India Tour Of South Africa 2021
-
వారి కారణంగానే ఓడిపోయాం.. సంచలన వాఖ్యలు చేసిన షమీ
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తొలి సారి దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలని అడుగు పెట్టిన టీమిండియాకు మరోసారి నిరాశే ఎదరైంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ సంచలన వాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో భారత్ ఓడపోవడం తానను చాలా బాధించందని మహ్మద్ షమీ తెలిపాడు. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో భారత బ్యాటింగ్ యూనిట్ పూర్తి స్ధాయిలో విఫలమయ్యందని షమీ చెప్పాడు. "మా బ్యాటర్లు కీలక సమయాల్లో విఫలమయ్యారు. దీని కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ను మా జట్టును కోల్పోయింది. ఈ సిరీస్లో మా బౌలింగ్ యూనిట్ చాలా బాగా రాణించింది. కాబట్టి ప్రోటిస్ జట్టుకు భారత్ గట్టి పోటీ ఇచ్చింది. డిఫెండ్ చేయడానికి మాకు ఇంకా 50-60 పరుగులు ఉండి ఉంటే, మేము ఖచ్చితంగా చివరి రెండు టెస్టుల్లో గెలిచే అవకాశం కలిగి ఉండేవాళ్లం. త్వరలోనే మా జట్టు కోలుకుంటుందని నేను భావిస్తున్నాను" షమీ పేర్కొన్నాడు. ఇక సిరీస్లో రాహుల్ తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ అంతగా రాణించలేదు. -
IND vs SA: 'టీమిండియా అతడి సేవలను కోల్పోయింది.. అందుకే ఓడిపోయింది'
దక్షిణాఫ్రికాతో టెస్టు, వన్డే సిరీస్లను కోల్పోయి టీమిండియా ఘోర పరాభావం పొందిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో విజయం సాధించిన భారత్.. చివరి రెండు టెస్టుల్లో ఓటమి చెంది సిరీస్ను అతిథ్య జట్టుకు అప్పగించింది. అదే విధంగా మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో ప్రోటిస్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో వెటరన్ దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సేవలను టీమిండియా కోల్పోయిందని స్టెయిన్ పేర్కొన్నాడు. “భారత్ ఖచ్చితంగా సర్ రవీంద్ర జడేజా లాంటి వారి సేవలను కోల్పోయింది. అతను అద్భుతమైన క్రికెటర్. అతను తన స్పిన్ మయాజాలంతో ఆటను మలుపు తిప్పగలడు. అదే విధంగా జడ్డూ.. బ్యాట్తో కూడా రాణించగలడు’’ అని అభిప్రాయపడ్డాడు. ఇక భారత పేస్ బౌలింగ్ గురించి మాట్లాడూతూ.. ‘‘భారత్కు బౌలింగ్లో కొంత సమస్య ఉన్న మాట వాస్తవం. బుమ్రాకి బ్యాకప్గా ఒక మంచి బౌలర్ కావాలి. వారికి గంటకు 140-145 కిమీ స్పీడ్లో బౌలింగ్ చేయగల బౌలర్ అవసరం. ఇక టెస్టు సిరీస్లో షమీ కూడా అద్భుతంగా రాణించాడు" అని స్టెయిన్ పేర్కొన్నాడు. చదవండి: AUS vs SL: శ్రీలంక జట్టులో కీలక పరిణామం.. కోచ్గా లసిత్ మలింగ! -
కెప్టెన్గా అతడు ఏం చేశాడో నాకు తెలియడం లేదు..
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో ఓటమి చెందింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఇక భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన కెఎల్ రాహుల్.. కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గా కూడా విఫలమయ్యాడు. ఈ సిరీస్లో సారథిగా జట్టును విజయపథంలో రాహుల్ నడిపించలేక పోయాడు. ఈ క్రమంలో భారత కెప్టెన్ కేఎల్ రాహుల్పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. జట్టు క్లిష్ట పరిస్ధితుల్లో ఉన్నప్పుడు రాహుల్ వ్యూహాలను రచించడంలో విఫలమయ్యాడని గవాస్కర్ తెలిపాడు. “ఈ సిరీస్లో రాహుల్ కెప్టెన్గా పూర్తి స్ధాయిలో విఫలమయ్యాడు. దక్షిణాఫ్రికా భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పుడల్లా రాహుల్ తన వ్యూహాలకు దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా భారీ స్కోర్ చేయకుండా ఆపడంలో రాహుల్ నిర్ణయాలు నాకు సంతృప్తి పరచలేదు. బహుశా అతడికి అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్గా అతడికి అంత అనుభవంలేక పోవడమే దీనికి కారణం కావచ్చు. ఇక బ్యాటింగ్లో కూడా రాహుల్ విఫలమయ్యాడు" అని గవాస్కర్ పేర్కొన్నాడు. -
రాహుల్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు.. తొలి భారత కెప్టెన్గా..
దక్షిణాఫ్రికాతో జరిగిన అఖరి వన్డే లోను ఓటమి చెంది టీమిండియా ఘోర పరాభావం పొందింది. కేప్టౌన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్పై నాలుగు పరుగుల తేడాతో ప్రోటిస్ విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో అతిథ్య జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఇక టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే. రోహిత్ గైర్హజరీలో కెప్టెన్గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. కెప్టెన్గా మెదటి మూడు వన్డేల్లో ఓడిన తొలి భారత ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. కాగా ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ తన తొలి మూడు వన్డేలు ఓడిపోలేదు. ఇక ఈ సిరీస్లో కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గా కూడా రాహుల్ విఫలమయ్యాడు. -
ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి.. సిరీస్ క్లీన్స్వీప్ చేసిన దక్షిణాఫ్రికా
కేప్టౌన్: రెండో వన్డేతో సిరీస్ పోయింది. ఇప్పుడు ఆఖరి ఓటమితో పరువు పోయింది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ నాలుగు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలై సిరీస్ను 0–3తో చేజార్చుకుంది. మొదట దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ డికాక్ (124; 12 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ సాధించాడు. డసెన్ (52; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 283 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ ధావన్ (61; 5 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లి (65; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. 32వ ఓవర్లో జట్టు స్కోరు 156 పరుగుల వద్ద కోహ్లి అవుట్ కావడంతోనే క్లీన్స్వీప్ ఖాయమైనప్పటికీ... దీపక్ చహర్ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్తో గెలుపుబాట పట్టింది. 18 బంతుల్లో భారత్ విజయానికి 10 పరుగులు అవసరమైన దశలో 48వ ఓవర్ తొలి బంతికి చహర్ను ఎన్గిడి బోల్తా కొట్టించడంతో టీమిండియా ఓడిపోయేందుకు ఎక్కువసేపు పట్టలేదు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) ధావన్ (బి) బుమ్రా 124; మలాన్ (సి) పంత్ (బి) చహర్ 1; బవుమా (రనౌట్) 8; మార్క్రమ్ (సి) సబ్–రుతురాజ్ (బి) చహర్ 15; డసెన్ (సి) శ్రేయస్ (బి) చహల్ 52; మిల్లర్ (సి) కోహ్లి (బి) ప్రసిధ్ కృష్ణ 39; ఫెలుక్వాయో (రనౌట్) 4; ప్రిటోరియస్ (సి) సూర్యకుమార్ (బి) ప్రసిధ్ కృష్ణ 20, కేశవ్ (సి) కోహ్లి (బి) బుమ్రా 6; మగాలా (సి) రాహుల్ (బి) ప్రసిధ్ కృష్ణ 0; ఎన్గిడి (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 18; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 287. వికెట్ల పతనం: 1–8, 2–34, 3–70, 4–214, 5–218, 6–228, 7–272, 8–282, 9–287, 10–287. బౌలింగ్: దీపక్ చహర్ 8–0–53–2, బుమ్రా 10–0–52–2, ప్రసిధ్ కృష్ణ 9.5–0–59–3, జయంత్ యాదవ్ 10–0–53–0, చహల్ 9–0–47–1, శ్రేయస్ అయ్యర్ 3–0–21–0. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) మలాన్ (బి) ఎన్గిడి 9; ధావన్ (సి) డికాక్ (బి) ఫెలుక్వాయో 61; కోహ్లి (సి) బవుమా (బి) కేశవ్ 65; పంత్ (సి) మగాలా (బి) ఫెలుక్వాయో 0; శ్రేయస్ అయ్యర్ (సి) ఫెలుక్వాయో (బి) మగాలా 26; సూర్యకుమార్ (సి) బవుమా (బి) ప్రిటోరియస్ 39; దీపక్ చహర్ (సి) ప్రిటోరియస్ (బి) ఎన్గిడి 54; జయంత్ (సి) బవుమా (బి) ఎన్గిడి 2; బుమ్రా (సి) బవుమా (బి) ఫెలుక్వాయో 12; చహల్ (సి) మిల్లర్ (బి) ప్రిటోరియస్ 2; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 11; మొత్తం ( 49.2 ఓవర్లలో ఆలౌట్) 283. వికెట్ల పతనం: 1–18, 2–116, 3–118, 4–156, 5–195, 6–210, 7–223, 8–278, 9–281, 10–283. బౌలింగ్: ఎన్గిడి 10–0–58–3, ప్రిటోరియస్ 9.2–0– 54–2, మగాలా 10–0–69–1, కేశవ్ మహరాజ్ 10–0–39–1, ఫెలుక్వాయో 7–0–40–3, మార్క్రమ్ 3–0–21–0. -
పోరాడి ఓడిన భారత్.. సిరీస్ క్లీన్స్వీప్ చేసిన దక్షిణాఫ్రికా
10:20 PM: సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా పోరాడి ఓడిపోయింది. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.2 ఓవర్లలో 283 పరుగుల వద్ద ఆలౌట్ కావడంతో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను దక్షిణాఫ్రికా 3-0తో క్లీన్స్వీప్ చేసింది. దీపక్ చహర్ 54 పరుగులతో ఆఖర్లో ఆశలు రేపినప్పటికి చివరి నిమిషంలో ఔటవడంతో టీమిండియా ఓటమి ఖరారు అయింది. అంతకముందు శిఖర్ ధావన్ 61, కోహ్లి 65 రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఫెక్యలువాయో 3, లుంగీ ఎన్గిడి 3, డ్వేన్ ప్రిటోరియస్ 2 వికెట్లు తీశారు. 8:46 PM: కోహ్లి(65).. టీమిండియా నాలుగో వికెట్ డౌన్ విరాట్ కోహ్లి శతక దాహం ఈ మ్యాచ్లో కూడా తీరలేదు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆచితూచి ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి.. 65 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేశవ్ మహారాజ్ బౌలింగ్లో బవుమాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 32 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 157/4గా ఉంది. క్రీజ్లో శ్రేయస్ అయ్యర్(16), సూర్యకుమార్ యాదవ్(1) ఉన్నారు. 8:15 PM: ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 116 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ చేసి శతకం దిశగా సాగుతున్న శిఖర్ ధవన్(73 బంతుల్లో 61; 5 ఫోర్లు, సిక్స్).. ఫెలుక్వాయో బౌలింగ్లో వికెట్కీపర్ డికాక్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అదే ఓవర్లో టీమిండియాకు మరో షాక్ తగిలింది. పంత్ వచ్చీ రాగానే.. మగాలాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఫలితంగా టీమిండియా 23 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజ్లో కోహ్లి(43), శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. టార్గెట్ 288.. ఆదిలోనే టీమిండియాకు షాక్ 288 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(9).. ఎంగిడి బౌలింగ్లో మలాన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా టీమిండియా 18 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్లో ధవన్(9), కోహ్లి ఉన్నారు. 6: 04 PM: టీమిండియా టార్గెట్ 288 ఆఖరి ఓవర్లో ప్రసిద్ధ కృష్ణ చెలరేగడంతో దక్షిణాఫ్రికా చివరి రెండు వికెట్లు బంతుల వ్యవధిలో కోల్పోయింది. 49వ ఓవర్ తొలి బంతిని బౌండరీకి తరలించిన మిల్లర్(39)..మూడో బంతికి క్యాచ్ ఔట్ కాగా, ఐదో బంతికి మగాలా.. కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 287 పరుగుల వద్ద ముగిసింది. టీమిండియా బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 3, బుమ్రా, దీపక్ చాహర్ తలో రెండు వికెట్లు, చహల్ ఓ వికెట్ పడగొట్టగా.. మార్క్రమ్ రనౌటయ్యాడు. సఫారీ బ్యాటర్లలో డికాక్(124) సెంచరీతో చెలరేగాడు. 5:56 PM: ఎనిమిదో వికెట్ డౌన్ భారీ స్కోర్ సాధిస్తామనుకున్న దక్షిణాఫ్రికా ఆశలపై టీమిండియా బౌలర్లు నీళ్లు చల్లారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు. 48వ ఓవర్లో ప్రసిద్ధ కృష్ణ.. ప్రిటోరియస్(20)ను పెవిలియన్కు పంపగా, 49వ ఓవర్లో బుమ్రా.. కేశవ్ మహారాజ్(6)ను ఔట్ చేశాడు. ఫలితంగా ఆ జట్టు 49 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. క్రీజ్లో మిల్లర్(35), మగాలా ఉన్నారు. 5: 18 PM: ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. ఫెలుక్వాయో(4) రనౌట్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన త్రో కారణంగా దక్షిణాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 40.1వ ఓవర్లో ఫెలుక్వాయో(4) రనౌటయ్యాడు. క్రీజ్లో మిల్లర్(7), ప్రిటోరియస్ ఉన్నారు. 41 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 229/6గా ఉంది. 5:02 PM: డస్సెన్(52) ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా హాఫ్ సెంచరీ చేసిన వెంటనే డస్సెన్ ఔటయ్యాడు. 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద చహల్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 37 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 219/5గా ఉంది. క్రీజ్లో మిల్లర్(2), ఫెలుక్వాయో ఉన్నారు. 4: 52 PM: దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ డౌన్ 124 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సెంచరీ హీరో డికాక్ ఔటయ్యాడు. బుమ్రా బౌలింగ్లో ధవన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. 36 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 216/4గా ఉంది. క్రీజ్లో డస్సెన్(51), డేవిడ్ మిల్లర్(1)ఉన్నారు. 4: 20 PM: డికాక్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా దక్షిణాఫ్రికా 31 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 174/3గా ఉంది. డికాక్.. 110 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసి 102 పరుగులతో కొనసాగుతున్నాడు. డస్సెన్ 46 బంతుల్లో 40 పరుగులతో డికాక్కు తోడుగా క్రీజ్లో ఉన్నాడు. కాగా, టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మలాన్(1), మార్క్రమ్(15), బవుమా(8) ఔటయ్యారు. టీమిండియా బౌలర్లు చాహర్ రెండు వికెట్లు పడగొట్టగా బవుమా రనౌటయ్యాడు. 3:36 PM: సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ మరోసారి అర్థశతకంతో మెరిశాడు. 60 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న డికాక్ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం సౌతాఫ్రికా 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. 3: 06 PM: మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా భువనేశ్వర్ కుమార్ స్థానంలో జట్టులోకి వచ్చిన దీపక్ చాహర్ సత్తా చాటుతున్నాడు. తొలుత మలాన్ను పెవిలియన్కు పంపిన అతను.. 13 ఓవర్లో మరో వికెట్ పడగొట్టాడు. సబ్స్టిట్యూట్ ఆటగాడు రుతురాజ్ క్యాచ్ పట్టడంతో మార్క్రమ్(15) పెవిలియన్ బాట పట్టాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 70 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. క్రీజ్లో డికాక్(42), డస్సెన్ ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 7వ ఓవర్లో దక్షిణాఫ్రికాకు మరో షాక్ తగిలింది. చాహర్ బౌలింగ్లో ఇన్ ఫామ్ బ్యాటర్, సఫారీ కెప్టెన్ బవుమా(12 బంతుల్లో 8) రనౌటయ్యాడు. కేఎల్ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో సఫారీ కెప్టెన్ను పెవిలియన్కు పంపాడు. ఫలితంగా ఆ జట్టు 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజ్లో డికాక్(26), మార్క్రమ్ ఉన్నారు. అంతకుముందు 3వ ఓవర్ తొలి బంతికే దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. భీకర ఫామ్లో ఉన్న ఓపెనర్ జన్నెమన్ మలాన్(1).. చాహర్ బౌలింగ్లో పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 1:40 PM: కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తుది సమరానికి టీమిండియా సిద్దమైంది. ఇప్పటికే వన్డే సిరీస్ను కోల్పోయిన భారత్.. చివరి వన్డేలోనైనా నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో నాలుగు మార్పులతో భారత్ బరిలోకి దిగగా, ప్రోటిస్ ఒకే ఒక మార్పు చేసింది. జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్, సూర్యకుమార్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చారు. భారత తుది జట్టు: కెఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, జానేమన్ మలన్, ఎయిడెన్ మార్కరమ్, రసీ వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లూక్వాయో, మగాలా, కేశవ్ మహరాజ్, డ్వైన్ ప్రిటోరియస్, లుంగి ఎండ్వైన్ ప్రిటోరియస్గిడి. -
అరుదైన రికార్డుకు చేరువలో చాహల్.. తొలి బౌలర్గా!
India vs South Africa ODI: దక్షిణాఫ్రికాతో టెస్టు, వన్డే సిరీస్లను కోల్పోయిన టీమిండియా అఖరి పోరుకు సిద్దమైంది. కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న చివరి వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో భారత స్సిన్నర్ యుజ్వేంద్ర చాహల్ని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో చాహల్ ఒక్క వికెట్ సాధిస్తే దక్షిణాఫ్రికా గడ్డపై ప్రోటిస్ జట్టుపై అత్యధిక వికెట్ల పడగొట్టిన బౌలర్గా నిలుస్తాడు. కాగా ఇప్పటికే 17 వికెట్లు పడగొట్టిన చాహల్.. కుల్దీప్ యాదవ్ (17)తో సమానంగా నిలిచాడు. అదే విధంగా మరో రెండు వికెట్లు సాధిస్తే.. వన్డేల్లో 100 వికెట్ల క్లబ్లో చాహల్ చేరుతాడు. ఇక టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్లో 3000 పరుగుల క్లబ్లో చేరడానికి 12 పరుగుల దూరంలో నిలిచాడు. చదవండి: Ind Vs Sa 3rd ODI: ధావన్కు విశ్రాంతి.. ఓపెనర్గా వెంకటేశ్.. భువీ వద్దు.. అతడే కరెక్ట్! -
దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. విరాట్ కోహ్లి దూరం!
South Africa vs India, 3rd ODI: కేప్టౌన్ వేదికగా దక్షిణాష్రికాతో అఖరి వన్డేలో ఆదివారం భారత్ తలపడనుంది. ఇప్పటికే రెండు వన్డే్ల్లో ఓటమి చెంది సిరీస్ను భారత్ కోల్పోయింది. టీమిండియా కనీసం చివరి వన్డేలోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. కాగా రెండు వన్డేల్లోనూ కెప్టెన్గా కేఎల్ రాహుల్ ఏమాత్రం ఆకట్టుకోకపోగా...హెడ్ కోచ్గా ప్రధాన ఆటగాళ్లతో తొలి పర్యటనలోనే రాహుల్ ద్రవిడ్కు కూడా సంతృప్తికర ఫలితం దక్కలేదు. అయితే చివరి మ్యాచ్లో భారత జట్టులో కీలక మార్పులు చేయున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు వన్డేల్లో విఫలమైన భువనేశ్వర్ కూమార్పై వేటు వేసి.. అతడి స్థానంలో దీపక్ చాహర్కు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. అదే విధంగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతిని ఇచ్చి .. అతడి స్ధానంలో సూర్యకూమార్ యాదవ్ ఎంపిక చేసే ఆలోచనలో టీమ్ మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తొలి రెండు వన్డేల్లో విఫలమైన శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్పై కూడా వేటు పడే అవకాశం ఉంది. ఒక వేళ శ్రేయస్ అయ్యర్ దూరమైతే అతడి స్ధానంలో రుతురాజ్ గైక్వాడ్ జట్టులోకి రానున్నాడు. చదవండి: SA vs IND: చివరి వన్డేలో గెలిచి భారత్ పరువు నిలుపుకునేనా? -
దక్షిణాఫ్రికా అరుదైన రికార్డు.. 21 ఏళ్ల తర్వాత!
