rankings
-
‘టైమ్స్’ ర్యాంకులకు పోటాపోటీ
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక ‘టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్’ ర్యాంకింగ్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల నుంచి పోటీ పెరుగుతోంది. గతేడాది కంటే అత్యధికంగా ‘ఇంపాక్ట్’ ర్యాంకులకు ప్రతిపాదనలు వెల్లువెత్తగా మన దేశం నుంచి ఎక్కువ విద్యా సంస్థలు దరఖాస్తు చేయడం విశేషం. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రెండు వేలకు పైగా విద్యాసంస్థలు ర్యాంకులు పొందగా ఈ ఏడాది దరఖాస్తుల్లో 18 శాతం పెరుగుదల నమోదైంది. ఈసారి 130 దేశాల నుంచి సుమారు 2,540 విశ్వవిద్యాలయాలు డేటాను సమర్పించాయి. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా వర్సిటీల పనితీరును పరిశీలించి ర్యాంకులు అందిస్తున్నారు.సగానికిపైగా ఆసియా నుంచే..టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకుల కోసం పోటీ పడుతున్న విద్యాసంస్థలు ఆసియాలోనే అధికంగా ఉన్నాయి. ప్రతిపాదనల్లో సగానికిపైగా ఆసియా నుంచే వచ్చాయి. భారత్ 148 విద్యా సంస్థల నుంచి ప్రతిపాదనలతో అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్తాన్ 127 విద్యా సంస్థల నుంచి ప్రతిపాదనలతో రెండో స్థానంలో ఉండగా 121 విద్యా సంస్థలతో ఫిలిప్పీన్స్ మూడో స్థానంలో ఉంది. అంగోలా, అజర్బైజాన్, చైనా, ఇండోనేషియా, కెన్యా, లిబియా నుంచి కూడా ఎక్కువ ప్రతిపాదనలు అందాయి. బెనిన్, బోట్సా్వనా, బుర్కినా ఫాసో, ఎల్ సాల్వడార్, ఎస్టోనియా, మాల్దీవులు, నమీబియా, పాపువా న్యూ గినియా, సెనెగల్, జింబాబ్వే మొదటి సారిగా ప్రతిపాదనలతో సిద్ధమయ్యాయి.నాణ్యమైన విద్య..సుస్థిరాభివృద్ధి లక్ష్యానికి అనుగుణంగా ‘నాణ్యమైన విద్య’ విభాగంలో అత్యధిక ప్రతిపాదనలు వచ్చినట్లు ‘టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్’ ప్రకటించింది. ఇందులో ఏకంగా 1,991 విశ్వవిద్యాలయాలు డేటాను అందించాయి. ‘మంచి ఆరోగ్యం–శ్రేయస్సు’ విభాగంలో 1,801 సంస్థలు పోటీ పడగా ‘లింగ సమానత్వం’లో 1,566 విద్యా సంస్థలున్నాయి. ఈ 3 లక్ష్యాలకు అనుగుణంగా గత నాలుగేళ్లుగా అత్యధికంగా ప్రతిపాదనలు వస్తుండటం గమనార్హం. టర్కీలోని ఇస్తాంబుల్లో జూన్ 16–19వ తేదీలలో జరిగే గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కాంగ్రెస్లో ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ ప్రకటించనున్నారు. -
భారత నంబర్వన్గా గుకేశ్
అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) క్లాసికల్ ఫార్మాట్ లైవ్ ర్యాంకింగ్స్లో భారత గ్రాండ్మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ ఒక స్థానం మెరుగుపర్చుకున్నాడు. గురువారం లైవ్ ర్యాంకింగ్స్లో గుకేశ్ 2784 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకొని భారత నంబర్వన్గా అవతరించాడు. కొన్నాళ్లుగా నాలుగో ర్యాంక్లో నిలిచి, భారత నంబర్వన్గా ఉన్న తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ 2779.5 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం నెదర్లాండ్స్లో జరుగుతున్న టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీలో గుకేశ్, అర్జున్, ప్రజ్ఞానంద పోటీపడుతున్నారు. ఐదో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 3.5 పాయింట్లతో గుకేశ్ రెండో స్థానంలో ఉన్నాడు. 14 మంది గ్రాండ్మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో అర్జున్ ఒక పాయింట్తో 13వ స్థానంలో ఉన్నాడు. -
2024 ప్రపంచ ఉత్తమ జావెలిన్ త్రోయర్ నీరజ్
న్యూఢిల్లీ: భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా 2024 సంవత్సరానికిగానూ ప్రపంచ ఉత్తమ జావెలిన్ త్రోయర్గా ఎంపికయ్యాడు. అమెరికాకు చెందిన ప్రముఖ మేగజైన్ ‘ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్’ ప్రకటించిన ర్యాంకింగ్స్ జాబితాలో... పారిస్ ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన 27 ఏళ్ల నీరజ్ చోప్రా అగ్రస్థానం దక్కించుకున్నాడు. ‘ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్’ మేగజైన్కు 78 ఏళ్ల చరిత్ర ఉంది. 2024లో డైమండ్ లీగ్లో ఒక్క విజయం కూడా సాధించని నీరజ్... దోహా, లుసానే, బ్రస్సెల్స్ ఈవెంట్లలో రెండో స్థానంలో నిలిచాడు. ఫిన్లాండ్లో జరిగిన పావో నుర్మీ గేమ్స్లో నీరజ్ టైటిల్ సాధించాడు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా)తో పోటీపడి నీరజ్ ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం నెగ్గిన పీటర్స్... గత ఏడాది డైమండ్ లీగ్ మూడు ఈవెంట్లలో విజేతగా నిలిచాడు. 2023లోనూ నీరజ్ ఈ జాబితాలో ‘టాప్’ ప్లేస్లో నిలిచాడు. ‘అగ్రస్థానం కోసం నీరజ్ చోప్రా, పీటర్స్ మధ్య గట్టి పోటీ సాగింది.గత ఏడాది నీరజ్ డైమండ్ లీగ్ టైటిల్ నెగ్గకపోయినా 3–2తో పీటర్స్పై ఆధిక్యంలో నిలిచాడు. ఒలింపిక్ చాంపియన్, పాకిస్తాన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఐదో స్థానం దక్కించుకున్నాడు’ అని మేగజైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
ఆన్లైన్ విద్యలో నాణ్యతకు పట్టం
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ విద్య విస్తరిస్తోంది. కోవిడ్ మహమ్మారి తర్వాత సంప్రదాయ విశ్వవిద్యాలయాలు డిజిటల్ విద్యపై దృష్టి కేంద్రీకరించాయి. అయితే ఇప్పటి వరకు ఆన్లైన్ విద్య నాణ్యతను కొలవడానికి సరైన ప్రమాణాలు లేవు. కానీ, తొలిసారిగా ఇటీవల టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆన్లైన్ లెర్నింగ్ ర్యాంకింగ్స్–2024ను ప్రకటించింది. ఇందులో ప్రపంచంలో 11 యూనివర్సిటీలకు గోల్డ్ స్టేటస్ ర్యాంకును ఇచి్చంది. ఇందులో భారతదేశం నుంచి మానవ్ రచన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ స్టడీస్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలు ‘బంగారు’ హోదా పొందాయి. దేశంలో ఏడు వర్సిటీలకు ర్యాంకులు... ఆన్లైన్ విద్యలో గోల్డ్ కేటగిరీలో 11 యూనివర్సిటీలు ఉన్నాయి. ఇందులో యూఎస్ఏ నుంచి మూడు, యూకే, భారత్ నుంచి రెండు చొప్పున, రష్యా, హంగేరీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుంచి ఒక్కొక్క యూనివర్సిటీ ఉన్నాయి.భారత్ నుంచి శూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్కు సిల్వర్ స్టేటస్ సాధించగా, అమిటీ యూనివర్సిటీ (నోయిడా), కేఎల్ యూనివర్సిటీ (ఏపీ), లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీ (పంజాబ్), మణిపాల్ వర్సిటీ (జైపూర్) బ్రాంజ్ స్టేటస్ పొందాయి. ఈ ర్యాంకింగ్స్తో భారత్ యూనివర్సిటీలు ఆన్లైన్ విద్యను అందించడంలో పురోగతిని కనబరుస్తున్నాయని స్పష్టమవుతోంది. వీటి ఆధారంగానే ర్యాంకులు ఆన్లైన్ అభ్యాసానికి అంకితమైన సిబ్బంది, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంతృప్తి, విద్యార్థుల్లో పురోగతి, కోర్సుల సిఫారసు వంటి అంశాలను టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ పరిశీలించి ర్యాంకులు కేటాయించింది. మొత్తం ప్రపంచంలో 14 యూనివర్సిటీలు వెండి, 31 కాంస్య పతకాల కేటగిరీలో నిలిచాయి. మరో 64 సంస్థలు డేటా సమర్పించినప్పటికీ పూర్తి ఎంట్రీ అవసరాలను తీర్చలేదు. కాబట్టి వాటికి రిపోర్టర్ హోదా కల్పిoచింది. అయితే ఆన్లైన్ విద్యను అందిస్తున్న యూనివర్సిటీ అభ్యాసకులు టెక్నాలజీ యాక్సెస్, టైమ్జోన్, భాషా ప్రావీణ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోల్డ్ స్టేటస్ పొందిన యూనివర్సిటీలు... » అమెరికన్ యూనివర్సిటీ(యూఎస్) » అరిజోనా స్టేట్ వర్సిటీ(యూఎస్) » హెచ్ఎస్ఈ వర్సిటీ (రష్యా) » మానవ్ వర్సిటీ (భారత్) » మాస్సే వర్సిటీ (న్యూజిలాండ్) » ఓపీ జిందాల్ (భారత్) » సెంట్రల్ఫ్లోరిడా వర్సిటీ (యూఎస్) » వర్సిటీ ఆఫ్ ఎసెక్స్ (యూకే) » లివర్పూల్ వర్సిటీ (యూకే) » సౌత్ ఆస్ట్రేలియావర్సిటీ (ఆ్రస్టేలియా) » వర్సిటీ ఆఫ్ స్జెడ్ (హంగేరి) -
2024 విజికీ మీడియా విజిబిలిటీ ర్యాంకింగ్స్: రిలయన్స్ టాప్
ఆదాయం, లాభాలు, మార్కెట్ వాల్యూ, సామాజిక ప్రభావం వంటి వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిలిచింది. 2024 విజికీ వెలువరించిన న్యూస్ స్కోర్ ర్యాంకింగ్లో సంస్థ ప్రథమ స్థానంలో నిలిచింది. భారతదేశంలోని ప్రముఖ FMCG లేదా బ్యాంకింగ్ & ఫైనాన్స్ కంపెనీల కంటే కూడా రిలయన్స్ విజిబిలిటీ చాలా ఎక్కువగా ఉందని ఏఐ బేస్డ్ మీడియా ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది.రిలయన్స్ సంస్థ.. 2024 న్యూస్ స్కోర్లో 100కి 97.43 స్కోర్ చేసింది. ఈ స్కోర్ 2023 (96.46), 2022 (92.56), 2021 (84.9) కంటే ఎక్కువని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే సంస్థ ప్రతి ఏటా వృద్ధి నమోదు చేస్తూనే ఉంది. రిలయన్స్ కంపెనీ విజికీ న్యూస్ స్కోర్ వార్షిక ర్యాంకింగ్స్లో మొదటి నుంచి గత ఐదేళ్లలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.విజికీ న్యూస్ స్కోర్ అనేది న్యూస్ పరిమాణం, హెడ్లైన్ ప్రజెంటేషన్, పబ్లికేషన్ రీచ్ & రీడర్షిప్ ఆధారంగా నిర్ణయిస్తారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్.. మీడియా ఇంటెలిజెన్స్ని ఉపయోగించి బ్రాండ్లు, వ్యక్తుల కోసం వార్తల దృశ్యమానతను కొలవడానికి ప్రపంచంలోని మొట్టమొదటి ప్రామాణిక కొలమానం.రిలయన్స్ తరువాత ర్యాంకింగ్లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (89.13), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (86.24), వన్97 కమ్యూనికేషన్స్ (84.63), ఐసీఐసీఐ బ్యాంక్ (84.33), జొమాటో (82.94) ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్ ఏడో స్థానంలో ఉండగా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ITC తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 40వ స్థానంలో ఉంది. -
తిలక్ @3
దుబాయ్: దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్లో రెండు సెంచరీలతో విజృంభించిన భారత యువ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్లో అదరగొట్టాడు. సఫారీలపై ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన తిలక్ వర్మ ఐసీసీ బుధవారం విడుదల చేసిన టి20 బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్లో తొలిసారి టాప్–10లోకి ప్రవేశించడమే కాకుండా... కెరీర్ అత్యుత్తమంగా 3వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో తిలక్ 69 స్థానాలు ఎగబాకడం విశేషం. ఈ జాబితాలో ఆ్రస్టేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (855 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా... ఇంగ్లండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ (828 పాయింట్లు) రెండో ర్యాంక్లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంక్ గల ఆటగాడిగా తిలక్ వర్మ (806 పాయింట్లు) నిలవగా... సూర్యకుమార్ (788 పాయింట్లు) ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంక్కు పరిమితమయ్యాడు. భారత్ నుంచి యశస్వి జైస్వాల్ (8వ ర్యాంక్) కూడా టాప్–10లో చోటు దక్కించుకున్నాడు. ఇదే సిరీస్లో రెండు సెంచరీలతో సత్తా చాటిన ఓపెనర్ సంజూ సామ్సన్ 22వ ర్యాంక్కు చేరాడు.నాలుగు నెలల తర్వాత... ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా నాలుగు నెలల తర్వాత మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది జూన్ 29న తొలిసారి నంబర్వన్ ర్యాంక్ కు ఎగబాకిని పాండ్యా ఆ తర్వాత తన టాప్ ర్యాంక్ను కోల్పోయాడు.అయితే దక్షిణాఫ్రికాతో సిరీస్లో అటు బ్యాట్తో ఇటు బంతితో రాణించిన హార్దిక్ 244 పాయింట్లతో మళ్లీ నంబర్వన్ ర్యాంక్లో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత్ నుంచి అత్యుత్తమంగా రవి బిష్ణోయ్ ఎనిమిదో ర్యాంక్లో ఉన్నాడు. -
టాప్–20 నుంచి కోహ్లి, రోహిత్ అవుట్
దుబాయ్: న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో భారత స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఘోరంగా విఫలం కావడంతో ఆ ప్రభావం వారిద్దరి ర్యాంకింగ్స్పై కూడా పడింది. బుధవారం విడుదలైన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో కోహ్లి, రోహిత్ శర్మ టాప్–20లో చోటు కోల్పోయారు. కోహ్లి ఎనిమిది స్థానాలు దిగజారి 22వ ర్యాంక్లో, రోహిత్ రెండు స్థానాలు పడిపోయి 26వ ర్యాంక్లో నిలిచారు. న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో కోహ్లి 93 పరుగులు, రోహిత్ 91 పరుగులు సాధించడం గమనార్హం. మరోవైపు భారత్కే చెందిన యశస్వి జైస్వాల్ ఒక స్థానం పడిపోయి నాలుగో ర్యాంక్లో నిలువగా... రిషబ్ పంత్ ఐదు స్థానాలు మెరుగై ఆరో ర్యాంక్లోకి వచ్చాడు. శుబ్మన్ గిల్ నాలుగు స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్లో నిలిచాడు. -
ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్: టాప్–10లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ను విడుదల చేశారు. టాప్–10లో భారత్ నుంచి ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. టీమిండియా కెపె్టన్ రోహిత్ శర్మ ఒక స్థానం పడిపోయి 751 రేటింగ్ పాయింట్లతో ఆరో ర్యాంక్కు చేరుకున్నాడు. యశస్వి జైస్వాల్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 740 రేటింగ్ పాయింట్లతో ఏడో ర్యాంక్లో నిలిచాడు. విరాట్ కోహ్లి రెండు స్థానాలు పురోగతి సాధించి 737 రేటింగ్ పాయింట్లతో ఎనిమిదో ర్యాంక్లో ఉన్నాడు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 881 పాయింట్లతో తన ‘టాప్ ర్యాంక్’ను నిలబెట్టుకోగా... విలియమ్సన్ (న్యూజిలాండ్; 859 పాయింట్లు) రెండో ర్యాంక్లో, మిచెల్ (న్యూజిలాండ్; 768 పాయింట్లు) మూడో ర్యాంక్లో ఉన్నారు. ఇంగ్లండ్కు చెందిన హ్యారీ బ్రూక్ మూడు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్ను అందుకున్నాడు. పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఆరు స్థానాలు పడిపోయి తొమ్మిదో ర్యాంక్లో నిలిచాడు. టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్ అశి్వన్ 870 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 847 పాయింట్లతో హాజల్వుడ్ (ఆ్రస్టేలియా), బుమ్రా (భారత్) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. -
సినెర్... కొత్త నంబర్వన్
పారిస్: ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న ఇటలీ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్ తన కెరీర్లో గొప్ప ఘనత సాధించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో తొలిసారి ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో సినెర్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 9,525 పాయింట్లతో నంబర్వన్ స్థానానికి చేరుకున్నాడు. టెన్నిస్లో కంప్యూటర్ ఆధారిత ర్యాంకింగ్స్ (1973 నుంచి) మొదలయ్యాక వరల్డ్ నంబర్వన్ ర్యాంక్ అందుకున్న తొలి ఇటలీ ప్లేయర్గా 22 ఏళ్ల సినెర్ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది సినెర్ 33 మ్యాచ్ల్లో గెలిచి, 3 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్తోపాటు మయామి మాస్టర్స్ సిరీస్, రోటర్డామ్ ఓపెన్లో అతను విజేతగా నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్లో సెమీఫైనల్లో ఓడిపోయాడు. గతవారం వరకు టాప్ ర్యాంక్లో ఉన్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ రెండు స్థానాలు పడిపోయి మూడో ర్యాంక్లో నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన కార్లోస్ అల్కరాజ్ ఒక స్థానం పురోగతి సాధించి రెండో ర్యాంక్లో నిలిచాడు. కెరీర్ బెస్ట్ ర్యాంక్లో నగాల్ భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ కెరీర్ బెస్ట్ 77వ ర్యాంక్కు చేరుకున్నాడు. ఆదివారం జర్మనీలో జరిగిన నెకర్ కప్ టోరీ్నలో విజేతగా నిలిచిన సుమిత్ 18 స్థానాలు పురోగతి సాధించాడు. తాజా ర్యాంక్ కారణంగా సుమిత్ వచ్చే నెలలో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో సింగిల్స్ విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహించడం ఖాయమైంది. -
దేశంలో ఐఐటీ బాంబే టాప్
సాక్షి, అమరావతి: భారతీయ విశ్వవిద్యాలయాలు అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. ప్రతిష్టాత్మక క్యూఎస్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్–2025లో భారతీయ వర్సిటీలు మెరుగైన ర్యాంకింగ్స్ దక్కించుకున్నాయి. గతేడాదితో పోలిస్తే 61 శాతం భారతీయ వర్సిటీలు తమ ర్యాంకులను మెరుగుపర్చుకోగా.. 24 శాతం వర్సిటీలు పాత ర్యాంకులనే పొందాయి. కేవలం 9 శాతం వర్సిటీల ర్యాంకులు క్షీణించాయి. అలాగే మూడు కొత్త విశ్వవిద్యాయాలకు క్యూఎస్ ర్యాంకింగ్స్ జాబితాలో చోటు దక్కింది. జాతీయ స్థాయిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) బాంబే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)–బెంగళూరు, ఐఐటీ ఖరగ్పూర్ నిలిచాయి. మెరుగైన ర్యాంకింగ్స్.. ప్రపంచ ర్యాంకింగ్స్ జాబితాలో ఐఐటీ బాంబే గతేడాది 149వ స్థానంలో ఉండగా.. ఈసారి 118వ ర్యాంక్ దక్కించుకుంది. ఐఐటీ ఢిల్లీ 197వ స్థానం నుంచి 150కి చేరుకుంది. ఐఐఎస్సీ 225 నుంచి 211వ ర్యాంక్కు ఎగబాకింది. ఐఐటీ ఖరగ్పూర్ 271 నుంచి 222కు, ఐఐటీ మద్రాస్ 278 నుంచి 263వ ర్యాంకులకు చేరుకున్నాయి. ఐఐటీ కాన్పూర్ ర్యాంకు గతేడాది కంటే స్వల్పంగా తగ్గి 227వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం గణనీయమైన పురోగతి కనబర్చింది. ఈ వర్సిటీ 407వ ర్యాంక్ నుంచి 328వ ర్యాంకుకు చేరుకొని దేశంలోనే 7వ స్థానంలో నిలిచింది. ఐఐటీ రూరీ్కకి 335, ఐఐటీ గౌహతికి 477, అన్నా వర్సిటీలకు 383వ ర్యాంక్ వచి్చంది. ఐఐటీ ఇండోర్ 454 నుంచి 477వ ర్యాంక్కు పడిపోయింది. జాతీయ స్థాయిలో మొదటి 15 స్థానాల్లో ఐఐటీ వారణాసి (ప్రపంచ ర్యాంకింగ్స్లో 531వ స్థానం), జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ(580), శూలినీ వర్సిటీ ఆఫ్ బయో టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ (587) వర్సిటీలున్నాయి. ఈ ఏడాది కొత్తగా సింబయాసిస్ ఇంటర్నేషనల్(డీమ్డ్) వర్సిటీ 641–650 ర్యాంకు పరిధిలో.. అలాగే దేశంలో 16వ స్థానం దక్కించుకుంది. టాప్–20లో ఐఐటీ హైదరాబాద్ (681–690), చండీగఢ్ వర్సిటీ (691–700), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి (701–710), యూనివర్సిటీ ఆఫ్ ముంబై (711–720) ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–వెల్లూరు (791–800), ఎస్ఆర్ఎం చెన్నై (1,000–1,200) చోటు దక్కించుకున్నాయి. 13 ఏళ్లుగా వరల్డ్ నంబర్ వన్గా ఎంఐటీ ప్రపంచవ్యాప్తంగా క్యూఎస్ ర్యాంకింగ్స్లో అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. వరుసగా 13వసారి ఎంఐటీ అత్యుత్తమ ఇన్స్టిట్యూట్గా టైటిల్ను నిలుపుకుంది. మొత్తం 1,500 విశ్వవిద్యాలయాలకు ర్యాంకులను కేటాయించగా.. అమెరికా నుంచి అత్యధికంగా 197, బ్రిటన్ నుంచి 90, మెయిన్ ల్యాండ్ చైనా నుంచి 71 వర్సిటీలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి.క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో టాప్ –10 కళాశాలలు/విశ్వవిద్యాలయాలుమసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఇంపీరియల్ కాలేజ్ లండన్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం హార్వర్డ్ విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ఈటీహెచ్ జూరిచ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జూరిచ్ యూనివర్సిటీ కాలేజ్ లండన్ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -
దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా భారతీయ విశ్వవిద్యాలయాలు అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ (సీడబ్ల్యూయూఆర్)లో 65 భారతీయ వర్సిటీలు, ఐఐటీ, ఐఐఎంలు చోటు దక్కించుకున్నాయి. ప్రపంచంలో మొత్తం రెండువేల విశ్వవిద్యాలయాలకు సీడబ్ల్యూయూఆర్–2024 ఎడిషన్లో ర్యాంకులు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే భారత్కు చెందిన 32 ఉన్నత విద్యా సంస్థల ర్యాంకులు మెరుగవ్వగా.. మరో 33 సంస్థల ర్యాంకులు స్వల్పంగా క్షీణించాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–అహ్మదాబాద్ (ఐఐఎం–ఏ) దేశంలోనే అగ్రశేణి విద్యా సంస్థగా నిలిచింది. అంతర్జాతీయంగా గతేడాది 419వ ర్యాంకు నుంచి ప్రస్తుతం 410కి చేరుకోవడం విశేషం. తగ్గిన ర్యాంకులు..20,966 విద్యా సంస్థల నుంచి అత్యుత్తమ విద్యా సేవలందించే రెండువేల వర్సిటీలను గుర్తించి సీడబ్ల్యూయూఆర్ ర్యాంకులు ప్రకటించింది. టాటా ఇన్స్టిట్యూట్తో సహా దేశంలోని టాప్–10 ఇన్స్టిట్యూట్లలో ఏడింటి ర్యాంకులు క్షీణించాయి. ఐఐఎం–అహ్మదాబాద్ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిలిచింది. గతేడాది 494వ ర్యాంకు నుంచి 501కు, ఐఐటీ–ముంబై 554 నుంచి 568వ ర్యాంకు, ఐఐటీ–మద్రాస్ 570 నుంచి 582, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వర్సిటీ 580 నుంచి 606కు, ఐఐటీ–ఢిల్లీ 607 నుంచి 616, ఢిల్లీ వర్సిటీ 621 నుంచి 622, పంజాబ్ వర్సిటీ 759 నుంచి 823కు క్షీణించాయి. మరోవైపు.. ఐఐటీ–ఖరగ్పూర్ తన స్థానాన్ని 721 నుంచి 704కు, అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ 866 నుంచి 798కు మెరుగుపర్చుకుంది.టాప్లో అమెరికా వర్సిటీలు..సెంటర్ ఫర్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్లో టాప్–10లో అన్నీ అమెరికా విశ్వవిద్యాలయాలే నిలిచాయి. అమెరికాకు చెందిన 90 విద్యా సంస్థలు ర్యాంకుల్లో మెరుగుదలను సాధించగా 23 స్థిరంగా, 216 వర్సిటీల ర్యాంకులు క్షీణించాయి. అలాగే, యూకేలో కేవలం 28 సంస్థలు మాత్రమే స్థానాలను మెరుగుపర్చుకోగా, 57 సంస్థల ర్యాంకులు పడిపోయాయి. జర్మనీకి చెందిన మ్యూనిచ్ విశ్వవిద్యాలయం 46వ స్థానంలో ఉన్నా జర్మనీలోని 55 వర్సిటీల ర్యాంకులు దిగజారాయి. వీటికి విరుద్ధంగా చైనాలో 95% వర్సిటీలు గతేడాది కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాయి. సింఘువా వర్సిటీ 43వ స్థానంలో నిలిచింది. వెయ్యిలోపు భారత్లోని వర్సిటీల ర్యాంకులు..పంజాబ్ వర్సిటీ (823), ఐఐటీ–కాన్పూర్ (842), ఎయిమ్స్–ఢిల్లీ (874), ఐఐటీ–రూర్కీ (880), బెనారస్ హిందూ వర్సిటీ (891), హోమీబాబా నేషనల్ ఇన్స్టిట్యూట్ (903), జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ (927), జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ (951), ఐఐటీ–గౌహతి (966) ర్యాంకులు సాధించాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు 1,299, ఐఐటీ–హైదరాబాద్కు 1,327 ర్యాంకులు వచ్చాయి.టాప్–10 వర్సిటీలు అమెరికావే.. » హార్వర్డ్ వర్సిటీ » మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ» స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం» యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి» యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్» ప్రిన్స్టన్ వర్సిటీ» కొలంబియా విశ్వవిద్యాలయం» యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా» యేల్ వర్సిటీ» కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -
అశ్విని –తనీషా జోడీ ర్యాంక్లో పురోగతి
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ పురోగతి సాధించింది. తాజా ర్యాంకింగ్స్లో అశ్విని –తనీషా ద్వయం నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 28వ ర్యాంక్కు చేరుకుంది. గతవారం లక్నోలో జరిగిన సయ్యద్ మోడి ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టో ర్నీలో అశ్విని –తనీషా జోడీ రన్నరప్గా నిలిచింది. -
Sexiest Bald Man of 2023: ఈ యేడు బట్టతల అందగాడు ఇతడే..
