి. -
నీటి లభ్యత తేల్చాకే కావేరికి గోదావరి
సాక్షి, అమరావతి: గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే కావేరి గ్రాండ్ ఆనకట్టకు గోదావరి జలాలను తరలించేలా గోదావరి – కావేరి అనుసంధానం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) పాలక మండలి 70వ సమావేశం మంగళవారం కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ అధ్యక్షతన వర్చువల్గా జరిగింది. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా, ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్సింగ్, అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులు, ఈఎన్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నదుల అనుసంధానంపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు. ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 141 టీఎంసీల గోదావరి జలాలను తుపాకులగూడెం నుంచి నాగార్జునసాగర్, సోమశిలల్లోకి, అక్కడి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించేలా రూపొందించిన గోదావరి – కావేరి అనుసంధానం డీపీఆర్పై చర్చించారు. ఇందులో 40 టీఎంసీల చొప్పున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులకు కేటాయించి, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. తమ కోటాలో నీటిని మళ్లించడానికి అంగీకరించబోమని ఛత్తీస్గఢ్ చెప్పింద. గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం ఇతర బేసిన్లకు మళ్లించే గోదావరి జలాలకుగాను తమకు కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని మహారాష్ట్ర పట్టుబట్టింది. తమకు ఏ ప్రాతిపదికన 9.8 టీఎంసీలు కేటాయించారని కర్ణాటక ప్రశ్నించింది. తమకు అంతకంటే ఎక్కువ కేటాయించాలని డిమాండ్ చేసింది. కావేరికి గోదావరి జలాలు తరలిస్తున్నందున, కావేరి జలాల్లో 92 టీఎంసీలు తమకు ఇవ్వాలని కేరళ కోరింది. గోదావరిలో మిగులు జలాలు లేవని, శాస్త్రీయంగా అధ్యయనం చేసి నీటి లభ్యతను తేల్చాలని ఏపీ డిమాండ్ చేసింది. నీటి లభ్యతను తేల్చాకే గోదావరి జలాలను కావేరికి తరలించాలని, అప్పుడే వర్షాభావ ప్రాంతాలకు సాగు, తాగు నీరు లభిస్తుందని పేర్కొంది. గత నెల 18న బెంగళూరులో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలపై నివేదిక రూపకల్పనలో తాము వెల్లడించిన అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని కోరింది. తెలంగాణ కూడా ఇదే రీతిలో స్పందించింది. రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ స్పష్టం చేశారు. -
ప్రాధాన్యత ప్రాజెక్టుగా మహేంద్రతనయ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో సాగు, తాగు నీటి సదుపాయాలను మెరుగుపర్చడం ద్వారా జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలో అత్యంత వెనుకబడిన నందిగం, పలాస, టెక్కలి, మెళియపుట్టి మండలాల్లో 24,600 ఎకరాలకు సాగు నీరు, 108 గ్రామాలకు తాగు నీరు అందించే మహేంద్ర తనయ ప్రాజెక్టును జలవనరుల శాఖ అధికారులు ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ఆఫ్షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టును చేపట్టారు. దీనిని గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ప్రాజెక్టు నత్తనడకన సాగింది. ఇప్పుడు వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృషిపెట్టింది. దివాలా తీసిన పాత కాంట్రాక్టర్ను తొలగించి, మిగిలిపోయిన పనులను కొత్త కాంట్రాక్టు సంస్థకు అప్పగించడానికి టెండర్ షెడ్యూళ్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపింది. జ్యుడిషియల్ ప్రివ్యూ అనంతరం రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ ధరకు కాంట్రాక్టర్కు పనులు అప్పగిస్తారు. రోజుకు 1200 క్యూసెక్కులు మళ్లించి.. ఒడిశాలోని తుపరసింగి వద్ద పుట్టిన మహేంద్రతనయ గొట్టా బ్యారేజ్కు 4 కిలోమీటర్ల ఎగువన వంశధారలో కలుస్తుంది. శ్రీకాకుళం జిల్లా మెళియపుట్టి మండలం చాపర వద్ద మహేంద్రతనయపై రెగ్యులేటర్ నిర్మించి, అక్కడి నుంచి రోజుకు 1200 క్యూసెక్కులు తరలించేలా 13.52 కిలోమీటర్ల వరద కాలువ తవ్వుతారు. ఈ కాలువ ద్వారా నీటిని తరలించి రేగులపాడు వద్ద 1.76 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్లో నిల్వ చేస్తారు. రిజర్వాయర్ నుంచి ఎడమ కాలువ (11.20 కిలోమీటర్లు) ద్వారా 12,500 ఎకరాలకు, కుడి కాలువ (10.20 కిలోమీటర్లు) ద్వారా 12,100 ఎకరాలు.. మొత్తం 24,600 ఎకరాలకు సాగు నీటితోపాటు 108 గ్రామాలకు తాగు నీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.852.45 కోట్లు. వరద కాలువలో ఇప్పటికే 7.27 కిలోమీటర్ల పని పూర్తయింది. మరో 6.3 కిలోమీటర్ల కాలువ తవ్వాల్సి ఉంది. కాలువపై 26 కాంక్రీట్ నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. రిజర్వాయర్ పనుల్లో భాగంగా 2.485 కిలోమీటర్ల పొడవున 55.6 మీటర్ల ఎత్తుతో మట్టికట్ట నిర్మించాలి. రిజర్వాయర్లో ముంపునకు గురయ్యే ఏడు గ్రామాల్లోని 1,059 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా.. ఇప్పటికే 659 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. ఆయకట్టుకు నీళ్లందించేలా 51.5 కిమీల పిల్ల కాలువల కోసం 373.75 ఎకరాల భూమిని సేకరించాలి. ఈ భూమి సేకరణ, నిర్వాసితులకు పునరావాసంపై అధికారులు దృష్టి సారించారు. మిగిలిపోయిన పనులను కొత్త కాంట్రాక్టు సంస్థకు అప్పగించి.. శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. -
‘అన్నమయ్య’ పునర్నిర్మాణం.. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఆకస్మికంగా వచ్చిన భారీ వరదలతో గతేడాది నవంబర్ 19న తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.787 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పునర్నిర్మాణానికి జలవనరుల శాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదముద్ర వేశారు. ఈమేరకు పరిపాలన అనుమతి ఇస్తూ జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. చెయ్యేరుకు వందేళ్లలో ఒకసారి గరిష్టంగా 2.40 లక్షల క్యూసెక్కులు, 200 ఏళ్లకు ఒకసారి గరిష్టంగా 2.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేయగా 140 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో గతేడాది అన్నమయ్య ప్రాజెక్టుకు 3.20 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఈ నేపథ్యంలో చెయ్యేరుకు నాలుగు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్వే నిర్మించాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు జలవనరుల శాఖ అధికారులు అన్నమయ్య ప్రాజెక్టును రీ డిజైన్ చేశారు. నాడు.. అదనపు స్పిల్వే నిర్మించకపోవడంతోనే అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బాదనగడ్డ వద్ద చెయ్యేరుపై 2.24 టీఎంసీల సామర్థ్యంతో అన్నమయ్య ప్రాజెక్టును 1981లో ప్రారంభించగా 2001కి పూర్తి చేశారు. 206.65 మీటర్ల ఎత్తుతో 94 మీటర్ల పొడవున స్పిల్వే, అనుబంధంగా 336 మీటర్ల పొడవున మట్టికట్టను నిర్మించారు. స్పిల్వేకు 13.75 మీటర్ల ఎత్తు, 14 మీటర్ల వెడల్పుతో ఐదు గేట్లు అమర్చారు. ఈ ప్రాజెక్టు కింద 22,500 ఎకరాల ఆయకట్టు ఉంది. 2012లో జల వనరుల శాఖ 3–డీ అధ్యయనంలో అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్వే నుంచి గరిష్టంగా 2.17 లక్షల క్యూసెక్కులే దిగువకు విడుదల చేయవచ్చని తేలింది. 2017లో ప్రాజెక్టును తనిఖీ చేసిన డ్యామ్ సేఫ్టీ కమిటీ 1.30 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా అదనంగా మరో స్పిల్వే నిర్మించాలని ఇచ్చిన నివేదికను టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. గతేడాది నవంబర్ 16, 17, 18, 19వతేదీల్లో శేషాచలం– నల్లమల అడవులు, చెయ్యేరు, బహుదా, మాండవ్య పరీవాహక ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. 17న అన్నమయ్య ప్రాజెక్టులో సగటున 1.75 టీఎంసీలను నిల్వ చేస్తూ వచ్చిన వరదను వచ్చినట్టుగా అధికారులు దిగువకు వదిలేశారు. 18న రాత్రి 8 గంటలకు వరద 77,125 క్యూసెక్కులకు చేరడంతో దిగువకు 1,09,124 క్యూసెక్కులను వదులుతూ వచ్చారు. ఆ రోజు రాత్రి పది గంటలకు ప్రాజెక్టు గేట్లను పూర్తిగా ఎత్తేసి 1,46,056 క్యూసెక్కులు దిగువకు వదిలేశారు. 19న అర్థరాత్రి 3 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టులోకి 3.20 లక్షల క్యూసెక్కులు రావటంతో మట్టం గరిష్ట స్థాయికి చేరింది. సామర్థ్యం చాలక మట్టికట్ట పైనుంచి దిగువకు వరద పారింది. దీంతో 19న ఉదయం 6.30 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది. 440 మీటర్ల పొడవు.. 4 లక్షల క్యూసెక్కులు దాటినా చెయ్యేరుకు నాలుగు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువగా వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా దృఢంగా అన్నమయ్య ప్రాజెక్టును పునర్నిర్మించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ క్రమంలో మట్టికట్ట కాకుండా 440 మీటర్ల పొడవున కాంక్రీట్ కట్టడం (స్పిల్వే)తో ప్రాజెక్టును నిర్మించాలని నిపుణుల కమిటీ సూచించింది. నాలుగు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద వచ్చినా దిగువకు విడుదల చేసేలా గేట్లను సులభంగా నిర్వహించేందుకు హైడ్రాలిక్ సిలిండర్ హాయిస్ట్ విధానంలో పనులు చేపట్టాలని నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రూ.787 కోట్లతో జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. -
రివర్స్ టెండరింగ్తో రూ.44.15 కోట్లు ఆదా
బి.కొత్తకోట: జలవనరుల శాఖలో రివర్స్ టెండరింగ్తో కోట్లు ఆదా అవుతున్నాయి. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో సాగే ఏవీఆర్ హంద్రీ–నీవా సాగునీటి ప్రాజెక్టు రెండోదశలో అంతర్భాగమైన పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులకు ఈనెల ప్రారంభంలో ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈనెల 20న ప్రాజెక్టు మదనపల్లె ఎస్ఈ సీఆర్ రాజగోపాల్ కంపెనీల సాంకేతిక అర్హతలను పరిశీలించగా సోమవారం కంపెనీలు దాఖలుచేసిన ప్రైస్బిడ్ను తెరిచారు. ఇందులో హైదరాబాద్కు చెందిన నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ రివర్స్ టెండరింగ్లో లెస్కు టెండర్ దాఖలు చేసి ఎల్–1గా నిలిచింది. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం సీవీరామన్నగారిపల్లె నుంచి హంద్రీ–నీవా పుంగనూరు ఉపకాలువ (పీబీసీ)పై కిలోమీటరు 79.600 నుంచి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలంలో కిలోమీటరు 220.350 వరకు కాలువను విస్తరించే పనులకు ప్రభుత్వం రూ.1,219,93,02,150 అంచనాతో టెండర్లను ఆహ్వానించింది. ఈ పనులు దక్కించుకునేందుకు నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్, మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ టెండర్లు దాఖలు చేశాయి. తొలుత టెండర్లను దాఖలు చేసిన కంపెనీల సాంకేతిక అర్హత, అనుభవం, సామర్థ్యంపై డాక్యుమెంట్లను ఈనెల 20న పరిశీలించగా రెండింటీకి అర్హత ఉన్నట్లు నిర్ధారౖణెంది. దీంతో సోమవారం మధ్యాహ్నం ప్రైస్బిడ్ను తెరిచారు. ఇందులో నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ అంచనాకంటే 3.42 శాతం అదనంతో రూ.1,261,65,18,283.53కు టెండర్ దాఖలు చేసింది. అనంతరం దీనిపై ఎస్ఈ రాజగోపాల్ రివర్స్ టెండరింగ్ ప్రారంభించి సా.5.30 గంటలకు ముగించారు. ఇందులో రెండు కంపెనీలు పోటీపడినా చివరికి నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రభుత్వ అంచనా విలువకంటే 0.1997 శాతం తక్కువకు అంటే..రూ.1,217,49,40,146.53తో టెండర్ దాఖలుచేసి ఎల్–1గా నిలిచింది. ఈ రివర్స్ టెండర్ నిర్వహణవల్ల ప్రభుత్వానికి రూ.44,15,78,137 ఆదా అయ్యింది. ఇక ఎల్–1గా నిలిచిన కంపెనీకి పనుల అప్పగింత కోసం ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు ఎస్ఈ చెప్పారు. -
హిరమండలం ఎత్తిపోతలకు గ్రీన్సిగ్నల్
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో వంశధార ఫేజ్–2, స్టేజ్–2 ఆయకట్టు రైతులకు ముందస్తు ఫలాలను అందించడం.. ఫేజ్–1 స్టేజ్–2 ఆయకట్టు, నారాయణపురం ఆనకట్ట ఆయకట్టును స్థిరీకరించడం, ఉద్దానం ప్రాంతానికి తాగునీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా హిరమండలం ఎత్తిపోతలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టడానికి రూ.176.35 కోట్లతో పరిపాలన అనుమతి ఇస్తూ బుధవారం జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. వంశధార నదిలో గొట్టా బ్యారేజ్ వద్ద నీటి లభ్యతపై 2007 ఆగస్టులో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మళ్లీ అధ్యయనం చేసింది. ఇందులో గొట్టా బ్యారేజ్ వద్ద 105 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. ఇందులో రాష్ట్ర వాటా 52.5 టీఎంసీలు. వంశధార స్టేజ్–1, స్టేజ్–2ల ద్వారా 34.611 టీఎంసీలను మాత్రమే వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వాటాలో ఇంకా 17.439 టీఎంసీలను వాడుకోవడానికి అవకాశం ఉంది. ఆ నీటిని వాడుకోవడానికి వంశధార ఫేజ్–2 స్టేజ్–2ను జలయజ్ఞంలో భాగంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఈ ప్రాజెక్టుపై ఒడిశా సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. నేరడి బ్యారేజ్ స్థానంలో కాట్రగడ్డ వద్ద సైడ్ వియర్ను నిర్మించి.. వరద కాలువ ద్వారా హిరమండలం రిజర్వాయర్ (19.5 టీఎంసీల సామర్థ్యం)కు మళ్లించి.. వంశధార పాత ఆయకట్టు 2,10,510 ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా 45 వేల ఎకరాలకు నీళ్లందించే పనులను చేపట్టారు. సైడ్ వియర్ వల్ల ఎనిమిది టీఎంసీలను మాత్రమే హిరమండలం రిజర్వాయర్కు తరలించవచ్చు. గొట్టా బ్యారేజ్ నుంచి కుడికాలువ మీదుగా.. నేరడి బ్యారేజ్కు వంశధార ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ.. ట్రిబ్యునల్ తీర్పుపై ఒడిశా సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో దాన్ని కేంద్రం నోటిఫై చేయలేదు. ఈ నేపథ్యంలో నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఒడిశా సర్కార్ను ఒప్పించడం కోసం భువనేశ్వర్ వెళ్లిన సీఎం వైఎస్ జగన్.. ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్తో దౌత్యం జరిపారు. ఓ వైపు నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటూనే మరోవైపు ప్రాజెక్టు ముందస్తు ఫలాలను అందించడం కోసం గొట్టా బ్యారేజ్ నుంచి రోజుకు 1,400 క్యూసెక్కుల చొప్పున వందరోజుల్లో 10 నుంచి 14 టీఎంసీలను తరలించేలా ఎత్తిపోతల పథకం చేపట్టడానికి ప్రతిపాదనలు పంపాలని మే 10న జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గొట్టా బ్యారేజ్ జలవిస్తరణ ప్రాంతం నుంచి 1,400 క్యూసెక్కులను 650 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి.. వంశధార కుడికాలువలో 2.4 కిలోమీటర్ల వద్దకు ఎత్తిపోస్తారు. ఈ నీటిని హిరమండలం రిజర్వాయర్కు తరలించడానికి వీలుగా 2.5 కిలోమీటర్ల పొడవున కుడికాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 2,265 క్యూసెక్కులకు పెంచుతారు. వందరోజుల్లో 10 నుంచి 12 టీఎంసీలను హిరమండలం రిజర్వాయర్లోకి తరలిస్తారు. తద్వారా వంశధారలో వాటా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని వంశధార స్టేజ్–1, స్టేజ్–2ల కింద 2,55,510 ఎకరాలకు నీళ్లందించడంతోపాటు వంశధార–నాగావళి అనుసంధానం ద్వారా నారాయణపురం ఆనకట్ట కింద ఉన్న 37 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తారు. హిరమండలం రిజర్వాయర్ నుంచి ఉద్దానానికి తాగునీటి కోసం 0.712 టీఎంసీలను సరఫరా చేస్తారు. -
నెల్లూరుకు నగిషీ.. వందేళ్ల కల సాకారం
(నెల్లూరు బ్యారేజ్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి రామగోపాలరెడ్డి ఆలమూరు): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల స్వప్నం నెల్లూరు బ్యారేజ్ సాకారమవుతోంది. జలయజ్ఞంలో భాగంగా దివంగత వైఎస్సార్ చేపట్టిన నెల్లూరు బ్యారేజ్ పనులను ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేశారు. ఈ బ్యారేజ్ను ఈనెల 6వ తేదీన జాతికి అంకితం చేయనున్నారు. బ్యారేజ్ ద్వారా సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువల కింద సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిధిలోని ముత్తుకూరు, టీపీ గూడూరు, వెంకటాచలం, ఇందుకూరుపేట, నెల్లూరు మండలాల్లోని 77 గ్రామాల్లో 99,525 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీరు అందనుంది. బ్యారేజ్ను పూర్తి చేసి నిత్యం 0.4 టీఎంసీలను నిల్వ చేయడం ద్వారా నెల్లూరుతోపాటు 77 గ్రామాల్లో తాగునీటి సమస్యను సీఎం జగన్ శాశ్వతంగా పరిష్కరించారు. వరద నియంత్రణ ద్వారా ముంపు ముప్పు నుంచి తప్పించారు. నెల్లూరు బ్యారేజ్ కమ్ 2 వరసల రోడ్డు బ్రిడ్జిని పూర్తి చేయడంతో నెల్లూరు–కోవూరు మధ్య రవాణా ఇబ్బందులు శాశ్వతంగా పరిష్కారమయ్యాయి. దీంతోపాటు మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీని కూడా సీఎం జగన్ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆంగ్లేయుల కాలంలో... 1854–55లో ఆంగ్లేయుల హయాంలో నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నా నదికి అడ్డంగా 481.89 మీటర్ల వెడల్పుతో ఆనకట్ట నిర్మించి అరకొరగా మాత్రమే ఆయకట్టుకు నీళ్లందించారు. 1862లో భారీ వరదలకు ఆనకట్ట దెబ్బతినడంతో 621.79 మీటర్ల వెడల్పుతో 0.7 మీటర్ల ఎత్తుతో కొత్త ఆనకట్ట నిర్మించారు. పూడిక పేరుకుపోవడం, శిథిలం కావడంతో ఆయకట్టుకు నీళ్లందించడం 1904 నాటికే సవాల్గా మారింది. నెల్లూరు తాగునీటికి తల్లడిల్లింది. ఆనకట్టకు దిగువన ఉన్న రోడ్డు ద్వారా నెల్లూరు–కోవూరు మధ్య రాకపోకలు సాగించేవారు. పెన్నా నదికి కాస్త వరద వచ్చినా రాకపోకలు స్తంభించిపోయేవి. ఆనకట్ట వల్ల వరద వెనక్కి ఎగదన్ని నెల్లూరును ముంచెత్తేది. ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆనకట్ట స్థానంలో బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మించాలని 1904 నాటి నుంచి నెల్లూరు ప్రజలు కోరుతున్నా 2004 వరకూ ఎవరూ పట్టించుకోలేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయ/æ్ఞంలో భాగంగా నెల్లూరు బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మాణాన్ని రూ.147.20 కోట్లతో 2008 ఏప్రిల్ 24న చేపట్టారు. ఆయన హయాంలో బ్యారేజ్ పనులు పరుగులెత్తాయి. రూ.86.62 కోట్లను ఖర్చు చేశారు. మహానేత హఠాన్మరణం నెల్లూరు బ్యారేజ్కు శాపంగా మారింది. నాడు కాలయాపన.. కమీషన్లకే ప్రాధాన్యం రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ నెల్లూరు బ్యారేజ్ పనులను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. బ్రిటీష్ సర్కార్ నిర్మించిన పాత ఆనకట్టకు పది మీటర్ల ఎగువన 10.9 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా 640 మీటర్ల వెడల్పుతో నెల్లూరు బ్యారేజ్ నిర్మాణాన్ని చేపట్టారు. పాత ఆనకట్ట వల్ల వరద ప్రవాహం వెనక్కి ఎగదన్నడం బ్యారేజ్ నిర్మాణానికి సమస్యగా మారింది. పాత ఆనకట్టను పూర్తిగా తొలగించి బ్యారేజ్ నిర్మిస్తున్న ప్రాంతానికి 20 మీటర్ల ఎగువన కాఫర్ డ్యామ్ నిర్మించి ఆయకట్టుకు నీళ్లందిస్తూ బ్యారేజ్ నిర్మించాలని 2014లో ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. 2016 వరకూ టీడీపీ సర్కార్ దీన్ని పరిశీలించకుండా జాప్యం చేసింది. ఆ తరువాత డిజైన్లలో మార్పులు చేసి అంచనా వ్యయాన్ని రూ.274.83 కోట్లకు సవరించింది. కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు రాబట్టుకునే పనులకే ప్రాధాన్యం ఇచ్చింది. 2016 నుంచి 2019 మే 29 వరకూ రూ.71.54 కోట్లు ఖర్చు చేసినా బ్యారేజ్లో 57 ఫియర్లను (కాంక్రీట్ దిమ్మెలు) పునాది కంటే ఒక మీటర్ ఎత్తు వరకు మాత్రమే చేయగలిగింది. నేడు ప్రతికూల పరిస్థితుల్లోనూ పూర్తి.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక నెల్లూరు బ్యారేజ్ను ప్రాధాన్యతగా చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. 2020 మార్చి నుంచి 2021 చివరిదాకా కరోనా మహమ్మారి మూడు దఫాలు విజృంభించింది. పెన్నా చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 2019–20, 2020–21, 2021–22లో వరుసగా భారీ వరదలు వచ్చాయి. నెల్లూరు బ్యారేజ్ నుంచి 2019–20లో 45.52, 2020–21లో 301.52, 2021–22లో 373.52 టీఎంసీల వరద జలాలు సముద్రంలో కలిశాయంటే ఏ స్థాయిలో ఉగ్రరూపం దాల్చిందో అంచనా వేయవచ్చు. వరద ఉద్ధృతికి బ్యారేజ్కు ఎగువన ఆయకట్టుకు నీళ్లందించడం కోసం తాత్కాలికంగా నిర్మించిన కాఫర్ డ్యామ్ (మట్టికట్ట) దెబ్బతిన్నది. వరదలు తగ్గాక మళ్లీ మట్టికట్టను సరిచేసి ఆయకట్టుకు నీళ్లందిస్తూ బ్యారేజ్ పనులు చేయడం సవాల్గా మారింది. ఈ తీవ్ర ప్రతికూలతల్లోనూ బ్యారేజ్లో రెండు మీటర్ల మందంతో 57 పియర్లను ప్రభుత్వం పూర్తి చేసింది. 57 పియర్ల మధ్య పది మీటర్ల ఎత్తు, మూడు మీటర్ల వెడల్పుతో 43 గేట్లు, కోతకు గురై వచ్చిన మట్టిని దిగువకు పంపడానికి పది మీటర్ల ఎత్తు, 4.3 మీటర్ల వెడల్పుతో 8 గేట్లు (స్కవర్ స్లూయిజ్ గేట్లు) వెరసి 51 గేట్లను ఏర్పాటు చేసింది. గేట్లను ఎత్తడం, దించడానికి వీలుగా ఎలక్ట్రిక్ విధానంలో హాయిస్ట్ను ఏర్పాటు చేసింది. బ్యారేజ్కు 22 మీటర్ల ఎత్తులో 1.2 మీటర్ల మందం, 7.5 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల రోడ్ బ్రిడ్జిని నిర్మించారు. సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువలకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్ను పూర్తి చేశారు. బ్యారేజ్లో 0.4 టీఎంసీలను నిల్వ చేయడానికి వీలుగా కుడి, ఎడమ కరకట్టలను పటిష్టం చేసేందుకు రూ.77.37 కోట్లను ఖర్చు చేశారు. నూతన అధ్యాయం.. నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల కలను సాకారం చేస్తూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పనులు ప్రారంభిస్తే ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ బ్యారేజీని పూర్తి చేశారు. ఈనెల 6న నెల్లూరు బ్యారేజ్ను సీఎం జగన్ జాతికి అంకితం చేసి చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించనున్నారు. ఆయకట్టుకు సమృద్ధిగా నీటితోపాటు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. నెల్లూరు–కోవూరు మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది. – అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రి పెరగనున్న భూగర్భ జలమట్టం.. నెల్లూరు బ్యారేజ్ను ప్రాధాన్యతగా చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కరోనా, వరదలు లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ పనులు కొనసాగాయి. సీఎం జగన్, మంత్రి అంబటి రాంబాబు మార్గదర్శకాల మేరకు సవాల్గా తీసుకుని పెన్నా బ్యారేజ్ను పూర్తి చేశాం. ఆయకట్టుకు సమృద్ధిగా నీటి సరఫరాతోపాటు బ్యారేజ్లో నిత్యం 0.4 టీఎంసీలను నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలమట్టం పెరుగుతుంది. సాగు, తాగునీటి సమస్యకు సీఎం జగన్ శాశ్వత పరిష్కారాన్ని చూపారు. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, జలవనరుల శాఖ. వరద ఉద్ధృతిలోనూ.. పెన్నా చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో గత మూడేళ్లుగా భారీ వరదలు వచ్చాయి. మట్టికట్ట కొట్టుకుపోవడంతో దాన్ని సరిచేసి ఆయకట్టుకు నీళ్లందిస్తూ బ్యారేజ్ పనులు పూర్తి చేయడం సవాల్గా మారింది. వరద ఉద్ధృతిని అధిగమించి సీఎం జగన్ నిర్దేశించిన గడువులోగా బ్యారేజ్ను పూర్తి చేశాం. ఈ బ్యారేజ్ పూర్తవ్వడంతో నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల కల నెరవేరుతోంది. – హరినారాయణరెడ్డి, సీఈ, తెలుగుగంగ -
దశాబ్దాల కల ‘సంగం’ సాకారం
మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ నిర్మాణం పూర్తి కావడంతో పెన్నా డెల్టాలోని 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు వెరసి మొత్తంగా 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడానికి మార్గం సుగమం అయ్యింది. ప్రధానంగా నెల్లూరుకు ముంపు ముప్పు తప్పింది. చెప్పిన మాట మేరకు యుద్ధ ప్రాతిపదికన బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నిబద్ధతను చాటుకున్నారు. దీనికి తోడు నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జి కూడా రికార్డు సమయంలో పూర్తి కావడం విశేషం. (మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి రామగోపాలరెడ్డి ఆలమూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజల దశాబ్దాల స్వప్నం సాకారమైంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ పనులను ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేశారు. ఈనెల 6న బ్యారేజ్ను జాతికి అంకితం చేయనున్నారు. దీంతో పాటు నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జిని కూడా రికార్డు సమయంలో పూర్తి చేశారు. సంగం బ్యారేజీ నిర్మాణం ద్వారా పెన్నా వరదలను సమర్థవంతంగా నియంత్రించి, ముంపు ముప్పు నుంచి నెల్లూరు జిల్లా ప్రజలను తప్పించవచ్చు. బ్యారేజ్లో 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉండటం వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగడం ఖాయం. తద్వారా తాగునీటి ఇబ్బందులు తీరుతాయి. మేకపాటి గౌతమ్రెడ్డి బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని పూర్తి చేయడం ద్వారా సంగం, పొదలకూరు మండలాల మధ్య రాకపోకల సమస్యను సీఎం వైఎస్ జగన్ శాశ్వతంగా పరిష్కరించారు. శిథిలమైనా పట్టించుకోని దుస్థితి నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నా నదిపై 1882–83లో బ్రిటీష్ సర్కార్ 0.9 మీటర్ల ఎత్తున ఆనకట్టను నిర్మించి.. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల కింద ఆయకట్టుకు 1886 నుంచి నీళ్లందించడం ప్రారంభించింది. ఈ ఆనకట్టకు దిగువన నదీ గర్భంలో నిర్మించిన రోడ్డు ద్వారా సంగం–పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు సాగుతున్నాయి. పెన్నాలో వరద పెరిగితే ఈ రెండు మండలాల మధ్య రాకపోకలు స్తంభించిపోయేవి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఆనకట్ట శిథిలావస్థకు చేరుకోవడంతో.. దానిపై 0.3 మీటర్ల మేర ఇసుక బస్తాలు వేసి, నీటిని నిల్వ చేసినా.. ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. సంగం ఆనకట్ట స్థానంలో బ్యారేజ్ నిర్మించి, ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లందించాలని నెల్లూరు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఆ డిమాండ్ను 2006 వరకూ ఎవరూ పట్టించుకోలేదు. సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీ స్వప్నం సాకారం దిశగా అడుగులు.. నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006 మే 28న సంగం బ్యారేజ్కు శంకుస్థాపన చేశారు. రూ.147.50 కోట్ల అంచనా వ్యయంతో 2008 మే 21న పనులు చేపట్టారు. మహానేత వైఎస్ హయాంలో బ్యారేజ్ పనులు పరుగులు తీశాయి. ఈ పనులకు అప్పట్లో రూ.30.85 కోట్లు వ్యయం చేశారు. అయితే మహానేత వైఎస్ హఠాన్మరణం సంగం బ్యారేజ్ పనులకు శాపంగా మారింది. కమీషన్లు వచ్చే పనులకే టీడీపీ హయాంలో పెద్దపీట సంగం బ్యారేజ్ను నిర్మిస్తున్న ప్రాంతంలో పెన్నా నది వెడల్పు 1,400 మీటర్లు. కానీ.. అప్పట్లో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజనీర్ 846 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్ (కాంక్రీట్ నిర్మాణం), ఇరువైపులా 554 మీటర్ల వెడల్పుతో మట్టికట్టలు నిర్మించేలా డిజైన్ను ఆమోదించారు. బ్యారేజ్ నిర్మాణ సమయంలో ఇబ్బందులు ఏర్పడటంతో డిజైన్లలో మార్పులు చేయాలని 2013లో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం 2013 నవంబర్ 23న నిపుణుల కమిటీని నియమించింది. బ్యారేజ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ.. 1,195 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్ (కాంక్రీట్ కట్టడం) నిర్మించాలని 2014లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను ఆమోదించడంలో రెండేళ్ల పాటు జాప్యం చేసిన టీడీపీ సర్కార్.. ఎట్టకేలకు 2016 జనవరి 21న బ్యారేజ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో అంచనా వ్యయాన్ని రూ.335.80 కోట్లకు పెంచింది. బ్యారేజ్ను 2017కు పూర్తి చేస్తామని ఒకసారి.. 2018కి పూర్తి చేస్తామని మరోసారి.. 2019కి పూర్తి చేస్తామని ఇంకోసారి ముహూర్తాలను మారుస్తూ వచ్చింది. టీడీపీ సర్కార్ కేవలం కమీషన్లు వచ్చే పనులకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. బ్యారేజ్లో 85 పియర్స్(కాంక్రీట్ దిమ్మెలు)ను సగటున 22 మీటర్ల చొప్పున అరకొరగా పూర్తి చేసింది. చేసిన పనుల కంటే.. ధరల సర్దుబాటు(ఎస్కలేషన్), పనుల పరిమాణం పెరిగిందనే సాకుతో అధికంగా బిల్లులు చెల్లించింది. రూ.86.10 కోట్లను ఖర్చు చేసినా బ్యారేజ్ పనులను ఒక కొలిక్కి తేలేకపోయింది. పెన్నా నదిపై సంగం బ్యారేజీ దిగువ వైపు నుంచి... అటు కరోనా, ఇటు వరద.. అయినా పూర్తి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక సంగం బ్యారేజ్పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రాధాన్యత ప్రాజెక్టుగా ప్రకటించి, శరవేగంగా పూర్తి చేయాలని జల వనరుల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 2020 మార్చి నుంచి 2021 ఆఖరుదాకా కరోనా మహమ్మారి విజృంభించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో 2019–20, 2020–21, 2021–22లో పెన్నా నది ఉప్పొంగి ప్రవహించింది. 2019–20 లో 42.52, 2020–21లో 301.52, 2021–22లో 373.52 టీఎంసీల నీరు నెల్లూరు బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసిందంటే ఏ స్థాయిలో వరద వచ్చిందో అంచనా వేసుకోవచ్చు. ఓ వైపు కరోనా మహమ్మారి తీవ్రత.. మరో వైపు పెన్నా వరద ఉధృతితో పోటీ పడుతూ సంగం బ్యారేజ్ పనులను సీఎం వైఎస్ జగన్ పరుగులెత్తించారు. బ్యారేజ్ 85 పియర్లను 43 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయించారు. ఈ పియర్స్ మధ్య 12 మీటర్ల ఎత్తు, 2.8 మీటర్ల వెడల్పుతో 79 గేట్లు, కోతకుగురై వచ్చిన మట్టిని దిగువకు పంపడానికి 12 మీటర్ల ఎత్తు, 3.8 మీటర్ల వెడల్పుతో 6 గేట్లు (స్కవర్ స్లూయిజ్) బిగించారు. వరద ప్రవాహం వచ్చినప్పుడు దిగువకు విడుదల చేయడానికి వీలుగా గేట్లను ఎత్తడానికి, దించడానికి విద్యుత్తో పనిచేసే హాయిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. బ్యారేజ్కు ఎగువన ఎడమ వైపున 3.17 కిలోమీటర్లు, బ్యారేజ్కు కుడి వైపున 3 కిలోమీటర్ల పొడవున కరకట్టలను పటిష్టం చేశారు. సంగం నుంచి పొదలకూరుకు రాకపోకలు సాగించడానికి వీలుగా బ్యారేజ్పై రెండు వరుసల రోడ్ బ్రిడ్జిని పూర్తి చేశారు. కనిగిరి, కావలి కాలువలకు సంయుక్తంగా నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్, కనుపూరు కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్లను పూర్తి చేశారు. ఈ పనులను రూ.131.12 కోట్ల ఖర్చుతో పూర్తి చేసి.. నెల్లూరు ప్రజల దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేశారు. నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జి ప్రాజెక్టు సైతం రికార్డు సమయంలో నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జిని కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తి చేసింది. జలయజ్ఞంలో భాగంగా దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008–09లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును పదేళ్ల తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి సీఎంగా పూర్తి చేశారు. నెల్లూరు నగరానికి సమీపాన ఇప్పటికే ఉండే పాత ఆనకట్టకు వంద మీటర్ల ఎగువున ఇంకొక కొత్త బ్యారేజీ కమ్ బ్రిడ్జి ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టును కూడా ఈ నెల 6న జాతికి అంకితం చేయనున్నారు. 13 ఏళ్ల క్రితం మొదట్లో రూ.147.20 కోట్ల అంచనాతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టులో 2014కు ముందే రూ.86.62 కోట్ల మేరకు పనులు పూర్తయ్యాయి. తర్వాత ప్రాజెక్టు వ్యయం రూ.274.83 కోట్లకు పెరిగింది. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం రూ.71.54 కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచనతో కాకుండా ప్రాజెక్టు నిర్మాణంలో కేవలం కమీషన్లకు అవకాశం ఉన్న పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపింది. అయితే 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించారు. కేవలం మూడేళ్లలో రూ.77.37 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు ప్రధాన కాంక్రీట్, ఇతర మట్టి పనులన్నింటినీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా 72 గ్రామాల పరిధిలోని 99,525 ఎకరాల్లో సాగు నీటి పారుదల అవకాశాలు మెరుగు పడతాయి. నెల్లూరు– కోవూరుల మధ్య రాకపోకల ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి. ఆనకట్టకు ఎగువన ఇన్ఫిల్ట్రేషన్ బావులు నిండడం వల్ల ఆ ప్రాంతంలో భూగర్భ జల మట్టం పెరిగి నెల్లూరు çనగరం.. ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు తాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది. ఇదో మహోజ్వల ఘట్టం సంగం బ్యారేజ్ నిర్మాణాన్ని మహానేత వైఎస్సార్ ప్రారంభిస్తే.. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి ఈ నెల 6న జాతికి అంకితం చేయనుండటం మహోజ్వల ఘట్టం. కరోనా తీవ్రత, పెన్నా వరద ఉధృతిని తట్టుకుని.. బ్యారేజ్ను పూర్తి చేశాం. నెల్లూరు జిల్లా ప్రజలకు మేకపాటి గౌతమ్రెడ్డి చేసిన సేవలను స్మరించుకుంటూ బ్యారేజ్కు ఆయన పేరు పెట్టాం. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల ఆయకట్టుకు నీళ్లందించి సస్యశ్యామలం చేస్తాం. – అంబటి రాంబాబు, జల వనరుల శాఖ మంత్రి రికార్డు సమయంలో పూర్తి సీఎం ఆదేశాల మేరకు బ్యారేజ్ను రికార్డు సమయంలో పూర్తి చేశాం. 3.85 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి ఇది దోహదపడుతుంది. బ్యారేజ్లో నిత్యం 0.45 టీఎంసీలను నిల్వ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదు. బ్రిడ్జితో సంగం–పొదలకూరు మధ్య రవాణా సమస్యకు పరిష్కారం లభించింది. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ నాణ్యతకు ప్రాధాన్యత సంగం బ్యారేజ్ పనులను అత్యంత నాణ్యతతో శరవేగంగా పూర్తి చేశాం. సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత ప్రాజెక్టుగా సంగం బ్యారేజ్ను ప్రకటించి.. గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ మేరకు గడువులోగా పూర్తి చేశాం. నెల్లూరు జిల్లా ప్రజల దశాబ్దాల కలను సీఎం వైఎస్ జగన్ నిజం చేశారు. – హరినారాయణ రెడ్డి, సీఈ, తెలుగుగంగ -
