prajavani
-
ప్రజావాణిలో అల్లు అర్జున్ మామ ఫిర్యాదు.. విషమేమిటంటే?
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు. ఈ క్రమంలో తన ఇంటి స్థలం గురించి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-92లో తమ ప్రాపర్టీస్ విషయంపై పునరాలోచించాలని ప్రజావాణిలో ఫిర్యాదులో పేర్కొన్నారు.అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదు అందించారు. ఈ సందర్భంగా కేబీఆర్ పార్కు వద్ద రోడ్డు విస్తరణలో తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రోడ్డు విస్తరణలో తన ప్లాటు ఒకవైపు 20 అడుగులు మరోవైపు 36 అడుగుల భూమి సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలంటూ అధికారులను కోరారు. కాగా, కొన్ని నెలల క్రితం కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రూ.1100 కోట్లు ఖర్చు చేయాలని అధికారులు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే రోడ్డు విస్తరణతో పాటుగా పలు కార్యక్రమాలను చేపట్టారు.ఇదిలా ఉండగా.. ఇటీవల టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(Kancherla Chandrasekhar Reddy) మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వీరి భేటీ సందర్భంగా వారిద్ధరూ ఏ అంశాలపై చర్చించారన్న దానిపై వివరాలు వెల్లడి కాలేదు. అల్లు అర్జున్ అరెస్టు ఎపిసోడ్ తర్వాతా చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్కు రెండోసారి వెళ్లడం చర్చనీయాంశమైంది. -
ఇకపై ప్రతి సోమవారం.. హైడ్రా కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రతి సోమవారం బుద్ధ భవన్ వేదికగా నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణలపై నేరుగా ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరించనున్నారు. ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రజావాణి నిర్వహించనున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదుదారులు ఆధారాలతో సహా రావాలని హైడ్రా కమిషనర్ సూచించారు. మొదటగా వచ్చిన 50 మంది ఫిర్యాదు దారులకు టోకెన్స్ ఇచ్చి.. ప్రాధాన్యతా క్రమంలో ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపిన రంగనాథ్ వెల్లడించారు.ఐఎస్బీ మేగజైన్లో ‘హైడ్రా’రాజధానిలోని జలవనరుల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) రికార్డుల్లోకి ఎక్కింది. ఈ సంస్థకు చెందిన ‘ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ ఎడిషన్’ డిసెంబర్–2024 మేగజైన్లో హైడ్రాపై వ్యాసం ప్రచురితమైంది. పబ్లిక్ పాలసీ విభాగంలో ‘హైదరాబాద్స్ హైడ్రా: ఎన్ ఎక్సర్సైజ్ ఇన్ అర్బన్ వాటర్ బాడీ రిక్సామ్నేషన్’ శీర్షికన దీన్ని ప్రచురించింది. తన అధికారిక వెబ్సైట్లోనూ ఈ వ్యాసాన్ని అందుబాటులో ఉంచింది.దాదాపు ఏడు వేల జలవనరులతో సిటీ ఆఫ్ లేక్స్గా పేరున్న హైదరాబాద్లో ప్రస్తుత పరిస్థితి, దానికి కారణాలను ఈ వ్యాసం వివరించింది. గతేడాది జూలై 19న హైడ్రా ఏర్పడిన తర్వాతి పరిస్థితులు, చెరువుల పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలను అభినందించిన ఈ వ్యాసం, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ జలవనరుల పరిరక్షణకు కృషి చేస్తున్నారని కితాబిచ్చింది. జనావాసాల జోలికి వెళ్లకుండా చెరువుల పరిరక్షణ చేపట్టాలంటూ హైడ్రా తీసుకున్న పాలసీ నిర్ణయాన్ని ఐఎస్బీ వ్యాసం అభినందించింది.ఇదీ చదవండి: హెచ్ఎంపీవీ వైరస్పై తెలంగాణ సర్కార్ అలర్ట్జల వనరుల ఆక్రమణ, అవి కనుమరుగు కావడం, కాలుష్య కోరల్లో చిక్కుకోవడం తదితర సమస్యలు దేశ వ్యాప్తంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు హైడ్రా తరహా వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవాలని ఐఎస్బీ తన వ్యాసంలో సూచించింది. తెలంగాణకు చెందిన పాలకులు, అధికారులు హైడ్రాకు మరింత చేయూత ఇవ్వాలని అభిప్రాయపడింది. -
‘ప్రజావాణి’ సంగతి ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులను ఏ విధంగా పరిష్కరిస్తున్నారని, ఈ దరఖాస్తుల పరిష్కారానికి అధికారుల వద్ద ఉన్న వ్యవస్థ ఏమిటని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే క్రమంలో జిల్లాల కలెక్టర్లు, ఆయా శాఖల ఉన్నతాధికారుల స్పందనను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆదివారం సచివాలయంలో ప్రజావాణి దరఖాస్తులపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి. చిన్నారెడ్డితో కలసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి.. అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు, ఏయే శాఖల వారీగా వచ్చాయి, ఎన్ని పరిష్కరించారన్న దానిపై అధికారులను అడిగారు. ప్రతి దరఖాస్తును పరిష్కరించే క్రమంలో అసలేం జరుగుతుందని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఇందుకు నోడల్ అధికారిణి దివ్య దేవరాజన్ సమాధానమిస్తూ, తొలుత ఫిర్యాదు రాగానే దరఖాస్తుదారుని మొబైల్కు ఎస్ఎంఎస్ పంపుతామని, ఆ తర్వాత పరిష్కారం అయిన వెంటనే ఎస్ఎంఎస్ ద్వారానే సమాచారమిస్తామని వెల్లడించారు. అయితే, సదరు దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకునే వ్యవస్థ లేదని, ఈ నేపథ్యంలో అలాంటి వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. త్వరలోనే కొత్త రేషన్కార్డులు.. ప్రజావాణిలో భాగంగా కొత్త రేషన్కార్డుకోసం దరఖాస్తులు, పింఛన్లు, ధరణికి సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయని అధికారులు డిప్యూటీ సీఎం భట్టికి వివరించారు. దీనిపై స్పందించిన భట్టి మాట్లాడుతూ.. రేషన్కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని, త్వరలోనే నిర్ణయం తీసుకుని కొత్త రేషన్కార్డులు మంజూరు చేస్తామని వెల్లడించారు. కొత్త పింఛన్లను కూడా త్వరలోనే మంజూరు చేసే అవకాశముందన్నారు. మహిళలకు కేవలం కుట్టుమెషీన్లు ఇస్తే సరిపోదని, శిక్షణ కూడా ఇవ్వాలని, ఇందుకోసం అవసరమైతే ఆర్థిక సాయం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ డెసు్కలను బలోపేతం చేయాలని, తద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య తగ్గుతుందని చెప్పారు. జీరో విద్యుత్ బిల్లులు జారీ చేసే మండలస్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని వెల్లడించారు. అవసరమైతే పాలసీ మార్చుకుందాం ప్రజావాణిలో వచ్చే దరఖాస్తుల్లో పరిష్కారానికి అవకాశమున్న ప్రతి ఫిర్యాదును పరిష్కరించాల్సిందేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ విధానాల్లో ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే రాతపూర్వకంగా నివేదిస్తే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ప్రతి మూడు నెలలకోసారి ప్రజావాణి దరఖాస్తులపై సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజావాణి విభాగంలో పనిచేసేందుకు పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని నోడల్ అధికారి దివ్య కోరగా, ఇందుకు స్పందించిన భట్టి తగినవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతు నుంచి అభినందన లేఖ.. ప్రజావాణిలో వచి్చన ఫిర్యాదులను వీలున్నంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని నోడల్ అధికారి దివ్య వెల్లడించారు. తన వ్యవసాయ భూమిలో విద్యుత్ వైర్లు వేలాడుతున్న విషయాన్ని ప్రజావాణి ద్వారా మహబూబ్నగర్కు చెందిన రైతు ఫిర్యాదు చేయగా, రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించామని, ఇందుకు అధికారులను అభినందిస్తూ ఆ రైతు లేఖ రాసిన విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టికి ఆమె వివరించారు. -
ప్రజా‘వాణి’ వినిపించదా?
సాక్షి, హైదరాబాద్: ఇబ్బంది ఏదైనా, పరిష్కార వేదిక ఏదైనా.. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు మాత్రం పెండింగ్లోనే ఉండిపోతున్నాయి. భూసంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడికక్కడ ప్రజా సమస్యల అర్జీలు పేరుకుపోతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం ప్రజావాణికి వచ్చిన దరఖాస్తుల్లో రెవెన్యూ వర్గాలు పరిష్కరించినవి 30శాతం కూడా దాటలేదు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఇప్పటివరకు రెవెన్యూ శాఖకు 13,513 దరఖాస్తులు రాగా.. అందులో పరిష్కారమైనవి 3,147 దరఖాస్తులు మాత్రమే. మిగతా 10,366 దరఖాస్తులు ఇంకా పెండింగ్లోనే ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెవెన్యూ శాఖకు వెళ్లే దరఖాస్తుల్లో ఎక్కువశాతం ధరణి సంబంధిత సమస్యలే ఉంటాయని.. కొన్నిచోట్ల పింఛన్లు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి వంటి దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కేవలం విచారణతోనే సరి! ప్రజావాణి కింద వస్తున్న దరఖాస్తుల్లో ఎక్కువగా ధరణికి సంబంధించినవే ఉంటున్నాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ధరణి పోర్టల్లో తమకు వచ్చిన లాగిన్ల ఆధారంగా సదరు దరఖాస్తులను పరిశీలించి, విచారణ జరిపి రిపోర్టు పంపించే అధికారం మాత్రమే తమకు ఉందని తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. నిజానికి ఈ దరఖాస్తులను విచారించేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది కూడా లేరని.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛిన్నాభిన్నమైన రెవెన్యూ వ్యవస్థ ఇంకా కోలుకోలేదని అంటున్నారు. మండలంలో ఉన్న ఒకరిద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లే (ఆర్ఐలే) ఈ దరఖాస్తులన్నింటినీ విచారించాల్సి వస్తోందని చెప్తున్నారు. విచారణ అనంతరం రిపోర్టులను పంపినా పైస్థాయిలో పరిష్కారం కావడం లేదని.. కొన్ని దరఖాస్తులు పరిష్కారమైనా ఆన్లైన్లో అప్డేట్ కావడం లేదని వివరిస్తున్నారు. తహసీల్దార్ల స్థాయిలోనే చాలా దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. పైస్థాయికి పంపిన వాటిని కలెక్టర్లు పట్టించుకోకపోవడంతో అక్కడా ఆగిపోతున్నాయని అంటున్నారు. నాలుగు జిల్లాల్లోనే కాస్త మెరుగు.. ‘సీఎం ప్రజావాణి’ దరఖాస్తుల గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో మాత్రమే పరిష్కార కార్యక్రమం చురుగ్గా జరుగుతోంది. జగిత్యాల, కరీంనగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 80శాతానికిపైగా దరఖాస్తులను పరిష్కరించారు. ఆరు జిల్లాలు వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, కామారెడ్డి, నాగర్కర్నూల్, భువనగిరి జిల్లాల్లో అయితే 100శాతం దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. అంటే ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఆ జిల్లాల్లో ఒక్క రెవెన్యూ అర్జీ కూడా పరిష్కారం కాకపోవడం గమనార్హం. మిగతా జిల్లాల్లో మొక్కుబడిగా ప్రజావాణి దరఖాస్తుల పరిష్కార కార్యక్రమం జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్లో కూడా దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పెండింగ్లో ఉండటం రెవెన్యూ యంత్రాంగం నిర్లిప్తతకు అద్దం పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. వారానికి వెయ్యి దాకా దరఖాస్తులు రాష్ట్రస్థాయిలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి వెయ్యి వరకు దరఖాస్తులు వస్తున్నాయి. అందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. గత శుక్రవారం 494 దరఖాస్తులురాగా.. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 125, హౌసింగ్ 43, పౌరసరఫరాల శాఖ 71, హోంశాఖ 45, పంచాయతీరాజ్ శాఖ 47, ఇతర శాఖలకు సంబంధించి 48 దరఖాస్తులు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
నిరసనల ’ప్రజావాణి’
లక్డీకాపూల్: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో మంగళవారం ప్రజావాణి కార్యక్రమం నిరసనలు, ఆందోళనల మధ్య సాగింది. లోక్సభ ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాత పునఃప్రారంభమైన ప్రజావాణికి పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు అన్యాయం జరిగిందనీ, న్యాయం చేయాలంటూ వివిధ సంఘాల నేతలు ప్రజాభవన్ ఎదుట బైఠాయించారు. విధుల నుంచి తొలగించిన తమకు న్యాయం చేయాలంటూ పెద్దఎత్తున ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలకు అనుగుణంగా ప్యాకేజీ పెంచాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డ్రైవర్స్ కం ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాత ప్యాకేజీపై వాహనాలు నడపడం చాలా కష్టమని, ప్యాకేజీని రూ.55 వేలకు పెంచాలని అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి సీతక్కకు అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.రాజేశ్వరరావు, జి. దేవేందర్ వినతిపత్రాన్ని సమర్పించారు. తాను కొనుగోలు చేసిన భూమిని ధరణిలో నమోదు చేయకపోవడంతో కబ్జాకి గురైందంటూ మాజీ సీఆర్పీఎఫ్ ఉద్యోగి ఇమ్మడి సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 702 దరఖాస్తులు నమోదయ్యాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 219 దరఖాస్తులు, మున్సిపల్ శాఖకు సంబంధించి 54, హోం శాఖకు సంబంధించి 52, హౌసింగ్ శాఖకు సంబంధించి 44, పౌరసరఫరాల శాఖకు సంబంధించి 46, ఇతర శాఖలకు సంబంధించి 287 దరఖాస్తులు అందినట్లు ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్ శాఖ సంచాలకులు దివ్య వెల్లడించారు. కార్యక్రమంలో ప్రజావాణి ఇంఛార్జి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి, ఆయా శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
TS: ఉదయం 4.30కే మొదలైన ప్రజావాణి
సాక్షి, హైదరాబాద్: ప్రజా స్వీయ విజ్ఞప్తుల ద్వారా వాళ్ల సమస్యల పరిష్కారం కోసమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా భారీగా స్పందన లభిస్తోంది. చలిని సైతం లెక్కచేయకుండా రాత్రంతా అక్కడే ఉంటున్నారు చాలామంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రజావాణి ఉదయం 4.30 నుంచే కార్యక్రమం మొదలు కావడం గమనార్హం. జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ వద్ద ప్రజావాణికి ఫిర్యాదులతో వచ్చిన వాళ్లను క్యూ లైన్లో ఎక్కువ సేపు ఉంచడం లేదు. వాళ్లు ఇబ్బంది పడడమే కాకుండా.. ట్రాఫిక్కు అంతరాయం కలుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వచ్చినవారిని వచ్చినట్లే క్యూ ద్వారా లోపలికి పంపిస్తున్నారు అధికారులు. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ కొనసాగుతోంది. ప్రజావాణిలో.. ఉద్యోగుల బదిలీలు, పెన్షన్లు విజ్ఞప్తులతోపాటు భూకబ్జాలు, డబుల్ బెడ్రూమ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. -
TS:ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు..ట్రాఫిక్ జామ్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. వారానికి రెండు రోజులు మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో మంగళ, శుక్రవారాల్లో జ్యోతిరావ్ పూలే ప్రజాభవన్(గత ప్రగతిభవన్)కు భారీగా తరలివస్తున్నారు. ఈ వారంలో రెండోసారి జరిగే శుక్రవారం(డిసెంబర్15) ప్రజావాణి కోసం ప్రజలు పోటెత్తారు. ఉదయం 5 గంటలకే ప్రజాభవన్ ముందు క్యూ కట్టారు. ఈ క్యూ లైను తొమ్మిది గంటలకల్లా రెండు కిలోమీటర్లకుపైగా పెరిగిపోయింది. దీంతో బేగంపేట ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజావాణికి వచ్చిన వారిని క్రమపద్ధతిలో నిల్చోబెట్టి ఒక్కొక్కరిగా లోపలికి పంపడం పోలీసులకు కొంత టఫ్ టాస్క్గా మారింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలందరూ హైదరాబాద్ ప్రజాభవన్కే రానవసరం లేకుండా ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల్లోనూ ప్రజావాణి నిర్వహింపజేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజా వాణి నియోజకవర్గాల్లోనూ నిర్వహించడం వల్ల స్థానిక సమస్యలు ఎక్కడికక్కడే త్వరగా పరిష్కారమవడమే కాకుండా ప్రజలకు హైదరాబాద్ దాకా వచ్చే భారం తగ్గుతుంది. ప్రజాభవన్ వద్ద రద్దీ తగ్గి ఇక్కడి యంత్రాంగం మీద ఒత్తిడి తగ్గే అవకాశముంటుంది. ప్రజావాణిలో ఎక్కువగా భూముల సంబంధిత సమ్యలు, ధరణి, ఆరోగ్యం,నిరుద్యోగం అంశాలపైనే ఎక్కువ అర్జీలు వస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాదర్భార్ పేరుతో ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమానికి తొలిరోజు సీఎం రేవంత్రెడ్డి నేరుగా హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత కార్యక్రమం పేరును ప్రజావాణిగా పేరుమార్చారు. అప్పటి నుంచి ఒక్కో రోజు ఒక్కో మంత్రి హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు ప్రజావాణికి మంత్రులు శ్రీధర్బాబు, కొండా సురేఖ హాజరయ్యారు. ఇదీచదవండి..TS: నేటినుంచి జీరో టికెట్ -
Prajavani: రెండున్నరేళ్లుగా మూగబోయిన ప్రజావాణి
సాక్షి, హైదరాబాద్: సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ప్రజల ఆవేదన వినేవారు లేకుండా పోయారు. గత రెండున్నరేళ్లుగా ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహించే ప్రజావాణి (గ్రీవెన్స్ సెల్) మూగబోయింది. కోవిడ్ నేపథ్యంలో జీహెచ్ఎంసీతోపాటు హైదరాబాద్ కలెక్టరేట్లలో 2020 మార్చి 17 నుంచి ప్రజావాణి కార్యక్రమం నిలిచిపోయింది. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ–ఆఫీస్ ద్వారా కాగిత రహిత పాలనను చేపట్టారు. వివిధ సమస్యలపై వస్తున్న ప్రజల నుంచి నేరుగా కాకుండా దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా, ఆ తర్వాత కలెక్టరేట్లోని ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక బాక్స్ ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించారు. కోవిడ్ వైరస్ ప్రభావం తగ్గినా... నేటికి గేటు వద్దనే మొక్కుబడిగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ దరఖాస్తుల్లో కనీసం 10 శాతం కూడా సమస్యలు పరిష్కారం కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఆఫీసుల చుట్టూ చక్కర్లు నగర వాసులు తమ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ, మున్సిపల్ కలెక్టర్ రెవెన్యూ ఆఫీసుల నిత్యం ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు ఎవరికి సమర్పించాలో తెలియని పరిస్ధితి నెలకొంది. సంబంధిత అధికారులు సైతం అందుబాటు లేక పోవడంతో వారిని పట్టించుకునేవారు కరువయ్యారు. దరఖాస్తులు సమర్పించినా... పరిష్కారమవుతుందన్న ఆశ కనిపించడం లేదు. దీంతో దళారులు, రాజకీయ నాయకులను ఆశ్రయించక తప్పడం లేదు. పెరిగిన పెండెన్సీ... ప్రభుత్వ పరంగా పేదలకు అందించే ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ఆర్ధిక చేయూత, సంక్షేమ రుణాలు, డబుల్ బెడ్రూమ్, సదరం సర్టిఫికేట్ తదితర దరఖాస్తులు పెండెన్సీ పెరిగిపోతోంది. దరఖాస్తుదారులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం కనిపించడం లేదు. కనీసం ప్రజావాణి పునరుద్దరిస్తే అందులో తమ దరఖాస్తులకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని పలువురు బాధితులు పేర్కొంటున్నారు. (క్లిక్ చేయండి: మన కార్లపై భారత్ సిరీస్ ఎప్పుడు? దీంతో లాభలేంటి..?) -
పింఛన్ తొలగించారని.. దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం
సాక్షి, యాదాద్రి/ కొండపాక(గజ్వేల్)/ సాక్షి, రంగారెడ్డిజిల్లా /మంచిర్యాల అగ్రికల్చర్: పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇతర పథకాలు అందడం లేదంటూ.. అధికారులు ఇబ్బందిపెడుతున్నారంటూ.. బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. తమ బాధలు చెప్పుకొనేందుకు కలెక్టరేట్లలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాలకు వస్తున్నారు. తమ సమస్య ఎప్పుడు తీరుతుందోననే మనస్తాపంతో ఆత్మహత్యా యత్నాలు చేస్తున్నారు. సోమవారం పలు జిల్లా కలెక్టరేట్లలో నలుగురు ఇలాంటి ప్రయత్నాలు చేయడం కలకలం రేపింది. పింఛన్ తొలగించారంటూ.. దివ్యాంగుడు.. యాదాద్రి భువనగిరి జిల్లా హన్మాపురం గ్రామానికి చెందిన నాగపురి యాదగిరికి ఆగస్టులో ప్రభుత్వం వికలాంగుల పింఛన్ మంజూరు చేసింది. ఒక నెల పింఛన్ తీసుకున్న యాదగిరికి తర్వాతి నెలలోనే ఆపేశారు. తాను కృత్రిమకాలుతో నడుస్తున్నానని, భార్య కూలి పనిచేసి పోషిస్తోందని, తనకు పింఛన్ పునరుద్ధరించి ఆదుకోవాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే యాదగిరి సోమవారం కలెక్టర్లో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చాడు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పింఛన్ పునరుద్ధరించడం లేదంటూ వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోబోయాడు. ఇది గమనించిన కలెక్టర్ సీసీ సోమేశ్వర్, సిబ్బంది ఆయనను ఆపారు. ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించిన అనంతరం యాదగిరికి కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు. అయితే యాదగిరి కుమారుడికి ట్రాక్టర్ ఉండటంతో పింఛన్ తొలగించినట్టు అధికారులు చెప్తున్నారు. భూమిని తమకు కాకుండా చేస్తున్నారంటూ.. మహిళ అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లికి చెందిన బి.జయశ్రీ తండ్రి సుర్వి భిక్షపతికి ఇదే రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 67లో 1.35 ఎకరాల భూమి ఉంది. ఆయన భూమిని ముగ్గురు కుమార్తెలకు రిజిస్ట్రేషన్ చేశారు. అయితే తమ భూమిపై రెండు రియల్ ఎస్టేట్ సంస్థలు కన్నేశాయని.. తాము విక్రయించబోమని చెప్తున్నా తహసీల్దార్ అనితారెడ్డితో కలిసి తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాయని జయశ్రీ అనే మహిళా రైతు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ధరణి పోర్టల్లో భూమి వివరాలు మార్చి కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తహసీల్దార్ అనితారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బ్లేడుతో చేతులు కోసుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు, కాంగ్రెస్ నేతలు ఆమెను అడ్డుకుని.. అదనపు కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ అంశాన్ని పరిశీలించి, న్యాయం చేస్తామని అదనపు కలెక్టర్ తిరుపతిరావు హామీ ఇచ్చారు. దుకాణం ఖాళీ చేయాలని వేధిస్తున్నారంటూ.. యువకుడు మంచిర్యాల అగ్రికల్చర్: అద్దె దుకాణం తొలగించొద్దని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సంతోష్ సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై అతడిపై నీళ్లు పోశారు. బాధితుడి వివరాల ప్రకారం.. చెన్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని దుకాణ సముదాయంలో ఓ షటర్ను పదేళ్లుగా అద్దెకు తీసుకుని టైర్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. దుకాణం తొలగించాలని మూడు నెలల క్రితం ఎంపీడీవో, ఎంపీపీలు షటర్కు తాళం వేయించారు. ఎంపీ, ఎమ్మెల్యేకు గోడు వినిపించినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నాడు. సోమవారం సాయంత్రానికి ఖాళీ చేయాలని చెప్పడంతో కలెక్టరేట్కు వచ్చానని తెలిపాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు నీళ్లు చల్లి అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేశారు. సంతోష్పై నీళ్లు పోస్తున్న పోలీసులు ఇల్లు మంజూరైన అడ్డుకుంటున్నారని ఆత్మహత్య పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో సిద్దిపేట జిల్లాలో కలకలం కొండపాక(గజ్వేల్): డబుల్ బెడ్ రూం ఇళ్ల అర్హుల జాబితాలో పేరు వచ్చాక కూడా కేటాయించకుండా అడ్డుకుంటున్నారని మనస్థాపానికి గురైన ఆటో డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కలెక్టరెట్ కార్యాలయం ఆవరణలో సోమవారం చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణంలోని గణేశ్ నగర్లో నివాసం ఉంటున్న శీలసాగరం రమేశ్ ఆటో డ్రైవర్. పట్టణ శివారులో నిర్మించిన డబుల్ ఇల్లు కోసం భార్య లత పేరిట దరఖాస్తు చేసుకున్నాడు. మూడు పర్యాయాలు లబ్ధిదారుల జాబితాలో లత పేరు వచ్చింది. అయినా ఇల్లును కేటాయించలేదు. ఈ విషయమై పలుమార్లు అధికారులను అడిగినా ఫలితం లేకుండాపోయింది. దీంతో సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. అర్హుల జాబితాలో పేరు ఉన్నా.. 26వ వార్డు కౌన్సిలర్ ప్రవీణ్ ఇల్లు రాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తూ పురుగుల మందు తాగుతున్న సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలోనే కలెక్టరెట్ ఆవరణలో ఉన్న వాహనాల పార్కింగ్ వద్ద పడిపోయాడు. వెంటనే అక్కడున్న స్థానికులు 108 అంబులెన్స్ సిబ్బంది మహేందర్, శ్రీనివాస్కు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న రమేశ్ను అంబులెన్సులో సిద్దిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడని అంబులెన్సు సిబ్బంది మహేందర్ తెలిపారు. మృతుడి భార్య లత ఇల్లు మంజూరైనా పట్టా ఇవ్వకుండా కౌన్సిలర్ ప్రవీణ్ అడ్డుకుంటుడటంతో డబ్బులు కూడా ఇచ్చామని ఆరోపించింది. తన భర్త మరణానికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వేడుకుంది. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ భాను ప్రకాష్ తెలిపారు. -
25 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు
సాక్షి,సిటీబ్యూరో: ప్రజావాణి కార్యక్రమానికి అత్యధికంగా అధికారులు హాజరు కాకపోవడంతో కలెక్టర్ శ్వేతా మహంతి సీరియస్ అయ్యారు. ప్రజావాణికి హాజరు కాని సుమారు 25 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీకి ఆదేశాలిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతివారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని అల్టిమేటం ఇచ్చారు. ఇక మీదట హాజరు కాకుంటే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమ ప్రాంగణానికి కలెక్టర్ చేరుకునే సరికి కనీసం పది మంది అధికారులు సైతం హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. మారని అధికారుల తీరు పాలనాధీశులు మారినా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. గత రెండేళ్లుగా ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా సాగుతూ వచ్చింది. సాక్షాత్తూ పాలనాధీశులు ప్రజావాణి కార్యక్రమంపై పెద్దగా ఆసక్తి కనబర్చకపోవడంతో కింది స్థాయి సిబ్బందిని పంపించి జిల్లా స్థాయి అధికారులు గైర్హాజరవుతూ వచ్చారు. ప్రజావాణిలో ప్రజల సమస్యలు పరిష్కారం కాదు కదా.. అసలు వినేవారే కరువయ్యారు. కనీసం కార్యక్రమానికి సైతం సమయపాలన లేకుండా పోయింది. కొన్ని సార్లు కింద స్థాయి అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగించగా, మరికొన్ని సార్లు అధికారుల కోసం అర్జీదారులకు పడిగాపులు తప్పలేదు. ప్రజావాణి కార్యక్రమంపై నమ్మకం సడిలి అర్జీదారుల సంఖ్య సైతం తగ్గుముఖం పడుతూ వచ్చింది. తాజాగా కలెక్టర్గా శ్వేతా మహంతి పాలనా పగ్గాలు చేపట్టడంతో కొంత ఆశలు చిగురించాయి. కానీ అధికారుల తీరు మారక పోవడంతో కలెక్టర్ కన్నెర్ర చేశారు. ప్రజావాణి ప్రత్యేకం.. కలెక్టర్ శ్వేతా మహంతికి ప్రజావాణి కార్యక్రమం అంటే ప్రత్యేక శ్రద్ధ . గతంలో పనిచేసిన ప్రాంతంలో ప్రజావాణి పై ప్రత్యేక దృష్టి సారించినట్లు అక్కడి వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి క్రమం తప్పకుండా హజరు కావడం, ప్రజా ఫిర్యాదులు, సమస్యలు వినడమే కాకుండా సంబంధిత అధికారులకు సత్వరమే పరిష్కార మార్గాల కోసం సూచనలు చేసే అలవాటు ఉన్నట్లు సమాచారం. సమయం మించి పోయినా తన చాంబర్లో సైతం ఫిర్యాదుల స్వీకరించే అధికారిగా పేరుంది. ఇలాంటి అధికారి కలెక్టర్గా పరిపాలన పగ్గాలు చేపట్టినా జిల్లా స్థాయి అధికారుల్లో మార్పు రాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె ఆర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఎం.కృష్ణ, రెవెన్యూ అధికారులు శ్రీను, వసంత కుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
‘ప్రజావాణి’కి మంచి రోజులొచ్చేనా..!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం గాడిలో పడుతుందా ? ప్రజల సమస్యల పరిష్కారానికి మోక్షం లభిస్తుందా ? జిల్లా స్థాయి అధికారుల్లో మార్పు వస్తుందా ? అధికారుల ఆదేశాలు అమలవుతాయా? అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించి పని చేయిస్తూ తాను పనిచేసే అధికారిగా ముద్ర వెసుకున్న శ్వేతా మహంతి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడంతో ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత రెండేళ్లుగా జిల్లా పాలనా యంత్రాంగమే కంచె చేను మేసిన విధంగా వ్యవహరించడంతో ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా మారింది. సాక్షాత్తూ పాలనాధీశులు ప్రజావాణి కార్యక్రమంపై పెద్దగా ఆసక్తి కనబర్చకుండా జాయింట్ కలెక్టర్కు బాధ్యతలు అప్పగించడం, జిల్లా స్థాయి అధికారులు గైర్హాజరు కావడం, ప్రజా ఫిర్యాదుల నిర్లక్ష్యానికి మరింత కారణమైంది. ప్రజాసమస్యలు పరిష్కారం కాదు కదా. అసలు వినేవారే కరువయ్యారు. మరోవైపు కార్యక్రమానికి సమయపాలన లేకుండా పోయింది. కొన్నిసార్లు కింది స్థాయి అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగించగా.. మరికొన్ని సార్లు ఆర్జీదారులకు పడిగాపులు తప్పడం లేదు. ప్రజావాణి కార్యక్రమంపై నమ్మకం సడిలి క్రమంగా అర్జీదారుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. ఆదేశాలు సైతం బేఖాతర్.. ప్రజావాణిలో ఉన్నతాధికారుల ఆదేశాలు సైతం అతంత మాత్రంగానే అమలవుతున్నాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రజావాణిలో పదే పదే జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని, అర్జీలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు వ్యక్తిగత శ్రద్ద కనబర్చాలని ఆదేశిస్తూ వచ్చినా ఫలితం లేకుండా పోయింది. పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి నివేదిక అందజేయాలని, పరిష్కరించిన వినతి పత్రాల వివరాలను శాఖల వారిగా తమ లాగిన్ ఐడీతో మీ కోసం వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచనలు సైతం అమలు కాలేదు. మరోవైపు పాలనా యంత్రాంగం వద్ద ఇప్పటి వరకు ఎన్ని ఆర్జీలు వచ్చాయి. ఎన్నిపరిష్కారమయ్యాయి. ఎన్ని పెండింగ్లో ఉన్నాయన్న వివరాలు అందుబాటులో లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. మార్క్ ఉంటుందా..? ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొని ప్రజల ఆర్జీలను స్వీకరిస్తారా..? లేక గత కలెక్టర్ల మాదిరిగా కార్యక్రమ బాధ్యతలు జాయింట్ కలెక్టర్కు అప్పగిస్తారా..? కొత్త కలెక్టర్ శ్వేతా మహంతి కొంత శ్రద్ధ కనబర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పనిచేసిన ప్రాంతంలో ప్రజావాణిపై ఆమె ప్రత్యేక దృష్టి సారిస్తూ వచ్చారు. ప్రజావాణికి క్రమం తప్పకుండా హాజరై ప్రజా ఫిర్యాదులు, సమస్యలు వినడమే కాకుండా సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజావాణి సమయం మించి పోయినా.. తన చాంబర్లో సైతం ఫిర్యాదుల స్వీకరించే అధికారిగా ఆమెకు పేరుంది. ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరయ్యే జిల్లా స్థాయి అధికారులకు తీవ్రంగా మందలిచినట్లు తెలుస్తోంది. ప్రజా ఫిర్యాదుల ఆప్డేట్, ప్రతివారం వాటి పురోగతిపై సమీక్ష నిర్వహించే అలవాటు ఉండడంతో జిల్లా స్థాయి అధికారుల్లో గుబులు పట్టుకుంది. కొత్త కలెక్టర్ పాలనా పగ్గాలు చేపట్టడంతో ప్రజావాణి గాడిలో పడి అధికారుల్లో మార్పు వస్తుందనే ఆశలు ప్రజల్లో చిగురిస్తున్నాయి. -
మూగ వేదనకు... స్పందించిన ‘ప్రజావాణి’
అనంతగిరి : మూగజీవాలకు వైద్యం అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడిన ఓ రైతు.. లేగ దూడను ఆటోలో తీసుకుని వచ్చి ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ధారూరు మండలం కేరెళ్లికి చెందిన రాములుకు చెందిన ఆవు ఆదివారం లేగదూడకు జన్మనిచ్చింది.పుట్టిన కొద్ది సేపటికే చెంగున ఎగరాల్సిన దూడ చతికిలబడి పేగులు బయటకు ఉండటంతో రైతు గుండె కదిలిపోయింది. వెంటనే పశు వైద్యాధికారులకు ఫోన్ చేస్తే వారు స్పందించలేదు. సోమవారం ఉదయం ఓ డాక్టర్ వచ్చి పరీక్షించినా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీనితో కలత చెందిన రాములు మరికొందరి సాయంతో ట్రాలీ ఆటోలో దూడను తీసుకుని.. కలెక్టరేట్కు వచ్చాడు. ప్రజావాణి కార్యక్రమంలో ఉన్న కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్కు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే స్పందించిన పశు వైద్య జిల్లా అధికారులు దూడకు వికారాబాద్లోని పశువుల ఆస్పత్రికి తరలించి వైద్యం చేసి పంపించారు. -
ఉత్తమ కలెక్టర్గా ఎం.హనుమంతరావు
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. దివ్యాంగులకు అందిస్తున్న విశిష్ట సేవలకు గాను ప్రభుత్వం ఆయనను ‘ఉత్తమ కలెక్టర్’అవార్డుకు ఎంపిక చేసింది. మంగళవారం ఆయన ఈ అవార్డును హైదరాబాద్లో అందుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని సోమవారం ఆయన స్వయంగా వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంలో కలెక్టర్ హనుమంతరావు ప్రత్యేక చొరవ చూపించారు. వీల్చైర్స్ సమకూర్చడం, కళ్లులేని వారిని, నడవలేని వారిని ఇంటి నుంచే సిబ్బందితో పోలింగ్ కేంద్రానికి తీసుకురావడం, ఓటు వేసిన తరువాత మళ్లీ ఇంటి వద్ద వదిలిపెట్టడం, పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన వారికి సిబ్బంది సహాయంగా ఉండడం లాంటి చర్యలను ఆయన చేపట్టారు. దివ్యాంగుల ఆర్థిక ప్రగతికి, ఉపాధి కల్పనకు పెద్దపీట వేశారు. అలాగే బ్యాటరీతో నడిచే వాహనాలు, వీల్చైర్ల పంపిణీ, ప్రజావాణిలో వారి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవడం, డివిజన్ స్థాయిల్లో కూడా వారికి ప్రత్యేకంగా ప్రజావాణి నిర్వహించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ఈ సేవలను గుర్తించి ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో ఆయనను ఉత్తమ కలెక్టర్గా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. -
మీడియాకు నో ఎంట్రీ.!