బట్టతల వచ్చినందుకు చాలా మంది మగవారు బాధపడుతూ ఉంటారు. తలపై వెంట్రుకలు లేని తమను ఎవరు చూస్తారని చింతిస్తూ ఉంటారు. కానీ బట్టతల ఉన్నవారికీ ఫ్యాన్స్ ఉన్నారు. గూగుల్లో బట్టతల అందగాళ్ల కోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ సెర్చ్ ట్రాఫిక్, శారీరక లక్షణాల ఆధారంగా ఒక కొత్త అధ్యయనం ప్రకారం బ్రిటిష్ ప్రిన్స్ విలియం (Prince William) "2023లో సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్"గా ఎంపికయ్యాడు. అమెరికన్ యాక్టర్ విన్ డీజిల్, హాలీవుడ్ నటుడు జాసన్ స్టాథమ్లను అధిగమించి టాప్లో నిలిచాడు. బట్టతల సెలబ్రిటీలను షర్టు లేకుండా చూడటానికి ఇంటర్నెట్లో ఎంతమంది సెర్చ్ చేస్తున్నారన్న దానిపై రీబూట్ అనే సంస్థ అధ్యయనం చేసి ర్యాంకులు రూపొందించింది. బట్టతల సెలబ్రిటీల ఎత్తు, నెట్వర్త్, ముఖ నిష్పత్తి, బట్టతల మెరుపు తదితర అంశాలను కూడా ఈ అధ్యయనం పరిగణనలోకి తీసుకుంది. ఈ "సెక్సీ" స్కోర్లో 10కి 9.88 స్కోర్తో ప్రిన్స్ విలియం అగ్రస్థానంలో నిలిచాడు. మిర్రర్ కథనం ప్రకారం.. సెలబ్రిటీల వాయిస్ ఫ్రీక్వెన్సీని కూడా ఈ అధ్యయనం పరిశీలించింది. అధ్యయనం మేరకు ప్రిన్స్ విలియం నెట్వర్త్ దాదాపు 100 మిలియన్ డాలర్లు (రూ.832 కోట్లు), ఎత్తు 1.91 మీటర్లు. ఇక వాయిస్ వియషంలో 10కి 9.91 స్కోర్, బట్టతల మెరుపులో 8.90 స్కోర్ సాధించాడు. మరోవైపు అమెరిన్ యాక్టర్ విన్ డీజిల్ 8.81 టోటల్ స్కోరుతో రెండవ స్థానంలో, జాసన్ స్టాథమ్ 8.51 స్కోరుతో మూడో స్థానంలో నిలిచారు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 7.12 స్కోర్తో ఐదో స్థానంలో ఉన్నారు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్లో మనిక బత్రా
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకుంది. తాజా ర్యాంకింగ్స్లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 31వ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది మనిక దోహా డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో సెమీఫైనల్కు, ఆసియా క్రీడల్లో క్వార్టర్ ఫైనల్కు చేరింది. జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 82వ ర్యాంక్లో ఉంది. -
సింధు ర్యాంక్లో పురోగతి
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు రెండు స్థానాలు పురోగతి సాధించింది. తాజా ర్యాంకింగ్స్లో సింధు 17 నుంచి 15వ స్థానానికి చేరుకుంది. పురుషుల సింగిల్స్లో ప్రణయ్ 9వ ర్యాంక్లో, లక్ష్య సేన్ 11వ ర్యాంకుల్లో కొనసాగుతుండగా...శ్రీకాంత్ ఒక స్థానం పడిపోయి 20వ ర్యాంక్ లో నిలిచాడు. గతవారం ఆస్ట్రేలియన్ ఓపెన్లో సెమీఫైనల్ చేరిన ప్రియాన్షు రజావత్ మూడు స్థానాలు ఎగబాకి 28వ ర్యాంక్కు చేరుకున్నాడు. -
ఆరో స్థానానికి ఎగబాకిన మంధాన.. 17వ ర్యాంక్కు పడిపోయిన సింధు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల వన్డే ర్యాంకింగ్స్లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఒక స్థానం మెరుగుపర్చుకుంది. తాజా ర్యాంకింగ్స్లో స్మృతి 704 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. భారత కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ రెండు స్థానాలు పడిపోయి 702 పాయింట్లతో ఎనిమిదో ర్యాంక్కు చేరుకుంది. బౌలర్ల ర్యాంకింగ్స్లో రాజేశ్వరి గైక్వాడ్ తొమ్మిదో ర్యాంక్లో, ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో దీప్తి శర్మ ఏడో ర్యాంక్లో ఉన్నారు. 17వ ర్యాంక్కు పడిపోయిన సింధు ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయిన భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ప్రదర్శన ఆమె ర్యాంకింగ్స్పై ప్రభావం చూపిస్తోంది. గతవారం యూఎస్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయిన పీవీ సింధు... మంగళవారం విడుదల చేసిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్లో ఐదు స్థానాలు పడిపోయింది. గతవారం 12వ ర్యాంక్లో నిలిచిన సింధు తాజాగా 17వ ర్యాంక్కు చేరుకుంది. గత పదేళ్లలో సింధు అత్యల్ప ర్యాంక్ ఇదే కావడం గమనార్హం. సింధు చివరిసారి 2013 జనవరిలో 17వ ర్యాంక్లో నిలిచింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 12 టోర్నీలు ఆడిన సింధు మాడ్రిడ్ మాస్టర్స్ టోరీ్నలో రన్నరప్గా నిలిచింది. మలేసియా మాస్టర్స్ టోర్నీ, కెనడా ఓపెన్లో సెమీఫైనల్కు చేరుకుంది. ప్రస్తుతం కొరియా ఓపెన్ టోరీ్నలో సింధు బరిలో ఉంది. కొత్త కోచ్గా హఫీజ్ హషీమ్ పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ప్రారంభం కావడంతో పీవీ సింధు కొత్త వ్యక్తిగత కోచ్ను నియమించుకుంది. 2003 ఆల్ ఇంగ్లండ్ చాంపియన్, మలేసియా మాజీ ప్లేయర్ మొహమ్మద్ హఫీజ్ హషీమ్ తన వ్యక్తిగత కోచ్గా వ్యవహరిస్తాడని మంగళవారం సింధు ట్విటర్ వేదికగా ప్రకటించింది. -
జాతీయ ర్యాంకుల్లో పడిపోయిన రాష్ట్ర యూనివర్సిటీలు.. కారణం అదేనా!
సాక్షి, హైదరాబాద్: అధ్యాపకుల కొరత రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు మరోసారి రుజువైంది. తాజాగా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్–2023) నివేదికలో దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియాతోపాటు జేఎన్టీయూహెచ్ ర్యాంకులు కూడా తగ్గాయి. జాతీయ ఓవరాల్ ర్యాంకుల్లోనే కాదు.. పరిశోధన, యూనివర్సిటీ స్థాయి ప్రమాణాల్లోనూ విశ్వవిద్యాలయాలు వెనుకంజలో ఉన్నాయి. అన్నింటికన్నా ఐఐటీ–హైదరాబాద్ అన్ని విభాగాల్లోనూ దూసుకుపోవడం విశేషం. గత మూడేళ్ల విద్యా ప్రమాణాల ఆధారంగా ఎన్ఐఆర్ఎఫ్ ఏటా ర్యాంకులు ఇస్తుంది. ఐఐటీ–హైదరాబాద్ దూకుడు.. ఓయూ వెనక్కు జాతీయస్థాయిలో వంద యూనివర్సిటీల్లో ఐఐటీ–హైదరాబాద్ గత ఏడాది మాదిరిగానే 14వ స్థానంలో నిలిచింది. ఈ సంస్థలో 2019లో 144 మంది రూ.17 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉపాధి పొందారు. 2020–21లో 185 మంది రూ.16 లక్షలకుపైగా, 2021–22లో 237 మంది రూ.20 లక్షలకుపైగా ప్యాకేజీతో ఉపాధి పొందారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లోనూ విద్యార్థులు అత్యధికంగా రూ.40 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉపాధి పొందారు. నిట్ వరంగల్లో అత్యధికంగా యూజీ విద్యార్థులు ఉపాధి అవకాశాలు సొంతం చేసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్లో ఈ సంస్థ మంచి ప్రమాణాలు నెలకొల్పినట్టు నివేదిక పేర్కొంది. అయినప్పటికీ ఈ సంస్థలో అధ్యాపకుల కొరత వల్ల రీసెర్చ్లో వెనుకబడింది. ఫలితంగా నిట్ వరంగల్ జాతీయర్యాంకు 2022లో 45 ఉండగా, ఈసారి 53కు చేరింది. ఉస్మానియా వర్సిటీ ఓవరాల్ ర్యాంకులో గత ఏడాది 46 ఉంటే, ఈసారి 64 దక్కింది. ఇక్కడా పరిశోధనల్లో నెలకొన్న మందకొడితనమే జాతీయ ర్యాంకుపై ప్రభావం చూపింది. ఈసారి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు ఓవరాల్ ర్యాంకులో గతంలో మాదిరిగానే 20వ ర్యాంకు వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 10 ర్యాంకుతో నిలకడగా ఉంది. హైదరాబాద్ ట్రిపుల్ఐటీ జాతీయస్థాయిలో 84వ ర్యాంకు పొందింది. చదవండి: విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల.. టాప్ 10లో హైదరాబాద్కు దక్కని చోటు ఇంజనీరింగ్లో వెనుకబాటుతనం ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ సరికొత్త బోధన విధానాలతో 9లో ఉన్న ర్యాంకును 8కి తేగలిగింది. ఎక్కువ ఇంజనీరింగ్ అనుబంధ కాలేజీలున్న జేఎన్టీయూ–హెచ్ 76 నుంచి 98కి పడిపోయింది. నిట్ వరంగల్ 21వ ర్యాంకుతో నిలిచింది. ఈసారి సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ జాతీయస్థాయి కాలేజీల విభాగంలో 98 ర్యాంకును సాధించింది. పరిశోధన విభాగంలో ట్రిపుల్ఐటీ హైదరా బాద్ ర్యాంకు 12 నుంచి 14కు చేరింది. అధ్యాపకుల కొరతే కారణం: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో వెనుకబడటానికి ప్రధాన కారణం అధ్యాపకుల కొరత. కొన్నేళ్లుగా నియామకాలు లేకపోవడం వల్ల పరిశోధనలో వెనుకబడిపోతున్నాం. అయినప్పటికీ బోధనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. -ప్రొ.డి.రవీందర్, ఉస్మానియా వర్సిటీ వీసీ ర్యాంకు సాధించని వ్యవసాయ వర్సిటీ దేశంలో టాప్–40 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చోటు దక్కలేదు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో వ్యవసాయ వర్సిటీ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై వర్సిటీ వర్గాలను ఆరా తీయగా, సమాధానం లభించలేదు. వర్సిటీ ప్రమాణాలు తగ్గుతున్నాయన్న చర్చ జరుగుతోంది. అడ్రస్ లేని మెడికల్ కాలేజీలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో దేశంలో టాప్ 50లో చోటు దక్కని వైనం సాక్షి, హైదరాబాద్: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చేసిన దేశంలోని టాప్–50 మెడికల్ కాలేజీల్లో రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క మెడికల్ కాలేజీ చోటు దక్కించుకోలేకపోయింది. రాష్ట్రం నుంచి నాలుగు కాలేజీలు... ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, కరీంనగర్లోని చలిమెడ ఆనందరావు మెడికల్ కాలేజీ, హైదరాబాద్కు చెందిన మల్లారెడ్డి, అపోలో మెడికల్ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. మిగిలిన కాలేజీలకు కనీసం దరఖాస్తు చేసుకునే స్థాయి కూడా లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. టాప్–50 ర్యాంకింగ్స్లో ఢిల్లీ ఎయిమ్స్ మొదటి ర్యాంకు, చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రెండో ర్యాంకు, తమిళనాడులోని వెల్లూరుకు చెందిన క్రిస్టియన్ మెడికల్ కాలేజీ మూడో ర్యాంకు, బెంగళూరుకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నాలుగో ర్యాంకు, పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐదో ర్యాంకు సాధించాయి. డెంటల్ ర్యాంకుల్లో మాత్రం తెలంగాణకు ఊరట కలిగింది. సికింద్రాబాద్లోని ఆర్మీ కాలేజీ ఆఫ్ డెంటల్ సైన్సెస్కు 33 ర్యాంకు దక్కింది. 176 మెడికల్ కాలేజీలు, 155 డెంటల్ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. రాష్ట్రంలో వైద్య పరిశోధన దాదాపు ఎక్కడా లేదని, అలాగే, విద్యార్థులు–అధ్యాపకుల నిష్పత్తి కూడా దారుణంగా ఉందన్న విమర్శలున్నాయి. -
నెట్ స్పీడ్లో ఎవరెక్కడ? ఎగబాకిన భారత్ ర్యాంక్
ఇంటర్నెట్ లేనిదే నిమిషం గడవని పరిస్థితి. ఎంటర్టైన్మెంట్ నుంచి ఆన్లైన్ చదువుల దాకా.. ఆర్థిక లావాదేవీల నుంచి నిత్యావసరాల బుకింగ్ దాకా.. స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్.. ఏదైనా ఇంటర్నెట్ అత్యవసరంగా మారిపోయింది. ఈ ఇంటర్నెట్ ఎంత వేగంగా ఉంటే.. మన పని అంత వేగంగా పూర్తవుతుంది. ఈ క్రమంలో ఊక్లా సంస్థకు చెందిన స్పీడ్టెస్ట్ వెబ్సైట్.. ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో సగటు ఇంటర్నెట్ వేగం ఎంత అన్నదానిపై ర్యాంకింగ్స్ ఇచ్చింది. ♦ మొబైల్ ఇంటర్నెట్ విభాగంలో 36.35 ఎంబీపీఎస్ స్పీడ్తో భారత్ 60వ స్థానంలో నిలిచింది. మార్చిలో భారత్ ర్యాంకు 64కాగా.. నెలలో నాలుగు స్థానాలు ఎగబాకింది. ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ విభాగంలో 51.12 ఎంబీపీఎస్తో 83వ స్థానంలో నిలిచింది. మార్చితో పోలిస్తే ఒక ర్యాంకు ఎగబాకింది. ♦ మొబైల్ ఇంటర్నెట్కు సంబంధించి 138 దేశాలకు ర్యాంకులు ఇవ్వగా.. యెమెన్ (3.38 ఎంబీపీఎస్), అఫ్గానిస్తాన్ (4.46), క్యూబా (4.48), వెనెజువెలా (6.90), హైతీ (8.03) అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. ♦ ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్కు సంబంధించి 180 దేశాలకు ర్యాంకులు ఇవ్వగా.. క్యూబా (1.97 ఎంబీపీఎస్), అఫ్గానిస్తాన్ (2.31), సిరియా (3.93), తుర్క్మెనిస్తాన్ (4.03), యెమెన్ (4.29) అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. ♦ ప్రపంచవ్యాప్తంగా సగటున మొబైల్ ఇంటర్నెట్ వేగం 42.07 ఎంబీపీఎస్కాగా.. ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ వేగం 80.12 ఎంబీపీఎస్ కావడం గమనార్హం. ♦ ప్రపంచంలో సగటున 100 ఎంబీపీఎస్ కంటే ఎక్కువ నెట్ స్పీడ్ను పరిగణనలోకి తీసుకుంటే.. మొబైల్ ఇంటర్నెట్లో కేవలం పది దేశాలు, ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్లో కేవలం 33 దేశాలు మాత్రమే ఈ వేగాన్ని అందుకున్నాయి. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ క్రికెటర్
ఐర్లాండ్ యువ క్రికెటర్ హ్యారీ టెక్టార్ చరిత్ర సృష్టించాడు. తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో తన దేశం తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు (722) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐర్లాండ్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఘనత పాల్ స్టిర్లింగ్ పేరిట ఉండేది. 2021 జూన్లో స్టిర్లింగ్ 697 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఈ రేటింగ్ పాయింట్లే చాలాకాలం పాటు ఐర్లాండ్ తరఫున అత్యధికంగా కొనసాగాయి. మే 12న బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో (113 బంతుల్లో 140; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) శతక్కొట్టడం ద్వారా స్టిర్లింగ్ రికార్డును బద్దలుకొట్టిన టెక్టార్.. తొలిసారి వన్డే ర్యాంకింగ్స్లో టాప్-10లోకి (7వ ర్యాంక్) కూడా చేరాడు. ఈ జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. సౌతాఫ్రికా రస్సీ వాన్డెర్ డస్సెన్, పాక్ ఫఖర్ జమాన్, పాక్కే చెందిన ఇమామ్ ఉల్ హాక్, ఇండియా శుభ్మన్ గిల్, ఆసీస్ డేవిడ్ వార్నర్, ఐర్లాండ్ హ్యారీ టెక్టార్, టీమిండియా విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా డికాక్, టీమిండియా రోహిత్ శర్మ టాప్-10లో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఇటీవలే బంగ్లాదేశ్తో ముగిసిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను ఐర్లాండ్ 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే ఫలితం తేలకపోగా.. హ్యారీ టెక్టార్ సెంచరీ చేసిన మ్యాచ్లో, మూడో వన్డేలో ఐర్లాండ్ ఓటమిపాలైంది. ఐర్లాండ్.. జూన్, జులై నెలల్లో జింబాబ్వేలో జరిగే వరల్డ్కప్ క్వాలిఫయర్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. క్వాలిఫయర్స్లో ఐర్లాండ్తో పాటు జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఒమన్, నేపాల్, శ్రీలంక, యుఎస్ఏ, యూఏఈ, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ 10 జట్లలోని రెండు జట్లు అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించనున్నాయి. చదవండి: శుబ్మన్ గిల్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు -
దేశంలోనే అట్టడుగున మన డిస్కంలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి రేటింగ్, ర్యాంకింగ్స్లో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు మరోసారి దేశంలోనే అట్టడుగు స్థానంలో నిలిచాయి. దేశంలోని 51 డిస్కంలలో టీఎస్ఎన్పి డీసీఎల్ 47వ ర్యాంకు, టీఎస్ఎస్పీడీసీఎల్ 43వ ర్యాంకుతో సరిపెట్టుకున్నాయి. ఈ మేరకు డిస్కంల 11వ వార్షిక రేటింగ్స్, ర్యాంకింగ్స్ నివేదికను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మెరుగైన రేటింగ్, ర్యాంకింగ్ కలిగి ఉంటేనే డిస్కంలకు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు లభించనున్నాయి. ఈ మేరకు కేంద్రం లంకె పెట్టడంతో ఈ రేటింగ్స్ కీలకంగా మారాయి. రాష్ట్ర డిస్కంలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. డీ–గ్రేడ్కి అడుగు దూరంలో ... డిస్కంల ఆర్థిక సుస్థిరతకు 75, పనితీరు సమర్థతకు 13, బయటి నుంచి ప్రభుత్వం/ఈఆర్సీల మద్దతుకు 12 కలిపి మొత్తం 100 స్కోరుకిగాను ఆయా డిస్కంలు సాధించిన స్కోరు ఆధారంగా వాటికి.. ఏ+, ఏ, బీ, బీ–, సీ, సీ–, డీ అనే గ్రేడులను కేటాయించింది. కీలక అంశాల్లో డిస్కంల వైఫల్యాలకు నెగెటివ్ స్కోర్ను సైతం కేటాయించింది. ఎస్పీడీసీఎల్ 10.8 స్కోరు సాధించి ‘సీ–’ గ్రేడ్ను, ఎన్పి డీసీఎల్ 6.6 స్కోరును సాధించి ‘సీ–’ గ్రేడ్ను పొందింది. చిట్టచివరి స్థానమైన ‘డీ గ్రేడ్’లో మేఘాలయ డిస్కం మాత్రమే నిలిచింది. దేశం మొత్తం బకాయిల్లో 15% మనవే... జెన్కో, ట్రాన్స్కోలకు దేశంలోని అన్ని డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు 2021–22 నాటికి రూ.2.81 లక్షల కోట్లకు ఎగబాకినట్టు కేంద్రం పేర్కొంది. అందులో ఎస్పీడీసీఎల్ వాటా ఏకంగా 10.3 శాతం కాగా, ఎన్పీడీసీఎల్ వాటా 4.3 శాతం కావడం గమనార్హం. జెన్కోల నుంచి డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్కు సంబంధించిన బిల్లులను 45 రోజుల్లోగా చెల్లించాల్సి ఉండగా ఎస్పీడీసీఎల్ 375 రోజులు, ఎన్పీడీసీఎల్ 356 రోజుల కిందటి నాటి బిల్లులను బకాయిపడ్డాయి. అంటే మన డిస్కంలు విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిల చెల్లింపులకు కనీసం ఏడాది సమయాన్ని తీసుకుంటున్నాయి. -
టాప్ అక్రెడిటేషన్ వ్యవస్థల్లో భారత్.. జీక్యూఐఐలో అయిదో ర్యాంకు
న్యూఢిల్లీ: నాణ్యతపరమైన మౌలిక సదుపాయాలకు సంబంధించి అత్యుత్తమ అక్రెడిటేషన్ వ్యవస్థలు ఉన్న టాప్ అయిదు దేశాల జాబితాలో భారత్ చోటు దక్కించుకుంది. 184 దేశాల లిస్టులో అయిదో స్థానంలో నిల్చింది. గ్లోబల్ క్వాలిటీ ఇన్ఫ్రా ఇండెక్స్ (జీక్యూఐఐ) 2021 ర్యాంకింగ్లు ఇటీవల విడుదలయ్యాయి. సూచీ ప్రకారం ప్రామాణీకరణలో భారత్ తొమ్మిదో స్థానంలో, మెట్రాలజీ విషయంలో 21వ ర్యాంకులోనూ ఉంది. ఈ జాబితాలో జర్మనీ అగ్రస్థానంలో ఉండగా, అమెరికా, చైనా, ఇటలీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. టాప్ అయిదు అక్రెడిటింగ్ వ్యవస్థల్లో ఒకటిగా భారత్కు గుర్తింపు లభించడంపై భారతీయ నాణ్యతా మండలి (క్యూసీఐ) హర్షం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యంలో నాణ్యతపరమైన మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రమాణాల అమలుకు తోడ్పడే సంస్థలను నియమించేందుకు జాతీయ అక్రెడిటేషన్ సంస్థ పాటించే ప్రక్రియను అక్రెడిటేషన్గా వ్యవహరిస్తారు. నిర్దిష్ట సంవత్సరం ఆఖరు వరకూ ఉన్న డేటాను ఆ తదుపరి సంవత్సరంలో సేకరించి, విశ్లేషించి, ఏడాది ఆఖరున ర్యాంకింగ్లు విడుదల చేస్తారు. డిసెంబర్ 2021 ఆఖరు వరకు గల డేటాను 2022లో ఆసాంతం సేకరించి, విశ్లేషించి, 2021 ర్యాంకింగ్లు ఇచ్చారు. స్వతంత్ర కన్సల్టింగ్ సంస్థలు మెసోపార్ట్నర్, అనలిటికర్ ఈ జీక్యూఐఐ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నాయి. -
వైద్య సేవల్లో తెలంగాణ థర్డ్ ప్లేస్.. యూపీ స్థానం తెలుసా అంటూ హరీష్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైద్యరంగంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతను మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ డయాగ్నాస్టిక్స్పై నేషనల్ హెల్త్ మినిస్ట్రీ నుంచి ప్రశంసలు అందినట్టు మంత్రి తెలిపారు. ఈ సందర్బంగా ఆరోగ్య శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ మీడియాతో మాట్లాడుతూ.. పల్లె దవాఖానాల ఏర్పాటులో తెలంగాణ ప్రభుత్వ పనితీరును కేంద్రం ప్రశంసించింది. ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న 3వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. బీజేపీ అధికారంలో ఉన్న యూపీ చివరి స్థానంలో ఉంది. కేసీఆర్ కిట్ ద్వారా 13.91 లక్షల మందికి ప్రయోజనం కలిగింది. 2014 నాటికి రాష్ట్రంలో శిశు మరణాల రేటు 39 కాగా.. ప్రస్తుతానికి 21కి తగ్గిందని వెల్లడించారు. వైద్య రంగానికి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి టెలి కన్సల్టెన్సీ సేవలు అందించాము. టీబీ నియంత్రణ, నిర్మూలనలో తెలంగాణకు అవార్డు దక్కింది. నిమ్స్లో బెడ్ల సంఖ్యను 1489 నుంచి 3489కి పెంచాము. తెలంగాణలో ప్రస్తుతం 22 జిల్లాల్లో డయాగ్నోస్టిక్స్ హబ్స్ ఉన్నాయి. గత ఏడాది రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది మరో 9 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు విద్యతో పాటు వైద్యం కూడా అందుబాటులోకి వస్తుంది. వరంగల్లో రూ.11వందల కోట్లతో 2వేల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నాము. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. పేద మహిళలకు న్యూట్రీషన్ కిట్స్ కూడా అందజేస్తున్నామని తెలిపారు. వసతులు పెంచడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. ఎన్సీడీసీ స్క్రీనింగ్ ద్వారా ఇంటి వద్దకు వెళ్లి పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. -
Table Tennis: కెరీర్ బెస్ట్ ర్యాంక్లో మనిక బత్రా.. ఆకుల శ్రీజ పురోగతి
Manika Batra: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 35వ ర్యాంక్కు చేరుకుంది. జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ నాలుగు స్థానాలు పురోగతి సాధించి 72వ ర్యాంక్లో నిలిచింది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో తెలంగాణ కుర్రాడు స్నేహిత్ 136వ ర్యాంక్ లో ఉన్నాడు. సత్యన్ 39వ ర్యాంక్తో భారత నంబర్వన్గా కొనసాగుతున్నాడు. ఇది కూడా చదవండి: రామ్కుమార్కు మిశ్రమ ఫలితాలు పుణే: టాటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్ రామ్కుమార్ రామనాథన్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రామ్కుమార్ 3–6, 7–5, 3–6తో ప్రపంచ 62వ ర్యాంకర్ పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. అయితే డబుల్స్ తొలి రౌండ్లో రామ్కుమార్–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీ 7–6 (7/5), 6–7 (4/7), 11–9తో రోహన్ బోపన్న (భారత్)–జాండ్షుల్ప్ (నెదర్లాండ్స్) ద్వయంపై ‘సూపర్ టైబ్రేక్’లో నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇతర మ్యాచ్ల్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ 7–6 (7/1), 5–7, 7–10తో మూడో సీడ్ సాదియో దుంబియా–రిబూల్ (ఫ్రాన్స్) జంట చేతిలో... పురవ్ రాజా–దివిజ్ శరణ్ (భారత్) ద్వయం 4–6, 3–6తో జీవన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీ చేతిలో ఓడిపోయాయి. చదవండి: జంపా మన్కడింగ్.. క్రీజు దాటినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! ఎందుకో తెలుసా? -
మరింత దిగజారిన కోహ్లీ
-
ఐసిసి ర్యాంకింగ్స్.. సత్తాచాటిన కెప్టెన్, వైస్ కెప్టెన్?
