positive results
-
జనవరిలో ‘తయారీ’కి కొత్త ఆర్డర్ల బూస్ట్
న్యూఢిల్లీ: భారత్ మొత్తం పారిశ్రామికరంగంలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం జనవరిలో సానుకూల ఫలితాన్ని నమోదుచేసుకుంది. హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జనవరిలో 56.5కి ఎగసింది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. డిసెంబర్లో ఈ సూచీ 54.9గా (18 నెలల కనిష్టం) నమోదయ్యింది. ద్రవ్యోల్బణం భయాల ఉపశమనం, డిమాండ్ బాగుండడం, కొత్త ఆర్డర్లలో పురోగతి ఇందుకు ప్రధాన కారణంగా నిలిచినట్లు నెలవారీ సర్వే పేర్కొంది. కాగా, ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే పేర్కొంటారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. -
ఒడిశాలో 180 మందికి స్క్రబ్ టైఫస్
భువనేశ్వర్: కేరళలో నిఫా వైరస్ మాదిరిగానే ఒడిశాలో స్క్రబ్ టైఫస్ ప్రజలను వణికిస్తోంది. ఒడిశాలో స్క్రబ్ టైఫస్ బాధితుల సంఖ్య ఆదివారానికి 180కి చేరుకుంది. ఇప్పటివరకు సేకరించి పంపిన 59 శాంపిళ్లలో 11 స్క్రబ్ టైఫస్ పాజిటివ్గా వెల్లడైనట్లు ఆరోగ్య శాఖాధికారులు వెల్లడించారు. మొత్తం 180 మంది బాధితుల్లో ఇతర రాష్ట్రాల వారు 10 మంది ఉన్నారన్నారు. సుందర్గఢ్, బర్గఢ్ జిల్లాల్లో కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయని అన్నారు. ఈ వ్యాధితో రాష్ట్రంలో ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు. ఒక రకమైన లార్వా పురుగులు కుట్టడం వల్ల ఇది సోకుతుంది. పొలాలు, అటవీ ప్రాంతాలకు దగ్గర్లోని వారు తొందరగా ఈ వ్యాధికి గురవుతారు. జ్వరం, పురుగు కుట్టిన చోట చర్మంపై ఎశ్చర్ అనే నల్ల మచ్చ ఏర్పడటం దీని లక్షణాలు. -
నష్టాల నుంచి.. లాభాల్లోకి
ముంబై: ఆరంభ నష్టాలను భర్తీ చేసుకున్న స్టాక్ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. అధిక వెయిటేజీ రిలయన్స్, టీసీఎస్ షేర్లు రెండు శాతం రాణించాయి. ఉదయం సెన్సెక్స్ నాలుగు పాయింట్ల స్వల్ప నష్టంతో 66,156 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 19,666 వద్ద మిశ్రమంగా మెదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో స్వల్ప అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 161 పాయింట్లు నష్టపోయి 65,999 వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు పతనమై 19,598 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చాయి. తదుపరి ఆసియా, యూరప్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో దేశీయ మార్కెట్లో తిరిగి కొనుగోళ్లు పుంజుకున్నాయి. దీంతో సూచీలు నష్టాలను భర్తీ చేసుకొని లాభాలను ఆర్జించగలిగాయి. చివరికి సెన్సెక్స్ 367 పాయింట్లు పెరిగి 66,528 వద్ద ముగిసింది. నిఫ్టీ 108 పాయింట్లు బలపడి 19,754 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఐటీ, మెటల్, ఆయిల్, విద్యుత్ షేర్లకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు భారీ డిమాండ్ లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.31%, ఒకశాతం ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.701 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,488 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు క్షీణించి 82.29 స్థాయి వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► సోమవారం బీఎస్ఈలో రూ.2.50 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.306.66 లక్షల కోట్లకు చేరింది. ► దేశీయ అత్యంత విలువైన రెండో సంస్థగా టీసీఎస్ తిరిగి తన స్థానాన్ని దక్కించుకుంది. ఐటీ షేర్ల ర్యాలీలో భాగంగా టీసీఎస్ షేరు 2% లాభపడి రూ.3,421 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ రూ.12.51 లక్షల కోట్లకు చేరింది. దీంతో ఈ జూలై 20న రెండో స్థానానికి చేరుకున్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు(0.38%) రూ.12.45 లక్షల కోట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. కాగా ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ రూ.17.23 లక్షల కోట్లతో తొలి స్థానంలో కొనసాగుతుంది. ► జెట్ ఎయిర్వేస్ షేరు బీఎస్ఈలో 5% పెరిగి రూ.50.80 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఎయిర్ ఆపరేటర్ సరి్టఫికెట్ పునరుద్ధరించినట్లు జలాన్ – కల్రాక్ కన్సార్షియం తెలపడంతో ఈ షేరుకు డిమాండ్ పెరిగింది. ఎల్అండ్టీ రూ. 6 ప్రత్యేక డివిడెండ్ ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్అండ్టీ తమ షేర్హోల్డర్లకు రూ. 6 ప్రత్యేక డివిడెండ్ ప్రకటించింది. చైర్మన్ ఏఎం నాయక్.. ఆరు దశాబ్దాలుగా గ్రూప్నకు నిరంతరాయంగా సేవలు అందిస్తుండటాన్ని పురస్కరించుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనికి ఆగస్టు 2 రికార్డు తేదీ కాగా ఆగస్టు 14లోగా డివిడెండ్ చెల్లిస్తారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తిగా భారత కార్పొరేట్ చరిత్రలో నాయక్ పేరు చిరస్థాయిగా నిలి్చపోతుందని ఉద్యోగులకు రాసిన లేఖలో ఎల్అండ్టీ సీఈవో, ఎండీ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ తెలిపారు. దశాబ్దాలుగా ఆయన అందించిన సేవలకు గాను గౌరవ సూచకంగా షేర్హోల్డర్లకు ప్రత్యేక డివిడెండ్ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆగస్టు 9న జరిగే సిల్వర్ జూబ్లీ ఏజీఎంలో నాయక్ పాల్గోనున్నట్లు పేర్కొన్నారు. -
పారిశ్రామిక రంగానికి ‘సెప్టెంబర్’ ఊరట
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం సెప్టెంబర్లో కొంత సానుకూల ఫలితాన్ని సాధించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సమీక్షా నెల్లో 3.1 శాతం (2021 ఇదే నెలతో పోల్చి) పెరిగింది. తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాలు సెప్టెంబర్లో మంచి ఫలితాలను అందించినట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పే ర్కొంది. ఆగస్టులో ఐఐపీలో అసలు వృద్ధిలేకపోగా 0.7% క్షీణతను నమోదుచేసుకుంది. జూలై లో వృద్ధి కేవలం 2.2%. అయితే 2021 సెప్టెంబర్లో పారిశ్రామిక వృద్ధి 4.4 శాతంకన్నా, తాజా వృద్ధి రేటు తక్కువగానే ఉండడం గమనార్హం. ► తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు దాదాపు 70 శాతం వెయిటేజ్ కలిగిన తయారీ రంగం సమీక్షా నెల్లో 1.8 శాతం పురోగమించింది. 2021 ఇదే నెల్లో వృద్ధి 4.3 శాతం. ► విద్యుత్: ఈ రంగం వృద్ధి రేటు 11.6%గా ఉంది. 2021 ఇదే నెల్లో ఈ రేటు కేవలం 0.9%. ► మైనింగ్: వృద్ధి 8.6% నుంచి 4.6%కి తగ్గింది. ► క్యాపిటల్ గూడ్స్: ఉత్పత్తి 10.3 శాతం పెరిగింది. 2021 ఇదే నెల్లో ఈ రేటు 3.3 శాతం. ► కన్జూమర్ డ్యూరబుల్స్: 4.5% క్షీణించింది. గతేడాది ఈ నెల్లో 1.6% వృద్ధి జరిగింది. ఆరు నెలల్లో 7 శాతం పురోగతి కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (2022–23, ఏప్రిల్–సెప్టెంబర్) ఐఐపీ వృద్ధి రేటు 7 శాతంగా నమోదైంది. -
అమెరికా అధ్యక్షునికి కరోనా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు గురువారం పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. బైడెన్కు స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరైన్ జీన్–పియర్రీ ప్రకటించారు. కరోనా లక్షణాల తీవ్రతను తగ్గించే యాంటీ వైరల్ డ్రగ్ ‘పాక్స్లోవిడ్’ను తీసుకుంటున్నారని వెల్లడించారు. అధ్యక్షుడు ప్రస్తుతం శ్వేతసౌధంలో ఐసోలేషన్లో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కు నెల రోజుల క్రితం కరోనా సోకింది. ఆమె త్వరగానే కోలుకున్నారు. -
ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ
న్యూఢిల్లీ: భారత్లోనూ రోజు రోజుకీ కరోనా ఉధృతి పెరిగిపోతోంది. వరసగా 8వ రోజు కేసుల సంఖ్య పెరిగింది. దేశ రాజధానిఢిల్లీలో ఒమిక్రాన్ వేరియెంట్ విస్తృతంగా వ్యాపిస్తూ ఉండడంతో శని, ఆదివారాల్లో కర్ఫ్యూ విధించాల ని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినట్టుగా ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మంగళవారం తెలిపారు. బస్సులు, మెట్రో రైళ్లు తిరిగి 100 శాతం సామర్థ్యంతో పని చేస్తాయన్నారు. బస్సులు, మెట్రోల కోసం వేచి చూసే వారు సూపర్ స్ప్రెడర్లుగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 8.37%కు చేరింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు. కొద్ది రోజులుగా ఆయన ఎన్నికల ర్యాలీలలో పాల్గొంటూ ఉండడంతో కరోనా సోకింది. మరోవైపు పంజాబ్ రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలన్నీ మూసివేసింది. సినిమా హాల్స్, రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయి. యూపీలో జనవరి 15 వరకు విద్యాసంస్థలను మూసివేశారు. 1892కి చేరుకున్న ఒమిక్రాన్ కేసులు గత 24 గంటల్లో దేశంలో 37,379 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య 1,892కి చేరుకుంది. -
దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి కోవిడ్ పాజిటివ్
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా(69) కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు స్వల్పలక్షణాలు బయటపడ్డాయని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. సోమవారం కేప్టౌన్లో జరిగిన మాజీ ఉపాధ్యక్షుడు డీక్లార్క్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు రమఫోసా అస్వస్థతకు గురయ్యారని పేర్కొంది. ఆయన ఆరోగ్య పరిస్థితులను రక్షణ శాఖ ఆరోగ్య అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. రమఫోసా కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నారు. సోమవారం 37,875 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం కేప్టౌన్లో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్న రమఫోసా..ఉపాధ్యక్షుడు డేవిడ్ మబూజాకు వారం పాటు అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని మంత్రి ఒకరు తెలిపారు. రమఫోసా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో బయటపడిన విషయం తెలిసిందే. -
కరోనాతో ఆసుపత్రిలో చేరిన అగ్ర హీరో కమల్ హాసన్
Kamal Haasan Tested Coronavirus Positive: విలక్షణ నటుడు కమల్ హాసన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇటీవల అమెరికా నుంచి భారత్కు తిరిగొచ్చిన ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా తేలింది. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన తమిళంలో ట్వీట్ చేశారు. చదవండి: యానీ ఎలిమినేషన్కు కారణం ఇదేనా? అదే ఆమె కొంపముచ్చిందా..! ‘ఇటీవల అమెరికా నుంచి తిరిగొచ్చిన నాకు కాస్త దగ్గు, జలుబు వచ్చింది. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధారించబడ్డాను. ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసోలేషన్లో ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే... మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గలేదు. దయ చేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి’ అంటూ కమల్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. కాగా ఆయన కొత్తగా అమెరికాలో దుస్తుల వ్యాపారం ప్రారంభిస్తున్నారు. తన బ్రాండ్ క్లాత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కమల్హాసన్ అమెరికా వెళ్లారట. அமெரிக்கப் பயணம் முடிந்து திரும்பிய பின் லேசான இருமல் இருந்தது. பரிசோதனை செய்ததில் கோவிட் தொற்று உறுதியானது. மருத்துவமனையில் தனிமைப்படுத்திக் கொண்டுள்ளேன். இன்னமும் நோய்ப்பரவல் நீங்கவில்லையென்பதை உணர்ந்து அனைவரும் பாதுகாப்பாக இருங்கள். — Kamal Haasan (@ikamalhaasan) November 22, 2021 -
నాకు మళ్లీ కరోనా:ప్రగ్యా జైస్వాల్
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇన్స్టాగ్రామ్లో తను పోస్ట్ షేర్ చేస్తూ.. ‘ఆదివారం నేను కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాను. నాకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాను. ఇంతకముందు కరోనా బారిన పడ్డాను. ఇప్పడు మళ్లీ కరోనా వచ్చింది .ప్రస్తుతం నేను ఐసోలేషన్లో ఉన్నాను. గత 10 రోజులుగా నన్ను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి’ అని ప్రగ్యా సూచించింది. View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) అయితే ప్రగ్యాకి కరోనా సోకడంతో అఖండ మూవీ టీం ఆందోళనలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆఖండ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర బృందం సెలబ్రెషన్స్ చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె హీరో బాలకృష్ణతో పాటు పలువురితో సన్నిహితంగా మెలిగింది. అంతేగాక బాలకృష్ణతో కలిసి దిగిన ఫొటోను కూడా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
చహల్, గౌతమ్లకు కరోనా
కొలంబో: శ్రీలంక పర్యటనను ముగించిన భారత క్రికెట్ జట్టులో మరో ఇద్దరు ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. స్పిన్నర్ యజువేంద్ర చహల్, కృష్ణప్ప గౌతమ్లు శుక్రవారం కోవిడ్–19 పాజిటివ్గా తేలినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మంగళవారం పాజిటివ్గా తేలిన కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మంది (హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, దీపక్ చహర్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే)లో వీరిద్దరు కూడా ఉన్నారు. అప్పటి నుంచి వీరంతా కూడా తమ గదుల్లోనే క్వారంటైన్ అయ్యారు. దాంతో చివరి రెండు టి20 మ్యాచ్లకు ఈ ఎనిమిది మంది కూడా దూరమయ్యారు. స్వదేశానికి పయనమయ్యేముందు భారత జట్టుకు చేసిన కరోనా పరీక్షల్లో చహల్, గౌతమ్ పాజిటివ్గా తేలారు. మిగిలిన టీమ్ ప్రత్యేక విమానంలో శుక్రవారం బెంగళూరుకు చేరుకుంది. అక్కడి నుంచి ప్లేయర్లు తమ స్వస్థలాలకు చేరుకున్నారు. ఆ ముగ్గురి పరిస్థితేంటి? పాజిటివ్గా తేలిన కృనాల్ పాండ్యా, చహల్, కృష్ణప్ప గౌతమ్లు కొలంబోలో ఏడు రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ను పూర్తి చేయాల్సి ఉంది. అనంతరం వారికి రెండు సార్లు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. రెండు పర్యాయాలు నెగెటివ్గా తేలితే భారత్కు వచ్చేందుకు వారికి అనుమతి లభిస్తుంది. ఇంగ్లండ్కు వెళ్లేందుకు సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వీరిద్దరికీ తాజాగా నిర్వహించిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ అని తేలడంతో... త్వరలోనే కొలంబో నుంచి నేరుగా ఇంగ్లండ్కు వెళ్లనున్నారు. ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో శుబ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్లు గాయపడటంతో... వారి స్థానాల్లో సూర్యకుమార్, పృథ్వీ షాలను బీసీసీఐ ఎంపిక చేసింది. భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ఆగస్టు 4 నుంచి జరగనుంది. -
పాజిటివ్ రిపోర్ట్ తప్పనిసరి కాదు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్–19 బాధితులకు చికిత్స అందించే విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లు, కోవిడ్ కేర్ సెంటర్లు, హెల్త్ సెంటర్లలో వారిని చేర్చుకోవడానికి కరోనా పాజిటివ్ రిపోర్టు తప్పనిసరి కాదని తేల్చిచెప్పింది. అంటే నిర్ధారణ పరీక్షలో పాజిటివ్గా తేలినట్లు రిపోర్టు ఉన్నా, లేకపోయినా ఆసుపత్రిలో చేర్చుకొని వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు కరోనా బాధితుల అడ్మిషన్ల విషయంలో జాతీయ విధానంలో కేంద్ర ఆరోగ్య శాఖ మార్పులు చేసింది. ఏ ఒక్క బాధితుడికి కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ వైద్య సేవలను నిరాకరించడానికి వీల్లేదని పేర్కొంది. ఆక్సిజన్, అత్యవసర ప్రాణాధార ఔషధాల సహా ఇతర సేవలను తప్పనిసరిగా అందించాలని స్పష్టం చేసింది. బాధితుడు మరో నగరానికి, పట్టణానికి చెందినవాడైనప్పటికీ ఆసుపత్రిలో చేర్చుకోవాల్సిందేనని వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి బారిన పడిన బాధితులకు ప్రభావవంతమైన, సమగ్రమైన చికిత్స వేగవంతంగా అందించాలన్నదే లక్ష్యమని ఆరోగ్య శాఖ తెలిపింది. అందుకే జాతీయ విధానంలో మార్పులు చేసినట్లు వివరించింది. అవసరం అనే ప్రాతిపదికగానే.. అనుమానిత కరోనా రోగులను పాజిటివ్ రిపోర్టు లేకపోయినా కోవిడ్ కేర్ సెంటర్(సీసీసీ), డెడికేటెడ్ కోవిడ్ హెల్త్ సెంటర్(డీసీహెచ్సీ)లో చేర్చుకోవాలని∙ఆరోగ్య శాఖ ఉద్ఘాటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో ఉన్న కోవిడ్ ఆసుపత్రుల్లో ఇది వర్తిస్తుందని వెల్లడించింది. సదరు బాధితుడి స్వస్థలం ఆసుపత్రి ఉన్న నగరం/పట్టణం కాకపోయినా ప్రవేశం నిరాకరించరాదని సూచించింది. అవసరం అనే ప్రాతిపదికన ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని పేర్కొంది. హాస్పిటల్ సేవలు అవసరమైన వారికి మాత్రమే పడకలు కేటాయించాలని, అవసరం లేని వారికి కేటాయించరాదని స్పష్టం చేసింది. డిశ్చార్జ్ పాలసీకి అనుగుణంగానే పేషెంట్లను డిశ్చార్జ్ చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు 3 రోజుల్లోగా అమలయ్యేలా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. -
ప్రసిధ్ కృష్ణ ‘పాజిటివ్’
ముంబై: ఐపీఎల్ టి20 టోర్నీ వాయిదా పడిన తర్వాత మరో ఇద్దరు క్రికెటర్లు కరోనా పాజిటివ్గా తేలారు. ఈ ఇద్దరూ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) బృందంలోని సభ్యులే. పేస్ బౌలర్ ప్రసిధ్ కృష్ణ, న్యూజిలాండ్కు చెందిన వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్లకు కరోనా సోకినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ‘రెండు నెగెటివ్ ఫలితాలు వచ్చిన తర్వాత ఇతర భారత క్రికెటర్లలాగే ప్రసిధ్ కూడా మే 3న బబుల్ వీడాడు. అయితే స్వస్థలం బెంగళూరు చేరిన తర్వాత అతని రిపోర్టు పాజిటివ్గా వచ్చింది’ అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. న్యూజిలాండ్కు చెందిన సీఫెర్ట్కు కూడా కరోనా రావడంతో అతను తన సహచర ఆటగాళ్లతో కలిసి ప్రత్యేక విమానంలో స్వదేశం వెళ్లే అవకాశం లేకుండా పోయింది. బయలుదేరే ముందు అతనికి చేసిన రెండు పరీక్షల్లో కూడా కరోనా ‘పాజిటివ్’ వచ్చింది. దాంతో సీఫెర్ట్ అహ్మదాబాద్లోనే ఆగిపోయాడు. సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ తరహాలోనే మెరుగైన చికిత్స కోసం సీఫెర్ట్ను కూడా చెన్నైకి తరలించనున్నారు. ఐసోలేషన్, ఆపై టెస్టులు నెగెటివ్గా వస్తేనే అతను న్యూజిలాండ్ పయనమవుతాడు. సీఫెర్ట్ ఆరోగ్యం గురించి తమకు పూర్తి సమాచారం ఉందని... బీసీసీఐతో పాటు అతను కోలుకునేందుకు తమవైపు నుంచి కూడా అన్ని రకాల సహకారం అందిస్తామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ వ్యాఖ్యానించారు. ప్రసిధ్కు సాధ్యమేనా... ఇంగ్లండ్ పర్యటనకు సెలక్టర్లు ప్రకటించిన నలుగురు రిజర్వ్ ఆటగాళ్లలో ప్రసిధ్ కృష్ణ ఒకడు. టీమిండియా బృందం ఈ నెల 25న ప్రత్యేక బయో బబుల్లోకి ప్రవేశిస్తుంది. ఆలోగా అతను నెగెటివ్గా తేలాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లండ్ వెళ్లాల్సిన భారత క్రికెటర్లంతా కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకుంటే బాగుంటుందని బీసీసీఐ భావిస్తోంది. ఆక్స్ఫర్డ్కు చెందిన కోవిషీల్డ్ను తీసుకుంటే అది ఇంగ్లండ్లో కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి రెండో డోసు అక్కడా తీసుకోవచ్చనేది ఆలోచన. అయితే ప్రసిధ్ ఈ నెల 18 లేదా 20 వరకు నెగెటివ్గా తేలినా... వైద్య సూచనల ప్రకారం కరోనా నుంచి కోలుకున్న తర్వాత వ్యాక్సిన్కు కనీసం నాలుగు వారాల విరామం అవసరం. మరి ప్రసిధ్ విషయంలో బీసీసీఐ ఏం చేస్తుందనేది చూడాలి. -
గత పది రోజులుగా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాం: శిల్పా శెట్టి
తన కుటుంబ సభ్యులంతా కరోనా బారిన పడినట్లు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి సోషల్ మీడియా వేదిక వెల్లడించింది. ‘గత పది రోజులుగా మా కుటుంబం క్లిష్ట పరిస్థితిల్లో ఉంది. మా అత్తమామ, మా అమ్మ, చివరిగా నా భర్త రాజ్ కరోనా బారిన పడ్డారు. వారంత ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నారు. నాకు నెగిటివ్గా తేలింది. డాక్టర్ల సలహా మేరకు వారంత క్వారంటైన్ గైడ్లైన్ పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నారు. అలాగే మా ఇంటి పనివాళ్లలోని ఇద్దరికి సైతం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వారు కూడా ఐసోలేషన్కు వెళ్లారు. దేవుడు దయ వల్ల అందరూ కొలుకుంటున్నారు’ అంటూ ఆమె ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్న కుటుంబ సభ్యులంతా కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ అన్ని విధాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని, ఇందుకు సహకరించిన ముంబై మున్సిపాలిటీ కమిషన్(బీఎంసీ), అధికారులకు శిల్పా ధన్యవాదాలు తెలిపింది. అభిమానులను ఉద్దేశిస్తూ.. ‘మీ అందరి ప్రేమ, మద్దతకు కృతజ్ఞతలు. మా కోసం ప్రార్థించిన వారందరికి రుణ పడి ఉన్నాం. అలాగే మీ ప్రార్థనలను కొనసాగిస్తారని ఆశిస్తున్నా’ అని పేర్కొంది. ఇక ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, బయటకు వెళ్లేటప్పుము మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడడం తప్పసరి చేసుకొండని సూచించింది. కోవిడ్ పాజిటివ్, నెగిటివ్ అయినా ప్రతి ఒక్కరూ మానసికంగా పాజిటివ్గా ఉండాలంటూ సందేశం ఇచ్చింది. కాగా శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా దంపతులకు 8 ఏళ్ల కుమారుడు, ఏడాది కూతురు ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
యుగానికి ఒక్కడు హీరోయిన్కు కరోనా
కరోనా సెకండ్ వేవ్లో ఇప్పటికే పలువురు తారలకు పాజిటివ్ వచ్చింది. తాజాగా నటి ఆండ్రియా కరోనా బారిన పడ్డారు. వైద్యుల సలహా మేరకు ఆమె ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ‘యుగానికి ఒక్కడు, విశ్వరూపం, తడాఖా, గృహం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు పొందారు ఆండ్రియా. నటిగానే కాదు.. గాయనిగా కూడా ఆండ్రియాకి మంచి గుర్తింపు ఉంది. చదవండి: తండ్రి ఓటమిపై శృతిహాసన్ కామెంట్స్ వైరల్ -
Hari Teja: కరోనాతో పోరాడుతూ... బిడ్డను కన్నాను!
