gym
-
అనకాపల్లి: జిమ్ కు కోటి రూపాయల కరెంటు బిల్లు
-
నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది!
ఈజీగా బరువు తగ్గడం అనేది లేటెస్ట్ హాట్ టాపిక్. అందుకే ఇన్ప్లూయెన్సర్లు, సెలబ్రిటీలు తమ వెయిట్ లాస్ జర్నీలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూఉంటారు. తాజాగా ఫిట్నెస్ ఇన్ప్లూయెన్సర్ రిధిశర్మ ఎలాంటి కఠినమైన డైట్ పాటించకుండానే విజయ వంతంగా 20 కిలోల బరువును తగ్గించుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్గా మారింది.రిధి శర్మ అందించిన వివరాల ప్రకారం పీసీఓఏస్ సమస్యతో బాధపడుతున్నప్పటికీ, జిమ్కు వెళ్లకుండా, ఇంట్లోనే వ్యాయామాలు చేస్తూ తనబరువును గణనీయంగా తగ్గించుకుంది. రిధి శర్మ పాటించిన నిబంధనల్లో మరో ముఖ్యమైన అంశం ఇంట్లో తయారు చేసుకున్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం. నో ఫాస్ట్ఫుడ్, ఇంటి ఫుడ్డే ముద్దుచక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంది. రోజూ నడవడం, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం లాంటి చక్కటి జీవనశైలి మార్పులపై దృష్టి పెట్టడం ద్వారా ఆమె దీనిని సాధించింది. అనవసరమైన క్యాలరీలు తీసుకోకుండా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారమే తీసుకుంది. అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండే టోఫు, పన్నీర్, సోయా, చిక్కుళ్ళు , గింజధాన్యాలు, తింటే శక్తిని పెంచుకోవడంతో కడుపు నిండిన భావన కలుగు తుందని రిధి శర్మ వివరించారు. View this post on Instagram A post shared by Ridhi Sharma | Fitness & Lifestyle (@getfitwithrid)>ఇంట్లోనే వ్యాయామంజిమ్ మెంబర్షిప్ కోసం ఖర్చు చేయడం మానేసిన శర్మ, వారాంతంలో మినహా ప్రతి రోజూ 30-40 నిమిషాల ఇంట్లోనే వ్యాయామాలు చేసింది. యోగా మ్యాట్, రెండు డంబెల్స్, రెసిస్టెన్స్ బ్యాండ్తో దీన్ని సాధించానని చెప్పారు. తన వ్యాయామంలో పైలేట్స్ (కండరాలకుబలంచేకూర్చే ఆసనాలు) స్ట్రెంత్ ట్రైనింగ్, పైలేట్స్ కూడా ఉండేవని తెలిపారు.కంటినిడా నిద్రప్రతీ రోజు 7 నుంచి 8 గంటలు చక్కటి నిద్ర ఉండేలా జాగ్రత్త పడిందట. ఇదే బరువు తగ్గే తన ప్రయాణంలో, రికవరీలో ఇది కీలకమైన పాత్ర పోషించిందని తెలిపింది. వాకింగ్ తన జర్నీలో పెద్ద గేమ్ ఛేంజర్ అని, రోజుకు 7 వేల నుంచి 10 వేల అడుగులు నడిచానని రిధి తెలిపింది. కేవలం కడుపు మాడ్చుకోవడం కాకుండా, శ్రద్ధగా వ్యాయామం చేసి ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటూ 20 కేజీల బరువు తగ్గినట్టు చెప్పింది రిధి.నోట్: బరువు తగ్గడం అనేది శరీర పరిస్థితులు, ఆరోగ్యం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఉపవాసం ఉండటం ఒఒక్కటే పరిష్కారం కాదు. కచ్చితంగా ఏదో ఒక వ్యాయామం చేయాలి. అందుకే బరువు తగ్గాలనుకుంటే, ఎందుకు బరువు పెరుగుతోందనే కారణాలను విశ్లేషించుకొని, నిపుణుల సలహా తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా బరువు తగ్గే ప్లాన్ చేసుకోవాలి. -
జిమ్కి వెళ్లకుండానే 16 కిలోలు తగ్గింది, ఎలా?
బరువు తగ్గే ప్రక్రియ అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి బరువు తగ్గడం అంటే అదొక యజ్ఞం. కొందరు జిమ్కు వెళ్లి వర్కౌట్స్ చేస్తారు. మరికొంతమంది యోగాసనాలతో ఈజీగా బరువు తగ్గుతారు. మరికొంతమంది వాకింగ్, జాగింగ్ ద్వారా తమ అధిక బరువును తగ్గించు కుంటారు. మరికొందరు ఇవన్నీ చేస్తారు. జిమ్కు వెళ్లకుండానే సాహిబా ఏకంగా 16 కిలోల బరువు తగ్గింది. తన వెయిట్ లాస్ జర్నీని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. సాహిబా మొదట్లో 104 కిలోల బరువు ఉండేది. దీంతో ఎలాగైన బరువు తగ్గించుకోవాలని నిశ్చయించుకుంది. దీనికి రోజూ 10-20 వేల అడుగులు నడిచేది. అంతేకాదు ఎన్ని కేలరీల ఫుడ్ తింటున్నదీ నిత్యం పరిశీలించుకుంటూ ఉండేది. ఆహార నియమాలను పాటించి భారీగా బరువు తగ్గింది. ప్రస్తుతం 87.85 కిలోల బరువుకు చేరింది. ఇంట్లోనే కొంత కార్డియో చేసానని ,స్కిప్పింగ్ వ్యాయామం కూడా చేసినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా కొన్ని చిట్కాలను కూడా తన ఫాలోవర్స్కు అందించింది. అధిక బరువు ఉన్నవారు అరగంట నడకతో ప్రారంభించి, వారి వారి కంఫర్ట్ జోన్కు అనుగుణంగా ఈ సమయాన్నిపెంచుకోవాలని సూచించింది.16 కిలోల బరువు తగ్గడానికి స్టెప్స్ సాహిబా మాటల్లోపూర్తిగా ఉపవాసం కాకుండా మితంగా తిన్నాను. కోరుకున్నది తిన్నారు. తగ్గించి తింటూ కేలరీలను ట్రాక్ చేసుకున్నాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ 12:12 (12గం ఉపవాసం 12గం తినడం)శరీరం దీనికి సహకరిస్తే ఈ ఉపవాసాన్ని పెంచుకోవచ్చు.డయాబెటిక్ లేదా కొన్ని మందులు తీసుకుంటే ఉపవాసం వద్దు. 16:8 ఉపవాస పద్ధతిలో రోజుకు 16 గంటల పాటు ఉపవాసం. ప్రోటీన్ , ఫైబర్ ఎక్కువ, పిండి పదార్థాలు , కొవ్వు తక్కువ ఉన్న ఆహారందేన్ని ఎలా తినాలి అనేది లెక్క వేసుకోవాలి.నీటిని తాగుతూ హైడ్రేట్ గా ఉంచుకున్నారు. జిమ్కు వెళ్లకూడదని కాదు!అయితే జిమ్కి వెళ్లడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్పింది. అయితే, అందరికీ ఆర్థిక స్థోమత ఉండదు కాబట్టి, తానూ కూడా ఆర్థిక భారం లేకుండా ఈ పద్ధతిని ఎంచుకున్నట్టు వెల్లడించింది. View this post on Instagram A post shared by Sahiba a.k.a Savleen | Vocals & Self-Care 🩷 (@sahibavox) నోట్: మనం ముందే అనుకున్నట్టుగా వెయిట్ లాస్ జర్నీ అనేది అందరికీ ఒకేలా ఉండదు. వారి వారి వ్యక్తిగత ఆరోగ్యం , పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి శరీర తత్వానికి తగ్గట్టు, మన బాడీ అందించే సంకేతాలను గుర్తించాలనే గమనించాలి. ఇటీవల విద్యాబాలన్ చెప్పినట్టు మన బరువు గుట్టు ఏంటి అనేది తెలుసుకుని రంగంలోకి దిగాలి.ఇదీ చదవండి : డైట్ చేస్తున్నారా? బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రాగుల ఉప్మా -
ఫిట్నెస్ కోసం హోం జిమ్!
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో వివిధ అంశాలపై స్పందిస్తూ నెటిజన్లకు ఆసక్తి కలిగిస్తుంటారు. ఫిజికల్ ఫిట్నెస్కు చాలామంది ప్రాధాన్యం ఇస్తారు. అందుకు జిమ్కు వెళ్లాలని అనుకుంటారు. కానీ ప్రత్యేకంగా జిమ్కు వెళ్లకుండా ఒకే పరికరంతో ఇంట్లోనే ఆ అనుభూతిని పొందుతూ ఫిట్గా ఉండొచ్చంటూ మహీంద్రా తెలిపారు. అందుకు సంబంధించి ఇటీవల ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అరొలీప్ అనే సంస్థ ద్వారా ఈ పరికరాన్ని నలుగురు ఐఐటీ విద్యార్థులు తయారు చేసినట్లు మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో తెలిపారు.Home gym created by 4 IIT grads. No rocket science here.But a clever convergence of mechanics & physical therapy principles to design a product that has global potential. In small apartments & even in Business Hotel rooms! Bravo! pic.twitter.com/Tz1vm1rIYN— anand mahindra (@anandmahindra) October 24, 2024ఇదీ చదవండి: ఏడేళ్ల తర్వాత రిలయన్స్ గుడ్న్యూస్‘ఈ హోమ్ జిమ్ పరికరాన్ని నలుగురు ఐఐటీ గ్రాడ్యుయేట్లు తయారు చేశారు. ఇదేమంతా రాకెట్ సైన్స్ కాదు. ఈ పరికరాన్ని చిన్న అపార్ట్మెంట్లు, హోటల్ రూమ్ల్లో, చిన్న ఇళ్లల్లోనూ వినియోగించేలా ఏర్పాటు చేశారు. మెకానిక్స్, ఫిజికల్ థెరపీను అనుసందానిస్తూ దీన్ని తయారు చేయడం నిజంగా గొప్ప విషయం’ అని మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ కంపెనీలో స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా సీఈవో నితిన్ కామత్ కూడా ఇన్వెస్ట్ చేసినట్లు వీడియో ద్వారా తెలిసింది. ఇందులో ఏఐ ఆధారిత ట్రెయినింగ్ సెషన్లు కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. -
వైద్యం.. వైవిధ్యం..
మనకు అనారోగ్యం వస్తే.. వైద్యులను ఆశ్రయిస్తాం. మరి అలాంటి వైద్యులే అనారోగ్యం పాలైతే? ఒక వైద్యుడు ఆరోగ్యంగా ఉంటే వందలాది మంది రోగులకు ఆరోగ్యాన్ని అందిస్తాడు. ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు. అందుకే వైద్యుల ఆరోగ్యం అత్యంత విలువైనది. అయితే దురదృష్టవశాత్తూ ప్రజల్ని అనారోగ్యాల నుంచి విముక్తం చేయాల్సిన వైద్యులే తరచూ అనారోగ్యాలకు గురవుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు/ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఆస్పత్రి ప్రాంగణంలో జిమ్ అనే కొత్త సంప్రదాయం ఊపిరి పోసుకుంది. ఈ నేపథ్యంలో దీని గురించి మరిన్ని వివరాలు.. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ) ప్రకారం.. దేశంలో వైద్యులు, జనాభా నిష్పత్తి 1:854 కావడంతో తీవ్ర పని ఒత్తిడి తప్పడం లేదు. దీంతో పాటే అనేక రకాల ఇతరత్రా పరిస్థితులు సైతం వైద్యులను రోగులుగా మారుస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో వైద్యులు/ ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్యాల అంశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే వైద్య రంగంలో రకరకాల మార్పు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగమే ఆస్పత్రుల్లో వ్యాయామ కేంద్రాలు. ఇప్పటి దాకా పలు దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న హాస్పిటల్ జిమ్స్.. ఇప్పుడిప్పుడే మన నగరంలోనూ అందుబాటులోకి వస్తున్నాయి.ఆస్పత్రిలో జిమ్.. అంత ఈజీ కాదు.. నిజానికి కరోనా సమయంలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో రద్దీ, బెడ్స్ లేకపోవడం వంటివి అనేక మంది మరణాలకు కారణమవడం అందరికీ తెలిసిందే. మరోవైపు అత్యంత వ్యాపారాత్మక ధోరణిలో నడుస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు తమ వైద్యుల కోసం ఆస్పత్రిలో అత్యంత విలువైన స్థలాన్ని జిమ్కు కేటాయించడం అంత సులభం కాదు కాబట్టి.. ఈ తరహా ట్రెండ్కు శ్రీకారం చుట్టిన ఆస్పత్రివైపు అందరూ అశ్చర్యంగా, అభినందనపూర్వకంగా చూస్తున్నారు. ఒత్తిడిని జయించేందుకు.. ఆస్పత్రి ఆవరణలో జిమ్ ఉండడం అనేక రకాలుగా ప్రయోజనకరం అంటున్నారు పలువురు వైద్యులు. ముఖ్యంగా క్లిష్టమైన కేసుల్ని డీల్ చేయడం, ఆపరేషన్లు వంటివి చేసిన తరువాత కలిగే ఒత్తిడి నుంచి రిలాక్స్ అవడానికి ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల కావడానికి సంగీతం నేపథ్యంలో సాగే వర్కవుట్స్ వీలు కల్పిస్తాయని అంటున్నారు. అంతేకాకుండా గంటల తరబడి ఎక్కువ సమయం ఆస్పత్రిలో గడపాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా జిమ్ అందుబాటులో ఉండడం వల్ల మేలు కలుగుతుందని అంటున్నారు.సిబ్బందికి ఉపయుక్తం.. ఒక పెద్ద కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యుల కంటే నర్సులు, అసిస్టెంట్ స్టాఫ్.. ఇతరత్రా సిబ్బంది ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వైద్యుల కన్నా రోగులతో అత్యధిక సమయం గడిపే వీరి ఆరోగ్యం కాపాడుకోడం చాలా ప్రధానమైన విషయమే. వీరి పనివేళలు సుదీర్ఘంగా ఉన్నా చెప్పుకోదగ్గ ఆదాయం ఉండని, ఈ దిగువ స్థాయి సిబ్బందికి నెలవారీ వేల రూపాయలు చెల్లించి జిమ్స్కు వెళ్లే స్థోమత ఉండదు. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రి ఆవరణలోనే జిమ్ ఉండడం, ఉచితంగా వ్యాయామం చేసుకునే వీలు వల్ల వీరికి వెసులుబాటు కలుగుతోంది. అరుదుగా కొందరు రోగులకు సైతం ప్రత్యేక వ్యాయామాలు అవసరమైనప్పుడు ఈ తరహా జిమ్స్ ఉపయుక్తంగా ఉంటాయి.లాభనష్టాల బేరీజు లేకుండా.. ఆస్పత్రుల్లో జిమ్స్ అనేది విదేశాల్లో కామన్. నేను సింగపూర్లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నప్పుడు అక్కడ టాప్ ఫ్లోర్లో జిమ్ ఉండేది. అక్కడ నేను వర్కవుట్ చేసేవాడిని. ఏ సమయంలోనైనా ఆస్పత్రికి చెందిన వారు వెళ్లి అక్కడ వర్కవుట్ చేయవచ్చు. హౌస్ కీపింగ్ స్టాఫ్ నుంచి డాక్టర్స్ వరకూ ఎవరైనా వర్కవుట్ చేసేందుకు వీలుగా జిమ్ ఉండడం నాకు చాలా నచి్చంది. అదే కాన్సెప్ట్ నగరంలో తీసుకురావాలని అనుకున్నా. సిటీలో ఆస్పత్రి నెలకొలి్పనప్పుడు మా హాస్పిటల్లోనే దాదాపు రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24/7 పనిచేసే జిమ్ను నెలకొల్పాం. లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా దీన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు మా ఆస్పత్రిలోని అన్ని స్థాయిల సిబ్బందీ ఈ జిమ్ను వినియోగించుకుంటున్నారు. – డా.కిషోర్రెడ్డి, ఎండీ, అమోర్ హాస్పిటల్స్ -
జిమ్ లో స్టెరాయిడ్స్ వాడుతున్నారా?
-
అక్రమంగా స్టెరాయిడ్స్ అమ్మకం
సాక్షి, హైదరాబాద్: శారీరక సౌష్టవం, కండలు పెంచాలనుకునే వారి బలహీనతను ఆసరాగా చేసుకుని స్టెరాయిడ్స్ అమ్ముతున్న రాకేశ్ డిస్ట్రిబ్యూటర్స్ పై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. రూ.2 లక్షల విలువైన 22 రకాల స్టెరాయిడ్స్ను స్వా«దీనం చేసుకుని, సంస్థను సీజ్ చేసినట్లు డీసీఏ డీజీ కమలాసన్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోఠిలోని ఈసామియా బజార్లో రాకేశ్ కనోడియా నిర్వహిస్తున్న రాకేశ్ డిస్ట్రిబ్యూటర్స్లో అక్రమంగా స్టెరాయిడ్స్ విక్రయి స్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈనెల 18, 19 తేదీల్లో సోదాలు చేసినట్టు తెలిపారు. స్వా«దీనం చేసుకున్న స్టెరాయిడ్స్ను పరీక్షల కోసం పంపామన్నారు. అనుమతి లేకుండానే మందుల దుకాణం.. మియాపూర్లోని శ్రీకాంత్ న్యూరోసెంటర్లో లెసెన్స్ లేని మందుల దుకాణాన్ని సీజ్ చేశారు. లైసెన్స్ లేకుండానే మందుల దుకాణాన్ని నిర్వహిస్తున్నట్టు సోదాల్లో భాగంగా గుర్తించామని కమలాసన్రెడ్డి వెల్లడించారు. -
12-3-30 ట్రెడ్మిల్ వర్కౌట్, దెబ్బకు ఊబకాయం పరార్! ఇంట్రస్టింగ్ స్టోరీ
బరువు తగ్గడం అనేది చిటికెలోనో, చిట్కాలతోనో జరిగేది కాదు. దీనికోసం సమతుల ఆహారం, నిరంతర వ్యాయామం కావాలి. వీటన్నింటికీ మించి పట్టుదల, చిత్తశుద్ధి, నిరంతర సాధన ఉండాలి. ఈ విషయాన్నే అక్షరాలా నిజం చేసి చూపించింది ఇంగ్లాండ్లోని నార్త్ ఆప్టన్షైర్కు చెందిన 20 ఏళ్ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మిల్లీ స్లేటర్. చిన్న జిమ్ చిట్కాతో ఏడాది పాటు శ్రమించి బరువు ఎలా తగ్గిందో తెలుసుకుందాం రండి!మిల్లీ స్లేటర్ 2023లో 115 కేజీల బరువుండేది. ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. జిమ్ చేసి ఒక్క ఏడాదిలో48 కిలోల బరువు తగ్గింది. ఇపుడు టోన్డ్ ఫిజిక్తో నాజూగ్గా తయారైంది. ఇపుడు ఆమె బరువు 67 కిలోలు. తన వెయిట్ లాస్ జర్నీని టిక్టాక్లో(టిక్టాక్పై ఇండియాలో నిషేధం) పంచుకుంది. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది.న్యూస్వీక్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ట్రెడ్మిల్పై వెయిట్ ట్రైనింగ్, ట్రెడ్మిల్ ఇంక్లైన్ వాకింగ్ ద్వారా తన జిమ్ అనుభవాన్ని గణనీయంగా పెంచిందని స్లేటర్ వెల్లడించింది. ఫిట్నెస్కి పోషకాహారం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో వివరించింది. జిమ్లో సాధనతోపాటు, తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రోటీన్ల ఆహారంపై దృష్టి సారించాలని పేర్కొంది. వ్యాయామం అనేది ఆహ్లాదకరంగా ఉండాలని సూచించింది. 30 నిమిషాల పాటు గంటకు 3 మైళ్ల వేగంతో 12 శాతం గ్రేడ్తో ట్రెడ్మిల్ వర్కౌట్ చేస్తానని తెలిపింది. ఇది లారెన్ గిరాల్డో చెప్పిన 12-3-30 ట్రెడ్మిల్ వర్కౌట్ లా ఉంటుందని స్లేటర్ తెలిపింది. మరోవైపు బయోమెకానిక్స్ జర్నల్ ఇటీవల ప్రచురించిన అధ్యయనం ప్రకారం చదునైన నేల మీద నడిచిన దానితో పోలిస్తే ట్రెడ్మిల్ మీద 5 శాతం ఇంక్లైన్లో నడిస్తే 17 శాతం, 10 శాతం ఇంక్లైన్లో నడిస్తే 32 శాతం అదనంగా కేలరీలు ఖర్చు అవుతాయట. మరోవైపు 12-3-30 వర్కవుట్తో కేవలం 30 నిమిషాల్లో 150 పౌండ్ల బరువున్నవ్యక్తి దాదాపు 300 కేలరీలు ఖర్చు చేయగలడని హెల్త్ సెంట్రల్ చెబుతోంది. -
Video: జిమ్లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన యువకుడు
గత కొన్నేళ్లుగా యువతలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యలు నేడు యువకులను పీడిస్తున్నాయి. ముఖ్యంగా డ్యాన్స్ చేసేటప్పుడు, జిమ్లో గుండెపోటుకు గురవడం పెరుగుతోంది. ప్రస్తుత జీవన విధానంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఆకస్మిక గుండెపోటు ఒక రకమైన సైలెంట్ హార్ట్ ఎటాక్ అని వైద్యులు చెబుతున్నారు.తాజాగా మహారాష్ట్రలో ఓ వ్యక్తి జిమ్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. జిమ్లోని సీసీటీవీ ఫుటేజీలో ఈ ఘటన రికార్డు అయింది. ఇందులో కన్వల్జిత్ సింగ్ బగ్గా అనే వ్యక్తి ఇతరులతో కలిసి కొన్ని వ్యాయామాలు చేస్తున్నాడు. అయితే అలా చేస్తూ కన్వల్ జిత్ కాస్త అసౌకర్యానికి గురయ్యాడు.మిగిలిన వాళ్లు వ్యాయామాన్ని కొనసాగిస్తూ ఉండగా.. అతడుగా నిదానంగా పక్కకు ఒరుగుతూ కనిపించాడు.క్షణాల్లోనే బగ్గా ఓ పిల్లర్కు ఆనుకొని అక్కడే కుప్పకూలిపోయాడు. కిందపడిపోవడం చూసిన అక్కడున్నవారు అతడి వద్దకు పరిగెత్తుకుని వెళ్లారు. అతనికి ఏమైందో జరిగిందో తెలియక వాళ్లంతా అటూ ఇటు పరిగెత్తడం వీడియోలో రికార్డు అయింది. అయితే బాధితుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఛత్రపతి సంభాజీనగర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.Another death due to heart attack⚠️Businessman Kawaljeet Singh collapses after suffering a fatal heart attack while working out at a gym in Maharashtra's Chhatrapati Sambhajinagar. pic.twitter.com/LXMne0qElz— Sneha Mordani (@snehamordani) July 22, 2024 -
75 ఏళ్ల వయస్సులోనూ ఫిట్గా..