-
నయా నంబర్వన్..డానిల్ మెద్వెదెవ్
లండన్: టెన్నిస్ రాకెట్ పట్టిన ఎవరికైనా కెరీర్లో రెండు లక్ష్యాలు ఉంటాయి. ఒకటి ఏదైనా గ్రాండ్స్లామ్ టోర్నీలో విజేతగా నిలువడం... రెండోది ఏనాటికైనా ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ను దక్కించుకోవడం... రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్ ఈ రెండు లక్ష్యాలను అందుకున్నాడు. గత ఏడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్ను సొంతం చేసుకున్న 26 ఏళ్ల మెద్వెదెవ్ సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ప్రపంచ తాజా ర్యాంకింగ్స్లో అధికారికంగా నంబర్వన్ స్థానాన్ని అధిరోహించాడు. 2020 ఫిబ్రవరి నుంచి టాప్ ర్యాంక్లో కొనసాగుతున్న సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ను రెండో స్థానానికి నెట్టేసి మెద్వెదెవ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన మెద్వెదెవ్ 8,615 పాయింట్లతో నంబర్వన్ ర్యాంక్ను దక్కించుకున్నాడు. జొకోవిచ్ 8,465 పాయింట్లతో రెండో ర్యాంక్కు పడిపోయాడు. ‘వరల్డ్ నంబర్వన్ ర్యాంక్ అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నా. రాకెట్ పట్టినప్పటి నుంచి నా లక్ష్యాల్లో ఇదొకటి. టాప్ ర్యాంక్ చేరుకున్నాక నాకు శుభాకాంక్షలు తెలుపుతూ చాలా మంది సందేశాలు పంపించారు. వారందరికీ ధన్యవాదాలు’ అని మెద్వెదెవ్ వ్యాఖ్యానించాడు. ► పురుషుల టెన్నిస్లో ‘బిగ్ ఫోర్’గా పేరొందిన ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్), జొకోవిచ్ (సెర్బియా), ఆండీ ముర్రే (బ్రిటన్)లలో ఎవరో ఒకరు 2004 ఫిబ్రవరి 2 నుంచి ఇప్పటి వరకు ‘టాప్’ ర్యాంక్లో కొనసాగుతూ వస్తున్నారు. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ నలుగురు కాకుండా మెద్వెదెవ్ రూపంలో మరో ప్లేయర్ నంబర్వన్ ర్యాంక్లో నిలువడం విశేషం. ► ఆండీ ముర్రే (2016 నవంబర్ 7) తర్వాత కొత్త నంబర్వన్ ర్యాంకర్గా మెద్వెదెవ్ నిలిచాడు. ► యెవ్గెనీ కఫెల్నికోవ్ (1999; మే 3), మరాత్ సఫిన్ (2000, నవంబర్ 20) తర్వాత ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ పొందిన మూడో రష్యా ఆటగాడిగా మెద్వెదెవ్ గుర్తింపు పొందాడు. నంబర్వన్ స్థానానికి చేరుకున్నాక కఫెల్నికోవ్ వరుసగా ఆరు వారాలు, సఫిన్ వరుసగా తొమ్మిది వారాలు టాప్ ర్యాంక్లో ఉన్నారు. ► 1996 ఫిబ్రవరి 11న మాస్కోలో జన్మించిన మెద్వెదెవ్ 2014లో ప్రొఫెషనల్గా మారాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 83 కేజీల బరువున్న మెద్వెదెవ్ 2016 నవంబర్లో తొలిసారి టాప్–100లోకి వచ్చాడు. అనంతరం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆరేళ్ల వ్యవధిలో ప్రపంచ నంబర్వన్గా అవతరించాడు. ► ఇప్పటివరకు మెద్వెదెవ్ మొత్తం 13 సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. ఇందులో ఒక గ్రాండ్స్లామ్ టోర్నీ (యూఎస్ ఓపెన్–2021), నాలుగు మాస్టర్స్ సిరీస్ టైటిల్స్, సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్ టైటిల్ (2020) ఉన్నాయి. ► 1973 ఆగస్టులో ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక వరల్డ్ నంబర్వన్ ర్యాంక్ అందుకున్న 27వ ప్లేయర్ మెద్వెదెవ్ కావడం విశేషం. -
ICC T20 Rankings: టీమిండియా నెంబర్వన్.. ఆరేళ్ల తర్వాత
దుబాయ్: ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమ్ ర్యాంకింగ్స్లో భారత జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. ఆదివారం వెస్టిండీస్తో సిరీస్ను 3–0తో గెలుచుకున్న అనంతరం భారత్ నంబర్వన్గా (269 రేటింగ్ పాయింట్స్) నిలిచింది. ఇప్పటి వరకు నంబర్వన్గా ఉన్న ఇంగ్లండ్ను రెండో స్థానానికి పడేసి రోహిత్ సేన ముందంజ వేసింది. ఇంగ్లండ్కు కూడా సమానంగా 269 రేటింగ్ పాయింట్లే ఉన్నా... 39 మ్యాచ్ల ద్వారా పాయింట్లపరంగా భారత్ (10,484), ఇంగ్లండ్కంటే (10,474) పది పాయింట్లు ఎక్కువగా ఉండటంతో అగ్రస్థానం దక్కింది. ఈ జాబితాలో పాకిస్తాన్ (266) మూడో స్థానంలో నిలిచింది. గతంలో భారత్ 2016లో చివరిసారిగా నంబర్వన్గా నిలిచింది. రెండు నెలల పాటు ఆ స్థానంలో ఉన్న జట్టు ఆ తర్వాత వెనుకబడిపోయింది. ప్రస్తుత ర్యాంకింగ్స్ పీరియడ్లో 5–0తో న్యూజిలాండ్తో, 2–1తో ఆ్రస్టేలియాపై, 3–2తో ఇంగ్లండ్పై, 3–0తో న్యూజిలాండ్పై, 3–0తో వెస్టిండీస్పై సాధించిన విజయాల కారణంగా భారత్కు టాప్ ర్యాంక్ లభించింది. -
ర్యాంకింగ్స్లో దుమ్మురేపిన ఐపీఎల్.. రెండో స్థానంలో సమ్మర్ ఒలింపిక్స్
క్యాచ్రిచ్ లీగ్గా ముద్రపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ర్యాంకింగ్స్లోనూ దూసుకుపోయింది. యుగోవ్స్ 2022 స్పోర్ట్స్ బజ్ ర్యాంకింగ్స్లో ఐపీఎల్ అగ్రస్థానంలో నిలించింది. రెండో స్థానంలో టోక్యో ఒలింపిక్స్(సమ్మర్ ఒలింపిక్స్) నిలవగా.. మూడోస్థానంలో ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ మూడో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇచ్చినట్లు యుగోవ్స్ తెలిపింది. ఇక ఐపీఎల్ 14వ సీజన్ తొలి అంచె పోటీలు మనదగ్గరే జరగ్గా.. కరోనా విజృంభణతో రెండో అంచె పోటీలు యూఏఈ వేదికగా జరిగింది. అయినప్పటికి భారత అభిమానులను అలరించిన ఐపీఎల్ 50.8 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. కాగా యుగోవ్స్ స్పోర్ట్స్ ర్యాంకింగ్స్లో ఐపీఎల్ తొలిస్థానంలో నిలవడం వరుసగా రెండోసారి. గతేడాది ప్రకటించిన ర్యాంకింగ్స్లోనూ ఐపీఎల్దే తొలిస్థానం. ►ఇక ఐపీఎల్ తర్వాత ఇండియాలో అత్యంత ఎక్కువ జనాధరణ పొందింది టోక్యో ఒలింపిక్స్. 2020లో జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా కారణంగా మరుసటి ఏడాదికి వాయిదా పడ్డాయి. దీంతో గతేడాది ఆగస్టులో నిర్వహించిన టోక్యో ఒలింపిక్స్లో ఎన్నడూ లేనంతగా మనకు ఏడు పతకాలు రావడం విశేషం. ఇందులో నీరజ్ చోప్రా స్వర్ణం గెలవడం చరిత్రలో నిలిచిపోయింది. 49.2 పాయింట్లతో .. కేవలం 1.6 పాయింట్ల తేడాతో తొలిస్థానం కోల్పోయినప్పటికి.. రెండోస్థానంలో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. ►సాధారణంగా ఐసీసీ టోర్నీలు జరిగితే ఇండియాలో ఎక్కువమంది చూస్తుంటారు. కానీ గతేడాది జరిగిన ఐసీసీ టి20 ప్రపంచకప్లో టీమిండియా నిరాశపరిచింది. సూపర్-12 దశలోనే ఇంటిబాట పట్టినప్పటికి.. ఐసీసీ టోర్నీని ఇండియా అభిమానులు ఆదరించారని సర్వేలో తేలింది. 45.9 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచిన ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్.. అంతకముందు ఇచ్చిన స్కోరు కంటే 0.4 మాత్రమే తక్కువగా ఉండడం విశేషం. ►ఈ మూడింటి తర్వాత ఫుట్బాల్ వరల్డ్కప్(28.3 పాయింట్లు), ఇండియన్ సూపర్ లీగ్(20.4 పాయింట్లు), వింబుల్డన్ చాంపియన్షిప్(టెన్నిస్, 18 పాయింట్లు) వరుసగా 4,5,6 స్థానాల్లో నిలవగా.. ప్రొ కబడ్డీ లీగ్ 17.9 పాయింట్లతో ఏడోస్థానం.. ఏసియన్ గేమ్స్ 15.3 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. ఇక తొమ్మిదో స్థానంలో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ) 13.3.. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ 13 పాయింట్లతో తొమ్మిది, 10 స్థానాల్లో ఉన్నాయి. ఇక యుగోవ్స్ తమ ర్యాంకింగ్స్ను స్పోర్ట్స్ ఇండెక్స్ రోజువారీగా బ్రాండ్ల పట్ల ప్రజల అవగాహనను కొలమానంలోకి తీసుకొని నిర్థారణ చేస్తుంది. -
ఆరు నుంచి ముప్పైకి.. వర్సిటీ ప్రతిష్ట కిందకి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విద్యలో ఒక వెలు గు వెలిగిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక్కసారిగా తన ప్రభను కోల్పోయింది. భారతీయ వ్యవసాయ పరి శోధన సంస్థ (ఐకార్) కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన వ్యవసాయ విశ్వవిద్యాలయాల ర్యాంకుల్లో కిందిస్థాయికి పడిపోయింది. గతంలో ఆరో ర్యాంకు సాధించగా, 2020 సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన జాబితాలో 30వ స్థానానికి పడిపోయింది. వాస్తవంగా ఈసారి తొలి ఒకట్రెండు స్థానాల్లో ఉంటామని కొందరు భావించినట్లు ప్రచారం కూడా జరిగింది. కానీ ఇంత ఘోరంగా పరిస్థితి మారడంపై చర్చ జరుగుతోంది. ఎందుకిలా? తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండేది. రాష్ట్రం ఏర్పడ్డాక ఆ పేరు ఏపీకి వెళ్లగా, తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో కొత్త గా ఏర్పడింది. అంటే రాష్ట్రంతోపాటు గత వ్యవసా య విశ్వవిద్యాలయం విడిపోయిందని అనుకోవచ్చు. కొత్త వర్సిటీలో అనేక సంస్కరణలు చేశామని, కొత్త వంగడాలు, పరిశోధనలు, రైతులకు మేలు చేసే అనేక కార్యక్రమాలు చేపట్టామని అధికారులు చెప్పేవారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, అంతర్జాతీయ వర్సిటీల నుంచి ఫ్యాకల్టీని తీసుకురావడం జరిగిందని అనేవారు. అందుకే వర్సిటీకి ఆరో ర్యాంకు వచ్చిందని చెప్పేవారు. తమకు తక్కువ ర్యాంకు ఎందుకు వచ్చిందో అర్థం కావడంలేదని, కారణాలు తెలుసుకునేందుకు ఐకార్కు లేఖ రాసినట్లు వర్సిటీకి చెందిన ఓ కీలకాధికారి చెప్పారు. తమ పరిశోధన పత్రాలు కొన్ని ప్రముఖ జర్నల్స్ల్లో అనుకున్న స్థాయిలో ప్రచురితం కాకపోవడం ఒక కారణమన్నారు. ర్యాంకింగ్లో విద్యార్థి–అధ్యాపక నిష్పత్తి, పరిశోధనలు, కొత్త వంగడాలు, జాతీయ–అంతర్జాతీయ స్థాయి లో ఒప్పందాలు, ఇతర వర్సిటీల కంటే ప్రత్యేకంగా చేపట్టే కార్యకలాపాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఫిర్యాదుల వల్లనే... వర్సిటీ ర్యాంకు 30వ స్థానానికి పడిపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. గతంలో ఆరో ర్యాంకు సాధించినప్పుడు కొన్ని ఇతర రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మన వర్సిటీపై ఐకార్కు ఫిర్యాదులు చేశాయని అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన కొన్ని వారసత్వాలను కూడా కొత్త వర్సిటీ చెప్పుకుంటోందన్న విమర్శలు అందులో ఉన్నట్లు సమాచారం. అంటే ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ఇతర రాష్ట్రాల్లో చదివి ఈ వర్సిటీలో అధ్యాపక వృత్తి చేపట్టిన వారి విషయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎన్జీ రంగా వర్సిటీ ఏపీకి వెళ్లిపోగా, అప్పుడు చదివిన వారు ఇప్పుడు వేరే రాష్ట్రం కిందకు వెళ్లడంతో దాన్ని అనుకూలంగా వాడుకున్నారన్న ఫిర్యాదు వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో ర్యాంకు ఖరారులో ఈసారి ప్రతీ అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించారని అందుకే ర్యాంకు దిగువకు పడిపోయిందని ఒక వర్సిటీ అధికారి వ్యాఖ్యానించారు. -
‘ది హెల్తీ స్టేట్స్, ప్రోగ్రెసివ్ ఇండియా’ ర్యాంకింగ్స్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆరోగ్య రంగంలో మెరుగుదల దిశగా ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ర్యాంకింగ్స్ను నీతి ఆయోగ్ ఈనెల 27న విడుదల చేయనుంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ‘ది హెల్తీ స్టేట్స్, ప్రోగ్రెసివ్ ఇండియా’ పేరుతో రాష్ట్రాల ఆరోగ్యరంగ పనితీరుపై ఈ ర్యాంకింగ్స్ను సిద్ధం చేశారు. 2017లో నీతి ఆయోగ్, కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రపంచ బ్యాంకు సహకారంతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆరోగ్యం రంగం పనితీరు, ఆరోగ్య రంగ పురోభివృద్ధిని పెంపొందించేందుకు వార్షిక ఆరోగ్య సూచికను ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడంతోపాటు, పరస్పరం అనుభవాలను పంచుకునేందుకు ప్రోత్సహిస్తారు. -
నీట్ తేలేదెప్పుడు..? క్లాసులు కదిలేదెప్పుడు..?
సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు వచ్చి రెండు వారాలైనా ప్రవేశాల షెడ్యూల్ను ఇంకా ప్రకటించలేదు. జాతీయస్థాయి నోటిఫికేషన్ విడుదల కాలేదు. మరోవైపు రాష్ట్రానికి చెందిన నీట్ ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇప్పటికీ విడుదల చేయలేదు. వాటిని ఇప్పటికే రాష్ట్రాలకు పంపాల్సి ఉండగా, మరింత ఆలస్యం అవుతోంది. త్వరలో రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారే కానీ, ఎప్పుడనేది స్పష్టత లేదు. దీంతో నీట్ అర్హత సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎదురుచూపులు తప్పలేదు. వాస్తవంగా నీట్ ఫలితాల ప్రకటన సమయంలోనే షెడ్యూల్ వంటి వాటిపై స్పష్టత ఇవ్వాలని, కానీ ఈ విషయంలో ప్రతీసారి అస్పష్టతే ఉంటోందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు అంటున్నాయి. కరోనా కారణంగా గతేడాది వైద్య విద్య ప్రవేశాల్లో జాప్యం జరగ్గా, ఈసారీ అదే పరిస్థితి నెలకొంది. దీనివల్ల వైద్య విద్యా సంవత్సరం గందరగోళానికి గురవుతుందని వాపోతున్నారు. నాలుగైదు నెలలు ఆలస్యంగా ప్రవేశాలు ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ ఫలితాలు ఈ నెల 1న విడుదలయ్యాయి. అనేకమంది తెలంగాణ విద్యార్థులు నీట్లో అర్హత సాధించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను జాతీయస్థాయి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ఎయిమ్స్, జిప్మర్ వంటి ప్రసిద్ధ వైద్య సంస్థల్లోని సీట్లనూ నీట్ ద్వారానే భర్తీ చేస్తారు. అందుకోసం ముందుగా జాతీయ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.రెండు విడతల జాతీయ కౌన్సెలింగ్ తర్వాత 15 శాతం సీట్లలో ఏవైనా మిగిలితే వాటిని తిరిగి ఆయా రాష్ట్రాలకు వెనక్కిస్తారు. వాటిని రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్లోనే నింపుకోవచ్చు. జాతీయస్థాయి కౌన్సెలింగ్ మొదలైన వెంటనే రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్కు నోటిఫికేషన్ జారీచేస్తారు. కరోనాకు ముందు సాధారణంగా ఆగస్టులో మెడికల్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభమయ్యేవి. కరోనా వల్ల గతేడా ది చాలా ఆలస్యంగా తరగతులు మొదలుకాగా, ఈసారి మహమ్మారి తీవ్రత తగ్గినా కూడా మరింత జాప్యం అవుతోంది. త్వరగా కౌన్సెలింగ్ మొదలుపెడితే డిసెంబర్లో తరగతులు ప్రారంభించడానికి వీ లుండేది. అయితే, జనవరిలో ఫస్టియర్ తరగతులు ప్రారంభమయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. ఫస్టియర్ ఫెయిలైన విద్యార్థులెక్కువ.. కరోనా కారణంగా వైద్య విద్యార్థులు చాలావరకు నష్టపోయారు. పది, ఇంటర్ మాదిరిగా ఆపై తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండా ప్రమోట్ చేయడం కుదరదు. అయితే, వైద్య విద్యార్థుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. 50 శాతం మార్కులు వస్తేనే పాసైనట్లు లెక్క. కరోనా వల్ల గతేడాది కాళోజీ వర్సిటీ పరిధిలో ఫెయిలైన విద్యార్థుల సంఖ్య పెరిగింది. నేరుగా తరగతులు జరగకపోవడంతో విద్యార్థులు నష్టపోయారు. కాబట్టి సకాలంలో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించి, త్వరగా తరగతులు ప్రారంభించాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. -
ఫోర్బ్స్ బెస్ట్ ఎంప్లాయర్ ర్యాంకింగ్స్.. ఈ సంస్థకే మొదటి ర్యాంకు
రిలయన్స్ సంస్థకి మరో అరుదైన గౌరవం దక్కింది. 2021 ఏడాదికి గాను ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన బెస్ట్ ఎంప్లాయర్ ర్యాకింగ్స్లో 52వ స్థానం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 750 కంపెనీలను ఈ ర్యాంకింగ్స్ కోసం పరిశీలించగా రిలయన్స్ సంస్థకి 52వ స్థానం దక్కింది. టాప్ 100లో ఫోర్బ్స్ బెస్ట్ ఎంప్లాయర్ అవార్డులకు సంబంధించి టాప్ 100 జాబితాలో మొత్తం నాలుగు సంస్థలకే చోటు దక్కింది. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ 52వ స్థానంలో నిలవగా ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ 65వ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 77, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 90 ర్యాంకును దక్కించుకున్నాయి. ప్రతిష్టాత్మక ఎస్బీఐ 117వ, ఎల్ అండ్ టీ 127వ స్థానాలకే పరిమితం అయ్యాయి. నంబర్ వన్ ఇక ప్రపంచ వ్యాప్తంగా ర్యాంకులను పరిశీలిస్తే శామ్సంగ్ సంస్థ ప్రథమ స్థానంలో నిలవగా ఐబీఎం కంప్యూటర్స్ ద్వితీయ స్థానం దక్కించుకుంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, గూగుల్, డెల్, హువావేలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. లక్షన్నర మంది నుంచి ప్రపంచ వ్యాప్తంగా 58 దేశాలకు చెందిన 750 కంపెనీల నుంచి 1,50,000ల మంది ఫుల్టైం, పార్ట్టైం ఉద్యోగుల నుంచి ఈ అభిప్రాయాలను సేకరించి ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. ఈ సందర్భంగా ఉద్యోగుల నుంచి కంపెనీ ఆర్థిక ప్రణాళిక, లింగ సమానత్వం, సామాజిక బాధ్యత, టాలెంట్ డెవలప్మెంట్ తదితర అంశాలపై వివరాలు సేకరించారు. ఇతర ఇండియన్ కంపెనీలు ఫోర్బ్స్ బెస్ట్ఎంప్లాయర్ ర్యాకింగ్స్లో చోటు దక్కించుకున్న ఇతర భారతీయ కంపెనీల విషయానికి వస్తే బజాజ్ 215, యాక్సిస్ బ్యాంక్ 215, ఇండియన్ బ్యాంక్ 314, ఓన్ఎన్జీసీ 404, అమర్రాజా గ్రూపు 405, కోటక్ మహీంద్రా 415, బ్యాంక్ ఆఫ్ ఇండియా 451, ఐటీసీ 453, సిప్లా 460, బ్యాంక్ ఆఫ్ బరోడా 496, ఎల్ఐసీ 504, ఇన్ఫోసిస్ 588, టాటా గ్రూపు 746వ స్థానాలు దక్కించుకున్నాయి. చదవండి : 40 ఏళ్లకే తరగనంత సంపద -
డూయింగ్ బిజినెస్ నివేదిక నిలిపివేత
వాషింగ్టన్: వివిధ దేశాల్లో వ్యాపారాలకు అనువైన పరిస్థితులకు సంబంధించి విడుదల చేసే ’డూయింగ్ బిజినెస్’ నివేదికను నిలిపివేయాలని ప్రపంచ బ్యాంకు నిర్ణయించింది. చైనాతో పాటు కొన్ని దేశాలకు ర్యాంకింగ్లు ఇచ్చే విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఇందుకు కారణం. 2018, 2020 నివేదికల్లో డేటాపరమైన అవకతవకలు, బ్యాంకు సిబ్బంది నైతిక విలువలు పాటించకపోవడం వంటి ఆరోపణలపై అంతర్గతంగా విచారణ నిర్వహించిన నేపథ్యంలో డూయింగ్ బిజినెస్ నివేదికను నిలిపివేయనున్నట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అప్పట్లో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యోంగ్ కిమ్, సీఈవో క్రిస్టలీనా జార్జియేవా.. ఆమె సలహాదారు ఒత్తిడి మేరకు చైనాకు మెరుగైన ర్యాంకింగ్ లభించేలా వరల్డ్ బ్యాంక్ సిబ్బంది డేటాను మార్చేశారని ఈ వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయసేవల సంస్థ విల్మర్హేల్ నిర్ధారించింది. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)కి డైరెక్టరుగా ఉన్న జార్జియేవా ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. విచారణ నివేదికలో వెల్లడైన విషయాలతో విభేదిస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు, ప్రపంచ బ్యాంకు ఈ వివాదంపై సమగ్రమైన విచారణ నిర్వహించాలని, విశ్వసనీయతను పాటించాలని చైనా విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. గత రెండు దశాబ్దాలుగా ఐఎంఎఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలపై పట్టు సాధించేందుకు చైనా ప్రయతి్నస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
నెంబర్ వన్గా ఐఐటీ మద్రాస్.. వరుసగా మూడో ఏడాది..