పార్ల్ వేదికగా భారత్తో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. కాగా భారత్ నిర్ధేశించిన 288 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ప్రోటిస్ సునాయాసంగా ఛేదించింది. కాగా ఈ మ్యాచ్లో భారత బౌలర్లు వికెట్ల పడగొట్టడంలో విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా విజయంలో ఓపెనర్లు మలాన్, డికాక్ కీలక పాత్ర పోషించారు. కాగా పార్ల్ వేదికగా వన్డే క్రికెట్లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యధిక పరుగుల ఛేజింగ్ కావడం గమనార్హం. అంతకుముందు 2001లో శ్రీలంకపై 248 పరుగుల టార్గెట్ను సౌతాఫ్రికా చేధించింది. ఇక టెస్ట్, వన్డే సిరీస్లను కోల్పోయిన టీమిండియా.. కేప్ టౌన్ వేదికగా జనవరి 23న జరిగే చివరి వన్డేలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. చదవండి: SA vs IND: 'భారత్ గెలవాలంటే అతడు జట్టులోకి రావాలి' -
వన్డేల్లో దక్షిణాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. తొలి ఆటగాడిగా
పార్ల్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో ప్రోటిస్ జట్టు కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయంలో ఓపెనర్లు మలాన్, డికాక్ కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ ఓపెనింగ్ వికెట్కు 132 పరుగులు జోడించారు. మలాన్ 91 పరుగులు చేయగా, డికాక్ 78 పరుగులు సాధించాడు. అయితే ఈ మ్యాచ్లో ప్రోటిస్ ఓపెనర్ జననేమన్ మలన్ ప్రపంచ రికార్డు సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 700 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మలన్ నిలిచాడు. మలన్ 12 ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించగా, నెదర్లాండ్ ఆటగాడు టామ్ కూపర్ 13 ఇన్నింగ్స్లో 700 పరుగులు చేశాడు. ఇక టెస్ట్, వన్డే సిరీస్లను కోల్పోయిన టీమిండియా.. కేప్ టౌన్ వేదికగా జనవరి 23న జరిగే చివరి వన్డేలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. చదవండి: హైదరాబాదీ ఆల్రౌండర్కి బంపర్ ఆఫర్.. భారత జట్టులో చోటు! -
రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి.. సిరీస్ సమర్పయామి
IND vs SA 2nd ODI : సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా పరాజయం పాలైంది. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది. మరో 10 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సౌతాఫ్రికా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. సౌతాఫ్రికా బ్యాటింగ్లో జానేమన్ మలన్ 91, క్వింటన్ డికాక్ 78, బవుమా 35 రాణించగా.. చివర్లో మార్ర్కమ్ 35 నాటౌట్, డసెన్ 34 నాటౌట్ మిగిలిన లాంచనాన్ని పూర్తి చేశారు. ఫ్లాట్గా ఉన్న వికెట్పై టీమిండియా బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేక చతికిలపడిపోయారు. భారత బౌలర్లలో బుమ్రా, భువనేశ్వర్, చహల్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆరంభంలోనే ధావన్(29), కోహ్లి డకౌట్గా వెనుదిరిగినప్పటికి.. కేఎల్ రాహుల్(55), పంత్(85) పరుగులు చేయడంతో పాటు.. మూడో వికెట్కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో టీమిండియా 183/2తో కోలుకున్నట్లే కనిపించింది. కానీ వెనువెంటనే పంత్, రాహుల్ ఔట్ కావడంతో టీమిండియా బ్యాటింగ్ తడబడింది. చివర్లో శార్దూల్ ఠాకూర్ 40 నాటౌట్ ఆకట్టుకోవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్ షంసీ 2, మగల, మార్క్రమ్, కేశవ్ మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు. 9:10 PM: విజయం దిశగా సాగుతున్న దక్షిణాఫ్రికా వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 91 పరుగులు చేసిన ఓపెనర్ మలాన్ను బుమ్రా బౌల్డ్ చేయగా.. ఆ తర్వాత చహల్ బౌలింగ్లో బవుమా(35) కాట్ అండ్ బౌల్డ్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 216 పరుగులతో ఆడుతోంది. ప్రొటీస్ విజయానికి ఇంకా 72 పరుగుల దూరంలో ఉంది. మార్క్రమ్, డసెన్లు క్రీజులో ఉన్నారు. 8:07 PM: టీమిండియా ఎట్టకేలకు వికెట్ సాధించింది. ఆరంభం నుంచి దూకుడు కనబరుస్తున్న సౌతాఫ్రికాను శార్దూల్ దెబ్బ తీశాడు. దాటిగా ఆడుతున్న డికాక్(78)ను ఎల్బీగా పెవిలియన్ చేర్చి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. 7:25 PM: 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా డికాక్ ఆరంభం నుంచి భారీ షాట్లు ఆడుతూ అర్థశతకం సాధించాడు. 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన డికాక్ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. జానేమన్ మలన్ 40 పరుగులతో డికాక్కు సహకరిస్తున్నాడు. ప్రస్తుతం 17 ఓవర్లలో సౌతాఫ్రికా వికెట్ నష్టపోకుండా 109 పరుగులు చేసింది. 7:10 PM: 10 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. డికాక్ 48, జానేమన్ మలన్ 20 పరుగులతో ఆడుతున్నారు. 6:47 PM: 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. డికాక్ 29, జానేమన్ మలన్ 4 పరుగులతో ఆడుతున్నారు. 6:00 PM: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆరంభంలోనే ధావన్(29), కోహ్లి డకౌట్గా వెనుదిరిగినప్పటికి.. కేఎల్ రాహుల్(55), పంత్(85) పరుగులు చేయడంతో పాటు.. మూడో వికెట్కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో టీమిండియా 183/2తో కోలుకున్నట్లే కనిపించింది. కానీ వెనువెంటనే పంత్, రాహుల్ ఔట్ కావడంతో టీమిండియా బ్యాటింగ్ తడబడింది. చివర్లో శార్దూల్ ఠాకూర్ 40 నాటౌట్ ఆకట్టుకోవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్ షంసీ 2, మగల, మార్క్రమ్, కేశవ్ మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు. 5:43 PM: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 47 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్ 32, అశ్విన్ 11 పరుగులతో ఆడుతున్నారు. 4:57 PM: తబ్రైజ్ షంసీ బౌలింగ్లో శ్రేయాస్ అయ్యర్(11) ఎల్బీగా వెనుదిరగడంతో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 11, శార్దూల్(0) ఆడుతున్నారు. 4:37 PM: టీమిండియా కేఎల్ రాహుల్(55), రిషబ్ పంత్(85) రూపంలో వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. 55 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ మగల బౌలింగ్లో డసెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత షంసీ వేసిన 33వ ఓవర్లో భారీ షాట్కు యత్నించిన పంత్ మార్ర్కమ్కు చిక్కాడు. ప్రస్తుతం 33 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 4:14 PM: ధావన్, కోహ్లిలు ఔటైన తర్వాత కేఎల్ రాహుల్, పంత్ కలిసి టీమిండియా ఇన్నింగ్స్ నడిపిస్తున్నారు. ఈ క్రమంలో కేఎల్ అర్థశతకం సాధించాడు. అంతకముందు పంత్ 43 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కేఎల్ రాహుల్ 44 పరుగులతో ఆడుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా 29 ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. 03:00 PM: టీమిండియా వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. ధావన్( 29) పరుగులు చేసి మరక్రామ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరగా, విరాట్ కోహ్లి కేశవ్ మహారాజ్ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. పంత్ 10, రాహుల్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. 02:25 PM: టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిలకడగా ఆడుతుంది. 5 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్ట పోకుండా 33 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాహల్(10), ధావన్(17) పరుగులతో ఉన్నారు. 1:40 PM: దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా తాడో పేడో తేల్చుకోవడానికిసిద్దమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్లో నిలవాలంటే తప్పనిసారిగా ఈ మ్యాచ్లో భారత్ గెలవాలి. ఇక ఈ మ్యాచ్లో ఎటు వంటి మార్పులు లేకుండానే భారత్ బరిలోకి దిగింది. దక్షిణాఫ్రికా జట్టు ఒక మార్పుతో ఈ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్లో 1-0 తేడాతో ప్రోటిస్ జట్టు ముందుంజలో ఉంది. తుది జట్లు: టీమిండియా: కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్. దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, జానేమన్ మలన్, ఎయిడెన్ మార్కరమ్, రసీ వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లూక్వాయో, మగాలా, కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షంషీ, లుంగి ఎంగిడి. చదవండి: యూసుఫ్ పఠాన్ తుపాన్ ఇన్నింగ్స్ .. కేవలం 40 బంతుల్లో.. -
కీలక పోరుకు సిద్దమైన టీమిండియా.. సిరీస్ సమం చేస్తారా?
2nd ODI vs SA: గత ఏడాదిని భారీ టెస్టు విజయంతో ఘనంగా ముగించిన భారత క్రికెట్ జట్టుకు ఈ ఏడాది ఇంకా గెలుపు బోణీ కాలేదు. దక్షిణాఫ్రికా గడ్డపై వరుసగా రెండు టెస్టులు ఓడటంతోపాటు తొలి వన్డేలో కూడా టీమిండియా చిత్తయింది. టెస్టు సిరీస్ కోల్పోయిన జట్టు ఇప్పుడు వన్డే సిరీస్ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. దక్షిణాఫ్రికాతో నేడు జరిగే రెండో వన్డేలో భారత్ తలపడనుంది. తొలి వన్డే జరిగిన వేదికపైనే ఈ మ్యాచ్ కూడా నిర్వ హిస్తుండగా... ఇరు జట్లూ మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తుది ఫలితంలో ఏమైనా మార్పు ఉంటుందా లేక భారత్ వన్డే సిరీస్నూ అప్పగిస్తుందా చూడాలి. వెంకటేశ్కు మరో చాన్స్! తొలి వన్డేలో కెప్టెన్ కేఎల్ రాహుల్ వ్యూహాలు ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అంటూ తీసుకున్న వెంకటేశ్ అయ్యర్తో అతను ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. ముఖ్యంగా బవుమా, డసెన్ జోడీని విడగొట్టడంలో ప్రధాన బౌలర్లంతా విఫలమైనప్పుడు కూడా అలాంటి ప్రయత్నం చేయలేదు. బౌలింగ్ చేయనప్పుడు వెంకటేశ్కంటే రెగ్యులర్ బ్యాటర్ సూర్యకుమార్ సరైన ప్రత్యామ్నాయమని అనిపించింది. అయితే ఒక్క అరంగేట్రం మ్యాచ్తోనే వెంకటేశ్ను పక్కన పెట్టే అవకాశాలు తక్కువ. అతనికి మరో చాన్స్ లభించవచ్చని తెలుస్తోంది. సుదీర్ఘ కాలంగా టాప్–3 ప్రదర్శనతోనే విజయాలు దక్కించుకున్న భారత్కు మళ్లీ మిడిలార్డర్ సమస్యగా మారింది. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ కూడా రాణిస్తేనే జట్టుకు గెలుపు అవకాశాలు ఉంటాయి. బ్యాటర్గా, కెప్టెన్గా కూడా రాహుల్కు ఇది కీలక మ్యాచ్ కానుంది. మరోవైపు తొలి వన్డేలో గెలుపుతో దక్షిణాఫ్రికా జట్టులో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఇదే జోరులో మరో మ్యాచ్ గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. టాప్–6లో మార్క్రమ్ మినహా అంతా ఫామ్లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. మార్క్రమ్ ఈ మ్యాచ్లోనైనా సత్తా చాటాలని జట్టు కోరుకుంటోంది. ఆపై ఫెలుక్వాయో, జాన్సెన్ రూపంలో ఇద్దరు ఆల్రౌండర్లు టీమ్లో ఉన్నారు. చిన్న బౌండరీలు ఉన్న ఈ మైదానంలో భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయం. చదవండి: క్రికెట్ అభిమానులుకు గుడ్ న్యూస్.. పాకిస్తాన్తో భారత్ తొలిపోరు -
ఎనిమిదేళ్ల తర్వాత బౌలింగ్లో చెత్త రికార్డు.. బ్యాటింగ్లో అదుర్స్
బోలాండ్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 31 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత మిడిలార్డర్తో పాటు, బౌలర్లు కూడా విఫలమయ్యారు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్ ఓ చెత్త రికార్డును మూట కట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో 10 ఓవర్ల కోటాలో 72 పరుగులు శార్దూల్ సమర్పించుకున్నాడు. కాగా ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా గడ్డపై ప్రోటీస్ జట్టుపై వన్డేల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో భారత బౌలర్గా ఠాకూర్ నిలిచాడు. అంతకుముందు 2013లో మోహిత్ శర్మ 82 పరుగులతో తొలి స్ధానంలో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్లో బాల్తో విఫలమైన ఠాకూర్ బ్యాట్తో అదరగొట్టాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన ఠాకూర్ అర్దసెంచరీ సాధించి ఆజేయంగా నిలిచాడు. కాగా వన్డేల్లో ఠాకూర్కి ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఇక భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే బోలాండ్ పార్క్ వేదికగా శుక్రవారం జరగనుంది. చదవండి: SA vs IND: మేము అలా చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం.. వాళ్లు బాగా ఆడారు! -
మేము అలా చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం.. వాళ్లు బాగా ఆడారు!
పెర్ల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆదిలోనే కెప్టెన్ రాహుల్ వికెట్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి భారత్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. అయితే వీరిద్దరూ ఔటయ్యాక భారత జట్టు మిడిలార్డర్ కూప్పకూలింది. చివర్లో శార్ధుల్ ఠాకూర్ మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు సాధించింది. కాగా భారత మిడిలార్డర్ విఫలంపై ఓపెనర్ శిఖర్ ధావన్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. బోలాండ్ పార్క్లో వికెట్ చాలా నెమ్మదిగా ఉందని ధావన్ తెలిపాడు. 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం భారత మిడిలార్డర్కు అంత సులభం కాదని అతడు అభిప్రాయపడ్డాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా బ్యాటర్లు టెంబా బావుమా, వాన్ డెర్ డుస్సేన్పై ధావన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘మాకు మంచి ఆరంభం లభించింది. రాహుల్ వికెట్ కోల్పోయినా నేను, విరాట్.. స్కోర్ బోర్డును ముందుకు నడిపించాము. కానీ వికెట్ వికెట్ చాలా నెమ్మదిగా ఉంది. మంచు ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్కు వచ్చినప్పుడు భారీ షాట్లు ఆడడం అంత సులభం కాదు. మేము ఈ మ్యాచ్లో సెంచరీ భాగస్వామ్యం కూడా నమోదు చేయలేకపోయాం. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం. అది మా బ్యాటింగ్ యూనిట్పై ప్రభావం చూపింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు టెంబా బావుమా, వాన్ డెర్ డుస్సేన్ అద్భుతంగా ఆడార’ని శిఖర్ ధావన్ అన్నాడు. కాగా ఈ మ్యాచ్లో ధావన్ 79 పరుగులు సాధించాడు. ఇక భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే బోలాండ్ పార్క్ వేదికగా శుక్రవారం జరగనుంది. చదవండి: ఒక వైపు కెప్టెన్, వైస్ కెప్టెన్కి పాజిటివ్.. అయినా టీమిండియా ఘన విజయం.. -
ఎనిమిదేళ్ల తర్వాత అరుదైన రికార్డు సాధించిన సౌతాఫ్రికా..
టీమిండియాతో తొలి వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు బావుమా, వండర్ డుస్సేన్ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. నాలుగో వికెట్కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కాగా టీమిండియాపై సౌతాఫ్రికా ఇదే నాలుగో వికెట్ అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. అంతకు ముందు సెంచూరియన్లో 2013లో డికాక్, డివిలియర్స్ నాలుగో వికెట్కు 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతే కాకుండా ఇది ఓవరాల్గా రెండో అత్యధిక భాగస్వామ్యం కూడా. అంతకుముందు 2000లో కోచి వేదికగా తొలి వికెట్కు కిర్ట్సెన్ - గిబ్స్ 235 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు బావుమా(110), వండర్ డుస్సేన్(129) సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా, అశ్విన్ ఒక వికెట్ సాధించాడు. చదవండి: మ్యాక్స్వెల్ ఊచకోత .. 41 బంతుల్లో సెంచరీ.. ఏకంగా 24 ఫోర్లు, 4 సిక్స్లు! -
టీమిండియా ఆల్రౌండర్కు బంఫర్ ఆఫర్.. ఐదేళ్ల తర్వాత!
SA vs IND: టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్కు సుందర్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో మరో ఆల్రౌండర్ జయంత్ యాదవ్ను సుందర్కి బ్యాకప్గా ఉంచునున్నట్లు తెలుస్తోంది. కాగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు జయంత్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు భారత జట్టుతోనే ఉన్నాడు. కానీ ఇప్పటివరకు అతడు కేవలం బెంచ్కే పరిమితమయ్యాడు. ఒకవేళ వన్డేలకు సుందర్ దూరమైతే మరోసారి జయంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. కాగా 2016లో న్యూజిలాండ్పై వన్డేల్లో అరంగేట్రం చేసిన జయంత్ యాదవ్.. ఇప్పటి వరకు ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. తన అరంగేట్ర మ్యాచ్లో ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ గాయం కారణంగా దక్షిణాఫ్రికా దూరం కావడంతో జయంత్కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయం అనిపిస్తోంది. ఇక భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జనవరి 19 న జరగనుంది. అదే విధంగా టీమిడియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం కావడంతో కేఎల్ రాహుల్ వన్డేలకు సారథ్యం వహించనున్నాడు. చదవండి: WTC 2021-23 Points Table: టాప్-3 లో పాకిస్తాన్.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే! -
Ind Vs Sa 3rd Test: సిరాజ్ స్దానంలో ఉమేశ్.. తుది జట్లు ఇవే
తుది పోరులో దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోవడానికి భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా రెండో టెస్టుకు గాయం కారణంగా దూరమైన విరాట్ కోహ్లి తుది జట్టులోకి వచ్చాడు. అదే విధంగా ఈ మ్యాచ్కు గాయం కారణంగా సిరాజ్ దూరం కావడంతో ఉమేశ్ యాదవ్కు స్ధానం దక్కింది. ఇక ఎటువంటి మార్పులు లేకుండానే దక్షిణాఫ్రికా బరిలోకి దిగింది. కాగా ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపించడంతో పాటు బౌన్స్ కారణంగా బ్యాట్స్మెన్ కూడా బాగా పరుగులు సాధించే అవకాశం ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పొడిబారి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కాబట్టి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకోవడం ఉత్తమమైన నిర్ణయం అనే చెప్పుకోవాలి. తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి. చదవండి: Ind Vs Sa 3rd Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ -
IND vs SA 3rd Test Day 1: భారత్ 223 ఆలౌట్, దక్షిణాఫ్రికా 17/1
IND vs SA 3rd Test Updates: భారత్ 223 ఆలౌట్, దక్షిణాఫ్రికా 17/1 తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. కెప్టెన్ డీన్ ఎల్గర్(3)ను బుమ్రా ఔట్ చేశాడు. క్రీజ్లో మార్క్రమ్(8), కేశవ్ మహారాజ్(6) ఉన్నారు. 8: 46 PM: సఫారీ పేసర్ల విజృంభణ.. టీమిండియా 223 ఆలౌట్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్లో టీమిండియా నిరాశపరిచింది. సఫారీ పేసర్ల ధాటికి 223 పరుగులకే చాపచుట్టేసింది. కెప్టెన్ కోహ్లి(79) ఓంటరి పోరాటం చేయడంతో గౌరవప్రదమైన స్కోర్ను సాధించగలిగింది. సఫారీ బౌలర్లు రబాడ 4, మార్కో జన్సెన్ 3, ఒలీవియర్, ఎంగిడి, కేశవ్ మహారాజ్ తలో వికెట్ సాధించారు. కోహ్లి(79) ఔట్.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా క్రీజ్లో పాతుకుపోయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(79) ఎట్టకేలకు ఔటయ్యాడు. రబాడ బౌలింగ్లో వెర్రిన్కు క్యాచ్ ఇచ్చి 211 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాడు. క్రీజ్లో ఉమేశ్ యాదవ్, షమీ ఉన్నారు. టీమిండియా ఎనిమిదో వికెట్ డౌన్ డ్రింక్స్ బ్రేక్కు ముందు టీమిండియాకు మరో షాక్ తగిలింది. రబాడ బౌలింగ్లో బుమ్రా డకౌటయ్యాడు. ఫలితంగా టీమిండియా 210 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. క్రీజ్లో కోహ్లి(78), ఉమేశ్ యాదవ్ ఉన్నారు. శార్ధూల్ ఔట్ రెండో టెస్ట్లో బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ రాణించిన శార్ధూల్ ఠాకూర్(12) ఈ మ్యాచ్లో నిరాశపరిచాడు. వచ్చీ రాగానే భారీ షాట్లతో విరుచుకుపడిన అతను.. మరో భారీ షాట్కు ప్రయత్నించి కేశవ్ మహారాజ్ బౌలింగ్లో కీగన్ పీటర్సన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా 205 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. క్రీజ్లో కోహ్లి(73), బుమ్రా ఉన్నారు. జన్సెన్ విజృంభణ.. 175 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా దక్షిణాఫ్రికా యువ పేసర్ మార్కో జన్సెన్ విజృంభణతో టీమిండియా 175 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. అశ్విన్ 2 పరుగులు మాత్రమే చేసి జన్సెన్ బౌలింగ్లో వెర్రిన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. క్రీజ్లో కోహ్లి(56), శార్ధూల్ ఠాకూర్ ఉన్నాడు. 167 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా మార్కో జన్సెన్ టీమిండియాపై మరోసారి ప్రతాపం చూపుతున్నాడు. ఈ ఇన్నింగ్స్లో ఇదివరకే కీలకమైన పుజారా వికెట్ పడగొట్టిన అతను.. రిషబ్ పంత్(27)ను కూడా పెవిలియన్కు పంపాడు. దీంతో టీమిండియా 167 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి(50), అశ్విన్ క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 116 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. రహానే(9) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. రబాడ బౌలింగ్లో వెర్రిన్కు క్యాచ్ ఇచ్చి రహానే ఔటయ్యాడు. క్రీజ్లో విరాట్ కోహ్లి(29), పంత్ ఉన్నారు. టీమిండియా మూడో వికెట్ డౌన్ క్రీజ్లో నిలదొక్కుకున్నట్లు కనిపించిన పుజారా 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మార్కో జన్సెన్ బౌలింగ్లో వెర్రిన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా 95 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. క్రీజ్లో కోహ్లి(17), రహానే ఉన్నారు. 5: 06 PM: టీమిండియా స్కోరు: 85/2 (34.3). పుజారా 35, కోహ్లి 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రొటిస్ బౌలర్లు రబడ, ఒలివర్ చెరో వికెట్ తీశారు. 4: 00 PM: లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 75/2 (28). కోహ్లి 15, పుజారా 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. 3: 36 PM: టీమిండియా ప్రస్తుత స్కోరు: 53/2 (22.1). కెప్టెన్ కోహ్లి 5, పుజారా 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. 2: 53 PM: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ను రబడ అవుట్ చేశాడు. స్కోరు: 33/2. విరాట్ కోహ్లి, పుజారా క్రీజులో ఉన్నారు. 2: 48 PM: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. కేఎల్ రాహుల్ అవుట్. ఒలివర్ బౌలింగ్లో టీమిండియా ఓపెనర్ రాహుల్ పెవిలియన్ చేరాడు. వికెట్ కీపర్ వెరెన్కు క్యాచ్ ఇచ్చి 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. పుజారా క్రీజులోకి వచ్చాడు. 2: 30 PM: కేఎల్ రాహుల్ 12, మయాంక్ అగర్వాల్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు 31/0. మూడో టెస్టులో రెండు మార్పులతో భారత జట్టు బరిలోకి దిగింది. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన విరాట్ కోహ్లి.. విహారి స్ధానంలో జట్టులోకి రాగా, సిరాజ్ స్థానంలో ఉమేశ్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక దక్షిణాఫ్రికా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి. కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తుది సమరానికి భారత్ సిద్దమైంది. ఒక్కో టెస్టు గెలిచి భారత్, దక్షిణాఫ్రికా 1–1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే. తొలి సారి సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ సాధించి చరిత్ర సృష్టించాలన్న పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. చదవండి: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. సూపర్ మ్యాన్లా.. వీడియో వైరల్! -
కోహ్లి వచ్చేశాడు.. భారత్ చరిత్ర సృష్టించేనా?