ఆయనకు సరిగ్గా 75 ఏళ్లు.. అయితేనేం..? నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంతో కష్టపడితేగానీ నేటితరం యువత సాధించలేని సిక్స్ప్యాక్ను నలభై ఏళ్ల క్రితమే తన సొంతం చేసుకున్నాడు. వృద్ధాప్యంలోనూ సిక్స్ప్యాక్ను కాపాడుకుంటూ నేటితరం యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే సికింద్రాబాద్ ఓల్డ్బోయిన్పల్లికి చెందిన విజయ్కుమార్. అనేక కారణాలతో నేటి తరం యువత తమ సిక్స్ప్యాక్ కలను సాధించలేకపోతున్నారు.సిక్స్ప్యాక్ కోసం గంటల తరబడి జిమ్లో కసరత్తులు తప్పనిసరి. ఎన్ని కసరత్తులు చేసినా సిక్స్ప్యాక్ సాధ్యం అవుతుందన్న గ్యారంటీ లేదు. ఇటువంటి కఠోర వ్యాయామాలను సునాయసంగా చేస్తూ తన సిక్స్ప్యాక్ను నేటికీ పదిలపరుచుకుంటున్నారు. వయసు శరీరానికే తప్ప మనసుకు కాదు అంటున్న విజయ్కుమార్ ఈ వయసులోనూ హుషారుగా వ్యాయామాలు చేస్తున్నారు.. ర్యాంప్వాక్లు సైతం చేయవచ్చని నిరూపిస్తున్నారు. క్రమం తప్పకుండా జిమ్కు వెళ్లడం, వ్యాయామంతోపాటు జాగింగ్, సైక్లింగ్ చేస్తూ ఎందరో యువకులు, విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్న వృద్ధ కండలవీరుడు విజయ్కుమార్పై సాక్షి కథనం.. సునాయాసంగా కఠోర ఆసనాలు 28 ఏళ్ల వయస్సు నుంచే వ్యాయామాలుఓల్డ్బోయిన్పల్లికి చెందిన ఎం.విజయ్కుమార్ నాలుగు దశాబ్దాలుగా క్రమం తప్పకుడా వ్యాయామం చేస్తూ అనారోగ్యాన్ని దరిచేరకుండా జాగ్రత్తపడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి సుచిత్ర వరకూ, ప్యారడైజ్ నుంచి బొల్లారం వరకూ, మారేడుపల్లి నుంచి బాలానగర్ వరకూ ఉన్న జిమ్ నిర్వాహకులకు, అందులో శిక్షణ తీసుకుంటున్న యువతకు సుపరిచితులు. సికింద్రాబాద్లో ఇంజినీరింగ్ వ్యాపారంలో స్థిపరడిన విజయ్కుమార్ తన 28 ఏళ్ల వయసు నుంచే వ్యాయాయం మొదలుపెట్టాడు. కొద్ది సంవత్సరాల క్రితం వరకూ వ్యాపారాన్ని కొనసాగించిన ఆయన ప్రస్తుతం వ్యాయామంతోపాటు యువతకు స్ఫూర్తిగా నిలిచే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సీనియర్ సిటిజన్స్లోనూ...కొద్ది సంవత్సరాలుగా స్నేహ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధిగా కొనసాగుతున్న విజయ్కుమార్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వృద్ధులకు స్పూర్తిగా నిలుస్తున్నారు. డీజే పాటలకు డ్యాన్స్ చేయడం, స్వతహాగా పాటలు పాడడం వంటి కార్యక్రమాలతో అటు వృద్ధుల్లో ఇటు యువకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. జిమ్ వర్కవుట్తోపాటు జాగింగ్, సైక్లింగ్ పోటీల్లోనూ పలు మెడల్స్ను అందుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించిన బాడీబిల్డింగ్, సైక్లింగ్ పోటీల్లో నేటికీ పాల్గొంటుంటారు.అందరూ క్రీడాకారులే... వ్యాయామం, క్రీడలు విజయ్కుమార్తోపాటు ఆయన కుటుంబ సభ్యులకు అలవాటయ్యాయి. విజయ్కుమార్, భార్య పిల్లలు కూడా ఉదయం నిద్రలేచింది మొదలు వర్కవుట్స్ చేయడం వారి దినచర్య. భార్య శారద కూడా భర్తకు తోడుగా వాకింగ్, జాగింగ్లకు వెళతారు. సీనియర్ సిటిజన్స్ క్రీడల్లో శారద పలు పతకాలు గెలుచుకుంది. కూతురు వాణి వాలీబాల్ జాతీయ క్రీడాకారిణిగా అవార్డులు అందుకుంది. కుమారులు పవన్, నవీన్ ఇరువురూ జాతీయ, అంతర్జాతీయ స్విమ్మర్లు. పెద్దకుమారుడు ఆ్రస్టేలియాలో స్థిరపడగా చిన్నకుమారుడు స్విమ్మింగ్ కోచ్గా ఉన్నాడు.ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ...సికింద్రాబాద్ ప్రాంతంలో విజయ్కుమార్ వర్కవుట్ చేయని జిమ్, సైక్లింగ్ చేయని రోడ్డు, జాగింగ్ చేయని మైదానం లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన వర్కవుట్ చేయడంతో పాటు అక్కడి యువకులకు వర్కవుట్లో మెళకువలు నేర్పుతుంటారు. ఇంటి ఆహారం అందులోనూ శాకాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం, దురలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని పదిలం చేసుకోవడం పట్ల అవగాహన కలిగిస్తున్నారు.శేషజీవితం సమాజానికి అంకితం నిరంతర వ్యాయామంతో వృద్ధాప్యంలోనూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా. ప్రస్తుతం కుటుంబ, వ్యాపార బాధ్యతలు ఏవీ నాపై లేవు. శేష జీవితం సమాజాభివృద్ధికి అంకితం చేయాలన్నదే లక్ష్యం. సీనియర్ సిటిజన్లలో నిరాశ, నిస్పృహలను దూరం చేసేందుకు చేతనైన సహాయం చేస్తున్నా. – మందుల విజయ్కుమార్ -
జిమ్ రిసెప్షనిస్ట్ ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: జిమ్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బాగలకుంట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దావణగెరెకి చెందిన మల్లనగౌడ, జ్యోతి దంపతుల కుమార్తె శ్రావణి(22) దాసరహళ్లిలో ఉంటూ బాగలకుంట పరిధిలోని గోల్డెన్ జిమ్లో రిసెప్షనిస్ట్గా పని చేస్తోంది. సోమవారం ఉదయం రోజులాగే పనికి వెళ్లిన శ్రావణి హఠాత్తుగా కూర్చున్న చోటే వాంతులు చేసుకుని అస్వస్థతకు గురై కుప్పకూలింది. జిమ్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. శ్రావణికి తలంలితండ్రులు వివాహం నిశ్చయించారు. అయితే ఆమె శంకర్ అనే యువకుడిని ప్రేమిస్తోందని సమాచారం. శ్రావణిని పెళ్లికి ఒప్పించాలని తల్లితండ్రులు ఇటీవల బెంగళూరు వచ్చారు. అయితే వివాహం చేసుకోవడానికి ఇష్టం లేని శ్రావణి చివరిసారిగా ప్రియుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అప్పటికే ఆమె విషం తాగింది. కేసు దర్యాప్తులో ఉంది. -
జిమ్లో చెమట చిందిస్తోన్న రకుల్.. ఫిట్నెస్ కోసం ఎన్ని కష్టాలో! (ఫోటోలు)
-
జిమ్లో అల్లు స్నేహారెడ్డి.. వర్కవుట్స్ చూశారా!
టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్యగా స్నేహా రెడ్డి అందరికీ పరిచయమే. సినిమాలకు సంబంధం లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో నెటిజన్లను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలో ఆమెకు నెట్టింట ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు సుమారు 10 మిలియన్ల వరకు ఫాలోవర్స్ ఉన్నారుతాజాగా స్నేహారెడ్డి జిమ్లో వర్కవుట్ చేస్తోన్న సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫిట్నెస్పై శ్రద్ధ వేరే లెవెల్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 మూవీతో బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రాన్ని పుష్ప పార్ట్-1కు సీక్వెల్గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలోనూ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన పుష్ప-2 ఊహించని విధంగా డిసెంబర్కు వాయిదా పడింది.Giving us major fitness goals, #AlluSnehaReddy seen streching & flexing to the core at the gym! 📸💪#AlluArjun #TFNReels #TeluguFilmNagar pic.twitter.com/QHMYWqNuNA— Telugu FilmNagar (@telugufilmnagar) June 28, 2024 -
ఇలాంటి జిమ్ సెంటర్లకి వెళ్లకపోవడమే మేలు...!
ఇటీవల ఫిట్నెస్ మీద దృష్టిసారిస్తోంది యువత. అందుకోసమని యోగా, ఏరోబిక్, జిమ్ వంటి పలు రకాల సెంటర్లకి వెళ్లి మరీ వర్కౌట్లు చేస్తున్నారు. అయితే చాలామంది చేసే తప్పు ఏంటంటే.. ఆ జిమ్ సెంటర్ ఫేమస్? కాదా అన్నది చూస్తారు గానీ ఆ సెంటర్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది గమనించారు. పాపం అలానే ఇక్కడొక మహిళ జిమ్ సెంటర్ పరిస్థితిని గమనించకపోవడంతో ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ దిగ్బ్రాంతికర ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది.వివరాల్లోకెళ్తే..ఇండోనేషియాలోని జిమ్లో 22 ఏళ్ల మహిళ మూడో అంతస్తులో ఉన్న ట్రెడ్మిల్పై నుంచి జారిపడి.. నేరుగా కిటికిలోంచి కిందపడి దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం ఇండోనేషియాలోని కాలిమంటన్లోని పోంటియానాక్లో జూన్ 18న చోటు చేసుకుంది. ఆ మహిళ ట్రెడ్మీల్పై నడుస్తూ ఉండగా అనూహ్యంగా బ్యాలెన్స్ కోల్పోయింది. అయితే వెనుక ఎంతో మేర ప్రదేశం లేకపోవడం ..దీనికి తగ్గట్టు అక్కడ ఉన్న గోడ మాదిరి అద్దంలాంటి విండో తెరిచి ఉండటంతో వెంటనే నేరుగా పడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలై అయక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదం ఆమె తన ప్రియుడితో కలిసి జిమ్ చేసేందుకు వచ్చినప్పుడూ చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియ పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా..ట్రెడ్మిల్కి కిటికి మధ్య దూరం కేవలం 60 సెంటిమీటర్ల దూరం ఉన్నట్లు తేలింది. పోస్ట్మార్టం రిపోర్టు కూడా తలకు తీవ్ర గాయలవ్వడంతోనే మృతి చెందిదని పేర్కొంది. నిజానికి ట్రెడ్మిల్పై ఎవరైనా కిందపడిపోవటం కామన్ అని, అయితే తగురీతిలో అక్కడ భద్రత లేకపోవడమే బాధకరమని అన్నారు ఇండోనేషియా పోలీసులు.అలాగే సదరు జిమ్ యజామనిని ఇలా ఎందుకు ఏర్పాట్లు చేశారని ప్రశ్నించగా..అద్దానికి వ్యతిరేకంగా చేస్తే దృష్టి మరలదని ఇలా ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. అలాగే విండోలు క్లోజ్ చేసేలా వ్యక్తిగత పర్యవేక్షకులు పరివేక్షిస్తుంటారని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడూ ఒకరూ లీవ్లో ఉండటంతోనే ఇది జరిగిందని చెప్పాడు సదరు యజమాని. ప్రస్తుతం పొలీసులు సదరు జిమ్ నిర్వహణ అనుమతిపై కూడా విచారణ చేపడుతున్నారు.(చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్లో జాన్వీ స్టైలిష్ లుక్..గజగామిని మాదిరి..!) -
నమ్రతా భారీ వర్కౌట్స్ చూస్తే షాక్, ఫ్యాన్స్ ఫిదా!
టాలీవుడ్లో పరిచయం అవసరంలేని అందమైన జంట ప్రిన్స్ మహేష్ బాబు, నటి నమ్రతా శిరోద్కర్ది. పెళ్లి తరువాత నటనకు గుడ్ బై చెప్పి నమ్రత కుటుంబ బాధ్యతలను చూసుకుంటోంది. వీరి ముద్దుల తనయ సితార నటిగా, మోడల్గా ఇప్పటికే తన హవాను చాటుకుంటోంది. అయితే తాజాగా నమ్రత వర్కౌవుట్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో సందడి చేస్తోంది. దీంతో వదినమ్మ ఎందుకింత కసరత్తు చేస్తోందంటూ ఫ్యాన్స్ చేస్తున్న ఊహాగానాలు వైరల్గా మారాయి.2004 నుండి పెద్ద స్క్రీన్కు దూరంగా ఉన్నారు నమ్రత. అయితే సోషల్ మీడియా అభిమానులకు అప్డేట్స్ మాత్రం అస్సలు మర్చిపోదు. భర్త , సూపర్ స్టార్ మహేష్ బాబు, పిల్లలు సితార గౌతమ్ గురించి తరచుగా పోస్ట్ చేస్తుంది. తాజాగా మాజీ మిస్ ఇండియా ఇటీవల ఒక రీల్ను షేర్ చేసింది. ఆమె భారీ వర్కౌట్ సెషన్ చూసి అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు.ఫిట్నెస్ కోసం ఆమె చేస్తున్న పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ‘‘బలమైన మహిళ!!’’ ‘‘సూపర్ వుమన్’’, , ‘‘వావ్’’, ‘‘బ్యూటిఫుల్’’ , ‘‘సూపర్ మామ్’’ అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) కాగా నమ్రతా గతంలో వివిధ సందర్భాలలో వర్కౌట్ వీడియోలను షేర్ చేసింది. గత ఏడాది మేలో, ట్రైనర్ కుమార్ మన్నవతో కలిసి హార్డ్కోర్ వ్యాయామాలు చేస్తున్న వీడియోను పోస్ట్ చేయడంతో ఆమె మళ్ళీ నటించనుందనే ఊహాగానాలకు దారితీసిన సంగతి తెలిసిందే. -
జిమ్ చేస్తూ కుప్పకూలి 17 ఏళ్ల మైనర్ కన్నుమూత
జీవితంలో మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభం తరువాత ఆరోగ్యం ఉన్నవారు వ్యాయామం చేస్తూ పలు ఆకస్మిక మరణాలు ఆందోళన రేపుతున్నాయి. జిమ్లో వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల బాలుడు మరణించిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోఈ విషాదం చోటు చేసుకుంది. భాన్పురిలోని స్పేస్ జిమ్లో బుధవారం వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల మైనర్ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. రోజు మాదిరిగానే ట్రెడ్మిల్పై పరిగెత్తుతూ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పోలీసుల సమాచారం ప్రకారం సత్యం (17) రహంగ్డేల్ భన్పురిలోని ధనలక్ష్మి నగర్లో నివాసముంటున్నాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం జిమ్లోని ట్రెడ్మిల్పై పరిగెత్తుతున్న అతడు ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడిపో యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేదు. అయితే అతని మరణానికి గల కారణాలను ఇంకా అధికారికంగా వెల్లడిరచలేదు. పోస్టుమార్టం నివేదిక తరువాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.సత్యం తండ్రి సుభాష్ రహంగ్డేల్ చిరు వ్యాపారం చేసుకునేవాడు. ఇద్దరు కుమారుల్లో సత్యం పెద్దవాడు. ఇటీవల ధనలక్ష్మి నగర్లోని కృష్ణ ఇంగ్లీషు మీడియం స్కూల్లో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. కానీ ఈ సంతోషం వారికి ఎంతోకాలం నిలవలేదు. ఎదిగిన కొడుకు ఆకస్మికంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. -
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
నేటి ఆధునిక శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. దీనికితోడు జీవనశైలిలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి కారణంగా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకోవడానికి ఉపవాసాలున్నా, జిమ్ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని వాపోతున్న వారిని చూస్తూ ఉంటాం. అలాగే ఏం తిన్నా ఇక్కడికే.. అంటూ హీరోయిన్ సమంతా తరహాలో అద్దముందు నిలబడి డైలాగులుకొట్టే అమ్మాయిలు కూడా చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో జిమ్కెళ్లకుండానే, ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో, ఊబకాయం, బెల్లీ ఫ్యాట్, ఫ్యాటీ బటక్స్ సమస్యకు చెప్పవచ్చు.గంటల తరబడి ఒకే చోట కూర్చుంటే గండమే!గంటల తరబడి టీవీలకు అతుక్కు పోకూడదు. పనిలో పడి అలాగే 8 నుంచి 10 గంటల పాటు కూర్చుని పని చేయకూడదు. ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల కొవ్వు పేరుకుపోతోంది. అలాగే కడుపు ఉబ్బరం వస్తుంది. కాబట్టి ప్రతి గంటకు 5 నిమిషాలు విరామం తీసుకోవాలి. మెట్లు ఎక్కడం, గుంజీలు తీయడం లాంటివి చేయాలి. దీంతో అవయవాలకు రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది క్రమం తప్పకుండా వ్యాయామంఉదయం, సాయంత్రం లేదా మీకు వీలైన సమయంలో వేగంగా నడవడం, జాగింగ్, యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్ తప్పకుండా చేయాలి. స్నేహితులతో కలిసి మీకు నచ్చిన గేమ్స్ (క్రికెట్, టెన్నిస్, కబడ్డీ,ఇ తర) అవయవాలు పూర్తిగా కదిలేలా ఆడండి. శరీరమంతా చెమట పట్టేదాకా శ్రమిస్తే బాడీలో టాక్సిన్స్ అన్నీ బయటికి పోతాయి.ఎముకలు, కండరాలు బలతంతా తయారవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అతి ముఖ్యమైన డీ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.తగినన్ని నీళ్లు, కంటినిండా నిద్ర: వ్యాయామం చేసేటప్పుడు వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. ఇది ఆకలిని తగ్గిస్తుంది , బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. నీటిని తాగడం వల్ల పొట్ట, పొత్తికడుపు కొవ్వు తగ్గుతుంది. చక్కటి నిద్ర కూడా మన బరువును ప్రభావితం చేస్తుంది. రోజుకు ఎనిమిది గంటల నిద్ర అవసరం.ఫైబర్ రిచ్ ఫుడ్స్: శరీర బరువు నియంత్రణలో ఉండాలంటే మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. బరువు పెరగడం గురించి ఆందోళన మానేసి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి, ఈ రకమైన ఆహారాన్ని తినడం వల్ల మీ కడుపు చాలా సేపు నిండుగా ఉంటుంది. అలాగే రాత్రి 7 గంటల లోపు డిన్నర్ కంప్లీట్ చేయాలి. బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.ఇంకా: ఒకేసారి కడుపు నిండా.. ఇక చాలురా బాబూ అనేంతగా తినవద్దు. అలాగే మైదాతో తయారుచేసిన పదార్థాలు, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. మద్యం, ధూమమానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. పొట్ట, పిరుదులు, పిక్కలు, భుజాలు లాంటి ప్రదేశాల్లో కొవ్వును కరిగించుకునేందుకు నిపుణుల సలహా మేరకు కొన్ని స్పాట్ రిడక్షన్ ఎక్స్ర్సైజ్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. యోగాలో కూడా ఇందుకోసం మంచి ఆసనాలు ఉన్నాయి. వాటినా ప్రాక్టీస్ చేయవచ్చు. నిజంగా వీటిని చిత్తశుద్ధిగా ఆచరిస్తే వారంలో బరువు తగ్గడం ఖాయం.నోట్: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే అని గమనించగలరు. ఏదైనా అనారోగ్య సమస్యలున్న వారు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. -
జిమ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్
ఫిట్నెస్ కోసం వ్యాయామం చేస్తూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆందోళన రేపుతోంది. జిమ్లో వర్కౌట్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు ఒక యువకుడు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈ విషాదం చోటు చేసుకుంది.వారణాసికి చెందిన దీపక్ గుప్తా (32)గత పదేళ్లుగా జిమ్లో రెగ్యులర్గా వ్యాయామం చేస్తుండేవాడు.పలు ఫిట్నెస్ పోటీలలో చురుకుగా పాల్గొనేవాడు. ఫిట్నెస్ అంటే ప్రాణం పెట్టే దీపక్ రోజూలాగానే జిమ్కెళ్లి వ్యాయామం చేస్తుండగా తీవ్రమైన తలపోటుతో బాధపడినట్టుగా వీడియో ఫుటేజ్ని బట్టి తెలుస్తోంది. నేలపై పడకముందే తన తలని చేతుల్లో పెట్టుకుని కూర్చున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. కిందపడిపోయిన దీపక్ను అక్కడున్న వారు లేపి కూర్చోబెట్టారు. నీళ్లు తాగించారు, వీపు, తలపై మసాజ్ చేశారు.అయినా గజ గజ వణికిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెడికల్ రిపోర్టు వచ్చిన తర్వాత అతడి మృతికి ఖచ్చితమైన కారణం తెలియనుంది. -
జిమ్లో వర్కౌట్ : క్రేజీ హీరోయిన్ ఫన్నీ వీడియో వైరల్
ఫ్యామిలీ స్టార్ హీరోయిన్, క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అందానికి మాత్రమే కాదు ఫిట్నెస్కు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇంట్రెస్టింగ్ పోస్టులు, జిమ్లో హెవీ వర్కౌట్స్ ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్ను ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇన్స్టాలో ఒక వీడియో షేర్ చేసింది. ట్రైనర్ చూసేటపుడు, కెమెరా సహా ట్రైనర్ మన ముందుకు వచ్చినపుడు అనే క్యాప్షన్తో వర్కౌట్ ఫన్నీ చీటింగ్ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ట్రైనర్ కెమెరాను ఆమెవైపు చూపినప్పుడల్లా, వెంటనే వ్యాయామం చేయడం ప్రారంభించడం, ట్రైనర్ చూడని సమయంలో వర్కవుట్స్ ఆపేసి డాన్స్ మూమెంట్స్ చేస్తుంది. మళ్లీ అతడు చూడగానే కష్టపడి వర్కవుట్ చేస్తున్నట్లు నటించడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు. దీంతో నెటిజన్లు కోచ్ ఉన్నపుడు మేము కూడా ఇంతే అంటూ కమెంట్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) కాగా ‘సీతారామం’ చిత్రంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. త తన అద్భుతమైన నటన, అందంతో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తరువాతహీరో నానీతో కలిసి ‘హాయ్ నాన్న’ చిత్రంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే విజయ దేవర కొండ సరసన నటించి మెప్పించింది ఈ బ్యూటీ. -
జిమ్లో పుష్ప డైరెక్టర్ భార్య.. పెద్ద సాహసమే!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప-2 ది రూల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా ఆడియన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప-2 టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే పలు రికార్డులు కొల్లగొట్టింది. దాదాపు 138 గంటల పాటు యూట్యూబ్లో నంబర్వన్ ప్లేస్లో ట్రెండ్ అయింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా పంచుకుంది. అయితే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత గురించి చాలామందికి తెలియదు. ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటున్నారు. సినిమాలతో పాటు ఎక్కడికెళ్లినా ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఆమె జిమ్లో కసరత్తులు చేస్తున్న వీడియోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది. జిమ్లో కసరత్తులు చేస్తూ తబిత కనిపించారు. ఆమె వర్కవుట్స్ సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) -
చిచ్చర పిడుగు!..తొమ్మిదేళ్లకే ఏకంగా 75 కిలోలు..!