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ఐఐటీ–మద్రాస్ నెంబర్ వన్గా నిలిచింది. ఓవరాల్ ర్యాంకుల్లోనూ, ఇంజినీరింగ్లోనూ వరుసగా మూడోసారి తొలి స్థానం సాధించింది. 2021 సంవత్సరానికి గాను ఉన్నత విద్యా సంస్థల పనితీరును మదింపు చేసి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) రూపొందించిన ర్యాంకుల జాబితాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ గురువారం విడుదల చేశారు. టాప్–100లో ఏపీ, తెలంగాణ విద్యా సంస్థలు ఓవరాల్ కేటగిరీలో ఐఐటీ–మద్రాస్ తొలి స్థానంలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూరు రెండోస్థానంలో, ఐఐటీ–బాంబే మూడో స్థానంలో నిలిచాయి. ఏపీ, తెలంగాణకు చెందిన పలు ఉన్నత విద్యా సంస్థలు ఓవరాల్ కేటగిరీ టాప్–100లో చోటు దక్కించుకున్నాయి. ఐఐటీ–హైదరాబాద్ 16వ స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 17వ స్థానంలో నిలిచాయి. గత ఏడాది ఐఐటీ–హైదరాబాద్ 17వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గత ఏడాది 15వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు రెండు స్థానాలు వెనుకబడింది. ఇక ఆంధ్రా యూనివర్సిటీ 48వ స్థానంలో, ఎన్ఐటీ–వరంగల్ 59వ, ఉస్మానియా యూనివర్సిటీ 62వ స్థానంలో నిలిచాయి. గత ఏడాది ర్యాంకులతో పోల్చితే ఈ వర్సిటీలు వెనుకబడ్డాయి. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వర్సిటీ(కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్) 69వ స్థానంలో, ఎస్వీయూ 92వ స్థానంలో నిలిచాయి. వర్సిటీ కేటగిరీల్లో హెచ్సీయూకు 9వ ర్యాంకు యూనివర్సిటీ కేటగిరీల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూర్ తొలిస్థానంలో నిలిచింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 9వ స్థానంలో నిలిచి టాప్–10లో చోటు దక్కించుకుంది. ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీకి 24వ స్థానం దక్కింది. ఉస్మానియా వర్సిటీ 32వ స్థానంలో, కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 35వ స్థానంలో, ఎస్వీయూ 54వ స్థానంలో, గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ 67వ స్థానంలో, ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ 83వ స్థానంలో, విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ, రీసెర్చ్ యూనివర్శిటీ 97వ స్థానంలో నిలిచాయి. కాలేజీల కేటగిరీల్లో టాప్–100లో రెండే.. కాలేజీల కేటగిరీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి కేవలం రెండు కాలేజీలు చోటు దక్కించుకున్నాయి. 34వ స్థానంలో విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజ్, 85వ స్థానంలో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ విమెన్ నిలిచాయి. ర్యాంకింగ్స్.. రీసెర్చ్ కేటగిరీలో..: రీసెర్చ్ కేటగిరీలో ఐఐటీ హైదరాబాద్ 15వ స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 25వ స్థానంలో నిలిచాయి. ఇంజినీరింగ్: ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 8వ స్థానంలో, ఎన్ఐటీ–వరంగల్ 23వ, కోనేరు లక్ష్మయ్య ఫౌండేషన్ 50వ, ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ 54వ స్థానంలో, జేఎన్టీయూ–హైదరాబాద్ 62వ స్థానంలో, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్–విశాఖపట్నం 74వ స్థానంలో నిలిచాయి. మేనేజ్మెంట్: మేనేజ్మెంట్ విభాగంలో ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్– హైదరాబాద్ 27వ స్థానంలో, కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 38వ, క్రియా యూనివర్సిటీ–చిత్తూరు 50వ స్థానంలో, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ–హైదరాబాద్ 63వ స్థానంలో నిలిచాయి. ఫార్మసీ: ఫార్మసీ విభాగంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూ్యటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైఫర్) హైదరాబాద్ 6వ స్థానంలో నిలిచింది. ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మాసూ్యటికల్ సైన్సెస్–విశాఖ 30వ స్థానంలో, శ్రీ పద్మావతి మహిళా విద్యాలయం–తిరుపతి 44వ, కాకతీయ యూనివర్సిటీ 48వ, ఎస్వీయూ 54వ, రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా–అనంతపురం 55వ స్థానంలో నిలిచాయి. శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ–చిత్తూరు 62వ, చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా– గుంటూరు 69వ స్థానంలో, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా–నర్సాపూర్ 72వ స్థానంలో నిలిచాయి. వైద్య విద్య విభాగం వైద్య విద్య విభాగంలో ఎయిమ్స్–ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. నారాయణ మెడికల్ కాలేజ్–నెల్లూరు 43వ స్థానంలో నిలిచింది. న్యాయ విద్య: న్యాయ విద్యా విభాగంలో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీ – బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా, నల్సార్ – హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ 28వ ర్యాంకు, ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ – హైదరాబాద్ 29వ ర్యాంకు దక్కించుకున్నాయి. ఆర్కిటెక్చర్: ఆర్కిటెక్చర్ విభాగంలో ఐఐటీ రూర్కీ మొదటి స్థానంలో, విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 8వ ర్యాంకు సాధించాయి. దంత వైద్య విద్య: దంత వైద్య విద్యా విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని విష్ణు డెంటల్ కాలేజీ 23వ స్థానంలో, ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ – సికింద్రాబాద్ 30వ స్థానంలో నిలిచాయి. -
కోహ్లి, రోహిత్ శర్మ వన్డే ర్యాంక్లు యథాతథం
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన పురుషుల వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ర్యాంకుల్లో ఎటువంటి మార్పు జరగలేదు. 848 రేటింగ్స్తో కోహ్లి రెండో స్థానంలో ఉండగా... 817 రేటింగ్స్తో రోహిత్ మూడో ర్యాంకులో ఉన్నాడు. ఈ విభాగంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తొలి స్థానంలో ఉన్నాడు. లంకతో జరిగిన తొలి వన్డేలో అర్ధ శతకంతో జట్టుకు విజయాన్ని కట్టబెట్టిన శిఖర్ ధావన్ ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు పైకి ఎగబాకి 16వ స్థానంలో నిలిచాడు. బౌలర్ల విభాగంలో భారత్ నుంచి బుమ్రా (6వ ర్యాంక్) మాత్రమే టాప్–10లో ఉన్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో జడేజా 9వ ర్యాంకులో ఉన్నాడు. -
ప్రపంచ స్టార్టప్ రంగంలో... 2030 నాటికి భారత్కు మూడో స్థానం
న్యూఢిల్లీ: 2030 నాటికి ప్రపంచ స్టార్టప్స్ ఏకోసిస్టమ్లో ఇండియా మూడో స్థానానికి చేరుతుందని, అందుకు అవసరమైన నాలెడ్జ్ బేస్ను పెంచడంతో పాటు సరైన పాలసీ ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేయడంపై దృష్టిపెట్టామని డిజిటల్ స్టార్టప్ థింక్ ట్యాంక్ అలయన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్ (ఏడీఐఎఫ్) తెలిపింది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్లతో స్టార్టప్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్చలు జరపుతున్నామని.. ఇరు వర్గాలను సమన్వయ పరిచే విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఏడీఐఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిజో కురువిలా జార్జ్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ స్టార్టప్ ఏకోసిస్టమ్ ఇండియా 20వ ర్యాంకింగ్లో ఉందని... 50 యూనికార్న్ స్టార్టప్స్తో అమెరికా (122), చైనా (92) మూడో స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. నాలెడ్జ్ షేరింగ్ కోసం త్వరలోనే స్టార్టప్ ఫౌండర్లతో అలయన్స్తో ఏర్పాటు చేస్తామని చెప్పారు. యాపిల్ విధానాల మాదిరిగానే స్టార్టప్స్ తమ ఆదాయంలో 30 శాతం వరకు వసూలు చేయాలని గూగుల్ ప్లేస్టోర్ ప్రతిపాదించింది. అయితే దేశంలో చాలా వరకు స్టార్టప్లకు అధిక మార్జిన్లు లేవని, ఈ విషయంపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని వివరించారు. అమెరికాలో ఆరిజోనా రాష్ట్రం యాప్ స్టోర్ ఫీజులపై మార్గదర్శకాలను తీసుకొచ్చిందని.. ఇది ప్రారంభ సంకేతమని ఆయన పేర్కొన్నారు. -
Fortune World's 50 Greatest Leaders List: ఫార్చూన్ ఉమెన్
న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా వెలువడే అమెరికన్ బహుళజాతి వాణిజ్య మాస పత్రిక ‘ఫార్చూన్’ ఏటా ‘ది బెస్ట్’ అని, ‘ది గ్రేటెస్ట్’ అని ర్యాంకింగులు ఇస్తుంటుంది. సాధారణంగా ‘బెస్ట్’ అనే ర్యాంకింగ్ సంస్థలకు. ‘గ్రేటెస్ట్’ అనే ర్యాంక్ వ్యక్తులకు ఉంటుంది. ఆ క్రమంలోనే ఈ ఏడాది కూడా ‘50 గ్రేటెస్ట్ లీడర్స్’ అంటూ.. కరోనా సంక్షుభిత ప్రపంచానికి వివిధ రంగాలలో విశేష నాయకత్వం వహించిన వారిలో యాభై మంది వ్యక్తులను ఎంపిక చేసి ఆ జాబితాను గురువారం విడుదల చేసింది. యాభైలో ఇరవై మందికి పైగా మహిళలే. వారిలో ఇద్దరు భారతీయ మహిళలు. ఒకరు డాక్టర్ అపర్ణా హెగ్డే. మరొకరు వర్షిణీ ప్రకాశ్. జాబితాలో అపర్ణ 15 వ స్థానంలో, వర్షిణి 28వ స్థానంలో నిలిచారు. డాక్టర్ అపర్ణ యూరోగైనకాలజిస్ట్. మహిళల మూత్రనాళ, మాతృ సంబంధ ఆరోగ్య సమస్యల చికిత్సలో నిపుణురాలు. ముంబైలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా ఆమె కెరీర్ ఆరంభమైంది. గర్భిణులలో, తల్లీబిడ్డల్లో ఆకస్మికంగా తలెత్తే అత్యవసర ఆరోగ్య పరిస్థితులకు.. అవి నివారించగలిగినవే అయినా.. సకాలంలో వైద్యం అందక సంభవించిన మరణాలు ఎన్నిటినో ఆమె దగ్గరగా చూశారు. మంచి డాక్టర్లు, చురుకైన నర్సులు, అత్యాధునిక చికిత్సా సదుపాయాలు ఉండి కూడా గ్రామీణ ప్రాంతాల గర్భిణుల వరకు ఆ సేవలు, లేదా ఆ సేవల వరకు గర్భిణులు వెళ్లలేకపోతే ఏమిటి ప్రయోజనం? ఏదైనా చేయాలనుకున్నారు అపర్ణ. ఆమె స్వరాష్ట్రం కర్ణాటక. అక్కడి ఓ గ్రామంలోనే ఆమె జన్మించారు. ముంబై నుంచి ఊరికి వచ్చినప్పుడు ఓ రోజు.. ఉపాధి పనుల కోసం వెళుతున్న ఓ గిరిజన మహిళను చూశారు అపర్ణ. ఆమె చేతిలో మొబైల్ ఫోన్ ఉంది! ఎస్.. మొబైల్ ఫోన్తోనే వైద్యసౌకర్యాలకు, మారుమూల ప్రాంతాల గర్భిణులకు వారధి నిర్మించాలి అనుకున్నారు అపర్ణ. అలా 2008లో ఆవిర్భవించినదే ‘అర్మాన్’. మాతాశిశు మరణాలను తగ్గించడం కోసం, మహిళలకే ప్రత్యేకమైన అనారోగ్య సమస్యల నుంచి వారికి విముక్తి కల్పించడం కోసం అర్మాన్ను ఒక పెద్ద నెట్వర్క్గా నిర్మించుకుంటూ వచ్చారు అపర్ణ. లాభార్జన ధ్యేయం లేని సంస్థ కాబట్టి ఆరంభంలో నిధులు రాలేదు. ఆ తర్వాత ప్రభుత్వమే భారీ భాగస్వామ్య సహకారంతో ముందుకు వచ్చింది. ప్రస్తుతం అర్మాన్ దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలలో గర్భిణులకు ప్రసూతి సేవలతోపాటు, మహిళల మానసిక సమస్యలకు చికిత్సను అందిస్తోంది. గర్భస్థ, నవజాత శిశువు అనారోగ్యాలను నయం చేసి తల్లీబిడ్డలకు పునర్జన్మనిస్తోంది. ఈ పదమూడేళ్లలో అర్మాన్ 2 కోట్ల 40 లక్షల మంది మహిళలకు చేరువ కాగలిగింది. వీళ్లలో ఒక్కరు ఒక్క ఫోన్ కాల్ చేసినా అర్మాన్లోని సుశిక్షితులైన 1,70, 000 మంది స్థానిక ఆరోగ్య కార్యకర్తల్లో ఆ దగ్గర ఉన్నవారు వెంటనే వెళ్లి వాళ్లను కలుస్తారు. వారికి అవసరమైన వైద్య సేవలు అందేలా శ్రద్ధ తీసుకుంటారు. గత పదిహేను నెలలుగా అర్మాన్ బాధ్యత రెట్టింపైంది. ప్రసూతి వార్డులు కూడా కరోనా వార్డులుగా మారిపోవడంతో గర్భిణులకు అర్మాన్ విడిగా ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యామ్నాయాలు చూడవలసి వస్తోంది. ‘దేశ భవిష్యత్తుకు జన్మనివ్వడం’ అనే నినాదంతో, తల్లీబిడ్డ ఆరోగ్య సంరక్షణకు, సంక్షేమానికి కృషి చేస్తున్న అపర్ణను ఈ ఏడాది ‘గ్రేటెస్ట్ లీడర్స్’లో ఒకరిగా ఫార్చూన్ ఎంపిక చేయడానికి వైద్యసేవల రంగంలో, అదీ ఇప్పటి పరిస్థితుల్లో ఇంతకు మించిన గొప్ప కారణం ఏముంటుంది? వర్షిణీ ప్రకాష్ ప్రవాస భారతీయురాలు. బోస్టన్లో ఉంటారు. పుట్టడం, పెరగడం అంతా యూఎస్లోనే. వాతావరణ కార్యకర్త వర్షిణి. పరిశ్రమలు పెరగడం, చెట్లు కూలిపోవడం, ఆకాశం మసి బొగ్గు అవడం కళ్లారా చూస్తూ ఉన్న వర్షిణికి ఓ రోజు భయం కలిగింది. మనిషి భవిష్యత్ ఏంటి అనిపించింది. జనరేషన్ జడ్ అమ్మాయి వర్షిణి. శారా బ్లేజ్విక్ అనే తన ఫ్రెండ్తో కలిసి ‘సన్రైజ్ మూవ్మెంట్’ అనే సంస్థను ప్రారంభించారు. వాతావరణానికి హితం కాని చర్యల్ని లీగల్గా అడ్డుకోవడం ఈ సంస్థ పని. ఇందులో సైనికులంతా యువతీ యువకులే. ఇంత వయసనేం లేదు, పచ్చదనాన్ని కోరుకునే హృదయమైతే చాలు. పచ్చదనం అనే మాటకు పైపై అర్థం తీసుకోకండి. ‘ప్రజా విముక్తి పోరాటం’ అనే పెద్ద అర్థమే ఆ సంస్థకు ట్యాగ్ లైన్గా ఉంది. సంస్థ నినాదం కూడా అదే. వాతావరణంలోని ప్రతికూల మార్పులకు జాతి వివక్ష, లైంగిక అసమానత్వం, ఆర్థిక వ్యత్యాసాలు, భౌగోళిక పరిస్థితులు అన్నీ కారణమేనంటారు వర్షిణీ, శారా. ‘అర్మాన్’ కు ఇండియాలో అతి పెద్ద నెట్వర్క్ ఉన్నట్లే, సన్రైజ్ మూవ్మెంట్కు యూఎస్లో విస్తృతంగా యువసైన్యం ఉంది. వాళ్లంతా పెద్ద పెద్ద డిగ్రీలు, పెద్ద హోదాల్లో ఉన్నవారు. సంస్థ 2017లో ప్రారంభమైంది. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వర్షిణి. శారా ట్రైనింగ్ డైరెక్టర్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వీళ్లు బైడెన్కు మద్దతుగా నిలబడ్డారు. అలాగని ఆయన్నేమీ పూర్తిగా సమర్థించలేదు. శిలాజ ఇంధన విరాళాలను పోగు చేసిన కొందరు రాజకీయ నాయకులకు బైడెన్ మద్దతు ఇవ్వడం వారికి నచ్చలేదు. ముఖాన్నే చెప్పేశారు. అలాగే ‘గ్రీన్ న్యూ డీల్’కి బైడెన్ ముఖం చాటేయడాన్ని కూడా వర్షిణి నిర్మొహమాటంగా విమర్శించారు. ఇది చాలదా ‘గ్రేటెస్ట్ లీడర్’ అవడానికి! వర్షిణితో పాటు శారాకు కూడా ఈ ‘గ్రేటెస్ట్’ ర్యాంకింగ్లో సగ భాగం ఇచ్చింది ఫార్చూన్. ఫార్చూన్ ‘50 గ్రేటెస్ట్ లీడర్స్’ తాజా జాబితాలో జసిండా ఆర్డెర్న్ (న్యూజీల్యాండ్ ప్రధాని) మొదటి స్థానంలో ఉన్నారు. మలాలాకు 31వ స్థానం దక్కింది. మహిళల్లో ఇంకా.. జెస్సికా టాన్, స్టేసీ అబ్రామ్, రెషోర్నా ఫిట్జ్ప్యాట్రిక్, డాలీ పార్టన్, విల్లీ రే ఫెయిర్లీ, కేట్ బింగ్హామ్, మెకన్జీ స్కాట్, డాక్టర్ యాలా స్టాన్ఫోర్డ్, టిమ్నిట్ గెబ్రూ, డయానా బెరెంట్, అడెనా ఫ్రైడ్మేన్, నికోల్ మేసన్, మేగన్ ర్యాపినో, ఫాజియా కూఫీ, నటాలియా రోడ్రిగ్స్, ఆరోరా జేమ్స్, నవోమీ ఒసాకా ఫార్చూన్ లిస్ట్లో ఉన్నారు. -
హైదరాబాద్ ఐఎస్బీ.. దేశంలోనే టాప్!
రాయదుర్గం (హైదరాబాద్): గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) మరో అరుదైన ఘనత సాధించినట్లు ఐఎస్బీ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ విభాగం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎస్సీఎం జర్నల్ లిస్ట్ ర్యాంకింగ్స్లో ఐఎస్బీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఎస్సీఎం జర్నల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రీసెర్చ్ జర్నల్ పబ్లికేషన్స్లలో ప్రచురించబడిన పరిశోధనా పత్రాలను పరిగణిస్తుంది. ప్రధానంగా విశ్లేషణాత్మక, అనుభావిక రంగాలలో పరిశోధన పత్రాలపై దృష్టి పెడుతుంది. ఈ క్రమంలో ఉత్తమ నిర్వహణ పరిశోధన విశ్వవిద్యాలయాలు, బీ–స్కూల్స్, సంస్థల ర్యాంకింగ్స్ను ఎస్సీఎం జర్నల్ లిస్ట్ 2015–20 కాలానికి ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్లో ఐఎస్బీ దేశంలోని బిజినెస్ స్కూళ్ళలో మొదటిస్థానంలో, ప్రపంచస్థాయిలో 64వ స్థానంలో నిలిచింది. ఇక్కడ చదవండి: రాష్ట్రపతి ఆమోదం: 95% ఉద్యోగాలు స్థానికులకే.. ‘సేఫ్’ జోన్లోకి సైబర్ వాంటెడ్స్ -
బెంగళూరులో సులభతర జీవనం
సాక్షి, న్యూఢిల్లీ: ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ (సులభతర జీవన సూచీ) –2020 ర్యాంకుల్లో పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల్లో బెంగళూరు నంబర్ 1గా నిలిచింది. విశాఖపట్నం 15వ స్థానంలో, హైదరాబాద్ 24వ స్థానంలో నిలిచాయి. పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాల్లో కాకినాడ నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే, మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ (పురపాలిక పనితీరు సూచీ) ర్యాంకుల్లో పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల్లో విశాఖపట్నం 9వ స్థానంలో నిలవగా, పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాల కేటగిరీలో తిరుపతి నగరం రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గురువారం ఇక్కడ ఆన్లైన్ ద్వారా ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ర్యాంకులను విడుదల చేశారు. జీవన నాణ్యత, పట్టణాభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాల ప్రభావాన్ని అంచనా వేసే సూచీ ఈ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. విభిన్న అంశాల ప్రాతిపదికన పౌరుల జీవన ప్రమాణాలను ఈ ఇండెక్స్ అంచనా వేస్తుంది. పౌరుల అవగాహన సర్వేకు ఈ ఇండెక్స్లో 30 శాతం వెయిటేజీ ఉంటుంది. జీవన నాణ్యత, ఆర్థిక సామర్థ్యం, సుస్థిరత, 13 రంగాల (విద్య, తదితర) అభివృద్ధి అంశాలకు 70 శాతం వెయిటేజీ ఇచ్చి ఈ ఇండెక్స్ రూపొందించారు. ఈ ర్యాంకులను రెండు కేటగిరీలుగా విభజించారు. పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాలను ఒక కేటగిరీలో, పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాలను మరో కేటగిరీలో విభజించి ఈ ర్యాంకులను ప్రకటించారు. మొత్తం 110 నగరాలు ఈ ఇండెక్స్ ర్యాంకులకు పోటీ పడ్డాయి. మిలియన్ ప్లస్ కేటగిరీలో టాప్–10 ఇవే.. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ పది లక్షలకు పైబడిన జనాభా గల నగరాల కేటగిరీలో బెంగళూరు మొదటి ర్యాంకు సాధించగా తరువాతి స్థానాల్లో వరుసగా పుణే, అహ్మదాబాద్, చెన్నై, సూరత్, నవీ ముంబై, కోయంబత్తూర్, వడోదర, ఇండోర్, గ్రేటర్ ముంబై టాప్–10లో నిలిచాయి. ఏపీ నుంచి విజయవాడ 41వ స్థానంలో నిలిచింది. నాలుగో ర్యాంకు సాధించిన కాకినాడ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ పది లక్షల లోపు జనాభా గల నగరాల కేటగిరీలో మొదటి స్థానంలో సిమ్లా నిలవగా, తరువాతి స్థానాల్లో వరుసగా భువనేశ్వర్, సిల్వాస, కాకినాడ, సేలం, వెల్లూర్, గాంధీనగర్, గురుగ్రామ్, దావన్గెరె, తిరుచిరాపల్లి టాప్–10 స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ నుంచి వరంగల్ 19వ స్థానంలో, కరీంనగర్ 22వ స్థానాల్లో నిలిచాయి. ఏపీ నుంచి తిరుపతి 46వ స్థానంలో నిలిచింది. మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ఇలా.. దేశంలో తొలిసారిగా మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ రూపొందించారు. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఒక సూచిక యొక్క ఫలితాన్ని నిర్దేశిస్తుండగా.. మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ఆ ఫలితానికి గల కారణాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. సేవల డెలివరీ, ప్రణాళిక, ఆర్థిక వ్యవస్థ, పరిపాలన ప్రక్రియల్లో సమర్థవంతమైన స్థానిక పాలనను నిరోధించే అంశాలను గుర్తించేందుకు ఈ ఇండెక్స్ దోహదపడుతుంది. సేవలు, ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, ప్రణాళిక, పరిపాలన అన్న ఐదు అంశాల ప్రాతిపదికన 20 రంగాల్లోని 100 సూచికలను ర్యాంకులకు ప్రాతిపదికగా తీసుకున్నారు. విశాఖ –9.. తిరుపతి–2..! మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్లో 10 లక్షలకు పైబడిన జనాభా కేటగిరీలో ఇండోర్ మొదటి స్థానం దక్కించుకుంది. తరువాత వరుసగా సూరత్, భోపాల్, పింప్రీ చించ్వాడ్, పుణే, అహ్మదాబాద్, రాయ్పూర్, గ్రేటర్ ముంబై, విశాఖపట్నం, వడోదర టాప్–10లో నిలిచాయి. ఇక, తెలంగాణ నుంచి హైదరాబాద్ 17వ స్థానంలో నిలిచింది. ఏపీ నుంచి విజయవాడ 27వ స్థానంలో నిలిచింది. 10 లక్షల లోపు కేటగిరీలో న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి స్థానంలో నిలిచింది. తిరుపతి రెండోస్థానంలో నిలిచింది. తరువాత వరసగా గాంధీనగర్, కర్నాల్, సేలం, తిరుప్పూర్, బిలాస్పూర్, ఉదయ్పూర్, ఝాన్సీ, తిరునల్వేలి నిలిచాయి. ఏపీ నుంచి కాకినాడ 11వ స్థానంలో నిలిచింది. -
కెరీర్ అత్యుత్తమ స్థానంలో రిషభ్ పంత్
దుబాయ్: బ్రిస్బేన్ టెస్టు హీరో రిషభ్ పంత్, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో తన కెరీర్లో అత్యుత్తమ స్థానాన్ని అందుకున్నాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో పంత్ 13వ స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 691 పాయింట్లు ఉన్నాయి. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) వరుసగా తొలి రెండు ర్యాంకుల్లో ఉండగా... భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (862 పాయింట్లు)ని వెనక్కి నెట్టి ఆసీస్ ప్లేయర్ లబ్షేన్ (878 పాయింట్లు) మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో భారత ప్లేయర్లు పుజారా ఏడో స్థానంలో, రహానే తొమ్మిదో ర్యాంకులో నిలిచారు. బౌలర్ల విభాగంలో సిరాజ్ 32 స్థానాలు మెరుగుపరుచుకొని 45వ ర్యాంక్కు చేరాడు. బౌలర్ల జాబితాలో ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), స్టువర్ట్బ్రాడ్ (ఇంగ్లండ్), నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్)... ఆల్రౌండర్ల కేటగిరీలో బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), జేసన్ హోల్డర్ (వెస్డిండీస్), జడేజా (భారత్) వరుసగా టాప్–3లో ఉన్నారు. -
వరుసగా 800 వారాలు...