1న పోలవరంపై కీలక భేటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు అడ్హక్గా రూ.10 వేల కోట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనపై చర్చించేందుకు సెప్టెంబర్ ఒకటో తేదీన∙రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అధికారులు వర్చువల్గా సమావేశం కానున్నారు. ఇందులో చర్చించిన అంశాల ఆధారంగా పోలవరానికి నిధుల విడుదలపై కేంద్ర జల్ శక్తి శాఖకు సీడబ్ల్యూసీ నివేదిక ఇస్తుంది. తర్వాత దీన్ని కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం జల్ శక్తి శాఖ పంపుతుంది. కేంద్ర కేబినెట్ ఆమోదించాక నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ గ్రీన్సిగ్నల్ ఇవ్వనుంది. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి సహాయ, సహకారాలు అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు గురువారం ఢిల్లీలో రాష్ట్ర అధికారుల బృందంతో కేంద్ర అధికారుల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో 2017–18 ధరల ప్రకారం.. కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) నిర్ధారించిన మేరకు రూ.55,656.87 కోట్ల వ్యయాన్ని ఆమోదించి, ఆ మేరకు నిధులు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి ఖర్చు చేసిన రూ.2,863 కోట్లను రీయింబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడం కోసం రూ.10 వేల కోట్లను అడ్హక్గా ఇవ్వాలని కోరారు. సహాయ, పునరావాస ప్యాకేజీ కింద నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో చెల్లించాలన్నారు. రాష్ట్ర అధికారులు చేసిన ఈ ప్రతిపాదనపై జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై.. కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీకి కేంద్ర కమిటీ సూచించింది. దీంతో కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు వచ్చే నెల ఒకటిన∙రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సీడబ్ల్యూసీ అధికారులు వర్చువల్గా భేటీ కానున్నారు. -
ఈ నెలలో నెల్లూరు, సంగం బ్యారేజీలు ప్రారంభం
రాపూరు: నెల్లూరు, సంగం బ్యారేజీల పనులు పూర్తయ్యాయని, ఈ నెలాఖరులో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వీటిని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం వద్ద ఆదివారం ఆయన జిల్లా ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న, జరగాల్సిన పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు, సంగం బ్యారేజీలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని, వీటిని ఆయన కుమారుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారని చెప్పారు. తెలుగుగంగ కాలువ ద్వారా నీరందని చెరువులకు ఎత్తిపోతల పద్ధతిలో నీరిస్తామని తెలిపారు. కండలేరు, సోమశిల కాలువల పనులు పునఃప్రారంభిస్తాం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నీటిపారుదల రంగంలో సమస్యల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. వైఎస్ రాజÔశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటిపారుదలశాఖలో జరిగిన అభివృద్ధి ఆ తరువాత ఆగిపోయిందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తరువాత మళ్లీ కదలిక వచ్చిందని తెలిపారు. సోమశిల, కండలేరు జలాశయాల కాలువల పనులను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ సోమశిల–స్వర్ణముఖి (ఎస్ఎస్) లింకు కాలువ పనులను ప్రారంభించాలని కోరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ఈ కాలువ పనుల్ని అటవీ అనుమతులు లేవని గత ప్రభుత్వం నిలిపేసిందని చెప్పారు. కండలేరు డ్యాం నుంచి లి‹ఫ్ట్ ద్వారా వెలుగోను, రాపూరు చెరువుల మీదుగా ఆలూరుపాడుకు కాలువ తవ్వేందుకు, పోకూరుపల్లి రైతులకు లిఫ్ట్ ఇరిగేషçన్ ద్వారా నీరందించేందుకు రూ.528 కోట్లతో ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ఈ పనుల్ని ప్రారంభించేందుకు, మద్దెలమడుగులో 18 అడుగుల వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సీఎం జగన్మోహన్రెడ్డిని తీసుకురావాలని కోరారు. అంతకుముందు మంత్రులు కండలేరు హెడ్రెగ్యులేటర్ను, ఫొటో ఎగ్జిబిçషన్ను పరిశీలించారు. ఈ సమావేశంలో జేసీ కూర్మనాథ్, నీటిపారుదలశాఖ సీఈ హరినారాయణరెడ్డి, సోమశిల ఎస్ఈ రమణారెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణమోహన్, జిల్లా పరిçషత్ ఉపాధ్యక్షురాలు ప్రసన్న, రాపూరు ఎంపీపీ చెన్నుబాలకృష్ణారెడ్డి, కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు అనిల్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
దూరదృష్టితో గట్టెక్కించారు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పది రోజులపాటు మహోగ్రంగా పోటెత్తిన గోదావరి లంక గ్రామాలకు కంటిపై కునుకు లేకుండా చేసింది. ఎగువన భద్రాచలం వద్ద 71 అడుగులు, దిగువన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 21 అడుగులతో క్షణక్షణం వణికించింది. మూడు రోజుల పాటు మూడో నంబర్ ప్రమాద హెచ్చరికతో ప్రమాద ఘంటికలు మోగించింది. అయితే ఈ స్థాయిలో వరద వచ్చినా గోదావరి తీరాన ఉన్న నాలుగు జిల్లాల్లో ఎక్కడా గండ్లు పడ్డ దాఖలాలు లేవు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపే దీనికి కారణమని నీటిపారుదల రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్ హయాంలో దూరదృష్టితో రూ.600 కోట్లతో 535 కిలోమీటర్లు మేర గోదావరి గట్లను ఆధునికీకరించడం, ఎత్తు పెంచడం వల్లే వరద ఉగ్రరూపం దాల్చినా ప్రాణనష్టం జరగకుండా కాపాడగలిగినట్లు పేర్కొంటున్నారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు... వైఎస్సార్ సీఎంగా ఉండగా 2006 ఆగస్టు 7న గోదావరికి వరదలు వచ్చాయి. నాడు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 22.80 అడుగుల నీటిమట్టంతో 28,50,664 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. నాటి వరదల ఉధృతికి వశిష్ట ఎడమ గట్టుకు పి.గన్నవరం మండలం మొండెపులంక, గౌతమి కుడిగట్టుకు అయినవిల్లి మండలం శానపల్లిలంక వద్ద భారీగా గండ్లు పడ్డాయి. ఏటిగట్లకు పడ్డ గండ్లతో పలు మండలాల్లో పంటలు ముంపునకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో చలించిపోయిన వైఎస్సార్ యుద్ధప్రాతిపదికన చర్యలకు ఆదేశించారు. నాడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఒక బృందాన్ని గోదావరి జిల్లాలకు పంపి వాస్తవ పరిస్థితిపై నివేదిక తెప్పించుకున్నారు. రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సీతాపతిరావు సారథ్యంలో వరదలు, ఏటిగట్ల ఆధునీకరణపై సాంకేతిక బృందంతో సర్వేచేసి సమగ్ర నివేదిక సిద్ధం చేయించారు. ఎటు చూసినా 8 మీటర్ల ఎత్తుతో.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో 535 కిలోమీటర్ల మేర గోదావరి ఏటిగట్ల పటిష్టం కోసం వైఎస్సార్ రూ.548 కోట్లు మంజూరు చేశారు. పనులు పూర్తయ్యేసరికి అంచనాలు రూ.600 కోట్లు దాటిపోయాయి. 1986 నాటి వరదల సమయంలో ఏటిగట్లు ఆరు మీటర్ల ఎత్తు ఉండగా మరో రెండు అడుగులు పెంచి ఆధునీకరించారు. గోదావరి బండ్ ఎత్తు ఎక్కడ చూసినా ఎనిమిది మీటర్లు ఉండేలా పెంచారు. నాలుగు మీటర్లు వెడల్పున్న ఏటిగట్లను ఆరున్నర మీటర్లకు పెంచి విస్తరించారు. ఏటిగట్లు కోతకు గురికాకుండా మరో రూ.112 కోట్లతో నదీ పరీవాహకం వెంట గ్రోయిన్స్ కూడా నిర్మించారు. పటిష్టమైన చర్యల ద్వారా 1986 నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా నివారించారు. తద్వారా గోదావరి జిల్లాల ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి దార్శనికుడిగా నిలిచారు. ముందుచూపు ఫలితమే.. 1986 ఆగస్టు 16న ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 20.10 అడుగులతో రికార్డు స్థాయిలో 35,06,380 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అత్యధికంగా నమోదైన 1986 వరదలనే ప్రామాణికంగా తీసుకుని ఏటిగట్లు పటిష్టం చేయాలని వైఎస్సార్ నిర్ణయించారు. దూరదృష్టితో ఎత్తు పెంపు, వెడల్పు, పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవడంతో తాజా వరదల్లో ఏటిగట్లకు ఎక్కడా చిన్న గండి కూడా పడలేదు. ఆనాడు ముందుచూపుతో ఆయన తీసుకున్న నిర్ణయాలే గోదావరి ప్రజల ప్రాణాలకు భరోసాగా నిలిచాయి. గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు వైఎస్సార్ హయాంలో చేపట్టిన రక్షణ చర్యల్లో కొన్ని ప్యాకేజీలను ఆయన హఠాన్మరణం తరువాత చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసింది. వశిష్ట కుడి గట్టు నరసాపురం, వశిష్ట ఎడమగట్టు పరిధిలో 48వ కిలోమీటరు నుంచి 90వ కిలోమీటరు వరకు మూడు ప్యాకేజీలు నిలిచిపోయాయి. అప్పట్లో పనులు నిలిచిపోయిన ప్రాంతాల్లోనే తాజాగా అధికార యంత్రాంగం, స్థానికులు నిద్రాహారాలు మాని గట్లకు కాపలా కాయాల్సి వచ్చింది. రాజోలు పరిధిలోని తాటిపాక మఠం నుంచి అంతర్వేది, రాజోలు నుంచి అంతర్వేది వరకు మానేపల్లి వద్ద గోదావరి వరద ఉధృతి భయపెట్టింది. సఖినేటిపల్లి లంక, టేకిశెట్టిపాలెం, దిండి, రామరాజులంక, ఎల్ గన్నవరం, మానేపల్లి ప్రాంతాల్లో వరద భీతిగొల్పింది. వైఎస్సార్ హయాంలో చేపట్టిన ఈ పనులను తరువాత ప్రభుత్వాలు పూర్తి చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని పేర్కొంటున్నారు. ఆ నిర్ణయమే కాపాడింది.. ఈరోజు గోదావరి జిల్లాలు సురక్షితంగా బయటపడ్డాయంటే ఆ రోజు వైఎస్సార్ తీసుకున్న నిర్ణయాలే కారణం. ఆయన దూరదృష్టితో కరకట్ట పటిష్టం చేయకుంటే ఈ వరదలకు ఏం జరిగేదో ఊహించలేం. ఎప్పుడూ లేనిది జూలైలో ఇంత ఉధృతంగా రావడం ప్రమాదకరమే. 2006లో వైఎస్సార్ సీఎంగా ఉండగా ధవళేశ్వరం హెడ్వర్క్స్ ఈఈగా ఏటిగట్ల అంచనాలు రూపొందించే ప్రక్రియలో భాగస్వామి కావడం నాకెంతో సంతృప్తినిచ్చింది. – విప్పర్తి వేణుగోపాలరావు, రిటైర్డ్ ఎస్ఈ, జలవనరులశాఖ, జెడ్పీ చైర్మన్, ఉమ్మడి తూర్పుగోదావరి -
వరుసగా.. వడివడిగా
సాక్షి, అమరావతి: ప్రాధాన్యతగా చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతన్నలకు ప్రయోజనం చేకూర్చాలని జలవనరుల శాఖకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, మహేంద్ర తనయ, తారకరామ తీర్థసాగర్, గజపతినగరం బ్రాంచ్ కెనాల్, రాయలసీమలోని జోలదరాశి, రాజోలి జలాశయాలు, కుందూ ఎత్తిపోతల, వేదవతి ఎత్తిపోతల, రాజోలిబండ డైవర్షన్ స్కీం కుడి కాలువ, మడకశిర బైపాస్ కెనాల్, భైరవానితిప్ప– కుందుర్పి ఎత్తిపోతలతోపాటు వరికపుడిశెల ఎత్తిపోతల, చింతలపూడి ఎత్తిపోతల, వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకంతో సహా 27 ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసేలా లక్ష్యాలను నిర్దేశించారు. వచ్చే నెల నెల్లూరు, సంగం బ్యారేజీలు ఆగస్టు మూడో వారంలో నెల్లూరు బ్యారేజీ, మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. సంగం బ్యారేజీపై నెలకొల్పనున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి విగ్రహం కోసం నిరీక్షిస్తున్నామని, త్వరలోనే రానుందని చెప్పారు. దసరాకి అవుకు రెండో టన్నెల్.. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ను దసరా నాటికి సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రకాశం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాలకు వరదాయిని లాంటి వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు. వెలిగొండ టన్నెల్–2లో ఏప్రిల్లో 387.3 మీటర్లు, మేలో 278.5 మీటర్లు, జూన్లో 346.6 మీటర్లు, జూలైలో ఇప్పటివరకూ 137.5 మీటర్ల మేర పనులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు సిద్ధం చేయాలని సీఎం జగన్ గడువు విధించారు. వంశధార పనులు ముమ్మరం.. వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2 పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని, అక్టోబర్లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. ఇదే సమయంలోనే గొట్టా బ్యారేజీ నుంచి హిర మండలం రిజర్వాయర్కు నీటిని తరలించే ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ ఎత్తిపోతలకు రూ.189 కోట్లు వ్యయం కానుంది. పశ్చిమ కర్నూలుపై ప్రత్యేక దృష్టి దశాబ్దాలుగా బాగా వెనకబాటుకు గురైన కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సమావేశంలో సీఎం జగన్ పేర్కొన్నారు. నీటి వసతి, సౌకర్యాల పరంగా అత్యంత వెనకబడ్డ ప్రాంతంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న వలసల నివారణకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు నిర్దేశించారు. భూమిలేని వారికి కనీసం ఒక ఎకరా భూమినైనా ఇవ్వాలన్నారు. ఆ ప్రాంతంలో సాగు, తాగునీటి పథకాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయాలని ఆదేశించారు. సాగునీరు అందించడం వల్ల ఉపాధి కల్పించి వలసలను నివారించవచ్చన్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీలు తదితరాలను నెలకొల్పి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. అక్కడప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్థ్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్సింగ్ రావత్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ప్రాజెక్టుల సీఈలు తదితరులు పాల్గొన్నారు. పోలవరంపై సమగ్ర సమీక్ష.. ► పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు, గోదావరికి ముందస్తు వరదలతో తలెత్తిన పరిణామాలపై సీఎం జగన్ సమగ్రంగా సమీక్షించారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో గతంలో వరద ఉధృతికి కోతకు గురై గ్యాప్–1, గ్యాప్–2ల్లో ఏర్పడిన అగాధాల పూడ్చివేత పనులపై విస్తృతంగా చర్చించారు. ఇందుకు సమగ్ర విధానాన్ని నిర్ధారించేందుకు తొమ్మిది రకాల పరీక్షలు, ఫలితాల నివేదికలు అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని పరీక్షలు పూర్తి కాగా మరికొన్ని నిర్వహించాల్సి ఉందని వివరించారు. ► కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సూచించిన విధానం ప్రకారం దిగువ కాఫర్ డ్యామ్లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటంతోపాటు 30.5 మీటర్ల ఎత్తున నిర్మించే పనులను షెడ్యూల్ ప్రకారమే చేపట్టామని.. కానీ గోదావరికి ముందస్తు వరదల వల్ల దిగువ కాఫర్ డ్యామ్ కోతకు గురైన ప్రాంతం మీదుగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలోకి వరద జలాలు చేరాయని సమావేశంలో అధికారులు తెలిపారు. ► ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలోకి వరద జలాలు చేరడం వల్ల అగాధాలు పూడ్చేందుకు చేపట్టాల్సిన పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొందని అధికారులు పేర్కొన్నారు. ముందస్తు వరదల వల్ల దిగువ కాఫర్ డ్యామ్ పనులకు అంతరాయం కలిగిందని చెప్పారు. ► గోదావరిలో వరద కనీసం 2 లక్షల క్యూసెక్కులకు తగ్గితేగానీ దిగువ కాఫర్ డ్యాం ప్రాంతంలో పనులు చేయడానికి అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. వరద తగ్గుముఖం పట్టగానే పోలవరం పనులను ముమ్మరంగా చేపట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని సీఎం సూచించారు. ► పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.2,900 కోట్లను రీయింబర్స్ చేయాల్సి ఉందని సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులను ఖర్చు చేసిందన్నారు. ఆ నిధులను రీయింబర్స్ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పోలవరం పనులను వేగవంతం చేసేందుకు అడ్హాక్ (ముందస్తు)గా రూ.6 వేల కోట్ల నిధులను కేంద్రం నుంచి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాంపొనెంట్ (విభాగాలు) వారీగా రీయింబర్స్ చేసే విధానంలో కాకుండా అడ్హాక్గా నిధులు తెప్పించుకుంటే కీలక పనులను త్వరితగతిన పూర్తి చేయవచ్చన్నారు. వరద తగ్గగానే శరవేగంతో పనులు చేసేందుకు ఆ నిధులు ఉపయోగపడతాయన్నారు. ఈ మేరకు అడ్హాక్గా నిధులు సమకూర్చేలా కేంద్రానికి లేఖలు రాయాలని అధికారులకు నిర్దేశించారు. పోలవరం కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానించే కనెక్టివిటీలు, హెడ్ రెగ్యులేటర్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. -
డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం తేలుస్తాం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ను రెండురోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో సమీక్షించిన నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ) బృందం.. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం తేల్చే పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమేనని తెలిపింది. ఇందుకు మూడు పద్ధతులను ప్రతిపాదించింది. వాటిపై 15 రోజుల్లోగా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ), కేంద్ర జలసంఘం (సీడబ్యూసీ)లకు నివేదిక ఇస్తామని ఎన్హెచ్పీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.ఎల్.కపిల్ తెలిపారు. సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ ఎంపికచేసిన పద్ధతి ప్రకారం డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని పరీక్షించి నివేదిక ఇస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి కనీసం రెండునెలలు పడుతుందని చెప్పారు. తీస్తా జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలో ఇదేరీతిలో డయాఫ్రమ్ వాల్ కోతకు గురవడంతో దానికి మరమ్మతులు చేసి, పూర్వస్థితికి తెచ్చామని పేర్కొన్నారు. కేంద్ర జల్శక్తి శాఖ ఆదేశాల మేరకు పోలవరం డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చాలని ఎన్హెచ్పీసీకి రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్కుమార్ లేఖ రాశారు. దీంతో ఎన్హెచ్పీసీ ఈడీ ఎస్.ఎల్.కపిల్ నేతృత్వంలో నిపుణులు విపుల్సాగర్, ఎ.కె.భారతిలతో కూడిన బృందం మంగళవారం పోలవరం చేరుకుని డయాఫ్రమ్ వాల్ను పరిశీలించింది. బుధవారం కూడా మరోసారి డయాఫ్రమ్ వాల్ను పరిశీలించి, పోలవరం సీఈ సుధాకర్బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. సామర్థ్యం తేల్చేందుకు సమగ్రంగా పరీక్షలు గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేయకుండానే పోలవరం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో 1,750 మీటర్ల పొడవున 1.5 మీటర్ల వెడల్పు, గరిష్టంగా 90 మీటర్ల లోతుతో డయాఫ్రమ్ వాల్ నిర్మించారు. దీంతో ఎగువ కాఫర్ డ్యామ్లో ఖాళీ ప్రదేశాల ద్వా రా అధిక ఉద్ధృతితో వరద ప్రవహించి 400 నుంచి 1,100 మీటర్ల వరకు మినహా కుడి, ఎడమ వైపున డయాఫ్రమ్ వాల్ కోతకు గురైంది. కోతకు గురైన ప్రాంతంతోపాటు కోతకు గురికాని ప్రాంతంలోను డయాఫ్రమ్ వాల్ను ఎన్హెచ్పీసీ బృందం పరి శీలించింది. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చడానికి మూడురకాల పద్ధతులను ప్రతిపాదించింది. ఎన్హెచ్పీసీ బృందం ప్రతిపాదించిన మూడు పద్ధతులు ► మొదటి పద్ధతి: కోతకు గురికాని ప్రాంతంతోపాటు కోతకు గురైన ప్రాంతంలోను ప్రతి మీటర్కు డయాఫ్రమ్ వాల్ మధ్యలో 20 ఎంఎం వ్యాసంతో ఒకటిన్నర అడుగుల లోతు రంధ్రం చేసి, దాంట్లోకి ఎలక్ట్రోడ్స్ పంపి సామర్థ్యాన్ని పరీక్షించడం. ► రెండో పద్ధతి: కోతకు గురికాని ప్రాంతంతోపాటు కోతకు గురైన ప్రాంతంలోను ప్రతి 40 మీటర్లకు ఒకచోట డయాఫ్రమ్ వాల్ మధ్యలో 20 ఎంఎం వ్యాసంతో ఆరుమీటర్ల వరకు రంధ్రం చేసి, దాంట్లోకి ఎలక్ట్రోడ్స్ పంపి సామర్థ్యాన్ని పరీక్షించడం. ఇందుకు డయాఫ్రమ్ వాల్ నిర్మించిన బావర్–ఎల్అండ్టీ సంస్థ అనుమతి తీసుకోవాలి. ► మూడో పద్ధతి: డయాఫ్రమ్ వాల్కు ఒక మీటర్ ఎగువన, ఒక మీటర్ దిగువన ప్రతి 40 మీటర్లకు ఒకచోట జిగ్జాగ్ విధానంలో 90 మీటర్ల లోతు వరకు బోర్లు తవ్వి, వాటిలోకి ఎలక్ట్రోడ్స్ పంపి సామర్థ్యాన్ని పరీక్షించడం. ఎన్హెచ్పీసీ నివేదికే కీలకం ప్రపంచంలో డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం తేల్చే పరీక్షలపై ఎన్హెచ్పీసీకి మినహా ఏ సంస్థకు అవగాహన లేదని నిపుణులు చెబుతున్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్పై పరీక్షలు చేసి ఎన్హెచ్పీసీ ఇచ్చే నివేదికే కీలకం. ఆ నివేదిక ఆధారంగానే డయాఫ్రమ్ వాల్పై సీడబ్ల్యూసీ తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం ఉన్న దానికి సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదంటే కోతకు గురైన ప్రాంతంలో మాత్రమే కొత్తగా నిర్మించి, ఇప్పుడున్న దానికి అనుసంధానం చేయాలా? అన్నది తేల్చనుంది. డయాఫ్రమ్ వాల్ భవితవ్యం తేలాక.. రాష్ట్ర ప్రభుత్వం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టనుంది. ఎన్హెచ్పీసీ బృందం వెంట పీపీఏ డిప్యూటీ డైరెక్టర్ ప్రవీణ్, ఐఐటీ నిపుణుడు సందీప్ తదితరులున్నారు. -
విపత్తులు, వరద కష్టాలపై ముందస్తు జాగ్రత్తలు
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రకృతి వైపరీత్యాల వల్ల తలెత్తే విపత్తులు, వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు జలవనరుల శాఖ సిద్ధమవుతోంది. శాఖాపరంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై సాగునీటి ప్రాజెక్టుల ఇన్చార్జిలను ఉన్నతాధికారులు అప్రమత్తం చేస్తున్నారు. జూలై నుంచి వర్షాలు ప్రభావం చూపనున్న నేపథ్యంలో గతంలో జరిగిన నష్టాలు, వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అ«ధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఇంజనీర్ ఇన్ చీఫ్ జి.అనిల్కుమార్.. చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈలు, ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, ఎస్సారెస్పీ, దేవాదుల, ఎల్లంపల్లి శ్రీపాదసాగర్, ఇందిరమ్మ వరద కాల్వ సహా 11 ప్రాజెక్టుల నిర్వాహకులకు వివిధ జాగ్రత్తలపై సోమవారం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వరదల సందర్భంగా విపత్తు సంసిద్ధత, ఏదైనా ఆకస్మిక పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆయా కార్యాలయాల్లో సిబ్బంది 24 గంటలు పనిచేసేలా చూడాలని పేర్కొన్నారు. ఫ్లడ్ కంట్రోల్ రూమ్లతో పర్యవేక్షణ: ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎదు ర్కొనేందుకు వీలుగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెంట్రల్ ఫ్లడ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఈ నెల 16 నుంచి డిసెంబర్ 15 వరకు పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. ఈ ఆరు నెలల వ్యవధిలో సెలవు లేకుండా విధులు నిర్వహించాల్సి ఉన్నందున సిబ్బందికి కేటాయించిన విధులను నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణించనున్నారు. వరదలు ఉధృతంగా ఉంటే క్రమం తప్పకుండా పెట్రోలింగ్ నిర్వహించేందుకు కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో ప్రమాదకరంగా ఉన్న పాయింట్లు, రెగ్యులేటర్ గేట్లు, ప్రధాన, మధ్యస్థ ప్రాజెక్ట్ల కోసం వరద గేట్లు గుర్తించాలని ఆదేశాలు అందాయి. అన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల వివరాలు అందుబాటులో ఉండాలని, వాటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్య వేక్షించాలని అధికారులకు సూచించారు. కంట్రోల్ రూమ్లు సమర్థవంతంగా పని చేసేందుకు డిప్యూటీ సూపరింటెండెంట్లకు బాధ్యతలు అప్పగించారు. -
ముందుగానే నీటి విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టుల కింద నీటి లభ్యత ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టుకు ఖరీఫ్ పంటల సాగుకు ముందుగా నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 1న నీటి సంవత్సరం ప్రారంభమయ్యే రోజే గోదావరి డెల్టాకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బుధవారం నీటిని విడుదల చేయనున్నారు. ముందుగా నీటిని విడుదల చేయడం వల్ల ఖరీఫ్ సాగును రైతులు ముందుగా చేపడతారు. సకాలంలో పంటల సాగు ద్వారా మంచి దిగుబడులు చేతికి అందనున్నాయి. నవంబర్లో తుపాన్ల ప్రభావం ప్రారంభమయ్యేలోగా పంట నూర్పిళ్లు పూర్తవుతాయి. తద్వారా ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా పంటలను కాపాడి రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మరోవైపు ఖరీఫ్ నూర్పిళ్లు పూర్తి కాగానే సకాలంలో రబీ పంటల సాగు చేపట్టవచ్చు. నీటి లభ్యతను బట్టి మూడో పంట కూడా సాగు చేసుకునే వెసులుబాటను రైతులకు కల్పించాలన్నది సీఎం జగన్ సంకల్పం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముందుచూపుతో నీటి నిల్వ.. ఖరీఫ్ పంటకు ముందుగా నీళ్లందించాలన్న లక్ష్యంతో పులిచింతల, గండికోట, బ్రహ్మంసాగర్, చిత్రావతి, వెలిగల్లు, సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటిని నిల్వ చేసేలా జలవనరులశాఖను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మే 12న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో జలాశయాల్లో నీటి నిల్వలు, లభ్యతను సమీక్షించిన సీఎం జగన్ ఆయకట్టుకు ముందుగా నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల పరిధిలోని జిల్లాల్లో ఐఏబీ (నీటి పారుదల సలహా మండలి) సమావేశాలను ప్రభుత్వం నిర్వహించింది. ముందుగా నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటికే విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచామని, సకాలంలో పంటల సాగు చేపట్టాలని రైతులను చైతన్యం చేసింది. వరుసగా నాలుగో ఏడాది.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు నిండటంతో వరుసగా 2019, 2020, 2021లో ఖరీఫ్, రబీల్లో కోటి ఎకరాలకుపైగా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఈ ఏడాదీ వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నీటి లభ్యత బాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాదీ కోటి ఎకరాలకు నీళ్లందుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 10 నుంచి కృష్ణా డెల్టా, గుంటూరు చానల్కు ► పోలవరంలో నిల్వ చేసిన నీటిని రివర్ స్లూయిజ్ల ద్వారా విడుదల చేసి గోదావరి డెల్టాకు బుధవారం నుంచే సరఫరా చేయనున్నారు. ► పులిచింతల ప్రాజెక్టులో 33.14 టీఎంసీలు నిల్వ ఉండగా ఈ నెల 10 నుంచి కృష్ణా డెల్టా, గుంటూరు ఛానల్కు విడుదల చేయనున్నారు. గండికోట, బ్రహ్మంసాగర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, వెలిగల్లు ప్రాజెక్టుల ఆయకట్టుకూ ఈ నెల 10 నుంచే నీరు విడుదల కానుంది. ► పెన్నా బేసిన్లోని సోమశిల, కండలేరు తదితర రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు జూన్ 10 నుంచే నీటిని సరఫరా చేస్తారు. ► గోరకల్లు, అవుకు రిజర్వాయర్లలో నిల్వ చేసిన నీటితో ఎస్సార్బీసీ ఆయకట్టుకు ఈనెల 30 నుంచి నీటిని విడుదల చేయనున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టుకు జూలై 15 నుంచి నీటిని సరఫరా చేస్తారు. ► గొట్టా బ్యారేజీలో నీటి లభ్యత ఆధారంగా ఈ నెలలోనే వంశధార ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. ► తుంగభద్ర డ్యామ్, సుంకేశుల బ్యారేజీపై ఆధారపడ్డ హెచ్చెల్సీ (ఎగువ ప్రధాన కాలువ), ఎల్లెల్సీ (దిగువ ప్రధాన కాలువ), కేసీ కెనాల్ ఆయకట్టుకు లభ్యత ఆధారంగా నీటి విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. -
రాజమహేంద్రవరానికి పీపీఏ కార్యాలయం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 31లోగా పీపీఏ కార్యాలయానికి అవసరమైన భవనాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. ఆ తర్వాత పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలిస్తారు. వచ్చే నెల నుంచి రాజమహేంద్రవరం కేంద్రంగా పీపీఏ విధులు నిర్వర్తించనుంది. విభజన నేపథ్యంలో పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించి పనులను పర్యవేక్షించడానికి 2014లో హైదరాబాద్ కేంద్రంగా పీపీఏ ఏర్పాటు చేసింది. దీంతో పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖల మధ్య సమన్వయం లోపం ఏర్పడి ఆ ప్రభావం ప్రాజెక్టు పనులపై పడుతోంది. ఇదే అంశాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వద్ద ప్రస్తావించిన సీఎం వైఎస్ జగన్.. పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాలని కోరారు. ఇందుకు అంగీకరించిన కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్.. పీపీఏ కార్యాలయాన్ని తరలింపునకు ఆదేశించారు. -
డయాఫ్రమ్ వాల్పై ఎన్హెచ్పీసీతో అధ్యయనం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్–ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ పటిష్ఠతపై జాతీయ జల విద్యుదుత్పత్తి సంస్థ (ఎన్హెచ్పీసీ)తో అధ్యయనం చేయిస్తామని కేంద్ర జల్శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం వెల్లడించారు. ఎన్హెచ్పీసీ ఇచ్చే నివేదిక ఆధారంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదా దెబ్బతిన్న భాగంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించి.. ఇప్పటికే ఉన్న డయాఫ్రమ్ వాల్తో అనుసంధానం చేయాలా? అన్నది తేలుస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను శనివారం శ్రీరాం నేతృత్వంలో పరిశీలించిన సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఖయ్యూం అహ్మద్, సీడబ్ల్యూసీ రిటైర్డ్ సభ్యులు గోపాలకృష్ణన్, పీపీఏ, డీడీఆర్పీ, సీఎస్ఆర్ఎంస్, వ్యాప్కోస్ సంస్థల అధికారుల బృందం ఆదివారం కూడా మరోసారి పరిశీలించింది. అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డి, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. దౌలిగంగా నదిపై ఎన్హెచ్పీసీ చేపట్టిన జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే ఆ సంస్థ అధ్యయనం చేసిందని ఆ సంస్థ మాజీ డైరెక్టర్ భార్గవ సమావేశంలో గుర్తుచేశారు. దాంతో ఆ సంస్థతోనే పోలవరం డయాఫ్రమ్ వాల్పై కూడా అధ్యయనం చేయించాలని శ్రీరాం అధికారులకు సూచించారు. వరద వచ్చేలోగా రక్షిత స్థాయికి పనులు గోదావరికి వరద ఉద్ధృతి వచ్చేలోపు అంటే జూలైలోగా దిగువ కాఫర్ డ్యామ్ను రక్షిత స్థాయికి పూర్తిచేయాలని శ్రీరాం ఆదేశించారు. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతంలో తొమ్మిది రకాల పరీక్షలను చేసి జూలై 15 నాటికి నివేదిక ఇవ్వాలని.. వాటి ఆధారంగా సీడబ్ల్యూసీ డిజైన్లు ఖరారు చేస్తుందన్నారు. ఇక కోతకు గురైన ప్రాంతం పూడ్చే పనులకయ్యే వ్యయాన్ని సీడబ్ల్యూసీ అంచనా వేస్తుందని.. దాన్ని కేంద్రమే భరిస్తుందన్నారు. అలాగే, కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత.. డయాఫ్రమ్ వాల్పై స్పష్టత వచ్చాక ఈసీఆర్ఎఫ్ను ప్రారంభించి.. ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలన్నారు. ఈసీఆర్ఎఫ్ పనుల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేసేందుకు సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) సంస్థ అధికారులతో పోలవరం ప్రాజెక్టు వద్దే లాబ్ను ఏర్పాటుచేయాలని శ్రీరామ్ ఆదేశించారు. దీనివల్ల పరీక్షల నివేదికలు ఎప్పటికప్పుడు వస్తాయని.. పనులు నిర్విఘ్నంగా చేపట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రాజెక్టు పూర్తిపై కేంద్ర కేబినెట్కు ప్రతిపాదనలు ఇక రాష్ట్ర జలవనరుల శాఖ, కాంట్రాక్టు సంస్థ, పీపీఏ, సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, సీఎస్ఎంఆర్ఎస్, సీడబ్ల్యూపీఆర్ఎస్, వ్యాప్కోస్, కేంద్ర జల్శక్తి శాఖ సమన్వయంతో పనిచేయడం ద్వారా పోలవరాన్ని వేగంగా పూర్తిచేయాలని వెదిరె శ్రీరాం చెప్పారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతోపాటు ప్రాజెక్టులో మిగిలిన పనులను పూర్తిచేయడానికి అవసరమైన నిధుల మంజూరుపై కేంద్ర కేబినెట్కు ప్రతిపాదనలు పంపుతామన్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన మేరకు నిధులు మంజూరుచేస్తామని ఆయన స్పష్టంచేశారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చారిత్రక తప్పిదమే పోలవరం రూరల్: కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడమే గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఆదివారం జరిగిన సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తికాకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడంవల్లే భారీ వరదలవల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని, ఇందులో ఎలాంటి సందేహంలేదని ఆయన స్పష్టంచేశారు. డయాఫ్రమ్ వాల్ ఏ మేరకు దెబ్బతిన్నదీ పరిశీలించేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర, రాష్ట్ర జలవనరుల నిపుణులు, కేంద్ర బృందం సభ్యులు శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నారన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ఇటువంటి సమస్య రావడం ప్రపంచంలోనే ఇది మొదటిసారన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించి ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కానీ, గత ప్రభుత్వం చేసిన అసమర్థ నిర్ణయమే పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు. దీని కారణంగా భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ 1.7 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నదని ప్రాథమికంగా అంచనా వేశారని, అంతేగాక పెద్ద అగాధాలు ఏర్పడ్డాయని అంబటి రాంబాబు తెలిపారు. సమస్యను పరిశీలించి, ఏ విధంగా అధిగమించాలన్న విషయంపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారన్నారు. -