మరో వారం పది రోజుల్లో డెలివరీ... బిడ్డ పుట్టగానే ఎలా ఉందో చూడాలనే ఆరాటం.. తాకాలనే అనురాగం... బిడ్డను ఒడిలో పడుకోబెట్టుకోవాలన్న ఆనందం. ఇలా... ఎన్నో ఆశలతో హరితేజ డెలివరీ కోసం ఎదురు చూశారు. సరిగ్గా డెలివరీ టైమ్కి వారం పది రోజుల ముందు కరోనా పాజిటివ్. నెగటివ్ ఆలోచనలు దగ్గరకు రాకూడని పరిస్థితి. రుచి తెలియకపోయినా తినాల్సిన పరిస్థితి. బిడ్డ బాగుండాలంటే తల్లి ప్రశాంతంగా ఉండాలి. మరి.. యాంకర్, ‘బిగ్ బాస్’ ఫేమ్, నటి హరితేజ ఈ కరోనా కష్టకాలాన్ని ఎలా అధిగమించారు? ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. ► మీకు మాత్రమే కాదు.. ఇంటిల్లిపాదికీ కరోనా వచ్చిందని విన్నాం... హరితేజ: అవును. నాతో పాటు మా అమ్మానాన్న ఉన్నారు. నాకు డెలివరీ టైమ్ దగ్గరపడటంతో మా అత్తగారు బెంగళూరు నుంచి వచ్చారు. ఒక్క మావారికి తప్ప ఇంట్లో అందరికీ కరోనా పాజిటివ్. అమ్మానాన్న, అత్తయ్య వేరే ఇంట్లో క్వారంటైన్లో ఉండిపోయారు. నాతో పాటు మావారు ఉన్నారు. ► ఇంట్లో ముందు ఎవరికి వచ్చింది? మా అమ్మానాన్నకు! వాళ్లకి వచ్చిన రెండు మూడు రోజులకు నాకు వచ్చింది. నాకు ముందు జ్వరం వచ్చింది.. కొంచెం నీరసంగా అనిపించింది. రెండు రోజులకు రుచి, వాసన పోయాయి. అప్పుడే నాకు పాజిటివ్ అని ఫిక్పయిపోయాను. కానీ ఇంట్లోవాళ్లు అలాంటిదేం ఉండదని వాదించారు. టెస్ట్ చేయించుకున్నాను. కానీ ఆ రోజు రాత్రి ‘నెగటివ్ వస్తే బాగుంటుంది’ అని పదే పదే దేవుణ్ణి తలుచుకున్నాను.. అయితే దురదృష్టం పాజిటివ్ అని వచ్చింది. ఆల్రెడీ నాకు తొమ్మిది నెలల నిండాయి. పొట్ట బరువు ఎక్కింది. మావారికి నెగటివ్ వచ్చింది. అయినా నన్ను అంటిపెట్టుకునే ఉన్నారు.. ఆయనకు ఎక్కడ కరోనా సోకుతుందోనని నా భయం. ► ఇంట్లో ఒకరికి కరోనా వచ్చినా పనివాళ్లను రమ్మనలేం. మీకు సహాయంగా మీవారు తప్ప ఇంట్లే వేరే ఆడవాళ్లు లేరు. ఇంటిపనులు ఎలా మేనేజ్ చేశారు? అంతా మావారే చేశారు. ఆయనకు వంట వచ్చు. ఆ మాటకొస్తే ఆయనకు రానిదంటూ లేదు. ఒక్క ఈ పరిస్థితుల్లోనే కాదు.. మిగతా రోజుల్లో కూడా నేను షూటింగ్స్ కోసం అవుట్డోర్ వెళ్లినప్పుడు ఆయనే ఇంటిని మ్యానేజ్ చేస్తారు. అందుకని ఇబ్బందిపడలేదు. ► నార్మల్వాళ్లే కరోనా సోకిందంటే భయపడుతున్నారు. మీరేమో వట్టి మనిషి కాదు. ‘పాజిటివ్’ అని రాగానే మీ మానసిక స్థితి ఏంటి? అప్పటివరకూ డెలివరీ టైమ్లో నొప్పి బాగా ఉంటుందేమో? డెలివరీ ఎలా జరుగుతుందో? అనే ఆలోచనలు ఉండేవి. కానీ అవన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. కరోనా అని తెలిశాక రాత్రీపగలూ ఒకటే టెన్షన్. ఏ టైమ్లో ఏం జరుగుతుందో? ఏం వినాల్సి వస్తుందో? అని భయం. బేబీ బాగుంటే చాలు అనేది మాత్రమే మనసులో ఉండేది. ► బిడ్డను కడుపులో మోస్తున్నప్పుడు అమ్మ వీలైనంత ప్రశాంతంగా ఉండాలి.. టెన్షన్ తగ్గించుకోవడానికి ఏం చేశారు? కరెక్టే... ఎక్కువ టెన్షన్ పడితే నాకు బీపీ పెరిగితే బిడ్డకు మంచిది కాదు. అందుకే నేను కొంచెం బ్యాలెన్డ్స్గానే ఉండేదాన్ని. కరోనా అని తెలిసి నా చుట్టూ ఉన్నవాళ్లు ఏడ్చినా, విపరీతంగా బాధపడినా నాకు మాత్రం ఏడ్చే పరిస్థితి కూడా లేదు. ‘మన కడుపులో ఇంకొకరు మన మీద ఆధారపడి ఉన్నారు’ అనే ఫీలింగ్ ఏడ్వనివ్వలేదు. ‘ఈ టైమ్లో మీరు టెన్షన్ పడితే బీపీ పెరిగిపోతుంది. వీలైనంత కూల్గా ఉండండి’ అని డాక్టర్లు కూడా చెప్పారు.. ఇక నా కళ్లముందు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ‘ధైర్యంగా ఉండడం’. నాకు నేనుగా ధైర్యం తెచ్చుకున్నాను. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ నేను ప్రశాంతంగా ఉండగలిగానంటే కారణం నేను చేసిన యోగా.. ధ్యానం. తెల్లవారుజాము నాలుగు గంటలకల్లా నిద్రలేచి, మా మేడ మీద ‘ప్రాణాయామం’ చేసేదాన్ని. దానివల్ల శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది అనిపించలేదు. ధాన్యం వల్ల ప్రశాంతంగా ఉండగలిగాను. ► కరోనా అంటే రుచి, వాసన తెలియదు. రుచి తెలియకపోతే ఆహారం తీసుకోలేం. తినాల్సిన నిర్బంధ పరిస్థితి మీది.. అదో బాధ అండీ.. బేబీ కోసం కచ్చితంగా తినాల్సిందే. ఏమీ తినబుద్ధయ్యేది కాదు. కరోనా సోకిన తర్వాత మావాళ్లు తినలేకపోయారు. నాక్కూడా అన్నం చూస్తే ఏదోలా ఉండేది. కానీ కడుపులో బేబీ ఉంది కాబట్టి, బలవంతంగా తిన్నాను. ఏం చేసినా బేబీ కోసమే. కొత్త టెన్షన్ని పక్కన పెట్టడం, బాధని వెనక్కి నెట్టడం నుంచి తినాలనిపించకపోయినా తినడం వరకూ ఏం చేసినా బేబీ క్షేమం కోసం చేశాను. ► గర్భవతిగా ఉన్నప్పుడు ఏ మందులు పడితే అవి వాడకూడదు. మరి.. కరోనాకి డాక్టర్లు ఇచ్చే మందులు వాడలేని స్థితిలో ఉన్న మీరు.. వేరే ఏ జాగ్రత్తలు తీసుకున్నారు? అవునండీ... మందులు వాడలేదు. అందుకు బదులుగా ప్రతిరోజూ ఉదయం వేపాకులు నమిలేదాన్ని. తులసి ఆకులు తినేదాన్ని. అల్లం, మిరియాలతో కషా యం చేసుకుని తాగేదాన్ని. రోజుకి నాలుగుసార్లు ఆవిరి పట్టేదాన్ని. యోగా, ధ్యానం వంటివి కూడా హెల్ప్ అయ్యాయి. నెగటివ్ తెచ్చుకోవాలనే తపనతో జాగ్రత్తలు తీసుకున్నాను. ► జనరల్గా మనకున్న సౌకర్యాలను బట్టి డెలివరీ జరిగే ఆసుపత్రిని సెలక్ట్ చేసుకుంటాం. మీరలా ఎంపిక చేసుకునే ఉంటారు. ఫైనల్గా కోవిడ్ ఆçసుపత్రిలోనే డెలివరీ అన్నప్పుడు కంగారుపడ్డారా? తొమ్మిది నెలలు ప్రతి నెలా చెకప్కి ఒకే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. మంచి ఆసుపత్రి సెలక్ట్ చేసుకుని, డెలివరీకి ప్రిపేర్ అయ్యాను. కానీ అది ‘నాన్ కోవిడ్ హాస్పిటల్’. అక్కడ కుదరదన్నారు. వేరే డాక్టర్ని సూచించారు. తొమ్మిది నెలల నా ఆరోగ్య స్థితి ఆ డాక్టర్కి తెలిసినంతగా కొత్త డాక్టర్కి తెలుస్తుందా? అని టెన్షన్ పడ్డాను. మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు కొంత రిలీఫ్ ఇస్తాడంటారు. అలా నేను వెళ్లిన డాక్టర్ నాకు చాలా ధైర్యం చెప్పారు. ‘ఏం ఫర్వాలేదు.. కూల్గా ఉండండి’ అన్నారు. ట్రీట్మెంట్ బాగా జరిగింది. నాకు డాక్టర్లందరూ దేవుళ్లలా కనిపించారు. అంతా సజావుగా జరిగేలా చేశారు. ► నార్మల్ డెలివరీ కాకుండా ‘సిజేరియన్’ చేయించుకోవాల్సి రావడం గురించి... నార్మల్ డెలివరీ అవ్వాలన్నదే నా ఆశ. అందుకే యోగా చేసుకుంటూ, డ్యాన్స్ కూడా చేసేదాన్ని. కింద కూర్చుని, పైకి లేవడం... ఇలా చాలా యాక్టివ్గా ఉన్నాను. విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ, సంగీతం నేర్చుకుంటూ చాలా ప్రశాంతంగా ఉన్నాను. వేరే ఆరోగ్య సమస్యలేవీ లేవు. నార్మల్ డెలివరీయే అని డాక్టర్ కూడా అన్నారు. కోవిడ్ హాస్పిటల్ కాబట్టి అందరూ కరోనా పేషెంట్లే! డాక్టర్లంతా ‘పీపీఈ’ డ్రెస్సులతో ఫుల్లీ కవర్డ్! ఆ వాతావరణం కొంచెం డిస్టర్బింగ్గానే అనిపించింది. ఆందోళన పడకూడదన్నా పడతాం. ఇక కరోనా సోకడంతో నార్మల్ డెలివరీ మంచిది కాదన్నారు. ఓ ఆరేడు గంటలు నొప్పులు పడటంవల్ల బిడ్డకు మంచిది కాదని, సిజేరియన్ చేయాల్సిందేనని అన్నారు. ప్లస్ నొప్పులు తట్టుకునే శక్తి ఉంటుందా? అనే సందేహం కూడా డాక్టర్లకి ఉంది. అందుకే వీలైనంత త్వరగా బేబీని బయటకు తీయాలన్నారు. ఆపరేషన్ థియేటర్కి వెళ్లేటప్పుడు ‘డెలివరీ ఎలా జరిగినా.. ఏ డాక్టర్ చేసినా.. నా బిడ్డ క్షేమంగా ఉంటే చాలు’ అని కోరుకున్నాను. ► బిడ్డ పుట్టగానే చూశారా... తాకారా? ఒక బాధాకరమైన విషయం ఏంటంటే... వెంటనే చూడలేదు. ఇక తాకే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? బిడ్డను బయటకు తీయగానే వేరే గదిలో ఉంచారు. వీడియో కాల్స్లో చూపించారు. లక్కీగా మా పాపకు నెగటివ్ వచ్చింది. ► మీకెప్పుడు నెగటివ్ వచ్చింది.. పాపను ఎప్పుడు తాకారు? మరి... బిడ్డకు ఆహారం ఎలా? పాలు ఇవ్వమన్నారు. బేబీకి నా ఉమ్ము టచ్ కాకూడదన్నారు. పాలు పట్టినంతసేపూ దగ్గకుండా, తుమ్మకుండా ఉండాలి. పాప పాలు తాగున్నంతసేపూ ముఖం ఒకవైపుకి తిప్పుకునేదాన్ని. ఆ పది నిమిషాలూ భయం భయంగానే ఉండేది. చేతులకు గ్లౌజులు వేసుకుని ఎత్తుకునేదాన్ని. పాప పుట్టిన 11 రోజులకు నాకు నెగటివ్ వచ్చింది. అప్పుడు గ్లౌజులు అవీ తీసేసి, పాపను తాకితే భలే అనిపించింది. గట్టిగా హత్తుకున్నాను. ► పాపకు పేరు పెట్టారా? లేదు. ఈ కరోనా టైమ్లో నామకరణం వేడుక అంటే సాధ్యం అయ్యేది కాదు. అందుకే ఓ రెండు నెలలు ఆగుదాం అనుకున్నాం. ► ఇప్పుడంతా రిలీఫ్.. ఈ ఆనందాన్ని షేర్ చేసుకుంటారా? దేవుడి దయవల్ల పెద్ద గండం నుంచి బయటపడ్డట్లయింది. నాకు ఈ ఆనందం ఈజీగా దక్కలేదు. నార్మల్గా నొప్పులు పడి కన్న అమ్మకు చాలా స్పెషల్గా ఉంటుంది. సిజేరియన్ అయినా సరే ఆనందంగానే ఉంటుంది. నేను కరోనాతో ఫైట్ చేస్తూ, బిడ్డను కన్నాను. కాబట్టి నాకు డబుల్ స్పెషల్... డబుల్ హ్యాపీనెస్. ధైర్యం కూడా డబుల్ అయింది. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. వేరే ఏ టెన్షన్స్ మనసులో లేవు. నా పాపతో చక్కగా గడుపుతున్నాను. ► తొమ్మిది నెలల ప్రాసెస్లో డెలివరీ గురించి భయపడ్డారా? మనకు ఆకలి వేసినప్పుడు రెస్టారెంట్కి వెళ్లి అది తిందాం.. ఇది తిందాం అనుకుంటాం. అవి దొరక్కపోతే ఆకలి తీర్చుకోవడానికి ఏది దొరికితే అది తింటాం. అప్పటివరకూ నచ్చినది తినాలనే కోరిక ఫిల్టర్ అయిపోయి, ‘ఏమీ వద్దు భగవంతుడా... ఆకలి తీరితే చాలు’ అనుకుంటాం. నా పరిస్థితి కూడా అలానే అయింది. ‘ఏమీ వద్దు. నా బిడ్డ బాగుంటే చాలు. ఆరోగ్యంగా ఉంటే చాలు’. అదొక్క ఆలోచన తప్ప వేరే ఏదీ లేదు. డెలివరీ టైమ్లో నాకేదైనా కష్టంగా ఉంటుందేమో అని అప్పటివరకూ ఉన్న ఆలోచనలన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. ► మీరు ప్రెగ్నెంట్ కాబట్టి ఎక్స్ట్రా కేర్ తీసుకుని ఉంటారు. మరి.. ఎవరి ద్వారా కరోనా వచ్చిందంటారు? మనకేం కాదులే అనే ధైర్యం ఉంటుంది. మా ఇంట్లో అందరికీ ఆ ధైర్యం ఎక్కువే. పైగా ఇంట్లో అందరికీ రోగనిరోధక శక్తి బాగానే ఉంటుంది. పనివాళ్లు, పాల ప్యాకెట్లు, డెలివరీ బాయ్స్.. ఇలా అందరూ వస్తారు. ఎక్కడినుంచి, ఎవరి ద్వారా అని ఇప్పుడు ఆలోచించడం అనవసరం. నాకు రావాలని రాసిపెట్టి ఉంది.. వచ్చింది. నా కూతురు కడుపులోనే ఫైట్ చేసి, బయటకు రావాలని ఉంది కాబట్టి ఇలా జరిగిందనుకుంటున్నాను. ఆ సంగతలా ఉంచితే.. ‘మనకేం అవుతుందిలే’ అని ఎవరూ తేలికగా తీసుకోకూడదు. అందరూ జాగ్రత్తగా ఉండాలి. మేం నేర్చుకున్న పాఠం ఇది. ఇప్పటివరకూ ఎన్నో కష్టాలు తట్టుకుని నిలబడ్డాను కానీ ఇది వేరే కష్టం. మన భుజం తట్టే మనిషి పక్కన ఉండలేని పరిస్థితి. మనం మనోధైర్యంతో ఉండగలిగితే ఏ కష్టాన్నయినా ఎదుర్కోగలుగుతాం అని నేర్చుకున్నాను. ఇదే అందరికీ చెబుతాను. కష్టం వచ్చినప్పుడు కంగారుపడతాం. అది సహజం. అయితే దాన్ని ధైర్యంగా అధిగమించి, నిలబడాలి. నా జీవితంలో ఇదొక మైలురాయి అనాలి. ముఖ్యంగా మనల్ని నమ్ముకుని మన లోపల ఒకరున్నారనే జాగ్రత్త ప్రెగ్నెంట్ ఉమన్కి ఉండాలి. ఇంట్లో అందరూ తనని జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. నాకు కరోనా గురించి అవగాహన లేదు కాబట్టి, విపరీతంగా భయపడ్డాను. కానీ అంత భయపడక్కర్లేదు. డాక్టర్లు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఏది ఏమైనా బిడ్డను కనేవరకూ కరోనా రాకపోయినా వచ్చినట్లే ఉంటే.. కష్టాలు రాకుండా ఉంటాయి. ప్రశాంతంగా డెలివరీకి వెళ్లొచ్చు. మరో విషయం ఏంటంటే... తల్లికి వచ్చినంత మాత్రాన బిడ్డకు కరోనా సోకుతుందని లేదు. ఎక్కడో ఒకరిద్దరికి తప్ప ఎక్కువ శాతం బిడ్డలకు సోకడం లేదు. అయినప్పటికీ మనం జాగ్రత్తగా ఉండాలి. – డి.జి. భవాని -
కరోనా రికార్డుల మోత
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి గణాంకాల్లో అగ్రదేశాలను భారత్ వెనక్కి నెట్టేస్తోంది. కరోనా సంక్రమణ విషయంలో భారత్ గత కొన్ని రోజులుగా ప్రతీ 24 గంటలకు ఒకసారి రికార్డులను బద్దలుకొడుతోంది. దేశంలో రోజు రోజుకీ వైరస్ సంక్రమిస్తున్నవారి సంఖ్య, మరణాల సంఖ్యలో గణనీయ పెరుగుదలతో భారత్లో పరిస్థితి భయంకరంగా మారింది. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన కరోనా గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,79,257 కొత్త పాజిటివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం సోకిన వారి సంఖ్య 1,83,76,524కు చేరింది. కరోనా ఎక్కువగా ప్రభావితమైన పది రాష్ట్రాల్లోనే 72.20% పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్తో పోరాడి 3,645 మంది తుది శ్వాస విడిచారు. దీంతో మరణాల సంఖ్య 2,04,832కు పెరిగింది. కొత్తగా 2,69,507 మంది కోలుకున్నారు. వైరస్తో పోరాడి ఆరోగ్యవంతులైన వారి సంఖ్య మొత్తంగా 1,50,86,878కు చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా చికిత్స పొందుతున్న యాక్టివ్ రోగుల సంఖ్య 30,84,814. దీంతో దేశంలో రికవరీ రేటు 82.10 శాతానికి, మరణాల రేటు 1.11% పడిపోయాయి. ఢిల్లీలో చికిత్స పొందుత్ను రోగుల సంఖ్య ఏకంగా లక్ష దాటింది. 15 కోట్ల డోస్ల వ్యాక్సినేషన్ ఇప్పటివరకు దేశంలో మొత్తం 15 కోట్ల 20 వేల 648 వ్యాక్సిన్ డోస్లను ప్రజలకు ఇచ్చారు. కోవిడ్ వ్యాక్సిన్కు సంబంధించిన మూడో డ్రైవ్ మే 1 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయనున్నారు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ దశలో అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ ప్రక్రియ బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం బుధవారం వరకు భారత్లో కరోనా వైరస్ కోసం మొత్తం 28,44,71,979 శాంపిల్స్ పరీక్షలు జరిగాయి. -
ఇప్పుడు శ్వాస తీసుకోగలుగుతున్నా: పూజా హెగ్డే
సమయాన్ని వృథా చేయడాన్ని కొందరు హీరోయిన్లు అస్సలు ఇష్టపడరు. ఈ జాబితాలో అగ్ర హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే పేరు కచ్చితంగా ఉంటుంది. పూజ చేతిలో ఉన్న అరడజను (‘రాధేశ్యామ్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘ఆచార్య’, ‘సర్కస్’, ‘కభీ ఈద్.. కభీ దీవాలీ’, తమిళ విజయ్తో సినిమా) సినిమాలే ఇందుకు నిదర్శనం. ఇటీవలే కరోనా సోకడం వల్ల పూజా హెగ్డే హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ ఈ టైమ్ను కూడా క్వాలిటీగా వినియోగించుకుంటున్నారామె. వర్చ్యువల్ యోగా సెషన్స్లో పాల్గొన్నారు పూజ. అంతేకాదు... ఆన్లైన్లో ఈ సెషన్స్ను షేర్ చేశారీ బ్యూటీ. ‘‘ఈ కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో అందరూ ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాణాయామం మనకు ఎంతో మేలు చేస్తుంది. మనం మెరుగైన విధంగా శ్వాసను తీసుకోగలిగేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ ప్రాణాయామం వల్ల నేను సరిగ్గా శ్వాస తీసుకోగలుగుతున్నాను’’ అన్నారు పూజా హెగ్డే. దర్శకుడు హరీష్ శంకర్, హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి ప్రముఖులు పూజా ఆన్లైన్ సెషన్ను ఫాలో అవ్వడం విశేషం. View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
Helping Hands: మానవసేవే మాధవ సేవ!