పారిస్: పురుషుల టెన్నిస్లో ఇప్పటికే ఎన్నో రికార్డులు నెలకొల్పిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ తాజాగా మరో కొత్త రికార్డును సృష్టించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో వరుసగా 800 వారాలపాటు టాప్–10లో నిలిచిన తొలి ప్లేయర్గా నాదల్ రికార్డు నెలకొల్పాడు. సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో 9,850 పాయింట్లతో రెండో స్థానాన్ని నిలబెట్టుకున్న నాదల్... 800 వారాల పాటు (15 ఏళ్లకు పైగా) టాప్–10లో నిలిచిన ఏకైక ప్లేయర్గా ఘనత వహించాడు. గతంలో అత్యధిక వరుస వారాలు టాప్–10లో నిలిచిన రికార్డు జిమ్మీ కానర్స్ (789 వరుస వారాలు) పేరిట ఉండేది. 2005 ఏప్రిల్లో తొలిసారిగా టాప్–10లో ప్రవేశించిన 34 ఏళ్ల నాదల్... గతేడాది నవంబర్లోనే జిమ్మీ కానర్స్ను వెనక్కి నెట్టేశాడు. వరుస వారాల పరంగా కాకుండా ఓవరాల్గా చూస్తే... అత్యధికంగా 931 వారాల పాటు స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ టాప్–10లో నిలిచాడు. -
సమ న్యాయంలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: దేశంలో ఆర్థిక, సామాజిక, లింగ సమానత్వం/సమ న్యాయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలోనూ, మొత్తమ్మీద (ఓవరాల్ ర్యాంకింగ్స్)లో తృతీయ స్థానంలో నిలిచిందని పబ్లిక్ ఎఫైర్స్ ఇండెక్స్ (ప్రజా వ్యవహారాల సూచీ–పీఏఐ)–2020 వెల్లడించింది. ఓవరాల్ ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ గతంతో పోల్చితే ప్రగతి చూపినట్టు ప్రముఖంగా ప్రస్తావించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ (పీఏసీ) దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పరిపాలన తీరు తెన్నులపై అధ్యయనం చేసి పబ్లిక్ ఎఫైర్స్ సూచీ–2020ని శనివారం ప్రకటించింది. వివిధ సామాజిక అంశాలపై ఈ సంస్థ పరిశోధనలు, అధ్యయనాలు చేయడంలో ప్రసిద్ధి చెందింది. 23 అంశాల ఆధారంగా ఆర్థిక, సామాజిక, లింగ సమానత్వంలో ప్రగతిని అంచనా వేసి ఫలితాలు వెల్లడించినట్టు సంస్థ ప్రకటించింది. ఆయా అంశాల్లో పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను వేర్వేరు విభాగాలుగా అధ్యయనం చేసి ర్యాంకులను ప్రకటించింది. పెద్ద రాష్ట్రాల్లో ఏపీదే అగ్రస్థానం 1 పెద్ద రాష్ట్రాల విభాగంలో సమానత్వం/సమ న్యాయం విషయంలో పీఏఐ ర్యాంకింగ్స్ 2019లో దేశంలో 9వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2020లో శరవేగంగా ప్రథమ స్థానంలోకి రావడాన్ని సంస్థ ప్రముఖంగా ప్రస్తావించింది. 2 రాష్ట్ర ప్రభుత్వం పేదలు, మహిళలకు పెద్దఎత్తున అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు శరవేగంగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైనట్టు నిపుణులు విశ్లేషించారు. 3 సమ న్యాయం విషయంలో 2020 ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ (0.652 పాయింట్లతో) కేరళ (0.629), ఛత్తీస్గఢ్ (0.260 పాయింట్లలో) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. 4 2019తో పోల్చితే మధ్యప్రదేశ్, ఒడిశా, హరియాణా, ఉత్తరప్రదేశ్ నెగిటివ్ సూచీలతో అట్టడుగు స్థానాలకు దిగజారాయి. ఇదే అంశంలో చిన్న రాష్ట్రాల విభాగంలో మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. 5 వృద్ధి విషయంలో కేరళ గతంలో ఉన్న మొదటి స్థానాన్ని నిలబెట్టుకోగా కర్ణాటక మూడో స్థానం నుంచి రెండో స్థానంలోకి ఎగబాకింది. వృద్ధి విషయంలో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వరుసగా మూడు, నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్నాయి. మూడు అంశాలు ప్రాతిపదికగా సమన్యాయం, వృద్ధి, సుస్థిర అభివృద్ధి అనే మూడు అంశాలను ప్రాతిపదికగా రాష్ట్రాలకు ఓవరాల్ ర్యాంకింగ్స్ ఇచ్చినట్టు పీఏసీ పేర్కొంది. -
స్వియాటెక్ @ 17
పారిస్: అందరి అంచనాలను తారుమారు చేసి ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ర్యాంకింగ్స్లోనూ దూసుకుపోయింది. ఫ్రెంచ్ ఓపెన్కు ముందు ప్రపంచ ర్యాంకింగ్స్లో 54వ స్థానంలో ఉన్న 19 ఏళ్ల స్వియాటెక్ ‘గ్రాండ్’ విజయంతో 37 స్థానాలు పురోగతి సాధించి కెరీర్ బెస్ట్ 17వ ర్యాంక్కు చేరుకుంది. రన్నరప్గా నిలిచిన సోఫియా కెనిన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని నాలుగో స్థానానికి చేరింది. యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా... సిమోనా హలెప్ రెండో ర్యాంక్లో (రొమేనియా), నయోమి ఒసాకా (జపాన్) మూడో ర్యాంక్లో ఉన్నారు. పురుషుల ర్యాంకింగ్స్లో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ జొకోవిచ్ (సెర్బియా) నంబర్వన్ స్థానంలోనే కొనసాగుతుండగా... విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్) రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన డీగో ష్వార్ట్జ్మన్ (అర్జెంటీనా) 14వ ర్యాంక్ నుంచి కెరీర్ బెస్ట్ 8వ ర్యాంక్కు చేరుకోగా... ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) తొలిసారి పదో ర్యాంక్ను అందుకున్నాడు. -
మెగ్ లానింగ్ మళ్లీ నంబర్వన్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. నాలుగు స్థానాలు ఎగబాకిన మెగ్ లానింగ్ 749 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్తో బుధవారం ముగిసిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో రాణించిన లానింగ్... సెంచరీతో సహా మొత్తం 163 పరుగులు చేసి సిరీస్ను ఆసీస్ కైవసం చేసుకోవడంలో ముఖ్యపాత్ర పోషించింది. నంబర్వన్ ర్యాంక్ను చేజిక్కించుకోవడం లానింగ్కు ఇది ఐదోసారి. అంతేకాకుండా ఆమె టాప్ ర్యాంకులో 902 రోజులను పూర్తి చేసుకోవడం విశేషం. లానింగ్ తొలిసారి 2014లో టాప్ ర్యాంక్కు చేరుకుంది. వెస్టిండీస్ ప్లేయర్ స్టెఫానీ టేలర్, అలీసా హీలీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (732 రేటింగ్ పాయింట్లు) నాలుగో స్థానంలో... సారథి మిథాలీ రాజ్ పదో స్థానంలో నిలిచారు. బౌలింగ్ విభాగంలో ఆసీస్ స్పిన్నర్ జెస్సికా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. భారత బౌలర్లలో జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్, శిఖా పాండే, దీప్తి శర్మలు వరుసగా ఐదు, ఆరు, ఏడు, పది స్థానాల్లో ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా తొలి స్థానంలో కొనసాగుతుంది. భారత్ రెండో స్థానంలో ఉంది. -
జాతీయ రహదార్లకు ర్యాంకింగ్లు
సాక్షి, అమరావతి: రహదారుల నాణ్యతను మెరుగుపరిచేందుకు రోడ్ల పనితీరు ఆడిట్ ఆధారంగా ర్యాంకింగ్ వ్యవస్థను ఎన్హెచ్ఏఐ ప్రవేశపెట్టనుంది. హైవేలపై ప్రయాణికులకు అందే సేవలపై, రోడ్డు నాణ్యత, రహదారి భద్రతలపై అభిప్రాయాలు సేకరించి ఆ మేరకు ర్యాంకింగ్లను నిర్ణయించనుంది. అక్టోబర్ నుంచి జాతీయ రహదార్ల ర్యాంకింగ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ర్యాంకింగ్లతో పాటు బీవోటీ (బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్ఫర్), హెచ్ఏఎం (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్), ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) ప్రాజెక్టుల కింద చేపట్టిన రోడ్లకు ప్రత్యేక ర్యాంకింగ్లను కేటాయిస్తారు. జాతీయ రహదార్లపై రోడ్ ఇంజనీరింగ్ లోపాల వల్ల కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ లోపాలపై సమగ్ర నివేదిక ఇచ్చేందుకు ఎన్హెచ్ఏఐ ఐఐటీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీల ఇంజినీరింగ్ విద్యార్థులు, ప్రొఫెసర్లు సర్వే చేసి రోడ్ ఇంజినీరింగ్ లోపాలపై నివేదిక ఇస్తారు. ఏపీలో మొత్తం 6,672 కి.మీ. మేర జాతీయ రహదార్ల నెట్వర్క్ ఉంది. 38 జాతీయ రహదార్ల ప్రాజెక్టులకు ర్యాంకింగ్లు ఇవ్వనున్నారు. ర్యాంకింగ్ల అంచనాకు ప్రామాణికం ఇదే.. ► హైవే సామర్థ్యం (45 శాతం), రోడ్ సేఫ్టీ (35 శాతం), యూజర్ సర్వీసెస్ (20 శాతం) ఈ మూడు విభాగాల్లో అంచనా వేస్తారు. ► వాహనం ఆపరేటింగ్ వేగం, యాక్సెస్ కంట్రోల్, టోల్ ప్లాజాల వద్ద తీసుకున్న సమయం, సేవలు, ప్రమాద రేటు తదితర పారామీటర్లను పరిగణనలోకి తీసుకుంటారు. ► ఈ అంచనా ప్రకారం ఎన్హెచ్ఏఐ ర్యాంకింగ్లను నిర్ణయిస్తుంది. ► ప్రతి జాతీయ రహదారి కారిడార్ పొందిన స్కోరు, మెరుగుపరుచుకునేందుకు ప్రయాణికుల అభిప్రాయాలను ఎన్హెచ్ఏఐ సేకరిస్తుంది. ► నాణ్యమైన రహదార్లను నిర్మించేందుకు ఈ ఆడిట్ అవసరమని ఎన్హెచ్ఏఐ పేర్కొంటుంది. -
విద్యలో ఉన్నతశ్రేణికి ఎలా?
మన ఉన్నత విద్యాసంస్థల బోధనా ప్రమాణాలెలా వున్నాయో, విద్యార్థులు తమ జ్ఞాన తృష్ణను తీర్చుకోవడానికి, తమ ప్రతిభాపాటవాలను మెరుగుపరచుకునేందుకు అవి ఎలా దోహదపడుతున్నాయో, పరిశోధనలకు ఆ విద్యాసంస్థలిచ్చే ప్రాధాన్యతలేమిటో తెలుసుకోవడానికి ఏటా ఆ సంస్థలు పొందే ర్యాంకులే ప్రమాణం. వాటి ఆధారంగానే విద్యార్థులు తమ తదుపరి గమ్యస్థానమేదో నిర్ణయించుకుంటారు. ఆ ఉన్నత విద్యాసంస్థలు సైతం తమను తాము సమీక్షించుకోవడానికి, లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి, మెరుగుపడటానికి ఈ జాబితా దోహదపడుతుంది. గురువారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ర్యాంకుల జాబితాను ప్రకటించడంలో వున్న పరమార్థం ఇదే. ఎప్పటిలాగే ఐఐటీలు ముందు వరసలో వున్నాయి. తొలి పది ర్యాంకుల్లో ఏడు ఆ సంస్థలవే. అత్యున్నత శ్రేణి విద్యాసంస్థగా మద్రాసు ఐఐటీ నిలిచింది. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) ద్వితీయ స్థానంలో వుంది. గత అయిదారేళ్లుగా ఆందోళనలతో హోరెత్తుతూ, మొన్న జనవరిలో చానెళ్ల సాక్షిగా గూండాల దాడులతో తల్లడిల్లిన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ) సైతం గతంలోవలే చదువుల్లో మెరిసింది. అది ఓవరాల్ కేటగిరిలో 8వ స్థానంలో, యూనివర్సిటీల కేటగిరీలో రెండో స్థానంలో వుంది. దేశవ్యాప్తంగా రగిలిన ఎన్నార్సీ, సీఏఏ వ్యతిరేక ఉద్యమాల తర్వాత ప్రముఖంగా వార్తల్లో నిలిచిన ఢిల్లీలోని జమియా మిలియా గత మూడేళ్లుగా వస్తున్న 12వ ర్యాంకు నుంచి ముందుకు కదిలి 10వ ర్యాంకులో నిలిచి ఔరా అనిపించుకుంది. వాస్తవానికి ఆ సంస్థ 2016నాటికి 83వ ర్యాంకులో వుండేదని గుర్తుంచుకుంటే... అక్కడి అధ్యాపకశ్రేణి దీక్షాదక్షతలు అర్ధమవుతాయి. విశ్వవిద్యాలయాల కేటగిరీలో హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆరో ర్యాంకులోవుంటే, ఇంజనీరింగ్ కేటగిరిలో హైదరాబాద్ ఐఐటీ ఎనిమిదో స్థానంలో వుంది. న్యాయ విశ్వవిద్యాలయాల్లో హైదరాబాద్ నల్సార్ది మూడో ర్యాంకు. ఒకప్పుడు మన పురాతన విద్యాకేంద్రాలు నలంద, తక్షశిల ప్రపంచానికి విజ్ఞాన కాంతులు వెదజల్లాయి. ఆ విశ్వవిద్యాలయాల్లో విద్వత్తును గడించడానికి పొరుగునున్న చైనా మొదలుకొని దూరతీరాల్లోని గ్రీస్ వరకూ ఎన్నో దేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. అయితే అలాంటి ఘనత క్రమేపీ కొడిగట్టడం మొదలైంది. ఏటా అంతర్జాతీయ స్థాయిలో వివిధ సంస్థలు ప్రకటించే ర్యాంకుల్లో మన ఉన్నతశ్రేణి విద్యా సంస్థలు ఎక్కడో వుంటున్నాయి. జాతీయ స్థాయిలో మెరిసే విద్యాసంస్థలు కూడా అంతర్జాతీయ పోటీలో చివరాఖరికి పోతున్నాయి. మూడు రోజుల క్రితం ప్రకటించిన క్యూఎస్ 2021 ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకుల్లో మన ఉన్నతశ్రేణి విద్యాసంస్థల తీరు ఆశాజనకం అనిపించదు. తొలి వంద విశ్వవిద్యాలయాల్లో మన దేశానికి చెందిన సంస్థ పేరు ఒక్కటీ లేదు. తొలి 200 ర్యాంకుల్లో మాత్రం బొంబాయి, ఢిల్లీ ఐఐటీలు, బెంగళూరు ఐఐఎస్సీ వున్నాయి. బొంబాయి ఐఐటీ 172(నిరుడు 152), ఢిల్లీ ఐఐటీ 193(నిరుడు 182), ఐఐఎస్సీ 185(నిరుడు 184) స్థానాల్లో వున్నాయి. ఈసారి మన దేశంలోని ఐఐటీల్లో మొదటి స్థానం పొందిన మద్రాసు ఐఐటీ క్యూఎస్లో 275వ స్థానంలో వుంది. మన విద్యాసంస్థలన్నీ గత జాబితాతో పోలిస్తే బాగా వెనకబడివున్నాయి. నిరుడు ప్రకటించిన జాబితాలోని 1,000 విద్యాసంస్థల్లో భారత సంస్థలు 25 వుండగా, ఈసారి అవి 21కే పరిమితమయ్యాయి. క్యూఎస్ ర్యాంకుల్ని విశ్వసించవద్దన్న ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ రాంగోపాల్రావు ప్రకటన సరైందే కావొచ్చు. ర్యాంకుల నిర్ణయానికి అంతర్జాతీయ సంస్థలు తీసుకునే కొలమానాలు సరైనవి కాకపోవచ్చు. కానీ మెరుగైన స్థాయి ర్యాంకులు రాకపోవడం, ఉన్న స్థితినుంచి మరింత కిందికి దిగజారడం అందరిలో అసంతృప్తి కలిగిస్తుందన్నది వాస్తవం. రాంగోపాల్రావు చెబుతున్నదాన్నిబట్టి ఈ ర్యాంకుల కోసం అధ్యాపకశ్రేణిలో, విద్యార్థుల్లో విదేశీయులెంత అనే అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. బోధన, పరిశోధన తదితర అంశాల్లో కూడా తమ ప్రమాణాలకు అనుగుణంగా లేకుంటే ఆమేరకు పాయింట్లు తగ్గిస్తారు. క్యూఎస్ తరహాలోనే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీహెచ్ఈ), షాంఘై జియావో టాంగ్ యూనివర్సిటీ తదితరాలు ప్రపంచశ్రేణి విద్యాసంస్థల జాబితాలను ప్రకటిస్తుంటాయి. దాదాపు అన్నిటా మనం తీసికట్టే. మన విద్యాసంస్థలకు ప్రపంచశ్రేణి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రెండేళ్లక్రితం మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్. గోపాలస్వామి నేతృత్వంలో 13మందితో సాధికార నిపుణుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ పబ్లిక్ రంగంలో పది, ప్రైవేటు రంగంలో పది ఉన్నత విద్యాసంస్థలను ఎంపిక చేస్తుందని, ఆ జాబితాలో చోటు లభించిన సంస్థలకు ఏటా రూ. 1,000 కోట్ల చొప్పున సమకూరుస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాబితాలో నిరుడు మద్రాస్ ఐఐటీ, ఖరగ్పూర్ ఐఐటీ, ఢిల్లీ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వున్నాయి. ఆ కార్యక్రమం అనుకున్నట్టే సాగుతున్నదో లేదో తెలియదుగానీ, అంతర్జాతీయ ర్యాంకుల్లో మన స్థితి మెరుగుపడటం మాట అటుంచి, మరింత కిందకు పోతోంది. ఘనతర విద్యాసంస్థలుగా మనం ప్రకటించుకున్నందుకైనా అవి అంతర్జాతీయంగా మెరుగైన తీరును ప్రదర్శిస్తే దేశంలోని ఇతర సంస్థలకు స్ఫూర్తిదాయకమవుతాయి. మార్గదర్శకంగా నిలుస్తాయి. అంతర్జాతీయ ర్యాంకులు, వాటి విశ్వసనీయత సంగతలావుంచి మన విద్యాసంస్థలు బోధనలో, పరిశోధనలో మరింత పదునెక్కాల్సిన అవసరం వుంది. ఆ సంస్థలకు తగిన వనరులను కల్పించని ప్రభుత్వాల వైఖరి మారితేనే ఇవి మెరుగుపడతాయన్నది కూడా అందరికీ తెలుసు. ర్యాంకులు వెల్లడైనప్పుడల్లా ఆయా విద్యాసంస్థలు మాత్రమే కాదు...పాలకులు సైతం తమ విధానాలు సమీక్షించుకోవాలి. సవరించుకోవాలి. అప్పుడు మాత్రమే విద్యారంగంలో గత వైభవం సాధ్యమవుతుంది. -
తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు ర్యాంకులు ఇలా..
సాక్షి, న్యూఢిల్లీః కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఉన్నత విద్యా సంస్థల ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు విద్యా సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఓవరాల్ కేటగిరీ ర్యాంకుల్లో(100లోపు) ఏడు విద్యా సంస్థలు, యూనివర్శిటీ కేటగిరీలో ఓవరాల్ కేటగిరీ ర్యాంకుల్లో వందలోపు ర్యాంకుల్లో 9 సంస్థలు నిలిచాయి. ఇంజినీరింగ్ కేటగిరీలో 200 ర్యాంకులు ప్రకటించగా.. 25 విద్యా సంస్థలు తెలుగు రాష్ట్రాలవే కావడం విశేషం. మేనేజ్మెంట్ కేటగిరీలో నాలుగు, ఫార్మసీ విద్యాసంస్థల కేటగిరీలో ఏడు చోటు సంపాదించుకోగా.. కళాశాలల కేటగిరీలో వందలోపు కేవలం రెండు కళాశాలలే చోటు దక్కించుకున్నాయి. వైద్య కళాశాలల కేటగిరీలో, న్యాయవిద్య, ఆర్కిటెక్చర్, దంత వైద్య విద్య కేటగిరీల్లో ఒక్కో కళాశాల చొప్పున ర్యాంకు దక్కించుకున్నాయి. ఓవరాల్ కేటగిరీ ర్యాంకులు ఇనిస్టిట్యూట్ స్కోర్ ర్యాంకు యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ 59.92 15 ఐఐటీ–హైదరాబాద్ 59.59 17 ఆంధ్రా యూనివర్శిటీ 51.24 36 ఎన్ఐటీ వరంగల్ 49.82 46 ఉస్మానియా యూనివర్శిటీ 48.54 53 ఎస్వీయూ 46.14 68 కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటీ 45.89 70 యూనివర్శిటీ కేటగిరీలో ఇనిస్టిట్యూట్ స్కోర్ ర్యాంకు యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ 61.70 6 ఆంధ్రా యూనివర్శిటీ 53.82 19 ఉస్మానియా యూనివర్శిటీ 51.15 29 ఎస్వీయూ 48.84 38 కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటీ 48.73 41 గాంధీ ఇని. ఆఫ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ 42.79 71 శ్రీసత్యసాయి ఇని. ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 42.08 75 ఐఐఐటీ, హైదరాబాద్ 41.69 78 విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్, రీసెర్చ్ 39.71 100 ఇంజినీరింగ్ కేటగిరీలో ఇనిస్టిట్యూట్ స్కోర్ ర్యాంకు ఐఐటీ–హైదరాబాద్ 66.44 8 ఎన్ఐటీ–వరంగల్ 57.76 19 ఐఐఐటీ–హైదరాబాద్ 49.45 43 జేఎన్టీయూ–హైదరాబాద్ 44.97 57 కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 44.70 58 కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్(ఏ), విశాఖపట్నం 41.36 69 యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ 38.43 88 యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజి, కాకినాడ 37.77 97 విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్, రీసెర్చ్ 36.28 118 సీబీఐటీ, హైదరాబాద్ 35.32 124 వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి 34.99 127 సీవీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 33.87 141 వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 33.75 143 ఎస్వీయూ 33.29 153 వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ 33.13 156 ఎస్ఆర్ ఇంజినీరింగ్, వరంగల్లు 32.95 160 ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ 32.26 170 గోకరాజు రంగరాజు, హైదరాబాద్ 32.24 172 అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ 31.74 180 శ్రీవిద్యానికేతన్ ఇంజినీరింగ్ 31.54 184 జేఎన్టీయూఏ, అనంతపురం 31.52 185 వాసవీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, హైదరాబాద్ 31.46 187 గాయత్రీ విద్యాపరిషత్, విశాఖ 31.38 188 జి.పుల్లారెడ్డి, కర్నూలు 31.35 190 బీవీఆర్ఐటీ 31.10 199 మేనేజ్మెంట్ కేటగిరీలో ఇనిస్టిట్యూట్ స్కోర్ ర్యాంకు ఇక్ఫాయ్ ఫౌండేషన్, హైదరాబాద్ 5 5.21 25 ఇనిస్టిట్యూట్ ఫర్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్, శ్రీసిటీ 46.16 53 ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ 44.38 61 కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 43.30 70 ఫార్మసీ కేటగిరీలో ఇనిస్టిట్యూట్ స్కోర్ ర్యాంకు నైపర్, హైదరాబాద్ 73.81 5 ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మా, విశాఖ 48.64 34 శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 44.52 42 చలపతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మా, గుంటూరు 41.31 54 రాఘవేంద్ర ఇని. ఆఫ్ ఫార్మా, అనంతపురం 41.14 55 ఆచార్య నాగార్జున వర్శిటీ కాలేజ్ 38.73 64 ఎస్వీ కాలే జ్ ఆఫ్ ఫార్మసీ, చిత్తూరు 37.72 69 కళాశాలల కేటగిరీలో ఇనిస్టిట్యూట్ స్కోర్ ర్యాంకు ఆంధ్ర లయోలా కాలేజ్, విజయవాడ 57.64 36 సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ విమెన్, హైదరాబాద్ 52.28 73 వైద్య కళాశాలల కేటగిరీలో ఇనిస్టిట్యూట్ స్కోర్ ర్యాంకు శ్రీవెంకటేశ్వర ఇని. ఆఫ్ మెడికల్ సైన్సైస్, తిరుపతి 45.93 38 న్యాయ విద్య కేటగిరీలో ఇనిస్టిట్యూట్ స్కోర్ ర్యాంకు నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా 73.12 3 ఆర్కిటెక్చర్ కేటగిరీలో ఇనిస్టిట్యూట్ స్కోర్ ర్యాంకు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కి, విజయవాడ 59.63 9 దంత వైద్య విద్య కేటగిరీలో ఇనిస్టిట్యూట్ స్కోర్ ర్యాంకు ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్సైన్సెస్, సికింద్రాబాద్ 55.13 23 చదవండి : ఐఐటీ–మద్రాస్ నెంబర్ 1 -
శరత్ కమల్ @ 31
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) సమాఖ్య (ఐటీటీఎఫ్) తాజాగా విడుదల చేసిన పురుషుల టీటీ ర్యాంకింగ్స్లో భారత వెటరన్ ఆచంట శరత్ కమల్ ఏడు స్థానాలు ఎగబాకి 31వ స్థానంలో నిలిచాడు. దాంతో భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంకు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 10 సంవత్సరాల తన ఐటీటీఎఫ్ టైటిల్ నిరీక్షణకు గత నెలలో తెరదించుతూ ఒమన్ ఓపెన్లో శరత్ విజేతగా నిలిచాడు. దాంతో అతని ర్యాంకింగ్ మెరుగుపడింది. భారత్కే చెందిన సత్యన్ 32వ ర్యాంకులో ఉన్నాడు. హర్మీత్ దేశాయ్ (72), ఆంటోని అమల్రాజ్ (100), మానవ్ ఠక్కర్ (139) స్థానాల్లో నిలిచారు. ఇక మహిళల విభాగంలో మనికా బాత్రా 63వ స్థానంలో ఉండగా... సుతీర్థ ముఖర్జీ 95వ స్థానంలో నిలిచింది. -
పాస్పోర్ట్ జాబితాలో దేశానికి 84వ స్థానం
సాక్షి, వెబ్డెస్క్ : ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్పోర్ట్ కలిగి ఉన్న జాబితాలో భారతదేశానికి 84 స్థానం దక్కినట్లు హెన్లీ అండ్ పార్టనర్స్ ప్రకటించిన రిపోర్టులో తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశంగా భారత్ 58 స్కోరును సాధించింది. దీంతో భారతీయులు వీసా, పాస్పోర్ట్లు లేకుండానే 58 దేశాలు వెళ్లడానికి అనుమతి ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. కాగా తజికిస్తాన్, మౌరిటానియాలతో కలిసి భారత్ స్థానాన్ని పంచుకొంది. ఇక అత్యంత శక్తిమంతమైన పాస్పోర్ట్ కలిగి ఉన్న టాప్ 10 దేశాలలో జపాన్ మొదటి స్థానంలో ఉండగా, తర్వాత వరుసగా సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియాలు ఉన్నాయి. ప్రపంచంలో అగ్రదేశాలుగా ఉన్న అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ ఈ జాబితాలో సంయుక్తంగా 8వ స్థానంలో నిలిచాయి. ఇక ఆప్ఘనిస్తాన్ అత్యంత చెత్త పాస్పోర్ట్ కలిగి ఉన్న దేశంగా ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. కాగా గతేడాదితో పోలిస్తే భారతదేశం రెండు స్థానాలను కోల్పోయి 58 వ స్థానంలో నిలిచింది. -
ఒకేసారి 88 స్థానాలు ఎగబాకాడు..
