engineering students
-
కృత్రిమ మేధ.. కేరాఫ్ భారత్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ప్రపంచాన్ని చాలా వేగంగా మారుస్తోంది. మనిషిలా ఆలోచించి నేర్చుకోవడమే కాదు.. మనిషిలానే తర్కించడం, కొత్త అర్థాన్ని కనుక్కోవడం, అనుభవం నుంచి నేర్చుకోవడం, సామర్థ్యం పెంచుకోవడం వంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. అలుపు, విరామమన్నది లేకుండా పనిచేసే ఈ టెక్నాలజీ మనిషి సృష్టించిన మరో అద్భుతం. పంటలు ఎలా పండిస్తే లాభమో చెబుతుంది. పిల్లలకు లెక్కలు (మ్యాథమెటిక్స్) సులభంగా నేర్పిస్తుంది. మన రహదారుల వెంట భద్రతను కట్టుదిట్టం చేస్తుంది. అమెరికా వంటి పెద్ద దేశాల్లోనే కాకుండా ఈ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడంలో, వినియోగంలో భారతదేశం కూడా దూసుకెళుతోంది.ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అన్ని రంగాల్లోనూ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ఇప్పటికే దేశంలోని కీలక రంగాల్లో దాదాపు 48 శాతం పని కృత్రిమ మేధతోనే నిర్వహిస్తున్నారు. 2025 ఆర్థిక సంవత్సరానికి ఇది 55 శాతానికి పెరుగుతుందని అంచనా. చాలా రంగాలు 75 శాతం పైగా కార్యకలాపాలు ఏఐ సాయంతోనే నిర్వహిస్తాయని చెబుతున్నారు. ఇంటి అవసరాల నుంచి పంట పండించడం వరకు ఏఐ వినియోగం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్లో ప్రపంచ మానవాళి జీవితాలనే మార్చేసే ఏఐ రంగంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రస్తుతం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. అనేక రంగాలు ఇప్పుడిప్పుడే ఏఐ సామర్థ్యాన్ని వినియోగించుకునే మార్గాలను అన్వేషించడం ప్రారంభించాయి. రోబోటిక్స్, మెషిన్ లెరి్నంగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఫ్లాట్ఫారాలు రోజురోజుకూ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. – సాక్షి, అమరావతిపెరుగుతున్న వినియోగం.. అవగాహన ఓ పక్క ఆరోగ్య సంరక్షణ, విద్య, బ్యాంకింగ్, వ్యవసాయంతో సహా అనేక పరిశ్రమలలో ఏఐ ఉపయోగిస్తుంటే.. మరో పక్క స్కూల్ స్థాయి నుంచి సాధారణ ప్రజల వరకు ఈ సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. ఇంకో వైపు భారత ప్రభుత్వం కనీసం 10,000 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూ) ఉన్న ఏఐ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడి పెడుతుందని ఇటీవల జరిగిన గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్–2024లో ప్రకటించింది.గతేడాది ఏప్రిల్లో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ విడుదల చేసిన ‘వార్షిక ఏఐ ఇండెక్స్’ ప్రకారం 2022లో ఏఐ ఆధారిత ఉత్పత్తులు, సేవలు అందించే స్టార్టప్లు 3.24 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయని.. దక్షిణ కొరియా, జర్మనీ, కెనడా, ఆ్రస్టేలియా వంటి దేశాలను సైతం అధిగమించాయని పేర్కొంది. మనకంటే ముందు యూఎస్, చైనా, యూకే, ఇజ్రాయిల్ మాత్రమే ఉన్నట్టు వివరించింది. భారతదేశంలోని ఏఐ స్టార్టప్లు 2013 నుంచి 2022 వరకు మొత్తం 7.73 బిలియన్ డాలర్లు పొందగా, కేవలం 2022 ఏడాదిలోనే దాదాపు 40 శాతం పెట్టుబడులు పెరిగాయి. 2028 నాటికి ఇది 20 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఈ రంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు కేంద్రమే బాధ్యత తీసుకుంటుంది. ఏఐ పరిశోధకులు, కంపెనీలను ప్రోత్సహించేందుకు త్వరలో ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ను స్థాపించనున్నారు. దీంతో పాటు ఏఐ స్కిల్ డెవలప్మెంట్, అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ను కూడా రూపొందించాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల ప్రారంభ దశలో ఏఐ, డీప్ టెక్నాలజీకి అవసరమైన నిధులను కేంద్రం అందించనుంది. దీని ద్వారా టెక్ నిపుణులకు భారీ డిమాండ్ ఏర్పడుతుందని అంచనా. బలమైన జాబ్ మార్కెట్ ఇలా» గ్లోబల్ టెక్నాలజీ హబ్గా మన దేశ ప్రాధాన్యం పెరుగుతుందన్నది జగమెరిగిన సత్యం. అందుకు తగ్గట్టే దేశంలో కృత్రిమ మేధ (ఏఐ) ఉద్యోగ మార్కెట్ వృద్ధి చెందుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఇందులో స్టార్టప్స్తో పాటు బహుళ జాతి కంపెనీల్లో ఏఐ టెక్ నిపుణులకు అవకాశాలు భారీగా ఉన్నాయి. » మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, రోబోటిక్స్ వంటి ఏఐ నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ వల్ల తాజా గ్రాడ్యుయేట్లతో పాటు అనుభవజ్ఞులైన నిపుణులకు ఈ డైనమిక్ రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో ప్రతి ఐదు ఉద్యోగాలలో ఒకటి కచ్చితంగా ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్ రంగాలకు చెందినదై ఉంటుందని చెబుతున్నారు. » ఈ క్రమంలో ఇంజినీరింగ్ విద్యార్థులు సాధారణ కంప్యూటర్ కోర్సుల కంటే టెక్ రంగంలో కఠినమైన సమస్యలను పరిష్కరించడంలో సరికొత్త అంశాలను నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రంగంలో పరిశోధన–ఆవిష్కరణలు, విద్యావేత్తలు– పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం బలమైన ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ‘డిజిటల్ ఇండియా, నేషనల్ ఏఐ స్ట్రాటజీ’ వంటి ప్రోగ్రామ్లను అందుబాటులోకి తెచ్చింది.నమ్మశక్యం కాని అద్భుతాలు » భారత ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగాన్ని మార్చగల శక్తి ఏఐకి ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సమీప కాలంలోనే ఈ టెక్నాలజీ కీలకం కానుందంటున్నారు. » వ్యవసాయంలో వాతావరణ మార్పులను అంచనా వేసి, ఏ సమయంలో ఏ పంట వేయాలో.. పంటల సస్యరక్షణ, దిగుబడులను పెంచడంలో రైతులకు నేరుగా సహాయం చేయగల సామర్థ్యం దీనికుంది. » ఈ నేపథ్యంలో అన్ని రంగాలకు కావాల్సిన ఏఐ టెక్నాలజీ సహకారం అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పెట్టుబడులు, నిపుణుల నియామకం కొత్త సాంకేతిక పరిజ్ఞానం పెంపునకు ఏఐ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు స్థాపించనున్నారు. అంటే ఈ టెక్నాలజీపై శిక్షణ నుంచి కొత్త సృష్టి వరకు అనేక విభాగాలకు భారత్ అంతర్జాతీయ మార్కెట్కు కేంద్రం కానుంది. » కృత్రిమ మేధస్సు (ఏఐ)ను ఉపయోగించి నమ్మశక్యం కాని అద్భుతాలు ఆవిష్కరించేందుకు భారతదేశానికి చాలా మంచి అవకాశం ఉందని, ఇది మునుపటి కంటే మరింత అభివృద్ధి చెందడానికి, ఇంటెలిజెన్స్ భారత్ను సృష్టించడానికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ టెక్నాలజీ వినియోగం శాతాల్లో68 బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్విసెస్65 టెక్ పరిశ్రమ52 ఫార్మా అండ్ హెల్త్కేర్43 ఎఫ్ఎంసీజీ అండ్ రిటైల్ 28 తయారీ రంగం22 మౌలిక వసతులు, రవాణ12 మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్68 బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్విసెస్ -
ముద్దొచ్చే మర చేప
ఇదేమిటో తెలుసా? రోబోచేప. పేరు ఈవ్. సిలికాన్ తోకను విలాసంగా ఊపుకుంటూ స్విట్జర్లాండ్లో జ్యూరిచ్ సరస్సులోని అతి శీతల జలాల్లో ఇలా విలాసంగా విహరిస్తోంది. దీన్ని రూపొందించేందుకు జ్యూరిచ్ ఈటీహెచ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏకంగా రెండేళ్లు పట్టిందట! ఇతర చేపలు, సముద్ర జీవాలు బెదిరిపోకుండా ఉండాలని దీన్ని అచ్చం చేపలా కని్పంచేలా డిజైన్ చేశారు. సోనార్ టెక్నాలజీ సాయంతో అడ్డొచ్చే వాటన్నింటినీ సునాయాసంగా తప్పించుకుంటూ సాగిపోగలదీ మర చేప. ఇంతకూ దీని పనేమిటంటారా? నీటి లోపలి పరిస్థితులను కెమెరా కంటితో ఒడిసిపట్టడం. సముద్ర జీవుల డీఎన్ఏను (‘ఇ–డీఎన్ఏ’గా పిలుస్తారు) సేకరించడం. ‘‘సముద్రం లోతుల గురించి, అక్కడి జీవుల గురించీ మనకు తెలిసింది నిజానికి చాలా తక్కువ. ఆ జీవులన్నీ నిరంతరం ‘ఇ–డీఎన్ఏ’ను జలాల్లోకి విడుదల చేస్తుంటాయి. దాన్ని సేకరించి ల్యాబుల్లో పరీక్షిస్తే వాటి గురించి మనకిప్పటిదాకా తెలియని విశేషాలెన్నో వెలుగులోకి వస్తాయి’’ అని అధ్యయన బృందం చెబుతోంది. ఈ రోబో చేపలు మున్ముందు సముద్రాల అధ్యయనం రూపురేఖలనే మార్చగలవని భావిస్తున్నారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
Hyderabad: ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
దుండిగల్: అతివేగం ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లిలోని వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన అక్షయ్, అస్మిత్, జస్వంత్, నవనీత్తో పాటు మరో స్నేహితుడు హరి కారులో దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్–5 వద్ద దిగారు. అక్కడి నుంచి సరీ్వస్ రోడ్డులో బౌరంపేట వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్షయ్, హరి, అస్మిత్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన జస్వంత్, నవనీత్లను సూరారంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యార్థులు నడిపిన కారుపై ఇప్పటికే అయిదు చలాన్లు నమోదయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్న్షిప్కు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ, బీటెక్ విద్యార్థుల దీర్ఘకాలిక ఇంటర్న్షిప్నకు సర్వం సిద్ధమైంది. ఈ విద్యార్థులకు విద్యతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం ఇంటర్న్షిప్ ప్రవేశపెట్టింది. ఇంజనీరింగ్ విద్యార్థులకు సోమవారం నుంచి ఇంటర్న్షిప్ ప్రారంభమవుతుంది. డిగ్రీ విద్యార్థులకు వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. గతేడాది 2.56 లక్షల మంది ఇంటర్న్షిప్ చేయగా, ఈ ఏడాది 3.46 లక్షల మంది ఇందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం 30కి పైగా ప్రపంచ స్థాయి సంస్థల్లో వర్చువల్గా, మరో 30 వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల ద్వారా ఇంటర్న్షిప్ కల్పిస్తోంది. ఇంటర్న్షిప్ కోసం ఉన్నత విద్యా మండలి పోర్టల్లో లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్) ఏర్పాటు చేశారు. జిల్లాలవారీగా గుర్తించిన సంస్థల వివరాలను వెబ్సైట్లో అప్డేట్ చేస్తున్నారు. ఆ సంస్థలతో సమన్వయం చేసేందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం నియమించింది. ప్రపంచ స్థాయి సంస్థలతో ఒప్పందం విద్యార్థుల ఇంటర్న్షిప్ కోసం పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వర్తక, వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్, మెగా సంస్థలను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటిలో మాన్యుఫాక్చరింగ్తో పాటు సర్వీసు సంస్థలూ ఉన్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకుంటోంది. ఎల్ఎంఎస్–ఐఐసీ పోర్టల్లో వీటి వివరాలు ఉంచింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, స్మార్ట్ ఇంటన్జ్, ఎక్సల్ ఆర్, సెలర్ అకాడమీ, సిస్కో, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్, వాద్వానీ ఫౌండేషన్, టీమ్ లీజ్ వంటి సంస్థల ద్వారా ఇంటర్న్షిప్ అందిస్తోంది. ఈ ఏడాది సుమారు 40 వేల మంది సంప్రదాయ డిగ్రీ విద్యార్థులకు స్ట్రైఫండ్తో కూడిన ఇంటర్న్షిప్ కల్పిస్తోంది. వీరితో పాటు 2వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్ కింద సేవలు వినియోగించుకోనుంది. వీరికి నెలకు రూ.12 వేల చొప్పున చెల్లిస్తూ ఆరు నెలల పాటు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు డిజిటల్ టెక్నాలజీపై అవగాహన పెంపొందించనుంది. చదువుకొనే సమయంలోనే జీతాన్నీ అందుకుంటారు విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు డిగ్రీతో పాటు ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు ఏడాది పాటు ఇంటర్న్షిప్ అమలు చేస్తున్నాం. దీర్ఘకాలిక ఇంటర్న్షిప్ను చివరి సెమిస్టర్లో పెట్టడం ద్వారా విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న పాఠ్యాంశాలతో పాటు పరిశ్రమల్లో నేర్చుకున్న విజ్ఞానంతో వేగంగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 10 లక్షల మందికి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ అందించింది. ఏపీలో విద్యార్థులు తొలిసారిగా చదువుకొనే సమయంలోనే జీతాన్నీ అందుకోనున్నారు. – ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ -
టాప్ కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్ల పరిమితి ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: అత్యుత్తమ ప్రతిభగల ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల ప్రవేశానికి పరిమితి ఎత్తివేయబోతున్నారు. ఇందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు ముసాయిదా ప్రతిని రూపొందించింది. దీన్ని రాష్ట్రాల ఉన్నతవిద్యా మండళ్లకు పంపింది. వచ్చే ఏడాది (2024) నుంచి దీన్ని అమల్లోకి తేవాలని భావిస్తోంది. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) కోర్సుల విషయంలోనూ ఈ విధానాన్ని అనుసరించాలని ప్రతిపాదించింది. ఇటీవల విడుదల చేసిన హ్యాండ్బుక్లోనూ ఏఐసీటీఈ దీన్ని ప్రస్తావించింది. ముసాయిదా ప్రతిని సమీక్షించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సిద్ధమవుతోంది. యూనివర్సిటీల వీసీలు, మండలి ఉన్నతాధికారులు ఈ అంశంపై చర్చించేందుకు సమావేశమవుతున్నారు. రాష్ట్రంలో పది కాలేజీలకు అవకాశం.. రాష్ట్రంలో 174 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా అటానమస్ కాలేజీలను కలుపుకొని 100 కాలేజీలకు ‘న్యాక్’అక్రెడిటేషన్ ఉంది. వాటిల్లో అత్యుత్తమ ప్రమాణాలు కనబరిచే కాలేజీల జాబితాను గుర్తించాల్సి ఉంటుంది. దీనికోసం ఎక్స్పర్ట్ విజిటింగ్ కమిటీ (ఈవీసీ)ని మండలి నియమించాల్సి ఉంటుంది. ఇందులో ఏఐసీటీఈ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి, అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీల సభ్యులు ఉంటారు. విద్యార్థుల హాజరు శాతం, ఏటా కౌన్సెలింగ్లో ఏ కాలేజీకి ఎందరు దరఖాస్తు చేస్తున్నారు? ఏయే కోర్సులను డిమాండ్ చేస్తున్నారు? ఆయా కోర్సుల్లో చేరేవారి పురోగతి ఎలా ఉంది? కాలేజీలో చేరిన విద్యార్థుల మార్కుల వివరాలను పరిశీలించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఉపాధి పొందిన తీరు, లభించిన వార్షిక వేతనం వంటి అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఇలా రాష్ట్రంలో అన్ని అర్హతలు ఉన్న కాలేజీలు 10 వరకూ ఉంటాయని మండలి వర్గాలు చెబుతున్నాయి. అయితే కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ పెరిగాక సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గాయి. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారా? అనే విషయమై ఏఐసీటీఈ స్పష్టత ఇవ్వలేదు. కాలేజీల్లో ఉండే మౌలికవసతులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పినా, దానిపైనా స్పష్టత ఇవ్వలేదని అధికారులు అంటున్నారు. సీట్లు పెరిగేనా? ప్రస్తుతం ప్రతి కాలేజీలోని ఒక్కో బ్రాంచిలో గరిష్టంగా 4 సెక్షన్లనే అనుమతిస్తున్నారు. ఒక్కో సెక్షన్లో 60 సీట్ల చొప్పున మొత్తం 240 సీట్లు ఉంటున్నాయి. అయితే నాలుగు సెక్షన్లు ఉన్న కాలేజీలు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. వాటిల్లోనూ ఎక్కువగా సీఎస్ఈ, కొత్తగా వచి్చన కంప్యూటర్ కోర్సులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరిమితి ఎత్తేసినా కొత్తగా సీట్లు పెరుగుతాయా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. కొత్త విధానం వల్ల యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు తీసుకోవాల్సిన అవసరం ఉండదని అధికారులు అంటున్నారు. విస్తృత చర్చ చేపడతాం.. ఏఐసీటీఈ ముసా యిదా ప్రతిపై త్వరలో ఉన్నతస్థాయి చర్చ చేపడతాం. ఏఐసీటీఈ ప్రతిపాదనలు రాష్ట్రంలో అమలు చేయగలమా లేదా? అనేది పరిశీలించాల్సి ఉంది. వీసీలు, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నాక దీనిపై ఏఐసీటీఈకి అభిప్రాయం తెలియజేస్తాం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
అర్థరాత్రి కాలువలోకి దూసుకెళ్లిన కారు..