పోలవరంపై కీలక భేటీలు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పెండింగ్ డిజైన్లు, నిధుల మంజూరుపై ఢిల్లీలో మంగళ, బుధవారాల్లో కేంద్ర జల్శక్తి శాఖ కీలక సమావేశాలను నిర్వహిస్తోంది. గోదావరి వరద ఉధృతికి పోలవరం ప్రధాన డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటం, కొంత భాగం దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను పటిష్ఠం చేయడంపై చర్చించేందుకు మంగళవారం కేంద్ర జల్శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులతోపాటు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఈ సమావేశంలో పాల్గొంటారు. దిగువ కాఫర్ డ్యామ్కు ఆరు కిలోమీటర్ల దిగువన పురుషోత్తపట్నం వద్ద గోదావరిలో ఇసుక తిన్నెల డ్రెడ్జింగ్ చేస్తూ.. అందులో నుంచి వచ్చే ఇసుకను ప్రత్యేక పైపులైను ద్వారా ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైనచోట పోసి.. వైబ్రో కాంపాక్షన్ చేయడం ద్వారా పూర్వస్థితికి తెచ్చే విధానాన్ని ఢిల్లీ ఐఐటీ రిటైర్డు డైరెక్టర్ వి.ఎస్.రాజు, ప్రొఫెసర్ రమణ ప్రతిపాదించారు. దీనిపై ఈనెల 11న సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఖయ్యూం అహ్మద్ నేతృత్వంలోని అధికారుల బృందం పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధ్యయనం చేసింది. ఖయ్యూం అహ్మద్ బృందం నివేదిక ఆధారంగా కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానంపై వెదిరె శ్రీరాం నేతృత్వంలో జరిగే సమావేశం నిర్ణయం తీసుకోనుంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం 2017–18 ధరల ప్రకారం రూ.55,656.87 కోట్లకు పెట్టుబడి అనుమతి ఇవ్వడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 41.15 మీటర్ల కాంటూర్ వరకు ప్రాజెక్టు తొలిదశను పూర్తిచేయడానికి నిధుల మంజూరుపై కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ బుధవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారు. ప్రధానంగా తొలిదశ పనుల పూర్తికి ఈ ఆర్థిక సంవత్సరంలో అవసరమైన నిధుల మంజూరుపై ఈ సమావేశంలో చర్చిస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి. -
వంశ‘ధార’ ఎత్తిపోతలకు సీఎం గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: వంశధార నదిపై నేరడి బ్యారేజీ నిర్మాణానికి ప్రయత్నిస్తూనే.. ఆ ప్రాజెక్టు ఫలాలను 2,55,510 ఎకరాల ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో ముందస్తుగా అందించడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుం బిగించారు. గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం రిజర్వాయర్లోకి నీటిని తరలించే ఎత్తిపోతల పనులకు ఆమోదం తెలిపారు. గొట్టా బ్యారేజి జల విస్తరణ ప్రాంతం నుంచి వంశధార వరద జలాలను రోజుకు 1,400 క్యూసెక్కులు హిరమండలానికి తరలిస్తారు. దీనికి రూ.189 కోట్లు ఖర్చవుతుందని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. హిరమండలం రిజర్వాయర్ను నింపడం ద్వారా ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లందిస్తారు. తద్వారా వెనుకబడిన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలు సస్యశ్యామలమవుతాయి. వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మించి చెరో 57.5 టీఎంసీలు వాడుకొనేలా 1961 జూలై 18న ఏపీ, ఒడిశాల మధ్య ఒప్పందం కుదిరింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2005లో వంశధార స్టేజ్–2, ఫేజ్–2 చేపట్టారు. నేరడి బ్యారేజీ నిర్మించి రోజుకు 8 వేల క్యూసెక్కుల నీటిని 19.05 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే హీరమండలం రిజర్వాయర్లోకి తరలించే పనులు చేపట్టారు. దీనిద్వారా కొత్తగా 45 వేల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు వంశధార స్టేజ్–1 కింద 2,10,510 ఎకరాలను స్థిరీకరిస్తారు. అయితే, నేరడి బ్యారేజీపై ఒడిశా సుప్రీం కోర్టుకు వెళ్లింది. దానిపై న్యాయపోరాటం చేస్తూనే ప్రాజెక్టు ఫలాలను ముందస్తుగా రైతులకు అందించడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు డిజైన్ను మార్చారు. కాట్రగడ్డ వద్ద వంశధారపై 300 మీటర్ల పొడవున సైడ్ వియర్ నిర్మించి 1,700 క్యూసెక్కుల చొప్పున 8 టీఎంసీలను హిరమండలం రిజర్వాయర్లోకి తరలించే పనులు చేపట్టారు. 2009 నాటికే ఈ పనులు సింహభాగం పూర్తయ్యాయి. ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. ఈ క్రమంలోనే వంశధార ట్రిబ్యునల్ తుది నివేదిక ఇచ్చింది. నేరడి బ్యారేజీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. వంశధార జలాలను సమంగా (57.5 టీఎంసీల చొప్పున) రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. దీన్ని ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. పూర్తి ఫలాలు అందించే దిశగా ట్రిబ్యునల్ తుది నివేదికను అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రిని సీఎం వైఎస్ జగన్ పలుమార్లు కోరారు. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి గతేడాది నవంబర్ 3న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో చర్చలు జరిపారు. ఓ వైపు నేరడి బ్యారేజీ నిర్మాణానికి ప్రయత్నిస్తూనే.. ప్రాజెక్టు పూర్తి ఫలాలను ముందస్తుగా అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కాట్రగడ్డ సైడ్ వియర్ ద్వారా చేరే 1,700 క్యూసెక్కులకు అదనంగా గొట్టా బ్యారేజీ నుంచి మరో 1,400 క్యూసెక్కుల వరద జలాలను హిరమండలం రిజర్వాయర్లోకి ఎత్తిపోసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. దీనిద్వారా వంశధారకు వరద ఉన్న రోజుల్లో గొట్టా బ్యారేజీ ద్వారా ఆయకట్టుకు నీటిని అందించి, వరద లేని రోజుల్లో హిరమండలం రిజర్వాయర్ ద్వారా నీరిస్తారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పటికే వంశధార ప్రాజెక్టు కింద రబీ పంటలకు నీళ్లందిస్తున్నారు. హిరమండలం రిజర్వాయర్ను నింపడం ద్వారా రెండో పంటకు కూడా పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించనున్నారు. -
పోలవరాన్ని పరిశీలించిన సీడబ్ల్యూసీ బృందం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) డిజైన్స్ విభాగం డైరెక్టర్ ఖయ్యూం అహ్మద్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం బుధవారం పరిశీలించింది. దిగువ కాఫర్ డ్యామ్లో కోతకు గురైన ప్రాంతాన్ని జియో మెంబ్రేన్ బ్యాగ్లలో ఇసుకను నింపి పూడ్చుతున్న విధానాన్ని పరిశీలించింది. ప్రధాన డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) ప్రాంతంలో గోదావరి వరద ఉధృతికి కోతకు గురైన ప్రాంతాలను, డయాఫ్రమ్ వాల్లో దెబ్బతిన్న భాగాలను తనిఖీ చేసింది. క్షేత్రస్థాయి అధ్యయనంలో వెల్లడైన అంశాలు, రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు సమర్పించిన నివేదిక ఆధారంగా ఇక్కడ చేపట్టాల్సిన పనులపై సీడబ్ల్యూసీ బృందం నివేదికను రూపొందించింది. దీనిపై ఈనెల 17న కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం నేతృత్వంలో ఢిల్లీలో జరిగే సమావేశంలో చర్చిస్తారు. అనంతరం కోతకు గురైన ప్రాంతాలను పూడ్చివేసే విధానానికి మెరుగులు దిద్దుతారు. ఈనెల 18న జరిగే డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) సమావేశంలో ఈ విధానంపై చర్చించి, ఆమోదించే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. పురుషోత్తపట్నం వద్ద డ్రెడ్జింగ్ చేస్తూ ఇసుకను ప్రధాన డ్యామ్ వద్ద కోతకు గురైన ప్రాంతాల్లోకి పొరలు పొరలుగా పంపింగ్ చేస్తూ వైబ్రో కాంపాక్షన్ ద్వారా పటిçష్టపరచాలని రాష్ట్ర జలవనరుల అధికారులు ప్రతిపాదించారు. డయా ఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతాల్లో సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ వేసి పాత దానికి అనుసంధానం చేసే పద్ధతిని కూడా ప్రతిపాదించారు. కేంద్ర జలసంఘం బృందంలో డైరెక్టర్ రాహుల్ కుమార్సింగ్, డిప్యూటీ డైరెక్టర్లు సోమేష్కుమార్, అశ్వని కుమార్ వర్మ, అసిస్టెంట్ డైరెక్టర్ గౌరవ్ తివారీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ డైరెక్టర్ పి.దేవందర్రావు ఉన్నారు. ప్రాజెక్టు పనులను సీఈ సుధాకర్బాబు వారికి వివరించారు. -
ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తి
సాక్షి, అమరావతి: ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలని సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. మంగళవారం సాగునీటి ప్రాజెక్టులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత.. క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర జలసంఘం, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్, పోలవరం ప్రాజెక్టు అథారిటీలతో డిజైన్లను వీలైనంత తొందరగా ఆమోదింపజేసుకుని పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తిచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని చెప్పారు. ఆ ప్రాజెక్టుకు ఖర్చుచేసిన రూ.2,559.37 కోట్లను రీయింబర్స్ చేసేలా కేంద్ర అధికారులతో చర్చించాలని ఆదేశించారన్నారు. నెల్లూరు, సంగం బ్యారేజీలు పూర్తయ్యేదశకు చేరుకున్నాయని, వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయని చెప్పారు. ఏపీలో టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారంలో ప్రాథమిక ఆధారాలు లభించడం వల్లే మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను పోలీసులు అరెస్టు చేశారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనిపై టీడీపీ నేతలు మాత్రం గందరగోళం చేస్తున్నారని విమర్శించారు. లీక్ చేసేది వాళ్లే.. గందరగోళం చేసేది వాళ్లే.. అంటూ మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, టీడీపీ నేతల మాటలను విశ్వసించరని చెప్పారు. ‘పేపర్ లీక్ చేసేది టీడీపీ నేతలు.. రాజీనామా చేయాల్సింది బొత్స సత్యనారాయణా?’ అని మరో ప్రశ్నకు సమాధానంగా ప్రశ్నించారు. -
ఉత్తరాంధ్రకు గోదావరి జలాభిషేకం
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రను గోదావరి జలాలతో అభిషేకిస్తూ అక్కడి భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ 162.409 కి.మీ. నుంచి 63.20 టీఎంసీలను తరలించి 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మంది ప్రజల దాహార్తి తీర్చడంతోపాటు ఆ ప్రాంత పారిశ్రామిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.17,411.40 కోట్లు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ప్రాధాన్యతగా గుర్తించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తి చేయాలని జల వనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొలి దశ పనులను రూ.954.09 కోట్లతో రెండు ప్యాకేజీలుగా, రెండో దశ పనులను రూ.5,134 కోట్లతో రెండు ప్యాకేజీలుగా కాంట్రాక్టర్లకు అధికారులు అప్పగించారు. రెండో దశలో మిగతా నాలుగు ప్యాకేజీ పనులకు టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు. పనులకు శ్రీకారం ► తొలి దశలో పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలను తరలించేందుకు వీలుగా 18.90 కి.మీ. మేర కాలువ, రెండుచోట్ల ఎత్తిపోతలు, 3.15 టీఎంసీల సామర్థ్యంతో పెదపూడి రిజర్వాయర్, ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులను చేపట్టారు. ► రెండో దశలో పాపయ్యపల్లె ఎత్తిపోతలతోపాటు 121.62 కి.మీ. పొడవున కాలువ తవ్వకం, ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టారు. భూసేకరణకు సమాంతరంగా పనులు తొలి దశ పనులు చేపట్టడానికి 3,822 ఎకరాల భూమి అవసరం. రెండో దశ పనులు చేపట్టడానికి 12,214.36 ఎకరాలు వెరసి 16,036.36 ఎకరాల భూమిని సేకరించాలి. ఇందులో ప్రస్తుతం కాంట్రాక్టర్లకు అప్పగించిన పనులు చేపట్టడానికి వీలుగా భూసేకరణ చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లకు అధికారులు దిశానిర్దేశం చేశారు. -
బాబు పాపం వల్లే ‘పోలవరం’ ఆలస్యం
పోలవరం రూరల్/దేవీపట్నం: చంద్రబాబు పాపం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని, సాధ్యమైనంత త్వరలో ప్రాజెక్టును తామే పూర్తిచేస్తామని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ఆయన గురువారం పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో కలిసి ఉభయగోదావరి జిల్లాల మధ్య జరుగుతున్న ఈ ప్రాజెక్టు పనులను, కోండ్రుకోట పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడమే కారణమని చెప్పారు. ప్రాజెక్టులో కీలక పనులు వదిలేసి, త్వరితగతిన పూర్తయ్యే పనులు చేసి వాటి బిల్లులను పాస్ చేయించుకోవాలనే తాపత్రయంతో అప్పటి టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి దేవినేని చేసిన పాపం వల్లే ఇలా జరిగిందన్నారు. దేశంలోగానీ, ప్రపంచంలోగానీ ఎక్కడా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినలేదని, కేవలం చంద్రబాబునాయుడు వల్లే ఇక్కడ జరిగిందని చెప్పారు. దీంతో దాదాపు రూ.400 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. డయాఫ్రమ్ వాల్ పునరుద్ధరణకు అధికారులు మూడు ఆప్షన్లను పరిశీలిస్తున్నారని తెలిపారు. సీడబ్ల్యూసీ, పీపీఏ, డీడీఆర్పీ సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును ఒక్క అంగుళం కూడా తగ్గించేది లేదని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు. ప్రాజెక్టు వ్యయం ఇప్పటికే రూ.47 వేల కోట్లకు పెరిగిందని, ప్రాజెక్టు ఆలస్యమయ్యే కొద్దీ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలుపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి అంబటి మాట్లాడుతూ నిర్వాసితులకు సమగ్ర పునరావాసం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్వాసితులకు అదనంగా ప్యాకేజీ ఇవ్వడానికి సీఎం హామీ ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. ఈ కార్యక్రమాల్లో ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సీఈ సుధాకర్బాబు, జెన్కో ఎస్ఈ శేషారెడ్డి, జేసీ పి.అరుణ్బాబు, ఆర్డీవో ఎం.ఝాన్సీరాణి, ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ అధికారి ప్రవీణ్ ఆదిత్య, వైఎస్సార్సీపీ రైతు విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ కొవ్వూరు త్రినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మళ్లించిన వరద నీటినీ కోటాలో కలిపేస్తారా?
సాక్షి, అమరావతి: విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్న సమయంలో మళ్లించిన వరద జలాలనూ రాష్ట్ర కోటా (నికర జలాలు)లో కృష్ణా బోర్డు కలపడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక కమిటీ కూడా వరద నీటిని ఏ రాష్ట్రం మళ్లించినా.. వాటిని ఆ రాష్ట్ర కోటాలో కలపకూడదని స్పష్టంచేసిన విషయాన్ని గుర్తుచేసింది. వరద జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిందని, ఈ నేపథ్యంలో.. మళ్లించిన వరద నీటిని రాష్ట్ర కోటాలో కలపడమంటే బచావత్ ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘించడమేనని స్పష్టంచేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్కు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ లేఖ రాశారు. విభజన చట్టంలోని 11వ షెడ్యూలు, ఆరో పేరా ప్రకారం.. కృష్ణా, గోదావరి వరదలను నియంత్రించడం, విపత్తు నివారణ చర్యలు చేపట్టడం రెండు రాష్ట్రాలపై ఉందని లేఖలో గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో.. కృష్ణా నదికి వరద వచ్చే రోజుల్లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ ద్వారా కడలిలో వరద జలాలు కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాల్లో ఎవరు వరద నీటిని మళ్లించినా.. దాన్ని విపత్తు నివారణ చర్య కింద పరిగణించాలేగానీ కోటా కింద లెక్కించకూడదని పునరుద్ఘాటించారు. దుర్భిక్ష ప్రాంతాలకు వరద జలాల మళ్లింపు నిజానికి.. వరద జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే స్వేచ్ఛను కృష్ణా బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. అలాగే, విభజన నేపథ్యంలో దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిర్ధారించింది. దీంతో.. బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ఇప్పటికీ అమల్లో ఉన్నందున వరద జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్కు ఉంటుందని సాగునీటిరంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఈ ఉద్దేశ్యంతోనే 2019లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నిండిపోవడంతో కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి కలిసే సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (పీహెచ్ఆర్) ద్వారా ఏపీ సర్కార్ వరద నీటిని దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు మళ్లించింది. కోటా కింద లెక్కించొద్దు : సీడబ్ల్యూసీ కమిటీ వరద జలాలు వృథాగా కడలిలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మళ్లించినా వాటిని కోటా కింద పరిగణించకూడదని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును గతంలోనే కోరింది. దీన్ని తెలంగాణ సర్కార్ వ్యతిరేకించింది. ఈ వ్యవహారంపై అధ్యయనం చేసి 2020, జూన్లోగా నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని 2019లో కృష్ణా బోర్డు కోరింది. దాంతో ఈ అంశంపై అధ్యయనం చేయడానికి 2020, మార్చి 3న సీడబ్ల్యూసీ సాంకేతిక కమిటీ ఏర్పాటుచేసింది. 2020 మేలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులతో ఒకసారి మాత్రమే సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించింది. ఆ కమిటీ అడిగిన వివరాలన్నీ ఏపీ ఇచ్చినప్పటికీ తెలంగాణ మాత్రం ఇవ్వలేదు. దీంతో.. మళ్లించిన వరద నీటిని కోటా కింద పరిగణించాలా? వద్దా? అని 2020, అక్టోబర్ 7న కృష్ణా బోర్డు కోరింది. దీనిపై సాంకేతిక కమిటీ 2020, అక్టోబర్ 20న స్పందిస్తూ.. మళ్లించిన వరద నీటిని కోటా కింద పరిగణించకూడదని స్పష్టంచేసింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించినట్లే.. ఇక ప్రకాశం బ్యారేజీ నుంచి 2019–20లో 798.29 టీఎంసీలు, 2020–21లో 1,289, 2021–22లో 501.36 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిశాయి. మూడేళ్లలోనూ సగటున 72 రోజులపాటు వరద ప్రవాహం సముద్రంలో కలిసింది. సీడబ్ల్యూసీ సాంకేతిక కమిటీ నివేదిక వచ్చేవరకూ ఏపీ మళ్లించిన వరద జలాల్లో 50 శాతాన్ని కోటా కింద పరిగణించాలని తెలంగాణ ప్రతిపాదనను కృష్ణా బోర్డు అంగీకరించింది. దీనిపై ఏపీ సర్కార్ అభ్యంతరం వ్యక్తంచేసినా.. వాటిని తోసిపుచ్చింది. 2020–21లో 22 టీఎంసీల వరద జలాలను మళ్లిస్తే 11, 2021–22లో 40 టీఎంసీల వరద జలాలను మళ్లిస్తే 20 టీఎంసీలను ఏపీ కోటాలో బోర్డు కలిపింది. ఇక 2021–22లో కృష్ణాలో 953 టీఎంసీల లభ్యత ఉంటే ఇందులో 66 శాతం అంటే 629 టీఎంసీలు ఏపీకి, 34 శాతం అంటే 324 టీఎంసీలు తెలంగాణకు రావాలి. ఏపీ వాడుకున్న వరద జలాల్లో 20 టీఎంసీలను నికర జలాల కోటాలో కలిపింది. లేదంటే.. ఏపీకి అదనంగా 20 టీఎంసీల జలాలు వచ్చేవే. ఇది బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించడమేనని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. -
పోలవరంలో బాబు గ్యాంగ్ దోపిడీ
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు ధన దాహానికి పోలవరం బలైందని, స్పిల్వే నిర్మాణం పూర్తికాకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించడంతో 2019 వరదల్లో అది పూర్తిగా దెబ్బతిని ఆర్థికంగా నష్టం చేకూర్చడంతోపాటు, ప్రాజెక్టు ఆలస్యమైంద ని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. గురువారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ ప్రాజెక్టులోను దెబ్బతినని డయాఫ్రమ్ వాల్ ఒక్క పోలవరంలోనే దెబ్బతిందని, దీనికి అప్పటి సీఎం చంద్రబాబు, జలవనరుల మంత్రి దేవినేని ఉమ పూర్తిబాధ్యత వహించాలని అన్నారు. పోలవరాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారంటూ ప్రధాని మోదీ చేసిన విమర్శకు ఇదే నిదర్శనమన్నారు. డయా ఫ్రమ్ వాల్ పేరుతో రూ.430 కోట్లు బిల్లులు చేశారని, దెబ్బతిన్న గోతులను పూడ్చడానికి రూ.800 కోట్లు, గోతుల నుంచి నీటిని తోడటానికి రూ.2,100 కోట్లు ఖర్చవుతుందని నిపుణులు అంచ నా వేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంతో పోలవ రం ప్రాజెక్టు డిజైన్లో మార్పుల అంశాలను నిపుణు లతో చర్చిస్తున్నామన్నారు. అనుకున్న గడువులోగా పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. రీడిజైనింగ్ వల్ల ప్రాజెక్టు ఎత్తు ఒక అంగుళం కూడా తగ్గదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారన్నారు. రైతుల ఆత్మహత్మలపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని చెప్పారు. రుణ మాఫీ పేరుతో రైతులను నిండా ముంచిన వారు ఇప్పుడు వాటి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. సచివాలయంలో మంత్రిగా బాధ్యతల స్వీకరణ అంబటి రాంబాబు గురువారం ఉదయం సచివాలయం నాలుగో బ్లాకులో జలవనరులశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరం, అంతకు ముందున్న పెండింగ్ పనులకు సంబంధించి గండికోట–పైడిపల్లి ఎత్తిపోతల పథకానికి ఆపరేషన్, మెయింటెనెన్స్ గ్రాంటుగా రూ.4.70 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ తొలి సంతకం చేసినట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మడ్డువలస ప్రాజెక్టు ఫేజ్–2 కెనాల్కు సంబంధించి 5 కిలోమీటర్ల కాలువ తవ్వడానికి రూ.26.9 కోట్ల గ్రాంటుకు సీఎం ఆమోదం కోసం పంపించే ఫైలుపై మరో సంతకం చేసినట్టు తెలిపారు. -
యుద్ధప్రాతిపదికన పోలవరం పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి అవసరమైన సహకారాన్ని సంపూర్ణంగా అందించాలని కేంద్ర ఆర్థిక, అటవీ, పర్యావరణ, గిరిజన సంక్షేమ శాఖల కార్యదర్శులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈఓలను కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు వేతనాలను వారి ఖాతాల్లో జమచేసిన తరహాలోనే పోలవరం నిర్వాసితులకూ సహాయ, పునరావాస (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ కింద చెల్లించాల్సిన పరిహారాన్ని నగదు బదిలీ రూపం (డీబీటీ)లో వారి ఖాతాల్లో జమచేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు సిఫార్సు చేశారు. కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి అధ్యక్షతన 2014, మే 28న ఏర్పాటైన పీపీఏ పాలక మండలి తొలి సమావేశాన్ని మంగళవారం వర్చువల్గా పంకజ్కుమార్ నిర్వహించారు. ఏపీ సీఎస్ సమీర్శర్మ తరఫున రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డి, తెలంగాణ సీఎస్ తరఫున ఆ రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పీపీఏ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ వివరించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై పాలక మండలి సంతృప్తి వ్యక్తంచేసింది. పీపీఏ సీఈఓ వ్యాఖ్యపై అభ్యంతరం పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం చోటుచేసుకోవడానికి ప్రధాన కారణం బడ్జెట్లో కేంద్రం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకోకపోవడమేనని పీపీఏ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ చెప్పడంపై జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయించడంలేదని గుర్తుచేశారు. బడ్జెట్లో నిధులు కేటాయించడంతోపాటు రీయింబర్స్మెంట్లో జాప్యం జరగకుండా చూడాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని పంకజ్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశలో నీటిని నిల్వచేయడానికి ఎలాంటి అభ్యంతరాల్లేవని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖాధికారులు చెప్పారు. కానీ, ఆగస్టులోగా తొలిదశలో నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని.. వాటికి నిధులివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖకు సిఫార్సు చేశారు. దీనిపై పంకజ్కుమార్ స్పందిస్తూ.. నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని డీబీటీ రూపంలో వారి ఖాతాల్లో జమచేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖకు సూచించారు. పరిశీలిస్తాం పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి అవసరమైన నిధులతోపాటు.. సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు సీడబ్ల్యూసీ ఆమోదించి, పెట్టుబడి అనుమతిచ్చి.. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ కోరారు. రీయింబర్స్మెంట్లో జాప్యంలేకుండా చూసి.. ప్రాజెక్టు పనులకు నిధుల కొరత తలెత్తకుండా చూస్తామని పంకజ్కుమార్ స్పష్టంచేశారు. -
పరవళ్లు.. పరుగులు
గడువులోగా పోలవరం.. పోలవరం దిగువ కాఫర్ డ్యామ్కు సంబంధించిన అన్ని డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదించిందని, జూలై 31 నాటికి పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ప్రధాన డ్యామ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని ఎలా పూడ్చాలనే విధానంపై ఏప్రిల్ 1న ఢిల్లీలో జరిగే సమావేశంలో కొలిక్కి వస్తుందని, మిగతా డిజైన్లు కూడా వీలైనంత త్వరగా ఖరారవుతాయన్నారు. సీడబ్ల్యూసీ అధికారుల వెంటపడి మరీ డిజైన్లకు అనుమతులు సాధించి గడువులోగా పూర్తి చేసేలా పనులు వేగవంతం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేసి రైతులకు ఫలాలు అందించాలని జలవనరుల శాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అధికారుల వెంటబడి మరీ ఆమోదించుకోవడం ద్వారా నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పోలవరంతో సహా ప్రాధాన్యత ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా ఇప్పటివరకూ పూర్తైన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. గడువులోగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం పలు సూచనలు చేశారు. నగదు బదిలీ రూపంలో పరిహారం పోలవరం నిర్వాసితులకు పునరావాసంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమావేశంలో అధికారులు తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో పునరావాసం కల్పిస్తున్నామన్నారు. మొదటి ప్రాధాన్యత కింద ముంపు గ్రామాల నుంచి తరలించే నిర్వాసితులకు ఆగస్టు నాటికి పునరావాసం కల్పిస్తామని చెప్పారు. ఇందులో 20,946 కుటుంబాలకుగానూ ఇప్పటికే 7,962 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించామన్నారు. 3,228 నిర్వాసిత కుటుంబాలు ఓటీఎస్(వన్టైమ్ సెటిల్మెంట్)కు దరఖాస్తు చేసుకున్నాయని, మిగతా 9,756 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామని చెప్పారు. నగదు బదిలీ (డీబీటీ) విధానంలో నిర్వాసితులకు వేగంగా పరిహారం చెల్లించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆగస్టుకు అవుకు టన్నెల్–2 సిద్ధం నెల్లూరు బ్యారేజీ పనులను పూర్తి చేసి మే 15 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. సంగం బ్యారేజీ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని చెప్పారు. దీనిపై సీఎం జగన్ సంతృప్తి వ్యక్తం చేస్తూ మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజిగా నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అవుకు టన్నెల్–2లో మిగిలిపోయిన 77.5 మీటర్ల పనులను 120 రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని అధికారులు తెలిపారు. ఆగస్టు నాటికి లైనింగ్తో సహా టన్నెల్ను పూర్తి చేసి ప్రస్తుత సామర్థ్యం మేరకు గాలేరు–నగరి కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులు తరలించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఉదయగిరి, బద్వేలుకు వెలిగొండ జలాలు.. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్–2 పనులపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. నెలకు 400 మీటర్ల మేర టన్నెల్ తవ్వకం పనులు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దీన్ని మరింత పెంచి నెలకు 500 మీటర్ల వరకూ టన్నెల్ తవ్వకం పనులు చేపడతామని తెలిపారు. వెలిగొండ టన్నెల్–1 ద్వారా సెప్టెంబర్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్కు కృష్ణా జలాలను తరలించి తొలిదశ ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. 2023 నాటికి టన్నెల్ –2 సహా అన్ని రకాల పనులను పూర్తిచేసి రెండు టన్నెళ్ల ద్వారా శ్రీశైలం నుంచి నల్లమలసాగర్కు నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు రెండో దశ కింద ఉదయగిరి, బద్వేలు ప్రాంతాలకు నీటిని అందించే పనులకు టెండర్లు పిలవాలని సీఎం జగన్ ఆదేశించారు. నేరడి బ్యారేజీతో రెండు రాష్ట్రాలకూ ప్రయోజనం వంశధార – నాగావళి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు. అక్టోబరుకు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. వంశధారపై గొట్టా బ్యారేజి ఎగువ నుంచి హిర మండలం రిజర్వాయర్లోకి ఎత్తిపోసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని దాదాపుగా ఆంధ్రప్రదేశే భరిస్తోందని.. బ్యారేజీని నిర్మిస్తే ఒడిశా కూడా సగం నీటిని వాడుకునే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు.ఇరు రాష్ట్రాలకూ నేరడి బ్యారేజీ ప్రయోజనకరమన్నారు. వీలైనంత త్వరగా నేరడి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వడివడిగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ► తోటపల్లి ప్రాజెక్టు కింద అన్ని పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులనూ వేగవంతం చేయాలన్నారు. ఆర్ధికశాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలని సూచించారు. ► తారకరామ తీర్థసాగరంలో రిజర్వాయర్ పనులు పూర్తి కావచ్చినట్లు అధికారులు పేర్కొనగా మిగిలిన పనులకు వెంటనే టెండర్లు పిలిచి పూర్తి చేయాలని సీఎం సూచించారు. సారిపల్లిని ముంపు గ్రామంగా గుర్తించి పునరావాసం కల్పించాలని ఆదేశించారు. ► మహేంద్ర తనయ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. మిగిలిన పనులకు ఆర్ధికశాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలని సూచించారు. ► ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువను శ్రీకాకుళం వరకూ తీసుకెళ్లాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రధాన కాలువ తవ్వడానికి అవసరమైన భూమిని వేగంగా సేకరించి పనులు వేగవంతం చేయాలన్నారు. ► సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా బోర్డు తీరు సరికాదు!