దుబాయ్: బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్లో మొత్తంగా ఎనిమిది వికెట్లు సాధించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్న టీమిండియా పేసర్ దీపక్ చహర్ తన ర్యాంక్ను మరింత మెరుగుపరుచుకున్నాడు. చివరి టీ20లో ఆరు వికెట్లు సాధించడంతో చహర్ ఒకేసారి 88 స్థానాలను ఎగబాకాడు. సోమవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ర్యాంకింగ్స్లో చహర్ 42వ స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్తో మూడో టీ20లో హ్యాట్రిక్ను కూడా సాధించి పొట్టి ఫార్మాట్లో ఈ ఫీట్ సాధించిన తొలి భారత బౌలర్గా వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఫలితంగా తన ర్యాంక్లో దూసుకుపోయాడు చహర్. ఇక అఫ్గానిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్ బౌలింగ్ విభాగంలో టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో న్యూజిలాండ్ మిచెల్ సాంత్నార్ కొనసాగుతున్నాడు.బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజామ్ టాప్ ర్యాంకులోనే ఉండగా, భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఏడో స్థానాన్ని కాపాడుకున్నాడు. కేఎల్ రాహుల్ ఒక స్థానం మెరుగుపరుచుకుని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్లో అఫ్గానిస్తాన్ క్రికెటర్ మహ్మద్ నబీ తొలిసారి నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ప్రస్తుతం క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం ప్రకటించడంతో అది నబీకి లాభించింది. -
నిర్భయ చట్టం అమల్లోకొచ్చినా.. భయమే!
మహిళలు సురక్షితంగా ఉన్నామని భావిస్తోన్న రాష్ట్రాల ర్యాంకింగ్లు... యావత్ ప్రపంచం సిగ్గుపడేలా ఢిల్లీ నడివీధుల్లో నిర్భయపై జరిగిన అత్యాచారానికి మరో నెలరోజుల్లో ఏడేళ్ళు నిండుతాయి. నిర్భయ ఉదంతం ఈ దేశంలో స్త్రీల భద్రత అంశాన్ని తెరపైకి తెచ్చింది. నిర్భయ ఘటనపై వెల్లువెత్తిన యువతరం ఉద్యమం నిర్భయ చట్టానికి ప్రాణం పోసింది. పసివారిపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ చిన్నారులపై అత్యాచారాల విషయంలో మరణదండన విధింపునకు దారితీసింది. అయితే ఏడేళ్ళ అనంతరం కూడా మహిళలు తమ రక్షణ విషయంలో సంతృప్తికరంగా లేరు. పాలనలో ప్రజల భాగస్వామ్యానికి సంబంధించిన ‘నేతా యాప్’ నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశంలో దాదాపు 80 శాతం మంది స్త్రీలు తమ రక్షణ కోసం ప్రభుత్వం చేయాల్సినంత చేయడంలేదని అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో వెల్లడైన అంశాలు మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో సంస్కరణల ఆవశ్యకతను, కఠినతరమైన చట్టాల అవసరాన్నీ నొక్కిచెపుతున్నాయని ఈ వేదిక వ్యవస్థాపకుడు ప్రథమ్ మిట్టల్ వ్యాఖ్యానించారు. నేతా యాప్ ఒక లక్ష మంది మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో 42 శాతం మంది తాము సురక్షితంగా లేమనీ, లేదా అత్యంత అభద్రతలో జీవిస్తున్నామనీ తెలిపారు. ప్రధానంగా హరియాణా, ఛత్తీస్గఢ్, అరుణాచల్ప్రదేశ్లలోని మహిళలు తాము ఎక్కువ అభద్రతకు లోనౌతున్నట్టు వెల్లడించారు. హిమాచల్ప్రదేశ్, త్రిపుర, కేరళలోని స్త్రీలు తమ పరిసరాల్లో తాము భద్రంగా ఉన్నట్లు వెల్లడించారు. దేశం మొత్తంమీద చూస్తే మెట్రోనగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు కనీస భద్రతలేని ప్రాంతమని సర్వేలో వెల్లడయ్యింది. సర్వేలో పాల్గొన్న 65 శాతం మంది మహిళలు కనీసం ఒక్క సారైనా తాము అభద్రతాభావ పరిస్థితులను ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. ఇతర మెట్రోనగరాలైన ముంబైలో ఇలాంటి రక్షణలేని పరిస్థితులను ఎదుర్కొన్న వారు 41 శాతం ఉంటే, కోల్కతాలో 50 శాతం, చెన్నైలో 38 శాతం మంది ఇలాంటి అభద్రతాభావంలో ఉన్నట్టు వెల్లడించారు. మహిళల భద్రతకు భరోసా ఇస్తోన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ తొలిస్థానంలోనూ, ఆ తరువాతి స్థానాలను త్రిపుర, కేరళ ఆక్రమించాయి. తాము సురక్షితంగా ఉన్నామని స్త్రీలు భావిస్తోన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాల్గవ స్థానంలో ఉంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో అతి తక్కువ మంది అంటే కేవలం 27 శాతం మంది మాత్రమే తాము సురక్షితంగా ఉన్నట్టు వెల్లడించారు. అయితే హిమాచల్ప్రదేశ్లో 61 శాతం మంది స్త్రీలు తాము అత్యంత సురక్షితంగా ఉన్నామని చెప్పడం విశేషం. అదేవిధంగా హరియాణా బాలబాలికల నిష్పత్తిలో కొంతమెరుగుపడినప్పటికీ పరువు హత్యలు, బాలికల శిశు హత్యల్లాంటి కొన్ని ప్రమాణాల్లో ఈ రాష్ట్రం అత్యంత వెనుకబడిఉన్నట్టు నేతా యాప్ సర్వే వెల్లడించింది. పాలనా వైఫల్యం... ఢిల్లీ ప్రభుత్వం రాజధాని నగరం మొత్తంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు 500 కోట్ల రూపాయలను (70.7 మిలియన్లు)ఖర్చు చేసింది. అయితే కేవలం సీసీటీవీలను ఏర్పాటు చేయడం ఒక్కటే సరిపోదని ఢిల్లీ మహిళల్లో 83 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. అత్యధికంగా హరియాణా మహిళలు (92 శాతం మంది) స్త్రీల రక్షణ విషయంలో తమ ప్రభుత్వ పాలన పట్ల అత్యంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. -
టాప్ 10 గ్లోబల్ సీఈఓల్లో మనోళ్లు..
న్యూయార్క్: ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అగ్రశేణి 10 కంపెనీల చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఈఓ)ల జాబితాలో.. ఏకంగా ముగ్గురు భారత సంతతికి చెందిన వారు స్థానం సంపాదించారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ రివ్యూ(హెచ్బీఆర్) రూపొందించిన ఈ ఏడాది టాప్–100 ప్రపంచ సీఈఓల్లో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ 6వ స్థానంలో నిలిచారు. ఆ తరువాత స్థానంలో మాస్టర్ కార్డ్ చీఫ్ అజయ్ బంగా ఉండడం విశేషం. కాగా.. తెలుగు తేజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 9వ ర్యాంకులో నిలిచారు. తొలి పది స్థానాల్లో ముగ్గురు భారత సంతతి వారు ఉండగా.. పూర్తి జాబితాలో డీబీఎస్ బ్యాంక్ పియూష్ గుప్తా 89వ స్థానంలో నిలిచి మొత్తం భారత సంతతి సంఖ్యను నాలుగుకు పెంచారు. 62వ స్థానంలో టిమ్కుక్ గ్లోబల్ టాప్ 100 జాబితాలో నైక్ సీఈఓ మార్క్ పార్కర్ (20), జేపీ మోర్గాన్ చీఫ్ జామీ డిమోన్ (23), లాక్హీడ్ మార్టిన్ సీఈఓ మారిలిన్ హ్యూసన్ (37), డిస్నీ సీఈఓ రాబర్ట్ (55), ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ (66), సాఫ్ట్బ్యాంక్ సీఈఓ మసయోషి సన్ (96) ర్యాంకుల్లో ఉన్నారు. అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ అగ్రస్థానంలో నిలిచారు. -
టాప్–10లో రోహిత్
దుబాయ్: హిట్మ్యాన్ రోహిత్ శర్మ టెస్టు బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్లో పదో స్థానానికి ఎగబాకాడు. దీంతో మూడు ఫార్మాట్లలోనూ టాప్–10 ర్యాంకుల్లో నిలిచిన మూడో భారత క్రికెటర్గా రోహిత్ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఈ ఓపెనర్ వన్డేల్లో రెండో స్థానంలో, టి20ల్లో ఏడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. కోహ్లికి గతం లో అన్ని ఫార్మాట్లలోనూ అగ్రస్థానంలో నిలిచిన ఘనత ఉండగా... మాజీ ఓపెనర్ గంభీర్ టెస్టు, టి20ల్లో టాప్ ర్యాంకులో, వన్డేల్లో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్కు ముందు రోహిత్ టెస్టు ర్యాంకు 44 కాగా... ఈ సిరీస్లో అతను అద్భుతంగా రాణించి 529 పరుగులు సాధించాడు. దీంతో అనూహ్యంగా టాప్–10లోకి దూసుకొచ్చాడు. టెస్టు బౌలర్ల జాబితాలో పేసర్లు షమీ 14వ, ఉమేశ్ యాదవ్ 24వ ర్యాంకుల్లో ఉన్నారు. -
‘స్వచ్ఛ దర్పణ్’లో ఆరు తెలంగాణ జిల్లాలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ దర్పన్ మూడో దశ సర్వేలో తెలంగాణలోని ఆరు జిల్లాలు మొదటి స్థానంలో నిలిచాయి. స్వచ్ఛ దర్పణ్ ఫేస్– 3 ర్యాంకింగ్ వివ రాలను కేంద్ర తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ శనివారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 700 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. అందులో 8 జిల్లాలకు మొదటి ర్యాంకు దక్కింది. వీటిలో రాష్ట్రంలోని వరంగల్ అర్బన్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలతో పాటు గుజరాత్లోని ద్వారక, హరియాణాలోని రేవరీ జిల్లాలకు జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు దక్కింది. స్వచ్ఛభారత్ అమలు తీరుపై అంచనాలకోసం కేంద్రం దశల వారీగా సర్వేలు నిర్వహిస్తోంది. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే ఫలితాల ఆధారంగా గరిష్టంగా వంద మార్కులు వేస్తారు. పూర్తి స్థాయి మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగం, నిర్వహణ, కమ్యూనిటీ సోక్ పిట్స్, కంపోస్టు పిట్స్, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలపై అవగాహన పెంచడం, జియో ట్యాగింగ్ పరిశీలన వంటి అంశాలపై దేశంలోని మొత్తం 700 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ సర్వే నిర్వహించింది. దేశంలోని ఎనిమిది జిల్లాలకు వందకు వంద మార్కులు వచ్చాయి. వీటిలో మన రాష్ట్రంలోని ఆరు జిల్లాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో గ్రామీణ కుటుంబాల సంఖ్య 42,33,614గా ఉంది. 2014 వరకు 11,56,286 కుటుంబాలకు మాత్రమే మరుగుదొడ్డి సౌకర్యం ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంది. ఇప్పుడు వంద శాతం లక్ష్యం పూర్తయ్యింది. పెరిగిన కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా కొత్త మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని కేంద్ర ప్రభుత్వ సర్వేలో నమోదైంది. మిగతా జిల్లాల్లో అంతంతే... ఈ జాతీయ స్థాయి ర్యాంకింగ్లలో 6 జిల్లాలు ప్రథమ స్థానంలో నిలవగా, మహబూబ్నగర్ 19, వనపర్తి జిల్లా 20 స్థానంతో సరిపెట్టుకున్నాయి. మిగతా జిల్లాల విషయానికొస్తే... ఖమ్మం–65, మేడ్చల్–75, జనగామ–86, గద్వాల–89, మంచిర్యాల–96, మెదక్–105, వరంగల్ రూరల్–108, సిద్దిపేట–143, నాగర్కర్నూల్–149, మిగతా జిల్లాలు 168 నుంచి 307 మధ్య ర్యాంకింగ్లు సాధించగా భూపాలపల్లి –530తో రాష్ట్రం నుంచి చివరిస్థానంలో నిలిచింది. అందరి కృషితోనే సాధ్యమైంది: ఎర్రబెల్లి ‘స్వచ్ఛదర్పణ్’లో మన రాష్ట్రం మంచి పనితీరు కనబరిచినట్లు కేంద్ర ప్రభుత్వ సర్వేతో స్పష్టమైంది. జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ఎనిమిది జిల్లాలు ఉంటే, వాటిలో తెలంగాణలోని ఆరు జిల్లాలు ఉండడం గర్వకారణం. సీఎం ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు వాటి వినియోగంపై అవగాహన కలి్పంచాం. స్వచ్ఛదర్పన్లో తాజా ఫలితాలకోసం పనిచేసిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు , ఎంపీడీవోలు, ఉపాధి హామీ సిబ్బంది, డీఆర్డీఏ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక అభినందనలు’అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. -
గ్లోబల్ టాప్ సీఈఓల్లో అంబానీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సీఈఓ వరల్డ్ మ్యాగజైన్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీల చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ (సీఈఓ) 2019 జాబితాను విడుదల చేసింది. 121 మందితో కూడిన ఈ జాబితాలో వాల్మార్ట్ సీఈఓ డగ్లస్ మెక్మిలన్ అగ్రస్థానంలో నిలిచారు. 10 మంది భారతీయులకూ ఈ జాబితాలో చోటు లభించింది. భారత్కు సంబంధించి ర్యాంకింగ్ విషయానికి వస్తే, ఆర్సిలార్ మిట్టల్ చీఫ్ లక్ష్మీ మిట్టల్ 3వ ర్యాంక్తో ముందు నిలిచారు. అయితే ఆయన కంపెనీ కేంద్రాన్ని లగ్జెంబర్గ్గా పేర్కొనడం జరిగింది. దీనితో 49వ ర్యాంక్తో ముకేశ్ అంబానీ దేశంలో తొలి స్థానాన్ని దక్కించుకున్నట్లయ్యింది. టాప్ 3గా లక్ష్మీ మిట్టల్: గ్లోబల్ జాబితాలో వాల్మార్ట్ సీఈఓ డగ్లస్ మెక్మిలన్ ముందు నిలవగా, రెండవ స్థానంలో రాయల్ డచ్ షెల్ గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెన్ వాన్ బెవుర్డెన్ నిలిచారు. మూడవ స్థానంలో ఆర్సిలర్ మిట్టల్ చైర్మన్ అండ్ సీఈఓ లక్ష్మీ మిట్టల్ ఉన్నారు. నాల్గవ ర్యాంక్ను సౌదీ ఆరామ్కో సీఈఓ అమిన్ హెచ్ నాసర్ సొంతం చేసుకున్నారు. బీపీ చీఫ్ బాబ్ డుబే ఐదవ స్థానాన్ని, ఎక్సాన్మొబిల్ సీఈఓ డారిన్ ఉడ్స్ ఆరవస్థానాన్ని, ఫోక్స్వ్యాగన్ సీఈఓ హెర్బర్ట్ డియాస్ ఏడవ స్థానాన్ని, టయాటా సీఈఓ అరియో టయోడా ఎనిమిదవ స్థానాన్ని పొందారు. 9,10 స్థానాలను వరుసగా యాపిల్ సీఈఓ టిమ్కుక్, బెర్క్షైర్ హాత్వే సీఓఈ వారెన్ బఫెట్ పొందారు. అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ 11వ స్థానాన్ని, యునైటెడ్హెల్త్గ్రూప్ సీఈఓ డేవిడ్ విచ్మన్ 12వ స్థానాన్ని, శాంసంగ్ సీఈఓ కిమ్ కి–నామ్ 13వ స్థానాన్ని దక్కించుకున్నారు. గర్వకారణం: ఓఎన్జీసీ, ఐఓసీ తమ సంస్థల సీఈఓలకు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో గుర్తింపు లభించడం గర్వకారణమని ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)లు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి. ప్రాతిపదిక ఇది...: సీఈఓలకు సంబంధించి సీఈఓ వరల్డ్ మ్యాగజైన్ గ్లోబల్ ర్యాకింగ్స్ ప్రతిష్టాత్మకమైనవి. 96 దేశాల్లో 1,200కిపైగా సీఈఓలను ఈ ర్యాంకింగ్స్కు పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. కంపెనీ వ్యాపార పనితీరు, సీఈఓ పూర్తి బాధ్యతల కాలంలో కంపెనీ సాధించిన ఫైనాన్షియల్ రిటర్న్స్ తుది ర్యాంకింగ్లో 60 శాతం వెయిటేజ్ని కలిగిఉంటాయి. పర్యావరణం, పాలనాతీరు, కంపెనీలో ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ షేర్లు, మార్కెట్ క్యాపిటలైజేషన్లో మార్పులు వంటి అంశాలు మిగిలిన 40 శాతం వెయిటేజీలో ఉన్నాయి. -
ఆ ర్యాంకింగ్స్లో కేరళ టాప్..!
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ వెల్లడించిన ఆరోగ్యకరమైన రాష్ట్రాల ర్యాంకింగ్లో కేరళ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వ సలహా సంస్థ అయిన నీతి ఆయోగ్ ప్రకటించిన రెండో రౌండ్ ఆరోగ్య సూచీలో కేరళ ప్రథమ స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మొత్తం ఆరోగ్యపరంగా అత్యంత నాసిరకమైన ప్రమాణాలతో ఉత్తరప్రదేశ్ చివరి స్థానానికి పరిమితమైంది. 23 ఆరోగ్య అంశాల ఆధారంగా పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనే మూడు భాగాలుగా విభజించి.. నీతి ఆయోగ్ ఈ ఆరోగ్య సూచీని రూపొందించింది. 2015-16 (ప్రాతిపదిక సంవత్సరం) 2017-18 (రిఫరెన్స్ ఇయర్) మధ్యకాలానికి ఈ సూచీని రూపొందించింది. ఆరోగ్య సౌకర్యాల కల్పనకు సంబంధించి వార్షిక పెరుగుదల విషయంలో జార్ఖండ్, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని, మొత్తంగా ఆరోగ్యరంగం పనితీరు ప్రకారం చూసుకుంటే.. కేరళ, పంజాబ్, తమిళనాడు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని ప్రకటించింది. ఇక, చిన్న రాష్ట్రాలలో వార్షికంగా ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచడంలో మిజోరాం మొదటి స్థానంలో ఉండగా, మణిపూర్, గోవా వార్షిక పనితీరు పరంగా అగ్రస్థానంలో ఉన్నాయి. ఫిబ్రవరి, 2018లో నీతి ఆయోగ్ మొదటిరౌండ్ ఆరోగ్య సూచీని ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014-15 నుంచి 2015-16 మధ్యకాలానికి మొదటిరౌండ్ సూచీని వెల్లడించింది. -
భారత్లో పత్రికా స్వేచ్ఛ దారుణం
లండన్: పత్రికా స్వేచ్ఛలో భారత్ తాజాగా మరో రెండు స్థానాలు దిగజారి 140వ ర్యాంకుకు పరిమితమైంది. పారిస్ కేంద్రంగా పనిచేసే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ 2019 ఏడాదికి పత్రికా స్వేచ్ఛ అంశంలో 180 దేశాలకు ర్యాంకులు కేటాయించింది. ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ – 2019’ పేరిట ఓ నివేదికను సంస్థ గురువారం విడుదల చేసింది. ఎన్నికల సమయం కావడంతో పాత్రికేయుల మీద అధికార బీజేపీ నేతల దాడులు పెరిగిపోయాయని సంస్థ ఈ నివేదికలో పేర్కొంది. భారత్లో గతేడాది జర్నలిస్టులపై జరిగిన హింసాత్మక దాడుల్లో ఆరుగురు చనిపోయారనీ, ఏడవ జర్నలిస్టు మృతి అంశంలోనూ అనేక అనుమానాలు ఉన్నాయంది. ‘భారత్లో పాత్రికేయులపై పోలీసులు, మావోయిస్టులు, నేర ముఠాలు, అవినీతి రాజకీయ నాయకులు హింసాత్మక దాడులకు పాల్పడటం, వారిని బెదిరించటం వంటివి చేస్తున్నారు. ఇలాంటి దాడుల వల్ల గతేడాది ఆరుగురు జర్నలిస్టులు చనిపోయారు’ అని నివేదిక తెలిపింది. ఆంగ్లేతర భాషల మీడియాకు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయంది. 2018లో భారత్కు 138వ ర్యాంకు దక్కగా తాజాగా 140వ స్థానానికి చేరింది. ఇక 2019 ఏడాదికి ప్రపంచ పత్రికా స్వేచ్ఛలో నార్వే మూడోసారి తొలి ర్యాంకు పొందింది. ఫిన్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. భారత్కు పొరుగు దేశాలైన పాకిస్తాన్ 142వ ర్యాంకు, బంగ్లాదేశ్ 150వ ర్యాంకు పొందాయి. సూచీ చిట్టచివరన తుర్క్మెనిస్తాన్ (180వ ర్యాంకు), ఉత్తర కొరియా (179), చైనా (177), వియత్నా (176) ఉన్నాయి. ఆఫ్రికా దేశాలైన ఇథియోపియా 110వ ర్యాంకును, గాంబియా 92వ ర్యాంకును పొందాయి. -
సోనియా, రాహుల్ అంతంతే!