-
ఇంజినీరింగ్ విద్యార్థులపై దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్స్
సాఓఇ, బాపట్ల: నాలుగు సంవత్సరాలు కష్టపడి ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులందరూ నా దృష్టిలో సూపర్ స్టార్సేనని సినీ దర్శకుడు రావిపూడి అనీల్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన పూర్వ విద్యార్థుల కలయికలో భాగంగా యంగ్ డైరెక్టర్ రావిపూడి అనీల్ విజ్ఞాన్లోని విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. అనీల్ మాట్లాడుతూ అవకాశాలనేవి మన దగ్గరకు రావని.. విద్యార్థులే వాటికి ఎదురెళ్లి తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి జీవితంలో నిర్ధిష్టమైన లక్ష్యం ఉండాలన్నారు. దాని సాధించేంతవరకు కష్టపడాలన్నారు. వినూత్న ఆలోచనలకు కాసింత క్రియేటివిటీ, టెక్నాలజీను ఉపయోగించుకుంటే జీవితంలో విద్యార్థులు ముందుకు దూసుకెళ్లి పోవచ్చన్నారు. ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చదవండి: (అదే నా కోరిక.. నటనకు బ్రేక్ ఇచ్చయినా ఆ విషయాలు తెలుసుకుంటా) -
భీమిలి బీచ్లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ భీమిలి బీచ్లో విషాదం చోటుచేసుకుంది. సరదగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు సముద్రంలోకి దిగగా.. వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. తగరపువలసలో ఇంజనీరింగ్ చదువుతున్న ఈసీఈ బ్రాంచ్కు చెందిన సాయి, సూర్య గల్లంతైనట్టు పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేవీ హెలికాప్టర్లతోనూ గాలింపు చర్యలు చేపట్టారు. బీచ్ వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: అమ్మా.. నాన్నకు ఏమైంది? ఎప్పుడు వస్తాడు?.. కంటతడి పెట్టించే ఘటన -
బాపట్లలో విషాదం.. నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు
చీరాల టౌన్: విహారయాత్ర కోసం బీచ్కు వచ్చిన నలుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యా రు. వారిలో ఒకరి మృతదేహం లభించింది. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ విషాద ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో గురువారం జరిగింది. చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు... గుంటూరుకు చెందిన జీవీఆర్ఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు రామాపురం బీచ్కు వచ్చా రు. వారు సముద్రంలో స్నానం చేస్తుండగా పెద్ద అలలు వచ్చాయి. తెనాలికి చెందిన యడవల్లి రమణ (19), పులివర్తి గౌతమ్ (20), అమరావతి మండలం పరిమి గ్రామానికి చెందిన తాళ్లూరి రోహిత్ (20), హైదరాబాద్కు చెందిన తిరుణగిరి మహదేవ్ (18) అలల తాకిడికి నీటిలో మునిగిపోయారు. ఆ సమయంలో కేకలు వేస్తున్న విద్యార్థుల ను కాపాడేందుకు రామాపురం మత్స్యకారులు ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. కొద్దిసేపటి తర్వాత మహదేవ్ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొ చ్చింది. మిగిలిన ముగ్గురు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. మహదేవ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. తీరంలో మిన్నంటిన రోదనలు... గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సహచర విద్యార్థులు రామాపురానికి చేరుకున్నారు. కుమారులు సముద్రంలో గల్లంతుకావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కష్టపడి బిడ్డలను చదివించుకుంటున్న తమపై విధి కక్షగట్టి తీసుకెళ్లిందని, తమకు కడుపుకోత మిగిల్చిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా రు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అక్కడికి చేరుకుని విద్యార్థులు, డీఎస్పీ పి.శ్రీకాంత్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
AP: బీటెక్ సీటు హాట్ కేకు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు హాట్కేకుల్లా భర్తీ అవుతున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా రాష్ట్రంలోని కాలేజీల్లో చదవడానికి ఇంజనీరింగ్ విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఏపీ ఈఏపీ సెట్–2022 అడ్మిషన్ల కౌన్సెలింగ్ (ఎంపీసీ స్ట్రీమ్)లో గురువారం తొలి విడత సీట్ల కేటాయింపులో 82% సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్ కోటా ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో ఇదో రికార్డు. గత ఏడాదిలో కూడా తొలి విడతలోనే 75 శాతానికి పైగా భర్తీ అయ్యాయి. ఇప్పుడు మరిన్ని ఎక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. జగన్ సీఎం అయిన తర్వాత కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులందరికీ ప్రభుత్వమే జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తుంది. దీంతోపాటు జగనన్న వసతి దీవెన కింద ఏడాదికి రూ.20 వేలు చెల్లిస్తుంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రమాణాలు మెరుగుపరుస్తోంది. ఏడాది ఇంటర్న్షిప్ విధానాన్ని ప్రవేశపెట్టింది. నైపుణ్య శిక్షణ ఇప్పిస్తోంది. ప్రముఖ పరిశ్రలతో కాలేజీలను అనుసంధానిస్తోంది. ఈ చర్యలన్నిటి ఫలితంగా రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సీట్లు హాట్ కేకులే అయ్యాయి. రాష్ట్రంలోని 248 ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 1,11,864 సీట్లు ఉన్నాయి. వీటిలో తొలి విడతలోనే 91,249 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 20,615 సీట్లు మిగిలి ఉన్నట్లు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ సి.నాగరాణి చెప్పారు. ఏపీ ఈఏపీ సెట్లో 1,73,572 మంది అర్హత సాధించగా ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 1,01,318 మంది వెబ్ ఆప్షన్లకు అర్హత సాధించారు. వీరిలో 99,025 మంది ఆప్షన్లను నమోదుచేశారు. తొలివిడతలో ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీ కాలేజీలు, ప్రైవేటు కాలేజీల్లోని సీట్లను కేటాయించారు. స్పోర్ట్సులో 492, ఎన్సీసీలో 984 సీట్ల కేటాయింపును పెండింగ్లో పెట్టారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) నుంచి మెరిట్ జాబితా అందిన అనంతరం ఆ సీట్లు కేటాయిస్తారు. భారీగా కంప్యూటర్ సైన్సు సీట్లు ఇంజనీరింగ్ సీట్లలో కంప్యూటర్ సైన్సు, తత్సంబంధిత సీట్లు అత్యధికంగా భర్తీ అయ్యాయి. ఇంజనీరింగ్ కాలేజీలు కూడా కంప్యూటర్ సైన్సు కోర్సుల్లోనే అత్యధిక శాతం సీట్లకు అనుమతులు తెచ్చుకున్నాయి. గతంలోకన్నా ఈసారి ఎక్కువ సీట్లు ఈ విభాగంలోనే ఉన్నాయి. సీఎస్ఈ, తత్సంబంధిత సీట్లు 41,991 భర్తీ కాగా అందులో సీఎస్ఈ సీట్లు 27,261 ఉన్నాయి. ఆ తరువాత ఈసీఈ, ఈఈఈలో ఎక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. తొలివిడతలోనే ఈ సీట్లు దాదాపు పూర్తిగా భర్తీ అయ్యాయి. బాబు హయాంలో సీట్ల భర్తీ అంతంతే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కన్వీనర్ కోటా ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి విద్యార్ధుల నుంచి స్పందన పెద్దగా ఉండేది కాదు. విద్యార్థుల్లో చాలా మంది హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని ప్రైవేటు కాలేజీల్లో చేరేందుకే మొగ్గు చూపేవారు. జేఈఈ మెరిట్ విద్యార్థులు ఏపీ ఎంసెట్లో టాప్ ర్యాంకులో నిలిచి మంచి కాలేజీలో సీటు వచ్చినా, దానిని వదులుకొని వేరే రాష్ట్రాలకు వలస వెళ్లే వారు. అప్పట్లో పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు కాకుండా కాలేజీ ఫీజు లక్షల్లో ఉన్నా కేవలం రూ.35 వేలు మాత్రమే చెల్లించేది. చంద్రబాబు హయాంలో చివరి దశ కేటాయింపులు పూర్తయ్యాక కూడా కాలేజీల్లో దాదాపు 40 శాతం సీట్లు ఖాళీగా ఉండేవి. 2016లో 58 శాతం, 2017లో 60 శాతం, 2018లో 61 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రభుత్వ చర్యల ఫలితంగా రాష్ట్రంలోని కాలేజీల్లోనే చదవడానికి విద్యార్థులు మొగ్గు చూపిస్తున్నారు. నేడు బీ కేటగిరీ నోటిఫికేషన్ ఇంజనీరింగ్ కాలేజీల్లోని యాజమాన్య కోటా అయిన బీ కేటగిరీ సీట్ల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సీట్ల భర్తీని కాలేజీలో ప్రత్యేక పోర్టల్ ద్వారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపడతాయి. విద్యార్థులు కాలేజీలకు నేరుగా దరఖాస్తు చేయడానికి లేదా ఈ పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించనున్నారు. ఫార్మసీ సీట్ల భర్తీకి బ్రేకు ఇంజనీరింగ్ స్ట్రీమ్లోనే ఫార్మసీ సీట్లు కూడా భర్తీ చేయాల్సి ఉన్నా వాటికి బ్రేకు పడింది. ఫార్మసీ కాలేజీల సీట్లకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు రాకపోవడంతో వీటి భర్తీని నిలిపివేశారు. అనుమతుల మంజూరు ప్రక్రియ వచ్చే నెలలో పూర్తవుతుందని ఫార్మసీ కౌన్సిల్ ఉన్నత విద్యాశాఖకు తెలిపింది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని ఉన్నత విద్యా మండలి ఫార్మసీ కౌన్సిల్కు మరోసారి లేఖ రాసింది. -
పదివేల లోపు నిబంధన బీసీ, ఈబీసీల ఆవేదన
విఘ్నేష్ కుమార్ గండిపేట సమీపంలోని పేరున్న కళాశాలలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. 2019 సంవత్సరంలో ఎంసెట్లో 10025 ర్యాంకు రావడంతో ఆ కాలేజీలో సీటు వచ్చింది. మంచి ర్యాంకు రావడం, బీసీ–బీ కేటగిరీలోని రిజర్వేషన్తో పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని భావించిన విఘ్నేష్ ఫీజు ఎక్కువైనా అందులో చేరాలనుకున్నాడు. అయితే అడ్మిషన్ ఖరారు చేసే సమయంలో రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని అధికారులు సూచించారు. దీనిపై ఉన్నతాధికారులను ఆరా తీయగా పదివేలలోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు మాత్రమే పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని, ఈ లెక్కన కాలేజీలో వ్యక్తిగతంగా రూ.90 వేలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే అప్పటికే పూర్తి ఫీజు రీయింబర్స్ చేయాలనే డిమాండ్ ఉండటంతో, తర్వాతైనా ప్రభుత్వం ఇవ్వకపోతుందా అనే ఆశతో తొలిఏడాది ఎలాగోలా ఫీజు మొత్తం సర్దుబాటు చేసుకుని అందులో చేరాడు. కానీ ఇప్పటికీ డిమాండ్ నెరవేరక పోవడంతో.. ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో ఫీజు చెల్లించడానికి ఎన్నో ఇబ్బందులకు గురికావలసి వచ్చింది. ఒక దశలో కోర్సు మానేద్దామనుకున్నా అష్టకష్టాలూ పడి ఫైనల్ ఇయర్ పూర్తిచేసి కొలువు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సాక్షి, హైదరాబాద్: ఎంసెట్లో పదివేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్ చేస్తుండటం..చాలామంది వెనుకబడిన తరగతుల విద్యార్థులు, ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒక ర్యాంకు ఎక్కువ వచ్చినా ఆ పథకం కింద విద్యార్థికి కేవలం రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని టాప్–10 ఇంజనీరింగ్ కాలేజీల్లో వార్షిక ట్యూషన్ ఫీజు రూ.80 వేలకు పైమాటే ఉంది. నాలుగైదు కాలేజీల్లో రూ.లక్ష కంటే ఎక్కువ ఉండగా.. మిగతా కాలేజీల్లో రూ.80 వేలకు అటుఇటుగా ఉంది. ఇక టాప్ 10 నుంచి 20 వరకు కాలేజీల్లో రూ.55 వేలకు మించి ఫీజు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కాగా పదివేల ర్యాంకు సీలింగ్ దాటిన విద్యార్థులకు ప్రభుత్వం కనీస ఫీజు అయిన రూ.35 వేలు మాత్రమే ఇస్తుండగా.. చాలా కాలేజీల్లో ట్యూషన్ ఫీజు రూ.50 వేల కంటే ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే సీలింగ్ ర్యాంకు దాటిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరిన పక్షంలో అదనపు ఫీజును వ్యక్తిగతంగా చెల్లించాల్సి వస్తోంది. సీఎం సానుకూలంగా స్పందించినా.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ర్యాంకు సీలింగ్ను కొన్నేళ్ల క్రితం విధించారు. అప్పట్నుంచీ విద్యార్థి సంఘాలతో పాటు బీసీ సంఘాలు, ఇతర సామాజిక సంఘాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు సమానంగా బీసీలు, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు పూర్తి ఫీజును రీయింబర్స్ చేయాలంటూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలు సందర్భాల్లో ర్యాంకు సీలింగ్ ఎత్తివేయాల్సిందిగా సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. బీసీ డిక్లరేషన్ ప్రతిపాదనల్లోనూ ఈ మేరకు సూచనలు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి మూడేళ్లు గడిచినా ఈ అంశం ఎటూ తేలలేదు. ర్యాంకు సీలింగ్ నిబంధనతో ఏటా వేలాది బీసీ, ఈడబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అరకొరగానే ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుండగా.. ఆయా కాలేజీల్లో అదనపు ఫీజు మొత్తాన్ని చెల్లించేందుకు తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. వారిలో సగం మందే బీసీలు ఎంసెట్లో 10వేల లోపు ర్యాంకులు సాధించిన వారిలో బీసీలు సగం మంది మాత్రమే ఉంటున్నారు. జనరల్ కేటగిరీతో పాటు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులను మినహాయిస్తే బీసీలు సగటున 3 వేల నుంచి గరిష్టంగా 6 వేల మంది ఉంటున్నట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఏటా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్న విద్యార్థులు 6 వేలకు మించడం లేదని స్పష్టమవుతోంది. రాష్ట్ర పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లోని వివిధ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా లక్ష మంది ఉండగా.. ఇందులో గరిష్టంగా 6వేల మంది బీసీ విద్యార్థులకు మాత్రమే ఫుల్ ఫీజు అందుతోంది. మొత్తం విద్యార్థుల్లో 10 శాతం మందికి పూర్తి ఫీజు మంజూరవుతుండగా.. అందులో బీసీల వాటా 6శాతం మాత్రమే. -
మీ కెరీర్ మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్.. నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే..
రాజానగరం(తూర్పుగోదావరి): చదివిన చదువు విద్యార్థికి ఉపయోగపడాలి. ఉపాధికి మార్గం చూపాలి. విజ్ఞానం పంచాలి. ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటంతో విద్యార్థులు చదువు పూర్తయ్యాక పట్టా చేత పట్టుకుని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అటు ఉద్యోగం పొందలేక ఇటు బయట ప్రపంచంలో మనలేక అవస్థలు పడుతున్నారు. చదవండి: మగవాళ్లకు మాత్రమే.. ఆడవారికి నో ఎంట్రీ.. ఎందుకంటే? కొద్దిరోజులుగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. విద్యార్థికి ఎదురవుతున్న ఇటువంటి క్లిష్ట పరిస్థితిని చక్కదిద్దేందుకు విద్యా సంస్థలు మార్గాన్వేషణ చేస్తున్నాయి. స్కిల్ బోధన చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఇస్తూ ఉపాధి బాట చూపుతున్నాయి. నన్నయ విశ్వ విద్యాలయం ఈ విషయంలో చురుకైన పాత్ర పోషిస్తోంది. ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసి, బయటకొస్తున్నారు. వారిలో చాలామందిలో పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాలు కొరవడుతున్నాయి. ఫలితంగా సరైన ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారు. ఈ కొరతను నివారించి, తరగతి గదిలో నేర్చుకున్న పరిజ్ఞానం ఉపయోగపడేలా విద్యాసంస్థలు ఇప్పుడు బాట వేస్తున్నాయి. పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యంతో కూడా అవగాహన కలిగించేందుకుగాను ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ ఇంటర్న్షిప్ ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాదు పరిశోధనలు చేసే విద్యార్థులకు కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు అధ్యాపకులు. ఈ కారణంగానే ప్రతి విద్యార్థి తన కోర్సులో ఏదోఒక పరిశ్రమలో ఇంటర్న్షిప్ చేయాలని రాష్ట్ర ఉన్న విద్యామండలి నిబంధన కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో ఇంటర్న్షిప్ అనేది ఇంజినీరింగ్ విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు మార్గాన్ని చూపటంతోపాటు ఉపాధి అవకాశాలకు తొలి మెట్టుగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. అందుకే కాలేజీల నుంచి ఇంటర్న్షిప్నకు మరో పరిశ్రమ లేదా సంస్థకు వెళ్లే విద్యార్థులు దీనిని సదవకాశంగా భావించాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. దీనిని క్యాజువల్గా పరిగణిస్తే భవిష్యత్కు ఇబ్బందికరమంటున్నారు. ఉపాధి పొందే అవకాశం ♦ తరగతి గదిలో నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానానికి మరింత పదును పెట్టి, వర్కుపై అవగాహన పెంచడం ఇంటర్న్షిప్ ప్రధాన ఉద్దేశం. ♦ పరిశ్రమలు, కొన్నిరకాల సంస్థలు ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ అవకాశాన్ని అందిస్తున్నాయి. ♦ తొలినాళ్లలోనే పని నేర్చుకునే వీలు కల్పిస్తున్నాయి. ♦ ప్రాజెక్టులు రూపొందించడం, ఫీల్డ్ గురించి తెలుసుకోవడం, హార్డ్, సాప్ట్ స్కిల్స్ని అభివృద్ధి చేయడం వంటి వాటి కోసం ఇంటర్న్షిప్లో సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయంలో వారు చూపించే ప్రతిభాపాటవాలతో కొన్ని సంస్థలు వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఆఫర్ చేస్తుంటాయి. ♦ వేసవిలో 10 నుండి 12 వారాలపాటు ఇంటర్న్ షిప్ చేయవలసి వస్తే ఇతర కాలాలలో ఆరు మాసాలకు లోబడి సమయాన్ని ఆయా సంస్థలు, పరిశ్రమలు నిర్ణయిస్తాయి. ♦ ఈ సమయంలో గౌరవ వేతనాలను కూడా పొందే అవకాశాలుంటాయి. ♦ అనుభవజ్ఞులతో పరిచయాలు ఏర్పడం, వారి అనుభవాలను షేర్ చేసుకోవడం జరుగుతుంటుంది. ♦ విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు ఇంటర్న్షిప్ ఎంతగానో దోహదపడుతుంది. ♦ ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు, ఉన్నత అవకాశాలను పొందేందుకు కూడా తోడ్పడుతుంది. ♦ ఏ ఉద్యోగానికైనా అనుభవం కొలమానికంగా ఉన్న నేపథ్యంలో ఇంటర్న్షిప్ అనుభవంగా సహకరిస్తుంది. పీహెచ్డీ చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది కంపెనీలు ఇచ్చే జాబ్ సెలక్షన్స్లో ఇంటర్న్షిప్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎంటెక్ చేసి, పీహెచ్డీ చేయాలనుకునే వారికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఆదికవి నన్నయ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఇప్పటి వరకు రెండు బ్యాచ్ల విద్యార్థులు చదువు పూర్తి చేసి బయటకు వెళ్లారు. ప్రస్తుతం 800 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీ, ఎన్టీఆర్ఐ, సీఐటీడీ వంటి సంస్థలలో ఇంటర్న్ఫిప్ చేసే అవకాశాలు వచ్చాయి. – ఆచార్య ఎం.జగన్నాథరావు, వైస్చాన్సలర్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ మార్గదర్శకాలను అనుసరించే.. ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలను అనుసరించి ఇంజినీరింగ్ విద్యార్థులంతా ఇంటర్న్షిప్ చేయవలసి ఉంటుంది. దీనిని ఆన్లైన్లోగాని, ఆఫ్లైన్లోగాని తప్పనిసరిగా చేయవలసిందే. ఇందుకోసం కంపెనీలు ఒక్కోసారి నోటిఫికేషన్స్ ఇస్తుంటాయి, వాటిని విద్యార్థులు చూసి, దరఖాస్తు చేసుకుంటారు. ఇంటర్న్షిప్స్ ఎక్కువగా సమ్మర్ హాలిడేస్లో చేస్తుంటారు. – డాక్టర్ వి.పెర్సిస్, ప్రిన్సిపాల్, ‘నన్నయ’ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అనుభవాన్ని అందించింది ఎలక్రిక్టకల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో మూడో సంవత్సరం చదువుతున్న నాకు ప్రాసెస్ కంట్రోల్ రంగంలో ప్రతిష్టాత్మక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( తిరుచిరాపల్లి)లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. నిజంగా ఇది మాకు వర్కుపై కొత్త అనుభవాన్ని అందించింది. తద్వారా లక్ష్యాన్ని సాధించాగలమనే ధీమాను ఇచ్చింది. – కార్తీక్కుమార్రెడ్డి, వసంతకుమార్, మౌనిక -
గంగాధర నెల్లూరులో చోరీలకు పాల్పడుతున్న బీటెక్ స్టూడెంట్స్
-
ఏఐసీటీఈ సర్వే: గణితంలో ఇంజనీరింగ్ విద్యార్థులు వీక్
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ విద్యార్థుల్లో గణితం సబ్జెక్టులో వెనుకబాటు ఎక్కువగా ఉంటోందని, ఫలితంగా ఆయా కోర్సుల్లో వారు తగిన నైపుణ్యాలను అలవర్చుకోలేకపోతున్నారని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పరఖ్ సర్వే వెల్లడించింది. ఇంజనీరింగ్ కోర్సుల్లో కీలకమైన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఏఐసీటీఈ ‘పరఖ్’ పేరిట ఈ స్టూడెంట్ లెర్నింగ్ అసెస్మెంట్ (విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మూల్యాంకనం)ను ఇటీవల నిర్వహించింది. చదవండి: పరిశ్రమలకు ఊరట.. ఏపీఈఆర్సీ కీలక ఆదేశాలు.. ఈ సర్వే ఫలితాలను బుధవారం విడుదల చేసింది. సాంకేతిక విద్యలో అభ్యసన లోపాలను గుర్తించేందుకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఏఐసీటీఈ పరఖ్ పేరిట ఆన్లైన్ పరీక్షను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 2,003 సాంకేతిక విద్యాసంస్థలకు సంబంధించిన 1.29 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. అభ్యర్థులు తమ అభ్యసన సామర్థ్యాలను ఈ పరఖ్ సర్వే ద్వారా స్వయం మూల్యాంకనం చేసుకునేలా దీన్ని నిర్వహించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నమోదైన ఈ సర్వే గణాంకాలను ఏఐసీటీఈ విశ్లేషించి నివేదికలు విడుదల చేసింది. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ ఫస్టియర్ విద్యార్థులకు పరఖ్ ద్వారా ఏఐసీటీఈ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టు అంశాలతోపాటు ఆప్టిట్యూడ్ టెస్ట్ను నిర్వహించింది. సెకండియర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులకు ఆయా కోర్ సబ్జెక్టు అంశాలను ఆధారం చేసుకొని మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అంశాల్లో స్వయం సామర్థ్య పరీక్షలను పెట్టింది. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులకు కోర్ సబ్జెక్టుల్లోనే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) అంశాలపైనా నిర్వహించింది. మ్యాథ్స్లోనే సమస్యలు.. ఏఐసీటీఈ విడుదల చేసిన నివేదికల ప్రకారం.. ఫస్టియర్ ఇంజనీరింగ్ విద్యార్థులు అన్ని మేజర్ ప్రోగ్రాముల్లోనూ మ్యాథమెటిక్స్లోనే సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఈ విద్యార్థులకు గణితం సబ్జెక్టులో ప్రాథమిక స్థాయిలో అభ్యసన సామర్థ్యాలు సరిగా అలవడకపోవడమేనని పేర్కొంది. ప్రాథమిక, మాధ్యమిక, హయ్యర్ సెకండరీ స్థాయిల్లో గణితం సబ్జెక్టులో వీరికి తగిన సామర్థ్యాలు అలవడలేదని వివరించింది. అత్యధిక శాతం మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠశాల స్థాయిలోని సామర్థ్యలోపాలు ఇప్పుడు సమస్యగా మారాయని పేర్కొంది. 22,725 మంది ఫస్టియర్ విద్యార్థులకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే.. ఫిజిక్స్, కెమిస్ట్రీ అంశాల్లో నైపుణ్యాలు అంతంతమాత్రంగా ఉండగా.. గణితంలో మరింత అధ్వానంగా ఉన్నారని తేల్చింది. ఆప్టిట్యూడ్ టెస్ట్కు సంబంధించి జనరల్ నాలెడ్జి, తదితర అంశాల్లోనూ చాలా వెనుకబడి ఉన్నారని స్పష్టం చేసింది. సబ్జెక్టులవారీగా స్కోర్లు ఎంతంటే.. పరఖ్ ద్వారా నిర్వహించిన సర్వే పరీక్షలో విద్యార్థులు ఇచ్చిన సమాధానాలను అనుసరించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్ టెస్టుల్లో ఏయే విభాగాల విద్యార్థులు ఎంత స్కోర్ చేశారో పరిశీలిస్తే అన్ని విభాగాల్లోనూ సగం శాతమే స్కోర్ ఉంది. గణితంలో.. ♦గణితంలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు సాధించిన సగటు స్కోరు 37.48 శాతం మాత్రమే. ♦ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) విద్యార్థుల సగటు స్కోరు 38.9 శాతం. ♦మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల సగటు స్కోర్ 39.48 శాతం ♦ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల సగటు స్కోర్ 40.02 శాతం ♦కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థుల సగటు స్కోర్ 40.12 శాతం ఫిజిక్స్లో.. ♦ఫిజిక్స్ అంశాల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు.. 52.5 శాతం సగటు స్కోర్తో మంచి ప్రతిభ చూపారు. ♦వీరి తర్వాత 51 శాతం స్కోర్తో కంప్యూటర్ సైన్స్, 50 శాతం స్కోర్తో మెకానికల్ విద్యార్థులు వరుస స్థానాల్లో ఉన్నారు. కెమిస్ట్రీలో.. కెమిస్ట్రీ ప్రశ్నలకు సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు 53.1% సగటు స్కోర్తో అగ్రభాగాన ఉన్నారు. సీఎస్ఈ విద్యార్థులు 53%, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు 51.3 శాతంతో తర్వాత స్థానాల్లో నిలిచారు. ఆప్టిట్యూడ్ టెస్టులో.. ఆప్టిట్యూడ్ టెస్టుకు సంబంధించి జనరల్ నాలెడ్జి తదితర అంశాల్లో విద్యార్థుల లోపాలు పరఖ్ సర్వేలో వెల్లడయ్యాయి. జనరల్ నాలెడ్జి, లాజికల్ రీజనింగ్ తదితర అంశాల్లో విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. సర్వేలో పాల్గొనని అనేక విద్యాసంస్థలు పరఖ్ సర్వేలో ఐఐటీలు సహా అనేక సాంకేతిక విద్యాసంస్థలు పాల్గొనలేదు. తమిళనాడు నుంచి 24,499 మంది పాల్గొనగా.. అత్యల్పంగా గోవా నుంచి ముగ్గురు విద్యార్థులే పాల్గొన్నారు. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ల నుంచి 12,387 మంది విద్యార్థులు ఈ పరఖ్ సర్వేలో భాగస్వాములయ్యారు. ఏపీ నుంచి 5,628, తెలంగాణ నుంచి 4,234, కర్ణాటక నుంచి 8,739, కేరళ నుంచి 3,431, మహారాష్ట్ర నుంచి 11,334, యూపీ నుంచి 5,288 మంది పాల్గొన్నారు. -
డ్రగ్స్తో పట్టుబడ్డ ఇంజనీరింగ్ విద్యార్థులు
-
విషాదం మిగిల్చిన ఈత సరదా
అబ్దుల్లాపూర్మెట్: సరదాగా కుంటలో ఈత కొట్టేందుకు దిగిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వాసం స్వామి కథనం ప్రకారం.. నాదర్గుల్లోని స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న మహబూబ్నగర్ జిల్లా కొమిరెడ్డిపల్లికి చెందిన ఎస్.క్రాంతికుమార్రెడ్డి (20), సంగారెడ్డి జిల్లా పాంపాడ్కు చెందిన పటోళ్ల శ్రీకాంత్ (20) శుక్రవారం సప్లిమెంటరీ పరీక్షలు రాసి మిగతా ఆరుగురు స్నేహితులతో కలిసి సంఘీనగర్ దేవాలయాల పరిసరాలకు వచ్చారు. కొహెడ శివారులోని నీటి కుంటలో సరదాగా ఈత కొట్టేందుకు దిగారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన మిగతా విద్యార్థులు.. 100కు డయల్ చేసి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కుంటలోకి దిగి ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
2000 మందికి సున్నా మార్కులు.. నోరెళ్లబెట్టిన విద్యార్థులు, కారణమేంటి?