ఒక్కసారి రిపోర్టులో.. ‘కరోనా పాజిటివ్’ వచ్చిందంటే ఆ వ్యక్తి హోం ఐసోలేషన్ లో ఉండాల్సిన పరిస్థితి. వీరి దగ్గరకు వెళ్లాలన్న భయపడే రోజులివి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పాజిటివ్ పేషంట్లకు స్వయంగా వంటచేసి అందిస్తున్నారు పాట్నాకు చెందిన తల్లీకూతుళ్లు. పాట్నాలోని రాజేంద్రనగర్లో నివసిస్తోన్న కుందన్ దేవి తన కూతుర్లతో కలిసి కోవిడ్ పాజిటివ్ పేషంట్ల ఆకలి తీరుస్తున్నారు. కుందన్ దేవి పెద్దకూతురు 32 ఏళ్ల అనుపమ సింగ్ తల్లికి ఫుడ్ తయారీలో సాయం చేస్తుంటే.. చిన్నకూతురు 26 ఏళ్ల నీలిమ సింగ్ ఫుడ్ ప్యాకెట్లను కరోనా పేషంట్ల వద్దకు చేరుస్తోంది. ఇటీవలే కుందన్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ వ్యక్తిని ఐసోలేషన్ లో ఉంచారు. సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నవారికి ఆహారం అందించడం చాలా కష్టంగా ఉండేది. ఈ ఇబ్బందిని దగ్గర నుంచి గమనించిన తల్లీ కూతుళ్లు.. పాజిటివ్ వచ్చి సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటోన్న పేషంట్లకు స్వయంగా వండి ఫుడ్ అందించాలనుకున్నారు. ఈ క్రమంలోనే నందన్ దేవి, అనుపమలు వంటచేసి జాగ్రత్తగా ప్యాక్ చేసి నీలిమ సింగ్కు ఇస్తారు. నీలిమ రోజూ 15 కిలోమీటర్ల పరిధిలోని కోవిడ్ పేషంట్లకు ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తోంది. దీని కోసం వీరు వివిధ అవసరాలకోసం దాచుకున్న డబ్బులను వాడుతుండడం విశేషం. ఎవరి సాయం లేకుండా వీరు ఫుడ్ ప్యాకెట్లను అందిస్తున్నారు. అయితే నందన్ దేవీ కూతుళ్ల సాయం గురించి తెలుసుకున్న చాలామంది వారికి సాయం చేయాలని ముందుకొచ్చినప్పటికీ వారు డబ్బు విరాళంగా ఇవ్వొద్దు! మీరు మాకు ఇవ్వాలనుకుంటున్న డబ్బులతో మీరే దగ్గర్లోని కరోనా పేషంట్లకు ఫుడ్ వండిపెట్టండి అని సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ‘‘మానవ సేవే మాధవ సేవ అన్నారు. సేవ చేయడం అంటే దేవుణ్ణి ఆరాధించడంతో సమానం. అందుకే కష్టాల్లో ఉన్నవారికి కాస్త మానవత్వంతో మేము చేయగలిగిన సాయం చేస్తున్నాం. కొన్నిసార్లు నా స్నేహితులు ఫుడ్ ప్యాకెట్స్ డెలివరీ చేయడంలో నాకు సాయం చేసేందుకు వస్తున్నారు. ఒకపక్క నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఫుడ్ ప్యాకెట్స్ను పేషంట్లకు అందిస్తున్నాను’’ అని నీలిమ చెప్పింది. -
బిగ్బాస్: కౌశల్కు కరోనా భయం, ఏం జరిగిందంటే!
ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ధాటికి ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతంగా పెరిగిపోతోంది. రోజుకు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక సినీ ఇండస్ట్రీలో సైతం కరోనా కోరలు చాస్తోంది. దీంతో పలు షూటింగ్లు వాయిదా పడ్డాయి. ఇప్పటికే 50 మందికి మించకుండ షూటింగ్ నిర్వహించాలనే నిబంధనల మేరకు కొందరు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్లు జరుపుకుంటున్నారు. అయినప్పటికి నటీనటులు ఇతర చిత్ర బృందంలోని వ్యక్తులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో మిగతా వారంత కరోనా పట్ల ఆందోళన చెందుతున్నారు. తాజాగా బిగ్బాస్ 2 సీజన్ విన్నర్ కౌశల్కు సైతం కరోనా భయం పట్టుకుంది. దీంతో అతడు ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ అసలు సంగతి చెప్పుకొచ్చాడు. తన డిజైనర్కు కరోనా పాజిటివ్గా తెలినట్లు వెల్లడించాడు. కాగా ప్రస్తుతం కౌశల్ సినిమాల కంటే ఎక్కువగా ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కౌశల్ మోడలింగ్లో దూసుకుపోతున్నాడు. దీంతో అతడు నెల రోజుల నుంచి ఇంటికి దూరంగా ఉంటున్నాడట. ఈ క్రమంలో తన డిజైనర్కు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యిందని దీంతో కౌశల్ ఇంటి దారి పట్టక తప్పలేదు. ఇక నెల రోజుల తర్వాత భార్య పిల్లలను కలుస్తుండటంతో అతడు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నానని, ఎప్పుడైనా ముందు జాగ్రత్త పడటం మంచిదే అని సూచించాడు. కాగా ప్రస్తుతం కౌశల్ బ్లాక్ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) చదవండి: బిగ్బాస్: లైవ్లో రెమ్యూనరేషన్ బయట పెట్టిన కంటెస్టెంట్ టాలీవుడ్లో విషాదం: కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి పొట్టి వీరయ్య మృతి: ఉదయభాను భావోద్వేగం -
కరోనా కాఠిన్యం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కోవిడ్–19 మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య శరవేగంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ రికార్డులను తిరగరాస్తూ దేశంలో వరుసగా రెండో రోజు పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 3,32,730 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించింది. దేశంలో కేవలం ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు బయటపడడం ఇదే మొదటిసారి. ఒక్కరోజులో నమోదైన పాజిటివ్ కేసుల్లో 75.01 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. దేశంలో ఇప్పటివరకు కరోనా బారినపడినవారి సంఖ్య 1,62,63,695కు చేరింది. దేశంలో 24 గంటల్లో మరో 2,263 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. ఒక్క రోజులో కరోనా సంబంధిత మరణాల్లో ఇప్పటిదాకా ఇదే అత్యధికం. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,86,920కు చేరుకుంది. రోజువారీ కరోనా సంబంధిత మరణాల్లో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకుంది. 2,027 మరణాలతో బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలో 568, ఢిల్లీలో 306 మరణాలు సంభవించాయి. రికవరీ రేటు 83.92 శాతం భారత్లో ప్రస్తుతం 24,28,616 యాక్టివ్(క్రియాశీల) కరోనా కేసులున్నాయి. మొత్తం కేసుల్లో ఇవి 14.93 శాతం. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,93,279 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 1,36,48,159కు చేరింది. రికవరీ రేటు 83.92 శాతానికి పడిపోయింది. మొత్తం యాక్టివ్ కేసుల్లో 59.12 శాతం కేసులు ఐదు రాష్ట్రాలు.. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళలో ఉన్నాయి. బెంగళూరులో 1.37 లక్షలు, పుణేలో 1.17 లక్షలు, ఢిల్లీలో 91 వేలు, ముంబైలో 81 వేలు, నాగపూర్లో 80,924, థానేలో 80,643, లక్నోలో 54,967, నాసిక్లో 46,706, అహ్మదాబాద్లో 36,247, చెన్నైలో 30,404 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరణాల రేటు 1.15 శాతంగా నమోదయ్యింది. భారత్లో ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 13,54,78,420కు చేరుకుంది. ఉత్తరప్రదేశ్లో సింగిల్ డే రికార్డు దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 37,238 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 199 మంది బాధితులు మరణించారు. దీంతో యూపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,13,370కి, మరణాల సంఖ్య 10,737కు చేరుకుంది. -
క్వారంటైన్లో మహేశ్బాబు, ప్రభాస్, రామ్చరణ్
హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు హీరో మహేశ్బాబు, ప్రభాస్, రామ్చరణ్. ఫ్యాన్స్ కంగారుపడాల్సిన అవసరంలేదు. ఇంతకీ విషయం ఏంటంటే... ‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్ సమయంలో చిత్రబృందంలోని ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ సినిమా షూటింగ్ను నిలిపివేశారు. అయితే కోవిడ్ బారినపడ్డ ఐదుగురిలో మహేశ్బాబు వ్యక్తిగత సహాయకుడు ఉన్నారట. దీంతో ఫ్యామిలీ డాక్టర్ సూచన మేరకు మహేశ్ క్వారంటైన్లోకి వెళ్లారని తెలిసింది. కేవలం మహేశ్ మాత్రమే కాదు.. ప్రభాస్, రామ్చరణ్లు కూడా హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. మొన్నటివరకు ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు ప్రభాస్. కాగా ప్రభాస్ మేకప్మ్యాన్కు కూడా కరోనా పాజిటివ్. దీంతో ఆయన హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారని తెలిసింది. అలాగే ఇటీవల సోనూ సూద్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ మధ్య ఆయన ‘ఆచార్య’ షూటింగ్లో పాల్గొన్నారు. రామ్చరణ్, సోనూలపై సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే చిరంజీవి, చరణ్ సహాయకుల్లో ఒకరికి కరోనా అట. దీంతో వైద్యుల సూచన మేరకు రామ్చరణ్ కూడా క్వారంటైన్లో ఉంటున్నారని సమాచారం. ఇలా ముగ్గురు టాప్ హీరోలు హోమ్ క్వారంటైన్లో ఉండటం తెలుగు పరిశ్రమలో చర్చనీయాంశమైంది. -
ఒక్కరోజులో 2,17,353 కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కోవిడ్ మహమ్మారి విలయతాండవం ఉధృతమవుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 2,17,353 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా ఆనవాళ్లు బయటపడ్డాక ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. వరుసగా రెండో రోజు 2 లక్షలకు పైగా కేసులు రావడం గమనార్హం. ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,91,917కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా మరో 1,185 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 1,74,308కు చేరింది. క్రియాశీల (యాక్టివ్) కేసుల సంఖ్య వరుసగా 37వ రోజు పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 97,866 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15,69,743 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో వీటి సంఖ్య 10.98 శాతం. మరోవైపు కరోనా రికవరీ రేటు క్రమంగా పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రికవరీ రేటు 87.80 శాతానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,25,47,866 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. తాజాగా ఒక్కరోజులో 1,18,302 మంది కోలుకున్నారు. మరణాల రేటు 1.22 శాతానికి పడిపోయింది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) గణాంకాల ప్రకారం కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఏప్రిల్ 15 వరకు 26,34,76,625 నమూనాలను (శాంపిల్స్) పరీక్షించారు. 80 శాతం కేసులు 10 రాష్ట్రాల్లోనే... దేశంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 79.10 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని పేర్కొంది. దేశంలోని మొత్తం యాక్టివ్ కరోనా కేసుల్లో 65.86 శాతం వాటా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలదే కావడం గమనార్హం. మొత్తం యాక్టివ్ కేసుల్లో 39.60 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. మొత్తం కరోనా సంబంధిత మరణాల్లో 85.40 శాతం మరణాలు కేవలం 10 రాష్ట్రాల్లో సంభవించాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్, తమిళనాడులో మరణాలు అధికంగా సంభవించాయి. 11.72 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ ఇప్పటివరకు 17.37 లక్షల సెషన్లలో 11,72,23,509 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం టీకా డోసుల్లో 59.63 శాతం డోసులను మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళలో∙ఇచ్చారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 27.30 లక్షల డోసులను పంపిణీ చేశారు. కోవాగ్జిన్ ఉత్పత్తి గణనీయంగా పెంపు.. దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచి సెప్టెంబరు కల్లా నెలకు 10 కోట్ల డోసులకు చేరుస్తామని బయోటెక్నాలజీ శాఖ తెలిపింది. ఇందుకోసం మూడు ప్రభుత్వ రంగ సంస్థలను రంగంలోకి దించామని తెలిపింది. అలాగే కోవిడ్ చికిత్సలో వాడే రెమ్డెసివిర్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డి.వి.సదానంద గౌడ్ వెల్లడించారు. గడిచిన ఐదు రోజుల్లో 6.69 లక్షల డోసులను రాష్ట్రాలకు అందించినట్లు తెలిపారు. నెలకు 28 లక్షల ఉత్పత్తి సామర్థ్యాన్ని 41 లక్షలకు పెంచామన్నారు. యడియూరప్పకు మళ్లీ కరోనా కర్ణాటక సీఎం యడియూరప్ప(78) రెండోసారి కరోనా వైరస్ బారినపడ్డారు. శుక్రవారం ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. యడియూరప్పకు తొలుత గత ఏడాది ఆగస్టు 2న కరోనా పాజిటివ్గా తేలింది. అప్పట్లో ఆసుపత్రిలో చేరి, తొమ్మిది రోజులపాటు చికిత్స అనంతరం కోలుకున్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ (70) కరోనా బారినపడ్డారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్సింగ్, కాంగ్రెస్ నేత రణదీప్సింగ్ సూర్జేవాలా(53), శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్లకూ కరోనా సోకింది. -
జాతీయ బాక్సింగ్ శిబిరంలో కరోనా కలకలం
న్యూఢిల్లీ: భారత ఎలైట్ మహిళా బాక్సర్ల కోసం నిర్వహిస్తున్న జాతీయ శిక్షణ శిబిరంలో కరోనా కలకలం చోటు చేసుకుంది. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో పాల్గొంటున్న వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 21 మందికి పాజిటివ్ రావడం గమనార్హం. కరోనా సోకిన వారి జాబితాలో భారత మహిళల బాక్సింగ్ జట్టు హెడ్ కోచ్ మొహమ్మద్ అలీ కమర్, హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ రాఫెల్ బెర్గామాస్కో ఉన్నారు. అయితే టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన బాక్సర్లెవరికీ పాజిటివ్ రాలేదని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) తెలిపింది. కరోనా సోకిన వారందరూ క్వారంటైన్లో ఉన్నారని... నెగెటివ్ వచ్చిన వారికి న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియానికి తరలించామని ‘సాయ్’ వివరించింది. -
ఐపీఎల్లో మరో పాజిటివ్!