న్యూఢిల్లీ: 16వ లోక్సభ కాలపరిమితి త్వరలో ముగిసిపోనుంది. ప్రస్తుతం వివిధ దశల్లో జరుగుతున్న ఎన్నికలు ముగిస్తే మరికొద్ది రోజుల్లోనే 17వ లోక్సభ కొలువుకానుంది. ఈ నేపథ్యంలో 16వ లోక్సభలో కష్టపడి పని చేసిందెవరు? కాలక్షేపం చేసిందెవరు? ఎవరు ఉత్తములు? అట్టడుగున ఉన్నదెవరు? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది ఇండియాటుడే. ఇందుకోసం ఇండియాటుడే ‘డేటా ఇంటెలిజెన్స్ యూనిట్’ కొన్ని ప్రామాణికాలను రూపొందించింది. అవి. వారు పార్లమెంటుకు హాజరైన రోజులు, అడిగిన ప్రశ్నల సంఖ్య, ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుల సంఖ్య, ఎంపీల్యాడ్స్ వినియోగం, వారిపై ఆయా నియోజకవర్గాల ప్రజల అభిప్రాయం అనే ఐదు అంశాలు. వీటి ప్రకారం ఎంపీల పనితీరుపై చేసిన విశ్లేషణలో కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. అందులో ప్రధానంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా చివరి స్థానాల్లో నిలవగా బీజేపీకి చెందిన బిహార్ బీజేపీ ఎంపీ జనార్దన్ సింగ్ సిగ్రివాల్ అన్ని పరామితుల్లోనూ అగ్రగామిగా నిలిచి మొదటి ర్యాంకు, ఏ ప్లస్ గ్రేడ్ పొందారు. టాప్ టెన్లో ఉన్న ప్రముఖుల్లో బీజేపీకి చెందిన మీనాక్షి లేఖి 7వ, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే 10వ ర్యాంకులు పొందారు. కాగా, ఇండియాటుడే ‘డేటా ఇంటెలిజెన్స్ యూనిట్’ మొత్తం 543 ఎన్నిౖMðన సభ్యుల్లో 416 మందిని మాత్రమే ర్యాంకింగ్స్లో లెక్కలోకి తీసుకుంది. 2014 మే 18వ తేదీన ఎన్నికైన రోజు నుంచి వారి పనితీరును పరిగణనలోకి తీసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ లోక్సభలో సమావేశాలకు 52 శాతం హాజరయ్యారు. అదేవిధంగా, ఎంపీల్యాడ్స్ కింద ఐదేళ్లలో కేటాయించిన రూ.25 కోట్లలో రూ.19.6 కోట్లు తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఖర్చుపెట్టారు. దీంతో రాహుల్కు 387వ ర్యాంకు దక్కగా రాహుల్ కంటే కొద్దిగా మెరుగ్గా 60 శాతం హాజరు శాతం ఉన్న సోనియాకు 381వ ర్యాంకులో ఉన్నారు. కాంగ్రెస్కు చెందిన 39 మంది ఎంపీల్లో 11 మందికి అత్యల్ప డీ, డీ ప్లస్ గ్రేడులు రాగా బీజేపీకి చెందిన 195 మంది ఎంపీల్లో 33 మందికి డీ, డీ ప్లస్ గ్రేడులు వచ్చాయి. బీజేపీకి చెందిన ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రతిపక్ష నేతలు పార్లమెంట్ హాజరు పట్టికలో సంతకాలు చేయనవసరం ఉండదు కాబట్టి, వారి హాజరు వివరాలు వెల్లడికాలేదు. పూర్తి స్థాయి సమాచారం లేనందున వారిని ర్యాంకుల ప్రక్రియ నుంచి మినహాయించింది. దీంతో రెండు ప్రధాన జాతీయ పార్టీల అగ్రనేతల పనితీరు అంచనా వేయలేదు. రాహుల్ గాంధీ తనదైన శైలిలో సభా చర్చలను కొన్ని సందర్భాల్లో ముందుండి నడిపారు. కానీ, ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలేవీ అడగలేదు. ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టలేదు. దీంతో ర్యాంకింగ్ ప్రక్రియలో ఆయన వెనుకబడ్డారని ఇండియా టుడే పేర్కొంది. చివరి స్థానాల్లో టీడీపీ ఎంపీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికై టీడీపీలో చేరిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి 416వ ర్యాంకుతో అట్టడుగున ఉండగా, బుట్టా రేణుక 337వ ర్యాంకు పొందారు. అలాగే, టీడీపీ ఎంపీలు మాగంటి వెంకటేశ్వరరావు 323వ ర్యాంకుతో డీప్లస్ గ్రేడ్, కేశినేని శ్రీనివాస్ 348వ ర్యాంకు డీప్లస్ గ్రేడ్, జేసీ దివాకర్రెడ్డి 401వ ర్యాంకు డీ గ్రేడ్ పొందారు. జనార్దన్ సింగ్ సిగ్రివాల్, ఎస్పీవై రెడ్డి, మీనాక్షి లేఖి, సుప్రియా సూలే -
అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ–మద్రాస్
న్యూఢిల్లీ: భారత్లోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఐఐటీ–మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర సాంకేతిక విద్యాసంస్థల పనితీరు ఆధారంగా రూపొందించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ జాబితాలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) రెండో స్థానంలో నిలవగా, ఐఐటీ–ఢిల్లీ మూడో స్థానం దక్కించుకుంది. ఈ ర్యాంకింగ్ ప్రక్రియలో 3,127 విద్యా సంస్థలు పాల్గొన్నాయి. విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్సీ–బెంగళూరు తొలిస్థానంలో నిలవగా, జేఎన్యూ, బీహెచ్యూ ఆతర్వాతి స్థానాల్లో నిలిచాయి. అలాగే కళాశాల విభాగంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని మిరండా కాలేజీ అగ్రస్థానం దక్కిచుకుంది. మరోవైపు అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలల జాబితాలోనూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) విద్యాసంస్థలు సత్తా చాటాయి. టాప్–10లో ఏకంగా 8 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇంజనీరింగ్ కళాశాలల జాబితాలో ఐఐటీ–మద్రాస్, ఐఐటీ–ఢిల్లీ, ఐఐటీ–ముంబై తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మేనేజ్మెంట్ విద్యాసంస్థల జాబితాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) తొలి 10 స్థానాల్లో ఆరింటిని దక్కించుకున్నాయి. వీటిలో ఐఐఎం–బెంగళూరు అగ్రస్థానంలో నిలవగా, ఐఐఎం–ఢిల్లీ, ఐఐఎం–ముంబై, ఐఐఎం–రూర్కీ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఉన్నతవిద్య విషయంలో అమ్మాయిల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటంపై రాష్ట్రపతి కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. -
సాయిప్రణీత్ @19
న్యూఢిల్లీ: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రన్నరప్గా నిలిచిన భారత ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్... ప్రపంచ ర్యాంకింగ్స్లో పురోగతి సాధించాడు. మంగళవారం విడుదలైన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్లో సాయిప్రణీత్ పురుషుల సింగిల్స్ విభాగంలో మూడు స్థానాలు ఎగబాకి 19వ స్థానానికి చేరుకున్నాడు. శ్రీకాంత్ ఏడో స్థానంలో, సమీర్ వర్మ 14వ స్థానంలో కొనసాగుతున్నారు. పురుషుల సింగిల్స్ టాప్–100లో భారత్ నుంచి పది మంది ఉండటం విశేషం. మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్లో సింధు, సైనా వరుసగా ఆరు, తొమ్మిది స్థానాల్లో కొనసాగుతున్నారు. -
స్వచ్ఛతలో సత్తుపల్లి ర్యాంకెంత..?
సాక్షి, సత్తుపల్లి: కేంద్ర ప్రభుత్వం సత్తుపల్లి స్వచ్ఛతకు పట్టం కట్టింది. బుధవారం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్–2019 ర్యాంకుల్లో సత్తుపల్లి మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో 65 ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రథమ స్థానం దక్కింది. జాతీయ స్థాయిలో 4,041 మున్సిపాలిటీతో పోటీపడి 4వేల మార్కులకు 2214.58 మార్కులు సాధించింది. అదేవిధంగా జాతీయస్థాయిలో ఇల్లెందు(389వ ర్యాంక్), మణుగూరు(953వ ర్యాంక్), కొత్తగూడెం(339వ ర్యాంక్), మధిర(501వ ర్యాంక్), పాల్వంచ(967వ ర్యాంక్) పొందాయి. జనవరిలో సర్వే జరిపిన కేంద్ర ప్రత్యేక బృందాలు.. స్వచ్ఛ సర్వేక్షన్లో ర్యాంకు కేటాయించేందుకు జనవరి మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కార్వే సంస్థ మున్సిపాలిటీలో సర్వే నిర్వహించింది. సెల్ఫోన్తో ప్రత్యేక యాప్ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో 200 మంది ప్రజల అభిప్రాయాలు సేకరించింది. రికార్డుల నిర్వహణ, పారిశుద్ధ్యం, బహిరంగ మల విసర్జన, తాగునీటి సరఫరా, తడి, పొడి చెత్తల సేకరణ, డంపింగ్ యార్డ్, వీధి దీపాల నిర్వహణ తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మున్సిపాలిటీ : సత్తుపల్లి విస్తీర్ణం : 18.90 చదరపు కిలోమీటర్లు జనాభా : 31,893 వార్డులు : 20 నివాసాలు : 7,202 పారిశుద్ధ్య సిబ్బంది : 115 మంది వాటర్ ట్యాంకర్లు : 2 పారిశుధ్య వాహనాలు : రిక్షాలు–12, ఆటోలు–2, డంపర్బిన్లు–20, డీసీఎం–1, ట్రాక్టర్లు–4 రోజువారీ సేకరించే చెత్త : 14 టన్నులు చాలా సంతోషంగా ఉంది దేశంలోనే సత్తుపల్లి మున్సిపాలిటీకి స్వచ్ఛతలో ఉత్తమ ర్యాంక్ రావటం చాలా సంతోషంగా ఉంది. వరంగల్ రీజియన్లో సత్తుపల్లి మున్సిపాలిటీకి స్వచ్ఛతలో మూడవ స్థానం లభించినందుకు గర్వంగా ఉంది. కౌన్సిలర్లు, ఉద్యోగులపై మరింత బాధ్యత పెరిగింది. ప్రధానంగా ప్రజలందరి భాగస్వామ్యంతోనే ఈ ర్యాంక్ను సాధించగలిగాం. – దొడ్డాకుల స్వాతి, చైర్పర్సన్, సత్తుపల్లి మున్సిపాలిటీ అందరి కృషితోనే సత్తుపల్లి మున్సిపాలిటీలోని అధికారులు, కార్మికులు, సిబ్బంది కృషి ఫలితంగానే ఉత్తమ ర్యాంక్ సాధించగలిగాం. ఇదే స్ఫూర్తితో మరింత సుందరంగా సత్తుపల్లిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. పట్టణాభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలి. – చీమా వెంకన్న, కమిషనర్, సత్తుపల్లి మున్సిపాలిటీ -
జులన్... నంబర్వన్
దుబాయ్: ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో ఎనిమిది వికెట్లు తీసి భారత మహిళల జట్టుకు సిరీస్ లభించడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా వెటరన్ పేసర్ జులన్ గోస్వామి... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని అలంకరించింది. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో జులన్ టాప్ ర్యాంక్ను అందుకుంది. గత ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో నిలిచిన 36 ఏళ్ల జులన్ ఈసారి రెండు స్థానాలు ఎగబాకి నంబర్వన్ స్థానానికి చేరుకుంది. బెంగాల్కు చెందిన జులన్ ఖాతాలో 730 ర్యాంకింగ్ పాయింట్లున్నాయి. 2016 ఫిబ్రవరిలో తొలిసారి వరల్డ్ నంబర్వన్ బౌలర్గా అవతరించిన జులన్ ఆ తర్వాత తన టాప్ ర్యాంక్ను కోల్పోయింది. మళ్లీ ఇంగ్లండ్తో తాజా వన్డే సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసి నంబర్వన్ స్థానాన్ని అందుకుంది. ఇప్పటివరకు 177 వన్డేలు ఆడిన జులన్ 218 వికెట్లు తీసింది. భారత్కే చెందిన మరో పేస్ బౌలర్ శిఖా పాండే 13వ ర్యాంక్ నుంచి ఐదో ర్యాంక్కు చేరుకుంది. దాంతో 2010 తర్వాత టాప్–5లో ఇద్దరు భారత పేస్ బౌలర్లు నిలువడం ఇదే ప్రథమం. 2010లో రుమేలీ ధర్, జులన్ టాప్–5లో నిలిచారు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత్కే చెందిన స్మృతి మంధాన 797 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతోంది. 2012 తర్వాత అటు బౌలింగ్ విభాగంలో... ఇటు బ్యాటింగ్ విభాగంలో భారత ప్లేయర్లు నంబర్వన్ స్థానంలో ఉండటం ఇదే తొలిసారి. 2012లో జులన్ గోస్వామి... మిథాలీ రాజ్ ఈ ఘనత సాధించారు. -
లక్ష్యం... టాప్ 20: శరత్
ముంబై: ఈ ఏడాది టాప్–20లోకి చేరడమే తన లక్ష్యమని భారత స్టార్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ అన్నాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకుల్లో 33వ స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాదిలో తన లక్ష్యాన్ని నెరవేర్చు కోవడంతోపాటు 2020 టోక్యో ఒలింపిక్స్కు అర్హత పొందేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్లో టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత్ తప్పకం పతకం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. గతేడాది ఆసియా క్రీడల టీటీలో సాధించిన రెండు కాంస్య పతకాలు తనలో ఆత్మవిశ్వాసం పెంపొందిం చాయని పేర్కొన్న కమల్... ఆ స్ఫూర్తితో ఒలింపిక్స్కు అర్హత పొందేందుకు ప్రయత్నిస్తు న్నట్లు వివరించాడు. ఆసియా క్రీడల్లో తీవ్ర పోటీ ఉంటుందని, అలాంటి చోటే రెండు పతకాలు నెగ్గగలిగామంటే ఇక ఒలింపిక్స్లోనూ భారత్కు పతకాలు దక్కే రోజు దగ్గరలోనే ఉందని అభిప్రాయపడ్డాడు. ఆసియా క్రీడల్లో శరత్ కమల్ నేతృత్వంలోని భారత జట్టు కాంస్యం నెగ్గి ఈ విభాగంలో దేశానికి 60 ఏళ్ల తర్వాత తొలి పతకాన్ని అందించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. శరత్తోపాటు మిక్స్డ్ డబుల్స్లో మనికా బాత్ర సైతం కాంస్యం నెగ్గి భారత్కు ఈ విభాగంలో ఒలింపిక్ పతకాలపై ఆశలు రేకెత్తించారు. -
సత్యన్ కొత్త చరిత్ర
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత్ తరఫున ఆల్టైమ్ బెస్ట్ ర్యాంక్ సాధించిన క్రీడాకారుడిగా జ్ఞానశేఖరన్ సత్యన్ చరిత్ర సృష్టించాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో సత్యన్ మూడు స్థానాలు ఎగబాకి 28వ ర్యాంక్ను అందుకున్నాడు. ఇప్పటివరకు భారత్ తరఫున అత్యుత్తమ ర్యాంక్ సాధించిన ప్లేయర్గా ఆచంట శరత్ కమల్ (30వ ర్యాంక్) పేరిట ఉన్న రికార్డును సత్యన్ సవరించాడు. గత ర్యాంకింగ్స్లో 30వ స్థానంలో ఉన్న శరత్ కమల్ మూడు స్థానాలు పడిపోయి 33వ ర్యాంక్కు చేరాడు. తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల సత్యన్ ఏడాది కాలంగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు. గతేడాది కామన్వెల్త్ గేమ్స్లో సత్యన్ టీమ్ విభాగంలో స్వర్ణం, మిక్స్డ్ డబుల్స్లో కాంస్యం, పురుషుల డబుల్స్లో రజతం సాధించాడు. ఆస్ట్రియా ఓపెన్ వరల్డ్ టూర్ ప్లాటినమ్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరాడు. మహిళల సింగిల్స్లో మనిక బత్రా టాప్–50లోకి స్థానం పొందిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. ఆమె పది స్థానాలు ఎగబాకి 47వ ర్యాంక్కు చేరుకుంది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్లో మనిక మహిళల సింగిల్స్, టీమ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించింది. -
కెరీర్ ఉత్తమ ర్యాంక్కు ప్రజ్నేశ్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ఏటీపీ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో ఏడు స్థానాలు మెరుగు పర్చుకున్నాడు. ఫలితంగా తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ 102కు చేరుకున్నాడు. ప్రజ్నేశ్ ఇటీవలే ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలిసారి మెయిన్ ‘డ్రా’లో ఆడాడు. పురుషుల విభాగంలో రామ్కుమార్ రామనాథన్ 133వ స్థానంలో నిలవగా, 13 స్థానాలు దిగజారిన యూకీ బాంబ్రీ 151వ ర్యాంక్లో నిలిచాడు. టాప్–200లో భారత్ తరఫు నుంచి ఈ ముగ్గురు ఉన్నారు. డబుల్స్ విభాగంలో మూడేసి స్థానాలు దిగజారి రోహన్ బోపన్న (37), దివిజ్ శరణ్ (40), జీవన్ నెడుంజెళియన్ (76)వ ర్యాంకుల్లో నిలవగా... లియాండర్ పేసర్ 78వ స్థానానికి పడిపోయాడు. అంకిత కెరీర్ బెస్ట్... సింగపూర్లో జరిగిన ఐటీఎఫ్ టోర్నీలో విజేతగా నిలిచిన అంకిత రైనా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో భారీ పురోగతి సాధించింది. ఏకంగా 35 స్థానాలు మెరుగుపర్చుకున్న అంకిత 168వ స్థానంలో నిలిచింది. ఆమె తర్వాత భారత్ నుంచి కర్మన్ కౌర్ తాండి (210)దే అత్యుత్తమ ర్యాంక్ కాగా... హైదరాబాద్ అమ్మాయి ప్రాంజల యడ్లపల్లి (290) టాప్–300లో నిలిచింది. -
టాప్ 200లో 49 భారతీయ వర్సిటీలు
లండన్: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) 2019 సంవత్సరానికి విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్లు ప్రకటించింది. 43 దేశాలకు చెందిన 450 విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్లు ప్రకటించగా భారత్కు చెందిన 49 వర్సిటీలు టాప్ 200లో స్థానం సంపాదించాయి. ర్యాంకింగ్స్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగుళూరు) 14వ స్థానం, ఐఐటీ (బొంబాయి) 27వ స్థానం, ఐఐటీ (రూర్కీ) 35వ స్థానం, ఐఐటీ (ఇండోర్) 61వ స్థానం, జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 64వ స్థానంలో నిలిచాయి. సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్సిటీ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అమృతా యూనివర్సిటీ ఈసారి టాప్ 150లో స్థానం సంపాదించాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పూణే, ఐఐటీ(హైదరాబాద్) తొలిసారిగా ర్యాంకింగ్లో చోటు సంపాదించాయి. 2018లో భారత్ నుంచి 42 వర్సిటీలు స్థానం సంపాదించగా ఈసారి అది 49కి పెరిగింది. టాప్లో చైనా వర్సిటీలు చైనాకు చెందిన నాలుగు వర్సిటీలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. జాబితాలో మొత్తం 72 వర్సిటీలతో చైనా అగ్రస్థానంలో ఉంది. భారత వర్సిటీల్లో విద్యాబోధన మెరుగుపడినా ప్రమాణాలతో పోలిస్తే వెనకబడే ఉన్నాయని టీహెచ్ఈ ఎడిటర్ ఎల్లీ బోత్వెల్ తెలిపారు. -
టాలెంట్లో తగ్గిన భారత్
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్కి చెందిన ఐఎండీ బిజినెస్ స్కూల్ వార్షిక టాలెంట్ ర్యాంకింగ్లో ఈసారి భారత్ రెండు స్థానాలు దిగజారి 53వ స్థానానికి పరిమితమైంది. అయిదోసారీ స్విట్జర్లాండ్ అగ్రస్థానం దక్కించుకుంది. 63 దేశాలతో ఐఎండీ బిజినెస్ స్కూల్ మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్ జాబితాలో టాప్–5 స్థానాల్లో డెన్మార్క్, నార్వే, ఆస్ట్రియా, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఆసియా దేశాల్లో మాత్రం సింగపూర్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గ్లోబల్ లిస్టులో మాత్రం సింగపూర్కు 13వ స్థానం దక్కింది. విద్యపై పెట్టే పెట్టుబడులు ఇతర సంపన్న దేశాల సగటుతో పోల్చినా తక్కువగా ఉండటం, నిపుణులైన విదేశీయులను ఆకర్షించడంలో సమస్యలు ఎదుర్కొంటుండటం తదితర అంశాల కారణంగా చైనా ర్యాంకింగ్ 39కి పరిమితమైంది. భారత్ విషయానికొస్తే.. టాలెంట్ పూల్లో సగటు స్థాయి కన్నా మెరుగ్గా ఉందని (సంసిద్ధత ప్రాతిపదికన 30వ స్థానం), మరోవైపు టాలెంట్ అభివృద్ధిపై పెట్టుబడులో మాత్రం వెనుకబడి ఉందని (63వ స్థానం) ఐఎండీ బిజినెస్ స్కూల్ పేర్కొంది. టాలెంట్ అభివృద్ధిపై పెట్టుబడులు, ఆకర్షణ, సంసిద్ధత అనే మూడు అంశాల ప్రాతిపదికన ర్యాంకులను నిర్ణయిస్తారు. -
కెరీర్ అత్యుత్తమ ర్యాంక్లో ప్రాంజల
న్యూఢిల్లీ: వరుసగా రెండు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య టోర్నమెంట్ టైటిల్స్ గెలిచిన హైదరాబాద్ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల ర్యాంకింగ్స్లో అద్భుత పురోగతి సాధించింది. సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్లో ప్రాంజల 60 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 280వ ర్యాంక్కు చేరుకుంది. అంకిత రైనా 195వ స్థానంలో నిలిచి భారత మహిళల సింగిల్స్ నంబర్వన్ ప్లేయర్గా ఉంది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో యూకీ బాంబ్రీ టాప్–100లో స్థానం కోల్పోయాడు. యూరోపియన్ ఓపెన్ టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన యూకీ బాంబ్రీ ఏడు స్థానాలు కోల్పోయి 107వ ర్యాంకులో నిలిచాడు. నింగ్బో చాలెంజర్ టోర్నీలో రాణించిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కెరీర్ బెస్ట్ 146వ ర్యాంక్ను అందుకున్నాడు. -
టాప్ ర్యాంక్లోనే కోహ్లి
దుబాయ్: ఐసీసీ టెస్టు బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి నంబర్వన్ స్థానంలోనే కొనసాగుతున్నాడు. సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో అతను తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నాడు. ఇతర భారత ఆటగాళ్లలో యువ సంచలనాలు పృథ్వీ షా 73 నుంచి 60వ ర్యాంక్కు... రిషభ్ పంత్ 85 నుంచి 62వ స్థానానికి ఎగబాకారు. బౌలర్ల జాబితాలో విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ కెరీర్లో తొలిసారి టాప్–10 (9వ)లోకి అడుగు పెట్ట గా, హైదరాబాద్ టెస్టులో పది వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్ 25వ స్థానంలో నిలిచాడు. టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. -
డీన్ జోన్స్ తర్వాత కోహ్లినే..
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ను టీమిండియా కోల్పోయినప్పటికీ కోహ్లి మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. తొలి వన్డేలో 75 పరుగులు చేసిన కోహ్లి.. రెండో వన్డే 45 పరుగులు సాధించాడు. ఇక మూడో వన్డేలో 71 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా రెండు రేటింగ్ పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన కెరీర్లోనే అత్యధికంగా 911 పాయింట్లను కోహ్లి సాధించాడు. 1991లో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ డీన్ జోన్స్ (918) తర్వాత అత్యధిక పాయింట్లు సాధించిన క్రికెటర్ కోహ్లినే కావడం విశేషం. ఇంగ్లండ్తో సిరీస్లో తొమ్మిది వికెట్లు పడగొట్టిన కుల్దీప్.. బౌలర్లలో 8 స్థానాలు ఎగబాకి కెరీర్లోనే అత్యుత్తమంగా ఆరో ర్యాంక్కు చేరుకున్నాడు. మరో స్పిన్నర్ చాహల్ 10వ ర్యాంక్లో కొనసాగుతుండగా.. బుమ్రా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంకులతో మెరిశారు..
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో శ్రీలంక బ్యాట్స్మన్ దిముత్ కరుణరత్నే, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జాసన్ హోల్డర్లు తమ కెరీర్ అత్యుత్తమ ర్యాంకులను సాధించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో అజేయంగా 158 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 60 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కరుణరత్నే 21 స్థానాలు ఎగబాకి 10వ స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్ జరిగిన రెండో టెస్టులో మొత్తంగా 11 వికెట్లు సాధించి విండీస్ గెలుపులో ముఖ్య భూమిక పోషించిన హోల్డర్ తొమ్మిది స్థానాలు పైకి ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. ఇక టెస్టు ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్లో హోల్డర్ తొలిసారి టాప్-5లో నిలిచాడు. ఇక జట్టు ర్యాంకింగ్స్లో వెస్టిండీస్ ఎనిమిదో స్థానాన్ని ఆక్రమించగా, బంగ్లాదేశ్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. -
స్వచ్ఛ ర్యాంకింగ్లో గ్రేటర్కు 27వ స్థానం
సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛ సర్వేక్షణ్–2018లో హైదరాబాద్ 27వ ర్యాంక్లో నిలిచింది. లక్ష జనాభాపైబడిన నగరాల్లో గ్రేటర్కు ఈ ర్యాంకు ప్రకటించారు. గతేడాది జనాభాతో సంబంధం లేకుండా 434 నగరాల్లో హైదరాబాద్ 22వ స్థానంలో నిలవగా, ఈసారి లక్ష జనాభా మించిన 500 నగరాలతో పోటీపడి 27వ స్థానంలో నిలిచింది. గతం కంటే ఈసారి మరింత ఉన్నత ర్యాంక్ను సాధించేందుకు ఎంతో కృషి చేసి, దేశంలోనే ఘనవ్యర్థాల నిర్వహణలో ఉత్తమ రాజధానిగా అగ్రస్థానంలో నిలిచిన హైదరాబాద్.. స్వచ్ఛ ర్యాంకింగ్ల్లో మాత్రం పడిపోయింది. అయితే ఇతర మెట్రో నగరాలైన బెంగళూరు, కోల్కత్తా, చెన్నై కంటే ముందంజలోనే ఉండడం గమనార్హం. గత సంవత్సరం 29వ స్థానంలో నిలిచిన గ్రేటర్ ముంబై ఈసారి 18వ స్థానంలో నిలిచి, హైదరాబాద్ కంటే ముందుంది. తెలంగాణలోని ఇతర కార్పొరేషన్లు, మునిసిపాలిటీల కంటే జీహెచ్ఎంసీ ముందంజలో నిలిచింది. గతంలో చిన్న పట్టణాలు, పెద్ద నగరాలు అన్నింటికీ కలిపి స్వచ్ఛ ర్యాంకులు ప్రకటించగా, ఈసారి లక్ష జనాభా మించిన నగరాలకు ప్రత్యేకంగా ర్యాంకులు ప్రకటించింది. స్వచ్ఛ కార్యక్రమాల అమలులో జీహెచ్ఎంసీ ముందున్నా.. ప్రజల ఫీడ్బ్యాక్లో మార్కులు తగ్గినందున ఓవరాల్ ర్యాంక్ తగ్గింది. దీంతో ఈ సంవత్సరం ప్రజలను మరింత ఎక్కువగా భాగస్వాములను చేసేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రజాస్పందన తగ్గినందునే.. ప్రస్తుత 2018 స్వచ్ఛ సర్వేక్షణ్లో మొత్తం మూడు విభాగాలకు కలిపి 4,000 మార్కులకు నిర్వహించిన సర్వేలో జీహెచ్ఎంసీకి 3,083 మార్కులు వచ్చాయి. వీటిలో సేవల ప్రగతికి 1400 మార్కులకు 973 లభించగా, స్వచ్ఛతకు నగరవాసుల స్పందనకు కేటాయించిన 1400 మార్కుల్లో 942 మాత్రమే వచ్చాయి. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతినిధులు స్వచ్ఛ కార్యక్రమాలపై నేరుగా జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో 1200 మార్కులకు 1177 వచ్చాయి. 2016లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్లో నగరానికి 2000 మార్కుల్లో 1355 (67.70శాతం), 2017లో 1605 (80శాతం) మార్కులు, ప్రస్తుత 2018లో 4000 మార్కులకు 3,083 మార్కులు (77శాతం) లభించాయి. రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్ల ర్యాంకులు.. గ్రేటర్ హైదరాబాద్కు 27వ స్థానం అనంతరం వరంగల్ కార్పొరేషన్కు 31వ స్థానం, సూర్యాపేట మున్సిపాలిటీ 45వ స్థానం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 73 స్థానంలోను నిలిచాయి. ఇప్పటి దాకా జరిగిన స్వచ్ఛ ర్యాంకింగ్లో పాల్గొన్న పట్టణాలు, గ్రేటర్ ర్యాంకు ఇలా.. సంవత్సరం పట్టణాలు జీహెచ్ఎంసీ 2015 476 275 2016 73 19 2017 434 22 2018 500 27 ఈసారి మొత్తం 4041 నగరాలో స్వచ్ఛ ర్యాంకింగ్లో పాల్గొనగా, లక్ష జనాభా దాటిన నగరాలకు ప్రత్యేకంగా ర్యాంకులు ఇచ్చారు. దేశంలోని వివిధ కార్పొరేషన్ల ర్యాంకుల తీరిదీ.. నగరం 2017 2018 హైదరాబాద్ 22 27 గ్రేటర్ ముంబై 29 18 బెంగళూర్ 210 216 చెన్నై 235 100 ప్రజల భాగస్వామ్యం పెంచుతాం స్వచ్ఛ కార్యక్రమాల అమల్లో మంచి మార్కులే వచ్చినప్పటికీ, కేవలం ప్రజా స్పందన మార్కులే తగ్గాయి. ఈ అనుభవంతో ఈ ఏడాది వారి భాగస్వామ్యం పెంచుతాం. గతేడాది ఐదు లక్షల మంది విద్యార్థులతో చైతన్య కార్యక్రమాలు నిర్వహించగా, ఈసారి పది లక్షల మందికి అవగాహన కల్పిస్తాం. అలాగే నగరంలోని నాలుగున్నర లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా భాగస్వాములను చేస్తాం. ఈ సంవత్సరం స్వచ్ఛ కార్యక్రమాలను జూన్ 5న పర్యావరణ దినోత్సవంనాడే ప్రారంభించాం. ఇందులో భాగంగా కాలనీలతో పాటు పాఠశాలలు, కార్యాలయాలు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లకు కూడా స్వచ్ఛ ర్యాంకింగ్ ఇవ్వాలని నిర్ణయించాం. – డా.బి.జనార్దన్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ -
చిత్త‘శుద్ధి’ తగ్గింది..!
