Federal Bureau of Investigation (FBI)
-
అమెరికన్లకు హాని చేయాలనుకుంటే అంతు చూస్తాం
వాషింగ్టన్: అమెరికన్లకు హాని చేయాలనుకునేవారి అంతు చూస్తామని, వారు భూమ్మీద ఏ మూల దాక్కున్నా వదలబోమని ఎఫ్బీఐ నూతన డైరెక్టర్ కశ్యప్ పటేల్ (కాశ్ పటేల్) హెచ్చరించారు. అమెరికా ప్రజలు గర్వించదగ్గ సంస్థగా ఎఫ్బీఐని పునర్నిర్మిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిరకాల మిత్రుడైన కాశ్ పటేల్ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) డైరెక్టర్గా సెనేట్ గురువారం ధ్రువీకరించింది. అనంతరం పటేల్... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అటార్నీ జనరల్ పామ్ బోండీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీని పారదర్శకంగా, జవాబుదారీగా, న్యాయానికి కట్టుబడినదిగా పునర్నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ‘‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తొమ్మిదో డైరెక్టర్గా నన్ను ధ్రువీకరించడం గౌరవంగా భావిస్తున్నా. అచంచల విశ్వాసం, మద్దతు ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్, అటార్నీ జనరల్ బోండీకి ధన్యవాదాలు. ‘జీ–మెన్’ నుంచి 9/11 దాడుల నేపథ్యంలో దేశాన్ని కాపాడటం వరకు ఎఫ్బీఐకి ఘనమైన వారసత్వం ఉంది. పారదర్శకంగా, జవాబుదారీతనంతో, న్యా యానికి కట్టుబడి ఉండే ఎఫ్బీఐకి అమెరికా ప్రజలు అర్హులు. రాజకీయ జోక్యంతో న్యాయ వ్యవస్థ ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. ఈ రోజుతో అది ముగుస్తుంది’’ అని ఎక్స్లో పోస్ట్ చేశారు. బాలీవుడ్ స్టైల్లో స్వాగతం.. ఎఫ్బీఐ కొత్త డైరెక్టర్గా కశ్యప్ పటేల్ను శ్వేతసౌధం స్వాగతించింది. వైట్హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో కాశ్కు బాలీవుడ్స్టైల్లో స్వాగతం పలికారు. నటుడు రణ్వీర్ సింగ్ నటించిన ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రంలోని ‘మల్హరి’ పాటను ఎడిట్ చేసి.. రణవీర్ స్థానంలో పటేల్ ముఖాన్ని ఉంచిన వీడియోను షేర్ చేశారు. ‘‘ఎఫ్బీఐ కొత్త డైరెక్టర్ కాశ్ పటేల్కు అభినందనలు’’ అని స్కావినో ట్వీట్ చేశారు. 47 సెకన్ల నిడివి ఉన్న ఈ క్లిప్ను వెంటనే 30 లక్షల మందికి పైగా చూశారు. డెమొక్రాట్ల నుంచి వ్యతిరేకత.. పటేల్ నామినేషన్ రాజకీయంగా చర్చనీయాంశం కావడంతో ఆమోదానికి వారం రోజులు ఆలస్యమైంది. ఈ పదవికి ఆయన అనర్హుడంటూ డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేశారు. కుట్ర సిద్ధాంతాలతో ఆయన అనుబంధం, రాజకీయ శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ గతంలో ఆయన ప్రకటనలు చేశారని, ట్రంప్ ఎఫ్బీఐ ప్రతీకార ప్రణాళికల సమాచారాన్ని దాచిపెట్టారని, పటేల్ను ఎఫ్బీఐ డైరెక్టర్గా నియమిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని డెమొక్రాట్ సెనేటర్లు ఆరోపించారు. పటేల్ అమెరికన్ల ప్రయోజనాల పరిరక్షణకు కాకుండా.. ట్రంప్ ప్రయోజనాల కోసం పని చేస్తా రని మండిపడ్డారు. అయితే సెనేట్లో రిప బ్లికన్లకు మెజారిటీ ఉండటం తెలిసిందే. అలాస్కాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్లు లీసా ముర్కోవ్స్కీ, మైనేకు చెందిన సుసాన్ కొలిన్స్ నుంచి వ్యతిరేకత ఎదురైంది. అయితే.. గతంలో ఇతర ట్రంప్ నామినీలను వ్యతి రేకించిన సెనేట్ మైనారిటీ నాయకుడు మిచ్ మెక్కా నెల్తో సహా మిగిలిన రిపబ్లికన్ పార్టీ మొత్తం పటేల్కు మద్దతు లభించింది. దీంతో.. సెనేట్ డెమొ క్రాట్లందరూ కాశ్కు వ్యతిరేకంగా ఓటు వేసి నా.. 51–49 ఓట్ల స్వల్ప తేడాతో ఆయన నామినేషన్ ఆమోదం పొందింది. భారతీయ నేపథ్యం.. కాశ్ పటేల్ తల్లిదండ్రులు గుజరాతీలు. యూఎస్లో స్థిరపడ్డారు. 1980లో న్యూయార్క్లో జన్మించిన పటేల్.. తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. లాంగ్ ఐలాండ్లోని గార్డెన్ సిటీ హైస్కూల్ నుంచి పట్టభద్రుడయ్యారు. రిచ్మండ్ విశ్వ విద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేశారు. యూకేలోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఫ్యాకల్టీ ఆఫ్ లాస్ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ అందుకున్నారు. అంతర్జాతీయ చట్టంలో సర్టిఫికెట్ కోసం న్యూ యార్క్కు తిరిగి వచ్చారు. ఆ తరువాత జాతీయ భద్రతా సలహాదారుగా, హౌస్ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్ (హెచ్పీఎస్సీఐ)కి సీనియర్ కౌన్సెల్గా పనిచేశారు. -
ట్రంప్ మరో సంచలనం.. గుజరాతీ కాష్ పటేల్కు కీలక బాధ్యతలు
వాషింగ్టన్: భారత సంతతి వ్యక్తి కాష్ పటేల్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక బాధ్యతలను అప్పగించారు. అమెరికా ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా కాష్ పటేల్ నియమితులయ్యారు. ఈ మేరకు పటేల్ నియామకానికి సంబంధించిన తీర్మానానికి సెనెట్ ఆమోదం తెలిపింది. 51-49 ఓట్ల తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది.డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఎఫ్బీఐ డైరెక్టర్గా కాష్ పటేల్ పేరును ప్రకటించారు. అయితే, ఇలాంటి పదవుల విషయంలో సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనిపై తీర్మానంపై సెనెట్లో ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్లో కాష్ పటేల్కు అనుకూలంగా 51, వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన నియామకం అధికారికంగా ధ్రువీకరించారు. అయితే, రిపబ్లికన్లకు మెజార్టీ ఉన్న సెనేట్లో కాష్ పటేల్ నియమాకంపై ఓటింగ్ చేపట్టారు. అయితే, అనూహ్యంగా ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు పార్టీ విప్ ధిక్కరించి ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. మైనే, అలస్కా సేనేటర్లు సుశాన్ కొలిన్స్, లీసా ముర్కోస్కీలు పటేల్ నియమాకాన్ని వ్యతిరేకించారు. ఇక, ప్రతిపక్ష డెమోక్రాట్లు కూడా పటేల్ నియమాకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం రెండు ఓట్ల తేడాతో ఆయన నియామకానికి లైన్ క్లియర్ అయ్యింది.ఎఫ్బీఐ డైరెక్టర్గా నియామకం అనంతరం కాష్ పటేల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా క్వాష్ పటేల్.. అమెరికా ప్రజలు గర్వించేలా ఎఫ్బీఐని తీర్చిదిద్దుతాను. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే అంతు చూస్తాం. అలాంటి వారు ఈ గ్రహంలో ఏ మూలన ఉన్నా వెంటాడుతామని హెచ్చరించారు. అలాగే, అమెరికానే ఫస్ట్.. మిషన్ ఫస్ట్గా పనిచేద్దాం. డైరెక్టర్గా నా లక్ష్యం స్పష్టంగా ఉంది అని చెప్పుకొచ్చారు.I am honored to be confirmed as the ninth Director of the Federal Bureau of Investigation.Thank you to President Trump and Attorney General Bondi for your unwavering confidence and support.The FBI has a storied legacy—from the “G-Men” to safeguarding our nation in the wake of…— FBI Director Kash Patel (@FBIDirectorKash) February 20, 2025ఇదిలా ఉండగా.. కాష్ పటేల్ ప్రవాస భారతీయుడు. ఆయన కుటుంబం గుజరాత్కు చెందినవారు. పూర్తి పేరు కశ్యప్ ప్రమోద్ వినోద్ పటేల్. పటేల్.. 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో జన్మించారు. లాంగ్ ఐలండ్లోని గార్డెన్ సిటీ హైస్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు. యూనివర్శిటీ కాలేజ్ లండన్ నుంచి ఇంటర్నేషనల్ లా అభ్యసించారు. ట్రంప్ తొలి హయాంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కౌంటర్ టెర్రరిజం విభాగానికి సీనియర్ డైరెక్టర్గా వ్యవహరించారు. రెండో టర్మ్లో ఎఫ్బీఐ డైరెక్టర్గా కొనసాగనున్నారు. Washington: US President Donald Trump has officially signed the commission to confirm Kash Patel as the Ninth Director of the Federal Bureau of Investigation.Source: Dan Scavino, Assistant to the President & White House Deputy Chief of Staff/ 'X' pic.twitter.com/cbWmFa0cpB— ANI (@ANI) February 21, 2025 -
Christopher Wray : ‘ట్రంప్ రాకముందే నేనే రాజీనామా చేస్తా’
వాషింగ్టన్ : అమెరికా శక్తిమంతమైన దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (ఎఫ్బీఐ)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతల్ని స్వీకరించనున్నారు. ఆ లోపే తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే ప్రకటించారు. క్రిస్టోఫర్ నిర్ణయంపై ‘గ్రేట్ డే ఫర్ అమెరికా’ అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా వ్యాఖ్యానించారు.‘కొంత కాలంగా సుదీర్ఘంగా సాగిన ఆలోచలన తర్వాత, ప్రస్తుత ప్రభుత్వ పాలన ముగిసే వరకు బాధ్యతలు నిర్వర్తిస్తా. ఆపై వైదొలగాలని నిర్ణయించుకున్నాను’ అని క్రిస్టోఫర్ వ్యాఖ్యానించారు. పదేళ్ల పదవీకాలంలో ఎఫ్బీఐ డెరెక్టర్గా క్రిస్టోఫర్కి మరో మూడేళ్లు ఉన్నాయి. అయినప్పటికీ ట్రంప్ రాకముందే పదవి నుంచి పక్కకి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.2017లో 38,000 మంది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్కు అధిపతిగా క్రిస్టోఫర్ని ట్రంప్ నియమించారు. ఆ తర్వాత అమెరికాలో జరిగిన వరుస పరిణామల నేపథ్యంలో ట్రంప్పై క్రిస్టోఫర్ చర్యలు తీసుకున్నారు. తాజా, ఎఫ్బీఐ డైరెక్టర్ నిర్ణయంపై ట్రంప్ స్పందించారు.క్రిస్టోఫర్ రాజీనామా అమెరికాకు గొప్ప రోజు. క్రిస్టోఫర్ వ్రే నాయకత్వంలో ఎఫ్బీఐ ఎలాంటి కారణాలు లేకుండా నా ఇంటిపై అక్రమంగా దాడి చేసింది. చట్టవిరుద్ధంగా అభిశంసన, నేరారోపణలు చేయడంలో శ్రద్ధగా పనిచేసింది. అమెరికా విజయం, భవిష్యత్తుకు అంతరాయం కలిగించడానికి చేయాల్సిన వన్సీ చేసింది’ అని ట్రంప్ ట్రూత్ సోషల్లోని పోస్ట్లో పేర్కొన్నారు. 🇺🇸Trump Nominates Cash Patel For FBI Director.😎 pic.twitter.com/f8d6I4l6gE— S p r i n t e r (@SprinterFamily) November 14, 2024తదుపరి ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (ఎఫ్బీఐ) డైరెక్టర్గా తన సన్నిహితుడు కాష్ పటేల్ను అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. ‘తదుపరి ఎఫ్బీఐ డైరెక్టర్గా కాష్ పటేల్ బాధ్యతలు చేపడతారని గర్వంగా ప్రకటిస్తున్నా. కాష్ ఎంతో తెలివైన న్యాయవాది, పరిశోధకుడు. అవినీతిపై పోరాటం, దేశ ప్రజల రక్షణ కోసం తన కెరీర్లో ఎక్కువ కాలం వెచ్చించిన పోరాటయోధుడు’ అని ప్రశంసించారు. 44 ఏండ్ల పటేల్ 2017లో ట్రంప్ హయాంలో యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్కు చీఫ్ ఆఫ్ స్టాఫ్గా వ్యవహరించారు. -
భారతీయ విద్యార్థి నాలుగేళ్లుగా మిస్సింగ్.. ఆచూకీ చెబితే 8 లక్షల రివార్డ్
న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ విద్యార్థి నాలుగేళ్ల క్రితం అదృశ్యమైంది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియరాలేదు. అయితే ఆ యువతి జాడ తెలిపిన వారికి 10 వేల డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు 8.32 లక్షలు) ఇవ్వనున్నట్లు యూఎస్ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) ప్రకటించింది. వివరాలు.. 29 ఏళ్ల మయూషీ భగత్.. 2019, ఏప్రిల్ 29వ తేదీన జెర్సీ సిటీలోని తన అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లి కనిపించకుండాపోయింది. తల్లిదండ్రులు ఫోన్ చేస్తేమో స్విచ్చాఫ్ వచ్చింది. ఆమె స్నేహితుల్ని సంప్రదించినా ఎలాంటి సమాచారం లభించలేదు.దీంతో కూతురు అదృశ్యంపై ఆమె కుటుంబ సభ్యులు మే 1వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మయూషీ ఇంటి నుంచి వెళ్లిన సమయంలో కలర్ పైజామా, బ్లాక్ టీ షర్ట్ ధరించింది’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువతి మిస్సింగ్పై న్యూజెర్సీలోని ఎఫ్బీఐ నెవార్క్ ఫీల్డ్ ఆఫీస్, జెర్సీ సిటీ పోలీసు శాఖ ఆమె కోసం గత నాలుగేళ్లుగా కోసం వెతుకుతూనే ఉంది. పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినా.. ఎలాంటి ఫలితం దక్కలేదు. అయితే మయూషీ ఆచూకీ ఇంకా తెలియరాకపోవడంతో తాజాగా ఎఫ్బీఐ ఓ ప్రకటన చేసింది. యువతి సమాచారం ఇచ్చిన వారికి పదివేల డాలర్ల రివార్డు ఇవ్వనున్నట్లు ఎఫ్బీఐ తెలిపింది. చదవండి: జన్మనిచ్చిన తల్లికై తపిస్తున్న ఓ కూతురి గాథ వింటే..కన్నీళ్లు ఆగవు..! ఎవరీ మయూషీ భగత్ మయూషీ భగత్.. భారతీయ విద్యార్థి. 1994లో వడోదరాలో జన్మించింది. 2016లో ఎఫ్ 1 స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లిన ఆమె అక్కడ న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చేస్తోంది. మయూషి భగత్ ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు ఉంటుందని. గోధుమ రంగు కళ్ళు, నల్లటి జుట్టు కలిగి ఉంటుందని అధికారులు వివరాలు వెల్లడించారు. ఆమె 2016లో ఎఫ్1 స్టూడెంట్ వీసాపై అమెరికాకు వచ్చింది. FBI గత ఏడాది జూలైలో తన వెబ్సైట్లోని ‘మోస్ట్ వాంటెడ్’ పేజీలో మయూషీ ‘తప్పిపోయిన వ్యక్తుల’ పోస్టర్ను ప్రదర్శించింది. -
ఖలిస్తాన్ వాదులూ జాగ్రత్త!
వాషింగ్టన్/న్యూఢిల్లీ: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్–కెనడాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో ఉన్న ఖలిస్తానీల ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) హెచ్చరికలు చేసింది. అమెరికన్ సిఖ్ కాకస్ కమిటీ కోఆర్డినేటర్గా ఉన్న ప్రీత్పాల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ..తనతోపాటు మరో ఇద్దరు అమెరికన్ సిక్కులను ఎఫ్బీఐ అధికారులు జూన్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారని చెప్పారు. ట్రూడోకు వ్యతిరేకంగా ఆందోళన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు వ్యతిరేకంగా ఆదివారం ఢిల్లీలోని జంతర్మంతర్లో యునైటెడ్ హిందూ ఫ్రంట్ నిరసన తెలిపింది. భారత వ్యతిరేక ఖలిస్తానీలకు కెనడా ప్రధాని మద్దతు, రక్షణ కలి్పంచడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వారిపై అంతగా ప్రేముంటే కెనడాలోనే ప్రత్యేక ఖలిస్తాన్ను ట్రూడో ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది. -
కష్టాన్నే నమ్ముకుంది! అదే ఆమెను ఎఫ్బీఐకి తిరుగులేని ఏజెంట్గా..
‘ఎఫ్బీఐలో పనిచేయడం అదృష్టం’ అంటాడు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్. ‘ఎఫ్బీఐ’లో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న ఇండో–అమెరికన్ సోహిని సిన్హా ఎప్పుడూ అదృష్టాన్ని నమ్ముకోలేదు. కష్టాన్నే ఇష్టంగా నమ్ముకుంది. ఎఫ్బీఐలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో స్థాయిలలో పనిచేసింది. తాజాగా సోహిని సిన్హాను ఎఫ్బీఐ సాల్ట్లేక్ సిటీ ఫీల్డ్ ఆఫీస్స్పెషల్ ఏజెంట్ ఇన్చార్జిగా నియమించింది... ఎఫ్బీఐలో సోహిని సిన్హాకు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. కౌంటర్–టెర్రరిజం ఇన్వెస్టిగేషన్లో మంచి పేరు తెచ్చుకుంది. భద్రతకు సంబంధించిన సంక్లిష్టమైన అంశాలను హ్యాండిల్ చేయడంలో, క్రిమినల్ సైబర్ ఇన్వెస్టిగేషన్లో దిట్టగా పేరున్న సోహిని సిన్హా తన వృత్తిపరమైన అంకితభావంతో ఎన్నో ప్రమోషన్లు పొందింది. 2001లో ఎఫ్బీఐలో స్పెషల్ ఏజెంట్గా చేరిన సిన్హా 2009లో సూపర్వైజరీ స్పెషల్ ఏజెంట్గా నియామకం అయింది. ఆ తరువాత వాషింగ్టన్ డీసీలోని కౌంటర్–టెర్రరిజం విభాగానికి బదిలీ అయింది. 2012లో అసిస్టెంట్ లీగల్ అటాషైగా ప్రమోట్ అయింది. కౌంటర్ టెర్రరిజమ్కు సంబంధించిన వ్యవహారాల్లో రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలిస్, కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్లతో కలిసి పనిచేసింది. ఆ తరువాత ఫీల్డ్ సూపర్వైజర్ (డెట్రాయిట్ ఫీల్డ్ ఆఫీస్)గా ప్రమోట్ అయింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ ఉగ్రవాదానికి సంబంధించిన సంక్లిష్టమైన కేసులను ఇన్వెస్టిగేట్ చేసింది.2020లో సైబర్ ఇన్ట్రూజన్ స్క్వాడ్లో చేరింది. తన నాయకత్వ సమర్థతతో 2021లో నేషనల్ సెక్యూరిటీ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్కు సంబంధించి అసిస్టెంట్ స్పెషల్ ఏజెంట్ ఇన్చార్జి (పోర్ట్లాండ్ ఫీల్డ్ ఆఫీస్) గా ప్రమోట్ అయింది. ఏజెన్సీ ఆపరేషన్స్లో తనదైన ముద్ర వేసింది. ఆ తరువాత ఎఫ్బీఐ డైరెక్టర్కు ఎగ్జిక్యూటివ్ స్పెషల్ అసిస్టెంట్గా నియామకం అయింది. ఇంటర్నేషనల్ ఎసైన్మెంట్స్లో కూడా తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఇంగ్లాండ్ నుంచి ఇరాక్ వరకు ఎన్నో దేశాల్లో, ఎన్నో సంస్కృతుల మధ్య పనిచేసింది.ఎఫ్బీఐలో చేరడానికి ముందు సోహిని సిన్హా థెరపిస్ట్గా, ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన క్లినిక్లో అడ్మినిస్ట్రేటర్గా పనిచేసింది. ఇక చదువు విషయానికి వస్తే సైకాలజీలో డిగ్రీ, మెంటల్ హెల్త్లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆ చదువు తన వృత్తి జీవితంలో ఎంతో ఉపయోగపడింది. ఇతరులకు సహాయపడాలనే సోహిని సిన్హా తపనకు ఎఫ్బీఐ బలమైన వేదికలా ఉపయోగపడుతోంది. -
దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!