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లో దాదాపు 2 వేల మంది విద్యార్థులకు కొన్ని పేపర్లలో సున్నా మార్కులు రావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగగా.. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ 2, 3 సంవత్సరాల విద్యార్థుల ఆఖరి సెమిస్టర్ మార్కులను ఇటీవల ప్రకటించారు. ఈ ఫలితాల్లో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులకు కొన్ని సబ్జెక్టుల్లో జీరో మార్కులు వచ్చాయి. వీరిలో ఎక్కువమంది పాలిటెక్నిక్ డిప్లొమా చేసి, ఐసెట్ ద్వారా నేరుగా ఇంజనీరింగ్ రెండో ఏడాది ప్రవేశాలు పొందిన వాళ్లు కావడం గమనార్హం. ఇంటర్నల్ పరీక్షల్లో వీరిలో చాలామందికి 25కు గాను 23 వరకు మార్కులొచ్చాయి. అయితే ఎక్స్టర్నల్స్లో మాత్రం ఏకంగా జీరో రావడం విస్మయం కలిగిస్తోంది. ఈ విధంగా మార్కులొచ్చిన వారు ఇప్పటివరకు 2 వేల మందిని గుర్తించినట్టు విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. అన్ని కాలేజీల నుంచి డేటా తెప్పిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. జవాబు పత్రాల మూల్యాంకనం దశలోనో, మార్కుల వెల్లడిలోనో జరిగిన సాంకేతిక లోపం ఇందుకు కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. (చదవండి: దీపం ఆరింది.. దిశగా వెలిగింది.. ‘దిశ’ విషాదానికి నేటితో రెండేళ్లు ) ఇప్పటికీ వినియోగంలో పాత సాఫ్ట్వేర్ కళాశాలలకు చెందిన జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసిన తర్వాత మార్కులను ఆయా కాలేజీల వారీగా జేఎన్టీయూహెచ్ సాఫ్ట్వేర్లో ఆప్లోడ్ చేస్తారు. దీనికోసం వర్సిటీ ఇప్పటికీ ఎప్పుడో పాతకాలం నాటి సాఫ్ట్వేర్నే వాడుతోంది. ఆప్లోడ్ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరిగినా దాన్ని తప్పుగా గుర్తించే విధానం ఈ సాఫ్ట్వేర్లో లేదని, తప్పులు ఆటోమేటిక్గా గుర్తించే సాఫ్ట్వేర్ను వర్సిటీ ఇప్పటికీ అందిపుచ్చుకోలేదని నిపుణులు అంటున్నారు. మరోవైపు అధ్యాపకులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత నెలలో జరిగిన పరీక్షలకు దాదాపు రెండు లక్షల వరకు విద్యార్థులు హాజరయ్యారు. అయితే అతి తక్కువ మందితో వాల్యుయేషన్ చేయించడం, వేగంగా మార్కులు అప్లోడ్ చేయించడం జరిగిందని చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు జీరో మార్కులు రావడానికి ఇవన్నీ కారణాలై ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. జేఎన్టీయూహెచ్ అధికారులు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకుంటే గానీ ఏమీ చెప్పలేమంటున్నారు. (చదవండి: మల్లాపూర్: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్) సాంకేతిక సమస్యలు సరిదిద్దుతాం ఎంతమందికి జీరో మార్కులొచ్చాయో డేటా తెప్పిస్తున్నాం. సమాధాన పత్రాలు పరిశీలిస్తాం. ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తిస్తాం. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసే అవకాశం లేదు. సాంకేతికపరమైన సమస్యలుంటే సరిదిద్దుతాం. విద్యార్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని, వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. – మంజూర్ హుస్సేన్, రిజిస్ట్రార్, జేఎన్టీయూహెచ్ అధ్యాపకులపై ఒత్తిడే కారణం.. వాల్యుయేషన్ నేపథ్యంలో అధ్యాపకులపై విపరీ తమైన ఒత్తిడి ఉంటోంది. వర్సిటీ అధికారులు త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు పరుగులు పెట్టిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ పని చేయిస్తున్నారు. వాల్యుయేషన్కు వెళ్లినా కాలేజీల్లో బోధన చేయాల్సి వస్తోంది. జీరో మార్కులు రావడానికి ఈ పరిస్థితులే కారణమని భావిస్తున్నాం. – అయినేని సంతోష్కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, సాంకేతిక కాలేజీల ఉద్యోగుల సంఘం అప్పుడు 82 శాతం.. ఇప్పుడు జీరో ఇంటర్నల్స్లో నాకు 82% మార్కులొచ్చాయి. రెండో ఏడాది మ్యాథ్స్ పేపర్లో సున్నా మార్కులు వేశారు. పరీక్ష బాగానే రాశాను. అందుకే ఇదేం అన్యాయమని కాలేజీ వాళ్లను అడిగాను. జవాబు పత్రం మూల్యాంకనం చేసేది మేము కాదు యూనివర్సిటీ వాళ్లని, అక్కడకెళ్లి అడగాలని చెబుతున్నారు. – సంజయ్, విద్యార్థి, అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ అధికారులే బాధ్యత వహించాలి వర్సిటీ అధికారుల మొద్దు నిద్రకు ఇది ఓ ఉదాహరణ. ఇంటర్నల్స్లో 90 శాతానికి పైగా మార్కులొచ్చిన విద్యార్థులకు ప్రధాన పరీక్షలో సున్నాలు ఎలా వస్తాయి? విద్యార్థుల జీవితాలతో అధికారులు చెలగాటమాడటం అన్యాయం. ఇందుకు అధికారులు బాధ్యత వహించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి. – నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ -
ఇంజనీరింగ్, ఫార్మసీలో 1.45 లక్షల సీట్లు
సాక్షి, అమరావతి: ఏపీఈఏపీ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. వెబ్ కౌన్సెలింగ్కు కాలేజీల్లోని కోర్సులవారీగా సీట్ల సంఖ్యను ప్రభుత్వం సోమవారం ఖరారు చేసింది. ఈ మేరకు వేర్వేరు జీవోలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్చంద్ర విడుదల చేశారు. తొలిసారిగా యూనివర్సిటీల కాలేజీలు, ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలతో పాటు ప్రైవేటు యూనివర్సిటీల్లోని 35 శాతం సీట్లు కూడా కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. 2021–22 విద్యా సంవత్సరంలో తొలి విడత కౌన్సెలింగ్కు 1,45,421 ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అత్యధికం కంప్యూటర్ సైన్సు విభాగంలో ఉన్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ (ఈసీఈ), మెకానికల్, కెమికల్, సివిల్ వంటి కోర్ సబ్జెక్టులకు సంబంధించినవి ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి మొత్తం 435 కాలేజీలు ఈసారి కౌన్సెలింగ్లో ఉన్నాయి. నేటినుంచి వెబ్ ఆప్షన్లు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 5వ తేదీ వరకు ఆప్షన్లను నమోదు చేయవచ్చు. 6వ తేదీన మార్పులు చేసుకోవచ్చు. 10వ తేదీన తొలి విడత సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్ధులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు సంబంధిత కాలేజీల్లో ఈనెల 15వ తేదీలోపు చేరాలి. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. -
ఇంజనీరింగ్ విద్యార్థినులకు స్కాలర్షిప్.. ఏడాదికి 50 వేలు
ఇంజనీరింగ్, డిప్లొమా చదివే విద్యార్థినులకు ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్షిప్ ప్రకటన వచ్చేసింది. ప్రతిభావంతులైన విద్యార్థినులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించే ఉద్దేశంతో అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ప్రతి ఏటా ఈ స్కాలర్షిప్ అందిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల విద్యార్థులు నవంబర్ 30వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఇలా ఏఐసీటీఈ గతంలో 4వేల మందికి స్కాలర్షిప్స్ను అందించేది. ఇందులో బీటెక్ అభ్యసించేవారికి 2000, డిప్లొమా వారికి 2000 చొప్పున కేటాయించింది. ప్రస్తుతం 2021 ఏడాది సంబంధించి ఈ స్కాలర్షిప్స్ సంఖ్యను భారీగా పెంచింది. 4 వేల నుంచి 10వేలకు(బీటెక్–5000, డిప్లొమా–5000)పెంచింది. ఆర్థిక ప్రోత్సాహం ప్రగతి స్కాలర్షిప్ పథకం కింద ఎంపికైన ప్రతి విద్యార్థినికి ఏడాదికి రూ.50వేల చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. కాలేజీ ఫీజు, కంప్యూటర్ కొనుగోలు, స్టేషనరీ, బుక్స్, ఎక్విప్మెంట్ తదితర అవసరాలన్నింటికీ కలిపి ఈ మొత్తాన్ని డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విధానంలో అందజేస్తారు. అర్హత ఏఐసీటీఈ గుర్తింపు పొంది టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ ఇయర్ బీటెక్/డిప్లొమా కోర్సుల్లో చేరి ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకుండా ఉండాలి. కుటుంబంలో అర్హులైన విద్యార్థినులు ఇద్దరూ ఉంటే ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంబంధిత కాలేజీలో బీటెక్/పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ధ్రువపత్రాలు పదోతరగతి/ఇంటర్ అకడమిక్ సర్టిఫికెట్లు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, సంబంధిత ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ పొందిన సర్టిఫికేట్, ట్యూషన్ ఫీజు రిసిప్ట్, ఆధార్తో లింక్ అయి ఉన్న బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఫోటోగ్రాఫ్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్, తల్లిదండ్రుల ధ్రువీకరణ పత్రం ఉండాలి. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.11.2021 ► వెబ్సైట్: https://www.aicte-india.org/ -
ఇంజనీరింగ్ విద్యార్థులకు వీఎల్ఎస్ఐ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ప్రాథమిక, ఉన్నత పాఠశాల, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా పాఠ్యాంశాల ప్రసారాలు అందించిన టీ–శాట్ ఇక ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ప్రత్యేక శిక్షణా ప్రసారాలను అందుబాటులోకి తేనుంది. టాస్క్, పీవీసీ (ఫోటానిక్స్ వాలి కార్పొరేషన్), వేద ఐఐటీ సంయుక్తంగా వెరీ లార్జ్స్కేల్ ఇంటిగ్రేషన్ (వీఎల్ఎస్ఐ) ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్లపై టీ–శాట్ చానళ్ల ద్వారా ఈనెల 26 నుంచి పాఠాలను బోధించనున్నట్టు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. టీ–శాట్ ద్వారా అందించే ఎక్స్పోజర్ ట్రైనింగ్తో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమల పురోగతి, మెరుగైన నైపుణ్యం, ఉద్యోగాల కల్పన, వివిధ సంస్థల సాంకేతికత తదితర అంశాలపై ప్రసారమయ్యే ప్రత్యేక బోధనను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 8:15 గంటల నుంచి నేటి ఉదయం 8:15 గంటల నుంచి 10:30 గంటల వరకు టీ–శాట్ నిపుణ చానల్లో ఈ ప్రత్యేక శిక్షణ ప్రసారాలు ఉంటాయని టీ–శాట్ నెట్వర్క్ చానళ్ల సీఈవో ఆర్.శైలేశ్రెడ్డి తెలిపారు. 15 రోజులపాటు 30 గంటలు ఈ ప్రసారాలు కొనసాగుతాయని, సాయంత్రం 7 గంటల నుంచి 9 వరకు పునఃప్రసారమవుతాయని వెల్లడించారు. టీ–శాట్ నిపుణ చానల్తోపాటు టీశాట్ ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్లోనూ ఈ ప్రసారాలు అందుబాటులో ఉంటాయి. సందేహాల నివృత్తి కోసం 040–23540326, 23540726, టోల్ఫ్రీ నంబర్ 18004254039లను సంప్రదించాలని శైలేశ్రెడ్డి చెప్పారు. -
ఇంజనీరింగ్ పూర్తి: మతిస్థిమితం కోల్పోయి తల్లిని చంపిన కూతుళ్లు
టీ.నగర్: తల్లిని హతమార్చిన మతిస్థిమితం లేని ఇద్దరు కుమార్తెలపై కేసు నమోదైంది. తిరునెల్వేలి జిల్లా పాళయంకోటైకి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి కోయిల్పిచ్చై, ఉషా (50) దంపతులకు కుమార్తెలు నీనా(21), రీనా(19) ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. కోయిల్పిచ్చై మున్నీర్పల్లంలో ఉంటున్నాడు. నీనా, రీనా ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కొద్ది నెలల క్రితం నుంచి కుమార్తెలు ఇరువురికి మతిస్థిమితం లేకుండా పోయింది. మంగళవారం మధ్యాహ్నం ఉషాతో కుమార్తెలు గొడవపడ్డారు. కేకలు విని ఇరుగుపొరుగువారు ఉషా ఇంట్లోకి వచ్చి చూడగా ఆమె నిర్జీవంగా కనిపించింది. పోలీసుల విచారణలో కత్తి, ఇనుపరాడ్తో దాడి చేయడం వల్లే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. -
బైక్ అంబులెన్సులు.. ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభ
గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు బైక్ అంబులెన్సులను రూపొందించారు. అత్యవసర సమయాల్లో కరోనా రోగులకు ఉపయోగపడేలా వీటిని తయారు చేశారు. ఆక్సిజన్ సిలిండర్, వీల్ చైర్, ఎమర్జెన్సీ మెడికల్ కిట్ ఇందులో ఉంటాయి. పూణేకు చెందిన డసల్ట్ సిస్టమ్స్ కంపెనీ ప్రతినిధి సుహాస్ ప్రీతిపాల్ పర్యవేక్షణలో మెకానికల్ సెకండియర్ చదువుతున్న గుత్తికి చెందిన యశ్వంత్, ఎజాజ్ అహ్మద్ 45 రోజులు శ్రమించి బైక్ అంబులెన్సులను రూపొందించారు. ఇప్పటిదాకా తయారైన పది బైక్ అంబులెన్సులను త్వరలోనే సచివాలయాలకు ఉచితంగా అందజేస్తామని గేట్స్ కాలేజీ ఎండీ గజ్జల రఘునాథ్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఒక్కో అంబులెన్స్ తయారు చేయడానికి దాదాపు రూ.50 వేలు ఖర్చయ్యిందని, కరోనా రోగులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతోనే వీటిని రూపొందించామని విద్యార్థులు యశ్వంత్, ఎజాజ్ అహ్మద్ చెప్పారు. -
ఎంసెట్ ఇక ఈఏపీసెట్
సాక్షి, అమరావతి: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సహా పలు ప్రొఫెషనల్ యూజీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం ప్రకటించారు. ఇంజినీరింగ్ తదితర కోర్సులకు ఇంతకు ముందు ఏపీ ఎంసెట్ నిర్వహించేవారు. మెడికల్ కోర్సుల ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ‘నీట్’ నిర్వహిస్తుండటంతో మెడికల్ విభాగాన్ని ఎంసెట్ నుంచి మినహాయిం చారు. మెడికల్ను తొలగించినందున ఏపీ ఎంసెట్ ను ఏపీ ఈఏపీసెట్(ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)–2021 పేరుతో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను ఆగస్టు 19 నుం చి 25 వరకూ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. సెప్టెంబర్ మొదటి, రెండో వారాల్లో ఇతర ప్రవేశ పరీక్షలు.. ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్సెట్, పీఈసెట్ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ మొదటి, రెండో వారాల్లో నిర్వహించే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఏపీ ఈఏపీసెట్–2021 షెడ్యూల్.. ►అపరాధ రుసుము లేకుండా జూన్ 26 నుంచి జూలై 25వ తేదీ వరకు ►రూ.500 ఫైన్తో జూలై 26 నుంచి ఆగస్టు 5 వరకు ►రూ.1,000 లేట్ ఫీజుతో ఆగస్టు 6 నుంచి 10 వరకు ►రూ.5,000 లేట్ ఫీజుతో ఆగస్టు 11 నుంచి 15 వరకు ►రూ.10 వేల అపరాధ రుసుముతో ఆగస్టు 16 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి తెలిపారు. -
లాంగ్ డ్రైవ్: ఇంజనీరింగ్ విద్యార్థుల దుర్మరణం
మాదాపూర్: లాంగ్డ్రైవ్ కోసం వచ్చిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు డివైడర్ను ఢీకొని మృత్యువాత పడ్డారు. మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... బీఎన్ రెడ్డి నగర్లోని హాస్టల్లో ఉంటున్న వినయ్కుమార్రెడ్డి(23) గురునానక్ కళాశాలలో, సన్ని రామిరెడ్డి(21) శ్రీదత్త కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. డ్యూక్ బైక్ పై లాంగ్డ్రైవ్ కోసం ఎల్బీనగర్ నుంచి డీఎల్ఎఫ్ వెళ్తూ కొత్తగూడలో డివైడర్ను ఢీకొన్నారు. ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘డేటింగ్ ట్రాప్’ ముంబై వ్యక్తి పనే.. -
జిరాక్స్ కాపీలే కాలేజీలకు ఇవ్వండి
సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్–2020 ద్వారా వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీలో చేరే సమయంలో సర్టిఫికెట్లకు సంబంధించి జిరాక్స్ కాపీలు మాత్రమే సమర్పించాలని అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ ప్రత్యేక కమిషనర్ ఎంఎం నాయక్ కోరారు. ఈ మేరకు విద్యార్థులకు జారీచేసిన అలాట్మెంట్ ఆర్డర్లలో పలు సూచనలు పొందుపరిచారు. ఇలా చేయాలి.. ► అభ్యర్థులు ముందుగా అలాట్మెంట్ ఆర్డర్ను ‘ఏపీఈఏఎంసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ► ఆ తరువాత అభ్యర్థి లాగిన్ అయి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ► తదుపరి జాయినింగ్ రిపోర్ట్, అలాట్మెంట్ ఆర్డర్, రిసీప్ట్ ఆఫ్ సర్టిఫికెట్లను రెండు కాపీల చొప్పున ప్రింట్ తీసుకుని వారికి కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలి. ► ఒక కాపీని కాలేజీలో సమర్పించి.. రెండో కాపీపై అకనాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. ► ఆన్లైన్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు వెబ్సైట్ నుంచి రిసీప్ట్ ఆఫ్ సర్టిఫికెట్ను డౌన్లోడ్ చేసుకుని దాన్ని కూడా కాలేజీలో సమర్పించాలి. సీటు కేటాయింపు అయిన అభ్యర్థులు దాన్ని నిలుపుకోవాలంటే సెల్ఫ్ రిపోర్టింగ్తో పాటు, కాలేజీలో రిపోర్టు చేయడం తప్పనిసరి. ఇందుకు చివరి తేదీ 2021 జనవరి 8. ► వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్, అనంతరం కాలేజీలో రిపోర్టు చేయని వారి అలాట్మెంట్ సీటును ఖాళీగా పరిగణిస్తారు. తరువాత కౌన్సెలింగ్ సమయంలో మొదటి విడత సీటు కేటాయింపు రద్దవుతుంది. ► రెండో కౌన్సెలింగ్లో ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థుల్లో అర్హులకు దాన్ని కేటాయిస్తారు. ► విద్యార్హతలకు సంబంధించిన వివరాలు పరిశీలనలో తప్పని తేలితే సదరు అభ్యర్థికి సీటును రద్దుచేయడంతో పాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకుంటారు. ► అభ్యర్థులు అడ్మిషన్ల సమయంలో సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులనే సమర్పించాలి. ► ఒరిజినల్ సర్టిఫికెట్లను కేవలం పరిశీలన వరకు అందించి తదుపరి వెనక్కి తీసుకోవాలి. ► ఫీజు రీయంబర్స్మెంట్కు అర్హులు కాని అభ్యర్థులు తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తరువాత మాత్రమే ఆయా కాలేజీల్లో ట్యూషన్ ఫీజులు చెల్లించాలి. ► తుది విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యే వరకు విద్యార్థుల నుంచి కాలేజీ యాజమాన్యాలు ఎలాంటి ఫీజులు వసూలుచేయకూడదు. నేటి నుంచి ఇంజనీరింగ్ తరగతులు తొలివిడత కౌన్సెలింగ్ ముగియడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ తరగతులను బుధవారం నుంచి ప్రారంభించేలా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అకడమిక్ క్యాలెండర్ను ప్రకటించింది. కోవిడ్–19 నేపథ్యంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించేలా ఆదేశాలు జారీచేసింది. ఇదీ క్యాలెండర్.. ప్రొఫెషనల్ యూజీ కోర్సుల తరగతుల ప్రారంభం : జనవరి 6 ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు : ఏప్రిల్ 17 సెకండ్ సెమిస్టర్ ప్రారంభం : మే 3 సెకండ్ సెమిస్టర్ పరీక్షలు : ఆగస్టు 23 థర్డ్ సెమిస్టర్ ప్రారంభం : సెప్టెంబర్ 1 -
జేఎన్టీయూ వద్ద విద్యార్థుల ధర్నా ఫొటోలు
-
‘ఇంజనీరింగ్ పరీక్షలను రద్దు చేయండి’
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జవహార్లాల్ నెహ్రు టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) వద్ద విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. ఇంజనీరింగ్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.. యూనివర్సిటీ గేటు దాటి విద్యార్థులంతా మూకుమ్మడిగా లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. పలువురు విద్యార్థును అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. -
విద్యార్థిని నగ్న చిత్రాల కేసులో మరో మలుపు
పట్నంబజారు (గుంటూరు): గుంటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన కేసులో మరో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి నగ్నచిత్రాలు తీసిన వరుణ్, వాటిని పోర్న్ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన కౌశిక్లను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు ఇన్స్ట్రాగామ్లో అప్లోడ్ చేసిన యువకుడి కోసం గాలిస్తున్న విషయం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు.. “మై నేమ్ ఈజ్ 420’ అనే ఇన్స్ట్రాగామ్ ఐడీపై విద్యార్థిని నగ్న చిత్రాలను అప్లోడ్ చేసిన యువకుడిని పోలీసులు గుర్తించారు. విద్యార్థిని చదివిన కళాశాలలోనే చదివిన విద్యారి్థకి ఈ వీడియోలు, చిత్రాలు అందాయి. (మరో ఇద్దరు యువతుల ప్రమేయం!) అయితే ఇవి ఎక్కడ నుంచి అతడికి వచ్చాయి అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీడియోలు సంపాదించిన విద్యార్థి వాటిని ఇన్స్ట్రాగామ్లో అప్లోడ్ చేయటంతో పాటు మరో నలుగురికి పంపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో డెల్టా ప్రాంతానికి చెందిన విద్యార్థితో పాటు అతని స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. వీడియో తీసుకున్న విద్యార్థి సదురు విద్యార్థినిని బెదిరించి నగదు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. -
కాలేజ్లో కీచకులు
-
గుంటూరులో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల కీచకపర్వం
-
మరో ఇద్దరు యువతుల ప్రమేయం!