సాక్షి, హైదరాబాద్ : ‘స్వచ్ఛ సర్వేక్షణ్–2018’ ర్యాంకుల్లో తెలం గాణ నగరాలు, పట్టణాలు నిరాశాజనక ప్రదర్శన కనబరిచాయి. లక్షకుపైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో టాప్–100లో రాష్ట్రం నుంచి ఈసారి మూడు నగరాలే చోటు దక్కించు కున్నాయి. గతేడాది జాతీయ స్థాయిలో 22వ స్థానంలో నిలిచిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ).. ఈ ఏడాది 27వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. సూర్యాపేట 45, కరీంనగర్ 73వ స్థానంలో నిలిచాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్, భోపాల్ నగరాలు తొలి రెండు ర్యాంకులు, కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ మూడో ర్యాంకును సాధించాయి. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలు వరుసగా 5, 6, 7 స్థానాల్లో నిలిచాయి. ఒంగోలు 83, చిత్తూరు 95వ స్థానాల్లో నిలిచాయి. తెలంగాణకు 7వ స్థానం స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకుల నివేదికను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ శనివారం వెల్లడించింది. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నగరాలకు ఇండోర్లో పురస్కారాలు ప్రదానం చేసింది. స్వచ్ఛతలో జాతీయ స్థాయిలో జార్ఖండ్, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తొలి ఐదు ర్యాంకుల సాధించగా.. తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. ఆయా రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాలు సాధించిన సగటు స్కోరు ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. పౌరుల అభిప్రాయం ప్రకారం పారిశుధ్యం మెరుగుదలలో లక్షకు పైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో జాతీయ స్థాయిలో 14వ స్థానంలో, లక్ష లోపు జనాభా ఉన్న నగరాల విభాగంలో 26వ స్థానంలో తెలంగాణ నిలిచింది. రాష్ట్రాల వారీగా లక్షకు పైగా జనాభా ఉన్న పురపాలికల విభాగంలో 7వ స్థానంలో, లక్ష లోపు జనాభా ఉన్న పురపాలికల విభాగంలో 6వ స్థానంలో నిలిచింది. దక్షిణాదిలో సిద్దిపేట టాప్.. ఘన వ్యర్థాల నిర్వహణలో జాతీయ స్థాయిలో ఉత్తమ నగరంగా నిలిచిన జీహెచ్ఎంసీ పురస్కారం అందుకుంది. ఉత్తర, దక్షిణ, ఈశాన్య, పశ్చిమ ప్రాంతాల వారీగా లక్ష లోపు జనాభా ఉన్న 4 పురపాలికలకు పురస్కారాలు అందించగా.. దక్షిణాది రాష్ట్రాల తరఫున 4 పురస్కారాల్లో మూడింటిని రాష్ట్రం కైవసం చేసుకుంది. దక్షిణాదిలో అత్యంత పరిశుభ్ర నగరంగా సిద్దిపేట, పౌరుల అభిప్రాయం ప్రకారం అత్యుత్తమ నగరంగా బోడుప్పల్, ‘నూతన ఒరవడి, ఉత్తమ విధానాల అమలు’లో పీర్జాదిగూడ పురపాలిక పురస్కారాన్ని అందుకుంది. రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి, మోయర్ బొంతు రామ్మోహన్ల నేతృత్వంలోని బృందం ఈ పురస్కారాలు అందుకుంది. రాష్ట్రం నుంచి రెండు పురపాలికలే.. జాతీయ స్థాయిలో లక్ష లోపు జనాభా ఉన్న టాప్–100 పురపాలికల్లో సిద్దిపేట రెండో ర్యాంకును కైవసం చేసుకోగా, భువనగిరి 49వ ర్యాంకును సాధించింది. ఈ విభాగంలో రాష్ట్రం నుంచి రెండు పురపాలికలకే స్థానం దక్కింది. మహారాష్ట్రలోని పంచ్గని తొలి స్థానం కైవసం చేసుకోగా, ఏపీ నుంచి ఒక్క పట్టణానికీ చోటు దక్కలేదు. దేశంలోని 61 కంటోన్మెంట్ బోర్డులకు ర్యాంకులకు కేటాయించగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు 46వ స్థానంలో నిలిచింది. జోనల్ ర్యాంకుల విభాగంలో దక్షిణాది ప్రాంతంలో సిద్దిపేట అగ్రస్థానంలో, భువనగిరి 3వ స్థానంలో నిలిచాయి. సిరిసిల్ల 5, పీర్జాదిగూడ 6, బోడుప్పల్ 8, షాద్నగర్ 12, కోరుట్ల 15, భైంసా 18వ ర్యాంకు సాధించాయి. జాతీయ, జోనల్ స్థాయిల్లో ర్యాంకులు దేశంలోని అన్ని పురపాలికలు, కంటోన్మెంట్ బోర్డుల్లో జనవరి 4 నుంచి మార్చి 10 వరకు స్వచ్ఛ సర్వేక్షన్–2018ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించింది. లక్షకు పైగా, లక్ష లోపు జనాభా ఉన్న నగరాలకు వేర్వేరుగా సర్వే జరిపింది. లక్షకు పైగా జనాభా ఉన్న నగరాలకు జాతీయ స్థాయిలో, లక్ష లోపు ఉన్న నగరాలకు జోన్ల వారీగా ర్యాంకులు ప్రకటించింది. 2017 జనవరి–డిసెంబర్ మధ్య పురపాలికలు సాధించిన పురోగతి ఆధారంగా ర్యాంకులు ప్రకటించింది. 4 అంశాల ఆధారంగా సర్వే నాలుగు ప్రధాన అంశాల ఆధారంగా 4,000 మార్కులకు సర్వే నిర్వహించారు. స్వచ్ఛ భారత్ కింద చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి పురపాలికల నుంచి సేకరించిన ప్రమాణ పత్రాల ఆధారంగా 1,400 మార్కులు కేటాయించారు. పత్రాల్లో, క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో తేడాలుంటే మార్కుల్లో కోత పెట్టారు. క్షేత్రస్థాయిలో పారిశుధ్య స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించి మరో 1,200 మార్కులు, పౌరులు అందించిన సమాచారం ఆధారంగా 1,000 మార్కులు, స్వచ్ఛత యాప్ డౌన్లోడ్ సంఖ్య, యాప్ ద్వారా సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలకు 400 మార్కులు ఇచ్చారు. -
టాప్–40 బిజినెస్ స్కూళ్లలో ఎల్పీయూ
జలంధర్: నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)ర్యాంకింగ్లలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మిట్టల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ దేశంలోని టాప్–40 బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా నిలిచింది. ఎల్పీయూ ఫార్మసీ డిపార్ట్మెంట్ 26వ స్థానంలో నిలిచింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ ర్యాంకులను ప్రకటించింది. పంజాబ్ యూనివర్సిటీ, ఐఐఎం రాంచీ, బిట్స్ లాంటి ఉన్నత విద్యా సంస్థలను అధిగమించి ఎల్పీయూ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ పంజాబ్ రీజియన్లో అగ్రస్థానం దక్కించుకుంది. ‘ఔట్రీచ్ అండ్ ఇంక్లూజివిటీ’ విభాగంలో అన్ని ఐఐఎంలను దాటుకుని తొలిస్థానంలో నిలిచింది. -
పడిపోయిన ఓయూ ర్యాంకు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర మానవ వనరుల శాఖ మంగళవారం ర్యాంకులను ప్రకటించింది. మొత్తం 9 విభాగాల్లో(ఓవరాల్, ఇంజనీరింగ్, వర్సిటీ, మేనేజ్మెంట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, మెడికల్, లా, ఆర్కిటెక్చర్) ఈ ర్యాంకులను వెల్లడించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ఇండియా ర్యాంకింగ్స్ 2018 పేరుతో వీటిని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 3,954 విద్యా సంస్థలను పరిశీలించిన అనంతరం ర్యాంకులను ప్రకటించింది. గతేడాది ఓవరాల్ కేటగిరీలో రాష్ట్రానికి చెందిన ఐదు విద్యా సంస్థలు టాప్–100లో ఉంటే.. ఈసారి నాలుగు విద్యా సంస్థలే ఆ అర్హత సాధించాయి. దేశంలో టాప్ ఉన్నత విద్యా సంస్థల్లో(ఓవరాల్గా) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) 11వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 14వ స్థానంతో సరిపెట్టుకున్న సెంట్రల్ వర్సిటీ ఈసారి తన స్థానాన్ని మెరుగుపరచుకుంది. ఇక హైదరాబాద్ ఐఐటీ, వరంగల్ ఎన్ఐటీలు తమ ప్రమాణాలను మెరుగుపరచుకుని గతేడాది కంటే మెరుగైన స్థానాలను దక్కించుకున్నాయి. అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం ర్యాంకు గతేడాది కంటే ఈసారి మరింతగా పడిపోయింది. గతేడాది 38వ ర్యాంకు తెచ్చుకున్న ఉస్మానియా ఈసారి 45వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. నల్సార్కు జాతీయ స్థాయిలో మూడో స్థానం ఉన్నత విద్యా సంస్థల ర్యాంకులను గతేడాది ఆరు కేటగిరీల్లోనే ప్రకటించిన కేంద్ర మానవ వనరుల శాఖ ఈసారి న్యాయ, మెడికల్, ఆర్కిటెక్చర్ విద్యా సంస్థలను కలుపుకుని తొమ్మిది కేటగిరీల్లో ర్యాంకులను ప్రకటించింది. ఇందులో న్యాయ విద్యా సంస్థల కేటగిరీలో హైదరాబాద్లోని నల్సార్కు జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు లభించింది. మెడికల్ కేటగిరీ టాప్–100లో రాష్ట్ర విద్యా సంస్థలు ఒక్కటీ లేవు. ఇక ఆర్కిటెక్చర్ కాలేజీల కేటగిరీలో హైదరాబాద్లోని జేఎన్ఏఎఫ్ఏయూ ఏడో ర్యాంకు సాధించింది. ఫార్మసీ కాలేజీల కేటగిరీలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కు ఆరో స్థానం లభించింది. ఇంజనీరింగ్ విద్యా సంస్థల కేటగిరీలో జేఎన్టీయూ స్థానం గణనీయంగా మెరుగుపడింది. గతేడాది 63వ ర్యాంకు దక్కించుకున్న జేఎన్టీయూ ఈసారి 42వ ర్యాంకును సాధించడం విశేషం. ఐదు అంశాల ప్రాతిపదికగా ర్యాంకులు.. ప్రధానంగా ఐదు అంశాల ప్రాతిపదికగా కేంద్రం ఈ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో టీచింగ్, లెర్నింగ్ రిసోర్సెస్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ అవుట్ కమ్స్, ఔట్రీచ్ అండ్ ఇన్క్లూజివిటీ, పర్సెప్షన్ ఆధారంగా 100 పాయింట్లకు లెక్కించి వచ్చిన పాయింట్ల ద్వారా ఈ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో ప్రధానంగా విద్యా సంస్థల్లో పీహెచ్డీ విద్యార్థులు, శాశ్వత అధ్యాపకులు, అధ్యాపక–విద్యార్థి నిష్పత్తి, సీనియర్ అధ్యాపకులు, బడ్జెట్.. దాని వినియోగం, పబ్లికేషన్స్, ప్రాజెక్టులు, ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్, పరీక్షల ఫలితాలు, ప్లేస్మెంట్స్, హయ్యర్ స్టడీస్, ఎంటర్ప్రెన్యూర్షిప్, టాప్ యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు చెందిన విద్యార్థుల శాతం, మహిళా విద్యార్థులు, పోటీతత్వం, పరిశోధనలు, వాటి ఫలితాలు తదితర అంశాల ఆధారంగా ర్యాంకులను ప్రకటించింది. డిగ్రీ కాలేజీల కేటగిరీలో ఒక్కటీ లేదు.. డిగ్రీ కాలేజీల కేటగిరీలో రాష్ట్రానికి చెందిన ఒక్క సంస్థకూ టాప్–100లో చోటు దక్కలేదు. 100కు పైబడిన ర్యాంకుల్లో మాత్రం పలు కాలేజీలకు స్థానం లభించింది. యూనివర్సిటీల కేటగిరీలో 101–150 ర్యాంకుల పరిధిలో కాకతీయ వర్సిటీ, ఇఫ్లూ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి, 151–200 ర్యాంకుల పరిధిలో నిజమాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీకి స్థానాలు దక్కాయి. టీం వర్క్తో మెరుగైన స్థానం: జేఎన్టీయూ ఈసారి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో జేఎన్టీయూకు గతేడాది కంటే మెరుగైన ర్యాంకు రావడం పట్ల యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వేణుగోపాల్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య హర్షం వ్యక్తం చేశారు. అధ్యాపకులు, సిబ్బంది టీం వర్క్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. సమష్టి కృషి ఫలితంగానే..: హెచ్సీయూ వీసీ మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేతుల మీదుగా ర్యాంకింగ్ సర్టిఫికెట్, మెమోంటోను హెచ్సీయూ వీసీ ప్రొఫెసర్ అప్పారావు అందుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఫ్యాకల్టీ, విద్యార్థులు, అధికారులు, నాన్టీచింగ్ స్టాఫ్, పూర్వ విద్యార్థుల సమష్టి కృషి ఫలితంగానే హెచ్సీయూ దేశంలోనే మంచి గుర్తింపును సాధించిందన్నారు. వరుసగా మూడేళ్ల పాటు ఐఐటీ హైదరాబాద్ దేశంలోని పది అత్యున్నత ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ఒకటిగా నిలవడంపై ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ యూబీ దేశాయ్ హర్షం వ్యక్తం చేశారు. పరిశోధన, బోధన, సంస్థ అభివృద్ధిలో విశిష్ట కృషి చేస్తున్న అధ్యాపక బృందానికే ఈ ఘనత దక్కుతుందన్నారు. -
'టీ 20 ర్యాంకింగ్స్లో తప్పిదం జరిగింది'
దుబాయ్: ఇటీవల టీ 20 ర్యాంకింగ్స్ విడుదల చేసే క్రమంలో ముందుగా రాత పూర్వక తప్పిదం జరిగినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వెల్లడించింది. టీ 20 ర్యాంకింగ్స్లో భాగంగా ఐసీసీ అధికారి ప్రతినిధి ఒకరు రాతపూర్వక తప్పిదం చేసినట్లు పేర్కొంది. గతవారం సదరు ఐసీసీ ప్రతినిధి టీ 20 ర్యాంకింగ్స్ గురించి క్రికెట్ డాట్ కామ్ ఏయూకి వివరాలు వెల్లడిస్తూ.. ఇంగ్లండ్, న్యూజిలాండ్తో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్లో ఆస్ట్రేలియా చివరి వరకూ ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఉంటే ఆ జట్టు కొత్తగా వరల్డ్ నంబర్ వన్గా అవతరిస్తుందని ప్రకటించారు. కాగా, ఇక్కడ ఆసీస్ ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీ సాధించినా రెండో స్థానానికే పరిమితమైంది. అయితే దీనిపై బుధవారం ఐసీసీ వివరణ ఇస్తూ.. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం పాకిస్తానే టాప్ ర్యాంకులో ఉన్నట్లు తెలిపింది. ఇక్కడ ఆసీస్ 125.65 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, పాకిస్తాన్ 125.84 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నట్లు పేర్కొంది. అయితే ఇక్కడ రెండు జట్లు దాదాపు 126 పాయింట్లు సాధించినప్పటికీ 0.19 తేడాతో పాకిస్తాన్ ప్రథమ స్థానంలో నిలిచిందని ఐసీసీ వెబ్సైట్లో వివరణ ఇచ్చింది. అదొక రాత పూర్వక తప్పిదంగా పేర్కొంది. -
అక్కడ చదివితే జాబ్ పక్కా..!
ఈ విద్యాసంస్థల్లో చదివితే జాబ్ పక్కా.. చదువు పూర్తి కాగానే ఉద్యోగం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుందని అంటోంది టైమ్స్ సర్వే.. ఈ మేరకు ఉద్యోగ కల్పనలో ముందున్న టాప్ టెన్ యూనివర్సిటీలకు ‘టైమ్స్ హైయర్ ఎడ్యూకేషన్ ఎంప్లయిబిలిటీ ర్యాంకింగ్స్’ను ప్రకంటించింది. ఈ ర్యాంకుల్లో అమెరికాలోని టాప్ యూనివర్సిటీలు ముందంజలో ఉన్నాయి. ఇక్కడి విద్యాసంస్థల్లో చదువుకుంటున్నవారిలో 80 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపింది. ఈ సర్వేలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. 2017 సంవత్సరంలో ప్రపంచంలోని ఏ కాలేజీ విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి అని సర్వే చేస్తే అమెరికాలోని కాలేజీలే అగ్ర స్థానాలలో నిలిచాయి. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు సైతం ఇక్కడ చదువుకున్న వారికే ఉద్యోగాలు ఇవ్వడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నాయని తేలింది. అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న టాప్-టెన్ విద్యాసంస్థల్లో అమెరికా కాలేజీలు మొదటి మూడు స్థానాల్లో ఉండటం విశేషం. మొదటి స్థానంలో కాలిఫోర్నియా ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిలిచింది. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అత్యుత్తమ విద్యాబోధన సాగడమే ఇందుకు కారణం అని సర్వే పేర్కొంది. రెండో స్థానంలో హార్వర్డ్ యూనివర్సిటీ, మూడో స్థానంలో కొలంబియా యూనివర్సిటీ నిలిచాయి. ఇక, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఐదో స్ధానంలో, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ ఎనిమిదో స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తొమ్మిదో స్థానంలో నిలిచాయి. టైమ్స్ హైయర్ ఎడ్యూకేషన్ ఎంప్లయిబిలిటీ.. టాప్టెన్ ర్యాంకులివే.. -
మళ్లీ టాప్కు చేరిన కివీస్
దుబాయ్:వెస్టిండీస్తో మూడు టీ 20ల సిరీస్ను 2-0తో గెలిచిన న్యూజిలాండ్ టాప్ ప్లేస్కు చేరుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)విడుదల చేసిన ర్యాంకింగ్స్లో కివీస్ 126 పాయింట్లతో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. బుధవారం జరిగిన చివరిదైన మూడో టీ 20లో న్యూజిలాండ్ 119 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఫలితంగా సిరీస్ ను కైవసం చేసుకున్న న్యూజిలాండ్ ఆరు పాయింట్లను ఖాతాలో వేసుకుని అగ్రస్థానాన్ని తిరిగి చేజిక్కింకుంది. గతేడాది నవంబర్లో భారత్ తో జరిగిన టీ 20 సిరీస్ను కివీస్ కోల్పోవడంతో పాకిస్తాన్ టాప్కు చేరింది. దాదాపు రెండు నెలల్లోనే మళ్లీ న్యూజిలాండ్ ప్రథమ స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్(124) రెండో స్థానానికి పరిమితం కాగా, భారత్ జట్టు(121) మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ వెస్టిండీస్ ఐదు పాయింట్లను కోల్పోయి ఐదో స్థానంలో ఉంది. మరొకవైపు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు వరుసగా ఆరు, ఏడు,ఎనిమిదో స్థానాల్లో నిలిచాయి. టీ 20 ర్యాంకింగ్స్లో అఫ్గానిస్తాన్ తొమ్మిదో స్థానంలో, బంగ్లాదేశ్ పదో స్థానంలో ఉన్నాయి. ఇదిలా ఉంచితే, న్యూజిలాండ్ టాప్ ప్లేస్ను నిలబెట్టుకోవాలంటే త్వరలో పాకిస్తాన్తో జరిగే టీ 20సిరీస్ను గెలవాల్సి ఉంది. న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య కేవలం రెండు పాయింట్ల మాత్రమే అంతరం ఉంది. దాంతో పాకిస్తాన్తో జరిగే సిరీస్ను కివీస్ 2-1తో గెలవాల్సి ఉంది. -
టాప్ ర్యాంకుపై ఆసక్తికర పోరు!
ఢాకా: ఇటీవల ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్ ను 4-1తో కైవసం చేసుకున్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా ర్యాంకింగ్స్ లో కూడా టాప్ కు చేరిన సంగతి తెలిసిందే. ఆసీస్ తో వన్డే సిరీస్ లో తిరుగులేని ఆధిక్యాన్ని కనబరిచిన టీమిండియా.. దక్షిణాఫ్రికాను వెనక్కునెట్టి ప్రథమ స్థానానికి చేరింది. అయితే టీమిండియా ర్యాంకును నిలబెట్టుకునే క్రమంలో మరొకసారి దక్షిణాఫ్రికా నుంచి ఆసక్తికర పోటీ ఎదురుకానుంది. ప్రస్తుతం విరాట్ సేన 120 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా 119 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కాగా, బంగ్లాదేశ్ తో మూడు వన్డేల సిరీస్ సిద్ధమవుతున్న సఫారీలు నంబర్ వన్ ర్యాంకుపై గురి పెట్టారు. బంగ్లాతో వన్డే సిరీస్ ను దక్షిణాఫ్రికా 3-0తో సాధించిన పక్షంలో 121 పాయింట్లతో టాప్ ర్యాంకుకు చేరుతుంది. ఈ సిరీస్ లో 2-0తో సఫారీలు ఆధిక్యంలోకి దూసుకెళితే డెసిమల్ పాయింట్ల తేడాలో భారత్ తన ర్యాంకును కోల్పోతుంది. కాగా, దక్షిణాఫ్రికా సిరీస్ ను 2-1 తో గెలిచిన పక్షంలో టీమిండియా తాజా ర్యాంకుకు ఎటువంటి ప్రమాదం ఉండదు. అయితే దక్షిణాఫ్రికా తన మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆఖరి వన్డేను అక్టోబర్ 22వ తేదీన బంగ్లాదేశ్ తో ఆడనుంది.అదే సమయంలో న్యూజిలాండ్ తో భారత్ తన తొలి వన్డే పోరుకు సిద్దమవుతుంది. ఇక్కడ కివీస్ తో తొలి వన్డేను భారత్ గెలవకుండా ఉన్న పక్షంలోనే సఫారీలు తమ ర్యాంకును కాపాడుకునే అవకాశం ఉంది. కివీస్ తో తొలి మ్యాచ్ ను భారత్ గెలిస్తే మాత్రం సఫారీలు టాప్ ర్యాంకును సాధించిన కొద్ది క్షణాల్లోనే దాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇటీవల జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను దక్షిణాఫ్రికా 2-0తో గెలిచింది. సఫారీలకు ఏమాత్రం పోటీ ఇవ్వలేని బంగ్లాదేశ్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఆదివారం నుంచి దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది. -
టాప్–20లో తొలిసారి మనోళ్లు ఐదుగురు
న్యూఢిల్లీ: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు గురువారం మరో అరుదైన ఘనత సాధించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో భారత్ నుంచి తొలిసారి ఐదుగురు క్రీడాకారులు టాప్–20లో నిలిచారు. గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో కిడాంబి శ్రీకాంత్ 9వ స్థానంలో, హెచ్ఎస్ ప్రణయ్ 15వ స్థానంలో, సాయిప్రణీత్ 17వ స్థానంలో, సమీర్ వర్మ 19వ స్థానంలో, అజయ్ జయరామ్ 20వ స్థానంలో ఉన్నారు. మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్లో పీవీ సింధు రెండో స్థానంలో, సైనా నెహ్వాల్ 12వ స్థానంలో కొనసాగుతున్నారు. గతవారం జపాన్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్లో సెమీఫైనల్కు చేరుకున్న సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 17వ ర్యాంక్కు చేరుకుంది. మహిళల డబుల్స్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 23వ ర్యాంక్ను నిలబెట్టుకుంది.