చిన్నారులు తమలో దాగున్న అసాధారణ ప్రతిభను బయటపెట్టి అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం. అవన్నీ ఏదో వాళ్ల పెద్దొళ్ల ట్రైనింగ్ లేదా వాళ్ల ఆసక్తి కొద్ది త్వరితగతిన నేర్చుకున్నవి. అయినా ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదన్న రీతిలో అంత పసిమొగలు కూడా అలవోకగా నేర్చుకోవడం జరుగుతుంది. అదే బరువుల ఎత్తడం లాంటి వాటి వద్దకు వస్తే..అంత ఈజీ కాదు. కానీ ఈ చిచ్చర పిడుగు రామయణంలో సీత శివధనుస్సు ఎత్తినట్లుగా ఈజీగా ఎన్ని కిలోలు ఎత్తిపడేసిందో తెలుసా..! అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో 9 ఏళ్ల చిన్నారి జిమ్లో ఏకంగా 75 కిలోల బరువుని అలవోకగా ఎత్తి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ చిన్నారి హర్యానాకు చెందిన అర్షియా గోస్వామి. ఈ వీడియోని చూసిన ఫిట్నెస్ ఔత్సాహికులు, నిపుణులు, నెటిజన్లు ఆమెను వావ్ నువ్వు గ్రేట్ రా అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఇక ఆర్షియా వెయిట్ లిఫ్టింగ్ అంటే ఆమెకు అత్యంత ఇష్టమట. అంతేగాదు చిన్న వయసులోనే అధిక బరువుల లిఫ్ట్ చేసిన పిన్న వయస్కురాలిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డులోకెక్కింది. అంతేగాదు ఆరేళ్ల ప్రాయంలోనే ఏకంగా 45 కిలోల బరువు ఎత్తి అందర్నీ ఆశ్చర్యపరిచిందంటా. నిజంగా ఆ చిట్టి తల్లి గ్రేట్ కదూ. మిగతా రంగాలన్ని ఏదో ప్రాక్టీస్ చేసి సాధించేయొచ్చు కానీ ఇది తనకు మించిన బరువు ఎత్తడం అది కూడా అంత చిన్న వయసులో అంటే..మాములు విషయం కాదు కదా..! View this post on Instagram A post shared by Arshia Goswami (@fit_arshia) (చదవండి: కళకు వయసుతో సంబంధం లేదంటే ఇదే! నలభైలలో ఆ మదర్స్..!) -
' నాలుగు రోజులు పట్టిందట'.. మెగా కోడలి స్టన్నింగ్ వీడియో వైరల్!
మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇటీవలే వేకేషన్ నుంచి తిరిగొచ్చింది. వరుణ్ తేజ్తో పెళ్లి తర్వాత తొలిసారి ట్రిప్కు వెళ్లిన లావణ్య ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది. లావణ్య పెళ్లి తర్వాత ఆమె నటించిన మిస్ ఫర్ఫెక్ట్ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే లావణ్య.. తాజాగా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. జిమ్లో తన వర్కవుట్స్కు సంబంధించిన వీడియోను లావణ్య ఇన్స్టాలో షేర్ చేసింది. అత్యంత కఠినమైన సాధన చేస్తూ కనిపించింది. ఈ వీడియోను చూసిన పలువురు లావణ్య సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లావణ్య తన ఇన్స్టాలో రాస్తూ..'నాలుగు నెలల తర్వాత జిమ్కు వచ్చా. మునుపటిలా మళ్లీ సాధన చేయడానికి నాలుగు రోజులు పట్టింది. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పుడైతే మొత్తానికి మళ్లీ నా దారిలోకి వచ్చా' అంటూ రాసుకొచ్చింది. కాగా.. దాదాపు ఏడేళ్ల క్రితం లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో 'మాయావన్' చిత్రం 'ప్రాజెక్ట్ z' రిలీజ్ కానుంది. ఈ సినిమా ఏప్రిల్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. 2017లో తమిళంలో విడుదలైన ఏడేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో విడుదల చేయడం ఏంటి అని సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) -
Jyothika-Suriya Workout: జిమ్లో సూర్య- జ్యోతిక కసరత్తులు.. ఫోటోలు వైరల్!
-
Janhvi Kapoor: జిమ్లో శ్రీదేవి కూతురి కష్టాలు.. ఫ్యాన్స్ ఫిదా (ఫోటోలు)
-
కండల కోసం కంగారు పడితే.. గుండెకు ముప్పు, ప్రాణాలే పోతాయ్!
మనసులో అనుకోగానే బరువు తగ్గిపోవాలి. చిటికె వేయగానే కండలు తిరిగిన బాడీ సొంతం కావాలి. ప్రతీదీ షార్ట్ కట్లో అయి పోవాలి. ప్రస్తుతం యువత మనుసుల్లోమెదులుతున్న ట్రెండ్ ఇదే. ఈ క్రేజ్నే కొంతమంది కేడీగాళ్లు సొంతం చేసుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతూ యువత ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. వారి ప్రాణాలమీదికి తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అక్రమంగా మెఫాటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న గ్యాంగ్ను టాస్క్ఫోర్క్ అదుపులోకి తీసుకుంది. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, నిందితుల నుండి 75 ఇంజక్షన్లను సీజ్ చేశామని టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాళ్ ప్రకటించారు. కండరాల పెరుగుదలకు ఇంజక్షన్లు దోహదపడతాయని నమ్మబలుకుతారు. వాటిని అక్రమంగా విక్రయిస్తున్నారు. దీన్ని నమ్మిన బాడీ బిల్డర్లు డాక్టర్ట సిఫారసు, ప్రికాషన్స్ లేకుండానే ఈ ఇంజక్షన్లను ఎడా పెడా వాడేస్తున్నారు. దీంతో కండలు పెరగడం సంగతి మాట అటుంచి గుండెకు తీరని ముప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నకిలి ఇంజెక్షన్లను అమ్ముతున్నగ్యాంగ్కు సంబంధించి ప్రధాన నిందితుడు నితేష్ సింగ్ ఆసిఫ్ నగర్లో పల్స్ ఫిట్నెస్ పేరిట జిమ్ నడిపిస్తున్నాడు. ఇతనికి సయ్యద్ జాఫర్ అలీ, రాహుల్ సింగ్ రిసెప్షనిస్ట్ లుగా వర్క్ చేస్తున్నారు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇంజక్షన్లను అక్రమంగా విక్రయించడమే వీరి దందా. ఈ ఇంజక్షన్లు తీసుకుంటే షార్ట్ టైంలో కండరాలు పెరుగుతాయని జిమ్కు వచ్చేవారిని నమ్మిస్తారు. ముంబై నుండి ఈ ఇంజక్షన్లను కొరియర్ ద్వారా నగరానికి తెప్పిస్తారు. బహిరంగ మార్కెట్లో 500 పలికే ఇంజక్షన్లను అక్రమంగా 2000 వరకు విక్రయిస్తారు. ఇంజక్షన్స్ అతిగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోకులు, సడన్ కార్డియాక్ అరెస్ట్ దారి తీయవచ్చుని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
రష్మిక కసరత్తు మామూలుగా లేదుగా...! వీడియో వైరల్
టాలీవుడ్, బాలీవుడ్ అంతటా తన సత్తా చాటుకుంటున్న స్టార్ హీయిన్ రష్మిక మందన్న ఫిట్నెస్ కోసం తెగ కష్టపడుతోంది. మండు వేసవిలో జిమ్లో చెమటలు కక్కుతోంది. జిమ్లో కసరత్తు చేస్తున్న నెట్టింట్ హల్ చల్ చేస్తోంది. నేషనల్ క్రష్ వీడియో చేసి ఫ్యాన్స్ అంతా అబ్బురపడుతున్నారు. హీరోయిన్గా నిలదొక్కుకోవాలంటే... ఆ మాత్రం చేయాల్సిందే.. కీప్ గోయింగ్ అంటూ కమెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎపుడూ ఫ్యాన్స్కు దగ్గరగా ఉండే ఈ భామ తాజాగా వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలో జిమ్లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోలనుచాలాపోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన సమంత కూడా ఇలాంటి వీడియోలను గతం చాలా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా గంటల తరబడి జిమ్ చేయడం, కష్టమైన వర్కవుట్స్ చేయడం ఆమెకి బాగా అలవాటు. ఆమె బాడీ చూస్తే ఈ విషయం ఇట్టే అర్థం అవుతుంది. కరియర్ పరంగా చూస్తే సూపర్, డూపర్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంటోంది. ఇటీవల పుష్ప, యానిమల్ లాంటి సినిమాలతో అటు సౌత్, ఇటు నార్త్లోనూ బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కాంబోలో పుష్ప2లో మరోసారి తన హవా చాటుకునేందుకు సిద్దమవుతోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
కొద్ది స్పేస్లోనే హ్యాపీగా చేసుకునే 'హోమ్ జిమ్ మెషిన్'!
‘తిండి కలిగితే కండగలదోయ్’ వాక్యానికే పరిమితం కాలేదు ఈ నలుగురు మిత్రులు. ‘కండకు జిమ్ కూడా కావాలోయి’ అంటున్నారు. ‘రోజూ జిమ్కు వెళ్లడానికి తిరిగి అక్కడి నుంచి రావడానికి బోలెడు సమయం తీసుకుంటుంది. అలా అని ఇంట్లోనే జిమ్ సెట్ చేసుకుందామా అంటే స్పేస్ ప్రాబ్లం’ అనుకునేవాళ్లకు ‘అరోలీప్ ఎక్స్’ రూపంలో పరిష్కారం చూపారు దిల్లీ, ఐఐటీ గ్రాడ్యుయేట్స్ అమన్రాయ్, అనురాగ్ డానీ, రోహిత్ పటేల్, అమల్జార్జ్. చిన్న స్థలాలలోనే ఏర్పాటు చేసుకునే స్మార్ట్ హోమ్ జిమ్ను తయారుచేసి, ఈ టెక్నాలజీపై పేటెంట్ పొందారు. ‘అరోలీప్ ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కంపెనీ మొదలు పెట్టి విజయం సాధించారు. అంతర్జాతీయ విపణిలోకి అడుగు పెట్టనున్నారు... కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్(ఐఐటీ, దిల్లీ) అయిన అమన్ రాయ్ అల్ట్రా మారథాన్లు నిర్వహించడంలో దిట్ట. అయితే కెరీర్ ప్రారంభించిన తరువాత ఉద్యోగ బాధ్యతలు, జిమ్కు వెళ్లడం మధ్య సమన్వయం కుదరడానికి కష్టపడాల్సి వచ్చేది. బెంగుళూరులోని అద్దె ఇంట్లో స్థల సమస్య వల్ల ఎక్సర్సైజ్కు సంబంధించి లిమిటెడ్ ఎక్విప్మెంట్ మాత్రమే ఉండేది. ఇక అనురాగ్ డానీకి ఆఫీసు పనిభారం వల్ల జిమ్కు వెళ్లడం అనేది కుదిరేది కాదు. రోబోటిక్ గ్రాడ్యుయెట్స్ అయిన రోహిత్ పటేల్, అమల్ జార్జ్ల పరిస్థితి కూడా అంతే. రకరకాల సమస్యలకు పరిష్కారాలు వెదకడానికి రకరకాల ప్రయోగాలు చేసేవారు. ఛత్తీస్గఢ్లోని భిలాయ్ ప్రాంతానికి చెందిన అమన్, అనురాగ్, రోహిత్, అమల్లు జిమ్కు వెళ్లడానికి తాము ఎదుర్కొంటున్న సమస్యపై దృష్టి పెట్టారు. హోమ్ జిమ్ ఎక్విప్మెంట్లు పెద్దవిగా ఉంటాయి. ఖరీదైనవి. తగినంత స్థలం కావాలి. ‘ఇంట్లో వ్యాయామాలు చేయడానికి వేర్వేరు బరువులు ఉన్న ఎక్విప్మెంట్ కొనుగోలు చేస్తూ ఉండాలి. ఇవి చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. అద్దె ఇండ్లలో, చిన్న అపార్ట్మెంట్లలో ఇది కష్టం. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనుకున్నాం’ అంటారు నలుగురు మిత్రులు. కొత్తగా డిజిటల్–వెయిట్స్ టెక్నాలజీ ఊపందుకుంటున్న టైమ్ అది. ఫిజికల్ వెయిట్స్ను రిప్లేస్ చేసే డిజిటల్ టెక్నాలజీ కోసం ప్రయోగాలు ప్రారంభించారు. రకరకాల ప్రోటోటైప్లు బిల్డ్ చేయడం కోసం పాతిక లక్షల వరకు వెచ్చించారు. మూడు సంవత్సరాలు కష్టపడి ఈ నలుగురు మిత్రులు లిమిటెడ్ స్పేస్లో ఉపయోగించుకోగలిగే రూపొందించారు. పదిహేను ప్రోటోటైప్ల తరువాత వారి కృషి ఫలించింది, ఈ స్మార్ట్, వాల్–మౌంటెడ్ జిమ్ ఎక్విప్మెంట్ ‘అరోలీప్ ఎక్స్’లో వందగంటల ఫిట్నెస్ కంటెంట్ ఉంటుంది. మూమెంట్స్ను ట్రాక్ చేస్తుంది. సంబంధిత డాటాను మ్యాపింగ్ చేస్తుంది. డాటా–డ్రైవెన్ వర్కవుట్స్ కోసం ఈ స్మార్ట్ ఎక్సర్సైజ్ మెషిన్ మోటర్–పవర్డ్ ఎలక్ట్రోమాగ్నటిక్ రెసిస్టెన్స్ను ఉపయోగిస్తుంది. జిమ్లో చేసే ప్రతి వర్కవుట్కు ఈ మెషిన్ను ఉపయోగించవచ్చు. ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్స్ డిజైన్ చేసిన గోల్–బేస్డ్ వర్కవుట్ ప్రోగ్రామ్స్ను ఈ మెషిన్ అందిస్తుంది. ‘అరోలీప్ ఫిట్నెస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కంపెనీ మొదలుపెట్టారు. ఫ్రెండ్స్ను ఆహ్వానించి ట్రయల్స్ మొదలుపెట్టారు. తమ ప్రాడక్ట్ తాలూకు వీడియోలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేయడం ప్రారంభించారు. ఈ వీడియోలకు మంచి స్పందన లభించడంతో వ్యాయామ ప్రేమికులను దృష్టిలో పెట్టుకొని మంత్లీ సబ్స్క్రిప్షన్లు మొదలుపెట్టారు. కొన్ని నెలల తరువాత ఫస్ట్ కస్టమర్స్ తమ ఫీడ్బ్యాక్ను కంపెనీ ఫౌండర్లకు ఇచ్చారు. తమ ప్రాడక్ట్లో మార్పులు, చేర్పులు చేయడానికి, మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ఫీడ్బ్యాక్ వారికి ఉపయోగపడింది.ప్రాడక్ట్కు పాజిటివ్ టాక్ రావడం మాట ఎలా ఉన్నా ఇన్వెస్టర్లు దొరకడం పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో రోహిత్ ‘జెరోదా’ సీయివో నిఖిల్ కామత్కు మెసేజ్ పెట్టాడు. వీరు ఉంటున్న అపార్ట్మెంట్కు వచ్చి ప్రోటోటైప్లను పరిశీలించి ఇంప్రెస్ అయ్యాడు నిఖిల్ కామత్. ఫస్ట్ ఏంజెల్ ఇన్వెస్టర్ అయ్యాడు. ఆ తరువాత మరో ముగ్గురు ఇన్వెస్టర్లు వచ్చారు. మాన్యుఫాక్చరింగ్ కోసం బెంగుళూలో చిన్న స్థలం ఏర్పాటు చేసుకొని ‘అరోలీప్ ఎక్స్’లను అమ్మడం మొదలుపెట్టారు. దేశీయంగా విజయం సాధించిన ‘అరోలీప్ ఎక్స్’ ఇప్పుడు అంతర్జాతీయ విపణిలో అడుగు పెట్టనుంది. ‘ఫిట్నెస్ సింపుల్ అండ్ యాక్సెసబుల్ అనేది మా నినాదం. లక్ష్యం’ అంటున్నారు నలుగురు మిత్రులు. (చదవండి: నాడు జర్నలిస్ట్ నేడు ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా..!) -
అక్కడ మాత్రం రాక్షసుడే : జెఫ్ బెజోస్పై ప్రియురాలి వ్యాఖ్యలు
ప్రపంచ రెండో అత్యంత ధనవంతుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్పై అతని కాబోయే భార్య లారెన్ శాంచెజ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా శాంచెజ్ బెజోస్ ఫిట్నెస్ గురించి మాట్లాడింది. వోగ్తో మాట్లాడిన శాంచెస్ తరచూ తామిద్దరం కలిసే ఈ జంట తరచుగా కలిసి వ్యాయామం చేస్తామని చెప్పింది. అయితే రోజువారి రొటీన్ లైఫ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుందని కానీ దాన్ని గోప్యంగా ఉంచడమే తనకిష్టమని వెల్లడించింది. జిమ్లో ఇద్దరమూ ఒకే తరహా ఎక్స్ర్సైజ్ చేయలేం.. కానీ తనతో పోలిస్తే బెజోస్ పూర్తిగా భిన్నం.. ఒక విధంగా చెప్పాలంటే జిమ్లో రాక్షసుడే అంటూ కాబోయే భర్త ఫిట్నెస్ కమిట్మెంట్పై ప్రశంసలు కురిపించింది. ఫిట్నెస్ ఫ్రీక్గా జెఫ్ బెజోస్ అమెజాన్ సీఈవోగా తప్పుకున్నప్పటినుంచి బెజోస్ ఫిట్నెస్పై మరింత దృష్టిపెట్టాడు. వ్యాయాయంతోపాటు, ఆహారంపై కూడా శ్రద్ధ ఎక్కువే. కొవ్వు, మాంసకృత్తులలో కూడిన బలమైన ఆహారాన్ని తీసుకుంటాడు. ముఖ్యంగా ప్రతీరాత్రి ఎనిమిది గంటల నిద్రే తన సక్సెస్కు కారణమని గతంలోనే చెప్పాడు బెజోస్. అంతేకాదు ఫిట్నెస్ కోసం స్టెరాయిడ్స్, హ్యూమన్ గ్రోత్ హార్మోన్లను ఉపయోగిస్తాడనే వాదనలను కూడా ఖండించాడు జెఫ్ బెజోస్. 59 ఏళ్ల లేటు వయసులో గర్ల్ ఫ్రెండ్ లారెన్ శాంచెజ్ను త్వరలోనే పెళ్లాడనున్నాడు. -
జిమ్కి వెళ్లేవాళ్లకి ఇది పర్ఫెక్ట్.. క్యాలరీల ప్రకారం తినేయొచ్చు
వంటలో ఏది ఎంత.. ఎప్పుడు వేయాలి? అనే విషయం తెలిస్తే వంట చేయడం పెద్ద కష్టమేం కాదంటారు చాలామంది. ఏది ఎప్పుడు వేయాలనేదానిపై క్లారిటీ కోసం కుకింగ్ వీడియోలను ఫాలో అయితే చాలు. అదే ఎక్కువ మోతాదులో వంటకు అంతే ఎక్కువ మోతాదులో ఇన్గ్రీడియెంట్స్ని వేయాల్సి వస్తే? ఈ డిజిటల్ మెజరింగ్ డివైస్ను వంటింట్లో ప్లేస్ చేస్తే సరి! యూజర్ ఫ్రెండ్లీ ఫంక్షనాలిటీ కలిగిన ఈ మెషిన్.. పిండి, నూక, పాలు, నీళ్లు ఇలా దేన్నైనా కొలిచి.. సరైన మోతాదులో చూపిస్తుంది. జిమ్కి వెళ్తూ లేదా డైట్ చేస్తూ కొలతప్రకారం తినేవాళ్లకు ఈ మెషిన్ భలే ఉపయోగపడుతుంది. దీనిపైనున్న పాత్ర సులభంగా డివైస్ నుంచి వేరుపడుతుంది. స్టెయిన్లెస్ స్టీల్తో రూపొందిన ఈ పాత్రను క్లీన్ చేయడమూ తేలికే. ఇది బ్యాటరీలపై చక్కగా పని చేస్తుంది. -
జిమ్ చేస్తున్నా బరువు తగ్గడం లేదు.. సర్జరీ చేయించుకోవచ్చా?
