rs praveen kumar
-
దళిత పోలీసు అధికారులను వేధిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, అమరావతి: దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని నాడు చంద్రబాబు కులదురహంకారంతో మాట్లాడారని, ప్రస్తుతం ఆయన ప్రభుత్వం దళిత పోలీస్ అధికారులను వేధిస్తోందని, దళితులు ఆత్మన్యూనతకు గురి చేయాలనే కుట్రతో వ్యవహరిస్తోందని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఏపీలో దళిత పోలీస్ అధికారులను టీడీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తూ మనోవేదనకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్, మరో రిటైర్డ్ నాన్ క్యాడర్ ఎస్పీ విజయ్ పాల్ పట్ల చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన మంగళవారం విడుదల చేసిన వీడియో సందేశంలో విమర్శించారు. ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు తనను కస్టోడియల్ టార్చర్ చేశారనే అభియోగాలను గతంలో సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని అయినా సరే మూడున్నరేళ్ల తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రఘురామ పాత ఆరోపణలనే చేయడం..టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటనే దళితుల్లో మాల సామాజికవర్గానికి చెందిన పీవీ సునీల్ కుమార్, మాదిగ సామాజికవర్గానికిచెందిన విజయ్పాల్లపై కేసు నమోదు చేయడం దుర్మార్గమని విమర్శించారు. గుంటూరు జిల్లాలో నమోదు చేసిన ఆ కేసు దర్యాప్తు బాధ్యతను ప్రకాశం జిల్లా ఎస్పీకి అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. పీవీ సునీల్ కుమార్కు 9 నెలలుగా పోస్టింగు ఇవ్వకుండా వేధిస్తుండటం..విజయ్పాల్ను అక్రమంగా అరెస్ట్ చేసి 2 నెలలపాటు జైల్లో ఉంచడం దళిత అధికారుల పట్ల చంద్రబాబు ప్రభుత్వ అమానవీయ వైఖరికి నిదర్శనమన్నారు. -
నా గురించి మాట్లాడే అర్హత మంత్రికి లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొండా సురేఖ వ్యాఖ్యలపై తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేశారు.సభ్యత, సంస్కారం, మానవత్వం అంటే ఎంటో కాంగ్రెస్కు తెలియదని ధ్వజమెత్తారు. బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే వారికి తెలుసని మండిపడ్డారు. ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని సురేఖపై విమర్శలు గుప్పించారు. తన గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత మంత్రికి ఏ మాత్రం లేదని హెచ్చరించారు. కేటీఆర్ గురుకుల బాట అనగానే వెన్నులో చలి పుడుతోందా..? రేవంత్ రెడ్డి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. దమ్ముంటే మీరు గురుకులాల మీద బహిరంగ చర్చకు రండి. అంతే కానీ మత్తులో ఉన్న ఈ మతి స్థిమితం లేని మంత్రులను, భజంత్రీలను పంపించి నవ్వులపాలు కాకండి అని సీఎం రేవంత్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ సూచించారు.సభ్యత-సంస్కారం- మానవత్వం అంటే ఎంటో తెలియని మీకు, బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే తెలిసిన మీకు,ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన మీకు,నా గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదు, మంత్రి గారు. రేవంత్… pic.twitter.com/fZd4wh9G5s— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) November 29, 2024 -
‘ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం’
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాల్లో కుట్రల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని ఆరోపించారు మంత్రి కొండా సురేఖ. ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని అన్నారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని, తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని ఆరోపించారు. అన్ని హాస్టల్స్లో ప్రవీణ్ కుమార్ అనుచరులు ఉన్నారని, త్వరలోనే అన్ని విషషయాలు బయటకు వస్తాయని చెప్పారు.బాలిక మృతి బాధాకరం..ఈ మేరకు సచివాలయం మీడియా పాయింట్ వద్ద మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. హాస్టళ్లలోని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఒక విద్యార్థిని చనిపోయిందని, అది కూడా బాధకరమని అన్నారు. బాధిత విద్యార్థినికి ప్రత్యేక వైద్య సదుపాయం కల్పించినప్పటికీ దురదృష్టవశాత్తు చనిపోయిందని తెలిపారు. బాలిక మృతి విషయాన్ని బీఆర్ఎస్ తమ రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తోందని.. ఆమె మృతిపై రాజకీయాలు చేయడం తగదని సూచించారు.‘ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని ఒకప్పుడు మాఫియా నడిపారు. సైకో రావు అండ్ బీఆర్ఎస్ గ్రూప్ ప్రభుత్వంపై బట్టకాల్చి వేయాలని చూస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. హాస్టల్స్లో ఉండే విద్యార్థులను సొంత పిల్లల లెక్క ప్రభుత్వం చూడాలి. కానీ గత పదేళ్ళలో ఏనాడు అలా జరగలేదు.అమ్మాయి చనిపోతే బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఆదుకున్నారా? గత ప్రభుత్వం హయంలో కస్తూర్బా ఘటన, గురుకులల్లో ఘటనలు, రెండెకెల సంఖ్యలో ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగితే ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫుడ్ పాయిజన్, మూసీ, లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ ప్రమేయం ఉన్నట్లు అనుమానంగా ఉంది. మల్లన్న సాగర్ ముంపు ప్రజలకు గత ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. బాధితులు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు.అందుకే కేటీఆర్ జైలుకు వెళ్తా అంటున్నారుమహబూబాబాద్లో పసిపిల్లలు ఉన్న వాళ్లను సైతం గత ప్రభుత్వంలో జైల్లో పెట్టారు. పక్కా ప్రణాళికతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలాగ చేస్తున్నారు. ప్రభుత్వం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా నిఘా పెడుతుంది. అన్ని బయటకు వస్తాయి. కేటీఆర్ తప్పులు చేశారు అని ఆయనకు తెలుసు అందుకే జైలుకు వెళ్తా అని ముందే చెప్తున్నారు. కేటీఆర్ ఏనాడు ప్రజలను కలువలేదు..ఇప్పుడేమో స్వాతంత్ర సమర యోధుడు లెక్క మాట్లాడుతున్నారు.’ అని కొండా సురేఖ మండిపడ్డారు.కవితకు ప్రాధాన్యత ఇస్తున్న కేసీఆర్..కవిత జైల్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. ఆమె బయటకు రాగానే మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. కేసీఆర్ కవితకు ప్రాధాన్యత ఇస్తున్నారట. కేటీఆర్ను పట్టించుకోవడం లేదట. కేసీఆర్ కుటుంబంలో కవిత - హరీష్ రావు ఒక్కటి అయ్యారని చర్చ జరుగుతుంది. బాల్క సుమన్, గాధరి కిషర్ అప్పట్లో ఆర్ ప్రవీణ్ కుమార్పై ఆరోపణలు చేశారు. ఆయన అవినీతి పాల్పడినట్లు అప్పటి బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.కేటీఆరే కాదు కేసీఆర్ కూడా జైలుకే..జైలుకు పోవాలని కేటీఆర్కు ఉబలాటంగా ఉన్నట్లు ఉంది. సరైన ఆధారాలు దొరికినప్పుడు జైలుకు పంపుతాం. సమయం వచ్చినప్పుడు జైలుకు కచ్చితంగా పోతావు కేటీఆర్. ఆధారాలు రాగానే కవిత జైలుకు వెళ్ళింది. కేటీఆర్ కూడా వెళ్తాడు. కేటీఆర్ మాత్రమే కాదు కవిత - కేసీఆర్ కూడా జైలుకు వెళ్తారు. -
బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
-
భార్యలు ధర్నా చేస్తే భర్తల్ని సస్పెండ్ చేస్తారా?
సాక్షి,హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ పోలిసుల్ని మనుషులుగా చూస్తే.. సీఎం రేవంత్ రెడ్డి మర మనుషులుగా భావిస్తున్నారని మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణలో స్పెషల్ పోలీసులు నెలలో 26 రోజులు వరుసగా విధులు నిర్వహించాలి. అనంతరం, నాలుగు రోజులు మాత్రమే సెలవు తీసుకుని వెసులు బాటు ఉంది. దీంతో తమ భర్తలు కుటుంబానికి, పిల్లలికి దూరంగా ఉండాల్సి వస్తుందంటూ నల్గొండలో పోలీస్ కుటుంబాలు ఆందోళన బాటపట్టాయి. వారి ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం విధులు నిర్వహిస్తున్న పోలీసుల్ని సస్పెండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. నల్లగొండలో భార్యలు రోడ్డెక్కితే భర్తలను సస్పెండ్ చేయడం దారుణం. సస్పెండ్ చేసిన కానిస్టేబుల్స్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. పోలీసులే నిరసన చేయటమంటే దేశ భద్రతకు సంబంధించిన అంశంగా చూడాలి. భర్తలు ఇబ్బందులు పడ్తుంటే భార్యలు సమ్మె చేస్తే తప్పేంటి. పోలీసులే సమ్మె చేయటం దేశంలోనే తొలిసారి. 26రోజులు పొడవునా డ్యూటీ చేస్తే 4రోజులు సెలవు ఇస్తామనడం దారుణం. పాత పద్దతిలో 15రోజులు డ్యూటీ చేస్తే..4రోజులు సెలవులు ఇవ్వాలి. తెలంగాణ పోలీసుల్లో అశాంతి ఉంది. ఇది ప్రమాదకరం. తెలంగాణలో శాంతిభద్రతలు దారుణంగా పడిపోయాయి. హైదరాబాద్లో వృద్ద దంపతులను హత్య చేస్తే కనీసం సీసీ టీవీలు పనిచేయటం లేదు. హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా సమీక్ష చేశారా?.కేటీఆర్, హరీష్ రావు మీద ఎన్ని కేసులు పెట్టారనే దానిపై మాత్రమే రేవంత్ సమీక్ష చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలపై పెట్రోల్ పోయాలన్న మైనంపల్లిపై సుమోటోగా కేసు నమోదు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన మీద కాకుండా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులకే రేవంత్ సమయం కేటాయిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. -
సునీల్ పోస్టులో తప్పేముంది?.. ఏపీ సర్కార్పై ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ పీవీ సునీల్కుమార్పై ఏపీ ప్రభుత్వ దాడిని ఖండిస్తున్నానని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ట్వీట్ చేశారు. ఆయన ట్విట్టర్లో పెట్టిన పోస్టులో తప్పేముందంటూ ప్రశ్నించారు. సునీల్పై చంద్రబాబు ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని అనడం సర్వీసు రూల్ ఉల్లంఘన ఎట్లయితది? రాజ్యాంగం ఆర్టికల్ 19 మళ్లీ మళ్లీ చదవండి. అప్పుడయినా విషయం అర్థం అయితదేమో!’’ అంటూ ట్వీట్ చేశారు.సోదరులు, సాటి అధికారి పీవీ సునీల్ కుమార్ గారిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దాడిని పూర్తిగా ఖండిస్తున్న. ఆయన ట్విట్టర్లో పెట్టిన పోస్టులో తప్పేముంది? ‘మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని అనడం సర్వీసు రూలు ఉల్లంఘన ఎట్లయితది? రాజ్యాంగం ఆర్టికల్ 19 మళ్లీ మళ్లీ చదవండి. అప్పుడయినా విషయం అర్థం… pic.twitter.com/H8axZ8A8CX— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 13, 2024 కాగా, రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా హైకోర్టు, సుప్రీం కోర్టు మూడేళ్ల క్రితం తోసిపుచ్చిన ఆరోపణల ఆధారంగా కూటమి సర్కార్ తప్పుడు కేసు నమోదు చేసింది. 2021లో తనను సీఐడీ అధికారుల కస్టడీలో గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టారని.. హింసించారని నాటి ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వైద్య పరీక్షలు గతంలోనే నిర్ధారించాయి. ఆ ఆరోపణల ఆధారంగా రఘురామకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించగా, అదే ఆరోపణల ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశించేందుకు సుప్రీం కోర్టు సైతం తిరస్కరించింది. అయితే, చంద్రబాబు ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించేందుకు బరి తెగించింది.నాడు న్యాయస్థానాలు తోసిపుచ్చిన ఆరోపణలతోనే రఘురామరాజు మూడేళ్ల తరువాత మెయిల్లో ఫిర్యాదు చేయడం.. ఆ వెను వెంటనే ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు, నాటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిలతోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్పై కేసులు నమోదు చేయడం విస్మయపరుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ చర్య కక్ష సాధింపే కాదు.. కోర్టు ధిక్కారమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అరాచకానికి ఈ పరిణామాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఇదీ చదవండి: సుప్రీంకోర్టు వారించినా వినరా? -
PV సునీల్ కుమార్ పై ఏపీ ప్రభుత్వ చర్యలను తప్పు బట్టిన RS ప్రవీణ్ కుమార్
-
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం
-
రఘురామపై మాజీ ఐపీఎస్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన అక్రమ కేసుల వ్యవహారంపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు. డీజీపీ ర్యాంకులో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులపై, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదైందన్న వార్త తనను షాక్కు గురిచేసిందని అన్నారాయన. ఈ క్రమంలో రఘురామ వ్యవహారశైలిపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎంపీ, ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజును వేధించారనే ఆరోపణలపై మాజీ సీఎం వైఎస్ జగన్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్నిఆర్ఎస్సీ తన ట్వీట్లో తప్పుబట్టారు. ఈ అంశాన్ని అప్పట్లోనే కోర్టులు విచారించాయని.. అయితే అందులో ఏమీ బయటకు రాలేదని అభిప్రాయపడ్డారు. అధికారం మారడం తప్ప మూడేళ్లలో ఏం మారిందని.. మూడేళ్ల తర్వాత అకస్మాత్తుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. .. దురదృష్టవశాత్తూ నిజాయితీగల పోలీసులు ఈ దేశంలో ప్రతీకార రాజకీయాల్లో బాధితులుగా మారుతున్నారన్న ఆర్ఎస్పీ.. గోద్రా మారణహోమంలో సత్యం, న్యాయానికి అండగా నిలిచినందుకు గుజరాత్ కేడర్కు చెందిన ఐపీఎస్ సంజీవ్ భట్ ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు రఘురామకృష్ణరాజుపైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. అబద్ధాలడడం అలవాటుగా ఉన్న ఇదే రాజకీయ నాయకుడు(రఘురామను ఉద్దేశిస్తూ..).. 2021లో పార్లమెంటులో నాపై నిరాధార ఆరోపణలు చేశారు. పైగా పేదలకు విద్య అందించే విషయంలోనూ ఈ వ్యక్తి ఏనాడూ సానుకూలంగా లేడు. అలాంటిది ఆయన ఎలా మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారనేదీ ఆశ్చర్యంగా ఉంది అని ఆర్ఎస్పీ ట్వీట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర చోట్ల సీనియర్ పోలీస్ అధికారులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లను సైతం ట్యాగ్ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.Shocked to hear the news of FIR on senior IPS officers(DGP rank) of AP Cadre Mr PV Sunil Kumar and Mr PSR Anjaneyulu along with former CM of AP, @ysjagan. This matter pertained to the alleged custodial torture of former MP of YSRCP, RaghuRamaKrishnam Raju @ RRR in in AP in 2021.…— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) July 13, 2024 -
కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్లపై పరువు నష్టం దావా: మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ క్షమాపణ చెప్పాలని మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. వీరిద్దరిపై పరువు నష్టం దావా వేస్తాను. భూ తగదాల కారణంగా కొల్లాపూర్లో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు గురయ్యాడని జూపల్లి చెప్పుకొచ్చారు. కాగా, మంత్రి జూపల్లి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ నాకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై పరువు నష్టం దావా వేస్తాను. వీరిద్దరూ నన్ను ఏ చౌరస్తాను రమన్నా వస్తాను. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. శ్రీధర్ రెడ్డి హత్యను ఖండిస్తున్నాను. శ్రీధర్ రెడ్డి హత్య కేసులో పూర్తి వివరాలు తెలియాలి అంటూనే కేటీఆర్ను నాపై ఆరోపణలు చేస్తున్నాడు. శ్రీధర్ రెడ్డికి తన కుటుంబ సభ్యులు, పలువురితో భూ తగాదాలు ఉన్నాయి. శ్రీధర్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి. నేను, పొంగులేటి.. కేసీఆర్తో విభేదించి బయటకి వచ్చాక ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కేసీఆర్ను నియంత అన్న ఆర్ఎస్ ప్రవీణ్ ఇప్పుడు కేసీఆర్ పంచన చేరారు. ప్రవీణ్ కుమార్ ఆత్మగౌరవం అమ్ముకున్నారు. ఒకాయన ఐపీఎస్ ఆఫీసర్, ఒకాయన ఎన్ఆర్ఐ ఇద్దరూ కలిసి బట్టకాల్చి మీద వేస్తున్నారు. నన్ను, పొంగులేటిని కేసీఆర్ బర్తరఫ్ చేసినందుకు, ప్రజలు కేసీఆర్ను బర్తరఫ్ చేశారు. నాపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ క్షమాపణ చెప్పాలి. శ్రీధర్రెడ్డి గ్రామానికి వెళ్లి కేటీఆర్ అసలు నిజాలు తెలుసుకోవాలి. నిజనిర్ధారణ చేసి తప్పు నాదుంటే ఎలాంటి చర్యలైనా తీసుకోండి’ అంటూ కామెంట్స్ చేశారు. -
కేసీఆర్ను ఢీకొట్టలేక కవితను జైలుకు పంపారు
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయంగా మాజీ సీఎం కేసీఆర్ ను ఢీకొట్టలేక ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవితను బీజేపీ జైలుకు పంపిందని బీఆర్ఎస్ నేతలు ఆర్. ఎస్.ప్రవీణ్కుమార్, బాల్క సుమన్ ఆరోపించారు. మాట వినని, అడ్డుగా ఉన్న ప్రతిపక్ష నేతలపై ఐటీ, సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తూ అక్రమ కేసు లను బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వా మ్యం ప్రమాదంలో ఉందని, దయచేసి బీజేపీకి ఎవరూ ఓటు వేయొద్దంటూ అభ్యర్థించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితతో తిహార్ జైల్లో ఆర్.ఎస్.ప్రవీణ్, బాల్క సుమన్ అరగంట పాటు ములాఖత్ అయ్యారు.అనంతరం తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. కవిత చాలా ధైర్యంగా ఉన్నారని, నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా అనే నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టి, ఆమె తరపు న్యాయవాదికి నోటీసులివ్వకుండా సీబీఐ అరెస్టు చేసిందంటేనే ఈ కేసు ఎవరి చెప్పుచేతల్లో నడస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆర్థిక నేరాలకు, ఇతర దేశాల నుంచి నగదు లావాదేవీలకు పీఎంఎల్ఏ కేసు నమోదు చేస్తారని, అసలు ఏ ఆధారా లున్నాయని పీఎంఎల్ఏ నమోదు చేశారో చెప్పా లని వారు డిమాండ్ చేశారు. ప్రముఖుల పేర్లు చెప్పాలంటూ కవితపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారనే విషయం కవిత చెప్పినట్లు తెలిపారు.తాము చెప్పినట్లు వింటే బయటకు పంపిస్తాం లేదంటే ఎన్ని రోజులైనా జైల్లోనే ఉంచుతామనే సంకేతాలను బీజేపీ ఇస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం అంతా బీజేపీనే అని బాల్క సుమన్ ఆరోపించారు. లిక్కర్ స్కాంలో అరెస్టు అయ్యే వారి పేర్లను 2020లో బీజేపీ నేత మీడియా సమావేశం ద్వారా చెప్పడం.. ఆ తర్వాత నుంచి దేశవ్యాప్తంగా అరెస్టులు జరగడాన్ని మనమంతా చూస్తూనే ఉన్నామన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు, ఇంకా జరగాల్సిన ఎన్నికల్లో బీజేపీకి 220 ఎంపీ సీట్లు కూడా రావని సుమన్ జోస్యం చెప్పారు. -
‘తీహార్ జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారు’
న్యూఢిల్లీ, సాక్షి: మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ నేతలు పరామర్శించారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, బాల్క సుమన్లు శుక్రవారం ఉదయం ఆమెను కలిశారు. కుటుంబ సభ్యులు కాకుండా పార్టీ సంబంధిత నేతలు ఆమెతో ములాఖత్ కావడం ఇదే మొదటిసారి. ములాఖత్ అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కవిత చాలా దైర్యంగా ఉన్నారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఉన్నారు.రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆ ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తారు, అందులో ఉన్నవాళ్ళందరిని దోషులుగా చేరుస్తామంటే ఎలా?. రైతు చట్టాలు సహా అనేక పాలసీలు మోదీ తీసుకొచ్చారు. అవి ఎవరి ప్రయోజనాలకోసం తీసుకొచ్చారు?. కవిత దగ్గరనుంచి ఒక్క రూపాయి డబ్బు దొరకలేదు, మనీలాండరింగ్ యాక్ట్ ఎలా వర్తిస్తుంది?. లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవు అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తారు. ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. బీజేపీ లో చేరినవారిపై ఒకలా, చేరనివారిపై మరోలా సెలెక్టీవ్ గా ఈడీ వ్యవహరిస్తోంది.విపక్షాల గొంతు నొక్కేందుకు సీబీఐ, ఈడీ ని బీజేపీ వాడుకుంటోంది. బాల్క సుమన్ మాట్లాడుతూ.. కవిత చాలా దైర్యంగా ఉన్నారు. మానసికంగా బలంగా ఉన్నారు. విపక్ష నాయకులను అణిచివేయలనే అన్యాయంగా కవితను ఈకేసులో ఇరికించారు.లిక్కర్ స్కాం కేసులో మార్చి 15వ తేదీన ఈడీ హైదరాబాద్లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి రిమాండ్ మీద ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఇక.. ఈ కేసులో ఈడీ, సీబీఐ వేర్వేరుగా ఆమెను అరెస్ట్ చేయగా.. బెయిల్ కోసం ఆమె కూడా విడివిడిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రస్తుతం వాటిపై విచారణ జరుగుతోంది. అంతకు ముందు సుప్రీం కోర్టు సూచనలతో ఆమె ట్రయల్ కోర్టు(ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు)లోనే బెయిల్ పిటిషన్లు వేశారు. ఇది రాజకీయ కక్షతోనే జరిగిన అరెస్టుగా ఆమె వాదించారు. అయితే.. ఆమె బయటకు వస్తే కేసును ప్రభావితం చేస్తారని దర్యాప్తు సంస్థల వాదనలో కోర్టు ఏకీభవించింది. ఆమె బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. -
‘కాంగ్రెస్ గూండాల దాడి.. ఇదా రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం?’