సాక్షి,సిటీబ్యూరో: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం కవరేజీపై సాక్షాత్తు హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ రవి నాయక్ ఆంక్షలు విధించారు. ప్రజావాణి సమావేశ మందిరంలోకి జర్నలిస్టులకు అనుమతి లేదని, ఫొటోలు తీసుకుని వెళ్లి పోవాలని, సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులు పంపే ప్రెస్నోట్ చూసి వార్తలు రాసుకోవాలని సూచిస్తూ సరి కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. ఇదేంటని ప్రశ్నించిన జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బంది సహకారంతో వారిని బలవంతంగా సమావేశ మందిరం నుంచి బయటికి పంపిన సంఘటన హైదరాబాద్ కలెక్టరేట్లో సోమవారం చోటుచేసుకుంది. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణికి కార్యక్రమాన్ని కవరేజ్ చేసేందుకు వివిధ పత్రికలు, చానళ్ల రిపోర్టర్లు కలెక్టరేట్కు వెళ్లారు. జిల్లా కలెక్టర్ మాణిక్ రాజ్ కన్నన్ ఇతర సమీక్షా సమావేశాల్లో బిజీగా ఉన్నందున ‘ప్రజావాణి’కి హాజరుకాలేదు. దీంతో జాయింట్ కలెక్టర్ రవి, జిల్లా రెవెన్యూ అధికారి భూపాల్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. మధ్యాహ్నం ప్రజా సమస్యలకు సంబంధించి ఆయా శాఖల అధికారులపై జేసీ ఆగ్రహం వ్యక్త చేశారు. దీనిని గమనిస్తున్న జర్నలిస్టులను గుర్తించిన జేసీ జర్నలిస్టుల ప్రజావాణికి పాత్రికేయులు రావాల్సిన అవసరం లేదని, ఫొటోలు తీసుకొని బయటికి వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నివ్వెరపోయిన జర్నలిస్టులు విధి నిర్వహణలో భాగంగా కవరేజీ కోసం వచ్చినట్లు చెప్పగా, మీరు జర్నలిస్టులని తెలుసునని, అయితే సమావేశ మందిరంలోకి అనుమతి లేదని అసహనం వ్యక్తం చేశారు. అక్రిడేటెడ్ జర్నలిస్టులైనా.. తాము ప్రభుత్వం జారీ చేసిన అక్రిడేటెడ్ జర్నలిస్టులమని కార్డులు చూపిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలను కవర్ చేసేందుకు అనుమతి ఉంటుందని కొందరు పాత్రికేయులు జేసీకి వివరించే ప్రయత్నం చేయగా ప్రజావాణి కార్యక్రమం పిటీషన్లు స్వీకరించేందుకు మాత్రమేనని, డీపీఆర్ఓ ప్రెస్ నోట్ పంపిస్తారని, దీనిని ప్రత్యేకంగా కవరేజీ చేయాల్సిన అవసరం లేదన్నారు.వారు పంపించింది రాసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా కాలంగా ప్రజావాణి కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నామని, అన్ని జిల్లాల్లో మీడియాను అనుమతిస్తున్నట్లు చెప్పగా ఆగ్రహానికిలోనైన జేసీ ఆ అవసరం లేదని స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసుకోవచ్చు జాయింట్ కలెక్టర్ ప్రజావాణికి రానివ్వడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చునని సూచించారు. అనంతరం ‘కాల్ది డీపీఆర్ఓ’ అంటూ జర్నలిస్టులపై ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. దీంతో జిల్లా రెవెన్యూ అధికారి సీసీ పవన్ అక్కడికి వచ్చి ప్రాతికేయులను బయటికి వెళ్లాలంటూ నెట్టివేసేందుకు ప్రయత్నించారు. దీంతో కలెక్టరేట్ ఏఓ ఆశోక్ రెడ్డి అక్కడికి వచ్చి తర్వాత మాట్లాడుకుందాం... మొదట బయటికి వెళ్లాలని విలేకరులను బయటికి పంపారు. అనంతరం డీపీఆర్ఓను వేదిక వద్దకు పిలిపించుకున్న జేసీ కేవలం ఫొటోలు తీసుకుని పొమ్మనండి.. మీరు పంపించిన ప్రెస్నోట్ రాసుకోమ్మని చెప్పాలంటూ హుకుంజారీ చేయడం విస్మయానికి గురిచేసింది. -
కంప్లైంట్ ఈజీ..!
గ్రేటర్ జనాభా కోటి దాటింది. ఇంతమందికి పౌరసేవలందిస్తోన్న జీహెచ్ఎంసీ... సమస్యల పరిష్కారానికి, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వివిధ మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సంప్రదాయ పద్ధతిలో వినతిపత్రాల నుంచి ఆధునిక తరహాలో స్మార్ట్ ఫోన్ యాప్స్ వరకు ఏ విధంగా ఫిర్యాదు చేసినా స్వీకరిస్తోంది. మార్పులకు అనుగుణంగా ప్రజలు తమకు అందుబాటులో ఉండే సాధనం ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్నికల్పిస్తోంది. సమస్యలపై ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు జీహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకొచ్చిన ఆయా సదుపాయాలపై ‘సాక్షి’ రిపోర్టు. కాల్ \కాల్ సెంటర్ 040–21111111 జీహెచ్ఎంసీ పరిధిలో సమస్యలకు సంబంధించి ప్రజలు ఈ నంబర్కు ఫోన్ చేయొచ్చు. ఫిర్యాదును బట్టి కాల్ సెంటర్ సిబ్బంది విభాగం, ఏరియా వారీగా సంబంధిత అధికారికి పంపుతారు. వారు ఫిర్యాదును నమోదు చేసుకొని పరిష్కారానికి కృషి చేస్తారు. డయల్ 100 ఇది కూడా జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ తరహాలోనే పని చేస్తుంది. వరద ముంపు, అగ్నిప్రమాదాలు తదితర అత్యవసర సమయాల్లో నేరుగా 100కు డయల్ చేయొచ్చు. యాప్స్/వెబ్సైట్స్ మై జీహెచ్ఎంసీ ఈ మొబైల్ యాప్ ద్వారా ప్రజలు తమ సమస్య/ఫిర్యాదులను సంబంధిత ఫొటోలతో సహా అప్లోడ్ చేసి పంపించొచ్చు. తద్వారా లొకేషన్ను కూడా సులభంగా గుర్తించి అధికారులు వెంటనే చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది. దీని ద్వారా వివిధ విభాగాల సమస్యలపై ఎప్పుడూ అందుబాటులో ఉండే ఫోన్తోనే ఫిర్యాదు చేసే అవకాశం ఉండడంతో దీన్ని ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. ఈ నెల 23 వరకు 8,49,062 మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. స్వచ్ఛ విజిల్ ఇది కూడా ‘మై జీహెచ్ఎంసీ’ లాంటిదే. అయితే ప్రత్యేకంగా స్వచ్ఛత అంశాలు, పారిశుధ్యం సంబంధిత ఫిర్యాదులు మాత్రమే దీని ద్వారా చేయాల్సి ఉంటుంది. చెత్త పేరుకుపోవడం, పరిసరాలు అశుభ్రంగా ఉండడం లాంటి సమస్యలను ఫొటోలు తీసి లొకేషన్ల వివరాలతో పంపిస్తే చర్యలు తీసుకుంటారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్: జీహెచ్ఎంసీ వెబ్సైట్ ద్వారా కూడా ప్రజలు ఫిర్యాదు చేయొచ్చు. ఫోన్కు వచ్చే ఓటీపీ ద్వారా ఫిర్యాదు నమోదు చేయొచ్చు. డైరెక్ట్ కంప్లయింట్ కమిషనర్ పేషీ ప్రజలు తమ ఫిర్యాదులను జీహెచ్ఎంసీ కార్యాలయంలో నేరుగా కమిషనర్కు అందజేయొచ్చు. కమిషనర్ పేషీలో ఫిర్యాదు కాపీని అందజేసినా తీసుకొని నమోదు చేసుకుంటారు. సాయంత్రం విజిటర్స్ సమయంలో నేరుగా కమిషనర్ను కలిసి సమస్యను వివరించడంతో పాటు దాన్ని అందజేయొచ్చు. ఫోన్ ఇన్ ఫోన్ ఇన్ లాంటి కార్యక్రమాల ద్వారా కమిషనర్ ప్రత్యేక సందర్భాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ప్రజావాణి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో కమిషనర్, అడిషనల్ కమిషనర్లు, ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొంటారు. ప్రజల ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను నమోదు చేసుకొని పరిష్కారానికి కృషి చేస్తారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోన్/సర్కిల్ కార్యాలయాల్లోనూ ప్రజావాణి నిర్వహిస్తారు. అక్కడి అన్ని విభాగాల అధికారులు పాల్గొంటారు. ఇతరత్రా... గ్రీవెన్స్ బాక్స్ ప్రజలు తమ ఫిర్యాదులను వేసేందుకు తాజాగా జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో గ్రీవెన్స్ బాక్సులు ఏర్పాటు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం వీటిని ఏర్పాటు చేస్తోంది. పత్రికల క్లిప్పింగ్స్ ప్రజల నుంచి నేరుగా వచ్చే ఫిర్యాదులే కాకుండా దినపత్రికల్లో ఆయా సమస్యలపై ప్రచురితమయ్యే వార్తా కథనాలు, ఫొటో ఫీచర్లను కూడా పరిగణనలోకి తీసుకొని సంబంధిత విభాగానికి పంపిస్తారు. సంబంధిత అధికారి పరిష్కార చర్యలు తీసుకుంటారు. పారిశుధ్యంపై విజిలెన్స్ ఇది జీహెచ్ఎంసీలోని అంతర్గత వేదిక. నగరంలో ఎక్కడెక్కడ పారిశుధ్యం అధ్వానంగా ఉందో? విజిలెన్స్ విభాగం గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజేస్తుంది. సత్వర పరిష్కారానికి సమస్యలు నమోదు చేస్తుంది. సోషల్ మీడియా\ఫేస్బుక్ జీహెచ్ఎంసీ ఫేస్బుక్ ఖాతా ద్వారా కూడా ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు. సిబ్బంది ఫిర్యాదును పరిశీలించి సంబంధిత అధికారికి పంపిస్తారు. సదరు అధికారి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ట్విట్టర్ జీహెచ్ఎంసీ ట్విట్టర్ ఖాతా ద్వారా ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువ మంది ఫిర్యాదు చేస్తున్నారు. దీన్ని ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వంలోని ముఖ్యులు కూడా చూస్తుండడంతో... ఇటు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయడంతో పాటు వారికి కూడా పంపిస్తున్నారు. దీంతో మిగతా అన్ని మార్గాల ద్వారా వచ్చే ఫిర్యాదుల కంటే జీహెచ్ఎంసీ అధికారులు దీనికే అధిక ప్రాముఖ్యం ఇస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తామేం పనులు చేశామనేది ఏరోజుకారోజు అధికారులు దీని ద్వారా ఉన్నతాధికారులకు పోస్ట్ చేస్తున్నారు. సమస్యను పరిష్కరించిన తర్వాత అధికారులు ఫిర్యాదు ఐడీతో సహా తిరిగి రీట్వీట్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ట్విట్టర్ ఖాతాను అనుసరిస్తున్నవారు లక్ష మందికి మించిపోయారు. దేశంలోనే ఏ మునిసిపల్ కార్పొరేషన్కూ ఇంతమంది ఫాలోవర్లు లేరు. ♦ ఫిర్యాదులు ఎక్కువగా మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా వస్తున్నాయి. ఆ తర్వాతి స్థానంలో కాల్ సెంటర్ ఉంది. ♦ అయితే వివిధ వేదికల ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నప్పటికీ... సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ అందుతోంది. కొందరు అధికారులు సత్వరమే స్పందించడం లేదని తెలుస్తోంది. నిధులుఅవసరమయ్యే వాటి విషయంలో ఆలస్యమవుతోందని అధికారులు పేర్కొంటున్నారు. -
మళ్లీ మమ!
సాక్షి, సిటీబ్యూరో: ప్రజావాణి.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీహెచ్ఎంసీలో ప్రతి సోమవారం నిర్వహించే విశిష్ట కార్యక్రమం. కానీ గత కొంత కాలంగా అధికారులు దీన్ని పట్టించుకోవడం లేదు. దాదాపు రెండేళ్లకు పైగా ఇదో మొక్కుబడి తంతుగా తయారైంది. వాస్తవానికి ప్రజావాణికి ఉన్నతాధికారులు హాజరై ప్రజల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. అయితే ఉన్నతాధికారులు కాకుండా సంబంధిత సెక్షన్లోని ఎవరో ఒకరు హాజరవడం కొద్దిరోజులు సాగింది. ఆ తర్వాత కొన్ని విభాగాలు పూర్తిగా రావడమే మానేశాయి. ఇక ఇటీవల కాలంలో ఎన్నికల కోడ్ ప్రజావాణికి అడ్డంకిగా మారింది. పరిస్థితిని గుర్తించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ప్రజావాణికి విభాగాధిపతులంతా తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని, ఏదైనా సమావేశం ఉంటే వేరే వారిని పంపించాలని ఆదేశించారు. విభాగాధిపతులే వెళ్లాల్సి వస్తే ముందస్తుగా తనకు సమాచారమివ్వాలని చెప్పారు. కమిషనర్ సీరియస్ కావడంతో అధికారులంతా హాజరవుతారని భావించారు. కానీ సోమవారం జరిగిన ప్రజావాణికి అన్ని విభాగాల ఉన్నతాధికారులు హాజరు కాలేదు. హాజరైన వారిలోనూ సగం మంది కమిషనర్ వెళ్లగానే జారుకున్నారు. బోనాల ఏర్పాట్లకు సంబంధించి సచివాలయంలో మంత్రితో సమావేశం ఉండడంతో కమిషనర్ వెళ్లారు. ఆయన అటు వెళ్లగానే ఒక్కొక్కరుగా అధికారులు కూడా వెళ్లిపోయారు. ఇలా మొత్తానికి మరోసారి ప్రజావాణిని మమ అనిపించారు. దీన్నో మొక్కుబడి తంతుగా ముగించారు. ఒక్కచోటే హాజరు... జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోనూ ప్రజావాణి సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది. కొందరు జోనల్ కమిషనర్లే ప్రధాన కార్యాలయం నుంచి ఆయా విభాగాలను పర్యవేక్షించే అడిషనల్ కమిషనర్లుగానూ ఉన్నారు. దీంతో వారు ప్రధాన కార్యాలయంలోని ప్రజావాణికి హాజరు కాలేదు. ఇలాంటి అడిషనల్ కమిషనర్లలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్), జీవవైవిధ్య విభాగం పర్యవేక్షణ, ఎస్సార్డీపీ, హౌసింగ్, నాలాల ఆక్రమణలు, చార్మినార్ పాదచారుల పథకం విభాగాల అధికారులు ఉన్నారు. కమిషనర్ సీరియస్.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణికి కమిషనర్ దానకిశోర్ కూడా హాజరయ్యారు. దాదాపు మూడేళ్లుగా ప్రజావాణికి కమిషనర్ హాజరు కావడం లేదు. దానకిశోర్ రావడంతో ఫిర్యాదుదారులు సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన ఆయన సంబంధిత అధికారులకు వాటిని మార్క్ చేశారు. ఎంతోకాలంగా అందుతున్న ఫిర్యాదులను పట్టించుకోని అధికారులను ఫోన్లోనే మందలించారు. ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణం స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెరిగిన ఫిర్యాదులు.. ప్రజావాణి నిర్వహణపై కమిషనర్ సీరియస్ అయిన తెలియడంతో గతంలో కంటే ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రధాన కార్యాలయానికి 33 మంది తమ ఫిర్యాదులు అందజేసేందుకు వచ్చారు. జీహెచ్ఎంసీలో ప్రజావాణికి అందే ఫిర్యాదుల్లో సింహభాగం టౌన్ప్లానింగ్వే. సోమవారం ప్రధాన కార్యాలయంలో ప్రజావాణికి మొత్తం 33 ఫిర్యాదులు రాగా... వీటిలో 22 టౌన్ప్లానింగ్వే. ముషీరాబాద్లో 40 గజాల స్థలంలో ఐదంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారని, పంజగుట్ట మీరా ట్రేడ్ సెంటర్ వద్ద అక్రమ షెడ్లను నిర్మించారని, రోడ్ల తవ్వకాలు, ఫుట్పాత్ల ఆక్రమణలు తదితర అంశాలపై కమిషనర్కు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులు ఇలా.. ఇంజినీరింగ్ 8 వెటర్నరీ 1 టౌన్ప్లానింగ్ 22 రెవెన్యూ (ఆస్తిపన్ను) 2 -
కష్టం చెబితే కేసుపెట్టారు!
నా ప్రాధాన్యం ప్రజావాణికే..సోమవారం కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్సెల్కు అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరు కావాల్సిందే.. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవు.. అని బాధ్యతలు స్వీకరించిన తర్వాత కలెక్టర్ కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు.తొలివారం గ్రీవెన్స్సెల్ లోచిన్న సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలిచ్చారు.. ఈ వార్త ప్రజలకు చేరడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కా రం కోసం ప్రజలు తరలివస్తున్నా రు. తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ తరుణంలో సోమవారం కలెక్టర్ భాస్కర్ ప్రజావాణిలో వ్యవహరించిన తీరుపై అందరి నుంచి అసంతృప్తి వ్యక్తమయింది. సాక్షి, విశాఖపట్నం: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో తన గోడు చెప్పుకునేందుకు వచ్చిన ఓ అర్జీదారుడిపై కలెక్టర్ ఏకంగా కేసు నమోదు చేయించారు. రెవెన్యూ శాఖకు చెందిన రిటైర్డ్ అధికారిపైనే కలెక్టర్ ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడున్న అధికారులతో పాటు అర్జీదారులు కూడా విస్తుపోయారు. ఇదీ పరిస్థితి సంక్రాంతి తర్వాత బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ కాటమనేని భాస్కర్ గడిచిన మూడు వారాలుగా అన్నీ తానై గ్రీవెన్స్సెల్ నిర్వహిస్తున్నారు. అర్జీదారుల సమస్యలను ఓపిగ్గా వింటూ వారి సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో చెప్పులరిగేలా తిరిగినా సమస్యలు పరిష్కారం కాని వారంతా మళ్లీ కలెక్టరేట్కు క్యూ కడుతున్నారు. ఈ కారణంగానే సోమవారం రికార్డుస్థాయిలో 455 మంది అర్జీదారులు వచ్చారు. విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్పైకేసు నమోదుకు ఆదేశం కలెక్టరేట్లోని యూఎల్సీ విభాగంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసి రిటైర్ అయిన ఎల్.విజయ్కుమార్ ఏళ్ల తరబడి పరిష్కారం కాని తన సమస్య చెప్పుకునేందుకు సోమవారం కలెక్టరేట్కు వచ్చారు. 2013లో రిటైర్ అయిన ఈయనకు ఇంత వరకు పదవీవిరమణ ప్రయోజనాలు అందలేదు. మూడు పీఆర్సీలు అమలు కాలేదు. 13కు పైగా ఇంక్రిమెంట్లు పడలేదు. దాదాపు ఆరేళ్లుగా పెన్షన్ రావడం లేదు. ఈ విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారానికి నోచుకోలేదు. కొత్త కలెక్టర్కు చెప్పుకుంటే సమçస్య పరిష్కారమవుతుందన్న ఆశతో విజయ్కుమార్ సోమవారం గ్రీవెన్స్సెల్కు వచ్చారు. సమస్య చెప్పుకోగా.. ఆసాంతం విన్న కలెక్టర్ భాస్కర్ కొంత సమయం పడుతుంది..అంతతొందరగా అవదు కదా అంటూ బదులివ్వడంతో రిటైర్డ్ డీటీ కాస్త ఆవేదనతో తన గోడు చెప్పుకునే ప్రయత్నం చేశారు. పెన్షన్ కూడా రాకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది సార్ అంటూ తన గోడును మరోసారి చెప్పుకునే ప్రయత్నం చేయడంతో కలెక్టర్ అతనిపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పాలి..అర్ధం కాదా అంటూ మండిపడ్డారు. పక్కనే ఉన్న డీఆర్వో చంద్రశేఖర్రెడ్డి వైపు చూసి ఏంటిది ? ఇక్కడ నుంచి తీసుకెళ్లండి? అని హుకుం జారీ చేశారు. విధులకు విఘాతం కల్గించారన్న అభియోగంపై ఫిర్యాదు చేయాల్సిందిగా డీఆర్వోను ఆదేశించారు. అంతే డీఆర్వో ఆదేశాల మేరకు కలెక్టరేట్ బీట్ చూసే పోలీసు సిబ్బంది రిటైర్డ్ డీటీ విజయకుమార్ను బలవంతంగా అక్కడ నుంచి మహారాణిపేట పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి మల్లేశ్వరరావు ఫిర్యాదు మేరకు మహారాణిపేట పోలీసులు రిటైర్డ్ డీటీ పై సెక్షన్ 186, సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. గోడు చెప్పుకుంటే కేసులు పెడతారా? అంటూ విజయకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని తన సమస్యను కొత్త కలెక్టర్ అయినా పరిష్కరిస్తారని వస్తే తనపై కేసులు పెట్టిస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. -
మూగవాణి!
సాక్షి, సిటీబ్యూరో: ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ చేపట్టిన ‘ప్రజావాణి’ కార్యక్రమం ప్రస్తుతం ఎవరికీ పట్టని పనికిమాలిన ‘వాణి’గా మారింది. ఐదారేళ్ల క్రితం కృష్ణబాబు జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నప్పుడు చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎంతో ఆదరణ ఉండేది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమానికి ఉదయం 10 గంటల కల్లా వచ్చే ప్రజలు క్యూ కట్టేవారు. వచ్చిన వారందరినీ వరుస క్రమంలో పంపించేందుకు వరుస నెంబర్లతో టోకెన్లు జారీ చేసేవారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకే సమయమైనా..అందరిఫిర్యాదులూ స్వీకరించేంత వరకు అధికారులు ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఉండేవారు. కమిషనర్తోపాటు అన్ని విభాగాల అడిషనల్ కమిషనర్లు.. తదితరులు తప్పనిసరిగా ఉండేవారు. తమ వద్దకు వచ్చిన ప్రజల వేదనల్ని సావధానంగా వినేవారు. అప్పటికప్పుడే కంప్యూటర్లోనూ నమోదు చేసేవారు. అన్నీ పూర్తయ్యాక సంబంధిత విభాగాలకు పంపించేవారు. ప్రతివారం ఎన్ని ఫిర్యాదులొచ్చిందీ.. పత్రికా ప్రకటన సైతం విడుదల చేసేవారు. ఆ తర్వాత సోమేశ్కుమార్ కమిషనర్గా వచ్చిన తర్వాత కూడా కొంత కాలం వరకు ఈ కార్యక్రమం సజావుగా సాగింది. ఆ తర్వాత కమిషనర్ లేకపోయినా..కనీసం అడిషనల్ కమిషనర్ స్థాయి వారు ప్రజావాణికి హాజరయ్యేవారు. ఆయా విభాగాలకు సంబంధించి ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకునేది వారే కనుక అడిషనల్ కమిషనర్లుండేవారు. ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్ తదితర విభాగాల అధిపతులూ తప్పనిసరిగా ఉండేవారు. దాదాపు రెండేళ్లుగా మొక్కుబడి తంతుగా సాగుతోన్న ప్రజావాణి గత ఏడాది కాలం నుంచి మరీ అధ్వాన్నంగా మారింది. కమిషనర్ సంగతటుంచి, కనీసం అడిషనల్ కమిషనర్లు కూడా హాజరు కావడం లేదు. విభాగాల ఉన్నతాధికారులూ రావడం లేదు. తప్పదన్నట్లుగా.. మొక్కుబడిగా ఒకరో ఇద్దరో వచ్చి కూర్చుంటున్నారు. అదీ క్లర్కులు, సూపరింటెండెంట్లు సైతం ఎవరు అందుబాటులో ఉంటే వారు కూర్చొని ప్రజలిచ్చే ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అన్ని విభాగాల వారు ఉండకపోవడంతో పాటు పరిష్కారంపై నిర్ణయం తీసుకునేవారు లేకపోవడంతో ఆయా విభాగాలకు సంబంధించి సరైన సమాధానం ఇచ్చేవారు లేరు. ‘ఫిర్యాదు ఇచ్చిపోండి..పరిష్కరిస్తాం’ అని చెబుతూ ఫిర్యాదు పత్రం స్వీకరిస్తున్నారు. కనీసం వాటినైనా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా అంటే అదీ లేదు. తీసుకున్న ఫిర్యాదు కాగితాల్ని ఆ తర్వాత ఎప్పుడో ఆన్లైన్లో ఉంచుతున్నారు. అందిన అన్ని ఫిర్యాదుల్నీ ఆన్లైన్లో ఉంచని ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు తాజాగా సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణికి అందిన ఫిర్యాదులే పది కాగా, వాటిల్లో ఒకటి కనిపించకుండా పోయింది. ఇక ఫిర్యాదు పరిష్కారమవుతుందనుకోవడం భ్రమే. ప్రజావాణిలో అందజేస్తే తమ ఫిర్యాదు వెంటనే పరిష్కారమవుతుందని భావించి పలువురు ఎంతో దూరం నుంచి వ్యయప్రయాసల కోర్చి వస్తున్నారు. పది గంటల నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా, ఒక్కోసారి 11.30 గంటల వరకు కూడా ప్రారంభం కావడం లేదు. తాజాగా సోమవారం ప్రజావాణికి సైతం అడిషనల్ కమిషనర్లు, విభాగాధిపతులెవరూ హాజరు కాలేదు. వచ్చిందే నలుగురు. ఫిర్యాదులు నమోదు చేసే కంప్యూటర్ ఆపరేటర్ సైతం సోమవారం 12 గంటల దాకా రాకపోవడంతో స్వీకరణలో జాప్యం జరిగింది. అంతమాత్రం దానికి కార్యక్రమాన్నే పూర్తిగా ఎత్తివేస్తే పోద్దికదా అని దూరం నుంచి వచ్చిన ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పదే ఫిర్యాదులు.. ఇక ఫిర్యాదుల్లో ప్రతిసారీ టౌన్ప్లానింగ్దే సింహభాగం. ఫిర్యాదులెన్ని అందినా అక్రమార్కులతో మిలాఖతయ్యే టౌన్ప్లానింగ్ అధికారులు వాటిని పరిష్కరించరు. తిరిగి, తిరిగి విసిగి వేసారి పోవాల్సిందే. సోమవారం మొత్తం పది ఫిర్యాదులందగా, అందులో టౌన్ప్లానింగ్వే ఆరు ఉన్నాయి. ఆస్తిపన్ను, ఇంజినీరింగ్, ఆరోగ్యం– పారిశుధ్యం తదితర విభాగాలకు చెందినవి ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. గణాంకాలు చూపేందుకు మాత్రం అందిన ఫిర్యాదుల్లో 60 –90 శాతం వరకు పరిష్కారమైనట్లు పేర్కొంటారు. సర్కిళ్లలో పరిష్కారం కాక.. సర్కిళ్లు, జోన్ల స్థాయిల్లో పరిష్కారం కావాల్సినవి సైతం అక్కడ పరిష్కారం కాక ఎందరో ప్రధాన కార్యాలయానికి వస్తుంటారు. యూసుఫ్గూడ ప్రాంతంలో తన ఇంటిలో కొంతభాగాన్ని ఇతరులకు అమ్మితే.. మొత్తం ఇల్లును అమ్మినట్లు మ్యుటేషన్ చేశారని, తన ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా సర్కిల్స్థాయి అధికారులకు ఎన్ని పర్యాయాలు విన్నవించుకున్నా.. పట్టించుకోకపోవడంతో ఇక్కడికొచ్చినట్లు ఒకరు వాపోయారు. పైపెచ్చు రెండు పర్యాయాలు సంబంధిత డాక్కుమెంట్లు సమర్పించినా, కనిపించడం లేవని చెబుతున్నారని వేదన వ్యక్తం చేశారు. -
‘డబుల్’ ధమాకా..!
సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి కొలువు తీరడంతో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం పేదలు మరింత ఆశల పెంచుకున్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం అధికారికంగా ఎలాంటి దరఖాస్తులు కోరనప్పటికీ పేదల ఉరుకులు, పరుగులు మాత్రం అధికమయ్యాయి. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించే విధానం అమల్లో ఉండటంతో డబుల్ బెడ్రూమ్ దరఖాస్తులు మీ సేవ, ఈ–సేవ కేంద్రాలకు కాసులు కురిపిస్తున్నాయి. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తుల ప్రతులను తీసుకొని కలెక్టరేట్ వద్ద క్యూ కడుతున్నారు. ఎన్నికల ఎన్నికల కోడ్ ముగిసి జిల్లా కలెక్టరేట్లలో ప్రజావాణి కార్యక్రమం ఫునఃప్రారంభం కావడంతో సోమవారం దరఖాస్తుల తాకిడి అధికమైంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో పేదల డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు సమర్పించారు. పెండింగ్ దరఖాస్తులే మూడు లక్షలు.. మహా నగర పరిధిలోని హైదరాబాద్–రంగారెడ్డి–మేడ్చల్ జిల్లా రెవెన్యూ యంత్రాంగాల వద్ద సుమారు మూడు లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మొదటి విడతగా మురికి వాడల్లోని నివాస ప్రాంతాల్లో స్థల లభ్యతను బట్టి ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ చేపడుతోంది. ఇప్పటికే అక్కడ ఉంటున్న లబ్ధిదారులందరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసి పోజిషిన్ సర్టిఫికెట్లను అందజేసింది. మొదటి విడత నిర్మాణాలు పూర్తయినా తర్వాత రెండో విడతలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. ఆయితే మొదటి విడత పనులే నత్తనడక నడుస్తున్నాయి. వాస్తవంగా ప్రభుత్వం నగరంలో రెండు లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఈ ఆర్ధిక సంవత్సరం లక్ష ఇళ్లు లక్ష్యంగా పెట్టుకొని డిసెంబర్ అఖరు నాటికి దాదాపు 40వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా సెప్టెంబర్ మొదటి వారం వరకు వడివడిగా సాగిన పనులు ఆ తర్వాత మందగించాయి. ఇందుకు బిల్లుల చెల్లింపు పెండింగ్ పడడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ ఏడాది లక్ష్యం... ఈ ఏడాది మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి వరకు మూడు ప్రాంతాల్లో 496 డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మరో 38 ప్రాంతాల్లో 39,669 ఇళ్లు పూర్తి కావాల్సి ఉంది. వచ్చే వేసవి నాటికి: 68 ప్రాంతాల్లో 59,835 పూర్త చేయాల్సి ఉంది. ప్రస్తుతం అమీన్పూర్లో (176), గాజుల రామారంలో (144), జమ్మిగడ్డలో (56),సయ్యద్సాబ్ కాబాడాలో (48) తదితర ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయ్యాయి. జియాగూడలో(840), బండ మైసమ్మనగర్, అహ్మద్గూడలో (4428) డి.పోచంపల్లిలో(1404), ఎరుకల నాంచారమ్మబస్తీలో (288), బహదూర్పల్లిలో (900) తదితర ప్రాంతాల్లో పనులు కొంత మంద కొడిగా సాగుతున్నాయి. ఇళ్ల నిర్మాణం ఇలా... నగరంలో స్థల లభ్యతనుబట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జీ+3, జీ+5, జీ+9 అంతస్తులుగా నిర్మిస్తున్నారు. వీటిల్లో ఒక్కో యూనిట్కయ్యే ఖర్చు అంచనా వేస్తే జీ+3 : రూ. 7 .00 లక్షలు, జీ+ 5 : రూ. 7.75 లక్షలు, జీ+9 : రూ. 7.90 లక్షలు ఖర్చు అవుతోంది. ఇందులో ఒక్కో యూనిట్కు లక్షా యాభైవేలు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్యోజన ద్వారా చెల్లిస్తోంది. మిగతా మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వమే చెల్లించాలి. వీటితోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు మరి కొంత ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. వాస్తవంగా లక్ష ఇళ్ల నిర్మాణం కోసం మొత్తం అంచనా వ్యయం రూ. 8598 కోట్లు, కాగా,అందులో కేంద్రప్రభుత్వ సబ్సిడీ రూ. 1500 కోట్లు. ఇప్పటి వరకు రూ. 2000 కోట్ల విలువైన పనులు జరుగగా రూ. 1600 కోట్లు చెల్లింపు జరిగింది. మరో నాలుగు వందల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. -
కేఎఫ్ బీర్లను విక్రయించాలి.. వైరల్ లేఖ
సాక్షి, జగిత్యాల : ప్రజావాణిలో జగిత్యాల జిల్లా కలెక్టర్కు ఓ వ్యక్తి రాసిచ్చిన ఫిర్యాదు లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వైన్స్షాపుల్లో, బార్లలో కింగ్ ఫిషర్ బీర్లను విక్రయించేలా చర్యలు తీసుకోవాలని జగిత్యాలకు చెందిన అయిల సూర్యనారాయణ(టీవీ.సూర్యం) సోమవారం జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మద్యంప్రియులు, యువత ఎక్కువగా ఇష్టపడే కింగ్ఫిషర్ బీర్ల విక్రయాలతో ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందన్నారు. మద్యం విక్రయదారులు సిండికేట్గా మారి కింగ్ఫిషర్ బీర్లను విక్రయించడం మానేశారని, వాటి స్థానంలో నాసిరకం బీర్లను విక్రయిస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 లో పేర్కొన్న ప్రాథమిక హక్కులలోని స్వేచ్ఛతో కూడిన కొనుగోలు హక్కుకు మద్యం విక్రయదారులు భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీర్ల విక్రయాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో బీర్లపై ఫిర్యాదు రావడంతో అధికారులతో పాటూ, ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారు కూడా ఆశ్చర్యపోయారు. అధికారులు ఆ లేఖను అబ్కారీ శాఖకు పంపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ -
విన్నాం.. చూస్తాం..
జనం సమస్యలు తెలుసుకొని సత్వర పరిష్కారం కోసం జిల్లా ఉన్నతాధికారులు నిర్వహిస్తున్న ‘ప్రజా వాణి’ మొక్కుబడిగా సాగుతోంది. వినతులు తీసుకోవడం, తరువాత బుట్టదాఖలు చేయడం సర్వసా«ధారణమైపోయింది. ఫలితంగా ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్న బాధితుల వేదన అరణ్యరోదనగానే మారుతోంది. జిల్లా స్థాయి అధికారులైనా న్యాయం చేస్తారని వ్యయప్రాయాసలకోర్చి వస్తున్న వారికి నిరాశే మిగులుతోంది. –చిత్తూరు, సాక్షి చిత్తూరు, సాక్షి: జిల్లాలో ప్రతి సోమవారమూ ‘ప్రజావాణి’ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయి తీ. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్, మండల కేంద్రాల్లో తహసీల్దార్ నేతృత్వంలో వినతులు స్వీకరణ జరుగుతోంది. జిల్లాస్థాయిలో నిర్వహించే సమావేశానికి ఆయా శాఖల హెచ్వోడీలు, మండల స్థాయిలో వివిధ శాఖల మండల స్థాయి అధికారులు ప్రజావాణిలో పాల్గొనాలి. చాలాచోట్ల తహసీల్దార్ తప్ప ఇంకెవరూ భాగస్వాములు కావడం లేదు. జిల్లాస్థాయిలో కలెక్టర్ ఉంటారన్న భయంతో విభాగాధిపతులు హాజరవుతున్నారు. కొన్ని శాఖల అధికారులు కింది స్థాయి సిబ్బందిని పంపిస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. కిందిస్థాయి సిబ్బంది హెచ్వోడీలకు సమస్యలు వివరించే పరిస్థితి ఉండదు. చెప్పినా వింటారనే భావన లేదు. నేరుగా హెచ్వోడీలే ప్రజావాణిలో పాల్గొంటే కలెక్టర్ దగ్గరే సమస్యపై స్పష్టత వచ్చే వీలుంటుంది. ప్రజావాణికి రాని విభాగాధిపతులకు నోటీసులు జారీ చేస్తే మరో ప్రజావాణికైనా వచ్చే వీలుంటుంది. ప్రజావాణి 11 గంటలు దాటితే కానీ ప్రారంభం కావడం లేదు. దీనివల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఇబ్బంది పడుతున్నారు. వేదిక మీద కూర్చున్న తర్వాత హడావుడిగా వినతులు స్వీకరిస్తున్నారు. వినతిపత్రం ఇస్తున్న వారితో ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. రెవెన్యూ శాఖవే ఎక్కువ ఫిర్యాదులు.. ♦ రెవెన్యూ శాఖ సమస్యలే ఎక్కువ ఫిర్యాదులుగా వస్తున్నాయి. ఫిర్యాదు చేసిన వారే ప్రతి వారమూ వస్తున్నారు. ♦ క్షేత్ర స్థాయిలో అధికారుల పర్యటనలు తక్కువ కావడం కూడా దీనికి కారణం. ♦ భూ సరిహద్దులపై స్పష్టత లేకపోవడంపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. ఒకరి భూ మిలోకి మరొకరు వచ్చారని ఆక్రమించుకుంటున్నారన్న ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ♦ క్లిష్టమైన సమస్యలను రెవెన్యూ శాఖ ఎదుర్కొంటోంది. ఈ ఏడాది జనవరి నుంచి 534 వినతులు వస్తే వాటిలో 73 మాత్రమే పరిష్కారమయ్యాయి. ♦ మిగతా శాఖల్లో ప్రజల నుంచి 50కి మించిన ఫిర్యాదులు రావడం లేదు. కొన్ని ఫిర్యాదులను ప్రజావాణిలో నమోదు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. ♦ ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కలెక్టర్ వినతులు స్వీకరించే సంప్రదాయం గతంలో ఉండేది. ఇప్పుడది లేదు. ♦ ప్రజావాణి ఫిర్యాదులపై సమీక్షలు, సమావేశాలు లేకపోవడం వల్ల కూడా పరిష్కారాలు తక్కువ నమోదవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ♦ హౌసింగ్ విభాగంలో 542 వినతులు వచ్చాయి. వీటిలో కేవలం 190 మాత్రమే పరిష్కారమయ్యాయి. ♦ ఎస్సీ, ఎస్టీల ఫిర్యాదులు పరిష్కరించడంలో అ«ధికారులు అలసత్వం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సమస్యలు పరిష్కరించడం లేదు అధికారులు అర్జీలు తీసుకుంటున్నారే గాని సమస్యలు పరిష్కరించడం లేదు. ఏడాదిన్నరగా దారికోసం ఇప్పటికి కలెక్టర్కు ఏడుసార్లు విన్నవించాను. పట్టించుకోలేదు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఆ అర్జీలు తిరిగి మండల అధికారులకు వస్తున్నాయి. మం డల అధికారులు సమస్యను పరిష్కరించకపోగా దురుసుగా ప్రవరిస్తున్నారు.– టి.రమేష్, ఈఆర్ కండ్రిగ, జీడీనెల్లూరు లోకేష్బాబుది కుప్పం మండలం కొత్తపల్లె. 45శాతం వికలాంగత్వం ఉన్నట్లు సదరం నుంచి ధ్రువీకరణ పత్రం ఉంది. వికలాంగ పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు కాలేదు. కలెక్టరేట్కు మూడు సార్లు తిరిగాడు. సోమవారం మళ్లీ అర్జీ ఇచ్చాడు. తన వినతిని పట్టించుకోవడం లేదని లోకేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకు పింఛను మంజూరు చేయరో కూడా చెప్పడం లేదని వాపోతున్నాడు. -
అర్హత సాధించినా ఉద్యోగమివ్వరా?
ఖమ్మం సహకారనగర్: కోర్టులో ప్రభుత్వ ఉద్యోగానికి తాను అర్హత సాధించినా తనకు ఉద్యోగం ఇవ్వలేదని ఖమ్మంకు చెందిన ఓ యువకుడు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నగరంలోని నిజాంపేటకు చెందిన జాగటి సాంబయ్య కోర్టులో అటెండర్ ఉద్యోగానికి 2012లో దరఖాస్తు చేశాడు. అయితే, అతడికి ఉద్యోగం రాలేదు. కానీ, సమాచార హక్కు చట్టం వివరాల ప్రకారం.. తాను రెండో సా ్థనంలో ఉండగా, మొదటి, మూడో స్థానంలో ఉన్న వారికి అటెండర్ ఉద్యోగం కల్పించారని తేలింది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ను కలిసేందుకు ప్రజావాణికి వచ్చాడు. దీంతో ఔట్ సోర్సింగ్లో ఉద్యోగం కల్పిస్తానని చెప్పడంతో మనస్తాపానికి గురై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అధికారులు, కలెక్టర్లు గన్మెన్లు అతడిని అడ్డుకుని బయటకు పంపించారు. -
న్యాయం జరిగేలా చూడాలి
మెదక్ మున్సిపాలిటీ : ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ చందనాదీప్తి అధికారులను ఆదేశించారు.సోమవారం మెదక్లోని జిల్లా పోలీసుకార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మనోహరబాద్ మండలం కొండాపూర్ గ్రామానికిచెందిన జల్లి రామకృష్ణ తాను ప్రేమించుకొని 2018 మే24న ఆర్యసమాజ్లో పెళ్లి చేసుకున్నామని, దీంతో మా కుటుంబ పెద్దలు నా భర్తను చంపేస్తామని బెదిరిస్తున్నారని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మంగోల్ గ్రామానికిచెందిన దాసరి హైమావతి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అలాగే తన భర్త పరమేష్ ప్రతిరోజు మద్యం తాగివచ్చి కొడుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని మెదక్ మండలం అవుసుపల్లి గ్రామం బొల్లారం తండాకు చెందిన బానోత్రాణి ఫిర్యాదు చేసింది. మా సొంత వ్యవసాయ భూమిని గొల్ల కంచన్పల్లి నర్సింలు అనే తనకు తెలియకుండా ట్రాక్టర్తో దున్నాడని, ఈ విషయంలో అతన్ని ప్రశ్నించగా గ్రామ పెద్ద సమక్షంలో విచారణ చేస్తుండగా నా కొడుకులను నర్సింలు,యాదయ్య, మహేష్ అనే వ్యక్తులు దాడిచేసి గాయపర్చారని, న్యాయం చేయాలంటూ శివ్వంపేట మండలం దంతాన్పల్లి గ్రామానికి చెందిన గొల్ల పెంటయ్య ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చట్టపరమైన విషయంలో న్యాయం జరగకుంటే ఫిర్యాదుదారులు తిరిగి తనను సంప్రదించవచ్చన్నారు. -
ఆవేదనల నివేదనలు
కరీంనగర్సిటీ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా నలు మూలలా నుంచి బాధితులు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించి న ప్రజావాణికి తరలివచ్చారు. ఎండను సైతం లెక్క చేయడం లేదు. ప్రధానంగా పట్టాపాసుపుస్తకాల్లో సవరణలు, భూ సమస్యలు, పింఛన్లు, డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం, ఉద్యోగాల కల్పన కోరుతూ అర్జీలు సమర్పించారు. జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్, ట్రెయినీ ఐఏఎస్ రాజశ్రీషార్ వినతులు స్వీకరించారు. అంతకుముందు జిల్లా అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రానికి రాలేని ప్రజలు తమ సమస్యలను ప్రతీ సోమవారం నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి ఫోన్ ద్వారా తెలుపుతారని, సంబంధిత జిల్లా అధికారులు వెంటనే సమస్యలకు పరిష్కారం చూపుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ నుంచి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీసీ కార్పొరేషన్ రుణం మంజూరు కోసం దరఖాస్తు చేశానని.. ఇంతవరకు మంజూరు కాలేదని తెలుపగా పరిశీలిస్తామని జేసీ అన్నారు. రామడుగు మండలం తిరుమలాపూర్ నుంచి మల్లేశం మాట్లాడుతూ.. తన భూమి కేసు కోర్టులో పెండింగ్లో ఉందని, కానీ నా ప్రత్యర్థికి పట్టాదారు పాసుపుస్తకం జారీ అయిందని తెలుపగా, వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారు. జమ్మికుంట మండలం బిజిగిరీషరీఫ్ నుంచి సదానందచారి మాట్లాడుతూ.. గ్రామానికి మానేరు నుంచి తాగునీటి పైప్లైన్ వేశారని.. ఇంతవరకు కనెక్షన్ ఇవ్వలేదని తెలుపగా గ్రామంలో ఆరు బావులను అద్దెకు తీసుకుని తాగునీటిని సరఫరా చేస్తున్నామని తాగునీటికి కొదువ లేదని జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు. చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామం నుంచి మహేశ్ మాట్లాడుతూ జంగోలకుంట చెరువు నుంచి మట్టిని తీసి భూమిని కబ్జా చేసుకుంటున్నారని తెలపగా వెంటనే తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని తహశీల్దార్ను జేసీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో అయేషా మస్రత్ ఖానమ్, జిల్లా పరిషత్ సీఈవో పద్మజారాణి, వయోజన విద్యాశాఖ డీడీ జయశంకర్, జౌళిశాఖ ఏడీ వెంకటేశం, మెప్మా పీడీ పవన్కుమార్, జిల్లా మార్కెటింగ్ శాఖ డీడీ పద్మావతి, సీపీవో పూర్ణచందర్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. -
సత్వరమే పరిష్కరించాలి
వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ శ్వేతామహంతి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు 120 ఫిర్యాదులు అందినట్లు గ్రీవెన్స్ సెల్ అధికారరులు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులలో ఎక్కువగా భూములు, పింఛన్లు, నీటి సమస్యలు పరిష్కరించాలని, గ్రామాల్లో బెల్టుషాపులను తొలగించాలని, మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యతను పరిశీలించాలని ఫిర్యాదులు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖలకు సిఫారస్ చేస్తూ.. ఫిర్యాదుదారులకు రశీదులు ఇచ్చి పంపించారు. కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్తోపాటు ఇన్చార్జ్ జేసీ చంద్రయ్య ఫిర్యాదులు స్వీకరించారు. అలాగే, జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో ఒకేఒక్క జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు. తగినంత మంది సిబ్బంది లేక ప్రభుత్వం కార్మికుల కోసం ప్రవేశపెట్టిన చాలారకాల దరఖాస్తులు పెండింగ్లో పడిపోతున్నాయి. కార్మికులకు అందాల్సిన చెల్లింపులలో తీవ్ర జాప్యం నెలకొంటుందని భవన నిర్మాణ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. ఊర్లోలేరని.. భూమి స్వాధీనం భర్త చనిపోవడంతో పిల్లల పోషనకు పట్నం పోతే.. మా భూమిని పక్కన ఉన్న రైతులు వారి భూమిలో కలుపుకున్నారు. మా తండ్రికి ఇందిరమ్మ పాలనలో అసైన్డ్ చేసిన 1.30 ఎకరాల భూమిని పెళ్లి సమయంలో నాకు రాసిచ్చారు. ముందు నుంచి తామే.. భూమిని సాగు చేసుకుని పంటలు పండించుకున్నాం. ఎవ్వరూ లేరని భూమిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు కలెక్టర్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదు.– చెన్నమ్మ, గోపాల్పేట మంచినీటి సమస్య పరిష్కరించాలి నాలుగేళ్లుగా వేసవి వ చ్చిందంటే.. గ్రామంలో తీవ్ర మంచినీటి సమస్య ఉత్పన్నమతుంది. గ్రామానికి చుట్టూ నీరున్నా.. తాగడానికి గుక్కెడు నీటికోసం అవస్థపడాల్సి వస్తోంది. ఈ నెల 19న సమస్యను డీపీఓ దృష్టికి తీసుకువెళ్తే.. ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. కలెక్టర్ స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలి. – గ్రామస్తులు, ఆరేపల్లి, ఆత్మకూరు మండలం నా కుమారుడి ఆచూకీ గుర్తించాలి మా కుమారుడు మహేష్ను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్లో చేర్పించాం. అక్కడే హాస్టల్లో ఉంచి చదివించాం. గతనెలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిసిన రోజు మహేష్ ఇంటికి రాకపోవడంతో కళాశాల యాజమాన్యాన్ని సంప్రదిస్తే మాకు తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. పోలీస్స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి నెలరోజులు పూర్తయినా నేటికీ ఆచూకి తెలియలేదు. – తల్లితండ్రులు, సాసనూలు, ఇటిక్యాల మండలం అనధికారిక మద్యం విక్రయాలపై.. మా గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా కిరాణం షాపులలో మద్యం విక్రయిస్తున్నారు. నిత్యం సాయంత్రం అయ్యిందంటే.. గ్రామశివారులలో మద్యం సీసాలతో గుంపులు కనిపిస్తాయి. రోజురోజుకు మద్యం సేవించేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. అనధికారికంగా గ్రామంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను తొలగించాలి.– రాముడు, అశోక్, కంభాళాపురం ఖాళీ బిందెలతోతండావాసుల నిరసన గతనెల రోజులుగా మా తండాలో మంచినీటి సమస్య నెలకొందని, అధికారులకు, పాలకులు చెప్పినా.. పట్టించుకోవటం లేదంటూ.. సోమవారం శ్రీనివాసపురం తండాకు చెందిన గిరిజన మహిళలు, పిల్లలు ఖాళీ బిందెలతో కలెక్టరేట్కు వచ్చారు. సుమారు గంటపాటు అక్కడే నిరసన తెలిపారు. అధికారులు, పాలకులకు ఈ విషయమై పలుమార్లు విన్నవించినా పటించుకో వడంలేదని ఆరోపించారు. సమస్యను కలెక్టర్కు వివరించారు. ఆమె సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో గిరిజన మహిళలు శాంతించారు. -
పైసలివ్వనందుకు పట్టామార్చారు
సిరిసిల్ల టౌన్: ‘సారూ.. నాకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు. ఊరు శివారులో 27 గుంటల భూమి ఉంది. దాన్ని ఆధారంగానే కుటుంబాన్ని సాకుతున్న.. కానీ, వీఆర్వో ఆ భూమిని వేరేవాళ్ల పేరు మీద రాసిండ్రు.. ఆయన అడిగిన పైసలు ఇయ్యలేదని గిట్ల జేసిండ్రు.. ఇగ నాకు ఆధారం ఎట్లా? గందుకోసమే పురుగుల మందు తాగుతున్న..’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్కు చెందిన బొమ్మెన తిరుపతి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కృష్ణభాస్కర్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. అధికారు లు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. బొమ్మెన తిరుపతి తండ్రి ఎల్లయ్యకు గ్రామ శివారులోని సర్వేనంబర్ 20లో 1.29 ఎకరాల భూమి ఉంది. దీనిని 2015 డిసెంబర్లో తన కుమారుడు తిరుపతి పేరిట రిజిస్ట్రేషన్ చేయించి, రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించారు. దీని పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా బ్యాంకులో రుణం తీసుకున్నాడు. ఇటీవల వీఆర్వో ఒకరు 1.29 ఎకరాల్లోని 27 గుంటలను ఇతరుల పేరిట పట్టా చేశారు. తన భూమిని ఇతరులకు ఎలా పట్టా చేస్తావని బాధితుడు ఆ వీఆర్వోను నిలదీయ గా.. అవతలి పార్టీ వారు రూ.30 వేలు ఇచ్చారని, నువ్వు రూ.50 వేలు ఇస్తే.. పట్టా నీ పేరిట చేస్తానన్నాడు.దీంతో మనస్తాపానికి గురైన తిరుపతి కుటుంబ సభ్యులతో కలసి సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించే ప్రజావాణికి హాజరయ్యాడు. తన భూమిని ఇతరుల పేరిట పట్టా చేసి, లంచం అడుగుతున్న వీఆర్వోపై చర్య తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేందుకు యత్నించగా కలెక్టర్ కృష్ణభాస్కర్, ఆర్డీవో పాండురంగ అడ్డుకున్నారు. ఘటనపై విచారణ జరిపించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం తగు చర్యలు తీసుకోవాలని ఆర్డీవో పాండురంగను కలెక్టర్ ఆదేశించారు. -
దయ చూపండయ్యా..
మహబూబ్నగర్ న్యూటౌన్: తిరిగి తిరిగి అలిసిపోతున్నాం.. దయ చూపండయ్యా అంటూ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుదారులు కలెక్టర్ ఎదుట సమస్యల ఏకరువు పెట్టారు. మండలాల్లో సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే ఇక్కడికి వస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణికి కలెక్టర్ రొనాల్డ్రోస్తో పాటు, డీఆర్వో వెంకటేశ్వర్లు, మెప్మా పీడీ గోపాల్, ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బెన్షాలో ప్రజల నుంచి వినతిపత్రాలు, ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం విషయంలో జాప్యం తగదని ఫిర్యాదులను అందుకున్న కలెక్టర్ ఈ సందర్భంగా మండలాల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. భూముల సమస్యలు, ఆసరా పెన్షన్లు, రుణాలు, ఉపాధి కోసం ఎక్కువ వినతిపత్రాలు అందగా మొత్తం 82వినతులు, ఫిర్యాదులు వచ్చాయి. బాధ్యలపై చర్య తీసుకోవాలి మత్స్యశాఖ కార్యాలయంలో ఏ పని జరుగాలన్నా లంచం ఇవ్వనిదే పని జరుగడంలేదని, అవినీతి అక్రమార్కులపై చర్య తీసుకోవాలని కోరుతూ తెలంగాణ మత్స్యకార్మిక సహకార సంఘం జిల్లా కార్యదర్శి తెలుగు సత్యయ్య ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. సంఘాల్లో సభ్యత్వం, లైసెన్సుల జారీ, వాహనాల మంజూరులో అక్రమాలు జరుగుతున్నాయని, అవినీతి అక్రమాలపై నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని కోరారు. మైనింగ్ అనుమతులు నిలిపివేయాలి తమకు ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూములను తీసుకొని ఇచ్చిన మైనింగ్ అనుమతులు నిలిపేయాలని మద్దూర్ మండలం నందిపాడ్ గ్రామానికి చెందిన దళిత రైతులు ప్రజావాణిలో కలెక్టర్కు విన్నవించారు. తమకు సర్వే నంబర్ 21లో 70మందికి పట్టాలు ఇవ్వడం జరిగిందని, వాటిని రద్దు చేసి మైనింగ్ చేపట్టడంతో జీవనోపాధి పోయిందన్నారు. మైనింగ్ అనుమతులు నిలిపేసి తమ భూములను సాగు చేసుకునేలా చూడాలని కోరారు. సేవా కార్యక్రమాలు అడ్డుకుంటున్నారు నవాబ్పేట మండలం లింగంపల్లి పంచాయతీ కిషన్గూడ పాఠశాలలో విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు సేవాదృక్పథంతో వాటర్ ప్యూరిఫైర్ను ఏర్పాటు చేసేందుకు చేస్తున్న పనులను స్థానిక టీఆర్ఎస్ నాయకులు, అధికారులు అడ్డుకుంటున్నారని పేర్కొంటూ అనిరుధ్ యువసేన ఆధ్వర్యంలో రాజాపూర్, నవాబ్పేట మండలాలకు చెందిన ప్రజలు కలెక్టరేట్కు తరలివచ్చి కలెక్టరేట్లో ఆందోళన చేపట్టారు. అలాగే, పోలేపల్లి సెజ్ వద్ద స్థానిక నాయకులు కొందరు అక్రమంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి చెరువు నీటిని తరలిస్తున్నారన్నారు. రాజాపూర్ మండలం గుండ్ల పొట్లపల్లి సమీపంలో ఉన్న బిలాస్ స్పాం జ్ ఐరన్ పరిశ్రమ ద్వారా కాలుష్యం విడుదలవుతుందని, తద్వారా తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు. పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. హద్దులు, ఆర్వోఆర్ అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వ గజిట్ ప్రకారం జమా మసీద్, ఈద్గాలకు కేటాయించిన భూమికి హద్దులు చూపి ఆర్వోఆర్ అమలు చేయాలి. సర్వే నంబర్ 320, 171లోని భూమిలో జామా మసీద్, ఈద్గా, ఖబ్రస్తాన్, గోఖుర్సాహెబ్ చెల్కలకు సంబంధించిన భూమిని సర్వే చేయించి హద్దులు నిర్ణయించి, రికార్డుల్లో నమోదు చేయాలని ఏళ్లుగా అధికారులను కోరుతున్నా పట్టించుకోవడంలేదని దామరగిద్ద మండలం లోకుర్తి గ్రామానికి చెందిన జామామసీద్ కమిటీ సభ్యులు ప్రజావాణిలో అధికారులను కలిసి విన్నవించారు. సంబంధిత భూమిని రికార్డుల్లో నమోదు చేయాలని కోరారు. -
నింగి నుంచి భూమి సర్వే..
మహబూబ్నగర్/మహబూబ్నగర్ న్యూటౌన్: ప్రతీ సోమవారం కలెక్టరేట్లలో జరిగే ప్రజావాణితో పాటు సర్వే ల్యాండ్ రికార్డుల కార్యాలయాలకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుంటాయి. తమ భూమి సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని ఆ ఫిర్యాదుల్లో పలువురు కోరుతుంటారు. శాశ్వత పరిష్కారం కోసం వీరందరూ ఎదురుచూస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఈక్రమంలో నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ రికార్డుల ప్యూరిఫికేషన్కు చర్యలు చేపట్టింది. అయితే, రికార్డుల వరకే పరిమితం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా జియోగ్రాఫిక్ ఇన్ఫర్మాటిక్ సిస్టమ్(జీఐఎస్) సర్వే నిర్వహించాలని యోచిస్తోంది. ఇటీవల రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి అధికారుల సమీక్షలో రికార్డుల ప్యూరిఫికేషన్ సర్వే సందర్భంగా క్షేత్ర స్థాయిలో ఎదురైన సమస్యలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ క్రమంలోనే జీఐఎస్ ద్వారా భూముల సర్వే చేపడితే ఎలా ఉంటుందనే సాధ్యాసాధ్యాలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించి సిద్ధంగా ఉండాలని అధికారులకు సూత్రప్రాయంగా నిర్దేశించినట్లు తెలిసింది. రెవెన్యూ శాఖ ప్రక్షాళన రెవెన్యూ శాఖను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే భూముల లెక్క తేల్చడంతో పాటు రికార్డుల ప్యూరిఫికేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో రికార్డులకు, క్షేత్ర స్థాయికి తేడాలు ఉన్నట్లు అధికారులు గమనించారు. భూప్రక్షాళన కార్యక్రమం ద్వారా ఆశించిన ఫలితాలు రావాలంటే మరిన్ని చర్యలు అవసరమని భావించిన ప్రభుత్వం జీఐఎస్ ల్యాండ్ సర్వే చేపట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తద్వారా భూరికార్డులు, హద్దుల విషయంలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని యోచిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదీ మేలు జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) ద్వారా భూముల సర్వే చేపడితే భూయాజమానులకు మేలు జరగడంతో పాటు రికార్డుల నిర్వహణ సైతం పారదర్శకమవుతుంది. సర్వే నంబర్ల వారీగా నిర్ణయించే హద్దుల మేరకు వాస్తవంగా భూమి విస్తీర్ణం, నక్షాలు రూపొందిస్తారు. పట్టాదారుల విస్తీర్ణం తేల్చి తర్వాత హద్దులు నిర్ణయిస్తారు. వీఆర్వో, సర్వేయర్లు ఇచ్చే రిపోర్టు ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. వీఆర్వో, సర్వేయర్ల రిపోర్టును తప్పని సరిచేయడంతో పాటు కొనుగోలు చేసిన భూమికి పక్కా కొలతలు నిర్ణయిస్తారు. దీని ప్రకారం రిజిస్ట్రేషన్, ముటేషన్ రికార్డుల్లో నమోదు చేయడం ద్వారా భవిష్యత్లో కొలతలకు సంబంధించి ఇబ్బందులు ఉండవు. అలాగే, ఎవరైనా భూమి కొలతల సమస్యతో అధికారుల వద్దకు వస్తే పరిష్కరించడం సులువవుతుంది. సర్వే నంబర్ల జియో ట్యాగింగ్ జీఐఎస్ సర్వే ద్వారా భూకొలతలు చేపట్టాక కర్ణాటక తరహాలో సర్వే నంబర్ల వారీగా హద్దులు నిర్ణయించి సర్వే నంబర్లను జియో ట్యాగింగ్ చేస్తారు. వచ్చే నెలలో జరగనున్న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆలోచన మేరకు జీఐఎస్ ల్యాండ్ సర్వే నిర్వహిస్తే భూప్రక్షాళన ఆశయం నెరవేరడమే కాకుండా భూ యాజమానులకు కొలతలు, హద్దులు, రికార్డుల పరంగా ఇబ్బందులు తొలగిపోయే అవకాశముంది. ఇందులో భాగంగా సర్వే నంబర్లను జియో ట్యాగింగ్ చేస్తే ఎప్పటికప్పుడు ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. గతంలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని తహసీల్దార్లకు సూచిస్తే కొన్ని మండలాల్లో ప్రభుత్వ భూములు లేవని చెప్పడం, భూములు ఉన్నట్లు రికార్డులు చెబుతుండడం ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. అదే సర్వే నంబర్లను జియో ట్యాగింగ్ చేస్తే వాస్తవంగా ఎంత భూమి అందుబాటులో ఉందో తెలిసిపోనుంది. త్వరలో సర్వే మహబూబ్నగర్ జిల్లాలోని తహసీల్దార్లతో ఈనెల 17న కలెక్టర్ రొనాల్డ్రోస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సమావేశంలో చర్చకొచ్చిన అంశాలను వివరించారు. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న హద్దుల సమస్యను అన్ని జిల్లాల అధికారులు సమావేశం దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీఐఎస్ సర్వే నిర్వహించి భూప్రక్షాళన ఫలితాలను ప్రజలకు అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. -
ప్రజావాణిలో గీత కార్మికుడి ఆత్మహత్య
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల / మంచిర్యాల సిటీ: కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఓ గీత కార్మికుడు సరైన స్పందన రాకపోవ డంతో పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలించగా, అక్కడ మృతి చెందాడు. ఈ ఘటన మంచిర్యాల కలెక్టరేట్ ఆవరణలో సోమవారం జరిగింది. మంచిర్యాల జిల్లా నెన్నెలకు చెందిన గీత కార్మికుడు రంగు రామా గౌడ్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. మండల కో ఆప్షన్ సభ్యుడు ఇబ్రïహీం, ఆయన భార్య గ్రామ సర్పంచ్ అస్మా ఇబ్రహీం భూ కబ్జాలకు పాల్పడుతున్నారని రామాగౌడ్ టీడీ పీ మండలాధ్యక్షుడి హోదాలో పత్రికా ప్రకటనలు ఇచ్చాడు. సర్పంచ్ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్నారంటూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. రామా గౌడ్పై కక్ష పెంచుకున్న ఇబ్రహీం ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టించాలని భావించి తన వద్ద పనిచేసే పల్లె మహేశ్ ద్వారా డిసెంబర్ 13న నెన్నెల పోలీసు స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించాడు. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో తనపై అక్రమ కేసు నమోదు చేశారని ఈనెల 2న జిల్లా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్కు ఫిర్యాదు చేశాడు. అయినా, స్పందన లేకపోవడంతో సోమ వారం ప్రజావాణిలో జేసీ సురేందర్రావు వద్దకు వచ్చి న్యాయం చేయాలని కోరాడు. నెన్నెల తహసీల్దార్ను విచారణకు ఆదేశించామని జేసీ చెప్పారు. దీంతో తనకు న్యాయం జరగదని మనస్తాపానికి గురై తెచ్చుకున్న పురుగుల మందును అక్కడే తాగి పడిపోయాడు. పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కారం
సిద్దిపేటటౌన్: ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు ఆలస్యం చేయొద్దని, వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను జాయింట్ కలెక్టర్ పద్మాకర్తో కలిసి ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను మళ్లీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారుల ను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో చంద్రశేఖర్, బీసీ, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు రాంరెడ్డి, చరణ్దాస్, డీపీవో సురేష్బాబు, డీఆర్డీవో స్వామి, డీడబ్ల్యూవో జరీనాబేగం, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. చెరువు పనులు ప్రారంభించండి.. చేర్యాల మండలం ముస్త్యా లలో 796 సర్వే నెంబర్లో 21 ఎకరాల 34 కుంటల విస్తీర్ణంలో గల పర్రెబావి కుంట ను గ్రామానికి చెందిన కొం దరు కబ్జా చేసి చెరువు కట్టను ధ్వంసం చేశా రు. దీనిపై గతంలో చాలాసార్లు ప్రజావాణి లో ఫిర్యాదు చేశా. దీనిపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దృష్టికి తీసుకుపోగా స్పందించిన ఆయన చెరువును కబ్జా కాకుండా చూసి అభివృద్ది చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.19 లక్షలతో అభివృద్ధి కోసం అంచనాలు వేసినా ఇంతవరకు అధికారులు అభివృద్ది పనులు ప్రారంభించలేదు. కలెక్టర్ స్పందించి కుంట అభివృద్ధి పనులు ప్రారంభమయ్యేలా చూడాలి. – చింతల కిష్టయ్య, ముస్త్యాల ఉపాధి కల్పించాలి.. నేను చిన్నప్పటి నుంచే వికలాంగుడిని. డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తవుతోంది. నాకు ఏదైనా ఆఫీస్లో చిన్న పని కల్పించి నాకు ఆసరా కల్పించాలి. పెన్షన్ తీసుకోవడానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వికలాంగుల కోటాలో మోటారు సైకిలు మంజూరు చేసి ఇబ్బందులు తొలగించాలి. – హన్మంతరెడ్డి, ఖమ్మంపల్లి -
మీ కోసం వచ్చాం..దయ చూపండయ్యా!