ముంబై: ఐపీఎల్ తాజా సీజన్లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలర్ యాన్రిచ్ నోర్జేకు నిర్వహించిన తొలి ఆర్టీ–పీసీఆర్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. బుధవారం నోర్జేకు నిర్వహించిన రెండో ఆర్టీ–పీసీఆర్ టెస్టు ఫలితం ఇంకా రాలేదు. దాంతో గురువారం రాజస్తాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్కు నోర్జే దూరం కానున్నాడు. అయితే నోర్జేకు పాజిటివ్ వచ్చిందని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించలేదు. ‘నోర్జే కరోనా నిర్ధారణ పరీక్షలు రావాల్సి ఉంది. ప్రస్తుతం అతను క్వారంటైన్లోనే ఉన్నాడు’ అని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతినిధి తెలిపాడు. నోర్జేతో ఈనెల 6న కలిసి వచ్చిన దక్షిణాఫ్రికాకే చెందిన మరో బౌలర్ కగిసో రబడకు నెగెటివ్ వచ్చింది. దాంతో అతను ఢిల్లీ జట్టు శిక్షణ శిబిరంలో పాల్గొన్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్), దేవ్దత్ పడిక్కల్, డానియల్ సామ్స్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) కరోనా బారిన పడ్డారు. -
‘ఆర్ఆర్ఆర్’ రచయిత విజయేంద్ర ప్రసాద్కు కరోనా
‘ఆర్ఆర్ఆర్’ మూవీ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్(78) కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటు హోంక్వారంటైన్ ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంతేగాక ఇటీవల ఆయనను కలిసిన వారంతా ఐసోలేషన్కు వెళ్లాల్సిందిగా ఆయన సూచించినట్లు తెలిపారు. కాగా ఇటీవల చెన్నైలో జరిగిన ‘తలైవి’ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్కు తిరిగి వచ్చిన ఆయనకు కరోనా లక్షణాలు కనిపించాయని, దీంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా తెలినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాగా విజయేంద్ర ప్రసాద్ బాహుబలి హిందీలో భజరంగీ భాయిజాన్, మణికర్ణిక వంటి హిట్ చిత్రాలకు ఆయన కథ అందించారు. తాజాగా ఆయన బాలీవుడ్ బహుభాష చిత్రం ‘సీత’కు కూడా స్ర్కీప్ట్ను సమకుర్చారు. చదవండి: అల్లు అర్జున్ అభిమానులపై కేసు ఎన్టీఆర్, అఖిల్ల వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ -
బెంగళూరు క్రికెటర్ డానియల్ సామ్స్కు పాజిటివ్
చెన్నై: ఐపీఎల్ను కరోనా వైరస్ వదలడం లేదు. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆల్రౌండర్ డానియెల్ సామ్స్ పాజిటివ్గా తేలాడు. ఆస్ట్రేలియాకు చెందిన అతను ఈనెల 3న భారత్కు వచ్చాడు. అప్పుడు చేసిన పరీక్షలో నెగెటివ్గా వచ్చింది. కానీ బుధవారం చేసిన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు వచ్చిందని ఆర్సీబీ ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఆర్సీబీ ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ వైరస్ బారి నుంచి కోలుకున్నాడు. బుధవారం అతని నమూనాలను పరీక్షించగా నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. రేపు చెన్నై వేదికగా ఐపీఎల్ 14వ సీజన్ మొదలవుతుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్తో బెంగళూరు తలపడుతుంది. -
పడిక్కల్కు పాజిటివ్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కష్టకాలం వచ్చింది. ఈ లీగ్పై కరోనా వైరస్ పడగ విప్పినట్లుంది. అందుకే ఆటగాళ్లు, గ్రౌండ్ సిబ్బంది, ఈవెంట్ మేనేజర్లు వరుసగా కోవిడ్–19 వైరస్ బారిన పడుతున్నారు. తాజా పరిణామాలు, పాజిటివ్ రిపోర్టులు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్కి ఈ మహమ్మారి సోకింది. గత నెల 22న అతని నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా కోవిడ్ పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో 20 ఏళ్ల యువ బ్యాట్స్మన్ను బెంగళూరులోని తన స్వగృహంలో క్వారంటైన్లో ఉంచారు. క్వారంటైన్ గడువు ముగిశాక వరుసగా రెండు ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ అని తేలితే అతన్ని బయో బబుల్లోకి తీసుకుంటామని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్సీబీ మెడికల్ టీమ్ అతనితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉందని అందులో పేర్కొంది. క్వారంటైన్ నేపథ్యంలో పడిక్కల్ ఈ నెల 9న జరిగే సీజన్ తొలి మ్యాచ్కు దూరం కానున్నాడు. చెన్నైలో మొదలయ్యే మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో ఆర్సీబీ తలపడుతుంది. లీగ్ ప్రారంభం కాకముందే కరోనా బారిన పడ్డ క్రికెటర్ల సంఖ్య మూడుకి చేరింది. నితీశ్ రాణా (కోల్కతా నైట్రైడర్స్) కరోనా నుంచి కోలుకోగా... అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్) ఐసోలేషన్లో ఉన్నాడు. ముంబై వేదికని మార్చలేదు: రాజీవ్ శుక్లా మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ కట్టుదిట్టమైన ముందు జాగ్రత్తలతో ముందుకెళ్తామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు. ‘ముంబై వేదికని మార్చే నిర్ణయం తీసుకోలేదు. షెడ్యూల్ ప్రకారం అక్కడే మ్యాచ్లు జరుగుతాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బయో బబుల్ కూడా ఉంది. కేసుల తీవ్రత పెరిగితే తప్ప స్టాండ్బై వేదికలు (హైదరాబాద్, ఇండోర్) పరిశీలించం’ అని శుక్లా తెలిపారు. -
90 వేలకు చేరువలో కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ రోజు రోజుకీ పెరిగిపోతోంది. 80 వేల మార్క్ చూసిన మర్నాడే ఒక్క రోజులో 90 వేలకి దగ్గరలో కేసులు నమోదవడం ఆందోళన పుట్టిస్తోంది. కరోనా మొదటి వేవ్ కంటే రెండో వేవ్లో మూడు రెట్ల వేగంతో కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 89,129 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,23,92,260కి చేరుకుంది. కరోనా మరణాలు ఒక్క రోజులోనే రెట్టింపయ్యాయి. మొత్తంగా 714 మంది కరోనాతో మరణించినట్టుగా కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 6,58,909కి చేరుకున్నాయి. మొత్తం కేసుల్లో ఇవి 5.32శాతంగా ఉన్నాయి. ► ఎనిమిది రాష్ట్రాల నుంచి కరోనా కేసులు అత్యధికంగా వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం కేసుల్లో 81.42% కేసులు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. ► దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 10 జిల్లాల నుంచే సగం కేసులు వెలుగులోకి వస్తున్నాయి. పుణె, ముంబై, నాగపూర్, థానే, నాసిక్, బెంగుళూరు అర్బన్, ఔరంగాబాద్, ఢిల్లీ, అహ్మద్నగర్, నాందేడ్ జిల్లాల నుంచి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ► గత రెండు నెలల కాలంలో యాక్టివ్ కేసుల్ని పరిశీలిస్తే మహారాష్ట్రలో తొమ్మిది రెట్లు అధికంగా కేసులు నమోదవుతూ ఉంటే, పంజాబ్లో ఏకంగా పన్నెండు రెట్లు అధికంగా కరోనా కేసులు వస్తున్నాయి. ► కరోనా మరణాల్లో 85శాతం ఆరు రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు నమోదు కాకపోవడం ఊరట కలిగించే అంశం. ఒడిశాలో 10 జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ ఒడిశాలో ముందుజాగ్రత్తగా 10 జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. సోమవారం నుంచి రాత్రి 10 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ వెల్లడించారు. రాష్ట్రంలో రోజుకి 500 వరకు కేసులు నమోదవుతున్నాయి. కనిమొళికి కరోనా పాజిటివ్ డీఎంకే లోక్సభ ఎంపీ కనిమొళికి కరోనా పాజిటివ్గా తేలింది. ఏప్రిల్ 6న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కరోనా సోకడంతో కనిమొళి ఎన్నికల సభలన్నీ రద్దు చేసుకొని ఆస్పత్రిలో చేరారని డీఎంకే వర్గాలు తెలిపాయి. -
ఐపీఎల్కు కరోనా సెగ
మామూలుగా అయితే వేసవి వస్తుందంటే పిల్లలకు సెలవులు, అభిమానులకు ఐపీఎల్ మ్యాచ్లు ఉంటాయి. ఈ ఆహ్లాదపరిచే ఆనందం ముందు మండే ఎండలైనా చిన్నబోతాయి. కానీ గతేడాది నుంచి ట్రెండ్ మారింది. కొత్త వైరస్ (కరోనా) దాపురించింది. ఐపీఎల్ను వణికిస్తోంది. ఆటగాళ్లను, సిబ్బందిని బెంబేలెత్తిస్తోంది. మొత్తానికి ఈ ఏడాదీ కరోనా సెగ లీగ్కు తాకింది. ముంబై: ఐపీఎల్ టి20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభానికి వారమైనా లేదు. కరోనా వైరస్తో ఈ టోర్నీలో అలజడి రేపింది. లీగ్ ఏర్పాట్లలో కలకలం మొదలైంది. శ్రీకారానికి ముందే వైరస్ సైరన్ మోగింది. భారత ఆల్రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్ సహా ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బంది, పలువురు ఈవెంట్ మేనేజర్లు వైరస్ బారిన పడ్డారు. ఇది లీగ్ వర్గాలను ఠారెత్తించినా... గత అనుభవాల దృష్ట్యా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దగా కంగారు పడకుండా చేయాల్సిన పనుల్ని చక్కబెడుతూ, ఏర్పాట్లను మరింత కట్టుదిట్టంగా చేయాలని నిర్ణయించింది. ఐసోలేషన్లో అక్షర్... ఢిల్లీ ఆటగాడు అక్షర్ పటేల్కు పాజిటివ్ రిపోర్టు వచ్చిందని జట్టు వర్గాలు తెలిపాయి. ముంబైలో తను బసచేసిన హోటల్లో గత నెల 28న అతనికి పరీక్ష చేయగా అప్పుడు నెగెటివ్ వచ్చింది. కానీ మరోసారి కోవిడ్ టెస్టు చేస్తే పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా అక్షర్ ఇంకా బయో బబుల్లోకి వెళ్లలేదు. కాబట్టి జట్టు సన్నాహక శిబిరానికి, ఇతర ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్కు ఎలాంటి ఇబ్బంది లేదని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. మొదట కోల్కతా నైట్రైడర్స్ హిట్టర్ నితీశ్ రాణా వైరస్ బారిన పడ్డట్లు రిపోర్టులో వచ్చింది. ఈ సీజన్లో ఇదే తొలికేసు. అయితే తదుపరి పరీక్షలో తను నెగెటివ్ అని తేలడంతో ఆటగాళ్లకు సంబంధించి తొలి పాజిటివ్ అక్షర్ ఖాతాలోకి వెళ్లింది. ఐపీఎల్ కరోనా ప్రోటోకాల్ ప్రకారం అక్షర్ 10 రోజులు క్వారంటైన్లో గడపాలి. క్వారంటైన్ గడువు ఈనెల 12న ముగియనుంది. ఆ తర్వాత వరుసగా రెండు ఆర్టీ–పీసీఆర్ టెస్టుల్లో కూడా అతనికి నెగెటివ్ రావాలి. అప్పుడే అతను జట్టుతో కలవగలడు. ఫలితంగా ఈనెల 10న చెన్నై సూపర్ కింగ్స్తో... 15న రాజస్తాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్ల్లో అక్షర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలో దిగే అవకాశాలు కనిపించడంలేదు. మరోవైపు చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) ఆటగాడికి కూడా కోవిడ్ సోకినట్లు తెలిసింది. అయితే అతని పేరు మాత్రం బయటకు పొక్కలేదు. పది మంది సిబ్బందికి... మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బందిలో 10 మందికి కూడా కోవిడ్ సోకింది. దీంతో పాటు మరో ఆరుగురు ఈవెంట్ మేనేజర్లు కూడా కరోనా బారిన పడటంతో బీసీసీఐ ఆందోళన చెందింది. ఈ నేపథ్యంలో ముంబైలో జరగాల్సిన మ్యాచ్లను హైదరాబాద్ లేదంటే ఇండోర్లో నిర్వహించనున్నారనే వార్తలు వెలువడ్డాయి. కానీ బీసీసీఐ మాత్రం బయో బబుల్ ఏర్పాట్లు ఉన్నపళంగా మార్చలేమని, ఏదేమైనా కట్టుదిట్టమైన చర్యలతో ముంబైలోనే మ్యాచ్లు నిర్వహించేందకు ప్రయత్నిస్తామని చెప్పింది. ‘స్టాండ్బై స్టేడియాలలో హైదరాబాద్ ఒకటి. కానీ ఇప్పటికైతే ఆగమేఘాలపై ముంబై మ్యాచ్ల్ని అక్కడికి తరలించాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కొద్ది సమయంలోనే మరో బబుల్ ఏర్పాటు అంత సులభం కాదు’ అని ఒక సీనియర్ బీసీసీఐ అధికారి వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం వాంఖెడే మైదానంలో ఈ నెల 10 నుంచి 25 వరకు 10 లీగ్ మ్యాచ్లు జరగాల్సివుంది. శుక్రవారం సాయంత్రం దాకా 8 పాజిటివ్ కేసులుంటే శనివారానికి ఆ సంఖ్య పదికి చేరిందని, ఆరేడు మంది ఈవెంట్ మేనేజర్లు కూడా వైరస్ బారిన పడ్డారని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. -
అలియాకు కరోనా: తల్లి సోని ఆందోళన
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కరోనా బారిన పడిని సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోంక్వారంటైన్లో ఉన్న అలియా త్వరలో మహమ్మారి నుంచి బయటపడాలని కోరుకుంటూ పలువురు బాలీవుడ్ ప్రముఖులు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలియా భట్ తల్లి సోని రజ్ధాన్ కూతురి ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఆమె ట్వీట్ చేస్తూ ఈ వైరస్ వ్యాప్తి నుంచి ఎలా రక్షించుకోవాలో అర్థం కావడం లేదంటూ ట్విటర్లో ఇలా రాసుకొచ్చారు. ‘ఇది సాధారణ తరంగం కాదు… ఈ వైరస్ ప్రతిచోటా ఉంది. ప్రతి ఇళ్లలో ఉంది, మన జుట్టులో ఉంది. ఇది తలచుకుంటుంటే చాలా భయంగా ఉంది. ఇది సాధారణ తరంగం కాదు.. ఈ మహమ్మరి ప్రతిచోటా ఉంది. ఇక మనం ఎలా ముందుకు సాగాలి. దీని నుంచి ఎలా బయటపడాలి. అసలు ఇది రాకుండ ఉండేందుకు ఎలా జాగ్రత్త పడాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న మహమ్మారి వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. ప్రతి ఇల్లు, ప్రతి కార్యాలయం, ప్రతి వీధి, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం.. ఎక్కడ లేదని చెబుతాం. ప్రతి చోటా ఉంది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా అలియా తనకు కరోనా పాజిటివ్గా తెలినట్లు స్వయంగా ప్రకటించారు. డబుల్ హోమ్ క్వారంటైన్ను ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు హీరోయిన్ ఆలియా భట్. సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ టైటిల్ రోల్ చేస్తున్న సినిమా ‘గంగూబాయి కతియావాడి’. ఈ సినిమా షూటింగ్లో దర్శకుడు సంజయ్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆలియా కూడా క్వారంటైన్లోకి వెళ్లారు. ఇలా హోమ్ క్వారంటైన్ను పూర్తి చేశారో లేదో అలా మరోసారి క్వారంటైన్కి వెళ్లారు ఆలియా. ఈసారి ఆలియాకు కరోనా సోకింది. This is no ordinary wave ...it’s everywhere. In our houses, in our hair. I’m getting a bit of a scare. It’s no ordinary wave.. it’s everywhere ... don’t know how we shall fare .. how do we begin to care... about so many here and there... it’s everywhere, it’s everywhere 🦠🦠🦠 — Soni Razdan (@Soni_Razdan) April 2, 2021 చదవండి: రెండుసార్లు క్వారంటైన్కు వెళ్లిన స్టార్ హీరోయిన్ అలియా భట్కి షాకిచ్చిన ముంబై కోర్టు -
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వెన్నులో వణుకు...
-
మళ్లీ లాక్డౌన్ తప్పదేమో: ఉద్ధవ్ ఠాక్రే
సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉధృతి పెరుగుతుండడంతో మళ్లీ లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. అయితే, ఇప్పటికిప్పుడు లాక్డౌన్ ప్రకటన చేయడం లేదన్నారు. లాక్డౌన్కు ప్రత్యామ్నాయం లభించకపోతే రానున్న రెండు మూడు రోజుల్లో కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని స్పష్టం చేశారు. మహారాష్ట్రను కరోనా హడలెత్తిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రస్తుతం లాక్డౌన్ మినహా ప్రత్యామ్నాయం కనిపించడం లేదన్నారు. ఏదైనా మార్గం ఉంటే సూచించాలని ప్రజలను కోరారు. తాను కూడా నిపుణులతో దీనిపై చర్చిస్తున్నానని తెలిపారు. ప్రజల ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదన్నారు. రాజకీయ పార్టీలు ఈ విషయంపై రాద్ధాంతం చేయకుండా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు సహకరించాలని ఉద్ధవ్ ఠాక్రే విన్నవించారు. కరోనా వైరస్ను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఠాక్రే పేర్కొన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాల కంటే అధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని గుర్తుచేశారు. ఆసుపత్రుల సంఖ్య, ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు ఇలా అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. మళ్లీ లాక్డౌన్ విధించాలని తాము కోరుకోవడం లేదన్నారు. నిపుణులతో చర్చించి రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. -
దేశంలో కరోనా విలయం, ఒక్కరోజే 81,466 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 81,466 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,23,03,131కి చేరుకున్నట్టు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన వెల్లడించింది. దేశవ్యాప్తంగా 469 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,63,396కి చేరుకుంది. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్గఢ్, కర్ణాటకలలో కరోనా ఉధృతి ఆందోళన పుట్టిస్తోందని కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్లో కరోనా కట్టడికి కొన్ని పట్టణ ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి లాక్డౌన్ విధించారు. ఏప్రిల్ 5 వరకు ఈ లాక్డౌన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రెండో డోసు తీసుకున్నా కరోనా పాజిటివ్ ఉత్తర ప్రదేశ్కి చెందిన సీనియర్ పోలీసు అధికారికి కోవిడ్–19 రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్గా తేలింది. తాను రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఐజీ) రాజేశ్ పాండే ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. తన భార్య కరోనా టీకా ఒక డోసు తీసుకున్నారని, ఆమెకి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. మూడు రోజుల క్రితం వాళ్లబ్బాయికి కరోనా సోకింది. రాబర్ట్ వాద్రాకు కరోనా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రాకు కోవిడ్–19 పాజిటివ్గా తేలింది. దీంతో ప్రియాంకా శుక్రవారం ఐసోలేషన్లోకి వెళ్లారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు. అస్సాంలో శుక్రవారం, తమిళనాడులో శనివారం, కేరళలో ఆదివారం పాల్గొనాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ‘నాకు కోవిడ్–19 నెగెటివ్గా నిర్థారణ అయినప్పటికీ వైద్యుల సూచన మేరకు కొన్ని రోజుల పాటు ఐసోలేషన్లో ఉంటాను’ అని ఆమె తెలిపారు. రికార్డు స్థాయి వ్యాక్సినేషన్ ఓ వైపు కరోనా కేసులు బెంబేలెత్తిస్తుంటే మరోవైపు జనం కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి బారులు తీరుతున్నారు. 45 ఏళ్ల వయసు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తూ ఉండడంతో 24 గంటల్లో 36.7 లక్షలకుపైగా మంది కోవిడ్–19 టీకాలు తీసుకున్నారు. ఒకే రోజులో ఈ స్థాయిలో వ్యాక్సినేషన్ జరగడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. యొత్తంగా 36,71,242 వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. 33,65,597 మంది మొదటి డోసు తీసుకుంటే, 3,05,645 మంది రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6.87 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ మహారాష్ట్ర కోవిడ్–19 గుప్పిట్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. రాష్ట్రంలో ఒకే రోజు 43,183 కేసులు నమోదయ్యాయి. పుణేలో గత రెండు రోజులుగా 8 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో శనివారం నుంచి వారం రోజులు రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత కరోనా ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్ణయించారు. మాల్స్, సినిమాహాళ్లు, రెస్టారెంట్లు, బార్లు వారం రోజుల పాటు సాయంత్రం 6 గంటలకే మూసేయాల్సి ఉంటుందని ఆదేశించారు. -
లాక్డౌన్ దిశగా మహారాష్ట్ర!
సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్ విధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించారు. నాందేడ్, బీడ్తోపాటు మరికొన్ని జిల్లాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలవుతోంది. పలు జిల్లాల్లో పాక్షిక లాక్డౌన్తోపాటు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. అయినప్పటికీ కరోనా అదుపులోకి రావడం లేదు. అందుకే మళ్లీ లాక్డౌన్ విధించడంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. 43 వేలు దాటిన కేసులు రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ హడలెత్తిస్తోంది. గురువారం ఒక్కరోజే ఏకంగా 43,183 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 249 మంది మృతి చెందారు. గురువారం 32,641 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,66,533 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముంబై నగరంలో కరోనా బాధితుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. గురువారం 8,646 కేసులు రికార్డయ్యాయి. 18 మంది కరోనాతో కన్నుమూశారు. ముంబైలో ఆంక్షలను మరింత కఠినతరం చేయడం ఖాయమన్న సంకేతాలను మేయర్ కిషోరి ఫెడ్నేకర్ ఇచ్చారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదు: రాజేష్ టోపే మహారాష్ట్రలో లాక్డౌన్కు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే చెప్పారు. లాక్డౌన్ విధించాలని తాము కోరుకోవడం లేదన్నారు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చెప్పారు. లాక్డౌన్ కాకుండా ఏమేం చేయొచ్చు అనేదానిపై నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ను వేగవంతం చేశామన్నారు. -
మళ్లీ కరోనా పడగ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒక్కసారిగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. గత 24 గంటల్లో 72,330 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 22 లక్షల 21వేల 665కి చేరుకుంది. గత ఏడాది అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో ఒక్క రోజు కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక కరోనా మరణాలు 459 నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 1,62,927కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,84,055గా ఉన్నట్టు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా కేసుల్లో 4.78శాతంగా ఉంది. 45 ఏళ్ల వయసు పై బడిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైన రోజే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. వ్యాక్సినేషన్ను ముమ్మరం చేస్తే కరోనా కేసుల్ని కట్టడి చేయవచ్చునని శాస్త్రవేత్తలు సూచించారు. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర నుంచి 61శాతం కేసులు వెలుగులోకి వస్తున్నాయి. యువతే క్యారియర్లా ? దేశంలో కరోనా కేసులు పెరిగిపోవడానికి యువతరం క్యారియర్లగా మారుతోందన్న ఆందోళనలు నెలకొన్నాయి. రోడ్లపైకొచ్చి స్వేచ్ఛగా, నిర్భీతిగా తిరుగుతున్న యువతే కారణమన్న అంచనాలున్నాయి. కరోనా సోకినా తమకేం కాదులే అన్న ధీమాతో ఉన్న యువతరం కనీస జాగ్రత్తలు కూడా పాటించకుండా తిరుగుతున్నారని, దీంతో వైరస్ వారినేం చేయకపోయినా యువత నుంచే పెద్దవారికి, వ్యాధులున్నవారికి సోకుతోందని న్యూఢ్లిలీలోని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. బ్రిటన్లో క్రిస్మస్ సమయంలో నెలకొన్న పరిస్థితి ప్రస్తుతం భారత్లో హోలీ పండుగ సమయంలో వచ్చిందని అన్నారు. వైరస్ మ్యుటేషన్ చెందినప్పుడు కేసులు అత్యధికంగా వెలగులోకి వస్తాయని కేంద్రం ఏర్పాటు చేసిన కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు కూడా అయిన డాక్టర్ రణదీప్ చెప్పారు. నగర ప్రాంతాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదు కావడానికి సెంట్రలైజ్డ్ ఏసీలున్న చోట్ల ప్రజలు ఎక్కువ సేపు గడపడమే కారణమని న్యూరో ఎక్విలిబ్రియమ్ సంస్థ వ్యవస్థాపకుడు రాజ్నీష్ భండారీ అన్నారు. వేసవికాలం వచ్చినప్పటికీ అత్యంత చల్లగా ఉండే ఏసీ గదుల్లో గడపడం వల్ల కేసులు పెరిగిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సెలవు రోజుల్లోనూ వ్యాక్సినేషన్ కరోనా ఉధృతిని కట్టడి చేయాలంటే ప్రజలందరికీ వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ జరగాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు ఏప్రిల్ నెలంతా నిరంతరాయంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఏప్రిల్ నెల 30 వరకు సెలవు దినాల్లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆ లేఖలో సూచించింది. మార్చి 31న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య శాఖ చర్చించిన అనంతరం గెజిటెడ్ హాలీడేస్ల్లో కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయానికొచ్చింది. కరోనా వ్యాక్సినేషన్ మరింత ముమ్మరంగా జరగాలంటే ప్రైవేటు సెక్టార్ ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ మూడో విడత మొదలైంది. 45 ఏళ్ల వయసుపైబడిన వారందరికీ వ్యాక్సిన్లు ఇవ్వడం మొదలు పెట్టారు. 6.5కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల్ని ఫ్రంట్లైన్ వర్కర్లు, ఆరోగ్య సిబ్బందితో పాటుగా 60 ఏళ్ల వయసు పైబడిన వారు, వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల వయసు పైబడిన వారికి ఇచ్చారు. -
దేవెగౌడ దంపతులకు కోవిడ్
సాక్షి, బెంగళూరు: జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, ఆయన సతీమణి చెన్నమ్మకు బుధవారం పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. వారిద్దరూ బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని దేవెగౌడ కోరారు. తనను కలిసేందుకు రావద్దని సూచించారు. దేవెగౌ డకు ఎలాంటి లక్షణాలు లేకున్నా, టెస్టుల్లో పాజిటివ్గా తేలింది. వైద్యుల సూచన ప్రకారం కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. దేవెగౌడకు ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ చేసి పరామ ర్శించారు. ప్రధాని ఫోన్ చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దేవెగౌడ త్వరగా కోలుకోవాలని కోరుతూ సీఎం బీఎస్ యడి యూరప్ప ట్వీట్ చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో కరోనా రెండో దశ ఉధృతంగా ఉంది. నిత్యం సుమారు రెండు వేల పాజిటివ్లు నమోదవుతున్నాయి. -
రాజేంద్రనగర్లో కోవిడ్ కలకలం
సాక్షి, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్లో గురువారం కరోనా కలకలం సృష్టించింది. ఎస్టీ హాస్టల్తో పాటు ప్రభుత్వ పాఠశాలలోని పలువురు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని తెలుసుకున్న స్థానికులు కలవరానికి గురయ్యారు. ఒకే సారి 26 మందికి కరోనా రావడంతో ఇదే విషయమై చర్చించుకున్నారు. మధ్యాహ్నానికి ఎప్పుడు రద్దీగా ఉండే రాజేంద్రనగర్ చౌరస్తా బోసిపోయి కనిపించింది. విద్యార్థులకు కరోనా సోకిందన్న విషయంతో స్థానిక వ్యాపారస్తులు సైతం మధ్యాహ్నం దుకాణాలను మూసివేశారు. ఇతర హాస్టల్లలో... రాజేంద్రనగర్ ప్రాంతంలో గిరిజన హాస్టల్తో పాటు ఎస్సీ, బీసీ, బాలిక, బాలుర హాస్టల్స్ ఉన్నా యి. ఈ ఐదు హాస్టల్స్లోని విద్యార్థులంతా స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యభ్యాసంసం కొనసాగిస్తున్నారు. వైద్య బృందం హాస్టల్స్లో ఉదయం పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు, ఇతర సిబ్బంది అందరికి నెగటీవ్గా వచ్చింది. ఆందోళనలో తల్లిదండ్రులు... రాజేంద్రనగర్ జెడ్పీహెచ్ఎస్లో చదువుతున్న 24మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడంతో ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కోరుతున్నారు. -
పాజిటివ్గా తేలడంతో దారుణానికి పాల్పడ్డ రైతు
సాక్షి, ధారూరు(వికారాబాద్): కరోనా పాజిటివ్ అని తేలడంతో భయపడిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ధారూరు మండలం నాగసమందర్లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ సురేష్, గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నాగసమందర్కు చెందిన ముతికె శాంత్కుమార్(54) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈయన మూడు రోజులుగా దగ్గు, దమ్ము, జ్వరంతో బాధపడుతున్నాడు. సోమవారం ఉదయం తాండూరులోని జిల్లా అస్పత్రికి వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో మనస్తాపానికి గురైన ఆయన ఇంటికి వచ్చి దులానికి ఉరివేసుకునే ప్రయత్నం చేశాడు. ఇది గుర్తించిన కుటుంబీకులు, గ్రామస్తులు అడ్డుకుని, నచ్చజెప్పారు. అందరినీ నమ్మించిన ఆయన సాయంత్రం వేళ భార్య నాగవేణి(50)ని నీళ్లు తీసుకురమ్మని ఇంట్లో నుంచి పంపించి దులానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన భార్య గుండెలు బాధుకుంటూ ఇతరుల సహాయంతో కిందకు దింపి చూడగా అప్పటికే శాంత్కుమార్ మరణించాడు. మృతుడి కుమారుడు భీమలింగం పోలసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ సురేష్ సిబ్బందితో వెళ్లి సంఘటన స్థలానికి డాక్టర్ను పిలిపించి పోస్టు మార్టమ్ చేయించారు. కోవిడ్ నిబంధనల మేరకు అంత్యక్రియలు జరిపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. మృతుడికి భార్యతో పాటు కొడుకులు శివశంకర్, భీమలింగ్లు ఉన్నారు. వ్యవసాయమే జీవనాధారంగా చేసుకుని జవనం గడుపుతున్న శాంతుకుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
ఉపాధ్యాయులకు కరోనా, ఆందోళనలో ఎమ్మెల్యే..
సాక్షి, వికారాబాద్: మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ సోకింది. ఈమేరకు వైద్యాధికారులు నిర్ధారించారు. జిల్లా కేంద్రంలోని శివారెడ్డి సమీపంలో ఉన్న పాఠశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది మొత్తం 40 మంది ఉన్నారు. వీరిలో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ సోకింది. విద్యార్థుల్లోనూ కొందరికి వైరస్ లక్షణాలు ఉన్నాయని వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. పాఠశాలలో మొత్తం 100 మందికి పైగా 8, 9, 10తోపాటు ఇంటర్ చదువుతున్నారు. వైద్యాధికారులు వారినుంచి నమూనాలు సేకరించి గురువారం ల్యాబ్కు తరలించారు. విద్యార్థుల్లో కొందరు జ్వరం తదితర లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఫలితాల అనంతరమే నిర్ధారణ అవుతుందని చెబుతున్నారు. పాఠశాలలో మహమ్మారి వ్యాప్తి చెందడానికి కారణమైన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. పాఠశాలలో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ రావడంతో బడిలో కోవిడ్ నిబంధనలు పాటి స్తున్నారా.. లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పిల్లలకు వైరస్ సోకితే ఎవరు బాధ్య త వహిస్తారని ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా భయంతో అటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శివరెడ్డిపేట్ సమీపంలో ఉన్న గురుకుల మైనారిటీ స్కూల్లో తన అనుచరులతో ప్రచారం చేశారు. పార్టీ అభ్యర్థి వాణీదేవికి ఓటేయాలని ఉపాధ్యాయులను కోరారు. ఎమ్మెల్యే సుమారు గంటసేపు పాఠశాలలో సమవేశమయ్యారు. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు పాజిటివ్ రావడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులకు సైతం కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. -
ఒకే అపార్టుమెంటులో 103 మందికి కరోనా
బెంగళూరు: ఒకే అపార్టుమెంటులో నివసిస్తున్న దాదాపు 103 మంది ఒకేసారి కరోనా వైరస్ బారిన పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇటీవల అపార్టుమెంటులో నిర్వహించిన పార్టీలో దాదాపు 45 మంది పాల్గొన్న అనంతరం 103 మందికి కరోనా పాజిటివ్ తేలిందని అధికారులు తెలిపారు. ఆ పార్టీ కారణంగానే అపార్టుమెంటు వాసులకు కరోనా సోకినట్లుగా అధికారులు అభిప్రాయపడుతున్నారు. బీబీఎమ్పీ అధికారుల సమాచారం మేరకు.. బెంగళూరులోని ఎస్ఎన్ఎన్ రాజ్ లేక్వ్యూ అపార్టుమెంటులో ఫిబ్రవరి 6న ఓ పార్టీ జరిగింది. ఈ పార్టీలో అపార్టుమంటు నివాసితులు 45 మంది పాల్గొన్నట్లు సమాచారం.దీంతో ఆది, సోమవారల్లో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఈ అపార్టుమెంటులోని వాచ్మెన్, డ్రైవర్, వంటవాళ్లతో సహా మొత్తం 103 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. కాగా ఇందులో ఉన్న మొత్తం 435 ప్లాట్స్లో 1500 మందిపైగా నివసిస్తున్నారు.లో ఫిబ్రవరి 6న నిర్వహించిన రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోని ఒక కార్యక్రమాని దాదాపు 45 మంది సమావేశమయ్యారు. అయితే ఇందులో చాలామందికి కరోనా లక్షణాలు లేవని, కనీసం ఈ లక్షణాలతో బాధపడుతున్నట్లు కానీ, ఆస్పత్రిలో చేరిన దాఖలాలు లేవని అధికారులు పేర్కొన్నారు. మొదట ఫిబ్రవరి 10న ఈ అపార్టుమెంటులోని వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలిందని, అనంతరం అపార్టుమెంటు వాసలంతా గృహనిర్భందంలోకి వెల్లినట్లు బీబీఎమ్పీ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం అపార్టుమెంటుతో పాటు చూట్టు పరిసర ప్రాంతాల్లో శానిటైజేషన్ చేయించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక ఆదివారం 513 మందికి, సోమవారం 600 మందికి కరోనా పరీక్షలు చేయించామని, ఇవాళ(మంగళవారం) మిగిలిన 300 మందికి పరీక్షలు చేయాల్సి ఉందని బీబీఎమ్పీ సీనియర్ అధికారి చెప్పారు. అనంతరం అపార్టుమెంటు సెక్రటరీ, సిబ్బందితో సమావేశమై వారు పాటించాల్సిన కోవిడ్ ప్రోటోకాల్, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చెర్చించినట్లు తెలిపారు. (చదవండి: మరోసారి ఈ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు) (కరోనా వైరస్.. 7 కొత్త లక్షణాల కథ..) (యూకేకు ప్రయాణం మరింత కఠినం) -
కోవిడ్–19 కిట్ల పెళ్లి
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయి అంటారు. రాజస్థాన్లో ఓ పెళ్లి మాత్రం కోవిడ్ సెంటర్లో జరగాలని దేవతలు నిర్ణయించినట్టున్నారు. ఇటీవల రాజస్థాన్ బారాలో ఒక జంట కెల్వారా కోవిడ్ సెంటర్లో పెళ్లితో ఒక్కటయ్యింది. నవ వధువు, వరుడు, వారి తల్లిదండ్రులు, పెళ్లి జరిపించే çపురోహితుడు పిపిఇ కిట్లు ధరించి మరీ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇలాంటి పెళ్లి జరగడం దేశంలో ఇదే మొదటిదిగా చెప్పుకోవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా వివాహవేడుకలపై అనేకానేక ఆంక్షలు తప్పడం లేదు. పెళ్లిళ్లలో మాస్కులు ధరించకపోయినా, ఎక్కువ సంఖ్యలో హాజరైనా, సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా పోలీసులు జరిమానాలు విధించిన సంఘటనలు చూశాం. కొన్ని పెళ్ళిళ్లలో వెయిటర్లు పిపిఇ కిట్లు ధరించడమూ చూశాం. కానీ, పెళ్లిలో వధూవరులు పిపిఇ కిట్లు ధరించడం మాత్రమే ఇప్పుడే చూస్తున్నాం. ఇందులో పెళ్లికూతురెవరో, పెళ్లికొడుకెవరో ఎత్తును బట్టి కొంత తెలుసుకోవచ్చు కానీ, మిగిలిన అతిథులలో ఎవరు ఎవరో ఎవరికీ తెలియదు. పురోహితుడంటే ప్రత్యేకంగా తెల్లసూటేసుకున్నాళ్లెండి. విషయమేమంటే.. రాజస్థాన్లోని బరాన్ జిల్లాలో ఛతర్గంజ్ గ్రామానికి చెందిన వధువుకు దంతా గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడితో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి కొన్ని రోజుల ముందు వధువు తల్లి అనారోగ్యానికి గురైంది. ఆమె కోవిడ్–19 పరీక్ష చేయించుకుంది. పాజిటివ్ అని వచ్చింది. ఆ తరువాత వధువు కూడా పరీక్ష చేయించుకుంది. పెళ్లి జరిగే రోజున వధువుకు కరోనా పాజిటివ్ అని రిజల్ట్ వచ్చింది. దీంతో వాయిదా వేయలేక అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపించాలనుకున్నారు పెద్దలు. అందుకు పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు. అయితే, ఈ పెళ్లిలో వధువు, వరుడు, వారి తల్లిదండ్రులు, పురోహితుడితోపాటు మొత్తం 7 గురు పిపిఇ కిట్లు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ పెళ్లి తంతు ముగించారు. పిపిఇ కిట్లతో వివాహం జరుపుకున్న జంటగా ఈ రాజస్థానీ వధూవరులు వార్తల్లో నిలిచారు. ఈ వివాహ వేడుక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అయ్యింది. -
5 రోజుల్లో 1,500 పడకల ఆస్పత్రి
బీజింగ్: బీజింగ్ దక్షిణ ప్రాంతంలో కరోనా కేసులు తిరిగి నమోదవుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం కేవలం 5 రోజుల్లోనే 1,500 పడకలుగల ఆస్పత్రిని శనివారానికి నిర్మించిందని జిన్హువా న్యూస్ ఏజన్సీ వెల్లడించింది. హెబెయ్ ప్రావిన్సుల్లో మొత్తం ఆరు ఆస్పత్రులను నిర్మించేందుకు సిద్ధం కాగా అందులో ఇది మొదటిది. మొత్తం 6,500 పడకలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 130 కొత్త కేసులు రాగా, వాటిలో 90 కేసులు హెబెయ్ ప్రావిన్సులోనే వచ్చాయి. గత శుక్రవారం నాటికి షిజాఝంనంగ్ నగరంలో కోటి కరోనా వైరస్ టెస్టులు చేసినట్లు అక్కడి మీడియా తెలిపింది. -
క్వారంటైన్కు 47 మంది టెన్నిస్ ప్లేయర్లు
మెల్బోర్న్: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్స్లామ్ టోర్నీని కరోనా వదిలేలా కనిపించడం లేదు. సీజన్ తొలి గ్రాండ్స్లామ్ కోసం మెల్బోర్న్కు ప్రత్యేక విమానంలో వచ్చిన ముగ్గురికి తాజాగా పాజిటివ్గా తేలడంతో నిర్వాహకులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారితో ప్రయాణించిన మొత్తం 47 మంది ప్లేయర్లను 14 రోజుల పాటు కఠిన క్వారంటైన్కు తరలించారు. క్వారంటైన్ సమయంలో ఆటగాళ్లంతా హోటల్ గదులకే పరిమితం కావాల్సిందిగా ఆదేశించారు. శనివారం లాస్ ఏంజెలిస్ నుంచి వచ్చిన విమానంలో ఇద్దరు, అబుదాబి ఫ్లయిట్లో ఒక్కరు పాజిటివ్గా తేలినట్లు ఆరోగ్య అధికారులతో పాటు, టెన్నిస్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ రెండు విమానాల్లోని ఆటగాళ్లెవరూ వైరస్ బారిన పడకపోవడం ఊరటనిచ్చే అంశం. ఫిబ్రవరి 8 నుంచి జరిగే ఈ టోర్నీ కోసం నిర్వాహకులు 15 ప్రత్యేక విమానాల ద్వారా విదేశీ ఆటగాళ్లను, సహాయక సిబ్బందిని మెల్బోర్న్కు తీసుకొస్తున్నారు. -
చెన్నై లగ్జరీ హోటల్.. కోవిడ్ హాట్స్పాట్
చెన్నై: చెన్నై నగరం గిండీలో ఉన్న లగ్జరీ హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళ కోవిడ్ హాట్స్పాట్గా మారింది. ఈ హోటల్ సిబ్బందిలో 85 మందికి కోవిడ్ పాజిటివ్గా తేలడం కలకలం రేపుతోంది. గురు, శుక్రవారాల్లో హోటల్లో సేకరించిన 609 శాంపిళ్లకు గాను 85 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. వీరిని ఇళ్లకు పంపించి చికిత్స అందజేస్తున్నామన్నారు. ఈ పరిణామంతో ఉలిక్కి పడ్డ మునిసిపల్ అధికారులు నగరంలోని 25 లగ్జరీ హోటళ్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడంతోపాటు వాటి సిబ్బంది, అతిథులందరికీ పరీక్షలు చేపట్టారు. గ్రాండ్ చోళ చెఫ్ ఒకరికి డిసెంబర్ 15వ తేదీన మొదటిసారిగా కోవిడ్గా తేలింది. ఈ హోటల్కు సమీపంలోనే ఉన్న మద్రాస్ ఐఐటీకి చెందిన 200 మంది విద్యార్థులు ఇటీవల కరోనా బారినపడ్డారు. -
మంత్రి పువ్వాడ అజయ్కు కరోనా..