కొందరు ఎంత తిన్నా శరీరానికి కొవ్వు పట్టదు. జీరో సైజ్లోనే కనిపిస్తుంటారు. మరికొందరికేమో కొంచెం తిన్నా లావెక్కిపోతారు. ఈ రోజుల్లో బరువు పెరగడం అనేది అన్ని వయసుల వారికి పెద్ద సమస్యలా మారింది. బరువు అదుపులో ఉంచుకునేందుకు గంటల తరబడి జిమ్లో వర్కవుట్స్ చేసినా, డైట్ కంట్రోల్ చేసినా ఏ మాత్రం రిజల్ట్ ఉండటం లేదు. ''నాకు 24 ఏళ్లు. నా హైట్ 5.2. బరువు 92 కిలోలు ఉన్నాను. యోగా, రెగ్యులర్గా జిమ్కి వెళుతున్నా, డైటింగ్ కూడా చేస్తున్నా. అయినా బరువు తగ్గడం లేదు. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవచ్చా? భవిష్యత్లో ప్రెగ్నెన్సీ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా?'' మీ వయసు 24 కాబట్టి డైటింగ్, ఎక్సర్సైజెస్ కొంతవరకు బరువు తగ్గడానికి దోహద పడతాయి. మీరు చెప్పిన మీ ఎత్తు, బరువు వివరాలను బట్టి మీ బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) 40 పైనే వస్తుంది. అంటే అధిక బరువు ఉన్నారని అర్థం. మార్బిడ్ ఒబేసిటీ అంటాం. బేరియాట్రిక్ సర్జరీ అనేది ఫస్ట్ ఆప్షన్గా తీసుకోకండి. ప్రొఫెషనల్ జిమ్ ఇన్స్ట్రక్టర్, డైట్ కౌన్సెలర్ని కలవండి. ఒకసారి హార్మోన్స్, థైరాయిడ్, సుగర్ టెస్ట్లు చేసుకోండి. జీవన శైలిని మార్చుకోవడం ద్వారా బరువు తగ్గించుకునే వీలు ఉంటుంది. బీఎమ్ఐ 40 దాటిన వారికి బేరియాట్రిక్ సర్జరీని సూచిస్తాం. బీఎమ్ఐ 35 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయినా స్పెషలిస్ట్ని సంప్రదించిన తరువాతే మీకు ఏది సరిపోతుందో అంచనా వేస్తాను. మామూలుగా బేరియాట్రిక్ సర్జరీ అయిన 12– 18 నెలల తరువాత మాత్రమే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ స్టార్ట్ చెయ్యాలి. ఎందుకంటే బరువు తగ్గే క్రమంలో మొదట్లో పోషకాల లోపం తలెత్తుతుంది. వాటిని మల్టీ విటమిన్స్తో కవర్ చేసి అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యాలి. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా జాగ్రత్తగా డైట్ని సూచించాల్సి ఉంటుంది. బీపీ, సుగర్ సమస్యలు తలెత్తకుండా టెస్ట్ చెయ్యాలి. బేరియాట్రిక్ సర్జరీ తరువాత ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఏ సమస్యలూ ఉండకపోవచ్చు. కానీ కొన్ని కేసెస్లో తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, నెలలు నిండకుండానే ప్రసవమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఒబేసిటీతో ఉన్నప్పటి రిస్క్ కంటే ఈ రిస్క్ చాన్సెస్ చాలా తక్కువ. కాబట్టి మంచి స్పెషలిస్ట్ని కలిసిన తరువాత అన్ని విషయాలు అసెస్ చేసుకుని అప్పుడు బేరియాట్రిక్ సర్జన్ని కలిస్తే మంచిది. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
జిమ్ చేస్తున్నా గుండెజబ్బులు.. సిద్దార్థ్ నుంచి స్పందన వరకు.. కారణమేంటి?
సాధారణంగానే సెలబ్రిటీలు స్ట్రిక్ట్ డైట్ను ఫాలో అవుతుంటారు. వయసు పైబడుతున్నా ఇంకా అదే గ్లామర్ను మెయింటైన్ చేస్తున్న వాళ్లు ఎందరో ఉన్నారు. అదే సమయంలో 40ఏళ్లు కూడా నిండకుండానే గుండెపోటుతో ఇటీవల తరచూ సెలబ్రిటీలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.సరైన జీవనశైలి, పౌష్టికాహారం, శారీరక శ్రమ ఉంటే గుండెపోటు నుంచి కశ్చితంగా తప్పించుకోవచ్చు అనడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవని సెలబ్రిటీల మరణాలను చూస్తే అర్థమవుతుంది.వయసుతో సంబంధం లేకుండా చిన్నవయసులోనే ఎంతోమంది సెలబ్రిటీలు గుండెపోటుతో మరణించిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. సిద్దార్థ్ శుక్లా నుంచి స్పందన వరకు.. గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలు వీళ్లే.. గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలుగతంలో హిందీ ‘బిగ్ బాస్’ సీజన్ 13 విజేత, ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ నటుడు సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. చనిపోయేనాటికి ఆయన వయస్సు కేవలం 40 ఏళ్లు మాత్రమే. ఆయన నిత్యం వ్యాయాయం చేస్తూ ఆరోగ్యకరమైన డైట్ను ఫాలో అయ్యేవాడు. చనిపోయే ముందురోజు కూడా వర్కవుట్స్ చేశాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న సిద్ధార్థ్ దురదృష్టం కొద్దీ ఆకస్మికంగా గుండెపోటుతో కన్నుమూశాడు.ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ కూడా 2021లో గుండెపోటుతోనే హఠార్మణం చెందిన విషయం తెలిసిందే. జిమ్లో వర్కవుట్స్ చేస్తూ 46 ఏళ్ల వయసులోనే హార్ట్ఎటాక్కు గురయ్యారు. యన సినిమాలకంటే కూడా పునీత్ ప్రజలకు చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు అలాంటి అభిమానులను సంపాదించుకునేలా చేసింది. పునీత్ మరణ వార్తను ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.చిన్నవయసులోనే హార్ట్ఎటాక్మరో కన్నడ నటుడు చిరంజీవి సర్జా కూడా గుండెపోటుతోనే మరణించారు. ఈయన ప్రముఖ నటుడు అర్జున్కు స్వయానా మేనల్లుడు. 35ఏళ్ల వయస్సులోనే హార్ట్ ఎటాక్తో చిరంజీవి సర్జా కన్నుమూశారు. చిరంజీవి సర్జా 2009లో వాయుపుత్ర చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సుమారు 19 సినిమాల్లో నటించాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన గుండెపోటుతో అకాల మరణం చెందాడు. చదవండి: హీరో భార్య మృతి, చిన్నవయసులోనే గుండెజబ్బులు..ఎందుకిలా?టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న కూడా గుండెపోటుతోనే కన్నుమూశారు. 39 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో అర్థంతరంగా తారకరత్న తనువు చాలించాడు. సుమారు 23రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన పరిస్థితి విషమించడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. పునీత్ కుటుంబంలో మరో విషాదంతాజాగా కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మరణించింది. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి బ్యాంకాక్ వెళ్లిన ఆమె ఆదివారం రాత్రి గుండెపోటుతో కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే ఆమె స్థానిక ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్ కుటుంబానికి విజయ్ రాఘవేంద్ర దగ్గర బంధువు.2021లో పునీత్ కూడా గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు వారి కుటుంబం నుంచే స్పందన కూడా మరణించడం శాండల్వుడ్ ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఈనెలలో ఈ జంట తమ 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. కానీ ఆ వేడకకు కొన్నిరోజులు ముందే స్పందన ఇలా హఠాన్మరణం చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.వ్యాయామం చేస్తున్నా ఎందుకీ గుండెజబ్బులు?స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నా చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకొస్తుందనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిని వేధిస్తుంది. గతంలో 25-30-40 ఏళ్ల వయస్సులో గుండెపోటు అనేది చాలా అరుదుగా ఉండేది. కానీ ఇటీవలికాలంలో ఈ సంఖ్య పెరుగుతోంది. వర్కవుట్స్ చేస్తే మంచిదే కదా అని అతిగా వ్యాయామాలు చేయకూడదు.దీనివల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతంది. యువత చాలా ఎక్కువ జిమ్ చేస్తుంటారు. కానీ జిమ్లో చేసే కొన్ని పొరపాట్లు కూడా గుండెపోటుకు కారణమౌతుంటుంది. వ్యాయామం ఎప్పుడూ సాధారణ స్థాయిలో, మితంగా ఉండాలి. పరిమితి దాటితే అనర్థాలు తప్పవు.హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరంపై, గుండెపై దుష్ప్రభావం పడుతుంది. గంటల తరబడి వ్యాయామం చేయడం కూడా మంచిది కాదని, వయసు పెరుగుతున్న కొద్దీ డాక్టర్ల సూచనతో వ్యాయామం, డైట్ను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. -
ఏమున్నాడు రా బాబు.. మహేశ్ అందానికి సీక్రెట్ ఏంటి?
టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరంటే సూపర్స్టార్ మహేశ్ బాబు అనే ఠక్కున చెప్పేస్తారు. అమ్మాయిల కలల రాకుమారుడిగా మహేశ్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాలుగు పదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తారు మహేశ్. వయసు పెరిగే కొద్దీ ఆయన అందం మరింత పెరుగుతుందా అనే సందేహం ఎవరికైనా వస్తుంది. ఏమున్నాడు రా బాబు, అచ్చం హాలీవుడ్ కటౌట్ అంటూ మహేశ్ లుక్స్కి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతుంటారు. అమ్మాయిల మనసు కొల్లగొట్టడంలో మహేశ్ తర్వాతే ఎవరైనా. మరి మహేశ్ ఏం తింటాడు? 50కి దగ్గరవుతున్నా ఇంత హ్యాండ్స్మ్గా, ఛార్మింగ్ లుక్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాడు? ఆయన అందం వెనుకున్న సీక్రెట్స్ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేశ్ బాబు అందం గురించి అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా అసూయపడుతుంటారు. ప్రతి సినిమాకి సరికొత్త లుక్లో కనిపిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంటాడు మన సూపర్స్టార్. దీంతో ఆయన గ్లామర్ వెనుకున్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని హీరో,హీరోయిన్లు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా మహేశ్ బాబు తన ఫ్యామిలీతో లండన్ ట్రిప్కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన పలు ఫోటోలను మహేశ్ భార్య నమ్రత సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, మహేశ్ యంగ్ లుక్కి నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఆయన ఫిట్నెస్, డైట్ విషయం మరోసారి హాట్టాపిక్గా మారింది. గతంలో సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్ టైంలో మహేశ్ సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. తన డైట్ గురించి ప్రస్తావిస్తూ.. “చాలా వరకు అన్నీ తింటాను, కానీ లిమిట్స్ లో తింటాను.పెరుగు, డైరీ ప్రోడక్ట్స్, పిజ్జాలు, బర్గర్, బ్రెడ్, జంక్ ఫుడ్ లాంటివి అస్సలు తినను. పిల్లలతో ఉన్నప్పుడు సరదాగా స్వీట్స్ లాంటివి కొన్ని తింటాను వాళ్ళ కోసం. ఆల్మండ్ మిల్క్ తో చేసిన పదార్థాలు తింటాను. ఇలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యి సుమారు పదేళ్లవుతుంది. మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా ఆ తర్వాత అలవాటైపోయింది అంటూ మహేశ్ స్వయంగా తెలిపాడు. మనం తినే తిండి ఎంత ముఖ్యమో, సంతోషంగా ఉండటం కూడా అంతే ముఖ్యమని, బహుశా అదే తన ఎనర్జీకి కారణమై ఉంటుందని వివరించాడు. జీవితంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటాను. ఏ విషయాన్ని అయినా పెద్దగా ఆలోచించను. అదే నా ఎనర్జీ సీక్రెట్’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మరో సీక్రెట్ ఏంటంటే.. ప్రతిరోజూ మహేశ్ మూన్ ధ్యానం చేస్తారట. అంటే ప్రతిరోజూ చంద్రుని నీడలో ధ్యానం చేస్తారట. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. సుధీర్ఘ కాలం నుంచి మహేశ్ ఈ మూన్ ధ్యానం చేయడం వల్ల ఇంత ఛార్మింగ్గా కనిపిస్తారని ఆయనతో పనిచేసిన ఫైట్ మాస్టర్స్ రామ్ –లక్ష్మణ్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఇక ఫిజికల్ ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ద వహించే మహేశ్ బాబు షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నా క్రమం తప్పకుండా జిమ్ చేస్తాడట. ఇక మహేశ్ బాబు అందం వెనుక ఓ డెర్మటాలజిస్ట్ కూడా ఉన్నారు. కర్ణాటకకు చెందిన రష్మి శెట్టి అనే డాక్టర్ గత కొన్నాళ్లుగా మహేశ్కు పర్సనల్ డెర్మలాటజిస్ట్గా వ్యవహరిస్తున్నారు. -
కుప్పకూలిన జిమ్ పైకప్పు.. పలువురి మృతి
బీజింగ్: చైనాలో ఘోరం జరిగింది. ఓ జిమ్ పైకప్పుకూలిపోయి పది మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. హెయిలాంగ్జియాంగ్ ప్రావిన్స్లో ఆదివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్విక్విహార్లోని రోడ్.34 మిడిల్ స్కూల్లో ఈ జిమ్ ఉంది. ఆదివారం సాయంత్రం ఉన్నట్లుండి పైకప్పు కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. పలువురిని శిథిలాల నుంచి బయటకు లాగాయి. అయితే ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆరుగురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందినట్లు స్థానికమీడియా సంస్థలు కథనం ప్రచురించాయి. భారీ వర్షం శిథిలాల తొలగింపు ప్రక్రియను అవాంతరం కలిగిస్తోంది. దీంతో ఇంకా పూర్తి కాకపోవడంతో.. వాటి కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 【#黑龍江 一中學體育館樓頂坍塌 已致10人死亡】 🇨🇳23日,黑龍江 #齊齊哈爾 市的一所中學的體育館樓頂發生坍塌。事故發生時體育館內共有19人,其中4人自行脫險,15人被困。截至24日凌晨三點,被困人員中已有9人死亡,4人被救出無生命危險,仍有2人被困。#China #Heilongjiang pic.twitter.com/IQEVhQytuZ — 鳳凰衛視PhoenixTV (@PhoenixTVHK) July 24, 2023 -
వీడియో: మెడ విరిగి కుప్పకూలిన ఫేమస్ ఫిట్నెస్ ట్రైనర్
-
ఎంత విషాదం.. జిమ్లో వర్కౌట్లు చేస్తూ కుప్పకూలిన యువకుడు
న్యూఢిల్లీ: యువతలో ఆకస్మిక మరణాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు, హార్ట్ఎటాక్లు.. కారణాలేవైనా నూరేళ్ల జీవితం అనుభవించాల్సిన యంగ్స్టర్స్.. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. అర్ధాంతరంగా ఎంతో ఆరోగ్యంగా ఉండే వారు సైతం ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. జిమ్లో ట్రెడ్మిల్పై వ్యాయామం చేస్తుండగా విద్యుద్ఘాతానికి గురై ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. నగరంలోని రోహిని ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బీటెక్ పూర్తి చేసిన 24 ఏళ్ల యువకుడు సాక్షం పృథి.. గురుగ్రామ్కు చెందిన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోహిణి సెక్టార్ 19లో నివాసముంటున్నాడు. ఇతడు స్థానికంగా సెక్టార్ 15లో ఉన్న జిమ్ప్లెక్స్ ఫిట్నెస్ జోన్లో తరుచుగా వ్యాయామానికి వెళ్తుంటాడు. ఇదే క్రమంలో గత మంగళవారం జిమ్కు వెళ్లాడు. ఉదయం 7.30 సమయంలో ట్రెడ్మిల్పై పరుగెత్తుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటివారు, సిబ్బంది.. యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో విద్యుదాఘాతమే బాధుతుడి మృతికి కారణమని తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. జిమ్ మేనేజర్ అనుభవ్ దుగ్గల్ను అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. చదవండి: యాక్సిడెంట్ను చూడబోతే.. 9 మంది మృతి -
మహేశ్ బాబు త్రీ మినిట్ ఛాలెంజ్.. మీరు చేయగలరా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకుమారుడి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మురారి, ఒక్కడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో స్టార్ హీరో హోదా దక్కించుకున్నాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే తాజాగా మహేశ్ బాబు షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: ప్రియుడి బర్త్డే బాష్: మలైకా డ్రెస్ ఖరీదెంతో తెలుసా?) ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంలో నటిస్తోన్న మహేశ్ బాబు జిమ్లో కసరత్తులు చేస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్స్టాలో పంచుకున్నారు. జిమ్లో మూడు రకాల తన ఫేవరేట్ వర్కవుట్స్ ఇవేనంటూ క్యాప్షన్ ఇచ్చాడు. మై సాటర్ డే సిజిల్ సెట్ అంటూ ఒక నిమిషం ల్యాండ్మైన్ ప్రెస్, ఒక నిమిషం కెటిల్బెల్ స్వింగ్, ఒక నిమిషం స్కిల్మిల్ రన్!! మీరు ఎన్ని సెట్లు చేయగలరు ??? అంటూ ఛాలెంజ్ విసిరారు. ఇది చూసిన మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్ ఫైర్ ఎమోజీలతో కామెంట్ చేసింది. ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ మాత్రం మరో పోకిరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: అక్కడ ప్లేట్స్ కడిగిన స్టార్ హీరోయిన్.. కారణం అదే!) View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
జిమ్లో హీరోయిన్ కసరత్తులు.. ఆశ్చర్యపోయిన భర్త !