సాక్షి, హైదరాబాద్: రాజకీయ ప్రత్యర్థులపై దాడి చేయటం అధికార దుర్వినియోగం చేయటమవుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్పై మండిపడ్డారు. నిన్న( మంగళవారం) అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ గూండాల దాడి ఘటనలో స్థానిక పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించటంపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఇది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘ప్రేమ దుకాణం’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘ప్రత్యర్థులపై నిర్మొహమాటంగా దాడి చేయడం, అధికార దుర్వినియోగం చేయటమే. పోలీసుల దుర్వినియోగం, దాడిలో భాగం కావడం సిగ్గుచేటు. ఇది రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం. తెలంగాణ డీజీపీ.. ఈ గూండాలపై కఠిన చర్యలు తీసుకోకుండా, పోలీసులాగా ప్రేక్షక పాత్ర వహిస్తే.. మేము మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించి న్యాయం జరిగేలా చూస్తాం’’ కేటీఆర్ ‘ఎక్స్’లో విమర్శించారు.Yahi Hai Kya Aapki “Mohabbat Ki Dukaan” @RahulGandhi ?Brazenly attacking opponents and abusing power. Shameful that police have become part of the abuse and attack @TelanganaDGP If you don’t act and book these goons and the spectator like cops, we will move the Human Rights… https://t.co/9VL4VjxD31— KTR (@KTRBRS) May 15, 2024 అచ్చంపేటలో కాంగ్రెస్ గూండాల దాడికి సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాడి జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ ట్యాగ్ చేశారు. ప్రవీణ్కుమార్ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్పై విధంగా స్పందించారు. -
కాంగ్రెస్ గూటికి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సోదరుడు
హైదరాబాద్, సాక్షి: అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు షాక్ తగలనుందని తెలుస్తోంది. మాజీ ఐపీఎస్, నాగర్కర్నూల్ లోక్సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోదరుడు ఆర్ఎస్ ప్రసన్న కుమార్ హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రెండు..మూడ్రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. బీఎస్పీ అధ్యక్ష పదవి వదిలేసి బీఆర్ఎస్లో ప్రవీణ్కుమార్ చేరిన కొద్ది రోజులకే నియోజకవర్గాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సొంత అన్నపైనే ప్రసన్నకుమార్ తిరుగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. తాను రాజకీయ ప్రత్యర్థిగా భావించే చల్లా వెంకట్రామిరెడ్డితో ఆర్ఎస్పీ భేటీ కావడంపై ప్రసన్న కుమార్ అలక బూనారు. ఈ క్రమంలోనే సొంత అన్నతో రాజకీయంగా విబేధించాలని సిద్ధపడినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే హస్తం నేతలతో సంప్రదింపులు జరిపిన ప్రసన్న కుమార్.. నేడో,రేపో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రసన్నకుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. -
నాగర్కర్నూల్ నుంచి ప్రవీణ్కుమార్..మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ శుక్రవారం ప్రకటించింది. మెదక్ నుంచి ఎమ్మెల్సీ పరిపాటి వెంకట్రామిరెడ్డికి, నాగర్కర్నూల్ నుంచి ఇటీవలే బీఎస్పీ నుంచి చేరిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు పార్టీ అధినేత కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీనితో మొత్తంగా బీఆర్ఎస్ 13 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది. మరో 4 సీట్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వంటేరు పేరు వినిపించినా.. మెదక్ లోక్సభ స్థానం నుంచి రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి పేరును బీఆర్ఎస్ దాదాపు నెల రోజుల క్రితమే ఖరారు చేసినా.. వివిధ కారణాలతో ప్రకటన జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే 2 రోజుల క్రితం కేసీఆర్ను కలిసిన వంటేరు ప్రతాప్రెడ్డి తనకు పోటీచేసే ఉద్దేశం లేదని చెప్పినట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జాయింట్ కలెక్టర్గా, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్గా వెంకట్రామిరెడ్డి పనిచేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి మెదక్ లోక్సభ నియోజకవర్గం పార్టీకి కంచుకోటగా ఉంది. 2014లో పార్టీ అధినేత కేసీఆర్ మెదక్ ఎంపీగా గెలిచినా రాష్ట్రంలో బీఆర్ఎస్ విజయం సాధించడంతో రాజీనామా చేసి సీఎం పదవి చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మెదక్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. ఆర్థిక బలం కలిగిన వెంకట్రామిరెడ్డి వైపు మొగ్గుచూపినట్టు సమాచారం. పెండింగ్లో మరో నాలుగు సీట్లు లోక్సభ ఎన్నికలకు సంబంధించి 11 సీట్లలో అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంతకుముందే ప్రకటించారు. తాజాగా ప్రకటించిన ఇద్దరి కలసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసిన స్థానాల సంఖ్య 13కు చేరింది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ సీట్లకుగాను ఇంకా నాలుగు సీట్లు హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, నల్లగొండ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ పేరు ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. మిగతా స్థానాలకు కసరత్తు కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. పెండింగ్ సీట్లకు రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని తెలిపాయి. 30వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయి సమావేశాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం మెదక్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులతో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు హరీశ్రావు, కొత్త ప్రభాకర్రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, ముఖ్య నేతలు వంటేరు ప్రతాప్రెడ్డి, ఎలక్షన్రెడ్డి, భూంరెడ్డి, వేలేటి రాధకృష్ణశర్మ తదితరులు దీనికి హాజరయ్యారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తిరుమలకు వెళ్లడంతో భేటీకి రాలేదు. ఈ సందర్భంగా ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు మెదక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నేతలను కేసీఆర్ ఆదేశించారు. ఆలోగా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని మండలాల వారీగా కార్యకర్తల సమావేశాలను పూర్తి చేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులకు సూచించారు. మెదక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో రెండు లేదా మూడు ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేందుకు షెడ్యూల్ తయారు చేయాలని మాజీ మంత్రి హరీశ్రావుకు సూచించారు. బీఆర్ఎస్లోనే కొనసాగుతా: వంటేరు ప్రతాప్రెడ్డి మెదక్ లోక్సభ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేసిన నేపథ్యంలో.. గజ్వేల్ నియోజకవర్గ నేత వంటేరు ప్రతాప్రెడ్డి బీఆర్ఎస్ను వీడతారనే ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తానని వంటేరు ప్రతాప్రెడ్డి తెలిపారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో పనిచేసిన ప్రతాప్రెడ్డి.. ఆ సమయంలో రేవంత్రెడ్డి, మైనంపల్లి హన్మంతరావులతో సన్నిహితంగా ఉండేవారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై 2014లో టీడీపీ తరఫున, 2018లో కాంగ్రెస్ తరఫున వంటేరు ప్రతాప్రెడ్డి పోటీ చేశారు. తర్వాత బీఆర్ఎస్లో చేరి అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు. నాకు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి: వెంకట్రామిరెడ్డి మర్కూక్ (గజ్వేల్): తనను మెదక్ అభ్య ర్థిగా ప్రకటించడం పట్ల కేసీఆర్, హరీశ్రావులకు వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఐఏఎస్ అధికారిగా ఏడున్నరేళ్లు ఈ జిల్లాలో పనిచేశానని, తనకు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ దీనిని గుర్తించి తనకు అవకాశం ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. -
అభ్యర్థుల ఖరారు పూర్తితో.. వ్యూహాలకు కసరత్తు!
సాక్షి, మహబూబ్నగర్: నాగర్కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనతో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ నియోజకవర్గాల ప్రధాన పార్టీల లోక్సభ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. విజయం కోసం ప్రధాన పార్టీలు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఎంపీ అభ్యర్థులు ఎవరో తేలడంతో స్థానికంగా సమీకరణాలు సైతం శరవేగంగా మారుతున్నాయి. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కొంతమంది నాయకులతో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. 100 రోజుల్లో తాము అమ లు చేసిన పతకాలు, అభివృద్ధి పనులు, చేపట్టబోయే పనుల గురించి ఓటర్లకు వివరించాలని భావిస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్ల ముందు ఎండగట్టాలని నిర్ణయించింది. బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ పథకాలపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటన పూర్తి కాగా ఇతర నేతలను రప్పించి సభలు, రోడ్షోలు నిర్వహించి ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని భావిస్తోంది. నాగర్కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రొఫైల్.. పేరు: రేపల్లే శివ ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులు: ప్రేమలత, సవారన్న పుట్టిన తేది: 23-11-1967 స్వస్థలం: అలంపూర్ విద్యార్హతలు: ఎంఏ(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) హార్వర్డ్ యూనివర్సిటీ, యూఎస్ఏ వృత్తి: ఐపీఎస్ అధికారి(1995 బ్యాచ్, గతేడాది ఉద్యోగానికి రాజీనామా), గురుకుల కార్యద ర్శితో పాటు ప్రభుత్వశాఖలో వివిధ హోదాలో పనిచేశారు. స్వేరోస్ సంస్థ స్థాపించి పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు. రాజకీయ అనుభవం: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ గత శాసనసభ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఇవి చదవండి: ‘పల్లా’కు మతిభ్రమించింది.. : సుంకెట అన్వేష్రెడ్డి -
బీఆర్ఎస్ అనూహ్య నిర్ణయం.. మెదక్ లోక్సభ బరిలో ఎమ్మెల్సీ
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శుక్రవారం(మార్చ్ 22) ఒక ప్రకటన విడుదల చేసింది. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి పి. వెంకట్రామిరెడ్డి పోటీ చేయనున్నారు. తాజాగా రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో రానున్న లోక్సభ ఎన్నికలకుగాను బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ ఎంపీ సీట్లకు గులాబీ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ఈ సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. కవిత అరెస్టు కక్ష సాధింపే.. బీఆర్ఎస్ ఎంపీలు -
మళ్లీ బీఆర్ఎస్లోకి క్యూ కట్టాల్సిందే..
గజ్వేల్/సాక్షి, హైదరాబాద్: అధికారం కోల్పోగానే పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వారి గురించి ఆలోచించబో మని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్పై ప్రజా వ్యతి రేకత పెరిగి, నాలుగేళ్ల తర్వాత తిరుగుబాటుగా మారి, బీఆర్ఎస్ వంద సీట్లతో మళ్లీ అధికారాన్ని చేపట్టడం ఖాయమని అన్నారు. ప్రస్తుతం పార్టీ మారిన నేతలే తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చేందుకు క్యూ కట్టాల్సిన పరిస్థితి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాంటి వాళ్లను చేర్చుకోవద్దని కొందరు సూచించగా స్పందించిన కేసీఆర్.. మీరంతా నాయకులుగా ఎదిగితే పార్టీ మారిన వ్యక్తులను తిరిగి చేర్చుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తన అనుచరులతో కలిసి సోమవారం రాత్రి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్హౌస్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. చంద్రబాబు రైతుల్ని ఇబ్బంది పెట్టారు ‘వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత ప్రారంభమైంది. నేను అకుంఠిత దీక్షతో మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చి ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నల్లా నీటిని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. కానీ ప్రస్తుతం మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో అర్థం కావడం లేదు. కరెంటు సరఫరా పరిస్థితి కూడా అలాగే ఉంది. నాటి ఉమ్మడి పాలనలో తెలంగాణపై కరెంటు సహా అన్ని రంగాల్లో వివక్ష కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రపంచ బ్యాంకు పిచ్చితో ఆర్థిక సంస్కరణల పేరిట రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేసే చర్యలకు పాల్పడ్డారు. చంద్రబాబుకు ఏమీ తెలియదు. అన్నీ తెలిసినట్లు నటించే వారు. విద్యుత్ కష్టాల నేపథ్యంలో చంద్రబాబును సైతం ఎదిరించా. తెలంగాణ ఉద్యమంలో నేను తిన్న తిట్లు ఎవరూ తినలేదు. నాపై దండకాలు రాసి పత్రికల్లో వేశారు. మరోవైపు రూ.5 వేల కోట్లు, కేంద్ర మంత్రి పదవి ఆఫర్ ఇచ్చి ఉద్యమం నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారు. అయినా ఏనాడూ తెలంగాణ ఉద్యమాన్ని వీడలేదు..’ అని కేసీఆర్ వెల్లడించారు. ఓటమి పార్టీకి మంచిదే.. ‘అగాథంలో ఉన్న తెలంగాణకు బీఆర్ఎస్ పాలనలో ధైర్యం వచ్చింది. ఇప్పుడిప్పుడే గాడిన పడిన ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి అధికారాన్ని అప్పగించారు. కానీ కొద్ది రోజుల్లోనే ప్రజలకు కాంగ్రెస్ పాలన అర్థమైంది. బీఆర్ఎస్ ఒక్కసారి ఓడిపోవాలని నేను కూడా భావించా. ఈ ఓటమి పార్టీకి మంచే చేస్తుంది. ఒక్కసారి ఓడితే నష్టమేమీలేదు. గాడిద వెంబడి పోతేనే కదా... గుర్రం విలువ తెలిసేది. దళితశక్తితో పాటు బహుజన శక్తి కలిసి నడవాలి దళితబంధు వల్ల ఓడిపోయామనే భావన ఎన్నికల ఫలితాల సమీక్ష తర్వాత బయటకు వచ్చింది. దళిత వర్గాలకు ఎలాంటి బ్యాంకు ష్యూరిటీలు లేకుండా రూ.10 లక్షల చొప్పున అందజేసి ఆ కుటుంబాల్లో వెలుగులు నింపడం తప్పా? దళిత సమాజం దీనిని సానుకూలంగా ఎందుకు తీసుకోలేకపోయిందో విశ్లేషించాల్సిన అవసరముంది. దళితశక్తితో పాటు బహుజన శక్తి కలిసి నడవాలి. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా సచివాలయానికి అంబేడ్కర్ పేరును పెట్టడమేగాకుండా భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం..’ అని కేసీఆర్ తెలిపారు. ప్రవీణ్కుమార్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తాం ‘ప్రవీణ్కుమార్ నిబద్ధత కలిగిన నాయకుడు. ఆయనను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా త్వరలోనే ప్రకటిస్తాం. భవిష్యత్లోనూ ప్రవీణ్కుమార్ ఉన్నత స్థానంలో ఉంటారు. ప్రవీణ్తో కలిసి దళిత శక్తిని ఏకం చేసేందుకు, బలహీన వర్గాలను ఏకతాటి మీదకు తెచేందుకు ఎజెండా తయారు చేయాల్సిన అవసరముంది. ఈ విధానం దేశానికే టార్చ్ బేరర్గా మారాలి..’ అని బీఆర్ఎస్ అధినేత పేర్కొన్నారు. అలాగైతే ప్రతిపక్ష పార్టీలో ఎందుకు చేరతా: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలంగాణ వాదం, బహుజన వాదం వేర్వేరు కాదని ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ చెప్పారు. వివక్షకు, అణిచివేతకు వ్యతిరేకంగా ఈ రెండు ఉద్యమాలు పుట్టుకొచ్చాయని తెలిపారు. తాను ప్యాకేజీ తీసుకుని బీఆర్ఎస్లో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్యాకేజీ తీసుకునే వ్యక్తినే అయితే ప్రతిపక్ష పార్టీలో ఎందుకు చేరతానని ప్రశ్నించారు. రేవంత్ బెదిరింపులు మానుకోండి ‘సీఎం రేవంత్రెడ్డి నన్ను పొగుడుతూనే సుతిమెత్తగా వార్నింగ్లు ఇస్తున్నారు. నేనూ పాలమూరు బిడ్డనే, నడిగడ్డ తిండి తిన్నవాడినే. మీ దారికి రాని వారికి బెదిరింపులు మానుకోండి. వార్నింగులు ఇచ్చి మీ హోదాను తగ్గించుకోవద్దు..’ అని ప్రవీణ్ కుమార్ సూచించారు. ఫామ్హౌస్కు వెళ్లేముందు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి చేపట్టాల్సిందిగా నన్ను సీఎం రేవంత్ ఆహ్వానిస్తే నేను తిరస్కరించిన మాట నిజమే. ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుని ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించా. అయితే నేను బీఆర్ఎస్లోకి వెళ్తే సమాధానం చెప్పాలని రేవంత్ అంటున్నారు. అయితే ఏ వేదిక మీద పనిచేయాలో చెప్పే స్వేఛ్చ తెలంగాణ ప్రజలకు లేదా. మీరు గేట్లు తెరిస్తే పిరికిపందలు, అసమర్థులు, స్వార్ధపరులు గొర్రెల మందలా వస్తున్నారు. కానీ నిజాయితీ కలిగిన నేను ఆ గొర్రెల మందలో ఒకడిని కాలేను. నేను ప్యాకేజీ తీసుకునే వాడినే అయితే రేవంత్ గేటు వద్ద ఉండే వాడిని. నేను దొంగ ఆస్తులు రక్షించుకునేందుకు వచ్చే పిరికిపందను కాను. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ కోసం వచ్చా’ అని ప్రవీణ్కుమార్ చెప్పారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారు ‘తరతరాల అణచివేతకు గురైన తెలంగాణకు విముక్తి కల్పించి వెలుగు వైపు నడిపించింది కేసీఆర్. ఆయన దురదృష్టవశాత్తూ అధికారంలో లేకున్నా ప్రజల గుండెల్లో ఉన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు బహుజన వాదులు కేసీఆర్ వెంట నడవాలని అనుకుంటున్నారు..’ అని ప్రవీణ్కుమార్ తెలిపారు. చిన్నారికి శ్రీయా ఫూలేగా నామకరణం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకురాలు అకినేపల్లి శిరీష–ప్రవీణ్ దంపతుల ద్వితీయ కుమార్తెకు శ్రీయా ఫూలేగా కేసీఆర్ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
సాక్షి, హైదరాబాద్: బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఎర్రవల్లిలో ఉన్న ఫామ్హౌస్లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్లో చేరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి కేసీఅర్ పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు.. తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. గజ్వేల్లోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో తెలంగాణ విశాల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్లో చేరుతున్నానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే వెళ్లిన గొర్రెల్లాగా వచ్చిన వ్యక్తిని కాదని ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గజ్వేల్లోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘నిజాయితీకి కట్టుబడి ఉన్నా. ఓ వైపు మంచివాడు అంటూ నన్ను రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. స్వార్దం కోసం ఎన్ని కోట్లు తీసుకొని వెళ్తున్నావు అంటూ సోషల్ మీడియాలో అడుగుతున్నారు.డబ్బు కోసం ఆశపడిన వాడిని అయితే కాంగ్రెస్లో చేరుతా. బీఆర్ఎస్ కాదు. టీఎస్పీఎస్సీ చైర్మర్ ఆఫర్ ఇస్తే.. తిరస్కరించా. నా గుండెల్లో ఎప్పుడూ బహుజన వాదం ఉంటుంది. నేనెప్పుడూ బహుజనులు సంక్షేమం కోసమే పోరాడుతా. రేవంత్ రెడ్డే కాదు నేను కూడా పాలమూరు బిడ్డనే’ అని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇక.. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు బయలుదేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇతర టీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరులు అభిమానులు ఉన్నారు. -
నేడు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా బీఎస్పీకి రాజీనామా చేసిన ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ గూటికి చేరనున్నారు. సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా..‘నా రాజకీయ భవితవ్యంపై హైదరాబాద్లో ఆదివారం వందలాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులతో మేధోమధనం జరిపాను. ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటే నడుస్తానని మాట ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ విశాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వం, రాజ్యాంగ రక్షణ, బహుజనుల అభ్యున్నతి కోసం సోమవారం కేసీఆర్ సమక్షంలో ఆపార్టీలో చేరబోతున్నా. ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటా. వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తా’ అంటూ పోస్టు పెట్టారు. ఇదిలా ఉండగా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తరఫున సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ప్రజలకు నమస్కారం🙏 నేను నా రాజకీయ భవితవ్యం పై ఈ రోజు హైదరాబాదులో వందలాది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో మేధోమధనం జరిపాను. అట్టి సభలో రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. కానీ నా మీద నమ్మకంతో నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక… — Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 17, 2024 -
పొత్తుకు బ్రేక్.. బీఆర్ఎస్తో ఎన్నికల పొత్తుపై బీఎస్పీ వెనకడుగు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు కుదిరిందని బీఆర్ఎస్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే బ్రేక్ పడింది. బీఆర్ఎస్తో పొత్తును విరమించుకుంటున్నట్లు బీఎస్పీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ వెల్లడించారు. పొత్తు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఇచ్చిన మాట తప్పడం తనకు ఇష్టం లేదని చెప్పడంతోపాటు తాను బీఎస్పీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం నందినగర్లో కేసీఆర్తో ప్రవీణ్కుమార్ శనివారం మధ్యాహ్నం సుమారు మూడు గంటలపాటు సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తన భవిష్యత్తు ప్రస్థానం బీఆర్ఎస్, కేసీఆర్తో కొనసాగుతుందని భేటీ అనంతరం ప్రవీణ్కుమార్ ప్రకటించారు. ఇదిలాఉంటే ఒకట్రెండు రోజుల్లో ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్లో చేరతారని ఆయన సన్నిహితవర్గాలు చెప్పాయి. బీఎస్పీతో పొత్తు విచ్ఛిన్నమైన నేపథ్యంలో నాగర్కర్నూల్ లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రవీణ్కుమార్ పోటీ చేయనున్నారు. పొత్తులో భాగంగా నాగర్కర్నూల్, హైదరాబాద్ స్థానాలను కేటాయిస్తున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్ తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించింది. ఇదిలాఉంటే ప్రవీణ్కు బీఆర్ఎస్లో కీలక పదవి కూడా దక్కే అవకాశమున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్కు ఇచ్చిన మాట తప్పకూడదనే..: ప్రవీణ్ కేసీఆర్తో భేటీ ముగిసిన తర్వాత ప్రవీణ్కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్తో కాకుండా ప్రాంతీయ పార్టీలతో బీఎస్పీ పొత్తు పెట్టుకోవాలని అందరితో చర్చించి నిర్ణయించుకున్నాం. అందులోభాగంగా బీఆర్ఎస్తో జరిగిన చర్చల ఫలితంగా నాగర్కర్నూల్, హైదరాబాద్ స్థానాలు కేటాయించారు. దీనికి బీఎస్పీ జాతీయ నాయకత్వం కూడా అంగీకరించినా బీఆర్ఎస్తో పొత్తు కుదుర్చుకోవడం బీజేపీకి నచ్చలేదు. పొత్తును విరమించుకోవాలని బీఎస్పీ అధిష్టానంపై బీజేపీ ఒత్తిడి తెచ్చింది. బీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు మీడియా సమావేశం పెట్టాలని బీఎస్పీ అధిష్టానం నుంచి నాకు ఆదేశాలు అందాయి. పొత్తు కోసం కేసీఆర్కు ఇచ్చిన మాట తప్పడం నాకు ఇష్టం లేదు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కేసీఆర్తో చర్చించాను. రాబోయే రోజుల్లో కేసీఆర్, బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తా. తెలంగాణ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా. బహుజన వాదాన్ని ఎన్నటికీ వీడను. తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఎస్పీ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నా. శ్రేయోభిలాషులతో చర్చించి రాజకీయ నిర్ణయం తీసుకుంటా’ అని ప్రవీణ్కుమార్ చెప్పారు. ఆది నుంచీ ఊగిసలాటే... లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ, బీఆర్ఎస్ నడుమ పొత్తు చర్చల్లో మొదటి నుంచీ ఊగిసలాట ధోరణి కనిపించింది. ఓ వైపు పొత్తులకు సంబంధించి కేసీఆర్తో చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే తాము దేశంలో ఏ పార్టీతోనూ కలిసి పోటీ చేయడం లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రకటించారు. అయితే మాయావతి ప్రకటన తెలంగాణకు వర్తించదని ప్రవీణ్ పేర్కొన్నారు. మరోవైపు మాయావతితో కేసీఆర్ మాట్లాడారని కూడా పేర్కొన్నారు. రెండు దఫాలుగా జరిగిన చర్చల్లో బీఎస్పీ మూడు సీట్లు కోరినట్లు ప్రచారం జరగ్గా.. నాగర్కర్నూల్, హైదరాబాద్ స్థానాలను కేటాయిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. అది జరిగి 24 గంటలు కాకమునుపే బీఎస్పీని వీడుతున్నట్లు ప్రవీణ్ ప్రకటించి కేసీఆర్తో భేటీ అయ్యారు.ఐపీఎస్ అధికారి నుంచి... సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసి తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ప్రవీణ్కుమార్ తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత గురుకులాల కార్యదర్శిగా వ్యవహరించారు. గురుకుల విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నతస్థాయికి తెచ్చేందుకు కృషి చేశారు. ‘స్వేరోస్’ సంస్థ ద్వారా గురుకులాల విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. 2021లో తన పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ప్రవీణ్కుమార్ అదే సంవత్సరం ఆగస్టులో మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరారు. రాష్ట్రంలో కాన్షీరాం అధ్యక్షుడిగా ఉన్న 1994 నుంచి రాజకీయ మనుగడ కోసం ప్రయత్నిస్తూ విఫలమైన బీస్పీలో ప్రవీణ్కుమార్ చేరడమే అప్పట్లో చర్చనీయాంశమైంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎత్తిచూపుతూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర, పర్యటనలు చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగ యువతను ఏకం చేయడంలో ఆయన సఫలీకృతమయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 107 మంది బీఎస్పీ అభ్యర్థులను బరిలో నిలిపారు. ఆయన స్వయంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ మనుగడ కోసం తాను పోరాడిన బీఆర్ఎస్తోనే కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. -
బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా
-
బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ)కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుడ్బై చెప్పారు. బీఎస్పీ పార్టీ తెలంగాణ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ‘బహుజన్ సమాజ్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను. నా నాయకత్వంలో తెలంగాణలో ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాల (వాటికి ఎంత మంచి ప్రాముఖ్యత ఉన్నా) వల్ల బీఎస్పీ వంటి గొప్ప పార్టీ ఇమేజ్ దెబ్బతినడం నాకు ఇష్టం లేదు’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ కానున్నారు. ఇటీవల బీఆర్ఎస్-బీఎస్పీ పార్టీలు లోక్సభ ఎన్నికల కోసం పొత్తు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. Dear fellow Bahujans, I am unable to type this message, but I must do it anyway, as the time to take new path has arrived now. Please forgive me for this post and I have no choice left. With heavy heart I have decided to leave Bahujan Samaj Party😭. I don’t want the image of… — Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 16, 2024 బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలలోని నాగర్ర్నూల్తో పాటు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల నుంచి బీఎస్పీ పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ చీఫ్గా ప్రవీణకుమార్ ప్రకటించారు. నాగర్కర్నూల్ స్థానం నుంచి స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్కుమార్(ఆర్ఎస్పీ) ఎన్నికలో బరిలో దిగనున్నారని బీఎస్పీ ప్రకటించింది. ఇక హైదరాబాద్ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్నదానిపై బీఎస్పీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇలాంటి తరుణంలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఎస్పీకి రాజీనామా చేయటం పార్టీకి పెద్ద షాక్ అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. -
బీఎస్పీకి రెండు సీట్లిచ్చిన బీఆర్ఎస్.. ‘ఆర్ఎస్పీ’ పోటీ అక్కడి నుంచే..