సాక్షి, గుంటూరు: ఇంజనీరింగ్ విద్యార్థుల కీచక పర్వం గుంటూరు పట్టణంలో శనివారం వెలుగు చూసింది. తోటి విద్యార్థినితో సన్నిహితంగా ఉంటూ వీడియోలు చిత్రీకరించిన ఇద్దరు యువకులు.. వాటిని అడ్డుపెట్టుకుని కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేశారు. తాము చెప్పినట్టు వినకుంటే ఆ వీడియోలను వెబ్సైట్లో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. మూడేళ్లుగా ఆమెపై వేధింపుల పరంపర సాగుతోంది. ఈక్రమంలో బాధితురాలు దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు వరుణ్, కౌశిక్లను 24 గంటల్లోనే అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. (చదవండి: చంద్రదండు అధ్యక్షుడిపై వేధింపుల కేసు) ఇద్దరు యువతుల ప్రమేయం వీడియోలతో యువతిని వేధించిన కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితులు వరుణ్, కౌశిక్తో పాటు మరో ఇద్దరు యువతులకు ఈ కేసులో ప్రమేయమున్నట్టు వెల్లడైండి. వరుణ్ స్నేహితురాలి ద్వారా కౌశిక్ చెల్లెలికి బాధితురాలి వీడియోలు అందినట్టు పోలీసులు గుర్తించారు. కౌశిక్ ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయించాడు. వీడియోలు చూపిస్తూ కోరిక తీర్చాలని బాధితురాలిని వేధింపులకు గురిచేశాడు. కాగా, వీడియోలు బయటకు రావడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు యువతులపై కూడా పోలీసులు కేసులు పెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం. -
ఆకతాయిల ఆగడాలకు ‘చెప్పు’ దెబ్బ
సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మాయి కదా అని హద్దుమీరారో అలారం మోగుతుంది. తాకేందుకు ప్రయత్నించారో షాక్ కొడుతుంది. మాన, ప్రాణాలను కాపాడుకునేలా మహిళల పాదరక్షల్లో అమర్చే ఎలక్ట్రానిక్ పరికరాన్ని తమిళనాడుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థినులు రూపొందించారు. వివరాలు.. తంజావూరుకు చెందిన బీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ పట్టభద్రురాలైన అమృతగణేష్ (33) 600కు పైగా పరికరాలను తయారుచేసింది. తంజావూరులోని ఒక ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు సంగీత, సౌందర్య, వినోదిని, విద్యార్థి మణికంఠన్లు అమృతగణేష్తో కలిసి అనేక పరిశోధనలు చేశారు. వేధింపుల బారినుంచి మహిళలు తమను తాము కాపాడుకునేందుకు వైర్లెస్ రిసీవర్, బ్యాటరీ, ఎలక్ట్రోడులను వినియోగించి పాదరక్షల్లో ఇమిడేలా ఒక పరికరాన్ని తయారుచేశారు. మహిళలు వేధింపులకు గురికాగానే వారు ధరించిన చెప్పుల్లోని ఆ పరికరం నుంచి వంద మీటర్ల వరకు వినిపించేలా అలారం మోగుతుంది. అంతేగాక ఆ చెప్పును నిందితునికి తాకిస్తే షాక్కు గురయ్యేలా తీర్చిదిద్దారు. ఈ పరికరానికి చార్జింగ్ చేయాల్సిన పనిలేదు. నడిచేటప్పుడే రీచార్జ్ అవుతుంది. ఈ పరికరాన్ని సెల్ఫోన్, రిస్ట్వాచ్లలో కూడా అమర్చుకోవచ్చు. (చదవండి: ఐటీ అధికారుల ముందుకు అర్చన కల్పత్తి) -
ఎంట్రీ అదిరింది
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కు ఈ ఏడాది ఉద్యోగాల పంట పండుతోంది. ప్రముఖ ఐటీ కంపెనీలు ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల కోసం నిర్వహించే క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులకు భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పించాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 1.80 లక్షల మందికి ప్లేస్మెంట్స్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న కంపెనీలు ఇప్పటికే 1.54 లక్షల మంది బీటెక్ విద్యార్థులను తమ కంపెనీల్లో ఉద్యోగులుగా చేర్చుకున్నాయి. అయితే ఈ ఎంట్రీలెవెల్ ఉద్యోగాల్లో 94 శాతం మంది ఇంజనీరింగ్ విద్యార్థులు చేరుతుండగా, 6 శాతం మంది బీఎస్సీ (కంప్యూటర్స్) విద్యార్థులున్నారు. ఈ రెండు కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్న ఐటీ కంపెనీలు ఎంటెక్ చదువుతున్న వారికి ఉద్యోగం ఇచ్చేందుకు మాత్రం ఆసక్తి చూపకపోవటం గమనార్హం. ఈ ఏడాది టయర్–1, టయర్–2కే పరిమితం టీసీఎల్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ఆక్సెంచర్, విప్రోలాంటి టాప్ కంపెనీలు దేశవ్యాప్తంగా డిసెంబర్ 10 నాటికి 65 వేల మందికి ఉద్యోగాలు కల్పించాయి. ఈ ఏడాది ఇప్పటివరకు హైదరాబాద్లోని టయర్–1, టయర్–2 ఇంజనీరింగ్ కాలేజీల్లో దాదాపు 8 వేల మందిని 5 టాప్ ఐటీ కంపెనీలు ఉద్యోగులుగా నియమించుకున్నాయి. మైక్రోసాఫ్ట్, బ్యాంక్ అఫ్ అమెరికా, ఒరాకిల్, అమెజాన్, డెలాయిట్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు టయర్–1 కాలేజీలకు మాత్రమే పరిమితమయ్యాయి. హైదరాబాద్లో టయర్–1 కేటగిరీకి చెందిన 12 ఇంజనీరింగ్ కళాశాలల మొత్తం విద్యార్థుల్లో 92 శాతం మందికి ఉద్యోగాలు లభించాయి. అలాగే ఐఐటీ హైదరాబాద్, నిట్ వరంగల్, బిట్స్ శామీర్పేట కళాశాలల నుంచి ప్లేస్మెంట్కు హాజరైన ప్రతి విద్యార్థికి ఉద్యోగం లభించగా, ఐఐటీ, నిట్ విద్యార్థులకు విదేశీ సంస్థలు భారీగా ఆఫర్లు ఇచ్చాయి. అయితే, వచ్చే ఏడాది హైదరాబాద్లోని టయర్–3 కళాశాలల్లో నియామకాలు చేపడతామని టీసీఎస్, ఇన్ఫోసిస్, ఆక్సెంచర్ లాంటి కంపెనీలు ప్రకటించడం మంచి పరిణామంగా కనిపిస్తోంది. అదే జరిగితే దాదాపు 60 ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లకు అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది 2 లక్షల ఉద్యోగాలు నాస్కామ్ అంచనా ప్రకారం వచ్చే ఏడాది ఎంట్రీ లెవెల్లో 2 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అదే జరిగితే తెలంగాణ, ఏపీలోని టయర్–1, 2, 3 కాలేజీల్లో దాదాపు 25 వేల మంది బీటెక్ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ ప్లేస్మెంట్ అధికారి చెప్పారు. ఈ ఏడాది ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు లభించాయని, వచ్చే ఏడాదికి ఇప్పటినుంచే కంపెనీల నుంచి లేఖలు అందుతున్నాయని ఆ అధికారి వెల్లడించారు. హైదరాబాద్, విశాఖపట్నంలో ఐటీ కంపెనీల కార్యకలాపాలు పెరుగుతున్న దృష్ట్యా ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఐటీ విశ్లేషకులు అంటున్నారు. విదేశాల నుంచి భారీగా ఆర్డర్లు.. ఇప్పటివరకు దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీలకు ఉత్తర అమెరికా నుంచి భారీగా ఆర్డర్లు వచ్చేవి. ఇప్పుడు యూరప్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియాతో పాటు గల్ఫ్ దేశాలు, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల నుంచి భారీగా ఆర్డర్లు వచ్చిపడుతున్నాయి. ఇక గడచిన ఆరు మాసాల్లో 100 బిలియన్ డాలర్ల మేర ఆర్డర్లు వచ్చాయని నాస్కామ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. గడచిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది చివరి నాటికి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో భారీగా ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంది. కాగ్నిజెంట్, ఆక్సెంచర్ వంటి విదేశీ కంపెనీలు ఇక్కడ ఉద్యోగులను నియమించుకుని శిక్షణ అనంతరం ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, బ్రిటన్, ఐర్లాండ్ వంటి దేశాలకు బదిలీ చేస్తున్నాయి. హెచ్1బీ వీసాల కారణంగా అమెరికా బదులు కెనడా, యూరప్ దేశాల్లోని కార్యాలయాల్లో ఎక్కువగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. -
పట్టాలపై చితికిపోయిన ఇంజనీరింగ్ విద్యార్థులు
కోయంబత్తూర్: రైలు కింద పడి నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందిన ఘటన కోయంబత్తూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అయిదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు బుధవారం రాత్రిపూట రైలు పట్టాలపై కూర్చున్నారు. అదే సమయంలో వేగంగా వచ్చిన చెన్నై-అలాప్పుజా ఎక్స్ప్రెస్ రైలు వారిపై నుంచి వెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మరణించగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కోయంబత్తూరు దగ్గరలోని సూలూరు బ్రిడ్జ్ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలంలో దొరికిన మందు బాటిళ్లు, ప్లాస్టిక్ కప్పులు ఆధారంగా వారు మద్యం సేవించడానికి పట్టాలపైకి వెళ్లినట్లు తెలుస్తోంది. మృతులు స్థానిక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు సిద్దిఖ్ రాజా(22), రాజశేఖర్ (20), గౌతమ్(23), కరుప్పసామీ(24)లుగా గుర్తించారు. వీరితోపాటు అక్కడే ఉన్న మరో విద్యార్థి విగ్నేశ్ తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలయ్యాడు. గౌతమ్, కరుప్పసామీ 2018లోనే ఇంజనీరింగ్ పూర్తవగా పరీక్షల కోసం నగరానికి వచ్చారు. రాజశేఖర్ మూడో సంవత్సరం, మిగతా ఇద్దరు నాలుగో సంవత్సరం చదువుతున్నారు. పరీక్ష రాసిన అనంతరం రౌతర్ పాలెంకు వెళ్లగా రైలు ప్రమాదంలో విగతజీవులుగా మారారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గంజాయికి బానిసలై.. స్మగ్లర్లుగా మారి..
నెల్లూరు (క్రైమ్): గంజాయికి బానిసైన ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు స్మగ్లర్లుగా అవతారమెత్తిన ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. సోమవారం నెల్లూరులోని ఉమేష్చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో కావలి డీఎస్పీ డి.ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళానికి చెందిన ఎస్.పవన్కల్యాణ్, విశాఖపట్టణానికి చెందిన లోకనాథ్ అఖిల్, విజయనగరం జిల్లాకు చెందిన బి.రవితేజ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలానికి చెందిన అమర్నాథ్ (కారు డ్రైవర్) వేలూరులోని విట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివారన్నారు. వీరంతా అక్కడ చదువుతున్న సమయంలోనే గంజాయికి బానిసలయ్యారని తెలిపారు. మత్తుకు బానిసైన వీరు గంజాయి తామే సరఫరా చేస్తే, తమ అవసరాలు తీరడంతో పాటు అధికంగా డబ్బులొస్తాయని భావించి స్మగ్లర్లుగా అవతారమెత్తారని చెప్పారు. విశాఖ ఏజెన్సీలోని తమ స్నేహితుడి ద్వారా గంజాయిని కొనుగోలు చేసి రైలు, రోడ్డు మార్గాన వేలూరుకు తరలించేవారని తెలిపారు. విశాఖ ఏజెన్సీలో కేజీ రూ.3 వేలకు కొనుగోలు చేసి వేలూరులో రూ.25 వేలకు విక్రయిస్తున్నారని, రెండేళ్లుగా ఈ అక్రమ రవాణా నిరాటంకంగా సాగుతోందని వివరించారు. సరుకు తీసుకెళుతూ.. నిందితులు పవన్కల్యాణ్, లోక్నాథ్ అఖిల్, రవితేజ, అమర్నాథ్ అద్దెకు కారు తీసుకుని విశాఖ ఏజెన్సీలోని అరకులో గంజాయిని కొనుగోలు చేశారు. కారులో వేలూరుకు బయలు దేరారు. కావలి వద్ద కారును ఆపి తమ స్నేహితుడైన గంజాయి విక్రేత (మహారాష్ట్ర, పూణేకు చెందిన) ప్రత్యూష్ సిన్హాతో మాట్లాడుతుండగా.. అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో సోమవారం వారందరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా ఈ వ్యవహారంలో మరికొంతమంది హస్తం ఉందని చెప్పడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఈ చదువులు ‘కొన’లేం!
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కళాశాలల్లో విద్యార్థుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న అదనపు ఫీజులకు అడ్డుకట్ట వేయాలంటే విద్యార్థులకు అందుబాటులో వర్సిటీ అధికారుల ఫోన్ నంబర్లు, వాట్సాప్ నంబర్లు ఉంచాలి. మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు, వర్సిటీలో ఫిర్యాదుల పెట్టెను అందుబాటులోకి తీసుకు రావాలి. దీంతో పాటు ఫిర్యాదు చేసిన విద్యార్థుల పేర్లను బయట పెట్టవద్దనే అభిప్రాయాలను పలువురు విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. సాక్షి,సిటీబ్యూరో: పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కాలేజీ చదువులు భారమయ్యాయి. ఆయా కళాశాలలు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఎఎఫ్ఆర్సీ) నిబంధనల మేరకు కాకుండా విద్యార్ధుల నుంచి అదనపు దోపిడీకి పాల్పడుతున్నాయి. ఎంసెంట్ కౌన్సెలింగ్కు ముందు విద్యార్థుల తల్లిదండ్రులకు అరచేతిలో వైకుంఠం చూపించి, టీఎఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజులకు అదనంగా ఒక్క రూపాయి తీసుకోబోమని నమ్మించి.. తమ కళాశాలలో అన్ని వసతులతో పాటు, క్యాంపస్ ఇంటర్వ్యూలు అధికంగా ఉంటాయని వల వేస్తున్నారు. కౌన్సెలింగ్ ముగిసి కాలేజీలో చేరాక ఇంజనీరింగ్ కళాశాలలు తమ అసలు రంగు బయటపెడుతున్నాయి. ల్యాబ్ ఫీజు, లైబ్రరీ ఫీజు, యూనివర్సిటీ ఫీజు, స్కాలర్షిప్ అప్లికేషన్ ఫీజు, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఫీజు, స్పోర్ట్స్ ఫీజు.. ఇలా వివిధ పేర్లతో విద్యార్థుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. దీనివల్ల చాలా మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు వారి తల్లిందడ్రులపై మోయలేని భారం పడుతోంది. ఒక్కసారి కళాశాలలో చేరా ఇష్టం ఉన్నా లేకపోయినా యాజమాన్యాలు అడిగినంత చెల్లించాల్సిన పరిస్థితి. అదనపు ఫీజులు కట్టలేక చేరిన కళాశాలను వదిలి వేరే కళాశాలకు మార్పు చేయించుకోవాలనుకున్నా సవాలక్ష కొర్రీలు ఉండడంతో గత్యంతరం లేక అదే కళాశాలల్లో అదనపు భారం మోస్తూ చదువాల్సి వస్తోంది. ఫీజుల నియంత్రణ టీఎఎఫ్ఆర్సీదే.. ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కళాశాలల్లో ఫీజుల పెంపు నిర్ణయాధికారం తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఎఎఫ్ఆర్సీ)దేనని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కమిటీ ప్రతి మూడేళ్లకు ఓసారి ఫీజులను ఖరారు చేస్తుంది. గతంలో కమిటీ నిర్ణయించిన ధరలను సవాల్ చేస్తూ చాలా కళాశాలలు కోర్టులను ఆశ్రయించాయి. దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఫీజుల పెంపు విషయం పూర్తిగా టీఎఎఫ్ఆర్సీదేనని తేల్చడంతో కళాశాలలు తప్పని పరిస్థితుల్లో కమిటీ నిబంధనలను పాటిస్తున్నాయి. కానీ రూటు మార్చి అదనపు దోపిడీకి తెరలేపుతున్నాయి. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ ఆదేశాల మేరకు ఒక ఇంజినీరింగ్ కళాశాలలో ఫీజు రూ.లక్ష అనుకుంటే, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా రూ.35 వేలు చెల్లిస్తుంది. మిగతా రూ.65 వేలు కట్టడానికి విద్యార్థి తల్లిదండ్రులు ముందే ఒప్పుకుంటారు. దాంతో ఎన్ని ఇబ్బందులు పడైనా చెల్లిస్తారు. కానీ చాలా కళాశాలల యాజమాన్యాలు జేఎన్టీయూహెచ్ నిర్ణయించిన ఫీజులు కాకుండా అదనంగా వసూలు చేస్తున్నాయి. కొరవడిన ప్రభుత్వ పర్యవేక్షణ ప్రైవేటు, అనుబంధ కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేయకుండా చూడాల్సిన బాధ్యత యూనివర్సిటీ అధికారులపై ఉంటుంది. అనుబంధ కళాశాలల్లో మౌలిక వసతులు ఏ మేరకు కల్పిస్తున్నారనే దాన్ని వర్సిటీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. కానీ 80 శాతానికి పైగా కళాశాలలకు నిబంధనల ప్రకారం విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించడం లేదనే విషయం అందరికి తెలిసిందే. అయినప్పటికీ వీటిపై చర్యలు తీసుకోవడం లేదు. మొక్కుబడిగా నిజ నిర్థారణ కమిటీ పర్యటన మినహా అనుబంధ కళాశాలల్లో వర్సిటీ పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. -
గేట్ వే ఆఫ్ అమెరికా.. అమీర్పేట
గత పదేళ్లతో పోలిస్తే ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసి బయటకు వస్తున్న వారి సంఖ్య 10 రెట్లు పెరిగింది. క్యాంపస్ స్థాయిలోనే ప్లేస్మెంట్ దక్కితే సరి.. లేదంటే అమీర్పేటను నమ్ముకోవాల్సిందే. ఇంజినీరింగ్ చదివి బయటకు వచ్చే ఏ ఫ్రెషర్ అయినా అమీర్పేటలో కాలుమోపిన తర్వాతే మరెక్కడికైనా వెళ్తారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగంలో మారుతున్న మార్పులకు అనుగుణంగా ఇక్కడ శిక్షణ సంస్థలు అందించే కోర్సుల్లో కాసింత జ్ఞానం సంపాదించుకుంటే ఉద్యోగంలో రాణించవచ్చని, ఉపాధి పొందవచ్చనే భరోసాను కల్పించడమే కారణం. అందుకేనేమో అమీర్పేటకు గేట్ వే ఆఫ్ అమెరికా అనే పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. దేశంలో ఎక్కడా దొరకని టెక్నాలజీ కోర్సులు ఇక్కడ లభించడం విశేషం. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కోర్సులైన జావా, ఫైతాన్, లిస్ప్, ప్రోలాగ్, సీ++ తదితర ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఒరాకిల్, డాట్నెట్, జావా వంటి పరిమిత బేసిక్ కోర్సులే ఒకప్పుడు ఎక్కువగా వినిపించేవి. ఆ తర్వాత ఆయా టెక్నాలజీలో వచ్చిన అధునాతన మార్పులను అందిపుచ్చుకుంటూనే ప్రస్తుతం రాజ్యమేలుతున్న క్లౌడ్ ఆధారిత టెక్నాలజీ కోర్సుల వరకు ఎప్పటికప్పుడు శిక్షణ కేంద్రాలు పదునుపెట్టుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచమంతా క్లౌడ్ సర్వీసుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న క్రమంలో అమీర్పేటలో ఆయా టెక్నాలజీ కోర్సులకు ఎక్కడా లేని ప్రాధాన్యం సంతరించుకుంది. పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి.. కోర్సుల ద్వారా నైపుణ్యాన్ని పెంచుకుని లక్షల ప్యాకేజీలకు ‘సాఫ్ట్’గా విద్యార్థులు ఎగిరిపోవడమే కాదు.. ఇక్కడ శిక్షణ కేంద్రాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. శిక్షణ కేంద్రాల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది మాట అలా ఉంచితే.. వీటిని నమ్ముకుని టీ స్టాళ్లు, చాట్భండార్, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, హాస్టళ్లు, సాఫ్ట్వేర్ కోర్సుల మెటీరియల్ విక్రయ కేంద్రాలు, ట్రావెల్ ఏజెన్సీలు తదితర సంస్థల నిర్వాహకులు వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. 500 పైచిలుకు శిక్షణ సంస్థలు.. రెండు దశాబ్దాల క్రితం వేళ్ల మీద లెక్కించేంత సాఫ్ట్వేర్ శిక్షణ కేంద్రాలకు మాత్రమే అమీర్పేట పరిమితంగా ఉండేది. మొదట అమీర్పేటలోనే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) కార్యాలయం ఉండేది. కాలక్రమంలో సాఫ్ట్వేర్ కంపెనీలు హైటెక్ సిటీకి వెళ్లిపోగా ఇక్కడ కోచింగ్ సెంటర్ల హవా మొదలైంది. అమీర్పేట మైత్రీవనం, ఆదిత్య ట్రేడ్ సెంటర్, సత్యం టాకీస్ రోడ్డు, గురుద్వారా రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 500 వరకు శిక్షణ సంస్థలు ఆయా కోర్సుల్లో శిక్షణనిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఆన్లైన్ కోర్సులను కూడా అందిస్తున్నాయి. ఖర్చు తక్కువ.. బెంగళూరు, చెన్నైలతో పాటు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ‘సాఫ్ట్’ కోర్సుల్లో శిక్షణకయ్యే ఖర్చు ఇక్కడ చాలా తక్కువ. దీంతో ఏపీ, తెలంగాణకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులే కాకుండా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా వంటి వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో పాటు దక్షిణాఫ్రికా, దుబాయ్, అబుదాబి తదితర దేశాలకు చెందిన విద్యార్థులు సైతం అమీర్పేట శిక్షణ కేంద్రాల్లో శిక్షణ తీసుకుంటుంటారు. గడిచిన రెండు దశాబ్దాల్లో అమీర్పేటలో కాలుపెట్టి అమెరికా వెళ్లినవారు అందుకే గేట్ వే ఆఫ్ అమెరికా.. అమీర్పేట అన్న పేరును సార్థకం చేసుకుంది. ఎప్పటికప్పుడు అప్డేట్.. మార్కెట్లోకి వచ్చే ఏ కొత్త టెక్నాలజీకి సంబంధించిన కోర్సయినా మొదట అమీర్పేట శిక్షణ కేంద్రాల్లో ఉండాల్సిందే. ముఖ్యంగా అమెరికా వెళ్లాలనే ఆశలను నెరవేర్చేందుకు ఇక్కడ శిక్షణ సంస్థలు టెక్నాలజీ కోర్సులను అప్డేట్ చేసుకుంటూనే ఉంటాయి. – ఎన్.కోటి,ఆపరేషన్స్ హెడ్, పీర్స్ టెక్నాలజీస్ భవితకు భరోసా ప్రస్తుతం మార్కెట్లో ఏడబ్ల్యూఎస్కు మంచి డిమాండ్ ఉంది. నేను ఈ కోర్సులో శిక్షణ పొందాను. ఫీజు కూడా ఎంతో రీజనబుల్గా ఉన్నాయి. అనుకున్న సమయంలో కోర్సులు పూర్తి చేసుకోవడం ఇక్కడ ప్రత్యేకత. – గోపీకృష్ణ, ఇంజినీరింగ్ విద్యార్ధి -
బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం
సాక్షి, చెన్నై : నగరంలోని నందనంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థినులు ప్రాణాలు విడిచారు. వివరాలు.. రాజమండ్రికి చెందిన భవానీ, నాగలక్ష్మీ, శివ ఇంజనీరింగ్ చదువుతున్నారు. మంగళవారం ముగ్గురూ ఒకే బైక్పై తాంబారంలోని కాలేజీకి వెళ్తున్న క్రమంలో వెనుకనుంచి మరో బైక్ బలంగా ఢీకొట్టింది. బైక్తో సహా ముగ్గరూ వెనకే వస్తున్న బస్సు కిందపడిపోయారు. బస్సు చక్రాలకింద నలిగి భవానీ, నాగలక్ష్మీ అక్కడికక్కడే ప్రాణాలో కోల్పోగా శివకు తీవ్రగాయాలయ్యారు. వీరి బైక్ను ఢీకొట్టిన వ్యక్తి కూడా గాయాలపాలయ్యాడు. ఇద్దరినీ తాంబారం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. శివ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సమీపంలో ఉన్న సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. -
బృందావన్ గెస్ట్హౌస్లో ఫేర్వెల్..! అదే చివరి పార్టీ