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలు సముద్రంలో వృథాగా కలుస్తున్న సమయంలో మళ్లించిన వరద జలాలను కృష్ణా బోర్డు ఏపీ కోటాలో కలపడంపై సాగునీటిరంగ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించడమేనని స్పష్టంచేస్తున్నారు. నిజానికి.. వరద జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే స్వేచ్ఛను కృష్ణా బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. అలాగే, విభజన నేపథ్యంలో దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిర్ధారించింది. ఈ నేపథ్యంలో.. బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ఇప్పటికీ అమల్లో ఉన్నందున వరద జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్కు ఉంటుందని సాగునీటిరంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఈ ఉద్దేశ్యంతోనే 2019లో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నిండిపోవడంతో కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి కలిసే సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఏపీ సర్కార్ వరద నీటిని దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు మళ్లించింది. రెండేళ్లయినా నివేదిక ఇవ్వని సీడబ్ల్యూసీ వరద జలాలు వృథాగా కడలిలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మళ్లించినా వాటిని కోటా కింద పరిగణించకూడదని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. దీన్ని తెలంగాణ సర్కార్ వ్యతిరేకించింది. దాంతో.. ఈ వ్యవహారంపై అధ్యయనం చేసి 2020, జూన్లోగా నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని 2019లో కృష్ణా బోర్డు కోరింది. కానీ, 2020 మేలో రెండు రాష్ట్రాల జలనవరుల శాఖ అధికారులతో ఒకసారి మాత్రమే సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించింది. ఆ తర్వాత దీనిపై సీడబ్ల్యూసీ దృష్టిసారించకపోవడమేకాక.. నివేదిక కూడా ఇవ్వలేదు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించినట్లే.. ప్రకాశం బ్యారేజీ నుంచి 2019–20లో 798.29, 2020–21లో 1,289, 2021–22లో 501.36 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిశాయి. మూడేళ్లలోనూ సగటున 72 రోజులు వరద ప్రవాహం వృథాగా సముద్రంలో కలిసింది. సీడబ్ల్యూసీ నివేదిక వచ్చే వరకూ ఏపీ మళ్లించిన వరద జలాల్లో 50 శాతాన్ని కోటా కింద పరిగణించాలని తెలంగాణ ప్రతిపాదనను కృష్ణా బోర్డు ఆమోదించింది. 2020–21లో 22 టీఎంసీల వరద జలాలను మళ్లిస్తే 11, 2021–22లో 40 టీఎంసీల వరద జలాలను మళ్లిస్తే 20 టీఎంసీలను ఏపీ కోటాలో బోర్డు కలిపింది. ఇక 2020–21లో కృష్ణాలో 953 టీఎంసీల లభ్యత ఉంటే ఇందులో 66 శాతం అంటే 629 టీఎంసీలు ఏపీకి, 34 శాతం అంటే 324 టీఎంసీలు తెలంగాణకు రావాలి. ఏపీ వాడుకున్న వరద జలాల్లో 20 టీఎంసీలను నికర జలాల కోటాలో కలిపింది. లేదంటే.. ఏపీకి అదనంగా 20 టీఎంసీల జలాలు వచ్చేవే. ఇది బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించడమేనని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. మళ్లించకపోతే వరద ముప్పే నిజానికి.. శ్రీశైలం నుంచి కృష్ణా వరదను మళ్లించకపోతే దిగువన కృష్ణా, గుంటూరు జిల్లాలకు తీవ్ర ముప్పు తప్పదు. అందుకే విభజన చట్టంలో సెక్షన్–85 (7) ప్రకారం విపత్తు నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్రం అప్పగించింది. ఆ చట్టం ప్రకారం వరద ముప్పును తప్పించడానికి ఏపీ సర్కార్ మళ్లించిన వరద జలాలను నికర జలాల కోటాలో కలపడంపై నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. కృష్ణా బోర్డు సీడబ్ల్యూసీ నివేదిక ఇవ్వలేదనే సాకుచూపి.. ఏపీ ప్రయోజనాలను పరిరక్షించకపోవడం సరికాదంటున్నారు. -
9న కృష్ణా బోర్డు భేటీ
సాక్షి, అమరావతి: తుంగభద్ర జలాల్లో చౌర్యానికి అడ్డుకట్ట వేయడమే అజెండాగా ఈనెల 9న హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు నీళ్లను మళ్లించకుండా అడ్డుకట్ట వేసి.. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని బోర్డు వర్గాలు తెలిపాయి. తుంగభద్ర జలాశయంలో కేసీ కెనాల్కు 10 టీఎంసీల కోటా ఉంది. నదిలో సహజ ప్రవాహం లేనప్పుడు, సుంకేశుల బ్యారేజీ వద్ద నీటి లభ్యత లేనప్పుడు.. ఈ కోటా నీటిని విడుదల చేయాలని తుంగభద్ర బోర్డుకు ఏపీ ఈఎన్సీ ప్రతిపాదనలు పంపిస్తుంటుంది. ఆ మేరకు తుంగభద్ర బోర్డు నీటిని విడుదల చేస్తుంది. తుంగభద్ర జలాశయం నుంచి ఆ నీళ్లు నదీ మార్గంలో రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్)కు చేరగానే.. వాటిని ఎడమ కాలువ ద్వారా కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు మళ్లిస్తున్నాయి. సుంకేశుల బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా నీళ్లను చౌర్యం చేస్తోంది. కృష్ణా బోర్డు జాయింట్ కమిటీ ఇటీవల క్షేత్ర స్థాయిలో నిర్వహించిన తనిఖీల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల జలచౌర్యం బయటపడింది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఏపీ హక్కులకు భంగం కలుగుతుందని జాయింట్ కమిటీ తేల్చిచెబుతూ కృష్ణా బోర్డుకు నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను 9వ తేదీన నిర్వహించే బోర్డు సమావేశంలో చైర్మన్ ఎంపీ సింగ్ ప్రవేశపెట్టనున్నారు. జలచౌర్యానికి అడ్డుకట్ట వేసేందుకు.. ఆర్డీఎస్ను ఏపీ, తెలంగాణ, కర్ణాటక అధికారులతో కూడిన జాయింట్ కమిటీ పర్యవేక్షణలో నిర్వహించాలని ప్రతిపాదించనున్నారు. ఎడమ కాలువపై టెలీమీటర్లు ఏర్పాటు చేసి.. నీటి వినియోగాన్ని ఎప్పటికప్పుడు లెక్కించాలని సూచించే అవకాశముంది. కోటాకు మించి వాడుకుంటే.. అదనంగా ఉపయోగించుకున్న నీటిని ఆ రాష్ట్ర కోటాలో కలిపి.. కోత వేయనున్నట్లు సమాచారం. అనుమతి లేకుండా నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతలను పూర్తిగా ఆపేయాలని స్పష్టం చేసే అవకాశముంది. వీటిపై సమావేశంలో మూడు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని.. తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
పోలవరంపై ‘ఈనాడు’ తప్పుడు రాతలు బురద జల్లడానికే 'ఎత్తు'గడలు
సాక్షి, అమరావతి: దున్నపోతు ఈనిందని ఎవరో అంటే.. ఎలా సాధ్యమని కనీసం ఆలోచించకుండా దూడను గాటికి కట్టేసేందుకు పలుగుతో సిద్ధమవడం ‘ఈనాడు’ మార్కు అజ్ఞాన సంపదకు తార్కాణం. ఆ అజ్ఞానంతో పచ్చి అబద్ధాలను ప్రచురిస్తూ నిజమని నమ్మించే దుస్సాహసానికి ఒడిగట్టడం రామోజీకే సాధ్యం. కొత్త ప్రాజెక్టుల్లో నీటి నిల్వకు సంబంధించి డ్యామ్ సేఫ్టీ ప్రొటోకాల్ ప్రకారం సీడబ్ల్యూసీ నిర్దిష్టంగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిందనే కనీస పరిజ్ఞానం కూడా ‘ఈనాడు’కు లేకపోవడంపై నీటిపారుదల రంగ నిపుణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఎత్తు తగ్గడం ఉత్తదే.. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి ఒక్క అం గుళం కూడా తగ్గించే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లే దని లోక్సభలో సాక్షాత్తూ కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గతేడాది ఫిబ్రవరి 11న స్పష్టం చేశారు. అయితే పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లు తనకు తానే ఊహించుకుని పదేపదే కల్పిత కథనాలను ప్రచురించడం ఏమిటని సాగునీటి నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరాన్ని కమీషన్ల కోసం జీవచ్ఛవంలా మార్చిన చంద్రబాబును అపర భగీరథుడుగా కీ ర్తిస్తూ.. ప్రాజెక్టుకు జీవం పోసి శరవేగంగా ఫలాల ను అందించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై అభూత కల్పనలతో అసత్యాలను అచ్చేస్తున్నారని ప్రాజెక్టు పనులను సుదీర్ఘకాలం పర్యవేక్షించిన రిటైర్డు చీఫ్ ఇంజనీర్ ఒకరు పేర్కొన్నారు. ఆ ప్రకారమే పోలవరంలోనూ.. పోలవరం డెడ్ స్టోరేజీ 17 మీటర్లు కాగా కనీస నీటి మట్టం 41.15 మీటర్లు. గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు. ఈ ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణానికి సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. ఆ డిజైన్ ప్రకారమే జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని కేంద్రం తరఫున రా ష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. వచ్చే ఏడాదికి పూర్తి చేసే దిశగా పనులను వేగవంతం చేసింది. పూర్తి చేసిన తొలి ఏడాది సీడబ్ల్యూసీ మార్గదర్శకాల (డ్యామ్ సేఫ్టీ ప్రొటోకాల్) మేరకు కనీస నీటి మట్టం 41.15 మీటర్ల కాంటూర్ స్థాయిలో 115.44 టీఎంసీలను నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో ఏడాది 150 టీఎంసీలు, మూడో ఏడాది పూర్తి సామర్థ్యం మేరకు అంటే 194.6 టీఎంసీలు నిల్వ చేసేలా ప్రణాళిక రూపొందించి కేంద్ర జల్ శక్తి, ఆర్థిక శాఖలకు సమర్పించింది. ఈ ప్రణాళిక అమలుకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. తొలి ఏడాది నీటి నిల్వ కోసం నిధులు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికను అనుసరించి సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం పోలవరంలో తొలి ఏడాది 41.15 మీటర్ల కాంటూర్ వరకూ నీటిని నిల్వ చేయడానికి వీలుగా పనులు పూర్తి చేసేందుకు ఎన్ని నిధులు అవసరమో తేల్చాలని జల్ శక్తి శాఖను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. ఇదే తరహాలో రెండో ఏడాది 2/3, మూడో ఏడాది పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడానికి అవసరమైన నిధులను తేల్చాలని నిర్దేశించింది. ఇదే అంశంపై జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ ఆదేశాల మేరకు సీడబ్ల్యూసీ సభ్యులు కుశ్వీందర్ వోహ్రా పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ), రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో మంగళవారం వర్చువల్ పద్ధతిలో సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదనలు అందచేస్తే కేంద్ర ఆర్థిక శాఖకు పంపి నిధులు విడుదల చేయాలని సూచిస్తామని సీడబ్ల్యూసీ సభ్యులు వోహ్రా పేర్కొన్నారు. వారంలో సమర్పిస్తామని జలవనరుల అధికారులు తెలిపారు. మంగళవారం సమావేశంలో జరిగింది ఇది కాగా అజ్ఞానంతో విషం చిమ్మడంపై సాగునీటిరంగ నిపుణులు విస్తుపోతున్నారు. ఒకేసారి పూర్తి ఫలాలందించడం సాధ్యమా? కొత్తగా చేపట్టిన ఒక ప్రాజెక్టును పూర్తి చేసిన తొలి ఏడాదిలోనే పూర్తి స్థాయిలో ఫలాలను అందించిన దాఖలాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేవు. దశల వారీగా ప్రాజెక్టు ఫలాలను ప్రజలకు అందిస్తారు. ఈ క్రమంలోనే పోలవరం పూర్తయ్యే తొలి ఏడాది 41.15 మీటర్ల స్థాయిలో 115.44 టీఎంసీలను నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదేపదే తప్పుడు రాతల్లో ఆంతర్యమేంటి? పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారంటూ 2020లోనూ ‘ఈనాడు’ ఇదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మింది. రామోజీ అచ్చేసిన అబద్ధాలతో ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారు. వీటిని శాసనసభ సాక్షిగా 2020 డిసెంబర్ 2న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖండించారు. పోలవరం ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించడం లేదని.. 45.72 మీటర్ల స్థాయిలోనే నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. కావాలంటే ప్రాజెక్టు ఎత్తు కొలిచేందుకు టేపుతో సిద్ధంగా ఉండాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. అజ్ఞానంతో రాష్ట్ర జీవనాడిపై విషం చిమ్మవద్దని హితవు పలికారు. అయినా సరే ప్రాజెక్టు పూర్తవుతోందనే కడుపుమంటతో పోలవరంపై అక్కసు వెలిబుచ్చుతూనే ఉన్నారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు (డ్యామ్ సేఫ్టీ ప్రొటోకాల్) తెలుసా? ► ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టును నిర్మిస్తే అందులో నీటిని ఎలా నిల్వ చేయాలనే అంశంపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిర్దిష్టంగా కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా తప్పనిసరిగా వీటి ప్రకారమే నిల్వ చేయాలి. ► ప్రాజెక్టు పూర్తయిన తొలి ఏడాది పూర్తి నీటి నిల్వ సామర్థ్యంలో 1/3 వంతు మాత్రమే నిల్వ చేయాలి. రెండో ఏడాది పూర్తి నీటి నిల్వ సామర్థ్యంలో 2/3 వంతు నీటిని నిల్వ చేయాలి. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దాలి. ► అన్నీ సక్రమంగా ఉన్నాయని, ప్రాజెక్టు భద్రతకు ఢోకా లేదని నిర్ధారించుకున్నాకే పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయాలి. పదేపదే తప్పుడు రాతల్లో ఆంతర్యమేంటి? పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారంటూ 2020లోనూ ‘ఈనాడు’ ఇదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మింది. రామోజీ అచ్చేసిన అబద్ధాలతో ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారు. వీటిని శాసనసభ సాక్షిగా 2020 డిసెంబర్ 2న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖండించారు. పోలవరం ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించడం లేదని.. 45.72 మీటర్ల స్థాయిలోనే నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. కావాలంటే ప్రాజెక్టు ఎత్తు కొలిచేందుకు టేపుతో సిద్ధంగా ఉండాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. అజ్ఞానంతో రాష్ట్ర జీవనాడిపై విషం చిమ్మవద్దని హితవు పలికారు. అయినా సరే ప్రాజెక్టు పూర్తవుతోందనే కడుపుమంటతో పోలవరంపై అక్కసు వెలిబుచ్చుతూనే ఉన్నారు. -
దిగువ కాఫర్ డ్యామ్కు లైన్ క్లియర్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యామ్ పనులకు మార్గం సుగమమైంది. ఈ డ్యామ్లో కోతకు గురైన ప్రాంతాన్ని బాగుచేసేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ రూపొందించిన డిజైన్ను డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) ఆమోదించింది. డీడీఆర్పీ నిర్ణయం, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల మేరకు పోలవరం పనులను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో గోదావరి వరదను మళ్లించే స్పిల్ వేను నిర్మించకుండానే.. ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) డయాఫ్రమ్ వాల్తోపాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల నిర్మాణాన్ని చేపట్టింది. దీనిని మధ్యలోనే వదిలేసింది. దాంతో 2019, 2020లలో గోదావరి వరద ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్య ఖాళీ ప్రదేశాల ద్వారా ప్రవహించింది. వరద ఉద్ధృతికి దిగువ కాఫర్ డ్యామ్లో 220 మీటర్ల పొడవు, 36 మీటర్ల లోతు వరకు కోతకు గురైంది. ఈ ప్రాంతం అభివృద్ధిపై బుధవారం డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలో వర్చువల్ విధానంలో జరిగిన సమావేశంలో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్బాబు, ఎస్ఈ నరసింహమూర్తి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. డయాఫ్రమ్ వాల్,జియోమెంబ్రేన్ బ్యాగ్లతో కోతకు గురైన ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించి.. దాని పక్కన ఒక పొర ఇసుక, మరో పొర జియోమెంబ్రేన్ బ్యాగ్లు, మరో పొరను రాళ్లతో వేసి అభివృద్ధి చేసేలా జలవనరుల శాఖ రూపొందించిన డిజైన్కు డీడీఆర్పీ ఆమోదం తెలిపింది. డయాఫ్రమ్ వాల్, రాళ్లు, ఇసుక, జియోమెంబ్రేన్ బ్యాగ్లతో ఆ ప్రాంతాన్ని 15 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూడ్చాలి. వాటిపై మరో 9.17 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టి వేయాలి. దీంతో దిగువ కాఫర్ డ్యామ్ పూర్తవుతుంది. స్పిల్ వే నుంచి విడుదలైన గోదావరి జలాలు ఈసీఆర్ఎఫ్ వెనక్కి ఎగదన్నకుండా దిగువ కాఫర్ డ్యామ్ అడ్డుకుంటుంది. జూన్, 2021 నాటికే ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తయింది. దాంతో గోదావరి వరదల సమయంలోనూ ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్య ఈసీఆర్ఎఫ్ నిర్మాణాన్ని చేపట్టి నిరంతరాయంగా పనులు పూర్తి చేయవచ్చు. డయాఫ్రమ్ వాల్ పటిష్టత తేలాకే ఈసీఆర్ఎఫ్ పునాది అయిన డయాఫ్రమ్ వాల్ను ఎల్ అండ్ టీ, బావర్ సంస్థలు నిర్మించాయి. డయాఫ్రమ్ వాల్పై 2018, 2019, 2020 వరదల ప్రభావం పడింది. వరద ఉధృతి ప్రభావం వల్ల డయాఫ్రమ్ వాల్ ఏమైనా దెబ్బతిందా? లేదా? అన్నది తేల్చాలని ఎల్ అండ్ టీ, బావర్ సంస్థను డీడీఆర్పీ ఆదేశించింది. ఆ రెండు సంస్థలు డయాఫ్రమ్ వాల్ పటిష్టతను పరీక్షించాయి. మరో వారంలో నివేదిక ఇస్తామని ఆ సంస్థలు తెలిపాయి. ఆ నివేదిక వచ్చాక ఈసీఆర్ఎఫ్ పనులపై తుది నిర్ణయం తీసుకుంటామని డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య చెప్పారు. -
రూ.412 కోట్లతో ఉప్పుటేరు ఆధునికీకరణ
సాక్షి, అమరావతి: కొల్లేరు సరస్సు పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. సరస్సు నుంచి మురుగునీటిని సముద్రంలో కలిపే ఉప్పుటేరు ఆధునికీకరణ, మూడు ప్రాంతాల్లో క్రాస్ రెగ్యులేటర్ కమ్ బ్రిడ్జి కమ్ లాక్లను నిర్మించేందుకు రూ.412 కోట్లతో గ్రీన్ íసిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు కొల్లేరులో కలిసే పెదలంక మేజర్ డ్రెయిన్పై అవుట్ఫాల్ స్లూయిజ్, డబుల్ లేన్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.40 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని వల్ల కొల్లేరును పరిరక్షించుకోవడంతోపాటు ప్రజా రవాణాను మెరుగుపర్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ► పశ్చిమగోదావరి జిల్లాలో ఆకివీడు మండలం దుంపగడప గ్రామం వద్ద ఉప్పుటేరుపై (10.56 కి.మీ. వద్ద) రెగ్యులేటర్ నిర్మాణానికి రూ.87 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ► పశ్చిమగోదావరి జిల్లాలో మొగల్తూరు మండలం పడతడిక వద్ద ఉప్పుటేరుపై (1.4 కి.మీ. వద్ద) రెగ్యులేటర్ కమ్ బ్రిడ్జి కమ్ లాక్ నిర్మాణానికి రూ.136.60 కోట్లను కేటాయించింది. ► పశ్చిమగోదావరి జిల్లాలో మొగల్తూరు మండలం మొల్లపర్రు వద్ద ఉప్పుటేరుపై (57.95 కి.మీ. వద్ద) రెగ్యులేటర్ కమ్ బ్రిడ్జి కమ్ లాక్ నిర్మాణానికి రూ.188.40 కోట్లను మంజూరు చేసింది. ► కృష్ణా జిల్లాలో కృత్తివెన్ను మండలం నిడమర్రు వద్ద పెదలంక మేజర్ డ్రెయిన్పై (3.25 కి.మీ. వద్ద) అవుట్ఫాల్ స్లూయిజ్, డబుల్ లేన్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేసింది. -
పోలవరం తొలి దశ పూర్తిచేస్తే.. 2.98 లక్షల ఎకరాలకు సాగునీరు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును తొలి దశలో 41.15 మీటర్ల కాంటూర్ వరకూ పూర్తిచేస్తే.. పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాల కింద 2.98 లక్షల ఎకరాలకు కాలువల (గ్రావిటీ) ద్వారా నీటిని సరఫరా చేయవచ్చునని కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు వివరించారు. కృష్ణా డెల్టాలో 13.08 లక్షలు, గోదావరి డెల్టాలో 10.13 లక్షలు కలిపి మొత్తం 23.21 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ప్రజలకు వేసవిలోనూ సమృద్ధిగా తాగునీటిని అందించవచ్చని చెప్పారు. ఈ పనుల పూర్తికి రూ.10,911 కోట్లు అవసరమని.. తక్షణమే విడుదల చేస్తే గడువులోగా తొలిదశను పూర్తిచేస్తామన్నారు. దీనిపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు కుశ్వీందర్ వోహ్రా స్పందిస్తూ.. పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల కింద ఇప్పటికే డిస్ట్రిబ్యూటరీలను అభివృద్ధి చేసిన నేపథ్యంలో వాటి వ్యయాన్ని మినహాయించి పోలవరం ప్రాజెక్టు తొలిదశ పూర్తిచేయడానికి అవసరమైన నిధులపై నివేదిక ఇవ్వాలని సూచించారు. దీని ఆధారంగా పోలవరం తొలిదశ పనులను పూర్తిచేయడానికి నిధుల మంజూరు అంశంపై కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిక ఇస్తామని కుశ్వీందర్ వోహ్రా తెలిపారు. ఈ నివేదికను బుధవారం సీడబ్ల్యూసీకి పంపుతామని రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ సి. నారాయణరెడ్డి చెప్పారు. పోలవరం పనులు వేగవంతం పోలవరం యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి పనులను వేగవంతం చేశామని 41.15 మీటర్ల కాంటూర్ వరకూ (తొలిదశ) పనులు పూర్తిచేయడానికి తక్షణం రూ.10,911 కోట్లు, 45.72 మీటర్ల వరకూ ప్రాజెక్టును పూర్తిచేయడానికి రూ.21 వేల కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్శక్తి, ఆర్థిక శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి స్వామినాథన్.. పోలవరం తొలిదశ పనులను పూర్తిచేయడానికి ఏ మేరకు నిధులు అవసరమవుతాయి? వాటివల్ల ఒనగూరే ప్రయోజనాలేమిటో తేల్చి నివేదిక ఇవ్వాలని కేంద్ర జల్శక్తి శాఖను ఆదేశించారు. కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం సీడబ్ల్యూసీ సభ్యులు కుశ్వీందర్ వోహ్రా రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్బాబు, పీపీఏ సీఈ ఏకే ప్రధాన్ తదితరులతో వర్చువల్ విధానంలో సమీక్ష జరిపారు. పుష్కర కింద 1.41లక్షలు, తాడిపూడి కింద 1.57 లక్షల ఎకరాలు.. పోలవరం ప్రాజెక్టును తొలిదశలో 41.15 మీటర్ల కాంటూర్ వరకూ పూర్తిచేస్తే.. కుడి, ఎడమ కాలువల ద్వారా గ్రావిటీపై నీటిని సరఫరా చేయవచ్చునని సీడబ్ల్యూసీకి రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు వివరించారు. కుడి కాలువ ద్వారా తాడిపూడి ఎత్తిపోతల కింద 1.57 లక్షల ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా పుష్కర ఎత్తిపోతల కింద 1.41 లక్షల ఎకరాలు వెరసి 2.98 లక్షల ఎకరాల ఆయకట్టుకు గ్రావిటీపై నీటిని సరఫరా చేయవచ్చునని చెప్పారు. అలాగే, కృష్ణా డెల్టాకు పోలవరం కుడి కాలువ ద్వారా గ్రావిటీపై నీటిని మళ్లించి.. 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చునన్నారు. ఇక హెడ్ వర్క్స్ (జలాశయం)లో కుడి, ఎడమ కాలువ పనుల్లో మిగిలిన వాటిని పూర్తిచేయడానికి.. నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి తొలి దశలో రూ.10,911 కోట్లు విడుదల చేయాలని కోరారు. రెండో దశలో రూ.21 వేల కోట్లు ఇక పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల వరకూ పూర్తిచేస్తేనే 194.6 టీఎంసీలను నిల్వచేయవచ్చునని.. అప్పుడే ప్రాజెక్టు పూర్తి ఫలాలు అందుతాయని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు వివరించారు. 45.72 మీటర్ల వరకూ ముంపునకు గురయ్యే భూమి సేకరణకు, నిర్వాసితుల పునరావాసానికి రూ.21 వేల కోట్లు అవసరమవుతాయని.. వాటిని కూడా తొలిదశ పనులకు ఇచ్చే నిధులకు సమాంతరంగా విడుదల చేయాలంటూ చేసిన ప్రతిపాదనలపై వోహ్రా సానుకూలంగా స్పందించారు. రెండో దశ పనులు పూర్తిచేయడానికి అవసరమైన నిధులపై కూడా కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిక ఇస్తామని చెప్పారు. -
రూ. 256.53 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజీలో పూడికతీత
సాక్షి, అమరావతి: ధవళేశ్వరం బ్యారేజీలో మేటలు వేసిన రెండు కోట్ల క్యూబిక్ మీటర్లకుపైగా ఇసుకను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇసుక మేటల తొలగింపునకు రూ. 256.53 కోట్ల వ్యయంతో రెండు ప్యాకేజీల కింద టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 21న ఆర్థిక బిడ్, అదే రోజున రివర్స్ టెండరింగ్ నిర్వహించి.. టెండర్లను జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఖరారు చేయనున్నారు. ఇసుక మేటల తొలగింపు ద్వారా బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. దీని ద్వారా గోదావరి డెల్టా రైతులకు సమృద్ధిగా నీటిని సరఫరా చేయడంతో పాటు పూడిక తీసిన ఇసుక ద్వారా నిర్మాణ రంగానికి ఊతం ఇవ్వాలన్నది సర్కార్ ఉద్దేశ్యం అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గోదావరి డెల్టాలో ఉన్న 10.09 లక్షల ఎకరాల ఆయకట్టుకు ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా నీళ్లందిస్తారు. ఈ బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 2.931 టీఎంసీలు. బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో భారీగా ఇసుక మేటలు వేయడం వల్ల ఆ నీటి నిల్వ సామర్థ్యం బాగా తగ్గింది. ఖరీఫ్లో పంటలకు నీళ్ల ఇబ్బంది లేకపోయినా.. రబీలో నీళ్లందించడం సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో బ్యారేజీకి 3 కి.మీ. నుంచి 12.5 కి.మీ. వరకూ ఎడమ వైపున ఇసుక మేటల తొలగింపునకు రూ. 135.85 కోట్లు.. కుడి వైపున ఇసుక దిబ్బల తొలగింపునకు రూ. 120.68 కోట్లతో అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. టెండర్లను ఖరారు చేశాక ఇసుక తొలగింపు పనులను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. ఏపీఎండీసీకి బాధ్యత అప్పగింత.. ధవళేశ్వరం బ్యారేజీలో ఇసుక మేటలను తొలగించేందుకు అయ్యే వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) భరించాలని ప్రభుత్వం పేర్కొంది. ఇసుకను తొలగించడం, దాన్ని విక్రయించడం వరకు అన్ని బాధ్యతలను ఏపీఎండీసీకి అప్పగించింది. పూడిక తీసిన ఇసుకను విక్రయించగా రూ. 256.53 కోట్ల కంటే అధికంగా ఆదాయం వస్తే.. ఆ లాభంలో వాటాలు ఏపీఎండీసీకి, సర్కార్ ఖజానాకు చేరుతాయి. పూడికతీతతో వచ్చే ఇసుకతో నిర్మాణరంగానికి మేలు జరుగుతుందని, కార్మికులకు చేతినిండా పనిదొరుకుతుందని అధికారులు భావిస్తున్నారు. -
చెరువులు నిండుగా.. రైతులకు పండగ..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు, తుపానుల ప్రభావంవల్ల సమృద్ధిగా వర్షాలు కురవడంతో భారీ, మధ్య, చిన్నతరహా నీటి ప్రాజెక్టులు నిండిన తరహాలోనే చెరువులు కూడా నిండిపోయాయి. చిన్న నీటిపారుదల విభాగం కింద ఉన్న 38,169 చెరువుల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 207.53 టీఎంసీలు కాగా.. శనివారం నాటికి 148.56 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ చెరువుల కింద 25,60,444 ఎకరాల ఆయకట్టు ఉంది. గతంలో చెరువుల కింద ఉన్న ఆయకట్టులో తొమ్మిది లక్షల ఎకరాలకు మించి పంటల సాగుచేసిన దాఖలాల్లేవు. వర్షాభావ పరిస్థితులవల్ల చెరువుల్లోకి వరద నీరు చేరకపోవడమే అందుకు కారణం. కానీ.. ఈ ఏడాది చెరువుల్లో రికార్డు స్థాయిలో నీటి నిల్వలు ఉండడంతో ఆయకట్టులో పంటలు సాగుచేయడంలో రైతులు నిమగ్నమయ్యారు. ఇక రాష్ట్రంలో సగటున 859.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 998.2 మి.మీలు కురిసింది. సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైంది. వైఎస్సార్ కడప జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే ఏకంగా 60.9 శాతం అధిక వర్షపాతం కురిసింది. మిగిలిన 12 జిల్లాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షం కురిసింది. ఇలా విస్తారంగా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు ఉరకలెత్తాయి. దాంతో ఎన్నడూ నీటిచుక్క చేరని చెరువులు కూడా నిండిపోయాయి. దాంతో ఆయకట్టు రైతుల్లో పండగ వాతావరణం నెలకొంది. నిల్వ సామర్థ్యంలో 50 శాతం కంటే ఎక్కువ నీటి నిల్వ ఉన్న చెరువుల కింద ఆయకట్టులో పంటలకు జలవనరుల శాఖ అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. యాజమాన్య పద్ధతుల ద్వారా ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించేలా జాగ్రత్తలు తీసుకుంటుండటంతో భారీఎత్తున పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు. -
డిజైన్ల ఆమోదంలో జాప్యమే కారణం
సాక్షి, అమరావతి: డిజైన్ల ఆమోదంలో డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చేస్తున్న జాప్యం వల్లే పోలవరం ప్రాజెక్టు ఎర్త్ కమ్ రాక్ ఫిల్(ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పనులు ఆలస్యమవుతున్నాయని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజైన్లను త్వరగా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. పోలవరం, సత్వర సాగు నీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ), కాడ్వామ్ (కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్) పనుల పురోగతిని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ గురువారం వర్చువల్ విధానంలో సమీక్షించారు. పోలవరం పనుల ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. పనులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డిలను ఆదేశించారు. డిజైన్లను వేగంగా ఆమోదిస్తే ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేస్తామని జవహర్రెడ్డి చెప్పగా.. తక్షణమే డీడీఆర్పీ సభ్యులు పనులను పరిశీలించి, డిజైన్లను ఖరారు చేసేలా చర్యలు తీసుకోవాలని సీడబ్ల్యూసీ చైర్మన్ ఆర్కే సిన్హాను పంకజ్కుమార్ ఆదేశించారు. ఈనెల 7న డీడీఆర్పీ ఛైర్మన్ ఏబీ పాండ్య పోలవరం పనులను పరిశీలించారని ఈఎన్సీ నారాయణరెడ్డి గుర్తు చేశారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిపై ఆయనకు పూర్తి అవగాహన ఉందన్నారు. వర్చువల్ విధానంలో డీడీఆర్పీ సమావేశం నిర్వహించి డిజైన్లను ఆమోదిస్తే ఈ సీజన్ను పూర్తి స్థాయిలో వినియోగించుకుని ప్రాజెక్టును పూర్తి చేస్తామని వివరించారు. ఇందుకు పంకజ్కుమార్ సానుకూలంగా స్పందించారు. తక్షణమే డీడీఆర్పీ సమావేశం నిర్వహించి.. డిజైన్ల ఆమోదానికి చర్యలు తీసుకోవాలని సీడబ్ల్యూసీ చైర్మన్ను ఆదేశించారు. ప్రాజెక్టుకు ఇటీవల విడుదల చేసిన రూ.320 కోట్లకు యూసీలు (వినియోగ ధ్రువీకరణ పత్రాలు) పంపామని, రీయింబర్స్ చేయాల్సిన మిగతా నిధులను మంజూరు చేయాలని జవహర్రెడ్డి చేసిన వి/æ్ఞప్తిపై పంకజ్కుమార్ సానుకూలంగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి.. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర అధికారులు కోరారు. దీనిపై మరో సమావేశంలో చర్చిద్దామని పంకజ్కుమార్ చెప్పారు. ఏఐబీపీ, కాడ్వామ్ కింద చేపట్టిన గుండ్లకమ్మ, తోటపల్లి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేసి.. పూర్తి ఆయకట్టుకు నీళ్లందించాలని ఆదేశించారు. భూసేకరణకు సంబంధించి న్యాయస్థానాల్లో కేసులు ఉన్నందువల్ల మిగిలిన పనులను పూర్తి చేయలేకపోతున్నట్లు రాష్ట్ర అధికారులు వివరించారు. వాటిని వీలైనంత తొందరగా పరిష్కరించుకుని.. గడువులోగా ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వివరించారు. -