జిల్లాలోని ప్రజలు సమస్యలను పరిష్కరించుకునేందుకు సోమవారం కలెక్టరేట్లో అధికారులు ఏర్పాటు చేసిన మీ కోసం ప్రజావాణికి వినతులు వెల్లువెత్తాయి. కలెక్టర్ ప్రద్యుమ్న, జెసీ గిరీషా, డీఆర్ఓ రజియాబేగం, జేసీ–2 చంద్రమౌళి వినతులు స్వీకరించారు. రుణాలు మంజూరు చేయాలి ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాలు 2014 నుంచి 2017 వరకు సక్రమంగా అమలు చేయలేదని సోమవారం క లెక్టరేట్ వద్ద కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం స భ్యులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్రమణ్యం మాట్లాడు తూ రుణాలు మంజూరు చేయక వేలాది మంది ఉపాధి లేక అవస్థలు పడుతున్నారన్నారు. బ్యాంకులు పూచీకత్తులు లేకుండా రుణాలు మంజూరు చేయాలన్నారు. దళితులపై దాడులు పెరిగిపోయాయని, వారికి చ ట్టాలు రక్షణ కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. టోల్ప్లాజా తేనెపల్లెకు దూరంగా నిర్మించాలి పూతలపట్టు మండలం తేనేపల్లె పంచాయతీ రంగంపే ట, ఎస్టీకాలనీ, బిదారమిట్ట, తాటితోపు, ఇందిర్మ కా లనీ వాసులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటి సౌకర్యం ఉన్న భూములు వద్ద టోల్ ప్లాజా నిర్మించడానికి నోటిఫికేషన్ ఇచ్చారని, దీంతో తమ భూములు ఇవ్వాల్సి వస్తుందన్నారు. తాము భూములు కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. రంగపేట, తేనేపల్లెకు దూరంగా 20 మై లురాయి నుంచి 21వ మైలురాయి వరకు ప్రభుత్వ భూ మి ఉందని, టోల్ప్లాజాను అక్కడ నిర్మించుకోవాలన్నా రు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. శ్మశాన స్థలాలు కేటాయించాలి రాష్ట్రమంతటా క్రైస్తవులకు శ్మశాన స్థలాలు కేటాయించా లని క్రిస్టియన్ లీడర్ ఫోరం రాష్ట్ర సభ్యుడు రెవరెండ్ ఆర్ జోబు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 9వ తేదీ విజయవాడలో రాష్ట్ర నలు మూలల నుంచి క్రైస్తవులతో రాష్ట్ర క్రైస్తవుల మహా సమ్మేళనం నిర్వహించనున్నామని చెప్పారు. క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు సాగిస్తామన్నారు. క్రైస్తవులకు ఇప్పటివరకు శ్మశాన స్థలాలు కేటాయించక పోవడం దారుణమన్నారు. అభ్యున్నతికి నోచని సంచార జాతులు స్వాసంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా సంచా ర జాతుల వారు అభ్యున్నతికి నోచుకోలేదని రాష్ట్ర సంచారజాతుల సంఘం అధ్యక్షుడు రవి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచార జాతులను అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించారని, వీరి కోసం ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి, జీఓ నంబర్ 17ను విడుదల చేసిందన్నారు. ఇంతవరకు ఒక్కరికి కూడా రుణాలు మంజూరు చేయలేదన్నారు. సంచార జాతుల పిల్లలకు రెసిడెన్సి యల్ పాఠశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
అప్పునకు బదులు కొడుకునెత్తుకెళ్లాడు
-
అప్పునకు బదులు కొడుకునెత్తుకెళ్లాడు
బోధన్: తీసుకున్న అప్పుకు బదులు వడ్డీ వ్యాపారి కొడుకును ఎత్తుకు పోయాడు. అప్పుతీర్చకుంటే చంపేస్తానని బెదిరించడంతో భయపడి భర్త పారిపోయాడు. దిక్కుతోచని స్థితిలో ఓ బాధితురాలు సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్లో నిర్వహించిన ప్రజావాణిలో తన గోడును సబ్ కలెక్టర్ వద్ద సిక్తా పట్నాయక్ వెళ్లబోసుకుంది. బోధన్లోని శర్భతీ కెనాల్ ప్రాంతంలో భారతి, మోతీ దంపతులకు నలుగురు పిల్లలు రవి, అంజలి, పవన్, ఓం ఉన్నారు. వీరు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఊరూరా తిరుగుతూ మోతీ బట్టల వ్యాపారం చేస్తాడు. వీరి సమీప బంధువు బోధన్కు చెందిన నారాయణ వద్ద వ్యాపారం కోసం ఏడాది క్రితం రూ. 70 వేలు అప్పుగా తీసుకున్నారు. తిరిగి అప్పు చెల్లి›ంచడంలో ఆలస్యం జరిగింది. అయితే, దశల వారీగా రూ. 20 వేల వరకు చెల్లించారు. కాగా, అసలు అప్పు, వడ్డీ కలిపి రూ. 2 లక్షల వరకు అయ్యాయని.. మొత్తం అప్పు చెల్లించాలని సదరు వడ్డీవ్యాపారి ఒత్తిడి చేశాడు. వారం రోజుల క్రితం అప్పు చెల్లించి తీసుకెళ్లాలని.. వీరి కుమారుడు పవన్ (9)ను బలవంతంగా తీసుకెళ్లాడు. అలాగే, అప్పు చెల్లించకుంటే చంపేస్తానని బెదిరించడంతో మోతి ఇల్లు వదిలి పారిపోయాడు. తన భర్త ఎక్కడికెళ్లిందీ.. తన కొడుకును ఏం చేశాడో తెలియదని బాధితురాలు భారతి సబ్ కటెక్టర్కు విన్నవించుకుంది. మొత్తం అప్పు చెల్లించకపోతే మిగిలిన ముగ్గురు పిల్లలను తీసుకెళ్తానని బెదిరిస్తున్నాడని బోరుమంది. -
ఫిర్యాదుల వెల్లువ
ప్రజావాణికి 61 వినతులు ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 61 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇన్చార్జి కలెక్టర్ రవీందర్రెడ్డి, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో గోవింద్, కలెక్టరేట్ ఏవో శ్రీధర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదులను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సిఫారసు చేశారు. రైతు సమన్వయ కమిటీని రద్దు చేయాలి.. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన రై తు సమన్వయ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిరికొండ మండలం హుస్సేన్నగర్ గ్రామా భివృద్ధి కమిటీ సభ్యులు కలెక్టరేట్ ఎదుట ధర్నా ని ర్వహించారు. ఇష్టానుసారంగా రైతు సమన్వయ క మిటీని ఏర్పాటు చేశారని, ఇందులో అధికార పార్టీ నాయకులే ఉన్నారని తెలిపారు. పంచాయతీ, గ్రా మాభివృద్ధి కమిటీ సభ్యులను సంప్రదించకుండా నే రైతు కమిటీని ఏర్పాటు చేశారని, రైతుల మేలు కోరి ఏర్పాటు చేస్తున్న రైతు సమన్వయ సమితుల్లో అర్హులకు చోటు కల్పించేలా కొత్త కమిటీని ఎన్నుకోవాలని కోరారు. వీడీసీ సభ్యులు మల్లేశ్, గంగారె డ్డి, రాజేందర్, రామస్వామి, రాజన్న, శ్రీనివాస్ త దితరులు పాల్గొన్నారు. గీత కార్మికులకు లైసెన్సులివ్వాలి ఈత చెట్లు గీయడానికి తమకు లైసెన్సులు ఇప్పించాలని కోరుతూ ఇందల్వాయి మండలం తిర్మన్పల్లికి చెందిన పలువురు కల్లుగీత కార్మికులు కలెక్టరేట్కు వచ్చారు. గ్రామంలో 30కి పైగా కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. ఈత చెట్లు గీసి కల్లును విక్రయించడానికి లైసెన్సులు ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ అధికారులను చాలాసార్లు విన్నవించామని, ఒకరిద్దరికి మాత్రమే లైసెన్సులు ఇచ్చి మిగతా వారికి ఇవ్వడం లేదన్నారు. తమకు కూడా లైసెన్సులు ఇప్పించి ఆదుకోవాలని గంగాగౌడ్, నారాగౌడ్, గంగాధర్గౌడ్, శ్రీనివాస్గౌడ్, శంకర్గౌడ్ తదితరులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. గొర్రెల పంపిణీలో అన్యాయం జరిగింది.. గొర్రెల పంపిణీలో తమకు అన్యాయం చే శారంటూ జ క్రాన్పల్లి మం డలం కొలిప్యాక్కు చెందిన లబ్ధిదారులు భోజేం ధర్, లలిత ఇన్చార్జి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. త మకు శ్రీ కృష్ణ యాదవ సొసైటీలో సభ్యత్వం ఉందని, సొసైటీ సభ్యులు లక్కీ డ్రా ద్వారా గొర్రెలను పంపిణీ చేయకుండా ఇష్టానుసారంగా పంచుకున్నారని తెలిపారు. అయితే, తమకు వచ్చిన గొర్రె లు ఇవ్వలేదని సభ్యులను ప్రశ్నించినందుకు కుల బహిష్కరణ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతు న్నారని వాపోయారు. దీనిపై మండల, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని, గొర్రెల పంపిణీలో జరిగిన అన్యాయంపై విచారణ చేయించి న్యాయం చేయాలని కోరారు. ట్రై సైకిల్ కోసం రెండేళ్లుగా.. నడవ లేని స్థితిలో ఉన్న తన కొడుకు గంగాప్రసాద్కు ట్రై సైకిల్ ఇవ్వాలని రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాల్కొండ మండలం బోదెపల్లికి చెందిన సహదేవ్ వాపోయాడు. ట్రై సైకిల్ కొరకు వికలాంగుల శాఖ కార్యాలయంలో చాలాసార్లు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ అధికారులు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ట్రై సైకిల్ ఇప్పించి ఆదుకోవాలని అధికారులకు వినతిపత్రం అందజేశాడు. ఆర్థికంగా ఆదుకోండి.. షుగర్ వ్యాధితో రెండు కాళ్లు కోల్పోయిన తనకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరుతూ మాక్లూర్ మండలం ముల్లంగి గ్రామానికి చెందిన వెంకటరమణ కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. తనది పేద కుటుంబమని, ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, కాళ్లు కోల్పోవడంతో కుటుంబాన్ని పోషించడానికి వీలు లేకుండా పోయిందన్నారు. కుటుంబాన్ని పోషించడానికి ఆర్థికంగా సాయం చేయడంతో ట్రై సైకిల్ ఇప్పించాలని అధికారులకు విన్నవించాడు. -
కలెక్టర్ బాటలోనే...
అర్జీదారుల సమస్యలపై జేసీ ప్రతిస్పందన గ్రీవెన్స్సెల్కు పోటెత్తిన ప్రజలు కాకినాడ : ప్రజావాణికి కొత్త ఒరవడి తెచ్చిన కలెక్టర్ కార్తికేయమిశ్రా బాటలోనే సోమవారం జాయింట్ కలెక్టర్ఎ.మల్లికార్జున కూడా గ్రీవెన్స్సెల్కు వచ్చిన అర్జీదారుల విషయంలో ప్రతి స్పందించారు.అర్జీదారుల సమస్యలను సావధానంగా విని అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ అందుబాటలో లేకపోవడంతో కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిని జాయింట్ కలెక్టర్ మల్లికార్జున కొనసాగించారు. ఆయా సమస్యలను నిర్ణీత వ్యవధిలో అధికారులు పరిష్కరించాలని జేసీ స్పష్టం చేశారు. కాకినాడ సంజయ్నగర్కు చెందిన అడిగడ్ల రామలక్ష్మి తన ఇద్దరు కుమారులు పూర్తిశాతం దృష్టి లోపంతో ఉన్నారని, వికలాంగ పింఛన్ మంజూరు చేయాలని కోరగా, ఒక రేషన్కార్డుపై ఒకరికే పింఛన్ ఇచ్చే అవకాశం ఉందని, కానీ దృష్టిలోపం కారణంగా ఇద్దరికీ పింఛన్ ఇచ్చేలా ప్రభుత్వానికి నివేదిస్తామని జేసీ తెలిపారు. ముమ్మిడివరం నక్కావారిపేటకు చెందిన రేవు ధనలక్ష్మి తన కుమారుడు వెంకటేశ్వరరావుకు ఉదయ కుమారితో వివాహం చేశామని, కోడలే అతనిని చంపేసిందని, తిరిగి పోస్టుమార్టం చేయాలని కోరగా, రిపోర్టుకు డాక్టర్, అతని అసిస్టెంట్ రూ.70వేలు అడుగుతున్నారని, లేకపోతే తప్పుడు రిపోర్టు ఇస్తామని బెదిరిస్తున్నారని తెలుపగా, డీసీహెచ్ఎస్ను వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గాంధీనగర్లో ఉంటున్న ఆర్.శ్రీనివాసశర్మ రామావైన్స్ షాపు వారు తన పక్క ఇంటిలో వైన్షాపు నిర్వహిస్తున్నారని, తనకు ఇబ్బంది కలుగజేస్తున్నారని, రక్షణకు చర్యలు చేపట్టాలని కోరగా, చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్శాఖను ఆదేశించారు. మధ్యాహ్నం 2 గంటల తరువాత నేరుగా జేసీ అర్జీదారుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుని, అర్జీలు తీసుకున్నారు. ఈ ప్రజావాణిలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆవేదనల నివేదనలు
► ప్రజావాణికి బాధితుల తాకిడి కరీంనగర్సిటీ: కరీంనగర్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. ప్రధా నంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. భూ సంబం «ధిత సమస్యలు, పింఛన్లు, రేషన్కార్డులు, ఉద్యోగ ఉపాధి కోసం అర్జీలు సమర్పించారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జే సీ శ్రీనివాస్, డీఆర్వో మస్రత్ఖాన మ్, ఆర్డీవో రాజా అర్జీలు స్వీకరించారు హుజురాబాద్ మండలం కందుగులలోని ఎస్సీకాలనీలో పూర్వపు పాఠశాల స్థలం కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉందని, ఆ స్థలాన్ని ప్రభుత్వ భవనం కోసం కేటాయించాలని తెలంగాణ అం బేద్కర్ యువజన సంఘం గ్రామాధ్యక్షుడు రొంటాల సురేష్ ఆద్వర్యంలో కలెక్టర్కు విన్నవించారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కా లనీకి చెందిన అంగన్వాడీ కేంద్ర ం–3లో పదేళ్లుగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న సంబంధిత వ్యక్తులపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జమ్మికుంట మండలం నగురం సర్పంచ్ ఐదు నెలలుగా గ్రామంలో ఉండకపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని, చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల కార్యదర్శి చెరుకు ఓదెలు కలెక్టర్కు విన్నవించారు. డయల్ యువర్ కలెక్టర్కు స్పందన ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్కు స్పందన వచ్చింది. జమ్మికుంట నుంచి మాటూరి శ్యాంసుందర్, ఆడెపు రాధ మాట్లాడుతూ ఇందిరమ్మ బిల్లులు పెండింగ్లో ఉన్నాయనగా.. పదిరోజుల్లోగా ఖాతా లో చేరుతాయని తెలిపారు. శంకరపట్నం మండలం కాచాపూర్ నుంచి రాజ మౌళి మాట్లాడుతూ సదరమ్ సర్టిఫికెట్ పరీక్ష చేయకుండా ఇచ్చారనగా..విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. కరీంనగర్ హౌసింగ్బోర్డు ను ంచి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ రిపేర్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నుంచి మురుగునీ రు వస్తోందనగా తగిన చర్య తీసుకుం టామన్నారు.. డీఆర్వో అయేషా మస్రత్ఖానమ్, ఆర్డీవో రాజాగౌడ్, జిల్లా అధికారులున్నారు. -
పింఛన్ కోసం వెళ్తే అరెస్టు చేయిస్తానని బెదిరించారు..
ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితుడు కోటగిరి(బాన్సువాడ) : గతేడాది జనవరి వరకు తనకు పింఛన్ వచ్చిం దని, ఆ తర్వాత రావ డం లేదని రుద్రూర్ మండలం రాణంపల్లికి చెందిన గంగాగౌడ్ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై పలుమార్లు కార్యాలయ సూపరింటెండెంట్ బాలగంగాధర్కు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని ఎంపీడీ వో అతారొద్దీన్కు సమస్యను వివరించాడు. దీంతో ఎంపీడీవో పింఛన్ ఎందుకు నిలిపివేశారు సూపరింటెండెంట్ వద్దకు వెళ్లి అడగమని సూచించడంతో గంగాగౌడ్ సూపరింటెండెంట్ వద్దకు వెళ్లి పింఛన్ ఎందుకు రావడం లేదని అడగగా.. సదరు అధికారి గంగాగౌడ్పై దుర్భాషలాడుతూ మళ్లీ పింఛన్ వస్తలేదని అడిగితే అరెస్టు చేయిస్తానంటూ బెదిరింపులకు దిగాడని గంగాగౌడ్ మండల కార్యాయలంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. గ్రామంలో చాలామంది అనర్హులకు పింఛన్లు ఇచ్చారని, తనకు న్యాయం చేయాలని ఇన్చార్జి తహసీల్దార్ విఠల్కు విన్నవించాడు. ఈ విషయమై ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ సమాధానమిచ్చారు. -
సమస్యల పరిష్కారానికి చర్యలు
కలెక్టర్ అరుణ్కుమార్ ప్రజావాణిలో 170 అర్జీలు కాకినాడ సిటీ : ప్రజల నుంచి వినతుల ద్వారా వచ్చే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 170 మంది హాజరై వినతులను అందజేశారు. కలెక్టర్ అరుణ్కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి అర్జీలను తీసుకున్నారు. మండల, డివిజన్ స్థాయిలోని అర్జీల పరిష్కారానికి తహసీల్దార్లు, ఎంపీడీఓలకు, సంబంధిత శాఖలకు సంబంధించి జిల్లా అధికారులకు సూచిస్తూ పరిష్కారానికి ఆదేశాలు జారీచేశారు. ప్రజవాణిలో వ్యక్తిగత సమస్యలు, పింఛన్లు, ఉపాధి, సంక్షేమ పథకాల రుణాలు, ధ్రువీకరణ పత్రాలు తదితర అంశాల వినతులను కలెక్టర్ స్వీకరించగా, భూమి రికార్డులు, సర్వే, ఇళ్లు, రేషన్కార్డులు తదితర అంశాల అర్జీలను జేసీ స్వీకరించారు. పలు అర్జీలపై మండలస్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి నిర్ధిష్ట కాలవ్యవధిలో పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అన్యాక్రాంతమైన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీలో అన్యాక్రాంతమైన సామాజిక స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ పంచాయతీ పాలక వర్గ సభ్యులు ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఉచిత విద్య అందించేందుకు స్కూల్ నిర్మిస్తామని దరఖాస్తు చేసుకున్న శ్రీ అరవింద్ సొసైటీకి నిబంధనలకు విరుద్ధంగా 2000 సంవత్సరంలో అప్పటి సర్పంచ్ రెండెకరాల సామాజిక స్థలం కేటాయించారన్నారు. కాని నేటికీ స్కూలు నిర్మించలేదని, ఆ స్థలం అన్యాకాంతమైందని ఆరోపించారు. దీనిపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకొవాలని ఉప సర్పంచ్ బీవీవీ సత్యనారాయణ, వార్డు సభ్యులు కోరారు -
మేమే దొరికామా?
• వాళ్లంతా ఖాళీగా కూర్చున్నారు.. • వెళ్లండి... తహసీల్దార్ను కలువుపో.. • ప్రజావాణిలో ఫిర్యాదుదారులపై • అధికారుల ఛీత్కారాలు, కసిరింపులు • వినతులు స్వీకరించకుండా వెనక్కి పంపించిన అధికారులు ఇదీ..సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదులు అందజేసేందుకు వచ్చిన బాధితులతో అధికారులు వ్యవహరించిన తీరు. సార్... మా పట్టా భూమిలో కడీలు పాతితే రెవెన్యూ అధికారులొచ్చి ప్రభుత్వ భూమి అంటూ వాటిని తొలగిస్తున్నారు... నాకు భర్త లేడు... పిల్లలున్నారు... నాకున్నది గదొక్కటే ఆధారం సార్... దయచేసి రెవెన్యూ వాళ్లకు చెప్పండి సార్.’’ అప్పన్నపల్లికి చెందిన పద్మమ్మ వినతి. అధికారి : అయితే మేమేం చేయాలి... వెళ్లక్కడ ... మిషన్ కాకతీయ పనులకు ఇబ్బందిగా మారింది. కడీలెలా పాతుతవు. పో... తహసీల్దార్ వద్దకెళ్లు... పద్మమ్మ : నాకు పట్టా ఉంది సారూ.... నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు. నా భూమిలో నాకు హక్కులేదా...? అధికారి : వెళ్లిపోవమ్మా.. మీ తహసీల్దార్ వద్దకెళ్లు. అన్నీ చెబుతారు.. మరో ఫిర్యాదుదారు–దళితులం సార్... భూపంపిణీ పథకంలో సాగు చేసుకునేందుకు భూమి ఇప్పించండి... పుణ్యమొస్తది. అధికారి : అమ్మా... ఎక్కడైనా రూ.4 లక్షలకు ఎకరా అమ్మితే చూడు. దానిని కచ్చితంగా ఇప్పిస్తా. అమ్మేవారుంటే నా దగ్గరకు తీసుకురా. ‘‘సారూ...భర్త నన్ను 5 సంవత్సరాల క్రితం వదిలేశాడు. మా తల్లిగారింటి వద్దనే ఉంటూ పిల్లలను చదివిస్తున్నా. పిల్లలు పెద్దయ్యారు. ఆస్తిని మా అత్త తన కూతురి పేరుమీద చేసింది. మాకు హక్కు దక్కే విధంగా చూడండి సారూ.అంటూ కోయిలకొండ మండలం సూరారం గ్రామానికి చెందిన నిర్మలమ్మ అధికారులను వేడుకుంది. అధికారి : మేమేం చేయాలమ్మా... పో వెళ్లి కోర్టులో కేసు పెట్టుకోపో... ఇంకో ఫిర్యాదుదారు : సార్.... నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించండి. మా ఊర్లో ఇండ్లోచ్చాయిని చెబుతున్నారు. ఇల్లు మంజూరు చేసి ఆదుకోండి సార్. అధికారి : మీ తహసీల్దార్ను కలువు పోమ్మా....ఇక్కడ మేమేం చేయలేం. మహబూబ్నగర్ న్యూటౌన్ : అధికారుల ఛీత్కరింపులతో బాధితులు ప్రజావాణిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ రొనాల్డ్రోస్ సెలవులో ఉండడంతో ఆయన హాజరుకాలేదు. అయితే సమస్యలను సావధానంగా వినాల్సిన మిగతా అధికారులు కసురుకోవడం, చీదరించుకోవడం మూలంగా ప్రజావాణి ఉద్దేశం నీరుగారుతోంది. అధికారులు సమస్యలను వినకుండా వెనక్కి పంపడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల పునర్విభజన అనంతరం ఫిర్యాదుల పరిష్కారం వేగం పుంజుకోవడం, అధికారులనుంచి మంచి స్పందన రావడంతో ప్రజావాణికి తాకిడి పెరిగింది. ప్రజల స్పందనకనుగుణంగా ప్రజావాణిని గతంలో మాదిరి కాకుండా ఇంకా మెరుగైన స్థాయిలో నిర్వహించాలని వీడియో కాన్ఫరెన్సు, హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశారు. మార్పులకనుగుణంగా అధికారులనుంచి స్పందన కరువవడంతో ప్రజావాణి విశ్వసనీయతను కోల్పోతోందని పలువురు ఆరోపిస్తున్నారు. భోజనం చేసి తిరుగుపయనం దూరప్రాంతాలనుంచి బాధితులు ప్రజావాణిలో ఆలస్యమవుతుందన్న ఆలోచనతో వెంట టిఫిన్బాక్సులు తెచ్చుకున్నారు. సోమవారం కలెక్టరేట్కు సుమారు మూడు వందల మంది వచ్చారు. కానీ వచ్చిన వినతులు, ఫిర్యాదులు 141 మాత్రమే. మిగతావారిని ‘మీ తహసీల్దార్ను కలవండని చెప్పడంతో వారు కలెక్టరేట్లోని చెట్లకింద వెంటతెచ్చుకున్న టిఫిన్బాక్సుల్లోని భోజనం చేసి తిరుగుపయనమయ్యారు. ‘చిన్న జిల్లాలో ప్రజా సమస్యల సత్వర పరిష్కారం ప్రభుత్వ బాధ్యత. ప్రజలు వారి సమస్యలను అధికారులకు వివరించి పరిష్కరించుకునేందుకు ఉద్దేశించిన ప్రజావాణిని ఇకనుంచి ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తాం. పారదర్శకత, శాశ్వత పరిష్కారాలు చూపాలనే ఉద్దేశంతో ప్రజావాణిలో వీడియో కాన్ఫరెన్సు ఏర్పాటు చేశాం. ప్రజావాణికి ఫిర్యాదుదారులు జిల్లా నలుమూలలనుంచి సమస్యలతో వస్తారు. వారికోసం జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసి ఉచితంగా ఫిర్యాదులు రాసిచ్చే చర్యలు తీసుకుంటున్నాం. ప్రజావాణిలో ఇచ్చే ఫిర్యాదుకు వాస్తవ పరిష్కారం చూపాలనేది ఉద్దేశం.’’ గతంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో కలెక్టర్ రొనాల్డ్రోస్ చెప్పిన మాటలు. సోమవారం జిల్లా రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారుల తీరు అందుకు భిన్నంగా ఉంది. ఆపదలో, పుట్టెడు ఆవేదనను కడుపులో నింపుకొని అధికారులకు ఫిర్యాదు సమర్పించి కన్నీళ్లు పెట్టుకున్న వారిని ‘కాదు పొమ్మని’ కసురుకుంటున్న పరిస్థితి. మండలాల్లో వారంతా ‘‘ఖాళీగా కూర్చున్నారు... మేమే దొరికామా... ప్రతివారం ఇదే పనిగా వస్తున్నారు..? వెళ్లండి మీ తహసీల్దార్ను కలవండి పోండి’ అంటూ అధికారులు కసరుకోవడంతో ఫిర్యాదుదారులు విధిలేక వెనుదిరిగారు. మండలాల్లో పట్టించుకోకపోవడంతో ఇక్కడికి వస్తే ‘ఈ ఛీత్కారాలేమిటీ.. అధికారులు చెప్పేదొకటి, జరుగుతున్నదొకటని’ అంటూ ఫిర్యాదుదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
కలెక్టరమ్మా.. కనికరించవమ్మా..