కేప్టౌన్: ‘ఫ్రీడం ట్రోఫీ’లో విజేతను తేల్చే సమరానికి సమయమైంది. ఒక్కో టెస్టు గెలిచి భారత్, దక్షిణాఫ్రికా 1–1తో సమంగా ఉన్న స్థితిలో నేటినుంచి జరిగే మూడో టెస్టులో గెలిచే జట్టు సిరీస్ను సొంతం చేసుకోనుంది. 2018లో ఇక్కడే జరిగిన సిరీస్లో భారత్ తొలి రెండు టెస్టులు ఓడి సిరీస్ కోల్పోయిన అనంతరం మూడో టెస్టును నెగ్గి ఆధిక్యాన్ని 1–2కు తగ్గించింది. ఇప్పుడు దానికంటే భిన్నమైన పరిస్థితుల్లో చివరి టెస్టు నిర్ణాయకంగా మారడం విశేషం. ఈ టెస్టు గెలిస్తేనే సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గాలన్న భారత జట్టు కల నెరవేరుతుంది. మరి కోహ్లి ఈ ఫీట్ను సాధించి తన ఖాతాలో చారిత్రాత్మక రికార్డును జమ చేసుకుంటాడో చూడాలి! సిరాజ్ అవుట్... భారత తుది జట్టులో రెండు మార్పులు జరగడం ఖాయమైంది. వెన్ను నొప్పితో రెండో టెస్టుకు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లి పూర్తి ఫిట్గా మారి ఈ మ్యాచ్కు సిద్ధమయ్యాడు. దాంతో హైదరాబాద్ బ్యాటర్ హనుమ విహారిపై వేటు పడటం దాదాపు ఖాయమైంది. వాండరర్స్లో విహారి మంచి ప్రదర్శనే కనబర్చినా...అనుభవం, పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికిప్పుడు పుజారా, రహానేలలో ఒకరిపై వేటు వేసి విహారిని ఎంపిక చేసే అవకాశాలు కనిపించడం లేదు. పైగా గత టెస్టు రెండు ఇన్నింగ్స్లో వీరిద్దరు కీలక అర్ధ సెంచరీలతో ఫామ్లోకి వచ్చారు. మరో వైపు తొడ కండరాల గాయంతో రెండో టెస్టులో తీవ్రంగా ఇబ్బంది పడిన హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. నిజాయితీగా చెప్పాలంటే భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణమైంది. కాబట్టి ఈ టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించగలిగితేనే బౌలర్లపై నమ్మకం ఉంచవచ్చు. ఓపెనర్లు రాహుల్, మయాంక్ మరోసారి శుభారంభం అందించాల్సి ఉండగా...పుజారా, రహానే తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. కోహ్లినుంచి కూడా జట్టు ఒక భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. మార్పుల్లేకుండానే... కెప్టెన్ ఎల్గర్ దుర్బేధ్యమైన ఆటతో జట్టు భారం మోస్తుండగా, మరో ఓపెనర్ మార్క్రమ్ రాణించాల్సి ఉంది. కీగన్ పీటర్సన్ కూడా బాగానే ఆడుతున్నా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. మిడిలార్డర్లో వాన్ డర్ డసెన్ ఇంకా తడబడుతూనే ఉండటం దక్షిణాఫ్రికాను ఇబ్బంది పెడుతోంది. తెంబా బవుమా మాత్రం చక్కటి ప్రదర్శన కనబరిస్తూ సిరీస్లో కీలక ఆటగాడిగా మారాడు. ఒక్కసారిగా జట్టు పేస్ బలంగా మారిపోయింది. రబడ ఫామ్లోకి రావడంతో పాటు జాన్సెన్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటం భారత్ను ఇబ్బంది పెట్టవచ్చు. చదవండి: Ind Vs Sa 3rd Test: మాకు అశ్విన్ ఉన్నాడు.. అద్భుతాలు చేస్తాడు.. జడేజాను మిస్సవడం లేదు: కోహ్లి -
IND vs SA 3rd Test: ద్రవిడ్పై కోహ్లి 'పైచేయి' సాధించేనా?
కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగునున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆడడం దాదాపు ఖాయమైంది. జొహాన్స్బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్కు గాయం కారణంగా కోహ్లి దూరమైన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్లో భారత్పై దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాదించింది. దీంతో మూడు టెస్ట్ల సిరీస్ 1-1తో సమమైంది. ఇక మూడో టెస్ట్కు ముందు ఓ అరుదైన రికార్డు కోహ్లిని ఊరిస్తుంది. దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా సచిన్ సచిన్ టెండూల్కర్(1161), రాహుల్ ద్రవిడ్(624) పరుగులతో ఉన్నారు. అయితే దక్షిణాఫ్రికాలో 611 పరుగులు చేసిన కోహ్లి.. ద్రవిడ్ రికార్డును అధిగమించడానికి కేవలం 14 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇక కోహ్లి తన కేరిర్లో 99వ టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. ఇక భారత్- దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్ట్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: Ind Vs Sa: హనుమ విహారికి నో ఛాన్స్.. పంత్కు అవకాశం... సిరాజ్ స్థానంలో అతడే! ఎందుకంటే.. -
'పంత్ని కొద్ది రోజులు పక్కన పెట్టండి.. అప్పుడే తెలిసి వస్తుంది'
జొహాన్స్ బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అయితే రెండో ఇన్నింగ్స్లో కీలక సమయంలో నిర్లక్ష్యంగా ఆడి వికెట్ కోల్పోయిన రిషబ్ పంత్పై మాజీలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ కోవలో భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ కూడా చేరాడు. పంత్ మ్యాచ్ విన్నర్ అనడంలో సందేహం లేదని, కానీ రెండవ ఇన్నింగ్స్లో ఆ విధంగా అతడు బ్యాటింగ్ చేయలేదని మదన్ లాల్ తెలిపాడు. "పంత్ని పక్కన పెట్టవలసిన సమయం వచ్చింది. అతడి స్ధానంలో వృద్ధిమాన్ సాహాకు అవకాశం ఇవ్వాలి. అతడు పంత్ కంటే తెలివైన ఆటగాడు. అదే విధంగా అతడు అత్యుత్తమ వికెట్ కీపర్. . అయితే టెస్టు క్రికెట్లో పంత్ ఎలా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాడో అతడే నిర్ణయించుకోవాలి. కాబట్టి అతడికి కాస్త బ్రేక్ ఇవ్వాలి. పంత్ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ అనడంలో సందేహం లేదు. కానీ అతడు తన ఆటకు తగ్గట్లు రాణించడం లేదు. ఏ ఆటగాడైన జట్టు కష్ట పరిస్ధితుల్లో ఉన్నప్పుడు అదుకోవాలి" అని మదన్ లాల్ పేర్కొన్నాడు. ఇక భారత్-దక్షిణాఫ్రికా మధ్య అఖరి టెస్ట్ కేప్ టౌన్ వేదికగా జనవరి 11న ప్రారంభంకానుంది. ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. దీంతో మూడో టెస్ట్లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. చదవండి: NZ vs BAN: ఇదేం ఫీల్డింగ్ రా బాబు.. ఒక బంతికి 7 పరుగులు.. వీడియో వైరల్! -
కోహ్లిని వెనకేసుకొచ్చిన వార్నర్..
గత రెండేళ్లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్న టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి విషయమై ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్ పరంగా కోహ్లి ప్రస్తుతం గడ్డు పరిస్థితలను ఎదుర్కొంటున్నప్పటికీ, అతను కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని అన్నాడు. తన బ్యాటింగ్ నైపుణ్యంతో ఎన్నో వ్యక్తిగత రికార్డులతో పాటు టీమిండియాకు చిరస్మరణీయ విజయాలు అందించిన రన్ మెషీన్కు బ్యాటింగ్లో విఫలమయ్యే హక్కు, అధికారం రెండూ ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఆటగాడు ఫామ్ కోల్పోవడం సహజమని, కోహ్లి విషయంలోనూ అదే జరిగిందని, యంత్రంలా పరుగులు చేసేందుకు అతనేమీ రోబో కాదని వెనకేసుకొచ్చాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి సెంచరీ సాధించి రెండేళ్లు పూర్తైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతను పరిమిత ఓవర్ల కెప్టెన్సీని కోల్పోవడంతో పాటు ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్లో అతని ర్యాంకు క్రమంగా దిగజారుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లికి జట్టులో చోటు సైతం ప్రశ్నార్ధకంగా మారింది. చదవండి: Ashes: స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు... బ్రాడ్మన్ వంటి దిగ్గజాలతో పాటుగా -
హైదరాబాద్ క్రికెటర్పై ద్రవిడ్ కీలక వాఖ్యలు..
హైదరాబాద్ బ్యాటర్ హనుమ విహారి దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. కోహ్లి గాయం కారణంగా వచ్చిన అవకాశాన్ని అతను సమర్థంగా వినియోగించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో అనూహ్యంగా ఎగసిన బంతికి అతను అవుట్ కాగా, రెండో ఇన్నింగ్స్లో కీలక పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ విషయాన్ని భారత్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అంగీకరించాడు. అయినా సరే విహారికి తుది జట్టులో చోటు ఖాయం కాదని అతను పరోక్షంగా చెప్పాడు. కోహ్లి కోలుకొని టీమ్లోకి వస్తే విహారిని పక్కన పెట్టడం ఖాయమని సంకేతమిచ్చాడు. విహారితో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా రెగ్యులర్గా అవకాశాలు దక్కించుకునేందుకు మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశాడు. ‘విహారి రెండు ఇన్నింగ్స్లలో చక్కగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో దురదృష్టకర రీతిలో అవుటైన అతను రెండో ఇన్నింగ్స్లో తన ఆటతో జట్టులో ఆత్మవిశ్వాసం నింపాడు. అయ్యర్ కూడా ఆడిన రెండు టెస్టుల్లో ఆకట్టుకున్నాడు. తాము ఎప్పుడు బరిలోకి దిగినా బాగా ఆడగలమని వారు నిరూ పించారు. అయితే ఇప్పటికిప్పు డే కాకుండా మున్ముందు వారికి తగిన అవకాశాలు లభిస్తాయి’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. చదవండి: MS Dhoni: పాక్ పేసర్కు ధోని స్పెషల్ గిఫ్ట్.. భావోద్వేగానికి గురైన క్రికెటర్.. దటీజ్ లెజెండ్! -
"ఆ విషయం గురించి పంత్తో మాట్లాడతాం"
జొహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్లో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే రెండో ఇన్నింగ్స్లో కీలక సమయంలో రిషభ్ పంత్ వికెట్ పారేసుకున్న తీరు విమర్శలపాలైంది. తాను ఎదుర్కొన్న మూడో బంతికే ముందుకు దూసుకొచ్చి షాట్ ఆడిన అతను డకౌటయ్యాడు. ఇది అతని సహజ శైలే అయినా ఆడిన సందర్భం తప్పని, దీనిపై పంత్తో మాట్లాడతామని ద్రవిడ్ అన్నాడు. ‘పంత్ ఎలా ఆడతాడనేది మనకందరికీ తెలుసు. అదే శైలితో అతను మంచి ఫలితాలు కూడా సాధించాడు. అయితే కొన్నిసార్లు పరిస్థితులను బట్టి కూడా షాట్లను ఎంపిక చేసుకోవాలి. ఈ విషయం గురించి అతనికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ పని మేం చేస్తాం’ అని ద్రవిడ్ స్పష్టం చేశాడు. చదవండి: MS Dhoni: పాక్ పేసర్కు ధోని స్పెషల్ గిఫ్ట్.. భావోద్వేగానికి గురైన క్రికెటర్.. దటీజ్ లెజెండ్! -
టీమిండియాకు భారీ షాక్.. మూడో టెస్ట్కు స్టార్ బౌలర్ దూరం!
దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ ఓటమి నుంచి కోలుకునే లోపే భారత్కు మరో భారీ షాక్. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గాయం కారణంగా మూడో టెస్ట్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. జొహన్నెస్బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో గాయపడిన సిరాజ్ ఇంకా కోలుకోనట్లు సమాచారం. ఈ క్రమంలో రెండో టెస్ట్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన భారత కోచ్ రాహుల్ ద్రవిడ్.. సిరాజ్ గాయంపై అప్డేట్ అందించాడు. "సిరాజ్ నెట్స్లో కష్టపడాలి. హామ్ స్ట్రింగ్ గాయం నుంచి వెంటనే కోలుకోవడం చాలా కష్టం. మొదటి ఇన్నింగ్స్లో గాయంతో సిరాజ్ దూరం కావడం మాకు ఒక పెద్ద ఎదురుదెబ్బ. అతడు గాయపడినప్పటికీ మూడో రోజు బౌలింగ్కు వచ్చాడు. ఒక వేళ కెప్టౌన్ టెస్ట్కు సిరాజ్ దూరమైతే, ఉమేష్, ఇషాంత్ రూపంలో మాకు మంచి బెంచ్ బలం ఉంది అని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఇక జొహన్నెస్బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో టీమిండియాపై దక్షిణాఫ్రికా 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్ట్ల సిరీస్1-1తో సమమైంది. ఇక కేప్ టౌన్ వేదికగా జనవరి 11న ప్రారంభం కానున్న అఖరి టెస్ట్లో ఇరు జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. చదవండి: SA vs IND: కోహ్లి గాయంపై కీలక ప్రకటన చేసిన ద్రవిడ్.. -
కోహ్లి గాయంపై కీలక ప్రకటన చేసిన ద్రవిడ్..
జోహాన్స్బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో టీమిండియాపై దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో 3 టెస్ట్ల సిరీస్ను 1-1 ప్రోటిస్ సమం చేసింది. ఈ క్రమంలో కేప్టౌన్లో జరగనున్న మూడు టెస్ట్ ఇరు జట్లుకు కీలకం కానుంది. అయితే ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ సాధించని భారత్కు ఇది సువర్ణ అవకాశం. ఇది ఇలా ఉంటే టీమిండియాను గాయాల బెడద వెంటాడుతుంది. ఇప్పటికే గాయం కారణంగా రోహిత్ శర్మ సౌతాఫ్రికా పర్యటనకు దూరం కాగా, కెప్టెన్ విరాట్ కోహ్లి వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. రెండో టెస్ట్ అనంతరం విలేకరల సమావేశంలో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడాడు. కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడో టెస్ట్కు విరాట్ కోహ్లి తిరిగి వస్తాడని ఆశిస్తున్నట్లు ద్రవిడ్ తెలిపాడు. "విరాట్ కోహ్లి ప్రస్తుతం మెడ నొప్పి నుంచి కోలుకున్నాడు. త్వరలో కేప్ టౌన్లో నెట్ సెషన్లో పాల్గొంటాడని భావిస్తున్నాను. అతడి గాయంపై ఎప్పటికప్పుడు వైద్యులతో చర్చిస్తున్నాను. అతడు మూడో టెస్ట్కు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాను. ఈ సిరీస్లో టీమిండియా బ్యాటింగ్ ప్రదర్శనపై ద్రవిడ్ని ప్రశ్నించగా.. ఇక్కడి పిచ్లపై బ్యాటింగ్ రెండు జట్లకు సవాలుగా మారింది. సెకెండ్ ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. మేము మరో 50-60 పరుగులు సాధించింటే బాగుండేది. అదే విధంగా హనుమ విహారి రెండు ఇన్నింగ్స్ల్లోనూ అద్భుతంగా ఆడాడు. గతంలో శ్రేయాస్ అయ్యర్ మాకు బాగా బ్యాటింగ్ చేశాడు. అవకాశం వచ్చినప్పుడు యువ ఆటగాళ్లు బాగా రాణిస్తున్నారు. అఖరి టెస్ట్లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంటామని భావిస్తున్నాను" అని ద్రవిడ్ పేర్కొన్నాడు. చదవండి: మోస్ట్ వాల్యూబుల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా మహ్మద్ రిజ్వాన్ .. -
టాప్-5లోకి సౌతాఫ్రికా ... టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే!
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో సౌతాఫ్రికా తొలి విజయం నమోదు చేసింది. జోహన్స్బర్గ్ వేదికగా భారత్తో జరిగిన రెండో టెస్ట్లో సౌతాఫ్రికా 7వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో సౌతాఫ్రికా ఖాతాలో 12 పాయింట్లు వచ్చి చేరాయి. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రోటాస్ జట్టు ఐదో స్థానానికి ఎగబాకింది. ఇక భారత్ జట్టు 4 స్ధానంలో నిలిచింది. కాగా యాషెస్ సిరీస్లో భాగంగా మూడు వరుస విజయాలతో 36 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, శ్రీలంక జట్టు 24 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ 36 పాయింట్లతో మూడో స్థానంలో, బంగ్లాదేశ్ 6వ స్థానంలో కొనసాగుతున్నాయి. వెస్టిండీస్ 7వ స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ జట్టు 8వ స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ జట్టు చివరి స్థానంలో ఉంది. చదవండి: ఎల్గర్ మళ్లీ ఆ తప్పు చేయలేదు.. టీమిండియాకు చేజారిపోయింది! -
నోరు అదుపులో పెట్టుకోమని అన్నాడు.. వెంటనే ఔటయ్యాడు..
జోహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా పోరాడతోంది. అయితే మూడో రోజు తొలి సెషన్లో భారత్ అధిపత్యం చెలాయించింది. అజింక్య రహానే, ఛెతేశ్వర్ పుజారా అర్ధసెంచరీలు సాధించి కీలకమైన ఇన్నింగ్స్లు ఆడారు. అయితే భారత్ వరుస క్రమంలో రహానే, పుజారా వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్పై అంతా ఆశలు పెట్టుకున్నారు. కాగా పంత్ బ్యాటింగ్కు వచ్చినప్పుడు రాస్సీ వాన్ డెర్ డస్సెన్ స్లెడ్జ్ంగ్ చేశాడు. అయితే వెంటనే పంత్ దానికి బదులుగా నోరు అదుపులో పెట్టుకోమని డస్సేన్ని హెచ్చరించాడు. ఈ క్రమంలో అసహానానికి గురైన పంత్.. రబాడ బౌలింగ్లో నిర్లక్షమైన షాట్ ఆడుతూ డకౌట్గా పెవిలియన్కు చేరాడు. కాగా జట్టు కష్ట పరిస్ధితుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పంత్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. భారత్ జట్టు దక్షిణాఫ్రికాకు 240 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. భారత్ విజయం సాధించాలంటే 8 వికెట్లు పడగొట్టాలి. చదవండి: SA vs IND: భారత అభిమానులకు గుడ్ న్యూస్.. కెప్టెన్ వచ్చేస్తున్నాడు! "Rishabh Pant" : Keep your mouth shut. **And got out on 3rd ball🥺** #SAvIND pic.twitter.com/DJZPoV4xZ9 — Aman 🍀 (@lazyafguy) January 5, 2022 -
"టీమ్ మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు.. వాటిని నేను అసలు పట్టించుకోను"
జోహెన్స్బర్గ్ వేదికగా జరగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా నయావాల్ ఛతేశ్వేర పుజారా అర్ధసెంచరీ సాధించాడు. గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్ను కొనసాగిస్తున్న పుజారాకి ఈ అర్ధ సెంచరీ కాస్త ఉపశమనం కలిగించింది. ఈ క్రమంలో మూడోరోజు ఆట అనంతరం మాట్లాడిన పుజారా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఫామ్లో లేకపోయినా ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన జట్టు మేనేజ్మెంట్కు పుజారా కృతజ్ఞతలు తెలిపాడు. గత ఏడాదిగా తనపై వస్తున్న విమర్శలు గురించి పెద్దగా పట్టించుకోలేదని పుజారా చెప్పాడు. "టీమ్ మేనేజ్మెంట్ నాకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంది, కాబట్టి బయట నాపై వస్తున్న విమర్శలను నేను పట్టించుకోను. కోచింగ్ స్టాఫ్, కెప్టెన్, ఆటగాళ్లందరూ నాకు సపోర్ట్గా ఉంటారు. మేము కష్టపడి ఆడుతాము. కొన్ని సందర్భాల్లో ఎక్కువ పరుగులు చేయలేం. అటువంటి సమయంలో మాపై విమర్శలు రావడం సాధారణం. కానీ ఒక క్రికెటర్గా ఇవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకు పోవాలి" అని పుజారా పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో 86 బంతులు ఎదుర్కొన్న పుజారా 53 పరుగులు చేశాడు. చదవండి: సఫారీలకు కావాల్సింది 122 పరుగులే.. టీమిండియా అద్భుతం చేసేనా? -
ఎవరీ అల్లావుద్దీన్ పాలేకర్.. భారత్తో ఏంటి సంబంధం ?
జోహన్నెస్బర్గ్ వేదికగా జరుగుతున్న భారత్- దక్షిణాఫ్రికా రెండో టెస్ట్లో అంపైర్గా అల్లావుద్దీన్ పాలేకర్ అరంగేట్రం చేశాడు. పాలేకర్ ఈ టెస్ట్లో అంపైర్గా అత్యత్తుమ నిర్ణయాలు తీసుకుని అందరినీ అకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అల్లావుద్దీన్ పాలేకర్ భారత సంతతికి చెందినవాడే. పాలేకర్ మహారాష్ట్రలోని శివ్ గ్రామానికి చెందినవాడని, అల్లా వుద్దీన్ తండ్రి ఉద్యోగ రీత్యా దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డాడని శివ్ గ్రామాధిపతి దుర్వేష్ పాలేకర్ వెల్లడించాడు. "నేను కూడా పాలేకర్నే. అల్లా వుద్దీన్ మా గ్రామానికి చెందినవాడే. అతడి తండ్రి ఉద్యోగం కోసం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. అల్లాహుదీన్ దక్షిణాఫ్రికాలో జన్మించాడు. అతడి సొంత గ్రామం శివ్. మా గ్రామం పేరు అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లినందుకు మేమందరం గర్విస్తున్నాం" అని దుర్వేష్ పాలేకర్ పేర్కొన్నాడు. అదే విధంగా 2014-15 రంజీ ట్రోఫీ సీజన్లో కూడా అల్లావుదీన్ పాలేకర్ అంపైరింగ్ విధులను నిర్వహించాడు. ఇక రెండో టెస్ట్ విషయానికి వస్తే విజయానికి దక్షిణాఫ్రికా 122 పరుగుల దూరంలో ఉంది. చదవండి: SA vs IND: భారత అభిమానులకు గుడ్ న్యూస్.. కెప్టెన్ వచ్చేస్తున్నాడు! -
భారత అభిమానులకు గుడ్ న్యూస్.. కెప్టెన్ వచ్చేస్తున్నాడు!
జోహన్నెస్బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్, దక్షిణాఫ్రికా జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్కు వెన్ను నొప్పి కారణంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అఖరి నిమిషంలో తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో విరాట్ స్ధానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో తిరిగి ఫిట్నెస్ సాధించాడనికి నెట్స్లో విరాట్ చెమటోడ్చుతున్నాడు. కాగా విరాట్ ప్రాక్టీస్కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ త్రోడౌన్ బౌలింగ్ చేస్తుండగా కోహ్లి ఆడుతున్నాడు. కాగా జనవరి 11నుంచి కేప్ టౌన్లో ప్రారంభం కానున్న అఖరి టెస్ట్లో కోహ్లి ఆడేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ కోహ్లి కేప్ టౌన్ టెస్ట్లో ఆడితే విరాట్ కెరీర్లో 99వ టెస్టు మ్యాచ్ అవుతుంది. ఇక జోహన్నెస్బర్గ్ టెస్ట్ విషయానికి వస్తే భారత్ జట్టు దక్షిణాఫ్రికాకు 240 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. భారత్ విజయం సాధించాలంటే 8 వికెట్లు పడగొట్టాలి. చదవండి: SA vs IND 2nd Test: ఓటమి దిశగా భారత్.. విజయానికి 122 పరుగుల దూరంలో దక్షిణాఫ్రికా! Kohli receiving throwdowns from Dravid pic.twitter.com/uY3h8cd8Fj — Benaam Baadshah (@BenaamBaadshah4) January 5, 2022 -
సఫారీలకు కావాల్సింది 122 పరుగులే.. టీమిండియా అద్భుతం చేసేనా?
దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు తొలిసారి సిరీస్ గెలుచుకుంటుందా? ఆతిథ్య జట్టు సిరీస్ను సమం చేసి పోరును మూడో టెస్టు వరకు తీసుకెళుతుందా? జొహన్నెస్బర్గ్ టెస్టు మ్యాచ్ నాలుగో రోజే ఫలితం తేలనుంది. పలు మలుపులు తిరిగిన బుధవారం ఆటలో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా పోరాడాయి. పుజారా, రహానే భాగస్వామ్యంతో పాటు హనుమ విహారి ఆట భారత్ను మెరుగైన స్థితికి నడిపించగా... రబడ స్పెల్ సఫారీలకు ఊపిరి పోసింది. ఛేదనలోనూ ఆ జట్టు జోరుగా మొదలు పెట్టినా, తక్కువ వ్యవధిలో రెండు వికెట్లు తీసి టీమిండియా మళ్లీ ఆధిపత్యం ప్రదర్శించింది. పట్టుదలగా నిలబడి మూడో రోజును సంతృప్తికరంగా ముగించిన కెప్టెన్ ఎల్గర్ ఇదే పోరాటతత్వంతో తన జట్టును గెలిపిస్తాడా లేక భారత్ ఎనిమిది వికెట్లు తీస్తుందా అనేది చూడాలి. జొహన్నెస్బర్గ్: రెండో టెస్టులో భారత్ జట్టు దక్షిణాఫ్రికాకు 240 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. దీనిని అందుకునే ప్రయత్నంలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ (121 బంతుల్లో 46 బ్యాటింగ్; 2 ఫోర్లు), డసెన్ (11 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలంటే ఆ జట్టు మరో 122 పరుగులు చేయాలి. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 85/2తో ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌటైంది. రహానే (78 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్), పుజారా (86 బంతుల్లో 53; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా, హనుమ విహారి (84 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాణించిన విహారి... కెరీర్ ప్రమాదంలో పడిన దశలో, మరోసారి విఫలమైతే జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉన్న స్థితిలో పుజారా, రహానే కీలక ఇన్నింగ్స్లతో సత్తా చాటారు. తమ సహజశైలికి భిన్నంగా వీరిద్దరు దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు. దాంతో స్కోరు వేగంగా సాగిపోయింది. ఈ క్రమంలో 62 బంతుల్లోనే పుజారా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, కొద్ది సేపటికే 67 బంతుల్లో రహానే కూడా హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. వీరిద్దరు 4.6 రన్రేట్తో 144 బంతుల్లోనే 111 పరుగులు జోడించడం విశేషం. అయితే వీరిద్దరిని ఎనిమిది పరుగుల వ్యవధిలోనే రబడ పెవిలియన్ పంపించగా... రిషభ్ పంత్ (0) విఫలమయ్యాడు. ఈ దశలో విహారి జట్టు ఇన్నింగ్స్ను నడిపించే బాధ్యత తీసుకున్నాడు. అతనికి అశ్విన్ (16) కొంత సహకరించగా... శార్దుల్ ఠాకూర్ (24 బంతుల్లో 28; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు బ్యాటింగ్ భారత్ స్కోరును 200 దాటించింది. జాన్సెన్ వేసిన ఓవర్లో 1 సిక్స్, 2 ఫోర్లు కొట్టిన శార్దుల్ అదే ఓవర్ చివరి బంతికి అవుటయ్యాడు. అనంతరం విహారి కొన్ని విలువైన పరుగులు జోడించాడు. భారత్ జోడించిన చివరి 41 పరుగుల్లో విహారినే 30 పరుగులు చేశాడు. ఎల్గర్ పట్టుదలగా... రెండో ఇన్నింగ్స్ను దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. మార్క్రమ్ (38 బంతుల్లో 31; 6 ఫోర్లు) దూకుడుతో జట్టు స్కోరు 10 ఓవర్లలోనే 47 పరుగులకు చేరింది. పదో ఓవర్ చివరి బంతికే మార్క్రమ్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని శార్దుల్ ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత పీటర్సన్ (28; 4 ఫోర్లు) కూడా రాణించాడు. దాంతో సఫారీ టీమ్ 93/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే అశ్విన్ చక్కటి బంతితో పీటర్సన్ను ఎల్బీగా అవుట్ చేయడంతో మళ్లీ భారత్దే పైచేయి అయింది. ఈ స్థితిలో ఎల్గర్, డసెన్ పట్టుదల కనబర్చారు. చేతికి, భుజానికి, మెడకు, ఛాతీకి... భారత పేసర్ల పదునైన బంతులకు ఇలా అన్ని శరీర భాగాలకు దెబ్బలు తగులుతున్నా ఎల్గర్ పిచ్పై దృఢంగా నిలబడ్డాడు. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా మరో వికెట్ తీయలేకపోయారు. చదవండి: Shardul Thakur: శార్ధూల్ పేరు ముందు "ఆ ట్యాగ్" వెనుక రహస్యమిదే..! -
భారీ సిక్స్ బాదిన బుమ్రా.. క్లాప్స్ కొట్టిన సంజనా.. వీడియో వైరల్!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 202 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. టీమిండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్(48), అశ్విన్(46) పరుగులతో రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా భారత్ సాధించగలిగింది. సఫారీ బౌలర్లలో జన్సెన్ 4, ఒలీవియర్, రబాడ తలో 3 వికెట్లు పడగొట్టారు. అయితే ఇన్నింగ్స్ 62వ ఓవర్ వేసిన రబడా బౌలింగ్లో భారత ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా భారీ సిక్స్ బాది అందరనీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలో స్టాండ్స్లో ఉన్న అతడి భార్య సంజనా గణేషన్ నవ్వుతూ చప్పట్లు కొట్టి అభినందించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Ranji Trophy: బెంగాల్ రంజీ జట్టులో రాష్ట్ర మంత్రి.. కెప్టెన్గా అభిమన్యు pic.twitter.com/asM1QNUMtH — Lodu_Lalit (@LoduLal02410635) January 3, 2022 -
దక్షిణాఫ్రికా ఫీల్డర్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్!
జోహన్నెస్బర్గ్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో దక్షిణాఫ్రికా ఫీల్డర్ రాస్సీ వాన్ డెర్ డుస్సెన్ అద్భుతమైన క్యాచ్తో మెరిశాడు. ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసిన రబాడా బౌలింగ్లో.. హనుమా విహారి డిఫెన్స్ ఆడడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుంది. కాగా షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న వాన్ డెర్ డుస్సెన్ జంప్ చేస్తూ ఒంటి చెత్తో అద్భుతమైన స్టన్నింగ్ క్యాచ్ని అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా విహారి ఆశ్చర్యానికి గురైయ్యాడు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్లో 202 పరుగులకే ఆలౌటైంది. కేఎల్ రాహుల్(50) అశ్విన్ (46) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ 4 వికెట్లు పడగొట్టగా, ఒలీవియర్, రబడ చెరో 3 వికెట్లు తీశారు. . తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టపోయి 35 పరుగులు చేసింది. చదవండి: SA vs IND: ఆ భారత ఆటగాళ్లకు ఇదే చివరి ఛాన్స్..లేదంటే What a superb close-in catch that was from Rassie van der Dussen to dismiss Hanuma Vihari! #SAvIND pic.twitter.com/SB0DURelNO — Cric Trend (@crictrend_) January 3, 2022 -
ఆ భారత ఆటగాళ్లకు ఇదే చివరి ఛాన్స్..లేదంటే
భారత జట్టు సీనియర్ ఆటగాళ్లు ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో రహానే గోల్డెన్ డక్ కాగా, పుజారా ఈ సారి కేవలం 3 పరుగులకే పెవియన్ చేరాడు. అయితే దక్షిణాఫ్రికా టూర్కు జట్టు ఎంపిక చేసే ముందే వీరిద్దరి చోటుపై అనుమానాలు నెలకొన్నాయి. కాగా విదేశాల్లో ఉన్న అనుభవం దృష్ట్యా ఈ సీనియర్ ఆటగాళ్లకి చోటు దక్కింది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేక పోతున్నారు. తొలి టెస్ట్లో రహానే 48 పరుగులతో ఫర్వాలేదనిపించిన, తర్వాత తేలిపోయాడు. ఈ క్రమంలో మరోసారి వీరిద్దరి ఎంపికపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వాఖ్యలు చేశాడు. ఈ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ వీళ్లిద్దరికి చాలా కీలకం అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే యువ ఆటగాళ్లు రాణిస్తుండంతో, వీళ్లు జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని అతడు తెలిపాడు. "పుజారా, రహానే ఇద్దరూ వారి టెస్ట్ కెరీర్ను కాపాడుకోవడానికి రెండో ఇన్నింగ్స్ కీలకం. తదపరి ఇన్నింగ్స్లో ఏదో ఒక స్కోర్ సాధించి జట్టులో తమ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాలి. లేదంటే వారు జట్టులో తమ స్ధానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వీళ్లకు శ్రేయస్ అయ్యర్ రూపంలో తీవ్రమైన పోటీ నెలకొంది" అని గవాస్కర్ పేర్కొన్నాడు. చదవండి: SA vs IND: రాహుల్కి వార్నింగ్ ఇచ్చిన అంపైర్.. ఎందుకో తెలుసా? -
రాహుల్కి వార్నింగ్ ఇచ్చిన అంపైర్.. ఎందుకో తెలుసా?
దక్షిణాఫ్రికా పర్యటనలో కేఎల్ రాహుల్ అధ్బుతమైన ఫామ్లో ఉన్నాడు. తొలి టెస్ట్లో సెంచరీతో చెలరేగిన రాహుల్.. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీతో రాణించాడు. కాగా భారత రెగ్యులర్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వెన్ను నొప్పి కారణంగా దూరం కావడంతో ఈ టెస్టుకు రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అయితే తొలి సెషన్లో బ్యాటింగ్ చేస్తున్న రాహుల్ని ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్ హెచ్చరించాడు. తొలి ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో మూడో బంతిని దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ బౌలింగ్ చేయడానికి సిద్దమయ్యాడు. చివరి క్షణంలో రాహుల్ వికెట్లు నుంచి దూరంగా తప్పుకున్నాడు. బంతిని ఎదుర్కోవడానికి రాహుల్ సిద్ధంగా లేకపోడంతో చివరి క్షణంలో బౌలర్ను ఆపివేసాడు. వెంటనే రాహుల్ క్షమాపణలు చెప్పినప్పటికీ.. కోంచెం త్వరగా ఆడమని అంపైర్ హెచ్చరించాడు. ఈ సంభాషణ అంతా స్టంప్ మైక్లో రికార్డైంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 202 పరుగులకే ఆలౌటైంది. . తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ సాధించగా... అశ్విన్ (46) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్ 4 వికెట్లు పడగొట్టగా, ఒలీవియర్, రబడ చెరో 3 వికెట్లు తీశారు. . తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టపోయి 35 పరుగులు చేసింది. చదవండి: SA vs IND: టీమిండియాకు భారీ షాక్.. వన్డే సిరీస్కు కోహ్లి దూరం! Marais is a sweet guy #INDvSA. As is the stand-in captain pic.twitter.com/KVQNqUPt06 — Benaam Baadshah (@BenaamBaadshah4) January 3, 2022 Marais is a sweet guy #INDvSA. As is the stand-in captain pic.twitter.com/KVQNqUPt06 — Benaam Baadshah (@BenaamBaadshah4) January 3, 2022 -
టీమిండియాకు భారీ షాక్.. వన్డే సిరీస్కు కోహ్లి దూరం!
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. గాయం కారణంగా రెండో టెస్టు మ్యాచ్కు దూరమైన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్కు కూడా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు టెస్ట్ అఖరి నిమిషంలో వెన్ను నొప్పి కారణంగా కోహ్లి తప్పుకున్నాడు. దీంతో అతడి స్ధానంలో కేఎల్ రాహల్ కెప్టెన్పీ బాధ్యతలు చేపట్టాడు. కాగా టాస్ సమయంలో మాట్లాడిన రాహుల్.. ప్రస్తుం కోహ్లి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడాని, త్వరగా కోలుకుంటాడని తెలిపాడు. కాగా అంతకుముందు వ్యక్తిగత కారణాలతో కోహ్లి వన్డే సిరీస్ నుంచి తప్పకోనున్నాడని వార్తలు వినిపించాయి. కానీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో కోహ్లి ఉన్నాడు. కాగా మరోసారి వన్డేలకు కోహ్లి అందుబాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా టీమిండియా పరిమిత ఓవర్లు కెప్టెన్ రోహత్ శర్మ కూడా గాయంతో దూరమైన సంగతి తెలిసిందే. ఇక భారత్-దక్షిణాఫ్రికా తొలి వన్డే జనవరి19న జరగనుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్కు భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), చహల్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా(వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ చదవండి: SA vs IND: రాహుల్కి వార్నింగ్ ఇచ్చిన అంపైర్.. ఎందుకో తెలుసా? -
టీమిండియా టెస్ట్ కెప్టెన్గా కేఎల్ రాహుల్.. ఇది ప్రతి ఆటగాడి కల!