‘తోటపల్లి’కి సంపూర్ణంగా సాగునీరు
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే తోటపల్లి బ్యారేజీ మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తోటపల్లి బ్యారేజీ కింద పాత ఆయకట్టు 64 వేల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా 1.20 లక్షల ఎకరాలు, గజపతినగరం బ్రాంచ్ కెనాల్ కింద 15 వేల ఎకరాలు వెరసి 1.99 లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు జలవనరుల శాఖ సన్నద్ధమైంది. శిథిలావస్థలో రెగ్యులేటర్.. విజయనగరం జిల్లాలో గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద నాగావళిపై 1908లో ఆంగ్లేయుల హయాంలో రెగ్యులేటర్ నిర్మించారు. శిథిలావస్థకు చేరుకున్న ఈ రెగ్యులేటర్పై ఆధారపడి 64 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నాగావళి వరద జలాలను గరిష్టంగా వినియోగించుకుని, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో 2004లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాత రెగ్యులేటర్కు ఎగువన 2.509 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ బ్యారేజీ ద్వారా పాత ఆయకట్టు 64 వేల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా కుడికాలువ ద్వారా 1.20 లక్షల ఎకరాలు, కుడి కాలువలో 97.7 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల మేర గజపతినగరం బ్రాంచ్ కాలువ తవ్వడం ద్వారా 15 వేల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. భూ సేకరణ సమస్య పరిష్కారం.. తోటపల్లి బ్యారేజీ పనులు 2009 నాటికే పూర్తయ్యాయి. అయితే కుడి కాలువలో మిగిలిన పనులు పూర్తి కాకపోవడంతో 40 వేల ఎకరాలకు నీళ్లందని దుస్థితి నెలకొంది. రెండు ప్యాకేజీల కాంట్రాక్టర్లు పనులు చేయకుండా పదేళ్లుగా మొండికేస్తుండటంతో కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రధాన కాలువతోపాటు డిస్ట్రిబ్యూటరీల్లో మిగిలిన పనులు పూర్తి చేయడానికి 72.335 ఎకరాల భూసేకరణ సమస్యను ఇటీవలే ప్రభుత్వం పరిష్కరించింది. దీంతో మిగిలిన పనులను రూ.124.23 కోట్లతో వేగంగా పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. వేగంగా గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులు గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా వేగవంతమయ్యాయి. మిగిలిపోయిన 13,42,558 క్యూబిక్ మీటర్ల మట్టి పని, 30 వరకు బ్రిడ్జిలు, అండర్ టన్నెళ్లు లాంటి నిర్మాణాలు, 12,583 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. కెనాల్ పూర్తయ్యేలోగా ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేసే దిశగా పనులను వేగవంతం చేశారు. -
నీటి లభ్యత తేల్చాకే కావేరికి గోదావరి
సాక్షి, అమరావతి: గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే గోదావరి–కావేరి అనుసం ధానం చేపట్టాలని కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ తేల్చిచెప్పింది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ అధ్యక్షతన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశం బుధవారం వర్చువల్ విధానంలో జరి గింది. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను నా గార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదు గా కావేరికి తరలించడానికి సమగ్ర ప్రాజెక్టు నివేది కను (డీపీఆర్ను) రాష్ట్రాలకు అందజేశామని ఎన్డబ్ల్యూడీఏ డీజీ భోపాల్సింగ్ చెప్పారు. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి గోదావరి–కావేరి అను సంధానంపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను విస్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న, భవిష్యత్తులో చేపట్టనున్న ప్రాజెక్టులకే గోదా వరి జలాలు సరిపోతాయని, నీటిలభ్యత ఎక్క డుందని జవహర్రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు లను పరిగణనలోకి తీసుకోకుండానే డీపీఆర్ రూపొందించారని ఆక్షేపించారు. గోదావరి వరద (మిగులు) జలాలపై పూర్తి హక్కును దిగువ రాష్ట్ర మైన ఆంధ్రప్రదేశ్కే గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిం దని గుర్తుచేశారు. ఏపీ అవసరాలు తీర్చాకే మిగిలి న జలాలను తరలించాలని స్పష్టం చేశారు. దీనిపై పంకజ్కుమార్ సానుకూలంగా స్పందించారు. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలని భోపాల్సింగ్ను ఆదేశించారు. ఆ తర్వాతే బేసిన్ పరిధిలోని రాష్ట్రాలతో అనుసంధానంపై చర్చించాలని చెప్పారు. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించాకే అనుసంధానం పనులు చేపడతామని స్పష్టం చేశారు. కొత్త రిజర్వాయర్లు లేకుండా అనుసంధానమా? ఇచ్చంపల్లి నుంచి తరలించే గోదావరి జలాలను నాగార్జునసాగర్, సోమశిల రిజర్వాయర్లలో నిల్వ చేసి.. కావేరి బేసిన్కు తరలించేలా డీపీఆర్ను రూపొందించడంపై ఈఎన్సీ నారాయణరెడ్డి అభ్యంతరం తెలిపారు. నాగార్జునసాగర్, సోమశిలలో నిల్వచేసే జలాలు వాటి ఆయకట్టుకే సరి పోవడం లేదన్నారు. గోదావరి జలాల నిల్వకు కొత్త రిజర్వాయర్లు నిర్మించకుండా అనుసంధానం అసాధ్యమని చెప్పారు. దీనిపై పంకజ్కుమార్ స్పందిస్తూ కొత్త రిజర్వాయర్ల నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఎన్డబ్ల్యూడీఏకు సూచించారు. నీటి లభ్యత తేల్చాకే చర్చించాలి : తెలంగాణ గోదావరిలో నీటిలభ్యతను శాస్త్రీయంగా తేల్చా కే, కావేరికి నీటి తరలింపుపై చర్చించాలని తెలంగాణ కూడా అభిప్రాయపడింది. గోదావ రి జలాల్లో తమ వాటా నీటిని కావేరి బేసిన్కు తరలించడానికి అంగీకరించబోమని ఛత్తీస్ఘడ్ స్పష్టం చేసింది. కావేరి బేసిన్లో కర్ణాటకలోనే కరవు పీడిత ప్రాంతాలు ఎక్కువని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అందువల్ల గోదావరి జ లాల్లో వాటా ఇవ్వాలని కోరింది. ఉమ్మడి ఏపీ తో పోల్చితే కృష్ణా బేసిన్లో తమ రాష్ట్రంలోనే కరవు పీడిత ప్రాంతాలు అధికమైనందున కృష్ణా బేసిన్కు తరలించే గోదావరి జలాలకు బదులు కృష్ణాజలాల్లో అదనపు వాటా ఇవ్వాల ని కోరింది. మహారాష్ట్ర కూడా కృష్ణాజలాల్లో అద నపు వాటా ఇవ్వాలని కోరింది. కావేరి బేసి న్కు గోదావరి జలాలను తరలిస్తున్నందున, కావేరి జలాల పంపకంలో న్యాయం చేయాలని కేరళ కోరింది. గోదావరి–కావేరి అనుసంధా నంపై ఎలాంటి అభ్యంతరం లేదని ఒడిశా తెలిపింది. తీవ్ర నీటి ఎద్దడితో తల్లడిల్లుతున్న కావేరి బేసిన్కు గోదావరి జలాలను తరలించి ఆదుకోవాలని తమిళనాడు కోరింది. -
కోటి ఎకరాలకు జలధారలు
సాక్షి, అమరావతి: ఈసారి రబీలో 31.10 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా జలవనరుల శాఖ అధికారులు రూపొందించిన ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా వృథాకు అడ్డుకట్ట వేసి శివారు భూములకు సైతం జలసిరులు అందించాలని దిశానిర్దేశం చేసింది. ఖరీఫ్లో భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల కింద 70 లక్షల ఎకరాలకు నీళ్లందించిన నేపథ్యంలో రబీతో కలిపి మొత్తం 1.11 కోట్ల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా.. 2019–20, 2020–21లోనూ ఖరీఫ్, రబీల్లో కోటి ఎకరాలకు నీళ్లందించారు. వరుసగా మూడో ఏడాది కోటి ఎకరాల ఆయకట్టుకు నీటిని అందిస్తుండటం గమనార్హం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ వరుసగా మూడేళ్ల పాటు కోటి ఎకరాలకు నీళ్లందించిన దాఖలాలు లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. గత మూడేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళితో పాటు వాగులు, వంకలు ఉరకలెత్తాయి. చిన్న, మధ్య తరహా, భారీ ప్రాజెక్టులు కళకళలాడుతుండటంతో మూడేళ్లుగా ఖరీఫ్, రబీల్లో కోటి ఎకరాలకు నీళ్లందించేందుకు మార్గం సుగమమైంది. కృష్ణా డెల్టాలో మొదటిసారి... కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని 13.08 లక్షల ఎకరాల్లో కృష్ణా డెల్టా ఆయకట్టు విస్తరించింది. ఇప్పటివరకూ ఖరీఫ్లో మాత్రమే కృష్ణా డెల్టా ఆయకట్టుకు అధికారికంగా నీళ్లందిస్తున్నారు. అయితే గత మూడేళ్లుగా రబీలోనూ కృష్ణా డెల్టా ఆయకట్టుకు అధికారికంగా నీళ్లందిస్తుండటం గమనార్హం. 2019–20లో 1.10 లక్షలు, 2020–21లో 2.50 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేసిన ప్రభుత్వం ఈ ఏడాది ఏకంగా 8.52 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీళ్లందించడానికి సిద్ధమైంది. డెల్టా చరిత్రలో రబీలో ఇంత భారీగా నీళ్లందిస్తుండటం ఇదే తొలిసారి. ఈసారి రికార్డు స్థాయిలో పులిచింతల ప్రాజెక్టులో ఏకంగా 40.44 టీఎంసీలను నిల్వ చేశారు. ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించడం వల్లే కృష్ణా డెల్టాలో రికార్డు స్థాయిలో ఆయకట్టుకు నీరు అందుతోందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. వంశధార నుంచి చిత్రావతి దాకా.. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నుంచి వైఎస్సార్ కడప జిల్లాలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దాకా మధ్య, భారీ తరహా ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్న అన్ని జలాశయాల కింద రబీలో ఆయకట్టుకు నీళ్లందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లాలో వంశధారతోపాటు మధ్యతరహా ప్రాజెక్టైన మడ్డువలస ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి డెల్టాకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తోంది. పశ్చిమ గోదావరిలో ఎర్రకాల్వ, తమ్మిలేరు ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తోంది. ప్రకాశం జిల్లాలో సాగర్ కుడి కాలువ, కృష్ణా డెల్టాతోపాటు మధ్యతరహా ప్రాజెక్టులైన రాళ్లపాడు, మోపాడు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెన్నా డెల్టాలో ఆలస్యంగా సాగు చేపట్టిన ఖరీఫ్ పంటలకు నీటిని సరఫరా చేస్తోంది. కర్నూలు జిల్లా పరిధిలో కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టడం వల్ల తెలుగుగంగ ఆయకట్టుకు రబీలో నీటిని విడుదల చేయడం లేదు. ఎస్సార్బీసీ, తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ) ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాలో తెలుగుగంగ, గండికోట ఎత్తిపోతల, గాలేరు–నగరి తొలిదశ, చిత్రావతి, పులివెందుల బ్రాంచ్ కెనాల్, హెచ్చెల్సీ(తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ) ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తోంది. లభ్యత ఆధారంగా రబీకి నీటి విడుదల ప్రభుత్వ ఆదేశాల మేరకు లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తాం. యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసి ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందిస్తాం. పులిచింతలలో ప్రభుత్వం దూరదృష్టితో 40.44 టీఎంసీలను నిల్వ చేయడం వల్లే కృష్ణా డెల్టా చరిత్రలో తొలిసారిగా రికార్డు స్థాయిలో రబీ పంటలకు నీళ్లందించగలుగుతున్నాం. నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని రైతులకు వి/æ్ఞప్తి చేస్తున్నాం. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ -
సంప్రదింపులతోనే పెండింగ్ అంశాల పరిష్కారం
సాక్షి, అమరావతి: సంప్రదింపుల ద్వారా పెండింగ్ అంశాలను పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్, ఒడిశా నిర్ణయించాయి. ఈ మేరకు సోమవారం సచివాలయం నుంచి రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమీర్శర్మ, సురేశ్ చంద్ర మహాపాత్ర వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు. అంతర్రాష్ట్ర సమస్యలను నిర్దిష్ట వ్యవధిలోగా పరిష్కరించుకునే అంశంపై ఇటీవల ఏపీ, ఒడిశా ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, నవీన్ పట్నాయక్ భువనేశ్వర్లో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల సీఎస్ల నేతృత్వంలో అధికారులతో కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆ కమిటీలు రెండూ సోమవారం పెండింగ్ అంశాలపై సమీక్షించాయి. ఈ సందర్భంగా సీఎస్ డా.సమీర్ శర్మ మాట్లాడుతూ.. పెండింగ్ అంశాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుందామన్నారు. ఒడిశా సీఎస్ సురేశ్ చంద్ర మహాపాత్ర మాట్లాడుతూ సీఎంల భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను పరిష్కరించుకునేందుకు సమావేశాలు దోహదం చేస్తాయన్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో రోడ్డు అనుసంధాన పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సీఎస్ సమీర్ శర్మ దృష్టికి తెచ్చారు. సమావేశం మినిట్స్ను రెండు రాష్ట్రాలు పంపితే తదుపరి భేటీల్లో పెండింగ్ అంశాలపై చర్చించుకోవచ్చన్నారు. ఇంధనం, జల వనరులు, రవాణాపై చర్చ ఈ సమావేశంలో ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య ఇంధన, జలవనరులు, ఉన్నత విద్య, పాఠశాల విద్య, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి వివిధ పెండింగ్ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఇంధన శాఖకు సంబంధించి జోలాపుట్, లోయర్ మాచ్ఖండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు, బలిమెల డ్యామ్, చిత్రకొండ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. జలవనరుల శాఖకు సంబంధించి వంశధార నదిపై నేరడి బ్యారేజ్, ఝంజావతి రిజర్వాయర్, బహుదా నది నీరు విడుదలకు సంబంధించి పంపు స్టోరేజ్ ప్రాజెక్టులకు ఇరు రాష్ట్రాల తరఫున ఎన్వోసీల మంజూరు అంశాలపై సమీక్షించారు. బహుదా నీటిని విడుదల చేయండి నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా ప్రభుత్వం 106 ఎకరాల భూమిని అప్పగించాల్సి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్రెడ్డి తెలిపారు. ఆ భూమిని అప్పగిస్తే బ్యారేజ్ సకాలంలో పూర్తయి ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అలాగే ఝంజావతి రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణంతో విజయనగరం జిల్లాలోని 5 మండలాల్లో 75 గ్రామాలకు తాగునీరు అందడమే కాకుండా 24,640 ఎకరాలకు సాగు నీరు అందుతుందని చెప్పారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఒడిశా ప్రభుత్వం ఆ ప్రాంతంలో గ్రామ సభలు నిర్వహించలేదన్నారు. ఒప్పందం ప్రకారం బహుదా నది ద్వారా ఒడిశా ప్రభుత్వం 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉందన్నారు. -
శ్రీశైలం ప్రాజెక్టును తనిఖీ చేసిన డీఎస్సార్పీ
సాక్షి, అమరావతి/శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం ప్రాజెక్టును కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలోని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ (డీఎస్సార్పీ) సోమవారం తనిఖీ చేసింది. ఆ తర్వాత తనిఖీలో వెల్లడైన అంశాల ఆధారంగా కర్నూలు ప్రాజెక్టŠస్ సీఈ మురళీనాథ్రెడ్డి, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) సీఈ కె.శ్రీనివాస్ తదితరులతో ప్రాజెక్టు వద్దే సమీక్ష సమావేశం నిర్వహించింది. ప్రాజెక్టు భద్రతకు ఎటువంటి ఢోకా లేదని చెప్పింది. మంగళవారం రాష్ట్ర జలవరులశాఖ అధికారులతో మరోసారి సమావేశమై.. ప్రాజెక్టు భద్రతకు తక్షణం, శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రపంచబ్యాంకు రుణంతో కేంద్రం చేపట్టిన డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (డ్రిప్) కింద శ్రీశైలం ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపడతారు. దేశంలో సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణకు ప్రపంచబ్యాంకు రుణంతో కేంద్రం డ్రిప్ పథకాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే తొలిదశ పూర్తవగా రెండోదశను ప్రారంభించింది. ఈ రెండోదశలో శ్రీశైలం ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. సీడబ్ల్యూసీకి ప్రతిపాదనలు కృష్ణానదికి 2009లో వచ్చిన భారీ వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లంజ్ పూల్ కాస్త దెబ్బతింది. దశాబ్దాల కిందట నిర్మించిన ఈ ప్రాజెక్టు స్పిల్ వే గ్యాలరీలో లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు గ్రౌటింగ్ (బోరు వేసి.. అధిక ఒత్తిడితో కాంక్రీట్ మిశ్రమాన్ని భూగర్భంలోకి పంపి.. చీలికలను కాంక్రీట్తో నింపడం ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేయడం) చేయడం, ఫ్లంజ్ పూల్కు, గేట్లకు మరమ్మతులు చేయడం, ఆఫ్రాన్ను పటిష్టం చేయడం, క్యాంపు కాలనీ నిర్మించడం వంటి పనులు చేపట్టడానికి రూ.780 కోట్లతో సీడబ్ల్యూసీకి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనల ఆధారంగా శ్రీశైలం ప్రాజెక్టును తనిఖీ చేసి.. భద్రతకు చేపట్టాల్సిన పనులపై నివేదిక ఇచ్చేందుకు సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలో రిటైర్డ్ సీఈ ఈశ్వర్ ఎస్.చౌదరి, రిటైర్డ్ ఈఎన్సీలు బి.ఎస్.ఎన్.రెడ్డి, పి.రామరాజు, రిటైర్డ్ సీఈలు రౌతు సత్యనారాయణ, కె.సత్యనారాయణ, జీఎస్ఐ రిటైర్డ్ డీజీ ఎం.రాజు, ఆర్కిటెక్చర్ ప్లానింగ్ అండ్ ల్యాండ్ స్కేప్ ఎక్స్పర్ట్ ఎండీ యాసిన్ సభ్యులుగా డీఎస్సార్పీని కేంద్రం నియమించింది. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే, గేట్లు, గ్యాలరీ, ఫ్లంజ్ పూల్, ఆఫ్రాన్లను పరిశీలించిన డీఎస్సార్పీ.. జలవనరులశాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలపై సమీక్ష సమావేశం నిర్వహించింది. మంగళవారం మరోసారి అధికారులతో సమావేశం కానుంది. ఈ బృందం ప్రాజెక్టు భద్రతకు చేపట్టాల్సిన పనులపై నివేదిక ఇస్తుందని సీఈ మురళీనాథ్రెడ్డి మీడియాతో చెప్పారు. -
నదుల అనుసంధానమే అజెండా
సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానమే అజెండాగా ఈ నెల 19న జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశమవుతోంది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరిగే ఈ సమావేశంలో ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్సింగ్, సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) చైర్మన్ ఆర్కే సిన్హాతోపాటూ అన్ని రాష్ట్రాల జల వనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. రాష్ట్రం తరఫున జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి హాజరవుతారు. సముద్రం పాలవుతున్న నదీ జలాలను ఒడిసిపట్టి.. లభ్యత ఎక్కువగా ఉన్న నది నుంచి తక్కువ లభ్యత ఉన్న నదికి మళ్లించడం ద్వారా దేశాన్ని సస్యశ్యామలం చేసేందుకు నదుల అనుసంధానాన్ని చేపట్టడం కోసం ఎన్డబ్ల్యూడీఏను కేంద్రం ఏర్పాటు చేసింది. హిమాలయ నదులను అనుసంధానం చేయడానికి 14, ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడానికి 16 ప్రణాళికలను ఎన్డబ్ల్యూడీఏ ఇప్పటికే సిద్ధం చేసింది. వాటిని ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. తొలుత కెన్–బెట్వా, గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి, దామన్గంగ–పింజాల్, పార్–తాపి–నర్మద నదులను అనసంధానించేందుకు నడుం బిగించింది. కెన్–బెట్వా అనుసంధాన పనులు చేపట్టడానికి రూ.44,605 కోట్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆ పనులు చేపట్టడానికి వీలుగా కెన్–బెట్వా లింక్ ప్రాజెక్ట్ అథారిటీ (కేబీఎల్పీఏ) పేరుతో ఎస్పీవీని ఎన్డబ్ల్యూడీఏ ఏర్పాటు చేసింది. ఈ పనులకు నిధుల సమీకరణ, టెండర్లపై సమావేశంలో చర్చించనున్నారు. గోదావరి నుంచి కృష్ణా, పెన్నా, కావేరి బేసిన్లకు 216 టీఎంసీలను తరలించే అనుసంధానం పనులపై ఇప్పటికే ఆ బేసిన్ల పరిధిలోని రాష్ట్రాలతో ఎన్డబ్ల్యూడీఏ చర్చించింది. అనుసంధానాన్ని ఎలా చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. -
లక్ష్యాల మేరకు పోలవరం పనులు: కేఎస్ జవహర్రెడ్డి
పోలవరం రూరల్: ప్రభుత్వ లక్ష్యాల మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి చెప్పారు. ఈఎన్సీ నారాయణరెడ్డితో కలిసి గురువారం ఆయన ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతీ పనిని పరిశీలించి వాటి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల మధ్య జరుగుతున్న పనులను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణం, వివిధ దశల్లో చేపట్టి పూర్తి చేసిన పనుల పురోగతిపై ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. హెడ్ వర్క్స్, స్పిల్వే, బ్రిడ్జి, గేట్లు, ఎర్త్ కం రాక్ఫిల్ డ్యామ్, గ్యాప్–3, ఓటీ రెగ్యులేటర్, బండ్–2, ట్విన్ టన్నెల్స్ తదితర పనులను పరిశీలించారు. పనుల వివరాలను ఎస్ఈ కె.నరసింహమూర్తి మ్యాప్ ద్వారా వివరించారు. గురువారం రాత్రి ప్రాజెక్టు ప్రాంతంలోనే జవహర్రెడ్డి బస చేశారు. -
పోలవరం పనుల్లో వేగం పెంచండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసే దిశగా పనులను మరింత వేగవంతం చేయాలని జలవనరులశాఖ అధికారులకు మంత్రి పి.అనిల్కుమార్ యాదవ్ దిశానిర్దేశం చేశారు. విజయవాడలో మంగళవారం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డితో కలిసి అన్ని ప్రాజెక్టుల సీఈలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో రెండు కాఫర్ డ్యామ్ల మధ్యన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది డయా ఫ్రమ్ వాల్ను పటిష్టం చేయడం, కోతకు గురైన జెట్ గ్రౌటింగ్, ఇసుక పొరలను భర్తీచేయడం తదితరాలకు సంబంధిం చిన డిజైన్లను ఈనెల 20న జరిగే డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) సమావేశంలో ఆమోదింపజేసుకోవాలని సూచించారు. డిజైన్లు ఆమోదం పొందిన వెంటనే పనులు ప్రారంభించి వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రాధాన్యత ప్రాజెక్టులైన నెల్లూరు, సంగం బ్యారేజీలను వచ్చే జనవరి ఆఖరులో గా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వంశధార స్టేజ్–2 ఫేజ్–2, అవుకు టన్నెల్, వెలిగొండ పనులను వేగవంతం చేయాలన్నారు. -
అప్పర్ భద్రకు అనుమతులు సరికాదు
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో దిగువ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభిప్రాయాలను తీసుకోకుండా కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) హైడ్రలాజికల్ క్లియరెన్స్ ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తక్షణమే ఈ అనుమతులను పునఃసమీక్షించి.. ప్రాజెక్టు పనులు చేపట్టకుండా కర్ణాటకను ఆదేశించాలని సీడబ్ల్యూసీ చైర్మన్ ఆర్కే సిన్హాను రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డిలు డిమాండ్ చేశారు. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు అప్పర్ భద్రపై ఏపీ, కర్ణాటక జలవనరుల శాఖ అధికారులతో ఆర్కే సిన్హా మంగళవారం వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. కేటాయించిన నీటిని వాడుకోవడానికే అప్పర్ భద్ర చేపట్టామని కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి ఎన్.లక్ష్మణ్రావు పీష్వా పేర్కొనడంపై ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–1.. అప్పర్ భద్రకు ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదని.. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు ఇప్పటిదాకా అమల్లోకి రాలేదన్నారు. ప్రాజెక్టుల ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఎక్కడా తగ్గలేదని కేడబ్ల్యూడీటీ–2 తేల్చిచెప్పినా.. దానికి భిన్నంగా మిగులు ఉందంటూ.. వాటిని వాడుకోవడానికే అప్పర్ భద్ర చేపట్టామని కర్ణాటక పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీలో కృష్ణా బేసిన్ ఆయకట్టుకు తీవ్ర నీటి ఎద్దడి అప్పర్ తుంగ ప్రాజెక్టు నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోసి.. భద్ర ప్రాజెక్టు నుంచి 29.90 టీఎంసీలను తరలించేలా కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు చేపట్టిందని ఏపీ అధికారులు వివరించారు. నీటిని తరలించే క్రమంలో కర్ణాటకలోని వాణివిలాసాగర్, ఏపీలోని భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ) మధ్య వేదవతిపై రిజర్వాయర్ను నిర్మిస్తోందన్నారు. ఈ రిజర్వాయర్ను నిర్మించకూడదని కేడబ్ల్యూడీటీ–1 స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్ కింద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల ఆయకట్టుతోపాటూ కేసీ కెనాల్ కింద ఏపీ, ఆర్డీఎస్ కింద ఏపీ, తెలంగాణల్లోని ఆయకట్టుకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం రావడంలో జాప్యం చోటు చేసుకుంటుందన్నారు. ఇది ఆ ప్రాజెక్టుల ఆయకట్టు రైతులకు ఇబ్బందులను సృష్టిస్తుందన్నారు. దీనిపై ఆర్కే సిన్హా స్పందిస్తూ.. ప్రాజెక్టుపై అభ్యంతరాలను కర్ణాటక సర్కార్కు పంపాలని సూచించారు. వాటిపై కర్ణాటక సర్కార్ వివరణ ఇచ్చిన తర్వాత మరోసారి 2 రాష్ట్రాల అధికారులతో సమావేశమై.. అప్పర్ భద్రపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయకున్నా.. అప్పర్ భద్రకు 36 టీఎంసీలు కేటాయించాలని కర్ణాటక చేసిన ప్రతిపాదనను.. నీటి లభ్యత లేకపోవడాన్ని ఎత్తిచూపుతూ కేడబ్ల్యూడీటీ–1 తోసిపుచ్చిందని గుర్తు చేశారు. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయకున్నా సరే.. అప్పర్ భద్ర ద్వారా 29.90 టీఎంసీలను వినియోగించుకుని 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందించేలా కర్ణాటక చేపట్టిన ఈ ప్రాజెక్టుకు గతేడాది డిసెంబర్ 24న సీడబ్ల్యూసీ టీఏసీ అనుమతి ఇచ్చిందని ఎత్తిచూపారు. దీనికి ఈ ఏడాది మార్చి 25న కేంద్ర జల్ శక్తి శాఖ పెట్టుబడి అనుమతి ఇచ్చిందన్నారు. కేడబ్ల్యూడీటీ–1, కేడబ్ల్యూడీటీ–2లు అప్పర్ భద్రకు 10 టీఎంసీలు కేటాయించనే లేదన్నారు. తుంగ ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 6.25, భద్ర ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 0.5, విజయనగర ఛానల్స్ ఆధునికీకరణ వల్ల 6.25, కృష్ణా డెల్టాకు పోలవరం ద్వారా మళ్లించిన జలాల్లో వాటాగా దక్కిన నీటిలో 2, కృష్ణా బేసిన్లో అదనపు మిగులు జలాల రూపంలో 6 టీఎంసీల లభ్యత ఉందని.. ప్రవాహ, ఆవిరి నష్టాలుపోనూ మిగిలిన నీటిని అప్పర్ భద్ర ద్వారా వాడుకుంటామని కర్ణాటక పేర్కొందన్నారు. కానీ.. వాటి ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఏమాత్రం తగ్గలేదని.. అదనపు మిగులు జలాలు లేవని కేడబ్ల్యూడీటీ–2 ఎత్తిచూపిన అంశాన్ని గుర్తు చేశారు. -
ఖరీఫ్కు కృష్ణా జలాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ పంటల కోసం ఈనెల 15 వరకు కృష్ణా నది నీటిని వాడుకోవడానికి ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు అనుమతినిచ్చింది. రబీకి అవసరమైన నీటిపై నెలాఖరులోగా ప్రతిపాదనలు పంపాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. నెలాఖరులోగా త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమై.. వినియోగించుకున్న జలాలను పరిగణనలోకి తీసుకుని, రబీకి కేటాయింపులు చేస్తుందని పేర్కొంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటివరకు కృష్ణా జలాల వినియోగం.. సాగు, తాగు నీటి అవసరాలపై చర్చించేందుకు బోర్డు త్రిసభ్య కమిటీ గురువారం సమావేశమైంది. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే, ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్ పాల్గొన్నారు. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకూ 350.585 టీఎంసీలు వాడుకున్నట్లు ఏపీ ఈఎన్సీ చెప్పారు. తెలంగాణ 108.235 టీఎంసీలు వాడుకుందని తెలిపారు. ఖరీఫ్ కోసం ఈనెల 15వరకు సాగర్ కుడి కాలువకు 11.77 టీఎంసీలు, ఎడమ కాలువకు 2.55, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు 5.22, హంద్రీ–నీవాకు 4.14 మొత్తం 23.68 టీఎంసీలు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, జూరాల, మధ్యతరహా ప్రాజెక్టుల కనీస నీటి మట్టాలకు లభ్యతగా ఉన్న జలాలు, తుంగభద్ర డ్యామ్లో రెండు రాష్ట్రాల వాటా నీటిని కలుపుకుంటే 331.708 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఇందులో ఏపీ వాటా 171.163, తెలంగాణ వాటా 160.545 టీఎంసీలని వివరించారు. దీనిపై తెలంగాణ ఈఎన్సీ స్పందిస్తూ.. ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కలను ఖరీఫ్ పూర్తయిన తర్వాత తేలుద్దామన్నారు. ఈనెల 15 వరకు రెండు రాష్ట్రాలు అవసరమైన మేరకు నీటిని వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి రాయ్పురే సమ్మతించారు. -