సాక్షి,హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)తో పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా బీఎస్పీకి బీఆర్ఎస్ రెండు సీట్లు కేటాయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ శుక్రవారం(మార్చ్15) ఒక ప్రకటన విడుదల చేసింది. పొత్తులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలలోని నాగర్ర్నూల్తో పాటు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల నుంచి బీఎస్పీ పోటీ చేయనుంది. నాగర్కర్నూల్ స్థానం నుంచి స్వయంగా బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్(ఆర్ఎస్పీ) ఎన్నికలో బరిలో దిగనున్నారని బీఎస్పీ ప్రకటించింది. ఇక హైదరాబాద్ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్నదానిపై బీఎస్పీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా, ఇప్పటివరకు మొత్తం 17 లోక్సభ స్థానాలకుగాను 11 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఖరారైంది. తాజాగా నాగర్కర్నూల్, హైదరాబాద్ లోక్సభ స్థానాలను పొత్తులో భాగంగా బీఎస్పీకి కేటాయించడంతో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేయాల్సి ఉంది. అభ్యర్థులను ప్రకటించాల్సిన నియోజకవర్గాల జాబితాలో సికింద్రాబాద్, నల్లగొండ, భువనగిరి, మెదక్ ఉన్నాయి. కాంగ్రెస్ జాబితా వెలువడిన తర్వాత మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్పైనా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. చేవెళ్ల లోక్సభ స్థానం పరిధిలో ఈ నెల 23న బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. అభ్యర్థులు ఖరారైన చోట బహిరంగ సభలు, ప్రచార షెడ్యూల్పై స్థానికంగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నేతలను కేసీఆర్ ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం. ఇదీ చదవండి.. మరో ఇద్దరికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ -
TS: బీఆర్ఎస్కు కోనప్ప గుడ్బై..! మంత్రి పొంగులేటితో కీలక భేటీ
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బుధవారం ఉదయం తెలంగాణ సెక్రటేరియట్లో రాష్ట్ర రెవెన్యూ,సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చాంబర్కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న మీడియా ప్రతినిధులతో ఆయన ముచ్చటించారు. కార్యకర్తలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపెట్టుకుంటున్నట్లు మంగళవారం రెండు పార్టీల అధ్యక్షులు ప్రెస్మీట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. బీఎస్పీతో పొత్తు విషయంలో అసంతృప్తికి గురైన కోనప్ప బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే కోనప్ప సచివాలయానికి వచ్చి సీఎం రేవంత్ మంత్రి వర్గంలో కీలక మంత్రిగా పేరున్న పొంగులేటితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సిర్పూర్ నుంచి కోనప్పపై పోటీ చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు కొనసాగితే తన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం అని భావించిన కోనప్ప పార్టీ మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కోనప్ప, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మధ్య ఉంటుందని అందరూ భావించినప్పటికీ సిర్పూర్ నుంచి అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇదీ చదవండి.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ధర్నా -
బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు ఖరారైంది. కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావును బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కలిసి పొత్తుపై చర్చించారు. అయితే.. తెలంగాణను కాపాడేందుకే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటున్నామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కలిసి ఆయన మీడియా ముందు మాట్లాడారు. బీఆర్ఎస్, బీఎస్పీ చాలా అంశాల్లో కలిసి పని చేసింది. అందుకే లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాం. కేవలం ఆర్ఎస్ ప్రవీణ్తోనే ఇప్పడు మాట్లాడాం. రేపు బీఎస్పీ అధినేత్రి మాయవతితో మాట్లాడతా. కచ్చితంగా కలిసి పోటీ చేస్తాం. సీట్ల పంపకాలపై త్వరలోనే ప్రకటన చేస్తాం అని కేసీఆర్ చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. నాలుగు నెలలు కాకముందే కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్తో రాజ్యాంగానికి ముప్పు ఉంది. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది. ఆ రెండు పార్టీలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మా స్నేహం తెలంగాణ ను పూర్తిగా మారుస్తుంది అని అన్నారు. నాగర్కర్నూల్ నుంచి పోటీ? ఇక పొత్తు ఖరారు నేపథ్యంలో.. లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. మంగళవారం కేసీఆర్ అధ్యక్షతన మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటరీ స్థాయి సమావేశం జరిగింది. అయితే.. మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి పేరును కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. కానీ, నాగర్ కర్నూల్ పార్లమెంటరీ స్థానం సమావేశం మాత్రం జరగలేదు. రెండ్రోజుల తర్వాత సమావేశం ఉంటుందని చివరి నిమిషంలో ప్రకటించడంతో.. అక్కడి కీలక నేతలు తెలంగాణ భవన్ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో.. ప్రవీణ్కుమార్ పేరు పరిశీలన కోసమే ఈ మీటింగ్ వాయిదా పడి ఉండొచ్చన్న సంకేతాలు బలపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు బీఆర్ఎస్కు గుడ్బై చెప్పి.. బీజేపీలో చేరారు. ఇటీవల బీజేపీ ప్రకటించిన లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలో రాములు తనయుడు భరత్కు నాగర్ కర్నూల్ సీటు కేటాయించింది కమలం పార్టీ. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఈ స్థానానికి గట్టి పోటీనే ఉంది. అయితే.. సీనియర్ నేత మల్లు రవిని పార్టీ బరిలో నిలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారితో నంది నగర్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆ పార్టీ ప్రతినిధుల బృందం. pic.twitter.com/bynXDHVXMB — BRS Party (@BRSparty) March 5, 2024 -
మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి
సూర్యాపేట రూరల్: సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీల పథకాల కంటే ముందు రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన తమ పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలంలోని ఇమాంపేట గురుకుల పాఠశాలలో వైష్ణవి మృతికి పాఠశాల ప్రిన్సిపాల్, ఆర్సీఓలే కారణమని తల్లిదండ్రులు ఆ పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు ప్రవీణ్ కుమార్ హాజరై తల్లిదండ్రులను ఓదార్చిన అనంతరం మాట్లాడారు. ‘సీఎం ఆరు గ్యారంటీలు అమ లు చేయకపోయినా మాకు నష్టం లేదు. ఇందు కోసమేనా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి మిమ్మ ల్ని అధికారంలోకి తీసుకొచ్చింది. ఆదాయం వచ్చే శాఖలకు మంత్రులను కేటాయించారే గానీ గిరి జన సంక్షేమ శాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించకపోవడం బాధాకరం. భువనగిరి గురుకులంలో ఇద్దరు విద్యార్థినులు చనిపోతే రెండు నిమిషాలు కూడా మౌనం పాటించకపోవడం హేయమైన చర్య’ అని ఆవేదన వ్యక్తంచేశారు. వైష్ణవి మృతిపై విచారణ జరిపి ఘటనకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలన్నారు. మృతురాలి కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. 3 గంటలకు పైగా ఆందోళన కొనసాగ డంతో 3 కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది. కలెక్టర్ పాఠశాల వద్దకు రావాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఎస్పీ నాగభూషణం, సీఐ రాజశేఖర్తో పాటు మరో ఇద్దరు సీఐలు, ఎస్సైలు గురుకుల పాఠశాల వద్దకు వచ్చారు. వైష్ణవి కుటుంబానికి న్యాయం చేస్తామని ప్రవీణ్కుమార్కు వెంకట్రెడ్డి హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు. -
ఐపీఎస్ అధికారి బయోపిక్.. ఆ రోజే రిలీజ్!
నంద కిషోర్ హీరోగా నటించిన చిత్రం ప్రవీణ్ IPS (ఇక ప్రజా సేవలో). ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఐరా ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్పై మామిడాల నీల నిర్మించిన ఈ మూవీ ఈ నెల 16న రిలీజ్ కానుంది. శనివారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు, ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల ప్రవీణ్ IPS ట్రైలర్ విడుదల చేశారు. సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. అలాంటి సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి సి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ... ప్రవీణ్ IPS జన హృదయాలను కదిలిస్తుందన్నారు. చాలామంది ఆదర్శాల కోసం సినిమాలు తీస్తే వాటిని జనం ఆదరించరని ఒక తప్పుడు అభిప్రాయం ఉందన్నారు. ‘మాల పిల్ల’, ‘రైతుబిడ్డ’ వంటి సినిమాల్లో ఆదర్శమే చూపించారని, ఆదర్శం (ఐడియలిజం) అనేది జన హృదయాలను తాకుతుందన్నారు. నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా అనేక విప్లవాత్మక మార్పులు విద్యారంగంలో తీసుకొచ్చారని అన్నారు. పూర్ణ మలావతి, ఆనంద్ లతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహింపజేశారని గుర్తు చేశారు. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం చాలా గొప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది నా తొలి చిత్రం డైరెక్టర్ దుర్గా దేవ్ నాయుడు మాట్లాడుతూ... ఇది నా తొలి చిత్రం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జీవితాన్ని మూడు పార్టులుగా తీయాలి. కానీ సెలెక్టివ్ అంశాలను తీసుకొని ప్రవీణ్ IPS మూవీ తీశాం. ఆయన నాకు ఇన్స్పిరేషన్. వివేక్ కూచిభోట్ల గారు లేకపోతే నాకు ఈ సినిమా అవకాశం వచ్చేది కాదని చెప్పారు. తనకు అన్ని విషయాల్లో అండగా నిలిచినందుకు వివేక్కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో కష్టాలు పడ్డారు ASKES ఫౌండేషన్ చైర్మన్ కొల్లూరి సత్తయ్య మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నో కష్టాలను భరించి ఐపీఎస్ అధికారిగా ఎన్నో సేవలు చేశారని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా పేద పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని కోచింగ్ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రవీణ్ IPS మూవీ హిట్ కావాలని ఆకాంక్షించారు. చదవండి: రెండేళ్లుగా అదే తెలుసుకున్నా.. ఒంటరితనమే బాగుంది! -
బహుజనవాదం .. బహుదూరం
సాక్షి, హైదరాబాద్/ ఆసిఫాబాద్: బహుజన సమాజ్ పార్టీకి మరోసారి చుక్కెదురైంది. బహుజనవాదం నినాదంతో రాష్ట్రంలో కొన్ని సీట్లతో పాటు మెరుగైన ఓట్ల శాతం సాధించాలని కలలుగన్న బీఎస్పీ ఆశలు నీరుగారి పోయాయి. ఐపీఎస్ అధికారిగా స్వచ్చంద పదవీ విరమణ పొంది బీఎస్పీ సారథ్య బాధ్యతలు తీసుకొన్న ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ సారథ్యంలో 108 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీకి రెండు చోట్ల మాత్రమే డిపాజిట్ దక్కింది. అందులో ఒకటి ప్రవీణ్కుమార్ పోటీ చేసిన సిర్పూరు కాగా, రెండోస్థానం పటాన్చెరు. సిర్పూరులో గెలుపుపై ఆశలు రేకెత్తించిన ప్రవీణ్కుమార్కు లభించిన ఓట్లు 44,646. ఇక్కడ అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్బాబు విజయం సాధించగా, ప్రవీణ్ కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. దళిత, గిరిజన బహుజనుల ఓట్లపై గంపెడాశెలు పెట్టుకున్న ప్రవీణ్కుమార్ స్థానికేతరుడు కావడం కూడా ఇక్కడ ఆయన విజయావకాశాలను దెబ్బతీసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్పను తెలంగాణేతరుడుగా ప్రచారం చేయడంలో ప్రవీణ్కుమార్ విజయం సాధించినప్పటికీ, హరీశ్బాబు స్థానికుడు కావడంతో ఓట్లన్నీ గంపగుత్తగా పోలయినట్లు తెలుస్తోంది. కాగా పటాన్చెరులో చివరి నిమిషంలో బీఎస్పీ టికెట్టుపై పోటీ చేసిన కాంగ్రెస్ రెబల్ నీలం మధుకు 46,162 ఓట్లు మాత్రమే లభించి మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి 7వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ రెండోస్థానంలో నిలిచారు. ఇక ప్రవీణ్కుమార్ సోదరుడు ప్రసన్న కుమార్ స్వచ్చంద విరమణ చేసి ఆలంపూర్ నుంచి పోటీ చేయగా, కేవలం 4,711 ఓట్లు మాత్రమే లభించాయి. వీరు కాకుండా పెద్దపల్లి నుంచి పోటీ చేసిన దాసరి ఉష 10,315 ఓట్లు సాధించగా, సూర్యా పేటలో వట్టి జానయ్యకు 13,907 ఓట్లు దక్కా యి. చొప్పదండి నుంచి పోటీ చేసిన శేఖర్కు 5,153 ఓట్లు లభించాయి. ఇలా మరికొన్ని స్థానాల్లో స్వ ల్పంగా ఓట్లు మాత్రమే సాధించి బహుజనవాదం వినిపించడంలో ఆ పార్టీ విఫలమైంది. ప్రవీణ్కుమార్కు నిరాశ బహుజన వాదం నినా దంతో కుమురంభీంజిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో పాగా వేయా లని ఆశపడిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమా ర్కు నిరాశ తప్పలేదు. దళితులు, గిరిజనులు, బుద్ధిస్టుల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఆర్ఎస్పీ పోటీకి మొగ్గు చూపారు. పోలింగ్ సరళిని బట్టి ఆ పార్టీకి అధిక సంఖ్యలో ఓట్లు పడ్డాయని విశ్లేషకులు భావించారు. అయితే ఆ పార్టీ నాయకులు వేసిన అంచనాలు తారుమారయ్యాయి. -
అందరి తెలంగాణగా మార్చడమే లక్ష్యం : ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
సాక్షి,హైదరాబాద్ : కొందరి తెలంగాణను అందరి తెలంగాణ చేయడమే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సాక్షి టీవీకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. దొరల తెలంగాణ కాకుండా పేదల తెలంగాణగా మార్చుదామనేది బీఎస్పీ ఆలోచన అని తెలిపారు. తెలంగాణలో దొరలు వదిలిపెట్టిపోయిన గడీలు గడిచిన తొమ్మిదేళ్లలో మళ్లీ పునర్మిర్మాణమయ్యాయన్నారు. బాంచన్ కాల్మొక్త అనే సంస్కృతి తెలంగాణలో పోలేదని చెప్పారు. రాజ్యాధికారంతోనే బాంచన్ కాల్మొక్త సంస్కృతి పూర్తిగా పోతుందని ప్రవీణ్కుమార్ స్పష్టం చేశారు. స్పష్టమైన ప్రణాళికతో అన్ని వర్గాలను కలుపుకుని కృషి చేస్తే రాజ్యాధికారం తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధించి, వీలైతే రాజ్యాధికారం చేపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. జార్ఖండ్లో మధుకోడా ఒక్కడే ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ప్రవీణ్కుమార్ గుర్తుచేశారు. దళితులు ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే సరిపోదని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంటేనే రాజ్యాధికారం వచ్చినట్లవుతుందన్నారు. ఉత్తరప్రదేశ్లో మాయావతి సీఎం అయిన తర్వాత బహుజనులకు రాజ్యాధికారంవచ్చిందన్నారు. మయావతి హయాంలో దళితులకు భూముల పంపిణీ జరిగిందని, మహిళలకు రక్షణ కల్పించిందని చెప్పారు. మాయావతి పాలన వల్ల బహుజనుల రెండు, మూడు తరాలు బాగుపడ్డాయని తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రిని కలిసి వారి ఆలోచనలు చెప్పుకునే అవకాశం తెలంగాణలో ఏ బ్యూరోక్రాట్కు లేదన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు కానిస్టేబుల్ ఆపితే ప్రగతిభవన్ గేటు వద్ద నుంచే వెనక్కు వెళ్లిన సందర్భాలున్నాయన్నారు. గురుకులాల సెక్రటరీగా వెళ్లిన వెంటనే దళిత, నిమ్న, వెనుకబడిన, అణగారిన అనే పదాలను నిషేధించి స్వేరో అనే పదాన్ని తీసుకొచ్చానని తెలిపారు. బీఎస్పీ మేనిఫెస్టోలో పెట్టిన 10 లక్షల ఉద్యోగాలు మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కాదని, ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగాల అన్నీ కలిపి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇవేకాక మరిన్ని విషయాలను ప్రవీణ్కుమార్ సాక్షి టీవీతో పంచుకున్నారు. -
ఖాకి చొక్కా విడిచి ఖద్దరుతో బహుజన రాజ్యాధికారం సాధ్యమేనా ?
-
ప్రగతిభవన్లో ఎంట్రీపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అమరవీరుల త్యాగాలను కళ్లారా చూశాను. తెలంగాణలో బాన్చన్ కల్చర్ సజీవంగా ఉందన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నన్ను హిందూ వ్యతిరేకి అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. కాగా, ఆర్ఎస్పీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రగతి భవన్లోకి సీఎస్లకు ఎంట్రీ నిరాకరించిన సందర్భాలున్నాయి. అపాయిమెంట్ ఉంటేనే లోపలికి అనుమతించేవారు. చాలా మంది గంటలు గంటలు బయట వేచి చూడటం నాకు తెలుసు. ఏ విధంగా అభివృద్ధి చేయాలో అని అధికారులను ఏనాడూ అడగలేదు. అధికారులు చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదు. తెలంగాణలో అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్చ బ్యూరోక్రాట్స్కు లేదు. ఎంతమంది తెలంగాణ బిడ్డలకు కేటీఆర్ ఉద్యోగాలు ఇచ్చారు?. కుట్రలతో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మాయావతి ఏడు లక్షల ఎకరాల భూమిని పంచారు. బడుగు, బలహీన, వెనుకబడిన అనే పదాలను నిషేధించాలి. మేం బీఫాంలు ఎప్పుడూ అమ్ముకోలేదు. మేము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. అసత్యాన్ని అతికేలా చెప్పడే బీజేపీ సిద్ధాంతం. బీసీలకు అడుగడుగునా బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. స్వేరోస్ అంటే ఆకాశమే హద్దుగా అని అర్థం. అంకితభావంతో పనిచేసే వాళ్లను ఎప్పుడూ పార్టీ వదులుకోదు. పేద పిల్లలు ఎప్పుడూ కూలీలుగానే ఉండాలా?. బీఎస్పీ పార్టీకి డబుల్ డిజిట్లో సీట్లు వస్తాయి. పెద్ద కంపెనీల్లో ఒక్క పేదవాడైనా పెద్ద హోదాలో ఉన్నాడా?. ఈసారి 80 శాతం టికెట్లు మా పార్టీ వారికే ఇచ్చాం. ఏపీలో ఇంగ్లీష్ మీడియం బోధన నిర్ణయాన్ని సమర్థిస్తాను. మాతృభాషతో పాటు ఇంగ్లీష్ బోధనను ప్రమోట్ చేయాలి. ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చి ఏపీ ప్రభుత్వం మంచి పనిచేసింది. జీవితంలో ఎదగాలంటే ప్రతీ ఒక్కరికీ చదువు అవసరం. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలి’ అంటూ కామెంట్స్ చేశారు. -
అధికారంలోకి వస్తే పది లక్షల ఉద్యోగాలు
వేములవాడ: బీఎస్పీ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యో గాలిచ్చి నిరుద్యోగులకు బాసటగా నిలుస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ అన్నారు. ఇందులో మహిళలకే 5 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చా రు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇక్కడ ప్రకృతి ఆగ్రహించి టెంట్లను కూల్చి వేసినట్లుగానే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. ఏనాడూ రాని దొరలు ఇప్పుడు ఓటుకు రూ.2 వేలు ఇస్తామంటూ మన ఇంటికి వస్తున్నారన్నారు. ఒక్కసారి ఓటు అమ్ముకుంటే మన బిడ్డల భవిష్యత్ను బొంద పెట్టుకున్నట్లేనని హెచ్చరించారు. రాష్ట్రంలో బీఎస్పీ ప్రభుత్వం రాగానే భూమిలేని ప్రతీ నిరుపేదకు ఎకరం భూమి ఇస్తామని భరోసా ఇచ్చారు. కేసీఆర్ మూడెకరాలు ఇస్తామని నమ్మబలికి దళితులకు చెందిన 35 వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. గల్ఫ్ బాధితుల కోసం రూ.500 కోట్లు కేటాయిస్తామన్న కేసీఆర్ వాగ్దానం ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గల్ఫ్ బాధితులకోసం రూ.5 వేల కోట్లతో ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కులాలవారీగా కాంట్రాక్టులు కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. ఎమ్మెల్సీ కవిత అక్రమంగా రూ.100 కోట్లు ఢిల్లీకి పంపిందని, ఆమె రూ.20 లక్షల ఖరీదైన వాచ్ ధరిస్తుందని ఆరోపించారు. పార్టీ వేములవాడ అభ్యర్థి, విద్యావంతుడైన డాక్టర్ గోలి మోహన్కు కాకుండా ఎవరికి ఓటు వేసినా మీ జీవితాలు నాశనమేనన్నారు. కూలిన టెంట్లు.. పలువురికి గాయాలు సభ ప్రారంభంలో వేములవాడ అభ్యర్థి గోలి మోహన్ మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన సుడిగాలితో టెంట్లు కూలిపోయాయి. అనుకోని ఈ ఘటనతో పలువురు మహిళలు, జర్నలిస్టులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్, సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి పరామర్శించారు. -
అధికార మార్పిడి జరగాలి! : ప్రవీణ్కుమార్
మహబూబ్నగర్: పొలాల్లో పంట మార్పిడి ఎలా చేస్తారో.. అలాగే రాజకీయాల్లోనూ అధికార మార్పిడి జరగాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్కుమార్ అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ, నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా అయిజలో మాట్లాడుతూ బీఎస్పీ అభ్యర్థులు ఎవరూ శ్రీమంతులు కారని, కష్టార్జితాన్ని నమ్ముకొనే మీ ముందుకు వచ్చారన్నారు. వాళ్ల వలే ఓటుకు వెయ్యి ఇచ్చి, 90 ఎంఎల్ బాటిల్, ఇంటి వద్ద ఉచితంగా భోజనాలు పెట్టే వాళ్లు కాదన్నారు. కానీ, ఐదేళ్లు రోజుకు మూడు పూటల తిండిపెట్టే విధంగా మీ అందరినీ తయారు చేయడానికి వచ్చిన వారన్నారు. వాల్మీకులు, కుర్వ సోదరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎంత మందికి టికెట్ ఇచ్చిందని ప్రశ్నించారు. బీఎస్పీ మహబూబ్నగర్, వనపర్తిలో వాల్మీకులకు టికెట్లు ఇచ్చినట్లు గుర్తుచేశారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టీ రిజర్వేషన్ పెంచి వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేరుస్తామన్నారు. ఈ అలంపూర్ గడ్డలో పుట్టిన.. ఇదే తుంగభద్ర నీళ్లు తాగిన.. ఇదే నడిగడ్డ గాలి పీల్చిన.. ఇదే నడిగడ్డలో మొలకెత్తిన విత్తనాలు తిని పెరిగి ఈ స్థాయికి వచ్చానన్నారు. అలంపూర్, సిర్పూర్ బీఎస్పీకి రెండు కళ్లలాంటివని, తప్పకుండా రెండు చోట్ల గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఇవి చదవండి: జీఓ 69ను బొందపెట్టి.. కొడంగల్ను ఎండపెట్టిండు.. : రేవంత్రెడ్డి -
కోనప్ప Vs ఆర్ఎస్ ప్రవీణ్ గా మారిన సిర్పూర్ రాజకీయం