నటి జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీనియర్ నటి నగ్మా చెల్లెలుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె తెలుగు, తమిళంలో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్గా కెరీర్ ఫుల్ స్వింగ్లో ఉండగానే తమిళ స్టార్ హీరో సూర్యను ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చిన జ్యోతిక ప్రస్తుతం కుటుంబంతో కలిసి ముంబయిలో ఉంటోంది. (ఇది చదవండి: 'ప్రతి అమ్మాయితో రాఖీ కట్టించుకుంటే పాపం'.. ఆసక్తిగా ట్రైలర్ ) తాజాగా జ్యోతిక జిమ్లో చేసిన కసరత్తులను తన ఇన్స్టాలో పోస్ట్ చేశారామె. ఆ వీడియోలో స్టన్నింగ్ వర్కవుట్స్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఇది చూసిన సూర్య సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మై వండర్ వుమెన్ అంటూ ఇన్స్టా స్టోరీస్లో జ్యోతిక జిమ్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం జ్యోతిక జిమ్లో కసరత్తులు చేస్తూ చెమడ్చోతున్న వీడియో తెగ వైరలవుతోంది. అంతేకాకుండా ఈ వీడియోకు భాగ్ మిల్కా భాగ్ చిత్రంలోని జిందా పాటను జోడించింది. కాగా.. జ్యోతిక వెంకట్ ప్రభు దర్శకత్వం తెరకెక్కించబోయే దళపతి-68లో విజయ్తో కలిసి నటించనున్నట్లు సమాచారం. గతంలో ఈ జంట 'కుషి', 'తిరుమలై' వంటి బ్లాక్బస్టర్ చిత్రాల్లో నటించారు. మరోవైపు రాజ్కుమార్ రావు రాబోయే చిత్రం శ్రీలో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా అజయ్ దేవగన్ నటిస్తోన్న థ్రిల్లర్ మూవీలో కనిపించనుంది.ఈ చిత్రంలో ఆర్ మాధవన్ కీలక పాత్రలో నటించారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కంగువ షూటింగ్లో బిజీగా ఉన్నాడు సూర్య. అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో దిశా పటాని హీరోయిన్గా నటిస్తోంది. (ఇది చదవండి: విషాదం.. యంగ్ టైగర్ వీరాభిమాని మృతి) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
కండల పిచ్చి.. సూదిగుచ్చి..
నగర యువతలో పెరుగుతున్న కండల పిచ్చి వారిని పెడదారి పట్టిస్తోంది. వేగంగా ఆరు పలకల శరీరాకృతిని సొంతం చేసుకొనేందుకు ప్రమాదకర సూదిమందులను తీసుకుంటుండటం అందరినీ కలవరపెడుతోంది. మైలార్దేవ్పల్లిలోని ఓ జిమ్లో 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను సోమవారం డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు, పోలీసులతో కలిసి సీజ్ చేయడం, జిమ్ ట్రైనర్ నితీశ్, అతని స్నేహితులు సొహైల్, రాహుల్లను అరెస్ట్ చేయడం యువతలో మజిల్ మేనియాకు.. ఈ ఇంజక్షన్ల విచ్చలవిడి విక్రయాలకు అద్దం పడుతోంది. – సాక్షి, హైదరాబాద్ కండల కోసం తహతహలాడే వారే టార్గెట్... సాధారణంగా పోటీలలో పాల్గొనే బాడీ బిల్డర్లు ఇంజక్షన్లను ఎంచుకుంటారు. గంటల తరబడి మజిల్ బిల్డింగ్ వర్కవుట్స్ చేయడానికి, పోటీల సమయానికి మజిల్స్ బాగా కనిపించేందుకు వాటిని వినియోగిస్తారు. అయితే అసాధారణ మార్గాల ద్వారా శరీరాన్ని బిల్డప్ చేయాలనే తపన ఉన్న యువకులకు కొన్ని జిమ్లలోని కోచ్లు ఈ ఇంజెక్షన్లు సిఫారసు చేస్తున్నారు. తక్కువ సమయంలోనే మంచి శరీరాకృతిని పొందుతారని చెబుతూ జిమ్ల యజమానులు ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కోటి సుమారు రూ. 300 పలికే ఇంజక్షన్ను కనీసం రూ. 1,500 నుంచి రూ. 2,000 వరకూ పెంచి అమ్ముతున్నారని సమాచారం. ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న వారిలో జిమ్ ట్రైనర్ల నుంచి ఫార్మా, మెడికల్ రిప్రజెంటేటివ్స్ దాకా ఉన్నారు. డిమాండ్నుబట్టి పుణే, ఢిల్లీ వంటి నగరాల నుంచి కూడా ఇంజక్షన్లను వారు దిగుమతి చేసుకుంటున్నారు. వినియోగం... ప్రాణాంతకం ఈ ఇంజక్షన్లు యాంటిహైపోటెన్సివ్స్ అనే మందుల శ్రేణిలో భాగంగా వైద్యులు చెబుతున్నారు. వాటిని సాధారణంగా లోబీపీ చికిత్సలో భాగంగా వినియోగిస్తామని... రోగి రక్తపోటును సాధారణ స్థితికి చేర్చడానికి ఆపరేషన్ థియేటర్లలో సర్జరీల సమయంలో వినియోగిస్తామని వైద్యులు అంటున్నారు. ఇది ఒక వ్యక్తి గుండె స్పందనను ఆకస్మికంగా పెంచేందుకు కూడా కారణమవడంతో అది కఠినమైన వర్కవుట్స్ చేసేందుకు ఉ్రత్పేరకంగా పనిచేస్తుందని వివరించారు. అయితే పర్యవేక్షణ లేని మెఫెంటెర్మైన్ ఇంజక్షన్ల వినియోగం వల్ల యువకుల్లో సైకోసిస్ లక్షణాలు పెరిగిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని దీర్ఘకాలం వాడితే అలవాటుగా మారి చర్మంపై దద్దుర్లు, రక్తపోటులో హెచ్చుతగ్గులు, శ్వాస ఆడకపోవడం, నిద్రలేమి, వికారం, వాంతులు, దృష్టి లోపాలు, భ్రాంతులు.. చివరకు గుండెపోటుకు కూడా సంభవించొచ్చని స్పష్టం చేస్తున్నారు. -
జిమ్ సెంటర్లో యువతి తింగరి చేష్టలు.. వీడియో వైరల్
-
అపర కుబేరులు జిమ్లో ఉంటే ఎలా ఉంటుంది - ఫోటోలు
-
Allu Arjun: పుష్ప-2 కోసం తెగ కష్టపడుతున్న అల్లు అర్జున్.. వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్లో బిజీబిజీగా గడిపేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ చాలా 'రా అండ్ రగ్గడ్'గా ఉంటుంది. దీనికోసం ఆయన కొన్ని నెలల పాటు ప్రత్యేక డైట్ను ఫాలో అయ్యారట. షూటింగ్ లేకపోయినా బన్నీ ఫిట్నెస్కి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే 41 ఏళ్ల వయసులోనూ అంత ఫిట్ అండ్ స్టైలిష్గా ఉంటారు. ఇక టాలీవుడ్లో ఫస్ట్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించిన తొలి హీరోగా బన్నీకి పేరుంది. ఈ క్రమంలో పుష్ప-2లో మరింత రగ్గడ్ లుక్లో కనిపించేందుకు తెగ కష్టపడుతున్నాడు. జిమ్లో చెమటలు చిందిస్తూ వర్కవుట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. మీరూ చూసేయండి మరి. @alluarjun Mannn back on duty to entertain us💥#AlluArjun𓃵 pic.twitter.com/UExDyWC448 — k🅰️nh🅰️ (@OnlyAlluArjun08) April 18, 2023 -
వ్యాయామం చేసి వచ్చాక.. గుండెపోటుతో యువకుడి మృతి
సాక్షి, మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామయ్యబౌళికి చెందిన సయ్యద్ మజిద్ హుస్సేన్ అలియాస్ జునేద్ (26) గురువారం రాత్రి జిమ్లో కొంతసేపు వ్యాయామం చేశాడు. అక్కడి నుంచి స్నూకర్ ఆడడానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. రాత్రి 11:30 గంటల సమయంలో ఛాతీలో నొప్పి వచ్చింది. వాంతులు కూడా చేసుకున్నాడు. సాధారణమైనదేనని భావించి ఇంటి ముందు వాకింగ్ చేయటం ప్రారంభించాడు. ఈక్రమంలో తీవ్ర గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కరోనా తర్వాత పోస్ట్కోవిడ్ సోకిన బాధితులతో పాటు ఇతరులకు సైతం ఇటీవల గుండెపోటు పెరిగాయి. సడెన్ కార్డియాక్ ద్వారా పలువురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో గుండె జబ్బులతో రోగులు బారులు తీరుతున్నారు. ముందస్తుగా గుర్తించడం ఎలా? సాధారణంగా గుండెపోటు వచ్చే వాళ్లకు కొన్ని లక్షణాలు కన్పిస్తుంటాయి. ప్రధానంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరాడక పోవడం, గుండె బరువు అనిపించడం, నీరసం, చెమటలు రావడం, చేతులు లాగడం వంటివి అనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ముందస్తు చికిత్స తీసుకుంటే కార్డియాక్ అరెస్టు నుంచి బయటపడేందుకు అవకాశం ఉంది. దెబ్బకొడుతున్న జీవన శైలి గతంతో పోలిస్తే ప్రస్తుతం అన్ని వర్గాల వ్యక్తులు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవనం తప్పడం లేదు. సరైన ప్రణాళిక లేక వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడితో సతమతం అవుతున్న పరిస్థితి ఉంది. కొన్ని రకాల ఉద్యోగాల్లో లక్ష్యాలు ఉంటాయి. అందుకోవడానికి పరుగులు పెట్టాల్సిందే. వేళకు తిండి తినరు. తిన్నా జంక్ఫుడ్ అలవాటు పడుతున్నారు. కొందరైతే చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు. చివరికి తీవ్ర అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. చిన్న వయస్సులోనే హృద్రోగ ముప్పు తలెత్తుతోంది. వారంలో 4–5రోజులు బయటే తింటున్నారు. ఈ ఆహారంలో రుచికోసం అధిక మసాలాలు, నూనెలు వాడుతుంటారు. తరచూ ఇవి తినడంతో అధిక కేలరీలు శరీరంలోకి చేరుతాయి. అందుకు తగినట్లు వ్యాయామం లేకపోవడంతో ఊబకాయులుగా మారి చివరకు ఆ ప్రభావం గుండైపె చూపుతుంది. -
తీవ్రమైన గుండెపోటు నుంచి కాపాడింది అదే: సుస్మితాసేన్
మాజీ మిస్వరల్డ్, నటి సుస్మితాసేన్ ఇటీవల తీవ్ర గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆమెకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి, స్టంట్ వేశారు. దీంతో ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. అయితే తన తాజా ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు సుస్మితాసేన్. ‘‘ఇటీవల నేను తీవ్ర గుండెపోటుకు గురయ్యాను. ప్రధాన రక్తనాళం 95 శాతం క్లోజ్ అయ్యింది. వైద్యులు నా కోసం ఎంతో శ్రమించారు. హాస్పిటల్ సిబ్బందికి, నా కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు. నా గొంతు ఇప్పుడు సరిగ్గాలేదు. కానీ భయడాల్సిన పనేంలేదు. చిన్న ఇన్ఫెక్షన్ మాత్రమే. ఇటీవల ఎక్కువగా గుండెపోటు కేసులు నమోదు కావడాన్ని గమనిస్తున్నాం. దయచేసి వ్యాయామాలు చేయండి. జిమ్కు వెళ్లడం వల్ల ఏం ఉపయోగం లేదని కొందరు భావిస్తుంటారు. కానీ, నా విషయంలో వ్యాయామాలు చేయడం ఉపయోగపడింది. ఓ యాక్టివ్ లైఫ్ను లీడ్ చేస్తున్నందునే ఈ ప్రమాదం నుంచి బయటపడగలిగాను. నా ఆరోగ్యం గురించి వైద్యులు ఓకే చెప్పగానే ‘ఆర్య’ లేటెస్ట్ సీజన్ కోసం జైపూర్ వెళ్తాను. ‘తాలి’ సినిమాకు డబ్బింగ్ చెప్పాల్సి ఉంది’’ అన్నారు సుస్మితాసేన్. -
తొలిసారి జిమ్లో అలా.. మహేశ్ బీస్ట్ లుక్ చూశారా?
టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అభిమానుల్లో ఆయనకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్ రేంజ్లో ఆయన దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఇక మహేశ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో వరల్డ్ చిత్రం చేయబోతున్నాడు. చదవండి: ఈ వారం కొత్త కంటెంట్తో ఓటీటీలు రెడీ, ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్! ప్రస్తుతం SSMB 28 షూటింగ్తో బిజీగా ఉన్న మహేశ్ తాజాగా అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. తన ఫిటినెస్ ఫొటో షేర్ చేసి ఫ్యాన్స్కి ట్రీట్ ఇచ్చాడు. మహేశ్ ఇప్పటి వరకు కామ్ అండ్ కూల్ చిత్రాలే చేశాడు. తెరపై ఆయన సిక్స్ ప్యాక్తో కనిపించింది లేదు. ఇక వెండితెరపై అందరి హీరోల్లా ఆయన బాడీ షో చేసిన దాఖలాలు లేవు. కానీ ఆయన తాజా పోస్ట్ చూస్తుంటే ఇప్పుడు మహేశ్ ఆ రూల్ బ్రేక్ చేయబోతున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: మంచు వారి ఇంట పెళ్లి భాజాలు? మనోజ్ పెళ్లి తేదీ ఫిక్స్! జిమ్లో వర్క్ అవుట్ చేసిన ఫొటోలు షేర్ చేశాడు. ఇందులో బైసిప్స్ వర్క్ అవుట్ అనంతరం నరాలు కనిపిస్తున్న తన బాడీ పిక్స్ని షేర్ చేశాడు. ఇవి చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మహేశ్ బీస్ట్ లుక్కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో తన తదుపరి చిత్రాలపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. త్రివిక్రమ్, జక్కన్నయాక్షన్ అడ్వెంచర్ చిత్రాల కోసమే మహేశ్ ఫిట్నెస్పై దృష్టి పెట్టడా? అని అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలతో మహేశ్ తన బీస్ట్ లుక్తో ట్రీట్ ఇవ్వబోతున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
జిమ్కు వెళ్లొస్తూ కుప్పకూలాడు
ఆదోని అర్బన్: ఆదోని పట్టణ శివారులోని ఆర్ట్స్ కళాశాల రోడ్డులో గల జిమ్లో వ్యాయామం చేసి బయటకు వచ్చిన ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలి మరణించిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పట్టణంలోని తిరుమలనగర్కు చెందిన సాయిప్రభు (25) ప్రతిరోజూ ఉదయాన్నే 6 గంటలకు జిమ్కు వెళ్లి వ్యాయామాలు చేస్తుంటాడు. శనివారం ఉదయాన్నే వాకింగ్కు పూర్తి చేసుకున్న సాయిప్రభు జిమ్కు వెళ్లి వ్యాయామం చేశాడు. ఆ తర్వాత బయటకు వచ్చి స్పృహ తప్పి పడిపోగా.. స్నేహితులు గమనించి వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మే 3న వివాహం తిరుమలనగర్కు చెందిన మల్లికార్జున ఆచారి, పుష్పవతి దంపతులకు ముగ్గురు సంతానం. ఆచారి కార్పెంటర్ కాగా.. పెద్ద కుమారుడికి, రెండో కుమార్తెకు వివాహాలు చేశాడు. మూడో కుమారుడు సాయిప్రభు బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు వర్క్ఫ్రమ్ హోమ్ కింద ఇంటినుంచే పని చేస్తున్నాడు. అతనికి బెంగళూరుకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. మే 3వ తేదీన ముహూర్తం నిర్ణయించగా.. కుటుంబ సభ్యులు ఆ ఏర్పాట్లలో ఉండగా.. ఈ దారుణం చోటుచేసుకుంది. సాయిప్రభు మరణించిన విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. -
జిమ్లో గుండెపోటు.. కానిస్టేబుల్ మృతి
కంటోన్మెంట్: జిమ్లో వ్యాయామం చేస్తూ ఓ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన మారేడుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు సికింద్రాబాద్ గ్యాస్మండీ ప్రాంతానికి చెందిన యంజాల విశాల్ (30) ఆసిఫ్ నగర్లోనే పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఇతను రెగ్యులర్గా మారేడుపల్లిలోని హెచ్2ఓ జిమ్లో కసరత్తు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం 7.00 గంటల సమయంలో జిమ్కు వెళ్లాడు. వార్మప్ చేస్తున్న క్రమంలోనే జిమ్లోనే కుప్పకూలిపోయాడు. జిమ్ నిర్వాహకులు 108కు సమాచారం అందించి, ఆంబులెన్స్లో యశోదా ఆసుపత్రికి తరలించారు. అయితే విశాల్ అప్పటికే మృతి చెందినట్లుగా డాక్టర్లు ధ్రువీకరించారు. విశాల్ కసరత్తు చేస్తూ జిమ్లో కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యాయామం చేస్తూ కుప్పకూలిన విశాల్
-
వ్యాయామం చేస్తూ.. గుండెపోటుతో కుప్పకూలిన యువ కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో విషాద ఘటన జరిగింది. జిమ్లో కసరత్తులు చేస్తూ 24 ఏళ్ల యువ పోలీస్ కానిస్టేబుల్ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. బోయిన్పల్లికి చెందిన ఈ కానిస్టేబుల్ పేరు విశాల్. 2020 బ్యాచ్. ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. చదువు పూర్తయిన వెంటనే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడిన ఈ యువకుడు 24 ఏళ్లకే ప్రాణాలు కోల్పోవడం కుటుంబసభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. చదవండి: విషమంగానే ప్రీతి ఆరోగ్యం -
Video: జిమ్లో యువతిపై అత్యాచారయత్నం.. నీచుడితో ఎలా పోరాడిందో చూడండి