Andhra Pradesh: ప్రాజెక్టుల భద్రతకు ప్రత్యేక చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన కార్యాలయ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై సమగ్ర పరిశీలన చేయాలని చెప్పారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద నిర్వహణ పరిస్థితులను సరిదిద్దాలని, రాష్ట్ర విభజన నాటి నుంచి దీని గురించి పట్టించుకోలేదని అన్నారు. దీనివల్ల ముప్పు ఏర్పడే పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వారీగా నిర్వహణ కోసం తగినంత సిబ్బంది ఉన్నారా? లేదా? అన్న దానిపై లెక్కలు తీయాలని, అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని ఆదేశించారు. గత సమీక్షా సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ దిశగా ప్రభుత్వ యంత్రాంగం కొన్ని చర్యలు చేపట్టిందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రెవిన్యూ–విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి, జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్లతో కమిటీ ఏర్పాటు చేశాం. ► ఐఐటీ, జేఎన్టీయూ నిపుణుల కమిటీకి జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ చైర్మన్గా ఉన్నారు. తీసుకోవాల్సిన చర్యలను అత్యున్నత కమిటీకి తెలియజేస్తున్నారు. ► వివిధ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్వహణపై గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన నివేదికలను కూడా అత్యున్నత స్థాయి కమిటీ పరిశీలిస్తోంది. ఇటీవలి వరదలు, కుంభవృష్టిని పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు తగిన సూచనలు చేస్తుంది. ► ఆటోమేషన్ రియల్ టైం డేటాకు, కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానించే వ్యవస్థపై కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడిన అత్యున్నత బృందం దృష్టి సారించింది. ► అన్ని మేజర్, మీడియం రిజర్వాయర్లు, బ్యారేజీల నిర్వహణకు అదనపు సిబ్బంది నియామకం, వాటర్ రెగ్యులేషన్ కోసం సిబ్బంది నియామకంపై ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ► పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేసిన పక్షంలో ఆస్తి, ప్రాణనష్టానికి ఆస్కారమున్న లోతట్టు ప్రాంతాలను గుర్తించే పని కూడా ఈ కమిటీ చేస్తోంది. -
రామోజీ మార్కు ‘వైఫల్యం’
కావాల్సిన బాబు అధికారంలో ఉంటే మానవ తప్పిదాన్ని ప్రకృతి విపత్తుగా చిత్రీకరిస్తారు. వేరొకరు అధికారంలో ఉంటే ప్రకృతి విపత్తునూ మానవ తప్పిదంగా వక్రీకరిస్తారు. ఇదీ రామోజీ మార్కు జర్నలిజం. ‘ఈనాడు’ రాతల్లో నీతి. 2003 అక్టోబర్ 30. అప్పటికి రెండ్రోజులుగా కురిసిన భారీ వర్షాలకు అన్నమయ్య ప్రాజెక్టులోకి 20వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ప్రాజెక్టు నిండిపోయింది. గేట్లు ఎత్తితే నీరు దిగువకు వెళ్లేది. గేట్లు ఎత్తడానికి జనరేటర్ ఆన్ చేయబోతే... దాన్లో డీజిల్ లేదు. ఫలితం... సకాలంలో ఎత్తకపోవడంతో గేట్లు కొట్టుకుపోయాయి. అపార నష్టం వాటిల్లింది. జనరేటర్ను చెక్ చేసుకోకపోవటం మానవ తప్పిదం. నాటి చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం. కానీ దాన్ని ‘ఈనాడు’ ప్రకృతి విపత్తుగానే రాసింది. 2021 నవంబరు 19. అప్పటికి మూడు రోజులుగా నల్లమల అటవీ ప్రాంతంతో పాటు చెయ్యేరు, బహుదా, పింఛా, మాండవ్య పరివాహక ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. గత 140 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఈ స్థాయి కుంభవృష్టిని వాతావరణ శాఖ కూడా అంచనా వేయలేదు. ఏ నది నుంచి ఎంత ప్రవాహం వస్తుందో కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) కూడా అంచనా వేయలేదు. సామర్థ్యానికి మించి వరద ముంచెత్తడంతో పింఛా ప్రాజెక్టు రింగ్బండ్ తెగింది. ఆ వరదకు బహుదా, చెయ్యేరు, మాండవ్య ప్రవాహాలు తోడయ్యాయి. ఏకంగా 3.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం అన్నమయ్య ప్రాజెక్టులోకి దూసుకొచ్చింది. సామర్థ్యానికన్నా ఒకటిన్నర రెట్లు అధిక వరద కావడంతో... స్పిల్ వే నుంచి వరదను దిగువకు విడుదల చేసే అవకాశంలేదు. ఫలితం... కట్టపై నుంచి వరద పారింది. మట్టికట్ట తెగింది. ప్రకృతి విపత్తు వల్లే ఇది జరిగినట్లు ప్రాజెక్టును చూసిన కేంద్ర బృందం నివేదించింది. సాగునీటి నిపుణులు, జలవనరుల శాఖ అధికారులూ అదే చెబుతున్నారు. ‘ఈనాడు’ మాత్రం అనూహ్యంగా వరద వచ్చిదంటూనే ఇదంతా సర్కార్ వైఫల్యమంటూ పనిగట్టుకుని దుష్ప్రచారం మొదలెట్టింది. ఈ రోతరాతల్లో నిజానిజాలేంటి? ఏది నిజం?. – సాక్షి, అమరావతి ఏది నిజం? చరిత్రలోనే గరిష్ఠ వరద.. తెగిన పింఛా మట్టికట్ట..: వైఎస్సార్ కడప జిల్లా టి.సుండుపల్లె మండలం ముదుంపాడు వద్ద 0.32 టీఎంసీల సామర్థ్యంతో పింఛా నదిపై పింఛా ప్రాజెక్టును నిర్మించారు. దాన్లోకి గరిష్ఠంగా 58 వేల క్యూసెక్కులకు మించి వరద వచ్చే అవకాశం లేదనే అంచనాతో స్పిల్ వే నిర్మించారు. కానీ గతనెల్లో ఏకంగా 1.30 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. స్పిల్ వే సామర్థ్యం కంటే 72 వేల క్యూసెక్కుల వరద అదనం. దాంతో 18న అర్ధరాత్రి రింగ్ బండ్ (మట్టికట్ట) తెగింది. ఆ వరద మొత్తం అన్నమయ్య ప్రాజెక్టు వైపు ఉరికింది. అన్నమయ్యకు... అంచనాలకు అందని వరద... వైఎస్సార్ జిల్లాలో రాజంపేట మండలం బాదనగడ్డ వద్ద 2.24 టీఎంసీల సామర్థ్యంతో అన్నమయ్య ప్రాజెక్టును 1981లో ప్రారంభించి.. 2001కి పూర్తి చేశారు. దీన్లోకి 100 ఏళ్లకు ఓసారి గరిష్ఠంగా 2.40 లక్షల క్యూసెక్కులు.. 200 ఏళ్లకోసారి గరిష్ఠంగా 2.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందనేది అధికారుల అంచనా. 2.85 లక్షల క్యూసెక్కుల వరదొచ్చినా దిగువకు విడుదల చేసేలా 94 మీటర్ల పొడవుతో స్పిల్ వేను నిర్మించారు. దీనికి 13.75 మీటర్ల ఎత్తు, 14 మీటర్ల వెడల్పుతో 5 గేట్లు అమర్చారు. 2012లో జల వనరుల శాఖ 3–డీ అధ్యయనంలో స్పిల్వే నుంచి గరిష్ఠంగా 2.17 లక్షల క్యూసెక్కులే దిగువకు విడుదల చేయొచ్చునని తేలింది. 2017లో ప్రాజెక్టును తనిఖీ చేసిన డ్యామ్ సేఫ్టీ కమిటీ.. 1.30 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా అదనంగా మరో స్పిల్ వే నిర్మించాలని సర్కార్కు నివేదిక ఇచ్చింది. కానీ.. నాటి చంద్రబాబు ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. గత నెల 16, 17, 18–19 తేదీల్లో నల్లమల, చెయ్యేరు, బహుదా, మాండవ్య పరివాహక ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. 17న అన్నమయ్య ప్రాజెక్టులో సగటున 1.75 టీఎంసీలను నిల్వ చేస్తూ... వచ్చిన వరదను వచ్చినట్టుగా అధికారులు దిగువకు వదిలేశారు. 18న రాత్రి 8గంటలకు వరద 77,125 క్యూసెక్కులకు చేరడంతో దిగువకు 1,09,124 క్యూసెక్కులను వదులుతూ వచ్చారు. 18న రాత్రి పది గంటలకు ప్రాజెక్టు గేట్లను పూర్తిగా ఎత్తేసి.. 1,46,056 క్యూసెక్కులు దిగువకు వదిలేశారు. 19 అర్థరాత్రి 3 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టులోకి 3.20 లక్షల క్యూసెక్కులు రావటంతో మట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. సామర్థ్యం చాలక మట్టికట్ట పైనుంచి దిగువకు వరద పారింది. దాంతో.. 19న ఉదయం 6.30 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది. ఇదీ వాస్తవం. ఎగువ నుంచి వరద వస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా అన్నమయ్య ప్రాజెక్టు దిగువన చెయ్యేరు పరివాహక ప్రాంతంలోని గ్రామాల నుంచి ప్రజలను అధికారులు ఖాళీ చేయించి పునరావాస శిబిరాలకు తరలించారు. భారీ ప్రాణనష్టం నివారించారు. కేంద్ర బృందమూ దీన్నే నిర్ధారిస్తూ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. కానీ.. ఈ వాస్తవం రామోజీ మార్కు జర్నలిజానికి కన్పించటం లేదు. చంద్రబాబు చెప్పిన అబద్ధాలే అక్కడ పతాక శీర్షికలవుతున్నాయి. తమ వాడు అధికారంలో లేడన్న అక్కసు.. తామేం చెప్పినా నమ్ముతారనే అతివిశ్వాసమే ‘ఈనాడు’ అబద్ధాలకు మూలం. కానీ తెలుగు నేలపై ఇపుడా పరిస్థితి లేదన్నది నూరుశాతం నిజం!!. -
జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శిగా జవహర్రెడ్డి
సాక్షి, అమరావతి: టీటీడీ ఈవోగా పనిచేస్తున్న డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డిని ప్రభుత్వం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. టీటీడీ ఈవో అదనపు బాధ్యతలు ఆయనకే అప్పగించింది. రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జె.శ్యామలరావు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఆ స్థానంలో ఉన్న సతీష్చంద్ర ఈ నెలాఖరులో రిటైర్ అయ్యాక ఆ బాధ్యతలను పూర్తిస్థాయిలో శ్యామలరావు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ ఎండీ, ఇంధనశాఖ ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జి.సాయిప్రసాద్ క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను అదనంగా నిర్వర్తిస్తున్న రజత్భార్గవను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. పరిశ్రమలు, వాణిజ్యశాఖ (ఫుడ్ ప్రాసెసింగ్) ముఖ్య కార్యదర్శి ముఖేష్కుమార్ మీనాను ఆర్థికశాఖ కొత్తగా ఏర్పాటుచేస్తున్న వాణిజ్యపన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టుకు బదిలీ చేశారు. ఇప్పటివరకు డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసులో పనిచేసి వెనక్కి వచ్చిన ఎస్.సురేష్ కుమార్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా నియమితులయ్యారు. ఆ స్థానంలో ఉన్న వి.చినవీరభద్రుడిని గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్గా బదిలీ చేశారు. గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్గా ఉన్న రంజిత్బాషాను సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శిగా బదిలీ చేశారు. యువజన వ్యవహారాల డైరెక్టర్, ఏపీ స్టెప్ ఎండీ సి.నాగరాణిని చేనేతశాఖ డైరెక్టర్గా నియమించారు. ఆప్కో ఎండీగా అదనపు బాధ్యతలు ఆమెకే అప్పగించారు. చేనేత డైరెక్టర్ అర్జునరావును బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్గా బదిలీ చేశారు. ఇప్పటివరకు ఆ పోస్టు అదనపు బాధ్యతలు చూస్తున్న అనంతరామును రిలీవ్ చేశారు. -
Andhra Pradesh: జలదౌత్యం!
సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా ఒడిశాతో నెలకొన్న జల వివాదాలను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. పోలవరం, జంఝావతి రిజర్వాయర్ ముంపు సమస్యల పరిష్కారంతోపాటు రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దిక్సూచిలా నిలిచే నేరడి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో చర్చించేందుకు ఈనెల 9న భువనేశ్వర్ వెళ్లనున్నారు. ఇద్దరు సీఎంలు కలసి జలవనరుల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి. సరిహద్దు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలను నెరపడం, సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుని అందరూ అభివృద్ధి చెందడమే తమ అభిమతమని సీఎం వైఎస్ జగన్ పలుదఫాలు వెల్లడించారు. ఈ క్రమంలో సమయం కేటాయిస్తే తానే వస్తానని ఈ ఏడాది ఏప్రిల్ 17న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కు లేఖ రాశారు. దీనిపై ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించి ఆహ్వానించడంతో సీఎం జగన్ వచ్చే వారం భువనేశ్వర్ వెళ్లనున్నారు. జంఝావతిపై కాంక్రీట్ డ్యామ్.. ► జంఝావతిలో 75 శాతం లభ్యత ఆధారంగా 8 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసి ఒడిశా, ఏపీ చెరి సగం వాడుకునేలా 1978 డిసెంబర్ 25న రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ► ఈ ఒప్పందం ప్రకారం 4 టీఎంసీలను వాడుకుని విజయనగరం జిల్లాలో కొమరాడ, పార్వతీపురం, మక్కువ, సీతానగరం, గరుగుబిల్లి మండలాల్లోని 75 గ్రామాల్లో 24,640 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా జంఝావతి ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో జలయ/æ్ఞంలో భాగంగా చేపట్టారు. ► 3.40 టీఎంసీల సామర్థ్యంతో విజయనగరం జిల్లాలో కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద జంఝావతిపై ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టుతో ఒడిశాలోని 1,175 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. ఈ భూమిని సేకరించి ఇస్తే పరిహారం చెల్లిస్తామని అప్పట్లోనే ఒడిశా సర్కార్ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ.. ఒడిశా నిరాకరించడంతో జంఝావతి ప్రాజెక్టు ఫలాలను ముందస్తుగా అందించడానికి కాంక్రీట్ డ్యామ్ స్థానంలో రబ్బర్ డ్యామ్ను నిర్మించి 2006 జనవరి 1న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జాతికి అంకితం చేశారు. అప్పట్లో తొమ్మిది వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించారు. ► ముంపునకు గురయ్యే భూమిని సేకరించి ఇవ్వడానికి ఒడిశా సర్కార్ను ఒప్పించడం ద్వారా రబ్బర్ డ్యామ్ స్థానంలో శాశ్వతమైన కాంక్రీట్ డ్యామ్ను నిర్మించి విజయనగరం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. నేరడితో ఇరు రాష్ట్రాలు సస్యశ్యామలం.. ► వంశధార ప్రాజెక్టు ఫేజ్–2 స్టేజ్–2 ద్వారా 2.45 లక్షల ఎకరాలకు నీళ్లందించే పనులను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో చేపట్టారు. నేరడి బ్యారేజీకి ఒడిశా సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయకట్టు రైతులకు ముందస్తుగా ఫలాలను అందించడానికి కాట్రగడ్డ వద్ద సైడ్ వియర్ నిర్మించి వంశధార జలాలను మళ్లించేలా పనులు చేపట్టారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం వంశధార ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. ► జల వివాదాలకు చరమగీతం పాడుతూ ఈ ఏడాది జూన్ 23న కేంద్రానికి వంశధార ట్రిబ్యునల్ తుది నివేదిక అందజేసింది. శ్రీకాకుళం జిల్లాలో నేరడి వద్ద వంశధారపై బ్యారేజీ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. నేరడి బ్యారేజీ వద్ద లభ్యమయ్యే 115 టీఎంసీల్లో రెండు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేసింది. నేరడి బ్యారేజీతో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని సేకరించి ఏపీ ప్రభుత్వానికి అందజేయాలని ఒడిశా సర్కార్ను ఆదేశించింది. నేరడి బ్యారేజీ కుడి వైపున కాలువ ద్వారా రోజూ ఎనిమిది వేల క్యూసెక్కులు వాడుకోవడానికి ఏపీ సర్కార్కు అనుమతి ఇచ్చింది. ఎడమ వైపున నీటిని వాడుకోవడానికి ఒడిశాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో భరించాలని ఆదేశించింది. ఈ బ్యారేజీ పూర్తయితే శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు ఆయకట్టులో రెండు పంటలకు, ఒడిశాలో వెనుకబడిన ప్రాంతాలకు నీళ్లందించి సస్యశ్యామలం చేయవచ్చు. ► రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే ఈ బ్యారేజీ నిర్మాణానికి ఒడిశాను ఒప్పించే దిశగా సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. పోలవరంలో నీటి నిల్వే లక్ష్యంగా.. ► పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేసినా ముంపు ప్రభావం తమ భూభాగంలో పడకుండా చూడాలని 2007 ఏప్రిల్ 3న అంతర్రాష్ట్ర సమావేశంలో ఒడిశా, ఛత్తీస్గఢ్ కోరాయి. ► ఆంధ్రప్రదేశ్, నాటి మధ్యప్రదేశ్, ఒడిశా మధ్య 1980 ఏప్రిల్ 2న కుదిరిన ఒప్పందం ప్రకారం పోలవరం ముంపు ప్రభావం లేకుండా సీలేరు, శబరి నదులకు కరకట్టలు నిర్మించాలని గోదావరి ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. ► ట్రిబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం ఒడిశాలో సీలేరుపై 12 కి.మీ, శబరిపై 18.2 కి.మీ. వెరసి 30.2 కి.మీ. పొడవున సగటున 50 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల ఎత్తుతో కరకట్టలు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు తాజా ధరల ప్రకారం రూ.378.696 కోట్లు వ్యయం కానుందని అంచనా. ఇదే రీతిలో ఛత్తీస్గఢ్లో శబరిపై 25.19 కి.మీ.ల పొడవున, ఇతర వాగులపై 3.93 వెరసి 29.12 కి.మీ. పొడవున సగటున 50 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల ఎత్తుతో కరకట్టల నిర్మాణానికి రూ.332.30 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ► కరకట్టల నిర్మాణానికి పర్యావరణ అనుమతి కోసం ఒడిశాలోని మల్కనగరి, ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ సదస్సులు నిర్వహించాలని 2005 నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు లేఖలు రాసినా ప్రయోజనం కానరాలేదు. ► పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేసే దిశగా సీఎం వైఎస్ జగన్ పనులను వేగవంతం చేశారు. గోదావరిలో వరద ప్రవాహం తగ్గగానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్యన ఎర్త్ కమ్ రాక్ ఫిల్(ఈసీఆర్ఎఫ్) డ్యామ్ నిర్మాణాన్ని చేపట్టి 2022 నాటికి పూర్తి చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలంటే ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ముంపు సమస్యను పరిష్కరించాలి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది పోలవరంలో నీటిని నిల్వ చేయడానికి మార్గం సుగమం చేసేందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో సీఎం జగన్ చర్చించనున్నారు. -
రబీకి నిండుగా నీరు
సాక్షి, అమరావతి: విస్తారంగా వర్షాలు కురవడంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండుగా ఉన్నాయి. గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా నీరు సమృద్ధిగా ఉంది. ఖరీఫ్ పంటలకు పూర్తిస్థాయిలో నీరందించిన రాష్ట్ర ప్రభుత్వం.. రబీకి కూడా నీరందించేందుకు సిద్ధమవుతోంది. 2019, 2020 తరహాలోనే యాజమాన్య పద్ధతుల ద్వారా నీరందించనుంది. తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టుకు ప్రయోజనం కలిగేలా జలవనరుల శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా గోదావరి, కృష్ణా, నాగావళి, వంశధార నదులు పోటీ పడి ప్రవహించాయి. వర్షాఛాయ ప్రాంతమైన పెన్నా నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్)లో కూడా సమృద్ధిగా వర్షాలు కురవడంతో పెన్నమ్మ కూడా పరవళ్లు తొక్కింది. దాంతో ఖరీఫ్ పంటలకు సమృద్ధిగా నీళ్లందించారు. ఇప్పటికీ వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టుల్లో గరిష్ఠ స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి. అందువల్ల రబీ పంటలకూ సమృద్ధిగా నీటిని సరఫరా చేస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. మూడు డెల్టాలతోపాటు ఇతర ఆయకట్టులోనూ.. గోదావరి డెల్టాలో ఏటా రబీ పంటలకు నీటిని సరఫరా చేస్తారు. కృష్ణా డెల్టాలో 2019లో తొలి సారిగా రబీకి ప్రభుత్వం అధికారికంగా నీటిని విడుదల చేసింది. గతేడాది కూడా దాన్ని కొనసాగించింది. ఈ ఏడాదీ కృష్ణా డెల్టాలో రబీకి నీళ్లిచ్చేందుకు కసరత్తు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో కండలేరు, సోమశిల రిజర్వాయర్లలో నీటి నిల్వలు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. దీంతో పెన్నా డెల్టాలో కూడా పూర్తి స్థాయిలో రబీకి నీళ్లందించనుంది. వంశధారలో గతేడాది తరహాలోనే నీటి లభ్యత ఆధారంగా ఈ ఏడాదీ సాగు నీరిచ్చేందుకు చర్యలు చేపట్టింది. తుంగభద్రలోనూ వరద కొనసాగుతుండటంతో హెచ్చెల్సీ (ఎగువ ప్రధాన కాలువ) ఆయకట్టులో నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. నీటితో కళకళలాడుతున్న ప్రకాశం బ్యారేజీ అవకాశం ఉన్న ప్రతి ప్రాజెక్టులోనూ నీటి విడుదల వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులు నిండటంతో ఖరీఫ్, రబీల్లో 2019, 2020లలో కోటి ఎకరాల చొప్పున ఆయకట్టుకు నీళ్లందించాం. ఈ ఏడాదీ అదే రీతిలో ఖరీఫ్లో నీళ్లందించాం. యాజమాన్య పద్ధతుల ద్వారా ఆన్ అండ్ ఆఫ్ విధానంలో నీటి వృథాకు అడ్డుకట్ట వేసి.. రబీలోనూ అధిక ఆయకట్టుకు నీళ్లందించి.. రైతులకు ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు రబీలో అవకాశం ఉన్న ప్రతి ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నాం. – సి.నారాయణరెడ్డి, జలవనరుల శాఖ ఈఎన్సీ -
రేపట్నుంచి బోర్డు చేతుల్లోకి
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు చరమగీతం పాడే దిశగా కృష్ణా బోర్డు చర్యలను వేగవంతం చేసింది. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను గురువారం నుంచి అమలు చేయడానికి సిద్ధమైంది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో 2 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లపై రేపటి నుంచి (గురువారం) ఇక కృష్ణా బోర్డుదే పెత్తనం. ఈ ప్రాజెక్టులతో పాటు వాటిపై ఉన్న 16 అవుట్లెట్లను కూడా పరిధిలోకి తీసుకోవాలని కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రెండు రాష్ట్రాల అధికారులు ఆమోదించారు. ఏపీ భూభాగంలోని ఆరు అవుట్లెట్లను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు చెప్పారు. తెలంగాణ భూభాగంలోని పది అవుట్లెట్లను స్వాధీనం చేయడంపై ప్రభుత్వంతో సంప్రదించి తెలియచేస్తామని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ పేర్కొన్నారు. 16 అవుట్లెట్లను స్వాధీనం చేస్తూ ఉత్తర్వులు ఇస్తే బోర్డు పరిధిలోకి తీసుకుని గురువారం నుంచే నిర్వహించడం ద్వారా గెజిట్ నోటిఫికేషన్ అమలుకు శ్రీకారం చుడతామని ఛైర్మన్ ఎంపీ సింగ్ స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు పరిధి ఖరారు, కేంద్ర జల్ శక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ అమలు అజెండాగా మంగళవారం హైదరాబాద్లో కృష్ణా బోర్డు ప్రత్యేకంగా సమావేశమైంది. ఏపీ తరఫున జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. నోటిఫికేషన్ అమలు వాయిదా కుదరదు.. కృష్ణా జలాల్లో తమ రాష్ట్రానికి న్యాయమైన వాటా కోసం కొత్త ట్రిబ్యునల్ నియమించాలని ఇప్పటికే కేంద్రం, కోర్టు ఎదుట ప్రతిపాదించామని, నీటి కేటాయింపులు తేలేదాక గెజిట్ నోటిఫికేషన్ అమలు వాయిదా వేయాలని తెలంగాణ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ సమావేశం ప్రారంభం కాగానే కోరగా బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ తోసిపుచ్చారు. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశాక అమలును నిలుపుదల చేయలేమని తేల్చి చెప్పారు. పరిధిపై వాడిగా చర్చ.. కృష్ణా బోర్డు పరిధిపై సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. సుంకేశుల బ్యారేజీ, ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) ఆనకట్ట, శ్రీశైలం, నాగార్జునసాగర్లపై ఉన్న 30 అవుట్లెట్లను పరిధిలోకి తీసుకోవాలని సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ సమావేశంలో ప్రవేశపెట్టారు. జలవిద్యుత్కేంద్రాలు మినహా శ్రీశైలం, నాగార్జునసాగర్లను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని రజత్కుమార్ చేసిన ప్రతిపాదనపై శ్యామలరావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ సీజన్ ప్రారంభంలో శ్రీశైలంలో కనీస నీటి మట్టానికి కంటే దిగువన, ఆపరేషన్ ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తూ తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించడంపై గతంలోనే పలుదఫాలు ఫిర్యాదు చేశామని బోర్డుకు గుర్తు చేశారు. తెలంగాణ సర్కార్ బోర్డు ఆదేశాలను ధిక్కరించి శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేయడం వల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి వందల టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిశాయని తెలిపారు. దీనిపై రజత్కుమార్ స్పందిస్తూ తెలంగాణలో విద్యుత్ అవసరాలు తీవ్రంగా ఉన్నాయని, శ్రీశైలం పూర్తిగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు అయినందున విద్యుదుత్పత్తిని ఆపడం కుదరదని పేర్కొనడంపై శ్యామలరావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దుందుడుకుగా విద్యుదుత్పత్తి చేస్తూ కృష్ణా జలాలను వృథాగా సముద్రంలో కలిసే పరిస్థితులను సృష్టిస్తుండటంపై తాము ఫిర్యాదు చేశామని, ఆ పరిస్థితిని నివారించేందుకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని గుర్తు చేశారు. తీర్మానానికి ఆమోదం రెండు రాష్ట్రాల అధికారుల వాదనలు విన్న అనంతరం శ్రీశైలం, నాగార్జునసాగర్లలో విద్యుదుత్పత్తి కేంద్రాలతోసహా అన్ని అవుట్లెట్లను బోర్డు పరిధిలోకి తీసుకుంటామని బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ ప్రకటించారు. శ్రీశైలంలో ఏడు, సాగర్లో తొమ్మిది వెరసి 16 అవుట్లెట్లను బోర్డు పరిధిలోకి తీసుకుంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా బోర్డులో సభ్యులైన రెండు రాష్ట్రాల అధికారులు ఆమోదించారు. ఈమేరకు ప్రాజెక్టులను బోర్డుకు స్వాధీనం చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని బోర్డు ఛైర్మన్ సూచించగా తక్షణమే జారీ చేస్తామని ఏపీ అధికారులు తెలిపారు. అవుట్లెట్లను బోర్డుకు స్వాధీనం చేయడంపై ప్రభుత్వంతో చర్చించి చెబుతామని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. మూణ్నెళ్ల తర్వాత పూర్తి స్థాయిలో స్వాధీనం.. బోర్డు పరిధిలోకి తీసుకున్న 16 అవుట్లెట్లను తాము జారీ చేసే మార్గదర్శకాలకు అనుగుణంగా అందులో పనిచేస్తున్న రెండు రాష్ట్రాల అధికారులు నిర్వహించాలని బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ పేర్కొన్నారు. బోర్డులో ఏపీ, తెలంగాణ అధికారులు ఎంత మంది ఉండాలి? ఏ ప్రాజెక్టుల్లో ఎవరిని నియమించాలి? అనే అంశాన్ని మూడు నెలల్లోగా తేల్చి ప్రాజెక్టులను, కార్యాలయాలను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. స్పష్టత వచ్చాకే సీడ్ మనీ జమ.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు బోర్డు నిర్వహణకు ఒక్కో రాష్ట్రం ఒకేసారి రూ.200 కోట్ల చొప్పున బోర్డు ఖాతాలో జమ చేయాలని ఛైర్మన్ ఎంపీ సింగ్ రెండు రాష్ట్రాల అధికారులను కోరారు. ఒకేసారి సీడ్ మనీగా డిపాజిట్ చేసే రూ.200 కోట్ల వినియోగంపై గెజిట్ నోటిఫికేషన్లో స్పష్టత లేదని రెండు రాష్ట్రాల అధికారులు బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కేంద్రం నుంచి స్పష్టత తీసుకోవాలని, ఆ తర్వాత అవసరాన్ని బట్టి నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్కేంద్రాలను స్వాధీనం చేసుకుంటేనే.. – జె.శ్యామలరావు, కార్యదర్శి, ఏపీ జలవనరుల శాఖ శ్రీశైలం, నాగార్జునసాగర్లలో 16 అవుట్లెట్లను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. తెలంగాణ సర్కార్ పరిధిలోని శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం, నాగార్జునసాగర్ విద్యుత్కేంద్రాలను బోర్డుకు స్వాధీనం చేస్తేనే పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాల, కుడి గట్టు విద్యుత్కేంద్రాలను బోర్డుకు అప్పగించేలా ఉత్తర్వులు జారీ చేస్తాం. తెలంగాణ విద్యుదుత్పత్తి కేంద్రాలను బోర్డు స్వాధీనం చేసుకుంటేనే రెండు రాష్ట్రాలకు ప్రయోజనం. లేదంటే గెజిట్ నోటిఫికేషన్కు అర్థం ఉండదు. విద్యుత్కేంద్రాల స్వాధీనంపై సర్కార్తో చర్చిస్తాం – రజత్కుమార్, తెలంగాణ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం, సాగర్ విద్యుత్కేంద్రాలతో సహా శ్రీశైలం, సాగర్లలో బోర్డు ప్రతిపాదించిన తెలంగాణ భూభాగంలోని పది అవుట్లెట్లను బోర్డుకు స్వాధీనం చేయడంపై సీఎం కె.చంద్రశేఖరావుతో చర్చించి నిర్ణయాన్ని వెల్లడిస్తాం. తెలంగాణలో విద్యుత్ అవసరాలు అధికంగా ఉన్నాయి. అందువల్ల మాకు జలవిద్యుదుత్పత్తి అత్యంత కీలకం. -
పెద్దవాగుతో మొదలు