బొమ్మలరామారం (ఆలేరు) : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లి శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు సాయి చైతన్యారెడ్డి, మేరెడ్డి స్ఫూరిరెడ్డి, ప్రణీతలు మృతిచెందగా తీవ్రంగా గాయపడిన వినిత్రెడ్డి (22)ని హైదరాబాద్కు తరలిస్తుండగా మృతిచెందాడు. మరో విద్యార్థి మనీష్రెడ్డి రాజధానిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే..ప్రమాదానికి మైసిరెడ్డిపల్లి శివారులోని ప్రమాదకరంగా ఉన్న మూలమలుపే ప్రధాన కారణంగా తెలుస్తోంది. (చదవండి : కన్నవారికి...కడుపు కోత) ఇబ్రహీంపట్నం శ్రీ హిందు ఇంజనీరింగ్ కళశాల విద్యార్థులు పరీక్షలు ముగిశాక మంగళవారం రాత్రి మండల కేంద్రంలోని బృందావన్ గెస్ట్హౌస్లో ఫేర్వెల్ చేసుకున్నారు. వేడుకలో 16 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది. మధ్యాహ్నం ప్రారంభమైన పార్టీ రాత్రి పది గంటల వరకు కొనసాగినట్లు సమాచారం. పార్టీ జరుగుతున్న క్రమంలోనే ఐదుగురు విద్యార్థులు మండల కేంద్రం నుంచి బీబీనగర్ వైపు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో ఎదురుగా పోలీస్ వాహనం ఎదురైంది. దానిని కట్ కొట్టి కారును వేగంగా ముందుకు నడిపారు. పోలీసులు గమనించి రాత్రివేళ ఇంత వేగంతో కారు వెళ్లడమేంటని తిరిగి వారు తమ వాహనంలో కారును ఫాలోఅయ్యారు. కొద్దిదూరం వెళ్లగానే విద్యార్థుల కారు ఫల్టీకొట్టి కనిపించింది. అయితే కారు నడుపుతున్న విద్యార్థికి మైసిరెడ్డిపల్లి శివారులో ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని ప్రమాదకర మూలమలుపుపై అవగాహన లేకపోవడం.. అతివేగంగా వెళ్లడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ఘటనాస్థలిని పరిశీలిస్తే స్పష్టమవుతోంది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా.. మండలంలో పలు ఫాం హౌస్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బొమ్మలరామారం మండలం రాజధానికి అతి మీపంలో ఉండడంతో కొందరు యువత వీకెండ్ పార్టీలకు ఇతర జల్సాలకు మండలంలోని పలు ప్రాంతాల్లో గల ఫాం హౌస్లను ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొందరు ఫాంహౌŠలు నిర్వహిస్తూ యువతను ఆకర్షించేందుకు విఫలయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నిషేధిత మాధకద్రవ్యాలతో పాటు హూక్కా, మద్యం సరఫరా చేస్తున్నట్టు సమాచారం. ‘బృందావన్పూర్’లో అన్నీ.. మంగళవారం శ్రీ హిందూ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు వేడుక జరుపుకున్న బృందావన్ ఫాంహౌస్పై కూడా ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. అయితే గెస్ట్ హౌస్ను అద్దెకు తీసుకుంటే కస్టమర్ల అవసరం మేరకు మద్యంతో పాటు డ్రగ్స్ను అందజేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ గెస్ట్ హౌస్లో ప్రతి వీకెండ్లతో పాటు రాత్రి సమయాల్లో యువకుల కేరింతలు, హోరెత్తే లౌడ్ స్పీకర్ల సౌండ్లతో ఇబ్బందులు పడుతున్నామని పరిసరాల ప్రజలు వాపోతున్నారు. ఈ గెస్ట్ హౌస్ స్థానిక పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓ వైపు గంజాయి,కొకైన్ లాంటి డ్రగ్స్కు మండలానికి చెందిన కొంత మంది యువకులు బానిసలుగా మారుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో ఇలాంటి ఘనటలు ఆందోళన కల్గిస్తున్నాయి. పోలీసులు నిఘా వైఫల్యంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండల ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. (చదవండి : అతివేగమే నలుగురిని బలి తీసుకుంది..!) కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగింత భువనగిరిఅర్బన్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థుల మృతదేహాలకు బుధవారం భువనగిరి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంతకుముందు మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఏరియా ఆస్పత్రి మిన్నంటిపోయింది. మృతుల కుటుంబాలకు పరామర్శ మృతుల కుటుంబాలను మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి పరామర్శించారు. భువనగిరి ఏరియా ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలను సందర్శించారు. ప్రమాదం జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. నరేందర్రెడ్డిని ఓదారుస్తున్న రాజగోపాల్రెడ్డి -
నేటి నుంచే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
జలంధర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచంలోనే అతిపెద్దదైన సైన్స్ పండగ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్సీ)కు రంగం సిద్ధమైంది. పంజాబ్లోని జలంధర్లో గురువారం ప్రధాని చేతుల మీదుగా ఈ వేడుక ప్రారంభం కానుందని నిర్వాహకులు తెలిపారు. ‘ఫ్యూచర్ ఇండియా: సైన్స్ అండ్ టెక్నాలజీ’ఇతివృత్తంగా ఐదు రోజులపాటు జరగనున్న ఈ ఉత్సవాలకు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వేదిక కానుంది. దేశ విదేశాలకు చెందిన దాదాపు 30 వేల మంది ఐఎస్సీలో పాల్గొంటారని, ఇందులో పలుదేశాల నోబెల్ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన, భూవిజ్ఞాన శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, టెక్స్టైల్ శాఖ మంత్రి స్మృతి ఇరానీలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎంపిక చేసిన పాఠశాలల విద్యార్థులు, శాస్త్రవేత్తలు పాల్గొంటారని చెప్పారు. శాస్త్రీయ దృక్పథం పెంపునకు.. ఏటా జనవరి 3వ తేదీన ప్రారంభమయ్యే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు ఘనమైన చరిత్ర ఉంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశం దేశ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడమే. గత ఏడాది ఐఎస్సీ వేడుకలు తెలంగాణ రాజధాని హైదరాబాద్లో జరగాల్సి ఉండగా చివరి నిముషంలో రద్దయింది. దీంతో రెండు నెలల తరువాత మణిపూర్లో నిర్వహించారు. ఈ ఏడాది జలంధర్లో జరగనున్న 106వ సైన్స్ కాంగ్రెస్లో పలు వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారని సదస్సు జనరల్ ప్రెసిడెంట్ డాక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థులు సిద్ధం చేసిన సౌరశక్తి బస్సులో ప్రధాని మోదీ సమావేశ కేంద్రానికి విచ్చేస్తారని ఎల్పీయూ ఉపకులపతి అశోక్ మిట్టల్ తెలిపారు. ఐఎస్సీలో ఏర్పాటు చేసిన ఆరు ప్రత్యేక ప్రదర్శనశాలల్లో సీఎస్ఐఆర్, డీఆర్డీవో, డీఏఈ, ఐసీఎంఆర్ వంటి ప్రభుత్వ సంస్థల ప్రదర్శన ఉంటుందని, ఇందులో ప్రైడ్ ఆఫ్ ఇండియా అన్నది దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసేదని ఆయన వివరించారు. యువ ప్రతిభకు వేదిక.. ఐఎస్సీ – 2019 రెండోరోజున జరిగే చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ యువ ప్రతిభకు వేదికగా నిలవనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంపిక చేసిన దాదాపు 150 సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. పది నుంచి 17 ఏళ్ల మధ్య వయస్కులు రూపొందించిన ఈ ప్రాజెక్టులు దేశంలో సైన్స్ ప్రాచుర్యానికి తోడ్పడతాయని అంచనా. మూడోరోజున సైన్స్ కమ్యూనికేటర్స్ మీట్ జరగనుంది. అదేరోజున విమెన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం కానుంది. దీంతోపాటు మొత్తం 14 ప్లీనరీ సెషన్స్ ఐఎస్సీలో భాగంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. నోబెల్ గ్రహీతలతో ప్రధాని ‘ఛాయ్ పే చర్చ’ భారత సైన్స్ కాంగ్రెస్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోబెల్ గ్రహీతలైన ముగ్గురు శాస్త్రవేత్తలతో ఛాయ్ పే చర్చా పేరిట ఇష్టాగోష్టిగా మాట్లాడనున్నారు. ప్రొఫెసర్ థామస్ సి.సుడాఫ్ (2013 వైద్య శాస్త్ర నోబెల్ గ్రహీత), ప్రొఫెసర్ అవ్రామ్ హెర్ష్కో (2004 కెమిస్ట్రీ నోబెల్ గ్రహీత), ప్రొఫెసర్ ఎఫ్.డంకన్ ఎం.హల్డానే (2016 ఫిజిక్స్ నోబెల్ గ్రహీత) ఈ చర్చలో పాల్గొంటారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముందడుగు వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారి నుంచి ప్రధాని సలహాలు, సూచనలు తీసుకుంటారని సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. -
సైన్స్ డిగ్రీనా.. సెటిలైనట్లే..!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్లో మాత్రమే కాదు.. బీఎస్సీ వంటి సైన్స్ కోర్సులు చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఉద్యోగానికి కావాల్సిన ప్రతిభ (ఎంప్లాయబుల్ టాలెంట్) కలిగిన విద్యార్థుల సంఖ్య బీఎస్సీ కోర్సుల్లో భారీగా పెరుగుతోంది. ఈ విషయాన్ని ఇండియా స్కిల్ రిపోర్టు–2019 వెల్లడించింది. వీబాక్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే నివేదికను ఇటీవల విడుదల చేసింది. అందులో దేశంలో వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల స్థితిగతులపై అంచనా వేసింది. ఈ సర్వేలో భాగంగా దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 100కు పైగా కంపెనీలు, 3.10 లక్షల మంది విద్యార్థులను కలిసింది. వారి అభిప్రాయాలు, పరిస్థితులను సమగ్రంగా విశ్లేషించి నివేదికను వెల్లడించింది. 2017 సంవత్సరంలో ఉద్యోగానికి కావాల్సిన సమర్థత కలిగిన బీఎస్సీ విద్యార్థులు 31.76% ఉంటే అది 2018లో 33.62 శాతానికి పెరిగింది. ఇక 2019 నాటికి ఇది 47.37 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. ఇంజనీరింగ్లో పెరగనున్న అవకాశాలు.. వచ్చే సంవత్సరం ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయని అంచనా వేసింది. 2014లో 51.74 శాతం మందికి ఎంప్లాయబిలిటీ టాలెంట్ ఉంటే అది 2015లో 54 శాతానికి పెరిగింది. తరువాత మూడేళ్లలో అది క్రమంగా తగ్గుతూ వచ్చింది. కానీ 2019 నాటికి మాత్రం ఇలా టాలెంట్ కలిగిన విద్యార్థులు 57.09 శాతానికి చేరుకుంటారని వీబాక్స్ అంచనా వేసింది. బీఎస్సీలోనూ అదే పరిస్థితి. 2014లో బీఎస్సీలో 41.66 శాతం మంది ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన విద్యార్థులు ఉంటే అది 2017 వరకు ఏటా తగ్గుతూ వచ్చింది. అయితే 2018లో మాత్రం పెరిగింది. ఇక 2019లో భారీగా పెరుగుదల నమోదు కానుందని వెల్లడించింది. దేశంలో ఐటీ, ఎంబీఏ విద్యార్థుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఆ కోర్సులు చేసిన విద్యార్థుల్లో ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన వారి సంఖ్య 2014 నుంచి ఇప్పటివరకు క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2014లో ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన ఎంబీఏ విద్యార్థులు 41.02 శాతం ఉంటే 2018లో 39.4 శాతానికి తగ్గింది. ఇక 2019లో ఈ సంఖ్య 36.44 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఒకప్పుడు ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన ఐటీఐ విద్యార్థులు 46.92 శాతం ఉంటే 2018 నాటికి అది 29.46 శాతానికి పడిపోయింది. 2019లో ఎలా ఉంటుందన్న అంచనా కూడా వీబాక్స్ వేయలేదు. పాలిటెక్నిక్లో సామర్థ్యాలు కలిగిన వారు 2018లో 32.67 శాతం ఉంటే వచ్చే సంవత్సరానికి 18.05 శాతానికి తగ్గిపోతుందని అంచనా వేసింది. ఎనిమిదవ స్థానంలో తెలంగాణ... రాష్ట్రాల వారీగా చూస్తే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. గతంలో టాప్ 10లో కూడా లేని తెలంగాణ ఈసారి తమ విద్యా సంస్థల్లో నాణ్యత ప్రమాణాలకు ప్రాధాన్యం ఇచ్చి గత రెండేళ్లుగా చర్యలు చేపట్టిన కారణంగా ఈసారి 8వ స్థానంలో నిలువగలిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. 2018లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కలిగిన మొదటి పది స్థానాల్లో ఉన్న దిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈసారి కూడా మొదటి పది స్థానాల్లో ఉన్నాయని ఇండియా స్కిల్ రిపోర్టు–2019 పేర్కొంది. ఈసారి కొత్తగా తెలంగాణ, రాజస్థాన్, హరియాణా టాప్–10 రాష్ట్రాల జాబితాలో చేరాయి. 2018 నివేదికలో టాప్–10 రాష్ట్రాల్లో ఉన్న మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలకు ఈసారి లేకుండాపోయాయి. -
ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి
మడ్డువలస జలాశయం మరో విషాదానికి వేదికైంది. ఇద్దరు యువకులను మింగేసి తల్లిదండ్రుల కన్నీటికి కారణమైంది. కన్నవారు పెట్టుకున్న ఆశలను సమాధి చేస్తూ వారి కొడుకులను పొట్టన పెట్టుకుంది. రాజాంలోని జీఎంఆర్ ఐటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న రాజాం పట్టణానికి చెందిన ఉరిటి రామ్తేజ్ (19), విజయనగరం జిల్లా కేంద్రం బాబామెట్టకు చెందిన మల్లెల సాయితరుణ్(19) రిజర్వాయర్లోని బకెట్ పోర్షన్లో గల్లంతై.. శవాలుగా తేలారు. కలిసిమెలిసి తిరిగే అలవాటున్న ఈ స్నేహితులు చావును కూడా కలిసే ఆహ్వానించారు. ఈ సంఘటన వారి తల్లిదండ్రులను.. స్నేహితులను విషాదంలోకి నెట్టింది. రాజాం/వంగర: శ్రీకాకుళం జిల్లా రాజాం జీఎంఆర్ ఐటీ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న రాజాం పట్టణానికి చెందిన ఉరిటి రామ్తేజ్తో పాటు విజయనగరం పట్టణం బాబామెట్టకు చెందిన మల్లెల సాయితరుణ్ మృతితో మడ్డువలస జలాశయం వద్ద తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. వీరిద్దరూ శుక్రవారం విహారానికి వంగర మండలం మడ్డువలస ప్రాజెక్ట్ వద్దకు బైక్పై వెళ్లారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే రాత్రయినా ఇళ్లకు రాకపోవడంతో వీరి తల్లిదండ్రులు కళాశాలకు ఫోన్ చేసి ఆరా తీశారు. అలాగే వారి స్నేహితులకు కూడా ఫోన్లు చేసి అడిగి తెలుసుకున్నారు. అయితే వీరెక్కడకు వెళ్లారన్నది ఎవరికీ తెలియకపోవడంతో అదే రోజు రాత్రి రాజాం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో రామ్తేజ్, సాయితరుణ్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. అలాగే వీరు తీసుకెళ్లిన సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కుటుంబీకులు ఆరాతీశారు. తమ బిడ్డలకు ఏం కాకూడదని, క్షేమంగా ఉండాలని దేవుళ్లకు మొక్కుకున్నారు. శుక్రవారం రాత్రంతా నిద్రాహారాలు మాని పిల్లల గురించే కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. అయితే వీరి సెల్ ఫోన్ సిమ్ కార్డు సిగ్నల్ మడ్డువలస వరకూ వచ్చి నిలిచిపోయినట్లు తెలుసుకున్నారు. దీంతో శనివారం ఉదయం మడ్డువలస ప్రాజెక్టు వద్దకు ఇద్దరు విద్యార్థుల కుటుంబీకులు చేరుకున్నారు. ప్రాజెక్టు వద్ద బైక్ ఉండడంతో ఆందోళన చెందారు. సెల్ఫీ కోసం నీటిలో దిగి అక్కడ బకెట్ పోర్షన్ వద్ద ప్రమాదానికి గురై ఉంటారని ప్రాజెక్ట్ వద్ద ఉన్నవారు, పోలీసులు అనుమానం వ్యక్తం చేసి వెతుకులాట ప్రారంభించారు. రెండు మృతదేహాలు ఒకేచోట.. రాజాం సీఐ ఎం.వీరకుమార్ ఆధ్వర్యంలో మడ్డువలస శ్రీ సీతారామ ఫిషర్మెన్ సొసైటీ సభ్యులు బకెట్ పోర్షన్లో వలలు వేసి గాలించడం ప్రారంభించారు. ఇంతలోనే విజయనగరం పట్టణానికి చెందిన మల్లెల సాయితరుణ్ మృతదేహం వలకు చిక్కడంతో బయటకు తెచ్చారు. దీంతో ఒక్కసారిగా అక్కడ విషాదం అలుముకుంది. కొడుకు మృతదేహాన్ని చూసి సాయితరుణ్ తల్లిదండ్రులు çమాధవి, ఫణీంద్రకుమార్లు కన్నీరుమున్నీరుగా రోదించారు. ఒక విద్యార్థి మృతదేహం లభ్యం కావడంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మరో అరగంట తరువాత అదే ప్రాంతంలో రాజాం పట్టణానికి చెందిన ఉరిటి రామ్తేజ్ మృతదేహం లభించింది. శవాన్ని వెలికితీయగానే తల్లిదండ్రులు ఉరిటి లక్ష్మీచందన, జగదీష్లు బోరున విలపించారు. రెండు మృతదేహాలు ఒకేచోట లభించడంతో ఇద్దరూ ఒకేసారి ప్రమాదానికి గురై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరూ వారసులే.. మడ్డువలస ప్రాజెక్ట్లో మునిగి చనిపోయిన ఇద్దరు విద్యార్థులు ఆయా కుటుంబాలకు వారసులే. దీంతో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది విజయనగరం బాబామెట్టకు చెందిన ఫణీంద్రకుమార్, మాధవిలకు సాయితరుణ్ ఒక్క డే కుమారుడు. ఓ కుమార్తె వీరికి ఉంది. ఫణీంద్రకుమార్ విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా, తల్లి మాధవి ప్రైవేట్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ పూర్తికాగానే సాయితరుణ్ను సివిల్స్కు పంపిద్దామని తల్లిదండ్రుల ఆలోచన. ఇంతలోనే విధి వక్రీకరించి ఆ ఇంట్లో తీరని విషాదాన్ని నింపింది. రాజాం పట్టణానికి చెందిన ఉరిటి జగదీష్కుమార్, రాధిక ఇంట్లో కూడా ఇదే పరిస్థితి. ఈ దంపతులకు కూడా రామ్తేజ్ ఒక్కడే మగ సంతానం. ఒక కుమార్తె ఉంది. జగదీష్కుమార్ రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తుండగా, రాధిక గృహిణి. వీరు ఎంతో ప్రేమగా రామ్తేజ్ను సాకుతూ వస్తున్నారు. ఎటువంటి కష్టం ఉండకూడదని దగ్గర్లో ఉంటాదనే ఉద్దేశంతో జీఎంఆర్ఐటీలో చేర్పించారు. బాగా చదివి ఉద్యోగం చేసి ఇంటికి చేదోడువాడోదుగా ఉంటాడని ఆశించిన వారి ఆశలు గల్లంతయ్యాయి. -
ఇంజనీరింగ్లో ఎలక్టివ్ సబ్జెక్టుగా వేదిక్ సైన్స్
సాక్షి, హైదరాబాద్: క్రీస్తు పూర్వమే భారతీయులకు వైమానిక శాస్త్రం గురించి తెలుసా..? మహాభారత కాలం నాడే టెస్ట్ ట్యూబ్ బేబి టెక్నాలజీ వాడుకలో ఉండేదా..? జలాంతర్గాముల గురించి ఇతర ప్రపంచం కంటే ముందే మనకు తెలుసా...? వంటి విషయాలను ఇకపై ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుకోనున్నారు. బీటెక్లో ఎలక్టివ్ సబ్జెక్టుగా వేదిక్ సైన్స్ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశ పెట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఏఐసీటీఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వేదిక్ సైన్స్ సబ్జెక్టు కోసం భారతీయ విద్యాభవన్ ప్రచురించిన ‘భారతీయ విద్యా సార్’పుస్తకాన్ని ఎంచుకుంది. ఏఐసీటీఈ నిర్ణయంపై పలువురు విద్యావేత్తలు, మేధావుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. -
అరచేతిలో ఒదిగిపోయే శాటిలైట్
చెన్నై : సాధారణంగా శాటిలైట్ బరువు టన్నులకు టన్నులు ఉంటుంది. దాని ఎత్తు, పొడవులు కూడా అదే మాదిరి ఉంటాయి. అయితే గుడ్డు కంటే తక్కువ బరువుగా.. అరచేతిలో ఒదిగిపోయే శాటిలైట్ను తమిళనాడు ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించారు. ప్రపంచంలో అత్యంత తేలికైన, చౌకైన శాటిలైట్ను రూపొందించి, సరికొత్త వరల్డ్ రికార్డును సృష్టించారు. విద్యార్థులు రూపొందించిన శాటిలైట్ అరచేతిలో ఒదిగిపోతుంది. దీని ఖర్చు కేవలం 15 వేల రూపాయలు మాత్రమే. ఇక బరువు విషయానికి వస్తే గుడ్డు కంటే తక్కువగానే ఉంటుంది. అంటే 33.39 గ్రాములు మాత్రమే. ఈ శాటిలైట్ను నలుగురు ఫస్ట్-ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థులు కేజే హరిక్రిష్ణన్, పీ అమర్నాథ్, జీ సుధి, టీ గిరిప్రసాద్లు రూపొందించారు. వీరంతా చెన్నైకి దగ్గర్లోని హిందూస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇన్ కెలంబక్కంలో చదువుకుంటున్నారు. ఈ శాటిలైట్ పేరును ‘జైహింద్-1ఎస్’గా నామకరణం చేశారు. ఈ శాటిలైట్ను వాతావరణ పరిస్థితుల డేటాను సేకరించడానికి ఉపయోగించుకోవచ్చని విద్యార్థులు తెలిపారు. అచ్చం ఈ శాటిలైట్ చూడానికి చతురస్రాకారంలో ఉన్న క్యూబ్ మాదిరే ఉంది. ఆగస్టులో నాసాలో దీన్ని లాంచ్ చేయబోతున్నారు. బెలూన్ లేదా రాకెట్లో పెట్టి ఈ శాటిలైట్ను ఆగస్టులో ఆకాశంలోకి పంపించబోతున్నారు. బెలూన్ కావలసిన ఎత్తులో చేరుకున్న తరువాత, ఆ శాటిలైట్ బెలూన్ నుంచి విడిపోతుంది. దీనికి 20 రకాల వాతావరణ పారామీటర్స్ కొలిచే సామర్థ్యం ఉంటుంది. సెకన్కు నాలుగు పారామీటర్స్ను రికార్డు చేయనుంది. ఆ డేటాను శాటిలైట్లో ఉంచే బిల్డ్ఇన్ ఎస్డీ కార్డులో స్టోర్ చేస్తుంది. 40 అడుగుల ఎత్తులో ఈ శాటిలైట్ను పరీక్షించిన తర్వాత, గత వారంలో నాసాకు దీన్ని పంపినట్టు విద్యార్థులు చెప్పారు. -
టెక్ కంపెనీలా.. మజాకా
న్యూఢిల్లీ : టాప్ టెక్ కంపెనీల్లో ఉద్యోగమంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అక్కడ పని ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ, ఆ కంపెనీలు అందించే సౌకర్యాలు, ప్రయోజనాలు అలానే ఉంటాయి. ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో ఎలాంటి ప్రతికూల పరిస్థితుల ఉన్నప్పటికీ, ఆ కంపెనీలకున్న క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గడం లేదు. తాజాగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి దిగ్గజ దేశీయ అవుట్ సోర్సింగ్ కంపెనీలకు మరింత పాపులారిటీ పెరిగిందట. దేశీయ ఇంజనీరింగ్ విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపే ఎంప్లాయిర్స్ జాబితాలో దేశీయ టెక్ కంపెనీల వార్షిక ర్యాంకింగ్స్ను పెంచుకున్నాయట. ఈ ర్యాంకులను యూనివర్సమ్స్ యాన్యువల్ సర్వే ఆధారితంగా రూపొందించారు. 50 దేశాల నుంచి 1.3 మిలియన్ పైగా అభ్యర్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు. గతేడాది తొలిసారి టాప్ 10 ర్యాంక్ కోల్పోయిన ఇన్ఫోసిస్, తాజాగా మళ్లీ తన ర్యాంకును పునరుద్ధరించుకుని టాప్ 9వ ర్యాంక్ను సంపాదించుకుంది. దేశీయ అతిపెద్ద అవుట్సోర్సింగ్ సంస్థ టీసీఎస్, బెంగళూరుకు చెందిన విప్రోలు ఐదు స్థానాలను పెంచుకుని, 13, 20వ ర్యాంకుల్లో నిలిచాయి. మరోవైపు అంతర్జాతీయ ఐటీ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, ఫేస్బుక్, అమెజాన్లు ఈ ర్యాంకింగ్స్లో టాప్-5లో ఉన్నాయి. వారికి కూడా భారత మార్కెటే అత్యంత కీలకమైనదిగా ఉంది. దేశంలో మరిన్ని వ్యాపారాలను ఏర్పాటుచేయడానికి గూగుల్, ఆపిల్, ఫేస్బుక్, అమెజాన్ సంస్థలు మరిన్ని చర్యలను తీసుకుంటున్నాయని రిపోర్టు తెలిపింది. ఇంటర్నేషనల్ కెరీర్ అత్యంత ముఖ్యమైన కెరీర్ లక్ష్యంగా ఉన్నప్పటికీ, గతేడాది నుంచి అది తగ్గిపోతుందని ఆసియా పసిఫిక్ రీజన్లోని యూనివర్సమ్ అడ్వయిజరీ హెడ్ ప్రతీక్ సభర్వాల్ అన్నారు. కేవలం పెద్ద అవుట్సోర్సింగ్ సంస్థలే కాకుండా.. ఫ్లిప్కార్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి సంస్థలు కూడా దేశీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. ఈ ర్యాంకింగ్స్లో ఫ్లిప్కార్ట్ 9 స్థానాలు ఎగబాకగా.. రిలయన్స్ 34వ ర్యాంక్ నుంచి 12వ ర్యాంక్కు పెరిగింది. బిజినెస్ స్టూడెంట్స్కు గూగుల్, ఆపిల్, ఫేస్బుక్, అమెజాన్ సంస్థలు టాప్ 10 ర్యాంకింగ్స్లో ఉన్నాయని, వాటి అనంతరం బిజినెస్ విద్యార్థులఇండియన్ ఎంప్లాయిర్స్గా కేవలం దేశీయ సెంట్రల్ బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేశీయ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐలు మాత్రమే చోటు దక్కించుకున్నట్టు తాజా సర్వే రిపోర్టు తెలిపింది. -
ప్రమాదకరంగా మారిన పవిత్ర సంగమం
-
కృష్ణానదిలో విద్యార్థులు గల్లంతు : ముగ్గురి మృతదేహాలు లభ్యం..