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలో శాసనసభ ఎన్నికలు సెగ పుట్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సిర్పూర్ బరిలో నిలిచిన బీఆర్ఎస్, బీఎస్పీ అభ్యర్థులు ‘నువ్వా– నేనా’ అన్నట్లు సిగపట్లకు దిగుతుండటంతో నియోజకవర్గంలో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రచారంలో భాగంగా ఇరు పార్టీల శ్రేణులు బాహాబాహీకి దిగుతుండటం ఘర్షణకు దారితీస్తోంది. అభ్యర్థులు ఏకంగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి వెళ్లడంతో ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనని రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు.. ప్రత్యారోపణలు రాష్ట్రంలోనే వరుస పరంగా నంబర్– 1 నియోజకవర్గమైన సిర్పూర్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోనేరు కోనప్ప నాలుగోసారి బరిలో ఉన్నారు. రావి శ్రీనివాస్, పాల్వాయి హరీశ్బాబు, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేశారు. కాగా.. 2014లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో కోనేరు కోనప్ప బీఎస్పీ తరఫున ఎన్నికల్లో నిలబడి గెలిచి.. బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు అదే బీఎస్పీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్(ఆర్ఎస్పీ) కోనప్పకు పోటీగా నిలబడ్డారు. కోనప్పను కచ్చితంగా ఓడించి తీరుతానని ఆర్ఎస్పీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాపకింద నీరులా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఎస్పీ దూసుకెళ్లేలా ప్రణాళికలు రచించారు. గ్రామం, మండలం, పట్టణం.. ఇలా ఇంటింటా తిరుగుతూ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఒక దశలో ‘కోనేరు కోనప్ప.. కలప దొంగ’ అంటూ మీడియా ముందు తీవ్ర ఆరోపణలు చేయడం.. అందుకు కౌంటర్గా కోనప్ప ‘మర్డర్లు చేసిన ఘనత మాకే ఉంది. ఎన్కౌంటర్లు కూడా మేమే చేపించాం. పరిటాల రవిని మేమే చంపించాం. బెల్లంపల్లి, కరీంనగర్లో హత్యలు మేమే చేపించాం. ప్రవీణ్కుమార్ ఒక పొలిటికల్ టూరిస్ట్’ అంటూ ఆర్ఎస్పీపై ప్రత్యారోపణలు చేశారు. అప్పటి నుంచి ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ శ్రేణుల్లో ఘర్షణ వాతావరణం.. నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీఎస్పీలకు చెందిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు వర్గాలుగా విడిపోయి ప్రచారంలో పాల్గొంటున్నారు. శ్రేణుల ప్రచారం తారస్థాయికి చేరడమే కాకుండా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నెల 11న కాగజ్నగర్ పట్టణంలోని బస్టాండ్ ఏరియాలో బీఎస్పీ కార్యకర్త షేక్ ఆసిఫ్ను బీఆర్ఎస్ నాయకుడు కోనేరు ఫణితోపాటు పలువురు ఆకారణంగా దాడిచేయడమే కాకుండా చంపుతామని బెదిరించినట్లు ఆరోపిస్తూ బాధితుడు ఆసిఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పోలీసులు ఫణితోపాటు పలువురిపై కేసు సైతం నమోదు చేశారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీల్లో ఉన్న అసంతృప్తులకు అభ్యర్థులు గాలం వేస్తుండటం.. భారీ ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చి తమవైపు తిప్పుకోవడం పరిపాటిగా మారింది. పార్టీ ఫిరాయింపులు గెలుపోటములపై ప్రభావం చూపుతుండటంతో అభ్యర్థులు దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఫలితంగా ప్రచారంలో ప్రత్యర్థులపై దాడులకు దిగడానికి సైతం వెనుకాడకపోవడంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆదివారం రాత్రి కాగజ్నగర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయబస్తీలో ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అనంతరం బీఆర్ఎస్ ప్రచార రథం డైవర్పై దాడి చేశారంటూ ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. తమ ప్రచారాన్ని అడ్డుకోవడమే కాకుండా అన్యాయంగా కేసు పెట్టారని నిరసన తెలుపుతూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్పీ కాగజ్నగర్ పోలీసు స్టేషన్లో బైఠాయించారు. పోలీసులు చివరకు ఇరువర్గాల అభ్యర్థులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. అయితే ఇలాంటివి పునరావృతమైతే మాత్రం నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం పోలీసులకు సవాలుగా మారనుంది. -
కేసీఆర్ను జైలుకు పంపడం ఖాయం
పెద్దపల్లిరూరల్: కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కోట్లాది రూపాయలు దిగమింగిన సీఎం కేసీఆర్ను, ఆయన కుటుంబసభ్యులను జైలు కు పంపడం ఖాయమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రూ.లక్షన్నర కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగిపోతోందని, అందుకు కల్వకుంట్ల కుటుంబసభ్యులే కారకులని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావంతులైన నిరుద్యోగ యువతశక్తిని నీరుగార్చారని ఆరోపించారు. ఇప్పుడు ఏంచేయాలో తెలియక విద్యావంతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రతి ఏటా రంజాన్ పండుగకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసుడే తప్ప మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించలేనిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇఫ్తార్ విందులు కావు.. న్యాయం కావాలని మైనారిటీలు అడుగుతున్నారని పేర్కొన్నారు. సభలో పార్టీ నాయకులు ఈర్ల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ సీఎం అభ్యర్థి బయోపిక్.. టీజర్ రిలీజ్
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఓ వైపు అన్ని పార్టీల నాయకులు, ఓటర్లని ప్రసన్నం చేసుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే టైంలో ఆయా పార్టీలు.. సినిమాలతోనూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇప్పటికే 'కేసీఆర్' సినిమా రానుండగా, ఇప్పుడు మరో పార్టీ తరఫున పోటీలో ఉన్న ముఖ్యమంత్రి అభర్థి బయోపిక్ విడుదలకు సిద్ధమైంది. (ఇదీ చదవండి: తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్బాబు.. త్వరలో శుభకార్యం!) నీల మామిడాల నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా 'ప్రవీణ్ ఐపీఎస్'. షూటింగ్ అంతా పూర్తి చేసుకుని ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. నవంబరులో ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసి, ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఐపీఎస్ మాజీ అధికారి, ప్రస్తుత బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియోలో.. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఎలివేషన్ ఇచ్చేలా డైలాగ్ పెట్టారు. తప్పితే క్యారెక్టర్స్ని పెద్దగా చూపించలేదు. అయితే ఈ సినిమాలో నందకిషోర్, రోజా హీరో హీరోయిన్గా నటిస్తున్నారు. దుర్గా దేవ్ నాయుడు దర్శకుడు. నవంబరు చివర్లో ఎన్నికల జరగడానికి ముందే ఈ సినిమా రిలీజ్ కానుంది. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) -
ప్రగతిభవన్ నుంచి కేసీఆర్ను సాగనంపాలి
మెట్పల్లి(కోరుట్ల)/జగిత్యాలటౌన్: తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబాన్ని ప్రగతిభవన్ నుంచి సాగనంపాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మినీ స్టేడియంలో బహుజన రాజ్యాధికార గర్జన సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో ఒక్కశాతం ఉన్న వర్గానికి అధికారం అప్పగిస్తే బహుజనులకు న్యాయం జరగదన్నారు.టీఎస్పీఎస్సీని మంత్రి కేటీఆర్ తన దోపిడీకి అడ్డాగా మార్చుకున్నారని, ఒక్కో పరీక్ష పేపర్ను ఆయన రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు అమ్ముకున్నారని ఆరోపించారు. పరీక్షలు వాయిదా పడటం వల్ల మనస్తాపం చెందిన ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్య చేసుకుంటే, కేటీఆర్ దానిని వక్రీకరిస్తూ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తే రూ.5 వేల కోట్లతో గల్ఫ్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. బహుజనులు ఎక్కువగా ఉన్న కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా దొరలు గెలవడం సమంజసం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న పూదరి నిషాంత్ కార్తికేయను గెలిపించాలని కోరారు. మాజీ జెడ్పీటీసీ పూదరి అరుణ, జిల్లా ఇన్చార్జి పుప్పాల లింబాద్రి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీ రద్దుకు తొలి సంతకం తమ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేస్తూ తొలి సంతకం చేయడంతో పాటు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకు అండగా నిలుస్తామని బీఎస్పీ చీఫ్ ప్రవీణ్కుమార్ హామీ ఇచ్చారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన బీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ, అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ ఏక్ నంబర్ అయితే బేటా కేటీఆర్ దస్ నంబర్ అని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్రావు అంబులెన్సుల్లో డబ్బులు పంపిణీ చేస్తారని అనుమానంగా ఉందని అన్నారు. -
ఎమ్మెల్యే కోనప్పపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
-
20 మందితో బీఎస్పీ తొలి జాబితా
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రకటించారు. తాను ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్టు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కో–ఆర్డినేటర్, ఎంపీ రాంజీ గౌతమ్తో కలసి పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రవీణ్కుమార్ విడుదల చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే 20 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటిస్తున్నామని, త్వరలో మరికొందరు అభ్యర్థులను వెల్లడిస్తామని చెప్పారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే మోదీ ప్రకటనలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రధాని మోదీ పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ప్రకటనలు చేశారని ప్రవీణ్కుమార్ విమర్శించారు. ఆచరణలో అమలుకాని హామీలతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మేనిఫెస్టోలు ఉంటున్నాయని విమర్శించారు. అధికారాన్ని అట్టిపెట్టుకోవాలనే ఉద్దేశంతోనే సమగ్ర కుటుంబ సర్వేను కేసీఆర్ బయటపెట్టడం లేదని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో చేసిన సర్వేను రహస్యంగా ఉంచడం ఎందుకని నిలదీశారు. బీఎస్పీ ప్రజాబలం ఉన్న పార్టీ అని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ధనబలమే తప్ప ప్రజాబలం లేదని వ్యాఖ్యానించారు. బీఎస్పీ తొలి జాబితా ఇదీ.. సిర్పూర్ – ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, జహీరాబాద్ – జంగం గోపి, పెద్దపల్లి – దాసరి ఉష, తాండూరు – చంద్రశేఖర్ ముదిరాజ్, దేవరకొండ – ముడావత్ వెంకటేశ్ చౌహాన్, చొప్పదండి – కొంకటి శేఖర్, పాలేరు – అల్లిక వెంకటేశ్వర్రావు, నకిరేకల్ – మేడి ప్రియదర్శిని, వైరా – బానోత్ రాంబాబు నాయక్, ధర్మపురి – నక్క విజయ్ కుమార్, వనపర్తి– నాగ మోని చెన్నరాములు, మానకొండూరు – నిషాని రామచందర్, కోదాడ – పిల్లిట్ల శ్రీనివాస్, నాగర్ కర్నూల్ – కొత్తపల్లి కుమార్, ఖానాపూర్ – బన్సీలా ల్ రాథోడ్, ఆందోల్ – ముప్పారపు ప్రకాశ్, సూర్యా పేట – వట్టే జానయ్య యాదవ్, వికారాబాద్ – గో ర్లకాడి క్రాంతికుమార్, కొత్తగూడెం– ఎర్ర కామేశ్, జుక్కల్– ప్రద్న్య కుమార్ మాధవరావు ఏకాంబర్. -
ఆ గొంతులన్నీ మూగబోయాయి
SAS (అందోల్): రాష్ట్ర సాధన ఉద్య మంలో పాటల రూపంలో ఉత్తేజపరిచిన గొంతులన్నీ మూగబో యాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ‘బీఎస్పీ శక్తి ప్రదర్శన’ నియోజకవర్గ ఇన్చార్జ్ ముప్పారం ప్రకాశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ కవులు, కళాకారులందరూ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల గొంతుకల కోసం బీఎస్పీలోకి రావాలని పిలుపునిచ్చారు. విప్లవా త్మకమైన పాటలను రాసిన వారిని, పాడిన వారిని గుర్తు చేసుకుంటూ పాటలు పాడుతూ అక్కడున్న వారిని ఆయన ఉత్తేజపరిచారు. సీఎం కేసీఆర్ ఫామ్హౌస్ కోసమే రూ.2 వేల కోట్లతో కొండపోచమ్మ రిజర్వాయర్ను రెండేళ్లలో పూర్తిచేశారని, సంగమేశ్వర, బస్వవేశ్వర ఎత్తిపోథల పథకానికి రూ.4 వేల కోట్లు మంజూరు చేయకపోతే క్రాంతి కిరణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు నటరాజన్ పాల్గొన్నారు. జర్నలిస్టుపై దాడిచేస్తే స్పందించని ఎమ్మెల్యే అందోల్లో అధికార పార్టీ నాయకుల అహంకారానికి అల్లాదుర్గం సాక్షి దినపత్రిక జర్నలిస్టుపై దాడిచేయడమే నిదర్శనమన్నారు. జర్నలిస్టు ఎమ్మె ల్యేగా ఉన్నా క్రాంతికిరణ్ జర్నలిస్టుపై జరిగిన దాడిని ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు. ఆయ న్ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. -
ఫాంహౌస్లలో నీలి జెండాలు పాతుతాం
ప్రశాంత్నగర్ (సిద్దిపేట): రాజకీయ నాయకుల ఫౌంహౌస్లలో నీలి జెండాలు పాతేస్తామని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బహుజన్ సమాజ్ పార్టీయేనని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. బుధవారం సిద్దిపేటలో నిర్వహించిన బహుజన దండయాత్ర సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో ఉన్న బహుజనులందరూ బీఎస్పీకి ఓటు వేస్తారన్నారు. దళితబంధు, బీసీబంధు, మైనార్టీబంధు, ఎస్టీబంధులతో పాటుగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దుకాణాన్ని సైతం ప్రజలు బంద్ పెట్టడం ఖాయమని చెప్పారు. బహుజనులకు కావాల్సింది గొర్రెలు, చేపలు కాదని, బీఎస్సీ అధికారంలోకి వస్తే బహుజనులు రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, కంప్యూటర్ ఇంజనీర్లు అయ్యే అవకాశం ఉందన్నారు. సీఎం కేసీఆర్ను ఓడించేందుకు గజ్వేల్ బహుజనులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. -
ఒంటరిగానే పోటీచేస్తాం: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
అచ్చంపేట/ కల్వకుర్తి రూరల్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రకటించారు. ఆదివారం రాత్రి నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట లో నిర్వహించిన నల్లమల నగారా సభలో, అంతకు ముందు కల్వకుర్తిలో మీడియాతో ఆయన మాట్లా డారు. రాజ్యాధికారం కోసం బహుజనులు ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని, బీసీలకు తమ పార్టీ 70 స్థానాలను కేటాయిస్తుందని చెప్పారు. సూర్యాపేటలో జానయ్యపై చేస్తున్న దాడులను, మణిపూర్, భూపాల్ దాడులను ఖండిస్తున్నామన్నా రు. ఒక శాతం ఉన్న దొరలు 99 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణ పేదలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ను కోరారు. తాము ఎవరి వైపున ఉండమని.. రాజ్యాంగం వైపు ఉంటామని ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. -
బీఎస్పీ అధికారంలోకి వస్తే 33 జిల్లాల్లో 33 సైనిక్ స్కూళ్ల ఏర్పాటు
హన్మకొండ చౌరస్తా, నయీంనగర్: వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ గెలిచి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 సైనిక్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని, ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.7,500 అందిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హామీనిచ్చారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో మంగళవారం ‘బహుజన విద్యార్థి భరోసా’సభలో బీఎస్పీ విద్యార్థి మేనిఫెస్టోను విడుదల చేశారు. బీఎస్పీ హామీలివే... పూలే విద్యార్థి భరోసా పేరుతో కాలేజీ విద్యార్థులకు అన్ని ప్రభుత్వ రంగ వాహనాల్లో ప్రయాణంలో 50 శాతం రాయితీ కల్పిస్తామని తెలిపారు. ప్రతి మండలం నుంచి వంద మందికి విదేశీ విద్య అందిస్తామని, అందులో 50మంది విద్యార్థినులు ఉంటారని వెల్లడించారు. రాష్ట్రంలోని 10లక్షల మందికి ఉన్నత విద్య కల్పిస్తామని, కేజీ నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు కోడింగ్ భాష నేర్పుతామని హామీనిచ్చారు. 8నుంచి 12 తరగతి విద్యార్థులకు 4వ భాషగా కోడింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నేర్పిస్తామన్నారు. విద్యార్థి, నిరుద్యోగ ఆత్మహత్యలు లేకుండా కార్యాచరణ రూపొందిస్తామని, విద్యార్థులకు ఉద్యోగాలు రాకపోతే కాంట్రాక్టర్లను చేస్తామని వాగ్దానం చేశారు. శ్రీకాంతాచారి పేరు తో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, పేపర్ లీకేజీలు లేకుండా చర్యలు చేపడతామని, పూర్ణ, ఆనంద్ క్రీడా స్ఫూర్తితో ప్రతి జిల్లాలో అంతర్జాతీ య ప్రమాణాలతో క్రీడా స్టేడియాలను నిర్మిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ వెల్లడించారు. అసెంబ్లీ జరుగుతుండగా గద్దర్ మరణ వార్త తెలిసినా సీఎం కేసీఆర్ కనీసంగా స్పందించలేదని, సంతాప తీర్మానం చేయలేదని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. -
హలో కేటీఆర్గారూ.. ఈ ఫొటో గుర్తుందా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల అమ్మకంపై బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్పై సెటైర్లు వేశారు. ‘ప్రభుత్వ భూముల వేలం పాటను ఆపివేయాలి. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మానుకోవాలి’అంటూ కేటీఆర్ ఓ ప్లకార్డు ప్రదర్శిస్తున్న పాత ఫొటోను జత చేస్తూ శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ‘తమరు ప్రతిపక్షంలో ఉంటే చెప్పేవి శ్రీరంగనీతులు, అధికారంలోకి వచి్చన తర్వాత ఆ నీతులు ఎక్కడో కొట్టుకొని పోయినయి! ఐనా చెప్పిందల్లా చేయడానికి మీరేమన్నా సన్నాసులా (నాన్న గారి మాటల్లోనే)!. మీరు మీ పత్రికల ద్వారా గతాన్ని తుడిచేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ చరిత్రను మరిచిపోయేంత సన్నాసులం మేం కాదు. 75 ఏళ్ల నుంచి 99 శాతం ఉన్న బహుజనులు 1శాతం ఉన్న ఆధిపత్య పాలకులకు ఓట్లేసి గెలిపిస్తే పేదల భూములను కాపాడలేదు సరికదా అమాంతంగా మింగేసిండ్రు. బీఎస్పీ అధికారంలోకి వచి్చన వెంటనే పేదల భూములకు రక్షణ కలి్పస్తాం’అని తన ట్వీట్లో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. కాగా వందల కోట్లకు అసైన్డ్ భూములను కొంటున్న కేసీఆర్, కేటీఆర్ బినామీల నుంచి భూములను తిరిగి తీసుకుంటామని, వాటిని పేద రైతులకు పంచుతామని ట్విట్టర్లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. నిన్న కోకాపేట, రేపు బుద్వేల్, ఎల్లుండి ఆర్ఆర్ఎర్ చివరికి మిగిలేది గోచి గుడ్డనే అని ఎద్దేవాచేశారు. హలో... @KTRBRS గారు గీ ఫోటో గుర్తుందా? తమరు ప్రతిపక్షంలో ఉంటే చెప్పేవి శ్రీరంగనీతులు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నీతులు ఎక్కడో కొట్టుకొని పోయినయి! ఐనా చెప్పిందల్లా చేయడానికి మీరేమన్నా సన్నాసులా(నాన్న గారి మాటల్లోనే) ! మీరు మీ పత్రికల ద్వారా గతాన్ని తుడిచేయాలని శతవిధాలా… pic.twitter.com/XdWrEhdOtz — Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) August 4, 2023 -
తలాయి జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలి
బెజ్జూర్: ప్రాణహిత నదిపై తలాయి జలవిద్యుత్ కేంద్రాన్ని ఎందుకు నిర్మించడంలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. ‘ఓటు మీదే–నోటు మీదే‘ నినాదంతో పార్టీ సిర్పూర్ ఇన్చార్జి అర్షద్ హుస్సేన్ చేపట్టిన యాత్ర మండలంలోని పలు గ్రామాల్లో శనివారం కొనసాగింది. తలాయి గ్రామ సమీపంలో నిర్మించతలపెట్టిన జల విద్యుత్కేంద్రం స్థలాన్ని ప్రవీణ్కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తలాయి జలవిద్యుత్ కేంద్రం నిర్మిస్తే ఎన్నో ప్రయోజనాలున్నాయని, దీనికి అనుసంధానంగా ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తే ఇక్కడున్న బీడు భూములన్నీ సస్యశ్యామలమవుతాయని తెలిపారు. ఆదివాసీ, గిరిజనుల బతుకులు బాగు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆదివాసీలకు పోడు పట్టాలివ్వడంలో, రిజర్వేషన్లు పెంచడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. శిథిలావస్థకు చేరిన కృష్ణపల్లి ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. 150 మంది విద్యార్థులన్న పాఠశాలలో సరిపడా టీచర్లు లేరని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజాసమస్యలు పరిష్కరించడంలో పూర్తి గా విఫలమయ్యారని ఆరోపించారు. బీఎస్పీ అధికా రంలోకి వస్తే వెంటనే ఆదివాసీ గూడేల్లో ప్రతీ నిరుపేదకు ఇల్లు నిర్మించే బాధ్యత తీసుకుంటామని, ప్రజాసమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
హైదరాబాద్లో అంబేడ్కర్ భారీ విగ్రహం.. మాయావతి ఫైర్
సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ పేరుతో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం స్వార్థ రాజకీయాలు చేస్తోందని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి మండిపడ్డారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలంటున్న కేసీఆర్.. ఆ మహానుభావుడి విగ్రహాల సాకుతో అణగారిన వర్గాలను మరోసారి ఏమార్చేందుకు వస్తున్నారని విమర్శించారు. బీఎస్పీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో ‘తెలంగాణ భరోసా సభ’ జరిగింది. మాయవతి ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు భూమి లేని దళితులకు మూడెకరాల భూమిని ఉచితంగా ఇచ్చానని.. కేసీఆర్ ఆ పథకాన్ని కాపీకొట్టి ఎన్నికల హామీగా ఇచ్చారని మాయావతి చెప్పారు. కానీ కేసీఆర్ దళితులకు భూమి పంపిణీ చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఎస్పీ బలోపేతం అవడంతో కేసీఆర్కు భయం పట్టుకుందన్నారు. కేసీఆర్ పాలనలో అన్నివర్గాలకు ఇబ్బంది కేసీఆర్ సర్కార్ తీరుతో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, ముస్లిం తదితర అణగారిన వర్గాలన్నీ ఇబ్బంది పడుతున్నాయని మాయావతి ఆరోపించారు. బిహార్లో తెలంగాణకు చెందిన దళిత ఐపీఎస్ను చంపిన హంతకుడిని అక్కడి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేస్తే.. సీఎం కేసీఆర్ కనీసం కూడా ప్రశ్నించలేదేమని నిలదీశారు. అంబేడ్కర్, కాన్షీరాం స్ఫూర్తితో బీఎస్పీ అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని.. భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి వస్తే యూపీలో అమలుచేసిన సంక్షేమ పథకాలను ఇక్కడా అమలు చేస్తామని మాయావతి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోని పేదలు, రైతులు, కూలీలు, నిరుద్యోగులు, మైనారిటీవర్గాలతో పాటు ఉన్నత వర్గాల్లోని పేదలకు కూడా బీఎస్పీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తున్నాయని.. కానీ నిరుద్యోగులకు ఇవ్వాల్సింది భృతి కాదని, ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక్కడ అధికారంలోకి వస్తే ప్రవీణ్కుమారే సీఎం తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్కుమారే ముఖ్యమంత్రి అని మాయావతి ప్రకటించారు. ఆయన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి, పేదలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారని.. అలాంటి వ్యక్తి సీఎం అయితే తెలంగాణ అభివృద్థి చెందుతుందని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం, లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామగ్రామాన బీఎస్పీని బలోపేతం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీఎస్పీ పాత్ర కీలకమని, పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు తెలిపామని మాయావతి గుర్తు చేశారు. బీఎస్పీకి భయపడే అంబేడ్కర్ విగ్రహం: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. ప్రగతిభవన్ మీద నీలి జెండా ఎగరవేయడం ఖాయమని, తెలంగాణను దోపిడీ దొరల నుంచి విముక్తి చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఏనాడూ అంబేడ్కర్ ఫోటోకు, విగ్రహానికి దండ వేయని కేసీఆర్.. బీఎస్పీకి భయపడే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టారని పేర్కొన్నారు. తాను బీఎస్పీలో చేరిన తర్వాతే దళిత బంధు పథకాన్ని తెచ్చారన్నారు. ‘దళితబంధు’లో ఎమ్మెల్యేలు మూడు లక్షల రూపాయల చొప్పన కమీషన్లు తీసుకుంటున్నట్టు స్వయంగా చెప్పిన కేసీఆర్.. దమ్ముంటే ఆ ఎమ్మెల్యేల పేర్లను ఏసీబీకి ఇవ్వాలని సవాల్ చేశారు. రైతులు పంట నష్టపోయి కష్టాలు పడుతుంటే.. కేసీఆర్ ప్రగతిభవన్లో మహారాష్ట్ర వాళ్లను పార్టీలో చేర్చుకునే పనిలో ఉన్నారని, తెలంగాణ ప్రజాధనాన్ని మహారాష్ట్ర వ్యక్తులకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో ఒక్కో ఉద్యోగాన్ని రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రతీ నెలా ఒకటో తేదీన జీతం తీసుకునే కేసీఆర్.. ఉద్యోగులకు మాత్రం 10వ తేదీన జీతాలు ఇస్తున్నాడని ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. పేద ఆర్టిజన్ కార్మికుల మీద ఎస్మా కింద కేసులు పెట్టారని, నెలకు 4లక్షలకుపైగా జీతం తీసుకుంటున్న కేసీఆర్పై ఎస్మా ప్రయోగించాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం నాడు తాము గజ్జె కట్టామని.. ఇప్పుడు అన్యాయం జరిగితే గల్లా పడతామని హెచ్చరించారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. భూమి లేని వారికి ఎకరం భూమి ఇస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో బీఎస్పీ తెలంగాణ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్, ఏపీ అధ్యక్షుడు పరంజ్యోతి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేశ్ చౌహాన్, అరుణ, సంజయ్ కుమార్, దాసరి ఉష తదితరులు పాల్గొన్నారు. -