భారత్-దక్షిణాప్రికా రెండో టెస్ట్కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చివరి నిమిషంలో దూరమయ్యాడు. కోహ్లి స్ధానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. టాస్ సందర్బంగా రాహుల్ మాట్లాడూతూ.." దురదృష్టవశాత్తూ కోహ్లి వెన్ను నొప్పి కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. ప్రస్తుతం విరాట్ని వైధ్యులు పర్యవేక్షిస్తున్నారు. అతడు మూడో టెస్ట్కు గాయం నుంచి కోలుకుంటాడని భావిస్తున్నాను. తన దేశానికి కెప్టెన్గా ఉండాలని అనుకోవడం ప్రతీ ఒక్క ఆటగాడికి కల. ఈ సవాల్ను ఎదర్కొవడానికి సిద్దంగా ఉన్నాను. విరాట్ స్ధానంలో హనుమా విహారి జట్టులోకి వచ్చాడు. తొలి టెస్ట్లో అద్భుతంగా రాణించాము. జోహన్స్బర్గ్లో కూడా అదే జోరు కోనసాగించాలని భావిస్తున్నాము" అని రాహుల్ పేర్కొన్నాడు. చదవండి: టీమిండియా ఆల్రౌండర్కి కరోనా పాజిటివ్.. -
ఆ విషయం విని షాక్కు గురయ్యాను: దక్షిణాఫ్రికా హెడ్ కోచ్
టెస్ట్ సిరీస్లో భాగంగా జొహన్నెస్బర్గ్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. అయితే తొలి టెస్ట్లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికాకు క్వింటన్ డి కాక్ రూపంలో బిగ్ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. డికాక్ తన టెస్ట్ రిటైర్మెంట్ను ఆకస్మికంగా ప్రకటించి అందరనీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ విషయంపై దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ మార్క్ బౌచర్ తాజాగా స్పందించాడు. డికాక్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నట్లు తెలిపాడు. అయితే అతడు ఇంత త్వరగా రిటైర్ అవుతుడాని ఎవరూ ఊహించలేదని బౌచర్ పేర్కొన్నాడు. టెస్ట్ ఫార్మాట్లో డికాక్ అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడని అతడు ప్రశంసించాడు. "ఆ వయస్సులో డికాక్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఎవరూ ఊహించ లేదు. ఇప్పటికీ మేము అదే షాక్లో ఉన్నాము. అతడి వ్యక్తిగత కారణాలను మేము గౌరవిస్తాము. మేము ఇప్పుడు సిరీస్ మధ్యలో ఉన్నాము. సిరీస్పై దృష్టిసారించాలి. డికాక్ స్ధానంలో వచ్చిన యువ ఆటగాళ్లపై దృష్టి పెట్టాలి. అద్భతమైన టెస్ట్ కెరీర్ను కలిగి ఉన్నాడు. డికాక్ స్ధానంలో కైల్ వెర్రెయిన్ జట్టులోకి రానున్నాడు. అతడు తన ఆటను మెరుగుపరుచుకున్నాడు. అతడికి తుది జట్టులో చోటు దక్కపోయిన చాలా కాలం నుంచి జట్టుతోనే ఉన్నాడు. కాబట్టి ఆ అనుభవంతో ముందుకు సాగుతాడని భావిస్తున్నాను" అని బౌచర్ పేర్కొన్నాడు. కాగా మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 1-0తో భారత్ ముందుంజలో ఉంది. ఇక రెండో టెస్ట్లో విజయం సాధించి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది. చదవండి: SA vs IND: ఇది గెలిస్తే... ప్రపంచాన్నే గెలిచినట్లు -
భారత్తో వన్డే సిరీస్.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన
South Africa Squad For ODIs Against India: జనవరి 19 నుంచి టీమిండియాతో ప్రారంభంకానున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం 17 మంది సభ్యుల దక్షిణాఫ్రికా బృందాన్ని క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) ఆదివారం ప్రకటించింది. ఈ జట్టుకు టెంబా బవుమా సారధ్యం వహించనుండగా.. ఇటీవలే టెస్ట్లకు వీడ్కోలు పలికిన క్వింటన్ డికాక్, సంచలన ఫాస్ట్ బౌలర్ మార్కో జెన్సన్, సీనియర్ పేసర్ రబాడ జట్టులో చోటు దక్కించుకున్నారు. గాయం కారణంగా టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమైన స్టార్ పేసర్ నోకియా నోర్జే.. వన్డే జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. Seamer Marco Jansen receives his maiden #Proteas ODI squad call-up as Temba Bavuma returns to captain the side for the #BetwayODISeries against India 🇿🇦 Wayne Parnell, Sisanda Magala and Zubayr Hamza retain their spots 💚#SAvIND #BePartOfIt pic.twitter.com/Nkmd9FBAb3 — Cricket South Africa (@OfficialCSA) January 2, 2022 టీమిండియా వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), కేశవ్ మహరాజ్ (వైస్ కెప్టెన్), క్వింటన్ డికాక్, జన్నెమాన్ మలన్, జుబేర్ హంజా, మార్కో జెన్సన్, సిసండా మగాలా, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, వేన్ పార్నెల్, ఆండైల్ ఫెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబాడ, తబ్రేజ్ షంషి, రాసి వాన్ డెర్ డస్సెన్, కైల్ వెర్రెన్ చదవండి: రెండో టెస్ట్కు ముందు నాలుగు రికార్డులపై కన్నేసిన కోహ్లి -
రెండో టెస్ట్కు ముందు నాలుగు రికార్డులపై కన్నేసిన కోహ్లి
వాండరర్స్: దక్షిణాఫ్రికాతో రేపటి(జనవరి 3) నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్ట్కు ముందు టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లిని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే.. దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయాన్నందించిన తొలి భారత కెప్టెన్గా రికార్డుల్లోకెక్కడంతో పాటు టెస్ట్ల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఆసీస్ దిగ్గజ కెప్టెన్ స్టీవ్ వా(41) సరసన నిలుస్తాడు. ప్రస్తుతం కోహ్లి ఖాతాలో 40 టెస్ట్ విజయాలున్నాయి. ఇక వ్యక్తిగత రికార్డుల విషయానికొస్తే.. వాండరర్స్లో కోహ్లి తానాడిన రెండు మ్యాచ్ల్లో 310 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు జాన్ రీడ్ 316 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. రేపటి మ్యాచ్లో విరాట్ మరో ఏడు పరుగులు చేస్తే రీడ్ రికార్డును బద్దలు కొడతాడు. 2013లో జరిగిన మ్యాచ్లో(119, 96) అదరగొట్టిన ఈ రన్ మెషీన్.. 2018 పర్యటనలో (54, 41) సైతం రాణించాడు. దీంతో పాటు ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న మరో రికార్డుపై సైతం కోహ్లి కన్నేశాడు. దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ద్రవిడ్(11 మ్యాచ్లు, 624 పరుగులు) రెండో స్థానంలో ఉండగా.. కోహ్లి(6 మ్యాచ్ల్లో 611 పరుగులు) మరో 14 పరుగులు చేసి ఆ స్థానాన్ని ఆక్రమించాలని భావిస్తున్నాడు. ఈ జాబితాలో దిగ్గజ బ్యాటర్ సచిన్ (15 మ్యాచ్ల్లో 1161 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. కాగా, సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా భారీ విజయాన్ని సాధించి, మూడు టెస్ట్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియాకు షాకివ్వడమే గతేడాదికి అత్యుత్తమం.. పాక్ కెప్టెన్ -
అతి త్వరలో అతన్ని టీమిండియా నుంచి సాగనంపడం ఖాయం..!
Pujara Will Be Rested Soon Says Sarandeep Singh: గతకొంత కాలంగా పేలవ ఫామ్తో సతమతమవుతున్న టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారాపై భారత మాజీ సెలెక్టర్ శరణ్దీప్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పుజారా వైఫల్యాల పరంపర ఇలాగే కొనసాగితే అతి త్వరలో జట్టు నుంచి సాగనంపడం ఖాయమని హెచ్చరించాడు. అతని స్థానాన్ని ఆక్రమించేందుకు శ్రేయస్ అయ్యర్ లాంటి నైపుణ్యం గల ఆటగాళ్లు కాసుకు కూర్చున్నారని, ఇకనైనా అలస్యం వీడకపోతే కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయే ప్రమాదముందని అలర్ట్ చేశాడు. గతకొంత కాలంగా ఓపెనర్లు కేఎల్ రాహుల్, అడపాదడపా మయాంక్ అగర్వాల్ మినహా టీమిండియాలో ఎవ్వరూ పెద్దగా రాణించడం లేదని, పుజారాతో పాటు రహానే, కోహ్లిలు సైతం ఫామ్ని అందుకునేందుకు ప్రయత్నించాలని, లేకపోతే చాలామంది మహామహులకు పట్టిన గతే వీరికి పడుతుందని హితబోధ చేశాడు. ఈ సందర్భంగా భారత బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించిన శరణ్దీప్.. టీమిండియాదే టెస్ట్ సిరీస్ అని ధీమా వ్యక్తం చేశాడు. మరోవైపు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై కూడా అతను స్పందించాడు. వన్డే కెప్టెన్గా కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేసిన శరణ్దీప్.. బుమ్రాకు వైస్ కెప్టెన్సీ అప్పజెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నాడు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అతను ఈ మేరకు వ్యాఖ్యానించాడు. చదవండి: కోహ్లితో పోలిస్తే అతను బెటర్.. వన్డే కెప్టెన్గా కేఎల్ రాహుల్ ఎంపిక సరైందే..! -
"అశ్విన్కి లాటరీ తగిలింది.. ఇది ఒక కొత్త జీవితం"
భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దాదాపు నాలుగేళ్ల తరువాత వన్డేల్లో పునరాగమనం గమనం చేయనున్నాడు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టులో అశ్విన్కు చోటు దక్కింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రీతీందర్ సింగ్ సోధీ అసక్తికర వాఖ్యలు చేశాడు. అశ్విన్ లాటరీ గెలుచుకున్నాడని అతడు అభిప్రాయపడ్డాడు. అశ్విన్కి ఇది ఒక కొత్త జీవితం అని అతడు తెలిపాడు. "అశ్విన్కి లాటరీ తగిలింది. అతడి కెరీర్ దాదాపు ముగిసిందని.. అశ్విన్ రిటైర్మెంట్ కూడా ప్రకటించడానికి కూడా సిద్దమయ్యాడు. అటువంటి సమయంలో అతడికి ఒక కొత్త జీవితం వచ్చింది. అశ్విన్ ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటాడని భావిస్తున్నాను. అతడు ఒక స్పిన్ దిగ్గజం. అతడికి ఈ ఫార్మాట్లో చాలా అనుభవం ఉంది. రాహుల్ ద్రవిడ్, టీమ్ మేనేజ్మెంట్, సెలెక్టర్లు అతడి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపికచేశారు. దక్షిణాఫ్రికా పర్యటన అంత సులభమైనది కాదు, కాబట్టి సెలెక్టర్లు సరైన నిర్ణయం తీసుకున్నారు అని సోధీ పేర్కొన్నాడు. చదవండి: Sourav Ganguly: మరోసారి కోవిడ్ బారిన పడిన బీసీసీఐ బాస్ -
"అతడు వైస్ కెప్టెన్ అవుతాడని అస్సలు ఊహించలేదు"
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకోపోవడంతో కెప్టెన్సీ బాధ్యతలు కేఎల్ రాహుల్కి అప్పగించారు. అదే విధంగా వైస్ కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రాని చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ ప్యానల్ నియమించింది. అయితే జట్టులో యువ ఆటగాళ్లు రిషబ్ పంత్ను కానీ,శ్రేయస్ అయ్యర్ని ఎంపిక చేస్తారని అంతా భావించారు. అయితే సెలెక్టర్లు మాత్రం బుమ్రావైపే మెగ్గు చూపారు. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్గా బుమ్రాను నియమించడం పట్ల భారత మాజీ క్రికెటర్ సబా కరీం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అయ్యర్, పంత్ను కాకుండా బుమ్రాను వైస్ కెప్టెన్గా నియమిస్తారని అసలు నేను ఊహించలేదు అని కరీం తెలిపాడు. "నేను ఈ విషయం విని చాలా ఆశ్చర్యపోయాను, జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్ అవుతాడని నేను ఊహించలేదు. రిషబ్ పంత్కు వైస్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను అనుకున్నాను. ఎందుకంటే అతడు మూడు ఫార్మాట్లను ఆడతాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా పంత్ అద్భుతంగా రాణించాడు. పంత్కి కెప్టెన్సీపై అవగాహన ఉంది. బుమ్రాకు ఇప్పటి వరకు కెప్టెన్గా చేసిన అనుభవం లేదు"అని సబా కరీమ్ పేర్కొన్నాడు. చదవండి: "నా జీవితంపై సినిమా తీయాలని అనుకుంటున్నాను" -
"బౌన్స్ పిచ్లపై ఆడటానికి సిద్ధంగా ఉన్నా"
టీమిండియా యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. దక్షిణాప్రికాతో వన్డే సిరీస్కు అయ్యర్ని బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫి, విజయ్ హాజరే ట్రోఫిలో అయ్యర్ అద్భుతంగా రాణించాడు. ఇక టీ20ల్లో భారత తరుపున అరంగేట్రం చేసిన అయ్యర్.. మూడు మ్యాచ్ల్లో 36 పరుగులుతోపాటు, మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. కాగా భారత వన్డే జట్టులో చోటు దక్కడం పట్ల అయ్యర్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలో రానున్న దక్షిణాప్రికా పర్యటనలో మరోసారి తనుఎంటో నిరూపించుకోవడానికి అయ్యర్ సిద్దం అవుతున్నాడు. ఇక భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకూడదని, రిలాక్స్గా ఉండాలని అయ్యర్ తెలిపాడు. "నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటాను. దక్షిణాప్రికా పిచ్లు ఎక్కువగా బౌన్స్కు అనుకులస్తాయి. బౌన్స్ పిచ్లపై ఒక బౌలర్, ఫీల్డర్, బ్యాటర్గా నా పాత్రను ఎలా నిర్వహించాలో నేను అన్ని విధాల సన్నద్దం అవుతున్నాను. నేను దక్షిణాఫ్రికాకు చేరుకున్న వెంటనే ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటాను. ప్రస్తుతం నా దృష్టి అంతా దక్షిణాఫ్రికా పర్యటనపైనే ఉంది" అని అయ్యర్ పేర్కొన్నాడు. ఇక భారత్- దక్షిణాప్రికా మధ్య తొలి వన్డే జనవరి 19న ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్కు భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), చహల్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా(వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ -
"టీమిండియా వన్డే వైస్ కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా.. ఇది అద్భుతమైన నిర్ణయం"
దక్షిణాఫ్రికాతో త్వరలో జరగనున్న 3 వన్డేల సిరీస్కు టీమిండియా జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. కాగా గాయం కారణంగా వన్డే సిరీస్కు రోహిత్ దూరం కావడంతో.. కేఎల్ రాహుల్ను కెప్టెన్గా బీసీసీఐ ఎంపిక చేసింది. అదే విధంగా జట్టు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. ఈ నేపథ్యంలో బుమ్రాను వైస్ కెప్టెన్గా నియమియండం పట్ల భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా హర్షం వ్యక్తం చేశాడు. బుమ్రాను నియమిస్తూ బీసీసీఐ అధ్బుతమైన నిర్ణయం తీసుకుందని అతడు తెలిపాడు. "దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు జస్ప్రీత్ బుమ్రాని వైస్ కెప్టెన్గా నియమించడం చాలా సంతోషంగా ఉంది. అతడికి భారత జట్టు వైస్ కెప్టెన్సీ భాధ్యతలు అప్పజెప్పుతూ బీసీసీఐ సెలెక్టర్లు మరోసారి అధ్బుతమైన నిర్ణయం తీసుకున్నారు. బుమ్రాకు ఇది తొలి మెట్టు, ఈ అవకాశాన్ని అతడు సద్వినియోగ పరుచుకుంటాడని నేను భావిస్తున్నాను" అని అతడు పేర్కొన్నాడు. కాగా జట్టులో మువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్కు ఐపీఎల్లో కెప్టెన్గా చేసిన అనుభవం ఉన్నప్పటికీ.. బుమ్రా వైపే సెలెక్టర్లు మెగ్గు చూపారు. దక్షిణాఫ్రికాతో సిరీస్కు భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), చహల్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా(వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ చదవండి: పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ కోచ్.. ఏ జట్టుకో తెలుసా? -
కేఎల్ రాహుల్కు బంపర్ ఆఫర్.. టీమిండియా వన్డే కెప్టెన్గా ఎంపిక
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ బంపర్ ఆఫర్ కొట్టాడు. త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న 3 వన్డేల సిరీస్కు టీమిండియా సారధిగా ఎంపికయ్యాడు. గాయం నుంచి రోహిత్ శర్మ కోలుకోకపోవడంతో(ఫిట్నెస్ సాధించకపోవడంతో) కేఎల్ రాహుల్ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. బీసీసీఐ ప్రకటించిన 18 మంది సభ్యుల బృందంలో ఐపీఎల్ 2021 దేశీయ స్టార్లు వెంకటేశ్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్లతో పాటు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్లు చోటు దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికాతో సిరీస్కు భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), చహల్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా(వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ చదవండి: అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ఆటగాళ్లు.. రేసులో ఇద్దరు పాక్ ఆటగాళ్లు -
"ఏంటి మిశ్రా మత్తులో ఉన్నావా.. ఇది తొలి టెస్ట్ మాత్రమే"
సెంచూరియాన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగిన తొలి టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ ఆటగాడు అమిత్ మిశ్రా భారత జట్టును అభినందిస్తూ ట్వీట్ చేశాడు. అయితే అక్కడే మిశ్రా పప్పులో కాలేశాడు. "విజయం సాధించిన టీమిండియాకు శుభాకాంక్షలు. అద్భుతంగా ఆడారు. చారిత్రత్మక విజయం సాధించి తొలి టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకున్నందుకు గర్వంగా ఉంది" అని మిశ్రా ట్విటర్లో పేర్కొన్నాడు. ఇంకేమి ఉంది ఇక్కడే మిశ్రా నెటిజన్లుకు దొరికిపోయాడు. మొట్టమొదటి టెస్టు సిరీస్ గెలిచినందుకు టీమిండియాకి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసిన మిశ్రాని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. "ఏంటి మిశ్రా మత్తులో ఉండి ట్వీట్ చేశావా" అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఇలా తప్పుగా ట్వీట్ చేయడం మిశ్రా ఇదేం కొత్త కాదు. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2021 విజేత న్యూజిలాండ్కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు. చదవండి: Virat Kohli- Vamika: ‘చిట్టితల్లి... నాన్న గెలిచాడు వామిక.. ఆ సంతోషం వెలకట్టలేనిది’.. వీడియో వైరల్ Congratulations team India. Very well played. A historic win for India as they record their first Test series sweep against South Africa. A proud moment. #IndvsSA #BCCI #TestSeries #TeamIndia #IndiaToday #AajTak #ZeeNews #StarSports #SonySports #NDTVSports #IndiaTv #SportsTak pic.twitter.com/kfYlGfzMYg — Amit Mishra (@MishiAmit) December 30, 2021 -
Ind Vs SA: తొలి టెస్టులో సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 191 పరుగులకే కుప్పకూలడంతో టీమిండియా 113 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. బవుమా 35 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో షమీ 3, బుమ్రా 3, సిరాజ్ 2, అశ్విన్ 2 వికెట్లు తీశారు. సౌతాఫ్రికా చివరి ఐదు వికెట్లను 30 పరుగుల లోపే కోల్పోయింది. టీమిండియా: తొలి ఇన్నింగ్స్: 327 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: 174 ఆలౌట్ సౌతాఫ్రికా: తొలి ఇన్నింగ్స్: 197 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: 191 ఆలౌట్ 3:11 PM: 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోతూ వస్తుంది. లంచ్ విరామం సమయానికి సౌతాఫ్రికా 66 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. బవుమా 34 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తుండగా.. మార్కో జాన్సెన్ 5 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 3, షమీ 2, సిరాజ్ 2 వికెట్లు తీశారు. టీమిండియా విజయానికి కేవలం మూడు వికెట్ల దూరంలో మాత్రమే ఉంది. 2:23 PM: టీమిండియా విజయానికి మరో 5 వికెట్లు మాత్రమే మిగిలాయి. 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా డీన్ ఎల్గర్ రూపంలో కీలక వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 175 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో బవుమా 10, డికాక్ 0 పరుగులతో ఉన్నారు. 1:50Pm: 45 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా స్కోర్: 110/4. ప్రస్తుతం క్రీజులో ఎల్గర్(63),బవుమా(4) పరుగులుతో ఉన్నారు. 1:30 Pm: దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య తొలి టెస్టులో భాగంగా అఖరి రోజు ఆటప్రారంభమైంది. నాలుగో రోజు జు ఆట ముగిసే సరికి దక్షిణాఫ్రికా 4వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. 52 పరుగులతో డీన్ ఎల్గర్ క్రీజులో ఉన్నాడు. ప్రొటీస్ విజయానికి 211 పరుగుల దూరంలో ఉండగా.. టీమిండియా విజయానికి 6 వికెట్ల దూరంలో ఉంది. తుదిజట్లు: భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), వియాన్ మల్దర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి. -
"అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్.. దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపిస్తున్నాడు"
టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. గత కొన్ని నెలలుగా టెస్టులు ఆడనప్పటికీ, సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో షమీ అద్భుతంగా రాణిస్తున్నాడని అతడు పేర్కొన్నాడు. షమీని జేమ్స్ ఆండర్సన్, డేల్ స్టెయిన్ వంటి దిగ్గజాలతో పోల్చాడు. "ప్రపంచంలోనే మహ్మద్ షమీ బౌలింగ్ యాక్షన్ అత్యుత్తమైనది. షమీ అద్భుతమైన లైన్-లెంగ్త్ బౌలింగ్ చేస్తాడు. నేను ఇప్పటి వరకు చాలా మంది ఆటగాళ్లను చూశాను. కానీ షమీ లాంటి మణికట్టు స్థానం ఉన్న బౌలర్ను చూడలేదు. ఏ బౌలరైనా ఒక్కోసారి తన మణికట్టు స్దానాన్ని కోల్పోయి బౌలింగ్ చేయడం చూసే ఉంటాం. జేమ్స్ ఆండర్సన్, స్టెయిన్ వంటి స్టార్ బౌలర్లు కూడా మణికట్టు స్దానాన్ని కోల్పోయి పరుగులు సమర్పించుకోడవం చూశాం. కానీ షమీ ఆలా బౌలింగ్ చేయడం నేను ఎప్పడూ చూడలేదు. దక్షిణాఫ్రికా బౌలర్ల గురించి మాట్లాడుతూ.. వారు చాలా కాలంగా టెస్ట్ క్రికెట్ ఆడలేదు. లైన్ - లెంగ్త్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. టీ20 ప్రపంచకప్ తర్వాత షమీ కూడా ఆడలేదు. ఇంగ్లండ్తో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. కానీ అతడి బౌలింగ్లో ఎటువంటి మార్పు రాలేదు" అని యూట్యూబ్ ఛానల్లో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. ఇక తొలి టెస్ట్లో ప్రోటాస్ బ్యాటర్లకు షమీ చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు రెండు ఇన్నింగ్స్లు కలిపి ఆరు వికెట్లు షమీ పడగొట్టాడు. చదవండి: SA Vs IND: బుమ్రాకి బౌలింగ్ ఎలా చేయాలో సూచనలు చేసిన కోహ్లి.. -
బుమ్రాకి బౌలింగ్ ఎలా చేయాలో సూచనలు చేసిన కోహ్లి..