సాక్షి, హైదరాబాద్: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మంగళవారం ట్విటర్లో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఆయనను కలిసిన వారు ఐసోలేషన్కు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం అయన ఆరోగ్యం బాగానే ఉందని స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నట్లు మంత్రి ట్వీటర్లో పేర్కొన్నారు. కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు 2,78,599 సంఖ్యకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 2,69,828 మంది డిశ్చార్జ్ కాగా.. 1,499 మంది మృతి చెందారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 7,272 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ తాజా నివేధికలో వెల్లడించింది. -
ఫార్ములా వన్ చాంపియన్ హామిల్టన్కు కరోనా
మనమ: కరోనా వైరస్ సామాన్యుల నుంచి సెలబ్రిలను సైతం వదలడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది దేశాధినేతలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు, బడా వ్యాపావేత్తలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఆదివారం బహ్రెయిన్లో జరిగిన 11వ గ్రాండ్ ప్రిని సొంతం చేసుకున్న హామిల్టన్కు కరోనా సోకడంతో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆయనలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హామిల్టన్ ఆరోగ్యం బాగానే ఉందని మెర్సిడెజ్ ఏఎంసీ పెట్రొనాస్ టీం తెలిపింది. అయితే త్వరలో జరిగే సాఖిర్ గ్రాండ్ ప్రికి హామిల్టన్ దూరమవుతున్నట్లు టీమ్ వెల్లడించింది. కాగా 7 సార్లు ఫార్ములా వన్ చాంపియన్గా నిలిచిన హామిల్టన్ రేసింగ్లో చరిత్ర సృష్టించాడు. అయితే ఆయనకు గత వారంలో మూడు సార్లు పరీక్షలు నిర్వహించగా ప్రతిసారి నెగెటివ్ వచ్చింది. ఈ తరుణంలో ఆదివారం కూడా ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనా పాజిటివ్గా తెలింది. దీంతో హామిల్టన్ ప్రస్తుతం బహ్రెయిన్లోనే ఐసొలేషన్లో ఉన్నాడు. కాగా ఆయనలో స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని, ఎలాంటి ఇబ్బంది లేదని టీమ్ సభ్యులు తెలిపారు. -
మణిపూర్ సీఎం బిరెన్ సింగ్కు కరోనా
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బిరెన్ సింగ్కు కరోనా వైరస్ పాజిటివ్గా తెలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్బుక్లో ఆదివారం ప్రకటించారు. దీంతో ఇటీవల కాలంలో ఆయనను కలిసిన వారు ఐసోలేషన్కు వెళ్లాలని సూచించారు. ‘ఫ్రెండ్స్ నాకు కరోనా పాజిటివ్గా తెలింది. కొన్ని రోజులుగా నేను కరోనా లక్షణాలతో బాధపడుతున్న. ఈ నేపథ్యంలో ఆదివారం కోవిడ్ పరీక్షలు చేసుకోగా పాజిటివ్ వచ్చింది. కావున ఇటీవల నన్ను కలిసి వారంతా కోవిడ్ పరీక్షలు చేసుకోవాలని, క్వారంటైన్లో ఉండాలని విజ్ఞప్తి’ అంటూ సీఎం తన పోస్ట్లో రాసుకొచ్చారు. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఆరు కరోనా మృతి కేసులు నమోదు కాగా మరణాల సంఖ్య 213కు చేరుకున్నట్లు ఆరోగ్య శాఖ తాజా హల్త్ బులెటిన్లో వెల్లడించింది. (చదవండి: ప్రముఖ నటుడు కన్నుమూత) -
చిరంజీవి కోసం లారెన్స్ ప్రత్యేక పూజ
చెన్నై: కరోనా బారిన పడిన మెగాస్టార్ చిరంజీవి త్వరగా కోలుకోవాలని అభిమానులు గుళ్లో పూజలు చేస్తున్నారు. అదే విధంగా సినీ ప్రముఖులు సైతం ఆయన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ కూడా చిరంజీవి మహమ్మారి నుంచి త్వరగా బయటపడాలని ఆకాంక్షిస్తూ గురువారం ట్వీట్ చేశారు. ఇందుకోసం తన ఇష్టదైవమైన రాఘవేంద్ర స్వామిని వేడుకుంటున్న ఫొటోను ట్విటర్లో పోస్టు చేస్తూ.. ‘అందరికి శుభ గురువారం.. ఈ రోజు మా గుడిలో ప్రత్యేక పూజ జరిగింది. చిరంజీవి అన్నయ త్వరలో కరోనాను జయించాలని రాఘవేంద్ర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజ నిర్వహించాను. ఆయన తొందరగా మహమ్మారి నుంచి పూర్తి ఆరోగ్యంతో బయటపడాలని స్వామిని గట్టిగా వేడుకున్నా’ అంటూ చేతులు జోడించిన మూడు ఎమోజీను జత చేశారు. అయితే తమిళనాడులోని తిరువళ్లే ప్రాంతంలో ఆయన సొంత ఖర్చులతో రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. (చదవండి: టైటిల్లో మార్పులు.. కొత్త పోస్టర్ విడుదల) Happy Thursday everyone! Today a special pooja is happening at my temple for Chiranjeevi annaiya to recover soon from covid. I pray ragavendra swamy for his speed recovery 🙏🏼🙏🏼 @KChiruTweets pic.twitter.com/EFaoxhJjct — Raghava Lawrence (@offl_Lawrence) November 12, 2020 ప్రస్తుతం రాఘవ లారెన్స్ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెలుగు ‘కాంచన’ మూవీని హిందీలో ‘లక్ష్మిబాంబ్’ పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫాం నవంబర్ 7 విడుదలై విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. కాగా లాక్డౌన్ అనంతరం తిరిగి షూటింగ్లు ప్రారంభం కావడంతో చిరంజీవి తన తాజా చిత్రం ‘ఆచార్య’ షూటింగ్లో తిరిగి పాల్గొనేందుకు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఈ పరీక్షలో తనకు కోవిడ్ పాజిటివ్ తెలిందని, ప్రస్తుతం తను హోంక్వారంటైన్లో ఉన్నానని వెల్లడిస్తూ గతవారం ట్వీట్ చేసిన విషయం తెలిసందే. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేకపోయిన కరోనా పాజిటివ్ వచ్చిందని, ఇటీవల కాలంలో ఆయనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలిందిగా చిరంజీవి సూచించారు. (చదవండి: పాజిటివ్... కానీ లక్షణాలు లేవు) -
క్వారంటైన్లో డబ్ల్యూహెచ్వో చీఫ్
జెనీవా: కరోనా సోకిన వ్యక్తిని కలిసిన కారణంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియేసస్ డబ్ల్యూహెచ్వో నిబంధనల ప్రకారం తాను క్వారంటైన్లో ఉంటున్నట్టు ట్విట్టర్లో వెల్లడించారు. అయితే తనకు ఎటువంటి లక్షణాలు లేవని టెడ్రోస్ తెలిపారు. టెడ్రోస్ కలిసిన కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎవరో ఆయన వెల్లడించలేదు. ఐక్యరాజ్యసమితికి చెందిన డబ్ల్యూహెచ్వో జెనీవా కేంద్రంగా పనిచేస్తోంది. ఐదు లక్షల జనాభా గలిగిన జెనీవాలో రోజుకి 1000 కొత్త కరోనా కేసులు నమోదౌతున్నాయి. జెనీవాలో కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ఆదివారం కఠిన ఆంక్షలు విధించారు. ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కోవిడ్ని కట్టడి చేసే కర్తవ్యనిర్వహణలో టెడ్రోస్ ముందుభాగాన ఉండి పోరాడుతున్నారు. రానున్న రోజుల్లో డబ్ల్యూహెచ్వో నియమాల ప్రకారం ఇంటి నుంచే పనిచేస్తానని టెడ్రోస్ వెల్లడించారు. కోవిడ్ని దాచిన బ్రిటన్ యువరాజు బ్రిటన్ యువరాజు విలియమ్స్కు ఏప్రిల్లో కరోనా సోకినప్పటికీ దాన్ని రహస్యంగా ఉంచారని, అప్పటికే ఆయన తండ్రి ప్రిన్స్ చార్లెస్ కోవిడ్తో క్వారంటైన్లో ఉన్నారని, అందుకే సన్నిహితులెవ్వరూ బాధపడకూడదని ఎవ్వరికీ చెప్పలేదన్న విషయాన్ని బ్రిటన్ మీడియా బయటపెట్టింది. బ్రిటిష్ సింహాసనాన్ని అధిష్టించే వరుసలో రెండో స్థానంలో ఉన్న ప్రిన్స్ విలియమ్స్కి కోవిడ్ సోకడంతో ప్రభుత్వ నియమాలను అనుసరించి, ప్యాలెస్లోని వైద్యులు తూర్పు ఇంగ్లాండ్లోని నార్ఫోల్క్లోని సొంత ఇంటిలో క్వారంటైన్లో ఉంచి వైద్యం అందించినట్లు మీడియా పేర్కొంది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఏప్రిల్లో దాదాపు 14 టెలిఫోన్ కాల్స్, వీడియో కాల్స్ని యువరాజు మాట్లాడారని, బర్టన్లోని క్వీన్స్ ఆసుపత్రికి చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ వర్కర్స్తో మాట్లాడారని ఆ కథనం పేర్కొంది. యువరాజు కరోనా వైరస్తో తీవ్రంగా ప్రభావితం అయ్యారని లండన్లోని ఇంటికే పరిమితమయ్యారని ఆ కథనం పేర్కొంది. భారత్లో కొత్త కేసులు 45 వేలు దేశంలో గత 24 గంటల్లో 45,231 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82,29,313కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 496 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,22,607కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 75,44,798కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 5,61,908 గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 6.83 శాతం ఉన్నాయి. కరోనా రోగుల రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 91.68 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల శాతం 1.49గా ఉంది. గత 24 గంటల్లో సంభవించిన కరోనా మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 113 మంది మరణించారు. ఈ నెల 1 వరకూ 11,07,43,103 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఆదివారం మరో 8,55,800 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది. -
రొనాల్డో మళ్లీ ‘పాజిటివ్’
ట్యూరిన్ (ఇటలీ): మేటి ఫుట్బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డోను కరోనా వదలడం లేదు. అతనికి మూడోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ కోవిడ్–19 పాజిటివ్గా తేలాడు. చాంపియన్స్ లీగ్లో యువెంటస్ (ఇటలీ) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఈ పోర్చుగల్ స్టార్ ఫార్వర్డ్కు మంగళవారం సాయంత్రం పరీక్షలు నిర్వహించగా అతనిలో ఇంకా వైరస్ లక్షణాలు ఉన్నాయని తేలింది. దాంతో బుధవారం రాత్రి చాంపియన్స్ లీగ్ గ్రూప్ ‘జి’లో భాగంగా స్టార్ ప్లేయర్ లయెనల్ మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తోన్న బార్సిలోనా క్లబ్ జట్టుతో జరిగిన మ్యాచ్కు రొనాల్డో దూరమయ్యాడు. రెండు వారాల క్రితం వైరస్ బారిన పడిన రొనాల్డో ప్రస్తుతం ఇటలీలో ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు. చదవండి: ‘కరోనా వైరస్’ ఓ పెద్ద మోసం: రొనాల్డో సోదరి -
భారత క్రికెట్ జట్టుకు కరోనా సెగ!
ముంబై: భారత క్రికెట్ జట్టుకు తాజాగా కరోనా సెగ తగిలింది. ఆటగాడికి కాకపోయినా... సహాయ సిబ్బందిలో ఒకరికి కోవిడ్–19 పాజిటివ్ వచ్చింది. ఇదివరకు ఐపీఎల్లో కరోనా కేసులున్నాయి. కానీ టీమిండియా, సిబ్బందికి సంబంధించి మాత్రం ఇదే తొలి మహమ్మారి కేసు. దీంతో కరోనా బాధితుడు రవిశాస్త్రి బృందంతో పాటు దుబాయ్కి వెళ్లలేదు. ఆదివారం అక్కడికి బయలుదేరాల్సి ఉన్నప్పటికీ కోవిడ్–19 సోకడంతో ‘అతడు’ 14 రోజుల క్వారంటైన్కు పరిమితమయ్యాడు. చికిత్స, రెండు వారాల ఐసోలేషన్ ముగిశాక నెగెటివ్ రిపోర్టు వస్తేనే అతడిని దుబాయ్ విమానం ఎక్కిస్తారు. (చదవండి: నీ రీఎంట్రీకి ఇది చాలు: రవిశాస్త్రి) దుబాయ్లో రవిశాస్త్రి... ఆసీస్ పర్యటన కోసం భారత జట్టు ఐపీఎల్ ముగిసిన వెంటనే అక్కడి నుంచే ఆస్ట్రేలియాకు పయనమవుతుంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, మేనేజర్ గిరీశ్ డోంగ్రేలతో పాటు టెస్టు స్పెషలిస్టులు హనుమ విహారి, చతేశ్వర్ పుజారా ఆదివారం దుబాయ్ చేరుకున్నారు. తాజాగా వీరికి కోవిడ్ పరీక్షలు, ఫలితాల ప్రక్రియ పూర్తవడంతో బయో బబుల్లోకి తీసుకున్నారు. పుజారా, విహారిలకు దుబాయ్లో ఉన్న ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ చేసే అవకాశం కల్పిస్తారు. కొందరు ఆటగాళ్లు సుదీర్ఘ పర్యటన కోసం తమ భార్యలను వెంటతీసుకు వెళ్లేందుకు బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రెండు నెలలుగా కుటుంబసభ్యులకు దూరంగా ఉండటంతో వారిని దుబాయ్కి రావాల్సిందిగా పలువు రు ఆటగాళ్లు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. (చదవండి: భారత టెస్టు స్పెషలిస్ట్లు దుబాయ్కి) -
కరోనా పాజిటివ్: క్షీణించిన నటుడి ఆరోగ్యం
కోల్కతా: ఇటీవల కరోనా బారిన పడిన ప్రముఖ బెంగాలీ నటుడు, దాదా సాహెబ్ ఫాల్కే విజేత సౌమిత్రా ఛటర్జీని(85) కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించారు. నిన్న(శుక్రవారం) ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను వైద్యులు వెంటిలేటర్పై ఉంచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతి క్షణం వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నట్లు కూడా చెప్పారు. అయితే గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కోవిడ్ పరీక్షలు చేయించాల్సిందిగా వైద్యులు సూచించారు. కోవిడ్ పరీక్షలు చేయించగా ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు అక్టోబర్ 6న డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు కోల్కతాలోని బెల్లెవ్ నర్సింగ్ హోంకు తరలించారు. (చదవండి: కరోనాతో చనిపోతే లోక్సభను మూసేయాలా?) ఇటీవల కేంద్రం షూటింగ్లకు అనుమతివ్వడంతో ఆయన దర్శకత్తం వహిస్తున్న అభియాన్ షూటింగ్ను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కరోనా బారిన ఉంటారని కుటుంబ సభ్యులు అభిప్రాయ పడుతున్నారు. అయితే సౌమిత్రా ఆస్కార్ విజేతలైన సత్యజిత్ రే, ఫెలుడాల రచనలలో కూడా ఒక భాగంగా ఉన్నారు. వారి రచనలైన ది వరల్డ ఆఫ్ అపు, సంఘర్ష్లు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అంతేగా ఆయన రాసిన ‘అషాని సంకేట్, ఘరే బైర్, అరణ్య దిన్ రాత్రి, చారులత, షాఖా ప్రోశాఖా, జిందర్ బండి, సాత్ పాక్ బంధతో పాటు మరిన్ని రచనలు ఉత్తమంగా నిలిచాయి. (చదవండి: పిల్లల్లోనూ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్) -
ట్రంప్ దంపతులు కోలుకోవాలని ప్రార్థించిన కిమ్
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మధ్య ఒకప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. అయితే కరోనా వల్ల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు కరోనా బారిన పడటంతో ఆయన త్వరగా కోలుకోవాలని కిమ్ ప్రార్థించినట్లు ఉత్తర కొరియా మీడియా శనివారం ప్రకటించింది. ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయిన విషయం తెలిసిందే. (చదవండి: త్వరగా కోలుకోండి మిత్రమా : మోదీ) దీంతో వారి ఆరోగ్యంపై కిమ్ స్పందిస్తూ.. ట్రంప్ దంపతులు త్వరగా మహమ్మారి నుంచి కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆశిస్తున్నట్లు ఉత్తర కొరియా మీడియా పేర్కొంది. అయితే ఈ రెండు దేశాల అధ్యక్షులు ఒకప్పుడు ఉప్పు, నిప్పులా ఉండేవారు. ఇటీవల వీరిద్దరూ కలిసి సింగపూర్లోని ఓ సమావేశానికి హాజరైన విషయం తెలిసిందే. అయితే సమావేశంలో చర్చలు విఫలమైనప్పటికీ.. వీరి మధ్య మాత్రం మైత్రి బలపడింది. అందుకే గతంలో కిమ్ ఆరోగ్యంపై ట్రంప్ ట్వీట్ చేయగా.. ఇవాళ ట్రంప్ ఆరోగ్యంపై కిమ్ స్పందించారు. (చదవండి: కరోనా బారిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు) -
ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో బయటపడుతున్న కొత్త కరోనా కేసుల సంఖ్య కోలుకుంటున్న వారి కంటే తగ్గుతూ వస్తోంది. మరోవైపు దేశంలో పదేళ్లు దాటిన వారిలో ఆగస్టు నాటికి ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా సోకినట్లు అంచనా వేస్తున్నామని ఐసీఎంఆర్ చేసిన సెకండ్ సీరో సర్వే తెలిపింది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు మంగళవారం విడుదలయ్యాయి. నగర మురికి వాడల్లో 15.6 శాతం కరోనా సోకగా, మురికివాడలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో 8.3 శాతం సోకినట్లు సర్వేలో తేలిందన్నారు. ఈ సర్వేను 21 రాష్ట్రాలకు చెందిన 700 గ్రామాల్లో జరిపినట్లు నిర్వాహకులు తెలిపారు. భారత్ లో ప్రతి మిలియన్ మందిలో 4,453 మందికి కరోనా సోకగా, 70 మరణాలు సంభవించాయని, ప్రపంచంతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని చెప్పారు. ఇదెలా ఉండగా, దేశంలో మంగళవారం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్త కేసులకంటే రికవరీలు ఎక్కువగా నమోదయ్యాయి. కొత్తగా 70,589 కేసులు నమోదు కాగా, 84,877 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 61,45,291 కి చేరుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 51,01,397 కు చేరుకుంది. గత రెండు వారాల్లోనే 11 లక్షలకు పైగా రికవరీలు అయినట్లు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 776మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 96,318కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,47,576 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 15.42 శాతం ఉన్నాయి. యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీలు 5.38 రెట్లు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమక్రమంగా 83.01 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. జగన్నాథుని ఆలయంలో 404 మందికి .. ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న 351 మంది అర్చకులకు, 53 మంది ఉద్యోగులకు కరోనా సోకిందని ఆలయ అధికారులు తెలిపారు. దేవాలయంలోని అర్చనలు ఒకదాని తర్వాత ఒకటి జరగాల్సి ఉంటుందని, ఏ ఒక్కటి జరగకపోయినా తర్వాత జరగాల్సినవి ఆగిపోతాయని చెప్పారు. ఈ క్రమంలో అర్చకులు ఒకరి తర్వాత ఒకరు ఉదయం నుంచి రాత్రి వరకు పని చేయడంతో కరోనా ఎక్కువగా ప్రబలినట్లు చెప్పారు. ఉపరాష్ట్రపతికి కరోనా పాజిటివ్ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మంగళవారం ఉదయం సాధారణ పరీక్షల్లో భాగంగా కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా వచ్చిందని ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. అయితే ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపింది. వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్లో ఉంటున్నట్టు తెలిపింది. ఉపరాష్ట్రపతి సతీమణి ఉషా నాయుడికి మాత్రం కోవిడ్ నెగెటివ్గా తేలింది. ఆమె సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటున్నట్టు ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. -
అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండుకు కరోనా
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు కరోనా వైరస్ బారిన పడ్డారు. తనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు ఆయన మంగళవారం ట్వీటర్లో ప్రకటించారు. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్న ఆయన తన ట్వీట్లో తనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని.. పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపారు. అయినప్పటికీ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. దీంతో మహమ్మారి పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ప్రజలకు సూచించారు. ప్రస్తుతం తాను ఎస్ఓపీ నిబంధనల మేరకు క్వారంటైన్లో ఉన్నానట్లు చెప్పారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్లో కరోనా యాక్టివ్ కేసులు సంఖ్య 1756 ఉండగా.. 4531 మంది పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జీ అయ్యారు. కరోనా కారణంగా 11 మంది మృత్యువాత పడ్డారు. (చదవండి: ఢిల్లీలో కొత్తగా 4,263 పాజిటివ్ కేసులు) I had undergone Covid test RT-PCR and have tested positive for Covid19. I am asymptomatic and feeling healthy. However as per SOP and safety of others, I am self isolating myself and request everyone who came in contact with me to adhere to the SOP. — Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) September 15, 2020 -
మలైకాకు కరోనా పాజిటివ్: సోదరి అసహనం!