రెండు విజయవంతమైన యునికార్న్ స్టార్టప్లను సృష్టించిన ఏకైక టెక్ వ్యవస్థాపకుడు, సందీప్ అగర్వాల్. వ్యాపారవేత్తగా పాపులర్ అవుతున్న తరుణంలో ఎఫ్బీఐ అరెస్టు బాగా దెబ్బతీసింది. రూ. 8వేల కోట్ల సంస్థ పోయింది. చేయని నేరానికి జైలు శిక్ష, మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు అయినా ఫీనిక్స్ పక్షిలా తిరిగి ట్రాక్లోకి వచ్చారు. రోలర్ కోస్టర్ లాంటి జీవితాన్నిఎదురీది ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తగా, ప్రస్తుతం రూ. 16400 కోట్ల కంపెనీ యజమానిగా తానేంటో నిరూపించుకున్న సందీప్ అగర్వాల్ సక్సెస్ స్టోరీ.. జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో అతని జీవితంలో అనుకోని కుదుపు తీవ్ర సంక్షోభాన్ని సృష్టించింది. కుటుంబంతో కలిసి అమెరికాలో వెకేషన్లో ఉండగా, ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సందీప్ అగర్వాల్ను అరెస్ట్ చేసింది. అరెస్టు తర్వాత 8 వేల కోట్ల రూపాయల కంపెనీని కోల్పోవాల్సి వచ్చింది. ఇదే తరుణంలో 17 ఏళ్ల వైవాహ జీవితానికి స్వస్తి పలుకుతూ 2018లో భార్య విడాకులు తీసుకుంది. అయినా ఎక్కడా ఆశను కోల్పోలేదు. కుటుంబానికి దూరంగా యూఎస్లో ఉండి, కేసుపై పోరాడవలసి వచ్చింది. కంపుకొట్టే టాయిలెట్ మధ్య జైలు జీవితాన్ని గడిపాడు. మరోవైపు రిమోట్గా కార్యకలాపాలను నిర్వహించినప్పటికీ వాటాదారుల అభ్యంతరాలతో కంపెనీ సీఈవో పదవి నుంచి వైదొలిగి, తాను నిర్మించిన సంస్థ పగ్గాలను తన స్నేహితుడికి అప్పగించారు. 2019లో, షాప్క్లూస్ను మరో కంపెనీ సుమారు 100 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. విచారణ, తీర్పు ఆలస్యం కారణంగా 2014లో ఇండియాకు రావడానికి అనుమతి లభించింది. చివరికి 2020లో యూఎస్ కోర్టు ద్వారా ఆర్థిక నేరాల కేసులో నిర్దోషిగా తేల్చింది. డ్రూమ్ టెక్నాలజీస్ ఏప్రిల్ 2014లో డ్రూమ్ టెక్నాలజీస్ అనే మరొక యునికార్న్ ఏర్పాటుచేశారు.అనేక ఇబ్బందుల మధ్య అత్యంత విశ్వసనీయమైన ఆటోమొబైల్ ప్లాట్ఫారమ్గా దీన్ని తీర్చిదిద్దారు. కేవలం ఒక్క ఏడాదిలోనే 16 మిలియన్ డాలర్లు ,తరువాతి మూడు సంవత్సరాలలో, పలు దఫాలుగా 90 మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చారు. ఏప్రిల్ 2021న భారతదేశంలో 55వ యునికార్న్గా అవతరించింది. కంపెనీ వాల్యుయేషన్ 2 బిలియన్ డాలర్లు లేదా రూ.16400 కోట్లు. డ్రూమ్ తన జీవితంలో లేకుంటే తాను ఈ సంక్లిష్ట పరిస్థతులనుంచి తాను బయటపడేవాడిని కాదని ఒక సందర్భలో సందీప్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. కుటుంబానికి దూరంగా, జైలు శిక్షను ఎదుర్కొంటున్న తరుణంలో కంపెనీ తనకు ఊరటనిచ్చిందని చెప్పారు. తరువాత ఉపాసనను రెండో పెళ్లి చేసుకున్నారు. షాప్క్లూస్ ముందు సందీప్ అగర్వాల్ ఎంబీఏ పట్టా పొందిన తరువాత అమెరిలో రెండు వేర్వేరు కంపెనీలలో పనిచేశారు. ఆ తరువాత వాల్ స్ట్రీట్లో 14 ఏళ్లు ఎనలిస్టుగా పనిచేశారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ! మొదలైన కంపెనీలను కవర్ చేస్తూ ఎనిమిదేళ్లపాటు విశ్లేషకుడిగా పనిచేశాడు.టాప్ ర్యాంక్ రీసెర్చ్ అనలిస్ట్గా పేరు సంపాదించారు.TiE సిలికాన్ వ్యాలీలో చార్టర్ సభ్యుడు కూడా. ఇంటర్నెట్ విశ్లేషకుడిగా 2010లో ఇండియాను సందర్శించిన సమయంలోఆన్లైన్ మార్కెట్ ప్రారంభించాలనే ఆలోచనకు పునాది పడింది. షాప్క్లూస్ ప్రారంభం డెలావేర్లో రాధికా ఘై అగర్వాల్ (సందీప్ అగర్వాల్ మాజీ భార్య),మృణాల్ ఛటర్జీ , సంజయ్ సేథితో కలిసి ఇ-మార్కెట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. సెప్టెంబరు 2011లో ఈ టీం దేశానికి వచ్చి శాశ్వతంగా గుర్గావ్లో స్థిరపడింది. షాప్క్లూస్ ప్రారంభంలో తన సోషల్ సర్కిల్స్ ద్వారా 1.95 మిలియన్ డాలర్లను సేకరించడం విశేషం. షాప్క్లూస్ పబ్లిక్ బీటా వెర్షన్ 26 జనవరి 2012న విడుదలచేయగా, ముగ్గురు లేదా నలుగురుగా ఉన్న టీంసంఖ్య 25 మంది సభ్యులకు పెరిగింది. నెలవారీ 20 లక్షలకు పైగా యూజర్లతో భారీ లాభాల్ని సాధించింది. ఈ దెబ్బకు అలెక్సా ర్యాంకింగ్ అదే సంవత్సరం ఆగస్టులో 14వేల నుండి 200కి పడిపోయింది. జనవరి 2013 నాటికి, షాప్క్లూస్ దేశంలో ఐదో అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్గా మారింది. అలెక్సా ర్యాంకింగ్ ఏకంగా 90కి పడిపోయింది. 2013 జూలైలో అమెరికాలో ఎప్బీఐ ఈరెస్టు చేసింది. వాల్ స్ట్రీట్లో సీనియర్ ఇంటర్నెట్ రీసెర్చ్ అనలిస్ట్గా పని చేస్తున్నప్పుడు అతనిపై 'ఇన్సైడర్ ట్రేడింగ్' ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో చట్టపరమైన ఆరోపణలను నమోదు చేసేదాకా అదే జోరు కొనసాగింది. అప్పటికీ కంపెనీ నెలవారీగా 200-300శాతం వృద్ధిని సాధిస్తోంది. కరియర్లో సందీప్ అగర్వాల్ తొలి అడుగులు 1995లోముంబైలోని కోటక్ మహీంద్రాలో ఇంటర్న్గా కరియర్ను మొదలు పెట్టారు సందీప్ అగర్వాల్. ఈ ఇంటర్న్షిప్ తన వ్యాపార కమ్యూనికేషన్తో పాటు తన విశ్లేషణాత్మక నైపుణ్యాలు,వ్యూహాత్మక ఆలోచనలఅభివృద్ధికి తోడ్పడిందని స్వయంగా సందీప్ అగర్వాల్ చెప్పారు. సందీప్ అగర్వాల్ చదువు కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్, దేవి అహల్య విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్లో మాస్టర్స్ పట్టా పొందారు. వాషింగ్టన్ యూనివర్శిటీ సెయింట్ లూయిస్ ఓలిన్ బిజినెస్ స్కూల్ నుచి ఎంబీఏ చేసారు. గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం సందీప్కు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం , గురుగ్రామ్లోని తన పెంట్హౌస్లో దాదాపు 1000 మొక్కలు ఉన్నాయి. తన కుమారులతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం ఇష్టం. గోల్ఫ్ , స్క్వాష్ ఆడుతారు. తోటపని, ప్రయాణాలు, చదవడం, రాయడం లాంటి ఇష్టాలు తనకు మంచి ఊరట అంటారు సందీప్. ‘ఫాల్ ఎగైన్, రైజ్ ఎగైన్’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. -
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మెడకు రహస్య పత్రాల గొడవ
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మెడకు రహస్య పత్రాల గొడవ -
బైడెన్ ఇంట్లో ఎఫ్బీఐ సోదాలు.. అధ్యక్షుడి మెడకు రహస్య ఫైళ్ల వ్యవహారం
వాషింగ్టన్: రహస్య ఫైళ్ల వ్యవహారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు చుట్టుకుంటోంది. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఫైళ్లు బయటపడడం ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆయన నివాసంలో తాజాగా చేపట్టిన సోదాల్లో మరో ఆరు ఫైళ్లు లభ్యం కావడం కలకలం రేపుతోంది. విల్మింగ్టన్లోని బైడెన్ ప్రైవేట్ నివాసంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) అధికారులు శుక్రవారం ఉదయం నుంచి రాత్రి దాకా ఏకంగా 13 గంటలపాలు సోదాలు చేపట్టారు. మొత్తం ఆరు ఫైళ్లు లభ్యమయ్యాయి. ఎఫ్బీఐ అధికారులు వీటిని ఉన్నతాధికారులకు నివేదించారు. సోదాల సమయంలో ఇరుపక్షాలకు చెందిన న్యాయ బృందాలతోపాటు శ్వేతసౌధం అధికారి ఒకరు ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సోదాలు జరుపుతున్న సమయంలో బైడెన్ గానీ, ఆయన భార్య గానీ ఇంట్లో లేరని తెలిసింది. సోదాల్లో ఫైళ్లతో పాటు చేతి రాతతో ఉన్న కొన్ని పత్రాలు కూడా లభించినట్లు సమాచారం. ఆరు ఫైళ్లు లభ్యం కాగా, ఇందులో కొన్ని బైడెన్ సెనేటర్గా ఉన్నప్పటివి, మరికొన్ని ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలానికి సంబంధించినవని ఆయన వ్యక్తిగత అటార్నీ బాబ్ బోయర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. నాకు ఎలాంటి విచారం లేదు: బైడెన్ గత ఏడాది నవంబర్ 2న వాషింగ్టన్ డీసీలో బైడెన్కు చెందిన పెన్ బైడెన్ సెంటర్లో, డిసెంబర్ 20న వాషింగ్టన్ ఇంట్లోని గ్యారేజీలో, ఈ ఏడాది జనవరి 12న అదే ఇంట్లో మరోసారి రహస్య దస్త్రాలు బయటపడడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత ఆయన వాటిని నేషనల్ ఆర్కైవ్స్ అందజేశారు. నిజానికి పదవీ కాలం ముగిసిన తర్వాత అధికారిక రహస్య పత్రాలను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. ఇలాంటి చర్యలను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. అధ్యక్షుడిని అభిశంసించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ చట్టం ప్రకారం.. పదవీ కాలం ముగిసిన తర్వాత అధికారిక పత్రాలను నేషనల్ ఆర్కైవ్స్కు పంపించాలి. ఇదిలా ఉండగా, తన నివాసాల్లో జరుగుతున్న సోదాలపై బైడెన్ స్పందించారు. ఫైళ్లు దొరకడంపై తనకు ఎలాంటి విచారం లేదన్నారు. అయితే, బైడెన్ తీరుపై రిపబ్లికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహస్య పత్రాల విషయంలో బైడెన్ ఇక తప్పించుకోలేరని చెబుతున్నారు. ఆయన కుటుంబంతోపాటు కుమారుడు హంటర్ బైడెన్ అక్రమ వ్యాపారాలపై సమగ్ర దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నారు. బైడెన్ నివాసాల్లో రహస్య పత్రాలు బయటపడడంపై కాంగ్రెస్ విచారణ చేపడుతుందని స్పీకర్ కెవిన్ మెక్కార్తీ ఆశాభావం వెలిబుచ్చారు. బైడెన్కు సన్ స్ట్రోక్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో జో బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రి అధికారమే అండగా ఆయన కుమారుడు హంటర్ బైడెన్ చెలరేగిపోయాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికాకు ప్రత్యర్థి దేశాలుగా భావించే చైనా, రష్యాలో హంటర్ బైడెన్కు వ్యాపారాలున్నాయి. ఆయా దేశాల్లో పలు కంపెనీల్లో ఆయన పెట్టుబడులు పెట్టి, భారీగా ఆర్జించినట్లు సమాచారం. అంతేకాకుండా రష్యా నుంచి హంటర్ లక్షలాది డాలర్లు ముడుపులుగా స్వీకరించాడని సాక్షాత్తూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు హంటర్ బైడెన్కు చెందినవిగా భావిస్తున్న ల్యాప్టాప్ల్లో ఆయన మత్తు మందులు వాడుతున్న ఫొటోలు, ఇతర వీడియోలు, మెయిళ్లు బయటపడడం సంచలనం సృష్టించింది. 2019 డిసెంబర్లో ఎఫ్బీఐ ఆ ల్యాప్ట్యాప్లను స్వాధీనం చేసుకుంది. అందులోని వివరాలను న్యూయార్క్ పోస్టు పత్రిక ప్రచురించింది. -
సైబర్ క్రైమ్ వలలో ఐసీసీ.. 20 కోట్ల నష్టం
క్రికెట్లో పెద్దన్న పాత్ర పోషించే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సైబర్ క్రైమ్ చిక్కుకున్నట్లు సమాచారం. గత ఏడాది ఆన్లైన్ మోసం కారణంగా ఐసీసీ 2.5 అమెరికన్ మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 20 కోట్లు) నష్టపోయినట్లు ఒక వెబ్సైట్ కథనం ప్రచురించింది. అమెరికా స్థావరంగా ఫిషింగ్ మెయిల్ స్కామ్ జరిగినట్టు సమాచారం. ఈ విషయంపై ఐసీసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సమాచారం ప్రకారం ఐసీసీ ఫిర్యాదు మేరకు ఎఫ్బీఐ(FBI) పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐసీసీ అకౌంట్ నుంచి నేరగాళ్లకు డబ్బు ఎలా చేరిందనేది కచ్చితంగా తెలియరాలేదు. బిజనెస్ మెయిల్ తరహాలో సందేశాన్ని పంపి.. సైబర్ ఫ్రాడ్కు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఐసీసీకి చెందిన కన్సల్టెంట్ అంటూ సంస్థకు కుచ్చుటోపీ వేసినట్లు తెలుస్తోంది. సదరు కన్సల్టెంట్ ఈమెయిల్ ఐడీని పోలిన ఐడీతో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్కు మెయిల్ చేశారట. ఆ మెయిల్లో 5 లక్షల డాలర్ల విలువైన వోచర్ను క్లియర్ చేయాలని కోరారు. ఏ ఖాతాకు ఆ సొమ్మును పంపాలో ఆ అకౌంట్ వివరాలు కూడా పంపించారు. దీంతో ఐసీసీ ఫైనాన్స్ విభాగం ఆ వోచర్ను క్లియర్ చేసింది. ఆ తర్వాత మరో రెండు, మూడు సార్లు ఇలాంటి టెక్నిక్తోనే సైబర్ నేరగాళ్లు డబ్బును కాజేసినట్లు తెలుస్తోంది. ఈ తరహా మోసాలను బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ (బీఈసీ) ఫిషింగ్ అంటారు. చదవండి: 'మంచి భవిష్యత్తు'.. చహల్ను టీజ్ చేసిన రోహిత్ శర్మ Usain Bolt: బోల్ట్కు చేదు అనుభవం.. అకౌంట్ నుంచి 97 కోట్లు మాయం -
సినిమాటోగ్రాఫర్ను కాల్చి చంపింది ఆ అగ్రహీరోనే!
న్యూయార్క్: ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) సంచలన నివేదికతో హాలీవుడ్ అగ్రహీరోకు షాక్ ఇచ్చింది. సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్ మృతిలో ప్రముఖ నటుడు అలెక్ బాల్డ్విన్ ప్రమేయం ఉందన్న విషయాన్ని ఎఫ్బీఐ దాదాపుగా నిర్ధారించేసింది. ప్రాప్ గన్ వర్కింగ్ కండిషన్లోనే ఉందని, నటుడి ప్రమేయం లేకుండా అది పేలే ఛాన్సే లేదని తేల్చి చెప్పింది. ప్రముఖ నటుడు(అమెరికన్) అలెక్ బాల్డ్విన్(64) చేతిలోని డమ్మీ తుపాకీ (ప్రాప్ గన్) పేలి సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్ మరణించగా, డైరెక్టర్ జోయల్ సౌజా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కిందటి ఏడాది అక్టోబర్లో ‘రస్ట్’ షూటింగ్ సందర్భంగా చోటు చేసుకుంది. తొలుత ఈ ఘటనపై బాల్డ్విన్ పై ఎలాంటి కేసూ నమోదు కాకపోవడంతో సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో పోలీసులు, ఆపై ఎఫ్బీఐ కూడా రంగంలోకి దిగింది. ఈలోపు తుపాకీట్రిగ్గర్ను తాను నొక్కనేలేదని, ప్రమాదం ఎలా జరిగిందో తనకు తెలియదని, ఘటనకు వేరేవరైనా కారణం అయ్యి ఉండొచ్చని చెబుతూ వస్తున్నాడు అలెక్. ఈ తరుణంలో ఎఫ్బీఐ తాను రూపొందించిన నివేదికను బయటపెట్టింది. ఫోరెన్సిక్ నివేదికలో.. అలెక్ బాల్డ్విన్ ప్రమేయం లేకుండా ఆ తుపాకీ ట్రిగ్గర్ నొక్కుకుపోయే ఛాన్సే లేదని తేల్చి చెప్పింది. దీంతో ఈ ఘటనకు వేరెవరో బాధ్యులన్న బాల్డ్విన్ ఆరోపణలు నిజం కాదని తేలింది. ఇక బాల్డ్విన్ లాయర్, ఎఫ్బీఐ నివేదికను తప్పుబడుతున్నాడు. తుపాకీ కండిషన్ ఏమాత్రం బాగోలేదని అంటున్నాడు. ఎఫ్బీఐ మాత్రం ఆయుధాన్ని పూర్తిగా పరిశీలించిన అనంతరం నివేదిక రూపొందించినట్లు చెబుతోంది. ఇక శాంటా ఫే కౌంటీ పోలీసులు ఈ కేసులో తమ దర్యాప్తు కొనసాగుతుందని, ఇదొక ప్రమాద ఘటనగా మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని ప్రకటించారు. న్యూమెక్సికోలో ఉన్న బొనాంజా క్రీక్ రాంచ్లో కిందటి ఏడాది రస్ట్ సినిమా షూటింగ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్(42) అక్కడికక్కడే కన్నుమూసింది. హచిన్స్ స్వదేశం ఉక్రెయిన్. కానీ, ఆర్కిటిక్ సర్కిల్ లో సోవియట్ మిలటరీ బేస్ పెరిగింది. కైవ్లో జర్నలిజం చేసిన ఆమె.. ఆపై లాస్ ఏంజెల్స్లో సినిమాటోగ్రఫీపై శిక్షణ తీసుకుంది. ఆమె పని చేసిన ‘ఆర్కెనిమీ’ 2020లో రిలీజ్ అయ్యింది కూడా. ఇదీ చదవండి: సామాన్యుడిలా ఆ యువరాజు! ఏం చేశాడంటే.. -
ప్రపంచంలో ఎక్కడా చేయనట్లు మేమేదో కొత్తగా చేస్తున్నట్లు చేస్తారేం!!
ప్రపంచంలో ఎక్కడా చేయనట్లు మేమేదో కొత్తగా చేస్తున్నట్లు చేస్తారేం!! -
ఒకే ఒక్కడు.. ఫ్లైట్ హైజాకింగ్.. అమెరికాకు ముచ్చెమటలు పట్టించాడు!
కొన్నిసార్లు నేరస్థుడే కథానాయకుడు. దోపిడీలు, హత్యలు చేసినా సరే.. అతడే గెలవాలని, పోలీసులకు దొరక్కూడదని కోరుకునే ప్రేక్షక హృదయాలు కోకొల్లలు. దృశ్యం, కిక్ , ధూమ్ 2, సూపర్.. వంటి సినిమాలు ఆ కోవకు చెందినవే. విశేషవిజయాలు అందుకున్నవే. ఈ తరహా సినిమాలెన్నింటికో స్ఫూర్తిగా నిలిచిన క్రిమినల్ ‘డేనియల్ కూపర్’ కథే ఈ వారం మిస్టరీ. ఎందరో నేరగాళ్లకు ముచ్చెమటలు పట్టించిన అమెరికన్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ సర్వీస్..‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ)’ని సైతం గడగడలాడించిన అతగాడు.. అసలు ఏం నేరం చేశాడు? ఎలా తప్పించుకున్నాడు? సినిమాని తలపించే ఆ కథే ఈ నార్త్వెస్ట్ హైజాకింగ్. అది 1971, నవంబర్ 24. అమెరికాలోని ఒరెగాన్లో పోర్ట్లాండ్ ఎయిర్ పోర్ట్లోకి ఎంటర్ అయ్యాడు అతను. ఆరడుగుల ఆజానుబాహుడు. వయసు నలభై పైనే. వైట్ షర్ట్, బ్లాక్ టై, ఓవర్ కోట్, గోధుమ రంగు షూస్, చేతిలో ఓ సూట్ కేస్.. చూడటానికి అచ్చం ఓ బిజినెస్మేగ్నెట్లానే ఉన్నాడు. ఇరవై డాలర్లు పెట్టి.. వాషింగ్టన్లోని సియాటెల్ వెళ్లేందుకు నార్త్ వెస్ట్ ఎయిర్లైన్స్కి చెందిన విమానంలో ఓ టికెట్ కొనుక్కున్నాడు. పేరు డేనియల్ కూపర్ అని నమోదు చేయించుకున్నాడు. అప్పటిదాకా ఆ విమానంలో 305 మంది ప్రయాణికుల్లో అతడూ ఒకడు. తనకు కేటాయించిన సీట్లో తాపీగా కూర్చుని.. విమానం ఇంకా బయలుదేరకముందే.. ఫ్లైట్ అటెండెంట్ని పిలిచి... తనకు ఓ బోర్బన్ బిస్కట్, సోడా కావాలన్నాడు. కొన్ని నిమిషాల్లోనే విమానం స్టార్ట్ అయ్యింది. ఫ్లైట్ అటెండెంట్ అతడు కోరినట్లే.. రెండూ తెచ్చి ఇచ్చింది. వాటిని అందుకున్న కూపర్ ఆమె చేతిలో ఒక స్లిప్ పెట్టాడు. అప్పటికే ఫ్లైట్ గాల్లో ఉంది. ఆ స్లిప్ ఓపెన్ చేసి చదివిన ఆమెకు కాళ్ల కింద విమానం షేక్ అయినట్లు షాక్ అయ్యింది. పక్కనే కూర్చోమన్నట్లు ఆమెకు సైగ చేశాడు కూపర్. తప్పనిస్థితిలో గమ్మున కూర్చుంది. ఆ స్లిప్లో ఉన్న మ్యాటర్ను నమ్మేందుకు.. ఆమె ముందే సూట్కేస్ ఓపెన్ చేసి చూపించాడు కూపర్. అందులో రెండు ఎరుపు రంగు కడ్డీలు.. రకరకాల వైర్లుతో చుట్టి ఉన్నాయి. అవి బాంబులే అని నిర్ధారించుకున్న ఆమె.. మరింత వణికిపోయింది. ‘స్లిప్ తీసుకుని, నేను చెప్పింది రాసుకో’ అని ఆదేశించాడు. ఆమె చేతిలో పెన్ వణుకుతూ కదులుతోంది. ‘నాకు అయిదు గంటల్లోపు రెండు లక్షల డాలర్లు (ప్రస్తుతం దీని విలువ 1.2 మిలియన్లు) కావాలి. ఆ మొత్తం 20 డాలర్ల నోట్ల రూపంలోనే ఉండాలి. అలాగే నాకు రెండు బ్యాక్ పారాష్యూట్లు, రెండు ఫ్రంట్ పారాష్యూట్లు కావాలి. విమానం ల్యాండ్ అవ్వగానే... వెంటనే ఇంధనం నింపేందుకు ఎయిర్పోర్టులో ఫ్యూయెల్ ట్యాంకర్ రెడీగా ఉండాలి. తేడా వస్తే... బాంబు పేలుతుంది’ అని కూపర్ చెప్పినట్లే అక్షరం పొల్లుపోకుండా రాసింది ఆ అటెండెంట్. ఆమె ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు.. ప్రయాణికుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని.. కూపర్ అడిగినట్లే సియాటెల్ ఏరియా బ్యాంకుల నుంచి డబ్బును, స్థానిక స్కైడైవింగ్ స్కూల్ నుంచి పారాష్యూట్లను రప్పించారు. విమానం సియాటెల్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యింది. అడిగినవన్నీ చేతికి అందిన తర్వాత.. కొందరు ప్రయాణికుల్ని, కొంతమంది సిబ్బందినీ విమానం దిగేందుకు ఒప్పుకున్నాడు కూపర్. ఆ ఒప్పందం ప్రకారం 36 మందిని క్షేమంగా విమానం నుంచి దింపేశారు. అనంతరం విమానంలో ఇంధనం నింపాలని ఆదేశించాడు. కూపర్ చెప్పినట్లే చేశారు అధికారులు. మిగిలినవారంతా విమానంలో ఉండగానే.. మళ్లీ విమానం పైకి లేచింది. మెక్సికో సిటీ మీదుగా పదివేల అడుగుల ఎత్తులో విమానాన్ని నడపమన్నాడు. కూపర్కి ఎదురుచెప్పలేదు పైలెట్స్. రాత్రి ఎనిమిది దాటింది. ఫ్లైట్ గాల్లో ఎగురుతూనే ఉంది. కూపర్ అధీనంలోనే ఉంది. సియాటెల్, రెనో మధ్యలో ఓ చోట.. విమాన వెనుక డోర్ ఓపెన్ చేయించి, పారాష్యూట్ సాయంతో కిందకు దూకేశాడు. తనతో పాటూ డబ్బు, మిగిలిన పారాష్యూట్లనూ తీసుకెళ్లాడు. ఇక అంతే.. 50 ఏళ్లుగా అతడు ఏమయ్యాడు అనేది ఎవరికీ తెలియలేదు. చివరికి అతడి పేరు కూడా అబద్ధం అని తేలింది. కూపర్ విమానంలో ఉన్నంత సేపు డార్క్ సన్ గ్లాసెస్ పెట్టుకునే ఉన్నాడనేది ప్రత్యక్ష సాక్షుల సమాచారం. ఎఫ్బీఐ చరిత్రలోనే సుదీర్ఘమైన ఇన్వెస్టిగేషన్ ఈ నార్త్వెస్ట్ హైజాకింగ్. మొదట్లో కూపర్ను మిలిటరీలో అనుభవజ్ఞుడైన పారాట్రూపర్గా భావించారు. నిజానికి అనుభవజ్ఞుడైన స్కైడైవర్ కాదని తేల్చారు. ఘటన జరిగిన ఐదేళ్లలో దాదాపు 800 మంది అనుమానితులను పరిశీలించి, వారిలో కూపర్ లేడని నిర్ధారించేశారు. నిందితుడిగా రిచర్డ్ ఫ్లాయిడ్ మెకాయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పటికీ అతడూ కూపర్కు సరిపోలలేదు. చివరికి కూపర్ చనిపోయి ఉంటాడనే అనుకున్నారు. ఎందుకంటే కూపర్ దూకాడు అని ఊహిస్తున్న ప్రాంతంలో గంటకు 200 మైళ్లు(322 కిమీ)వేగంతో గాలులు వీస్తాయని, ఆ ప్రతికూల పరిస్థితుల్లో పారాష్యూట్తో దిగడం కష్టమని అంచనా వేశారు. 1980లో అంటే దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత కొలంబియా నది సమీపంలో పోర్ట్ల్యాండ్కు ఉత్తరాన ఏరియల్ నుంచి 20 మైళ్ల (32 కిమీ) దూరంలో ఓ బాలుడికి.. 5,800 డాలర్లున్న శిథిలావస్థలోని ప్యాకెట్ ఒకటి దొరికింది. దాంట్లో అన్నీ 20 డాలర్ల నోట్లే ఉన్నాయి. కూపర్ డిమాండ్ చేసి తీసుకున్న 20 డాలర్ల నోట్ల మీదున్న సీరియల్ నంబర్లకు శిథిలావస్థలోని ప్యాకెట్లో దొరికిన 20 డాలర్ల నోట్ల మీది సీరియల్ నంబర్లు సరిపోలాయి. విస్తృతశోధన తర్వాత తేలిన విషయం అదొక్కటే. దాంతో 2016లో అధికారికంగా ఈ కేసుని క్లోజ్ చేసింది ఏజెన్సీ. అపరిష్కృతమైన ఈ క్రైమ్ స్టోరీ చాలా మందిని ఆకర్షించింది. చివరికి ఈ కేసులో కీలక సూత్రధారి అయిన డేనియల్ కూపర్.. పేరు మీద పాటలు, పుస్తకాలు, సినిమాలు వగైరా వగైరా చాలానే వచ్చాయి. చివరికి కూపర్ ‘జానపద కథానాయకుడు’గా మారిపోయాడు. అయితే డాన్ కూపర్గా గుర్తింపు పొందిన డేనియల్ కూపర్.. ఇన్వెస్టిగేషన్ సమయంలో ఓ రిపోర్టర్ పొరబాటుగా విన్న పేరునే శాశ్వతం చేసుకున్నాడు డి.బి.కూపర్గా. చదవండి: Virender Sehwag: కోహ్లి కెప్టెన్సీ వివాదం: సెహ్వాగ్ భయ్యా ఎక్కడున్నావు!? -
క్రిప్టోకరెన్సీ.. ఇలాంటి నేరాలే జరుగుతాయ్ జాగ్రత్త!
ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ చెలామణిపై ఆర్బీఐ ఆందోళన నేపథ్యంలో.. కేంద్రం సానుకూల కోణంలోనే స్పందించే అవకాశాలు ఉన్నాయంటూ కథనాలు వెలువడుతున్నాయి. అయితే క్రిప్టోకరెన్సీ ద్వారా ఆర్థిక నేరాలతో పాటు అమాయకులూ బలి అవుతారంటూ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్ కరెన్సీ విషయంలో కొత్త తరహా నేరాలు తప్పవని సైబర్ నిపుణులు సైతం వారిస్తున్నారు. అందుకు ఉదాహరణగా తాజాగా రికార్డైన క్రిప్టోకరెన్సీ భారీ చోరీ కేసును ప్రస్తావిస్తున్నారు. తాజాగా ఓ టీనేజర్ ఏకంగా 46 మిలియన్ కెనడా డాలర్లు( 36.5 మిలియన్ అమెరికా డాలర్లు.. మన కరెన్సీలో దాదాపు 270కోట్ల రూపాయలపైనే) క్రిప్టోకరెన్సీని కాజేశాడు. కెనడా హామిల్టన్కు చెందిన 17 ఏళ్ల ఆ పిలగాడు.. అంత డబ్బుతో ఏం చేశాడో తెలుసా? ఆన్లైన్ గేమింగ్లో అరుదైన ఓ యూజర్నేమ్ను కొనుగోలు చేశాడు. స్విమ్ స్కాపింగ్(సెల్యూలార్ నెట్వర్క్ ఉద్యోగుల్ని డూప్లికేట్ నెంబర్ల ద్వారా బురిడీకొట్టించి.. బాధితుల అకౌంట్లను హ్యాక్ చేయడం) ద్వారా ఆ టీనేజర్ ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో టీనేజర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రపంచంలో ఇప్పటిదాకా ఒక వ్యక్తి ఇంత భారీస్థాయిలో క్రిప్టోకరెన్సీ చోరీకి పాల్పడడం ఇదే తొలిసారి అని ప్రకటించారు. నిజానికి ఈ చోరీ జరిగింది కిందటి ఏడాదిలో. బాధితుడు కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జోష్ జోన్స్!. ఈ నేపథ్యంలోనే ఎఫ్బీఐ రంగంలోకి దిగింది. క్లిక్ చేయండి: క్రిప్టోకరెన్సీ.. నీటి బుడగల్లాంటివి హామిల్టన్ సిటీ పోలీసుల సహకారంతో దర్యాప్తు కొనసాగించింది ఎఫ్బీఐ. అయితే అరుదైన ఆ యూజర్ నేమ్ దొంగను పట్టించింది. అంతేకాదు మొత్తం సొమ్ములో కేవలం ఏడు మిలియన్ల సొమ్ము మాత్రమే రికవరీ అయ్యిందని తెలుస్తోంది. కంటికి కనిపించని ఈ కరెన్సీని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని, లేనిపక్షంలో ఇలాంటి నేరాలకు గురై భారీగా మోసపోవాల్సి వస్తుందని క్రిప్టో ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. చదవండి: క్రిప్టో కరెన్సీ చేతికి రాలేదని.. ఖమ్మంవాసి బలవన్మరణం -
హ్యాకర్స్ రూట్ మార్చారు, స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు
హ్యాకర్స్ తమ పంథాని మార్చుకుంటున్నారు. ఇప్పటి వరకు మాల్ వేర్ సాయంతో సంస్థలపై దాడులు చేసే సైబర్ నేరస్తులు ఇప్పుడు స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. ఆయా స్కూళ్ల డేటా బేస్లో ఉన్న స్కూల్ చిల్డ్రన్స్ డేటాను దొంగిలిస్తున్నారు. ఆ డేటాతో సొమ్ము చేసుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అడిగినంత ఇవ్వకపోతే అక్రమ వ్యాపార కార్యకలాపాలకు వేదికగా నిలిచే ‘డార్క్ వెబ్’లో అమ్ముకుంటున్నట్లు నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ(ఎన్బీసీ) ఓ రిపోర్ట్ను విడుదల చేసింది. ఈఏడాది 1200స్కూళ్లని టార్గెట్ చేసి.. నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ(ఎన్బీసీ) రిపోర్ట్ ప్రకారం..అమెరికాకు చెందిన ఓ జిల్లా స్కూల్కు చెందిన విద్యార్ధుల వ్యక్తిగత వివరాల్ని మాల్ వేర్ సాయంతో దొంగిలించారు. విద్యార్ధుల పేర్లు, డేటా బర్త్,సోషల్ సెక్యూరిటీ నెంబర్ల(ssn)ను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా సైబర్ దాడులతో డబ్బుల్ని డిమాండ్ చేశారని, అలా ఇవ్వలేదనే విద్యార్ధుల వ్యక్తిగత డేటాను డార్కెవెబ్లో అమ్ముకున్నట్లు ఎఫ్బీఐ విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ సైబర్ దాడులతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా టీచర్స్ సైతం ఈ సైబర్ దాడులు విద్యార్ధుల భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా,ఈజీ మనీ ఎర్నింగ్ కోసం హ్యాకర్స్ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్ని టార్గెట్ చేయడంతో పాటు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అమెరికాకు చెందిన 1200 స్కూళ్లకు చెందిన కంప్యూటర్లను మాల్ వేర్తో దాడులు చేసినట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అధ్యక్షుడి ప్రకటన తరువాతే కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ..ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఐటీ విభాగాల్ని మరింత పటిష్టం చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు సైబర్ నేరాలపై జరిగే న్యాయ విచారణకు మరింత ప్రాధాన్యం ఇచ్చే అంశాల్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటన చేశారో లేదు. హ్యాకర్స్ దాడుల్ని ముమ్మరం చేయడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: సాయిధరమ్ తేజ్... చిత్రలహరిలో చెప్పింది ఇదే -
ఎఫ్బీఐపై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన అసహనాన్ని దాచుకోలేకపోతున్నారు. అమెరికా నిఘా సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ)పై సైతం నిందలు మోపడానికి వెనుకాడడం లేదు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఓట్ల లెక్కింపులో అవకతవకలు చోటుచేసుకున్నాయని, అందుకే ఫలితాలు తారుమారు అయ్యాయని, తనకు అన్యాయం జరిగిందని ట్రంప్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మద్దతుదారులు న్యాయ పోరాటం సాగిస్తున్నారు. తన వాదనను బలపరిచేలా ఎఫ్ఐబీ ఒక్క ప్రకటన కూడా చేయలేదని ట్రంప్ ఆక్షేపించారు. ఆయన ఆదివారం ఓ ఇంటర్వ్యూలో.. ఎఫ్బీఐ క్రియాశీలతను కోల్పోయిందన్నారు. ఆ సంస్థ తీరుతో నిరుత్సాహానికి గురయ్యానని చెప్పారు. ఎఫ్బీఐలోని కొందరు తనకు వ్యతిరేకంగా పని చేశారని ధ్వజమెత్తారు. (చదవండి: శాస్త్రవేత్త దారుణ హత్య.. ట్రంప్పై అనుమానం!) -
కోల్డ్ బ్లడెడ్ మర్డర్ : ఆచూకీ చెబితే ఎఫ్బీఐ రివార్డు
వాషింగ్టన్: అమెరికాలో ఒక భారతీయ వ్యక్తిని కిడ్నాప్ చేసిన హత్య చేసిన కేసులో నిందితుడికి సంబంధించిన సమాచారం అందించిన వారికి భారీ రివార్డును ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) ప్రకటించింది. ఈ కేసును ఎఫ్బీఐ సెంట్రల్ వర్జీనియా హింసాత్మక నేరాల టాస్క్ ఫోర్స్ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే నేరస్థుడి ఆచూకీని కనుక్కునేందుకు తాజా ప్రకటన చేసింది. ఈ హత్యకు సంబంధించిన ఏదైన సమాచారం ఇచ్చిన వారికి 15,000 డాలర్లను బహుమతిగా ఇవ్వనున్నామని ఎఫ్బీఐ ప్రకటించింది. పరేష్కుమార్ పటేల్ (ఫైల్ ఫోటో) ఎఫ్బీఐ సమాచారం ప్రకారం సెప్టెంబర్16, 2012 న అమెరికాలో ఉంటున్న భారత జాతీయుడు పరేష్కుమార్ పటేల్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చారు. వర్జీనియాలోని చెస్టర్ ఫీల్డ్ లో పనిచేస్తున్న పటేల్ను ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు పథకం ప్రకారం ఎత్తుకెళ్లారు. నాలుగు రోజుల తరువాత తుపాకీ గుళ్ల గాయాలతో ఉన్న అతని మృతదేహాన్నివర్జీనియా రిచ్మండ్ నగరంలోని అంకారో బోట్ ల్యాండింగ్ వద్ద పోలీసులు గుర్తించారు. అప్పటినుంచి ఈ కేసుకు సంబంధించి నిందితుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో చాలెంజింగ్ గా తీసుకున్న దర్యాప్తు సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. #FBIRichmond's Central VA Violent Crimes Task Force offers up to $15K #reward for info leading to arrest/conviction of person(s) responsible for the 2012 murder of Mr. Pareshkumar Patel. https://t.co/2rk9WgTRwq or 804-261-1044.https://t.co/qtJjIzl9hj @RichmondPolice @CCPDVa — FBI Richmond (@FBIRichmond) September 15, 2020 -
ఉచితంగా అందించలేం: జూమ్ సీఈఓ
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ను నియంత్రించేందుకు అన్ని దేశాలు లాక్డౌన్ను విధించాయి. లాక్డౌన్ వల్ల అందరు ఇంట్లో ఉంటూ సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తున్నారు. అత్యాధునిక వీడియో సెషన్స్కు పేరొందిన అమెరికాకు చెందిన జూమ్ యాప్ లాక్డౌన్ కారణంగా గత రెండు నెలలుగా అధిక లాభాలను అర్జించినట్లు జూమ్ సంస్థ తెలిపింది. అయితే టెక్నాలజీ, భద్రతకు ప్రాధాన్యతమిస్తు కొత్త అప్గ్రేడ్ వర్షన్ను ఇన్స్టాల్ చేశామని.. అయితే ఈ వెర్షన్ను ఫ్రీగా అందించడంలేదని, రీచార్జ్ చేసుకోవాలని జూమ్ సీఈఓ ఎరిక్ యాన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఎఫ్బీఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారులతో కలిసి తమ సంస్థ పనిచేయనుందని.. అందువలన ఉచితంగా యూజర్లకు అందించలేకపోతున్నామని ఆయన పేర్కొన్నారు. యాప్ను ఉచితంగా అందించడం వలన కొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని తెలిపారు. తాజా నివేదికల ప్రకారం జూమ్ యాప్ AES 256-bit జీసీఎమ్ అనే కొత్త వెర్షన్ను ఇన్స్టాల్ చేయనుందని సంస్థ అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త వర్షన్తో అనేక నూతన సాంకేతిక అంశాలను పొందుపరిచామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కంపెనీ జూమ్ రూమ్స్, సిస్టమ్స్, వైర్లెస్ సేవలను యూజర్లకు అందిస్తోంది. సరికొత్త రీతిలో జూమ్ రూమ్స్ను నవీకరిస్తున్నందున వీడియో సెషన్స్ అద్భుతంగా కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది. చదవండి: హైదరాబాద్: సిటీ బస్సులకూ ఇక రైట్ రైట్! సరికొత్త వెర్షన్లో జూమ్ యాప్.. -
వరవరరావు హార్డ్డిస్క్ డేటా రికవరీ కోసం..
పుణే: ఎల్గార్ పరిషద్– మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన విరసం నేత వరవరరావు ఇంట్లో స్వాధీనంచేసుకున్న హార్డ్డిస్క్లోని డేటా రికవరీ కోసం అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) సాయం తీసుకోవాలని పుణే పోలీసులు భావిస్తున్నారు. గతేడాది ఆగస్టులో వరవరరావు ఇంట్లో సోదాల్లో లభ్యమైన హార్డ్డిస్క్లో ఏముందో తెల్సుకునేందుకు నాలుగు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలకు పంపినా ఫలితం లేదు. తొలుత పుణేలోని ల్యాబొరేటరీకి పంపగా, నిపుణులు హార్డ్ డిస్క్లోని డేటాను రికవరీ చేయలేకపోయారని ఓ అధికారి చెప్పారు. తర్వాత ముంబైలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపినా అక్కడి నిపుణులు డేటా సంపాదించలేకపోయారు. గుజరాత్, హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీల నిపుణులు రికవరీ చేయలేకపోయారని పేర్కొన్నారు. ‘సాంకేతికతలో ఎఫ్బీఐ చాలా పురోగతి చెంది ఉంటుంది. అందుకే ఎఫ్బీఐకి హార్డ్ డిస్క్ పంపాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు అవసరమైన అనుమతులను కేంద్ర హోం శాఖ ఇచ్చింది’అని ఆ అధికారి చెప్పారు. -
వరవరరావు కేసు: ఎఫ్బీఐకు హార్డ్డిస్క్!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరేగావ్ హింసాకాండ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావును నవంబర్ 17 ,2018లో పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని వరవరరావు ఇంట్లో సోదాలు చేసిన అనంతరం పోలీసులు స్వాధినం చేసుకున్న హార్డ్ డిస్క్ ధ్వంసం కావడంతో.. అందులోని డేటాను గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో డేటాను రాబట్టేందుకు పూణె పోలీసులు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ)ను ఆశ్రయించారు. వరవరరావు ఇంటి నుంచి స్వాధీనం చేసుకొన్న హార్డ్ డిస్క్ను ఇప్పటికే నాలుగు ఫోరెన్సిక్ ల్యాబ్లకు పంపించారు. మొదట పూణేలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా.. ఎటువంటి డేటాను గ్రహించక పోవడంతో.. ఆ తర్వాత ముంబైలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్ డైరెక్టరేట్కు చేరవేశారు. అక్కడనుంచి డేటాను తెరవలేకపోవడంతో.. అనంతరం గుజరాత్, హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్లలో తెరిచే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ధ్వంసమయిన హార్డ్ డిస్క్ నుంచి డేటాను పొందడం కష్టతరమవడంతో.. అమెరికాకు చెందిన ఎఫ్బీఐకు పంపేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా 2017 డిసెంబర్ 31న పూణేలో మావోయిస్టుల మద్దతుతో ఎల్గర్ పరిషత్ సమావేశం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్న ప్రసంగం, కులాల మధ్య అల్లర్లకు కారణమై.. భీమా కోరెగావ్లో హింసాకాండ చెలరేగింది. ఇక భీమా కోరేగావ్ ఘటనలో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు. ఎల్గర్ పరిషత్-కోరెగావ్ భీమా కేసులో.. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించడం, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే నెపంతో వరవరరావును అరెస్టు చేశారు. అదేవిధంగా విప్లవ సంఘాల నేతలకు మావోయిస్టులతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నాయనే అభియోగాలతో సుధా భరద్వాజ్, సుధీర్ ధవాలే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్, అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గోన్సాల్వ్స్, షోమా సేన్పై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. -
‘ద్వేషపూరిత దాడుల్లో సిక్కులు’
అమెరికాలో 2018లో జరిగిన ద్వేషపూరిత దాడుల్లో బాధితులుగా సిక్కులు మూడో స్థానంలో ఉన్నారని యుఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం సిక్కులపై 60 దాడులు చోటు చేసుకున్నాయని పేర్కొంది. గత ఏడాది అమెరికాలో మొత్తం ద్వేషపూరితమైన దాడులు 7,120 జరిగాయని.. 2017తో పోల్చతే కొంచం తగ్గాయిని ఎఫ్బీఐ నివేదిక తెలిపింది. ద్వేషపూరితమైన దాడులు ముఖ్యంగా మతం ఆధారంగా యూదులు(835), ముస్లింలు(188), సిక్కులు (60)పై జరిగాయని పేర్కొంది. ఇతర మతాలపై ఇటువంటి దాడులు 91 అయ్యాయని తెలిపింది. ఇందులో భాగంగా హిందువులపై 12 దాడులు, బుద్ధులపై పది చోటుచేసుకున్నట్టు వెల్లడించింది. జాతి అధారంగా మొత్తం 4,047 దాడులు జరిగితే.. అందులో అత్యధికంగా అమెరికాలోని నల్లజాతి అఫ్రికన్లపై సుమారు 1,943 దాడులు చోటుచేసుకుంటున్నాయని వెల్లడించింది. తరువాత తెల్ల జాతివారైన అమెరికన్లపై కూడా 762 దాడులు.. లాటిన్లపై 485 దాడులు జరిగాయని ఆ నివేదికలో వెల్లడైంది. కాగా 2018లో ఆసియన్లపై 148, అరబ్బులపై 82, అలాస్కా ప్రజలపై 194 ద్వేషపూరిత దాడులు జరిగినట్టు ఎఫ్బీఐ నివేదిక వెల్లడించింది. అయితే మిగతా మతస్తులపై దాడులు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ సిక్కులపై మాత్రం పెరుగుతున్నాయని.. దుండగులు దాడులకు లక్ష్యం చేసుకున్న మతాల్లో సిక్కులు మూడో స్థానంలో ఉన్నారని ఎఫ్బీఐ నివేదిక వెల్లడించింది. -
చిక్కడు.. దొరకడు.. ఎఫ్బీఐకి కూడా..
న్యూయార్క్/న్యూఢిల్లీ: ఆ హంతకుడిపై ఏకంగా రూ. 70లక్షల రివార్డు. దర్యాప్తులోనే మేటి అయిన అమెరికా అతని కోసం తెగ అన్వేషిస్తోంది. భారత్సహా నాలుగేళ్లుగా ప్రపంచాన్ని జల్లెడ పట్టినా అతడు దొరకలేదు. అమెరికా దర్యాప్తు సంస్థ (ఎఫ్బీఐ) టాప్ 10 వాంటెడ్ లిస్టులో స్థానం దక్కించుకున్నాడు. అతడే అహ్మదాబాద్కు చెందిన భద్రేశ్ కుమార్ పటేల్ (24). అమెరికాలోని డంకిన్ డోనట్స్ స్టోర్లో పనిచేస్తున్న అతడు తన భార్యను కిరాతకంగా చంపాడు. అనంతరం తప్పించుకొని పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. 2015 ఏప్రిల్ 12న రాత్రి పనిచేస్తున్న అతడు తన భార్య ఫలక్ (21)తో కలసి స్టోర్లోని కిచెన్కు వెళ్లాడు. కాసేపటికి ఒక్కడే బయటకు వచ్చాడు. కొద్ది గంటల తర్వాత పోలీసులు అమె మృత దేహాన్ని కనుక్కున్నారు. చాలా సార్లు కత్తితో పొడిచి మరీ హత్యచేశాడు. సీసీటీవీ ఫుటేజీల ప్రకారం అతడు ఓ టాక్సీలో హోటల్కు వెళ్లి రాత్రంతా పడుకొని తెల్లవారాక మాయమయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అతడు కనిపించలేదు. ఎఫ్బీఐ అతడి కోసం అమెరికాలోనేగాక భారత్లోని గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీలలో కూడా వెదికారు. ఇరుదేశాలు కలసి చేసిన పెద్ద కేసు విచారణ ఇదే కావడం గమనార్హం. -
యాపిల్ను భయపెట్టిన 16 ఏళ్ల బాలుడు!
సిడ్నీ: యాపిల్ సంస్థలో పనిచేయాలనే కోరిక ఓ 16 ఏళ్ల బాలుడిని ఆ సంస్థ కంప్యూటర్లను హ్యాక్ చేసేలా చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ టీనేజర్ యాపిల్ కంపెనీ కంప్యూటర్లను హ్యాక్ చేసి ఆ సంస్థను భయపెట్టాడు. అయితే చివరకు దొరికొపోయి శిక్షను అనుభవించేందుకు సిద్దమయ్యాడు. ఇక వినియోగదారుల సమాచారానికి ఎలాంటి నష్టం కలిగించలేదని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మెల్బోర్న్లోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థి అయిన ఈ టీనేజర్ యాపిల్ సంస్థకు వీరాభిమాని. అందులో పనిచేయాలని కలలుగన్నాడు. యూఎస్లోని కాలిఫోర్నియాలో ఉన్న ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోని కంప్యూటర్లను హ్యాక్ చేశాడు. అందులో భద్రపర్చిన 90 జీబీ ఫైళ్లను కూడా డౌన్లోడ్ చేశాడు. ఏడాదిలో పలుమార్లు ఇలా కంప్యూటరైజ్డ్ టన్నెల్స్ అండ్ ఆన్లైన్ బైపాసింగ్ సిస్టం ద్వారా కంప్యూటర్లను హ్యాక్ చేశాడు. దీన్ని గుర్తించిన సంస్థ ప్రతినిధులు ఆ యువకుడిపై ఎఫ్బీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఆస్ట్రేలియా పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఇంట్లో తనిఖీలు చేసి ఈ మొత్తం సమాచారాన్ని ‘హాకీ హాక్ హాక్’ పేరుతో ఫోల్డర్ను క్రియేట్ చేసి దాచినట్టు తెలిసింది. నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో.. వచ్చేనెల న్యాయస్థానం శిక్ష విధించనుంది. మైనర్ కావడంతో అతని పేరును భయట పెట్టలేదు. -
ఆ ముష్కరులను గుర్తించొచ్చు: ఎఫ్బీఐ
వాషింగ్టన్: అమెరికాలో విచక్షణారహితంగా అమాయకులపై కాల్పులకు పాల్పడుతున్న వ్యక్తుల ప్రవర్తనా సరళి ఎలా ఉంటుందో గుర్తించామని దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ తెలిపింది. ఈ లక్షణాలు తెలిసి ఉండటం వల్ల పోలీసులు కొన్ని కాల్పుల ఘటనలనైనా అడ్డుకోగలగడానికి వీలవుతుందంది. హంతకుల్లో చాలా వరకు శ్వేతజాతీయులేననీ, వారు వివిధ రకాల ఒత్తిడులకు, అన్యాయానికి గురైన వారేనని తెలిపింది. 75 శాతం హంతకులకు మానసిక అనారోగ్యాలేవీ లేవని ఎఫ్బీఐ తెలిపింది. -
సెక్స్రాకెట్.. సీఎం సన్నిహితుడి విచారణ!
సాక్షి, అమరావతి: సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో అమెరికాకు సినీతారలను తరలించి వ్యభిచారం ఊబిలోకి దింపిన వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసును అమెరికాలోని చికాగో పోలీసులు సీరియస్గా తీసుకోవడంతో తీగ లాగితే డొంక కదులుతోంది. తొలుత ఇది కేవలం సినీతారలకు సంబంధించిన అంశంగానే భావించినప్పటికీ ఈ రాకెట్లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్కు అత్యంత సన్నిహితుడైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రస్తుత అధ్యక్షుడు సతీష్ వేమనను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) తాజాగా విచారించడం కలకలం రేపుతోంది. తానా నుంచి సినీతారలకు ఆహ్వానాలు, మెయిల్స్ పంపడంతోపాటు సతీష్ వేమన బ్యాంకు ఖాతా నుంచి సినీతారలకు పెద్ద మొత్తంలో డబ్బులు మళ్లాయని ఎఫ్బీఐ సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను విచారించినట్టు తెలిసింది. టీడీపీలో సతీష్ చురుకైన పాత్ర తొలుత ఎఫ్బీఐ విచారణకు హాజరైన సతీష్ వేమన తరువాత ఫోన్ స్విచాఫ్ చేసినట్లు తెలిసింది. అయితే తానా ప్రతినిధులపై పోలీసులు ఒత్తిడి తేవడంతో సతీష్ విచారణకు హాజరై సహకరించారని చెబుతున్నారు. సినీతారల సెక్స్ రాకెట్కు సంబంధించి సతీష్ వేమన ప్రమేయంపై ఈ సందర్భంగా ఎఫ్బీఐ ఆరా తీసినట్టు సమాచారం. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే సతీష్ గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి కొందరు హీరోయిన్లను అమెరికా తీసుకెళ్లి పలు కార్యక్రమాలు నిర్వహించారు. అయితే సెక్స్ రాకెట్లో తన ప్రమేయం లేదని సతీష్ వేమన ముందు జాగ్రత్తగా కొన్ని మీడియా సంస్థలకు వివరణ ఇచ్చుకోవడంపై తానా ప్రతినిధుల్లో భిన్న వాదనలు వ్యక్తమైనట్టు తెలిసింది. తప్పు చేయనప్పుడు మీడియాకు ముందే వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని పలువురు సహచరులు ఆయన్ను ప్రశ్నించినట్టు తెలిసింది. చికాగో కోర్టుకు ‘సెక్స్ రాకెట్’ దంపతులు... సినీతారల సెక్స్ రాకెట్ కేసులో మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతులను ఎఫ్బీఐ గురువారం ఇల్లినాయిస్ కోర్టులో హాజరు పరిచింది. గురువారం నుంచి ఈ కేసు విచారణ ప్రారంభం అయినందున కిషన్ దంపతులు అప్రూవర్గా మారి నోరు విప్పితే పలువురు ప్రముఖుల గుట్టు రట్టు అవుతుందని భావిస్తున్నారు. కిషన్ దంపతులకు రెండేళ్ల క్రితమే వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటూ సినీతారలు, ప్రముఖులను తరలించి సెక్స్ రాకెట్ నడపటాన్ని అమెరికా పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం నాలుగేళ్ల నుంచి జరుగుతున్నట్లు భావించినా పదేళ్ల నుంచి కొనసాగుతున్నట్టు ఎఫ్బీఐ దర్యాప్తులో తేలిందని విశ్వసనీయ సమాచారం. అమెరికాకు సినీతారలు, ప్రముఖులు ఎవరెవరిని ఎప్పుడెప్పుడు తీసుకొచ్చారు, ఎవరెవరికి ఎంత మొత్తం చెల్లించారు తదితర వివరాలు చంద్రకళ డైరీలో రాసి ఉన్నట్టు చెబుతున్నారు. ఆ డైరీ ఇప్పుడు ఎఫ్బీఐ చేతికి చిక్కడంతో ఎవరి జాతకాలు బయటపడతాయోననే కలవరం మొదలైంది. తీవ్ర నేరంగా పరిగణిస్తున్న ఎఫ్బీఐ దాదాపు ఆరు నెలల క్రితం దొరికిన ఒక కాగితం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఎఫ్బీఐ పలు కీలక ఆధారాలు సేకరించి సెక్స్ రాకెట్లో పాత్రధారులైన మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతులను అదుపులోకి తీసుకుంది. వీరిపై కేసు నమోదు చేసిన చికాగో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా దర్యాప్తు చేపట్టి దీని వెనుక కీలక వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. సాంస్కృతిక ప్రదర్శనల పేరుతో వ్యభిచారం చేయడం తీవ్రమైన నేరంగా ఎఫ్బీఐ పేర్కొంటోంది. అమెరికాలో ఇష్టపూర్వకంగా జరిగే వ్యభిచారంపై పెద్దగా ఆంక్షలు లేనప్పటికీ మారుపేర్లతో విదేశీయులను తరలించి వ్యభిచారంలోకి దించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించినట్టు తెలుస్తోంది. ఈ సెక్స్ రాకెట్లో దాదాపు రూ.40 కోట్ల మేర చేతులు మారినట్టు చెబుతున్నారు. -
చక్రబంధంలో ట్రంప్!
అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాక డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు, తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశ పౌరులను మాత్రమే కాదు... ప్రపంచ ప్రజానీకాన్నే విస్మయపరుస్తున్నాయి. ఈ పరంపరలో ఆయన వెలువరించిన తాజా ట్వీట్ వాటన్నిటినీ తలదన్నింది. అధ్యక్షుడిగా తనను తాను క్షమించుకునే అధికారం తనకున్నదన్నదే ఆ ట్వీట్ సారాంశం. అలా అంటూనే తాను ఆ పని చేయా ల్సిన అవసరం రాదని ముక్తాయించారు. ఎందుకంటే ఆయన ఏ తప్పూ చేయలేదట! ఇప్పటికిప్పుడు ట్రంప్ ఇలా చెప్పడానికి కారణం ఉంది. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై అమెరికా పౌరుల్లో ఉన్న విశ్వసనీయతనూ, ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ అవకాశాలనూ దెబ్బతీయడానికి ప్రయత్నించిన రష్యాతో ఆయన కుమ్మక్కయ్యారన్న అభియోగాలపై సాగుతున్న విచారణ కీలక దశకు చేరింది. ఏడాదినుంచి ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ రాబర్ట్ ఎస్. మ్యూలర్ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ విచా రణపై ట్రంప్కు మొదటినుంచీ అసహనం ఉంది. దానిపై వీలు చిక్కినప్పుడల్లా ఆయన విరుచుకు పడుతూనే ఉన్నారు. ఈమధ్యకాలంలో ట్రంప్ న్యాయవాద బృందం మ్యూలర్ విచారణ చెల్లుబాటు కాదని వాదించడం మొదలుపెట్టారు. అంతేకాదు... పదవిలో ఉన్నంతకాలం ఎలాంటి ప్రాసిక్యూషన్ నుంచి అయినా ట్రంప్కు రక్షణ ఉంటుందని కూడా బల్లగుద్ది చెబుతున్నారు. ఆఖరికి ట్రంప్ ఎవరి నైనా కాల్చిచంపినా సరే ఆ విషయంలో ఆయనపై చర్య తీసుకోవడానికి వీలుండదని కూడా సెల విస్తున్నారు. దానికి కొనసాగింపుగానే ట్రంప్ తాజా ట్వీట్ చేసినట్టు కనబడుతోంది. వాటర్గేట్ కుంభకోణంలో చిక్కుకుని 1974లో పదవీభ్రష్టుడైన రిచర్డ్ నిక్సన్ కూడా ట్రంప్ మాదిరే మాట్లా డేవారు. వాటర్గేట్ విచారణ సాగుతున్న సమయంలో ‘అధ్యక్షుడు ఏదైనా చేస్తే అది చట్టవిరుద్ధం కాదనే అర్థం’ అని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. మరో మాటలో చెప్పాలంటే అధ్యక్షుడు అన్ని చట్టాలకూ అతీతుడని నిక్సన్ వాదనలోని సారాంశం. ఇంతకూ ట్రంప్ ‘స్వీయ క్షమాభిక్ష’ నిర్ణయం తీసుకుంటారా లేక ఆ అవసరం రానివిధంగా ఏకంగా మ్యూలర్ విచారణనే రద్దు చేస్తారా అన్నది ఇంకా చూడాల్సి ఉంది. ఏం చేసినా అది అమె రికాలో పెను సంక్షోభాన్ని కలిగించడం ఖాయం. అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికుండే క్షమాభిక్ష అధికారాల గురించి, ఏ విచారణనైనా ప్రారంభించమని లేదా నిలిపేయమని కోరే అధికారం గురించి వివరంగానే మాట్లాడినా...అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి తన విషయంలో తాను ఇలా చేయవచ్చునా అనే సంగతిని మాత్రం చెప్పలేదు. అధ్యక్షుడిగా ట్రంప్ వంటివారు వస్తారని రాజ్యాంగాన్ని రచించినవారి ఊహకు తట్టి ఉండకపోవచ్చు. కానీ ఆ లొసుగును ట్రంప్ ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదని ఆయన నుంచీ, ఆయనవైపునుంచీ వెలువడుతున్న ప్రకటనలు గమనిస్తే అర్ధమవుతుంది. విచారణలో భాగంగా ట్రంప్ను పిలిపించినా, దానికి ఆయన కట్టుబడాల్సిన అవసరం లేదని ఇప్పటికే మ్యూల ర్కు అందించిన లేఖలో ట్రంప్ న్యాయవాదులు స్పష్టం చేశారు. విచారణకు ట్రంప్ హాజరైతే అది అధ్యక్ష బాధ్యతల్ని నిర్వర్తించడంలో అవరోధంగా మారుతుందని, ఆయన స్థాయిని తగ్గిస్తుందని కూడా వారు వాదించారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ టీంలో సభ్యులుగా ఉండి ఆ తర్వాత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పలువురు వివిధ కారణాలరీత్యా తప్పుకోవాల్సి వచ్చింది. స్వల్పకాలం జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన మైకేల్ ఫ్లిన్ అందులో ఒకరు. ఆయన ట్రంప్ ఎన్నికల ప్రచార బృందంలో సభ్యుడిగా ఉన్నప్పుడు రష్యా రాయబారితో మాట్లాడిన మాటలు నిరుడు వెల్లడయ్యాయి. రష్యాపై అప్పటికి అమలులో ఉన్న ఆంక్షల్ని ట్రంప్ అధ్యక్షు డయ్యాక తొలగిస్తారన్నది ఆ మాటల సారాంశం. ఆ సంభాషణలు వెల్లడయ్యాక ఫ్లిన్ రాజీనామా చేయాల్సివచ్చింది. దానిపై అప్పటి ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీ దర్యాప్తునకు ఆదేశించగా దాన్ని నిలిపేయమని ట్రంప్ ఆయన్ను కోరారు. విననందుకు ఆగ్రహించి కోమీని తప్పించారు. కోమీ కూడా ట్రంప్కు ఒకప్పుడు సన్నిహితుడే. ట్రంప్ ఏరికోరి తెచ్చుకున్న 26మంది ఉన్నతాధికారులు ఇలా వివిధ సందర్భాల్లో తమంత తాము వైదొలగవలసి వచ్చింది. లేదా కొందరిపై ఆగ్రహించి ట్రంప్ తొలగించారు. ముఖ్యంగా మ్యూలర్ చేసిన అభియోగాలకు సరిగా జవాబు చెప్పలేక నలుగురు రాజీనామా చేశారు. ఇలా పదే పదే జరగడం వల్ల కావొచ్చు... విచారణ కీలక దశకు చేరుకుని తనపై అభియోగాలు మోపే అవకాశాలు స్పష్టంగా కనబడటం వల్ల కావొచ్చు ట్రంప్ తాజా ట్వీట్ చేశారని అనుకోవాలి. అమెరికా రాజ్యాంగం ‘స్వీయ క్షమాభిక్ష’ గురించి చెప్పకపోయినా ‘ఎవరూ తమ గురించి తాము తీర్పు ఇచ్చుకోరాద’న్న సంప్రదాయమైతే ఉంది. అయితే ట్రంప్ విశిష్టత ఏమంటే ఆయన ఏ సంప్రదాయాలనూ గౌరవించే రకం కాదు. నిక్సన్ చెప్పినట్టు అధ్యక్షుడు ఏం చేసినా చట్టవిరుద్ధం కాదని ఆయన బలంగా నమ్ముతారు. ట్రంప్ స్వీయ క్షమాభిక్షకు పూనుకున్నా, రష్యా ప్రమేయంపై సాగే దర్యాప్తులో నిందితులుగా నిర్ధారణ అయిన తన బృందంలోని వారికి క్షమాభిక్ష పెట్టేందుకు ప్రయత్నించినా, మ్యూలర్ దర్యాప్తును మూలపడేసినా అది ట్రంప్పై ఉన్న అభియోగాల తీవ్రతను మరింత పెంచుతుంది. ఆ అభియోగాల్లో నూరు శాతం నిజం ఉండొచ్చునని ప్రతి ఒక్కరూ భావించే ప్రమాదం ఏర్పడు తుంది. తనను అన్యాయంగా వేధిస్తున్నారని, బాధ్యతలపై దృష్టి కేంద్రీకరించకుండా అవరోధం కలిగిస్తు న్నారని ట్రంప్ వాపోతున్నా ఆయన తప్పించుకోవడం సాధ్యం కాదు. అధ్యక్షుడిగా ఆయన తీసుకునే నిర్ణయాల్లోని అసంబద్ధతలపైనా, అందులో ఉండే పరస్పర వైరుధ్యాలపైనా ఇప్పటికే అందరిలోనూ అసంతృప్తి ఉంది. మ్యూలర్ దర్యాప్తును ఏమాత్రం ఆటంకపరిచినా ఇది మరిన్ని రెట్లు పెరుగుతుంది. అమెరికన్ కాంగ్రెస్ ఆయనపై మహాభియోగ తీర్మానం చేసేందుకు కూడా సిద్ధపడొచ్చు. ట్రంప్ వివేకంతో వ్యవహరిస్తారో, తెగేదాకా లాగేందుకు ప్రయత్నిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
బిత్తిరి చర్య.. తప్పిన పెను ప్రమాదం
వాషింగ్టన్: జాగ్రత్తగా ఉండాల్సిన అధికారి నిర్లక్ష్యంగా వహించాడు. బిత్తిరి చర్యతో నైట్ క్లబ్లో ప్రజలను బెంబేలెత్తించాడు. అయితే ఈ ఘటనలో ఓ వ్యక్తి మాత్రం గాయపడ్డాడు. డెన్వర్ నగరం(కొలరెడా)లోని ఓ నైట్ క్లబ్లో జరిగిన ఘటన తాలుకూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎఫ్బీఐ అధికారి(ఆఫ్ డ్యూటీలో ఉన్నాడు) ఒకరు శుక్రవారం రాత్రి డెన్వర్లోని మైల్ హైల్ స్పిరిట్ అనే నైట్ క్లబ్కు వెళ్లాడు. హుషారుగా ఫ్లోర్పై బ్రేక్ డాన్స్ చేయటం ప్రారంభించాడు. చుట్టూ అమ్మాయిలు, అబ్బాయిలు చేరి వావ్ అనుకుంటుంటే.. ఆ కోలాహలం చూసి తట్టుకోలేక తన ట్యాలెంట్ ప్రదర్శించాడు. బ్యాక్ఫ్లిప్ మూమెంట్తో అదరగొట్టాడు. ఆ ప్రయత్నంలో అతని వెనకభాగంలో దాచుకున్న గన్ ఎగిరి కింద పడిపోయింది. కంగారులో దాన్ని తీసుకునే క్రమంలో అది కాస్త పేలింది. బార్లో పని చేసే ఓ ఉద్యోగి కాలికి తగిలి గాయపడ్డాడు. అదృష్టవశాత్తూ బుల్లెట్ కింది దిశగా ప్రయాణించటంతో పెను ప్రమాదమే తప్పింది. ఘటన తర్వాత సారీ చెబుతూ అక్కడి నుంచి అతను గాయబ్ అయిపోయాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి రికార్డు చేసి వైరల్ చేశాడు. ఎఫ్బీఐ మౌనం... ఘటన అనంతరం రంగంలోకి దిగిన డెన్వర్ పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అయితే ఎఫ్బీఐ అధికారి కావటంతో కేసు మాత్రం నమోదు చేయలేదు. మరోవైపు ఎఫ్బీఐ ఈ కేసును గోప్యంగా డీల్ చేయాలని చూస్తోంది. ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉన్నాడా? లేదా? అన్నది కూడా తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంపై మీడియాకు ఎలాంటి వివరణ ఇచ్చేందుకు ఎఫ్బీఐ అధికారులు సుమఖంగా లేకపోవటం విశేషం. అయితే డెన్వర్ పోలీసులు మాత్రం ఎఫ్బీఐతో ప్రమేయం లేకుండా ఈ కేసులో ముందుకు వెళ్తామని చెబుతున్నారు. ఇప్పటికే డిస్ట్రిక్ అటార్నీ కార్యాలయానికి నివేదిక ను సమర్పించగా, వారిచ్చే ఆదేశాలనుసారం ముందుకు వెళ్తామని పోలీసులు స్పష్టం చేశారు. -
తప్పిన పెను ప్రమాదం
-
బీర్ కోసం రక్తం చిందించాడు
వాషింగ్టన్: బీర్ కోసం విమానంలో రచ్చ చేసిన తాగుబోతు.. దెబ్బలు తినటమే కాకుండా జైలు పాలయ్యాడు. అమెరికా ఎయిర్లైన్స్కు చెందిన ఓ ఫ్లైట్లో ఈ ఘటన చోటు చేసుకోగా, అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... వర్జిన్ ఐలాండ్స్ నుంచి మియామి వెళ్తున్న విమానంలో జాసన్ ఫెలిక్స్ అనే వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. అప్పటికే పీకలదాకా తాగిన ఫెలిక్స్ ఇంకా బీర్ కావాలంటూ ఫ్లైట్ సిబ్బందిని కోరాడు. అయితే వారు నిరాకరించారు. ‘నేను అసలు ఫ్లైట్ ఎక్కిందే మందు కోసం. మీరు బార్టెండర్లు. నాకు బీర్ కావాల్సిందే’ అని అతను అనటం, అవును మేం బార్టెండర్లమే కానీ, మీకు ఇంకా అదనంగా బీర్ ఇవ్వలేం’ అంటూ సిబ్బంది చెప్పటం వీడియోలో ఉంది. వాగ్వాదం ముదురుతున్న క్రమంలో వెనకాలే నిల్చున్న ఓ వ్యక్తి ఫెలిక్స్కు నచ్చజెప్పే యత్నం చేశాడు. చివరకు ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరి ఘర్షణకు దారితీసింది. గొడవలో ఫెలిక్స్ మూతి పగిలి రక్తం కారింది. చివరకు తోటి ప్రయాణికులు వారిద్దరినీ నిలువరించారు. మియామీ చేరుకున్న తర్వాత ఫెలిక్స్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విమాన సిబ్బందితో గొడవకు దిగాడంటూ అతనిపై ఆరోపణలు నమోదు చేశారు. ఫెలిక్స్ను చితక్కొట్టింది ఆఫ్ డ్యూటీలో ఉన్న ఓ పోలీసాఫీసర్ అని తేలింది. బుధవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఎఫ్బీఐ అధికారి ఒకరు తెలిపారు. నేరం రుజువైతే కోర్టు ఫెలిక్స్కు 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు 2,50,000 డాలర్ల జరిమానాను విధించే అవకాశం ఉంది. -
ఆ తల ఎవరిదో తెలిసింది..!!
సాక్షి, వెబ్ డెస్క్ : నాలుగు వేల సంవత్సరాల క్రితం మరణించిన ఓ వ్యక్తి తల వెనుక దాగివున్న రహస్యాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) చేధించింది. 1915లో ఈజిప్టులోని డెయిర్ ఎల్ బర్షా ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుండగా వారికి ఓ మమ్మీ తల లభ్యమైంది. అయితే, ఎంత ప్రయత్నించినా మమ్మీ ఏ కాలానికి చెందినదో వారు కనుక్కోలేకపోయారు. 1920 నుంచి తవ్వకాల్లో శాస్త్రవేత్తలకు లభ్యమైన వస్తువులు అన్నింటిని(మమ్మీ తలతో సహా) బోస్టన్ ఫైన్ ఆర్ట్స్ మ్యూజియంలో భద్రపరిచారు. తాజాగా దాదాపు 100 ఏళ్ల తర్వాత మమ్మీ తల వెనుక దాగివున్న మిస్టరీని ఎఫ్బీఐ బయటపెట్టింది. మమ్మీ పన్నుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా అది ఒక పురుషుడిగా తేలిందని ఎఫ్బీఐ ‘జెనెస్’ అనే జర్నల్లో పేర్కొంది. డీఎన్ఏ పరీక్షల్లో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి రావడం వల్లే ఇది సాధ్యమైందని నిపుణులు అంటున్నారు. నిజానికి ఆ మమ్మీ తల అప్పటి బ్రిటీష్ గవర్నర్ డ్జేహుటైనాక్ట్ది అని ఎఫ్బీఐ తెలిపింది. గవర్నర్ దంపతుల మరణం అనంతరం వారిని ప్రత్యేక ప్రదేశంలో పూడ్చిపెట్టారని చెప్పింది. కానీ దొంగలు వారి శరీరంపై ఉన్న ఆభరణాల కోసం 30 అడుగుల లోతులో పాతిపెట్టిన శవపేటికను తవ్వి తీశారని వివరించింది. ఆ తర్వాత ఆభరణాలను చోరీ చేసి పేటికను దగ్గరలోని గుహలో పడేశారని వెల్లడించింది. -
టెక్సస్లో సీరియల్ బాంబర్!
హూస్టన్: అమెరికాలోని టెక్సస్ రాజధాని ఆస్టిన్లో ఈ నెలలో నాలుగోసారి పేలుడు సంభవించింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఆస్టిన్లో వరుసగా పేలుళ్లు సంభవిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వీటి వెనుక సీరియల్ బాంబర్ ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ 350 మంది ప్రత్యేక ఏజెంట్లను, బాంబు స్క్వాడ్లను ఆస్టిన్కు పంపింది. -
ఎఫ్బీఐ అధికారిపై ట్రంప్ వేటు
వాషింగ్టన్: కీలక సమాచారాన్ని అనధికారికంగా మీడియాకు అందిస్తున్నారనే ఆరోపణలపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ)లో రెండో ర్యాంకు అధికారిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేటు వేశారు. ఆదివారం పదవీ విరమణ చేయనున్న ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ ఆండ్రూ మెక్కాబెపై శుక్రవారం అర్ధరాత్రి ట్రంప్ యంత్రాంగం వేటు వేసింది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయంపై విచారణకు సంబంధించిన కీలక సమాచారాన్ని మీడియాకు వెల్లడిస్తున్నందువల్లే మెక్కాబెపై వేటు వేస్తున్నట్టు అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ శుక్రవారం ప్రకటించారు. -
ఆ దొంగతనంతో చైనా హర్టయ్యింది
వాషింగ్టన్ : బొటనవేలు దొంగతనం చేసినందుకు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ ఓ వ్యక్తిని అరెస్ట్ చేసింది. అయితే అది మనిషిది కాదు సుమీ... చారిత్రక నేపథ్యం ఉన్న టెర్రా కోట్టా యుద్ధవీరుడి విగ్రహానిది. ఫిలడెల్ఫియాలోని ఫ్రాంక్లిన్ ఇనిస్టిట్యూట్ మ్యూజియంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... గతేడాది డిసెంబర్ 21 మ్యూజియంలో ఓ పార్టీ వేడుకలు జరిగాయి. దీనికి పెద్ద ఎత్తున్న విద్యార్థులు హాజరయ్యారు. వారంతా టెర్రా-కొట్టా వారియర్ ఎగ్జిబిషన్లో వారంతా కలియదిరిగారు. దానికి బియర్ ప్రాంతానికి చెందిన చెందిన మైకేల్ రోహనా అనే విద్యార్థి కూడా హజరయ్యాడు. అంతా ఫోటోలు దిగుతున్న సమయంలో మెల్లిగా ఓ విగ్రహాం వద్దకు వెళ్లి దాని బొటనవేలును విరిచేశాడు. దానిని తన జేబులో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సుమారు 4.5 మిలియన్ డాలర్ల విలువైన విగ్రహం కావటంతో ఏకంగా పోలీస్ శాఖా ఎఫ్బీఐ సాయం కోరింది. సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా ఎఫ్బీఐ అతన్ని గుర్తించే ప్రయత్నం చేసింది. దాదాపు నెలన్నరకు పైగా విచారణ చేపట్టి చివరకు అతన్ని అరెస్ట్ చేసింది. బోటనవేలును అతని నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆపై రోహనా బెయిల్ పై విడుదలయ్యాడు. కాగా, ఈ ఘటనపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. షాంక్సి కల్చరల్ హెరిటేజ్ ప్రమోషన్ సెంటర్.. అమెరికా విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. ‘అది మా జాతి గౌరవానికి సంబంధించింది. నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించటం దారుణం. ఈ కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలి’ అని పేర్కొంది. FBI says a US man stole the thumb of a 2,200-year-old Chinese terracotta warrior statue being displayed at the Franklin Institute pic.twitter.com/ZwzRrSq8V2 — CGTN (@CGTNOfficial) 18 February 2018 టెర్రా-కొట్టా మ్యూజియాలు... చైనాకు చెందిన బలమైన సైన్యం టెర్రా-కొట్టా సుమారు 2 వేల సంవత్సరాల క్రితం నాటిది. చైనా తొలి చక్రవర్తి క్విన్ షీ హువాంగ్ సమాధికి రక్షణగా ఈ టెర్రా-కొట్టా యుద్ధవీరుల విగ్రహాలను నిర్మించారు. 1974లో ఓ రైతు వీటిని గుర్తించటంతో వెలుగులోకి వచ్చింది. అందులోని కొన్ని విగ్రహాలను ప్రపంచంలోని వివిధ మ్యూజియాలకు తరలించి ప్రదర్శిస్తున్నారు. తమ సంప్రదాయాలకు, చరిత్రకు గుర్తుగా చైనా వీటికి అపూర్వ గౌరవం ఇస్తోంది. -
డెమోక్రాట్లతో ఎఫ్బీఐ కుమ్మక్కు
-
డెమొక్రాట్లతో ఎఫ్బీఐ కుమ్మక్కు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై జరుగుతోన్న దర్యాప్తులో డెమోక్రాట్లతో ఎఫ్బీఐ, న్యాయ విభాగం కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తూ ట్రంప్ పార్టీకి చెందిన రిపబ్లికన్లు ఎఫ్బీఐపై ‘మెమో’ విడుదల చేశారు. ఎఫ్బీఐ వద్దని వారిస్తోన్నా వినకుండా ట్రంప్ ఈ మెమోను ఆమోదించి హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీలకు పంపారు. మెమోరాండంలో వెల్లడైన వివరాలు సిగ్గుచేటని ట్రంప్ అన్నారు. రష్యా జోక్యంపై విచారణలో ట్రంప్ ప్రచార బృందానికి చెందిన మాజీ సలహాదారుడి విషయంలో అధికారులు కోర్టును తప్పు దారి పట్టించారని మెమోలో ఆరోపించారు. అందులోని అంశాల్ని పరిశీలిస్తే న్యాయశాఖ, ఎఫ్బీఐలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు తీసుకున్న నిర్ణయాల నైతికతపై ఆందోళన వ్యక్తమవుతోందని వైట్హౌస్ మీడియా కార్యదర్శి సాండర్స్ అన్నారు. ప్రతినిధుల సభకు చెందిన ఇంటెలిజెన్స్ చైర్మన్ డెవిన్ న్యూనెస్ రూపొందించిన ఈ మెమోలో.. ‘ డెమోక్రాట్ల తరఫున బ్రిటిష్ నిఘా ప్రతినిధి క్రిస్టోఫర్ స్టీల్ రాసిన పరిశోధన వివరాల్ని దర్యాప్తులో ఎఫ్బీఐ వాడుకుంది’ అని ఆరోపించారు. అధ్యక్షుడి జాతీయ భద్రతా బృందం నుంచి అందిన సమాచారం ఆధారంగా దీనిని రూపొందించినట్లు శాండర్స్ తెలిపారు. రిపబ్లికన్ సభ్యుడు డానా రోహ్రబచెర్ మాట్లాడుతూ.. మెమోతో వాస్తవాలు వెలుగుచూశాయని చెప్పారు. ‘పోలీసు, నిఘా విభాగాలు కూడా కొన్నిసార్లు రాజీపడతాయి. ఎప్పటికప్పుడు అలాంటి దుర్వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అందుకే అన్ని ఫెడరల్ దర్యాప్తు విభాగాలపై అమెరికన్ చట్ట సభల పర్యవేక్షణ ఉండాలి’ అని అన్నారు. పారదర్శకత కోసం ట్రంప్ శ్రమిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఎఫ్బీఐ విచారణకు డెమోక్రాట్లు సాయపడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నమే ఇది. ఇది వాటర్గేట్ కుంభకోణంతో పోల్చదగిన స్థాయిలో ఉంది’ అని అన్నారు. ఈ వ్యవహారంపై ఎఫ్బీఐ మాత్రం నోరు మెదపలేదు. -
ఆ రాక్షసుల ఫోటోలను విడుదల చేశారు
వాషింగ్టన్ : పాన్ అమెరికా ఎయిర్వేస్ విమాన హైజాక్, మారణ హోమానికి సంబంధించి ఉగ్రవాదుల ఫోటోలను అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ మరోసారి విడుదల చేసింది. 1986, సెప్టెంబర్ 5న ముంబై నుంచి న్యూయార్క్ బయలుదేరిన పాన్ యామ్ ఫ్లైట్ 73 విమానాన్ని కరాచీలో హైజాక్ చేసిన ఉగ్రవాదులు 26 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. ఆ రోజు ఏం జరిగిందంటే... ఈ విమానంలో అటెండెంట్గా పనిచేస్తున్న నీర్జా భానోత్ టెర్రరిస్టుల బారి నుంచి 359 మందిని తన వంతు ప్రయత్నం చేశారు. ప్రయాణికులు సురక్షితంకోసం ఆమె తన జీవితాన్ని పణంగా పెట్టారు. కానీ, ఈ క్రమంలో నీర్జాతోపాటు 20 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు అమెరికన్లు కూడా ఉన్నారు. హైజాకర్లు మహ్మద్ హఫీజ్ అల్ టర్కీ, జమల్ సయ్యిద్ అబ్దుల్ రహిమ్, మహ్మద్ అబ్దుల్లా ఖలీల్ హుస్సేన్, మహ్మద్ అహ్మద్ అల్ మున్వర్ ప్రధాన నిందితులు. 2000 సంవత్సరంలో తొలిసారి వీరి ఫోటోలను విడుదల చేయగా.. ఇప్పుడు ఏజ్-ప్రోగ్రెసన్ టెక్నాలజీ ద్వారా వారు ఇప్పుడు ఎలా ఉంటారన్నది అంచనా వేస్తూ వారి ఫోటోలు రిలీజ్ చేశారు. వీళ్లల్లో ప్రతీ ఒక్కరిపై 5 మిలియన్ల అమెరికన్ డాలర్ల నజరానా ఉంది. వీరంతా అబు నిదల్ ఆర్గనైజేషన్ సంస్థకు చెందిన వారని.. ప్రస్తుతం వీరంతా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నారని ఎఫ్బీఐ ప్రకటించింది. -
డబ్బు కోసం భారత బిలియనీర్ ఏం చేశాడంటే...
వాషింగ్టన్: భారత అమెరకన్ ఫార్మా బిలియనీర్ జాన్ నాథ్ కపూర్ (74)ను ఎఫ్బీఐ అధికారులు అరెస్ట్ చేశారు. క్యాన్సర్ రోగులకు వాడే నొప్పి నివారణ ఓపియడ్ను ప్రిస్కైబ్ చేయాలని డాక్టర్లకు ముడుపులు ముట్టచెప్పడం,కుట్ర అభియోగాలను కపూర్పై నమోదు చేశారు. అమృత్సర్లో జన్మించిన కపూర్ 1960లో భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఆయన ప్రస్తుతం ఫార్మా కంపెనీ ఇన్సిస్ థెరాప్యుటిక్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది 20,000 మంది పైగా అమెరికన్లు ఒపియడ్ ఓవర్డోస్లు తీసుకోవడం వల్ల మరణించడంతో కపూర్ నిర్వాకంపై అమెరికా అధికారులు సీరియస్గా ఉన్నారు. లక్షలాది అమెరికన్లు ఈ ప్రమాదకర డ్రగ్కు అడిక్ట్ అయ్యారు. దీనికి బాధ్యులైన వీధి వ్యాపారుల నుంచి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ల వరకూ ఏ ఒక్కరినీ విడిచిపెట్టమని యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. ఒపియడ్ విక్రయాలపై యూఎస్ ఉక్కుపాదం మోపడంతో కపూర్ బృందం వైద్యులకు లంచాలు ఆఫర్ చేసి ఈ డ్రగ్ను ప్రిస్కైబ్ చేసేలా వ్యవహరించింది. లాభాల కోసం బీమా కంపెనీలనూ రీఎంబర్స్మెంట్ వచ్చేలా వీరు ఒత్తిడి తీసుకువచ్చినట్టు అధికారులు ఆరోపిస్తున్నారు. డబ్బు కోసం నీచానికి ఒడిగట్టే ఈ ఇండియన్ అమెరికన్ న్యూయార్స్ స్టేట్ యూనివర్సిటీ నుంచి మెడిసినల్ కెమిస్ర్టీలో పీహెచ్డీ పొందాడు. బాంబే వర్సిటీ నుంచి ఫార్మసీలో బీఎస్ చేశాడు. -
కెనడీ హత్య ఫైల్స్ విడుదల
వాషింగ్టన్ డీసీ : అమెరికానేకాక మొత్తం ప్రపంచాన్నే కుదిపేసిన అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యోదంతం ఫైళ్లను అమెరికా తొలిసారి బహిర్గం చేసింది. జాతీయ భద్రతా ఏజెన్సీల సూచనల మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని ప్రత్యేక ఫైళ్లను మాత్రం విడుదల చేయలేదు. మొత్తం 3,191 పైళ్లలో 2,891 ఫైళ్లను అధికారులు విడుదల చేశారు. కెనడీ హత్యకు సంబంధించిన ముఖ్యమైన 300 ఫైళ్లను మాత్రం ట్రంప్ విడుదల చేయలేదు. అమెరికా అధ్యక్ష పదవిలో ఉండగా జాన్ ఎఫ్ కెనడీని 1963, నవంబర్ 22న హత్య చేశారు. అప్పటినుంచి ఈ హత్యపై ఎన్నో అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఈ హత్య ఒక మిస్టరీగా ప్రజలు భావిస్తారు. లీ హర్వీఏ ఓస్వాల్డ్ అనే హంతకుడు అధ్యక్షుడు కెనడీని హత్య చేసినట్లు అధికారులు రికార్డుల్లో పేర్కొన్నారు. కెనడీ హత్య జరిగిన మూడు దశాబ్దాల తరువాత.. రికార్డ్ కలెక్షన్ యాక్ట్ -1992 ప్రకారం.. హత్య సంబంధించిన అన్ని ఫైళ్లను ఒకే చోటకు చేర్చాలని నాటి ప్రభుత్వం తీర్మానం చేసింది. ఆ ప్రకారం హత్యకు సంబంధించిన అన్ని ఫైళ్లను సేకరించి నేషలన్ ఆర్చీవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఏఆర్ఏ)లో భద్రపరిచారు. ఆ సమయంలో ఈ ఫైళ్లను 2017 అక్టోబర్ 26న ప్రజల ముందుంచాలని నిర్ణయించారు. కీలకమైన ఫైళ్లను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో హత్యకు సంబంధించిన కుట్రపై ప్రజలకున్న అనుమానాలు అలాగే మిగిలిపోతాయని చరిత్రకారులు అభిప్రాయాన్నివ్యక్తం చేస్తున్నారు. కెనడీ హత్యకు ముందు ఓస్వాల్డ్ మెక్సికో పర్యటన కూడా రహస్యంగానే మిగిలిపోయిందని చరిత్రకారులు చెబుతున్నారు. -
ఆయన అలాంటి వాడు కాదట..?!