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్బుతంగా రాణిస్తున్నాడు. ఆట నాలుగో రోజు గాయం కారణంగా ఫీల్డ్లోకి ఆలస్యంగా వచ్చిన బుమ్రా రెండు కీలక మైన వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్.. బ్యాటర్ వాన్ డెర్ డస్సెన్తో కలిసి 40పరుగుల భాగాస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ సమయంలో బౌలింగ్ వచ్చిన బుమ్రా.. వాన్ డెర్ డస్సెన్ని క్లీన్ బౌల్డ్ చేసి భాగాస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో అర్ధసెంచరీ సాధించి నిలకడగా ఆడుతున్న ఎల్గర్ని ఔట్ చేయడానికి కోహ్లి వ్యూహలను రచిస్తోన్నాడు. బౌలింగ్ చేస్తున్న బుమ్రాకు కోహ్లి పలు సూచనలు చేశాడు. ఎల్గర్కు రౌండ్ది వికెట్ బౌలింగ్ చేయమని కోహ్లి సూచించాడు. పిచ్పై పగుల్లు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోమని కోహ్లి బుమ్రాకు సలహా ఇచ్చాడు. వెంటనే బుమ్రా తన పొజిషన్ మార్చుకుని రౌండ్ది వికెట్ బౌలింగ్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ విజయానికి 6వికెట్ల దూరంలో ఉంది. 315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ఆఫ్రికా 4వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. చదవండి: SA Vs IND: టెస్టుల్లో రికార్డు సృష్టించిన బుమ్రా.. భారత్ తరపున తొలి బౌలర్గా.. -
టెస్టుల్లో రికార్డు సృష్టించిన బుమ్రా.. భారత్ తరపున తొలి బౌలర్గా..
భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ క్రికెట్లో సరి కొత్త రికార్డును సృష్టించాడు. భారత్ తరుపున విదేశాల్లో అత్యంత వేగంగా 100 టెస్టు వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచాడు. సెంచూరియాన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో వాన్ డెర్ డస్సెన్ని ఔట్ చేసిన బుమ్రా ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డును బుమ్రా కేవలం 43 ఇన్నింగ్స్లోనే తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 25 టెస్ట్లు ఆడిన బుమ్రా మొత్తంగా 105 వికెట్లు పడగొట్టాడు. అయితే బుమ్రా సాధించిన 105 వికెట్లలో 101 విదేశాల్లోనే పడగొట్టడం గమనర్హం. కాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో బుమ్రా అదరగొడుతున్నాడు. కీలక సమయంలో వాన్ డెర్ డస్సెన్, కేశవ్ మహారాజ్లను పెవిలియన్కు పంపి భారత్ను విజయానికి ఆరు వికెట్ల దూరంలో నిలిపాడు. కాగా బుమ్రా తన టెస్ట్ కెరీర్ను 2018లో దక్షిణాఫ్రికాలోనే ప్రారంభించాడు. చదవండి: ఉత్తర్ప్రదేశ్ కెప్టెన్గా కుల్ధీప్ యాదవ్.. -
భారత వన్డే జట్టు కెప్టెన్గా కేఎల్ రాహుల్!
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు కేఎల్ రాహుల్ భారత జట్టుకు సారథ్య బాధ్యతలు వహించే అవకాశం ఉంది. పరిమిత ఓవర్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రోహిత్ శర్మ నేషనల్ క్రికెట్ అకాడమీలోని రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాడు. అయితే అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు రోహిత్ అందుబాటుపై సందిగ్ధత నెలకొంది. కాగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత జట్టును ఒకటి రెండ్రోజుల్లో బీసీసీఐ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ గాయం నుంచి కోలుకోపోతే కేఎల్ రాహుల్ను కెప్టెన్గా ఎంపిక చేసే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కేఎల్ రాహుల్ ప్రస్తుతం టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక జనవరి 19నుంచి భారత్- దక్షిణాఫ్రికా మద్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: ఇదేమి బౌలింగ్రా బాబు.. 4 ఓవర్లలో 70 పరుగులు! -
రెండో రోజు ఆట వర్షార్పణం... భారత్కు గెలుపు దక్కేనా!
సెంచూరియన్: తొలి రోజు చక్కటి ప్రదర్శనతో దక్షిణాఫ్రికా సిరీస్లో శుభారంభం చేసిన భారత్కు రెండో రోజే ప్రతికూలత ఎదురైంది. వరుణుడి కారణంగా అదే జోరును కొనసాగించే అవకాశం లేకుండా పోయింది. వర్షం కారణంగా తొలి టెస్టు సోమవారం ఆట పూర్తిగా రద్దయింది. నగరంలో ఆదివారం రాత్రి నుంచే కురుస్తున్న వాన సోమవా రం కూడా కొనసాగడంతో క్రికెట్ సాధ్యం కాలేదు. మధ్యలో రెండుసార్లు వర్షం తగ్గడంతో అంపైర్లు మైదానాన్ని పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. అయితే అదే సమయంలో మళ్లీ వర్షం రావడంతో చేసేదేమీ లేకపోయింది. ఫలితంగా ఒక్క బంతి కూడా వేయకుండానే స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:55కు అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 90 ఓవర్లలో 3 వికెట్లకు 272 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (248 బంతుల్లో 122 బ్యాటింగ్; 17 ఫోర్లు, 1 సిక్స్), అజింక్య రహానే (81 బంతుల్లో 40 బ్యాటింగ్; 8 ఫోర్లు) క్రీజ్లో ఉన్నారు. గెలుపు దక్కేనా! వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఈ టెస్టు మూడు, నాలుగు రోజుల్లో ఎలాంటి వర్ష సూచన లేదు. ఆట పూర్తి స్ధాయిలో సజావుగా సాగే అవకాశం ఉంది. అయితే చివరి రోజైన గురువారం కూడా వాన పడే అవకాశం ఉందని నిపుణులు చెబు తున్నారు. అదే జరిగితే నాలుగు ఇన్నింగ్స్ల ఆట సాగడం దాదాపు అసాధ్యమే. పైగా ఇప్పటి వరకు స్పందిస్తున్న తీరు చూస్తే పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలంగా ఉంది. ఒక్కసారిగా వికెట్లు కుప్పకూలిపోయే పరిస్థితి కూడా కనిపించడం లేదు. టీమిండియాకు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే ఆట సాగితే కచ్చితంగా మనదే పైచేయి అయి ఉండేది. సఫారీ గడ్డపై తొలిసారి సిరీస్ గెలవాలని కోరు కుంటున్న భారత్కు వర్షం వల్ల మ్యాచ్లో ఆశించిన ఫలితం రాకపోతే మాత్రం తీవ్ర నిరాశ తప్పదు. ఒలీవియర్ అందుకే ఆడలేదు! భారత్తో తొలి రోజు ఒక్క ఇన్గిడి మినహా దక్షిణాఫ్రికా బౌలర్లంతా పేలవ ప్రదర్శన కనబర్చారు. సీనియర్ రబడ పూర్తిగా విఫలం కాగా, కొత్త బౌలర్ మార్కో తేలిపోయాడు. గాయంతో నోర్జే సిరీస్కు దూరం కావడంతో అతని స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్, దేశవాళీలో అద్భుత ఫామ్లో ఉన్న డ్యువాన్ ఒలీవియర్ టెస్టులో కచ్చితంగా ఆడతారని అంతా భావించారు. అయితే అతడిని టెస్టుకు ఎంపిక చేయకపోవడంతో దక్షిణా ఫ్రికా సెలక్టర్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో సోమవారం క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) వివరణ ఇచ్చింది. ‘కొన్నాళ్ల క్రితం ఒలీవియర్ కోవిడ్–19 బారినపడ్డారు. కరోనా ప్రభావపు తదనంతర సమస్యల నుంచి అతను పూర్తిగా కోలుకోలేదు. క్వారంటైన్ కారణంగా సరిగా ప్రాక్టీస్ సాగకపోగా, క్యాంప్ ఆరంభంలోనే తొడ కండరాల గాయంతోనూ బాధ పడ్డాడు. అందుకే అతనికి బదులుగా మార్కోకు అవకాశమిచ్చాం’ అని సెలక్షన్ కమిటీ కన్వీనర్ విక్టర్ పిట్సంగ్ వెల్లడించారు. చదవండి: ఇదేమి బౌలింగ్రా బాబు.. 4 ఓవర్లలో 70 పరుగులు! -
కోహ్లి.. ఎలా ఆడాలో రాహుల్ని చూసి నేర్చుకో: భారత మాజీ క్రికెటర్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి నిరాశ పరిచాడు. తన 71వ సెంచరీ కోసం నిరీక్షణ ఇంకా కొనసాగుతుంది .భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన కోహ్లి, కేఎల్ రాహుల్తో కలిసి నాల్గో వికెట్కు 82 పరుగులు జోడించాడు. అయితే భారత ఇన్నింగ్స్ 69వ ఓవర్ వేసిన లుంగీ ఎంగిడీ బౌలింగ్లో రెండో బంతిని ఆఫ్సైడ్లో ఆడేందుకు కోహ్లి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్స్లో ఉన్న వియాన్ మల్డర్కు చేతికి వెళ్లింది. కోహ్లి 94 బంతుల్లో 35 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఔటైన తీరుపై భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. "కోహ్లి ఆడితే చూడాలాని చాలా మంది భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అతడి ఆటతీరుపై అతడే అసంతృప్తిగా ఉంటాడు. కానీ కోహ్లి రికార్డులను పరిశీలిస్తే.. గత ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లి అధ్బుతంగా రాణించాడు. అదే విధంగా 2028 దక్షిణాఫ్రికా పర్యటనలో సెంచరీ సాధించాడు. అతడు సెంచరీలు,డబుల్ సెంచరీలు సాధించాలనే కసితో ఉన్నాడు. ఇక కోహ్లి ఔటైన తీరు నాకు కాస్త ఆసంతృప్తి కలిగించింది. దక్షిణాఫ్రికా బౌలర్లు కోహ్లికి ఆఫ్ స్టంప్ వెలుపల బౌలింగ్ చేస్తున్నారు. కోహ్లి టెంప్ట్ అయ్యి వికెట్ను చేజేర్చుకున్నాడు. రాహుల్ ఆడిన విధంగానే కోహ్లి, అటువంటి డెలివరీలను వదిలేయాలని" అని ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు. ఇక తొలి రోజు భారత్ మూడు వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. కాగా రెండో రోజు ఆటకు వరుణుడు ఆటంకి కలిగించాడు. దీంతో ఒక్క బంతి కూడా పడకుండానే రోజు ఆట రద్దైంది. చదవండి: మూడేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి.. ఇంకా బయోబబుల్లోనే! -
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. నాలుగేళ్ల తర్వాత అశ్విన్ రీ ఎంట్రీ!
Ravi Ashwin on selectors radar for South Africa ODIs: భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పరిమిత ఓవర్ల క్రికెట్లో దాదాపు నాలుగేళ్ల తరువాత పునరాగమనం చేశాడు. టీ20 ప్రపంచకప్తో రీఎంట్రీ ఇచ్చిన అశ్విన్ అద్బుతంగా రాణించాడు. తరువాత స్వదేశంలో న్యూజిలాండ్తో జరగిన టీ20 సిరీస్లోను అద్బుతమైన ప్రదర్శన చేశాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్న అశ్విన్ సెలెక్టర్ల దృష్టిని మరింత ఆకర్షించాడు. ఈ క్రమంలో త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్కు అశ్విన్ ఎంపిక చేసే ఆలోచనలో సెలెక్షన్ కమిటీ ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా అశ్విన్కి రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, చహాల్ రూపంలో తీవ్రమైన పోటీ నెలకొంది. కాగా చివరి వన్డే మ్యాచ్ 2017లో ఆడాడు. ఇక దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. ఇక గాయం కారణంగా టెస్ట్ సిరీస్కు దూరమైన టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే సిరీస్కు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్ వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇక టెస్ట్ సిరీస్ ముగిశాక జనవరి19 నుంచి దక్షిణాఫ్రికా- భారత్ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: Ind vS SA Test: నోర్జే లేడు.. కష్టమే.. భారమంతా రబడపైనే.. మరి కేశవ్ మహరాజ్? -
దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ సాధించిన రికార్డులు ఇవే..
India Test Record In South africa: దక్షిణాఫ్రికాతో తొలి పోరుకు భారత్ సిద్దమైంది. ఆదివారం( డిసెంబర్26) నుంచి సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్(బ్యాక్సింగ్ డే టెస్ట్) ప్రారంభం కానుంది. తొలి టెస్ట్లో విజయం సాధించి సిరీస్ను ఘనంగా ఆరంభించాలని టీమిండియా భావిస్తోంది. కాగా ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఒక్క టెస్ట్ సిరీస్ గెలవలేదు. ఈ క్రమంలో తొలి టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవాలని కోహ్లి సేన ఉవ్విళ్లూరుతుంది. ఈ నేపథ్యంలో సఫారీ గడ్డపై భారత్ సాధించిన రికార్డులెంటో ఓ లుక్కేద్దాం. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ సాధించిన రికార్డులు ఇవే ► దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు సాధించిన టెస్టు విజయాల సంఖ్య. ఇప్పటివరకు ఏడుసార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత జట్టు మొత్తం 20 టెస్టులు ఆడింది. 10 టెస్టుల్లో ఓడిపోయి, ఏడు టెస్టులను ‘డ్రా’ చేసుకుంది. ► దక్షిణాఫ్రికా గడ్డపై భారత్కు టెస్టు విజయాలను అందించిన కెప్టెన్లు. 2006లో రాహుల్ ద్రవిడ్... 2010లో ధోని... 2018లో విరాట్ కోహ్లి నాయకత్వంలో భారత జట్టు ఒక్కో టెస్టులో విజయం రుచి చూసింది. ► సెంచూరియన్లో దక్షిణాఫ్రికా గెలిచిన టెస్టుల సంఖ్య. ఈ వేదికపై దక్షిణాఫ్రికా మొత్తం 26 టెస్టులు ఆడింది. రెండు టెస్టుల్లో ఓడి, మూడింటిని ‘డ్రా’ చేసుకుంది. మరోవైపు సెంచూరియన్లో గతంలో ఆడిన రెండు టెస్టుల్లోనూ భారత్ ఓడిపోయింది. చదవండి: Hardik Pandya: అభిమానితో హార్దిక్ పాండ్యా దురుసు ప్రవర్తన.. వీడియో వైరల్ -
Ind Vs Sa Test Series: "ఫామ్లో లేడని కోహ్లిని తప్పిస్తారా..’’
టీమిండియా క్రికెటర్ అజింక్య రహానే గత కొద్ది కాలంగా పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది టెస్టు క్రికెట్లో 19.57 సగటుతో 411 పరుగులు మాత్రమే సాధించాడు. అయితే అతడికి విదేశీ పిచ్లపై ఉన్న రికార్డల దృష్ట్యా దక్షిణాఫ్రికా పర్యటనకు అతడిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. కాగా ఆరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీ సాధించిన శ్రేయాస్ అయ్యర్ రూపంలో రహానే స్ధానానికి గట్టి పోటీ నెలకొంది. అంతే కాకుండా హనుమ విహారి రూపంలో ఐదోస్ధానానికి పోటీ ఏర్పడింది. ఈ క్రమంలో భారత మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. సెంచూరియాన్ వేదికగా జరిగే తొలి టెస్ట్లో రహానేకి చోటు దక్కడం కష్టమని అతడు అభిప్రాయపడ్డాడు. "జట్టులో ఐదో స్ధానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ స్ధానంలో ఎవరని ఎంపిక చేయాలో అన్నది కష్టంగా మారింది. కేవలం గణంకాల ఆధారంగా మాత్రమే జట్టును ఎంపిక చేస్తే, కోహ్లి కూడా గత ఏడాదిగా ఫామ్లో లేడు. అయితే ఇప్పుడు కోహ్లి ఫామ్లో లేడని జట్టు నుంచి తప్పిస్తారా? పూజారా కూడా గత కొంత కాలంగా ఫామ్లో లేడు. అతడి గురించి ఎవరూ మాట్లాడరు. పూజారాకి జట్టులో కచ్చితంగా చోటు దక్కుతుంది. కానీ చివరకు మిగిలినది రహానే మాత్రమే. అతడు రానున్న రోజుల్లో జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో తొలి టెస్ట్కు రహానే సారథ్యం వహించాడు. ఇక రెండో టెస్ట్కు విరాట్ కోహ్లి జట్టులోకి రావడంతో రహానే ఏకంగా జట్టులో స్ధానాన్నే కోల్పోయాడు. దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్ట్కు టీమిండియా 5లేదా 6గురు బ్యాటర్లతో బరిలోకి దిగాలని భావిస్తే రహానేకి చోటు దక్కడం కష్టం. కోహ్లికి లేదా పుజారాకు ఇదేమి కొత్త కాదు. కోహ్లి సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటాడు. 2018 పర్యటనలో జోహన్స్బర్గ్, కేప్టౌన్ పిచ్లపై భారత ఆటగాళ్లు ఆడటానికి ఇబ్బంది పడ్డారు. అయితే కోహ్లి మాత్రం 150 పరుగులు సాధించి అధ్బుతంగాగ రాణించాడు. ఈసారి కూడా కోహ్లి రాణిస్తాడని నేను ఆశిస్తున్నాను. ఇక రహానే స్ధానంలో శ్రేయాస్ అయ్యర్ లేదా హనుమా విహారికు చోటు దక్క వచ్చు" అని ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు. చదవండి: దక్షిణాఫ్రికాపై భారత్ గెలవడం చాలా కష్టం.. సిరీస్ వాళ్లదే: టీమిండియా మాజీ క్రికెటర్ -
"దక్షిణాఫ్రికాపై భారత్ గెలవడం చాలా కష్టం.. సిరీస్ వాళ్లదే"
సౌతాఫ్రికా-భారత్ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టెస్ట్ సిరీస్లో సౌతాఫ్రికాపై భారత్ విజయం సాధించడం చాలా కష్టం అని అతడు అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్లో భాగంగా డిసెంబర్26 నుంచి సెంచూరియన్ వేదికగా ప్రారంభం కానుంది. "ఈ సిరీస్లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలవడం చాలా కష్టం. ఇంతకు ముందు జట్టులో నోర్జే ఉన్నప్పుడు దక్షిణాఫ్రికా2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంటుందని చెప్పాను. ఇప్పుడు గాయం కారణంగా నోర్జే ప్రోటాస్కు దూరమయ్యాడు. కనుక ఈ సిరీస్కు1-1తో సమం కావచ్చు. ఎందుకంటే తొలి టెస్ట్కు వరుణుడు ఆటంకం కలిగించవచ్చు. ఈ సిరీస్ డ్రాగా ముగిస్తుందని నేను భావిస్తున్నాను. ఒక వేళ విజయం సాధిస్తే అది దక్షిణాఫ్రికా జట్టే అవుతుంది. దక్షిణాఫ్రికా జట్టు తిరిగి ఫామ్లోకి వచ్చింది. ఆ జట్టులో యువ ఆటగాళ్లు అద్బుతంగా రాణిస్తున్నారు. టీ20 వరల్డ్కప్లో కూడా దక్షిణాఫ్రికా అద్బుతంగా ఆడింది" అని యూట్యూబ్ ఛానల్లో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. భారత జట్టు(అంచనా): మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చదవండి: SA Vs IND: భారత ఆటగాళ్లకు ద్రవిడ్ స్పెషల్ క్లాస్.. ఎందుకో తెలుసా? -
భారత ఆటగాళ్లకు ద్రవిడ్ స్పెషల్ క్లాస్.. ఎందుకో తెలుసా?
దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్కు టీమిండియా అన్ని అస్త్రాలను సిద్దం చేసుకోంటుంది. డిసెంబర్26 న సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ జట్టు ఆటగాళ్లపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నాడు. అదే విధంగా ఈ మ్యాచ్ కోసం ఆటగాళ్లతో ద్రావిడ్ వ్యూహాలను రచిస్తోన్నాడు. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా రెండు వైట్ బోర్డులను తీసుకువచ్చి ద్రవిడ్ ఆటగాళ్లకు స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. ఈ క్లాస్లో కెప్టెన్ కోహ్లితో పాటు జట్టు ఆటగాళ్లంతా పాల్గొన్నారు. ఈ సెషన్లో భాగంగా ఆటగాళ్లకు దిశా నిర్ధేశం చేశాడు. ఈ మ్యాచ్లో అనుసరించాల్సిన మార్గాలపై ద్రవిడ్ ఆటగాళ్లతో చర్చించాడు. కాగా గతంలో కూడా భారత మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిరెస్టన్ ఇటువంటి సెషన్స్ తీసుకునేవాడు. అయితే భారత జట్టు ఇప్పటివరకు సఫారీ గడ్డపై ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవ లేదు. దీంతో ఈ సిరీస్పై కోచ్ ద్రవిడ్తో పాటు, కెప్టెన్ కోహ్లి ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. భారత జట్టు(అంచనా): మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చదవండి: IND vs SA Test Series: టీమిండియా అదరగొడుతోంది.. కానీ ఇక్కడ మాదే పైచేయి: ప్రొటిస్ కెప్టెన్ .@imVkohli's transformation 👏 Excitement about SA challenge 👌 Initial few months as Head Coach ☺️ Rahul Dravid discusses it all as #TeamIndia gear up for the first #SAvIND Test in Centurion. 👍 👍 Watch the full interview 🎥 🔽https://t.co/2H0FlKQG7q pic.twitter.com/vrwqz5uQA8 — BCCI (@BCCI) December 25, 2021 -
ఓపెనర్లుగా మయాంక్, రాహుల్.. హనుమ విహారికి నో ఛాన్స్!
Ind Vs Sa Test Series: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకి భారత్ తుది జట్టు ఎంపికపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగతున్నాయి. డిసెంబరు 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. ఇక బ్యాక్సింగ్డే టెస్టులో విజయం సాధించి సిరీస్ను శుభారంభం చేయాలని కోహ్లి సేన భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్కు తుది జట్టును ఎంపిక చేయడం పెద్ద సవాల్గా మారింది. మిడిలార్డర్లో రెండు స్థానాల కోసం ముగ్గురు ఆటగాళ్లు పోటీపడుతున్నారు. అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి రేసులో ఉన్నారు. కాగా ప్రస్తుతం అజింక్య రహానె టెస్టుల్లో ప్రస్తుతం పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. అయితే అతడికి విదేశాల్లో ఉన్న రికార్డుల దృష్ట్యా.. తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. మరో వైపు ఆరంగ్రేట్ర మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్కు మిడిలార్డర్లో చోటు దక్కచ్చు. ఇక మరోసారి హనుమ విహారి బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక తుది జట్టులో ఎవరకి చోటుదక్కుతుందో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. ఈ క్రమంలో క్రికెట్ నిపుణలు, మాజీలు దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్ట్కు భారత ప్లేయింగ్ ఎలెవన్ను అంచనా వేస్తున్నారు. ఈ కోవలో భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ కూడా చేరాడు. తొలి టెస్ట్కు భారత ప్లేయింగ్ ఎలెవన్ను జాఫర్ ఎంచుకున్నాడు. ఈ జట్టులో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ను ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. ఇక ఫామ్లో లేకపోయిన ఛెతేశ్వర్ పుజారాకు తన జట్టులో మూడో స్ధానంలో చోటు కల్పించాడు. ఇక నాలుగో స్ధానంలో కెప్టెన్ కోహ్లికు చోటు దక్కింది. ఇక ఐదో స్ధానంలో అతడు అజింక్యా రహానె వైపే మెగ్గుచూపాడు. ఆరో స్ధానంలో శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేశాడు. ఇక జట్టు వికెట్ కీపర్గా రిషబ్ పంత్కు చోటు ఇచ్చాడు. జట్టులో ఏకైక స్పిన్నర్గా రవిచంద్రన్ అశ్విన్ను ఎంచుకున్నాడు. ఇక బౌలర్ల కోటాలో మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్కు వసీం చోటు ఇచ్చాడు. కాగా జాఫర్ ప్రకటించిన జట్టులో హనుమ విహారి చోటు దక్కలేదు. వసీం జాఫర్ ఎంచుకున్న భారత ప్లేయింగ్ ఎలెవన్: మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చదవండి: Harbhajan Singh: ఆడతాడు... తిడతాడు... కొడతాడు! అది భజ్జీ స్పెషల్.. -
"ఈ సారి కూడా విజయం మాదే.. టీమిండియాకు ఓటమి తప్పదు"
దక్షిణాఫ్రికా పర్యటనలలో భాగంగా టీమిండియా మూడు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. ఇక టెస్ట్ సిరీస్లో భాగంగా సెంచూరియాన్ వేదికగా తొలిటెస్ట్ ప్రారంభం కానుంది. కాగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ భారత్ గెలవలేదు. ఈ సారి కచ్చితంగా కోహ్లి సేన తొలి సిరీస్ కైవసం చేసుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. భారత్ - దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ప్రోటాస్ మాజీ పేసర్ ముఖాయ ఎన్తిని ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కొన్నేళ్లుగా అత్యుత్తమ టెస్టు జట్లలో భారత్ ఒకటిగా నిలిచిందని, కానీ స్వదేశంలో టీమిండియాను కచ్చితంగా ఓడిస్తాము అని అతడు తెలిపాడు. “ప్రస్తుతం భారత్ అత్యుత్తమ బౌలింగ్ విభాగాన్ని కలిగి ఉంది. కానీ దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు ఇక్కడి పిచ్లపై పూర్తి అవగహన ఉంది. మా జట్టులో డీన్ ఎల్గర్, టెంబా బావుమా వంటి ఆద్బుతమైన బ్యాటర్లు ఉన్నారు. అదే విధంగా వాన్ డెర్ డుస్సెన్ రూపంలో మాకు ఒక మంచి ఆటగాడు దొరికాడు. ఇక డికాక్ కూడా తనదైన రోజున జట్టును గెలిపించగలడు. మాకు రబాడా, ఎంగడీ వంటి స్టార్ పేసర్లు ఉన్నారు. భారత్ను ఒత్తిడిలోకి నెట్టగలరు. మా బౌలర్లు ఇప్పటికే భారత్పై పట్టును కలిగి ఉన్నారు. చివరగా నేను చెప్పేది ఒక్కటే.. ఈసారి కూడా భారత జట్టు సిరీస్ను గెలవలేరు అని ముఖాయ ఎన్తిని పేర్కొన్నాడు. చదవండి: Abid Ali: పాక్ క్రికెటర్ ఆబిద్ అలీకి యాంజియో ప్లాస్టీ.. రెండు నెలలు విశ్రాంతి -
విరాట్ సిద్ధమయ్యాడు.. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలే!
దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ (బ్యాక్సింగ్డే టెస్ట్)కు ముందు టీమిండియా నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. డిసెంబర్26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. కాగా ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై ఒక్క టెస్ట్ సిరీస్ కూడా భారత్ గెలవలేదు. ఇక కోహ్లి సారథ్యంలోని భారత జట్టు తొలి టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నెట్స్లో చెమటోడ్చుతున్నాడు. తన ప్రాక్టీస్ సెషన్కి సంబంధించిన కొన్ని ఫోటోలను ట్విట్టర్లో అభిమానులతో కోహ్లి పంచుకున్నాడు. దీంతో బ్యాక్సింగ్డే టెస్ట్కు రన్మిషన్ కోహ్లి సిద్దమయ్యాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా కోహ్లి గత కొంతకాలంగా అంత ఫామ్లో లేడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి సెంచరీ సాధించి రెండేళ్లు దాటింది. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్లోనైనా కోహ్లి సెంచరీ సాధిస్తాడాని అభిమానులు ఆశిస్తున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న కెప్టెన్సీ వివాదం నేపథ్యంలో కోహ్లి ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. కాగా విరాట్ కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలిగించి రోహిత్ శర్మను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ఆసియా కప్లో భారత్ శుభారంభం.. దుమ్మురేపిన హర్నర్, యశ్దల్ 🥊day 🏏..⏳ pic.twitter.com/kV3tbqlQdp — Virat Kohli (@imVkohli) December 23, 2021 -
వివాదాలకు బ్యాట్తోనే కోహ్లి సమాధానం చెబుతాడు.. ఇప్పుడూ అంతే!
టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి అనూహ్యంగా విరాట్ కోహ్లిని బీసీసీఐ తొలిగించిన సంగతి తెలిసిందే. కాగా కోహ్లిను తప్పించి రోహిత్కి కెప్టెన్సీ భాధ్యతలు అప్పజెప్పడంపై బీసీసీఐపై విమర్శలు వెల్లువెత్తాయి. తరువాత బీసీసీఐపై విరాట్ కోహ్లి సంచలన వాఖ్యలు చేశాడు. తనకు చెప్పకుండానే కెప్టెన్సీ నుంచి తొలిగించారని విరాట్ ఆరోపించడంతో.. ఈ వివాదం మరింత ముదిరింది. ప్రస్తుతం కోహ్లి కెప్టెన్సీ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత టెస్ట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. అయితే ఈ మధ్యన చెలరేగిన వివాదాల అన్నింటికి కోహ్లి తన బ్యాట్తోనే సమాధానం చెబుతాడని అతడి చిన్ననాటి కోచ్ రాజ్కూమార్ శర్మ చెప్పారు. "ఏది జరిగినా తన మంచికే. విరాట్ కేరిర్లో ఎప్పుడూ ఏదైనా వివాదానికి తన బ్యాట్తోనే సమాధానం చెబుతాడు. ఈ సారి కూడా అలా జరిగితే, అది భారత జట్టుకు చాలా ఉపయోగపడుతుంది. దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ విభాగం చాలా అత్యుత్తమైనది. ఈ సిరీస్లో విరాట్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడడం భారత జట్టుకు చాలా కీలకం. ఈ సారి కూడా తన బ్యాట్తో కోహ్లి పరుగుల సునామీ సృష్టిస్తాడని భావిస్తున్నాను" అని ఇండియా టీవికు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్కూమార్ శర్మ పేర్కొన్నాడు. ఇక డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. చదవండి: "గంగూలీ నీ పని నువ్వు చూసుకో.. ఆ విషయం వాళ్లు చూసుకుంటారు" -
క్రికెటర్లకు కరోనా సోకినా ఆట ఆగదు..
న్యూఢిల్లీ: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్టు, వన్డే సిరీస్లు నిరాటంకంగా కొనసాగనున్నాయి. ఒమిక్రాన్ సహా ఏ ఇతర కరోనా వేరియంట్ వచ్చినా, ఆటగాళ్లకు సోకినా మ్యాచ్లు జరుగుతాయి తప్ప వాయిదా, రద్దు అనేదే ఉండదు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) బోర్డుల మధ్య పరస్పర అంగీకారంతో ఒప్పందం కుదిరింది. ఆటగాళ్లు, లేదంటే సిబ్బందిలో ఎవరికైనా కోవిడ్ సోకితే సదరు వ్యక్తుల్నే ఐసోలేషన్కు పంపిస్తారు. సన్నిహితంగా మెలిగిన వారిని బలవంతంగా ఐసోలేషన్కు తరలించబోమని సీఎస్ఏ మెడికల్ ఆఫీసర్ షుయెబ్ మంజ్రా తెలిపారు. ‘ఇరు బోర్డుల మధ్య మెడికల్ ప్రొటోకాల్ ఒప్పందం కుదిరింది. బయో బబుల్లోని వారంతా టీకా తీసుకున్నారు. పొరపాటున ఎవరికైనా వైరస్ సోకినా హోటల్లో వేరుగా ఉంచుతారు. మ్యాచ్లను మాత్రం కొనసాగిస్తాం’ అని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించేందుకు నిష్ణాతులైన వైద్య సిబ్బందిని నిత్యం అందుబాటులో ఉంచామని చెప్పారు. ఆటగాళ్లకు, సిబ్బంది, హోటల్ సిబ్బంది, గ్రౌండ్ సిబ్బందికి ప్రతి రోజు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహిస్తూనే ఉంటామని మంజ్రా వివరించారు. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఈ ఆదివారం సెంచూరియన్లో మొదలవుతుంది. జనవరి 19, 21, 23 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. సిరీస్లోని అన్ని మ్యాచ్లకు ప్రేక్షకులకు అనుమతించడం లేదు. చదవండి: న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్పై వేటు.. -
భారత బౌలర్పై సచిన్ ప్రశంసల జల్లు..
ముంబై: టెస్టు క్రికెట్లోకి ప్రవేశించిన నాటినుంచి అద్భుత ప్రదర్శనతో భారత జట్టులో కీలక సభ్యుడిగా మారిన హైదరాబాద్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. ‘సిరాజ్ కాళ్లల్లో స్ప్రింగ్లు ఉన్నట్లుగా చురుగ్గా ఉంటాడు. అది నాకెంతో నచ్చుతుంది. అతని రనప్ కూడా బాగుంటుంది. మైదానంలో ఎల్లప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తాడు. ఆటలో ఆ రోజు తొలి ఓవర్ వేస్తున్నాడా, చివరిది వేస్తున్నాడా అనిపించే అరుదైన బౌలర్లలో సిరాజ్ ఒకడు. ఏ సమయంలోనైనా దూసుకొచ్చేందుకు అతను సిద్ధంగా ఉంటాడు’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. మాస్టర్ ప్రశంసలపై సిరాజ్ కృతజ్ఞతలు తెలిపాడు. సచిన్ స్థాయి వ్యక్తి తనను మెచ్చుకోవడం తనకు మరింత ప్రేరణ అందిస్తుందని, దేశం కోసం అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తానని అతను అన్నాడు. చదవండి: న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్పై వేటు.. -
అతనిలో ప్రతిసారి ఏదో కొత్తదనం కనిపిస్తుంది.. హైదరబాదీ పేసర్ని ఆకాశానికెత్తిన సచిన్
హైదరాబాదీ పేస్ గన్ మహ్మద్ సిరాజ్పై దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. అతన్ని చూసిన ప్రతిసారి ఏదో కొత్తదనం కనిపిస్తుందంటూ ఆకాశానికెత్తాడు. కెప్టెన్ ఎప్పుడు అడిగినా లోడెడ్ గన్లా నిప్పులు చెరిగేందుకు రెడీగా ఉంటాడని కితాబునిచ్చాడు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో సచిన్ మాట్లాడుతూ.. Thank you @sachin_rt sir for this . It is a huge motivation for me coming from you .. I will always do my best for my country .stay well sir https://t.co/3qJrCBkwxm — Mohammed Siraj (@mdsirajofficial) December 22, 2021 సిరాజ్ బౌలింగ్ రనప్ అద్భుతంగా ఉంటుందని, మైదానంలో అతనెప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తాడని, అతను బౌల్ చేసేది తొలి ఓవరా లేక అఖరిదా అన్నది గుర్తించలేరని కొనియాడాడు. సిరాజ్లో ఈ లక్షణాలు తననెంతో అకట్టుకున్నాయని, గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఇదే తరహా యాటిట్యూడ్తో అతను సత్ఫలితాలు సాధించాడని పేర్కొన్నాడు.సిరాజ్లో వేగంగా నేర్చుకునే లక్షణం కనిపించిందని, అరంగేట్రం టెస్ట్లోనే అనుభవజ్ఞుడిలా బౌల్ చేశాడని, సీనియర్ల సలహాలతో మరింత మెరుగయ్యాడని కొనియాడాడు. దక్షిణాఫ్రికాతో త్వరలో ప్రారంభంకానున్న టెస్ట్ సిరీస్లో సిరాజ్ కీలక బౌలర్గా అవతరిస్తాడని జోస్యం చెప్పాడు. కాగా, తనపై క్రికెట్ దిగ్గజానికి ఉన్న అభిప్రాయానికి సిరాజ్ కృతజ్ఞతలు తెలిపాడు. 'థాంక్యూ సచిన్ సర్. మీ నుంచి ఇలాంటి మాటలు రావడం నాకెంతో స్ఫూర్తిదాయకం. దేశం కోసం ఎప్పుడూ అత్యుత్తమంగా ఆడేందుకే ప్రయత్నిస్తాను. స్టే వెల్ సర్' అంటూ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే, మూడు టెస్ట్ల సిరీస్ నిమిత్తం ప్రస్తుతం సిరాజ్ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. చదవండి: ప్రముఖ బాలీవుడ్ నటుడికి దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన కేన్ మామ..! -
అతి పెద్ద సవాల్.. దక్షిణాఫ్రికాపై గెలవడం అంత ఈజీ కాదు
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్ట్లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇక టెస్ట్ సిరీస్లో భాగంగా డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చేరుకున్న భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. కాగా సఫారీ గడ్డపై తొలి టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకోవాలని కోహ్లి సేన ఊవ్విళ్లూరుతోంది. అయితే, ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా పేసర్లు టీమిండియా బ్యాటర్లకు గట్టి సవాలు విసురుతారని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. 2018లో భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు బ్యాటర్లకు ప్రోటీస్ స్టార్ పేసర్ కగిసో రబడా చుక్కలు చూపించాడని అతడు తెలిపాడు. "దక్షిణాఫ్రికా జట్టుకు అత్యత్తుమ పేస్ ఎటాక్ బౌలింగ్ విభాగం ఉంది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్ట్జే గాయం కారణంగా సిరీస్కు దూరమయ్యాడు. ఇది భారత్కు కాస్త ఉపశమనం కలిగించే అంశం. కానీ ఆ జట్టులో రబడా వంటి స్టార్ పేసర్ ఉన్నాడు. ప్రపంచ అత్యత్తుమ బౌలర్ల్లలో రబడా ఒకడు. వారి వారి పేస్ బౌలర్లు భారత్కు ఖచ్చితంగా సవాలు విసురుతారు" అని అతడు పేర్కొన్నాడు. కాగా 2018 సిరీస్లో 15 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా సిరీస్ కైవసం చేసుకోవడంలో రబడా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక భారత్ బౌలింగ్ గురించి మాట్లాడుతూ.. "భారత బౌలింగ్ విభాగంలో ప్రపంచస్ధాయి బౌలర్లు ఉన్నారు. జట్టులో జస్ప్రీత్ బుమ్రా,మహమ్మద్ షమీ వంటి అనుభవజ్ఞులైన పేసర్లు ఉన్నారు. టెస్ట్ సిరీస్లో భారత్ 400పైగా పరుగులు సాధిస్తే విజయం సాధించవచ్చు. కానీ ప్రోటీస్ పేసర్లను ఎదుర్కొని రుగులు రాబట్టడం అంత సులభం కాదు అని జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: VIjay Hazare Trophy: ప్రశాంత్ చోప్రా 99, షారుఖ్ 79.. సెమీస్లో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు -
అతడు ప్రపంచ స్ధాయి బౌలర్.. సౌతాఫ్రికాకు ఇక చుక్కలే!
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు భారత్ అన్ని విధాలా సిద్దమవుతోంది. ఈ సిరీస్లో భాగంగా డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. అదే విధంగా భారత్ పేస్ విభాగం అద్భుతంగా ఉంది అని అతడు కొనియాడాడు. "ప్రపంచ స్థాయి అద్బుతమైన బౌలర్లలో బుమ్రా ఒకడు. ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు విజయం సాధించింది. ఈ పర్యటనల్లో బుమ్రా తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇక భారత బౌలింగ్ విభాగం అద్భుతమైనది. అదే విధంగా టెస్ట్ల్లో భారత్ విజయాల్లో జట్టు పేస్ బౌలింగ్ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచస్ధాయి బ్యాటర్లను కూడా బోల్తా కొట్టించే బౌలర్లు భారత జట్టులో ఉన్నారు. అనుభవజ్ఞులైన పేసర్లు ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ ఉండడం జట్టుకు మరింత బలం చేకూరుతుంది" అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా 2018లో సౌతాఫ్రికా పర్యటనలోనే జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ల్లో ఆరంగట్రేం చేశాడు. చదవండి: IPL 2022 Auction: 39 బంతుల్లో 79.. పంజాబ్ కింగ్స్ వదులుకొని తప్పుచేసింది -
దక్షిణాఫ్రికా పర్యటనకు అతన్ని ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యపరిచింది..