సాక్షి, ముంబై: బాలీవుడ్ లవ్ బర్డ్స్ మలైకా ఆరోరా, అర్జున్ కపూర్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వారే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలో మలైకా కరోనా పరీక్షలకు సంబంధించిన మెడికల్ రిపోర్టు ఫేస్బుక్తో పాటు పలు సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో మలైకా సోదరి, నటీ అమ్రితా ఆరోరా దీనిపై అసహనం వ్యక్తం చేశారు. తన సోదరి మెడికల్ రిపోర్టును సోషల్ మీడియాలో షేర్ చేయాల్సిన అవసరం ఏముందని మండిపడ్డారు. దీనివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. అలాగే తనకు కరోనా సోకడం సబబేనంటూ పలువురు వ్యాఖ్యనించడం దారుణమన్నారు. (చదవండి: అర్జున్ కపూర్కు, మలైకా అరోరాకు కరోనా) ఇలాంటి సమయంలో తనకు సపోర్టుగా ఉంటూ కోలుకునేలా మద్దతుగా నిలవల్సింది పోయి.. విమర్శలు చేయడం దారుణమని పేర్కొన్నారు. తన మెడికల్ రిపోర్టును షేర్ చేస్తూ మలైకాను కించపరచడం సరికాదని, ఇలాంటి సమయంలో ఇలా చేయడమేంటని అసలు మనుషులకు ఏమైందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మహమ్మారి నుంచి కోలుకునేందుకు మలైక తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని, ఇందుకు తనని తాను తాను సిద్దం చేసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా తను కరోనా బారిన పడ్డానని, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని మలైకా ప్రకటించారు. ప్రస్తుతం తను ఐసోలేషన్కు వెళ్లానని, గత కొద్దిరోజులకు తనను కలిసిన వారు హోం క్వారంటైన్లో ఉండాలని, కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా మలైకా విజ్ఞప్తి చేశారు. -
1579కు చేరిన కరోనా కేసులు
సాక్షి, మెదక్: జిల్లాలో మరో 81 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 1579కు చేరింది. ప్రజలు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని పేర్కొన్నారు. చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఇక ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. తరచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకుంటే కరోనా బారినపడరని పేర్కొన్నారు. -
దారుణం: భార్యకు కరోనా.. గుండెపోటుతో భర్త మృతి
సాక్షి, మల్లాపూర్(కోరుట్ల): కరోనా విజృంభణ మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తోంది.. వైరస్ సోకిన వారికి అండగా నిలిచి, మనోధైర్యం నింపాల్సిన బంధువులు, మిత్రులు, స్థానికులు భయపడుతూ దగ్గరకు రావడం లేదు.. దీంతో కొంతమంది మానసిక వేదనతో కృంగిపోతూ బలవన్మరణానికి పాల్పడుతున్నారు. మరికొందరు సమాజం నుంచి వెలివేయబడ్డామనే ఆందోళనతో మనోధైర్యాన్ని కోల్పోతున్నారు.. పలువురు అదే పనిగా ఆలోచిస్తూ గుండెపోటుతో చనిపోతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు మేమున్నాం.. అంటూ ముందుకు వస్తూ మాయమవుతున్న మానవత్వానికి పునర్జీవం పోస్తున్నారు.. ఇందుకు మల్లాపూర్ మండలంలోని రాఘవపేటలో జరిగిన ఘటనే సాక్ష్యం. స్థానికుల కథనం ప్రకారం.. రాఘవపేటకు చెందిన బెజ్జారపు పరమానందం(55)కు ఇద్దరు భార్యలు. రెండో భార్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. తన ఇల్లాలికి వైరస్ రావడంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం గుండెపోటుతో మృతిచెందాడు. పరమానందం అంత్యక్రియలు చేయడానికి బంధువులు, చుట్టుపక్కలవారు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయన భార్య తల్లడిల్లింది. సర్పంచ్ నత్తి లావణ్య, ఉపసర్పంచ్ ఎండీ.అమీనొద్దీన్, తహసీల్దార్ రమేష్లు ఈ విషయాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన కోరుట్లకు చెందిన ఆల్ ఇండియా మానవత్వ సందేశ సమితి సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంస్థ సభ్యులు నజీర్ అలీ, ఇసాక్ అబ్దుల్లా, సుష్యాల్, హఫీజ్, అబ్దుల్ రబ్లు ప్రత్యేక అంబులెన్స్లో రాఘవపేటకు చేరుకున్నారు. పీపీ కిట్లు ధరించి, పరమానందం మృతదేహాన్ని గ్రామ శివారులోని శ్మశానవాటికకు తీసుకెళ్లి, అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వాన్ని చాటుకున్న ఆ సమితి సభ్యులకు బాధిత కుటుంబ సభ్యులు, ఆ గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా మృతుడికి ఒక కుమారుడు ఉన్నాడు. -
కరోనా సోకిందని తల్లిని గెంటేసిన కూతురు
చంటి పిల్లలు తప్పటడుగులు వేస్తూ కిందపడిపోతే తల్లిదండ్రుల మనసు ఎంత తల్లడిల్లిపోతుందో అందరికీ తెలిసిందే.. అలాంటిది జన్మనిచ్చిన వారిని అవసాన దశలో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నపేగులు కాఠిన్యం ప్రదర్శించాయి. కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియగానే కూతురు ఓ తల్లిని ఇంటినుంచి గెంటేయగా.. కుమారులు కొన్నేళ్లుగా ఆమె ఆలనా పాలననే విస్మరించారు. ఈ దారుణ ఘటన త్రిపురారం మండల కేంద్రంలో శుక్రవారం వెలుగుచూసింది. సాక్షి, త్రిపురారం (నాగార్జునసాగర్): మండల కేంద్రంలోని బాబు సాయిపేట రోడ్డులో నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కులవృత్తి చేసుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేసి వివాహాలు జరిపించారు. ఓ కుమారుడు, కూతురు అక్కడే ఉంటుండగా మరో కుమారుడు బతుకుదెరువు నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వలస వెళ్లాడు. కాగా, కొన్నేళ్ల క్రితం ఆమె భర్త మృతిచెందాడు. అప్పటినుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఉన్న ఆస్తిపాస్తులు పంచుకుని తల్లి ఆలనా పాలనను కుమారులు విస్మరించారు. దీంతో ఆ వృద్ధురాలు కొన్నేళ్లుగా మండల కేంద్రంలోనే ఉంటున్న కుమార్తె వద్ద ఆశ్రయం పొందుతోంది. వైరస్ సోకిందని... కొద్ది రోజులుగా సదరు వృద్ధురాలు స్వల్ప అస్వస్థతకు గురైంది. దీంతో సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడంతో గురువారం సాయంత్రం పాజిటివ్ అని తేలింది. ఆ విషయం తెలుసుకున్న కుమార్తె తల్లిని ఇంట్లోకి రానివ్వకుండా చెట్టు కొమ్మలు అడ్డు వేసుకుంది. దీంతో రాత్రంతా చలికి వణుకుతూ.. ఆకలికి అలమటిస్తూ ఆ.. అభాగ్యురాలు చెట్టుకిందే గడిపింది. సర్పంచ్ చొరవ తీసుకుని.. వృద్ధురాలి దీనస్థితిని శుక్రవారం ఉదయం స్థానికులు సర్పంచ్ శ్రీనివాసరెడ్డికి వివరించారు. వెంటనే స్పందించిన ఆయన వృద్ధురాలిని ఇంట్లోకి రానివ్వాలని నచ్చచెప్పినా కుమార్తె ఒప్పుకోలేదు. అటు ఆమె కుమారులను సంప్రదించినా ససేమిరా అన్నారు. దీంతో సర్పంచ్ చొరవ తీసుకుని ఆ వృద్ధురాలికి కుమార్తె ఇంటి సమీపంలోనే తాత్కాలిక ఆశ్రయం కల్పించి కడుపు నింపి భరోసా కల్పించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సరైన వైద్యసేవలతో పాటు న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. -
కరోనా పరీక్షల్లో ఏపీదే మొదటి స్థానం
సాక్షి, విజయవాడ: కరోనా పరీక్షల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉంది. రాష్ట్ర జనాభాలో ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 5.65 శాతం మందికి కరోనా పరీక్షలు చేసింది. ఒక మిలియన్ జనాభాకు 56, 541 టెస్టులతో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటికి వరకు మొత్తం 30,19, 296 టేస్టులు జరిగినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో 57,685 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 9,742 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16003కు చేరింది. తాజాగా వైరస్ నుంచి 8,061 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా, 86 మంది మృత్యువాత పడ్డారు. AP is the only state among all the major states to have tested 5.65% of the total population for #COVID19. With 56,541 tests/million AP continues to stay top in testing among all the states. #APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/TLHwbK27F4 — ArogyaAndhra (@ArogyaAndhra) August 19, 2020 -
బాక్సర్ సరిత దేవికి కరోనా పాజిటివ్
సాక్షి, ఇంఫాల్: ప్రముఖ ఇండియన్ బాక్సర్ లైశ్రమ్ సరితా దేవి, ఆమె భర్త కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోమవారం ప్రకటించారు. గత మూడు రోజులుగా తను జ్వరం, కండరాల నొప్పితో బాధపడ్డారని, దీంతో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పారు. కోవిడ్ పరీక్ష ఫలితాల్లో తనకు పాజిటివ్గా తెలిందని తెలిపారు. దీంతో తన భర్త, కుమారుడు సైతం కరోనా పరీక్షలు చేయించుకోగా తన భర్తకు పాజిటివ్ రాగా.. తన కుమరుడి నెగిటివ్ వచ్చినట్లు సరిత తెలిపారు. (చదవండి: ఒకే రోజు కోలుకున్న 7,866 మంది) దేశంలో రోజు రోజు కరోనా వైరస్ మరింత విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 57,982 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 26 లక్షలు దాటింది. తాజాగా 941 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 50,921కి చేరింది. నేడు నమోదైన కరోనా పాజిటివ్ కేసులతో కలిసి మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 26,47,664 కు చేరుకుంది. ప్రస్తుతం 6,76,900 మంది వైరస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 19,19,843 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 7 లక్షల 30 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతో.. మొత్తం పరీక్షల సంఖ్య మూడు కోట్లు దాటింది. (చదవండి: ప్రతి 3 నిమిషాలకు ఓ ఇద్దరు..) -
లక్షణాలు లేకుండానే కేంద్ర మంత్రికి కరోనా
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులను సైతం ఈ మహమ్మారి వెంటాడుతోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షాతో పాటు మరో నలుగురు మంత్రులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా వారి జాబితాలో కేంద్ర మంత్రి యశోనాయక్ శ్రీపాద కూడా చేరారు. ఈ రోజు చేయించుకున్న కరోనా పరీక్షలో తనకు పాజిటివ్ వచ్చినట్లు ఆయనే స్వయంగా ఇవాళ(బుధవారం) వెల్లడించారు. (చదవండి: ప్రముఖులపై కరోనా పంజా) ‘ఈరోజు నేను కోవిడ్ పరీక్షలు చేయించుకున్నాను. నాలో ఎటువంటి కరోనా లక్షణాలు కనబడనప్పటికి పాజిటివ్ వచ్చింది. అయినా నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. డాక్టర్ల సలహా మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నాను’ అంటూ ట్వీట్ చేశారు. అయితే వైద్యులు పాజిటివ్గా నిర్థారించడంతో ఇటీవల కాలంలో తనను కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని మంత్రి ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి: ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం) I underwent Covid-19 test today & it has turned out assymptomaically positive. My vitals are within normal limits and I have opted for home isolation. Those who have came in contact with me in last few days are advised to get tested for themselves and take required precautions. — Shripad Y. Naik (@shripadynaik) August 12, 2020 -
ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సోమవారం బ్రెయిన్ సర్జరీ జరిగింది. మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. అనారోగ్యానికి గురైన 84 ఏళ్ల ప్రణబ్ డాక్టర్ల సూచన మేరకు సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ‘ప్రణబ్కు బ్రెయిన్ క్లాట్ను తొలగించేందుకు శస్త్రచికిత్స జరిగింది. ఆయన పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. వెంటిలేటర్పై ఉన్నారు’అని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. కీలక అవయవాల పనితీరు నిలకడగా ఉందని, నిపుణులైన వైద్య బృందం ఆయన్ను నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపాయి. దాదాకు కరోనా పాజిటివ్ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కోవిడ్–19 బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోమవారం ఆయనే స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. గత వారంలో తనను సంప్రదించిన వారందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లడం లేదా కోవిడ్–19 పరీక్షలు చేయించుకోవడమో చేయాలని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కూడా అయిన ఆయన విజ్ఞప్తి చేశారు. 2012–17 మధ్యకాలంలో ప్రణబ్ రాష్ట్రపతిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్ఆర్ ఆస్పత్రికి వెళ్లి ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఆయన కూతురు షర్మిష్టకు ఫోన్ చేసి ప్రణబ్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, అశోక్ గహ్లోత్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర మంతి పీయూష్ గోయల్ తదితర నేతలు మాజీ రాష్ట్రపతికి త్వరగా స్వస్థత చేకూరాలని ఆకాంక్షించారు. -
కోవిడ్పై పోరులో కీలకం స్వచ్ఛభారత్: మోదీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్పై పోరులో స్వచ్ఛభారత్ కార్యక్రమం చాలా ముఖ్యమైందని ప్రధాని మోదీ అన్నారు. శనివారం ఆయన స్వచ్ఛభారత్ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్ఘాట్ వద్ద రాష్ట్రీయ సచ్ఛతా కేంద్రాన్ని ప్రారంభించి కార్యక్రమానికి హాజరైన విద్యార్థులనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఈనెల 15వ తేదీ వరకు కొనసాగే ‘వ్యర్థ విముక్త భారత్’ కార్యక్రమం ద్వారా వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత ప్రాధాన్యాన్ని చాటిచెప్పిన మహాత్మాగాంధీకి నివాళిగా రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రంను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గాంధీజీ చేపట్టిన చంపారన్ సత్యాగ్రహం కార్యక్రమం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ 2017లో ప్రకటించారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన ఆగస్టు 8వ తేదీని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో టాయిలెట్లు నిర్మించాలని, అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టాలని ఆయన జిల్లాల అధికారులను కోరారు. కరోనా వైరస్ నుంచి కాపాడుకునేందుకు భౌతిక దూరం నిబంధనలను పాటించాలనీ, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని విద్యార్థులను ప్రధాని కోరారు. తగ్గిన మరణాలు.. పెరిగిన రికవరీ న్యూఢిల్లీ: భారత్లో వరుసగా రెండో రోజూ 60 వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. శనివారం కొత్తగా 61,537 కేసులు బయటపడటంతో మొత్తం కేసుల సంఖ్య 20,88,611కు చేరుకుంది. గత 24 గంటల్లో 48,900 కోలుకోగా, 933 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 42,518కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 14,27,005కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,19,088 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 29.64గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 68.32 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 2.04%కి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 7 వరక 2,33,87,171 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శుక్రవారం మరో 5,98,778 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. కేంద్రమంత్రి మేఘ్వాల్కు పాజిటివ్ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కరోనా బారిన పడ్డారు. కోవిడ్–19 పరీక్షలో పాజిటివ్ వచ్చిందని, ఎయిమ్స్లో చేరానని ఆయన శనివారం వెల్లడించారు. తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాని కోరారు. -
ప్రముఖులపై కరోనా పంజా
న్యూఢిల్లీ/బెంగళూరు/లక్నో: కరోనా మహ మ్మారి అత్యంత ప్రముఖులను సైతం వదిలిపెట్టడం లేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తమిళనాడు గవర్నర్, కర్ణాటక సీఎం యెడియూరప్ప తాజాగా కరోనా బారినపడ్డారు. ఉత్తరప్రదేశ్ మంత్రి కరోనా వల్ల కన్నుమూశారు. అమిత్ షాకు కరోనా పాజిటివ్ తనలో కరోనా వైరస్ ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(55) ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వెల్లడించారు. అమిత్ షా ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ సుశీల్ కటారియా పర్యవేక్షిస్తున్నారు. మేదాంత ఆసుపత్రిలోకి ఇతరులు రాకుండా నిషేధం విధించారు. అమిత్ షాను ఇటీవలే తాను కలిశానని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో చెప్పారు. అతి త్వరలో కరోనా టెస్టు చేయించుకుంటానని, అప్పటిదాకా కుటుంబ సభ్యులకు దూరంగా ఐసోలేషన్లో ఉంటానని తెలిపారు. అమిత్ షాను కలిసిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆయన ఇటీవలే కేబినెట్ భేటీలో పాల్గొన్నారు. అమిత్ షా త్వరగా కోలుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, హరియాణా సీఎం ఖట్టర్ ఆకాంక్షించారు. యెడియూరప్ప కూడా.. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు కరోనా వైరస్ సోకింది. ఆదివారం ఆయనకు పరీక్షలు చేయగా, పాజిటివ్గా తేలింది. యెడియూరప్ప చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఇటీవల తనను కలిసినవారు కరో నా టెస్టు చేయించుకోవాలని, హోం ఐసో లేషన్లో ఉండాలని ఆయన సూచించారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ కూడా కరోనా బారినపడ్డారు. కరోనాతో యూపీ మంత్రి మృతి యూపీ సాంకేతిక విద్యా శాఖ మంత్రి కమల్రాణి (62)ని కరోనా పొట్టన పెట్టుకుంది. ఆమె ఆదివారం లక్నో లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశా రు. రాష్ట్రంలో కరోనా వల్ల ఒక మం త్రి మరణించడం ఇదే తొలిసారి. యూపీ కేబినెట్లో ఆమె ఏకైక మహిళ. కమల్రాణికి జూలై 18న పరీక్షలు చేయ గా, కరోనా పాజిటివ్గా తేలింది. ఆమె డయాబెటిస్, హైపర్ టెన్షన్, హైపోథైరాయిడిజమ్తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. కరోనా బారిన తమిళనాడు గవర్నర్ సాక్షి, చెన్నై: తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్కు(80) కరోనా వైరస్ సోకింది. ఆయనలో కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉండడంతో హోం ఐసోలేషన్లో ఉండాలని కావేరీ ఆసుపత్రి వైద్యులు సూచించారు. తమిళనాడు రాజ్భవన్లో ముగ్గురికి కరోనా సోకడంతో గవర్నర్ పురోహిత్ జూలై 29 నుంచి సెల్ఫ్ ఐసోలేషన్లోనే ఉంటున్నారు. ఒక వైద్య బృందం ఎప్పటికప్పుడు గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గవర్నర్లో కరోనా లక్షణాలు బయటపడలేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేశాయి. -
42 మంది కరోనా రోగులు అదృశ్యం
లక్నో: ఉత్తరప్రదేశ్లో కరోనా రోగులు అదృశ్యమైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘాజీపూర్కు చెందిన 42 మంది కరోనా బారిన పడ్డ వ్యక్తులు కనిపించకుండా పోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాంపిల్స్ ఇచ్చిన ల్యాబ్లో కూడా వారంతా తప్పుడు అడ్రస్, ఫోన్నెంబర్లు ఇచ్చినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. దీనిపై ఘాజీపూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కేకే వర్మ అదనపు జిల్లా మేజిస్ట్రేట్కు శుక్రవారం లేఖ రాశారు. ఈ కరోనా వైరస్ పాజిటివ్గా నిర్థారణ అయిన దాదాపు 42 మంది కనిపించడం లేదని పేర్కొన్నారు. వారంతా ఆసుపత్రిలో కానీ హోం ఐసొలేషన్లో కూడా లేరని లేఖలో వెల్లడించారు. (చదవండి: భారత్: 16 లక్షలు దాటిన కరోనా కేసులు) Chief Medical Officer of Ghazipur writes to Additional District Magistrate of Ghazipur regarding 42 #COVID19 patients, who were neither found to be in hospitals nor in home isolation. The letter reads 'Tracing of 42 positive patients is underway.' — ANI UP (@ANINewsUP) July 31, 2020 పరీక్షా సమయంలో వారంత తప్పుడు సమాచారం, నకిలీ మొబైల్ నెంబర్ ఇచ్చారని తెలిపారు. కనిపించకుండా పోయిన కరోనా రోగులను పట్టుకునేందుకు కష్టతరంగా ఉందని, ఇందుకోసం బృందాలను ఏర్పాటు చేసి వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని డాక్టర్ వర్మ లేఖలో వివరించారు. ఇప్పటి వరకు ఘాజీపూర్లో 505 యాక్టివ్ కేసుల నమోదు కాగా.. 10 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ల సంఖ్య 16 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 55,079 కేసులు నమోదయ్యాయి. గురువారం 779 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 16,38,871కు చేరింది. మొత్తం 35,747 మంది కరోనాతో మరణించారు. (చదవండి: కరోనా: కోలుకున్న 'బ్రేకింగ్ బ్యాడ్ స్టార్') -
అయోధ్య పూజారికి కరోనా
అయోధ్య: ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరగనున్న రామమందిర భూమిపూజకు భారీ ఏర్పాట్లు జరుగుతుండగా, పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సిన పూజారికి, పదహారు మంది భద్రతా సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కరోనా సోకిన పూజారి ప్రదీప్ దాస్, ఆలయంలో పూజలు నిర్వహించే నలుగురు ప్రధాన పూజారుల్లో ఒకరైన ఆచార్య సత్యేంద్ర దాస్ శిష్యుడు. ప్రదీప్ దాస్ని ప్రస్తుతం హోంక్వారంటైన్లో ఉంచారు. అయోధ్యలో ప్రధాని మోదీ రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు వాటర్ ప్రూఫ్ మండపాలూ, దానిలో ఒక చిన్న వేదికను ఏర్పాటు చేస్తున్నారు. న్యూయార్క్లో భారీ స్క్రీన్లపై.. భూమిపూజ ఘట్టాన్ని అమెరికాలోని ప్రవాస భారతీయులు సైతం వీక్షించనున్నారు. న్యూయార్క్లోని టైమ్ స్క్వేర్ దగ్గర శ్రీరాముడి చిత్రాలూ, అయోధ్య రామమందిరం త్రీడీ చిత్రాలను ప్రపంచంలోనే అతిపెద్ద 17వేల చదరపుటడుగుల భారీ నాస్డాక్ స్క్రీన్పై దీన్ని ప్రదర్శించనున్నట్టు అమెరికన్ ఇండియా పబ్లిక్ అఫెయిర్స్ కమిటీ అధ్యక్షుడు జగదీష్ షెహానీ వెల్లడించారు. ఇది జీవిత కాలంలో చూడలేని ఒక అద్భుతమైన కార్యక్రమం అని, ఈ చారిత్రక సందర్భంలో అమెరికాలోని భారతీయులంతా అక్కడ సమావేశమౌతారని షెహానీ అన్నారు. -
రాజమౌళి ఫ్యామిలీకి కరోనా
దర్శకులు యస్.యస్. రాజమౌళి మరియు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ట్వీటర్ ద్వారా ప్రకటించారు రాజమౌళి. ‘‘కొన్ని రోజుల క్రితం నాకు, మా కుటుంబ సభ్యులకు కొద్దిగా జ్వరం వచ్చింది. దానంతట అదే తగ్గిపోయింది కూడా. కానీ ఎందుకైనా మంచిది అని కరోనా టెస్ట్ చేయించుకున్నాం. ఈ రోజు (బుధవారం) రిజల్ట్ లో కరోనా పాజిటివ్ వచ్చింది. వైద్యుల సూచన మేరకు అందరం ఇంట్లోనే క్వారంటైన్లో ఉంటున్నాం.. ఏ లక్షణాలు లేకుండా మేమందరం బాగానే ఉన్నాం. అన్ని సూచనలు పాటిస్తున్నాం. కరోనాలో నుంచి బయటపడి ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని రాజమౌళి అన్నారు. -
చిరంజీవి సర్జా ఇంట మరో చేదు వార్త..