-
ఆయన అలాంటి వాడు కాదట..?!
వాషింగ్టన్: లాస్వేగాస్లో నరమేధానికి దిగిన.. స్టీఫెన్ పెడాక్ గురించి అతని గర్ల్ఫ్రెండ్ మార్లు డాన్లీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నరమేధం జరుగుతున్న సమయంలో పిలిప్పీన్స్లో ఉన్న ఆమె.. అమెరికాకు తిరిగి రావడంతో ఎఫ్బీఐ అధికారులు విచారణకు దిగారు. ఈ విచారణలో పలు కొత్త విషయాలు వెలుగు చూశాయి. పెడాక్ గురించి ఆమె మాట్లాడుతూ.. ‘అతను చాలా మంచివాడు.. మానవత్వం ఉన్న మనిషి, జాలి, దయ వంటి గుణాలు ఉండడమే కాక ఎవరితోనూ విభేధాలు, గొడవలు పడని వ్యక్తి’ అని చెప్పారు. అంతేకాక తనతో పొరపాటున కూడా.. ఇటువంటి రక్తపాతానికి దిగుతున్నట్లు కానీ, హింసాత్మక ఘటన చేస్తున్నట్లుకానీ మాట మాత్రంగానైనా చెప్పలేదని ఆమె అన్నారు. ఈ నరమేధం గురించి ఏ మాత్రం తెలిసున్నా.. ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకునేదాన్ని అని డాన్లీ చెప్పారు. భయంకర విధ్వంసం జరిగిపోయింది.. ఇప్పుడు చేయడానికి ఎవరి దగ్గర ఏం లేదు.. అని ఒకరకమైన నిర్వేదంతో ఆమె చెప్పారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని.. గాయాలతో చికిత్స పొందుతున్నవారు.. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు డాన్లీ తెలిపారు. నరమేధంపై విచారణ చేస్తున్న అధికారులకు పూర్తిగా సహకరిస్తానని ఆమె స్పష్టం చేశారు. నరమేధం సృష్టించేందుకు పెడాక్కు ఎవరైనా ప్రేరణ కల్పించారా? లేక రక్తపాతం సృష్టించాలన్న ఆలోచనల పెడాక్లో ఎలా వచ్చింది? ఇందుకు నీ దగ్గర ఏదన్నా సమాచారం ఉందా? అని డాన్లీని ఎఫ్బీఐ అధికారులు ప్రశ్నించారు. దానికి స్పందించిన డాన్లీ.. పై విధంగా సమాధానాలు ఇచ్చారు. ఈ కేసుపై విచారణ చేస్తున్న అధికారులు మాత్రం పెడాక్కు సంబందించిన మూలాలను, నరమేధానికి గల కారణాలను తెలుసుకుంటామని చెబుతున్నారు. -
3 రష్యా కాన్సులేట్ల స్వాధీనం
వాషింగ్టన్, న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో కార్యాలయాలను సీజ్ చేసిన అమెరికా వాషింగ్టన్: అమెరికా– రష్యాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయి. శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, వాషింగ్టన్ల్లోని రష్యా దౌత్య కార్యాలయాలను అమెరికా శనివారం స్వాధీనం చేసుకుంది. రెండు రోజుల్లో వీటిని ఖాళీ చేయాలంటూ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. గత నెలలో తమ దేశంలోని అమెరికా దౌత్య సిబ్బందిని రష్యా సగానికి పైగా తగ్గించింది. దీనికి ప్రతిగా ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దౌత్య కార్యకలాపాలకు రష్యా ఈ కార్యాలయాలను ఇకపై ఉపయోగించుకోవడానికి వీల్లేదని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. భద్రత, నిర్వహణ సహా ఈ మూడు కార్యాలయాలూ పూర్తి స్థాయిలో తమ అధీనంలోనే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతి ఉంటే తప్ప వీటిల్లోకి రష్యా దౌత్యవేత్తలకు ప్రవేశం కల్పించమన్నారు. దీనిపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాళీ చేయకపోతే తమ దౌత్య కార్యాలయం తలుపులు బద్దలు కొడతామని ఎఫ్బీఐ హెచ్చరించిందని రష్యా ఆరోపించింది. అమెరికాది దూకుడు చర్యగా అభివర్ణించింది. అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదని అమెరికా పేర్కొంది. రష్యా ఎంబసీ ప్రతినిధుల సమక్షంలో ప్రభుత్వ అధికారులు ఈ మూడు కార్యాలయాలను తనిఖీ మాత్రమే చేసినట్టు సంబంధిత అధికారి తెలిపారు. -
ఇప్పుడు ట్రంప్‘క్షమా’ గోల!
కిందటి నవంబర్ఎన్నికల్లో రష్యా జోక్యంపై స్పెషల్కౌన్సల్రాబర్ట్మలర్తన దర్యాప్తును డొనాల్డ్ట్రంప్ఆర్థిక లావాదేవీల వరకూ విస్తరించడం అమెరికా అధ్యక్షుడిని కొత్త ఆలోచనకు పురికొల్పింది. రష్యన్ల పాత్రపై పూర్వపు ఎఫ్బీఐ డైరెక్టర్జేమ్స్కోమీ దర్యాప్తు నచ్చని ట్రంప్ఆయనను తొలగించారు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు మలర్ను డెప్యూటీ అటార్నీ జనరల్రాడ్రాసెన్స్టెయిన్లిఖిత పూర్వక ఉత్తర్వు ద్వారా నియమించారు. దర్యాప్తు కాలంలో తెలిసిన అంశాలపై కూడా కూపీ లాగవచ్చని ఈ ఉత్తర్వులో పేర్కొనడంతో మలర్తన పరిధిని విస్తరించారు. ట్రంప్సహాయకులు, అల్లుడు జారెడ్కష్నర్, పెద్ద కొడుకు జూనియర్ట్రంప్సహా ఆయన కుటుంబసభ్యుల వ్యవహారాల నుంచి ట్రంప్2008 నాటి ఆర్థిక లావాదేవీల వరకూ పలు అంశాలపై మలర్దర్యాప్తు చేస్తున్నారని తెలియడంతో ట్రంప్కొత్త వ్యూహానికి తెరతీశారు. ప్రజలను ప్రభుత్వం నుంచి కాపాడడానికి (చేసిన తప్పులు మన్నించడానికి) అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికి ఇచ్చిన క్షమాభిక్ష అధికారాన్ని ఈ వ్యవహారంలో వాడుకోవడానికి ఎంత వరకు వీలుందో పరిశీలించాలని ట్రంప్తన సలహాదారులను కోరారు. తనను తాను అధ్యక్షుడు క్షమించుకోవచ్చా? రష్యా జోక్యం వ్యవహారంలో పాత్ర ఉన్న కుటుంబసభ్యులు సహా తనవారందరితోపాటు ట్రంప్తనను తాను క్షమించుకోవడానికి కూడా ఆస్కారముందేమో చూడాలని సలహాదారులను అడిగారని తెలుస్తోంది. అమెరికా చరిత్రలో ఇంతవరకూ ఏ అధ్యక్షుడూ తనకు తాను క్షమాభిక్ష ప్రకటించుకున్న సందర్భాలు లేవు. ఈ క్షమాభిక్ష అధికారం కింద ఇంకా అభియోగాలు నమోదుకాని, శిక్షపడనివారిని కూడా అధ్యక్షుడు క్షమించడానికి రాజ్యాంగం వీలు కల్పిస్తోంది. అందుకే ఈ విషయంపై ట్రంప్లాయర్లు విస్తృతంగా తమలో తాము చర్చించుకుంటున్నారని చెబుతున్నారు. తమకు మరీ ఇబ్బంది కలించేలా మలర్దర్యాప్తు సాగుతుంటే, ఆయనను ఏఏ కారణాలపై ఆ పదవి నుంచి తప్పించడానికి ఎన్ని అవకాశాలున్నాయనే విషయాన్ని కూడా ట్రంప్లాయర్లు పరిశీలిస్తున్నారు. తొలగించడం సాధ్యంకాకపోతే మలర్దర్యాప్తు పరిధిని ఎలా కుదించాలి? అనే అంశంపై కూడా వారు తర్జనభర్జనలు పడుతున్నారు.ఽ ఎఫ్బీఐ డైరెక్టర్గా ఉండగా ఉత్తర వర్జీనియాలోని ట్రంప్నేషనల్గోల్ఫ్క్లబ్నుంచి మలర్వైదొలిగినపుడు సభ్యత్వ రుసుం వివాదం ఆయనకూ, క్లబ్కూ మధ్య వచ్చిందని, దీన్ని కారణంగా చూపించి మలర్ను ఈ దర్యాప్తు బాధ్యత నుంచి తొలగించవచ్చిని కొందరు ట్రంప్కు సలహా ఇచ్చారు. అయితే, మలర్క్లబ్సభ్యత్వం రద్దుచేసుకున్నప్పుడు మెంబర్షిప్ఫీ వివాదమేదీ లేదని ఆయన ప్రతినిధి ఒకరు చెప్పారు. ఎందుకొచ్చిందీ ఆలోచన? ఫ్లారిడా పామ్బీచ్లోని ట్రంప్భవనాన్ని 2008లో రష్యా కుబేరుడొకరు కొనుగోలు చేయడం సహా అధ్యక్షుడి పాత లావాదేవీలను కూడా మలర్క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారనే వార్త తెలియడంతో ట్రంప్కు క్షమాభిక్ష ఆలోచన వచ్చిందంటున్నారు. అలాగే, ట్రంప్సమర్పించిన అనేక సంవత్సరాల ట్యాక్స్రిటర్న్స్పత్రాలను మలర్అధికారికంగా తెప్పించుకుని పరిశీలించే అవకాశముందనే సమాచారం కూడా ట్రంప్ను కంగారుపెడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ‘స్వయం క్షమాభిక్ష’కు అవకాశాలపై అధ్యయనం చేయిస్తున్నారు. అధ్యక్షుడు తనను తాను క్షమించుకోవచ్చా? అనే అంటే ‘లేదు’ అని న్యాయకోవిదులెవరూ చెప్పలేదు. కాని, ఇంత వరకు ఏ అధ్యక్షుడూ ఈ పనిచేయలేదు. ఒకవేళ ఏ అధ్యక్షుడైనా స్వయం క్షమాభిక్ష ప్రకటించుకుని ఉంటే ఆ నిర్ణయంపై కోర్టు తీర్పు వచ్చి ఉండేది. ఈ పరిస్థితి గతంలో తలెత్తకపోవడంతో ట్రంప్కు ఆ అధికారముందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. వాటర్గేట్కుంభకోణంలో ఇరుక్కుని చివరికి రాజీనామా చేసే ముందు మాజీ అధ్యక్షుడు రిచర్డ్నిక్సన్ఈ స్వయం క్షమాభిక్ష గురించి ఆలోచించారు. ఈ అధికారం అధ్యక్షుడికి ఉందని ఆయన లాయర్చెప్పినా, దాన్ని వాడుకోకూడదనే నిక్సన్నిర్ణయించుకున్నారు. 1974 ఆగస్ట్లో పదవి రాజీనామా చేశాక నిక్సన్కు తర్వాత అధ్యక్ష పదవికి చేపట్టిన (ఉపాధ్యక్షుడు) జెరాల్డ్ఫోర్డ్క్షమాభిక్ష ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తప్పుపట్టిన ప్రజలు 1976 నవంబర్అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్పారీ్ట అభ్యర్థి జిమీ కార్టర్పై పోటీచేసిన ఫోర్డ్ను ఓడించారు. (సాక్షి నాలెడ్జ్సెంటర్) -
ట్రంప్కు మరిన్ని తంటాలు
► సెనేట్ కమిటీ ముందు సాక్ష్యం చెబుతానన్న కోమీ ► ఎఫ్బీఐ కీలక వ్యక్తి ఎవరు? (సాక్షి నాలెడ్జ్ సెంటర్) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గతేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ను ఓడించడానికి రష్యాతో కుమ్మక్కయారనే వ్యవహారంలో కొత్త విషయాలు వెల్లడవుతున్న క్రమంలో తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు. ఈ నెల 9న ఈ కుంభకోణంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారనే కోపంతో ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీని ట్రంప్ హఠాత్తుగా తొలగించాక ఈ వారం మరిన్ని పరిణామాలు శరవేగంతో సంభవించాయి. అ కమిటీ ముందు హాజరై సాక్ష్యం చెబుతానని ఇప్పుడు కోమీ ప్రకటించడంతో ఈ అంశం మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ట్రంప్ పాత్రపై కొంత పరిశోధన జరిపిన కోమీని ఈ నెల 29న జరిపే అమెరికా మెమోరియల్ డే తర్వాత ఏరోజైనా ఈ కమిటీ ముందు సాక్ష్యం చెప్పాల్సిందిగా ఆదేశిస్తారని తెలుస్తోంది. ఏడాదిగా రెండు ప్రధాన రాజకీయపక్షాల మధ్య నలిగిన ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ కమిటీకి ఎలాంటి ‘సంచలనాత్మక’ విషయాలు వెల్లడిస్తారనే విషయం పలువురిలో ఆసక్తి రేపుతోంది. ఫెడరల్ దర్యాప్తు సంస్థ అధిపతిగా ప్రతి విషయాన్ని కాగితంపై పెట్టే అలవాటున్న కోమీ మెమోల్లోని అంశాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ ఫ్లిన్పై దర్యాప్తు నిలిపివేయాలని ట్రంప్ కోరిన విషయం ఈ మెమోల్లో ఒకటి. నిక్సన్ మాదిరిగా పొరపాటు మీద పొరపాటు! రష్యాతో కుమ్మక్కు వ్యవహారంలో అధ్యక్షుని పాత్రపై దర్యాప్తునకు ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ రాబర్ట్ మ్యూలర్ను ప్రత్యేక ప్రాసిక్యూటర్గా నియమించాక ‘ఇది అమెరికా చరిత్రలో ఓ రాజకీయ నాయకునిపై ఘోరమైన వేధింపు చర్య’ అని ట్రంప్ ట్వీట్ చేశాక ఆయన తీవ్ర భయాందోళనకు గురవుతున్నారనే భావన సర్వత్రా నెలకొంది. 1972 అధ్యక్ష ఎన్నికల్లో వాటర్గేట్ కుంభకోణానికి పాల్పడిన అప్పటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మాదిరిగా ఇప్పుడు వరుసగా ‘తప్పటడుగులు’ వేస్తూ రష్యా వ్యవహారంలో వాస్తవాలు బయటకు రాకుండా కప్పిపెట్టడానికి అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నారనే అనుమానం అత్యధిక అమెరికన్లను వేధిస్తోంది. రష్యాతో చేతులు కలిపారనడానికి ఆధారాలు లభ్యమౌతున్నాయనే భయంతోనే కోమీని పదవి నుంచి తొలగించడమే కాక, మరుసటి రోజు వైట్హౌస్లోతనను కలిసిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికాలో రష్యా రాయబారితో మాట్లాడుతూ, కోమీ ఉద్వాసనతో పీడ విరగడైందని, ఆయన చేసింది తిక్క పని అని ట్రంప్ చెప్పిన మాటలు రికార్డవడమే కాక, వాటిని ప్రసిద్ధ అమెరికా దినపత్రిక వెల్లడించడం అధ్యక్షుడి పరువును మరింత దిగజార్చింది. తప్పు చేశాడు కాబట్టే కప్పిపుచ్చే పనులకు ట్రంప్ పాల్పడుతున్నారనే ఆరోపణ వినిపిస్తోంది. ‘కీలక వ్యక్తి’ ఎవరు? రష్యాతో ఎన్నికల కుమ్మక్కుపై జరిపే ఫెడరల్ దర్యాప్తులో వైట్హౌస్లో పనిచేస్తున్న సీనియర్ సలహాదారును ‘కీలక వ్యక్తి’గా సాక్ష్యం చెప్పాలని కోరే అవకాశాలున్నాయని ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక శుక్రవారం వెల్లడించింది. దర్యాప్తు సంస్థకు అనుమానం ఉన్న మనిషినే కీలక వ్యక్తిగా భావించవచ్చు. కీలక వ్యక్తి సాక్ష్యం చెప్పాక ఆయన అనుమానితుడా, నిందితుడా అనేది తేలుతుంది. ఈ కీలక వ్యక్తి ఎవరనే విషయమై ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్పటివరకూ ఈ కుంభకోణం దర్యాప్తులో కీలక వ్యక్తులుగా ప్రాచుర్యం పొందిన మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ ఫ్లిన్, ట్రంప్ ప్రచార నిర్వాహకుడు పాల్ మానాఫోర్ట్, విదేశాంగ విధాన సలహాదారు కార్టర్ పేజ్, రాజకీయ వ్యూహకర్త రోజర్ స్టోన్ ఇప్పుడు ప్రభుత్వ పదవుల్లో లేరు. మరి ఎవరీ కీలక వ్యక్తి అంటే, ట్రంప్ పెద్దల్లుడు, సీనియర్ సలహాదారు జారెడ్ కష్నర్ పేరు వినిపిస్తోంది. ఈ కీలక వ్యక్తిపై ఎఫ్బీఐ ఓ కన్నేసి ఉంచిందని కూడా ఈ పత్రిక వివరించింది. -
రికార్డుల్లో హ్యాట్రిక్
ముంబై: భారత్ ప్రధాన స్టాక్ సూచీలు వరుసగా మూడోరోజు రికార్డు గరిష్టస్థాయిలో ముగియడం ద్వారా హ్యాట్రిక్ సాధించా యి. రుతుపవనాలు త్వరితంగా రావడం, కార్పొరేట్ ఫలితాలు ప్రోత్సాహకరంగా వుండటంతో ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు బుధవారం కూడా కొనసాగింది. దాంతో బీఎస్ఈ సెన్సెక్స్ మరో 76 పాయింట్లు ఎగిసి కొత్త చరిత్రాత్మక గరిష్టస్థాయి 30,659 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 470 పాయింట్లు ఎగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ అదేబాటలో 13.50 పాయింట్లు పెరిగి 9,526 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అమెరికా ఎఫ్బీఐ చీఫ్ను ఆ దేశపు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా తొలగించడంతో ఏర్పడిన సంక్షోభం కారణంగా ప్రపంచ మార్కెట్లు ప్రతికూలధోరణిలో ట్రేడ్అయినా, భారత్ మార్కెట్ సానుకూలంగా ముగియడం విశేషం. టాటా స్టీల్ టాప్.... మంగళవారం మార్కెట్ ముగిసిన తర్వాత టర్న్ ఎరౌండ్ ఫలితాల్ని ప్రకటించిన టాటా స్టీల్ షేరు బుధవారం జోరుగా ర్యాలీ జరిపింది. 8 శాతం ర్యాలీ జరిపిన ఈ షేరు రూ. 493 వద్ద ముగిసింది. సెన్సెక్స్–30 షేర్లలో 17 షేర్లు పెరగ్గా, అత్యధికంగా లాభపడింది టాటా స్టీల్ షేరే. టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్లు 2.5 శాతం మేర పెరిగింది. ర్యాలీ పటిష్టంగా లేదు..:మార్కెట్ కొత్త రికార్డుస్థాయిల్ని తాకినప్పటికీ, బుధవారంనాటి ర్యాలీలో పటిష్టత కొరవడిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. అమెరికాలో ఏర్పడిన తాజా అనిశ్చితి ఫలితంగా ఇన్వెస్టర్లు కాస్త ఆచితూచి వ్యవహరించారని ఆయన అన్నారు. జీఎస్టీ రేట్లపై స్పష్టత ఇచ్చ కౌన్సిల్ సమావేశం రెండురోజుల్లో జరగనున్నందున, ఇన్వెస్టర్లు ఆ సమావేశంపై దృష్టి నిలిపారని ఆయన వివరించారు. కార్పొరేట్ ఫలితాలు ప్రోత్సాహకరంగా వుండటంతో విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు క్రితం రోజు రూ. 858 కోట్లు నికర కొనుగోళ్లు జరిపారు. ప్రపంచ మార్కెట్లు డౌన్.. ఎఫ్బీఐ చీఫ్ను అమెరికా అధ్యక్షుడు తొలగించిన నేపథ్యంలో అక్కడ ఏర్పడిన సంక్షోభం కారణంగా చాలావరకూ ఆసియా పసిఫిక్ మార్కెట్లు క్షీణించాయి. జపాన్ నికాయ్, ఆస్ట్రేలియా ఆల్ ఆర్డనరీస్, హాంకాంగ్ హాంగ్సెంగ్, సింగపూర్ స్ట్రయిట్టైమ్స్, తైవాన్ తైపీ సూచీలు 1 శాతం వరకూ నష్టపోయాయి. యూరప్లోని ప్రధాన మార్కెట్ సూచీలు బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ, జర్మనీ డాక్స్, ఫ్రాన్స్ కాక్లు కూడా 1 శాతం మేర నష్టపోయాయి. అమెరికా సూచీలు కూడా 1 శాతం గ్యాప్డౌన్తో మొదలయ్యాయి. ఇంత భారీ గ్యాప్డౌన్తో అమెరికా మార్కెట్ ప్రారంభంకావడం గత కొద్ది వారాల్లో ఇదే ప్రధమం. -
ట్రంప్ తొలగింపునకు సమయం ఆసన్నమైందా?
-
ట్రంప్ తొలగింపునకు సమయం ఆసన్నమైందా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలగింపునకు సమయం దగ్గరపడుతోందా?. అమెరికన్ పత్రికల్లో వస్తున్న సంచలన కథనాలు ట్రంప్ త్వరలోనే ఉద్వాసనకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న రష్యా అధికారులతో దేశానికి చెందిన రహస్య సమాచారాన్ని ట్రంప్ పంచుకున్నారని వాషింగ్టన్ పోస్టులో ఓ రిపోర్టు వచ్చింది. దీన్ని తొలుత వైట్హౌస్ తోసి పుచ్చింది. తర్వాత స్వయంగా ట్రంపే.. ఐతే తప్పేంటి. దేశాధ్యక్షుడిగా ఉగ్రవాదంపై మిత్ర దేశానికి సమాచారం ఇవ్వడంలో తప్పులేదని తనను తాను సమర్ధించుకున్నారు. తాజాగా మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లైన్పై విచారణను నిలిపివేయాలని ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీని ట్రంప్ కోరినట్లు న్యూయార్క్ టైమ్స్ సంచలన వార్తను ప్రచురించింది. డైరెక్టర్ పదవి నుంచి తప్పించకముందు వరకూ ట్రంప్, ఫ్లైన్ల మధ్య జరిగిన పూర్తి సంభాషణల వివరాలు కామీ వద్ద ఉన్నాయని పేర్కొంది. అయితే, కామీ రాసుకున్న నోట్స్ తమ చేతిలో లేదని.. ఓ సోర్స్ ద్వారా కామీ నోట్స్ను పూర్తిగా చదివినట్లు రిపోర్టులో పేర్కొంది. ఫిబ్రవరి 14న జరిగిన ఓ సమావేశంలో కామీని కలుసుకున్న ట్రంప్.. 'ఫ్లైన్ మంచివాడు, అతని వదిలేస్తావని ఆశిస్తున్నా' అని మాట్లాడినట్లు చెప్పింది. మహాభియోగం తప్పదా? కథనంపై స్పందించిన వైట్ హౌస్.. అధ్యక్షుడిపై అసత్య ప్రచారం చేయడం తగదని వ్యాఖ్యానించింది. జనరల్ ఫ్లైన్ దేశ రక్షణ కోసం ఎంతో కృషి చేశారని చెప్పింది. ఫ్లైన్పై విచారణను నిలిపివేయాలని అధ్యక్షుడు ట్రంప్ కామీ లేదా మరే ఇతర వ్యక్తిని కోరలేదని పేర్కొంది. కాగా, ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారని.. కానీ కొద్ది రోజులకే రాజద్రోహం కింద అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతారని ప్రొఫెసర్ అలన్ లిట్చ్మన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఓ పత్రికకు ఇంటర్వూలో ఇచ్చిన లిట్చ్మన్ ట్రంప్పై మహాభియోగ తీర్మానం ప్రవేశపెడతారని పేర్కొన్నారు. -
ఈ విషయంలో ఎవరి సలహా తీసుకోలేదు
ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్కోమీ తొలగింపు తప్పదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి వాషింగ్టన్: న్యాయవ్యవస్థ సూచనలతో సంబంధంలేకుండా తనకున్న విశిష్ట అధికారాలను వినియోగించి ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీని విధుల నుంచి తొలగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వైట్హౌస్ వర్గాలు మాత్రం అత్యున్నత న్యాయాధికారుల సలహా మేరకే అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ట్రంప్ మాట్లాడుతూ కోమీని విధుల నుంచి తొలగించేందుకు తాను ఎవరి సలహా తీసుకోలేదని తెలిపారు. అటార్నీ జనరల్ జెఫ్ సెసన్స్, డిప్యూటీ అటార్నీ జనరల్ రాడ్ రోషెన్ స్టెయిన్లతో సోమవారం సమావేశమైన ట్రంప్ కోమీ తొలగింపునకు గల కారణాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారని వైట్హౌస్ వెల్లడించింది. తాను ఎఫ్బీఐ దర్యాప్తు పరిధిలో ఉన్నానా? అని కోమీని అనేక మార్లు ప్రశ్నించానని అందుకు ఆయన లేదని బదులిచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. కోమీని ప్రభావితం చేయడానికి, అతనిపై ఒత్తిడి తేవడానికీ ఎన్నడూ ప్రయత్నించలేదని ట్రంప్ అన్నారు. ఎఫ్బీఐ మాజీ చీఫ్పైన కూడా ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఆయన్ని ఒక షోబోట్గా అభివర్ణించారు. అత్యున్నత దర్యాప్తు సంస్థ సమగ్రతను ఆయన చెడగొట్టారని అభిప్రాయపడ్డారు. ఏడాది క్రితం నాటికి ఎఫ్బీఐ సంక్షోభంలో ఉందన్న విషయం మనందరికీ తెలిసిందేనని, ఈ ఏడాది సమయంలో అది ఏమాత్రం మెరుగుపడలేదని అన్నారు. కోమీ అధికారుల విశ్వాసాన్ని కోల్పోయారని ఎఫ్బీఐ తాత్కాలిక డైరెక్టర్ ఆండ్రూ మెక్క్యాబ్ వెల్లడించిన కాసేపటికే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ బృందం రష్యాతో కుమ్మక్కయిందనే ఆరోపణలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
ఎఫ్బీఐ డైరెక్టర్ ఉద్వాసనకు కారణం ఏమిటి?