-
కృష్ణానదిలో విషాదం: మృతదేహాలు లభ్యం..
సాక్షి, విజయవాడ: ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ఈత కోసం వెళ్లి నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు శనివారం గల్లంతైన విషయం తెలిసిందే. వారి కోసం నిన్న నుంచి తీవ్రంగా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఆ నలుగురిలో చైతన్య రెడ్డి, ప్రవీణ్, శ్రీనాథ్, రాజ్కుమార్ మృతదేహాలు లభమయ్యాయి. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మృత దేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. మత్స్యకారులకు ఈ మృతదేహాలు దొరికినట్లు సమాచారం. కాలేజీ యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పాలని మృతుల బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మృతదేహాలను తీసుకెళ్తామని ఆస్పత్రి ముందే కుటుంబ సభ్యులు బైఠాయించారు. మృతదేహాలను తీసుకెళ్లామని పోలీసుల చెప్పిన కూడా వినని విద్యార్థుల బంధువులు. వరాలివి.. ఆ నలుగురు కృష్ణాజిల్లా కంచికచర్లలోని మిక్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నారు. తిరువూరుకు చెందిన నర్సింగ్ శ్రీనాథ్(19), గుంటూరు జిల్లా చౌపాడుకు చెందిన కారుకట్ల ప్రవీణ్(18), కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రంగాపురానికి చెందిన కుప్పిరెడ్డి నాగచైతన్యరెడ్డి(19), విజయవాడ కొత్తపేటకు చెందిన పిల్లా రాజ్కుమార్(19), పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గురజాల సాయిరామ్ పవిత్ర సంగమం వద్దకు వచ్చారు. ప్రవీణ్, శ్రీనాథ్ కళాశాల హాస్టల్లో ఉంటున్నారు. మిగిలిన వారు బయట రూమ్లో ఉంటున్నారు. సాయిరామ్ మినహా మిగిలిన నలుగురు కాలువ కలిసే ప్రాంతంలో స్నానానికి దిగారు. శ్రీనాథ్ గ్రిల్స్పైకి ఎక్కి విన్యాసాలు చేస్తున్న సమయంలో పట్టుతప్పి కాలువలోకి జారిపోయాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో ప్రవీణ్, చైతన్య, రాజ్కుమార్ ఒక్కొక్కరుగా నీటిలో కొట్టుకునిపోయారు. ప్రత్యక్షసాక్షిగా ఉన్న సాయిరామ్ తన తోటి వారిని కాపాడాలని అక్కడ ఉన్నవారిని వేడుకున్నా నీటి ఉధృతిని చూసి ఎవ్వరూ సాహసించలేదు. వారు చూస్తుండగానే విద్యార్థులు మునిగిపోయారు. ప్రమాదం విషయం తెలిసి స్థానికులు, కళాశాల విద్యార్థులు సంగమం ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద గతేడాది నవంబర్లో బోటు బోల్తాపడి 22 మంది మృత్యువాత పడ్డ విషయం విదితమే. ఇపుడు అదే ప్రాంతంలో నలుగురు విద్యార్థులు గల్లంతుకావడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. -
విషాద సంగమం ముమ్మరంగా గాలింపు..
-
విషాద సంగమం
ఇబ్రహీంపట్నం/కంచికచర్ల (మైలవరం): పట్టిసీమ కాలువ కృష్ణా నదిలో కలిసే పవిత్ర సంగమం వద్ద మరో విషాదం చోటుచేసుకుంది. స్నానం చేసేందుకు వచ్చిన నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు శనివారం మధ్యాహ్నం ఇక్కడ గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో ఉన్న మిక్ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్, మెకానికల్ విభాగాల్లో రెండో సంవత్సరం చదువుతున్న తిరువూరుకు చెందిన నర్సింగ్ శ్రీనాథ్(19), గుంటూరు జిల్లా చౌపాడుకు చెందిన కారుకట్ల ప్రవీణ్(18), కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రంగాపురానికి చెందిన కుప్పిరెడ్డి నాగచైతన్యరెడ్డి(19), విజయవాడ కొత్తపేటకు చెందిన పిల్లా రాజ్కుమార్(19), పశ్చిమగో దావరి జిల్లాకు చెందిన గురజాల సాయిరామ్ పవిత్ర సంగమం వద్దకు వచ్చారు. ప్రవీణ్, శ్రీనాథ్ కళాశాల హాస్టల్లో ఉంటున్నారు. మిగిలిన వారు బయట రూమ్లో ఉంటున్నారు. సాయిరామ్ మినహా మిగిలిన నలుగురు కాలువ కలిసే ప్రాంతంలో స్నానానికి దిగారు. శ్రీనాథ్ గ్రిల్స్పైకి ఎక్కి విన్యాసాలు చేస్తున్న సమయంలో పట్టుతప్పి కాలువలోకి జారిపోయాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో ప్రవీణ్, చైతన్య, రాజ్కుమార్ ఒక్కొక్కరుగా నీటిలో కొట్టుకునిపోయారు. ప్రత్యక్షసాక్షిగా ఉన్న సాయిరామ్ తన తోటి వారిని కాపాడాలని అక్కడ ఉన్నవారిని వేడుకున్నా నీటి ఉధృతిని చూసి ఎవ్వరూ సాహసించలేదు. వారు చూస్తుండగానే విద్యార్థులు మునిగిపోయారు. ప్రమాదం విషయం తెలిసి స్థానికులు, కళాశాల విద్యార్థులు సంగమం ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద గతేడాది నవంబర్లో బోటు బోల్తాపడి 22 మంది మృత్యువాత పడ్డ విషయం విదితమే. ఇపుడు అదే ప్రాంతంలో నలుగురు విద్యార్థులు గల్లంతుకావడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ముమ్మరంగా గాలింపు.. విద్యార్థులు గల్లంతైన సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక మత్స్యకారులు, గజఈతగాళ్లు సంగమం వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ఉధృతి అధికంగా ఉండటంతో గాలింపు చర్యలు కష్టంగా మారాయి. తొలుత పట్టిసీమ కాలువలో బోట్లు, వలలతో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. అనంతరం కృష్ణానదిలో గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి వరకూ వెతికినా గల్లంతైన వారి జాడ లభ్యం కాలేదు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఇన్చార్జి కలెక్టర్ విజయకృష్ణన్, సీపీ గౌతమ్సవాంగ్, డీసీపీ క్రాంతి రాణా, డీసీపీ నవాజ్జానీ ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక అధికారులు, విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కాగా, తమ తోటి విద్యార్థులు గల్లంతయ్యారు అన్న విషయం తెలుసుకుని ప్రమాదం జరిగిన ప్రాంతానికి కళాశాల విద్యార్థులు భారీగా చేరుకున్నారు. సహచర విద్యార్థి సాయిరామ్ ద్వారా విషయాన్ని తెలుసుకుని దుఖఃసాగరంలో మునిగిపోయారు. గల్లంతైన వారు క్షేమంగా రావాలని దేవుళ్లకు మొక్కుకున్నారు. ప్రభుత్వ వైఫల్యంపై ప్రజాగ్రహం.. గోదావరి జలాలు పట్టిసీమ కాలువ ద్వారా పవిత్ర సంగమం వద్దకు నాలుగు రోజుల కిందట చేరాయి. జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఇక్కడ పూజలు కూడా చేశారు. ఈ ప్రాంతానికి రోజూ వందలాది మంది వస్తున్నా.. కనీస భద్రతా చర్యలు చేపట్టలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. బోటు బోల్తా సంఘటన తర్వాత అయినా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడుతున్నారు. కాలువకు నీళ్లు వదిలామని ప్రచారం చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై పెట్టడంలేదని ధ్వజమెత్తుతున్నారు. ప్రమాదకర ప్రాంతమైనా కనీసం హెచ్చరిక బోర్డులుగానీ, సూచికలుగానీ ఇక్కడ ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గం సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ అమెరికా నుంచి బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. ఈ సంఘటన దరదృష్టకరమన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు సలాం బాబు, డి.అంజిరెడ్డి, జి.కొండూరు జెడ్పీటీసీ సభ్యుడు కాజా బ్రహ్మయ్య, ఇబ్రహీంపట్నం మండల కన్వీనర్ బొమ్మసాని వెంకటచలపతి, పార్టీ నాయకులు లంకే అంకమోహనరావు, జోగి రాము తదితరులు బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గాలింపు చర్యలకు తమవంతు సహకరించారు. మిక్ యాజమాన్యంపై ఆగ్రహం.. మిక్ కళాశాల యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రుల మండిపడుతున్నారు. కళాశాలలో క్రమశిక్షణ కొరవడిందని, ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నా విద్యార్థులపై ఎటువంటి శ్రద్ధ పెట్టడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల హాస్టల్ నుంచి విద్యార్థులు బయటకు వెళ్లేందుకు అనుమతి ఎలా ఇచ్చారని, కళాశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
నలుగురు బీటెక్ స్టూడెంట్స్ గల్లంతు
-
విషాదం: నలుగురు బీటెక్ స్టూడెంట్స్ గల్లంతు
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద శనివారం జరిగింది. కంచికచర్లోని మిక్(ఎంఐసీ) ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పెర్రీ ఘాట్ వద్దకు వెళ్లారు. అయితే వీరిలో తొలుత ఒక విద్యార్థి స్నానం చేయడానికి కృష్ణా నదిలో దిగగా ప్రమాదశాత్తూ లోపలికి జారిపోయాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు తమ స్నేహితుడిని కాపాడేందుకు యత్నించారు. కానీ ఆ ప్రయత్నంలో ఆ ముగ్గురు బీటెక్ విద్యార్థులూ గల్లంతయ్యారు. కాగా గల్లంతైన వారి పేర్లు ప్రవీణ్(18), చైతన్య (18), శ్రీనాథ్ (19), రాజ్ కుమార్ (19). సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గల్లంతైన విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రూ. 75 వేలతో అద్భుత కారు
బొబ్బిలి రూరల్: ఓ పాతకారు ఇంజిన్తో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి కేవలం రూ. 75 వేలతో అద్భుతమై కారును రూపొందించారు ఇంజినీరింగ్ విద్యార్థులు. విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం కోమటపల్లిలోని తాండ్రపాపారాయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ కారును తయారు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ బి.వెంకటరమణ ఆధ్వర్యంలో మెకానికల్ హెడ్ కృపారావు, వర్క్షాపు ఇన్చార్జి నర్సింగరావుల పర్యవేక్షణలో జీఎల్ కార్తీక్, వి.సురేష్, ఎన్ఎస్ శ్రీకాంత్, వి.మణికంఠ, బి.హరీష్బాబు, వెంకటరమణ తదితరులు ఈ మల్టీ పర్పస్ కారును రూపొందించారు. ఈ మల్టీపర్పస్కారును బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ విద్యార్థులు తలచుకుంటే ఎలాంటి అద్భుతాలైనా సాధించగలరన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ విద్యార్థులను, కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. కారు ప్రత్యేకతలివీ.. - కారుకు ఖర్చు కేవలం రూ. 75 వేలు - మైలేజీ 50-60 కిలో మీటర్ల వేగంతో 20-23 కి.మీ. నడుస్తుంది. - డ్రైవర్తో కలిపి ఆరుగురు ప్రయాణించవచ్చు. - అల్ట్రాసోనిక్ సెన్సార్ల సహాయంతో నడిచే ఈ కారు ఎదురుగా మీటరు దూరంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా నియంత్రించే వీలుంది. - మద్యం సేవించి వాహనం నడిపితే కారు కదలదు. ఓనర్కు మెసేజ్ వెళ్లి వాహనం నిలిచిపోతుంది. - వాహనాన్ని ఎవరైనా తస్కరిస్తే ఆఫ్లైన్లో కూడా ఎక్కడ ఉందో కనిపెట్టవచ్చు. -
విద్యార్థులకు బీఎండబ్ల్యూ బంపర్ ఆఫర్
సాక్షి, చెన్నై : జర్మనీ, లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతీయ విద్యార్థులకు అందించడానికి ముందుకు వచ్చింది. భారతీయ విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ‘స్కిల్ నెక్ట్స్’ కార్యక్రమాన్ని క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ప్రారంభించింది. చెన్నైలోని బీఎండబ్ల్యూ ప్లాంట్ 11వ వార్షికోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా మన దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు 365 బీఎండబ్ల్యూ ఇంజిన్ ట్రాన్సిమిషన్లను ఉచితంగా అందించనుంది. ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న వారు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశించే విద్యార్థులకు ‘స్కిల్ నెక్ట్స్’ ఎంతగానో తోడ్పాటు అందిచనుంది. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. మన దేశంలోని ఆటోమేటిక్ ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడంలో ‘స్కిల్ నెక్ట్స్’ ఉపయోగపడుతుందని గట్టిగా నమమ్ముతున్నానని అన్నారు. బీఎండబ్ల్యూ ఇంజిన్, ట్రాన్స్మిషన్ల సాయంతో విద్యార్థులు అధునాతన శిక్షణ పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా అన్నా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులతో కలిసి బీఎండబ్ల్యూ ఇంజిన్, ట్రాన్స్మిషన్లను కారులో బిగించారు. బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు విక్రం పవాహ్ మాట్లాడుతూ.. లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధి గణనీయంగా పెరుగుతుందన్నారు. అందుకు తగ్గట్టు నైపుణ్యం ఉన్న ఉద్యోగులు లభించడం లేదన్నారు. తాము ప్రారంభించిన ‘స్కిల్ నెక్ట్స్’ కార్యక్రమంలో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. -
మానవ రహిత రైల్వే గేటు బాగు
పెడన : నందమూరు శ్రీవాసవి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తమ ప్రతిభను కొనసాగిస్తున్నారు. తాజాగా మానవ రహిత రైల్వే గేటును రూపొందించి ఆహో అనిపించారు. కళాశాలలో ఈఈఈ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ గేటు నమూనాను రూపొందించి కళాశాలలో ప్రిన్సిపాల్ ఏబీ శ్రీనివాసరావు, హెచ్ఓడీ జ్యోతిలాల్ నాయక్ ఎదుట ప్రదర్శించారు. పరికరాలు.. పనితీరు.. మానవ రహిత రైల్వే గేటుకు ఆర్డీనో ఎలక్ట్రానిక్ పరికరం, ట్రాన్స్ఫార్మర్, బ్రిడ్జి రెక్టిఫైర్, కెపాసిటర్, అయస్కాంతాల సెన్సార్, సర్వే మీటరు, ఎల్ఈడీ లైట్లను ఉపయోగించనున్నారు. ఆర్డీనో పరికరం ద్వారా రైల్వే గేటు నియంత్రణకు ఉపయోగిస్తారు. రైలు వచ్చే సమయంలో గేటు మూసుకోవడం, రైలు వెళ్లగానే తెరుచుకునేలా ఈ పరికరం ఉపయోగపడుతుంది. ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ను అందిస్తుంది. బ్రిడ్జి రెక్టిఫైర్ ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే విద్యుత్ను తీసుకుని సమాంతర డీసీలోని 5 ఓల్టు విద్యుత్గా తగ్గించి అందిస్తుంది. ఇందుకు కెపాసిటర్ను వినియోగించారు. అయస్కాంత సెన్సార్లు రైలు వచ్చిన సమాచారాన్ని ఆర్డీనోకు సందేశాన్ని పంపిస్తుంది. ఎల్ఈడీ లైట్లను ఈ సెన్సార్లకు అనుసంధానం చేయడంతో అవి వెలిగేలా చర్యలు చేపట్టారు. ఉపయోగాలు మానవ రహిత రైల్వే గేటు వల్ల మానవ లోపాలు జరిగే నష్టాలను అరికట్టవచ్చు. రైలు రాకపోకల్లో జాప్యం జరిగినా ఎటువంటి ట్రాఫిక్కు అంతరాయం ఉండదు. సుదూర ప్రాంతాల్లో గేట్ కీపర్ ఒక్కడే ఉండాలంటే భయపడే పరిస్థితులు. ఇటువంటి చోట్ల ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీనిని అతివేగంగా ఆపరేట్ చేయవచ్చు. తక్కువ ఖర్చుతో కూడుకున్నది. కనుగొన్నది వీరే.. వాసవిలో ట్రిపుల్ ఈ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎ.మాధవితేజ, ఎం.హారిక, వి.చరణ్సాయి, ఎన్.సాయికొండ, ఏహెచ్వీ ప్రసాద్. ఐదు నెలలు పాటు శ్రమించి దీనిని రూపొందించారు. చదువుతోపాటు ప్రయోగాలు ముఖ్యమనే ఉద్దేశంతో. విద్యార్థులు చదువుతో పాటు ఏదైనా కొత్త తరహా ప్రయోగం చేస్తేనే గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతో విద్యార్థుల ఆలోచనకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వడంతో ఈ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంతో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం వచ్చింది. ఇందుకు హెచ్ఓడీ జ్యోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో కళాశాల యాజమాన్యం సహకారంతో విద్యార్థులు ఈ ప్రయోగంలో విజయం సాధించడం చాలా అభినందనీయం. – కేవీవీఎన్ భాస్కర్,ప్రాజెక్టు గైడ్ -
మహిళలపై వివక్ష
-
పశ్చిమగోదావరి జిల్లాలో దాడులు
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు దాడులు నిర్వహించారు. గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందనే సమాచారంతో వట్లూరు సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తితో పాటు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరస్టైన వారిలో 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 10.50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థులే టార్గెట్
హనుమాన్జంక్షన్ రూరల్(గన్నవరం):ఇంజినీరింగ్ విద్యార్థులు, యువతను టార్గెట్ చేసుకుని గంజాయి విక్రయాలు సాగిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీస్స్టేషన్లో సీఐ వై.వి.వి.ఎల్.నాయుడు, ఎస్సై వి.సతీష్ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. నూజివీడు మండలం రాట్నాలగూడెంకు చెందిన జి.మనోజ్కుమార్, ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన నక్కా చిన్న వెంకటేశ్వరరావు కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల కిందట అనుమానాస్పదంగా సంచరిస్తున్న మనోజ్కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించామని చెప్పారు. ఆయన వద్ద ఆరు గంజాయి ప్యాకెట్లు లభించాయని పేర్కొన్నారు. తదుపరి విచారణలో నక్కా చిన్న వెంకటేశ్వరరావు నుంచి నిషేధిత గంజాయి కొనుగోలు చేసినట్లు వెల్లడించటంతో అతనిని కూడా అరెస్ట్ చేశామని వెల్లడించారు. వీరిద్దరి నుంచి ఒక కేజీ 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రధానంగా హనుమాన్జంక్షన్, గన్నవరం, నూజివీడు, ఏలూరు ప్రాంతాల్లో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఐదు గ్రాముల గంజాయి కలిగిన ఒక్కో ప్యాకెట్ను రూ.100 చొప్పున విక్రయిస్తున్నట్లు చెప్పారు. యువత అధికంగా గంజాయికి అలవాటు పడుతున్నారని, సిగిరెట్లలో గంజాయి నింపుకుని సేవిస్తున్నారన్నారు. ఈ కేసుపై మరింత దర్యాప్తు ముమ్మరంగా సాగుతుందని, గంజాయి సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు స్పెషల్ టీంను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేసుతో సంబంధం ఉన్న హనుమాన్జంక్షన్కు చెందిన కొందరు పెద్ద మనుషుల కుమారులను పోలీసులు తప్పించారని వస్తున్న ఆరోపణలపై విలేకరులు ప్రశ్నించగా, సీఐ దీన్ని పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. కేసు విచారణ పూర్తి కాలేదని, ఇంకా లోతైన విచారణ సాగుతుందని తెలిపారు. -
గుండె ‘చెరువు’