గ్రూప్–1 టాపర్ ఎవరో చెబితే ప్రభుత్వం కూలుతుంది: ఆర్ఎస్ ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ గ్రూప్–1 మొదటి ర్యాంకు ఎవరిదో చెబితే బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్లకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా గ్రూప్–1 టాపర్లు ఎవరో ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంగళవారం బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ భోరోసా దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ సిబ్బంది, ఈ కేసులో నిందితులైన రాజశేఖర్రెడ్డి, దాసరి కిషోర్లకు గ్రూప్–1 ప్రిలిమ్స్లో 150 మార్కులకుగాను 120 మార్కులు సాధించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు తెలిసిన వారే టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఉన్నారని, అందువల్ల ఆ కమిషన్ను వెంటనే రద్దు చేయాలన్నారు. ఏ నిరుద్యోగ బిడ్డల త్యాగం వల్ల తెలంగాణ వచి్చందో, ఆ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు అమ్ముకుంటోందని ప్రవీణ్కుమార్ ఆరోపించారు. ‘టెన్త్’లో అలా.. టీఎస్పీఎస్సీలో ఇలా.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ‘సిట్’విచారణ నత్తనడకన సాగుతోందని... నిందితులను బాధితులుగా చూపే ప్రయత్నం జరుగుతోందని దుయ్యబట్టారు. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు 48 గంటల్లోనే పాత్రదారులు, సూత్రదారులను అరెస్ట్ చేశారని... కానీ టీఎస్పీఎస్సీ కేసులో సూత్రదారులు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నందునే ఇప్పటివరకు అరెస్టు చేయలేదని ఆరోపించారు. ఈ కేసుపై స్పందించకుండా ముఖ్యమంత్రి మౌనం వహిస్తున్నారంటే తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ముఖ్యమంత్రి గద్దె దిగాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్కు దమ్ముంటే అమరవీరుల స్థూపం వద్దకు రావాలని, తాము పేపర్ లీక్కు సంబందించి ఆధారాలతో వస్తామని ఆయన సవాల్ చేశారు. 18న నిరసన దీక్ష... టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిరుద్యోగులకు న్యాయం చేసేలా ప్రతిపక్ష పారీ్టలంతా ఏకతాటిపైకి రావాలని ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. అలాగే కొత్త కమిషన్ వేశాకే పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్తో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అన్ని పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలతో ఈ నెల 18న ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేయనున్నట్లు ప్రవీణ్కుమార్ తెలిపారు. సీఎంకు 25 ప్రశ్నలు రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం కేసీఆర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు వాడుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మంగళవారం బీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలను ఓటుబ్యాంకుగా చూడటమే తప్ప చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 2016లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికైనా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని... కానీ గతంలో దళిత, బహుజనులకు ఇచ్చిన హామీల సంగతేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా 25 ప్రశ్నలతో సీఎంకు రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ -
కేటీఆర్ను విచారిస్తే నిజాలు తెలుస్తాయి
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలో సీఎం కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందని తాను మొదటి నుంచి వ్యక్తం చేస్తున్న అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్–1 సహా మిగిలిన పరీక్ష పేపర్ల లీకేజీలో ఐటీ శాఖకు ప్రత్యక్ష సంబంధం ఉందన్నట్లుగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్కు ఈ వ్యవహారంలో సంబంధం ఉందని ఆయన మాటల ద్వారానే తెలుస్తోందని, ఆయనను సిట్ విచారిస్తే నిజాలు తెలుస్తాయని అన్నారు. మంగళవారం ఆయన బీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రూప్–1 ప్రిలిమ్స్ కటాఫ్ మార్కుల వివరాలను ఇప్పటికీ అధికారికంగా వెల్లడించకున్నా జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో, సిరిసిల్లలో ఎంతమంది పరీక్ష రాస్తే ఎందరు క్వాలిఫై అయ్యారో కేటీఆర్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. కేటీఆర్కు ఆ డేటా టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డిగానీ, కమిషన్ సభ్యులుగానీ ఇచ్చారా అని అనుమానం వ్యక్తం చేశారు. పేపర్ల కుంభకోణానికి తనకు సంబంధం లేదంటూనే టీఎస్పీఎస్సీ తరపున కేటీఆర్ వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు మాత్రమే లీకేజీ అంశాలను వెల్లడించాల్సి ఉండగా, ఆ సంస్థ అధికార ప్రతినిధిగా కేటీఆర్ ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ ఆఫీస్ ఈ వ్యవహారంలో రిమోట్గా పనిచేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులకు నోటీసులు ఇస్తూ కేటీఆర్కు మాత్రం డేటా ఇస్తున్నారన్నారు. పేపర్ లీకేజీపై చైర్మన్ జనార్దన్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కమిషన్ చైర్మన్, సభ్యుల హస్తం ఉందని ఆరోపించారు. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ తారుమారు చేశారనే అనుమానం బలపడుతోందని, కీలకమైన సాక్ష్యాలను చెరిపివేశారనే అనుమానం కూడా కలుగుతోందన్నారు. 80 నుంచి 90 మార్కులుపైగా వచ్చిన వాళ్ల ఓఎంఆర్ షీట్లను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. -
నిందితులను రక్షించడానికే సిట్: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
బిజినేపల్లి: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిందితులను పట్టుకోవడానికి కాకుండా..అసలు నిందితులను రక్షించడానికే పనిచేస్తుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. పేపర్ లీక్ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ బోర్డుకు, ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధాలున్నాయనే ఆరోపణలు రోజురోజుకూ బలపడుతున్నాయన్నా రు. టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుడు లింగారెడ్డి పీఏకు గ్రూప్–1లో 127 మార్కులు ఎలా వచ్చాయని, ముఖ్యమంత్రికి ఓఎస్డీగా పనిచేసే రాజశేఖర్రెడ్డికి లింగారెడ్డి స్వయంగా మేనబావని తెలిపారు. రాజ్యాధికార యాత్ర లో భాగంగా శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో ప్రవీణ్ కుమార్ పర్య టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిట్ ఈ కేసులో అసలు దోషులను వదిలేసి, కిందిస్థాయిలో 12 మందిని అరెస్టు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 2009 బ్యాచ్కు చెందిన 200 మంది ఎస్సైల పదోన్నతుల ఫైల్ను పెండింగ్లో పెట్టారని, అలాంటి ఫైల్స్ చూడని హోంమంత్రిపై త్వర లోనే మిస్సింగ్ కంప్లైంట్ చేస్తామన్నారు. ప్రభుత్వానికి పనిచేయాల్సిన అడ్వొకేట్ జనరల్ కవిత లిక్కర్ స్కాం కేసు కోసం ఈడీ ముందు ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. -
బీఆర్ఎస్, బీజేపీలవి దొంగాటలు
ఆలంపూర్: ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే బీఆర్ఎస్, బీజేపీ దొంగాటలు అడుతున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలో బీఎస్పీ బహుజన రాజ్యాధికార యాత్ర శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా ఆలంపూర్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ బీసీ రిజర్వేషన్ను 27 నుంచి 50 శాతానికి ఎందుకు పెంచడం లేదని సీఎం కేసీఆర్ను నిలదీశారు. బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వానికి వస్తున్న అడ్డంకులేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల గురించి ఎమ్మెల్యేలెవరైనా మాట్లాడితే వారిని ప్రగతిభవన్లోకి అడుగు పెట్టనీయరని, అందుకే వారు క్యాంపు కార్యాలయాలకే పరిమితమయ్యారని అన్నా రు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు మహిళారిజర్వేషన్లు గుర్తుకు వచ్చాయని, అందుకే నిరాహార దీక్ష చేస్తానని అంటున్నారని అన్నారు. తెలంగాణలో 2014 నుంచి 2018 వరకు ఒక్క మహిళామంత్రి లేరని, అప్పుడు ఎందుకు కవితకు నిరాహార దీక్ష ఆలోచన రాలేదని ప్రశ్నించారు. బీఎస్పీ కేవలం మహిళల గురించే కాదు బీసీలు, మైనారీ్ట, ఎస్టీల రిజర్వేషన్ల కోసం కూడా పోరాడుతుందన్నారు. రూ.3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో ముస్లింల కోసం ఒక శా తం కంటే తక్కువగా నిధులు కేటాయించడం శోచనీయమని అన్నారు. ముస్లింల పై సానుభూతి వ్యక్తం చేసే పారీ్టలు ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సమావేశంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కేశవరావు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మహిళా కనీ్వనర్ రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. -
దళితబంధు.. బీఆర్ఎస్ కార్యకర్తలకు విందు
జన్నారం (ఖానాపూర్): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం బీఆర్ఎస్ కార్యకర్తలకు విందుగా మారిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. మంగళవారం బీఎస్పీ రాజ్యాధికార యాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా జన్నా రం మండలం ధర్మారం, కామన్పల్లి, ఇందన్పల్లి, జన్నారం గ్రామాల్లో పర్యటించారు. జన్నారంలో ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. దళితబంధు పథకం ప్రకటనకే పరిమితమైందని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులతోపాటు గిరిజనేతరులు కూడా అటవీ హక్కు పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు. టైగర్జోన్ పేరుతో అడవిలో ఉన్న గిరిజనులు, గిరిజన గ్రామాలను తరలించడం సరికాదన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సర్పంచ్ల ఆత్మహత్యలకు కారణమవుతున్న ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రవీణ్ పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు రమేశ్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాథోడ్ బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు
ఉట్నూర్/ఇంద్రవెల్లి: రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో పర్యటించారు. ముందుగా ఉట్నూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ధరణి పోర్టల్ పనితీరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అనంతరం ఐబీ చౌరస్తాలో మాట్లాడుతూ, పేదలకు మెరుగైన విద్య, వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో కాంగ్రెస్, బీజేపీలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. సచివాలయం గుమ్మటాలు కూల్చుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. కూల్చాల్సింది గుమ్మటాలు కాదని.. రాష్ట్రంలో అవినీతిలో కురుకుపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడి, బీఎస్పీని ఆదరించాలన్నారు. అనంతరం యాత్ర పెర్కగూడ, శ్యాంపూర్, యోందా, ఉమ్రి, నర్సాపూర్, గోట్టిపటార్ మీదుగా ఇంద్రవెల్లి చేరుకుంది. ఇంద్రవెల్లిలోని బుద్ధనగర్, ప్రబుద్ధనగర్, సట్వాజిగూడ, బుర్సన్పటర్ గ్రామాల్లో యాత్ర సాగింది. -
తాను పోటీచేసే అసెంబ్లీ స్థానంపై క్లారిటీ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
-
TS: బీఎస్పీకి కంచుకోట ఉందా? అక్కడి నుంచే ప్రవీణ్ కుమార్ పోటీ!
ఆ నియోజకవర్గం BSP కంచుకోటగా చెబుతారు. ఆ బహుజనుల కోట నుంచే పార్టీ రాష్ట్ర చీఫ్ ఎన్నికల బరలో దిగబోతున్నారా? అక్కడి నుంచే పోటీ చేయడానికి ప్రవీణ్కుమార్ భావించడానికి కారణం ఏంటి? నియోజకవర్గంలో ప్రవీణ్ పర్యటన ఎన్నికల యాత్రేనా? కుమ్రంబీమ్ జిల్లాలోని సిర్పూర్ టి నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీకి బలమైన స్థావరంగా భావిస్తారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రెండు సీట్లలో అనుహ్యంగా BSP రెండు స్థానాల్లో విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ టి నియోజకవర్గం నుండి BSP రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ బరిలో దిగాలని భావిస్తున్నారట. అందులో బాగంగానే బహుజన రాజ్యదికార యాత్రను ఐదురోజుల పాటు ఈ నియోజకవర్గంలో ప్రవీణ్ నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల యాత్రలో తెలంగాణ సర్కారు వైఫల్యాలను ఇంటింటికి తీసుకువెళ్లుతున్నారు. ఈ సందర్భంగా బహుజన రాజ్యం తెచ్చేందుకు మద్దతివ్వాలని ప్రజలను కోరుతున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే కోనేటి కోనప్ప విఫలం చెందారని విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. గుడ్బై ఐపీఎస్.. ఛలో అసెంబ్లీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ..ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్కుమార్ బహుజన సమాజ్ పార్టీ ద్వారా ప్రజా జీవితంలోకి అడుగు పెట్టారు. రాబోయే ఎన్నికలే ఆయన ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికలు. సిర్పూర్ నియోజకవర్గం నుంచే ఎన్నికల బరిలోకి దిగాలని భావించిన ప్రవీణ్ అక్కడి పరిస్థితులు అధ్యయనం చేసేందుకే యాత్ర నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం లో దళిత, గిరిజన, మైనారీటీ, బీసీ ఓటర్లు భారీగా ఉన్నారు. ఆయా వర్గాలే అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. పైగా 2014లో ఇక్కడ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అందుకే సిన్సియర్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న ప్రవీణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తే మళ్ళీ బలహీనవర్గాల ప్రజలంతా మద్దతిస్తారనే అంచనాతోనే ఈ స్థానంపై కన్నేసారని తెలుస్తోంది. పైగా స్థానిక ఎమ్మెల్యే కోనప్ప పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని టాక్. ఎమ్మెల్యేపై వ్యతిరేకత బిఎస్పీకి అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. తాను ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ...జనరల్ సీటులో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఎంత పెద్ద నాయకులైనా రిజర్వుడు కేటగిరికి చెందినవారైతే..ఆ స్థానాల్లోనే పోటీ చేస్తారు. కాని దానికి భిన్నంగా అందరివాడిగా గుర్తింపు పొందాలని భావిస్తున్న ప్రవీణ్కుమార్ జనరల్ సీటునే ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారంటూ ప్రచారం సాగుతున్నా..పార్టీ నాయకత్వం మాత్రం దీనిపై ఇంకా ప్రకటన చేయలేదు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
బీఆర్ఎస్, బీజేపీ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాయి
కాగజ్నగర్టౌన్: ప్రశ్నించే గళాలను అణచివేయడా నికి బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు కుట్రలు చేస్తు న్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ కుట్రల్లో భాగంగా తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తన ఆపిల్ సెల్ఫోన్ను ట్యాప్ చేస్తున్నట్లు ఆ సంస్థ తనకు మెయిల్ పంపించిందని తెలిపారు. ప్రవీణ్కుమార్ చేపట్టిన రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్ర సోమవారం కుమురంభీం జిల్లా కాగజ్నగర్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బహుజన రాజ్యం కోసం తాను చేస్తున్న పోరాటాన్ని జీర్ణించుకోలేక, బీఎస్పీకి పెరుగుతున్న ఆదరణను తట్టు కోలేక ప్రభుత్వాలు ఇలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఈ పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాగా, రైతుస్వరాజ్య వేదిక నాయకులను ఉద్దేశించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, రైతులకు పల్లా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు ఎక్కువయ్యాయని, పేదల భూములను ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిడాం గణపతి, జిల్లా అధ్యక్షుడు ఆకుల సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలి.. సీఎంకు ప్రవీణ్కుమార్ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ రిజర్వే షన్లను 27% నుంచి 50 శాతానికి పెంచా లని, బీసీ జన గణన ను చేపట్టాలని ప్రభు త్వాన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆయన బహిరంగ లేఖ రాశా రు. తెలంగాణలో బీసీల జనాభా 50 శాతా నికిపై ఉన్నా విద్య, ఉద్యోగాలు సహా అన్ని రంగాల్లో బీసీల వాటా 27శాతమే ఉందన్నారు. పెరిగిన జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వే షన్లు కల్పించాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 50% నిధులను బీసీలకు కేటా యించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, సమగ్ర కుటుంబ సర్వే నివేదికను బహిర్గతపరచాలని డిమాండ్ చేశారు. బీసీల సమస్యలను తక్షణ మే పరిష్కరించకపోతే ప్రభుత్వం రాజీనామా చేసి గద్దెదిగాలని లేఖలో డిమాండ్ చేశారు. చదవండి: రేవంత్రెడ్డి కొత్త పార్టీ?.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం.. -
బంగారు తెలంగాణ దొరలకే పరిమితమైంది
సాక్షి, పెద్దపల్లి: బంగారు తెలంగాణ దొరల ఇంటికే పరిమితమైందని, పేదలకు ఇళ్లు లేవు, ఇంటికి తలుపులు లేవని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మంగళవారం పెద్దపల్లి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ దోచుకోడానికే అధికారంలోకి వచ్చాయని, అందుకే దొరల పాలన అంతం చేసి పేదల రాజ్యం తెచ్చుకోవాలన్నారు. ఒకవైపు మహిళల రక్షణ కోసం షీ టీమ్లు అని డబ్బాలు కొడుతున్నారని.. మరోవైపు బాలికలపై అధికార పార్టీ నేతలు అత్యాచారాలు చేస్తున్నారని ఆరోపించారు. -
పోలీసు నియామకాల నిబంధనలను మార్చాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో ఉన్న నియమ నిబంధనలను మార్చాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. మూడు ఈవెంట్స్ తప్పనిసరి చేయడంపై పునరాలోచించాలని, ఎత్తును మాన్యువల్గా కొలవాలని, షాట్పుట్ లైన్ మీద పడినా క్యాలిఫై చేయాలని కోరారు. సోమవారం బీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఈసారి పరుగు పందెంలో పురుషులకు 1,600 మీటర్లు, అమ్మాయిలకు 800 మీటర్లు పెట్టడం నిరుద్యోగులను ఇబ్బందులకు గురిచేయడమనే అన్నారు. లాంగ్జంప్ 3.8 మీటర్లు పరిగణనలోకి తీసుకోవాలని, ఎత్తు కొలిచే సందర్భంలోనూ సాంకేతిక లోపంతో చాలా మంది అభ్యర్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎత్తును మ్యానువల్గా కొలవాలని కోరారు. చాలా గ్రామాల్లో సరైన గ్రౌండ్స్ లేవని, పీఈటీ కూడాలేని పరిస్థితుల్లో మూడు ఈవెంట్స్ తప్పనిసరి చేయడం సరికాదని, ఎక్కువ మంది హాజరు కాకూడదనే కుట్రపూరితంగా ఇలా చేస్తున్నారని ప్రవీణ్కుమార్ విమర్శించారు. ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నికల సమయంలో ఉద్యోగాలంటూ అభ్యర్థులను ఆందోళనలకు గురి చేయడం ఏమిటని నిలదీశారు. నిబంధనలను మార్చకపోతే బీఎస్పీ నిరవధిక పోరాటం చేస్తుందని హెచ్చరించారు. -
రాష్ట్రంలో దౌర్జన్యకర పాలన
ధన్వాడ: రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు దౌర్జన్యం చేస్తూ ప్రజలను భయపెడుతూ పాలన సాగిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. శనివారం ధన్వాడ మండలంలోని గున్ముక్లలో ఆయన పర్యటించి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు కండువా కప్పి బీఎస్పీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి గల్లీలో బెల్ట్షాపులు పెట్టి కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను తాగుబోతులుగా చేసేందుకు యత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రులు ప్రజలను వైద్యం పేరుతో దోచుకుంటున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీని ఆదరించాలని, తాము అధికారంలోకి వస్తే భూమి లేని వారికి ఎకరాభూమి ఇస్తామని, బెల్ట్షాపులను పాలబూతులుగా మారుస్తామని, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూలు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాస్ కుటుంబీకులను ప్రవీణ్కుమార్ పరామర్శించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ డీఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మద్యంతో వచ్చే డబ్బులా? ప్రజల భవిష్యత్ ముఖ్యమా..
బాలానగర్: సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. మద్యం ద్వారా వచ్చే రూ.35 వేల కోట్లు కావాలా.. 3.77 కోట్ల మంది ప్రజల బంగారు భవిష్యత్ కావాలా అని ప్రశ్నించారు. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఓ తండాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విద్యార్థిని కుటుంబాన్ని ప్రవీణ్కుమార్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మద్యం మత్తులోనే ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పారు. చక్కగా ఇంగ్లిష్ మాట్లాడే విద్యార్థులు తయారవుతున్న ఈ తరుణంలో గల్లీ గల్లీలో బెల్టు షాపులు ఏర్పడటంతో.. మద్యానికి అలవాటు పడిన యువకులు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎంతోమంది పిల్లల భవిష్యత్ నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మీకేమో లిక్కర్ స్కాములు.. మాకేమో మరణ శయ్యాలా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాలిక ఆత్మహత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కటుంబానికి న్యాయపరంగా అండగా ఉంటామన్నారు. ఆయన వెంట బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్ బాలవర్ధన్గౌడ్, మండల కోఆర్డినేటర్ యాదయ్య తదితరులుఉన్నారు. -
లిక్కర్ స్కాంపై పెదవి విప్పరెందుకు?