► ప్రజావాణిలో విన్నపాలు ► 121 దరఖాస్తుల స్వీకరణ పెద్దపల్లిరూరల్ : తమ సమస్యలపై వినతిపత్రాలు అందించి వాటిని పరిష్కరించాలంటూ బాధితులు వేడుకున్నారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ వర్షిణి, డీఆర్వో వెంకటేశ్వర్లు వినతులు స్వీకరించారు. ఇల్లు లేని తమకు డబుల్ బెడ్రూం గృహాల కేటాయింపులో ప్రాధాన్యతనివ్వాలని, పింఛన్లు అందించాలని వృద్ధులు, రేషన్ కార్డులు కావాలని తమ సమస్యలను ఏకరువుపెట్టారు. సోమవారం నాటి ప్రజావాణిలో 121 దరఖాస్తులు వచ్చాయి. ట్యాంకు కట్టకుండానే డబ్బు మింగిండ్రు.. మా ఊరిలో రూ. 6లక్షలతో మంచినీటి ట్యాంకు కట్టాల్సిఉంది. లక్ష రూపాయలు కూడా ఖర్చు చేయకుండానే ట్యాంకుకు మెరుగులు దిద్ది రూ.5.89లక్షల బిల్లులు పొందారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కాంట్రాక్టర్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. – పుట్ట రామయ్య, ఖానాపూర్,మంథని ఉపాధి మార్గం చూపించండి.. సుగ్లాంపల్లిలోని శాలివాహన పవర్ప్లాంటులో 8 ఏళ్లుగా పని చేస్తున్నాం. గతేడాది జూలై నుంచి ప్లాంటు మూసివేశారు. అప్పటినుంచి అక్టోబర్వరకు సగం జీతం ఇచ్చిన యాజమాన్యం, ఆ తర్వాత నుంచి పట్టించుకోవడంలేదు. కంపెనీలో పని చేస్తేనే మా కుటుంబం గడిచేది. ఇప్పుడు పనిలేక పాలుపోవడంలేదు. ప్లాంట్ను తెరిపించి పని కల్పించాలి. లేదంటే ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపించాలి. – సుగ్లాంపల్లి పవర్ప్లాంట్ వర్కర్స్ పింఛన్ ఇప్పించండి దేవుడిని నమ్ముకుని బతుకుతున్నాం. మాకు ఏ ఆధారం లేదు. సర్కారు పట్టించుకోవడంలేదు. మొన్నటిదాకా మాలాంటోళ్లకు పింఛన్ డబ్బులు వస్తాయన్నారు. ఇప్పటిదాకా ఇచ్చినోళ్లులేరు. ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం పింఛన్ పించి ఆదుకోవాలి. – రామగుండం జోగినులు ఖాళీ చేయమని బెదిరిస్తున్నారు చాలాఏళ్లుగా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని సర్వే నంబరు 45లో నివసిస్తున్నాం. ప్రభుత్వం మాకు రేషన్ కార్డులు, ఆధార్కార్డులు ఇచ్చిం ది. అయితే ఇప్పుడు గ్రామానికి చెందిన మద్దెల శ్రీహరి భూమి తనదంటూ ఖాళీ చేయించాలని కొందరు అధికారులతో కలిసి బెదిరిస్తున్నారు. ఇళ్ల సమీపంలో మద్యం దుకాణం పెట్టి ఇబ్బంది పెడుతున్నాడు. –గర్రెపల్లి ఒడ్డెర కుటుంబాలు కనీస వసతులు కల్పించాలి సింగరేణి ప్రాజెక్టు కోసం మా భూములు తీసుకున్నారు. పునరావాసకాలనీలో కనీస సౌకర్యాలు లేవు. తాగునీరు, డ్రెయినేజీలు నిర్మించలేదు. విద్యుత్సౌకర్యం లేక అంధకారం నెలకొని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఎన్నోసార్లు సింగరేణి, రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నాం. – గోపాల్, రాజమల్లు, లద్నాపూర్ -
ప్రజావాణికి 200 అర్జీలు
కాకినాడ సిటీ : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి సుమారు 200 అర్జీలు వచ్చాయి. వాటిని పరిశీలించిన కలెక్టర్ అరుణ్కుమార్ సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజావాణిలో వ్యక్తిగత సమస్యలు, పింఛన్లు, ఉపాధి, సంక్షేమ పథకాల రుణాలు, ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన అర్జీలు కలెక్టర్ స్వీకరించగా, జేసీ ఎస్.సత్యనారాయణ భూమి రికార్డులు, సర్వే చేయాలని, ఇళ్లు కావాలని, రేష¯ŒS కార్డులు తదితర అంశాలకు సంబంధించిన అర్జీలు, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి ఐసీడీఎస్, వైద్యం, సంక్షేమ పథకాలు, ప్రత్యేక ప్రతిభావంతుల శాఖలకు సంబంధించిన అర్జీలు స్వీకరించారు. మండల స్థాయి అంశాలపై సంబంధిత తహసీల్దార్లు, ఎంపీడీఓలకు కలెక్టర్ వీడియో కాన్ఫరె¯Œ్స వ్యవస్థ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంత నిర్వాసితుల సంఘం వినతి వివిధ సమస్యలపై పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత నిరుద్యోగ సంఘం సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రా న్ని అందజేసింది. ముంపు ప్రాంత నాలుగు మండలాల్లో మీ–సే వా కేంద్రాలు, ఆదివాసిలకే కేటాయించాలని, జీఓ ఎంఎస్నంబర్–3 ప్రకారం పోస్టులన్నీ భర్తీ చేయాలని, 18 ఏళ్లు దాటిన యువతీ యువకులను ప్రత్యేక కుటుంబంగా పరిగణించి వారికి ప్రత్యేక పునరావాసం కల్పించాలని తదితర డిమాండ్లతో వినతిపత్రంలో కోరారు. సంఘ నాయకులు చిచ్చడి శ్రీరామమ్మూర్తి తదితరులు వినతిపత్రం ఇచ్చినవారిలో ఉన్నారు. -
మా ఊరికి ఎడ్లబండి పోయే దారీ లేదు!
► వ్యవసాయ ఉత్పత్తుల తరలింపూ కష్టమే ► రోడ్డు వేసి మా భూములకు మార్గం కల్పించండి ► దుడ్డుపాలెం గ్రామస్తుల వినతి ► కలెక్టరేట్ గ్రీవెన్స్కు 244 వినతులు బీచ్రోడ్: ‘మాది రాయపురాజు పేట, దుడ్డుపాలెం గ్రామం. మాకు చట్టబద్ధమైన భూములు ఉన్నాయి. వాటిని సాగు చేసుకునేందుకు, వ్యవసాయ ఉత్పత్తులను తరలించేందుకు ఎడ్లబండి పోయే మార్గం లేక ఇబ్బంది పడుతున్నాం. మా గ్రామపటంలో పూర్వకాలంలో ఉన్న ప్రధాన మార్గం నిరుపయోగంగా మారి పలువురు ఆధీనంలో ఉంది. ఈ ప్రధాన రహదారి గ్రామ రెవెన్యూ రికార్డుల పరంగా పూర్తిగా ప్రభుత్వం పోరంబోకు స్థలంగా పేర్కొన్నారు. ఆ స్థలాన్ని పునరుద్ధరించి మార్గం వేసి మాకు వ్యవసాయం చేసుకునే సదుపాయం కల్పించాలి’ అంటూ గ్రీవెన్స్లో వినతిపత్రం ఇచ్చారు చోడవరం మండలం రాయపురాజు పేట, దుడ్డు పాలెం గ్రామస్తులు. కలెక్టరేట్లో నిర్వహించిన మీ కోసం (ప్రజావాణి)కి జిల్లావ్యాప్తంగా 244మంది అర్జీదారులు దరఖాస్తు చేసుకున్నారు. జాయింట్ కలెక్టర్ జి.సృజనకు వినతులు అందించారు. ఎక్కువ మంది భూ ఆక్రమణలు, పెన్షన్, రేషన్కార్డు , గృహాల సమస్యలపై ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరెడ్డి, స్పెషల్ డిఫ్యూటీ కలెక్టర్ నరసింహరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. బియ్యం పూర్తిగా ఇవ్వట్లేదు మా గ్రామంలో చాలా కుటుంబాలకు రేషన్ బియ్యం పూర్తిగా ఇవ్వడం లేదు. 8 నెలలుగా ఇలా జరుగుతోంది. ఒక్కో కుటుంబానికి 5 నుంచి 10 కిలోల బియ్యం ఇవ్వడం లేదు, 15 మంది కార్డులకు పూర్తిగా బియ్యం రాలేదు. రేషన్ డీలర్ను ప్రశ్నిస్తే ఎమ్మార్మోకు చెప్పుకోమంటున్నారు. తహసీల్దారును అడిగితే ఆధార్ వివరాలు సరిగ్గా నమోదు కాలేదంటున్నారు. మేం ఇప్పటికే చాలాసార్లు ఆధార్ వివరాలను డీలర్కు ఇచ్చాం. అయినా బియ్యం ఇవ్వట్లేదు. తినడానికి కూడా బియ్యం లేని పరిస్థితిలో ఉన్నాం. మాకు రేషన్ పూర్తిగా ఇప్పించాలి. – పాంగి డోంబు, రంగిలిసింగి, డుంబ్రిగుడ -
అర్జీలు పరిష్కరించాలి
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ కాకినాడ సిటీ : ప్రజా అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి సుమారు 210 మంది అర్జీదారులు తమ సమస్యలపై వినతులను అందజేశారు. జాయింట్ కలెక్టర్ అర్జీదారుల సమస్యలను విని వాటిపై చర్యలకు సంబంధిత శాఖల జిల్లా అధికారులకు సూచించారు. సామాజిక, వ్యక్తిగత సమస్యలు, గృహాల మంజూరు, ఉపాధి కల్పన తదితర అంశాలపై వినతులు వచ్చాయి. మండలస్థాయి అంశాలపై పరిష్కారానికి తహసీల్దార్లకు ప్రజావాణి నుంచే వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్–2 రాధాకృష్ణమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. చెరువుల తవ్వకాన్ని నిలిపివేయాలని కైకవోలులో 75 కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతానికి ఇరువైపులా అక్రమంగా తవ్వుతున్న రొయ్యల చెరువులను నిలుపుదల చేయాలని కోరుతూ స్థానికులు దళిత ప్రజాసంఘాలు, అఖిలభారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న చెరువుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. రెవెన్యూ, మత్య్సశాఖాధికారులు అక్రమ చెరువుల విషయంలో పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ట్రైబల్ వెల్పేర్ అధికారిపై చర్యలు తీసుకోవాలి గిరిజన శాఖ నుంచి జీతం తీసుకుంటూ జిల్లా కేంద్రంలో ఇతర శాఖల విధులు నిర్వహిస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ అధికారి టీవీఎస్జీ కుమార్పై చర్యలు తీసుకోవాలని వై.రామవరం మాజీ ఎంపీపీ గొర్లె శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రజావాణిలో వినతిపత్రాన్ని అందజేశారు. గిరిజనుల సంక్షేమం పట్టించుకోకుండా నిర్లక్షంగా వ్యవహరిస్తున్న అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని జీతం రికవరీ చేయాలని కోరారు. -
ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించండి
ఖమ్మం సహకారనగర్: ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్ అన్నా రు. ప్రజావాణిలో భాగంగా సోమవారం జిల్లా పరిషత్లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు ప్రజావాణికి హాజరవుతారని, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. కొణిజర్ల మండలం బస్వాపురం గ్రామానికి చెందిన చల్లా వెంకటేశ్వర్లు ఇటీవల కాలంలో పిడుగుపడి తన రెండు ఆవులు మృతి చెందాయని, ఆవుల ద్వారా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, తనకు న్యా యం చేయాలని విన్నవించారు. బీసీ హాస్టల్లో వాచ్మెన్ ఉద్యోగం కోసం సీఎం కార్యాలయంలో సంప్రదించగా అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వాలని సూచించారని కల్లూరుకు చెందిన షేక్ గఫార్ డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. సీఎం కార్యాలయం నుంచి ఇచ్చిన ప్రతులను చూపించారు. డీఆర్వో ఉన్నతాధికారుల ఆదేశానుసారం సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. పలువురు వినతిపత్రాలు సమర్పించగా, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నగేష్ పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని..... ఇంటి స్థలం కోసం తిరుగుతున్నా స్వాతంత్య్ర సమరయోధురాలిగా ఉన్న పెండ్యాల శేషారత్నం ఇంటి స్థలం ఇప్పించాలని డీఆర్వోకు విన్నవించారు. గతంలో కలెక్టర్, జేసీలను కలిసి సమస్యను విన్నవించానన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తానని హామీనిచ్చినట్లు శేషారత్నం తెలిపారు. -శేషారత్నం, ఖమ్మం ఇల్లు కోసం వినతి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నానని, తనకు ఇంటి స్థలం ఇచ్చి ఆదుకోవాలని ప్రజావాణిలో డీఆర్వోకు విన్నవించినట్లు నగరంలోని విజయనగర్ కాలనీకి చెందిన బి.అప్పారావు తెలిపారు. గతంలో కూడా సమస్యను విన్నవించానని, సమస్య పరిషష్కారం కాకపోవటంతో తిరిగి విన్నవించినట్లు వెల్లడించారు. -అప్పారావు, విజయనగర్కాలనీ, ఖమ్మం ఆగిన పెన్షన్ ఇవ్వాలని కోరా తనకు ఇస్తున్న పెన్షన్ ఆరు నెలలుగా నిలిచిపోయిందని, మండల స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోకపోవటంతో ప్రజావాణిలో పెన్షన్ ఇవ్వాలని కోరారు. స్పందించిన డీఆర్వో సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. -పాశం వెంకటరెడ్డి, కూసుమంచి మండలం -
ప్రజావాణి వినతులకు పరిష్కారమేది?
ఫిర్యాదుదారుల ఆవేదన కాకినాడ సిటీ : సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కలెక్టరేట్ ప్రజావాణిలో అందిస్తున్న వినతులకు న్యాయం జరగక పదేపదే తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అర్జీదారులు ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా దివ్యాంగులు ఇక్కట్ల పాలౌతున్నారు. పిఛన్లు, ట్రై సైకిళ్ళు మంజూరు కోరుతూ ఇచ్చిన అర్జీలకు పరిష్కారం లభించడం లేదని వాపోతున్నారు. తమ అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని పలువురు విజ్ఞప్తిచేస్తున్నారు. ప్రజావాణికి 220 వినతులు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి సుమారు 220 అర్జీలు అందాయి. కలెక్టర్ అరుణ్కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి అర్జీదారుల నుంచి వినతులు తీసుకుని సంబంధిత శాఖల జిల్లా అధికారులకు పరిష్కార ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తిగత సమస్యలు, పింఛన్లు, ఉపాధి, సంక్షేమ పథకాలు, రుణాలు, భూ సర్వే చేయాలని, ఇళ్ల మంజూరు తదితర అంశాలపై అర్జీలు అందాయి. -
పడిగాపులు
ప్రజావాణిలో 11.30 గంటలకు ప్రారంభమైన వినతుల స్వీకరణ కాకినాడ సిటీ : కలెక్టరేట్ ప్రజావాణికి వచ్చిన అర్జీదారులు పడిగాపులు పడ్డారు. ప్రతివారం 10.30 గంటలకు వినతుల స్వీకరణ ప్రారంభమౌతుంది. అయితే ఈ సోమవారం 11.30 గంటలకు ప్రారంభించారు. కలెక్టర్ అరుణ్కుమార్ జిల్లా అధికారుల సమీక్ష నిర్వహించడంతో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, జేసి–2 రాధాకృష్ణమూర్తిలు అక్కడే ఉండిపోయారు. దీంతో కలెక్టర్, జేసీ వచ్చే వరకు అర్జీదారులు పడిగాపులు పడాల్సి వచ్చింది. చిన్నారులతో వచ్చిన మహిళలు, వృద్ధులు అధికారులు వచ్చేవరకు లై¯ŒSలో నిలబడలేక ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ప్రజావాణికి 260 వినతులు ప్రజావాణికి సుమారు 260 మంది హాజరై సమస్యలపై వినతులను అందజేశారు. కలెక్టర్ అరుణ్కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి అర్జీదారుల నుంచి వినతులు తీసుకుని సంబంధిత శాఖల జిల్లా అధికారులకు పరిష్కారం కోసం ఆదేశాలు జారీచేశారు. వ్యక్తిగత సమస్యలు, పింఛన్లు, ఉపాధి, సంక్షేమ పథకాల రుణాలు, భూ సర్వే చేయాలని, ఇళ్లు, రేష¯ŒSకార్డులు కావాలని అర్జీలు వచ్చాయి. -
అధికారులు రాకుంటే సమస్యల పరిష్కారమెలా?
గ్రీవెన్స్కు అధికారుల డుమ్మాపై ఎమ్మెల్యే రాజేశ్వరి ఆగ్రహం మెమోలు జారీచేయాలని ఆదేశం చింతూరు : ఐటీడీఏలో ప్రతి బుధవారం నిర్వహించే గ్రీవెన్స్కు అధికారులు హాజరుకాకపోతే ప్రజల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతూరు ఐటీడీఏ వద్ద బుధవారం నిర్వహించిన మీకోసం ప్రజాసమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కొన్ని శాఖల అధికారులు గైర్హాజరు కావడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఎంతోదూరం నుంచి ఐటీడీఏకు వస్తుంటే అధికారులు లేకపోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. గైర్హాజరైన అధికారులకు వెంటనే మెమోలు జారీ చేయాలని ఆమె ఆదేశించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరించేందుకు అధికారులంతా కృషి చేయాలని సూచించారు. ఇకపై ప్రతి బుధవారం నిర్వహించే గ్రీవెన్స్కు తాను వచ్చి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటానని ఆమె పేర్కొన్నారు. అందిన ఫిర్యాదులపై ఆరా? ఇప్పటి వరకు నిర్వహించిన గ్రీవెన్స్లలో ఎన్ని ఫిర్యాదులు అందాయి? వాటిలో ఎన్ని పరిష్కారమయ్యాయో తనకు పూర్తి నివేదిక అందించాలని ఎమ్మెల్యే రాజేశ్వరి ఐటీడీఏ అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రీవెన్స్కు వచ్చిన లబ్దిదారుల సమస్యలను స్వయంగా తెలుసుకుని వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకొస్తే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానన్నారు. అంగన్వాడీ వర్కర్ల, రోజువారీ పనివారి పెండింగ్ వేతనాలు, బిల్లులను త్వరితగతిన మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సీడీపీవోలను ఎమ్మెల్యే ఆదేశించారు. చింతూరు ఐటీడీఏ ఏర్పడి ఆరు నెలలైనా ఇంతవరకు రెగ్యులర్ పీవోను నియమించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. పీవో లేకపోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆమె అన్నారు. ఇప్పటికైనా పీవోను నియమించి గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. -
ప్రజావాణికి ఫిర్యాదుదారుల తాకిడి
జిల్లా రెండుగా విడిపోయినా ప్రజావాణికి ఫిర్యాదుదారుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు.. కొత్తగా కామారెడ్డి జిల్లా ఏర్పాౖటెనా ఫిర్యాదుల సంఖ్య మారలేదు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 84 ఫిర్యాదులు నమోదయ్యాయి. కలెక్టర్ యోగితారాణా, జాయింట్ కలెక్టర్ రవీందర్రెడ్డి, డీఆర్వో పద్మాకర్, డీఆర్డీవో వెంకటేశ్వర్లు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సిఫార్సు చేశారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి ప్రజలు తరలివచ్చే వారు. అయితే, జిల్లాల పునర్విభజనలో భాగంగా కామారెడ్డి కొత్తగా జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో ఫిర్యాదులు తగ్గే అవకాశముందని భావించారు. కానీ, ఎప్పట్లాగే ఈసారి కూడా కలెక్టరేట్కు వచ్చే వారి తాకిడి ఏమాత్రం తగ్గలేదు. – ఇందూరు -
ప్రజావాణికి 103 ఫిర్యాదులు
ఇందూరు : కలెక్టర్ కార్యాలయం కిటకిటలాడింది. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుదారులతో సందడి నెలకొంది. సోమవారం ప్రగతిభవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి –– ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ యోగితారాణా, జాయింట్ కలెక్టర రవీందర్రెడ్డి, డీఆర్వో పద్మాకర్, ఐకేపీ చంద్రమోహన్రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సిఫారసు చేశారు. చెరువులకు మరమ్మతులు చేపట్టాలి.. (03ఎన్జెడ్టి221–12050037) భారీ వర్షాలతో తమ గ్రామంలోని రెండు చెరువులకు సంబంధించిన కట్టలు తెగిపోయాయని, వాటికి మరమ్మతులు చేయించాలని నవీపేట మండలం బినోలా గ్రామస్తులు కలెక్టర్కు విన్నవించారు. ఖాళీ అయిన చెరువులను ఎత్తిపోతల పథకం ద్వారా నింపాలని కోరారు. గ్రామంలోని పెద్దచెరువు కట్ట, ఖదిరాబాద్ చెరువు కట్టలు తెగిపోయి, పంటలు నీట మునిగాయని సర్పంచ్ సుధాకర్, వీడీసీ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం చెరువుల్లో నీరు లేదని, రబీలో పంటలు పండించడానికి కష్టంగా మారుతుందని తెలిపారు. కావున చెరువులకు మరమ్మతులు చేపట్టి, ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులను నింపాలని కలెక్టర్ను కోరారు. కార్మికులను ఆదుకోవాలి.. (03ఎన్జెడ్టి222) సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అడ్డా మీది కార్మికులకు వసతులు కల్పించాలని, సేదతీరడానికి రేకుల షెడ్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలని సంఘం జిల్లా అధ్యక్షుడు కల్లెడి గంగాధర్ కోరారు. అడ్డా మీది కార్మికులకు ఉపాధి హామీ పని కల్పించాలని, ఈఎస్ఐ సౌకర్యంతో పాటు 60 ఏళ్లు నిండిన వారికి పెన్షన్లు ఇప్పించాలని విన్నవించారు. కార్మికుల కోసం ప్రత్యేకంగా కాలనీ ఏర్పాటు చేసి ఇళ్లు కట్టివ్వాలని, కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని కోరారు. శాంతయ్య, నర్సింహులు, గంగారాం, తదితరులు కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. హరితహారం కూలీ డబ్బులివ్వండి.. (03ఎన్జెడ్టి223) హరితహారంలో భాగంగా నర్సరీల్లో పెంచిన మొక్కలకు నీరు పట్టి, చెట్లను పెంచినందుకు రావాల్సిన కూలీ డబ్బులు ఇంకా రాలేదని, నాలుగు నెలల నుంచి అధికారులు డబ్బులు ఇవ్వలేదని నిజామాబాద్ మండలం నర్సింగ్పల్లి గ్రామానికి చెందిన మహిళలు వాపోయారు. ఈ మేరకు కూలీలు లక్ష్మి, భూదవ్వ, భూలక్ష్మి, తదితరులు కలెక్టర్ యోగితారాణాను కలిసి వినతిపత్రం సమర్పించారు. నర్సింగ్పల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలను పెంచడానికి పని చేశామని, దానికి సంబంధించిన కూలీ డబ్బు ఇంకా రాలేదని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని, త్వరగా కూలీ డబ్బులు ఇప్పించాలని విన్నవించారు. స్పందించిన కలెక్టర్ డ్వామా అధికారులకు సిఫార్సు చేశారు. సదరం సర్టిఫికెట్ ఇప్పించండి.. (03ఎన్జెడ్టి224) చిత్రంలో కనిపిస్తున్న వీరు డిచ్పల్లి మండలం రాంపూర్ తండాకు తల్లి కూతుళ్లు మంగిబాయి, పీరుబాయి. శారీరక వికలాంగురాలైన పీరుబాయికి సదరం సర్టిఫికేట్ లేకపోవడంతో ఏడాది నుంచి పెన్షన్ నిలిపివేశారు. ప్రస్తుతం సదరం సర్టిఫికేట్ ఉంటేనే పెన్షన్ ఇస్తామని అధికారులు స్పష్టం చేయడంతో సర్టిఫికేట్ ఇప్పించాలని మంగిబాయి తన కూతురితో కలిసి ప్రజావాణిలో కలెక్టర్ను కలిసింది. సదరం సర్టిఫికేట్ ఇప్పించి, పెన్షన్ను పునరుద్ధరించాలని యోగితారాణాకు వినతిపత్రం సమర్పించారు. బిల్లులు ఇవ్వట్లేదు... (03ఎన్జెడ్టి225) ఈయన పేరు నీరడి ఆశోక్. డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామం. తన ఇంట్లో ప్రభుత్వ పథకం కింద మరుగుదొడ్డిని నిర్మించకున్నానని, అయితే అందుకు సంబంధించిన బిల్లును ఇవ్వడం లేదని వాపోయారు. బిల్లులు ఇవ్వాలంటే రూ.2 వేలు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ అడుగుతున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తన సొంత డబ్బుతో మరుగుదొడ్డి నిర్మించానని, తనకు బిల్లులు ఇప్పించాలని విన్నవించాడు. ఆర్థిక సాయం అందించండి... (03ఎన్జెడ్టి228) వీరిద్దరు అన్నదమ్ములు బానోత్ వినోద్, సుమన్. తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథలుగా మారారు. అయితే, తన తమ్ముడు సుమన్కు ప్రమాదవశాత్తు వెన్నెముక విరిగిందని, చికిత్స చేయించడానికి స్తోమత లేదని వినోద్ తెలిపాడు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సాయం అందించాలని ఆదుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశాడు. స్పందించిన యోగితారాణా ఆరోగ్యశ్రీ అధికారులకు సిఫార్సు చేశారు. దోమకొండలోనే కొనసాగించాలి... (03ఎన్జెడ్టి229) కొత్తగా ఏర్పాటు కానున్న బీబీపేట్ మండలంలో తమ గ్రామాన్ని కలపవద్దని కోరుతూ మహ్మదాపూర్ గ్రామస్తులు కలెక్టరేట్కు తరలివచ్చారు. అనంతరం కలెక్టర్ యోగితారాణాకు వినతి పత్రం అందజేశారు. బీబీపేట్ మండలంలో తమ గ్రామాన్ని విలీనం చేయడం సరికాదని, కొత్త మండలంలో కలిపితే తమకు నష్టం జరుగుతుందన్నారు. తమను పాత మండలమైన దోమకొండ మండలంలోనే కొనసాగించాలని కోరారు. గ్రామస్తులు గజ్జెల లక్ష్మీకాంతం, నాగం రాజుగౌడ్, యాచం నరేందర్, బాగిరెడ్డి, లక్ష్మారెడ్డి, రాజు, బాల్రెడ్డి, పోషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్డును బాగుచేయండి.. ఇటీవల కురిసిన వర్షాలకు తమ గ్రామానికి చెందిన రోడ్డు తెగిపోయిందని, రోడ్డును బాగు చేయించాలని మాచారెడ్డి మండలం ఆరెపల్లి గ్రామస్తులు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. చెక్ డ్యాం కట్ట తెగిపోవడంతో రోడ్డు పూర్తిగా చెడిపోయి రాకపోకలకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. కావున రోడ్డుకు మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు. -
నేటి ప్రజావాణి రద్దు
కాకినాడ సిటీ : కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి కార్యక్రమాలు రద్దు చేసినట్టు కలెక్టర్ అరుణ్కుమార్ ప్రత్రికలకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అనివార్య కారణాల వల్ల జరిగిన ఈ మార్పును ప్రజలు, అర్జీదారులు గమనించాలని కోరారు. -
ఎవరికీ చెప్పుకోను..?
అధికారుల తప్పిదంతో దక్కని ఉద్యోగం ఓ మూగ నిరుద్యోగి ఆవేదన ముకరంపుర: ఓ మూగ నిరుద్యోగితో అధికారులు చెలగాటమాడారు.. నోరుండి మాట్లాడలేని ఆ వ్యక్తి అధికారుల పొరపాటును నిలదీయలేకపోయాడు.. ఫలితంగా దక్కాల్సిన ఉద్యోగం చేజారిపోయింది. చివరికి తప్పు అధికారిదేనని ఒప్పుకునేసరికి ఉద్యోగ ఖాళీలు లేకుండా పోయాయి. తమ్ముడి సాయంతో సోమవారం ప్రజావాణిని ఆశ్రయించిన ఆ మూగ ఉద్యోగి ఆవేదన ఇది.. గోదావరిఖని :యెటింక్లయిన్ కాలనీకి చెందిన జె.సదానందం పుట్టుకతోనే మూగ. పట్టుదలతో డిగ్రీ పూర్తిచేశాడు. 2015 నవంబర్లో వికలాంగకోటాలో ఉద్యోగఖాళీలకు నోటిఫికేషన్ రాగా.. దరఖాస్తు చేసుకున్నాడు. మెడికల్ రిపోర్టు సమర్పించాడు. ఉద్యోగ ఖాళీలన్నీ 7వ తరగతి అర్హత కింద ఉన్న అటెండర్ పోస్టులే.. అయినా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే సంకల్పంతో దరఖాస్తు చేశాడని అతడి తమ్ముడు రఘు వివరించాడు. ఆయా మండలాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని నిబంధన ఉండడంతో ఆసక్తి చూపాడు. తీరా విద్యాశాఖలో 7వ తరగతి విద్యార్హతల సర్టిఫికెట్ ఒరిజినల్ కాదని, స్కూల్రికార్డులో లేదని, అవి సరిపోలడంలేదని కారణంచూపారు. దీంతో సదానందం తర్వాత అర్హత మరొకరిని మెరిట్ప్రకారం ఉద్యోగంలోకి తీసుకున్నారు. తప్పు విద్యాశాఖపై నెట్టేసిన వికలాంగుల శాఖ తమదేమీ లేదన్నట్లు వ్యవహరించింది. బాధితుడు విద్యాశాఖ చుట్టూ తిరగగా.. డీఈవో స్వయంగా పరిశీలించి 7వ తరగతి సర్టిఫికెట్ ఒరిజినల్గా నిర్ధారించి పొరపాటు చేసిన సెక్షన్ ఇన్చార్జిపై ఆగస్టు 18న చర్యలకు ఆదేశించారు. ఈలోపు ఖాళీ ఉద్యోగం వేరొకరికి దక్కగా.. మొత్తం 30 మందికి పోస్టింగులిచ్చేశారు. సోమవారం ఒరిజినల్ అర్హత సర్టిఫికెట్లతో కలెక్టర్ నీతూప్రసాద్ను ఆశ్రయిస్తే ఏజేసీని విచారించాల్సిందిగా ఆదేశించారు. ఆయన వికలాంగులశాఖ ఏడీ నళిని పిలిచి ఆరాతీస్తే ఖాళీలు లేవని, తప్పు విద్యాశాఖదేనని, ఖాళీల కోసం కలెక్టర్కు లెటర్ పెడుతామని పేర్కొన్నారు. ఆ మూగ సైగలు 8 నెలలుగా ఎవరికీ పట్టలేదు. కళ్లుండి తప్పిదాలు చేసిన అధికారి తీరుతో ఆ మూగ నిరుద్యోగికి ఉద్యోగం కోసం నిరీక్షణ తప్పడం లేదు.. కలెక్టరమ్మ స్పందించి వికలాంగుల కోటాలో అర్హతను బట్టి ఉద్యోగం ఇప్పించాలని సదానందం తన తమ్ముడు రఘు సాయంతో వేడుకున్నాడు. -
హామీని నెరవేర్చాల్సిందే..
లేకపోతే ఆమరణ దీక్ష చేపడతా ర్యాంపును, ఇసుక లారీలను అడ్డుకుంటాం ప్రజావాణిలో అధికారులను నిలదీసిన జక్కంపూడి రాజా సీతానగరం : జాలిమూడి వద్ద గత నెల 15న ఇసుక లారీ కిందపడి మామిడి దుర్గ మరణించిన సంఘటన నేపథ్యంలో ఆమె ఇద్దరు కుమార్తెలకు అధికారులు, ర్యాంపు నిర్వాహకులు నష్ట పరిహారం ఇస్తానన్న హామీని విస్మరిస్తే సహించేది లేదని జక్కంపూడి రాజా హెచ్చరించారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ చంద్రశేఖరరావును ఆయన నిలదీశారు. సంఘటన జరిగి 40 రోజులైనా, మృతురాలి కుమార్తెలు శ్రీదేవి, సత్యభువనకు ర్యాంపు నిర్వాహకులు రూ.4 లక్షలు, ప్రభుత్వపరంగా ఇంటిస్థలం, ఆర్థికసాయం ఇచ్చేలా అధికారులు ఒప్పుకున్నారని, ఇంతవరకూ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నగదు విషయమై తమకు సంబంధం లేదని, ఇంటì æస్థలం, సీఎం రిలీఫ్ఫండ్ వచ్చేలా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ర్యాంపు నిర్వాహకులతో చర్చిస్తామని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు చేతులెత్తేస్తారా అంటూ రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా హామీ నెరవేర్చకపోతే ఆమరణ æదీక్ష చేపడతానని ప్రకటించారు. ఇసుక లారీలను, కాటవరం ర్యాంపును అడ్డుకుంటామని హెచ్చరించారు. సిగ్గుంటే పదవికి రాజీనామా చెయ్! సాక్షి, రాజమహేంద్రవరం : గతంలో ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు నీతి, నైతిక విలువల గురించి మాట్లాడిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు.. ఇప్పుడు తాను చేసిన వ్యవహారం ఏమిటో చెప్పాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ప్రశ్నించారు. సిగ్గు, నైతిక విలువలుంటే పార్టీకి రాజీనామా చేసినట్టుగానే, పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆదిరెడ్డి వల్లే నగరంలో ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేషన్, ఆర్యాపురం బ్యాంక్ ఎన్నికల్లో పార్టీ నష్టపోయిందని మండిపడ్డారు. బీసీలకు పెద్దపీట వేయాలని పార్టీ నుంచి తొలి ఎమ్మెల్సీ పదవిని ఆదిరెడ్డికి ఇచ్చారని గుర్తు చేశారు. పుష్కరాల్లో 29 మంది మరణిస్తే ఒక్కసారి కూడా కమిషన్ ముందు పార్టీ వాదన వినిపించలేదని విమర్శించారు. ఇసుక విక్రయాలు, నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై కోర్టుకెళతానన్న మాటలు, ఆ తర్వాత ఎక్కడిపోయాయో చెప్పాలని డిమాండ్ చేశారు. సాధారణ లెక్చరర్గా ఉన్న ఆదిరెడ్డి ఇప్పుడు ఖరీదైన కార్లలో ఎలా తిరుగుతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. కార్పొరేటర్లు మేడపాటి షర్మిలారెడ్డి, మింది నాగేంద్ర, బొంత శ్రీహరి, పిల్లి నిర్మల, మజ్జి నూకరత్నం, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. -
కలెక్టరమ్మా.. దయ చూపండి
ప్రజావాణికి 378 దరఖాస్తులు ముకరంపుర: ‘క్షేత్రస్థాయిలో అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయాం.. మా సమస్యలు పట్టించుకున్న వారే కరువయ్యారు.. మీరైనా దయ చూపండి.. మాకు న్యాయం చేయండి’ అంటూ బాధితులు కలెక్టర్ నీతూప్రసాద్ను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి బాధితుల తాకిడి కనిపించింది. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 378 మంది అర్జీలు సమర్పించారు. ప్రధానంగా భూసంబంధిత సమస్యలు, ఉపాధి కల్పించాలని, రేషన్కార్డులు, పింఛన్లు తదితర సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. కలెక్టర్ నీతూప్రసాద్, జేసీ శ్రీదేవసేన, డీఆర్వో వీరబ్రహ్మయ్య తదితరులు అర్జీలు స్వీకరించారు. – కరీంనగర్ మండలం బొమ్మకల్ శివారులో 724 సర్వే నంబర్లోని 1.15 గుంటల భూమిని 17 మంది పట్టాదారుల నుంచి ఖరీదు చేసి ఆస్తి మార్పిడి చేసుకుని గ్రామ పంచాయతీ అనుమతితో ఇళ్లు కూడా నిర్మించుకున్నామని, ఆ భూమిని ఇద్దరు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని బూదిరెడ్డి వెంకటయ్య కలెక్టర్కు ఫిర్యాదుచేశాడు. వారికి తహసీల్దార్, ఆర్ఐలు సహకరించి సదరు వ్యక్తులకు ఆస్తిమార్పిడి చేసి వ్యవసాయ భూమిగా పట్టాదారు పాస్బుక్కులు జారీ చేశారని తెలిపారు. విచారించి న్యాయం చేయాలని కోరారు. –సుల్తానాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టులో కొన్నేళ్లుగా ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్గా సరుకులు సరఫరా చేస్తున్న తనపై అసత్యపు ఆరోపణలతో ఎలాంటి నోటీసులివ్వకుండా తొలగించారని బత్తిని నారాయణగౌడ్ కలెక్టర్కు విన్నవించారు. ఈ విషయమై ఆర్జేడీకి ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించినా పట్టించుకోవడంలేదని తెలిపారు. ఈఎండీ రూ.50వేలు రావాల్సి ఉందని, తప్పును రుజువు చేయకుండా సుల్తానాబాద్ సీడీపీవో దాటవేస్తున్నారని, విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు. –జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో పెట్టాలని బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ మిర్యాల్కర్ నరేందర్ కలెక్టర్ను కోరారు. మోడీ అనేక ప్రజాసంక్షేమ పథకాలతో దేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటుతున్నారని తెలిపారు. –జిల్లా కేంద్రంలో అదనంగా కళాశాలల స్థాయి బీసీ బాలుర, బాలికల వసతి గృహాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ బీసీ వెల్ఫేర్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కేశిపెద్ది శ్రీధర్రాజు ఆధ్వర్యంలో కలెక్టర్ నీతూప్రసాద్కు వినతి పత్రం సమర్పించారు. జిల్లా కేంద్రంలో మూసివేసిన నాలుగు బీసీ వసతి గృహాలను ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. -
సమస్య తీరదు.. ఆశ చావదు!