ఎదిగొచ్చిన కొడుకులు ఉన్నత విద్యనభ్యసిస్తుంటే సంబరపడిన ఆ కన్నగుండెలు బద్దలయ్యాయి.కాలేజీకి వెళ్లారనుకున్న తనయులు కళ్లముందే విగతజీవులై పడి ఉండడం చూసి తల్లడిల్లాయి. ఎన్నో ఆశలతో చదివిస్తున్న వారసులు అనంత లోకాలకు వెళ్లిపోడంతో పుట్టెడు దుఃఖంతో కన్నీరుమున్నీరయ్యాయి. ఏలూరు టౌన్/పెదవేగి రూరల్: సరదాగా గడుపుదామని జామతోటలోకి వెళ్ళి.. పక్కనే ఉన్న చెరువులోకి ఈతకు దిగిన నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు విగతజీవులయ్యారు. ముగ్గురు స్నేహితులు మునిగిపోతుంటే కాపాడేందుకు వెళ్లిన మరో విద్యార్థి వారితోపాటే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన ఏలూరు పరిసరాల్లో కలకలం రేపింది. తల్లిదండ్రుల రోదనలు, బంధువుల హాహాకారాలతో పెదవేగి మండలం భోగాపురంలోని చెరువు ప్రాంతం మార్మోగింది. రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ మూడో సంవత్సరం చదువుతున్న కామవరపుకోటకు చెందిన కె.హరికృష్ణ(21), చింతలపూడికి చెందిన గుమ్మి విజయశంకర్(22), ఏలూరుకు చెందిన ఎస్కే పరశురాం(23)తోపాటు ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చింతలపూడికి చెందిన కోటసాయిరాజు (22) శనివారం మధ్యాహ్నం తరగతులకు డుమ్మాకొట్టి కళాశాల సమీపంలోని భోగాపురం వద్ద జామతోటలోకి వెళ్లారు. మద్యం తాగి.. వెంట తెచ్చుకున్న బాక్సుల్లోని భోజనాన్ని తిన్నారు. ఆ తర్వాత సరదాగా కాసేపు గడిపారు. తోటలోని జామకాయలు కోసుకుతిన్నారు. జామతోట సమీపంలోనే చెరువు ఉండడంతో అందులో ముగ్గురు ఈతకు దిగారు. చెరువు బాగా లోతుగా ఉండడంతో మునిగిపోయారు. గట్టుపై నుంచి ఈ దృశ్యాన్ని చూస్తున్న విద్యార్థి కోట సాయిరాజు దుస్తులతోనే చెరువులోకి దిగాడు. స్నేహితులను కాపాడదామని చెరువులో దిగి వారితోపాటు విగతజీవుడైనట్టు తెలుస్తోంది. ఆదివారం వెలుగులోకి ఈ ఘటన శనివారం జరిగినా ఆదివారం వెలుగులోకి వచ్చింది. భోగాపురం చెరువు సమీపంలోని జామతోటలో విద్యార్థుల బ్యాగులు, పుస్తకాలు, మోటారు సైకిల్, చెరువుగట్టుపై దుస్తులు ఉండడంతో స్థానికులు ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఏలూరు డీఎస్పీ కె.ఈశ్వరరావు, త్రీటౌన్ సీఐ పి.శ్రీనివాసరావు, రూరల్ సీఐ వెంకటేశ్వరరావు, పెదవేగి ఎస్సై వి.కాంతిప్రియ, ఏలూరు రూరల్ ఎస్సై నాగేంద్రప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువులో పైకితేలిన మృతదేహాన్ని స్థానికులు బయటకు తీసుకువచ్చారు. మిగిలిన ముగ్గురి మృతదేహాల ఆచూకీ తెలియకపోవటంతో జిల్లా అగ్నిమాపక దళ అధికారి ఏవీ శంకరరావు ఆధ్వర్యంలో సిబ్బంది బోటుపై చెరువులో గాలించి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెసేజ్ ‘మిస్’ చేసిందా ? సాధారణంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులు తరగతులకు హాజరుకాకుంటే వెంటనే వారి తల్లిదండ్రులకు యాజమాన్యాలు మెసేజ్ ఇస్తాయి. అయితే రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీలో శనివారం జరిగిన చిన్న పొరపాటు విద్యార్థుల మృతికి పరోక్షంగా కారణమైందని విద్యార్థుల బంధువులు ఆరోపిస్తున్నారు. కనీసం మెసేజ్ వచ్చి ఉంటే తమ పిల్లలు ఎక్కడ ఉన్నారో ఆరా తీసేవారమని, ఇంత ఘోరం జరిగేది కాదేమోనని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో జాతీయ సెమినార్ నిర్వహించే ఏర్పాట్లలో కార్యాలయ సిబ్బంది బిజీగా ఉండడంతోనే శనివారం మెసేజ్ పంపలేదని ప్రిన్సిపల్ డి.సంజయ్ వివరణ ఇచ్చారు. రోదనల హోరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతిచెందారనే విషయాన్ని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులతోపాటు తోటి విద్యార్థులు భారీగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక్కో మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీస్తుంటే వారి తల్లి్లదండ్రులు, బంధువులు తీవ్రంగా రోదించారు. వారి హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగింది. నలుగురు విద్యార్థులు ప్రతిభావంతులే చనిపోవటం కలచివేసింది. వాళ్ళు బాగా చదువుతారు. మంచి ప్రతిభావంతులు. వారికి 90శాతం హాజరు ఉంటుంది. సాధారణంగా తరగతులకు రాకుండా ఉండరు. శనివారం కాలేజీకి రాలేదు. హాజరుపట్టీలో ఆబ్సెంట్ వేసిఉంది. ఈరోజు ఉదయం మృతిచెందారనే సమాచారం తెలిసి వెంటనే ఏఓ సాయికృష్ణతో కలిసి వచ్చా. డి.సంజయ్, ప్రిన్సిపల్, రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీ ఘటన బాధాకరం ఇంజినీరింగ్ విద్యార్థులు ఇలా చనిపోవటం బాధాకరం. సరదాగా వచ్చి ఇలా మృత్యువాత పడ్డారు. మద్యం బాటిళ్లు ఘటనా స్థలంలో ఉన్నాయి. మద్యం తాగి ఉంటారని భావిస్తున్నాం. పోస్టుమార్టం చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. కళాశాలలకు హాజరుకాని విద్యార్థుల గురించి యాజమాన్యాలు సమాచారం అందించాలి. విద్యార్థులు వ్యసనాలు అలవాటు చేసుకోకూడదు. ఇది దురదృష్టకర ఘటన. – కె.ఈశ్వరరావు, డీఎస్పీ, ఏలూరు -
చదువుతో పాటే ఉపాధి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధి అవకాశాల్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలంటే పరిశ్రమలకు అవసరమైన కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. వీటిని ఇంజనీరింగ్ పాఠ్యాంశాలకు జోడించాలని యోచిస్తోంది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఇంజనీరింగ్ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఏర్పాటైన సబ్ కమిటీలు హాజరయ్యాయి. మారుతున్న పరిస్థితులు, విస్తరిస్తున్న పరిశ్రమలకు అనుగుణంగా ఇంజనీరింగ్ పాఠ్యాంశంలో సంస్కరణలు చేయాలని, ఇందులో యూనివర్సిటీలు కీలకంగా మారాలని సభ్యులు సూచించారు. ఇంజనీరింగ్ విద్య, సాధారణ విద్యనభ్యసించే విద్యార్థులకు మెరుగైన ఉపాధి మార్గాలను చూపడానికి, నిరుద్యోగాన్ని భారీగా తగ్గించడం కోసం సబ్ కమిటీలు పనిచేయనున్నాయి. అలాగే పాఠ్యాంశం, ఇంటర్న్షిప్ అండ్ ఎంప్లాయిమెంట్, యూనివర్సిటీల్లో ఇంక్యుబేషన్ కేంద్రాల కోసం కమిటీలు కృషి చేస్తాయి. వర్సిటీల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇంక్యుబేషన్ కేంద్రాల్లో విద్యార్థులు వివరాలు నమోదు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక వెబ్పోర్టల్ను ప్రారంభించాలని నిర్ణయించారు. పరిశ్రమల అవసరాలు ఏమిటనే అంశం ఆధారంగా విద్యార్థులు తమ ఆలోచనలను పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఓయూ వీసీ రామచంద్రమ్, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ సీతారామారావు, కేయూ వీసీ సాయన్న, జేఎన్టీయూఎఫ్ వీసీ కవితాదర్యాని, ఆర్జీయూకేటీ వీసీ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్లో కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఆదివారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. అతివేగం వల్లే కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. విద్యార్థుల అందరూ గీతం ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన వారిగా తెలిసింది. మృతి చెందిన విద్యార్థిని జతిన్ వర్మగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జూబ్లీహిల్స్లో కారు బీభత్సం.
-
సెల్ఫోన్ సంభాషణలే ప్రాణాల మీదకు తెచ్చాయా.?
ఇంజనీరింగ్ చదువుకున్నారు. తల్లిదండ్రులను ఎదురించి కోరుకున్న వారిని పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరు వివాహితల జీవితాలు అర్ధంతరంగా ముగియడానికి కారణాలు ఏమిటి.? బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారా? లేక నమ్మినవారి చేతిలో హతమయ్యారా? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకడం లేదు. సాంకేతిక విప్లవంగా చెప్పుకుంటున్న సెల్ఫోన్ ఇద్దరి జీవితాల్లో కల్లోలానికీ, చివరికి వారి ప్రాణాలను బలితీసుకుందనే అనుమానాలువ్యక్తం అవుతున్నాయి. కోదాడ: కోదాడలో సోమవారం వెలుగుచూసిన వేర్వేరు సంఘటనల్లో అనుమానాస్పదంగా మృతిచెందిన వెంపటి జయశ్రీ (24) మాధవి (23)ల మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామాలు, నేపథ్యం వేరైనప్పటికీ ఇద్దరి మరణానికి కారణం ఒకటేనని తెలుస్తోంది. మంగళవారం కోదాడ ప్రభుత్వ వైద్యశాల వద్ద జయశ్రీ తల్లి ధనలక్ష్మి మాత్రం తన కుమార్తెను భర్త శ్రావణ్, అత్త మామలు వేధించి ప్రాణాలు తీశారని ఆరోపించారు. మాధవి భర్త సతీష్ కూడా వంశీకృష్ణ వేధించి తనభార్యను హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. ప్రాణాలమీదకు తెచ్చిన సెల్ఫోన్... కోదాడలో ఇంజనీరింగ్ చదువుకున్న జయశ్రీ పట్టణానికి చెందిన శ్రావణ్ను ప్రేమించి..పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. చదువుకునే రోజుల్లో క్లాస్మేట్ అయిన ఓ మిత్రుడు బెంగళూరులో ఉంటున్నాడు. ఇటీవల అతను తరచు జయశ్రీతో ఫోన్లో మాట్లాడుతున్నాడని సమాచారం. ఈ విషయమై భర్తకు జయశ్రీకి చిన్నపాటి గొడవలు అవుతున్నాయని దీనిని దృష్టిలో పెట్టుకుని తరచు వేధిస్తున్నాడని ఆమె తల్లి పేర్కొంటోంది. అంతే కాక విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం జయశ్రీతో ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తికి శ్రావణ్ ఫోన్ చేసి ఇక తన భార్యకు ఫోన్ చెయ్యవద్దని వార్నింగ్ ఇవ్వడమేగాక కోదాడలో ఉంటున్న అతని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఫోన్ సంభాషణల రికార్డు తనవద్ద ఉందని శ్రావణ్ తరుచు బెదిరిస్తున్నాడని జయశ్రీ తల్లిదండ్రుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ ఘటనల నేపథ్యంలో జయశ్రీ ఒత్తిడికి లోనైందా? లేక ఇతర కారణాలు ఏమై ఉంటాయన్నది పోలీసుల విచారణలో తేలనుంది. తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, వరకట్నం కోసం వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే జయశ్రీ కాపురంలో ఇంత కల్లోలానికి, ప్రాణాల మీదకురావడానికి సెల్ఫోనే కారణమని బంధువులు అంటున్నారు. మాధవి మరణానికి కూడా..? కోదాడలోని షిర్డీనగర్లో సోమవారం వెలుగుచూసిన మాధవి అనుమానాస్పద మరణం వెనుక కూడా సెల్ఫోన్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. వత్సవాయికి చెందిన మాధవి ఖమ్మం జిల్లాకు చెందిన సతీష్తో నెలన్నర క్రితమే వివాహం చేసుకుంది. ఇద్దరి ఇంటిపేర్లు ఒకటే ఉన్నాయని తల్లిదండ్రులు వద్దన్నా వినకుండా కష్టపడి పైకి వచ్చి, విద్యుత్ ఏఈ ఉద్యోగం సంపాదించిన సతీష్నే పెళ్లి చేసుకుంటానని కోరి చేసుకుందని బంధువులు అంటున్నారు. కానీ చదువుకునే రోజుల్లో పరిచమైన వంశీకృష్ణతో గతంలో తరచు ఫోన్లో మాట్లాడింది. వాటిని అడ్డుపెట్టుకుని మాధవిని వేధించడమేగాక ఫోన్ సంభాషణలను భర్తకు పంపుతానని బెదిరించాడని, దాని విషయం మాట్లాడడానికే ఆమె కోదాడకు వచ్చి ఉంటుందని బంధువులు అంటున్నారు. భర్త సతీష్ మాత్రం వంశీకృష్ణ వేధిస్తున్నాడని తనకు కూడా చెప్పిందని, అతనిపై గతంలో కేసు కూడా పెట్టిందని అంటున్నాడు. తన భార్య హత్యకు వంశీకృష్ణ కారణమని అతను ఆరోపిస్తున్నాడు. ఇదీలా ఉండగా సోమవారం కోదాడకు వచ్చిన మాధవి తన మరిదిని ఖమ్మం క్రాస్రోడ్డు వద్ద ఉండమని ఆటోలో షిర్డీనగర్కు వెళ్లింది. అక్కడ వంశీకృష్ణ ఒక్కడే ఉన్నాడని ఫోన్ విషయమై వారు గొడవ పడుతుండగా అతని భార్య వచ్చిందని.. దీంతో తగాదా పెద్దదై భార్యభర్తలు కలిసి మాధవిని హత్యచేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. మాధవి చనిపోయిన గదిలో ఫ్యాన్కూడా లేదని, చున్ని ఆమె బరువును కూడా ఆపదని అందువల్ల ఆత్మహత్య కానే కాదని.. అది ముమ్మాటికీ హత్యేనని బం«ధువులు మంగళవారం ఆస్పత్రి వద్ద రోదిస్తూ ఆరోపించారు. పోస్టుమార్టానికి వైద్యుడు కరువు..! సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఇద్దరు వివాహితలు జయశ్రీ, మాధవిల మృతదేహాలకు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించడానికి వైద్యుడు కరువయ్యాడు. సోమవారం రాత్రి మృతదేహాలను మార్చురీకి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం వరకు వైద్యుడు లేకపోవడంతో బం«ధువులు మార్చురీ వద్దే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి వైద్యులను రప్పించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చివరకు మృతదేహాలను హుజూర్నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడ పోస్టుమార్టం నిర్వహించారు. ఈ తతంగం అంతా పూర్తి అయ్యేసరికి సాయంత్రం కావడంతో మృతుల కుటుంభ సభ్యులు, బంధువులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. విచారణ జరుపుతున్నాం.. జయశ్రీ, మాధవి మరణాల మిస్టరీని ఛేదించేందుకు విచారణను ముమ్మరం చేశాం. జయశ్రీని వరకట్నం కోసమే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రి ఫిర్యాదు చేశారు. మాధవి మృతిపై కూడా ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. మాధవి విషయంలో సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశాం. సాధమైనంత త్వరలో ఈ కేసుల మిస్టరీని ఛేదిస్తాం. –సీఐ రజితారెడ్డి, కోదాడ -
సర్టిఫికెట్టు.. తాకట్టు!
సాక్షి, హైదరాబాద్ : రాహుల్.. ఏడాది కిందట మేడ్చల్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు.. ఫస్టియర్ కాకుండానే అనారోగ్య సమస్యలతో కాలేజీ మానేశాడు.. ఒరిజినల్ సర్టిఫికెట్లు కాలేజీలోనే ఉండిపోయాయి.. వాటిని ఇవ్వాలని అడిగితే మిగతా మూడేళ్ల ఫీజు చెల్లిస్తేనే ఇస్తామని కరాఖండీగా చెప్పేసింది యాజమాన్యం! వెంకటేష్.. మొయినాబాద్లోని మరో ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్లో చేరాడు.. ప్రథమ సంవత్సరం పూర్తయింది.. తండ్రి అనారోగ్యం కారణంగా కుటుంబ పోషణ భారం అతడిపై పడింది. సెకండియర్ కాలేజీకి వెళ్లలేని పరిస్థితి.. యాజమాన్యాన్ని తన సర్టిఫికెట్లు అడిగితే మూడేళ్ల ఫీజు చెల్లించాల్సిందేనని చెప్పింది.. దీంతో ఆ విద్యార్థి సాంకేతిక విద్యాశాఖకు ఫిర్యాదు చేశాడు. ..కోర్సులు పూర్తయిన వారికి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదన్న సాకుతో సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న యాజమాన్యాలు.. అనివార్య కారణాల వల్ల చదువు మానేసిన విద్యార్థులకు కూడా చుక్కలు చూపుతున్నాయి! ఇంటర్ అర్హతతో ఇతర కోర్సులు చదువుకునే అవకాశమే లేకుండా చేస్తున్నాయి. మిగతా సంవత్సరాల ఫీజులు చెల్లిస్తేనే ఇస్తామంటూ మెలిక పెడుతున్నాయి. కుటుంబ సమస్యలు, డిటెన్షన్, చదవలేకపోవడం వంటి కారణాలతో కాలేజీల్లో చేరుతున్న వారిలో ఏటా 5 వేల నుంచి 6 వేల మంది డ్రాపౌట్స్గా మిగిలిపోతున్నారు. వీరంతా కాలేజీ నుంచి సర్టిఫికెట్లు వెనక్కి తీసుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా కనికరించకపోవడంతో సాంకేతిక విద్యాశాఖకు క్యూ కట్టారు. ఇలా గత పదిహేను రోజుల్లో 47 మంది విద్యార్థులు ఫిర్యాదులు చేశారు. ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఏఐసీటీఈ చెప్పినా.. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం చదువు మానేసిన విద్యార్థుల సర్టిఫికెట్లను వారికి తిరిగి ఇచ్చేయాలి. ఏ కారణంతోనూ నిరాకరించడానికి వీల్లేదు. మిగతా సంవత్సరాల ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామన్న మెలిక పెట్టరాదు. ఈ విషయాన్ని ఏఐసీటీఈ 2017–18 ఇంజనీరింగ్ కాలేజీల అప్రూవల్ ప్రాసెస్లో స్పష్టం చేసింది. ఇబ్బందులతో చదువు మానేస్తున్న వారి సర్టిఫికెట్లు ఆపి మరింత ఇబ్బందులు పెట్టవద్దని స్పష్టం చేసింది. అయినా యాజమాన్యాల తీరు మారడం లేదు. వీరేకాదు కోర్సు పూర్తయిన వారికి ఈ తంటాలు తప్పడం లేదు. దీంతో కొందరైతే క్యాంపస్ సెలక్షన్స్లో ఎంపికైనా సర్టిఫికెట్లు లేకపోవడంతో ఉద్యోగాల అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద నిధుల విడుదలలో ఆలస్యం అవుతుండటంతో యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయి. హైకోర్టుది అదే మాట.. విద్యార్థుల సర్టిఫికెట్లను ఇవ్వకుండా నిరాకరించడం సరికాదని, ఎట్టి పరిస్థితుల్లో వారికి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందేనని ఇటీవల హైకోర్టు కూడా స్పష్టం చేసింది. అటు సాంకేతిక విద్యాశాఖ సైతం కొన్ని కాలేజీలకు లేఖలు రాసింది. అయితే సర్టిఫికెట్లు ఇచ్చేయాలని చెప్పే అధికారం సాంకేతిక విద్యాశాఖకు లేదంటూ కొన్ని యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. విద్యార్థులు మధ్యలో వెళ్లిపోతే తాము మిగతా సంవత్సరాల ఫీజును నష్టపోతామని వాదించాయి. అయితే హైకోర్టు కూడా విద్యార్థుల సర్టిఫికెట్లను ఆపడానికి వీల్లేదని స్పష్టం చేయడం గమనార్హం. -
కొట్టుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులు
-
కొట్టుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులు
సాక్షి, వరంగల్ రూరల్: ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని చెన్నారావుపేటలో బుధవారం వెలుగుచూసింది. స్థానిక జయముఖి ఇంజనీరింగ్ కాళాశాలలో రెండు గ్రూపుల విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా.. మనోజ్, రజనీకాంత్ అనే విద్యార్ధులు గాయపడి అపస్మారక స్థితికి చేరుకోవడంతో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసుల అదుపులో ఇంజనీరింగ్ విద్యార్థులు
సూర్యాపేట: గంజాయి సేవిస్తున్న 9 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ శ్రీరంగాపురంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు గంజాయి సేవిస్తుండగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి వదిలి పెడతామన్నారు. వారికి గంజాయి సప్లై చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. -
ఇంజినీరింగ్ విద్యార్థులే ఏటీఎం దొంగలు
విశాఖపట్టణం: నగరంలో ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులిద్దరూ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన వారు. నగరంలోని ఎంవీపీ కాలనీలో ఉన్న రెండు ఏటీఎంలలో రూ.4.92 లక్షలను వీరిద్దరూ కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. యూపీలోని కుషినగర్ జిల్లా స్వప్నిల్ సింగ్(22), బిహార్లోని ఫైజాబాద్కు చెందిన సత్యరథ్ మిశ్రా(20) నాగ్పూర్లోని యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ సెకండియర్ చదువుకుంటున్నారు. ఆన్లైన్లో ఏటీఎం సాఫ్ట్వేర్ను టాంపరింగ్ చేసి డబ్బును డ్రా చేయడం నేర్చుకున్న విద్యార్థులు ఢిల్లీ, ఒడిశాలలో ఉన్న కొన్ని ఏటీఎంల్లో ప్రయత్నించి విఫలమయ్యారు. గత నెలలో విశాఖ చేరుకుని చోరీకి అనువైన ఎంవీపీ కాలనీలోని ఏటీఎంలను ఎంపిక చేసుకున్నారు. జూన్ 24 తేదీ నుంచి 28వ తేదీ వరకు అర్థరాత్రి 11 నుంచి 2 గంటల మధ్య మొత్తం 51 సార్లు దొంగతనానికి పాల్పడ్డారు. అయితే, ఎవరి వ్యక్తిగత అకౌంట్ల నుంచీ డబ్బు డ్రా చేయలేదు కాబట్టి, ఆయా బ్యాంకులకే అంతిమంగా నష్టం వాటిల్లింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆయా ఏటీఎంలలో ఉన్న సీసీ ఫుటేజిల ఆధారంగా విచారణ చేయగా నిందితులు కాన్పూర్లో ఉన్నారని తెలుసుకున్నారు. దీంతో అక్కడి వెళ్లిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బుధవారం విశాఖకు తీసుకువచ్చారు. వారి వద్ద ఉన్న రూ.13 లక్షల నగదుతోపాటు ఆభరణాలతోపాటు కొంత సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. -
సీట్లు తక్కువ.. విద్యార్థులు ఎక్కువ
♦ కన్వీనర్ కోటాలో గతేడాది కన్నా తగ్గిన సీట్లు ♦ సీట్లు 62,746.. వెరిఫికేషన్ చేయించుకున్న వారు 64,340 ♦ గతేడాది 5 వేల సీట్లు అదనం.. ఈసారి 1,594 సీట్లు తక్కువ ♦ కన్వీనర్ కోటా ప్రవేశాలకు ముగిసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ♦ నేడు వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం.. 28న సీట్లు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: ఈసారి ఇంజనీరింగ్లో విద్యార్థులకు కోరుకున్న కాలేజీల్లో సీట్లు లభిం చడం కొంచెం కష్టంగా మారింది. కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్న సీట్లు తక్కువగా ఉండటం.. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. గతేడాది కన్వీనర్ కోటాలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరైన విద్యార్థుల సంఖ్య కన్నా 5 వేలకు పైగా ఎక్కువ సీట్లున్నాయి. ఈ సారి విద్యార్థుల సంఖ్య కంటే 1,594 సీట్లు తక్కువగా ఉన్నాయి. దీంతో ఎక్కువ మంది కోరుకున్న కాలేజీల్లో సీట్లు లభించడం కాస్త కష్టమే. గతేడాది కన్వీనర్ కోటాలో 71,066 సీట్లు అందుబాటులో ఉండగా, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న 66,566 విద్యార్థుల్లో మొదటి దశ కౌన్సెలింగ్లో 57,789 మందికే సీట్లు లభించాయి. ఈ సారి కన్వీనర్ కోటాలో 62,746 సీట్లు అందుబాటులో ఉండగా, గురువారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ముగిసే సమయానికి 64,340 మంది హాజరయ్యారు. వెరిఫికేషన్ కు హాజరైన విద్యార్థుల కన్నా 1,594 సీట్లు తక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన ఎంత మందికి మొదటి దశ కౌన్సెలింగ్లో సీట్లు లభి స్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. మేనేజ్మెంట్ కోటా వైపు మొగ్గు..! కన్వీనర్ కోటాలో కోరుకున్న కాలేజీల్లో సీట్లు లభిస్తాయో లేదోనన్న అనుమానంతో డబ్బు చెల్లించగలిన వారు మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతేడాది కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా సీట్లు మొత్తం 1.04 లక్షలుండగా, ఎంసెట్లో 1.06 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు. కానీ ఈ సారి మొత్తం సీట్లు 92,700 వరకు ఉండగా, అర్హులు మాత్రం 1.03,500 మంది ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 11 వేల సీట్లు తగ్గిపోయాయి. దీనివల్ల కూడా మేనేజ్మెంట్ కోటాకు డిమాండ్ ఏర్పడింది. వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం.. ఇంజనీరింగ్ ఎంసెట్ వెరిఫికేషన్ గురువారంతో ముగిసింది. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోనివారు ఈ నెల 23న ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు. ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు శుక్రవారం తమ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి ఈ నెల 28న రాత్రి 8కు సీట్లు కేటాయించనున్నారు. జ్టి్టpట://్టట్ఛ్చఝఛ్ఛ్టి.nజీఛి.జీn వెబ్సైట్లో వివరాలను ఉంచుతామని వివరించారు. -
ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్యాలపై శిక్షణ!