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయడానికి రష్యా నిర్వహించిన పాత్రపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఎఫ్బీఐ) డైరెక్టర్ జేమ్స్ కోమీ దర్యాప్తు చేస్తున్న తీరు నచ్చకపోవడం వల్లే అమెరికా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనకు ఉద్వాసన పలికారని స్పష్టమౌతోంది. ఈ దర్యాప్తునకు చెప్పుకోదగ్గ మొత్తంలో నిధులు, సిబ్బందిని కేటాయించాలని ఫెడరల్ న్యాయశాఖను తన తొలగింపునకు కొద్ది రోజుల ముందు కోమీ కోరారని అమెరికా మీడియా వెల్లడించింది. మెజారిటీ పాలకపక్షమైన రిపబ్లికన్పార్టీ సభ్యలతో నిండిన సెనేట్, హౌస్ కమిటీలు కూడా ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నప్పటికీ, ఎఫ్బీఐ తన దృష్టిని ట్రంప్ టీమ్తో రష్యాకున్న లింకులపై కేంద్రీకరించడం అధ్యక్షుని ఆగ్రహానికి కారణమైంది. ఎన్నికల ప్రచారంలో రష్యా జోక్యంపై సాగుతున్న దర్యాప్తును తాను పర్యవేక్షిస్తున్నానని మార్చిలో కోమీ ధ్రువీకరించాక ఆయనను తొలగించడంతో ట్రంప్కు ఈ దర్యాపును సక్రమంగా ముగించడం ఇష్టంలేదని తేలిపోయింది. మార్చి 20న హౌస్ ఇంటెలిజన్స్ కమిటీ ముందు హాజరైన కోమీ, ‘‘ఎఫ్బీఐ రష్యా జోక్యంపైనేగాక, ట్రంప్ ప్రచార బృందం రష్యాతో కుమ్మక్కయిందా? అనే విషయంపై కూడా దర్యాప్తు జరుపుతోంది’’అని చెప్పిన మాటలు కోమీకి ఉద్వాసన పలకాల్సిందేనని అధ్యక్షుడు నిర్ణయించుకోవడానికి కారణమయ్యాయి. ఎన్నికల సమయంలో ట్రంప్ టవర్ ఫోన్లను ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ట్యాపింగ్ చేయించారనడానికి సాక్ష్యాధారాలు లేవని కూడా అదే సందర్భంలో కోమీ అన్న మాటలు ట్రంప్కు చిర్రెత్తించాయి. అయితే, రష్యాతో తన శిబిరానికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేయడం వల్లే కోమీని తొలగించారనే మాటకు విలువలేకుండా చేయడానికే ట్రంప్, ‘‘నాపై దర్యాప్తు జరపడం లేదని మూడు వేర్వేరు సందర్భాల్లో మీరు నాకు చెప్పడం ఎంతో అభినందనీయం.’’ అని కామీని ప్రశంసిస్తూనే పదవి నుంచి తొలగించారు. ట్రంప్పై మెకెయిన్ నిప్పులు ఎన్నికల ప్రచారంలో రష్యా జోక్యంపై ప్రత్యేక కాంగ్రెషెనల్ కమిటీతో దర్యాప్తు జరిపించాలని తానెప్పటి నుంచో కోరానని, ఇలాంటి కమిటీని తక్షణమే నియమించాల్సిన అవసరం ఉందని ఎఫ్బీఐ ఛీఫ్ తొలగింపు నిరూపిస్తోందని రిపబ్లికన్ సీనియర్ సెనేటర్ జాన్ మెకెయిన్ చెప్పారు. అయితే, ఏడాదిగా రష్యా పాత్రపై కాంగ్రెస్ విచారణ సాగుతోందనీ, ముందుకు సాగని ఈ దర్యాప్తునకు వెంటనే స్వస్తి పలికితే మంచిదని, అమెరికన్లు కోరుకుంటున్న విషయాలపై ఇక దృష్టి పెట్టడం మంచిదని వైట్హౌస్ ప్రతినిధి సారా హకబీ శాండర్స్ మంగళవారం ఓ టీవీ చానల్తో మాట్లాడుతూ చెప్పిన మాటల్లో నిజం లేదు. ఎందుకుంటే, ఇంతవరకూ ఈ వ్యవహారంపై కాంగ్రెస్ దర్యాప్తు ప్రారంభమే కాలేదు. రెండోది, రష్యా జోక్యంపై అత్యధిక ప్రజానీకం విచారణ జరపాలని కోరుతోంది. మరో ముఖ్యాంశం ఏమంటే, రష్యన్ల జోక్యంపై ఎఫ్బీఐ దర్యాప్తు ఇటీవల జోరందుకుంది. ఈ కుంభకోణంపై కోమీ ఇటీవల రోజూవారీగా నివేదికలు అందకుంటున్నారు. అంతకు ముందు వీక్లీ రిపోర్టులు ఆయనకు వచ్చేవి. ఈ పరిస్థితులే ట్రంప్ ఆగ్రహానికి, చివరికి కోమీ ఉద్వాసనకు దారితీశాయని అమెరికా ప్రధాన మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. వాటర్గేట్ ఛాయలు రష్యాపాత్రపై దర్యాప్తుపై కొత్త డైరెక్టర్ పర్యవేక్షణ ఉంటుందా? అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ జవాబివ్వకపోవడం కూడా ఈ దర్యాప్తును నీరుగార్చుతారనే అనుమానాన్ని బలపరుస్తోంది. 1972 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా వాషింగ్టన్ డీసీలోని వాటర్గేట్ కాంప్లెక్స్–హోటల్లో జరిగిన డెమొక్రాటిక్ కన్వెన్షన్లో ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై(వాటర్గేట్ కుంభకోణం)దర్యాప్తునకు 1973లో ఓ ప్రత్యేక ప్రాసిక్యూటర్ను నియమించారు. ఆయన విచారణ ప్రారంభించిన వెంటనే ఆరోపణలెదుర్కొంటున్న అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ప్రాసిక్యూటర్ను తొలగించేశారు. దాంతో 1974లో నిక్సన్ రాజీనామాకు దారితీసిన పరిణామాలకు ప్రాసిక్యూటర్ ఉద్వాసన నాందీ పలికింది. ఇప్పటి ఎఫ్బీఐ డైరెక్టర్ తొలగింపు 1973నాటి పరిణామాలను గుర్తుచేస్తోంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ డిస్మిస్
-
ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ డిస్మిస్
► అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం ► సంస్థను ప్రభావితం చేసేందుకేనని విమర్శలు వాషింగ్టన్: సంచలనాలకు, వివాదాలకు కేంద్రంగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంలోని అత్యున్నత దర్యాప్తు విభాగమైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) డైరెక్టర్ జేమ్స్ కొమెను పదవి నుంచి తొలగించారు. ఈ విషయాన్ని ట్రంప్ నేరుగా కొమెకు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను కొమెకు పంపించారు. దీనిలో ‘మీరు బ్యూరోను సమర్థంగా నిర్వహించలేకపోతున్నారనే అమెరికా అటార్నీ జనరల్ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కొమెను డిస్మిస్ చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారని వైట్హౌస్ అధికార ప్రతినిధి సీన్ స్పైసర్ ప్రకటించారు. ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కొమెను తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా అటార్నీ జనరల్ జెఫ్ సెస్సన్స్, డిప్యూటీ అటార్నీ జనరల్ రాడ్ రోసెన్స్టెయిన్ సంయుక్తంగా ప్రెసిడెంట్కు లేఖ రాయడంతో, వారి వినతిని ట్రంప్ ఆమోదించారని సీన్ స్పైసర్ వెల్లడించారు. ఈనిర్ణయం తీవ్ర సంచలనం సృష్టించింది. సరైన సమాచారం ఇవ్వనందునే... రష్యాతో ట్రంప్నకు ఉన్న సంబంధాలపై ఎఫ్బీఐ విచారిస్తున్న సమయంలో ఆ సంస్థను ప్రభావితం చేసేందుకు తాజా చర్య తీసుకున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అయితే.. క్లింటన్ ఈ–మెయిల్స్ దర్యాప్తు అంశానికి సంబంధించి గతవారం కాంగ్రెస్కు సరైన సమాచారం ఇవ్వని కారణంగానే ఆయన్ను తొలగించినట్లు ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఎఫ్బీఐ డైరెక్టర్గా పదేళ్లు పదవిలో కొనసాగాల్సిన కొమె.. నాలుగేళ్లకే దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొమె స్థానంలో ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న ఆండ్రూ మెక్కాబెను యాక్టింగ్ డైరెక్టర్గా నియమించారు. ఇలా తొలగింపునకు గురైన డైరెక్టర్లలో కొమె రెండో వ్యక్తి. 1993లో ఎఫ్బీఐ డైరెక్టర్గా ఉన్న విలియమ్ ఎస్ సెషన్స్ను అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ తొలగించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై చేపట్టిన దర్యాప్తు ట్రంప్కు చుట్టుకుంటుందన్న భయంతోనే కొమెను తొలగించినట్లు సెనెట్ నాయకుడు చుక్ షుమెర్ ఆరోపించారు. -
నిఘా అప్పగిస్తే ఉగ్రవాదిని పెళ్లిచేసుకుంది
వాషింగ్టన్: నిఘా కోసం నియమిస్తే ఆ విషయం మరిచిపోయి ఓ ఉగ్రవాదిని పెళ్లి చేసుకుంది డానియెలా గ్రీనే అనే ఓ ఎఫ్బీఐ అధికారి. దీంతో అమెరికా ఎఫ్బీఐ ఉన్నతాధికారులు ఖిన్నులయ్యారు. ఎఫ్బీఐ అధికారులు మంగళవారం వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ధ్రువపత్రాల ప్రకారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈమెకు అత్యంత రహస్య భద్రత కూడా ఉంది. ఈ పత్రాల ప్రకారం జూన్ 2014న జర్మనీలోని తన తల్లిదండ్రులను చూసేందుకు బయలుదేరి వెళ్లిన ఆమె అక్కడికి వెళ్లకుండా టర్కీకి వెళ్లింది. టర్కీ సరిహద్దు గుండా వెళ్లి తాను వివాహం చేసుకోవాలనుకున్న ఐసిస్ ఉగ్రవాదిని కలిసింది. ఆ వెంటనే వివాహం చేసుకుంది. అయితే, అతడు ఎవరనే వివరాలు మాత్రం తెలియరాలేదు. అక్కడి మీడియా వర్గాల సమాచారం ప్రకారం అతడు డెనిస్ కస్పెర్ట్ అని తెలిసింది. డెనిస్ను 2015లో ఉగ్రవాదిగా అమెరికా గుర్తించింది. జర్మనీకి చెందిన ఐసిస్ ఉగ్రవాద గ్రూపుపై నిఘా నిర్వహించేందుకు ఎఫ్బీఐలో అనువాద విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఈ డానియెలాను నియమించారు. 2011లో అమెరికన్ను వివాహం చేసుకున్న ఆమె అనూహ్యంగా 2014లో మాయం అయింది. జూన్ నెలలో కనిపించకుండా పోయిన ఆమె అదే నెలలో ఉగ్రవాది డెనిస్ను వివాహం చేసుకుంది. అయితే, అది విషాదం అని తెలుసుకునేందుకు ఆమెకు ఎన్నో రోజులు పట్టలేదు. వెంటనే జూలై నెలలో తనకు తెలిసిన వ్యక్తికి తాను ఎంతో పెద్ద తప్పు చేశానని ఒక మెయిల్ పంపించింది. తన జీవితం ఎన్నిరోజులు ఇక్కడ మగ్గిపోతుందో తనకు అర్ధం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ మరో మెయిల్ చేసింది. యూఎస్ వస్తే తనను జీవితాంతం జైలులోనే ఉంచుతారని అయినా పర్వాలేదని పేర్కొంది. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని ఆగస్టు నెలలో అమెరికాకు రాగా అక్కడే అధికారులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె నేరాన్ని ఒప్పుకుంది. జరిగిన విషయాలన్నీ ఒప్పుకొని పోలీసులకు పూర్తి సహకారం అందించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కోర్టుకు చేరగా అవి తాజాగా వెలుగులోకి వచ్చాయి. స్కైప్ ద్వారా ఉగ్రవాదితో ఆమెకు సంబంధాలు ఏర్పడినట్లు తెలిపింది. ఆమె అన్ని నిజాలు చెప్పడంతో రెండేళ్ల జైలు శిక్ష వేశారు. -
ఎఫ్బీఐ మోస్ట్ వాటెండ్ లిస్ట్లో భద్రేష్
వాషింగ్టన్: భార్యను చంపి పరారీలో ఉన్న భారతీయ యువకుడి పేరును అమెరికా నేరపరిశోధక సంస్థ ఎఫ్బీఐ మోస్ట్వాంటెడ్ జాబితాలో చేర్చింది. గుజరాత్కు చెందిన భద్రేష్ కుమార్ చేతన్భాయ్ పటేల్ (26)ను పట్టిచ్చిన వారికి లక్ష అమెరికన్ డాలర్లు పారితోషికంగా అందజేస్తామని తెలిపింది. వివరాలివీ.. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ సమీపంలోని వీరంగామ్కకు చెందిన భద్రేష్కుమార్ చేతన్భాయి పటేల్, పాలక్(21)ను వివాహం చేసుకుని 2015లో అమెరికా చేరుకున్నారు. వారిద్దరూ మేరీలాండ్ రాష్ట్రం హనోవర్లో ఉన్న పటేల్ బంధువుల రెస్టారెంట్లో ఉద్యోగులుగా చేరారు. అయితే, భద్రేష్కుమార్ అమెరికాలో ఉండిపోవాలని అంటుండగా, అతని భార్య పాలక్ స్వదేశం వెళ్లిపోవాలని పట్టుబడుతోంది. దీనిపై ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెస్టారెంట్లోపల ఉన్న గదిలో వారి మధ్య గొడవ జరిగింది. కోపంతో ఉన్న భద్రేష్కుమార్ భార్యను తీవ్రంగా కొట్టటంతోపాటు కత్తితో పలుమార్లు పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రెండేళ్ల నుంచి వెతుకుతున్నా పోలీసులకు మాత్రం దొరకలేదు. అతడు అమెరికాలోనే ఉంటున్న పలువురు బంధువులు, పరిచయస్తుల వద్ద తలదాచుకుని ఉంటాడని, లేదా కెనడా వెళ్లిపోయి ఉంటాడని భావిస్తున్నామన్నారు. దీంతోపాటు కెనడా నుంచి తిరిగి ఇండియా వెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నట్లు తెలిపారు. అతని ఆచూకీ కోసం స్థానికుల నుంచి పలుమార్గాల్లో వివరాలు సేకరించామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశామని, ఫలితం లేకపోవటంతో మోస్ట్వాంటెడ్లిస్ట్లో అతని పేరు ఉంచినట్లు చెప్పారు. భద్రేష్కుమార్ ఆచూకీ తెలిపిన వారికి లక్ష అమెరికన్ డాలర్లు పారితోషికంగా అందజేస్తామని తెలిపింది. -
అసలు ట్రంప్కు పవర్ ఎలా? రంగంలోకి ఎఫ్బీఐ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యాకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయా? వారి మధ్య ఒప్పందాలు జరిగి ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడ్డారా? అవినీతి నేరాలకు ఒడిగట్టారా అనే విషయాలపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కామే బహిరంగంగా స్పష్టం చేశారు. ‘వారు(రష్యా) మా ప్రజాస్వామ్యాన్ని దెబ్బకొట్టాలని భావించారు. ఆమె(హిల్లరీ క్లింటన్)ను గాయపరిచారు. అతడి(డోనాల్డ్ ట్రంప్)కి సహాయం చేశారు’ అని కామే ఆరోపించారు. అదే సమయంలో ఎన్నికల సమయంలో అమెరికాకు చెందిన కొంతమంది ప్రత్యేకమైన పౌరుల ఫోన్లను ట్యాపింగ్ చేసే విషయాన్నిమాత్రం ఇప్పుడే చెప్పలేనని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రభావం చూపించారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు కూడా సామాన్యుల నుంచి అగ్రస్థానాల్లో ఉన్న సంస్థల అధిపతులకు కూడా నచ్చలేదు. ఈ నేపథ్యంలో అమెరికాలో గత ఏడాది(2016)నవంబర్ 8 జరిగిన ఎన్నికల్లో ట్రంప్తో కలిసి రష్యా ఏదైనా కుట్రలకు పాల్పడిందా అనే అంశంపై ఎఫ్బీఐ ఇప్పటికీ దర్యాప్తు చేస్తూనే ఉందని ఆయన ఓ ఇంటెలిజెన్స్కు స్పష్టం చేశారు. అంతేకాదు, అమెరికాలో ఎవరు అధ్యక్షుడు కావాలనే విషయంలో పుతిన్కు ఒక స్పష్టత ఉందని, అతడికి హిల్లరీ అధ్యక్షురాలు కావడం ఇష్టం లేదని, ట్రంప్ అధికారంలోకి రావాలని అతను నిర్ణయించుకున్నారని, ఆ ప్రకారమే ట్రంప్ అధికారంలోకి వచ్చాడని నేరుగా కామెంట్లు చేసి తాజాగా వివాదం రేపారు. దీనిపై అమెరికా అధ్యక్ష భవనం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. -
అమెరికా ఎన్నికలపై ఎఫ్బీఐ విచారణ
అమెరికా ఎన్నికలపై దర్యాప్తు చేయనున్నట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కూమీ సోమవారం ప్రకటించారు. ఎన్నికల్లో రష్యా ప్రభుత్వం పాత్ర ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు కూమీ తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రచారానికి, రష్యాకు ఏవైనా సంబంధాలు ఉన్నాయా? అనే అంశంపై కూడా విచారణ చేస్తామని పేర్కొన్నారు. అయితే ఏ విధంగా కేసు విచారణలో ముందుకు వెళ్తామనే అంశాలను ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. -
మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా..?
-
ఇండియన్ అమెరికన్ ఎంపీల తీవ్ర స్పందన
-
డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
-
కాన్సాస్ కాల్పులపై సత్య నాదెళ్ల స్పందన
-
తెలుగువారిపై కాల్పులు: స్పందించిన సత్య నాదెళ్ల
వాషింగ్టన్: తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న కాన్సాస్ కాల్పులపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. మన సమాజంలో ఇలాంటి మతిలేని హింసకు, మతవిద్వేషానికి తావులేదని పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధితులైన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి అండగా ఉంటానని ట్విట్టర్లో తెలిపారు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఓ శ్వేతజాతి ఉన్మాది జరిపిన కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్కూ గాయాలయ్యాయి. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్ బార్లో బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనను ఇప్పటికే భారత సంతతికి చెందిన అమెరికన్ చట్టసభ సభ్యులు ఖండించారు. -
ఇండియన్ అమెరికన్ ఎంపీల తీవ్ర స్పందన
వాషింగ్టన్: జాతి విద్వేషంతో శ్వేతజాతి ఉన్మాది భారతీయ ఇంజినీర్ శ్రీనివాస్ కుచిభోట్ల (32)ను దారుణంగా కాల్చిచంపిన ఘటనపై ఇండియన్ అమెరికన్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. శ్రీనివాస్ కుచిభోట్ల హత్యను తీవ్రంగా ఖండించారు. దేశంలో మతిలేని హింసకు తావులేదని తేల్చిచెప్పారు. 'కాన్సాస్లో జరిగిన కాల్పుల ఘటన తీవ్రంగా బాధ కలిగించింది. బాధితుల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. విద్వేషం విజయం సాధించకుండా చూడాల్సిన అవసరముంది' అని భారత సంతతికి చెందిన కాలిఫోర్నియా సెనేటర్ కమల్ హారిస్ ట్వీట్ చేశారు. 'కాన్సాస్ కాల్పులతో ఛిన్నాభిన్నమైన కుటుంబం గురించే నేను మథనపడుతున్నా. మతిలేని హింసకు మన దేశంలో తావులేదు. జరిగిన ఘోరంతో నా గుండె పగిలింది' అని కాంగ్రెస్వుమెన్ పరిమళ జయపాల్ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయురాలిగా పరిమళ జయపాల్ నిలిచిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి దేశంలో విద్వేష నేరాలు పెరిగిపోయాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాన్సాస్ నగరంలో జరిగిన కాల్పులను ఇండియన్ అమెరికన్ చట్టసభ సభ్యుడు రో ఖన్నా ఖండించారు. ఈ మతిలేని హింసలో బాధితులైన కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఓ శ్వేతజాతి ఉన్మాది జరిపిన కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్కూ గాయాలయ్యాయి. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్ బార్లో బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది -
మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా?
-
మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా?
మనది అమెరికానేనా.. మనం అమెరికాకు చెందిన వాళ్లమా? ఇక్కడ మనకు భద్రత ఉందా?.. ఇవి కన్సాస్లో శ్వేతజాతి ఉన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ కూచిభోట్ల భార్య సునయన దుమల అడిగిన ప్రశ్నలు. అమెరికాలో చోటుచేసుకున్న విద్వేష కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ కూచిభోట్ల ఉద్యోగం చేసే గార్మిన్ కంపెనీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన భార్య సునయన మాట్లాడారు. అమెరికాలో జరుగుతున్న కాల్పుల ఘటనలు తనను ఆందోళనకు గురిచేశాని, ఒకదశలో ఈ దేశంలో మనం ఉండగలమా? అని తన భర్తని అడిగితే.. ఏం కాదు అమెరికాలో మంచి రోజులు వస్తాయని ఆయన చెప్పేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. అమెరికాలో మైనారిటీలు, విదేశీయులపట్ల వివక్ష చూపుతున్న ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయని, మేం ఇక్కడి వాళ్లమేనా? అన్న సందేహాలు కలిగిస్తున్నాయని ఆమె అన్నారు. ఇప్పటికైనా ఈ విద్వేష నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అని ఆమె ప్రశ్నించారు. విద్వేష దారుణాలపై అమెరికా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన భర్తకు ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాకు వెళ్లిపోదామని తాను గతంలో ఎన్నోసార్లు చెప్పినా తన భర్త ఒప్పుకోలేదని ఆమె అన్నారు. ఇంత జరిగాక, ఇంకా అమెరికాలో ఉండటం అవసరమా? అని ఆమె వ్యాఖ్యానించారు. తమకు పిల్లలు కూడా లేరని, తన భర్త జ్ఞాపకాలే ఇప్పుడు తమకు మిగిలాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మృతుడు శ్రీనివాస్ కుటుంబానికి ఆదుకునేందుకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది. హుస్టన్లోని భారత కౌన్సెల్ జనరల్ అనుపమ రాయ్ ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. శ్రీనివాస్ కుటుంబానికి అన్ని విధాల సాయం చేసేందుకు కృషి చేస్తున్నారు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఓ శ్వేతజాతి ఉన్మాది జరిపిన కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్కూ గాయాలయ్యాయి. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్ బార్లో బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది\ -
డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
వాషింగ్టన్: అమెరికాలో విద్వేషపూరితంగా విదేశీయులపై తూటాలు పేలుతున్నా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరు ఏ మాత్రం మారలేదు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆవేశంతో యూఎస్ నేవీ మాజీ ఉద్యోగి జరిపిన కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన ఇంజినీర్ మరణించిన మరుసటిరోజు ట్రంప్ మరింత దురుసుగా ప్రవర్తించారు. కన్సర్వేటీవ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సీపీఏసీ)లో పాల్గొన్న ట్రంప్ ప్రసంగిస్తూ.. తానేమీ ప్రపంచానికి ప్రతినిధిని కాదని, కేవలం అమెరికాకు మాత్రమే అధ్యక్షుడిని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గన్ ఓనర్షిప్ రైట్స్ కోసం చర్యలు తీసుకుంటానని, అమెరికా పౌరుల రక్షణ కోసం పాటు పడతానని, అమెరికన్లకే ఉద్యోగాలు కల్పిస్తామని ఈ సందర్భంగా ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. అయితే ట్రంప్ గానీ, వైట్ హౌస్ గానీ కన్సాస్ కాల్పుల ఘటనపై ఎలాంటి ప్రకటన చేయలేదు. 'ప్రపంచమంతటా అన్ని దేశాలకూ కలిసి ఒకే గీతం ఉందా.. అదే విధంగా ఒకే రకమైన కరెన్సీ ఉందా.. ఒకే జెండా లాంటివి ఉన్నాయా' అని ట్రంప్ ప్రశ్నించారు. చికాగోలోని పలు ప్రాంతాల్లో తుపాకీ కాల్పుల్లో ఏడుగురు మృతిచెందడంపై ట్రంప్ ట్విట్టర్లో స్పందించారు. వారి మృతిపట్ల సంతాపం ప్రకటించారు. 'అసలు చికాగోలో ఏం జరుగుతుంది. పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. చికాగోకు ఇప్పుడు సహాయం అవసరం' అని ట్రంప్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ట్రంప్.. ఇతర దేశస్తులను అమెరికా నుంచి వెల్లగొట్టేందకు సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకుంటూ విదేశీయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ట్రావెల్ బ్యాన్, వీసా రూల్స్, జాబ్ రూల్స్ అంటూ ఏదో రకంగా విదేశీయులను వారి స్వస్తలాలకు పంపించేసి.. దేశ పౌరులతోనే అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశీయులపై ఎలాంటి దాడులు జరిగినా పట్టించుకునే ప్రసక్తే లేదని, కేవలం అమెరికా ప్రజల కోరకు మాత్రమే తాను పని చేయనున్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్థానికంగానూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. (జాతి వివక్షకు 'అధికారం' తోడైతే..) (‘కూచిబొట్ల’కు కొండంత అండ) శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు శ్రీనివాస్ కుటుంబానికి ఎన్ఆర్ఐల బాసట -
అమెరికాలో మళ్లీ విద్వేషపు తూటా పేలింది
-
విద్వేషపు తూటా!