►ప్రజావాణికి తిరిగి తిరిగి అలిసిపోతున్న పిర్యాదుదారులు ►గ్రమాల్లో అధికారులు అందుబాటులో ఉండకపోవడమే కారణం ►నేడు జిల్లాకేంద్రంలో ప్రజావాణి ♦ పరిష్కారానికినోచుకోని సమస్యలు ♦ ప్రజావాణికి తిరిగి వేసారిపోతున్న బాధితులు ♦ క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యమే కారణం ♦ నేడు ప్రజావాణి గ్రామాల్లో అధికారులు అందుబాటులో ఉండటంలేదు. దీంతో ఎంతో ఆశతో ప్రతిసోమవారం సమస్యలపై ఫిర్యాదు చేయడానికి జిల్లాకేంద్రానికి వస్తున్న వారికీ ఇక్కడా నిరాశే ఎదురవుతోంది. వినతులను స్వీకరిస్తున్న జిల్లా అధికారులు అలా తీసుకొని ఇలా మండలాలకు పంపించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. - మహబూబ్నగర్ న్యూటౌన్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహిస్తు న్న ప్రజావాణిలో వినతులిచ్చిన బాధితులు స మస్య పరిష్కారం కాకపోవడంతో చాలామంది మళ్లీమళ్లీ వచ్చి తమ గోడును అధికారులకు వెల్లబోసుకుంటున్నారు. ఇక్కడ అధికారులు ఆదేశాలు జారీచేసినా మండల స్థాయిలో అధికారులు పట్టిం చుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తరచూ మంచినీటి సమస్య, పింఛన్ల మంజూరి, భూముల సమస్యలు, రుణాల మం జూరీ, ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అక్రమా లు, నిరుద్యోగుల సమస్యలపై ప్రజావాణికి వినతులు అధిక సంఖ్యలో వస్తున్నాయి. ఫిబ్రవరి నె లలో వందల్లో ఫిర్యాదులు అందక వాటిలో ప దిశాతం కూడా సమస్యలను పరిష్కరించలేదు. గ తనెల 1న నిర్వహించిన ప్రజావాణిలో 314 దరఖాస్తులు, 8న 339, 15న 300, 22న 305, 29న జరి గిన ప్రజావాణిలో 320 ఫిర్యాదులు, వినతులు అందాయి. ఉద్యోగం కోసం.. అమ్రాబాద్ మండలం దోమలపెంటకు చెందిన కె. సంతోషమ్మ 2002కు ముందు ఏపీ జెన్కోలో వాచ్మెన్గా పని చేసింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఆమెనున తొలగించారు. తనను తెలంగాణలో ఉద్యోగం కల్పించాలని విన్నవిస్తే హైదరాబాద్ జల సౌదకు వెళ్లమని చెబుతున్నారు. ఆమె కొన్నిరోజులుగా ఫిర్యాదు తీసుకొని తిరుగుతున్నా ఇక్కడి అధికారులు పట్టించుకోవడంలేదు. కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ కలెక్టర్ టికె.శ్రీదేవి ప్రజావాణి, పల్లెవికాసం, రెవెన్యూ దర్బార్ వంటి కార్యక్రమాల్లో వచ్చిన సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని మండల అధికారులకు ఆదేశిస్తున్నా ఎవరూ స్పందించడంలేదు. మండలకేంద్రాల్లో జరిగే ప్రజావాణిలో పదుల సంఖ్యలోకూడా దరఖాస్తులు రావడంలేదంటే ప్రజలకు అధికారులపై ఏమేరకు నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ పని కావడంలేదని జిల్లాకేంద్రానికి వస్తుండటంతో ఇక్కడ వందల సంఖ్యలో దరఖాస్తులు పేరుకపోతున్నాయి. కానీ అవికూడా తిరిగి మండలాలకు వెళ్లడంతో అక్కడే ఉండిపోతున్నాయి. స్థానిక రాజకీయాలు, నిర్లక్ష్యం కారణంగా సమస్యలు తీరడంలేదని ఫిర్యాదు దారులు వాపోతున్నారు. ప్రేమ్కుమార్ పరేషాన్.. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని బోయపల్లి గ్రామ శివారులో రాజేంద్రనగర్కు చెందిన జె.ప్రేమ్కుమార్కు సర్వే నెం.134లో 1.20 ఎకరాల భూమి ఉంది. అయితే అందులోంచి 0.10 గుంటల భూమిని రెవెన్యూ అధికారులు రికార్డుల్లో ఇతరుల పేరుమీద మార్చారు. ఇందుకు కారణాలు చెప్పి తన భూమిని తన పేరుమీదకు మార్చాలని ప్రేమ్కుమార్ కొన్నిరోజులుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా పని కావడంలేదు. -
ఏక్ నిరంజన్..!
ప్రజావాణికి హాజరైన ఒకే ఒక్క అధికారి.. ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వీలుగా ప్రభుత్వం ‘ప్రజావాణి’ ఏర్పాటు చేశారు. అధికారులంతా ఒకే దగ్గర ఉండి వచ్చినసమస్యలను పరిష్కరించడం.. వివిధ శాఖల మధ్య ఉన్న సమస్యలను సమన్వయం చేసుకొని బాధితులకు న్యాయం చేసేందుకు వీలుగా ప్రతి సోమవారం అధికారులంతా ఒకే దగ్గర ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే, ఇక్కడ కూడా అధికారులు సరైన శ్రద్ధ చూపడం లేదు. గ్రీవెన్స్డేలకు కూడా డుమ్మా కొడుతున్నారు. సోమవారం తాండూరు మండల పరిషత్లో నిర్వహించిన ప్రజా దర్బార్కు పంచాయతీరాజ్ ఏఈ ఇసాక్ మాత్రమే హాజరయ్యారు. మిగతా వారంతా డుమ్మా కొట్టారు. దీంతో బాధితులు అధికారులకోసం వేచి చూసి వెనుదిరిగారు. 11గంటల తర్వాత ఎంపీడీఓ జగన్మోహన్రావు వచ్చారు. అధికారులు లేకపోవడం.. బాధితులంతా వెళ్లిపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. - తాండూరు రూరల్ -
ప్రజావాణి వినతులకు తొలి ప్రాధాన్యత
అధికారులకు కలెక్టర్ కేవీ రమణ ఆదేశం కడప సెవెన్రోడ్స్ : ప్రజావాణికి వచ్చే వినతుల పరిష్కారానికి అధికారులు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ కేవీ రమణ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు కలెక్టరేట్కు వచ్చి అర్జీలు సమర్పిస్తుంటారని చెప్పారు. వాటిని అధికారులు పరిశీలించి సకాలంలో పరిష్కరించాలన్నారు. కడప రెవెన్యూ డివిజన్ పరిధిలో 268 ప్రభుత్వ చౌక దుకాణాలకు ఇన్ఛార్జి ఆర్డీఓగా ఉన్న లవన్న ఇచ్చిన నోటిఫికేషన్ను తక్షణమే రద్దుచేయాలని టీడీపీ నాయకుడు ఇందిరెడ్డి శివారెడ్డి తదితరులు కోరారు. రోస్టర్ను సక్రమంగా రూపొందించలేదని చెప్పారు. అలాగే కోర్టు విచారణలో ఉన్న ఎఫ్పీ షాపులను కూడా నోటిఫికేషన్లో పొందుపరిచారన్నారు. భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఈనెల 25న బదిలీపై వెళుతున్న ఇన్చార్జి ఆర్డీఓ హడావుడిగా నోటిఫికేషన్ విడుదల చేయడంపై పలు అనుమానాలు ఉన్నాయని వివరించారు. జర్నలిస్టుల హెల్త్ కార్డుల దరఖాస్తులకు మరికొంత సమయాన్ని పొడిగించాలని జాప్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి.విజయకుమార్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు జ్యోతి జార్జి కోరారు. వరుసగా పండుగలు రావడం వల్ల చాలామంది దరఖాస్తు చేసుకోలేక పోయారన్నారు. సమాచారం సైతం చాలామందికి తెలియదన్నారు. జిల్లాలోని వికలాంగులకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు చిన్న సుబ్బయ్యయాదవ్, బీఎన్ బాబు తదితరులు కోరారు. పలుమార్లు తహశీల్దార్ల దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లినప్పటికీ వారు స్పందించడం లేదన్నారు. కడప నగరంలోని పలు వీధులలో చెత్తాచెదారాలు పేరుకుపోతున్నప్పటికీ మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించడం లేదని అర్బన్ డెవలప్మెంట్ కమిటీ నాయకులు ఎం.చెండ్రాయులు, వై.తిరుమలయ్య, సుజాతరెడ్డి, ఎస్.గౌస్పీర్ తదితరులు ఫిర్యాదు చేశారు. ఈగలు, దోమలు ప్రబలి పలు వ్యాధులకు కారణమవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రామారావు, ఇన్ఛార్జి ఏజేసీ సుబ్బారెడ్డి, డీఆర్వో సులోచన, ఇతర జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
‘ప్రజావాణి'లో ఇబ్బందులు
ముకరంపుర: కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించే ‘ప్రజావాణి' అధికారుల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. బాధితుల సమస్యల పరిష్కారం దేవుడెరుగు.. అసలు కార్యక్రమ నిర్వహణలోనే సమస్యలు తాండవిస్తుండడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక జనం సతమతమవుతున్నారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి బాధితులు కలెక్టరేట్కు తరలివచ్చారు. ఉదయం 10 గంటల నుంచి బాధితుల తాకిడి మొదలైంది. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎప్పటిలాగే ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం సాగింది. ప్రజావాణి నిర్వహించే ఆడిటోరియంలో మధ్యాహ్నం 12 గంటలు దాటినా ఒక్క అధికారి రాకపోవడంతో జనం అధికారుల తీరుపై మండిపడ్డారు. జిల్లా ఉన్నతాధికారులకు కలుసుకోవాలనుకున్న వారు రెండు గంటలపాటు ఎదురు చూశారు. చివరికి జిల్లా రెవెన్యూ అధికారి వీరబ్రహ్మయ్య వచ్చి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. అలా 12 గంటలకు మొదలైన దరఖాస్తుల స్వీకరణ మధ్యాహ్నం 2 గంటలతో ముగిసింది. ఆడిటోరియంలో శాఖల వారీగా ఉన్న కౌంటర్లూ వెలవెలబోయాయి. తెలంగాణ రాష్ట్రం పేరుతో కొత్తగా రూపొందించిన ప్రజవాణి వెబ్సైట్ తెరుచుకోకపోవడంతో దరఖాస్తులు నమోదు చేసి రశీదులిచ్చే తొమ్మిది కంప్యూటర్లు అలంకారప్రాయంగా మారాయి. బాధితులకు చేతిరాతతో రశీదులు అందజేయడంతో అంతులేని ఆలస్యం జరిగింది. -
గోడు గోడలకే..
ప్రజావాణి... ప్రతీ సోమవారం మండల, డివిజన్, జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమం. సామాన్యులు తమ గోడు వెల్లబోసుకునేందుకు.. తద్వారా సమస్య పరిష్కారానికి అనువైన వేదిక. కానీ జిల్లా ఉన్నతాధికారులు తమకు ఇచ్చిన అర్జీలను తీసుకోవడం.. ఆ తర్వాత సంబంధిత శాఖలకు పంపించడంతోనే సరిపెడుతున్నారు. ఫలితంగా సమస్య పరిష్కారం కాక.. అర్జీదారులకు వ్యవయప్రయూసలే మిగులుతున్నారుు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణిపై ‘సాక్షి’ పరిశీలన జరపగా అక్కడికి వచ్చిన బాధితులు పెద్దమొత్తంలో కనిపించారు. కొన్నేళ్లుగా తాము దరఖాస్తు చేస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదంటూ ఆరోపించారు. - ముకరంపుర ముకరంపుర: కలెక్టరేట్కు సోమవారం జిల్లా నలుమూలల నుంచి 220 మంది బాధితులు తరలివచ్చారు. తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఇందులో ప్రధానంగా ఆహారభద్రత, పెన్షన్లపై దరఖాస్తులున్నారుు. సర్వర్ సమస్యతో నమోదులో జాప్యం జరిగింది. దీంతో సిబ్బంది దరఖాస్తులు తీసుకుని చేతిరాతతో కూడిన రశీదులందించారు. ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు కలెక్టరేట్ సమావేశమందిరంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం జరిగింది. అనంతరం 11.15 గంటలకు కలెక్టర్ వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్వో వీరబ్రహ్మయ్య, డీఆర్డీఏ పీడీ విజయగోపాల్ ఒకరి తర్వాత ఒకరు ఆడిటోరియంలో నిర్వహించే ప్రజావాణికి వచ్చారు. బాధితుల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించి కార్యక్రమం ముగించారు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆ తర్వాత వచ్చిన బాధితులు కొంతమంది వెనుదిరిగారు. కానరాని అధికారులు ప్రజావాణిలో కలెక్టర్, జేసీతో పాటు జిల్లాస్థారుు అధికారులు పాల్గొనాల్సి ఉంటుంది. కానీ కొన్నిశాఖల అధికారులు తమ కార్యాలయంలోని కిందిస్థాయి సిబ్బందిని పంపి చేతులు దులుపుకుంటున్నారు. కలెక్టర్, జేసీలు ఏదైనా అధికారిక కార్యక్రమంపై బయటికి వెళ్తే ఇక అక్కడ ఒక్క అధికారి కూడా కనిపించడం లేదు. సోమవారం డీపీవో కుమారస్వామి మినహా జిల్లాస్థాయి అధికారులవెరూ ప్రజావాణిలో లేరు. డీఎంహెచ్వో బాలు, హౌసింగ్ పీడీ నర్సింహారావు, డీఎస్వో చంద్రప్రకాశ్, వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్ తదితర అధికారులెవరూ కుర్చీలో కానరాలేదు. ఏం జరుగుతోంది? ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించి బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. కలెక్టర్, జేసీ సహా ఉన్నతాధికారులు పాల్గొంటారు. అర్జీలను మొదట ప్రత్యేక కౌంటర్లలో తీసుకుని వెబ్సైట్లో నమోదు చేసుకుని శాఖల వారీగా ఉన్నతాధికారులకు చేరవేస్తారు. దరఖాస్తు నమోదైనట్లు కౌంటర్లో బాధితుడికి ఓ ప్రతి ఇస్తారు. దానిని కలెక్టర్కు సమర్పించి గోడు వెల్లబోసుకుంటారు. ఆ తర్వాత ఆ సమస్యను కలెక్టర్ సంబంధిత అధికారులకు రాసి పరిష్కరించాల్సిందిగా సూచిస్తారు. వెబ్సైట్ ఉత్తదే.. ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ఆయా శాఖల అధికారులు తమకు అందిన అర్జీలు, పరిష్కారం, పురోగతి తదితర వివరాలను వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. కొన్ని శాఖలు ప్రజావాణి ద్వారా సంబంధిత సమస్యలు పరిష్కారం కాబడినవి అంటూ బాధితులకు లేఖలు చేరవేస్తుండడంతో అవాక్కయ్యే సంఘటనలు కనిపిస్తున్నాయి. మొక్కుబడిగా కార్యక్రమం ఇక్కడ అధికారులు కంప్యూటర్లో దరఖాస్తులు నమోదు చేసుకోవడం.. తర్వాత సంబంధిత శాఖకు బదిలీ చేయడం.. జిల్లా ఉన్నతాధికారులను కలుసుకోవడం వరకు బాగానే ఉంటున్నా అంతా మొక్కుబడి వ్యవహారంగా సాగుతోంది. మండల, డివిజన్ స్థాయిలో ప్రజావాణి ఉన్నా జిల్లా నలుమూలల నుంచి బాధితులు వ్యయప్రయాసల కోర్చి కలెక్టరేట్కు తరలివస్తున్నారు. వేలల్లో దరఖాస్తులు వస్తున్నా పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించినట్లే పేర్కొంటున్నారు. సమస్యలు పరిష్కారానికి నోచుకోక బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే వున్నారు. అధికారులు డుమ్మా సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి స్పందన కరువైంది. పలు శాఖల అధికారులు డుమ్మా కొట్టారు. చేనేత జౌళి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఫారెస్ట్, వైద్య, విద్య, వ్యవసాయ శాఖ అధికారులు హాజరు కాలేదు. ఆర్డీవో భిక్షానాయక్ సమక్షంలో జరిగిన ప్రజవాణికి పెద్దగా ఫిర్యాదులు రాలేదు. భూమి సర్వే కోసం వ్యక్తిగత సమస్యలను ప్రస్తావిస్తూ పలువురు దరఖాస్తు చేసుకున్నారు. సిరిసిల్లలో కార్మికుల కూలి ఒప్పందం కోసం చర్చలు నిర్వహించాలని కోరుతూ సీఐటీయూ, నవోదయ పవర్లూం కార్మిక సమాఖ్య వినతిపత్రాలు అందించాయి. ఆగస్టు 19న నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆన్లైన్లో పూర్తిస్థాయిలో డాటా ఎంట్రీ లేదని, చాలా కుటుంబాల సమాచారం నమోదు కాలేదని నేత చేయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కుసుమ విష్ణు, వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు తడుక శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎస్కేఎస్ వివరాలు లేకపోవడంతో ఆహారభద్రత, ఆసరా పింఛన్లు అందకుండా పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. - సిరిసిల్ల అనాథ లకు నీడనివ్వండి 12 ఏళ్లుగా కరీంనగర్ శివారులోని అద్దె ఇంట్లో వీరబ్రహ్మేంద్ర అనాథాశ్రమం నిర్వహిస్తున్నా. ప్రస్తుతం 33 మంది వృద్ధులున్నారు. వయసు మీరడంతో వారు మరణిస్తున్నారు. ఈ కారణంగా ఇళ్లు ఖాళీ చేయాలని ఇంటి యజమాని ఒత్తిడి పెంచుతున్నాడు. అనాథ వృద్ధులకు ఎక్కడ ఆశ్రయమివ్వాలి. పక్కా ఇళ్ల స్థలం కేటాయించాలని 12 ఏళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేదు. ప్రస్తుత ఆశ్రమం వద్దే కుంట శిఖం భూమి, వర్మి కంపోస్ట్ షెడ్ ఉంది. అది వీరబ్రహ్మేంద్ర అనాథవృద్ధాశ్రమానికి కేటాయించాలని వేడుకుంటున్నా. - వీరమాధవ్, వీరబ్రహ్రేంద్ర అనాథాశ్రమం తెరుచుకోని తహశీల్దార్ చాంబర్ ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారుల పట్టింపు కరువైంది. సోమవారం మంథనిలో అసలు ప్రజావాణియే నిర్వహించలేదు. సాక్షి విలేకరి ఉదయం 10-30 గంటలకు తహశీల్దార్ కార్యాలయానికి చేరుకోగా తహశీల్దార్ చాంబర్ ఇంకా తెరుచుకోనే లేదు. గడియ పెట్టి ఉన్న గది ఫొటో తీయగా... ఉదయం 11-30 గంటలకు సిబ్బంది కేవలం గది మాత్రమే తెరిచారు. కానీ అర్జీలు తీసుకునేందుకు ఏ ఒక్క అధికారి అందుబాటులో లేరు. వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన చాలామంది బాధితులు ప్రజావాణి లేదని తెలుసుకుని నిరాశతో వెనుదిరిగారు. ఇక్కడ ప్రజావాణి ఎందుకు నిర్వహించలేదో అధికారులకే తెలియాలి. డివిజన్లోనూ ప్రజావాణి మొక్కుబడిగా సాగింది. తాను ఐకేపీ కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి వెళ్లగా.. డెప్యూటీ తహశీల్దార్ దరఖాస్తుల పరిశీలనకు వెళ్లారని, ఎంపీడీవో కూడా అదే పనిలో ఉన్నారని మంథని తహశీల్దార్ జల్లా సత్తయ్య తెలపడం కొసమెరుపు. - మంథని ఒక్కటే దరఖాస్తు హూజూరాబాద్లో ప్రజావాణికి స్పందన కరువైంది. తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి అధికారులెవరూ హాజరుకాలేదు. ఒకే ఒక్కరు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తును కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ రాము తీసుకున్నారు. ఓసారి మండల పరిషత్లో.. మరోసారి తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తుతుండడంతో జనం అయోమయానికి గురవుతున్నారు. సర్వే కారణంగా అధికారులు ప్రజావాణికి హాజరు కాలేదని తహశీల్దార్ నాగేశ్వరావు తెలిపారు. - హుజూరాబాద్ టౌన్ జగిత్యాలలో ఫిర్యాదులు జగిత్యాలలో నిర్వహించిన ప్రజావాణికి కొంత స్పందన కనిపించింది. ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొందరు సమస్యలపై అధికారులకు అర్జీలు అందించారు. సారంగాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన సురేందర్రావు 105, 107 సర్వే నంబరు రికార్డులో పేరును అక్రమంగా తొలగించారని.. బాధ్యులపై చర్య తీసుకుని న్యాయం చేయాలని వినతిపత్రం అందించారు. మెట్పల్లి మండలం కోనారావుపేట రేషన్ డీలర్ ఎన్.జనార్దన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేయడంలేదని.. రాయికల్ మండలం యూసూఫ్నగర్గీత పారిశ్రామిక సంఘం భూమి సర్వే నంబర్ 631లోని భూమి కబ్జా చేసినవారిపై చర్యలు తీసుకోవాలని కొందరు అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ కొంరయ్య, ఆర్డబ్ల్యూఎస్ డీఈ రాజేశం, హౌసింగ్ డీఈ వెంకన్న, డీఎల్పీవో చంద్రశేఖర్, సంక్షేమాధికారులు బాలసురేందర్, జయదేవ్, అబ్రహం, రంగారెడ్డి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, మెట్పల్లి సీడీపీవో మమత, ఐకేపీ ఏరియా కో-ఆర్డినేటర్ పద్మ పాల్గొన్నారు. ఆర్డీవో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అధికారులు స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. - జగిత్యాల -
నా భార్యతో వ్యభిచారం చేయిస్తున్నారు
ప్రజావాణిలో కలెక్టర్కు మొరపెట్టుకున్న భర్త ఏలూరు (వన్టౌన్) : తన భార్యతో వ్యభిచారం చేయిస్తున్నారని, రక్షించాలని కోరుతూ ఓ భర్త ప్రజావాణిలో కలెక్టర్కు మొరపెట్టుకున్నాడు. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు మండలం గవరపేట 50వ డివిజన్లో నివాసం ఉండే చొచ్చుపల్లి శ్రీనివాస్ భార్యను తంగెళ్లమూడి ఎమ్మార్సీ కాలనీకి చెందిన మణి అనే వ్యభిచార కేంద్ర నిర్వాహకురాలు తీసుకువెళ్లిపోయిందని, దీంతో తన భార్యను పంపించాలని కోరితే ఖర్చులకు డబ్బులిస్తామంటున్నారని వాపోయాడు. బలవంతంగా తన భార్యను నిర్భందించి వ్యభిచారం చేయించడమే కాక భార్యను పంపాలని అడిగితే చంపుతానని, కొడతానని బెదిరిస్తున్నారని, దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చే శాడు. తనకు ఆరోగ్యం బాగోలేదని, పిల్లలు రాఘవస్వామి (8), మల్లేశ్వరస్వామి (7) అనాథలుగా రోడ్లపై తిరుగుతున్నారని, మా కుటుంబాన్ని రక్షించాలంటూ కన్నీరుమున్నీరయ్యాడు. ఏలూరులో యథేఛ్ఛగా జరుగుతున్న వ్యభిచారాన్ని అరికట్టాలని, తన భార్య లాంటి ఎంతో మంది వ్యభిచార కూపాల్లో మగ్గిపోతున్నారని బాధితుడు తెలి పాడు. దీనిపై స్పందించిన కలెక్టర్ కె.భాస్కర్ కేసును దర్యాప్తు చేయాలని డీఎస్పీ కేజీవీ సరితను ఆదేశించారు. నగరంలో చాపకింద నీ రులా సాగుతున్న వ్యభిచార కేంద్రాలపై ఇప్ప టికైనా పోలీసు శాఖ దృష్టి సారించాల్సి ఉంది. చీటింగ్ కేసులో ముగ్గురి అరెస్ట్ నరసాపురం (రాయపేట) : పట్టణ పరిధిలోని చినమామిడిపల్లిలో చీటిపేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్సై జాన సతీష్ చెప్పారు. నిందితులు వెలిది వెంకటమహాలక్ష్మీ, ఆమె భర్త పుల్లయ్య, వీరి కుమారుడు కుమార్లను సోమవారం అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచినట్టు తెలిపారు. కొంతకాలంగా చీటీల వ్యాపారం నిర్వహిస్తూ రూ.70 లక్షలకు కుచ్చుటోపి పెట్టిన విషయం విదితమే. -
ప్రజావాణిలో ఒకే ఒక్కడు
- తక్కువ సంఖ్యలో అధికారుల హాజరు - కొందరు మధ్యలో నుంచి నిష్ర్కమణ - వినతులు స్వీకరించిన జడ్పీ సీఈఓ రాజారాం ప్రగతినగర్ : జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 182 వినతులు వచ్చాయి. తక్కువ సంఖ్యలో అధికారులు హాజరయ్యారు. ఇందులో నుంచి కొంతమంది అధికారులు మధ్యలో నుంచి నిష్ర్కమించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను జడ్పీ సీఈఓ రాజారాం స్వీకరించారు. జడ్పీ సీఈఓ మధ్యాహ్నం కూడా అధికారుల హాజరును పరిశీలించగా, సగం మంది అధికారులు కూడా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని, ఏదో ప్రజావాణికి తూతూ మంత్రంగా వచ్చి మధ్యలో నుంచి నిష్ర్కమించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోండి అసలే రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఇబ్బందులు పడుతున్న తమపై వీడీసీ సభ్యులు పెత్తనం చెలాయిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని బాల్కొండ మండలం ముప్కాల్ గ్రామ గీత పారిశ్రామిక కుటుంబాలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టాయి. వీడీసీకి ఈ సంవత్సరం వ్యాపారాలు లేక డబ్బులు చెల్లించలేకపోతున్నామని చెప్పినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తాము గీసిన కల్లును పారబోస్తూ, దుకాణాలకు తాళాలు వేశారన్నారు. వారి దౌర్జాన్యాలను అరికట్టాలని కోరారు. -
ప్రజావాణికి 142 వినతులు
ప్రగతినగర్/శివాజీనగర్ : జిల్లా కేంద్రంలో స్థానిక ప్రగతి భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 142 వినతులు వచ్చాయి. జిల్లా కలెక్టర్ రొనాల్డ్రోస్ మధ్యాహ్నం వరకు వినతులు స్వీకరించారు. కలెక్టర్ను కలిసిన నూతన ఎస్పీ జిల్లా కలెక్టర్ రొనాల్డ్రోస్ను నూతన ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆ యన జిల్లాలో జరుగుతున్న బతుకమ్మ పండుగ ఏర్పా ట్లు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి జిల్లాలోని భవన నిర్మాణ రంగాల కార్మికులను అదుకోవాలని జిల్లా భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బండారు గంగాధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయనకలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో లక్ష మంది భవన నిర్మాణ రంగాల కార్మికులు ఉన్నారని తెలిపారు. నిరుపేదలైన కార్మికులకు నివాస స్థలాలతోపాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ప్రతి ఒక కుటుంబానికి 30 కిలోల బియ్యం అందించాలన్నారు. బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్తోపాటు మరికొందరు తమ ప్రాంతంలోని మంజీర నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని, వారిపై చర్యలు తీపుకోవాలని ఫిర్యాదు చేశారు.దసరా పండుగ సందర్భంగా సివిల్ సప్లయ్ గోదాములో పని చేస్తున్న హమాలీలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా స్వీట్లు, బోనస్కు సంబంధించిన చెక్ను అందించారు. -
ప్రజా సమస్యలను పరిష్కరించండి
ప్రజావాణిలో జేసీ జె.మురళి మచిలీపట్నం : ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ జె.మురళి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులంతా తప్పనిసరిగా ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని, అత్యవసర పనులు ఉన్నప్పుడు కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి పొందాలని చెప్పారు. తాను వినికిడి సమస్యతో బాధపడుతున్నానని, వినికిడి యంత్రాన్ని అందజేయాలని కోడూరుకు చెందిన నాగం లక్ష్మీనాంచారమ్మ జేసీకి వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన ఆయన వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులను పిలిపించి ఆమెకు వినికిడి యంత్రాన్ని అందజేశారు. డీఆర్వో ఎ.ప్రభావతి, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. డీఈవో డి.దేవానందరెడ్డి, డీఎస్వో సంధ్యారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు.. దోసపాడు ఆర్అండ్బీ రోడ్డు నుంచి ఎస్టీ కాలనీ మీదుగా సిమెంటు రోడ్డు వేయించాలని, ఆర్అండ్బీ రోడ్డు నుంచి బీసీ కాలనీ రైల్వే కట్ట వరకు బీటీ రోడ్డు నిర్మించాలని, ఆర్అండ్బీ రోడ్డు నుంచి బీసీ కాలనీ వరకు సిమెంటు రోడ్డు నిర్మించాలని కోరుతూ పెదపారుపూడి జెడ్పీటీసీ సభ్యురాలు మూల్పూరి హరీష వినతిపత్రం అందజేశారు. బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ కోడూరు రామకృష్ణారావు అనే వ్యక్తి అధికారులకు అర్జీ సమర్పించారు. జగ్గయ్యపేట మండలం ధర్మవరప్పాడు గ్రామంలో పేదల ఆక్రమణలో ఉన్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ దరావత్తు రవీంద్రనాయక్ వినతిపత్రం అందజేశారు. తన భూమిని కొందరు ఆక్రమించుకున్నారని, ఖాళీ చేయాలని కోరితే చంపుతామని బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన కుంభం వెంకటేశ్వరమ్మ విన్నవించారు. గుడ్లవల్లేరు మండలం విన్నకోట దళితవాడలో చెరువును అక్రమంగా లీజుకు తీసుకున్న సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామానికి చెందిన ఎం.వీరయ్య, మరికొందరు అర్జీ అందజేశారు. బందరు మండలం ఎస్ఎన్గొల్లపాలెంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని ఖాళీ చేయించి, పేదలకు నివేశనాస్థలాలుగా ఇవ్వాలని కోరుతూ చోరగుడి రంజిత్కుమార్ వినతిపత్రం అందజేశారు. బందరు మండలం పెదయాదర గ్రామంలోని శ్మశానవాటికను అభివృద్ధి చేసి చుట్టూ ప్రహరీ నిర్మించాలని, అక్కడ షెడ్డు నిర్మించాలని కోరుతూ కంచర్లపల్లి శివరామప్రసాద్ అనే వ్యక్తి వినతిపత్రం సమర్పించారు. తమకు వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని కోరుతూ గుడివాడకు చెందిన ఎం.సుశీల, బావదేవరపల్లికి చెందిన నలుకుర్తి మరియమ్మ, పెడన మండలం బల్లిపర్రు గ్రామానికి చెందిన కలిదిండి సత్యనారాయణ వినతిపత్రాలు అందజేశారు. పమిడిముక్కల మండలం గురజాడ గ్రామ పంచాయతీలో అవకతవకలకు పాల్పడిన కార్యదర్శి ఎన్.సాంబశివరావుపై తప్పుడు నివేదిక ఇచ్చిన గుడివాడ డీఎల్పీవో ఎం.వరప్రసాదరావుపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త శ్రీనివాసగౌడ్ వినతిపత్రం అందజేశారు. మచిలీపట్నం చేపల మార్కెట్ రైస్ బజారులో రోడ్డు ఆక్రమణలను తొలగించాలని కోరుతూ పలువురు వ్యాపారులు అర్జీ అందించారు. -