ఖమ్మం/మామిళ్లగూడెం: ప్రతి అంశంపై మీడియా సమావేశాలు పెట్టి గంటల తరబడి మాట్లాడే సీఎం కేసీఆర్.. లిక్కర్ స్కాంపై ఎందుకు పెదవి విప్పడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. తన కూతురు కవితను లిక్కర్ స్కాం నుంచి కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాంతాచారి వంటి ఎంతోమంది అమరులు సాధించిన తెలంగాణ నేడు స్కాంలకు నిలయంగా మారిందన్నారు. రాష్ట్రంలో మోసాలు, అవినీతి పెరిగిపోయాయని, సీబీఐ కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న కేసులకే అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అధికారులు, కవిత విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆధారాలు కూడా దొరకకుండా మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీజేపీకి చెందిన బీఎల్ సంతోష్ రూ.వందల కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తే ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు. ఆపరేషన్ ఆకర్‡్ష రాజ్యాంగ విరుద్ధమన్నారు. -
లిక్కర్ స్కాంలో ప్రభుత్వం
అలంపూర్/అలంపూర్ రూరల్: టీఆర్ఎస్ ప్రభుత్వం లిక్కర్ స్కాంలో మునిగిపోయిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చెప్పారు. గురువారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్లో నిర్వహించిన బీఎస్పీ పాదయాత్ర ముగింపు సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకులు ఈ స్కాంలో రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన డబ్బును ఇతర దేశాలు, రాష్ట్రాల్లో లిక్కర్ ఇతర దందాల్లో పెట్టుబడులు పెట్టారని విమర్శించారు. ఇందులోని నిందితులు తమ సెల్ఫోన్లను సైతం పగలగొట్టారని, ఇలాంటి నీచమైన పనిని కరడు కట్టిన నేరస్తులు సైతం చేయరని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు దమ్ముంటే బీసీల కులగణన చేపట్టి, రిజర్వేషన్లు పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. -
ముందస్తు ఎన్నికలు ఖాయం: ఆర్.ఎస్.ప్రవీణ్
కామారెడ్డి టౌన్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చెప్పారు. సీఎం కేసీఆర్ అకస్మాత్తుగా ఫామ్హౌస్ నుంచి బయటకు వచ్చి జిల్లాల పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వెనక ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఉండి ఉండవచ్చన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్కు ఎలాంటి సిద్ధాంతం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఎజెండాతో ఏర్పాటైన పార్టీని దేశవ్యాప్తంగా ప్రజలు ఎలా ఆదరిస్తారని ప్రశ్నించారు. బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో పలువురు రైతులు, సైనికులకు ఆర్థిక సాయం చేసినంత మాత్రాన ప్రజలు ఆదరించరని తెలిపారు. కమ్యూనిస్టుల మద్దతు తీసుకుని, వందలమంది నాయకులను మోహరించి, రూ.500 కోట్లు ఖర్చు చేస్తేగానీ మునుగోడు ఉపఎన్నికలో గెలవలేదని ప్రవీణ్ ఎద్దేవాచేశారు. బీఎస్పీ కార్యకర్తలు గ్రామగ్రామాన నూతన కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. త్వరలో బహుజన రాజ్యాధికార యాత్ర కామారెడ్డి జిల్లాలో చేపడతామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్రాజు, జిల్లా ఇన్చార్జులు సురేశ్గౌడ్, సాయిలు, జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్, మహిళా కన్వీనర్ వసంత తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలి
నాంపల్లి: బీసీ రిజర్వేషన్లను యాభై శాతానికి పెంచాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఏసీగార్డ్స్ అడ్వకేట్స్ కాలనీలోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల పెంపు–బీఎస్పీ భవిష్యత్తు కార్యాచరణ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. జనాభా దామాషా పద్ధతిలో బీసీ రిజర్వేషన్లు 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, క్రీమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని కోరారు. కాలేల్కర్, మండల్ కమిషన్ల సిఫార్సులను అమలు చేయకుండా ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో కూడా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో దేశవ్యాప్తంగా బీసీల కోసం 8617 టీచింగ్ పోస్టుల భర్తీకి అనుమతి ఉన్నా ఉద్దేశపూర్వకంగా 4821 పోస్టులను ఖాళీగా ఉంచారని నిందించారు. దర్యాప్తులు, ఐటీ దాడుల పేరుతో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని దుయ్యబట్టారు. పథకం ప్రకారమే రెండు ప్రభుత్వాలు దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలివ్వకుండా ఫారెస్టు అధికారులను చంపుతున్నారని ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం నుంచి తమ పార్టీ కార్యాచరణ ప్రారంభం అవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయానంద రావు, రాష్ట్ర మైనార్టీ కన్వీనర్ అబ్రార్, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, అధికార ప్రతినిధులు సాంబశివగౌడ్, అరుణ, డాక్టర్ వెంకటేష్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో ఆరు నెలల్లో ఎన్నికలు ఖాయం
సిద్దిపేటజోన్: తెలంగాణలో ఆరు నెలల్లో ఎన్నికలు రావడం ఖాయమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తూ బుధవారం సిద్దిపేటలోని పార్టీ కార్యాలయంలో తన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఎస్పీ శ్రేణులకు కేవలం 180 రోజుల సమయం ఉందని, గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మరో 55 మంది కార్యకర్తలను తయారు చేయాలని, సామాజిక మాధ్యమాల్లో కాకుండా బహుజన కార్యకర్తలు గ్రామాల్లో ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకుగాను ‘మై బీఎస్పీ టాక్ ఇన్’అనే పోర్టల్ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. తనపై కేసులు పెట్టినా, బెదిరింపులకు పాల్పడినా భయపడేదిలేదన్నారు. ఇదీ చదవండి: డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లైన్ క్లియర్.. లబ్ధిదారుల ఎంపిక షురూ! -
బీజేపీ, టీఆర్ఎస్ రెండూ దొంగ పార్టీలే: ఆర్ఎస్పీ
కొల్లాపూర్ రూరల్: బీజేపీ, టీఆర్ఎస్ రెండూ దొంగ పార్టీలేనని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని కుడికిల్లలో ఇటీవల పోడు భూముల సమస్యలతో నార్లాపూర్, కుడికిల్ల గ్రామాల రైతుల ఘర్షణలో గాయపడిన దళిత రైతులను పరామర్శించారు. అనంతరం ప్రవీణ్ విలేకరులతో మాట్లాడుతూ అంగట్లో సరుకుల మాదిరిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రెండు పార్టీలు ముందుగా మాట్లాడుకునే ఈ తతంగాన్ని నడిపాయని ఆరోపించారు. కొనుగోలుకు గురైన ఎమ్మెల్యేలను దించి.. బీఎస్పీ పార్టీ వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
మునుగోడులో ఓటమి ఒప్పుకున్న టీఆర్ఎస్
మునుగోడు: ఎనిమిదేళ్లు గా ప్రజా సమస్యలు పట్టించుకోని సీఎం కేసీఆర్.. మునుగోడు ఉప ఎన్నికకు మంత్రులు, ఎమ్మెల్యేలను కలిపి.. మొత్తం 88 మందిని పంపడం ద్వారా పరో క్షంగా ఓటమిని అంగీకరించారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్పష్టం చేశారు. గురువారం ప్రవీణ్కుమార్ మునుగోడు మండలం కొంపల్లి, చల్మెడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రోజు కూడా ఫామ్ హౌస్ని వదిలి బయటకురాని సీఎం.. నేడు కేవలం ఒక ఎంపీటీసీ పరిధిని ఎంచుకొని ప్రచారం చేయడం ఆయన అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు. వెల్మకన్నె గ్రామానికి ప్రచారానికి వెళ్లి మహిళలతో మాట్లాడారు. మాటల సందర్భంలో తాము ఎప్పుడూ ఏసీ కారులో తిరగలేదని ఆ మహిళలు చెప్పారు. దీంతో ప్రవీణ్కుమార్ వారిని కారులో ఎక్కించుకుని కాసేపు తిప్పారు. -
కూతురు కోసమే ఢిల్లీకి సీఎం కేసీఆర్
చండూరు : మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బంధువు అభిషేక్రావు అరెస్టయ్యారని, తర్వాత ఎమ్మెల్సీ కవిత అరెస్టవుతుందని తెలిసి..తన కూతుర్ని కాపాడుకోవడం కోసమే కేంద్రంలో మంతనాలు జరపడానికి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం పరిధిలోని చండూరు, తుమ్మలపల్లి, దోనిపాముల, కొండాపురం, నెర్మట గ్రామాలలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, ఒప్పందం ప్రకారం కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. స్కాంలు, కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయే నాయకులను, దోపిడీ పార్టీలను ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. ఉపఎన్నికల్లో గెలవడం కోసం ఆధిపత్య పార్టీలు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయన్నారు. ఈ ఉప ఎన్నిక కొండ చిలువకు, చలి చీమలకు మధ్య యుద్ధంగా అభివర్ణించారు. ఇప్పటికీ చండూరులో బుడగ జంగాలు, ఎరుకల కులాలు చెత్త ఏరుకుని బతుకుతున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్పీ పార్టీని ఆదరించి..ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు జగన్నాథ్గౌడ్, ప్రమీల, నిర్మల, సుజాత, గణేశ్, శివ పాల్గొన్నారు. -
దేశాన్ని దోచుకునేందుకే బీఆర్ఎస్
మునుగోడు: తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో దోచుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు దేశాన్ని కూడా దోచుకునేందుకు బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం కాన్షీరాం వర్థంతి సందర్భంగా నల్లగొండ జిల్లా మునుగోడులోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన ధూంధాం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు చేపడుతోందన్నారు. సీఎం కేసీఆర్ తనకు ఆదాయం వస్తే చాలు, ప్రజల ఆరోగ్యాలు తనకు అవసరం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నియంత పాలన, దేశంలో మతతత్వ పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్, బీజేపీలను మునుగోడు ఉపఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. బహుజనుల రాజ్యాధికారం సాధించేందుకు కాన్షీరాంను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కాన్షీరాం స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని మునుగోడు ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి అందోజు శంకరాచారిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ మునుగోడు అభ్యర్థి అందోజు శంకరాచారి తదితరులు పాల్గొన్నారు. -
మునుగోడు ఉప ఎన్నిక; బీఎస్పీ అభ్యర్థిగా యువ నాయకుడు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థిని బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఆందోజు శంకరాచారిని తమ పార్టీ తరపున పోటీకి నిలబెడుతన్నట్టు ఆయన వెల్లడించారు. శనివారం శంకరాచారికి పార్టీ తరపున బిఫాం అందించారు. ఉన్నత విలువలున్న యువనాయకుడు శంకరాచారిని గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. కలుద్దాం- నిలుద్దాం- గెలుద్దాం నినాదంతో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ నవంబర్ 3న జరగనుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా ప్రజాగాయకుడు గద్దర్ను ఖరారు చేశామని ఆ పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక మునుగోడులో విజయం కోసం రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ముఖ్య నేతలను రంగంలోకి దించాయి. మునుగోడులో విజయం ఎవరిని వరిస్తుందో నవంబర్ 6న వెల్లడవుతుంది. (క్లిక్ చేయండి: పదోసారి పోటీ.. మునుగోడులో విజయం నాదే) -
మునుగోడులో సారా, కూర, ఖారతో ప్రలోభాలు
మర్రిగూడ: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ సారా, కూర, ఖార ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని మర్రిగూడ, యరగండ్లపల్లి, తిరగండ్లపల్లి, లెంకలపల్లితోపాటు మరికొన్ని గ్రామాల్లో బహుజన రాజ్యాధికారయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. 70 రోజులుగా 23 వేల మంది వీఆర్ఏలు శాంతియుతంగా సమ్మె చేస్తుంటే లాఠీచార్జి చేయించి అణచివేసే ప్రయత్నం చేస్తూ.. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడడం అమానుషమన్నారు. కాగా, మర్రిగూడ మండలంలోని పీహెచ్సీని ప్రవీణ్కుమార్ సందర్శించారు. అదే సమయంలో నడవలేక ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధుని కుటుంబీకులు మోసుకెళ్తున్న దృశ్యం చూసి తాను కూడా చేయివేసి సాయం చేశారు. చదవండి: బీజేపీకి కొత్త పేరు చెప్పిన కేటీఆర్ -
దోచుకున్న సొమ్ముతో విమానాల కొనుగోలు: ఆర్ఎస్ ప్రవీణ్
మర్రిగూడ: ఎంతో మంది త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో నేడు కేసీఆర్ కుటుంబపాలన కొనసాగుతోందని, దోచుకున్న సొమ్ముతో విమానాలు కొంటున్నారంటే పాలన ఏవిధంగా ఉందో అర్ధమవుతుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. ఆయన శుక్రవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో బహుజన రాజ్యాధికార యాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. గ్రామాల్లో వన భోజనాలు, బతుకమ్మ చీరలతో మాయమాటలు చెబుతూ మత్తులో ముంచడం టీఆర్ఎస్ పార్టీకే చెల్లుతుందన్నారు. ఫార్మా కంపెనీలు, రీజినల్ రింగురోడ్ల పేర్లతో బడుగు, బలహీనవర్గాల భూములను లాక్కొంటున్నారని, అగ్రవర్ణాల వారి భూములను అలాగే ఉంచుతున్నారని ఆరోపించారు. చదవండి: సాగరహారంపై ‘పిట్ట పోరు’.. కేటీఆర్–రేవంత్ల మాటల యుద్ధం -
కేసీఆర్కు 300 ఎకరాలు ఎందుకు?
సంస్థాన్నారాయణపురం: ‘ముఖ్యమంత్రి కేసీఆర్కు 300 ఎకరాల భూమి ఉంది, పేదలకు మాత్రం ఎకరం భూమి లేదు, సరైన ఇళ్లు లేవు’ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం జనగాంలో గురువారం బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, రాజగో పాల్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, పాల్వాయి స్రవంతి భూమి దున్నగలరా, విత్తనాలు వేయగలరా, కలుపు తీయగలరా? వారికి వందల ఎకరాల భూమి ఎందుకు’అని ప్రశ్నించారు. గిరిజనులు చదును చేసి సాగు చేసుకుంటున్న భూములను గుంజుకుంటున్నారని, పట్టాలివ్వకుండా అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బహుజన రాజ్యం వస్తే ప్రతి నిరుపేద కుటుంబానికి ఎకరం భూమితో పాటు పట్టాలు ఇస్తామని ప్రవీణ్కుమార్ హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగాలు ఇవ్వడం లేదని, నాయకులు మాత్రం విదేశాల్లో కూడా వ్యాపారం చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని దుయ్యబట్టారు. ఓట్ల సమయంలో పేదలకు డబ్బు, మద్యం పంచి ఎన్నికల అనంతరం అభివృద్ధికి దూరంగా ఉంచుతున్నారని విమర్శించారు. చదవండి: బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు.. సీఆర్పీఎఫ్ జవాన్ నిర్వాకం -
ప్రజలసొమ్ముతో టీఆర్ఎస్ నేతల దావత్లు
సంస్థాన్ నారాయణపురం: నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సంపాదించిన సొమ్ముతోనే మనకు దావతులు ఇస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం యాద్రాది భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని మల్లారెడ్డిగూడెం, గుజ్జ తదితర గ్రామాలలో ఆయన పర్యటించారు. పాదయాత్ర చేస్తూ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దావతులు, డబ్బు, చీరలు పంచడం తప్ప టీఆర్ఎస్కు అభివృద్ధి చేతకాదని విమర్శించారు. చదవండి: ప్రాజెక్టులకు సహకరించని రాష్ట్ర సర్కారు -
ఎనిమిదేళ్లలో రూ.5 లక్షల కోట్ల అప్పు
చౌటుప్పల్: కేసీఆర్ తన ఎనిమిదేళ్ల పాలనలో రూ.5 లక్షల కోట్ల అప్పు చేశారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. బీఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర ఆదివారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం, చౌటుప్పల్, తంగడపల్లి గ్రామాల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా చిరు వ్యాపారులు, వివిధ రంగాల కార్మికులతో ఆయన ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్గమధ్యంలో చాకలి ఐలమ్మ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సర్దార్ సర్వాయి పాపన్నల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి స్కీంలతో సీఎం కేసీఆర్ కోట్లు సంపాదించారని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చేవి స్కీంలు కాదని, అన్నీ స్కాంలేనని అన్నారు. స్కీంల ద్వారా పేదల పేరు చెప్పుకొని టీఆర్ఎస్ నాయకులు జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం నాసిరకం బతుకమ్మ చీరలు పంచుతూ మహిళలను అవమానపరుస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని గుజరాత్ షేఠ్లకు అమ్ముతోందని ధ్వజమెత్తారు. మునుగోడు ఎన్నికల కోసం కేంద్రహోంమంత్రి అమిత్ షా తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డికి రూ.150 కోట్లు ఇచ్చారని ఆయన ధ్వజమెత్తారు. -
ఉప ఎన్నిక కోసమే ‘గిరిజన బంధు’
చౌటుప్పల్ రూరల్: మునుగోడు ఉప ఎన్నిక కోసమే సీఎం కేసీఆర్ గిరిజన బంధు పథకాన్ని తెస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. గిరిజనులపై అంత ప్రేమ ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసీ బిడ్డ ముర్ముకు ఎందుకు ఓటేయలేదని, అగ్రవర్ణానికి చెందిన యశ్వంత్ సిన్హాకు ఎందుకు మద్దతిచ్చారని ఆయన ప్రశ్నించారు. ప్రవీణ్కుమార్ చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర గురవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాన్పేట, మల్కాపురం, ఖైతాపురం, ఎనగంటితండా, పీపల్పహాడ్, డి.నాగారం గ్రామాల్లో కొనసాగింది. -
‘పేదల ప్రాణాలతో ప్రభుత్వ చెలగాటం’
ఇబ్రహీంపట్నం: ప్రజల సొమ్ము దోచుకుంటూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు కోల్పోయిందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కు.ని. ఆపరేషన్లు వికటించి మృత్యువాత పడిన సీతారాంపేటకు చెందిన లావణ్య, లింగంపల్లికి చెందిన సుష్మ కుటుంబ సభ్యులను ఆదివారం సాయంత్రం అయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం డాక్బంగ్లాలో ఏర్పాటు చేసిన మిడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు వస్తే నలుగురి ప్రాణాలను తీశారని ఆరోపించారు. ఈ అంశంపై అసెంబ్లీలో ఒక్కముక్కా ప్రస్తావించకపోవడం సీఎం అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మంత్రులు, ముఖ్యమంత్రి రాకపోవడం సిగ్గుచేటన్నారు. ఇతర రాష్ట్రాలు తిరిగి రైతులకు డబ్బులు ఇచ్చేందుకు, డిల్లీకి వెళ్ళి రాజకీయాలు చేసేందుకు వీలవుతోంది కానీ... ఓట్లు వేసిన ప్రజలు పుట్టెడు శోకంలో ఉంటే వారిని పరామర్శించి, ఆదుకునేందుకు సమయం దొరకడంలేదా? అని ప్రశ్నించారు. విద్యార్థుల, పేద ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోన్న ఈ దోపిడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియాను చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, వారి పిల్లల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని, ఆపరేషన్లు చేసిన వైద్యులపై, పర్యవేక్షించని సిబ్బందిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. -
మునుగోడు బరిలో ఉంటాం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బిజినేపల్లి: త్వరలో జరగబోయే మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చెప్పారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వెల్గొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. మునుగోడు ప్రజలు తమ పార్టీ అభ్యర్థిని ఆదరిస్తా రన్న నమ్మకం ఉందన్నారు. అనంతరం రాబోయే అసెంబ్లీ ఎన్ని కల్లో కూడా తాము పూర్తిస్థాయిలో అభ్యర్థులను నిలబెడతామని వెల్లడించారు. చదవండి: బీజేపీకి తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి: రేవంత్ -
మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని బహుజన్ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. మునుగోడు ప్రజలు రాజగోపాల్రెడ్డికి బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అన్ని స్థానాల్లోనూ బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని, బీఎస్పీ గెలుపు చారిత్రక అవసరమన్నారు. సామాజిక న్యాయం అజెండాగా ఉప ఎన్నికల్లోకి వెళ్తామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. నాలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ప్రవీణ్ కుమార్ అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని సమస్యలను తప్పించుకోవడానికి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. చదవండి: కాంగ్రెస్ గూటికి చెరుకు సుధాకర్.. మునుగోడు ఉపఎన్నికలో సామాజిక అస్త్రంగా! -
ఆత్మగౌరవంతో ముందుకు వెళదాం
సిరిసిల్ల: ఆకలితోనైనా చస్తాం.. కానీ ఆత్మగౌరవాన్ని పోగొట్టు కోమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ పేర్కొ న్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీలంతా కలసి ఆత్మగౌరవంతో ముందుకు వెళదామని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం విశ్వకర్మీయుల ఆత్మగౌరవసభలో ప్రవీణ్కుమార్ మాట్లాడారు. తెలంగాణలో అగ్రకులాలు పేదలను విభజించి పాలిస్తున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అహంకారంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏకంగా బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్నే మార్చాలంటున్నారని విమర్శించారు. ‘నేను సిరిసిల్లకు వస్తుంటే అనేక అడ్డంకులు సృష్టించారు, మీ నాయన కుట్రలను భరించలేకనే 26 ఏళ్లు చేసిన ఉద్యోగాన్ని వదిలేసి ప్రజల కోసం బయటకు వచ్చా’అని ప్రవీణ్కుమార్.. మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి అన్నారు. ప్రగతిభవన్ వేదికగా అనేక కుట్రలు జరుగుతున్నాయన్నారు. ‘బహుజనులంతా ఒకరితో ఒకరు కలుద్దాం.. నిలుద్దాం.. గెలుద్దాం’అని పిలుపునిచ్చారు. అంతకుముందు ఆయన గంభీరావుపేట మండలం నర్మాలలో కూడా మాట్లాడారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరిట 200 మంది పేదల వద్ద బలవంతంగా 370 ఎకరాల భూములు లాక్కున్నారని ప్రవీణ్కుమార్ ఆరోపించారు. వారికి ఎకరానికి రూ.5 లక్షలు మాత్రమే చెల్లించారని, ఈ భూముల్లో అధికార పార్టీ నేతలు విల్లాలు కడుతున్నారని మండిపడ్డారు. బాధితులకు అండగా ఉంటానని ప్రవీణ్కుమార్ హామీ ఇచ్చారు. సిరిసిల్లలో దీక్షలు చేస్తున్న వీఆర్ఏల శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. సిరిసిల్ల సభలో విశ్వకర్మ నాయకులు దాసోజు శ్రవణ్, ఆచారి, మురళి, మధుచారి తదితరులు పాల్గొన్నారు. -
పేదలను ముంచి బుల్లెట్ ప్రూప్ కార్యాలయాలు కట్టుకుంటున్నారు
పర్వతగిరి: ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలను ముంచి బుల్లెట్ ్రçపూఫ్ కార్యాలయాలు కట్టుకుంటున్నారని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. భారీ వర్షాన్ని లెక్క చేయకుండా యాత్ర కొనసాగించారు. పర్వతగిరి అంబేడ్కర్ సెంటర్ వద్ద ఆయన మాట్లాడుతూ పేదలు ఉండడానికి ఇళ్లు లేవని, దొరలు గడీలు, ఫామ్హౌస్లు నిర్మించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ భూమి కనబడితే అక్కడ కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. 1,300మంది అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో ఒకే కుటుంబం వారు ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, పరిశ్రమల ఏర్పాటులో పోగు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కొందరి చేతిలో బందీగా ఉన్న తెలంగాణను అందరి తెలంగాణగా మార్చేందుకు బహుజన సమాజ్వాది పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి బహుజనులంతా ఐక్యం కావాలన్నారు. కాళేశ్వరం మునిగినట్లే కేసీఆర్ మునగడం త«థ్యమన్నారు. అనంతరం ఆయన అన్నారం షరీఫ్ యాకుబ్బాబా దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు. -