స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్పై తరగతులు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు అఖిల భారత సాంకే తిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కసరత్తు చేస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు, పారిశ్రామికావసరాలకు అనుగుణంగా శిక్షణ, అధ్యాపకులకు సాంకే తిక పరిజ్ఞానంపై శిక్షణ తరగతులను నిర్వ హించేందుకు చర్యలు ప్రారంభిం చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే పలు సంస్కర ణలను అమలు చేయాలని నిర్ణయించిన ఏఐసీటీఈ.. కొత్తగా ఇంజనీరింగ్లో చేరే విద్యార్థులకు తరగతుల కంటే ముందుగా స్పోకెన్ ఇంగ్లిషు, కమ్యూనికేషన్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, ఇంజనీరింగ్ మౌలిక అం శాలపై నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ ఐఐటీ, బెనారస్ హిందూ వర్సిటీ– ఐఐటీలో విజయవంతమైన ఈ శిక్షణ కార్య క్రమాన్ని ఇతర ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ అమలు చేయాలని నిర్ణయించినట్లు ఏఐసీ టీఈ చైర్మన్ అనీల్ డి. సహస్రబుద్ధే ఇటీవల వెల్లడించారు. మొదట 500 కాలేజీల్లో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ కాలేజీలో తప్పనిసరి చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పారిశ్రామిక శిక్షణ తప్పనిసరి ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంటున్న విద్యా ర్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, వృత్తి నైపు ణ్యాలు, పారిశ్రామిక అవసరాలకు అనుగు ణంగా సిద్ధంగా లేకపోవడంతో ఉపాధి లభించక నిరుద్యోగులుగా మిగిలిపోతు న్నారు. ఈ నేపథ్యంలో వారికి 8 వారాల పారిశ్రామిక శిక్షణ తప్పనిసరి చేయాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. ఇంజనీరింగ్ మూడు, నాలుగో సంవత్సరాల్లో శిక్షణను అమలు చేయనుంది. అలాగే సబ్జెక్టు వారీగా ఇండస్ట్రీ కన్సల్టేషన్ కమిటీలను (ఐసీసీ) ఏర్పాటు చేసి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని వర్సిటీలకు స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని వర్సిటీలు ఫస్టియర్లో డిటెన్షన్ అమలు చేసేలా కసరత్తు చేస్తోంది. -
సోలార్ కారు.. హాయిగా షికారు
- జి.పుల్లయ్య కాలేజీ విద్యార్థుల ఆవిష్కరణ - త్వరలోనే వికలాంగులకు సైతం సోలార్ ట్రైసైకిళ్ల తయారీకి చర్యలు - విద్యార్థులను అభినందించిన కాలేజీ చైర్మన్ జి.వి.ఎం మోహన్ కుమార్ కర్నూలు సిటీ: కర్నూలు నగర శివారులోని వెంకయ్యపల్లె సమీపంలోని జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థు«లు తమ ప్రతిభతో సోలార్ కారును ఆవిష్కరించారు. అలాగే ఇంట్లో పైసా ఖర్చూ లేకుండా ఆరోగ్యకరమైన వంటలు తయారు చేసుకునేందుకు సోలార్ కుక్కర్ను సైతం తయారు చేశారు. ఈ మేరకు బుధవారం ఆ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ కాలేజీల చైర్మన్ జి.వి.ఎం మోహన్కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం కాలుష్యం సమాజంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. దీంతో తమ వంతుగా సమాజానికి మెరుగైన వాహనాలను తయారు చేయాలనే ఉద్దేశంతోనే సోలార్తో రెండు ప్రాజెక్టులను ఈ ఏడాది తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో భాగంగానే విద్యార్థు«లు చాలా శ్రమతో అధ్యాపకుల సహయంతో సోలార్ కారు, సోలార్ కుక్కర్ను రూపొందించారన్నారు. నూతన ఆవిష్కరణలకు ఇది ప్రారంభమని, మునుముందు ఎన్నో ప్రాజెక్టులు చేపడుతామన్నారు. అనంతరం విద్యార్థులను అభినందించారు. సమావేశంలో ఈ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి.శ్రీనివాసరావు, వైస్ చైర్మెన్ జి.వంశీధర్, డీన్ డా.ఎస్ ప్రేమ్కుమార్, కార్పొరేట్ వ్యవహారాల డీన్ డా.ఎం.గిరిధర్కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. తక్కువ ఖర్చుతోనే కారు: చైర్మన్ జి.వి.ఎం మోహన్కుమార్ కాలుష్య నివారణకు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో సోలార్ కారును ఆవిష్కరించాలనుకున్నాం. రూ. 1.25 లక్షల బడ్జెట్ను నిర్ణయించాం. అయితే మెకానికల్ తృతీయ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు జె.నిర్మల్, డి.ఆశిష్, హూసేన్ బాషా, సాయినాథ్గౌడ్, రంజిత్, యోగేష్, అనిల్ దాదాపు 45 రోజులపాటు స్టడీ చేసి మోకానికల్ విభాగాధిపతి డాక్టర్ కె. మల్లికార్జున పర్యవేక్షణలో కేవలం రూ. 70 వేలు మాత్రమే ఖర్చు చేసి సోలార్ కారును తయారు చేశారు. ఇందులో ఆరుగురు ప్రయాణించవచ్చు. 2 నుంచి 3 గంటలు చార్జీ అయితే సరిపోతుంది. గంటకు 32 నుంచి 40 కి.మీ వేగంతో వెళ్తుతుంది. సాధారణ వాహనాల వలే రోడ్డుపై ప్రయాణం చేయవచ్చు. సోలార్ ఫలకాలను పెంచుకుంటే మరింత వేగంగా కూడా వెళ్లవచ్చు. ప్రస్తుతం నాలుగు బ్యాటరీలతో కారు నడుస్తుంది. క్యాంపస్లో దీన్ని వినియోగిస్తున్నాం. త్వరలోనే దివ్యాంగుల కోసం సోలార్ ట్రైసైకిళ్ల తయారు చేసే అంశంపై ఆలోచన చేస్తున్నాం. -
విహారయాత్రలో విషాదం
- బీచ్లో 11 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు - 8 మృతదేహాలు లభ్యం సాక్షి, ముంబై/బనశంకరి(బెంగళూరు): విద్యార్థుల విహారయాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్టడీటూర్ ముగించుకుని సరదాగా బీచ్ స్నానానికి వెళ్లిన వారిలో 8 మంది విగతజీవులుగా ఒడ్డుకు కొట్టుకొచ్చారు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని వాయరి బీచ్లో శనివారం ఈ ఘోరం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రం బెళగావిలోని మరాఠా ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన 47 మంది విద్యార్థులు స్టడీటూర్ నుంచి తిరిగి వస్తూ శనివారం విహారయాత్రకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో బీచ్లో ఈత కొడుతుండగా.. ప్రమాదవశాత్తూ 8 మంది అరేబియా సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలోని లోతైన ప్రాంతానికి వెళ్లడంతో ఒక్కసారిగా రాకాసి అలలు వారిని మింగేశాయి. మృతుల్లో ఐదుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారని పోలీసులు తెలిపారు. మునిగిపోతున్న విద్యార్థుల్ని రక్షించేందుకు మిగతా విద్యార్థులు ప్రయత్నించినా అప్పటికే ఆలస్యమైందని సింధుదుర్గ్ ఎస్పీ అమోఘ్ గోయంకర్ చెప్పారు. మొత్తం ఎనిమిది మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా పోలీసుల సాయంతో ముగ్గురు విద్యార్థుల్ని ఒడ్డుకు తీసుకురాగా చికిత్స కోసం వారిని సమీపంలోని మాల్వన్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో ఒకమ్మాయి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. స్టడీటూర్లో భాగంగా గత గురువారం మహారాష్ట్రలోని పుణేలో ఇండస్ట్రియల్ మీట్కు ఈ విద్యార్థులు హాజరయ్యారు. మృతదేహాల్ని సింధుదుర్గ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనతో కర్ణాటకలోని బెళగావి నగరంలో విషాదం అలముకుంది. స్టడీ టూర్కు అనుమతి లేదు: ప్రిన్సిపాల్ ఘటనపై మరాఠా మండల కాలేజీ ప్రిన్సిపాల్ విశ్వనాథ్ ఉడుపి స్పందిస్తూ... విద్యార్థుల స్టడీ టూర్కు అనుమతి నిరాకరించినా వెళ్లారని చెప్పారు. ఇండస్ట్రియల్ మీట్ పూర్తి కాగానే నేరుగా కాలేజీకి రావాలని విద్యార్థులకు సూచించామన్నారు. -
ఇంజనీరింగ్ విద్యార్థుల దారుణ హత్య
ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఇద్దరు ఇంజనీరింగ్ ఫైనల్ విద్యార్థులను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా కొట్టి చంపారు. లోనావాలా, ఐఎన్ఎస్ శివాజీ సమీపంలోని కొండ మీద నగ్నంగా పడివున్న రెండు మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. సింగద్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి, కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న మరో విద్యార్థినిగా వీరిని గుర్తించారు. ఈ జంటల హత్య ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. అహ్మద్నగర్ కు చెందిన విద్యార్థి( 22), పుణేకు చెందిన అతని స్నేహితురాలు అనూహ్యంగా శవాలై తేలారు. చేతులను వెనక్కి కట్టివేసి, తలపై పదునైన ఆయుధంతో బలంగా మోదడంతో చనిపోయి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో బాధితుని బైక్తో పాటు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా బాధితులను గుర్తించిన పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. మరోవైపు హత్యకు గరైన యువతికి ఇప్పటికే ఉద్యోగం వచ్చిందని కోర్సు పూర్తయిన తర్వాత జాబ్లో చేరేందుకు యోచిస్తున్నట్లు కళాశాల అధికారులు చెప్పారు. అలాగే హాస్టల్ నుంచి తన స్నేహితునితో కలసి బయటికి వెళుతున్నానని, ఆలస్యంగా వస్తానంటూ సన్నిహితులతో చెప్పి వెళ్లిందని తెలిపారు. -
మినీ హెలికాప్టర్ తయారు చేసిన బీటెక్ స్టూడెంట్స్
-
విద్యార్థుల వినూత్న కృషి
బొబ్బిలి రూరల్ : ఇంజినీరింగ్ విద్యార్థుల అద్భుత కృషితో సోలార్ పవర్డ్ వెహికల్ తయారైంది. ఈ వెహికల్ను రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని మంగళవారం మండలంలో కోమటపల్లి తాండ్ర పాపారాయ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభించారు. ఈ వాహనంపై మంత్రి మృణాళిని, ఆమె భర్త గణపతిరావు, జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి, మున్సిపల్ చైర్పర్సన్ తూముల అచ్యుతవల్లి ప్రయాణించారు. ప్రస్తుతం సోలార్, బ్యాటరీతో నడిచే ఈ వాహనం సోలార్తో నడిచే విధంగా రూపు దిద్దడానికి ఏర్పాట్లు చేçస్తున్నారు. రూ.1,50,000లతో తయారైన ఈ వాహనానికి ఒకసారి చార్జి చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఎనిమిది మంది ప్రయాణించే ఈ వాహనంపై ప్రయాణించడానికి కిలోమీటరుకు 25పైసలు ఖర్చు కానుండగా, బ్యాటరీ నాలుగేళ్లు పని చేస్తుంది. దీనిని ట్రిపుల్ఈ, ఈసీఈ, మెకానికల్ బ్రాంచ్కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు వంగపండు త్రివేణి, ఆర్.భరత్, జగదీష్, దిలీప్, కిషోర్, దిలీప్, విజయ్, వంశీ,ఆర్. శివసాయి, బాబు, ఎస్.శివ, సాయిరాం, కె.శ్రీనివాసరావు తయారుచేయగా, వీరికి ప్రిన్సిపాల్ డాక్టర్ జాషువాజయప్రసాద్, హెచ్వోడీలు బి.వెంకటరమణ, పి.కృపారావు, ఎన్.గణేష్ సహకరించారు. -
మద్యం కోసం జూనియర్లను చితకబాదారు
వరంగల్: మద్యం తాగించాలంటూ జూనియర్ విద్యార్థులను సీనియర్స్ చితకబాదిన విషయం వరంగల్ జిల్లాలో కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితమే ఓ కాలేజీ విద్యార్థులు మద్యం మత్తులో కత్తులతో దాడులు చేసుకోగా.. ఓ స్టూడెంట్ చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటనను మరువకముందే జూనియర్ స్టూడెంట్ పై మద్యం కోసం దాడి చేయడం సంచలనం రేపుతోంది. నగర శివారు లోని ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఐదుగురు సీనియర్ విద్యార్థులు ఓ జూనియర్ ను మద్యం తాగించాలంటూ గత కొద్దిరోజులుగా వేధిస్తున్నారు. గురువారం అతడిని బలవంతగా సమీపంలో ఉన్న బారుకు తీసుకెళ్లారు. డబ్బులు లేవని కాళ్లు మొక్కినా వినకుండా వేధించారు. దీంతో మరో స్నేహితుడికి కాల్ చేసి రమ్మన్నాడు. అతని దగ్గర కూడా కేవలం రెండు వందల రూపాయలు ఉండడంతో ఇద్దరినీ చితకబాదిన సీనియర్స్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, వరుస సంఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
వ్యభిచార గృహాల ముందు తచ్చాడుతూ..
హైదరాబాద్: వ్యభిచార గృహాల ముందు తచ్చాడుతూ.. అక్కడికి వచ్చిన విటులను బెదిరించి వారి వద్ద నుంచి నగదు తీసుకెళ్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉండటం గమనార్హం. నగరంలోని కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో పరిధిలోని వ్యభిచార గృహాల సమీపంలో దోపిడీలకు పాల్పడుతున్న వారిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారిలో రంగరాజు అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా పోలీసులు తెలిపారు. -
అతి వేగానికి ఇద్దరు విద్యార్థులు బలి
విశాఖపట్నం: అతివేగం ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన తిమ్మాపురం-రుషికొండ మధ్య దారిలో చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థులు వెళ్తున్న బైకు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పక్కనే ఉన్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న నితిన్(18), విజయహాసిని(18) మృతి చెందగా మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు నితిన్ దువ్వాడ కాలేజిలో బీటెక్ చదువుతున్నట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను కేజీహెచ్కు తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. -
అట్టహాసంగా కైట్ ఫెస్టివల్
సాక్షి, యాదాద్రి /యాదగిరికొండ / యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలోని పెద్దగుట్టపై జరిగిన అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు పతంగులను ఎగురవేసి సంబ రాలు జరుపుకున్నారు. నింగిలో ఎగురుతున్న పతంగులను చూసి స్థానిక ప్రజలు ఆనందపారవశ్యంతో మునిగితేలా రు. ఫెస్టివల్కు భువనగిరికి చెందిన బచ్పన్ పాఠశాల, వివిధ ఇంజనీరింగ్ కలేజీల విద్యార్థులు వలంట రీలుగా వ్యవహరించారు. ఆరోగ్య శిబిరం ఏర్పాటు కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న ప్రదేశంలో జిల్లా వైద్యాధికారి డీకే చారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, అర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ నాయక్ ప్రారంభించారు. మధ్యాహ్న సమయంలో పెద్దగుట్టపై ఎండ ఎక్కువగా ఉండటంతో జిల్లా కలెక్టర్ బీపీ చెక్ చేయించుకున్నారు. అనంతరం వైద్యులు కలెక్టర్కు గ్లూకోజ్ తాగించారు. ప్రత్యేక ఆకర్షణగా చేనేత వస్త్రాలు ఈ కైట్ ఫెస్టివల్లో చేనేత వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ధరించాలన్న తెలంగాణ ప్రభుత్వం సూచనలతో ఈ వేడుకలు జరుగుతున్న సమయంలో భూదాన్పోచంపల్లి నుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయించారు. ఎక్కువగా చీరలు తీసుకురావడంతో అధిక సంఖ్యలో మహిళలు అక్కడికి చేరుకొని తిలకించారు. అలాగే వేడుకలు జరుగుతున్న సమయంలో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగకుండా భువనగిరి అగ్నిమాపక కేంద్రం నుంచి ఫైరింజన్ తీసుకువచ్చారు. సంక్రాంతి రోజున జరిగిన అగ్నిప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ఈ ఫైరింజన్ను తీసుకువచ్చారు. అందరికీ తెల్ల టోపీలు తెలంగాణ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ పే రిట వైటీడీఏ అధికారులు అక్కడికి వచ్చిన భక్తులకు, ప్రజలకు, విదేశీయులకు శాంతి ని కోరుతూ తెల్లటోపీలను ఉచితంగా అం దజేశారు. వచ్చిన అతిథులు కూర్చోవడానికి శామియానాలతో పాటు కుర్చీలను ఏర్పాటు చేశారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక రుచులు పెద్దగుట్టపై తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఫుడ్కోర్టు ఏర్పాటు చేశారు. ఇందులో సమోసా, మిర్చీలు, స్యాండ్విచ్ వంటి ఆహార పదార్థాలను విక్రయించారు. చిరువ్యాపారుల సందడి పతంగుల పండుగ సందర్భంగా చిరువ్యాపారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పుట్నాలు, జామకాయలు, ఐస్క్రీమ్స్ వ్యాపారులు వచ్చి తమ వ్యాపారాన్ని కొనసాగించారు.జేసీ జి.రవినాయక్, ఈఓ గీతారెడ్డి, వైటీడీఏ వైస్చైర్మన్ కిషన్Sరావు, జౌళిశాఖ ఏడీ పద్మ, ఏసీపీ మోహన్రెడ్డి, తహసీల్దార్ వెంకట్రెడ్డి పాల్గొన్నారు -
ఇంజినీరింగ్ విద్యార్థులు ఎంతపని చేశారు?
చెన్నై: మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తామని పిలిచి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఝలక్ ఇచ్చారు. ఆ ఫోన్ వ్యక్తిని పిలిపించి ఫోన్ లాక్కొని పారిపోయారు. చివరకు పోలీసులు వారిని వెంబడించి అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం రంజిత్ కుమార్ అనే వ్యక్తి రూ.40 వేలు విలువ చేసే తన స్యామ్సంగ్ ఎస్7 ఎడ్జ్ ఫోన్ను ఆన్లైన్ పోర్టల్లో అమ్మకానికి పెట్టాడు. అయితే, మనోజ్(అలియాస్ ప్రెడెరిక్), మోతిస్వరణ్ అనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఆ ఫోన్ను కొంటామని చెప్పారు. రంజిత్ను మాధవరం అనే ప్రాంతంలోని ఓ పార్క్ వద్దకు రమ్మని కోరారు. అతడు అక్కడికి వచ్చి వారికోసం ఎదురుచూస్తుండగా దగ్గరకు వచ్చి ఫోన్ వివరాలు అడుగుతున్నట్లుగా నటించి అనూహ్యంగా ఫోన్ లాక్కోని బైక్ పరారయ్యారు. దీంతో అవాక్కయిన రంజిత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని చివరకు అరెస్టు చేశారు.