సాక్షి, అమరావతి: గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) పరిధిపై ప్రాథమికంగా స్పష్టత వచ్చింది. రెండు రాష్ట్రాల అంగీకారం మేరకు ఈ నెల 14 నుంచి గోదావరి పరీవాహక ప్రాంతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన పెద్దవాగును తొలి దశలో బోర్డు తన పరిధిలోకి తీసుకోనుంది. శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకు గోదావరిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తీసుకోవాలన్న ఏపీ డిమాండ్పై తెలంగాణ సర్కార్ అభ్యంతరం తెలిపింది. దాంతో.. పరిస్థితులపై అధ్యయనం చేసి ఆ ప్రాజెక్టులను దశలవారీగా బోర్డు పరిధిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తామని బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చెప్పారు. పెద్దవాగు, సీలేరుపైనే కీలక చర్చ ప్రాజెక్టుల పరిధి, సిబ్బంది నియామకం, నిధులు తదితర అంశాలపై చర్చించేందుకు హైదరాబాద్లోని జలసౌధలో గోదావరి బోర్డు సోమవారం పూర్తిస్థాయి ప్రత్యేక సమావేశం నిర్వహించింది. బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన భేటీలో ఏపీ, తెలంగాణ జల వనరుల శాఖ కార్యదర్శులు శ్యామలరావు, రజత్కుమార్, ఈఎన్సీలు నారాయణరెడ్డి, మురళీధర్, నారాయణరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ఎస్సార్ఎస్పీ నుంచి సీతమ్మసాగర్ వరకు చేపట్టిన అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ అధికారులు పట్టుబట్టారు. ఎగువ రాష్ట్రమైన తెలంగాణ నుంచే గోదావరి ప్రవాహాలు దిగువకు రావాల్సి ఉందని, ఎగువన తెలంగాణ అనేక ప్రాజెక్టులు చేపట్టి నీటిని వినియోగించడంతో పాటు ఎప్పటికప్పుడు ఎత్తిపోతల ద్వారా చెరువులన్నింటినీ నింపుకుంటోందని తెలిపారు. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. పెద్దవాగు కింద ఉన్న 16 వేల ఎకరాల ఆయకట్టులో 13 వేల ఎకరాలు ఏపీలోనే ఉన్నందున ఆ ప్రాజెక్ట్ నిర్వహణ వ్యయంలో ఏపీ 85 శాతం చెల్లించాలని తెలంగాణ అధికారులు కోరారు. తొలి దశలో ప్రయోగాత్మకంగా పెద్దవాగును తమ పరిధిలోకి తెచ్చుకొని, దాని అమలు, నిర్వహణ బాధ్యతలు చూస్తామని బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశారు. ఏ రాష్ట్ర సిబ్బంది ఆ రాష్ట్ర పరిధిలోనే పనిచేస్తారని తెలిపారు. ప్రభుత్వ స్థాయిలో చర్చించి.. పెద్దవాగును బోర్డుకు అప్పగించేలా ఉత్తర్వులు జారీ చేస్తామని రెండు రాష్ట్రాల అధికారులు చెప్పారు. సీలేరు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తేవాలని తెలంగాణ అధికారులు కోరడంపై ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవహారంలో చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ జోక్యం చేసుకుంటూ.. ఈ అంశం కేంద్రం పరిధిలో ఉందని, దానిపై తర్వాత చర్చిద్దామని చెప్పారు. బడ్జెట్ ఉద్దేశం చెబితే సీడ్మనీ ఇస్తాం బోర్డులకు ఇరు రాష్ట్రాలు చెల్లించాల్సిన చెరో రూ.200 కోట్ల సీడ్మనీ అంశంపైనా చర్చ జరిగింది. కేవలం ఒక్క ప్రాజెక్టునే బోర్డు పరిధిలో ఉంచినప్పుడు రూ.200 కోట్ల నిధులు అవసరం ఏముంటుందని రెండు రాష్ట్రాల అధికారులు ప్రశ్నించారు. అదీగాక నిధుల విడుదల ఆర్థిక శాఖతో ముడిపడి ఉన్నందున బడ్జెట్ ఉద్దేశాలను బోర్డు తమకు చెబితే ఆర్థిక శాఖకు తెలియజేస్తామని వివరించారు. కొలిక్కిరాని కృష్ణా బోర్డు పరిధి తెలంగాణ జల వనరులు, జెన్కో అధికారుల దాటవేత ధోరణి వల్ల కృష్ణా బోర్డు పరిధి కొలిక్కి రాలేదు. గెజిట్ నోటిఫికేషన్లో షెడ్యూల్–2 ప్రాజెక్టుల వివరాలను సోమవారం ఇస్తామని ఆదివారం చెప్పిన తెలంగాణ అధికారులు ఆ తర్వాత మాట మార్చారు. దాంతో పరిధి, స్వభావంపై ముసాయిదా నివేదికను అసంపూర్తిగానే కృష్ణా బోర్డుకు సబ్ కమిటీ కన్వీనర్ ఆర్కే పిళ్లై అందించారు. పరిధిపై నిర్ణయాధికారాన్ని మంగళవారం జరిగే కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశానికి అప్పగించారు. ఆదివారం కృష్ణా బోర్డు సబ్ కమిటీ సమావేశంలో ప్రాజెక్టుల వివరాలను సోమవారం ఇస్తామని తెలంగాణ అధికారులు చెప్పడంతో సోమవారం రాత్రి సబ్ కమిటీ మరోసారి భేటీ అయ్యింది. కానీ.. తెలంగాణ అధికారులు ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. తెలంగాణ వాదనపై ఏపీ జల వనరుల శాఖ సీఈ శ్రీనివాసరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. శ్రీశైలం, సాగర్, పులిచింతలలో తెలంగాణ ఇష్టారాజ్యంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. ఏపీ హక్కులను కాలరాస్తుండటం వల్లే జల వివాదం ఉత్పన్నమైన అంశాన్ని ఎత్తిచూపారు. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను బోర్డు నియంత్రణలోకి తీసుకోకుండా ప్రాజెక్టులను మాత్రమే పరిధిలోకి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని తేల్చిచెప్పారు. ఈ వాదనతో సబ్కమిటీ కన్వీనర్ పిళ్లై ఏకీభవించారు. బోర్డు పరిధి, స్వరూపంపై బోర్డుకు నివేదిక ఇచ్చేందుకు సబ్కమిటీ రూపొందించిన ముసాయిదాపై తెలంగాణ అధికారులు సంతకం చేయడానికి నిరాకరించగా.. ఏపీ అధికారులు సంతకం చేశారు. -
‘వంశధార’పై తుది తీర్పు అమలు చేయండి
సాక్షి, అమరావతి: వంశధార నదీ జలాలపై ట్రిబ్యునల్ తుది తీర్పును అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీకి చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా మరోసారి లేఖ రాశారు. ‘వంశధార నదీ జలాలను ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు పంపిణీ చేస్తూ వీడబ్ల్యూడీటీ (వంశధార జల వివాదాల ట్రిబ్యునల్) నాలుగేళ్ల క్రితం 2017 సెప్టెంబర్ 13న తీర్పు ఇచ్చింది. 2021 జూన్ 21న తుది తీర్పు కూడా వెలువడింది. ఈ అవార్డు ఎప్పుడెప్పుడు అమల్లోకి వస్తుందా? నేరడి బ్యారేజీ నిర్మితమవుతుందా..? వంశధార జలాలతో తమ పొలాలు ఎప్పుడెప్పుడు సస్యశ్యామలమవుతాయా..? అని అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. నేరడి బ్యారేజీ నిర్మాణం కాకపోవడం వల్ల ఏటా వంశధార జలాలు వృథాగా కడలిపాలవుతున్నాయి. దయచేసి వీడబ్ల్యూడీటీ అవార్డును తక్షణమే అమలు చేసేలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయండి. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించండి’ అని లేఖలో సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశాల మధ్య వంశధార జలాల వివాదాన్ని పరిష్కరిస్తూ వీడబ్ల్యూడీటీ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరుతూ 2019 జూన్ 27న షెకావత్కు సీఎం జగన్ గతంలో లేఖ రాశారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల(ఐఎస్ఆర్డబ్ల్యూడీ) చట్టం–1956 సెక్షన్–6(1) ప్రకారం వీడబ్ల్యూడీటీ తుది తీర్పు అమలుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతూ మంగళవారం మరోసారి లేఖ రాశారు. సీఎం జగన్ లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. వంశధార జల వివాదాన్ని పరిష్కరిస్తూ వీడబ్ల్యూడీటీ తుది తీర్పును 2021 జూన్ 23న కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. వంశధారపై నేరడి బ్యారేజీని నిర్మించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తుది తీర్పు క్లాజ్–4 ద్వారా వీడబ్ల్యూడీటీ అనుమతి ఇచ్చింది. తుది తీర్పును అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచి ఏడాదిలోగా నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని ఒడిశా సర్కార్ సేకరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించాలని క్లాజ్–8 ద్వారా వీడబ్ల్యూడీటీ ఆదేశించింది. గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన రోజు నుంచి మూడు నెలల్లోగా తీర్పు అమలును పర్యవేక్షించడానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు నామినేట్ చేసిన వారితోపాటు నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి క్లాజ్–10 ద్వారా వీడబ్ల్యూడీటీ దిశానిర్దేశం చేసింది. పర్యవేక్షణ కమిటీ నిర్ణయాలు, మార్గదర్శకాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే పరిష్కరించడానికి సింగిల్ మెంబర్ రివ్యూ అథారిటీని ఏర్పాటు చేయాలని క్లాజ్–10(ఏ) ద్వారా కేంద్రాన్ని వీడబ్ల్యూడీటీ ఆదేశించింది. రివ్యూ అథారిటీగా కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు. రివ్యూ అథారిటీ నిర్ణయానికి రెండు రాష్ట్రాలు కట్టుబడాలి. శ్రీకాకుళం రైతులకు ఫలాలను అందించాలి.. వీడబ్ల్యూడీటీ తీర్పు వెలువడి నాలుగేళ్లు పూర్తయింది. తుది తీర్పు కూడా వచ్చింది. కానీ ఇప్పటిదాకా వీడబ్ల్యూడీటీ తీర్పును అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా రైతులకు నేరడి బ్యారేజీ ఫలాలను అందజేయడానికి వీలుగా తక్షణమే సెక్షన్–6(1) ప్రకారం వీడబ్ల్యూడీటీ తుది తీర్పును నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతున్నాం. తుది తీర్పు అమలు తీరును పరిశీలించేందుకు పర్యవేక్షణ కమిటీ, సింగిల్ మెంబర్ రివ్యూ అథారిటీని కూడా నియమించాలి. -
నేడు తుంగభద్ర బోర్డు భేటీ
సాక్షి, అమరావతి: తుంగభద్ర (టీబీ) జలాశయానికి ఎగువన కర్ణాటక సర్కార్ ప్రతిపాదిస్తున్న నవలి బ్యారేజీ నిర్మాణం, అక్రమ ఎత్తిపోతల పథకాల ద్వారా జలదోపిడీ అజెండాగా బుధవారం తుంగభద్ర బోర్డు సమావేశమవుతోంది. బోర్డు చైర్మన్ డీఎం రాయ్పురే అధ్యక్షతన వర్చువల్గా జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక జలవరులశాఖల ఈఎన్సీలు పాల్గొననున్నారు. టీబీ డ్యామ్లో పూడిక పేరుకుపోవడంతో నీటినిల్వ సామర్థ్యం 133 టీఎంసీల నుంచి 100.85 టీఎంసీలకు తగ్గిందని చెబుతోన్న కర్ణాటక సర్కార్, తగ్గిన సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసుకోవడానికి ఈ డ్యామ్కు ఎగువన నవలి వద్ద బ్యారేజీ నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ టీబీ బోర్డుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించింది. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటి వాటాల్లో దామాషా ఆధారంగా భరించాలని ప్రతిపాదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే బోర్డుకు లేఖ రాశాయి. ఈ అంశంపై చర్చించాలని కర్ణాటక సర్కార్ కోరిన నేపథ్యంలో దాన్ని బోర్డు చైర్మన్ డీఎం రాయ్పురే అజెండాలో చేర్చారు. టీబీ డ్యామ్ నీటినిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలు కాదని, 105 టీఎంసీలని ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైందని టీబీ బోర్డు పేర్కొంది. కానీ దీన్ని కర్ణాటక సర్కార్ తోసిపుచ్చుతోంది. టీబీ డ్యామ్ నీటినిల్వ సామర్థ్యంపై రీ సర్వే చేయాలని కోరింది. కర్ణాటక ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యతిరేకిస్తున్నాయి. టీబీ డ్యామ్ నీటినిల్వ సామర్థ్యాన్ని 105 టీఎంసీలుగా పరిగణించి నీటి కేటాయింపులు చేయాలని ఇప్పటికే బోర్డును కోరారు. బోర్డు సమావేశంలోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించనున్నాయి. టీబీ డ్యామ్లో ఎత్తిపోతల ద్వారా రెండు టీఎంసీలను తరలించడానికి మాత్రమే గతంలో బోర్డు నుంచి కర్ణాటక సర్కార్ అనుమతి తీసుకుంది. కానీ అక్రమ ఎత్తిపోతల ద్వారా అదనంగా 7.38 టీఎంసీలు తరలిస్తున్నట్లు బోర్డు జాయింట్ కమిటీ ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో తేల్చింది. ఈ నేపథ్యంలో కర్ణాటక సర్కార్పై చర్యలు తీసుకుని ఆ రాష్ట్ర వాటాలో కోత వేసేలా బోర్డుపై ఒత్తిడి చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించాయి. -
ఆగని కర్ణాటక జల దోపిడీ
కర్నూలు సిటీ: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర జలాశయం. దీని నుంచి జల చౌర్యానికి అలవాటు పడిన కర్ణాటక ఇబ్బడిముబ్బడిగా ఎత్తిపోతల పథకాలు, భారీ మోటార్లతో నీటి దోపిడీకి పాల్పడుతోంది. ఉమ్మడి రాష్ట్రాల ప్రాజెక్టుగా ఉన్నటువంటి తుంగభద్ర (టీబీ) డ్యాం నీటిని కేటాయించిన మేరకు అందించేందుకు బోర్డున్నా కూడా జల దోపిడీని అరికట్టలేకపోతోంది. ప్రాజెక్టు తమ భూభాగంలో ఉందనే ధీమాతో డ్యాం ఎగువన, దిగువన, నది పరీవాహక ప్రాంతాల్లో నుంచి ఇష్టానుసారంగా కర్ణాటక నీటిని దోపిడీ చేస్తోంది. ఈ దోపిడీపై గతేడాది అక్టోబర్ 22న టీబీ బోర్డు సమావేశంలో ఉమ్మడిగా తనిఖీలు చేయాలని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్లు చేసిన సూచన మేరకు జాయింట్ కమిటీ ఏర్పాటుచేశారు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 2 వరకు జాయింట్ కమిటీ తనిఖీలు నిర్వహించింది. ఈ కమిటీ విచారణలో కన్నడిగుల గుట్టురట్టు అయ్యింది. దీంతో కమిటీ ఇచ్చిన నివేదికను ఈ నెల 29న బెంగళూరులో జరుగనున్న టీబీ బోర్డు సమావేశంలో ప్రధాన అజెండాగా ప్రవేశ పెట్టనున్నారు. సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. నిర్మాణంలో ఉన్న చిలవరబండి లిఫ్ట్ అక్రమంగా లిఫ్ట్లు ఏర్పాటు తుంగభద్ర డ్యాం నీటిని దొంగచాటుగా కాజేసేందుకు టీబీ డ్యాం కుడి, ఎడమ వైపున మొత్తం 50 ఎత్తిపోతల పథకాలు ఉన్నట్లు జాయింట్ కమిటీ గుర్తించింది. ఇందులో కుడి వైపు 28, ఎడమ వైపు 22 ఉన్నాయి. -
6లోగా అదనపు సమాచారమివ్వండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీబేసిన్ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లపై ఇతర సమాచారంగానీ, పరిశీలనలనుగానీ తమకు అక్టోబర్ 6వ తేదీలోగా సమర్పించాలని తెలంగాణకు గోదావరి బోర్డు సూచించింది. ఈలోగా అందించిన సమాచారం మేరకే ప్రాజెక్టుల అనుమతుల విషయమై ముందుకు వెళతామని, ఎలాంటి అదనపు సమాచారం ఇవ్వకుంటే తెలంగాణ తరఫున చెప్పడానికి అదనంగా ఏమీ లేదన్నట్లుగానే భావిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు రెండ్రోజుల కిందట బోర్డు సభ్యకార్యదర్శి బీపీ పాండే ఒక్కో ప్రాజెక్టుపై విడివిడిగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సీతారామ, తుపాకులగూడెం, చిన్న కాళేశ్వరం, మోదికుంటవాగు, చౌట్పల్లి హన్మంత్రెడ్డి ఎత్తిపోతల, చనాకా–కొరట ప్రాజెక్టుల డీనీఆర్లను తెలంగాణ ఇదివరకే సమర్పించగా, దీనిపై బోర్డు స్క్రూటినీ మొదలుపెట్టింది. ఒక్కో ప్రాజెక్టుకు కేటాయించిన నీరు, ప్రాజెక్టు వ్యయం, వృధ్ధిలోకి తెచ్చే ఆయకట్టుతోపాటు తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్న వివరాలను రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్లలో వివరించింది. అయితే సీతారామసహా కొన్ని ప్రాజెక్టులపై గోదావరి బోర్డు అదనపు సమాచారం కోరింది. సీతారామ ప్రాజెక్టు కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుకు నీటి లభ్యత తగ్గే అవకాశాలున్నాయా అంటూ పలు ప్రశ్నిలు సంధించినట్లు తెలిసింది. దీంతోపాటే చనాకా–కొరటకు సంబంధించి మహారాష్ట్రకు దక్కే జలాలు, ఆ ప్రాంతంలో ఆయకట్టు వివరాలను సేకరించినట్లుగా తెలిసింది. తాము కోరుతున్న సమాచారంతోపాటు ఇతరత్రా ఎలాంటి సమాచారాన్నైనా అక్టోబర్ 6లోగా తమకు అం దించాలని కోరింది. ఈ వివరాలను సైతం పరిశీలనలోకి తీసుకొని డీపీఆర్లను మదింపు చేస్తామని తెలిపింది. చనాకా–కొరటపై సీడబ్ల్యూసీకి ప్రజెంటేషన్ చనాకా–కొరట ప్రాజెక్టుపై శుక్రవారం హైదరాబాద్లోని కేంద్ర జలసంఘం ఇంజనీర్లకు ఆదిలాబాద్ సీఈ శ్రీనివాస్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బ్యారేజీ నిర్మాణం, ఇప్పటివరకు చేసిన పనులు, వ్యయం, భూసేకరణ, మహారాష్ట్ర సహకారం, తెలంగాణ, మహారాష్ట్రలో వృద్ధిలోకి వచ్చే ఆయకట్టు తదితరాలపై వివరణ ఇచ్చారు. 28న కృష్ణా బోర్డు సబ్ కమిటీ మరోమారు భేటీ గెజిట్ నోటిఫికేషన్ అంశాల అమలుపై చర్చించేందుకు కృష్ణాబోర్డు సబ్కమిటీ మంగళవారం మరోమారు భేటీ కానుంది. ప్రాజె క్టుల సమాచారం, సిబ్బంది, భద్రత వంటి అంశాలపై కమిటీ చర్చించనుంది. తెలంగాణ ఇప్పటికే కొంత సమాచారాన్ని బోర్డుకు అందించగా, మరికొంత సమాచారాన్ని మం గళవారం నాటి భేటీలో సమర్పించనుంది. -
పోలవరం ప్రాజెక్టు అంతర్రాష్ట్ర సమస్యలపై ముందడుగు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారంలో ముందడుగు పడింది. ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. జలాశయం ముంపు నుంచి తప్పించడానికి శబరి, సీలేరు నదులకు కరకట్టలు నిర్మించడానికి వీలుగా యుద్ధప్రాతిపదికన ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేసినప్పుడు బ్యాక్ వాటర్ ప్రభావం ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఏ మేరకు ఉంటుందో తేల్చడానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖల అధికారులు సభ్యులుగా జాయింట్ కమిటీని ఏర్పాటుచేస్తామని పేర్కొంది. ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ప్రజాభిప్రాయ సేకరణ చేసేవరకు పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయబోమని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో.. ప్రాజెక్టు పనుల నిలిపివేత ఉత్తర్వులను (స్టాప్ వర్క్ ఆర్డర్) తాత్కాలిక నిలుపుదల (అభయన్స్)లో పెట్టకుండా.. పూర్తిగా ఎత్తేసే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారంపై కేంద్ర జల్శక్తిశాఖ కార్యదర్శి పంకజ్కుమార్, కేంద్ర అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి రామేశ్వర్ప్రసాద్ గుప్తాల నేతృత్వంలో సోమవారం వర్చువల్గా ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, సీడబ్ల్యూసీ చైర్మన్ ఎస్.కె.హల్దార్, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ జలవనరులశాఖల కార్యదర్శులు జె.శ్యామలరావు, అనూగార్గ్, ఎన్.కె.అశ్వల్, ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరకట్టల నిర్మాణానికి సిద్ధం పోలవరంను 2022 నాటికి పూర్తి చేసేందుకు పనుల్ని వేగవంతం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీలేరు, శబరి నదుల్లో బ్యాక్ వాటర్ వల్ల ముంపు సమస్య ఏర్పడకుండా ఒడిశాలో రూ.378.696 కోట్లతో 30.2 కిలోమీటర్లు, ఛత్తీస్గఢ్లో రూ.332.3 కోట్లతో 29.12 కిలోమీటర్ల కరకట్టల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లు పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ చెప్పారు. ఇందుకోసం ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ఒడిశా, ఛత్తీస్గఢ్లను కోరుతూ 31 మార్లు ఏపీ ప్రభుత్వం, తాము లేఖలు రాశామని తెలిపారు. డిజైన్పై సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్ గోదావరిలో 500 ఏళ్లకు ఒకసారి గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని ఐఐటీ–రూర్కీ నివేదిక ఇచ్చిందని, కానీ 50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను నిర్మించారని ఒడిశా జలవనరులశాఖ కార్యదర్శి అనూగార్గ్ చెప్పారు. దీనివల్ల గరిష్ట వరద వచ్చినప్పుడు.. పోలవరం ప్రాజెక్టు నుంచి సీలేరు, శబరిల్లోకి వరద ఎగదన్ని ఒడిశాలో అధికభాగం ముంపునకు గురవుతుందన్నారు. 58 లక్షల క్యూసెక్కుల వరదను పరిగణనలోకి తీసుకుని ముంపు ప్రభావంపై అధ్యయనం చేసేవరకు ప్రాజెక్టు పనులను ఆపేయాలని కోరారు. దీనికి సీడబ్ల్యూసీ చైర్మన్ ఎస్.కె.హల్దార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరం భద్రత దృష్ట్యా.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మార్గదర్శకాల ప్రకారం 50 లక్షల క్యూసెక్కుల వరదనైనా సులభంగా దిగువకు విడుదల చేసేలా పోలవరం సిల్ప్ వే డిజైన్ను ఆమోదించామని చెప్పారు. ఈ అంశంలో సీడబ్యూసీదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. బ్యాక్ వాటర్ ప్రభావంపై మళ్లీ సర్వే చేయాలన్న అనూగార్గ్ ప్రతిపాదనను సీడబ్ల్యూసీ హైడ్రాలజీ విభాగం డైరెక్టర్ నిత్యానందరాయ్ తోసిపుచ్చారు. జాయింట్ కమిటీతో అధ్యయనం పోలవరం ప్రాజెక్టులో వచ్చే ఏడాది ఏ మేరకు నీటిని నిల్వ చేస్తారు.. దానివల్ల తమ రాష్ట్రాల్లో ముంపు ఉంటుందా? అని ఒడిశా, ఛత్తీస్గఢ్ అధికారులు ప్రశ్నించారు. దీనిపై ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు స్పందిస్తూ.. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం 2022లో 41.15 మీటర్ల మేర ప్రాజెక్టులో నీరు నిల్వ చేస్తామని, దీనివల్ల బ్యాక్ వాటర్ ముంపు ఉండదని చెప్పారు. అనంతరం కేంద్ర జల్శక్తిశాఖ కార్యదర్శి పంకజ్కుమార్ మాట్లాడుతూ గోదావరిలో 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల ముంపు ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో గుర్తించేందుకు జాయింట్ కమిటీతో సర్వే చేయిస్తామని చెప్పారు. సీడబ్ల్యూసీ నేతృత్వంలో పీపీఏ, మూడు రాష్ట్రాల జవనరులశాఖల అధికారులు సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సంప్రదింపుల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడంతోపాటు జాయింట్ సర్వేను పూర్తిచేయాలని ఆదేశించారు. ఈలోగా ముంపు ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన ప్రజాభిప్రాయ సేకరణచేసి ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఒడిశా, ఛత్తీస్గఢ్లను ఆదేశించారు. ఇందుకు ఆ రెండు రాష్ట్రాలు సమ్మతించాయి. -
సంపూర్ణంగా సహకరిస్తాం
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు సంపూర్ణ సహకారం అందించడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. నోటిఫికేషన్లో సవరణల ప్రతిపాదనలపై కేంద్ర జల్ శక్తి శాఖ స్పందన ఆధారంగా ముందుకెళ్తామని తెలిపాయి. బుధవారం హైదరాబాద్లో కృష్ణా బోర్డు సమావేశం ముగిశాక... కేంద్ర జల్శక్తి శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ అమలే అజెండాగా కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్, గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ల అధ్యక్షతన బోర్డులు ఉమ్మడిగా సమావేశమయ్యాయి. గెజిట్ నోటిఫికేషన్ షెడ్యూల్–1, 2, 3 లో పేర్కొన్న ప్రాజెక్టుల వివరాలను తక్షణమే అందజేయాలని రెండు రాష్ట్రాలను కోరాయి. గతనెల 3న జరిగిన సమన్వయ కమిటీ సమావే శానికి, 9న జరిగిన బోర్డుల ఉమ్మడి సమావేశా నికి గైర్హాజరైన తెలంగాణ అధికారులు ఉమ్మడి భేటీకి హాజరయ్యారు. కృష్ణానదిపై ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు లను బోర్డులు అధీనంలోకి తీసుకుని, నిర్వహిం చాలని ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శ్యామ లరావు సూచించారు. ఇతర ప్రాజెక్టుల్లో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కలను రోజువారీ సేకరించి.. వాటా కింద లెక్కించాలని ప్రతిపాదించారు. దీనివల్ల బోర్డులపై భారం తగ్గుతుందన్నారు. తెలంగాణ అధికారులు కూడా ఇదేరీతిలో స్పందించారు. నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం అన్ని ప్రాజెక్టుల వివరాలు అందజేయాలని, అభ్యంతరాలుంటే కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని బోర్డుల చైర్మన్లు సూచించారు. నోటిఫికేషన్లో సవరణలు చేయాలని కేంద్ర జల్శక్తి శాఖను కోరినట్లు రెండు రాష్ట్రాల అధికారులు వివరించారు. కృష్ణా బేసిన్లో విద్యుదుత్పత్తి కేంద్రాలపై చర్చించాలని ఏపీ అధికారులు పట్టుబట్టగా.. తెలంగాణ అధికారు లు అభ్యంతరం తెలిపారు. కృష్ణాజలాల తరహా లోనే ఉత్పత్తయ్యే విద్యుత్లో 66 శాతాన్ని ఏపీకి కేటాయించాలని అధికారులు కోరారు. సాగర్ కుడికాలువ, టెయిల్పాండ్, పులిచింతల విద్యు త్ కేంద్రాల్లో ఉత్పత్తయ్యే విద్యుత్ను ఏపీకే కేటా యించాలని, సాగర్ ఎడమకాలువ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్ను దామాషా పద్ధతిలో పంపిణీ చేయాలని ఏపీ అధికారులు కోరారు. ఈ ప్రతిపాదనలపై తెలంగాణ అధికా రులు అభ్యంతరం తెలిపారు. దీంతో వాటిపై మరో సమావేశంలో చర్చిద్దామని కృష్ణా బోర్డు చైర్మన్ సూచించారు. ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలతో సంబంధంలేని ప్రకాశం బ్యారేజీ కాలువల వ్యవస్థను కృష్ణా బోర్డు, ధవళేశ్వరం బ్యారేజీ కాలువల వ్యవస్థను గోదావరి బోర్డు పరిధి నుంచి మినహాయించాలని ఏపీ అధికా రులు కోరారు. రెండురాష్ట్రాల అధికారుల సూచనల మేరకు బోర్డుల పరిధి, స్వరూపాన్ని ఖరారు చేసేందుకు బోర్డు సభ్య కార్యదర్శి, నిపుణుడు, సభ్యుడు, రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర విభాగాల సీఈలు, జెన్కో సీఈల నేతృత్వంలో సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. -
ఏపీకి 66.. తెలంగాణకు 34
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాల పరిష్కారంలో బోర్డు కొంత ముందడుగు వేసింది. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేయాలన్న తెలంగాణ సర్కార్ ప్రతిపాదనను తోసిపుచ్చింది. గత నాలుగేళ్ల తరహాలోనే చిన్న నీటివనరుల విభాగంలో వినియోగం, ఆవిరి నష్టాలు, కృష్ణా డెల్టాకు మళ్లించిన గోదావరి జలాలతో నిమిత్తం లేకుండా కృష్ణా జలాలను 66 : 34 నిష్పత్తిలో రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తామని తేల్చి చెప్పింది. ఏ నీటి సంవత్సరం లెక్కలు అదే ఏడాదితో ముగుస్తాయని, కోటాలో మిగిలిన నీటిని క్యారీ ఓవర్గానే పరిగణించాలన్న ఆంధ్రప్రదేశ్ వాదనతో కృష్ణా బోర్డు ఏకీభవించింది. క్యారీ ఓవర్ జలాలపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని తెలిపింది. కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్లోని జలసౌధలో బోర్డు 14వ సర్వ సభ్య సమావేశం సుమారు ఐదు గంటలు రెండు విడతలుగా సుదీర్ఘంగా జరిగింది. మళ్లించిన వరద జలాలు వేరుగా లెక్కింపు.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లు ఎత్తివేసి ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నప్పుడు రెండు రాష్ట్రాల్లో ఎవరు వరద జలాలను మళ్లించినా లెక్కలోకి తీసుకోకూడదన్న ఏపీ ప్రతిపాదనతో బోర్డు ఏకీభవించింది. మళ్లించిన వరద జలాలను వాటా కింద కాకుండా వేరుగా లెక్కిస్తామని పేర్కొంది. సాగర్, కృష్ణా డెల్టాల్లో సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే బోర్డు కేటాయించిన నీటిని శ్రీశైలం నుంచి 66 : 34 నిష్పత్తిలో వాడుకుంటూ రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేయాలన్న ఏపీ వాదనతో కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఏకీభవించారు. బోర్డు, జల్ శక్తి శాఖ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ దిగువన సాగు, తాగునీటి అవసరాలు లేకున్నా శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి చేయటాన్ని ప్రశ్నించారు. అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ సర్కార్ను కట్టడిచేయడంతోపాటు జరిమానా వి«ధించాలని ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి పట్టుబట్టడంతో తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్లు సమావేశం నుంచి వాకౌట్ చేసి తర్వాత మళ్లీ భేటీలో పాల్గొన్నారు. 70 శాతం వాటాకు ఏపీ పట్టు కృష్ణా జలాలను చెరి సగం పంపిణీ చేయాలని తెలంగాణ కోరడంపై ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. చిన్న నీటివనరుల విభాగంలో 89.15 టీఎంసీల కేటాయింపు ఉంటే తెలంగాణ సర్కార్ 175 టీఎంసీలను వాడుకుంటోందని, వాటిని పరిగణనలోకి తీసుకుని ఏపీకి కృష్ణా జలాల్లో 70 శాతం వాటా కేటాయించాలని ఈఎన్సీ నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు వరద జలాలను వాడుకునే స్వేచ్ఛను బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిందని గుర్తు చేస్తూ వాటిని వాటా కింద కలపకూడదని ఏపీ అధికారులు చేసిన డిమాండ్తో కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఏకీభవించారు. వరద జలాలను వాడుకునే స్వేచ్ఛ రెండు రాష్ట్రాలకు ఉందని స్పష్టం చేశారు. జరిమానా విధించాల్సిందే.. నీటి సంవత్సరం ప్రారంభం నుంచే శ్రీశైలంలో కనీస మట్టానికి దిగువనే బోర్డు అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేయటాన్ని పలుదఫాలు బోర్డు దృష్టికి తెచ్చామని ఏపీ అధికారులు గుర్తు చేశారు. వాటా జలాలను ఆంధ్రప్రదేశ్కు దక్కకుండా చేయడానికే తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేస్తోందని, నీళ్లు వృథాగా సముద్రంలో కలిసే పరిస్థితిని సృష్టించిందన్నారు. దీనిపై కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఏకీభవించారు. సాగర్, కృష్ణా డెల్టాలో సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడే బోర్డు కేటాయించిన నీటిని 66:34 నిష్పత్తిలో వాడుకుం టూ రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి చేయాలని తేల్చిచెప్పారు. ఎడమగట్టు కేంద్రంలో నిరంతరా యంగా విద్యుదుత్పత్తి వల్ల నీటి మట్టం అడుగంటి దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లందించలేని దుస్థితి నెలకొందని, చెన్నైకి తాగు నీరు సరఫరా చేయలేని పరిస్థితి ఉత్పన్నమైందని ఏపీ అధికారులు పేర్కొన్నారు. విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణ సర్కార్ను కట్టడి చేయడం తోపాటు జరిమానా విధించాలని పట్టుబట్టారు. విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లే.. కృష్ణా నదిపై అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్లను ఇవ్వాలని బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ రెండు రాష్ట్రాల అధికారులను కోరారు. ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్ను అందచేశామని ఏపీ అధికారులు గుర్తు చేశారు. గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినవేనని, విభజన చట్టం 11వ షెడ్యూల్ ద్వారా వాటిని కేంద్రం ఆమోదించి పూర్తి చేయడానికి అనుమతి ఇచ్చిందన్నారు. వాటిని అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొనడమంటే విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కేంద్ర జల్శక్తిశాఖ దృష్టికి తేవాలని బోర్డు ఛైర్మన్ సూచించగా ఇప్పటికే నివేదించినట్లు ఏపీ అధికారులు తెలిపారు. తెలంగాణ సర్కార్ అనుమతి లేకుండా చేప ట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, భక్త రామదాస, తుమ్మిళ్ల, నెట్టెంపాడు(సామర్థ్యం పెంపు), కల్వకుర్తి (సామర్థ్యం పెంపు), ఎస్సెల్బీసీ, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టులను నిలిపేసేలా చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేశారు. అనుమతి లేని ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వాలని తెలంగాణ అధికారులను బోర్డు చైర్మన్ ఆదేశించారు. -
‘శ్రీశైలం’లో నీటి నిల్వ సామర్థ్యం ఎంత?