- అమెరికాలో కాల్పుల ఉదంతం.. జాతి వివక్ష కోణంలో ఎఫ్బీఐ దర్యాప్తు - మృతుడు శ్రీనివాస్, గాయపడ్డ అలోక్రెడ్డి ఇద్దరూ హైదరాబాదీలే - తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ అమెరికన్ ఘాతుకం - వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్కూ గాయాలు - కాల్పులు జరిపిన పూరింటన్ అరెస్ట్.. నేవీ మాజీ ఉద్యోగిగా గుర్తింపు - విషాదంలో మునిగిపోయిన శ్రీనివాస్ కుటుంబం - ఘటనపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ దిగ్భ్రాంతి.. ‘మా ఉద్యోగాలు మాకే..’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో ఇచ్చిన నినాదం వెర్రితలలు వేస్తోందా? గద్దెనెక్కాక ఆయన తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు అమెరికాలో జాత్యహంకార భావజాలానికి మరింత ఊతమిస్తున్నాయా? కన్సాస్లో ఇద్దరు తెలుగు ఇంజనీర్లపై జరిగిన కాల్పుల ఘటన చూస్తుంటే ఇది నిజమేనని అన్పిస్తోంది! బార్లోకి వచ్చిన అమెరికన్.. జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ ఇంజనీర్లపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో అమెరికాలో ఉంటున్న భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హ్యూస్టన్/వాషింగ్టన్/హన్మకొండ/ సాక్షి, హైదరాబాద్: అమెరికాలో మళ్లీ విద్వేషపు తూటా పేలింది. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఆడమ్ పూరింటన్ అనే ఓ శ్వేతజాతి ఉన్మాది కాల్పులకు తెగబడ్డాడు. హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల అనే ఇంజనీర్ను పొట్టన పెట్టుకున్నాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్కూ గాయాలయ్యాయి. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్ బార్లో బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. కాల్పులు జరిపిన పూరింటన్ అమెరికా నేవీ మాజీ ఉద్యోగి అని గుర్తించారు. ఘటన జరిగిన 5 గంటల్లోనే మిస్సోరి ప్రాంతంలోని ఓ బార్లో అతడిని అరెస్టు చేశారు. మీరు నాకంటే ఎక్కువా..? హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్, మేడసాని అలోక్రెడ్డి అమెరికాలోని కన్సాస్ రాష్ట్రంలో ఉన్న ఓవర్ల్యాండ్ పార్క్లో నివసిస్తున్నారు. జీపీఎస్ వ్యవస్థలను తయారు చేసే గార్నిమ్ అనే సంస్థలో ఉద్యోగం నిర్వస్తున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. ఇద్దరూ కలసి బుధవారం రాత్రి అక్కడి ఒథాలే ప్రాంతంలోని ఆస్టిన్స్ బార్కు వెళ్లారు. కొంతసేపటి తర్వాత çపూరింటన్ అనే అమెరికన్ వారి వద్దకు వచ్చి వాదనకు దిగాడు. తాము (అమెరికన్లు) మేధావులమేనని, తమకు ప్రతిభ ఉన్నా విదేశాల వారి కారణంగా తమకు ఉద్యోగాలు రావట్లేదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘మీరు మా ఉద్యోగాలను కాజేస్తున్నారు. తక్షణం అమెరికా విడిచివెళ్లిపోండి. ఉగ్రవాదులు.. మీరు నాకంటే ఎలా ఎక్కువ? అమెరికాలో ఎందుకుంటున్నారు, ఏం చేస్తున్నారు..’అంటూ గొడవకు దిగాడు. దీంతో శ్రీనివాస్, అలోక్రెడ్డిలు బార్ మేనేజర్కు ఫిర్యాదు చేశారు. అక్కడికి వచ్చిన బార్ మేనేజర్, సిబ్బంది పూరింటన్ను బయటికి పంపేశారు. కొద్దిసేపటికే తిరిగొచ్చి.. బార్ నుంచి బయటికి వెళ్లగొట్టినా.. పూరింటన్ కొద్దిసేపటికి తుపాకీతో తిరిగి వచ్చాడు. ‘మా దేశం విడిచి వెళ్లిపోండి.. ఉగ్రవాదులారా..’ అని అరుస్తూ శ్రీనివాస్, అలోక్రెడ్డిలపై కాల్పులు జరిపాడు. శ్రీనివాస్ ఛాతీలో బుల్లెట్ దిగడంతో అక్కడే కుప్ప కూలిపోయారు. అలోక్కి తొడ భాగంలో తూటా దూసుకుపోయింది. ఈ సమయంలో అక్కడే ఉన్న ఇయాన్ గ్రిలట్ అనే మరో అమెరికన్.. పూరింటన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో అతడి చేతిపై బుల్లెట్ గాయమైంది. వారందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించగా.. శ్రీనివాస్ అప్పటికే మరణించారు. అలోక్రెడ్డి, ఇయాన్ గ్రిలట్లు చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక జాతి, మత విద్వేష నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ కాల్పుల ఘటన భారతీయ అమెరికన్లలో భయాందోళన నింపుతోంది. కాగా.. తమ ఏవియేషన్ ఇంజనీరింగ్ టీమ్లో పనిచేస్తున్న శ్రీనివాస్ కాల్పుల్లో మృతిచెందడం, అలోక్ గాయపడ్డం తమను కలచివేసిందని గార్మిన్ కంపెనీ తెలిపింది. 1.చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న అలోక్రెడ్డి 2.కుమారుడి మరణవార్త తెలిసి విలపిస్తున్న శ్రీనివాస్ తల్లిదండ్రులు 3.శ్రీనివాస్, అలోక్రెడ్డిపై కాల్పులు జరిగింది ఈ బార్లోనే.. శ్రీనివాస్ కుటుంబానికి వెల్లువలా సాయం.. శ్రీనివాస్ కూచిభొట్ల కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సహాయం చేసేందుకు చాలా మంది ముందుకొచ్చారు. ఆయన స్నేహితురాలు కవిప్రియ మథురమాలింగం సోషల్ మీడియాలో ఏర్పాటు చేసిన ‘గోఫండ్మి’పేజీ ద్వారా పలువురు అమెరికన్లు సహా దాదాపు 7,200 మంది 2,61,996 డాలర్ల (సుమారు రూ.కోటి 80 లక్షలు) సాయం అందించారు. శ్రీనివాస్ స్నేహశీలి అని, ఎవరినీ పల్లెత్తుమాట అనేవాడు కాదని అమెరికాలో ఆయన ఇంటి పొరుగువారు చెప్పారు. 1. ప్రణీత్ నేచర్స్ బౌంటీలోని శ్రీనివాస్ నివాసం 2. ఆర్కేపురంలోని అలోక్రెడ్డి నివాసం పదేళ్ల కింద అమెరికా వెళ్లి.. అమెరికాలో మరణించిన శ్రీనివాస్ తండ్రి కూచిభొట్ల మధుసూదనరావు ఐడీపీఎల్ విశ్రాంత ఉద్యోగి. వారు ఐదేళ్లుగా హైదరాబాద్ శివార్లలోని బాచుపల్లి మల్లంపేట గ్రామ పరిధిలో ఉన్న ప్రణీత్ నేచర్స్ బౌంటీ ఫేజ్–1లో నివసిస్తున్నారు. వారికి శ్రీనివాస్ తోపాటు పరశురామశాస్త్రి, సాయి కిశోర్ సంతానం. పరశు రామశాస్త్రి హైదరాబాద్లోనే స్థిరపడగా.. శ్రీనివాస్, సాయి కిశోర్ అమెరికాలో ఉంటున్నారు. శ్రీనివాస్ హైదరాబాద్ శివార్లలోని విద్యా జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీ రింగ్ చదివారు. పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి మాస్టర్స్ పూర్తి చేశారు. తొలుత అమెరికాలోని రాక్వెల్ కొలిన్స్ సంస్థలో సిస్టమ్స్ ఇంజనీర్గా పనిచేసి.. అనంతరం గార్నిమ్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరారు. శ్రీనివాస్కు నాలుగేళ్ల క్రితం హైదరాబాద్కే చెందిన సునయనతో వివాహం జరిగింది. వారికి ఇంకా సంతానం లేదు. శ్రీనివాస్ మరణవార్త విని వారి కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. స్నేహితుడితో కలసి.. అమెరికన్ కాల్పుల్లో గాయపడిన అలోక్ కుటుంబం హైదరాబాద్లోని చైతన్యపురి పరిధిలో ఉన్న ఆర్కే పురంలో నివసిస్తోంది. ఆయన తండ్రి మేడసాని జగన్మోహన్రెడ్డి, తల్లి రేణుక. వీరి స్వస్థలం వరంగల్ జిల్లా హన్మకొండలోని అడ్వొకేట్స్ కాలనీ. పదేళ్లుగా వారి కుటుంబం హైదరాబాద్లో నివాసం ఉంటోం ది. మిషన్ భగీరథ ప్రాజెక్టులో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న జగన్మోహన్రెడ్డికి ఇద్దరు కుమారులు అలోక్రెడ్డి, సురేందర్రెడ్డి. అలోక్రెడ్డి హైదరాబాద్ లోని వాసవి కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూని కేషన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2006లో అమెరికా వెళ్లి మాస్టర్స్ డిగ్రీ చేశారు. శ్రీనివాస్తో కలసి రాక్వెల్ కొలిన్స్ సంస్థలో పనిచేసిన ఆయన.. తర్వాత శ్రీనివాస్ మాదిరిగానే గార్నిమ్ సంస్థలో చేరారు. ప్రస్తుతం కో–ఆర్డినేటర్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అలోక్రెడ్డికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య దీప్తి అమెరికాలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆమె ప్రస్తుతం గర్భవతి. ఐదు గంటల్లోనే దుండగుడు అరెస్ట్.. ఎఫ్బీఐ దర్యాప్తు శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్రెడ్డిలపై కాల్పులు జరిపిన జాత్యహంకారి పూరింటన్ (51)ను అమెరికా పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. పూరింటన్పై హత్య (ఫస్ట్ డిగ్రీ మర్డర్), హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. కాల్పుల ఘటన జరిగిన తర్వాత ఐదు గంటల్లోనే దుండగుడిని పట్టుకోవడం గమనార్హం. కాల్పుల ఘటన తర్వాత మిస్సోరీలోని క్లింటన్లో ఉన్న ఓ బార్లో దాక్కున్న పూరింటన్ తాను తూర్పుఆసియా వాసులిద్దరిని చంపానని అక్కడి ఉద్యోగితో చెప్పాడని అమెరికన్ స్థానిక మీడియా పేర్కొంది. కాల్పుల ఘటనపై అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) కూడా దర్యాప్తు చేపట్టింది. ఈ ఘటన వెనుక జాతి వివక్ష కోణం ఉందా, లేదా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నామని కన్సాస్ నగరంలోని ఎఫ్బీఐ ప్రతినిధి ఎరిక్ జాక్స్ వెల్లడించారు. ఈ దుర్ఘటన జరిగిన బార్ను నిరవధికంగా మూసివేశారు. దుండగుడు అమెరికన్ నేవీ మాజీ ఉద్యోగి! కాల్పులు జరిపిన పూరింటన్ అమెరికా నావికాదళం మాజీ ఉద్యోగి అని స్థానిక మీడియా వెల్లడించింది. అతడి వద్ద పైలట్ లైసెన్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయని తెలిపింది. అతను ఒథాలేలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా పనిచేశాడని, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్లోనూ పనిచేసి 2010లో బయటికొచ్చాడని పేర్కొంది. మానవత్వమున్న మనిషిని.. దుండగుడిని అడ్డుకున్న అమెరికన్పై ప్రశంసలు కాల్పులు జరిపిన పూరింటన్ను ప్రాణాలకు తెగించి అడ్డుకున్న 24 ఏళ్ల అమెరికన్ యువకుడు ఇయాన్ గ్రిలట్కు ప్రశంసలు లభిస్తున్నా యి. ఒక అమెరికన్ జాతి విద్వేషంతో కాల్పులు జరపగా.. మరో అమెరికన్ మానవత్వంతో అడ్డుకోవడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. పూరింటన్ కాల్పులు మొదలుపెట్టడంతో టేబుల్ వెనక దాక్కున్న గ్రిలట్.. ఒక్కసారిగా విసురుగా వెళ్లి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడు అతడిపైనా కాల్పులు జరపడంతో.. గ్రిలట్ చేతి గుండా ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆస్పత్రిలో గ్రిలట్ను యూనివర్సిటీ ఆఫ్ కన్సాస్ హెల్త్ సిస్టమ్ ఇంటర్వూ్య చేసింది. అందు లో.. ‘సాటి మనిషి కోసం నేనేం చేయాలో అదే చేశాను. అతడు (బాధితుడు) ఎక్కడి వాడు, ఏ జాతి వాడదన్నది ముఖ్యం కాదు. మనమంతా మనుషులం. దుండగుడు మరొకరి వైపు వెళ్లకుండా ఏం చేయాలో అది చేశాను’ అని గ్రిలట్ పేర్కొన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటాం: కాల్పుల ఘటనపై సుష్మ దిగ్భ్రాంతి సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలో తెలుగువారిపై జాతి విద్వేష కాల్పుల పట్ల విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడు శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే అమెరికాలోని భారత రాయబారి నవతేజ్ సర్నాతో మాట్లాడానని, అక్కడి అధికారులు కన్సాస్కు చేరుకున్నారని ట్విటర్లో పేర్కొన్నారు. శ్రీనివాస్ భౌతిక కాయాన్ని హైదరాబాద్కు చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. కన్సాస్లో కాల్పులను ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఖండించింది. ఈ ఘటనపై అమెరికా దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని రాయబార కార్యాలయ అధికారి మ్యారికే కార్లసన్∙ పేర్కొన్నారు. కాగా, అమెరికాలో జాత్యహంకార దాడుల పట్ల సీపీఐ ఆందోళన వ్యక్తం చేసింది. జాత్యహంకారం, ట్రంప్ విధానాలపై పోరాడాలని అమెరికాలోని ప్రజాస్వామ్య శక్తులకు విన్నవించింది. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని కన్సాస్లో దుండగుడు ఇద్దరు తెలుగు విద్యార్థులపై కాల్పులు జరపడం, ఈ ఘటనలో ఒకరు మరణించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కాల్పుల ఘటనలో శ్రీనివాస్ కూచిభొట్ల అనే విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అలోక్ మేడసాని అనే విద్యార్థి గాయపడ్డారు. కన్సాస్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అలోక్కు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ జగన్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలి: కృష్ణమోహన్, శ్రీనివాస్ బంధువు ‘‘ఇప్పటికే అమెరికాలో నలుగురు జాత్యహంకార దాడుల్లో చనిపోయారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలి. శ్రీనివాస్ మృతదేహాన్ని మూడు, నాలుగు రోజుల్లో రప్పించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చారు..’’ తెలుగు ప్రజలు కలసికట్టుగా ఉండాలి: జగన్మోహన్రెడ్డి, అలోక్రెడ్డి తండ్రి ‘‘అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలంతా కలసికట్టుగా ఉండాలి. అమెరికా వాళ్లు పిచ్చివాళ్లలా మారిపోతున్నారు. ఏ విషయమైనా వారితో వాదించవద్దు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతోనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. భారత యువత పునరాలోచన చేసుకుని స్వదేశానికి తిరిగి రావాలి..’’ సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. (జాతి వివక్షకు 'అధికారం' తోడైతే..) (‘కూచిబొట్ల’కు కొండంత అండ) శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు శ్రీనివాస్ కుటుంబానికి ఎన్ఆర్ఐల బాసట -
చర్చిలపై దాడులకు ఐసిస్ సిద్ధం?
ఒకవైపు క్రిస్మస్, మరోవైపు కొత్త సంవత్సరం వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్న నేపథ్యంలో అమెరికాలోని చర్చిలపై ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు దాడులకు తెగబడే ప్రమాదం ఉందని ఎఫ్బీఐ హెచ్చరించింది. అమెరికాలో ఉన్న చర్చిలపై దాడులు మొదలుపెట్టాలంటూ ఇస్లామిక్ స్టేట్ తన సానుభూతిపరులకు ఆన్లైన్లో సందేశాలు పంపుతుండగా, వాటిని ఎఫ్బీఐ మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసింది. టర్కీలో రష్యా రాయబారిని ఒక ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది కాల్చి చంపి.. బెర్లిన్లో క్రిస్మస్ మార్కెట్లోకి ట్రక్కును పంపించి, డజను మందిని చంపిన తర్వాత.. ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యంపైనే గురిపెట్టినట్లు తెలుస్తోంది. జర్మనీ దాడి చేసింది తామేనని ఐసిస్ ప్రకటించుకుంది. తమకు అందిన సమాచారాన్ని ఎఫ్బీఐ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అయితే కచ్చితంగా ఎక్కడ దాడులు జరగొచ్చన్న విషయం గురించి మాత్రం రాష్ట్రాల అధికారులు ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. కాగా, జర్మనీ మార్కెట్లోకి ట్రక్కును తీసుకెళ్లి, పలువురిని తొక్కించి చంపేసిన ట్యునీషియన్ ఉగ్రవాది అనిస్ అమ్రీ... ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగిన పోలీసు కాల్పుల్లో హతమయ్యాడు. -
వేధింపుల కేసు: నటుడికి విముక్తి
లాస్ఏంజిల్స్: సొంత పిల్లలనే వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ టాప్ హీరో బ్రాడ్ పిట్కు భారీ ఊరట లభించింది. నటి ఏంజిలీనా జోలీతో విడిపోయే సందర్భంలో ఆమెపై ఉన్న కోపాన్ని బ్రాడ్ పిట్ పిల్లలపై ప్రదర్శించాడని, ప్రైవేట్ జెట్ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో చిన్నారులను వేధించాడని గత సెప్టెంబర్లో కేసు నమోదు అయింది. కాగా, వేధింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు లేకపోవడంతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్(ఎఫ్బీఐ) ఈ కేసు దర్యాప్తును పూర్తిగా నిలిపేసింది. ఈ మేరకు మంగళవారం ఎఫ్బీఐ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. అటు లాస్ఏంజిల్స్ కౌంటీ చైల్డ్ అండ్ ఫ్యామిలీ సర్వీసెస్ శాఖ కూడా నవంబర్ మొదటివారంలోనే బ్రాడ్ పిట్కు ఈ కేసులో క్లీన్చిట్ ఇవ్వడం గమనార్హం. 12 ఏళ్ల (10 ఏళ్ల సహజీవనం, రెండేళ్ల వైవాహిక) బంధానికి ముగింపు పలుకుతూ స్టార్ కపుల్స్ ఏంజిలీనా జోలీ, బ్రాడ్ పిట్లు గత సెప్టెంబర్లో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. భర్తతో కలిసుండే విషయంలో పునరాలోచన లేదన్న జోలి.. బ్రాడ్ పిట్ పిల్లల్ని వేధించాడని ఆరోపించారు. దీంతో ఆరుగురు పిల్లల(మాడెక్స్ జోలీ-పిట్, పాక్స్ జోలీ-పిట్, జహారా జోలీ-పిట్, షిలోహ్ జోలీ-పిట్, కవలలు కెనాక్స్ జోలీ-పిట్, వివీన్నె జోలీ-పిట్) సంరక్షణ బాధ్యత ఎవరికి అప్పగించాలనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఒకదశలో పిల్లల్ని తనకే అప్పగించాలని కోర్టులో పోరాటం చేసిన బ్రాడ్ పిట్.. కొన్ని హామీల మేరకు దిగొచ్చారు. ప్రస్తుతానికి ఆరుగురు పిల్లలూ మలీబులోని ఇంట్లో తల్లి జోలీతో కలిసి ఉంటున్నారు. -
ఎఫ్బీఐ వల్లే ఓడిపోయా
హిల్లరీ క్లింటన్ ఆరోపణ వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమికి ఎఫ్బీఐయే కారణమని డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆరోపించారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తన ఈమెరుుళ్ల వ్యవహారంపై దర్యాప్తును పునఃప్రారంభించాలని ఎఫ్బీఐ డెరైక్టర్ జేమ్స్ కామే నిర్ణరుుంచడం ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపిందరు. ‘ఇలాంటి ఎన్నికల్లో గెలవలేకపోవడానికి అనేక కారణాలు ఉంటారుు. మా విశ్లేషణ ప్రకారం కామే లేఖ వల్ల అనేక అనుమానాలు ప్రజలకు వచ్చారుు. ఇదే నా గెలుపును అడ్డుకుంది’ అని శనివారం డెమొక్రటిక్ పార్టీ నిధుల సమీకరణవేత్తలు, దాతలతో జరిగిన భేటీతో అన్నారు. ఎఫ్బీఐ డెరైక్టర్ ప్రకటన రానంత వరకూ విజయం తనవైపే ఉందని, అరుుతే విచారణను పునఃప్రారంభిస్తున్నట్టు ప్రకటించడంతో తారుమారైందని అన్నారు. సోషల్ మీడియా వల్లే నా గెలుపు: ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన రిప్లబికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన విజయానికి సోషల్ మీడియానే కారణమన్నారు. ట్విటర్, ఫేస్బుక్ లాంటి సోషల్మీడియా తన చారిత్రక గెలుపులో కీలక పాత్ర పోషించిందని సీబీఎస్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సోషల్మీడియా వల్ల తాను చెప్పింది ప్రజలకు సులువుగా చేరిందని, ప్రధాన మీడియా తనకు వ్యతిరేకంగా పనిచేసినా సోషల్మీడియా తనకు అండగా నిలిచిందని చెప్పారు. ప్రత్యర్థులు ఎక్కువ ఖర్చు చేసినా.. తాను తక్కువ ఖర్చు చేసినా.. సోషల్ మీడియాలో క్రియాశీలంగా ఉండటం వల్లే విజయం సాధించగలిగానని చెప్పారు. ట్రంప్కు ఫేస్బుక్, ట్వీటర్, ఇన్ట్రాగామ్ల్లో 28 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. హిల్లరీ చాలా స్మార్ట్..ట్రంప్:హిల్లరీ చాలా తెలివైన వారని ట్రంప్ ప్రశంసించారు. ఫలితాల అనంతరం హిల్లరీ తనకు మర్యాద పూర్వకంగా ఫోన్ చేశారని చెప్పారు. హిల్లరీ దయ, మర్యాద గల వ్యక్తి అని ప్రశసంల వర్షం కురిపించారు. ఫోన్ చేయడం ఇబ్బందైనా ఫలితాల తర్వాత ఫోన్ చేసి హిల్లరీ శుభాకాంక్షలు చెప్పగా ధన్యవాదాలు తెలిపానని, గట్టి పోటీ ఇచ్చారని తానన్నాని ట్రంప్ తెలిపారు. తానైతే ఫోన్ చేసేందుకు చాలా ఇబ్బంది పడేవాడినని చెప్పారు. హిల్లరీ భర్త కూడా మాట్లాడారని, ఎన్నికలు పోటాపోటీగా జరిగాయన్నారని వివరించారు. కాగా, ట్రంప్కు వ్యతిరేకంగా ఆదివారం నాలుగో రోజూ లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, చికాగో, వోర్సెస్టార్, మసాచుసెట్స్, లోవా నగరాల్లో నిరసనలు కొనసాగారుు. ముగ్గురు భారతీయ అమెరికన్ల గెలుపు అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు భారతీయ అమెరికన్లు గెలిచారు. కాలిఫోర్నియాలోని 27వ అసెంబ్లీ డిస్ట్రిక్ ఎన్నికల్లో శాన్జోస్ కౌన్సిల్మెన్గా డెమొక్రటిక్ అభ్యర్థి ఆష్ కల్రా విజయం సాధించారు. 52.4 శాతం ఓట్లు సాధించిన కల్రా కాలిఫోర్నియా అసెంబ్లీకి ఎన్నికై న తొలి భారతీయ అమెరికన్. రిపబ్లికన్ నీరజ్ అతానీ(25 ఒహయో 42వ అసెంబ్లీ డిస్ట్రిక్ట్కు తిరిగి ఎన్నికయ్యారు. ప్రత్యర్థిని 25% పారుుంట్ల తేడా ఓడించారు. నార్త్ కరోలినాలో జై చౌదురి(డెమోక్రటిక్) రాష్ట్ర సెనెట్కు ఎన్నికయ్యారు. న్యూజెర్సీలోని ఉడ్బ్రిడ్జ సిటీకౌన్సిల్కు వీరు పటేల్ ఎన్నికయ్యారు. -
సెన్సెక్స్ 189 పాయింట్ల ర్యాలీ
ఐదు రోజుల నష్టాలకు తెర క్లింటన్కు ఎఫ్బీఐ క్లీన్చిట్తో మార్కెట్లలో ఉత్సాహం ముంబై: ఎఫ్బీఐ క్లీన్చిట్తో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయావకాశాలు మెరుగుపడతాయన్న తాజా అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ర్యాలీ జరిపాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడంతో సెన్సెక్స్ 185 పాయింట్లు లాభపడి 27,458.99 వద్ద ముగియగా, అటు నిఫ్టీ సైతం 63 పాయింట్లు లాభపడి 8,497.05 వద్ద క్లోజయింది. గత వారం ఎన్నికల ముందస్తు అంచనాల్లో డోనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలోకి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు నష్టాలను చవిచూడటం తెలిసిందే. కానీ, ఎన్నికకు మరో రెండు రోజుల సమయం ఉందనగా... వ్యక్తిగత ఈ మెయిల్ వాడకం విషయంలో హిల్లరీ క్లింటన్పై నేరారోపణలు నమోదు చేసేందుకు ఎటువంటి ఆధారాలు లేవని ఎఫ్బీఐ క్లీన్చిట్ ఇవ్వడం ఇన్వెస్టర్లలో ఉత్సాహానికి దారి తీసింది. దీంతో స్పెక్యులేటర్లు తమ షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకునేందుకు మొగ్గు చూపడం ఈక్విటీ మార్కెట్ల ర్యాలీకి తోడ్పడింది. హిల్లరీకి ఎఫ్బీఐ క్లిన్చిట్ ఇవ్వడంతో మార్కెట్లు సానుకూలంగా స్పందించినట్టు జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. తుది పోరు విషయంలో ఆందోళనగా ఉన్న ఇన్వెస్టర్లు తాజా పరిణామంతో ఊపిరి పీల్చుకున్నారని చెప్పారాయన. ఫార్మా, బ్యాంకు స్టాక్స్లో షార్ట్ కవరింగ్ సైతం ర్యాలీకి మద్దతుగా నిలిచినట్టు చెప్పారు. గత ఐదు ట్రేడింగ్ దినాల్లో సెన్సెక్స్ 667 పాయింట్ల మేర నష్టపోయిన విషయం తెలిసిందే. క్యాపిటల్ గూడ్స మినహా అన్ని సూచీలు లాభాల్లోనే ముగియడం కొనుగోళ్ల ఉత్సాహాన్ని సూచిస్తోంది. రంగాల వారీగా చూస్తే మెటల్స్, హెల్త్కేర్ 2 శాతం చొప్పున, బ్యాంకెక్స్ 1.70 శాతం, రియల్టీ 1.50 శాతం, స్మాల్ క్యాప్ 1.19 శాతం, మిడ్ క్యాప్ 0.59 శాతం మేర లాభపడ్డాయి. కాగా, గత శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు నికరంగా రూ.343 కోట్ల మేర విక్రయాలు జరిపారు. 7 శాతం పెరిగిన లుపిన్ స్టాక్ ఎఫ్డీఏ తనిఖీలను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్టు ఫార్మా కంపెనీ లుపిన్ ప్రకటించడం ఆ షేరుకు కలసివచ్చింది. 7 శాతం లాభపడి బీఎస్ఈలో రూ.1,519 వద్ద ముగిసింది. ఎస్బీఐ 4 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 3.36 శాతం, ఐటీసీ 3 శాతం, టాటా స్టీల్ 2 శాతం, హీరో మోటో కార్ప్, అదానీ పోర్ట్స్ 2 శాతం మేర లాభాలను ఆర్జించాయి. టీసీఎస్ 2 శాతం, ఎల్అండ్టీ 1.34 శాతం, హెచ్యూఎల్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ ఒక శాతం వరకు నష్టపోయాయి. -
టోక్యో , ముంబై, పారిస్ అన్నీ ..