బోగస్ ఫిర్యాదులిస్తే అరెస్ట్ చేయిస్తా
ప్రజావాణిలో కలెక్టర్ కె.భాస్కర్ ఏలూరు (ఫైర్స్టేషన్ సెంటర్) : ప్రజావాణిలో బోగస్ ఫిర్యాదులు చేసే వ్యక్తులను, దళారులను అరెస్టు చేయిస్తామని కలెక్టర్ కె.భాస్కర్ హెచ్చరించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భీమవరం పట్టణానికి చెందిన కోయి వెంకట నాగలక్ష్మి, వెంకటహరినాథ్ దంపతులు రైతుబజార్లో కూరగాయలు అమ్ముకోవడానికి తమకు అనుమతివ్వాలని, ఎకరం పొలం ఉందని, దానిలో పండే కూరగాయలను రైతుబజార్లో అమ్ముకుంటామని కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. వారికి పొలం ఉందా లేదా, ఉంటే అందులో కూరగాయలు పండిస్తున్నారా అనే విషయాన్ని వెంటనే తెలుసుకోవాలని కలెక్టర్ జేసీ బాబూరావునాయుడిని ఆదేశించారు. ఆయన భీమవరం తహసిల్దార్కు ఫోన్లో సమాచారం అందించి వెంటనే చెప్పాలని కోరారు. ఈలోగానే ఆ దంపతులు తమకు పొలంలేదని, రైతు బజార్లో లెసైన్స్ తీసుకుంటే కూరగాయల వ్యాపారం చేసుకోవచ్చనే ఉద్దేశంతో తప్పుడు వినతి అందించినట్టు వెంకట నాగలక్ష్మి తెలిపింది. దీనిపై స్పందించిన కలెక్టర్ వారిపై చర్యలు తీసుకోవాలని రిజర్వ్ సీఐ రామకృష్ణను ఆదేశించారు. మార్కెటింగ్ ఏడీని పిలిచి ఆ దంపతులపై చీటింగ్ కేసును నమోదు చేయాలని భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించాలని ఆదేశించారు. బంగారుగూడెం కార్యదర్శిపై చర్యలకు ఆదేశం 20 రోజుల నుంచి కుళాయిల ద్వారా మురికినీరు వస్తుందని తెలిపినా కార్యదర్శి పట్టించుకోవడం లేదని ప్రజావాణిలో తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ స్పందించి వెంటనే కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డీపీవో ఎ.నాగరాజువర్మను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తుల్లో 20 శాతం అక్రమ చేపల చెరువుల తవ్వకాలకు సంబంధించే ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ విషయంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గణపవరం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన వెంకట్రాజు(72) అనే వికలాంగుడు తనకు ఎటువంటి పింఛన్ మంజూరు చేయడం లేదని కలెక్టర్కు విన్నవించారు. దీనిపై స్పందించిన ఆయన సదరం సర్టిఫికెట్ వెంటనే తీయించి అతడికి పెన్షన్ మంజూరు చేయాలని డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ద్వారకాతిరుమల మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన ముత్తా నాగ మాధురి, ముత్తా సీతలకు ఆమ్ ఆద్మీ బీమా యోజన కింద ప్రతి సంవత్సరం రూ.1200 అందేదని అయితే గత సంవత్సరం మంజూరైన ఈ స్కాలర్షిప్ తమకు ముట్టినట్లుగా వేలిముద్రలు వేయించుకుని అధికారులు డబ్బును ఇవ్వలేదని కలెక్టరుకు విన్నవించగా దీనిపై మండల ఏపీఎంపై చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. పలువురు వివిధ అంశాలపై ఫిర్యాదులు అందించారు. మహిళా ప్రజాప్రతినిధుల తరఫున పెత్తనం చెలాయిస్తే చర్యలు జిల్లాలో మహిళా సర్పంచ్లు, ఇతర స్థానిక సంస్థల మహిళా ప్రతినిధుల పేరుతో వారి భర్తలు లేదా బంధువులు అధికారికంగా ఎటువంటి పెత్తనం చెలాయించినా వారిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ కె. భాస్కర్ డీపీవో ఎ.నాగరాజు వర్మను ఆదేశించారు. ప్రజావాణిలో సర్పంచ్ల స్థానంలో వారి బంధువులు పెత్తనం చెలాయిస్తున్నారని అనేక ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. -
ప్రజలకు న్యాయం చేయండి
కలెక్టర్ ఎం.రఘునందన్రావు చిలకలపూడి (మచిలీపట్నం) :ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారానికి అధికారులు చొరవ చూపి ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్ ఎం.రఘునందన్రావు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్తో పాటు జేసీ మురళీ, ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో ప్రభావతి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ సీహెచ్.ప్రతాపరావు, మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం, డీఎంఅండ్ హెచ్వో జె.సరసజాక్షి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్వీవీ .సత్యనారాయణ, డీఈవో దేవానందరెడ్డి, డీఆర్డీఏ ఏపీడీ జ్యోతి పాల్గొన్నారు. అర్జీలు ఇవే : కంకిపాడు గ్రామంలోని దొడ్డివారి వీధిలో వాహనాలను రోడ్డుపై నిలపకుండా చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతానికి చెందిన ఎం. రామచంద్రరావు కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. చల్లపల్లి పంచాయతీ పరిధిలోని పార్వతమ్మతోట, నిమ్మలతోట ప్రాంతాలకు మంచినీరు సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. కోడూరు మండలం నరసింహపురం గ్రామంలోని సర్వే నెంబరు 131/1, 2, 137/1, 6, 7లో ఉన్న 7.40 ఎకరాల భూమిలో చేపల చెరువులు అనుమతులు లేకుండా విచ్చలవిడిగా తవ్వుతున్నారని, తవ్వకాలను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని అర్జా సాంబశివరావు అర్జీ ఇచ్చారు. రెవెన్యూ విభాగం ద్వారా గత ఎన్నికల్లో ఫ్లయింగ్ స్క్వాడ్, చెక్పోస్టుల్లో 65 రోజుల పాటు వీడియో చిత్రీకరణ కోసం వీడియోగ్రాఫర్లకు రోజుకు రూ. 1800 చొప్పున చెల్లిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు రూ. 1100 మాత్రమే చెల్లిస్తున్నారని మచిలీపట్నం వీడియోగ్రాఫర్లు కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. అయితే తమ రికార్డుల్లో మాత్రం రూ. 1800 చొప్పున ఇస్తున్నట్లు నమోదు చేసుకుంటున్నారని వీడియోగ్రాఫర్లకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో కోరారు. విజయవాడ రూరల్, పెనమలూరు మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు నిబంధనలకు విరుద్ధంగా భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని, వాటిని నియత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి పంచాయతీ శివారు అయోధ్య గ్రామంలో పీడబ్ల్యూడీ కరకట్టకు చెందిన 1.50 ఎకరాల శ్మశానభూమిని ఆక్రమించుకున్న వారి నుంచి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని జి.మల్లిఖార్జునరావు, డి.వెంకటేశ్వరరావు తదితరులు వినతిపత్రమిచ్చారు. బంటుమిల్లి మండలం అర్తమూరు గ్రామశివారు సాయినగర్లో ఎంతోకాలంగా 60 మంది ఎస్టీ కులాలకు చెందిన వారు నివాసం ఉంటున్న రహదారి ఆక్రమణకు గురైందని, రహదారిని స్వాధీనం చేసుకుని తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు అర్జీ ఇచ్చారు. -
వినతులపై తక్షణ చర్యలు
సీఎంకు అందిన విజ్ఞాపనలను పరిష్కరించండి గ్రీవెన్స్ వినతులపై జాప్యం తగదు అధికారులకు కలెక్టర్ యువరాజ్ ఆదేశం విశాఖ రూరల్ : జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందిన విజ్ఞాపనలపై తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అధికారులతో వివిధ అంశాలపై చర్చిం చారు. ఈ నెల 8, 9 తేదీల్లో సీఎం పర్యటనలో 351 విజ్ఞాపనలు అందాయని, వాటన్నింటిపై చర్యలు చేపట్టి యాక్షన్ టేకెన్ రిపోర్టును వెంటనే తమకు నివేదించాలని ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాల్లో గత ఏడా ది కాలంలో సుమారు 5,572 పిటిషన్లు అందాయని, వాటిపై సంబంధిత శాఖాధికారులు ఆశించిన స్థాయిలో చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నారు. అతి తక్కువ శాతం మాత్రమే పరిష్కరించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిపై వెంటనే చర్యలు తీసుకొని సంబంధిత వెబ్సైట్లో అప్డేట్ చేయాలన్నారు. మండల స్థాయిలో నిర్వహించే గ్రీవె న్స్ డేలో అందే పిటిషన్లను కూడా వెబ్సైట్లో అప్డేట్ చేసేలా ఆర్డీఓలు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఆధార్కార్డులతో అనుసంధానం చేసే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. రేషన్కార్డులు, పింఛన్లు, ఉపకార వేతనాలు, గృహాలు, ఎన్ఆర్ఈజీఎస్ జాబ్కార్డులు, గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేసే ప్రక్రియను ఆయా శాఖాధికారులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ ప్రవీణ్కుమార్, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శ్రీనివాసన్, డూమా పీడీ శ్రీరాములు నాయుడు, గృహ నిర్మాణ సంస్థ పీడీ ప్రసాద్, డీఎంహెచ్ఓ డాక్టర్ శ్యామల పాల్గొన్నారు. -
ప్రజావాణికి నూతన సాఫ్ట్వేర్
పర్యావరణానికి హాని లేకుండా చర్యలు సంక్షేవు హాస్టళ్లలో రూపాంతరంతో అభివృద్ధి కలెక్టర్ సిద్ధార్థజైన్ కుప్పం : ప్రతి సోవువారమూ నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి నూతన సాఫ్ట్వేర్ను రూపొందించినట్లు కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. ఆదివారం కుప్పం ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సవూవేశంలో ఆయున వూట్లాడారు. సంక్షేవు హాస్టళ్లలో సవుస్యల పరిష్కారానికి రూపాంతరం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. హాస్టళ్ల అభివృద్ధికి తగు చర్యలు చేపట్టనున్నామన్నారు. వుంచినీరు సరఫరా చేసే ట్యాంకర్లకు ఇదివరకు కేటాయించే నగదును వురింత పెంచినట్లు తెలి పారు. వేరుశెనగ సాగు చేస్తున్న రైతులు పంట బీవూకు సెప్టెంబర్ 15లోగా ప్రీమియం చెల్లించవచ్చన్నారు. నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నావుని వివరించారు. కుప్పం డిగ్రీ కళాశాలకు తరగతి గదులు లేకపోవడంతో స్థానికంగా ఉన్న ఏపీవీవీపీకి చెందిన భవనాలు అనువుగా ఉంటాయుని తవు దృష్టికి తెచ్చారని, ప్రస్తుతం ఈ భవనాలు ద్రవిడ వర్సిటీ వినియోగించుకుంటుండడంతో వారికి సైతం తగిన సవూచారం అందించామని పేర్కొన్నారు. ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సవూవేశంలో వుదనపల్లె సబ్ కలెక్టర్ నారాయుణ భరత్గుప్త, కడ ప్రత్యేకాధికారి ప్రియూంక పాల్గొన్నారు. -
అసెంబ్లీలో ప్రజావాణి వినిపిస్తా
-సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి అయ్యగారిపాళెం(పొదలకూరు) : ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపై ప్రజావాణి వినిపిస్తానని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. మండలంలోని అయ్యగారిపాళెంలో గురువారం జరిగిన శుభకార్యానికి హాజరైన ఎమ్మెల్యే చుట్టుపక్కల గ్రామాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఓటేసీ గెలిపించిన వారి రుణం తీర్చుకుంటానన్నారు. అయ్యగారిపాళెం గ్రామస్తులు తమ కుటుంబాన్ని వెన్నంటి ఉన్నారన్నారు. ఏకపక్షంగా ఎన్నికల్లో ఓట్లేసి తనను గెలిపించినట్టు పేర్కొన్నారు. జెడ్పీ చైర్మన్గా తాను పనిచేసిన కాలంలో అయ్యగారిపాళెంలో మౌలిక వసతులు కల్పించినట్టు తెలిపారు. నియోజకవర్గంలో ఎవరైనా కక్షసాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు. ప్రజానాయకులు అన్నవారు రాగద్వేషాలను జయించాలన్నారు. ఓటమికి కుంగిపోవడం, గెలుపునకు పొంగిపోవడం మంచిపద్ధతి కాదన్నారు. కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడితే ప్రజాజీవితం నుంచి ప్రజలే వెలివేస్తారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి తనకు ముఖ్యమన్నారు. తనను నమ్మి ఓట్లేసిన ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాజకీయాలు తాత్కాలికమని, చేసిన అభివృద్ధే నాయకుడి పనితనానికి ప్రామాణికంగా పనిచేస్తాయన్నారు. అందరినీ కలుపుకుని వెళుతూ కక్షపూరిత రాజకీయాలకతీతంగా పనిచేస్తానన్నారు. ఎమ్మెల్యే వెంట గ్రామ సర్పంచ్ కట్టా సులోచన, తోడేరు ఎంపీటీసీ సభ్యుడు ఏనుగు శశిధర్రెడ్డి, బిరదవోలు సర్పంచ్ వెన్నపూస శ్రీనివాసులురెడ్డి, మాజీ సర్పంచులు ఏటూరు వేణుగోపాల్రెడ్డి, ఎం.గోపాలయ్య, నాయకులు కండే వెంకటనర్సయ్య, రాధాకృష్ణయ్య, కట్టా పెంచలభాస్కర్, కోసూరు సుబ్రమణ్యం, గోగుల గోపాలయ్య ఉన్నారు. -
గళమెత్తిన ఆశా వర్కర్లు
కలెక్టరేట్ ముట్టడికి యత్నం అడ్డుకున్న పోలీసులు తోపులాటలో గాయపడిన ఆశావర్కర్ చిలకలపూడి (మచిలీపట్నం) : సమస్యల పరిష్కారం కోసం ఆశావర్కర్లు తమ గళాన్ని వినిపించారు. జిల్లా నలుమూలల నుంచి వేల సంఖ్యలో తమ నిరసన తెలిపేందుకు ఆశావర్కర్లు సోమవారం కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ధర్నాకు ఆశావర్కర్లు భారీగా తరలి రావడంతో పోలీసులు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద భారీ బందోబస్తు, రోప్ పార్టీని ఏర్పాటు చేశారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ ముట్టడికి ఆశావర్కర్లు యత్నించారు. కలెక్టరేట్ గేటు ఎక్కి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. తోపులాట జరిగింది. అరగంట పాటు పోలీసులకు, ఆశావర్కర్లకు మధ్య తోపులాట జరగటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లోనికి ఆశావర్కర్లు అందర్నీ అనుమతించాలని పోలీసు అధికారులను కోరగా కేవలం పది మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. దీంతో ఆశావర్కర్లను, ముఖ్యమైన నాయకులను మాత్రమే ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించేందుకు అనుమతించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీవీ కృష్ణ, ఏపీ వాలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. కమల మాట్లాడుతూ ఆశావర్కర్లకు కేంద్రం చెల్లిస్తున్న పారితోషికాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వేతనం నిర్ణయించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అమలయ్యే పారితోషికాలను పట్టణాలకూ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఆశావర్లకు ఏఎన్ఎం శిక్షణ ఇచ్చి రెండో ఏఎన్ఎంలుగా తీసుకోవాలని వారు కోరారు. తోపులాటలో ఆశావర్కర్కు గాయం ... ఆశావర్కర్ల ధర్నా అనంతరం పోలీసులకు, ఆశావర్కర్లకు మధ్య జరిగిన తోపులాటలో బందరు సర్కారుతోటకు చెందిన పరసా రాణి కిందపడిపోయారు. ఈ సమయంలో ఆమె చేతిని పలువురు తొక్కటంతో కుడిచేతికి తీవ్రగాయమైంది. ఆశావర్కర్ల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం వల్లే ఆమె కిందపడిపోయిందని, దీంతో తోపులాటలో ఆమె చేతిని తొక్కారని ప్రజావాణి కార్యక్రమంలో ఏజేసీ చెన్నకేశవరావుకు ఫిర్యాదు చేశారు. అనంతరం పరసా రాణిని వైద్యచికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీఐటీయు నాయకులు వీవీ రమణ, బూర సుబ్రమణ్యం, ఆశావర్కర్ల సంఘం నాయకులు వై.నాగలక్ష్మి, పి.ధనశ్రీ, జి.వెంకటలక్ష్మి, జి.చిట్టికుమారి, టి.నాంచారమ్మ, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆశావర్కర్లు పాల్గొన్నారు. -
‘ప్రజావాణి’లో మార్పులు
వచ్చే వారం నుంచే అమలు కలెక్టర్ యువరాజ్ వెల్లడి విశాఖ రూరల్ : ప్రజావాణి కార్యక్రమం విధానంలో స్వల్పమార్పులు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. సోమవారం తన చాంబర్లో విలేకర్లతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రజావాణి దరఖాస్తుల పరిస్థితి కొంత గందరగోళంగా ఉందని, వచ్చే వారం నుంచి ముందుగా ప్రజలు ఎకనాలెడ్జ్మెంట్ తీసుకొని తరువాత తనను కలిసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మండల కార్యాలయాల్లో కూడా ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేస్తాన్నారు. కేవలం సోమవారం మాత్రమే కాకుండా ఎప్పుడైన దరఖాస్తు చేసుకొనే వెసలుబాటు కల్పిస్తామన్నారు. వచ్చే వారం నుంచి ప్రజావాణిలో ఈ మార్పులు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. సెజ్లు, ఎన్ఏఓబీ నిర్వాసితుల వివరాలను బయోమెట్రిక్ ద్వారా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. సెజ్లు, ఎన్ఏఓబీలకు భూ సేకరణ వల్ల సుమారుగా 6500 మంది నిర్వాసితులయ్యారని వెల్లడించారు. వీరిలో కొంత మందికి పునరావాసం కల్పించడం జరిగిందని, మిగిలిన వారికి కల్పించాల్సి ఉందని వివరించారు. కలెక్టరేట్లో మీ-సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు ఈ నెల 8, 9 తేదీల్లో ముఖ్యమంత్రి జిల్లా పర్యనటకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్లు కలెక్టర్ చెప్పారు. గత షెడ్యూల్ ప్రకారం తొలి రోజు పర్యటన ఉంటుందని, రెండో రోజున మధురవాడలో ఉన్న శిల్పారామంలో రూ.కోటి అంచనా వ్యయంతో నిర్మించే గిరిజన మ్యూజియానికి సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆ రోజున ప్రపంచ గిరిజన దినోత్సవం వేడుకల నిర్వహణకు మూడు వేదికలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. స్టీల్ప్లాంట్, ఎయిర్పోర్టు ఎదురుగా ఉన్న స్థలం, ఏయూలో అనువైన స్థలాన్ని నిర్ణయించి ఘనంగా వేడుకలు నిర్వహిస్తామన్నారు. 15 తరువాత ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నెల 15వ తేదీకి కూడా ఇదే పరిస్థితులు ఉంటే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 45 శాతం తక్కువగా కురిసిందని, ఆగస్టు 15కు 30 శాతం తక్కువ వర్షపాతం ఉంటే స్వల్పకాలిక విత్తనాలు అవసరముంటుందన్నారు. అవసరమైన చోట రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
ప్రజావాణిగా గ్రీవెన్స్ సెల్
ప్రభుత్వ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ మంచినీటి సమస్య పరిష్కారానికి పెద్దపీట కుప్పంలో కలెక్టర్ సిద్ధార్థ జైన్ కుప్పం: సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్ను ఇక నుంచి ప్రజావాణిగా పేరు మారుస్తున్నట్టు కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. ఆయన ఆదివారం రాత్రి కుప్పం తహశీల్దార్ కార్యాలయుంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజావాణి కార్యక్రవూన్ని నిర్వహించి గ్రామస్థాయి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 1వ తేదీన అధికారులు హాస్టల్ నిద్ర కార్యక్రమం చేపట్టి అక్కడి వసతులు, ఆహారం, విద్యా విధానాలపై నివేదిక రూపొందిస్తారన్నారు. ప్రధానంగా గ్రామస్థాయి సమస్యలు అక్కడే పరిష్కారవుయ్యేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. మండల స్థాయి అధికారులు ఇలాంటి సమస్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. జిల్లాలో మంచినీటి సమస్య పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. పరిపాలనకు సంబంధించి నూతన టెక్నాలజీని వినియోగించుకుంటామన్నారు. కుప్పం నియోజకవర్గంలో మోడల్ స్కూల్లో తరగతి గదులు కొరత, పింఛన్ల పంపిణీ, ఇసుక రవాణా విధానంలో సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వీటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదనపల్లి సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్త పాల్గొన్నారు. -
వినతులు..కుప్పలు తెప్పలు
హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి(గ్రీవెన్స్సెల్)లో తమ బాధలు చెప్పుకునేందుకు జనం పోటెత్తారు. ఒకవైపు గ్రామస్థాయిలో ‘మన ఊరు-మన ప్రణాళిక’ వంటివి జరుగుతున్నా కలెక్టరేట్లో రద్దీ మాత్రం విపరీతంగా ఉంది. ముఖ్యంగా రేషన్కార్డులు, పింఛన్లు, భూసమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. మధ్యాహ్నం తర్వాత కలెక్టర్ కిషన్ ప్రజావాణిలో పాల్గొన్నారు. ఆయనతోపాటు కొద్దిసేపు జేసీ, డీఆర్వో, డీఆర్డీఏ పీడీ ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. వెన్నారం చెరువుపై బ్రిడ్జి నిర్మించాలి డోర్నకల్లోని కన్నెగుండ్ల గ్రామం నుంచి తోడేళ్లగూడెం వెళ్లే దారిలో కన్నెగూడెం పెద్దచెరువు వరద కారణంగా రాాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి వెన్నారం చెరువుపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ ఉప సర్పంచ్ వడ్డం వెంకన్న వినతిపత్రం ఇచ్చారు. అంతేకాక అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టాలని కోరారు. వంటచేసే అవ కాశం ఇవ్వండి కేసముద్రం మండలం మొహమూద్పట్నంలో ఏర్పాటు చేసిన కస్తూర్బా పాఠశాలలో పిల్లలకు వంటచేసే అవకాశం స్థానికులకే కల్పించాలని కోరుతూ స్థానిక మహిళలు వినతిపత్రం ఇచ్చారు. తమ గ్రామంలో పాఠశాల ఏర్పాటుకు తాము స్థలం కేటాయించామని అలాంటిది పక్కగ్రామం వారికి వంటచేసే అవకాశం ఇవ్వడంవల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని వివరించారు. అకారణంగా తొలగించారు వర్ధన్నపేట మండలం నల్లబెల్లి ఎస్టీ హాస్టల్లో అకారణంగా 18మంది విద్యార్థుల పేర్లను వార్డెన్ తొలగించారని, ఈ విషయంలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాని కోరుతూ ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి బిర్రు మహేందర్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందించారు. విద్యార్థులను తిరిగి హాస్టల్లో చేర్పించుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ‘మీ సేవ’కు అనుమతివ్వరూ.. వైకల్యంతో నానా కష్టాలు పడుతూనే ఎంఏ, బీఈడీ పూర్తిచేశానని, తనకు మీసేవ, ఏపీఆన్లైన్ కేంద్రం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ భూపాలపల్లికి చెందిని కానుగుల ఐలయ్య కలెక్టర్కు సమర్పించిన వినతిపత్రంలో కోరారు. మెసెంజర్లను కొనసాగించాలి సర్వశిక్షా అభియాన్లో మండలస్థాయిలో పనిచేసిన మెసెంజర్లను కొనసాగించాలని, మెసెంజర్ల వ్యవస్థను రద్దు చేయడం వల్ల వారు ఉపాధి కోల్పోతున్నారంటూ టీఎస్ ఎమ్మార్సీ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.బిక్షపతి కలెక్టర్ను కోరారు. వ్యవస్థను రద్దుచేయడంలో మెసెంజర్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, తక్షణం దీనిపై స్పందించి న్యాయం చేయాలని కోరారు. కేయూ రిజిస్ట్రార్, డీవోలపై చర్య తీసుకోవాలి కుమార్పల్లిలోని సర్వే నంబర్ 214లోగల తమ పట్టాభూమి విషయంలో వివాదాలు సృష్టించి తమను అనవసరంగా ఇబ్బందులు పెడుతున్న కేయూ రిజిస్ట్రార్, డీవోలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎర్రబెల్లి ప్రభాకర్రెడ్డి, గట్టురాజు, రామకృష్ణ, నగేష్ తదితరులు వినతిపత్రం అందించారు. ఈ భూమి విషయంలో ఇప్పటికే పలుమార్లు సర్వేలు, విచారణలు చేసినట్లు తెలిపారు. అయినా ఇబ్బందులు తప్పడం లేదని వివరించారు. దీనికి స్పందించిన కలెక్టర్, జేసీ సర్వేకు ఆదేశించారు. -
సమగ్ర సమాచారం సిద్ధం చేయండి
కలెక్టర్ ఎం.రఘునందన్రావు చిలకలపూడి (మచిలీపట్నం) : జిల్లాలో ఆయాశాఖల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలపై అధికారులు సమగ్ర సమాచారాన్ని రూపొందించి నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఎం.రఘునందన్రావు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ జె మురళీ, ఏజేసీ చెన్నకేశవరావు, ట్రైనీ కలెక్టర్ సృజన, డీఆర్వో ప్రభావతి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మంగళవారం ఉదయం 10 గంటలకు కైకలూరులో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ నిర్వహించే సమీక్షా సమావేశానికి అధికారులందరూ సమగ్ర సమాచారాన్ని తీసుకురావాలన్నారు. విద్య, పశుసంవర్థకశాఖ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తమ నివేదికల్లో పూర్తిస్థాయి సమాచారం ఇవ్వాలని చెప్పారు. జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, డీఆర్డీఏ పీడీ రజనీకాంతారావు, డ్వామా పీడీ అనిల్కుమార్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ డి.మధుసూధనరావు, మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం, పశుసంవర్థకశాఖ జేడీ దామోదరనాయుడు, డీసీవో రమేష్బాబు, డీఈవో డి.దేవానందరెడ్డి, ఎక్సైజ్ ఏఈఎస్ ఎన్.సునీత, డీఎంఅండ్హెచ్వో జె.సరసజాక్షి, డీఎస్వో పి.బి. సంధ్యారాణి, బందరు ఆర్డీవో సాయిబాబు, మచిలీపట్నం మునిసిపల్ కమిషనర్ మారుతీదివాకర్, ఇన్చార్జ్ డీపీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు. అర్జీలు ఇవే : విస్సన్నపేట మండల కేంద్రంలో రైతుబజార్ ఏర్పాటు చేసి నాణ్యమైన కూరగాయలను తక్కువ ధరకు అందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన కె.కృష్ణమోహన్ అర్జీ ఇచ్చారు. జి.కొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామంలో వాగు, ఆర్అండ్బీ రహదారి ఆక్రమణకు గురైందని ఆక్రమణదారులను తొలగించి చర్యలు చేపట్టాలని కోరుతూ గ్రామానికి చెందిన ఎస్.పుల్లారావు వినతిపత్రం సమర్పించారు. 2013 ఏప్రిల్ నెలలో గ్రూప్-4 బ్యాక్లాగ్ పోస్టుల నియామకంలో వికలాంగుల కోటా కింద భర్తీ చేసిన అభ్యర్థులకు త్వరితగతిన నియామక పత్రాలివ్వాలని చైతన్య వికలాంగుల సేవాసమితి అధ్యక్షులు జె.అంజయ్య అర్జీ ఇచ్చారు. తనకు రావాల్సిన పీఎఫ్ సొమ్మును ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని నిమ్మకూరు మహిళా మండలిలో వంటమనిషిగా పనిచేసి పదవీ విరమణ చేసిన పామర్రు మండలం కొమరవోలు గ్రామానికి చెందిన పి.తులసమ్మ వినతిపత్రమిచ్చారు. మచిలీపట్నంలోని కోనేరుసెంటరులో షాపుల ముందు ఏర్పాటు చేసిన ఆటోస్టాండ్ను మరో ప్రదేశానికి మార్చాలని కోరుతూ మాజేటి రమేష్బాబు అర్జీ ఇచ్చారు. మచిలీపట్నం 24వ వార్డులోని ఉల్లింగిపాలెం దళితవాడకు చెందిన ఆరుగురు లబ్ధిదారులకు ప్రభుత్వం మాఫీ చేసిన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాల ధ్రువపత్రాలు ఇవ్వాలని పట్టణ పౌర సంఘం నాయకులు బూర సుబ్రమణ్యం అర్జీ ఇచ్చారు. మచిలీపట్నం మునిసిపాల్టీ పరిధిలో ప్రధాన రహదారికిరువైపులా డ్రెయిన్లను ఏర్పాటు చేసి మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు. శింగనపూడి దళితవాడకు చెందిన శ్మశానభూమిని ఆక్రమణదారుల నుంచి గ్రామస్తులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వినతిపత్రమిచ్చారు. కలిదిండి మండలం పెదలంక గ్రామంలోని చెరువును అభివృద్ధి చేసేందుకు చెరువు పక్కనే ఉన్న భూమిని సేకరించి చెరువు విస్తీర్ణం పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అర్జీ ఇచ్చారు. -
బిల్లుల షాక్!