జిమ్లో కసరత్తులు చేస్తున్న యువతిపై గుర్తు తెలియని వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. జిమ్లోకి ప్రవేశించిన వ్యక్తి యువతి వద్దకు వచ్చి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. అగంతకుడి బారి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు తన శక్తికి మంచి ప్రయత్నించింది. కామాంధుడికి భయపడకుండా ధైర్యంగా పోరాడింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. జనవరి 22న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్లోరిడాలోని టంపా నగరానికి చెందిన నషాలి అల్మా అనే 24 ఏళ్ల యువతి ఫిట్నెస్ మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్. తన అపార్ట్మెంట్లోని జిమ్లో వ్యాయామం చేస్తుంది. ఆ సమయంలో అక్కడ ఆమె ఒక్కతే ఉంది. ఇంతలో ఎవరో వ్యక్తి జిమ్లోకి వచ్చాడు. కొద్దిసేపు ఏదో పనిచేసుకుంటున్న నటిస్తూ అనంతరం వ్యాయామం చేసుకుంటున్న యువతి వద్దకు వచ్చాడు. ఆమెను బంధించడానికి ప్రయత్నించాడు. గట్టిగా పట్టుకొని నేలమీద పడేసి లైంగికదాడికి ప్రయత్నించాడు. అయితే కామాంధుడికి చిక్కకుండా గట్టిగానే పోరాడింది నషాలి. భయపడకుండా ధైర్యంగా అతని బారి నుంచి తనను తాను రక్షించుకుంది. ఈ దృశ్యాలన్నీ జిమ్లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు యువతి ధైర్యసాహసాలను ప్రశంసిస్తున్నారు. అలాగే ఆ నీచుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Hillsborough County Sheriff (@hcsosheriff) తనకు జరిగిన ఘోర అనుభవంపై బాధితురాలు మాట్లాడుతూ..‘ అతను నా వద్దకు రాగానే నేను దూరంగా తోశాను. ఏం చేస్తున్నావ్, దూరంగా వెళ్లు, నన్ను తాకడం ఆపు అని అరిచాను. అయినా తను వినలేదు. నా బలవంతం చేశాడు. తనకు దొరకకుండా ప్రయత్నించాను. అతనికి ఎదురు తిరిగి ధైర్యంగా పోరాడాను. చివరకు తను అక్కడి నుంచి వెళ్లిపోయాడు’ అని తెలిపింది. కాగా నిందితుడిని జేవియర్ థామస్-జోన్స్గా గుర్తించారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. -
ఇల్లే నయా జిమ్
సాక్షి, అమరావతి: శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. జీవన నాణ్యతను మెరుగుపర్చుకోవడానికి ‘ఫిట్నెస్’ మంత్రం జపిస్తున్నారు. ప్రాణాంతక వ్యాధుల ముప్పును తప్పించుకునేందుకు అత్యధికులు వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా దేశంలోని పట్టణాలు, నగరాలతోపాటు సెమీ అర్బన్, సబ్ అర్బన్ ప్రాంతాల్లోనూ ‘హోమ్ జిమ్’ ట్రెండ్ పెరుగుతోంది. గుండె ఆరోగ్యంపై దృష్టి గుండె, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడం, కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడటం వలన కార్డియోవాస్కులర్ వ్యాయామ పరికరాలను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇవే మార్కెట్ వాటాలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్నాయి. ఇందులో ట్రెడ్మిల్స్, స్టేషనరీ బైక్లు, రోయింగ్ యంత్రాలు, ఎలిప్టికల్స్ ఉన్నాయి. భారత్ టాప్.. తాజా గణాంకాల ప్రకారం భారత్లో గత ఏడాది గృహ ఫిట్నెస్ పరికరాల పరిశ్రమ మార్కెట్ విలువ 13,741.23 మిలియన్ డాలర్లుగా నమోదైంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇది ఆసియన్–పసిఫిక్ దేశాల్లోనే అత్యధిక మార్కెట్ విలువగా నమోదైంది. మరోవైపు ప్రపంచ దేశాలతో పోలిస్తే ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలు అత్యధికంగా ఫిట్నెస్కు ప్రాధాన్యం ఇస్తుండటం విశేషం. దేశంలో భౌగోళికంగా చూస్తే పశ్చిమ, మధ్య భారతం అతిపెద్ద మార్కెట్గా ఉంది. ఇక్కడ పట్టణీకరణ, పెరుగుతున్న తలసరి ఆదాయం దీనికి కారణంగా తెలుస్తోంది. తూర్పు, దక్షిణ భారత దేశంలోనూ ఫిట్నెస్ మార్కెట్ క్రమంగా వృద్ధి చెందుతున్నప్పటికీ ఇక్కడ ఎక్కువ శాతం ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆన్లైన్ ఆర్డర్ల వృద్ధి దేశంలో ఇటీవల గృహ వ్యాయామ పరికరాల కొనుగోలులో 45 శాతం ఆన్లైన్ ఆర్డర్లు పెరిగాయి. ముఖ్యంగా ట్రెడ్మిల్స్, ఎక్సర్సైజ్ బైక్లు, డంబెల్ సెట్లు, బెంచ్లు ఎక్కువగా ఉంటున్నాయి. సుమారు రూ.1,300–రూ.2,000 ధరలో వివిధ రకాల బరువులు, రాడ్లు, వెయిట్ బార్లు, జిమ్ ఉపకరణాలు లభిస్తున్నాయి. మరోవైపు యోగా మ్యాట్లు, రెసిస్టెన్స్ బ్యాండ్లు, ఫోమ్ రోలర్లు, టమ్మీ ట్రిమ్మర్లు వంటి సులభమైన వ్యాయామ పరికరాల విక్రయం విరివిగా ఉంటోంది. ఆన్లైన్ మార్కెట్ వ్యాపారం గత సంవత్సరం దాదాపు ఏడు రెట్లు పెరిగింది. చాలా కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ఒకే పరికరంపై 3కు పైగా వివిధ రకాల వ్యాయామాలు చేసుకునేలా డిజైన్లు చేస్తున్నాయి. ‘స్మార్ట్’గా వాడుతున్నారు ఫిట్నెస్ యాప్ల డౌన్లోడ్లు భారత్తోపాటు ప్రపంచ వ్యాప్తంగా భారీగా పెరిగాయి. 2023లో స్మార్ట్వాచ్లు, ఫిట్నెస్ బ్యాండ్ల వంటి వేరియబుల్ టెక్నాలజీలు సరికొత్త ఫిట్నెస్ ట్రెండ్ను సృష్టించనున్నాయి. దీంతోపాటు ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్/వర్చువల్ ఫిట్నెస్ సెషన్లు పెరగనున్నాయి. ఇంతకు ముందు ఆన్లైన్ శిక్షణ గురించి పెద్దగా అవగాహన లేనివారు కూడా ఇప్పుడు ఆన్లైన్ శిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో మహిళలు ఎక్కువగా ఉండటం విశేషం. ఆసక్తి పెరిగింది కోవిడ్ తర్వాత హోమ్ జిమ్లు పెరిగాయి. తక్కువ ధరల్లో వ్యాయామ పరికరాలు వస్తుండటం, ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో చాలామంది స్వయంగా వ్యాయామాలు చేయడం నేర్చుకుంటున్నారు. కొంతమంది మా లాంటి ట్రైనర్స్ను పెట్టుకుంటున్నారు. హోమ్ జిమ్ ఇంటిల్లిపాదికి ఎంతగానో ఉపయోగపడుతోంది. – సందీప్, ఫిట్నెస్ ట్రైనర్, విజయవాడ -
Samantha: కఠిన సమయంలో నాకు చేరువై, నాలో స్ఫూర్తి నింపావు..: సమంత
స్టార్ హీరోయిన్ సమంత ఫిటినెస్ ఫ్రీక్ అనే విషయం తెలిసిందే. సమయం దొరికితే గంటలు గంటలు ఆమె జిమ్లోనే గడుపుతారు. అంతేకాదు జిమ్ హేవీ వర్క్అవుట్స్ చేస్తూ తరచూ వీడియోలు షేర్ చేసేది. అయితే ఇటీవల మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సామ్ ప్రస్తుతం కోలుకుంటోంది. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్స్పై దృష్టి పెట్టిన ఆమె జిమ్లో వర్క్ అవుట్స్ చేయడం స్టార్ట్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన ఫిటినెస్ వీడియోను షేర్ చేసింది. జిమ్లో పుల్ అప్స్ చేస్తోన్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. చదవండి: మాస్ మహారాజా బర్త్డే సర్ప్రైజ్.. రావణాసుర ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది దీనికి ఆమె.. ‘‘కఠిన సమయంలో నాకు చేరువై, నాలో స్ఫూర్తి నింపిన ‘హూ ఈజ్ గ్రావిటీ’ బ్యాండ్కు ధన్యవాదాలు. సాధ్యమైనంత వరకూ కఠినతరమైన డైట్స్లో మనం తినే ఆహారం వల్ల బలం రాదని.. మన ఆలోచనా విధానం పైనా అది ఆధారపడి ఉంటుందన్నది నా అభిప్రాయం’’ అని సమంత రాసుకొచ్చింది. ఇక ఈ తాజా వీడియోపై పలువురు సినీ సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. అంతేకాదు వెంకటేశ్ కూతురు అశ్రిత కూడా సామ్ పోస్ట్పై స్పందించింది. ఆమెకు మరింత బలం చేకూరాలని ఆకాంక్షిస్తూ ఎమోజీలతో కామెంట్స్ చేసింది. చదవండి: కీరవాణికి పద్మశ్రీ వరించడంపై రాజమౌళి ఎమోషనల్ పోస్ట్ అలాగే సుశాంత్ కూడా కామెంట్స్ చేశాడు. ఇక డైరెక్టర్ నందిని రెడ్డి చేసిన కామెంట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘నువ్వు రెండు చేతులా చేస్తుంది.. నేను ఒక్క చేతితో చేస్తున్నాను. నువ్వు ఫీల్ అవుతానే ఆ వీడియో షేర్ చేయలేదు’ అంటూ చమత్కిరంచింది. కాగా సమంత నటించిన శాకుంతలం మూవీ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
జిమ్ చేస్తూనే మృతి చెందిన మహిళ
-
అయ్యబాబోయ్ సమంత ఛాలెంజ్
-
మాస్క్తో వ్యాయామం చేస్తే ఊపిరితిత్తులపై అధిక ఒత్తిడి
-
యూత్కు స్పూర్తిగా నిలుస్తున్న బామ్మ
-
జిమ్కి వెళ్లేవాణ్నే కాదు
యాక్టర్స్ ఫిట్గా ఉండటానికి గంటల తరబడి జిమ్లో టైమ్ స్పెండ్ చేస్తుంటారు. కష్టతరమైన వర్కౌట్స్ చేస్తూ ఫిట్గా ఉంటుంటారు. కానీ, నా యంగర్ డేస్లో ఎప్పుడూ జిమ్కి వెళ్లలేదు అంటున్నారు బాలీవుడ్ ‘యాక్షన్ కింగ్’ ధర్మేంద్ర. జిమ్కు వెళ్లకుండా కూడా ఫిట్గా ఉండగలిగిన సీక్రెట్ షేర్ చేస్తూ –‘‘పొలమే నా జిమ్. నా యంగ్ డేస్లో జిమ్కు ఎప్పుడూ వెళ్లలేదు. పొలాన్ని దున్నడం, బావిలో నుంచి నీళ్లు తోడటం వంటి పనులు చేస్తుండేవాణì్న. అలాంటి వర్కౌట్సే బెస్ట్ వర్కౌట్స్. మనల్ని ఫిట్గా ఉంచుతాయి’’ అని పేర్కొన్నారు ధర్మేంద్ర. -
జిమ్ సెంటర్లో మహిళపై దాడి
-
జిమ్ సెంటర్లో మహిళపై దాడి
మద్యప్రదేశ్: జిమ్ సెంటర్లో ఓ వ్యక్తి మహిళపై చేయిచేసుకోవడమే కాకుండా అతి దారుణంగా కాలుతో తన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సంఘటన ఇండోర్లోని ఓ జిమ్ సెంటర్లో చోటుచేసుకుంది. ఈ దృశ్యలు సీసీ పుటేజీలో రికార్డయ్యాయి. అతని తీరుపై జిమ్ యజమానికి కంప్లేయింట్ ఇవ్వడంతో ఆగ్రహానికి గురియై ఇలా చేశాడని సమాచారం. -
జిమ్ను వేడెక్కిస్తున్న భామలు!
ఫిట్నెస్ మీద బాలీవుడ్ భామలకు ఫోకస్ ఎక్కువే. నిన్నటికినిన్న కత్రినా కైఫ్ తన జిమ్ వర్కట్స్ ఫొటోలతో సోషల్ మీడియాలో హిట్ పెంచగా.. తాజాగా ‘కెవ్వు కేక’ భామ మలైకా అరోరా జిమ్ ఫొటోలతో మరింత వేడెక్కించింది. 43 ఏళ్ల మలైకాకు జిమ్ వర్కౌట్స్ అంటే చాలా ఇష్టం. ఆమెకు జిమ్లో ఒక కొత్త ఫ్రెండ్ దొరికిందట. ఆమెనే సైఫ్ అలీఖాన్ కూతురు సరా అలీఖాన్. ఇటీవల సరాతో కలిసి కసరత్తులు చేస్తున్న ఫొటోను ఒకదాన్ని మలైకా పోస్టు చేసింది. మలైక-కరీనా కపూర్ మంచి స్నేహితులు. ఆ రకంగా కరీనా భర్త సైఫ్కు కూడా ఆమె సన్నిహితురాలే. కాబట్టి సరా, మలైకా జిమ్లో కలిసి వర్కౌట్స్ చేయడం ఆశ్చర్యమేమి కాదని బాలీవుడ్ జనాలు అంటున్నారు. ‘మూడు కోతులు ఇలా వేలాడుతున్నాయి. ఎందుకని నన్ను అడగకండి. ఇలా చేయడం మాకు ఎంతో సరదాగా ఉంది’అంటూ సరా, నమ్రత పురోహిత్తో జిమ్లో దిగిన ఫొటోను మలైక షేర్ చేసింది. స్టార్ కిడ్గా ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సరా త్వరలోనే సుశాంత్సింగ్ రాజ్పుత్ సరసన కేదార్నాథ్ సినిమాతో బాలీవుడ్కు పరిచయం కానుంది. ఈ సినిమాలో అందంగా కనిపించేందుకు ఇప్పటినుంచే ఈ చిన్నది జిమ్లో కష్టపడుతున్నది. అటు మలైకాతోనే కాదు ఇటు నటి నిమ్రత కౌర్తోనూ కలిసి జిమ్లో చెమటోడుస్తున్నది. -
జిమ్లపై త్వరలో స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్: త్వరలోనే వ్యాయామశాలపై ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. రెండు నెలల్లోగా ప్రతి జిమ్లో ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ ఉండితీరాలని తెలిపారు. లేదంటే కఠినచర్యలుంటాయని హెచ్చరించారు. తమ కమిషనరేట్ పరిధిలోని జిమ్లకు ఈ మేరకు సర్క్యులర్ జారీ చేశామన్నారు. ప్రతి జిమ్ యజమాని తమ కమిషనరేట్లో నమోదు చేయించుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు తేలితే చర్యలు తప్పవన్నారు. స్త్రీ, పురుషులకు వేర్వేరు జిమ్ ఇన్స్ట్రక్టర్లను నియమించుకోవాలని తెలిపారు. -
విశాఖలో రకుల్ రిమ్‘జిమ్’
-
ఇరవై నిమిషాలు.. ఇవీ వ్యాయామాలు
‘జిమ్’దగీ ‘ఆరోగ్యం వద్దనుకుంటే శారీరకశ్రమకు వారానికి కనీసం 150 నిమిషాలు కూడా కేటాయించకండి’’ ఇది తాజాగా హార్వర్డ్ విశ్వవిద్యాలయం చేస్తున్న పరిశోధనాత్మక హెచ్చరిక. వారంలో ఆ మాత్రం సమయం కూడా చెమట పట్టేలా శారీరకశ్రమ చేయనివారు పెరుగుతున్నారని, అటువంటివారే ఎక్కువగా కేన్సర్, డయాబెటిస్, రక్తపోటు... తదితర వ్యాధులతో చనిపోతున్నారని ఆ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో వెల్లడైంది. వారానికి 150 నిమిషాలు అంటే జస్ట్ డైలీ 20 మినిట్స్. ఈ నేపధ్యంలో కొన్ని సులభమైన వ్యాయామాలు, అవి అందించే లాభాలపై ఫిట్నెస్ నిపుణులు అందిస్తున్న వివరాలివి... వాకింగ్ రోజుకి గంట చొప్పున వారానికి 5 రోజులు బ్రిస్క్ వాక్ చేస్తే పక్షవాతం వల్ల వచ్చే రిస్క్ సగానికి సగం తగ్గిపోతుందని హార్వర్డ్ స్టడీ తేల్చింది. గుండె, ఊపిరితిత్తులు శక్తివంతమవుతాయి. వ్యక్తి బరువుని బట్టి కూడా కేలరీలు ఖర్చు అయే తీరులో మార్పు ఉంటుంది. ఉదాహరణకు 60కిలోల బరువు ఉన్న వ్యక్తి గంటకు 5 కి.మీ వేగంతో నడిస్తే 180–200 కేలరీలు, అదే 80 కిలోలున్న వ్యక్తికైతే 220–240 కేలరీలు ఖర్చు అవుతాయి. తాము నిర్ధేశించుకున్న విధంగా కేలరీలు ఖర్చు అవుతున్నదీ లేనిదీ చూడాలంటే మార్కెట్లో లభించే పీడోమీటర్స్, స్టెప్ కౌంటర్స్ వంటివి వినియోగించవచ్చు. వారానికి 3500 కేలరీలు వాకింగ్ ద్వారా ఖర్చయ్యేట్టుగా నిర్ణయించుకోవడం చక్కని లక్ష్యం కనీసం 20 నిమిషాలు నుంచి 60 నిమిషాల దాకా కేటాయించగలగాలి. ఈ వ్యవధి నిదానంగా పెంచాలి. మొత్తం 60 నిమిషాలు ఒకే సారి వాకింగ్ చేయలేని పక్షంలో 15నిమిషాల చొప్పున దీనిని విభజించుకుని చేయవచ్చు. సైక్లింగ్ సైకిల్ తొక్కడం ద్వారా సాధించే ఫిట్నెస్ని దృష్టిలో పెట్టుకుంటే... సైకిల్ని మన డైలీ రొటీన్లో భాగం చేయడానికి ప్రయత్నిస్తాం. సాధారణ వేగంతో చేసే సైక్లింగ్ ద్వారా గంటకు దాదాపు 300 కేలరీలు, అంటే 20 నిమిషాలలో 100కిపైగా కేలరీలు హాంఫట్. ఇది గుండెకు మంచి వ్యాయామం. దీని ద్వారా తొడ పై భాగం కండరాలు, పిక్కలు, నడుం చుట్టు పక్కల ఉండే ఆబ్లిక్స్, మోచేతులు... వంటి దేహంలోని ప్రధాన భాగాలకు వ్యాయామం లభిస్తుంది. అవసరమైనపుడు వేగం పెంచడం, అలసట అనిపించినపుడు తగ్గించడం లాంటి సౌలభ్యం కారణంగా వ్యాయామం పై అదుపుని, నియంత్రణను అందిస్తుంది. కండరాలు వదులుగా ఉన్నాయని భావించేవారు, బరువు ఎక్కువ లేకున్నా బాడీషేప్ బాలేదని బాధపడేవారికి ఇది మంచి ఎంపిక. ఆఫీసుల్లో ఎక్కువ సేపు కూర్చుని చేసే ఉద్యోగాలకు పరిమితమయ్యేవారు పొద్దున్నే సైకిల్పై రాకపోకలు సాగించడం వల్ల రెండుపూటలా వ్యాయామం చేసినట్టే. స్కిప్పింగ్ బాక్సర్లు సైతం ముందస్తు వార్మప్లో చేసే వ్యాయామాంగా స్కిప్పింగ్ ప్రాచుర్యం పొందింది.æ గుండె, ఊపిరితిత్తులకు చక్కని వ్యాయామం అందిస్తుంది. ఈ స్కిప్పింగ్ 10 నిమిషాలపాటు, నిమిషానికి 120రిపిటీషన్స్ చొప్పున చేస్తే అరగంట పాటు జాగింగ్ చేసినంత, టెన్నిస్ 2 సెట్స్ ఆడినట్టు, 12నిమిషాల స్విమ్మింగ్ చేసిన ఫలితాన్నిస్తుంది. వ్యక్తి బరువు, చేసే వేగాన్ని బట్టి కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే 70నుంచి 110 కేలరీలను ఖర్చు చేస్తుంది. డ్యాన్స్ డ్యాన్స్ ఓ మంచి వ్యాయామమని నిపుణులు చెప్తున్నారు. 10కిలోల బరువున్న వ్యక్తి ఒక్క నిమిషం నృత్యం చేస్తే దాదాపు 1.4 క్యాలరీలు ఖర్చు అవుతాయి. 70కిలోల బరువున్న వ్యక్తి 20 నిమిషాలు నృత్యం చేస్తే దాదాపు 196 క్యాలరీలు ఖర్చు అవుతాయి. దీనిలోనూ సావధానంగా చేయడం వల్ల 20నిమిషాలకు 140 నుంచి 150 క్యాలరీలు, మధ్యస్ధంగా చేయడం వల్ల 160 నుంచి 180 క్యాలరీలు, వేగంగా చేసే విధానం వల్ల 180 నుంచి 200 క్యాలరీలు ఖర్చుఅవుతాయి. ఈ డ్యాన్స్ వర్కవుట్స్ని వారంలో 2 నుంచి 4 సార్లు తమ వ్యాయామ రొటీన్లో భాగంగా మార్చుకోవచ్చు. క్రమబద్ధమైన ఆరోగ్యం కోసమైతే కేవలం 20 నుంచి 30 నిమిషాల పాటు సమయం వీటికి కేటాయిస్తే సరిపోతుంది. అయితే బరువు తగ్గాలి అనుకునేవారు మాత్రం వార్మప్ చేసిన అనంతరం వ్యాయామం ప్రారంభించిన తొలి 8 నిమిషాలలోపు దేహంలో కార్బొహైడ్రేట్స్, ఆ తర్వాత 12 నిమిషాలలో ప్రొటీన్స్ ఖర్చవుతాయి. ఆ తర్వాతే, అంటే 20 నిమిషాల తర్వాతే అధికంగా ఉన్న ఫ్యాట్ ఖర్చు అవడం ప్రారంభిస్తుంది. కాబట్టి... వారు మరింత సమయం వెచ్చించక తప్పదు. -
ధోనీ ఏం చేస్తున్నాడో తెలుసా..?