ముంబై : హిల్లరీ క్లింటన్ వర్సెస్ డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష రేసులో ని అనూహ్యమార్పులతో ప్రపంచ మార్కెట్లు కూడా అనూహ్యంగా స్పందిస్తున్నాయి. ఎఫ్బీఐ హిల్లరీకి క్లీన్ చిట్తో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు తమ ట్రెండ్ మార్చుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆసియా, యూరప్ మార్కెట్లు జోరును అందుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు నాలుగు సెషన్ల తర్వాత రీబౌండ్ అయ్యాయి. ఒక దశలో 300 పాయింట్లకు పైగా ఎగిసాయి. చివరికి సెన్సెక్స్ 185 పాయింట్లు ఎగసి 27,459 వద్ద , నిఫ్టీ కూడా 63 పాయింట్లు జంప్చేసి 8,497 వద్ద ముగిసింది. ప్రధానంగా ప్రభుత్వ బ్యాంకులు, ఫార్మా షేర్లలో కొనుగోళ్ల వెల్లువ సాగింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లాభాలతోపాటు ఫార్మా, మెటల్స్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ తదితర అన్ని రంగాలూ లాభపడ్డాయి. లుపిన్ టాప్ విన్నర్ గా నిలవగా, అరబిందో, హిందాల్కో, స్టేట్బ్యాంక్, బీవోబీ, ఐటీసీ, ఐసీఐసీఐ, భెల్, టెక్ మహీంద్రా, హీరో మోటో లాభాలతో ముగిశాయి. టీసీఎస్, టాటా మోటార్స్, ఇన్ఫ్రాటెల్, ఎల్అండ్టీ, హెచ్యూఎల్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ నష్టపోయాయి. పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ 16.5 శాతం పెరుగుదలతో మార్కెట్ లో ఆకర్షణగా నిలిచింది. వాల్ స్ట్రీట్ వరుసగా తొమ్మిది సెషన్లలో, భారతీయ మార్కెట్లలో గత ఐదు సెషన్లలోనూ నష్టాలను ఎదుర్కొన్నాయి. జపాన్లో, నిక్కి చేరింది 1.6 శాతం, వాల్ స్ట్రీట్ డౌ ఫ్యూచర్స్ లో 1.3 శాతం , యూరోపియన్ మార్కెట్లు దాదాపు 1.5 శాతం పెరగడం విశేషం.ప్రాథమికంగా ఒక సెంటిమెంట్ తో బలపడ్డ మార్కెట్ ట్రెండ్ అని గ్లోబల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్. సౌరభ్ జైన్ వ్యాఖ్యానించారు. అయితే బంగారం ధరలు మాత్రం వెలవెలబోయాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో 330 రూపాయలకు నష్టపోయిన పసిడి 10 గ్రా. రూ. 30,220 వద్ద ఉంది. రూపాయి 0.02 పైసల నష్టంతో 66.73 వద్ద ఉండగా, అటు డాలర్ కూడా బలహీన ట్రెండ్ లో ఉంది. -
6,50,000 ఈ-మెయిళ్లు చదివారా?
కేవలం ఎనిమిది రోజుల్లోనే డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ కు చెందిన ఆరున్నర లక్షల ఈ-మెయిళ్లను చదివారా? అంటూ అమెరికన్ అధ్యక్ష పదవి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ఆదివారం ఎఫ్ బీఐ డైరెక్టర్ ను ప్రశ్నించారు. మిచిగాన్ లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ట్రంప్ ఎఫ్ బీఐ డైరెక్టర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. (చదవండి: ఎన్నికల ముందు హిల్లరీకి భారీ ఊరట) హిల్లరీ అక్రమాలపై చాలా కాలం విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో దారుణ అక్రమాలకు పాల్పడిన ఆమెను ఎఫ్ బీఐ అధికారులు విడిచిపెట్టరని అన్నారు. కానీ, ప్రస్తుతం రిగ్గ్ డ్ సిస్టం ఆమెను రక్షిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు చాఫెజ్ కూడా క్లింటన్ ను నిర్దోషిగా ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. నేరాలకు పాల్పడిన హిల్లరీని అధ్యక్ష పీఠాన్ని అధిష్టించనివ్వకూడదని ట్రంప్ అమెరికన్లకు పిలుపునిచ్చారు. -
హిల్లరీకి క్లీన్చిట్: భారీలాభాల్లో స్టాక్ మార్కెట్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు క్రిమినల్ నేరారోపణల నుంచి భారీ ఊరట కల్పిస్తూ.. ఎఫ్బీఐ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఇన్నిరోజులు నష్టాల్లో నడిచిన దేశీయ స్టాక్ సూచీలు సోమవారం ఒక్కసారిగా భారీ లాభాల్లో ఎగిశాయి. 280 పాయింట్లకు ఎగిసిన సెన్సెక్స్, ప్రస్తుతం 239 పాయింట్ల లాభంతో 27,513వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 77 పాయింట్ల లాభంతో 8510గా ట్రేడ్ అవుతోంది. హిల్లరీ ప్రైవేట్ ఈ-మెయిల్ వాడకంపై పునఃవిచారణ చేపట్టిన ఎఫ్బీఐ, అమెరికా అధ్యక్ష ఎన్నికల చివరి దశలో ఆమెకు భారీ ఊరటనిచ్చింది. నేరారోపణల నుంచి హిల్లరీని బయటపడేసింది. దీంతో ట్రంప్ గెలుస్తాడనే ఊహాగానాలకు చెక్ పడింది. ట్రంప్ గెలుపు అవకాశాలతో ఆటుపోట్లకు గురైన స్టాక్ మార్కెట్లు ఎఫ్బీఐ ప్రకటనతో మళ్లీ హిల్లరీ గెలిచే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చాయి. దీంతో అటు అమెరికన్ స్టాక్ మార్కెట్లు, ఇటు ఆసియన్ మార్కెట్లు, దేశీయ సూచీలు లాభాల బాట పట్టాయి. ఈ ప్రకటనతో మెక్సికన్ పెసో భారీగా లాభపడింది. రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత విధానాలు ఆ దేశానికి ప్రతికూలంగా మారాయి. ఎఫ్బీఐ క్లీన్ చీట్తో హిల్లరీ గెలుపుకు మళ్లీ అంచనాలు బలపడి, మెక్సికన్ పెసో 1-1/2 వారాల గరిష్టానికి జంప్ అయింది. దేశీయ స్టాక్ మార్కెట్లో లుపిన్ 7 శాతం పెరిగింది, అదేవిధంగా సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్ లాభాల్లో నడుస్తున్నాయి. బలమైన క్యూ2 ఫలితాలతో పీఎన్బీ షేర్ 5 శాతం ఎగిసింది. అయితే దేశీయ కరెన్సీ రూపాయి, డాలర్ మారకం విలువతో పోల్చుకుంటే 4 పైసలు బలహీనపడింది. శుక్రవారం 66.70గా ముగిసిన రూపాయి, నేటి ట్రేడింగ్లో 66.74గా ప్రారంభమైంది. అమెరికా ఎకనామిక్ డేటా, డాలర్ ఇండెక్స్ రూపాయి బలపడటానికి సహకరించవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. -
ఎన్నికల ముందు హిల్లరీకి భారీ ఊరట
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్కు చిట్టచివరి నిమిషంలో భారీ ఊరట లభించింది. ఆమె గతంలో విదేశాంగ శాఖ మంత్రిగా ఉండగా ప్రైవేటు ఈ మెయిల్ వాడారన్న విషయమై విచారణ పూర్తయిందని.. హిల్లరీపై తాము ఎలాంటి నేరారోపణలు చేయబోవడం లేదని ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ తెలిపారు. దాంతో పోలింగ్కు మరొక్కరోజు ఉందనగా హిల్లరీకి ఇది భారీ ఊరటగా భావించవచ్చు. కాంగ్రెస్లోని కీలక సభ్యులకు ఈ మేరకు కామీ వర్తమానం పంపారు. మొత్తం ఈ మెయిళ్లను పరిశీలించేందుకు ఎఫ్బీఐ బృందం రోజుకు 24 గంటలూ పనిచేసిందని, చివరకు తాము జూలై నెలలో వ్యక్తపరిచిన అభిప్రాయంలో లెఆంటి మార్పు లేదని ఆయన అన్నారు. ప్రచారంలో చిట్టచివరిగా ముగిసిన 48 గంటల సమయంలో ఎఫ్బీఐ విచారణ లేకపోవడంపతో హిల్లరీ క్లింటన్కు ఇది మంచి ఆయుధంగా మారింది. ఒకవేళ హిల్లరీ ఈ ఎన్నికల్లో గెలిచి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడితే.. ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు ఆమెతో కలిసి ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేరారోపణలు మోపితేప తర్వాత ఇద్దరి మధ్య సయోధ్య ఎలా కుదురుతుందోనన్న అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి. కానీ కామీ తాజా ప్రకటన పుణ్యమాని ఇప్పుడు ఇక ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా పోయింది. ఇప్పుడు తాము సమర్పించింది మధ్యంతర నివేదిక ఏమీ కాదని, దర్యాప్తు మొత్తం పూర్తయిపోయినట్లేనని కూడా కామీ స్పష్టం చేయడంతో ఈ విషయంలో హిల్లరీ ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి అక్టోబర్ 28వ తేదీన కామీ చేసిన ఒక ప్రకటనతో ఒక్కసారిగా డోనాల్డ్ ట్రంప్ ఆధిక్యం పెరిగింది. అంతకుముందు వరకు ట్రంప్ మీద స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న హిల్లరీ క్లింటన్.. ఒక్కసారిగా కొంత వెనకబడ్డారు. ఒకానొక దశలో ట్రంప్ ఒకటి రెండు పాయింట్ల ఆధిక్యంలోకి కూడా వచ్చారు. ఇప్పుడు తాజాగా ఎఫ్బీఐ డైరెక్టర్ క్లీన్ చిట్ ఇవ్వడంతో హిల్లరీ మళ్లీ స్పష్టమైన ఆధిక్యం సాధించే అవకాశం కనిపిస్తోంది. -
వేడెక్కుతున్న అమెరికా రాజకీయాలు
-
వేడెక్కుతున్న అమెరికా ఎన్నికల రాజకీయాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఓ వైపు సమయం దగ్గర పడుతుండటంతో తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ విమర్శలు గుప్పించారు. ఈమెయిల్స్ వ్యవహారంలో ఆమె చేసిన తప్పిదాలకు హిల్లరీ క్రిమినల్ కేసు చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఓ ల్యాప్ టాప్ నుంచి పంపిన 65,000 ఈమెయిల్స్ ను హిల్లరీ భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పార్టీ సన్నిహితులు షేర్ చేసుకున్నారని ఎఫ్ బీఐ తన దర్యాప్తులో కనుగొన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. స్వీయ తప్పిదాలకు హిల్లరీ ఒక్కరే ఇందులో బాధితురాలు కాదని, అమెరికన్ ప్రభుత్వ తీరుతో ప్రజలందరూ ఈమెయిల్స్ కుంభకోణంలో బాధితులుగా మిగిలారని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఓర్లాండోలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ట్రంప్ మాట్లాడుతూ.. విఫలమైన ఓ నాయకురాలికి ఎవరైనా మద్ధతిస్తారా అని ఈ సందర్బంగా ప్రశ్నించారు. ఆమె గత తరం నాయకురాలు అని, భవిష్యత్తు కోరుకునే వాళ్లు తన వెంట ఉండాలని ట్రంప్ పిలుపునిచ్చారు. 'హిల్లరీ అందర్నీ బ్లేమ్ చేయాలనుకుంటున్నారు. ఆమె గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రసంగాలలో ఈ విషయం తేటతెల్లమయింది. ఎఫ్ బీఐ, అమెరికన్ కాంగ్రెస్ కు కూడా ఆమె ఎన్నో పర్యాయాలు అబద్ధాలు చెప్పారు. ఆమె హయాంలో 13 ఫోన్లు మాయం చేశారు. 33,000 వేల ఈమెయిల్స్ ను లేకుండా చేశారు. ఈ విషయాన్ని ఎవరూ నమ్మడం లేదు' అని ట్రంప్ పేర్కొన్నారు. -
ఎన్నికల వేళ ‘ఈమెయిళ్ల’ రచ్చ
-
ఎన్నికల వేళ ‘ఈమెయిళ్ల’ రచ్చ
- హిల్లరీ ఈమెయిళ్లపై మళ్లీ ఎఫ్బీఐ దర్యాప్తు - ఎఫ్బీఐ నిర్ణయంపై డెమోక్రాట్ల అనుమానాలు వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా మిగిలింది 9 రోజులే. ఇప్పటి వరకూ రేసులో దూసుకుపోతున్న డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు ఇటువంటి కీలక తరుణంలో ఎదురుదెబ్బ తగిలింది. హిల్లరీ ఈమెయిళ్ల వ్యవహారంపై దర్యాప్తును పునరుద్ధరించాలని తాజాగా ఎఫ్బీఐ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టించింది. హిల్లరీ 2009-2012 మధ్య విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ, వ్యక్తిగత ఈమెయిళ్లను పంపేందుకు ప్రైవేట్ సర్వర్ను వినియోగించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తును పునరుద్ధరిస్తున్నామంటూ ఎఫ్బీఐ డెరైక్టర్ జేమ్స్ కోమే టాప్ కాంగ్రెస్ నేతలకు లేఖ రాశారు. ఆ లేఖ అంశం రిపబ్లికన్ నాయకుడు మీడియాకు విడుదల చేసే వరకూ వైట్హౌస్కు, హోంశాఖకు తెలియదు. ఎఫ్బీఐ నిర్ణయం డెమోక్రటిక్ పార్టీని షాక్కు గురిచేసింది. అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉన్న తరుణంలో ఎఫ్బీఐ ఈ నిర్ణయం తీసుకోవడంపై వారు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై హిల్లరీ స్పందిస్తూ.. ఈమెయిళ్లకు సంబంధించి ఎఫ్బీఐ జూలైలో వచ్చిన నిర్ణయానికి తాజా దర్యాప్తులోనూ పెద్దగా వ్యత్యాసం ఉండకపోవచ్చన్నారు. దేశంలో ఓటింగ్ జరుగుతోందని, ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలియాలంటే అన్ని వివరాలను బహిర్గతం చేయాలని ఆమె ఎఫ్బీఐని కోరారు.. సర్వేలన్నింటిలోనూ తానే ముందున్నానని, ఈ వ్యవహారం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని తాను భావించడం లేదనిచెప్పారు. వాటర్గేట్ స్కామ్కంటే పెద్దది: ట్రంప్ ఈమెయిళ్ల వ్యవహారంపై రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇది వాటర్గేట్ కుంభకోణానికంటే పెద్దదని ఆరోపించారు. భారతీయ అమెరికన్ల ఓట్లు హిల్లరీకే: సర్వే న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడుతున్న డెమోక్రాట్ల అభ్యర్థి ిహ ల్లరీ క్లింటన్వైపు భారతీయ అమెరికన్లు భారీ సంఖ్యలో మొగ్గుచూపుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఆమె అధ్యక్షురాలు కావాలని, భారత్-అమెరికా సంబంధాలు ఆమె నాయకత్వంలో మరింత బలపడతాయని వారు భావిస్తున్నట్లు ఇండ్యూఎస్ బిజినెస్ జర్నల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సర్వే ప్రకారం. ఎన్నికలు ఇప్పుడే జరిగితే భారతీయ అమెరికన్లలో 79.43 శాతం మంది హిల్లరీకి, 14.89 శాతం మంది రిపబ్లికన్ల అభ్యర్థి ట్రంప్కు ఓటేస్తారు. హిల్లరీ ఈమెయిల్ హ్యాకింగ్ ఇలా ... అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ప్రచార నిర్వాహకుడు జాన్ పొడెస్టాకు చెందిన 50 వేల ఈ మెయిల్లు ఎలా హ్యాకింగ్ కు గురయ్యాయో తెలిసింది. ఇంతకాలం దీనికి రష్యా ప్రభుత్వం కారణమని భావిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ముందు మార్చి 19న పొడెస్టాకు హ్యాకర్లు గూగుల్ నుంచి ఓ మెయిల్ పంపారు. అందులో.. ఉక్రెయిన్లో ఎవరో పొడెస్టా జీమెయిల్ పాస్వర్డ్ను కొట్టేశారని, లాగిన్ కావడానికి విఫలయత్నం చేశారని ఉంది. పాస్వర్డ్ను మార్చుకొమ్మని ఓ వెబ్సైట్ను కూడా సూచించారు. పొడెస్టా కింది ఉద్యోగి ఈమెయిల్ను క్లింటన్ ప్రచార ఆపరేషన్స్ హెల్ప్ డెస్క్కు పంపించారు. దానికి అక్కడి ఉద్యోగి చార్లెస్ డేలావాన్ ‘ఇది సక్రమ మెయిలే. జాన్ తన పాస్వర్డ్ను తక్షణమే మార్చుకోవాలి’ అని 25 నిమిషాల తరువాత బదులిచ్చారు. పొడెస్టా పాస్వర్డ్ను మార్చకోవాలన్న లింకు వాస్తవానికి నెదర్లాండ్స్లోని కంప్యూటర్ను సూచించింది. దాని వెబ్ అడ్రస్ న్యూజిలాండ్లోని టోక్లీయా అనే ప్రాంతం పేరు మీద ఉంది. పొడవైన ఆన్లైన్ చిరునామాలను సూక్ష్మరూపంలో వ్యక్తం చేసే ఓ సర్వీసు ద్వారా హ్యాకర్లు ఈ లింకు నిజస్వరూపాన్ని దాచిపెట్టారు. ‘పొడెస్టా పాస్వర్డ్ను కొట్టేశారని’ చెప్పిన ఉక్రెయిన్ హ్యాకర్ ఇంటర్నెట్ అడ్రస్ను కూడా హ్యాకర్లు ఈమెయిల్లో పొందుపరిచారు. ఆ అడ్రస్ ఉక్రెయిన్లోని ఓ మొబైల్ కమ్యూనికేషన్ ప్రొవైడర్దని తెలిసింది. ఆ తరువాత పొడెస్టా ఎలా స్పందించారో తెలియదు కానీ ఐదు నెలల తరువాత హ్యాకర్లు అతని ఖాతాల నుంచి వేల కొలది ఈమెయిళ్లను విజయవంతంగా డౌన్లోడ్ చేశారు. -
11 రోజుల్లో ఎన్నికలు.. హిల్లరీకి ఎదురుదెబ్బ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షపదవి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ తన ఈ-మెయిళ్లపై ఇప్పటివరకూ జరిగిన విచారణలోని వాస్తవాలను బయటపెట్టాలని శుక్రవారం ఎఫ్ బీఐను కోరారు. ప్రస్తుతం దేశంలో ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరికీ ఈ విషయాలు తెలియాలని ఐయోవాలోని ఓ సమావేశంలో అన్నారు. కొత్త ఈ-మెయిళ్లను కూడా పరిశీలిస్తున్నామని ఎఫ్ బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ చెప్పిన కొద్ది సమయంలో హిల్లరీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కొత్తగా బయటకు వచ్చిన ఈ-మెయిళ్లు ఆంథోని వీనర్-వీనర్ కంపెనీకు చెందినవిగా ఎఫ్ బీఐ గుర్తించింది. ఈ కంపెనీ ఓనర్ గతంలో న్యూయార్క్ డెమొక్రటిక్ పార్టీ నేత. మైనర్ బాలికపై లైంగిక దాడులు చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చిన తర్వాత పార్టీ నుంచి పక్కకు తప్పుకున్నారు. దాదాపు ఏడాది కాలం పాటు హిల్లరీ ఈ-మెయిళ్లపై విచారణ చేసిన ఎఫ్ బీఐ ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దీంతో న్యాయశాఖ విచారణను నిలిపివేసింది. అయితే తాజాగా బయటపడిన ఈ-మెయిళ్ల కారణంగా మొత్తం కేసును ఎఫ్ బీఐ మళ్లీ తెరచింది. మరో 11 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో ఎఫ్ బీఐ హిల్లరీపై కేసును తెరవడంపై డెమొక్రటిక్ ల శిబిరంలో ఆందోళన నెలకొంది. తొలుత కేసును మూసేసిన ఎఫ్ బీఐ మరలా తెరవడంపై డెమొక్రటిక్ లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ బీఐ దురుద్దేశంతోనే కేసును తెరుస్తున్నట్లు భావిస్తున్నారు. కాగా, హిల్లరీ ఈ-మెయిళ్ల కేసును రీ ఓపెన్ చేయడాన్ని అధ్యక్ష పదవి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ స్వాగతించారు. చివరకు న్యాయం జరగబోతోందని వ్యాఖ్యానించారు. న్యూ హంప్ షైర్ లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఆయన మద్దతుదారులు 'ఆమెను జైల్లో వేయండి' అంటూ నినాదాలు చేశారు. తప్పును సరిదిద్దుకునేందుకు ముందుకు వచ్చిన న్యాయశాఖ, ఎఫ్ బీఐలపై తనకు గౌరవముందని ట్రంప్ అన్నారు. -
కాల్సెంటర్ స్కామ్ 2 వేల కోట్లపైనే
-
కాల్సెంటర్ స్కామ్ 2 వేల కోట్లపైనే
► అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ వెల్లడి ► ఎఫ్బీఐ అదుపులో హైదరాబాదీ భోగవల్లి నరసింహ ► టెక్సాస్ రాష్ట్రం ఇర్వింగ్ను చిరునామాగా పేర్కొన్న భోగవల్లి ► ఐఆర్ఎస్ ఏజెంట్ల పేరిట బెదిరింపులు, ఆపై వసూళ్లు ► అతని ఖాతాల్లో కోట్లు జమచేసిన అమెరికన్లు ► నగదును భారత్కు బదిలీ చేశాడంటూ ఎఫ్బీఐ అభియోగాలు వాషింగ్టన్, డల్లాస్: భారత్ కేంద్రంగా సాగిన కాల్సెంటర్ కుంభకోణం విలువ రూ. 2 వేల కోట్లకు పైనేనని అమెరికా అధికారులు నిర్ధారించారు. ఐదు కాల్ సెంటర్లు వేలాది మంది అమెరికా పౌరులను మోసం చేసి ఈ మొత్తాన్ని అక్రమంగా వసూలు చేశాయని, దొంగిలించాయని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ జే జాన్సన్ తెలిపారు. ఈ కేసులో ఇంతవరకూ అమెరికాలో 20 మంది అరెస్టు కాగా, అందులో భారతీయులే అధికంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. హెచ్ గ్లోబల్, కాల్మంత్ర, వరల్డ్వైడ్ సొల్యూషన్స్, జోరియన్ కమ్యూనికేషన్స్, శర్మ బీపీవో సర్వీసెస్ పేరుతో కాల్సెంటర్ల నుంచి ఈ ఫోన్కాల్స్ వెళ్లాయని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేశాయి. మరోవైపు ఈ కుంభకోణంలో రోజుకో కొత్త అంశం వెలుగు చూస్తోంది. కీలక సూత్రధారుల్లో ఒకరైన హైదరాబాద్కు చెందిన భోగవల్లి నరసింహ(50)ను ఎఫ్బీఐ అధికారులు గురువారం అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల ద్వారా నగదు కార్యకలాపాలు నిర్వహించాడంటూ ఎఫ్బీఐ అతనిపై కేసు నమోదు చేసి టెక్సాస్ రాష్ట్రం నార్తర్న్ జిల్లా మెజిస్ట్రేట్ న్యాయమూర్తి ముందు హాజరుపర్చింది. ఈ మేరకు నార్తర్న్ జిల్లా అటార్నీ శుక్రవారం ప్రకటన విడుదలచేశారు. ఎఫ్బీఐ వెల్లడించిన వివరాల మేరకు... అమెరికాకు చెందిన ఆదాయపు పన్ను వసూలు విభాగం ఐఆర్ఎస్(ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్) ఏజెంట్లుగా పేర్కొంటూ కొందరు వ్యక్తులు అమెరికాలో పలువురికి ఫోన్లు చేసి బెదిరించారు. పన్ను చెల్లింపుల్లో లొసుగులున్నాయని, అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయంటూ భయపెట్టేవారు. జరిమానా చెల్లించకపోతే జైలుకు పంపుతామంటూ ఐఆర్ఎస్ పేరిట హెచ్చరించారు. మనియార్డర్లు, నగదును తాము పేర్కొన్న బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలంటూ వందలాది మందిని మోసగించారు. ఈ బ్యాంకు ఖాతాల్లో కొన్నింటిని భోగవల్లి నియంత్రించేవాడని ఎఫ్బీఐ వెల్లడించింది. వెంటనే ఐఆర్ఎస్కు డబ్బు చెల్లించకపోతే... గంటల వ్యవధిలో అరెస్టు చేస్తామని హెచ్చరించి కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ డబ్బును భోగవల్లి హవాలా మార్గంలో భారత్కు పంపేవాడు. మోసంలో మూడు ఖాతాల వినియోగం బ్యాంక్ ఆఫ్ అమెరికాకు చెందిన రెండు ఖాతాల్ని ఈ మోసంలో భోగవల్లి వినియోగించాడు. అందులో ఒకటి టెక్డైనమిక్స్ ఇండస్ట్రీస్ పేరిట, రెండోది టచ్స్టోన్ కమోడిటీస్ ఇండస్ట్రీస్ పేరిట ఉంది. భోగవల్లి వాడిన ఇతర ఖాతాల్లో టచ్స్టోన్ కమోడిటీస్ పేరిట ఉన్న సిటీ బ్యాంకు అకౌంట్ కూడా ఉంది. నవంబర్ 5, 2014– ఫిబ్రవరి 2, 2015 మధ్య దాదాపు 242 సార్లు భోగవల్లికి చెందిన బ్యాంక్ ఆఫ్ అమెరికా ఖాతాకు నగదు జమైనట్లు గుర్తించారు. వాటి మొత్తం విలువ రూ. 11.29 కోట్లు. ఈ మొత్తంలో 2,250 ప్రత్యేక మనియార్డర్లు కూడా ఉన్నాయి. అలాగే జనవరి 16, 2015–జనవరి 30, 2015 మధ్య దాదాపు 60 మనియార్డర్లు (రూ. 25.81 లక్షలు) మరో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఖాతాలో జమయ్యాయి. నవంబర్ 4, 2014– ఫిబ్రవరి 5, 2015 మధ్యలో దాదాపు 128 మనియార్డర్లు (రూ.65.76 లక్షలు) సిటీ బ్యాంక్ ఖాతాకు చేరాయి. ఈ ఖాతాల్లో నగదును భోగవల్లి... తన నియంత్రణలోని ఇతర ఖాతాలకు బదిలీ చేసేవాడు. వాటిని ఖర్చుపెట్టడం లేదా భారత్తో పాటు ఇతర దేశాల్లో ఖాతాలకు బదిలీ చేసేవాడు. రెండు కంపెనీలకు అధినేతగా భోగవల్లి రికార్డుల ప్రకారం భోగవల్లి టెక్సాస్ రాష్ట్రంలోని ఇర్వింగ్ పట్టణం చిరునామాతో టచ్స్టోన్ కమోడిటీస్కు డైరక్టర్గా వ్యవహరిస్తున్నాడు. టచ్స్టోన్ కమోడిటీస్ ద్వారా ఎగుమతులు, దిగుమతులు వ్యాపారం చేస్తున్నట్లు వెబ్సైట్లో అతను పేర్కొన్నాడు. టెక్డైనమిక్స్ వెబ్సైట్ ప్రకారం... ఆ సంస్థకు అధ్యక్షుడు భోగవల్లే... టెక్నాలజీ, అవుట్సోర్సింగ్, కన్సల్టింగ్ సేవల్ని అందిస్తామంటూ అందులో పేర్కొన్నాడు. అందులోను ఇర్వింగ్ పట్టణం చిరునామానే ఇచ్చాడు.