రూ. వేలల్లో రావడంతో వినియోగదారుల ఆందోళన ‘ప్రజావాణి’లో అధికారులకు ఫిర్యాదు పి.లక్ష్మి... ఇంటి విద్యుత్తు సర్వీసు మీటరు నంబరు 442. సాధారణంగా ప్రతి నెల రూ.135 నుంచి రూ.150 వరకు బిల్లు వచ్చేది. ఈనెల బిల్లు మాత్రం ఒక్కసారిగా రూ. 6,772 వచ్చింది. కె.రాజేశ్వరి... ఇంటి మీటరు నంబరు 304. ఇప్పటివరకు నెలకు రూ. 116 నుంచి రూ. 130 మధ్యే బిల్లు వచ్చేది. ఈసారి ఏకంగా రూ. 1,035 వచ్చింది. సర్వాలక్ష్మి... ఇంటి విద్యుత్తు మీటరు నంబరు 423. ప్రతి నెల బిల్లు రూ. 142 నుంచి రూ. 160 వరకు మాత్రమే వచ్చేది. ఈనెల మాత్రం వెయ్యి రూపాయలకు పైగా బిల్లును విద్యుత్తు సిబ్బంది ఆమె చేతికి ఇచ్చారు. ఎం.మంగ... ఇంటి మీటరు నంబరు 465. ఈ సర్వీసుకు ఇప్పటివరకు రూ. 149 మించి ఏ నెలా బిల్లు రాలేదు. ఈసారి మాత్రం రూ. 939 చెల్లించాలని బిల్లు వచ్చింది. బైపా పెంటయ్యమ్మ... ఇంటి సర్వీసు నంబరు 555. గతంలో ప్రభుత్వం ఎస్సీలకు 50 యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితంగా ఇవ్వడంతో ఆమె ఐదు నెలల క్రితమే కుల ధ్రువీకరణపత్రం అధికారులకు ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు బిల్లు రాలేదు. ఈనెల మాత్రం రూ. 850 చెల్లించాలంటూ ఆమెకు బిల్లు వచ్చింది. ఈ విద్యుత్తు బిల్లుల బాధితులంతా జిల్లాలోని నాతవరం మండలంలో చమ్మచింత గ్రామానికి చెందినవారు. వారికే కాదు ఈ మండలంలో పలువురు వినియోగదారులకు ఇలాగే అధిక బిల్లులు రావడంతో నిర్ఘాంతపోయారు. పెద్దగా విద్యుత్తు వినియోగించని తమ ఇళ్లకు అదీ సరఫరాలో అధిక కోతలు విధిస్తున్న సమయంలో రూ. వేలల్లో బిల్లులు రావడమేమిటని ఆందోళన చెందుతున్నారు. దీంతో కొంతమంది సోమవారం విద్యుత్తు సబ్స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బిల్లులను సరి చేయించాలంటూ ఏఈ వెంకట్రావుకు విన్నవించారు. - నాతవరం -
ప్రజావాణికి సమస్యల వెల్లువ
కలెక్టరేట్ (మచిలీపట్నం): కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి సమస్యలు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ ఎం. రఘునందనరావుకు మొరపెట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ మురళి, ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో ప్రభావతి, జెడ్పీ సీఈవో సుదర్శనం తదితర అధికారులు ప్రజల నుంచి 175 అర్జీలు స్వీకరించారు. ముఖ్యమైన అర్జీలు ఇవీ.. తమ గ్రామంలో అనుమతులు లేకుండా యథేచ్ఛగా చేపల చెరువులు తవ్వుతున్నారని కలిదిండి మండలం సీతారామపురం అగ్రహారానికి చెందిన చింతపాటి పద్మావతి ఫిర్యాదు చేశారు. ఈ చెరువులను పూడ్పిం చాలని విజ్ఞప్తిచేశారు. తమ గ్రామంలో కమ్యూనిటీ హాలు నిర్మానం కోసం కేటాయించిన స్థలం ఆక్రమణకు గురైందని గుడివాడ మండలం నాగవరప్పాడుకు చెందిన దాసు శరబంది ఫిర్యాదుచేశారు. తమ ప్రాంతంలో 70 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న స్థలాలను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలని గుడివాడకు చెందిన కడియం నాగరాజు అర్జీ దాఖలు చేశారు. ఐకేపీలో పనిచేస్తున్న వీవోఏలకు పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాల బడ్జెట్ను వెంటనే విడుదల చేయాలని, మండల, జిల్లా సమాఖ్యల నుంచి గుర్తింపుకార్డులు, నియామక పత్రాలు ఇవ్వాలని ఐకేపీ యానిమేటర్స్ (వీవోఏ) సంఘం జిల్లా అధ్యక్షురాలు బి.సౌజన్య, గౌరవాధ్యక్షురాలు ఎ.కమల అర్జీ ఇచ్చారు. బందరు మండలం రుద్రవరం గ్రామంలో కృష్ణా యూనివర్సిటీ భవన నిర్మాణాల కోసం ఉపాధి హామీ పథకంలో కూలీలుగా పనిచేస్తున్న తమకు తెలియకుండా పొక్లెయిన్ ద్వారా తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. బందరు మండలం ఎస్.ఎన్.గొల్లపాలెం శ్మశానభూమికి రహదారి రహదారి సౌకర్యంలేదని గ్రామానికిచెందిన బి.రాజేష్, లక్ష్మణ్ తదితరులు అధికారులకు వివరిం చారు. గ్రామస్తులు చనిపోయినప్పుడు సరి హద్దు పొలాల యజమానులను బతిమలాడి మృతదేహాలను తీసుకువెళ్లాల్సి వస్తోం దని ఆందోళన వ్యక్తంచేశారు. శ్మశానానికి రహదారి వసతి కల్పించాలని అర్జీలో వేడుకున్నారు. మండల కేంద్రమైన గూడూరులో విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి రెండు వైపులా ఆర్ఎస్ నంబరు 393/1లో ఉన్న సుమారు 250 ఎకరాల గ్రామకంఠం భూమిలో పలువురు నివసిస్తున్నారని, ఈ ప్రాంతంలో భూముల క్రయవిక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ చేసేం దుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కలెక్టర్కు అర్జీలు ఇచ్చారు. గూడూరు మండలం ముక్కొల్లు పంచాయతీ శివారు నాగవరం గ్రామంలో ఈ నెల 17వ తేదీన జరిగిన అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఐఏవై కింద పక్కాఇళ్లు మంజూరు చేయాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులతో మచిలీపట్నంలోని రాజుపేట, దళితవాడ, మగ్గాలకాలనీ, యానాదుల కాలనీలో డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం చేపడ్తారని గతంలో అధికారులు ప్రకటించినా, ఇంత వరకు పనులు ప్రారంభించలేదని కేవీపీఎస్ నాయకుడు సీహచ్ రాజేష్ తదితరులు అర్జీ ఇచ్చారు. నిధులు మంజూరు చేసి డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెడన మండలం చోడవరం గ్రామంలో కేసుగుంట చెరువు పూడికతీత పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ గ్రామానికి చెందిన పి.లక్ష్మీనారాయణ తదితరులు కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. ‘విజయవాడ అజిత్సింగ్నగర్లో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన సాయిశ్రీనివాస్ బార్ అండ్ రెస్టారెంట్ను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విజయవాడ 53వ డివిజన్ కార్పొరేటర్, వైఎస్సార్ సీపీ నాయకులు కరీమున్నీసా తదితరులు అర్జీ ఇచ్చారు. -
అర్జీదారులకు న్యాయమైన పరిష్కారం
ప్రజావాణిలో అధికారులకు ఏజేసీ సూచన 130 దరఖాస్తుల రాక కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్లైన్ : ప్రజావాణిలో అర్జీదారులు పేర్కొన్న సమస్యలకు న్యాయమైన పరిష్కారం చూపాలని అడిషనల్ జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు అధికారులకు సూచించారు. వరుస ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని దాదాపు రెండు నెలల తర్వాత సోమవారం తిరిగి ప్రారంభించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏజేసీతో పాటు డీఆర్వో ఎ.ప్రభావతి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 130 అర్జీలు దరఖాస్తుదారుల నుంచి వచ్చి అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏజేసీ మాట్లాడుతూ ఎన్నికల విధులు ముగిశాయని, ఇకపై ప్రజావాణి అర్జీలపై అధికారులు దృష్టిసారించాలని చెప్పారు. వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని అధికారులు కిందిస్థాయి సిబ్బందికి అప్పగించకుండా అర్జీదారు ఇచ్చిన సమస్యను పరిష్కరించాలన్నారు. అర్జీదారుడికి న్యాయమైన పరిష్కారం చూపి వారిలో నమ్మకం కలిగించాలని సూచించారు. పరిష్కరించిన అర్జీలను ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. ఖరీఫ్ సీజన్, విద్యాసంవత్సరం ప్రారంభం కావస్తున్నాయని, ఇకపై అర్జీలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని ఏజేసీ తెలిపారు. ఆలస్యంగా వచ్చిన అధికారులు... రెండు నెలల తరువాత నిర్వహించిన ప్రజావాణి తొలి కార్యక్రమానికి అధికారులు ఆలస్యంగా హాజరుకావడం గమనార్హం. సాధారణంగా ప్రజావాణి కార్యక్రమానికి 60 నుంచి 70 మంది అధికారులు, సిబ్బంది హాజరవుతారు. సోమవారం మాత్రం 11.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రజావాణి కార్యక్రమానికి తొలుత కేవలం పది, పదిహేను మంది అధికారులు మాత్రమే వచ్చారు. 11.30 నుంచి 12 గంటలలోపు ఒక్కొక్క అధికారి రావటం ప్రారంభించారు. కలెక్టర్ రఘునందనరావు ప్రజావాణి కార్యక్రమానికి హాజరైతే అధికారులు 10 నిమిషాలు ముందుగానే సమావేశపు హాలుకు చేరుకునే అధికారులు.. కలెక్టర్, జేసీ రారని తెలియటంతో ఆలస్యంగా హాజరవటం గమనార్హం. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ డి.మధుసూదనరావు, బీసీ సంక్షేమ శాఖాధికారి లక్ష్మీదుర్గ, హౌసింగ్ పీడీ సీహెచ్ ప్రతాపరావు, రాజీవ్ విద్యామిషన్ పీవో డి.పద్మావతి, డీఈవో దేవానందరెడ్డి, డీఎస్వో పీబీ సంధ్యారాణి, బందరు ఆర్డీవో పి.సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి దృష్టికి వచ్చిన పలు సమస్యలివీ... గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న తమకు గత ఐదు నెలలుగా జీతాలు చెల్లించటం లేదని 104 కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి వి.శాంతికుమార్ అర్జీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించి 24 రోజుల పని దినాలను అమలు పరచాలని అర్జీలో కోరారు. రాజకీయంగా చైతన్యవంతమైన కృష్ణాజిల్లాకు నందమూరి తారకరామారావు జిల్లాగా నామకరణం చేయాలని ప్రముఖ న్యాయమూర్తి కంచర్లపల్లి శివరామప్రసాద్ అర్జీ ఇచ్చారు. జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించిన నందమూరి తారక రామారావును గుర్తించి జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయాలని ఆయన అర్జీలో కోరారు. వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన ఎస్.మోహనరెడ్డి తన వ్యవసాయ భూములకు సంబంధించి అడంగల్లో తప్పుగా నమోదైందని, ఆ వివరాలను సరిచేయాలని కోరుతూ అర్జీ ఇచ్చారు. తమ భూముల సరిహద్దుల్లో అక్రమంగా చేపల చెరువులు సాగు చేస్తున్నారని, వాటిని నియంత్రించాలని కోరుతూ అధికారులకు చెప్పినా ఫలితం లేకపోయిందని మండవల్లి మండలం లోకుమూడి గ్రామానికి చెందిన బొందలపాటి గిరిధరవరప్రసాద్, గ్రామస్తులు అర్జీ అందజేశారు. ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పెడన పట్టణం 22వ వార్డులో ఇళ్ల మధ్యలో కలంకారీ ఉడుకుల పొయ్యిను ఏర్పాటు చేయటం వల్ల దట్టమైన పొగతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని యర్రా బాలసుబ్రమణ్యం అర్జీ అందజేశారు. కాలనీవాసులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇళ్ల మధ్యలో ఉన్న పొయ్యిను తొలగించాలని ఆయన కోరారు. మోపిదేవి మండలం కోసూరివారిపాలేనికి చెందిన కోసూరి వెంకటేశ్వరరావు 2014 ఏప్రిల్ 22న విద్యుత్షాక్కు గురై మరణించారని, కుటుంబ సభ్యులకు లోకాయుక్త ఆదేశాల మేరకు సహాయం అందజేయాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ అందజేశారు. ఆపద్బందు పథకం కింద రూ.50 వేలు, విద్యుత్ శాఖ ఎస్ఈ లక్ష రూపాయలు మంజూరు చేయాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసిందని ఆయన అర్జీలో పేర్కొన్నారు. కృత్తివెన్ను మండలంలోని ఇంతేరు గ్రామంలో చౌకధరల దుకాణం యజమాని అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గ్రామానికి చెందిన తమ్ము ఆంజనేయులు అర్జీ ఇచ్చారు. చనిపోయిన రేషన్కార్డుదారుల రేషన్ను అక్రమంగా అమ్మకాలు జరుపుతున్నారని, షాపు యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
నేటి నుంచి ప్రజావాణి
మచిలీపట్నం, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 26వ తేదీ సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. ఈ ఏడాది మార్చి 10వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి కార్యక్రమానికి విరామం ప్రకటించారు. దీంతో దాదాపు రెండున్నర నెలలుగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది. సోమవారం నుంచి ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ప్రారంభించనున్నారు. రెండున్నర నెలలుగా ఈ కార్యక్రమం నిలిచిపోయినా ప్రతి సోమవారం కొద్దిపాటి సంఖ్యలో బాధితులు, అర్జీదారులు కలెక్టరేట్కు వస్తూనే ఉన్నారు. దూరప్రాంతం నుంచి వచ్చే వారిని వెనక్కి పంపకుండా సిబ్బంది వారి నుంచి అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు పంపారు. ఈ రెండున్నర నెలల వ్యవధిలో దాదాపు వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అధికారులంతా ఎన్నికల విధుల్లో ఉండటంతో ఈ సమస్యలు పరిష్కారం కాలేదు. ప్రస్తుతం కొనసాగనున్న ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొననున్నారు. హైదరాబాదులో ప్రత్యేక సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన కలెక్టర్ రఘునందన్రావు సోమవారం నాటి ప్రజావాణిలో పాల్గొనే అవకాశం లేదు. -
గ్రీవెన్స్.. నాన్సెన్స్!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సామాన్యుని సమస్యలకు పరిష్కారమే అంతిమ లక్ష్యంగా ఏర్పాటుచేసిన ‘ప్రజావాణి’ జిల్లాలో గాడి తప్పింది. గ్రీవెన్స్ను జిల్లా అధికారులు మొక్కుబడి కార్యక్రమంగా మార్చేశారు. ఫిర్యాదుదారుని నుంచి అర్జీ తీసుకుని 30 రోజుల పాటు నాన్చడం.. ఆ తర్వాత ‘మీ సమస్య పరిష్కరించడమైనది’ అని కలెక్టర్ కార్యాలయం నుంచి ఓ ఉత్తరం పంపి చేతులు దులుపుకుంటున్నారు. కానీ పరిష్కరించారో లేదో తెలియక ఫిర్యాదుదారులు తలపట్టుకుంటున్నారు. అయినా ఆశ చావని ముసలవ్వలు కళ్లు కనిపించకపోయినా కట్టె పొడుచుకుంటూ... కట్టుకున్నవాడు కాలంజేస్తే సంసారాన్ని మోయలేని వితంతువులు... కంపెనీల కాలుష్యపు కోరలకు చిక్కి తల్లడిల్లుతున్న జనం... రేషన్ కార్డని.. కొత్త ఇళ్లని.. ఫీజు రీయింబర్స్మెంటని ఇలా జనాలు ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీసు మెట్లెక్కుతున్నారు. కష్టనష్టాల కోర్చి ప్రజలు చేస్తున్న ఫిర్యాదులపై అధికారుల పని తీరును పరిశీలించేందుకు ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పర్యటించింది. ప్రజలను నేరుగా కలిసి మాట్లాడినపుడు ‘ప్రజావాణి’ డొల్లతనం బయటపడింది. చిన్నచిన్న సమస్యలను కూడా పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నట్లు కనిపించింది. మండలాల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు సంగారెడ్డికి పంపితే జిల్లాఅధికారులు మళ్లీ మండలానికే పంపిస్తున్నారు. మండలస్థాయి అధికారులు సమస్యలను పరిష్కరించలేక, పెండింగ్లో ఉంచలేక డిస్పోజ్డ్ అని చూపిస్తున్నారు. కాలంతీరిన ఫిర్యాదులను పరిష్కరించిన జాబితాలో చేర్చి జిల్లా కలెక్టర్ను, ప్రజలను మోసం చేస్తున్నట్టు తేలింది. అధికారులు పరిష్కరించినట్లు చూపిస్తున్నవి కాకి లెక్కలే అని బయటపడింది. గడిచిన మూడేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇప్పటివరకు 15,502 ఫిర్యాదులు రాగా వాటిలో 14,730 కేసులు పరిష్కరించినట్లు అధికారిక నివేదికలు చెప్తున్నాయి. మిగిలిన 772 ఫిర్యాదులు కూడా కోర్టు కేసులు, ఇతర వివాదాలు ఉండటం వల్లే పరిష్కరించలేకపోయామని నివేదికల్లో పొందుపరిచారు. గత ఏడాది మొత్తం 9,568 ఫిర్యాదులు అందగా 9,095 కేసులు పరిష్కరించినట్లు చూపించారు. దుబ్బాక మండలం దుంపలపల్లికి చెందిన కె. లింగమ్మ గత ఏడాది నవంబర్ 11 గ్రీవెన్స్కు అర్జీ పెట్టుకున్నారు. తన బావ ప్రభాకర్ అనే వికలాంగుని పేరు మీద 148/9లో ఎకరం భూమి ఉంది. భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు, రెవెన్యూ రికార్డుల్లో ప్రభాకర్ పేరే ఉంది. కబ్జాలో మాత్రం మరో వ్యక్తి ఉన్నారు. తన భూమి తనకు ఇప్పించాలని విన్నవించారు. ఆమెకు 148/9 సర్వే నంబర్ భూమిలో మోఖా ఇవ్వకుండానే అదే ఏడాది డిసెంబర్ 9న ఫిర్యాదు పరిష్కరించినట్టు కలెక్టర్ కార్యాలయం నుంచి ఆమెకు లేఖ అందింది. పైగా వేరొకరు కబ్జాలో ఉన్నారు కాబట్టి పొజిషన్ ఇవ్వలేమని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. అధికారుల సమాధానంతో అవాక్కైన లింగమ్మ మళ్లీ గ్రీవెన్స్కు వచ్చి మరో అర్జీ పెట్టుకున్నారు. పుల్కల్ మండలం వెండికోల్ గ్రామానికి చెందిన తిరుపతి అనే రైతుకు ఓ రెవెన్యూ అధికారి నకిలీ 13బీ సర్టిఫికెట్, నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చి మోసం చేశారు. సదరు అధికారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని గత ఏడాది డిసెంబర్ 2న గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు సదరు అధికారి మీద చర్యలు లేవు, ఆయనకు న్యాయం జరగలేదు, కానీ సమస్య పరిష్కరించినట్టు ఈ నెల 2వ తేదీన తిరుపతికి లెటర్ అందింది. జిన్నారం మండలం కిష్టాయిపల్లి 166/2అ సర్వే నంబర్లో పుల్లంగారి ఎల్లమ్మ, ఆమె బావ ఎంకయ్యలకు 3.24 ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ భూమి పక్కనే ఓ వెంచర్ను నిర్మాణం చేస్తున్నారు. ఈ వెంచర్ యాజమాన్యం కొంతమేరకు ఎంకయ్య, ఎల్లమ్మల భూమిలోకి చొచ్చుకొచ్చారు. సర్వే చేసి తమ భూమిని కాపాడాలని వారు మండల గ్రీవెన్స్లో 2012లో ఫిర్యాదు చేశారు. 2014లో జిల్లా గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు స్పందించలేదు. గిరిజనులకు గుక్కెడు నీళ్లు కూడా ‘ప్రజావాణి’ ఇవ్వలేకపోయింది. కాంజీపురం, కొత్తపల్లి, చౌహాన్వాడి తండాలకు చెందిన గిరిజనులు తాగునీటి సమస్యను తీర్చాలని 30 రోజుల కిందట కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్డేలో ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. తండాలో రెండు బోర్లుండగా... ఒక బోరు నుంచి ఫ్లోరైడ్ నీరు వస్తోంది. మరో బోరు చెడిపోయింది. చెడిపోయిన బోరుకు మరమ్మతులు చేస్తే వినియోగంలోకి వస్తుంది. అధికారులు కనీసం ఆ పని కూడా చేయలేదు. తాగునీటి కోసం ఇక్కడి మహిళలు దాదాపు కిలోమీటర్ నడిచి వ్యవసాయ బావుల నుంచి తెచ్చుకుంటున్నారు. కోహీర్ పట్టణ ంలోని మొల్లవాడికి చెందిన అంగన్వాడీ కార్యకర్త నియామకంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మంగలి స్వరూప అనే మహిళ ఈ నెల 6న కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. బీసీ(డీ) గ్రూపునకు చెందిన మహిళకు బీసీ(ఎ) కుల ధ్రువీకరణ పత్రం కింద అంగన్వాడీ కార్యకర్తగా అవకాశం ఇచ్చారని ఆరోపిస్తూ స్వరూప ఫిర్యాదు చేశారు. దరఖాస్తు ఇచ్చి 17 రోజులవుతున్నా ఇప్పటివరకు సరైన సమాధానం ఇవ్వలేదు. కులధ్రువీకణ పత్రం విచారణ నిమిత్తం కలెక్టర్ నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని కోహీర్ తహశీల్దార్ చెప్పారు. తూప్రాన్ మండలం రంగాయిపల్లి గ్రామస్థులను స్పాంజ్ అండ్ ఐరన్ కంపెనీ కాలుష్య భూతం పట్టింది. ఈ కంపెనీ కాలుష్యం దెబ్బకు సమీప పల్లెలు అల్లకల్లోలమవుతున్నాయి. పసిపిల్లలు ఆరోగ్యంగా ఎదగటం లేదు. పచ్చని పంట పొలాలు బీడు భూములుగా మారిపోయాయి. పరిశ్రమ సమీపంలోని కిలోమీటరు దూరంలో ఉన్న భూగర్భ జలాలు సైతం కలుషితమయ్యాయి. దీంతో ప్రజలు తాగేందుకు నీరు దొరకక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ కలుషిత నీటితో స్నానాలు చేస్తే వంటిపై దద్దుర్లు వస్తున్నాయి. ఇవే అంశాలను ప్రస్తావిస్తూ గత డిసెంబరు 16న గ్రామానికి చెందిన నవచైతన్య యూత్ అసోసియేషన్ సభ్యులు కలెక్టర్కు గ్రీవేన్స్ డే సందర్భంగా ఫిర్యాదు చేశారు. రోజులు గడిచాయి కానీ అధికారుల జాడ లేదు. సమస్యకు పరిష్కారం చూపలేదు. వర్గల్ మండలం తున్కిఖల్సా గ్రామం సమీపంలో సామ్రాట్ టైర్ల పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమలో పాత టైర్లను కాల్చి నూనె, ఐరన్, బూడిద తీస్తారు. గతంలో ఉన్న తహశీల్దారు ఏదీ చూడకుండానే నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిశ్రమ నుంచి వచ్చిన కాలుష్యంతో తున్కిఖల్సా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాలుష్యం సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు గ్రీవెన్స్ను ఆశ్రయించారు. అయినా పరిస్థితి ఇప్పటికీ యథాతథం. పరిశ్రమ నిర్వాహకులు కాలుష్యం పొగను రాత్రి వేళ విడుదల చేస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయినా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం చోద్యం చూడటం గమనార్హం. పరిశ్రమ నుంచి వచ్చే వాసన భరించలేక సమీప పంట పొలాల్లో పనిచేయడానికి కూలీలు కూడా రాని పరిస్థితి నెలకొంది. -
అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలి
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్లైన్ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఎం.రఘునందనరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్తో పాటు ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో ఎల్.విజయచందర్, జెడ్పీ సీఈవో బి.సుబ్బారావు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, పరిష్కారం కాని అంశాలైతే అర్జీదారులకు వెంటనే తెలపాలని ఆదేశించారు. డీఆర్డీఏ పీడీ శివశంకర్, డ్వామా పీడీ అనిల్కుమార్, బీసీ సంక్షేమశాఖ డీడీ ఎం.చినబాబు, హౌసింగ్ పీడీ సీహెచ్.ప్రతాపరావు, మత్స్యశాఖ డీడీ టి.కల్యాణం, రాజీవ్ విద్యామిషన్ పీవీ పి.పద్మావతి, డీఎంఅండ్హెచ్వో సరసిజాక్షి, డీసీవో రమేష్బాబు, డీఎస్వో పి.బి.సంధ్యారాణి, మెప్మా పీడీ హిమబిందు, ఐసీడీఎస్ పీడీ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అర్జీలు ఇవీ.. ఘంటసాల మండలం అచ్చెంపాలెంలోని ఆయకట్టుకు దాళ్వా పంట వేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు కె.రామచంద్రరావు కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. 2012-13 విద్యాసంవత్సరానికి సంబంధించి తమకు వెంటనే స్కాలర్షిప్పులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల వసతి గృహంలో ఉండి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. తమ గ్రామంలో పలువురు అనుమతి లేకుండా చేపల చెరువులు తవ్వుతున్నారని, దీనివల్ల పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు నష్టం వాటిల్లుతోందని కోడూరు మండలం నరసింహాపురం గ్రామానికి చెందిన కొల్లి వెంకటసుబ్బయ్య, అప్పారావు ఫిర్యాదుచేశారు. తమ గ్రామంలోని చౌకధరల దుకాణం డీలర్ కార్డుదారులకు సక్రమంగా సరుకులు ఇవ్వడంలేదని, చనిపోయిన వారి పేరు మీద ఉన్న కార్డుల సరుకులను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామానికి చెందిన తమ్ము ఆంజనేయులు, సత్యరాజు తదితరులు కలెక్టర్కు ఫిర్యాదుచేశారు. డీలర్పై చర్యలు తీసుకుని, తమకు సక్రమంగా సరుకులు అందించేలా చూడాలని కోరారు. అంగన్వాడీ టీచర్ ఎస్సీకాలనీకి చెందిన చిన్నారులను పలకతో కొట్టి గాయపరుస్తున్నారని, అడిగితే సరైన సమాధానం చెప్పడంలేదని గూడూరు మండలం ఆకుమర్రు గ్రామానికి చెందిన కె.మురళీకృష్ణ ఫిర్యాదుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2013 సెప్టెంబర్ 23న విడుదల చేసిన జీవో 5,235 ద్వారా పౌరసంబంధాలశాఖ డెప్యూటీ డెరైక్టర్ కార్యాలయాన్ని జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఏర్పాటు చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త జం పాన శ్రీనివాసగౌడ్ కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. మచిలీపట్నం 27వ వార్డులోని ప్రజల కోసం రుద్రవరం పరిధిలో శ్మశానవాటిక ఏర్పాటుచేసినా, దారి సౌకర్యం లేదని మాజీ కౌన్సిలర్ కొక్కిలిగడ్డ శరత్కుమార్ అధికారులకు వివరించారు. దారి సౌకర్యం కల్పించడంతోపాటు, శ్మశానానికి ప్రహరీ నిర్మించాలని విజ్ఞప్తిచేశారు. అనూహ్య మృతికి రెండు నిమిషాల మౌనం సాఫ్ట్వేర్ ఇంజినీరు శింగవరపు ఎస్తేరుఅనూహ్య ముంబైలో దారుణ హత్యకు గురైన సంఘటనకు సంతాపంగా ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రఘునందనరావుతో పాటు జిల్లా అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలపై గౌరవభావం పెంపొందేలా రాబోయే కాలంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. -
31న ఓటర్ల తుదిజాబితా
సాక్షి, గుంటూరు: ఓటర్ల తుది జాబితా ప్రచురణకు గడువు కోరడంతో ఎన్నికల కమిషన్ ఈ నెల 31న ప్రచురణకు ఆదేశాలిచ్చిందని, 17వరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపులపై విచారణ జరుగుతుందని జిల్లా కలెకర్ ఎస్.సురేశ్కుమార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు రోజుల్లో యంత్రాంగమంతా భౌతిక పరిశీలన పూర్తిచేయాలని, 18 నుంచి 30 వరకు కంప్యూటరైజేషన్, డేటా ఎంట్రీ పూర్తిచేసి తుది జాబితా ఎన్నికల కమిషన్ అనుమతి మేరకు ప్రచురిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా 3.25 లక్షల వరకు క్లెయిమ్స్ వచ్చాయని, ఇప్పటికే 80 శాతం వరకు పరిశీలన పూర్తయిందన్నారు. సుమోటో కింద 39 వేల బోగస్ ఓట్లు తొలగించడం జరుగుతుందని, ఏవైనా అభ్యంతరాలు, తొలగింపులు ఉంటే 17 లోపే జరగాలన్నారు. తుది జాబితా ప్రచురించిన తర్వాత తొలగింపులు కుదరవని స్పష్టం చేశారు. ఈ నెల 18న జిల్లాలోని ఆరు పంచాయతీలు, 45వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉందని, అయి తే నామినేషన్ల ఘట్టం పూర్తయిన తర్వాత నాలుగు పంచాయతీల సర్పంచ్లు, 29 వార్డులకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయని వివరించారు. పెదకూరపాడు మండలం ముస్సాపురం, ముప్పాళ్ళ మండలం కుందూరివారిపాలెం, పొన్నూరు మండలం కసుకర్రు, మంగళగిరి మండలం బేతపూడి గ్రామాల్లో సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ నాలుగు సర్పంచ్ స్థానాలకు పది మంది, 29 వార్డులకు 38 మంది బరిలో ఉన్నారన్నారు. ముత్తాయపాలెం, రామచంద్రపురం సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదన్నారు. వీఆర్వో, వీఆర్ఏ పోస్టులు కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక జరుగుతుందని, సిఫార్సులతో జరగవని స్పష్టంచేశారు. పోస్టులు ఇప్పిస్తామనే ప్రచారం తన దృష్టికి వచ్చిందని, అభ్యర్థులు ఎవరూ మోసపోవద్దని కలెక్టరు చెప్పారు. ఇక ప్రజాదర్బార్..ఇకపై డివిజన్ స్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తామని, ప్రజాదర్బార్ పేరుతో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ నెల 20న గురజాల రెవెన్యూ డివిజన్లో జిల్లాస్థాయి అధికారులంతా హాజరై పథకాలపై సమీక్ష చేస్తారన్నారు. డయల్ యువర్ ఆఫీసర్ కార్యక్రమం ప్రతిరోజూ జరుగుతుందని, 9.30 గంటల నుంచి 10.30 వరకు సెల్ నంబరు 98669 92627కు ఫిర్యాదిదారులు ఫోన్ చేయవచ్చన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్గా తాను అన్ని అంశాలపై ఈ కార్యక్రమంలో పాల్గొంటానని, ఒకటవ, మూడవ మంగళవారాల్లో జాయింట్ కలెక్టర్ రెవెన్యూ అంశాలు, సివిల్ సప్లయిస్, ఆధార్, మీ సేవ, లీగల్ మెట్రాలజీ, సినిమాటోగ్రఫీపై హాజరవుతారని, ఫిర్యాదులు చేయవచ్చన్నారు. -
వెంటవెంట సమస్యలు పరిష్కరించండి
=ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్ ఉండొద్దు =శాఖల వారీగా త్వరగా స్పందించాలి కలెక్టరేట్,న్యూస్లైన్ : ప్రజా సమస్యలపై నిరంతరం దృష్టిసారించాలని, వెంటవెంట వాటి పరిష్కారానికి అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. సోమవారం ప్రజావాణిలో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడారు.ఎంతో నమ్మకంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ప్రజావాణిపై నమ్మకంతో వస్తున్న ఫిర్యాదుదారులను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఏ శాఖ లో కూడా ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో ఉండొద్దన్నారు. టోల్ఫ్రీ ద్వారా వచ్చే, ఇతర ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజావాణిలో 232 ఫిర్యాదులు అందా యి. కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ హర్షవర్ధన్ ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించారు. విద్యార్థుల ఉపకార వేతనా ల విషయంలో ఆధార్ అనుసంధానం రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కలెక్టర్ను కలిసి కోరారు. గాంధారి మండలంలో ఇంత వరకు ప్రభుత్వ పరంగా మొక్కజొన్న కొనుగోలు చేయలేదని రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉన్న 500 గజాల భూమి ని ఒడ్డెర లు ఆక్రమిస్తున్నారని చర్యలు తీసుకోవాలని మంచిప్ప గ్రామస్తులు కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఆ స్థలంలో పాఠశాల కాని అంగన్వాడీ భవనాన్ని నిర్మిం చాలని కోరారు. జిల్లాకేంద్రంలోని నిజాంకాలనీలో ఉర్దూ మీడియం పాఠశాల భవన నిర్మానానికి నిధులు మంజూరు చేయాలని పాఠశాల విద్యా కమిటీ సభ్యు లు కలెక్టర్కు విన్నవించుకున్నారు. లక్ష్యాలు ఛేదించండి.. పశు సంవర్ధక శాఖలో నిర్ధారించిన లక్ష్యాలను సాధిం చడం సంబంధిత అధికారుల బాధ్యతని కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. సోమవారం ప్రగతిభవన్ సమావేశ మందిరంలో పశు సంవర్ధకశాఖ అధికారులతో పశుక్రాంతి ,గొర్రెల పెంపకం యూనిట్స్ , ఇతర పథకాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పథకాల లక్ష్యాల సాధన కోసం బ్యాంకర్లు కాన్షెంట్ ఇవ్వలేదని అధికారులు తమ బాధ్యత విస్మరించడం సరికాదన్నారు. బ్యాంకర్లపై ఒత్తిడి తెచ్చి యూనిట్ల గ్రౌండింగ్కు కృషి చేయాలన్నారు. వచ్చేనెల మొదటి వారంలో మండలాల వారీగా బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి పథకాల లక్ష్యాల సాధన కోసం కాన్షెంట్ ఇచ్చే విధంగా కృషిచేస్తామన్నారు. పశు సంవర్ధకశాఖ అధికారులు బ్యాంకర్ల సమావేశానికి హాజరై అయా బ్రాంచి మేనేజర్లతో కాన్షెంట్ ఇవ్వడానికి కృషిచేయాలన్నారు. సమావేశంలో పశు సంవర్ధకశాఖ జేడీ ఎల్లన్న, అధికారులు పాల్గొన్నారు.