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైన భారత టెస్ట్ జట్టును ఉద్ధేశించి మాజీ టీమిండియా ఓపెనర్, వివాదాస్పద వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మూడు టెస్ట్ల సిరీస్ నిమిత్తం సెలక్టర్లు ఎంపిక చేసిన 18 మంది సభ్యుల భారత బృందంలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పేరులో లేకపోవడం ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నాడు. గాయాలపాలైన ఇద్దరు స్పిన్నర్లను(రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్) పక్కకు పెట్టిన సెలక్టర్లు.. వారిద్దరి స్థానాలను భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ.. కేవలం జయంత్ యాదవ్ను మాత్రమే ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు. గాయం బారిన పడక ముందు సుందర్ టీమిండియా రెగ్యులర్ సభ్యుడని.. ప్రస్తుతం అతను గాయం నుంచి కోలుకుని ఫిట్గా ఉన్నప్పటికీ సెలక్టర్లు అతన్ని పరిగణలోకి తీసుకోకపోవడం విడ్డూరంగా అనిపించిందని అన్నాడు. ఈ విషయమై సెలక్టర్లు వివరణ ఇవ్వాల్సి ఉందని డిమాండ్ చేశాడు. దక్షిణాఫ్రికాలో పరిస్థితుల దృష్ట్యా లెగ్ స్పిన్నర్ను ఎంపిక చేసే అవకాశం లేదని.. అలాగని కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకోలేరని.. ఇలాంటి పరిస్థితుల్లో సుందర్కు కచ్చితంగా జట్టులో చోటు కల్పించాల్సి ఉండిందని అభిప్రాయపడ్డాడు. జయంత్ యాదవ్తో పోలిస్తే సుందర్కు బ్యాటింగ్లోనూ రాణించే సత్తా ఉంది కాబట్టి అతన్ని ఎంపిక చేసి ఉండడమే సరైన నిర్ణయమని అన్నాడు. కేవలం ముంబై టెస్ట్లో పర్వాలేదనిపించాడని జయంత్ యాదవ్ను ఎంపిక చేయడం ఏ మాత్రం సబబో చెప్పాలని సెలెక్టర్లను నిలదీశాడు. దక్షిణాఫ్రికాలో పరిస్థితుల దృష్ట్యా టీమిండియా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల ఫార్ములాతో బరిలోకి దిగే అవకాశం ఉంది కాబట్టి మూడో స్పిన్నర్గా సుందర్ను ఎంపిక చేయాల్సి ఉండిందని అన్నాడు. కాగా, గాయానికి ముందు సుందర్ ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. చదవండి: చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్ మేనల్లుడు.. అరుదైన రికార్డు -
పిచ్ను చూసి షాక్కు గురైన శ్రేయాస్.. ప్రాక్టీస్లో నిమగ్నం కావాలన్న ద్రవిడ్
సెంచూరియన్: మూడు టెస్ట్ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా.. తొలి టెస్ట్ వేదిక అయిన సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానంలో అడుగుపెట్టింది. మ్యాచ్ ప్రారంభానికి మరో ఆరు రోజులే మిగిలి ఉండడంతో ఆటగాళ్లంతా ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు. పిచ్ పరిశీలిన నిమిత్తం మైదానంలోకి వెళ్లిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. పిచ్పై ఉన్న పచ్చికను చూసి షాక్కు గురయ్యానంటూ వ్యాఖ్యానించాడు. పిచ్పై చాలా గడ్డి ఉందని, ఇలాంటి వికెట్పై బ్యాటింగ్ చేయడం బ్యాటర్కు సవాలుగా ఉంటుందని పేర్కొన్నాడు. #TeamIndia had an intense nets session 💪🏻 at SuperSport Park 🏟️ in the build up to the first #SAvIND Test. Here's @28anand taking you closer to all the action from Centurion. 👍 👍 Watch this special feature 🎥 🔽https://t.co/Dm6hVDz71w pic.twitter.com/qjxnBszmDa — BCCI (@BCCI) December 20, 2021 ఈ విషయమై సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మను సంప్రదించగా.. అతను కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని తెలిపాడు. వికెట్ చాలా తడిగా ఉందని, ఇలాంటి పిచ్పై బ్యాటింగ్ చాలా కష్టమవుతుందని ఇషాంత్ అభిప్రాయపడినట్లు వెల్లడించాడు. వికెట్ను పరిశీలించిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. పచ్చికను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ప్రాక్టీస్ చేయాలని ఆటగాళ్లకు సూచించాడు. ప్రత్యర్థి జట్టులో రబాడ, నోర్జే లాంటి భీకరమైన ఫాస్ట్ బౌలర్లున్నారని, ఇలాంటి వికెట్పై వారిని ఎదుర్కోవాలంటే కఠోరమైన ప్రాక్టీస్ చేయడమే పరిష్కారమని అభిప్రాయపడ్డాడు. కాగా, సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26 నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. A new day and a fresh new start 👍🏻 We're back at it 💪🏻#TeamIndia 🇮🇳 | #SAvIND pic.twitter.com/xceSqZ8z6v — BCCI (@BCCI) December 20, 2021 చదవండి: తనపై లైంగిక దాడి జరగలేదు.. మాట మార్చిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి -
భారత్ పర్యటన.. ఆ మ్యాచ్లను వాయిదా వేసిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు!
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు భారత్ అన్ని విధాలా సన్నద్దం అవుతోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చేరుకున్న భారత జట్టు క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. కాగా ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో ఒమ్రికాన్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ముందుజాగ్రత్త చర్యగా 2021కి సంబంధించి 4-రోజుల డొమెస్టిక్ సిరీస్లోని మిగిలిన రౌండ్ను వాయిదా వేసస్తున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. "డిసెంబర్ 16-19 (డివిజన్ టూ), డిసెంబర్ 19-22 (డివిజన్ వన్) మధ్య జరగాల్సిన ఐదో రౌండ్ మ్యాచ్లను వాయిదా వేస్తున్నాం. ప్రస్తుతం బయట కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకోవలివచ్చింది. ఈ మ్యాచ్లకు సంబంధించి కొత్త షెఢ్యూల్ను త్వరలో ప్రకటిస్తాం" అని క్రికెట్ సౌత్ ఆఫ్రికా అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా భారత్-సౌత్ ఆఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. చదవండి: Bhuvneshwar Kumar: భారత జట్టు డాటర్స్ లిస్టులో మరో రాకుమారి.. భువీ కూతురు ఫొటో వైరల్! -
ఓవర్లోడ్ బ్యాగ్ మోసుకుని వెళ్లిన కోహ్లి.. దాంట్లో ఏముంది!
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా తొలి టెస్ట్కు సిద్దం అవుతోంది. సెంచూరియాన్ వేదికగా డిసెంబర్ 26న తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. మొదటి టెస్ట్కు ముందు భారత జట్టు సెంచూరియన్ చేరుకుని ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 'ఓవర్లోడ్' కిట్ బ్యాగ్ మోసుకుని ప్రాక్టీస్కు వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక కోహ్లి ఆ బ్యాగ్లో ఏమి తీసుకువెళ్లాడని అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. కాగా కోహ్లి.. సుదీర్ఘ సిరీస్ లేదా పర్యటనకు వెళ్లినప్పుడు 10 బ్యాట్లు,10 జతల గ్లోవ్లను తీసుకువెళతానని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇక 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లి సెంచూరియాన్ వేదికగా 153 పరుగులు సాధించాడు. తొలి టెస్ట్ కూడా ఇదే వేదికగా జరుగతుండడంతో కోహ్లి మరోసారి చెలరేగాలని అభిమానులు ఆశిస్తున్నారు. అదే విధంగా కోహ్లి నాయకత్వంలోని టీమిండియా సఫారీ గడ్డపై తొలి టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. చదవండి: Rishabh Pant: రిషభ్పంత్కు లక్కీ ఛాన్స్.. ట్వీట్ చేసిన ఉత్తరాఖండ్ సీఎం Getting Test-match ready 👌 👌 🎥 Snippets from #TeamIndia's first practice session ahead of the first #SAvIND Test. pic.twitter.com/QkrdgqP959 — BCCI (@BCCI) December 19, 2021 -
'సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ సాధించడానికి ఇదే సువర్ణావకాశం'
టీమిండియా దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టింది. ఈ పర్యటనలో భాగంగా మూడు టెస్ట్లు, మూడు వన్డేలు భారత్ ఆడనుంది. కాగా ఇంతవరకు సఫారీ గడ్డపై ఒక్క టెస్ట్ సిరీస్ కూడా భారత్ గెలవలేదు. దక్షిణాఫ్రికాలో 7 టెస్ట్ సిరీస్లు ఆడిన భారత్ 6 సిరీస్లో ఓటమిచెందింది. ఒక్క సిరీస్ డ్రాగా ముగిసింది. ఈ క్రమంలో తొలిసారిగా టెస్ట్ సిరీస్ గెలచి చరిత్ర సృష్టించాలని కోహ్లి సేన ఊవ్విళ్లూరుతోంది. సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26న దక్షిణాఫ్రికా-భారత్ తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు సబాకరీం ఆసక్తికర వాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ తొలి టెస్ట్ సిరీస్ను కచ్చితంగా కైవసం చేసుకుంటుందని సబాకరీం జోస్యం చెప్పాడు. ఇటీవలి కాలంలో ప్రోటీస్ జట్టు పెద్దగా రాణించకపోవడం, భారత్కు కలిసొస్తోంది అని అతడు అభిప్రాయపడ్డాడు. "రానున్న టెస్ట్ సిరీస్లో భారత్ 2-0 కానీ, 2-1 తేడాతో తప్పనిసరిగా విజయం సాధిస్తుంది. ఇక వన్డేల్లో భారత జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పన అవసరంలేదు. ప్రస్తుత జట్టు అత్యుత్తమైనది. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. అంతేకాకుండా జట్టులో కొంత మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. వారు కూడా ప్రస్తుతం అద్బుతంగా రాణిస్తున్నారు. కాగా ఇటీవలి కాలంలో ప్రోటీస్ జట్టు పెద్దగా రాణించకపోవడంతో, విజయం సాధించడానికి భారత్కు ఇదే సువర్ణ అవకాశం" అని కరీం పేర్కొన్నాడు. చదవండి: Steve Smith: 'అర్ధరాత్రి పడుకోకుండా ఇదేం పని బాబు'.. వీడియో వైరల్ -
చెమటోడ్చుతున్న హార్ధిక్ పాండ్యా.. జట్టులోకి రీ ఎంట్రీ!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా తిరిగి ఫిట్నెస్ సాధించాడనికి కష్టపడుతున్నాడు. హార్ధిక్ ప్రస్తుతం ముంబైలోని రిహాబిలిటేషన్ సెంటర్లో చెమటోడ్చుతున్నాడు. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత హార్ధిక్.. అంతగా రాణించలేక పోతున్నాడు. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్-2021, టీ20 ప్రంపచకప్లోను హార్ధిక్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో స్వదేశాన న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్కు అతడిని ఎంపిక చేయలేదు. 2021 ఏడాదికు గాను ఆరు వన్డేలు ఆడిన హార్ధిక్ కేవలం 165 పరుగులు మాత్రమే చేశాడు. ఇక టీ20ల విషయానికి వస్తే..11టీ20లు ఆడిన 165 పరుగులు మాత్రమే సాధించాడు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు సెలక్షన్లోకి తనని పరిగణలోకి తీసుకోవద్దు అని అతడే స్వయంగా సెలెక్టర్లుని కోరాడు. ఇక పూర్తి స్ధాయిలో ఫిటెనస్ సాధించి తిరిగి జట్టులోకి వస్తాను అని హార్ధిక్ తెలిపాడు. ఈ క్రమంలో పాండ్యా విజయ్ హజారే ట్రోఫీ నుంచి కూడా తప్పుకున్నాడు. కాగా పాండ్యా తాజాగా తన ప్రాక్టీస్కు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ స్టొరీలో షేర్ చేశాడు. చదవండి: Ravichandran Ashwin: ధోని ఈజ్ బెస్ట్, తర్వాత ఆ ఇద్దరు.. అశ్విన్ లిస్ట్లో పంత్కి నో ప్లేస్ -
భారత జట్టు వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్!
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు భారత జట్టు వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ను బీసీసీఐ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా అంతకు ముందు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ పొందిన రోహిత్ శర్మ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ స్ధానంలో రాహుల్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా దీనిపై బీసీసీఐ అధికారికంగా ఇంకా ప్రకటన చేయవలసి ఉంది. "రోహిత్ గాయం కారణంగా టెస్ట్ సిరీస్కు దూరమయ్యాడు. దీంతో అతడి స్ధానంలో వైస్ కెప్టెన్గా రాహుల్ను ఎంపిక చేశాం" అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా ఇప్పటికే దక్షిణాప్రికాకు చేరుకున్న టీమిండియా క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టింది.ఇక సెంచూరియాన్ వేదికగా డిసెంబర్ 26న దక్షిణాఫ్రికా- భారత్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ చదవండి: IPL 2022: "నాకు ఐపీఎల్లో ఆ జట్టుకు ఆడాలని ఉంది" -
ఫుట్బాల్ మ్యాచ్ .. గొడవపడ్డ అశ్విన్, పుజారా!
దక్షిణాఫ్రికా పర్యటనకు చేరుకున్న టీమిండియా ఒక్క రోజు క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. జోహన్నెస్బర్గ్లో ఫుట్వాలీ మ్యాచ్తో వారి తొలి ప్రాక్టీస్ సెషన్ను మొదలుపెట్టారు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్తో పాటు సహచర ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయారు. ఒక జట్టుకు అశ్విన్ సారథ్యం వహించగా, మరో జట్టుకు ద్రవిడ్ నాయకత్వం వహించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఈ వీడియోలో అశ్విన్, పుజారా సీరియస్గా ఏదో గొడవపడినట్లు కనిపిస్తుంది. అదే విధంగా కోచ్ రాహుల్ ద్రవిడ్ ఫుట్బాల్ స్కిల్స్ను చూసి కెప్టెన్ విరాట్ కోహ్లి ఆశ్చర్యపడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సెంచూరియాన్ వేదికగా డిసెంబర్26న భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు అతడిని కచ్చితంగా తీసుకోవాలి.. How did #TeamIndia recharge their batteries ahead of their first training session in Jo'Burg? 🤔 On your marks, get set & Footvolley! ☺️😎👏👌#SAvIND pic.twitter.com/dIyn8y1wtz — BCCI (@BCCI) December 18, 2021 -
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు అతడిని కచ్చితంగా తీసుకోవాలి..
టీమిండియా యువ ఆటగాడు రుత్రాజ్ గైక్వాడ్ భీకరమైన ఫామ్లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో కేవలం 5 ఇన్నింగ్స్లలో 603 పరుగులు చేశాడు. దీంట్లో 4 సెంచరీలు ఉండడం గమనార్హం. ఈ క్రమంలో రుత్రాజ్ గైక్వాడ్పై భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ టోర్నీలో బౌలర్లను రుత్రాజ్ అలవోకగాఎదర్కొన్నాడు అని అతడు తెలిపాడు. అంతే కాకుండా పేస్ బౌలర్లకు అతడు స్సిప్ షాట్లు అద్బుతంగా ఆడుతున్నాడని చోప్రా కొనియాడాడు. "విజయ్ హజారే ట్రోఫీలో మనం ముందుగా రుత్రాజ్ గైక్వాడ్ గురించి మాట్లాడుకోవాలి. అతడు ఈ టోర్నీలో నాలుగు సెంచరీలు సాధించాడు. వరుసగా హ్యట్రిక్ సెంచరీలు నమోదు చేశాడు. అంతేకాకుండా అతడి వికెట్ సాధించడానికి బౌలర్లు చాలా కష్టపడుతున్నారు. అతడు ఆడిన ఇన్నింగ్స్లో కొన్నింటిని నేను చూశాను. రుత్రాజ్ చిన్న పిల్లలతో ఆడినట్లు ఆనిపించింది. ఫాస్ట్ బౌలర్లకు వ్యతిరేకంగా అద్బుతంగా స్వీప్ షాట్లను ఆడుతున్నాడు. ఫాస్ట్ బౌలర్లకు స్వీప్ షాట్లు ఆడేది అతడు ఒక్కడే. బౌలర్లు బాగానే బౌలింగ్ చేస్తున్నారు. కానీ గైక్వాడ్ ఈ సీజన్లో అద్బుతమైన టచ్లో కనిపిస్తున్నాడని" అతడు యూట్యూబ్ ఛాన్లో పేర్కొన్నాడు. రుత్రాజ్ గైక్వాడ్ అధ్బుతమైన ఫామ్లో ఉన్నాడని, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు అతడు సెలెక్టర్ల దృష్టిలో కచ్చితంగా ఉంటడాని చోప్రా అభిప్రాయపడ్డాడు. చదవండి: Ind Vs Sa: ఫొటోలు షేర్ చేసిన టీమిండియా ఆటగాళ్లు.. సేఫ్గా ఉండండి.. చలి ఎక్కువగా ఉందా భయ్యా! -
అతడిని కచ్చితంగా భారత జట్టులోకి తీసుకోవాలి.. ఎందుకంటే!
దక్షిణాప్రికా పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్ట్లు, మూడు వన్డేలు ఆడనుంది. డిసెంబర్ 26న సెంచూరియాన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే దక్షిణాప్రికా చేరుకున్న టీమిండియా ఒక్క రోజు ఐషోలేషన్లో ఉండనుంది. ఇక టెస్ట్ సిరీస్కు స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెస్ట్ సిరీస్కు శార్దూల్ ఠాకూర్ను కచ్చితంగా జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. “శార్దూల్ ఠాకూర్కు ఖచ్చితంగా స్థానం దక్కుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా భారత్ సాధించిన ప్రతీ విజయంలో అతడు కీలకపాత్ర పోషించాడు. అదే విధంగా విదేశీ పిచ్లపై కూడా అతడు రాణించగలడు. శార్దూల్ బాల్తో పాటు బ్యాట్తో కూడా రాణించగలడు. ఇటువంటి సమయంలో భారత్కు ఠాకూర్ ఆటగాడు చాలా అవసరం. ఇంగ్లండ్ సిరీస్లో అతడు కీలకమైన వికెట్లు పడగొట్టాడు. విరాట్ కోహ్లి సాదరణంగా విదేశాల్లో నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్తో బరిలోకి దిగుతుంటాడు. కోహ్లి వ్యూహం ఠాకూర్కు ఫేవర్గా ఉంటుందని" అతడు పేర్కొన్నాడు. చదవండి: Sourav Ganguly: మొన్న ద్రవిడ్.. నిన్న లక్ష్మణ్.. ఇక సచిన్ వంతు... బిగ్ హింట్ ఇచ్చిన గంగూలీ -
దక్షిణాఫ్రికాలో ల్యాండైన కోహ్లి సేన.. ఫొటోలు షేర్ చేసిన బీసీసీఐ
India Tour Of South Africa: ఓ పక్క వన్డే కెప్టెన్సీ అంశంపై దుమారం నడుస్తుండగానే.. కోహ్లి నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాలో ల్యాండైంది. ఇవాళ ఉదయం ముంబై నుంచి ప్రైవేటు విమానంలో జోహన్నెస్బర్గ్కు బయల్దేరిన 18 మంది ఆటగాళ్లతో కూడిన భారత బృందం సాయంత్రానికి అక్కడికి చేరుకుంది. సౌతాఫ్రికా విమానం ఎక్కడానికి ముందు టీమిండియా ముంబైలోని క్వారంటైన్లో మూడు రోజులు గడిపింది. ఆటగాళ్లతో పాటు భారత బృందంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, ఇతర కోచింగ్ సిబ్బంది ఉన్నారు. 📍Touchdown South Africa 🇿🇦#TeamIndia #SAvIND pic.twitter.com/i8Xu6frp9C— BCCI (@BCCI) December 16, 2021 విమానంలో జట్టు ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసిన బీసీసీఐ.. ఆటగాళ్లు జోహన్నెస్బర్గ్ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న దృష్యాలను కూడా ట్విటర్ వేదికగా షేర్ చేసింది. కాగా, దక్షిణాఫ్రికాలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరగుతుండడంతో అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీమిండియా కొన్ని రోజుల పాటు క్వారంటైన్లోనే ఉండనుంది. క్వారంటైన్లో ఆటగాళ్లకు ప్రతిరోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నెల 26 నుంచి కేప్టౌన్ వేదికగా బాక్సింగ్ డే టెస్ట్ ప్రారంభం కానుంది. చదవండి: పాక్ క్రికెట్కు కరోనా కాటు.. మరో సిరీస్ వాయిదా