బెంగళూరు: చిత్ర పరిశ్రమల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకు మహమ్మారి బారిన పడుతున్న నటీనటుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఉత్తరాది, దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కన్నడ హీరో చిరంజీవి సర్జా సోదరుడు హీరో ధ్రువ సర్జా ఆయన భార్య ప్రేరణ శంకర్లు కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ధ్రువ సర్జా సోషల్ మీడియాలో వేదికగా ప్రకటించాడు. వారిలో తేలికపాటి కరోనా లక్షణాలు కనిపించడంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు బుధవారం ట్వీట్ చేశాడు. (చదవండి: ‘నువ్వు లేకుండా ఉండలేం.. వచ్చేయ్’) ‘నాకు, నా భార్యకు పాజిటివ్ వచ్చింది. మాలో తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నందున బెంగుళూరులోని ఆసుపత్రిలో చేరాలని నిర్ణయించుకున్నాం. మేము త్వరలోనే కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తామని ఆశిస్తున్నాను. అయితే గత కొద్దిరోజులుగా ఎవరైతే మమ్మల్ని కలిశారో వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అంటూ ధ్రువ ట్వీట్ చేశాడు. ఆయన సోదరుడు హీరో చిరంజీవి సర్జా జూన్ 7వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. చిరంజీవి సర్జా మరణంతో విషాదంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు ఇది మరో చేదు వార్త. (చదవండి: కరోనా: ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నిర్మాత) -
పీఎసీ డైరెక్టర్కు కరోనా.. సమావేశంలో సీఎం రమేష్
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశానికి హాజరైన పీఏసీ డైరెక్టర్కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పీఏసీ సమావేశానికి హాజరైన వారందరిని హోం క్వారంటైన్కు వెళ్లాల్సిందిగా పార్లమెంట్ మంగళవారం పిలుపు నిచ్చింది. ఈ సమావేశంలో ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు. అదే విధంగా జమ్మూ కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ హోం క్వారంటైన్కు వెళ్లారు. రెండు రోజుల క్రితం కశ్మీర్లో బీజేపీ అధ్యక్షుడిని కలిసినందున ఆయన క్వారంటైన్కు వెళ్లినట్లు ప్రకటించారు. చదవండి: ఆ దశకు భారత్ ఇంకా చేరుకోలేదు -
నటుడికి కరోనా.. నటీనటులకు కోవిడ్ పరీక్షలు
రోజురోజుకు మహమ్మారి విజృంభిస్తోంది. ఉత్తర, దక్షిణాదికి చెందిన టీవీ, చిత్ర పరిశ్రమల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ బిగ్బీ కుటుంబాన్ని కరోనా వెంటాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా బుల్లితెరపై కూడా కరోనా కోరలు చాచింది. ‘కసౌతి జిందగీ కే’ సీరియల్ నటుడు పార్థ్ సమాతాన్ తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ‘నేను కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ తేలింది. నాలో స్వల్ప లక్షణాలు ఉన్నాయి. గత వారం రోజులుగా నన్ను కలిసిన వారంతా ఐసోలేషన్కు వేళ్లండి. పరీక్షలు చేయించుకోండి’ అంటూ సమాతాన్ ట్వీట్ చేశాడు. (చదవండి: కపూర్ కుటుంబంలో కరోనా కలకలం!) ప్రస్తుతం సమాతాన్ ముంబైలోని తన నివాసం సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నాడు. సినిమా, సరీయల్ షూటింగ్స్కు ప్రభుత్వం అనుమతించడంతో సమతాన్ తను నటిస్తున్న ‘కసౌద్ జిందగీ కే’ సీరియల్ షూటింగ్లో పాల్గొన్నాడు. తన సహా నటులతో కలిసి సెట్స్లో సందడి చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షూటింగ్లో సమాతాన్తో పాటు ఎరికా ఫెర్నాండేజ్, కరణ్ పటేల్, పూజా బెనర్జీ, భుభావి చోక్సేలు కూడా పాల్గొన్నారు. వారి ఆరోగ్యం పట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీరియల్ నటీనటులతో పాటు సెట్స్లోని సిబ్బందికి దర్శక నిర్మాతలు ఈనెల 12న కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఫలితాలు రావాల్సి ఉంది. (చదవండి: నా భార్యకు కరోనా సోకింది : రతన్ శుక్లా) View this post on Instagram Hi everyone , I have been tested Postive for covid 19 .although I have mild symptoms.. I would urge and request everyone whose been with me in close promitixy over the last few days please go and get yourself tested . The Bmc has regularly been in touch and with the doctors guidance I am in self quarantine and I am grateful to them for all their support . Please be safe and take care 😇 A post shared by Parth Samthaan (@the_parthsamthaan) on Jul 12, 2020 at 4:27am PDT -
ఆర్మూర్లో 6కు చేరిన కరోనా కేసులు
సాక్షి, నిజామాబాద్: ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామంలో కరోనా కేసులు 6కు చేరాయి. కాగా గ్రామంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో గ్రామస్థులు బయటి వారు గ్రామంలోకి రాకుండా పొలిమేరలో కంచె ఏర్పాటు చేశారు. పారిశుధ్య కార్మికులతో గ్రామంలోని వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రవణాన్ని అధికారులు పిచికారీ చేయిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని అధికారులు ఆదేశించారు. (కరోనా వైరస్ బారిన మరో ఎమ్మెల్యే) -
ప్రైవేటు పాఠశాలకు కరోనా
సాక్షి, బెంగుళూరు: పాఠశాలల పునరారంభంపై అనుకూల, ప్రతీకూల చర్చ జరుగుతున్న నేపథ్యలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన 8మంది ఉపాధ్యాయులకు కరోనా సోకడం కలకలం రేకెత్తిస్తోంది. ధ్వారాడలోని కిల్లా సమీపంలోని ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో తరగతులు పునః ప్రారంభంపై ఈనెల 6న సన్నద్ధత సమావేశం నిర్వహించారు. సమావేశంలో మొత్తం 24 మంది పాల్గొన్నారు. (కొనసాగుతున్న కరోనా విభృంభణ) వీరిలో యాలక్కి శెట్టర్ కాలనీ నివాసీ అయిన ఉపాధ్యాయురాలికి రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. సమావేశంలో పాల్గొన్న బోధన, బోధనేతర సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించుకోగా వారిలో ఆరుగురు ఉపాధ్యాయునిలు, ఒక ఉపాధ్యాయుడికి తాజాగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇంకా మిగతా వారినివేదిక అందాల్సి ఉందని అధికారులు తెలిపారు. అప్పటి వరకు అందరినీ హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు. -
ఇటలీని దాటేసిన భారత్
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగింది. ప్రపంచ దేశాల్లో ఇటలీని దాటి ఆరో స్థానానికి చేరడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా మన దేశంలో బయటపడ్డాక ఒకే రోజు దాదాపుగా 10 వేల కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో ఇటలీని దాటేసిన భారత్ ప్రపంచ పట్టికలో ఆరోస్థానానికి చేరింది. కొత్తగా 9,887 కేసులు నమోదు కావడంతో శనివారం నాటికి కేసుల సంఖ్య 2,36,657కి చేరుకుంది. ఇటలీలో ఇప్పటి వరకు 2,34,801 కేసులు నమోదయ్యాయి. 70% మృతులకు వేర్వేరు వ్యాధులు ఒకే రోజు 294 మంది ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 6,642కి చేరుకుంది. రికవరీ రేటు పెరగడం ఊరటనిచ్చే అంశం. ఇప్పటివరకు 48.20% మంది కోవిడ్ రోగులు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరణించిన వారిలో 70శాతానికి మందికిపైగా ఇతర వ్యాధులతో బాధుపడుతున్నవారే ఉన్నారని తెలిపింది. రకరకాల వ్యాధులు ఉన్న వారు కరోనాబారినపడి∙ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించింది. అయిదుగురు ఈడీ అధికారులకు కోవిడ్ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉద్యోగులు అయిదుగురికి కరోనా వైరస్ సోకింది. వారిలో స్పెషల్ డైరెక్టర్ ర్యాంకు అధికారి ఉన్నారు. దీంతో ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయాన్ని సీజ్ చేశారు. సోమవారం వరకు ఆఫీస్ను మూసేస్తారు. భారత్లో సామూహిక వ్యాప్తి దశ భారత్ సరైన్ సమయంలో లాక్డౌన్ విధించడంతో ఇప్పటివరకు కరోనాని బాగా నియంత్రించిందని డబ్ల్యూహెచ్ఓ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే దేశాన్ని అన్లాక్ చేసే క్రమంలో కేసులు భారీగా పెరిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఈ దశలో కేసులు మూడు వారాల్లోనే రెట్టింపు అవుతాయని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటిక్ డైరెక్టర్ మైకేల్ రయాన్ అంచనా వేశారు. అత్యధిక జనాభా కలిగిన భారత్లో నమోదవుతున్న కేసుల్ని చూస్తే దానిని విజృంభణగా భావించలేమన్నారు. ఇప్పుడు మార్కెట్ల తాళాలు తెరుస్తూ ఉండడంతో విస్తృతంగా కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. లాక్డౌన్ వంటి చర్యలతో వైరస్ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకున్నప్పటికీ భారీగా వలసలు, నగరాల్లో అత్యధిక జనసాంద్రత, రోజూ పని చేస్తే తప్ప ఎందరికో పూట గడవని దుస్థితి వంటి అంశాలు వైరస్ నియంత్రణకు సవాళ్లుగా మారతాయని రయాన్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడే భారత్ సామూహిక వ్యాప్తి దశకు చేరుకుంటోందని, మితి మీరి కేసులు నమోదవకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా ప్రభావం భారత్లో ప్రాంతానికి ప్రాంతానికి మధ్య మారిపోతోందని వైరస్ వ్యాప్తి చెందడంలో పట్టణాలు, పల్లెల మధ్య చాలా వ్యత్యాసం ఉందని రయాన్ వివరించారు. సెప్టెంబర్ నాటికి అంతం! కరోనా వైరస్ భారత్లో సెప్టెంబర్ రెండో వారం నాటికల్లా అంతమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన ప్రజారోగ్య నిపుణులు డాక్టర్ అనిల్కుమార్, డాక్టర్ రూపాలీ రాయ్ చెబుతున్నారు. గణిత నమూనా ఆధారంగా చేసిన ఓ విశ్లేషణను బట్టి వారు ఈ అంచనాకు వచ్చారు. ఎపిడిమోలజీ ఇంటర్నేషనల్ అనే ఆన్లైన్ జర్నల్లో ఈ వివరాలు ప్రచురించారు. ఈ విశ్లేషణ కోసం వారు బెయిలీ గణిత నమూనాను ఉపయోగించారు. -
రజనీకాంత్కి కరోనా
‘‘రజనీకాంత్ని మేం దేవుడిలా భావిస్తాం, ఆయన గురించి సరదాగా జోకులు వేసినా ఊరుకోం, నీది చాలా బ్యాడ్ టేస్ట్ కాబట్టే ఇలాంటి పిచ్చి జోక్ వేశావ్, కరోనా అనేది కామెడీ కాదు, ఇలాంటి జోక్ వేయడం భారతీయ సంస్కృతి కాదు. ఇంకోసారి ఇలా చేశావంటే జాగ్రత్త’’ అంటూ బాలీవుడ్ నటుడు రోహిత్ రాయ్ పై నెటిజన్లు మండిపడ్డారు. శనివారం రోహిత్ పై తిట్ల వర్షం కురిపించారు రజనీ అభిమానులు. దానికి కారణం ‘రజనీకాంత్కి కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ కరోనానే క్వారంటైన్లో ఉంది’ అని తన ఇన్ స్టాగ్రామ్లో రోహిత్ పెట్టిన పోస్ట్. రజనీకి కరోనా వస్తే అదే నిర్భందంలో ఉండాలి తప్ప రజనీకేం కాదు అనేది అతని పోస్ట్ అర్థం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సూపర్ స్టార్పై వేసిన ఈ జోక్ ఆయన అభిమానులకు మింగుడుపడక, రోహిత్ రాయ్ పై మండిపడ్డారు. ‘‘నవ్వించడానికి చేశాను. అయితే అది ఇలా అవుతుందనుకోలేదు. క్షమించండి. కానీ ఇది చెత్త జోక్ అని నేను అనుకోవడంలేదు. ఇది టిపికల్ రజనీ సార్ జోక్. ఒకర్ని కామెంట్ చేసే ముందు అసలు వాళ్లు ఏ ఉద్దేశంతో అన్నారో ఒకసారి ఆలోచించాలి. మీరందరూ నన్ను బాధపెట్టడానికి మెసేజులు పోస్ట్ చేస్తున్నట్లు మిమ్మల్నందర్నీ బాధపెట్టడానికి నేను ఆ జోక్ వేయలేదు’’ అని రోహిత్ రాయ్ పోస్ట్ చేశాడు. ఉద్దేశం ఏదైనా ఎవరిపై జోక్ వేస్తున్నామనేది ముఖ్యం అని కొందరు అంటున్నారు. -
డీ గ్యాంగ్ బాస్కు కరోనా?
కరాచీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కరోనా వైరస్ బారిన పడ్డాడా? అవునని కొందరు కాదని కొందరు చెబుతున్నారు. పాకిస్తాన్ నుంచి ముంబై నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్న ఈ కరడుగట్టిన తీవ్రవాది దావూద్ భార్య మెహజబీన్కు కరోనా పాజిటివ్గా తేలిందని, దీంతో దావూద్ వ్యక్తిగత సిబ్బందితోపాటు రక్షణ వ్యవహారాలను చూసే వారందరినీ క్వారంటైన్లో ఉంచినట్లు కొన్ని వార్తా సంస్థలు కథనాలు ప్రచురించగా.. అలాంటిదేమీ లేదని ‘భాయ్’ఆరోగ్యంగానే ఉన్నాడని అతడి తమ్ముడు అనీస్ ఇబ్రహీం తమతో చెప్పినట్లు ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ ఇంకో కథనాన్ని ప్రచురించింది. ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో జన్మించిన దావూద్ 1993 నాటి ముంబై పేలుళ్లకు కుట్ర పన్నిన విషయం తెలిసిందే. 1994 నుంచి పాకిస్తాన్లోని కరాచీలో ఐఎస్ఐ ఆశ్రయంలో ఉంటున్న దావూద్ ప్రస్తుతం కరోనా బారిన పడి కరాచీ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అతడి భార్య మెహజబీన్కూ వ్యాధి సోకిందని పీటీఐ తదితర వార్తా సంస్థలు తెలిపాయి. మరోవైపు.. ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ దావూద్ ఇబ్రహీం తమ్ముడు అనీస్ ఇబ్రహీంతో తాము ఫోన్లో మాట్లాడామని దావూద్ కుటుంబంలో ఎవరికీ కరోనా సోకలేదని అనీస్ చెప్పినట్లు పేర్కొంది. పాక్తోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి మాఫియా కూడా కార్యకలాపాలను నడుపుతున్నట్లు అనీస్ అంగీకరించినట్లు వెల్లడించింది. ‘‘భాయ్ బాగున్నాడు. షకీల్ కూడా. మా ఇంట్లో ఎవరికీ కరోనా సోకలేదు. ఎవరూ ఆసుపత్రిలో చేరలేదు’’అని అనీస్ చెప్పినట్లు తెలిపింది. -
డ్రైవర్కు కరోనా సోకినా... రేసులు ఆగవు
లండన్: ఫార్ములావన్ (ఎఫ్1) రేసుల్లో పాల్గొనేందుకు వచ్చిన డ్రైవర్లలో ఎవరికైనా కరోనా సోకినా... పోటీ మాత్రం ఆగదని ఎఫ్1 సీఈఓ చేజ్ క్యారీ స్పష్టం చేశారు. ‘వైరస్తో డ్రైవర్ లేదంటే టీమ్ పాల్గొనలేకపోయినా... రేసుకు ఢోకా ఉండదు. ఆ గ్రాండ్ప్రిని రద్దు చేయం. దీనికి సంబంధించిన కచ్చితమైన ప్రణాళికతో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ రేసులు జరుగుతాయి. ఒకవేళ డ్రైవర్ కరోనా బారిన పడితే రిజర్వ్ డ్రైవర్లయితే ఉంటారుగా. భౌతిక దూరం లోపించినా కూడా వలయంతో రక్షణ పద్ధతుల్ని అనుసరిస్తాం. ఇందులో ఎదురయ్యే ఇబ్బందుల్ని, సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎఫ్1 సిద్ధంగా ఉంది’ అని క్యారీ వెల్లడించా రు. మార్చిలో ఆస్ట్రేలియా గ్రాండ్ప్రితో మొదలవ్వాల్సిన సీజన్ కరోనాతో ఇంకా ప్రారంభం కాలేదు. -
కరోనా పాజిటివ్.. నిద్ర పట్టడం లేదు: నటి
డెహ్రాడూన్: తనకు తన కుటుంబ సభ్యులకు కరోనా అని తేలడంతో నిద్ర పట్టడం లేదని ప్రముఖ సీరియల్ నటి మోహేనా కుమారి పేర్కొన్నారు. దీనిపై ఆమె మంగళవారం తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. ‘నిద్రపట్టడం లేదు.. ఈ ప్రారంభ రోజులు మా అందరికి ముఖ్యంగా చిన్నవారికి, పెద్దవారికి చాలా కష్టంగా ఉంది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి మేమంతా త్వరలో బయటపడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ప్రస్తుతం మేము బాగానే ఉన్నాము. ఈ విషయంలో దేనిపై మాకు ఫిర్యాదు చేసే హక్కు లేదు. ఎందుకంటే ఇంతకన్నా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నవారు సమాజంలో చాలా మంది ఉన్నారు’ అంటూ ఆమె ఇన్స్టాలో రాసుకొచ్చారు. (మాకు కరోనా పాజిటివ్గా తేలింది: నటి) అంతేగాక తన కుటుంబమంతా కరోనా బారిన పడిన విషయం తెలిసి సన్నిహితులు, బంధువులు త్వరలో కోలుకోవాలని ఆశిస్తున్నామంటు వారికి క్షేమ సందేశాలు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోహేనా ‘‘మా కుటుంబం మహమ్మారి నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తూ.. సందేశాలు పంపిస్తున్న వారందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్న. మీ మెసేజ్లు మాలో ఆత్మవిశ్వాన్ని నింపుతున్నాయి’’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. కాగా తనతో పాటు తన భర్త సూయేష్ రావత్, ఆయన తండ్రి, ఉత్తరాఖండ్ పర్యటక శాఖ మంత్రి సత్పాల్ మహరాజ్కు, ఆయన భార్యకు కూడా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు, వారి బంధువులు 41 మంది క్వారంటైన్లో ఉన్నారు. (మంత్రి భార్యకు కరోనా: 41 మంది క్వారంటైన్) View this post on Instagram 🙏🏽 A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on Jun 1, 2020 at 3:16pm PDT -
కోవిడ్ @ ఇండియా
కరోనా మహమ్మారి భారత్ను వణికిస్తోంది. లాక్డౌన్ని కట్టుదిట్టంగా అమలు చేసినప్పటికీ రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరికొన్ని మినహాయింపులతో లాక్డౌన్ 5.0ని కేంద్రం జూన్ 30 వరకు పొడిగించింది. మొదటి సారి దేశంలో లాక్డౌన్ ప్రకటించినప్పట్నుంచి ఇప్పటివరకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మే రెండో వారం నుంచి కొద్ది రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య రెట్టింపు అవుతూ వస్తోంది. అయితే రికవరీ రేటు 47.4% ఉండడం, మరణాల సగటు రేటు 3 శాతం కూడా దాటక పోవడం ఎంతో ఊరటనిచ్చే అంశం. -
ఒకే రోజు 7,466 కేసులు
న్యూఢిల్లీ: లాక్డౌన్ 4.0 కొనసాగింపుపై కేంద్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్న వేళ దేశవ్యాప్తంగా కోవిడ్–19 కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 7,466 కొత్త కేసులు నమోదు కాగా, 175 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఒకే రోజు ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో భారత్ తొమ్మిదో స్థానానికి ఎగబాకింది. మొత్తంగా కేసులు లక్షా 65 వేల 799 వరకు చేరుకున్నాయని కేంద్రం వెల్లడించింది. మే 22 నుంచి ప్రతిరోజూ సగటున 6 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ కేసులు చైనా కంటే రెట్టింపు నమోదైతే, మృతుల సంఖ్యలో కూడా చైనాని భారత్ దాటేసింది. చైనాలో మొత్తం కేసులు 84వేలు కాగా భారత్లో లక్షా 65 వేలు దాటి పోయాయి. ఇక కోవిడ్ మరణాల్లో చైనాను మించిపోయాం. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ డేటా ప్రకారం చైనాలో ఇప్పటివరకు 4,638 మంది మరణిస్తే భారత్లో మృతుల సంఖ్య 4,706కి చేరుకుంది. అయితే భారత్లో రికవరీ రేటు 42.89%గా ఉండటం ఊరట కలిగించే అంశం. బెంగాల్ మంత్రికి పాజిటివ్ పశ్చిమ బెంగాల్ మంత్రి సుజిత్ బోస్కు కరోనా సోకింది. ఇంట్లో నౌకరుకు కరోనా సోకడంతో మంత్రికి, ఆయన కుటుంబ సభ్యులకి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మంత్రితో పాటు కుటుంబ సభ్యుల్లో మరొకరికి పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా, రాజ్యసభ సెక్రటరేరియెట్లో పనిచేసే అధికారి ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పార్లమెంటు భవనంలో రెండు ఫ్లోర్లను పోలీసులు సీజ్ చేశారు.