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యాన్ని తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జలాశయంలో డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) విధానంలో బ్యాథమెట్రిక్ సర్వే చేయడం ద్వారా ఏ మట్టంలో.. ఎంత నీరు నిల్వ ఉంటుందన్నది తేల్చే పనులను ముంబైకి చెందిన ‘జియో సర్వీసెస్’ మారిటైమ్ లిమిటెడ్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ శుక్రవారం సర్వే పనులు ప్రారంభించింది. జలాశయం జల విస్తరణ ప్రాంతం 616 చదరపు కిలోమీటర్లు. బెడ్ లెవల్ సగటున 500 మీటర్లు. పూర్తి నీటిమట్టం 885 అడుగులు. జలాశయం జల విస్తరణ ప్రాంతంలో బెడ్ లెవల్ నుంచి 885 అడుగుల వరకు.. ఏ మట్టం వద్ద ఎంత నీరు నిల్వ ఉంటుదన్నది పడవల ద్వారా ఏడీసీపీ (అకౌస్టిక్ డాప్లర్ కరంట్ ప్రొఫైలర్) పరికరాన్ని ఉపయోగించి.. బ్యాథమెట్రిక్ సర్వే ద్వారా తేల్చుతామని హైడ్రాలజీ విభాగం సీఈ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. శ్రీశైలం జలాశయాన్ని నిర్మించినప్పుడు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలు. 2001–02లో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 264 టీఎంసీలేనని తన సర్వే ద్వారా తేల్చింది. భూమి కోతతో కొట్టుకొస్తున్న పూడిక నదీ పరివాహక ప్రాంతంలో అడవులను నరికేయడం వల్ల భూమి కోతకు గురై.. వరదతో పాటు మట్టి కొట్టుకొస్తోంది. అందువల్లే శ్రీశైలం జలాశయంలో పూడిక భారీ ఎత్తున పేరుకుపోతోంది. ఇందు వల్లే నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని సీడబ్ల్యూసీ తేల్చింది. 2009–10లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యంపై మరో సర్వే చేసింది. ఆ సర్వేలో నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు తగ్గిందని తేలింది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ప్రతి పదేళ్లకు ఒకసారి నీటి నిల్వ సామర్థ్యంపై సర్వే చేయాలి. ఈ నేపథ్యంలో ఎన్హెచ్పీ (నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు)లో భాగంగా శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం తేల్చే పనులను జల వనరుల శాఖ అధికారులు చేపట్టారు. తాజాగా చేపట్టిన సర్వే 15 రోజుల్లో పూర్తవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. -
పోలవరం నిర్వాసితులకు వేగంగా పునరావాసం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్కుమార్ యాదవ్ ఆదేశించారు. మంగళవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆయన సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యామ్లో కుడి వైపున 96 మీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మించే పనులు చేపట్టామని, నెలాఖరులోగా రక్షిత స్థాయికి దిగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ఆలోగా ఎగువ కాఫర్ డ్యామ్ పనులు పూర్తవుతాయని మంత్రికి వివరించారు. ఆ తర్వాత రెండు కాఫర్ డ్యామ్ల మధ్య నిల్వ ఉన్న నీటిని తోడివేసి.. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) సూచనల మేరకు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు చేపట్టి..2022 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి అనిల్కుమార్..గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెలలో 5 వేల నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామని అధికారులు వివరించారు. పశ్చిమగోదావరి జిల్లాలో తాడ్వాయిలో పునరావాస కాలనీ నిర్మాణంలో జాప్యం జరుగుతుండటంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణమే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టులో రెండో టన్నెల్ పనులను వేగవంతం చేసి.. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. -
వేగంగా పోలవరం దిగువ కాఫర్ డ్యామ్ పనులు
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ పనులను ఇప్పటికే దాదాపు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం దిగువ కాఫర్ డ్యామ్ పనులను వేగవంతం చేసింది. దిగువ కాఫర్ డ్యామ్లో కుడి వైపున 96 మీటర్ల పొడవు, 1.2 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల లోతుతో డయా ఫ్రమ్ వాల్ (పునాది) నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థ మేఘా సోమవారం ప్రారంభించింది. నెలాఖరు నాటికి దిగువ కాఫర్ డ్యామ్ను రక్షిత స్థాయికి పూర్తి చేసి.. సెప్టెంబరులో కాఫర్ డ్యామ్ల మధ్య నిల్వ ఉన్న సుమారు 0.4 టీఎంసీల నీటిని బయటకు తోడే పనులు చేపట్టనుంది. నీటిని పూర్తిగా తోడివేశాక.. ప్రధాన డ్యామ్ అయిన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) పనులు చేపట్టి నిరంతరాయంగా చేయడం ద్వారా 2022 నాటికి పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేసేలా సీఎం వైఎస్ జగన్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. దాని అమలును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి.. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ ప్రణాళిక మేరకు గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వేను రికార్డు సమయంలో ప్రభుత్వం పూర్తి చేసింది. జల వనరుల శాఖాధికారులు, డయాఫ్రమ్ వాల్ పనులు జరుగుతున్న దృశ్యం కాఫర్ డ్యామ్లపై ప్రత్యేక దృష్టి పోలవరం ప్రాజెక్టులో 194.6 టీఎంసీలను నిల్వ చేసేది ప్రధాన డ్యామ్ అయిన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్లోనే. ఈ డ్యామ్ను గోదావరి నది గర్భంలో ఇసుక తిన్నెలపై 2,454 మీటర్ల పొడవున మూడు భాగాలుగా (గ్యాప్–1లో 564 మీటర్లు, గ్యాప్–2లో 1,750 మీటర్ల మేర ఈసీఆర్ఎఫ్ను, గ్యాప్–3లో 140 మీటర్ల పొడవున కాంక్రీట్ డ్యామ్) నిర్మించాలి. ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి వీలుగా గోదావరి ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించేందుకు నదికి అడ్డంగా 2,480 మీటర్ల పొడవున 42.5 మీటర్ల ఎత్తుతో ఎగువ కాఫర్ డ్యామ్ను.. స్పిల్వే నుంచి దిగువకు విడుదల చేసిన నీరు గ్యాప్–2లో 1,750 మీటర్ల పొడువున నిర్మించే ఈసీఆర్ఎఫ్ వైపు ఎగదన్నకుండా 1,613 మీటర్ల పొడవున 30.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్ డ్యామ్ను నిర్మించాలి. ఇందులో ఎగువ కాఫర్ డ్యామ్ పనులను 40 మీటర్ల ఎత్తుతో పూర్తి చేశారు. ఈ పనులు నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. దిగువ కాఫర్ డ్యామ్కు పునాదిని జెట్ గ్రౌటింగ్ విధానంలో చేశారు. కుడి వైపున నేల మృదువుగా ఉండటం వల్ల 96 మీటర్ల పొడవున డయా ఫ్రమ్ వాల్ను నిర్మిస్తున్నారు. నెలాఖరు నాటికి దిగువ కాఫర్ డ్యామ్ పనులను రక్షిత స్థాయికి పూర్తి చేయనున్నారు. -
రికార్డు సమయంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు
సాక్షి, అమరావతి, సాక్షి, అమరావతి బ్యూరో, అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో గేటు విరిగిపోయిన రెండు రోజుల్లోనే దాని స్థానంలో శనివారం స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో నీటి నిల్వకు మార్గం సుగమం చేసి, రికార్డు సృష్టించారు. ప్రాజెక్టు గేటు విరిగిపోయాక.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత తక్కువ సమయంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసి, నీటి నిల్వను పునరుద్ధరించిన దాఖలాలు లేవని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని చెబుతున్నారు. సాగర్ నుంచి దిగువకు విడుదల చేస్తున్న జలాల్లో శనివారం రాత్రి 11 గంటలకు పులిచింతల ప్రాజెక్టులోకి 37,332 క్యూసెక్కులు చేరుతున్నాయి. విద్యుదుత్పత్తి ద్వారా 12,968 క్యూసెక్కులను తెలంగాణ ప్రభుత్వం దిగువకు విడుదల చేస్తోంది. స్టాప్ లాగ్ గేటు ఏర్పాటుతో ప్రాజెక్టులో నీటి మట్టం 129.19 అడుగుల్లో 6.4 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు గేట్లు అన్నీ మూసి వేశారు. కాగా, గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఎగువ నుంచి ప్రాజెక్టులోకి భారీ ఎత్తున వరద వస్తుండటంతో అంతే స్థాయిలో దిగువకు విడుదల చేసేందుకు 16వ గేటును ఎత్తే సమయంలో ట్రూనియన్ బీమ్ యాంకర్ యోక్ గడ్డర్లో సమస్య తలెత్తడంతో గేటు ఊడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, అధికారులను సీఎం ఆదేశించడంతో యుద్ధ ప్రాతిపదికన స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు పనులకు ఉపక్రమించారు. నిర్విరామ శ్రమతో ఫలితం 17 గేట్లు ఎత్తేసి.. దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో శనివారం తెల్లవారుజాముకు ప్రాజెక్టులో నీటి నిల్వను క్రస్ట్ లెవల్కు అంటే 3.66 టీఎంసీలకు తగ్గించారు. ఎగువ నుంచి 46 వేల క్యూసెక్కుల వరద వస్తున్నప్పటికీ లెక్క చేయకుండా శనివారం ఉదయం నుంచే ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పర్యవేక్షణలో బీకెమ్ ప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులు స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. స్టాప్ లాగ్స్ను క్రేన్ల ద్వారా సక్రమంగా బిగించేందుకు వైజాగ్కు చెందిన సీలైన్ ఆఫ్షోర్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన 10 మంది సభ్యుల బృందం నిర్విరామంగా శ్రమించింది. స్టాప్ లాగ్ను అమర్చుతున్న దృశ్యం విరిగిపోయిన 16వ గేటు వెనుక భాగంలో రెండు పియర్లకు ఏర్పాటు చేసిన రెయిలింగ్ ద్వారా స్పిల్ వే బ్రిడ్జిపై నుంచి గ్యాంట్రీ క్రేన్ ద్వారా తొలుత 17 మీటర్ల వెడల్పు, 1.5 మీటర్ల ఎత్తు, 28 టన్నుల బరువు ఉన్న ఎలిమెంటు (ఇనుప దిమ్మె)ను దించారు. దానిపై అంతే బరువున్న రెండో ఎలిమెంటును దించారు. అప్పటి నుంచే నీటి నిల్వ మొదలైంది. ఇలా ఎలిమెంట్లను ఒకదానిపై మరొకటి ఏర్పాటు చేస్తూ నీరు కిందకు రాకుండా రబ్బర్ సీళ్లు వేశారు. అర్ధరాత్రి చివరగా 23 టన్నుల బరువున్న 11వ ఎలిమెంటును దించారు. దాంతో 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో కూడిన స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఇది మిగతా గేట్ల తరహాలో ఎత్తడానికి, దించడానికి వీలుండదు. నీటి నిల్వకు దోహదం చేస్తుంది. పూర్తి గేటు ఏర్పాటుకు కసరత్తు విరిగిపోయిన పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు వరద ఉధృతికి కొట్టుకుపోయి, స్పిల్ వే నుంచి దాదాపు 750 మీటర్ల దూరంలో పడి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. గడ్డర్స్ ఆచూకీ లభించలేదు. ప్రవాహం తగ్గాక.. 250 టన్నుల బరువున్న గేటును వెలికితీసి, పరిశీలిస్తామని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తెలిపారు. పటిష్టంగా ఉంటే అదే గేటును బిగిస్తామని.. లేదంటే దాని స్థానంలో కొత్తగా గేటును తయారు చేస్తామని చెప్పారు. గేటు బిగించడానికి రెండు పియర్లకు ట్రూనియన్ బీమ్లు దెబ్బతిన్న నేపథ్యంలో వాటిని తొలగించి కొత్తగా నిర్మిస్తామన్నారు. ట్రూనియన్ బీమ్ యాంకర్లో గేట్ల ఆర్మ్ గడ్డర్లను అనుసంధానం చేయడానికి సెల్ఫ్ లూబ్రికెంట్ బుష్లను గతంలో జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నామని చెప్పారు. ఇప్పుడు అవి బాగుంటే వాటినే ఉపయోగిస్తామని.. లేదంటే జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో పూర్తి గేటును బిగించేందుకు రెండు నెలల సమయం పడుతుందన్నారు. స్టాప్ లాగ్ గేటు ద్వారా పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలు నిల్వ చేస్తామని, కృష్ణా డెల్టా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్ని ప్రధాన ప్రాజెక్టులను పరిశీలిస్తాం పులిచింతల ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాజెక్టులను పరిశీలిస్తామని జల వనరుల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి తెలిపారు. శనివారం ఆయన ప్రాజెక్ట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యయన కమిటీ వేయాలని ఆదేశించారని చెప్పారు. ఈ కమిటీ వారం రోజుల్లోగా నివేదిక ఇస్తుందన్నారు. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవన్నారు. కాగా, స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు పనులను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను శనివారం సందర్శించారు. -
యుద్ధప్రాతిపదికన ‘గేటు’ పునరుద్ధరణ పనులు
సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట/అచ్చంపేట (పెదకూరపాడు): పులిచింతల ప్రాజెక్టులో ఎడమ వైపున ట్రూనియన్ బీమ్ విరిగిపోవడం వల్ల ఊడిపోయిన 16వ గేటు స్థానంలో యుద్ధప్రాతిపదికన స్టాప్ లాగ్ గేటును అమర్చేందుకు జల వనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. స్టాప్ లాగ్ గేటును దించేందుకు ముందస్తుగా చేపట్టాల్సిన పనులను ప్రాజెక్టు ఎస్ఈ రమేష్ పర్యవేక్షణలో బీకెమ్ సంస్థ నిపుణులు శుక్రవారం పూర్తి చేశారు. శనివారానికి ప్రాజెక్టులో నీటిమట్టం క్రస్ట్ లెవల్ (గేట్లు అమర్చే స్థాయి)కు చేరగానే.. స్టాప్ లాగ్ గేటును దించుతామని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఈ గేటును 11 ఎలిమెంట్స్(భాగాలు)గా కిందికి దించుతారు. ఊడిపోయిన 16వ గేటు వెనుక భాగంలో పియర్స్కు అమర్చిన రెయిలింగ్ ద్వారా 17 మీటర్ల వెడల్పు, సుమారు 1.68 మీటర్ల పొడవు గల 28 టన్నుల ఎలిమెంట్ను తొలుత దించుతారు. దానిపై అంతే వెడల్పు, ఎత్తుతో కూడిన 26 టన్నుల బరువైన ఎలిమెంట్ దించుతారు. వాటికి ముందే అమర్చిన రబ్బర్ సీల్స్తో ఆ రెండు ఎలిమెంట్లను అతికిస్తారు. ఇలా 11 ఎలిమెంట్లను ఒక దానిపై ఒకటి దించి.. అతికించడం ద్వారా 18.5 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో కూడిన స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేస్తారు. ఈ గేటు బరువు సుమారు 240 టన్నుల బరువు ఉంటుంది. పూర్తి స్థాయి గేటు ఎత్తు, వెడల్పు స్థాయిలో ఈ స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేయడం ద్వారా జలాశయంలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడానికి మార్గం సుగమం చేస్తారు. నేడు క్రస్ట్ లెవల్ స్థాయికి నీటి మట్టం పులిచింతల ప్రాజెక్టులో శుక్రవారం రాత్రి 8 గంటలకు 40.9 మీటర్ల స్థాయిలో 7.7142 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 31,825 క్యూసెక్కులు చేరుతుండగా.. 17 గేట్లను 6 మీటర్లు, ఒక గేటును 2.5 మీటర్ల మేర తెరిచి 2,44,406 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇదే రీతిలో దిగువకు నీటిని విడుదల చేస్తే శనివారం ఉదయానికి ప్రాజెక్టులో నీటి నిల్వ క్రస్ట్ లెవల్ 36.34 మీటర్లకు చేరుతుంది. అప్పుడు ప్రాజెక్టులో 3.61 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంటుంది. ఎగువ నుంచి స్థిరంగా 31 వేల క్యూసెక్కుల వరద వచ్చినా.. సులభంగా స్టాప్ లాగ్ గేటును దించుతామని అధికార వర్గాలు తెలిపాయి. స్టాప్ లాగ్ గేటును దించే ప్రక్రియ శనివారం సాయంత్రానికి పూర్తి చేస్తామని స్పష్టం చేశాయి. పులిచింతల ప్రాజెక్టులో స్టాప్ లాగ్ గేటు పెట్టడానికి జరుగుతున్న పనులు ఆ నివేదికను టీడీపీ బుట్టదాఖలు చేయడంతోనే.. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడానికి ముందు 2015లో జనవరి 5న స్పెషల్ డ్యామ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ టీమ్ (ఎస్డీఎస్ఐటీ) ఇచ్చిన నివేదికను అప్పటి టీడీపీ సర్కార్ బుట్టదాఖలు చేయడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసేందుకు ప్రాజెక్టులో నీటిని ఖాళీ చేసినా.. కొద్ది రోజుల్లోనే పూర్తి సామర్థ్యం మేరకు 45.77 టీఎంసీలను నిల్వ చేసి కృష్ణా డెల్టాకు సమృద్ధిగా నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలావుండగా.. ప్రాజెక్టుపై ఈ నెల 8, 9 తేదీలలో వాహనాలు, ప్రజల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు తహసీల్దార్ ఎం.క్షమారాణి తెలిపారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రాజెక్ట్ వద్ద 144వ సెక్షన్ విధిస్తున్నట్టు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే కఠిన చర్యలు : మంత్రి పేర్ని నాని పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడం వెనుక ఎవరైనా కావాలని నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. ఈ ప్రాజెక్టు గేట్లను 2013–14లో అమర్చారని గుర్తు చేశారు. వెలగపూడిలో సచివాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రివర్గ సమావేశంలో పులిచింతల ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోయిన విషయంపై చర్చించామన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరుపుతోందన్నారు. పులిచింతల ప్రాజెక్టులో హైడ్రాలిక్ గేట్లు అమర్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారని తెలిపారు. యోక్ గడ్డర్ లోపం వల్లే... పులిచింతల నుంచి వరదను దిగువకు విడుదల చేసేందుకు 16వ గేటును ఎత్తే సమయంలో ఎడమ ట్రూనియన్ బీమ్లో గేటును అనుసంధానం చేసిన యోక్ గడ్డర్లో 25 మిల్లీమీటర్ల మందంతో కూడిన రేకు(ఇనుప ప్లేట్)పై అధిక ఒత్తిడి పడి చితికిపోయింది. దాంతో యోక్ గడ్డర్ విరిగిపోయింది. దీనివల్ల ట్రూనియన్ బీమ్ పగిలిపోవడంతో గేటు ఊడిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయిందని జల వనరుల శాఖ అధికారులు, బీకెమ్ సంస్థ నిపుణులు తేల్చారు. ఇక్కడున్న ఒక్కో గేటు బరువు 250 టన్నులు. రెండు పియర్ల(కాంక్రీట్ దిమ్మెల) మధ్య ట్రూనియన్ బీమ్లకు అమర్చిన యాంకర్లో యోక్ గడ్డర్లను ఆర్మ్ గడ్డర్లతో అనుసంధానం చేయడం ద్వారా గేట్లను బిగిస్తారు. వరద ఉధృతి వల్ల 1,500 టన్నుల భారం పడినా.. గేట్లను సులభంగా ఎత్తేలా వాటిని అమర్చారు. గేటు ఎత్తే సమయంలో 2,500 టన్నుల భారం పడినా యోక్ గడ్డర్ విరిగిపోయే అవకాశమే లేదని.. కానీ ఆ స్థాయిలో భారం పడకున్నా 16వ గేటు యోక్ గడ్డర్ విరిగిపోవడం ఆశ్చర్యంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. మరమ్మతుల కోసమే స్టాప్ లాగ్ గేటు పులిచింతల ప్రాజెక్టు స్పిల్ వే పొడవు 560.25 మీటర్లు, ఎడమ వైపు నాన్ ఓవర్ ఫ్లో డ్యామ్(ఎన్వోఎఫ్) పొడవు 232.75, కుడి వైపు ఎన్వోఎఫ్ పొడవు 141 మీటర్లు. మట్టి కట్ట పొడవు 355 మీటర్లు. ప్రాజెక్టు టాప్ బీమ్ లెవల్(టీబీఎం) 58.24 మీటర్లు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 53.54 మీటర్లు. కనీస నీటిమట్టం 42.67 మీటర్లు. స్పిల్ వేకు 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో 24 గేట్లను బిగించారు. అంటే, స్పిల్ వేకు 32.34 మీటర్ల నుంచి 50.84 మీటర్ల మధ్య వీటిని బిగించారు. వాటిని పూర్తి స్థాయిలో ఎత్తివేస్తే 20.37 లక్షల క్యూసెక్కుల(176 టీఎంసీల)ను ఒకేసారి దిగువకు వదిలేయవచ్చు. ఈ గేట్లలో ఎప్పుడైనా సమస్య ఉత్పన్నమైతే, వాటికి మరమ్మతులు చేయడానికి రెండు స్టాప్ లాగ్ గేట్లను ఏర్పాటు చేశారు. సమస్య ఉన్న గేటుకు ముందు భాగంలో స్టాప్ లాగ్ గేటును దించి.. గేటుకు మరమ్మతు చేస్తారు. ఆ తర్వాత స్టాప్ లాగ్ గేటును పైకి ఎత్తేస్తారు. ఆ తర్వాత 11 ఎలిమిమెంట్లను విడదీస్తారు. -
Polavaram Project: తొలకరికి పోలవరం తొలిఫలం
రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం ఉన్న ఊరు, ఇళ్లను త్యాగం చేస్తున్న నిర్వాసితుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా పునరావాసం కల్పించాలి. పునరావాస కాలనీల్లో నిర్వాసితులు జీవితాంతం నివాసం ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంత డబ్బు ఎక్కువ ఖర్చయినా సరే ఇళ్లను అత్యంత నాణ్యంగా నిర్మించండి. సమాంతరంగా మౌలిక సదుపాయాల కల్పన, రహదారులు పనులు పూర్తి చేయండి. వచ్చే నెలలో పునరావాస కాలనీలను పరిశీలిస్తా. – పోలవరం వద్ద సమీక్షలో సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: పోలవరం జలాశయంతోపాటు కుడి, ఎడమ కాలువ పనులను లైనింగ్తో సహా 2022 జూన్ నాటికి పూర్తి చేసి రైతులకు ప్రాజెక్టు ఫలాలను అందించాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో కేంద్రం నుంచి రూ.2,200 కోట్లు రావాల్సి ఉందన్నారు. అయినా సరే ప్రాజెక్టు పనులకు ఎక్కడా ఆటంకం కలగనివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులను ఇస్తోందని చెప్పారు. సహాయ, పునరావాస(ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ కింద నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు నిర్మిస్తున్న ఇళ్లు, మౌలిక సదుపాయాల పనులను అత్యంత నాణ్యంగా చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్ సోమవారం తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో నేరుగా పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని స్పిల్ వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్, జలవిద్యుత్కేంద్రం పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఏరియల్ సర్వే అనంతరం హెలిప్యాడ్ వద్ద సీఎం జగన్కు మంత్రులు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. హెలిపాడ్ వద్దనున్న వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆ తర్వాత ఇటీవలే పూర్తైన స్పిల్ వే వద్దకు చేరుకుని బ్రిడ్జిపైకి వెళ్లి స్వయంగా పనులను గమనించారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. పోలవరం పనుల పురోగతిని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు తదితరులు వివరించారు. రెండేళ్లలో పూర్తైనవి, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనుల గురించి వివరించారు. ఏరియల్ సర్వే, క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ముఖ్యమంత్రి జగన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్ సర్వే చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ యుద్ధప్రాతిపదికన పనులు.. పోలవరం స్పిల్ వే పనులను దాదాపుగా పూర్తి చేశామని అధికారులు ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. స్పిల్వే 48 గేట్లలో 42 గేట్లను ఇప్పటికే అమర్చామన్నారు. జర్మనీ నుంచి ఇటీవలే 14 హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లు వచ్చాయని, వరద తగ్గగానే మిగిలిన ఆరు గేట్లకు బిగిస్తామని చెప్పారు. ఎగువ కాఫర్ డ్యామ్లో ఖాళీలను పూర్తి చేసి 40 మీటర్ల ఎత్తుకు పూర్తి చేశామన్నారు. వాతావరణం అనుకూలిస్తే ఈ నెలాఖరుకు పూర్తి స్థాయిలో 42.5 మీటర్ల ఎత్తుకు ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేస్తామని చెప్పారు. దిగువ కాఫర్ డ్యామ్ పనులను వేగంగా చేస్తున్నామన్నారు. ఎర్త్కం రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) పనులపై సీఎం జగన్ ఆరా తీశారు. గత సర్కార్ ఎగువ కాఫర్ డ్యామ్లో ఖాళీ ప్రదేశాలను వదిలేయడం వల్ల వరద ఉద్ధృతికి ఈఎస్ఆర్ఎఫ్ పునాది డయాఫ్రమ్ వాల్లో కొంత భాగం దెబ్బతిందని, దాన్ని ఎలా బాగుచేయాలన్న దానిపై సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం), డీడీఆర్పీ(డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్)తో చర్చిస్తున్నామని అధికారులు తెలిపారు. సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ మార్గదర్శకాల మేరకు డయాఫ్రమ్ వాల్ను అత్యంత పటిష్టంగా మార్చి ఈసీఆర్ఎఫ్ పనులు చేపడతామన్నారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ పోలవరం జలాశయంతోపాటు అనుసంధానాలు, టన్నెళ్లు, కుడి, ఎడమ కాలువల పనులను లైనింగ్తో సహా 2022 జూన్ నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎడమ కాలువలో మిగిలిన తవ్వకం పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని, నిర్దేశించిన గడువులోగా అన్ని పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. పోలవరం పనులపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ఏదో కట్టాం కదా అన్నట్లుగా కుదరదు.. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద తొలిదశలో 90 గ్రామాలకుగానూ ఆగస్టు నాటికి 48 గ్రామాల నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘గతంలో ఆర్ అండ్ ఆర్ పనులపై దృష్టి పెట్టకుండా పూర్తిగా వదిలేశారు. మన ప్రభుత్వం వచ్చాక ఆర్ అండ్ ఆర్పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాం. పనులన్నీ పూర్తి నాణ్యతతో ఉండాలి. ఏదో కట్టాం కదా అన్నట్లుగా పునరావాస కాలనీలు కట్టకూడదు’ అని అధికారులకు స్పష్టం చేశారు. పునరావాస కాలనీలను కచ్చితంగా నాణ్యతతో నిర్మించాలన్నారు. ‘ఇంత పెద్దఎత్తున పునరావాస కాలనీలు కడుతున్నప్పుడు ఎక్కడో ఒకచోట అలసత్వం కనిపించే అవకాశాలుంటాయి. కానీ అలాంటి అలసత్వానికి తావు ఉండకూడదు, ఆర్ అండ్ ఆర్ పనుల్లో కచ్చితంగా నాణ్యత పాటించేలా ఒక అధికారిని నియమించండి. ఆ అధికారి ఇచ్చే ఫీడ్ బ్యాక్ను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. తప్పులు ఉన్నాయని చెప్పినప్పుడు కచ్చితంగా సరిదిద్దుకోవాలి’ అని అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ కాలనీలను వేగంగా నిర్మించి లక్ష్యాలను త్వరగా చేరుకోవాలనే ప్రయత్నంలో అక్కడక్కడా తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయని, అయితే అలాంటి సందర్భాల్లో వాటిని సరిదిద్దే ప్రయత్నాలు తప్పకుండా చేయాలని అధికారులకు సూచించారు. ఫొటో ఎగ్జిబిషన్లో పోలవరం పనుల పురోగతిని తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వాసితులకు ఇబ్బందులు తలెత్తకూడదు.. ‘ఆగస్టు నాటికి కొన్ని ఇళ్లను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గోదావరికి వరద వస్తే తగ్గేసరికి నవంబరు, డిసెంబర్ వరకూ పట్టే అవకాశాలు ఉంటాయి. ఈలోగా పునరావాస కాలనీలను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి’ అని అధికారులను సీఎం జగన్ అప్రమత్తం చేశారు. అప్పటిదాకా నిర్వాసితులకు ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన ప్రమాణాలతో పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి వాటిలోకి తరలించాలని సూచించారు. సమస్యలున్నా శరవేగంగా.. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని కేంద్రం సుమారు ఆర్నెళ్లుగా రీయింబర్స్ చేయలేదని ఈ సందర్భంగా అధికారులు తెలియచేయడంతో డబ్బులు సకాలంలో అందేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం నుంచి త్వరితగతిన బిల్లుల మంజూరుకు ఢిల్లీలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించినట్లు అధికారులు తెలిపారు. నిర్వాసితులకు జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధిపైనా దృష్టిపెట్టామన్నారు. నిర్వాసితుల్లో ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఉన్నవారికి తిరిగి భూములు ఇచ్చేందుకు భూమిని గుర్తించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. చాలా క్లిష్టమైన సమస్యలు ఉన్నప్పటికీ పనులు వేగంగా చేస్తున్నారని ఈ సందర్భంగా అధికారులను ముఖ్యమంత్రి ప్రశంసించారు. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు ఫలాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు.. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), జలవనరులశాఖ మంత్రి అనిల్కుమార్, రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, నీటిపారుదలశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, పోలవరం నిర్మాణ సంస్ధ ప్రతినిధులు పాల్గొన్నారు. -
రేపు పోలవరానికి సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేస్తారు. సోమవారం ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. 11.10 –12 గంటల మధ్య పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. 12 నుంచి ఒంటి గంట వరకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు. -
దేశంలో అత్యుత్తమ ఆకృతుల సంస్థ సీడీవో
సాక్షి, అమరావతి: దేశంలో అత్యుత్తమ ఆకృతుల సంస్థలో రాష్ట్ర కేంద్ర ఆకృతుల విభాగం (సీడీవో) నిలవడం రాష్ట్రానికే గర్వకారణమని జలవనరులశాఖ మంత్రి పి.అనిల్కుమార్యాదవ్ చెప్పారు. ఆయన గురువారం విజయవాడలోని సీడీవో కార్యాలయంలో డిజిటలైజ్డ్–సీడీవో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లను డిజిటలైజ్ చేసే కార్యక్రమాన్ని డిసెంబర్లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిష్టాత్మక పోలవరం జాతీయ ప్రాజెక్టు డిజైన్లను సీడీవో పరిశీలించిన తర్వాతే కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)కు పంపుతారన్నారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్లలోనూ లోపాలను ఎత్తిచూపి.. వాటిని సరిచేసిన ఘనత సీడీవో అధికారులకు దక్కిందని చెప్పారు. అందుకే దేశంలో అత్యుత్తమంగా డిజైన్లను రూపొందించడంలో సీడబ్ల్యూసీతో సమానంగా సీడీవో నిలిచిందన్నారు. దేశంలో అత్యుత్తమ ఆకృతులను రూపొం దించినందుకుగాను సీడీవో ఐఎస్వో– 9001–2015 సర్టిఫికెట్ దక్కించుకుందని చెప్పారు. ఈ సందర్భంగా ఐఎస్వో సర్టిఫికెట్ను సీడీవో సీఈ శ్రీనివాస్కు అందజేశారు. జలవనరులశాఖ సలహాదారు బీఎస్ఎన్రెడ్డి, సీడీవో ఎస్ఈ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
రేపు పోలవరానికి సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూలు ఇదీ.. బుధవారం ఉ.10.00 : సీఎం నివాసం నుంచి రోడ్డు మార్గంలో హెలీప్యాడ్కు చేరుకుంటారు. 10.10: హెలీకాప్టర్లో పోలవరానికి ప్రయాణం 11.00: ప్రాజెక్టు హెలీప్యాడ్ వద్దకు చేరిక 11.10–12.00: క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన మ.12.00–1.00: అధికారులతో సమీక్ష సమావేశం 1.20: హెలీకాప్టర్లో తిరుగుపయనం 2.00: తాడేపల్లిలోని హెలీప్యాడ్కు రాక 2.15: సీఎం నివాసానికి.. -
'సీమ' ఎత్తిపోతలే శరణ్యం
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ సర్కార్ అక్రమంగా నీటిని తోడేస్తున్న నేపథ్యంలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకమే శరణ్యమని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ)కి రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఎకో సెన్సిటివ్ జోన్కు 18 కిలోమీటర్ల దూరంలో చేపట్టే ఈ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర అటవీ, పర్యావరణశాఖకు నివేదిక ఇస్తామని ఈఏసీ పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి పర్యావరణ అనుమతిపై కేంద్ర అటవీ, పర్యావరణశాఖ నేతృత్వంలో 15 మంది ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలతో కూడిన ఈఏసీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్, రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సీఈ మురళీనాథ్రెడ్డి హాజరయ్యారు. శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటిమట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా డిజైన్ మేరకు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, చెన్నైలకు.. ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ ప్రాజెక్టుల ద్వారా 44 వేల క్యూసెక్కులే తీసుకెళ్లవచ్చునని, 854 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉంటే అత్యవసరాలకు 6 వేల క్యూసెక్కులు తరలించవచ్చని ఈఏసీకి రాష్ట్ర అధికారులు వివరించారు. తెలంగాణ సర్కార్ ఇష్టారాజ్యంగా విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల శ్రీశైలంలో నీటిమట్టం పెరగడం లేదని, దీంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కాలువల ద్వారా నీటిని తరలించలేని దుస్థితి నెలకొందని చెప్పారు. ఈ దుస్థితి అధిగమించడానికే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి పోతిరెడ్డిపాడు దిగువన కాలువలోకి రోజుకు 3 టీఎంసీలను ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల చేపట్టామన్నారు. దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించడానికి ఇది అత్యావశ్యకమని వివరించారు. ఈ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వాలని కోరారు. పాత ప్రాజెక్టులైన ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్లకు ఇంతకుముందే పర్యావరణ అనుమతి తీసుకున్నామని, వాటి ఆయకట్టుకు నీళ్లందించడానికి చేపట్టిన ఈ ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అధికారుల ఇచ్చిన వివరణ, తమ అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా కేంద్ర అటవీ, పర్యావరణశాఖకు ఇవేదిక ఇస్తామని ఈఏసీ పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర అటవీ, పర్యావరణశాఖ రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వడంపై నిర్ణయం తీసుకోనుంది.