ముంబై: టీమిండియా వన్డే, టి-20 కెప్టెన్ పదవి నుంచి అనూహ్యంగా వైదొలిగిన తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ ఏం చేస్తున్నాడు? కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్టు ధోనీ నేరుగా ప్రకటించకుండా బీసీసీఐకి తన నిర్ణయాన్ని తెలిపాడు. అతని తరఫున రిటైర్మెంట్ నిర్ణయాన్ని బోర్డు ప్రకటించింది. ధోనీ ఆటగాడిగా కొనసాగనున్నట్టు ప్రకటించిన బోర్డు.. ఇంగ్లండ్తో టి-20, వన్డే సిరీస్కు అతన్ని ఎంపిక చేసింది. అయితే తన భవిష్యత్ గురించి ప్రణాళికలు ఏంటన్నవి ధోనీ వెల్లడించలేదు. ప్రస్తుతం మహీ ఏం చేస్తున్నాడంటే ఇంగ్లండ్తో జరిగే సిరీస్లో రాణించేందుకు శ్రమిస్తున్నాడు. ఫిట్నెస్ కాపాడుకునేందుకు జిమ్లో కసరత్తులు చేస్తున్నాడు. జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు తీసిన ఫొటో, వీడియోలను ధోనీ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. కాగా మహీ సొంతూరు రాంచీలో ఉన్నాడా? వేరే చోట ఉన్నాడా? జిమ్కు ఎక్కడ వెళ్లాడు వంటి విషయాలను వెల్లడించలేదు. ఈ నెల 4 ధోనీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. మహీ స్థానంలో విరాట్ కోహ్లీని కెప్టెన్గా ఎంపిక చేసింది. టెస్టు కెప్టెన్సీ నుంచి ధోనీ ఇంతకుముందే వైదొలిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు కోహ్లీయే కెప్టెన్. కాగా 35 ఏళ్ల ధోనీ పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగనున్నాడు. ఈ నెల 15 నుంచి ఇంగ్లండ్తో జరిగే సిరీస్లో ఆడనున్నాడు. ఇంగ్లండ్తో 10న జరిగే ప్రాక్టీస్ మ్యాచ్కు మాత్రం భారత్ ఏ టీమ్కు ధోనీనే సారథ్యం వహిస్తాడు. -
ఎమ్మెల్యే భూమి పూజ.. స్థానికుల ఆందోళన
హైదరాబాద్ : వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెం. 1 వెంగల్రావు పార్కు వెనుకాల దోబీఘాట్ బస్తీలో వ్యాయామశాల నిర్మాణానికి మంగళవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి భూమి పూజ చేశారు. అయితే ఇక్కడ వ్యాయామశాల నిర్మాణం వద్దంటూ స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. పనులను తక్షణం నిలిపివేయాలంటూ స్థానికులంతా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యే వారందరినీ శాంతింపజేసి ఇక్కడ వ్యాయామశాల నిర్మాణం వల్ల ప్రయోజనాలను తెలియజేశారు. పార్కు పక్కన ఉన్న పార్కింగ్ స్థలం నుంచి వ్యాయామశాలకు రోడ్డు నిర్మిస్తామని దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని సూచించారు. ఇక్కడ వ్యాయామశాల నిర్మాణం వల్ల దళిత యువకులకు ప్రయోజనం ఉంటుందన్నారు. సుఖ్దేవ్నగర్, రామకష్ణానగర్, బాలాపురబస్తీ, గాందీపుర బస్తీ, దేవరకొండ బస్తీ, ఇలా అన్ని ప్రాంతాల యువకులు వినియోగించుకోవడానికి వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు కిషన్, అభిలాష్, రవి, శివ, ప్రవీన్, వీరాస్వామి, చంద్రశేఖర్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
వెయిట్... 52 వెయిట్ లిఫ్ట్... 72!
పది.. ముప్ఫై.. యాభై.. కాదండీ! ఏకంగా 72 కిలోల బరువు.. స్వీట్ అండ్ క్యూట్ హీరోయిన్ సమంత కాస్త కష్టపడుతూనే 72 కిలోల వెయిట్ను లిఫ్ట్ చేశారు. మరి, ఇంతకీ సమంత వెయిట్ ఎంతో తెలుసా? కొంచెం అటూ ఇటూగా 52 కిలోలు మాత్రమేనట. ఇప్పుడు సమంత వెయిట్ లిఫ్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన కంటే 20 కిలోలు ఎక్కువ బరువును ఎత్తడంతో ఆశ్చర్యపోవడం వీక్షకుల వంతైంది. హీరోయిన్లు అంటేనే సున్నితత్వానికి మారుపేరన్నట్టు వ్యవహరిస్తుంటారు. కష్టపడే పనులకు దూరంగా జరుగుతారు. మరి, సమంతకు ఎందుకీ వెయిట్ లిఫ్టింగ్లు, వగైరా అంటే.. ఓ రకమైన ఫిట్నెస్ ప్రొగ్రామ్ ఇది. ప్రస్తుతం ఫిట్నెస్ కాపాడుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ పవర్ ట్రైనింగ్ను ఆశ్రయిస్తున్నారు. అందులో ఈ వెయిట్ లిఫ్టింగ్ కూడా ఓ వ్యాయమం. ఐ లైక్ జిమ్.. లవ్ వెయిట్స్ అని కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు సమంత. నాగచైతన్య, మస్కతి ఐస్క్రీమ్, వర్క్ - ఈ మూడూ లేకుండా జీవించలేనని ఆ మధ్య సమంత చెప్పారు. ఆ లిస్ట్లో ఇక వెయిట్ లిఫ్టింగూ చేరుతుందేమో! -
వామ్మో.. సమంత 72 కేజీలు ఎత్తేసింది
-
వామ్మో.. సమంత 72 కేజీలు ఎత్తేసింది
ఈ మధ్య సినిమాలతో కన్నా తన పెళ్లి వార్తలతోనే ఎక్కువగా సందడిచేస్తున్న సమంత, సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్గా ఉంటోంది. ముఖ్యంగా త్వరలో నాగచైతన్యను పెళ్లి చేసుకుంటున్నట్టుగా ప్రకటించిన తరువాత ఈ బ్యూటి మరింత జోరు పెంచింది. వరుసగా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అయితే అలా అప్ లోడ్ చేస్తున్న ఫోటోలలో ఎక్కువగా జిమ్లో తీసిన ఫోటోలే ఉండటం విశేషం. గతంలో నాగచైతన్య సమంత ఇద్దరు కలిసి జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. తరువాత స్పోర్ట్స్ డ్రెస్ లో ఊయ్యల ఊగుతున్న ఫోటోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది సామ్. తాజాగా భారీ బరువుల ఎత్తుతున్న వీడియో ఒకటి తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేసిన జెస్సీ అందరికీ షాక్ ఇచ్చింది. అక్కినేని ఫ్యామిలీ ఇన్సిపిరేషన్ తో హెల్త్, బాడీ మీద ఎక్కువగా దృష్టి పెట్టిన సమంత ఎక్కువ సమయం జిమ్ లోనే గడిపేస్తున్నట్టుగా ఉంది. అందుకే ఏకంగా 72 కేజీల బరువుతో కసరత్తులు చేస్తూ ఆ వీడియోను పోస్ట్ చేసింది. సమంత పోస్ట్ చేసిన ఈ వీడియోపై సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పెద్ద సంఖ్యలో రియాక్ట్ అవుతున్నారు. -
బిజీ బిజీ ప్రిపరేషన్లో రామ్చరణ్
-
ఆ భారీ పేలుడు ఫుటేజీ బయటకొచ్చింది
-
ఆ భారీ పేలుడు ఫుటేజీ బయటకొచ్చింది
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్లోగల మన్హటన్ శివారులోని చెల్సియాలో ఓ చెత్తకుండీలో శక్తిమంతమైన పేలుడుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. 29మంది తీవ్రంగా గాయపడటానికి కారణమైన ఈ బాంబు స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8.30కి జనసమ్మర్ద ప్రాంతంలో జరిగింది. దీని ధాటికి చుట్టుపక్కల భవనాల కిటికీలు, వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. అదే సమయంలో దీనికి దగ్గర్లోనే ప్రెజర్ కుక్కర్ బాంబు హడలెత్తించింది. వైర్లతో కూడిన దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ఈ పేలుడు సంభవించిన చెల్సియాలోని ఓ జిమ్ లోపలా బయట ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారు. అందులో రికార్డయిన ప్రకారం జనాలంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమై వెళుతున్నారు. ఆ చోటు ప్రశాంతంగా ఉందా సమయంలో. కొంతమంది వ్యక్తులు అలా జిమ్ దాటుకుంటూ ముందుకు వెళ్లారో లేదో వెంటనే వెనుకకు పరుగులు తీశారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీని ధాటికి ఆ జిమ్ లోని వస్తువులతోపాటు అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. నాలుగువైపులా ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించి ఆధారాలకోసం ఆరా తీస్తున్నారు. -
బిజీ బిజీ ప్రిపరేషన్లో కోహ్లి
కాన్పూర్: త్వరలో న్యూజిలాండ్తో సిరీస్ నేపథ్యంలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఫిట్నెస్ను మరింత మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాడు. తన ఫిట్నెసే సక్సెస్ మంత్రంగా భావించే కోహ్లి.. అతని ఇంటివద్ద జిమ్లో పలు రకాల కసరత్తులు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. దీనిలో భాగంగా ముందుగా 15 నిమిషాల పాటు సైక్లింగ్ చేసిన కోహ్లి.. ఆ తరువాత ఎటువంటి విశ్రాంతి తీసుకోకుండా ట్రేడ్మిల్ వ్యాయామం చేశాడు. దాదాపు నిమిషానికి 120 రౌండ్ల పాటు సైక్లింగ్ చేసిన తరువాత ఎటువంటి విరామం తీసుకోకుండా ట్రేడ్ మిల్ వ్యాయమం చేసినట్లు కోహ్లి స్పష్టం చేశాడు. ఈ మేరకు ప్రతీ 20 సెకెండ్లకు 10 స్ట్రైడ్స్ చేయడమే కాకుండా, ప్రతీ స్ట్రైడ్కు కేవలం 10 సెకెండ్ల విశ్రాంతి మాత్రమే తీసుకున్నట్లు ఈ స్టైలిష్ ఆటగాడు పేర్కొన్నాడు. ఈ నెల 22న కాన్పూర్లో జరిగే మొదటి మ్యాచ్తో ఈ మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లి నాయకత్వంలో స్వదేశంలో జరిగే సుదీర్ఘ క్రికెట్ సిరీస్ లో న్యూజిల్యాండ్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతోంది. -
ఫిట్తోనే హిట్..
సాక్షి, వీకెండ్ ప్రతినిధి: ప్రతి ఒక్కరూ ఫిజికల్ ఫిట్నెస్పై దృష్టి సారించాలని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఏ రంగంలో విజయం సాధించాలన్నా ఇది అవసరమన్నారు. ఒలింపిక్స్లో సింధు రజత పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన గోపీచంద్కు బంజారాహిల్స్లోని క్రిస్ గెతిన్స్ జిమ్లో శుక్రవారం గౌరవ సభ్యత్వం అందజేశారు. కార్యక్రమంలో జిమ్ డైరెక్టర్లు సతీష్ మర్యాద, శ్రీకాంత్, ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ దినాజ్ పాల్గొన్నారు. -
పోలీసుస్టేషన్లో ఆ రెండూ తప్పనిసరి!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రతి పోలీసుస్టేషన్పై జాతీయ జెండాతోపాటు ఠాణా లోపల ఓ వ్యాయామశాల(జిమ్) ఏర్పాటు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి సూచించారు. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పాటు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఒకప్పుడు కేవలం స్వాతంత్య్ర, గణతంత్య్ర దినోత్సవాల సందర్భంలోనే జాతీయ జెండాలు ఎగిరేవి. అయితే, నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో మాత్రం నిత్యం ఈ పతాకం ఎగురుతూ కనిపించేది. దీనికి భిన్నంగా సిటీలోని అన్ని పోలీసుస్టేషన్లతో పాటు సీసీఎస్, టాస్క్ఫోర్స్ కార్యాలయాలు, డివిజన్ ఏసీపీ, జోన్ డీసీపీ కార్యాలయాలపై జాతీయ జెండాను నిత్యం కచ్చితంగా ఎగురవేయాలంటూ కొత్వాల్ స్పష్టం చేశారు. నగరంలోని అన్ని ఠాణాలు, పోలీసు కార్యాలయాలకు వీటిని సరఫరా చేశారు. నామ్కే వాస్తేగా ఎగురవేస్తే సరిపోదని, ఏ దశలోనూ ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘనకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎస్ హెచ్ వోలకు కొత్వాల్ స్పష్టం చేశారు. దీంతో ఈ జెండాల పర్యవేక్షణ బాధ్యతల్ని స్థానిక అధికారులు ఆయా కార్యాలయాల్లో పని చేసే సిబ్బందికి అప్పగించారు. ప్రస్తుతం దాదాపు ప్రతి ఠాణా, పోలీసు కార్యాలయంపై జాతీయ జెండా ఎగురుతూ కనిపిస్తోంది. మరోపక్క పోలీసు అధికారులు, సిబ్బందికి ఫిట్నెస్కు ఎంతో కీలకమని కమిషనర్ భావించారు. పని ఒత్తిడి నేపథ్యంలో ఎవరికి వారు ఇళ్ల వద్ద వ్యాయామం చేసుకోవడం, వ్యాయామ శాలలకు వెళ్లడం సాధ్యం కాదు. వీరు పని చేసే చోటే వ్యాయామశాల అందుబాటులోకి తెస్తే అత్యధికులు వినియోగించుకునే ఆస్కారం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కొత్వాల్.. ఏసీపీ, డీసీపీ కార్యాలయాలతో పాటు పోలీసుస్టేషన్లలోనూ జిమ్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆధునికీకరణ జరుగుతున్న, నిర్మిస్తున్న ఠాణాల్లో అధికారులు, సిబ్బంది కార్యాలయాలతో పాటు జిమ్ కోసం ప్రత్యేక స్థలం కేటాయిస్తున్నారు. మిగిలిన చోట్ల దశల వారీగా ఏర్పాటుకు నిర్ణయించారు. ఉన్నతాధికారుల కార్యాయాల్లో వారు విశ్రాంతి తీసుకునే గదుల్లోనే ఉపకరణాలు అందుబాటులో ఉంచుతున్నారు. దాదాపు నగరంలోని అన్ని కార్యాయాలకు ఈ ఉపకరణాలు అందుతున్నాయి. మరో రెండు నెలల్లో ఠాణా పైనా జాతీయ జెండా, లోపల జిమ్ కచ్చితం కానున్నాయి. -
ఎక్కడున్నా అది మాత్రం మానను!
ఏ సిటీ వెళ్లినా.. ఆ మాటకొస్తే ఏ స్టేట్ వెళ్లినా సమంత అది మాత్రం మానరు. ఏ విషయంలో అయినా రాజీపడతారేమో కానీ, ఆ విషయంలో అస్సలు రాజీపడరు. ఇంతకీ సమంత ఏం మానుకోరు? అని ఊహించడం మొదలుపెట్టేశారా? మరేం లేదు. చెప్పబోతున్న విషయం జిమ్కి సంబంధించినది. ఈ మధ్య జిమ్ సెంటర్లో అమాంతంగా వంద కేజీలు బరువు ఎత్తి, సమంత అందర్నీ ఆశ్చర్యపరచిన విషయం తెలిసిందే. ఈవిడగారు మంచి ఫిట్నెస్ ఫ్రీక్. ఆ విషయం గురించి సమంత మాట్లాడుతూ - ‘‘ఫిట్నెస్ కోసం ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని పాటిస్తారు. కొంతమంది యోగా చేస్తారు. మరికొంతమంది ఏవేవో థెరపీలు చేస్తారు. ఇంకొంత మంది జిమ్ చేస్తారు. నా విషయానికొస్తే నేను జిమ్ చేస్తాను. వారంలో ఐదు రోజులు తప్పనిసరిగా చేయాల్సిందే. హైదరాబాద్లో ఉన్నా చెన్నై వెళ్లినా.. ఎక్కడికెళ్లినా జిమ్ మాత్రం మానను’’ అని చెప్పారు. సమంత ఫిట్నెస్ సీక్రెట్ అదన్నమాట. మామూలుగా యోగా చేసేటప్పుడు రమ్యకృష్ణ ‘బంచికు బంచికు చెయ్యి బాగా.. ఒంటికి యోగా మంచిదేగా..’ అని పాడారు. అదే సమంత అయితే.. ‘జిమ్.. జిమ్.. రిమ్.. జిమ్..’ అని పాడతారేమో. -
సిక్స్ ప్యాక్.. ఫిట్నెస్కు చిహ్నం కాదు!
కండలు పెంచినంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నట్లు కాదంటున్నారు వైద్య నిపుణులు. సిక్స్ ప్యాక్ బాడీ... చూసేందుకు ఫిట్ గా కనిపించినా... శరీర దారుఢ్యంతోపాటు, ఆరోగ్యంకూడ అవసరమని చెప్తున్నారు. ఫిట్నెస్ కోసం తరచుగా జిమ్ లకు వెళ్ళేవారు ట్రెండ్ ను ఫాలో అయ్యేందుకు బాడీ పెంచినా, తగిన ఆహార పద్ధతులను కూడ పాటించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో.. పోషక విలువలున్న ఆహారం కూడ అంతే అవసరమని చెప్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ తారలను, ప్రముఖ బాడీ బిల్డర్లను చూసి.. నేటి యువత సిక్స్ ప్యాక్ ట్రెండ్.. ఫాలో అయిపోతున్నారు. బానపొట్ట, వదులు శరీరం తగ్గించుకొని బాడీ ఫిట్నెస్ కోసం అత్యాధునిక జిమ్ లను ఆశ్రయిస్తున్నారు. కానీ చాలాశాతం వ్యాయామశాలల్లో శిక్షణ ఇచ్చేవారు తమ కస్టమర్లను డబ్బుకోసం తప్పుదారి పట్టిస్తుంటారు. తమ ఆదాయ వనరులను పెంచుకునేందుకు శరీరంలో కొవ్వును తగ్గించేందుకు ఆరోగ్యకరమైన ఆహారానికి బదులుగా మందులను సూచిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించిన ఇద్దరు యువకులు కార్డియాక్ సమస్యతో ఏకంగా ప్రాణాలను సైతం పోగొట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అందుకే ఫిట్నెస్ ప్రియులు కొవ్వును తగ్గించుకునేందుకు ప్రొటీన్ షేక్స్, స్టెరాయిడ్స్ వంటి వాటి జోలికి వెళ్ళవద్దని, ఆరోగ్యకరమైన ఆహారం, రోజువారీ వ్యాయామం ఫిట్నెస్ పెంచుకునేందుకు మూలాలని నిపుణులు సూచిస్తున్నారు. సిక్స్ ప్యాక్ ఆరోగ్యానికి చిహ్నం కాదని, ప్రకృతికి విరుద్ధంగా ప్రయత్నాలు చేయడం ఎంత మాత్రం సరికాదని ఫిట్నెస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వారికిచ్చిన నిర్ణీత సమయంలో ప్రాజెక్టు పూర్తి చేయడాని సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించే సినిమా యాక్టర్లను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఫాలో కావొద్దని హెచ్చరిస్తున్నారు. ఫిట్నెస్ ప్రియులు ముఖ్యంగా వారికి సిక్స్ ప్యాక్ అవసరం ఎంతవరకు ఉందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించి, రెండుసార్లు ప్లేట్ లెట్ కౌంట్ తగ్గడంతో ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితికి చేరుకున్నామని, సిక్స్ ప్యాక్ బాడీ కోసం 48 గంటలపాటు నీటికి, ఉప్పుకు దూరంగా ఉండటమేకాక, అదే సమయంలో వర్కవుట్ కూడ చేయాల్సి వస్తుందని అనుభవజ్ఞులు చెప్తున్నారు. అయితే ఇది భవిష్యత్తులో జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. అందుకే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతోపాటు, వ్యాయామం చేయాలని సిక్స్ ప్యాక్ అభిమానులకు సలహా ఇస్తున్నారు. ఒకవేళ తప్పనిసరిగా సిక్స్ ప్యాక్ చేయాలనుకుంటే ప్రకృతి సిద్ధమైన ఆహారమే తీసుకోవాలని, ఫలితానికి కొంత సమయం పట్టినా... ఆరోగ్యానికి నష్టం చేకూరదని చెప్తున్నారు. ఫిట్ గా కనిపించాలనుకుంటారే తప్ప... ఫిట్ గా ఉండాలనుకోరని మిస్టర్ ఇండియా రన్నర్ అప్ రాహుల్ రాజశేఖరన్ అంటున్నారు. రెండిటి మధ్య వ్యత్యాసాన్ని గమనించడం ఎంతో అవసరమని చెప్తున్నారు. శరీరంలోని అవయవాలు ఆరోగ్యంగా పనిచేసేందుకు స్త్రీ పురుషులిద్దరికీ కనీసం 15 నుంచి 20 శాతం కొవ్వు అవసరమౌతుందని, అయితే తమకు వృత్తి పరంగా అది సాధ్యం కాకపోవడంతో 5శాతం మాత్రమే కొవ్వు శరీరంలో ఉంటుందని, ఈ పరిస్థితి భవిష్యత్తులోతమకు తీవ్ర నష్టాన్ని కలుగజేయడంతోపాటు సమాజానికి తప్పుడు సందేశాన్ని అందించడం బాధగా అనిపిస్తుందని చెప్తున్నారు. -
సమంత లవ్ స్టోరీ!
టాప్ హీరోయిన్ సమంత లవ్ స్టోరీ ఇది అంటూ అప్పుడప్పుడు వదంతులు వినిపిస్తూనే ఉంటాయి. వాటిని ఆమె కొట్టిపారేయడం పరిపాటిగా మారింది. ఆమె లవ్ స్టోరీ ఏమైనా బయటకు లీకైందా అన్న అనుమానం తలెత్తకమానదు. అయితే ఈ లవ్ స్టోరీలో ఆమె ప్రేమలో పడింది ఏ వ్యక్తితోనూ కాదు. ఎందుకంటే సమంతా లవ్ స్టోరీలో కథానాయకుడు జిమ్ అని తెలిసి అశర్చపోనక్కర్లేదు. ఎందుకంటే జిమ్ లో కసరత్తులు చేస్తున్న సందర్భంగా ఓ ఫొటో దిగిన సమంత ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 'మై లవ్ స్టోరీ విత్ జిమ్' అని ట్విట్ లో పేర్కొంది. ఈ ఫొటో, వివరాలు గమనించినట్లయితే వారంలో కొన్ని గంటలు జిమ్ లో కచ్చితంగా గడుపుతన్నట్లు కనిపిస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్.. ఇలా ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా ముద్దుగుమ్మలు నాజూకుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలో హీరోలతో పోటీపడుతూ జిమ్ వర్కవుట్స్, యోగా, ఇలా రకరకాల పద్ధతులను అందాలభామలు ఫాలో అవుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ లలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన హీరోయిన్లలో సమంత ఒకరని చెప్పవచ్చు. సమంతా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి బొద్దుగా అవ్వకుండా ఉండేందుకు ఫిట్ నెస్ ఫార్ములాస్ వాడుతోంది. శ్రీయ, పరిణీతి చోప్రా, ఇలా చెప్పుకుంటేపోతే చాలామంది హీరోయిన్లు జిమ్ లో వర్కవుట్లు చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇటీవల కాలంలో వార్తల్లో కెక్కిన విషయం తెలిసిందే. -
జిమ్లో కొన్ని కోట్ల బ్యాక్టీరియా!
లావొక్కింత తగ్గించుకోవాలనే తపనతోనో, జీరో సైజ్ కోసమో, సిక్స్ ప్యాక్ సాధించాలనే పట్టుదలతోనే నేటి యువత జిమ్ల వెంట పరుగుతీస్తున్న విషయం తెల్సిందే. అయితే జిమ్ పరికరాలపై మనకు హానికరమైన కొన్ని కోట్ల బ్యాక్టరియా ఉంటుందన్న విషయం ఎంత మందికి తెలుసు? ఇది తెలుసుకోవడం కోసమే ‘ఫిట్ రేటెడ్’ సంస్థ జిమ్లోని 27 పరికరాలపై పరిశోధనలు జరిపి కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఉందని కనిపెట్టింది. ప్రతి జిమ్ పరికరంపైనా పది లక్షలకు మించి జెర్మ్స్ ఉంటాయని పరిశోధనలో తేలింది. ట్రెడ్మిల్ స్క్రీన్ను టచ్ చేసినప్పుడల్లా, ఫ్రీ వెయిట్ను పట్టుకున్నప్పుడల్లా బ్యాక్టీరియా జిమ్ యూజర్లపై దాడి చేస్తుంది. దీని వల్ల నిమోనియా లేదా సెప్టిసేమియా, చర్మ వ్యాధులు సంక్రమిస్తాయి. ► ట్రెడ్మిల్పై పబ్లిక్ టాయ్లెట్ కన్నా 74 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. ► ఫ్రీ వెయిట్స్పై సరాసరి టాయ్లెట్ సీటుకన్నా 362 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. ► ఎక్సర్సైజ్ బైక్పై స్కూల్ కేఫ్ ట్రేకన్నా 39 రెట్లు బ్యాక్టీరియా ఉంటుంది. ► అన్ని మూడు రకాల పరికరాలపై గ్రామ్ పాజిటివ్ కొస్సీ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది స్కిన్తోపాటు ఇతర ఇన్పెక్షన్లను కలిగిస్తుంది. ఈ రకమైన బ్యాక్టీరియా యాంటీ బయాటిక్స్కు కూడా లొంగదు. ►ఫ్రీ వెయిట్స్, ఎక్సర్సైజ్ బైక్పైనా బసిల్లస్ బ్యాక్టీరియా కూడా ఉన్నట్టు వెల్లడైంది. దీని వల్ల చెవి, కళ్లు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వస్తాయి. జిమ్ పరికరాలను రోజుకు ఎంతో మంది ఉపయోగిస్తుండడం వల్ల, వారి నుంచి కారే చెమట బిందువులతో కలసి బ్యాక్టీరియా విస్తరిస్తుందని నిపుణులు తెలిపారు. వాటిని వెంటవెంటనే యాంటీ బ్యాక్టీరియా రసాయనాలతో శుభ్రం చేయకపోవడం వల్ల ఈపరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు. బ్యాక్టీరియా భయంతో జిమ్ను మానేయాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వారు చెబుతున్నారు. జాగ్రత్తలు జిమ్లోకి ప్రవేశించగానే యాంటీ బ్యాక్టీరియా జెల్ లేదా రసాయనంతో చేతులు కడుక్కోవాలి. శుభ్రమైన టవల్తో తుడుచుకోవాలి. అదే జెల్తో మనం పట్టుకోబోయే ప్రతి జిమ్ పరికరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాతే దాన్ని ఉపయోగించాలి. ప్రతి పరికరం వర్కవుట్ తర్వాత మళ్లీ చేతులు జెల్తో కడుక్కోవాలి. ఇంటికి వెళ్లేటప్పుడు కూడా శుభ్రంగా చేతులు కడుక్కొని వెళ్లాలి. వెళ్లాక జిమ్ బట్టలను నీటిలో తడిపి ఉతికేసుకోవాలి. ఇదంతా శ్రమెందుకు అనుకునేవారు ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. -
నాయకులవుతారా.. జిమ్కు వెళ్లండి
న్యూయార్క్: రాజకీయ నాయకులుగా మారి దేశాన్ని పాలించాలని కలలు కంటున్నారా? అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జిమ్ల వైపు క్యూ కట్టండి. ఎందుకంటే, ఓ వ్యక్తి మంచి శారీరక దారుఢ్యాన్ని కలిగి ఉండి, మంచి ఎత్తు ఉంటే తప్పకుండా నాయకుడవుతాడని, ప్రజలను ఇట్టే ఆకర్షిస్తాడని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. తెలివి తేటలు, సుదీర్ఘ దృష్టి అనేవి ప్రతి వ్యక్తికి ఉండే అంతర్గత లక్షణాలని, వాటిని కేవలం అనుభవం ద్వారానే ప్రజలు తెలుసుకోగలుగుతారని, కానీ, శారీరక దారుఢ్యం మాత్రం బయటకు కనిపించేదని, చూడగానే కళ్లను ఇట్టే ఆకర్షించి నాయకుడంటే ఇతడే అనే భావనను వారికి కలిగిస్తుందంటా. 'ఎన్నో ఉదాహరణలతో పొందుపరిచి ఉన్న అంశాలను పరిశీలించిన మాకు ప్రపంచంలో శారీరక సామర్థ్యం ఉన్నవారంతా రాజకీయ నాయకులుగా ఎదిగారని తెలిసింది' అని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కెలీ హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన పరిశోధన కారులు తెలిపారు. -
అప్పట్లో నా వైపు వింతగా చూసేవాళ్లు!
‘‘శరీరం, మనసు... రెండూ తేలికగా ఉంటే ఏ పనైనా తేలికగా చేసేయొచ్చు. కానీ, అవి తేలికగా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పటికీ సాధించలేమనుకునే కొన్ని విషయాలను కూడా ఒక పనితో ఇట్టే సాధించగలం. అదెలా? ఈ రెండు ప్రశ్నలకూ సమాధానం ఒకటే... యోగా’’ అని శిల్పా శెట్టి అంటున్నారు. ఇప్పుడామె వయసు నలభై ఏళ్లు. కానీ, ఆమె శరీరాకృతి పాతికేళ్ల పడుచులను పోలినట్లుగా ఉంటుంది. అలాగే, శిల్పాశెట్టి చాలా హుషారుగా కనిపిస్తారు. అందంతో పాటు మంచి ఆరోగ్యంతో ఉన్నట్లు అనిపిస్తుంటారు. ఆ ఘనత మొత్తం యోగాకే దక్కుతుందంటున్నారామె. యోగా గురించి ప్రత్యేకంగా కొన్ని విషయాలను ఆమె ఈ విధంగా పంచుకున్నారు. ♦ యోగా అనేది మన సంస్కృతి. కానీ, మన దేశంలో కన్నా విదేశాల్లోనే దీనికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఇక్కడ కూడా యోగా విలువ తెలుసుకుంటున్నారు. పధ్నాలుగేళ్ల క్రితం నేను యోగా మొదలుపెట్టాను. అప్పట్లో నేను యోగా చేస్తుంటే చాలామంది వింతగా చూసేవాళ్లు. ♦ యోగా అనేది వృద్ధుల కోసమే అనే అపోహ ఒకప్పుడు ఉండేది. ఆ అపోహ తొలగించాలనే సంకల్పంతోనే నేను యోగా డీవీడీ చేశాను. ఆ డీవీడీని పెద్దలు మాత్రమే కాదు.. పిల్లలు కూడా చూడాలని కోరుకున్నాను. ఎందుకంటే, భవిష్యత్తు అంతా పిల్లల పైనే ఆధారపడి ఉంది. ‘మీ యోగా డీవీడీ చాలా ఉపయోగంగా ఉంది’ అని నాతో చాలామంది అంటుంటారు. అప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ♦ జిమ్తో పోలిస్తే యోగా చేయడానికి అయ్యే ఖర్చు తక్కువ. ఇంకా చెప్పాలంటే రూపాయి ఖర్చు లేకుండా యోగా చేయొచ్చు. ఉచితంగా యోగా చేయించేవారి శాతం ఇప్పుడు ఎక్కువే ఉంది. జిమ్ చేస్తున్నప్పుడు శరీర భాగాలన్నీ కదులుతాయో లేదో నాకు తెలియదు కానీ, యోగా చేస్తున్నప్పుడు కదలని భాగం ఉండదు. ♦ యోగాకు కులమతాలతో సంబంధం లేదు. అందరూ చేయొచ్చు. వయసు తారతమ్యం లేదు. ఆస్తి, అంతస్థుల పట్టింపు లేదు. ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ప్రాణాయామం మంచి ఫలితాన్నిస్తుంది. అందుకనే నేను దాదాపు రోజూ యోగా చేస్తాను. దీనికోసం కనీసం ఐదు నిమిషాలైనా కేటాయిస్తాను. ♦ నాకు అన్ని ఆసనాలూ ఇష్టమే. ఒక్కో ఆసనం పని తీరు ఒక్కో విధంగా ఉంటుంది. కానీ, ‘సూర్య నమస్కారాలు’ మాత్రం శరీరంలో ఉన్న అన్ని భాగాలనూ కదిలిస్తాయి. రోజుకి జస్ట్ మూడుసార్లు సూర్య నమస్కారాలు చేసి చూడండి. చెమట పట్టేస్తుంది. శరీరంలో ఉండే మలినం ఆ చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంటుంది. ఇక, ఎక్కువసార్లు సూర్య నమస్కారాలు చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఊహించుకోవచ్చు. మీరు కనుక ఎక్కువసార్లు సూర్య నమస్కారాలు చేస్తే, ఇక ఆ తర్వాత ఏ ఆసనాలూ వేయాల్సిన అవసరం లేదు. అదే సరిపోతుంది. ♦ నా జీవనశైలి ఎంతో క్రమశిక్షణతో ఉంటుంది. రాత్రి త్వరగా నిద్రపోవడం, తెల్లవారుజామున మేల్కోవడం నా అలవాటు. ఒక్క ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లోనూ ఓ పద్ధతి ప్రకారం డైట్ ఫాలో అవుతాను. జిహ్వ చాపల్యం తీర్చుకోవడం కోసం కాకుండా, ఆరోగ్యానికి ఏది మంచిదో అదే తింటాను. అది కూడా టైమ్ ప్రకారమే. -
బక్వా నాచే షురూ కరో
ఫిట్నెస్ త్రూ ఫన్.. సిటీలో ఇదీ ట్రెండ్. స్టెప్ ఎరోబిక్స్ నుంచి మొదలుపెట్టి సల్సా, బాల్రూమ్ స్టెప్స్, హిప్హాప్.. ఇవన్నీ సిటీలో నృత్యాభిలాషుల కన్నా ఆరోగ్యాభిలాషుల కారణంగానే ఆదరణ పొందుతున్నాయనేది నిర్వివాదం. ఇక జుంబా డ్యాన్స్ స్టైల్ అయితే ప్రతి జిమ్, ఫిట్నెస్ సెంటర్లో తప్పక జత చేయాల్సిన అంశంగా మారిపోయింది. ఇప్పుడు అదే కోవలో వచ్చేస్తోంది బక్వా. - ఎస్.సత్యబాబు నెలన్నర క్రితం హైటెక్ సిటీలో నిర్వహించిన హైదరాబాద్ ఫిట్నెస్ కార్నివాల్ ద్వారా సిటీలో అరంగేట్రం చేసింది బక్వా డ్యాన్స్. సదరు ఈవెంట్కి మొత్తంగా వచ్చిన స్పందన కన్నా బక్వా యాక్టివిటీకే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. కొత్త కొత్త ఫిట్నెస్ మార్గాలు వెతుక్కునే సిటీజనులు ‘ఏమిటీ బక్వా’ అంటూ ఆరా తీయడం మొదలు పెడితే... అప్పటిదాకా దీనిపై అంతగా అవగాహన పెంచుకోని ట్రైనర్లు.. ఒక్కసారిగా నెట్లోకి వెళ్లి బ్లాగులూ, యూ ట్యూబ్ వీడియోలు సెర్చ్ చేసి దీని గురించి ప్రాథమిక పరిజ్ఞానం సంపాదించారు. ప్రస్తుతం సిటీలో జుంబా తదితర డ్యాన్స్ యాక్టివిటీల ద్వారా ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్న శిక్షకుల్లో పలువురిని బక్వా బాగా ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన సర్టిఫికేషన్ కోర్స్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో సిటీలో బక్వా సందడి మొదలుకానుంది. ఆఫ్రికా మూలాలు.. సిటీలో సందడి చేయనున్న బక్వా డ్యాన్స్ మూలాలు ఆఫ్రికాలో ఉన్నాయి. సౌతాఫ్రికన్ వార్ డ్యాన్స్, క్యాపొయిరా, కిక్ బాక్సింగ్, లైట్ బాక్సింగ్, స్టెప్ల కలయిక బక్వా. ఇదొక ఫన్ వర్కవుట్ ప్రోగ్రామ్. లైట్ బాక్సింగ్ని సూచించే బీవో, సౌతాఫ్రికన్ వార్డ్యాన్స్, ట్రెడిషనల్ క్వైటోను సూచించే కేడబ్ల్యూఏ నుంచి బక్వా పేరు పుట్టింది. అంతర్జాతీయ ఫిట్నెస్ ప్రముఖుడు పాల్ మార్వి దీని సృష్టికర్త. ఏడేళ్ల కృషితో దీన్ని లాస్ఏంజెల్స్లో లాంచ్ చేశాడు. జన్మతః సౌతాఫ్రికాకు చెందిన మార్వి లాస్ఏంజెల్స్లో లీడింగ్ గ్రూప్ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్. ఈ బక్వాను తన సొంత క్లాసుల గురించి ప్రత్యేకంగా క్రియేట్ చేసుకున్నాడు. తదనంతర కాలంలో ఇది ప్రపంచమంతా పాకింది. తైవాన్, జపాన్, అమెరికా. గ్రీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి చోట్ల హెల్త్పబ్స్లో బక్వా ఇప్పుడు హాట్ వర్కవుట్. విశేషాలెన్నో... దీనిని నేర్చుకోవడానికి డ్యాన్స్లో ప్రాథమిక అంశాలు సైతం తెలియనక్కర్లేదు. ప్రపంచంలో సైన్ లాంగ్వేజ్ వినియోగించే ఏకైక వర్కవుట్ ఇదే. అలాగే లెటర్స్, నంబర్స్, హ్యాండ్ సిగ్నల్స్, అమెరికన్ సైన్ లాంగ్వేజ్లు ఉపయోగించి చేసే వినూత్నమైన పోగ్రామ్ బక్వా. ఈ యాక్టివిటీలో పాప్, లాటిన్, హౌస్ మ్యూజిక్లను బ్యాక్ గ్రౌండ్గా వినియోగిస్తారు. ఇందులో పార్టిసిపెంట్స్కి తర్వాతి మూవ్ని చెప్పడానికి సైన్లాంగ్వేజ్ని ఉపయోగిస్తాడు ఇన్స్ట్రక్టర్. ఈ వర్కవుట్లో అందరూ ఒక గ్రూప్గా పాల్గొంటారు. డ్యాన్స్ చేసే సమయంలో అక్షరాలను, అంకెలను పార్టిసిపెంట్స్ తమ పాదాలతో డ్రా (చిత్రణ) చేస్తారు. బక్వా ఎల్, 3, జే, కే ఇంకా డజన్ల కొద్దీ ఇతర బక్వా స్టెప్స్ను పాదాలతో డ్రా చేస్తారు. మిగిలిన డ్యాన్స్ ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ తరహాలో స్టెప్స్ 8 కౌంటింగ్ ఇందులో ఉండదు. అసలు ఇందులో స్టెప్స్ కౌంటింగ్ అవసరమే లేదు. బీట్తో పాటు మ్యూజిక్ని ఫీలవుతూ కదలడమే. స్టెప్ తెలిస్తే చాలు ఇన్స్ట్రక్టర్ అందించే కొరియోగ్రఫీ అవసరం లేకుండానే ఫాలో అయిపోవచ్చు. ఉపయోగాలెన్నో... అన్ని వయసుల వారికీ తగ్గట్టుగా, అన్ని రకాల ఫిట్నెస్ లెవల్స్ ఉన్నవారికీ నప్పేలా డిజైన్ చేసిన డ్యాన్సింగ్ వర్కవుట్ బక్వా. ఇంటెన్సిటీ ఉన్నవారికీ, కావాలనుకునే వారికీ, లావుగా ఉన్నవారికీ, సన్నగా ఉన్నవారికీ.. ఇలా అందరికీ ఇది ఉపకరిస్తుంది. టోటల్ బాడీ వర్కవుట్గా, అత్యధిక కేలరీలను సహజమైన పద్ధతిలో ఖర్చు చేసేదిగా పేరొందింది. అత్యంత సులభంగా అనిపించే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక్క సెషన్లో అత్యధికంగా 1,200 కేలరీలు సైతం ఖర్చు చేసే అవకాశం ఉందంటే ఆశ్చర్యమే. ‘జుంబాతో పోల్చి చూస్తే ఇదొక అద్భుతమైన, సమర్థవంతమైన వర్కవుట్. అనూహ్యమైన స్ట్రెస్ బస్టర్. గంటలో 1,000 కేలరీలు ఖర్చు చేయిస్తుంది. జుంబా కూడా ట్రెడిషనల్ 8 కౌంట్ స్టెప్స్ను ఫాలో అవుతుంది. అలాగే దీనికన్నా కాస్త స్లో కూడా. బక్వాకి ఎటువంటి కొరియోగ్రఫీ అవసరం లేదు. మనం చేయాల్సిందల్లా... ఇంగ్లిష్ లాంగ్వేజ్ లెటర్స్ని, నంబర్స్ని మన ఫీట్తో డ్రా చేయాలి. ఉదాహరణకు ఎల్, కే, జేలను డ్రా చేయడం లేదా.. మీ దేహాన్ని నంబర్ 3 లాగా కదపడం వంటివి. ఈ డ్యాన్స్ను అన్ని వయసుల వారూ ఫాలో కావచ్చు’ అని ముంబైకి చెందిన ట్రైనర్ అంచల్ గుప్తా అంటున్నారు. ఇది కేవలం ఒక వర్కవుట్ మాత్రమే కాదని ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అని కూడా అంటున్నారు దీని రూపకర్త మార్వి. మన చుట్టూ ఉన్నవారితో ఎనర్జీనీ, ఎగ్జయిట్మెంట్నీ సమానంగా పంచుకునే అద్భుతమైన అనుభవం అంటున్నాడు. హైలెవల్ కార్డియో వర్కవుట్ చేశామనే ఫీలింగ్నే కలగనీయనంత పూర్తి వినోదం దీని స్పెషాలిటీ.