RS Praveen Kumar: ఇది సర్కారీ కాంట్రాక్టుల దోపిడీ!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున మెహిదీపట్నంలోని భోజగుట్ట బస్తీలో ప్రభుత్వ పాఠశాలను ఇటీవల సందర్శించాను. అక్కడ పాఠశాల ప్రాంగణంలోనే అంగన్ వాడీ కేంద్రం కూడా ఉంది. అందులో 20 మంది చిన్నపిల్లలున్నారు. కానీ ఆ గదిలో కనీసం కరెంటు లేదు. పాఠశాల విద్యార్థులు తరగతి గదులు లేక నాలుగు, ఐదవ తరగతుల పిల్లలు ఒకే గదిలో కూర్చోగా, ఒకటవ తరగతి పిల్లలు బయట వరండాలో కూర్చొని చదువుకుంటున్నారు. ఆ పాఠశాలలో ఒక్క విద్యార్థికి కూడా పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. యూనిఫాం అందలేదు. పాఠశాల పక్కనే కాలనీవాసులు చెత్తను పడేస్తున్నారు. ఇదీ తెలంగాణలో విద్యావ్యవస్థ పరిస్థితి. రాజధాని నగరంలోనే ఇలా ఉందంటే ఇక గ్రామాల్లో పరిస్థితి చెప్పనవసరం లేదు. బడులను బాగుచేస్తామని చేపట్టిన ‘మన ఊరు– మన బడి’ పథకం వంటివి ఇప్పుడు అయినవారికీ, బడాబాబులకూ దోచిపెట్టే మార్గాలుగా మారడం దారుణం. ‘మన ఊరు– మన బడి’ పథకం కింద రూ.7,200 కోట్లు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. మొదటి విడతలో భాగంగా రూ.3,500 కోట్లు ఖర్చు చేయనున్నారు. గత మే నెలలో పాఠశాలల్లో చిన్న, పెద్ద మరమ్మత్తుల కోసం రూ.1,539 కోట్లకు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి 24 గంటల లోపే రద్దు చేశారు. తిరిగి రాత్రికి రాత్రే నోటిఫికేషన్ లోని విధివిధానాలు మార్చారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఏడాదికి రూ. 180 కోట్ల రాబడి ఉన్న సంస్థలే అర్హమైనవి. ఈ ఆదాయం, అర్హత ఎవరికి ఉంటుంది? కచ్చితంగా బహుజన వర్గాల (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణపేదలు) ప్రజలకు అయితే ఉండదు. కేవలం బడా కాంట్రాక్టర్లకు మాత్రమే అర్హత ఉంటుంది. పెద్ద కాంట్రాక్టర్లయినా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అన్ని విధాలా అనుకూలంగా ఉండేవారికే టెండర్లు దక్కేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఈ విధంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధనాన్ని, పేదలకు ఉపయోగపడాల్సిన బడ్జెట్ను కేవలం ఆయనకు సన్నిహితులైన ఒకరిద్దరికే దోచిపెట్టడానికి శాయశక్తులా కృషి చేస్తున్నది. కాకపోతే ఏమిటి? కేవలం రూ.4,500కు వచ్చే డ్యూయల్ డెస్క్ ధరను అమాంతం రూ. 12,000కు పెంచి, వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు అధికారికంగా చెల్లించే పనికి ఒడిగట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జైళ్లలో ఉండే ఖైదీలు తయారుచేసిన వస్తువులను కూడా అతితక్కువ ధరకు తీసుకునే అవకాశం ఉన్నా, ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతోంది. గ్రీన్ బోర్డు ఒక చదరపు ఫీట్ ధరను రూ. 280 నుండి రూ. 370కి పెంచారు. అయితే మొదటిసారి టెండర్ నోటిఫికేషన్కు ప్రతిస్పందిస్తూ టెండర్ దాఖలు చేసిన సంస్థలు... తాము అర్హులమైనా తమను అనర్హులుగా ప్రభుత్వం ఎలా తమ టెండర్లను తిరస్కరిస్తుందని ప్రశ్నిస్తూ హైకోర్టుకు ఎక్కాయి. కోర్టులో ఈ వివాదంపై వాదనలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం రెండోసారి పిలిచిన టెండర్లనూ రద్దు చేస్తున్నట్లు కోర్టుకు తెలియచేసింది. దీనర్థం ఏమిటి? మేం మొదటి నుంచీ ‘మన ఊరు– మన బడి’ పనుల టెండర్లలో అవకతవకలూ, ఆశ్రిత పక్షపాతం ఉన్నాయని ఆరోపిస్తున్న విషయాలు నిజమే అని ప్రభుత్వం ఒప్పుకున్నట్లే కదా. అంతా సజావుగా ఉంటే రెండోసారీ టెండర్లను ఎందుకు రద్దుచేసినట్లు? ప్రభుత్వం గ్రామాల్లో పాఠశాల భవనాలకు పెయింటింగ్ వేసే కాంట్రాక్టులనూ బడా కాంట్రాక్టర్లే దక్కించుకునేలా నిబంధనలు రూపొందిస్తే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పారిశ్రామికవేత్తల గతేం కావాలి? ఇదంతా చూస్తుంటే ఉద్దేశ్యపూర్వకంగా ఎంఎస్ఎంఈలు మూతపడేలా ప్రభుత్వమే పాటుపడుతున్నదని అర్థమవుతోంది. ఒకపక్క విదేశాలకు వెళ్ళి, అనేక రాయితీలు ప్రకటించి అంతర్జాతీయ కంపెనీలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తున్న మంత్రి కేటీఆర్... ఇదే రాష్ట్రంలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవకాశాలు, రాయితీలు ఎందుకు ఇవ్వడం లేదు. 5,000 ఎంఎస్ఎంఈలు మూత బడుతుంటే ఎందుకు పట్టించుకోలేదు? ప్రభుత్వం పెద్ద కాంట్రాక్టర్లతోపాటూ ఎంఎస్ఎంఈలనూ టెడర్ల ప్రక్రియలో పాల్గొనడానికి అవకాశం కల్పించాలి. అప్పుడే చిన్నాచితక కంపెనీలు నడుపుతున్న బహుజనులకూ అభివృద్ధి చెందే అవకాశం దక్కుతుంది. తెలంగాణలోని పేద ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలను అర్థం చేసుకోవాలి. మోసానికి గురవుతున్న మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి. ‘మన ఊరు – మన బడి’ పథకానికి కావా ల్సిన నిధులను ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుంచి కూడా సేకరిస్తున్నది కానీ, జీఓ నం. 59/2018, జీఓ నం. 32/2022లు చెప్పిన ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు అవకాశం ఇవ్వాలన్న నిబంధనలను పట్టించుకోకుండా మోసం చేస్తోంది. ఒక్క విద్యా వ్యవస్థలోనే కాదు మిగతా రంగాలలోనూ ఈ దోచిపెట్టే పని కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన 1.15 లక్షల కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టులో గానీ, రూ. 36 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టులో గానీ ఒక్క బహుజనుడు కూడా కాంట్రాక్టరుగా లేడు. ఈ అన్యాయాన్ని మిగతా పార్టీలవారు ఎవరూ ప్రశ్నించడం లేదు. బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే కాంట్రాక్టుల్లో మా బహుజనుల వాటా ఏదని ప్రశ్నిస్తోంది. గత 70 ఏళ్లుగా బహుజన సమాజం మోసపోతున్నది. ఆధిపత్య పార్టీల నాయకులు బహుజనులను కేవలం ఓటు వేసే యంత్రాలుగానే చూస్తున్నారు. సంపద ఉన్న చోటికి వారిని రానివ్వడం లేదు. రాబోయే ఎన్నికల్లో ఒక బహుజనుడిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోకపోతే, తెలంగాణ రాష్ట్ర ఆస్తి, వనరులు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అందుకే పేద ప్రజల సొమ్మును ఎత్తుకుపోయే రాబందుల నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. బహుజన తెలంగాణను సాధించాలి, తెలంగాణ అమరుల ఆశయాలను నిజం చేయాలి. (క్లిక్: పోడు రైతుకు హరితహారం గండం) - డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ -
పేదలకు ఎకరం భూమి.. 10 లక్షల ఉద్యోగాలు
హన్మకొండ అర్బన్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లో మార్చి 6న ప్రారంభమైన బహుజన రాజ్యాధికార యాత్ర బహుజనుడిని ముఖ్యమంత్రి చేసేవరకు ఆగేదిలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ అన్నారు. 2023లో తెలంగాణ లో బీఎస్పీ అధికారంలోకి వస్తుందని, ప్రగ తిభవన్పై నీలిజెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ లో ఉండి దొరలకు చెంచా కొడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు బీఎస్పీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికార యాత్ర వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సభలో బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ ఆకాశ్ఆనంద్, ఎంపీ రాంజీగౌతం, ఇతర నాయకులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఎకరం భూమి, ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామన్నారు. పది లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. 60వేల పుస్తకాలు చదివిన మేధావులకు ప్రశాంత్కిశోర్ సలహా లు ఎందుకని ప్రశ్నించారు. బీఎస్పీలో 60 వేల పుస్తకాలు చదివిన మేధావులు, 90 ఎంఎల్ తాగుబోతులు లేరని ఎద్దే వా చేశారు. తమ వెనక పార్టీని నడపడానికి స్వామీజీలు లేరని, మెగా, మైహోం లు లేవని, కాళేశ్వరం ప్రా జెక్టులు లేవని, బహుజనుల గుండె ధైర్యం ఉందని అన్నారు. -
బెటాలియన్ను సీఎం ఫామ్హౌస్లో నిర్మించాలి: ఆర్ఎస్పీ
గోవిందరావుపేట: 5వ బెటాలియన్ ఏర్పాటుకు పేదల భూములే దొరికా యా? సీఎం కేసీఆర్ ఫామ్హౌస్లో నిర్మించవచ్చు కదా అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. బహుజన రాజ్యాధి కార యాత్ర సోమ వారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో సాగింది. ఈ సందర్భంగా బెటాలియన్ ఏర్పాటులో భూములు పోతున్న చల్వాయి రైతులతో ప్రవీణ్ మాట్లాడారు. పేదలకు చెందిన 105 ఎకరాల భూమిని 5వ బెటాలియన్ కోసం కేటాయించారని, నిర్వాసితులకు ఉద్యోగం, నివాస స్థలం ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. పేదల తరపున మాట్లాడే వారేలేరని, వారికి నోరులేదని అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా అడిగిన వారిని జైలుకు పంపుతున్నారని ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే గిరిజనుల పోడు భూములకు పట్టాలిస్తుందని హామీ ఇచ్చారు. -
గిరిజనులపై ప్రభుత్వం మొసలి కన్నీరు: ఆర్ఎస్పీ
భద్రాచలంఅర్బన్: గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆరోపించారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర సోమవారం భద్రాచలం చేరుకుంది. మొదట అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్య ప్రజలను, బస్పాస్ చార్జీలు పెంచి విద్యార్థులను ఇబ్బంది పెడుతోందన్నారు. రాష్ట్రంలో ‘మన ఊరు – మన బడి’కార్యక్రమానికి సంవత్సరానికి రూ.7,800కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఈ నిధులతో బడులు బాగుపడటమేమో కానీ.. కాంట్రాక్టర్లు బాగా సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఎన్నికల డ్రామానేనని విమర్శించారు. భద్రాద్రి జిల్లాలో పోడు భూముల సమస్య అధికంగా ఉందన్న ఆర్ఎస్పీ ఈ సమస్య పరిష్కరిస్తానని 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసిన వాగ్దానాన్ని గుర్తు చేశారు. -
గడీల పాలనను గద్దె దింపుతాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గడీల పాలనను గద్దె దింపేవరకు రాత్రింబవళ్లు పనిచేస్తానని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చెప్పారు. దొరల పాలన అంతా దోపిడీమయంగా సాగుతోం దని.. దళితులు, గిరిజనులు, బహుజనులు నష్టపోతున్నా రని ఆందోళన వ్యక్తం చేశారు. 13 వందల మంది త్యాగా లతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కొందరి చేతుల్లో బందీ అయిందని, అన్నివర్గాలకు న్యాయం దక్కాలంటే దొరల పాలనకు మంగళం పాడాలని పిలుపునిచ్చారు. బీఎస్పీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ప్రవీణ్కుమార్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో శుక్రవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అభినందన సభ జరిగింది. దీనికి ముందు బీఎస్పీ రాష్ట్ర ఇన్చార్జ్ రాంజీ గౌతమ్తో కలిసి ప్రవీణ్కుమార్ మీడియాతో మాట్లాడారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులపాలు చేశారని, ఉద్యో గులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని మండి పడ్డారు. సంపత అంతా కొందరి వద్దే ఉండిపోయిందని, అన్ని వర్గాల ప్రజలు ఆప దలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన న్యాయం జరగాలంటే బీఎస్పీకి రాజ్యా ధికారం అప్పగించాలని పిలుపు నిచ్చారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు, రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కారు అగ్రకులా లకే ప్రాధా న్యత ఇస్తున్నాయని మండిపడ్డారు. తాను చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశా రు. రాబోయే ఎన్నికల్లో గెలిచి ఏనుగు మీద ప్రగతిభవన్కు వెళ్తామన్నారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడాలని, గ్రామాలకు తరలివెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అందరి పార్టీ బీఎస్పీ.. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల్లో కేవలం అగ్రవర్ణాలకే పదవులు దక్కుతాయని, వారికి మాత్రమే ప్రాధాన్యత దక్కు తుందని ప్రవీణ్కుమార్ విమర్శించారు. బీఎస్పీ దళిత, గిరిజన, బహుజనులతోపాటు అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత దక్కుతుందని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 52శాతం ఉన్న బీసీలకు తమ పార్టీ 70 సీట్లు కేటాయిస్తుం దని ప్రకటించారు. అనంతరం బీఎస్పీ రాష్ట్ర ఇన్చార్జి, ఎంపీ రాంజీ గౌతమ్ మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో బీఎస్పీకి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయని, వాటిని అదుపులో పెట్టేందుకు సమర్థుడైన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పేదల విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తా మని.. ప్రతి పౌరుడికి ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిం చేందుకు బీఎస్పీ కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. -
కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యం
కామేపల్లి: అవినీతిమయంగా మారిన సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా బీఎస్పీ పని చేస్తోందని, ఇందులో భాగంగానే బహుజన రాజ్యధికార యాత్ర చేపట్టామని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర మహబూబాబాద్ నుంచి ఖమ్మం జిల్లా కామేపల్లి మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ప్రవీణ్కుమార్ మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కుంటూ అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. అకాల వర్షం, తెగుళ్లతో పంటలు నష్టపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే పట్టించుకోని సీఎం కేసీఆర్.. పంజాబ్ రైతులకు రూ.18 కోట్లకు పరిహారం ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. సర్పంచ్లు అప్పులు తెచ్చి గ్రామాల్లో పనులు చేస్తే బిల్లులు చెల్లించకపోవడంతో వారు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిన నేపథ్యంలో జూన్లో రైతుబంధు, ఉద్యోగుల వేతనాలకు నిధులు ఎలా సమకూరుస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలివ్వడంతో పాటు ఎస్సీ, బీసీ కులాలకు ప్రత్యేక ప్యాకేజీ, గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. -
గనులు తవ్వమంటే.. మసీదులు తవ్వుతారా?
బయ్యారం: గనులను తవ్వి ఉపాధి కల్పించమంటే బీజేపీ నాయకులు మసీదులు తవ్వు తామంటున్నారని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. బ హుజన రాజ్యాధికారయాత్ర లో భాగంగా సోమవారం ఆయన మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని ఇనుప రాయిగుట్టపై ఇనుపరాయిని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. ఉక్కు పరిశ్రమ నిర్మాణంపై బీజేపీ, టీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో మైనింగ్ శాఖమంత్రిగా కొనసాగుతున్న కేటీఆర్ ట్వీట్లు పెడుతున్నారనే తప్ప పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రావడం లేద న్నారు. ఇప్పటికైనా ఉక్కు పరిశ్రమను నిర్మించాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు. -
సీఎం కేసీఆర్ను గద్దె దించాలి
మహబూబాబాద్ అర్బన్: మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రం గా మార్చిన సీఎం కేసీఆర్ను వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కో–ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. బహు జన రాజ్యాధికార యాత్ర 77వ రోజు ఆదివారం మహబూబా బాద్ జిల్లా కంబాలపల్లి గ్రా మంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో కలియ తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారు స్తూ.. ప్రభుత్వోద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి తీసు కొచ్చారన్నారు. -
రైతులను సీఎం మోసం చేశారు: ప్రవీణ్కుమార్
సాక్షి, మహబూబాబాద్: సీఎం కేసీఆర్ తనను నమ్మి ఓట్లు వేసిన రైతులు, నిరుద్యోగులను మోసం చేశారని బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు, కేసముద్రం మండలాల్లో ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా కేసముద్రం మార్కెట్లో హమాలీలతో కలిసి ఆయన బస్తాలు మోశారు. పేదల ఇళ్లల్లోకి వెళ్లి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. అనంతరం ప్రవీణ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. రుణమాఫీ చేస్తామని ప్రకటించారే తప్ప ఇప్పటి వరకు పూర్తిగా రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. ఇక్కడ రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం పంజాబ్కు వెళ్లి అక్కడ డబ్బులు పంచిపెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రధానమంత్రి కావాలనే పగటి కలలు కంటూ దేశమంతా తిరుగుతున్నారని ప్రవీణ్ ఎద్దేవా చేశారు. -
దళితబంధు కాదు.. దగా బంధు: ఆర్ఎస్పీ
జూలూరుపాడు: దళితుల అభ్యున్నతి కోసమే దళితబంధు పథ కాన్ని ప్రవేశపెట్టామని టీఆర్ఎస్ సర్కార్ గొప్పలు చెబుతున్నా.. అది దళి తులను దగా చేసేందుకేనని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపిం చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి అను చరులకే తప్ప నిరుపేదలకు దళిత బంధు అందడం లేదన్నారు. ప్రవీణ్ చేపట్టిన బహుజ న రాజ్యాధికార యాత్ర మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లోని అనంతారం, కాకర్ల, పడమట నర్సాపు రం, బేతాళపాడు, గుండ్లరేవు, అన్నారుపాడు, పాపకొల్లు, జూలూరుపాడు గ్రామాల్లో కొనసాగింది. ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నా పేదలు మాత్రం ఇంకా దుఃఖంలోనే ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. -
పేదలకు నిలువ నీడా దక్కట్లేదు: ఆర్ఎస్పీ
ములకలపల్లి: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నామని చెప్పుకునే టీఆర్ఎస్ పాలనలో నిరుపేదలకు నిలువ నీడ కూడా దక్కట్లేదని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి, అన్నపురెడ్డి మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. అగ్రవర్ణాల దోపిడీ, రాజ్యాధికారం లేక బహుజనులు నష్టపోతున్న తీరును 5 వేల గ్రామాల్లో వివరించేందుకు యాత్ర చేపట్టగా ఇప్పటివరకు 500 గ్రామాల్లో పూర్తయిందని తెలిపారు. ఉచిత పథకాలతో గద్దెనెక్కిన కేసీఆర్ ప్రజలకు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ పేరిట కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. యాత్రలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎర్రా కామేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఓట్లు పేదలవి.. కోట్లు పాలకులవి: ఆర్ఎస్పీ
అశ్వారావుపేట రూరల్: పేదల ఓట్లతో గద్దెనెక్కిన పాలకులు కోట్ల రూపాయలు దండుకుంటున్నారని, ప్రజలు మాత్రం అక్కడే ఉన్నారని బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. ఆయన చేపట్టిన రాజ్యాధికార యాత్ర ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం, ఆసుపాక, నారాయణపురం, నందిపాడు, ఖమ్మంపాడు, బచ్చువారిగూడెం, దురదపాడు, తిరుమలకుంట గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ఏళ్లుగా పేదలను మోసం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్లను ఇంటికి పంపించి, బహుజన రాజ్యం కోసం బీఎస్పీని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. మండలంలోని గుమ్మడవల్లి గ్రామం వద్ద 40 ఏళ్ల క్రితం నిర్మించిన పెదవాగు ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు నేటికీ నష్ట పరిహారం ఇవ్వకపోవడం పాలకుల అసమర్థతకు నిదర్శమని మండిపడ్డారు. కార్యక్రమంలో రిటైర్డ్ డీఐజీ కోటేశ్వరరావు, జిల్లా ఇన్చార్జి కృష్ణార్జునరావు పాల్గొన్నారు. -
70 మంది బీసీలను అసెంబ్లీకి పంపడమే లక్ష్యం: ఆర్ఎస్పీ
వేంసూరు: వచ్చే ఎన్నికల్లో 70 మంది బీసీలను ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి పంపడమే బీఎస్పీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర గురువారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఖమ్మం జిల్లా వేంసూరు, సత్తుపల్లి మండలాల్లో కొనసాగిన యాత్రలో ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ... వడ్డించేవాడు బహుజనుడైతేనే అందరి ఆకలి తీరు తుందన్నారు. అందుకు వచ్చే ఎన్నికల్లో 70 మంది బీసీ ప్రతినిధులను అసెంబ్లీకి పంపించేందుకు ప్రతి బహుజన బిడ్డ పనిచేయా లని కోరారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నేడు నాలుగు లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు. పనికి రాని పథకాలతో ప్రజలను మోసం చేస్తున్నారని, పేదలకు ఉచిత విద్య, వైద్యం అంది స్తే ఉచిత పథకాలతో పనేమిటని ప్రవీణ్కుమార్ ప్రశ్నించా రు. దళితబంధు పథకంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులకే లబ్ధి జరిగేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల హక్కుల కోసం కాపలాగా ఉంటానని ప్రవీణ్కుమార్ స్పష్టం చేశారు. -
సంక్షేమ పథకాలతో బతుకులు మారవు
తల్లాడ: దళితబంధు తదితర సంక్షేమ పథకాలతో అణగారిన వర్గాల బతుకులు మారవని బీఎస్పీ చీఫ్ కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు అణగారిన వర్గాలకు చేసిందేమీ లేదని విమర్శించారు. బహుజనులను ఓటేసే యంత్రాలుగానే చూస్తున్నారన్నారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని పలు గ్రామాల్లో సోమ వారం కొనసాగింది. మల్లవరంలో జరిగిన సభలో ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకుంటున్న పాలకులు ఆ తర్వాత ప్రజల బాగోగులను విస్మరిస్తున్నారని చెప్పారు. సొంత సం పాదన పెంచుకునేందుకే జిల్లా మంత్రి అజయ్కుమార్, ఆయన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు సమ యానికి అనుగుణంగా అన్నిపార్టీల జెండాలు మోస్తున్నారని ఆరోపించారు. విద్యారంగానికి నిధులు కేటాయిస్తే అణగారిన వర్గాల పిల్లలు కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పారు. ప్రగతిభవన్ను దెయ్యాల కొంపగా సీఎం కేసీఆర్ మార్చా రని మండిపడ్డారు. మతతత్వ బీజేపీతో ప్రమాదం పొంచి ఉందని, తీన్మార్ మల్లన్న మోసకారి అని ఆరోపించారు. -
కరప్షన్.. కలెక్షన్.. కేసీఆర్..! : ఆర్ఎస్పీ
కోదాడ: తెలంగాణ అంటే కరప్షన్.. కలెక్షన్.. కేసీఆర్.. అన్నట్లు తయ్యారైందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆరోపించారు. విద్యార్థుల బలిదానం, మేధావుల శ్రమదానం, తెలంగాణ వాదుల పోరాటంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వ అధినేతలు అవినీతిలో కూరుకొని పోయారన్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదనే సామెతను నిజం చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పడి దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బాలుర పాఠశాలలో నిర్వహించిన సభ లో ప్రవీణ్కుమార్ మాట్లాడారు. రైతులు ధాన్యం కొనేవారు లేక ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు విమానాల్లో ఢిల్లీ వెళ్లి గంట సేపు ధర్నా చేసివచ్చారని, దానివల్ల రైతులకు ఒరిగింది ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాజ్యాధికారం చేతికి వచ్చినపుడే బహుజనులు అభివృద్ధి చెందుతారని, పల్లకీ బోయిలుగా కాకుండా పల్లకిలో కూర్చోవడానికి కృషి చేయాలని కోరారు.వచ్చే ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు తమ పార్టీ 70 శాతం సీట్లను కేటాయిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మేధావులు మౌనంగా ఉండవద్దని బయటికి వచ్చి మేలు చేసే వ్యక్తులను అధికారంలో కూర్చోబెట్టాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పిల్లుట్ల శ్రీనివాస్, గుండెపంగు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాధికారం దక్కే వరకు పోరాటం
కూసుమంచి: బహుజనులకు రాజ్యాధికారం దక్కేదాకా పోరాటం ఆగదని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చెప్పారు. ఆయన చేపట్టిన బహుజనుల రాజ్యాధికార యాత్ర సోమవారం ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లా సరిహద్దు నాయకన్గూడెం వద్ద ప్రవేశించిన యాత్ర పాలేరు, కూసుమంచి, గట్టుసింగారం, మల్లేపల్లి, జుజుల్రావుపేట, లోక్యాతండా, కోక్కాతండా, నేలపట్ల, అగ్రహారం గ్రామాల్లో కొనసాగింది. ఆయన పలు కాలనీలు, వసతిగృహాలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని దోచుకుంటున్న సీఎం కేసీఆర్ కుటుంబం పాలనలో ఘోరంగా విఫలమైన విషయాన్ని ప్రజలు గుర్తించారన్నారు. కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా దళితుడు సీఎం కాలేదని, దళితులకు మూడెకరాల భూమిదక్కలేదని, తాజాగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం కూడా అదే కోవలోకి వెళ్తుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అరాచక పాలనను ప్రజల్లో ఎండగట్టి బహుజనులను ఏకం చేసి రాజ్యాధికారం సాధించేదిశగా ఈ పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సీఎం కేసీఆర్కు పరాజయం తప్పదని, వచ్చే ఎన్నికల్లో తాము విజయం సాధించి రాష్ట్రంలో పాగా వేయటం ఖాయమన్నారు. యాత్రలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఉపేంద్ర సాహూ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ఆటవిక పాలన
సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ విరుచుకుపడ్డారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన నార్నూర్ మండల కేంద్రంలో స్వేరోస్ జైభీమ్ దీక్ష ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్థానికంగా జరిగిన జిల్లా బీఎస్పీ సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి పట్టణంలో తల్లీకొడుకుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ దౌర్జన్యమే కారణమని ఆరోపించారు. కాగజ్నగర్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దౌర్జన్యం, ఇసుక మాఫియా, ప్రశ్నించే అధికారులపై దాడులు ఆటవిక రాజ్యం కాకపోతే మరేంటని ప్రశ్నించారు. జీవో 3ని సుప్రీంకోర్టు రద్దు చేస్తే రాష్ట్ర ప్రభు త్వం ఎలాంటి రివ్యూ పిటిషన్ వేయకపోవడం గిరిజనులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. దళితబంధు కింద లబ్ధిదారులకు వాహనాలు ఇస్తున్నట్లు చూపిస్తున్నప్పటికీ డబ్బులు కట్టకపోవడంతో ఆ వాహనాలను షోరూం యాజమాన్యాలు లాక్కెళ్తున్నాయని ప్రవీణ్ తెలిపారు. -
దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్: ఆరెస్పీ
సూర్యాపేట: పలు గ్రామాల్లో టీఆర్ఎస్ నేతలు అసైన్డ్ భూములను కబ్జా చేస్తున్నారని, అక్రమాలను ప్రశ్నిస్తున్న తమ పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. బహుజన రాజ్యాధికారయాత్రలో భాగంగా ఆయన గురువారం సూర్యాపేట పట్టణంలోని పలు ప్రాం తాల్లో పర్యటించారు. తొలుత అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఖమ్మం క్రాస్రోడ్డులోని విగ్రహానికి నివాళులర్పించేందుకు ప్రవీణ్కుమార్ వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి జగదీశ్రెడ్డి వచ్చేవరకు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు ఎవరూ వేయొద్దని నిలిపివేయడంతో బీఎస్పీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదేసమయంలో అక్కడికి వచ్చిన మంత్రి తన తోపాటు ప్రవీణ్కుమార్ను విగ్రహం వద్దకు తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ వరి వేయొద్దన్న తెలంగాణ ప్రభుత్వమే ఢిల్లీకి వెళ్లి డ్రామాలు వేసి చివరకు వడ్లు కొంటామంటోందన్నారు. మిల్లర్ల వద్ద రైతు లను బలిపశువును చేస్తోం దని దుయ్యబట్టారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు చడపంగు రవి, నియోజకవర్గ అధ్యక్షుడు యాతాకుల సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
ముందస్తుకు సిద్ధమయ్యే ప్రజాకర్షక పథకాలు
హుజూర్నగర్/పెన్పహాడ్: ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యే సీఎం కేసీఆర్ ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెడుతున్నారని బీఎస్పీ చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పరిధిలో ఆయన పర్యటించారు. పెన్పహాడ్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ అవసరాలకు పేదల అసైన్డ్ భూములను బలవంతంగా గుంజుకుంటోందని ఆరోపించారు. భూనిర్వాసితులకు మార్కెట్ ధరల ప్రకారం నష్టపరిహారం చెల్లించట్లేదని మండిపడ్డారు. ఇకపై అధికారులు అసైన్డ్ భూముల సర్వేకు వస్తే అడ్డుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. అంతకుముందు ఫణిగిరిగుట్ట వద్ద రూ. 150 కోట్లతో నిర్మిస్తున్న ఆదర్శ కాలనీని ఆయన పరిశీలించారు. ఈ ప్రాజెక్టు డంపింగ్ యార్డుగా మారడానికి కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రభుత్వాలే కారణమన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చడపంగు రవి, నియోజకవర్గ ఇంచార్జ్ సాంబశివగౌడ్, అధ్యక్షుడు కొండమీది నరసింహారావు, కస్తాల కిశోర్, జిలకర రామస్వామి, వాస పల్లయ్య, పిడమర్తి శీను పాల్గొన్నారు. -
రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం
హుజూర్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని రాజ్యాంగంలో ఉన్నా కొనుగోలు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల దాహార్తి తీర్చడానికి రూ.36 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం చేపడితే గ్రామాలకు తాగునీరు అందడంలేదు కానీ కేసీఆర్ కుటుంబం దాహార్తి తీరడానికి ఉపయోగపడిందని విమర్శించారు. పేద విద్యార్థులు చదువుకుంటున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించడంపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడీని ప్రశ్నించడానికి బీఎస్పీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. తెలంగాణలో లక్షల కోట్ల సంపద కేసీఆర్ కుటుంబం గుప్పెట్లో బందీ అయిందని, బీఎస్పీ అధికారంలోకి వస్తే వారు దోచుకున్నదంతా పేదలకు పంచుతామని, అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హుజూర్నగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. -
ప్రజల్లోకి ‘బహుజన సిద్ధాంతం’
ఆర్మూర్/దుబ్బాకటౌన్: అమ్ముడుపోని సమాజాన్ని స్థాపించినపుడే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమని బీఎస్పీ నేషనల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజి గౌతమ్, రాష్ట్ర చీఫ్ కో–ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. తెలంగాణలో బహుజన రాజ్య స్థాపనకు బీఎస్పీ సిద్ధాంతాలు, జెండాను, పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇరువురు నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మినీ స్టేడియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ‘బీసీలకు రాజ్యాధికార సంకల్పసభ’లో వారు మాట్లాడారు. బీసీలు వెనకబడ్డ తరగతుల వారు కాదని, వెనక్కి నెట్టివేయబడిన తరగతుల వారని ప్రవీణ్కుమార్ అన్నారు. అంతకుముందు స్వేరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన బహుజన రాజ్యాధికార సంకల్ప సైకిల్యాత్ర ముగింపు సభ సిద్ది పేట జిల్లా దుబ్బాకలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రాబోయేది బహుజన రాజ్యమేనన్నారు. బహుజన రాజ్యస్థాపనకు 26 రోజులుగా 235 గ్రామాల్లో పర్యటించానన్నారు. స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ తప్ప మిగతావన్నీ ఆధిపత్య కులాలకు పెంపుడు కుక్కల్లా మారాయన్నారు. -
బెల్టు షాపులు లేకుండా చేస్తాం: ప్రవీణ్కుమార్
కనగల్: బీఎస్పీ అధికారంలోకి వస్తే బెల్టుషాపులు లేకుండా చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. 24వ రోజుకు చేరిన బహుజన రాజ్యాధికార యాత్ర మంగళవారం కనగల్లో కొనసాగింది. కనగల్ నుంచి క్రాస్రోడ్డు వరకు పాదయాత్ర నిర్వహించిన ప్రవీణ్కుమార్ అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బెల్టుషాపుల వల్ల గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందన్నారు. మద్యానికి బానిసలై చాలా మంది చిన్నవయస్సులోనే అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిలో ఏమోగానీ రాష్ట్రం మద్యం విక్రయించడంలో మాత్రం నంబర్వన్ స్థానంలో నిలిచిందని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని తెలిపారు. కూలీలుగా ఉన్న బడుగుబలహీన వర్గాలను ఓనర్లను చేయడమే తమ లక్ష్యమన్నారు. ఏనుగు గర్తుకు ఓటేసి, ప్రగతి భవన్పై నీలిజెండా ఎగురవేసేందుకు బడుగు బలహీనవర్గాలు పాటుపడాలని పిలుపునిచ్చారు. -
బహుజన రాజ్యస్థాపనే లక్ష్యం: ఆర్ఎస్పీ
నూతనకల్, అర్వపల్లి: ఆధిపత్య వర్గాలకు అధికారాన్ని దూరం చేసి బహుజన రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలోని వెంకెపల్లి, చిల్ప కుంట్ల, నూతనకల్, యడవెళ్లి, తాళ్లసింగారం గ్రామాల్లో నిర్వహించిన రాజ్యాధికార యాత్రలో ఆయన వివిధ చోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరిం చారు. అనంతరం అర్వపల్లి మండలం లోయపల్లి గ్రామానికి యాత్ర చేరింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొంతమంది బీఎస్పీలో చేరారు. ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ ఆధిపత్య వర్గాలకు అధికారం ఉండటం వల్ల ఆ వర్గాలకే ప్రయోజనాలు చేకూరాయన్నారు. సీఎం కేసీఆర్ ఇంతకాలం నిరుద్యోగ సమస్యను గాలికి వదిలేసి ఇప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేస్తామ నడం ఆ యన రాజకీయ ప్రయోజనాలకోసమేనని అన్నారు. జీఓ 111ను రద్దు చేయడం వల్ల అగ్రవర్ణాలకే ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ వాటి నిర్మాణాలను గాలికి వదిలేశారని, కొన్ని ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేసుకొని కూలడానికి సిద్ధంగా ఉన్నాయని, మరికొన్ని పిల్లర్లకే పరిమితమయ్యాయని విమర్శించారు. -
దొరల కబంధ హస్తాల్లో తెలంగాణ
తుంగతుర్తి, మద్దిరాల: అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ నేడు దొరల కబంధ హస్తాల్లో నలిగిపోతోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్టినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంతో పాటు వెలుగుపల్లి, అన్నారం, వెంపటి, రావులపల్లి, గొట్టిపర్తి, మద్దిరాల మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని కుక్కడం, కుంటపల్లి, గోరెంట్ల, పోలుమల్ల గ్రామాల్లో చేపట్టిన రాజ్యాధికార యాత్రలో పాల్గొని ఆయన మాట్లాడారు. మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బాగుపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమేనన్నారు. కేసీఆర్ సీఎం కాకముందు 50 ఎకరాలుంటే ఇప్పుడు 300 ఎకరాల భూమిని కూడ బెట్టుకొని అందులో రూ.40 కోట్ల బంగ్లా కట్టుకున్నారని ఆరోపించారు. ఇటీవల సీఎం కేసీఆర్ చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లకుండా యశోద ఆస్పత్రికి వెళ్లారని, అదే మనం ఆ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాలంటే భార్య మెడలో పుస్తెలతాడును తాకట్టు పెట్టాలి లేదా ఎకరం వ్యవసాయ భూమినైనా అమ్ముకోవాలని ఆవేదన వ్యక్తంచేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందేలా పూర్తి డబ్బులు కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో 33 లక్షలకు పైగా నిరుద్యోగులుంటే 8 ఏళ్ల నుంచి ఎలాంటి నోటిఫికేషన్ వేయకుండా రాత్రికిరాత్రే కేవలం 81 వేల ఉద్యోగాలను ప్రకటించారని ప్రవీణ్ విమర్శించారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రగతి భవన్పై నీలిరంగు జెండా
జఫర్గఢ్: ప్రగతిభవన్పై నీలిరంగు జెండా ఎగురవేయాలన్నదే తమ లక్ష్యమని బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. బహుజన రాజాధికార యాత్ర స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాల, జఫర్గఢ్ , పాలకుర్తి మండలాల్లో ఆదివారం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని, రాష్ట్రం బాధల తెలంగాణగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్న సీఎం కేసీఆర్ తన కుటుంబాన్నే బంగారంగా మార్చుకున్నారని ఆరోపించారు. బీఎస్పీ ద్వారానే బడుగుల జీవితాలు బాగుపడుతాయని తెలిపారు. రానున్న బహుజన రాజ్యంలో అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అందుతుందని, రానున్న రోజుల్లో పేదింటి విద్యార్థులే ఈ దేశాన్ని శాసిస్తారని ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణలో జోరందుకున్న పాదయాత్రలు
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ముందస్తు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఆయ పార్టీల నాయకుల పాదయాత్రలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్రారంభించి విరామం ప్రకటించిన పాదయాత్రలు పునఃప్రారంభం అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు తద్వారా ఓటర్ల మన్ననలు పొందేందుకు పాదయాత్రలు దోహదం చేస్తాయని నాయకులు విశ్వసిస్తున్నారు. 300 రోజుల బహుజన రాజ్యాధికార యాత్ర మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చేరికతో తెలంగాణలో బహుజన సమాజ్ పార్టీలో ఉత్సాహం కనబడుతోంది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న ప్రవీణ్కుమార్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. బీఎస్పీ తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ హోదాలో ఆయన ‘బహుజన రాజ్యాధికార యాత్ర’ పేరుతో పాదయాత్ర చేపట్టారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ నుంచి మార్చి 6న ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 300 రోజుల పాటు 5 వేల గ్రామాల గుండా ఈ యాత్ర సాగనుంది. ప్రజాప్రస్థానం పున:ప్రారంభం వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రను మార్చి 11 నుంచి పునః ప్రారంభించారు. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలోని కొండపాకగూడెం నుంచి పాదయాత్ర పున:ప్రారంభమైంది. ప్రతీ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ, నియోజకవర్గంలోని సగానికిపైగా మండలాల్లో కొనసాగేలా పాదయాత్రకు రూపకల్పన చేశారు. గతేడాది అక్టోబర్ 20న ప్రజాప్రస్థానం యాత్రను ప్రారంభించిన షర్మిల... ఎమ్మెల్సీ కోడ్తోపాటు కరోనా మూడో వేవ్ కారణంగా పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. భట్టి విక్రమార్క.. పీపుల్స్ మార్చ్ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క.. మధిర నియోజకవర్గంలో ‘పీపుల్స్ మార్చ్’ పేరుతో ఫిబ్రవరి 27న పాదయాత్ర చేపట్టారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లి నుంచి పాదయాత్ర చేపట్టి 100 కిలోమీటర్లు పూర్తి చేశారు. తన అసెంబ్లీ సెగ్మెంట్లో 32 రోజుల పాటు 500 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని భావించినప్పటికీ.. శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత పాదయాత్రను పునఃప్రారంభించే అవకాశముంది. ఏప్రిల్ 14 నుంచి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14 నుంచి రెండో విడత యాత్ర చేపట్టనున్నట్టు ఆయన ఇప్పటికే ప్రకటించారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల సమస్యలు, ఇతర అంశాలు తెలుసుకుని ఎన్నికల మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దాలని ఆయన భావిస్తున్నారు. (క్లిక్: ‘మాయావతి, ఒవైసీలకు.. పద్మవిభూషణ్, భారతరత్న’) ఆమ్ ఆద్మీ పార్టీ పాదయాత్ర ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్న మరికొంత నేతలు కూడా పాదయాత్రలకు సిద్ధమవుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తమ పార్టీ నేతలతో కలిసి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సెర్చ్ కమిటీ చైర్పర్సన్ ఇందిరా శోభన్ గతంలో తెలిపారు. అయితే పంజాబ్లో ‘ఆప్’ ఘన విజయం ఆ పార్టీ నాయకులు, కేడర్లో ఉత్సాహం నింపింది. (క్లిక్: సీఎంను ఓడించిన సామాన్యుడు.. ఎవరతను?) ముందస్తు ఎన్నికలకు వెళ్లం కాగా, అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలతో ఇప్పటికే ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉధృతంగా ప్రచారం సాగిస్తున్నారు. అయితే, ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని సీఎం కేసీఆర్ ఇటీవల తేల్చిచెప్పారు. 103 మంది ఎమ్మెల్యేల మద్దతుతో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉందని.. సోషల్మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ఆయన కోరారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. (చదవండి: మూడు జంటలు.. ముచ్చటైన విజయాలు) -
బీఎస్పీ నాయకుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తో స్ట్రెయిట్ టాక్
-
బీఎస్పీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా రుద్రవరం సునీల్
సాక్షి, హైదరాబాద్: బహుజన్ సమాజ్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉస్మానియా యూనివర్సీటీ విద్యార్థి రుద్రవరం సునీల్ నియమితులయ్యారు. ఈ మేరకు బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కో– ఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. రుద్రవరం సునీల్ సామాజిక ఉద్యమాలు, సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర నిర్వహిస్తూ, ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధన విద్యార్థిగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. తెలంగాణలో బహుజన రాజ్య స్థాపన కోసం నిర్మాణాత్మక కార్యక్రమాలతో ముందుకు సాగుతానన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ.. అణగారిన వర్గాలను సమీకరిస్తూ.. గ్రేటర్లో బీఎస్సీ బలోపేతానికి చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తానని పేర్కొన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శక్తివంచన లేకుండా క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరిస్తానన్నారు. బీఎస్సీ రాష్ట్ర చీఫ్ కో– ఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్లకు కృతజ్ఞతలు తెలిపారు. (క్లిక్: గ్రేటర్ జిల్లాలకు టీఆర్ఎస్ అధ్యక్షులు వీరే.. ముగ్గురూ ముగ్గురే..) -
మాట - మంటలు
-
అన్ని రంగాల్లో ముందుండాలన్నదే స్వేరోయిజం
పాత గుంటూరు: రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లోనూ మనమే ముందుండాలన్నదే స్వేరోయిజమని ఐపీఎస్(వీఆర్ఎస్) అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చెప్పారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం.. మార్పు కోసం స్వేరోయిజం అంశాలతో స్వేరోస్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రవీణ్కుమార్, ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్కుమార్, ఐఆర్టీఎస్ విశ్రాంత అధికారి డాక్టర్ భరత్భూషణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఎన్నో సవాళ్లున్నాయని, వాటిని ఎదుర్కోవాలంటే రాజకీయంగానే సాధ్యమవుతుందన్నారు. రానున్న కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దళితుల చుట్టే తిరుగుతాయన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా మాయావతి ఆశీస్సులతో బీఎస్పీలో చేరానని, రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీలో స్వేరో నెట్వర్క్ కార్యాలయాన్ని ప్రారంభించాల్సిన అవసరముందన్నారు. సునీల్కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాన్షీరాం ప్రసంగాలపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
ఈ అవార్డు ఆయనకే అంకితం: స్వేరోస్
Sakshi Excellence Awards: హైదరాబాద్లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘ఎక్స్లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ అవార్డును తెలంగాణ స్వేరోస్ సంస్థ తరపున శాయన్న అందుకున్నారు. చదువు అంటే కేవలం పుస్తకాలను బట్టీ పట్టడం కాదు. నాలెడ్జ్తో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్, మోరల్ సైన్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ వంటి పాఠ్యేతర అంశాల్లోనూ ప్రావీణ్యం కలిగి ఉండాలి. అందుకోసమే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఆ స్ఫూర్తితో 1984లో ‘స్వేరోస్’ పేరుతో విద్యార్థులే నిజామాబాద్ లో ఒక బృందంగా ఏర్పడి విద్యార్థుల అభ్యున్నతికి పాటు పడుతున్నారు. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్, విలేజ్ లెర్నింగ్ సెంటర్స్, వొకేషనల్ ట్రయినింగ్ సెంటర్స్, స్వేరోస్ సర్కిల్ వంటి వాటి ఏర్పాటుతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది స్వేరోస్. ఆయనకే అంకితం పేదల బతుకుల బాగు కోసం కృషి చేస్తున్న మా సంస్థ అంకిత భావాన్ని గుర్తించి ఈ అవార్డును మాకు అందించారు. దీనికి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సంస్థలో నన్ను భాగస్వామి చేసినందుకుగాను ఈ అవార్డును ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గారికి అంకితం చేస్తున్నా. – శాయన్న,స్వేరోస్ ఇంటర్నేషనల్ -
RS Praveen kumar: సీఎంగా కేసీఆర్ ఏడేళ్లు ఏం చేశారు..?
సాక్షి, ఆదిలాబాద్: బహుజనులు రాజ్యాధికారం సాధించే దిశగా ఇప్పటి నుంచే గ్రామాలకు వెళ్లి ప్రచారం చేపట్టాలని మాజీ ఐపీఎస్ అధికారి, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన శనివారం ఆదిలాబాద్కు వచ్చారు. అర్అండ్బీ అతిథి గృహంలో ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాలోని బీఎస్పీ నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కుమ్మరివాడకు వెళ్లి కుండలు తయారు చేసే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. భుక్తపూర్ కాలనీకి వెళ్లి కావేరి, మహిపాల్ దంపతులతోపాటు పలువురు మేదరులతో మాట్లాడారు. తర్వాత జనార్దన్రెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన బీఎస్పీ నాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరాం, మహాత్మా జ్యోతిబా ఫులే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివిధ పార్టీలను వదిలి బీఎస్పీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ రెండేళ్ల తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదల రాజ్యం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. బాంచన్ బతుకుల కాలం పోయిందని, గులాబీ తెలంగాణ నీలి తెలంగాణగా మారుతుందని పేర్కొన్నారు. దళితుల అభివృద్ధి విషయంలో సీఏం కేసీఆర్ ఏడేళ్లు ఎందుకు పథకాలను అందించకుండా నిద్రపోయారని ప్రశ్నించారు. దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి ఇస్తానని కేవలం 10 వేల మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. శ్మాశనవాటికలు, రైతు వేదికలు, ఇతర భవనాలను నిర్మించేందుకు అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడంతో నిరుద్యోగులు కులవృత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారన్నారు. సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ మంద, కోఆర్డినేటర్ గంగాధర్, జిల్లా ఇన్చార్జి మెస్రం జంగుబాపు, తదితరులు పాల్గొన్నారు. చదవండి: పదేళ్ల క్రితం అదృశ్యం: పుట్టింటికి రప్పించిన రాఖీ పండుగ -
బహుజనుల ఐక్యతతోనే రాజ్యాధికారం
సాక్షి, ఆదిలాబాద్: బహుజనులు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం సిద్ధిస్తుం దని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బహుజనుల పక్షాన ఉద్యమించడంతో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలకు బడుగు, బలహీనవర్గాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న ప్రవీణ్కుమార్ ఆర్అండ్బీ విశ్రాంతి గృహంలో ఉమ్మ డిజిల్లా బీఎస్పీ నాయకులతో సమావేశమై పార్టీ పరిస్థితులపై ఆయన చర్చించారు. కుండలు తయారు చేసే చక్రంపై మట్టితో ప్రమిదలు తయారు చేశారు. ఆయన వెంట బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, రాష్ట్ర కోఆర్డినేటర్ గంగాధర్, జిల్లా ఇన్చార్జి జంగుబాబు ఉన్నారు. -
ఈటల గెలిస్తే ప్రభుత్వం కూలుతుందా?
కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలిస్తే ప్రభుత్వం కూలిపోతుందా? అని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీలవి రాజకీయ డ్రామాలని, లోపాయికారి ఒప్పందంతోనే విమర్శలు చేసుకుంటున్నారన్నారు. బీఎస్పీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ ప్రగతిభవన్పై నీలిజెండా ఎగురవేసి బహుజనభవన్గా మార్చడమే లక్ష్యంగా ముం దుకుసాగాలన్నారు. చదవండి: కృష్ణా జలాల వివాదం తెలుగు రాష్ట్రాలకే పరిమితం బీఎస్పీ అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ ఫాంహౌస్కు పవర్ కట్చేసి బహుజనుల పవర్ ఏంటో చూపుతా మన్నారు. మంత్రి మల్లారెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్న తీరు ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చేలా ఉందని, మల్లారెడ్డిని సమాజం నుంచి బహిష్కరించాలని కోరారు. ఉపఎన్నికలు వస్తేనే ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తుకొస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వేరోస్ సభ్యులతోపాటు వివిధ పార్టీ్టలకు చెందిన కార్యకర్తలు బీఎస్పీలో చేరారు. చదవండి: మనోళ్లకు ‘బీపీ’ ఎక్కువే! -
హుజూరాబాద్ బరిలో బీఎస్పీ.. ప్రవీణ్ కుమార్పై ఒత్తిడి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికలో త్వరలో ఆసక్తికర పరిణామా లు చోటు చేసుకునే అవకాశాలు కనిపి స్తున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ టీఆర్ఎస్–బీజేపీల మధ్య ద్విముఖ పోరే నడు స్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయనప్పటికీ.. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ఏర్పాట్లు చేసుకుంది. తాజాగా.. హుజూరాబాద్ బరిలో బీఎస్పీ దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయాలంటూ పలువురు బీఎస్పీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 26వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు నేతలు బీఎస్పీలో చేరుతుండగా.. ఈ సందర్భంగా నిర్వహించే సభలో ఆయన హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీ చేయాలా? వద్దా? అన్న విషయంపై నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం. (చదవండి: Huzurabad : కాంగ్రెస్ నుంచి బరిలోకి మాజీమంత్రి కొండా సురేఖ..?) బీఎస్పీతోనే బహుజన రాజ్యాధికారం: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ దేవరకొండ: బీఎస్పీ తోనే బహుజన రాజ్యా ధికారం సాధ్యమని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగిన బీసీ కులాల చర్చా కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు. బీసీలు, బీసీ ఉపకులాల భవిష్యత్తు ఇప్పటికీ అగమ్యగోచరంగానే ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో బహుజనులకు విముక్తి కలి్పంచే పార్టీ బీఎస్పీ అని, బీసీలంతా ఐక్యంగా ఉద్యమించి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికీ బీసీ గణనకు భారత ప్రభుత్వం ఒప్పుకోవట్లేదని, 2014లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సకల జనుల వివరాలు ఎందుకు తెలపడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ పేరును బహుజన భవన్గా మార్చాలన్నారు. ఈ సందర్భంగా పలువురు బీఎస్పీలో చేరారు. బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సిద్ధార్థ పూలే, నాయకులు రాజారావు, ప్రముఖ విద్యావేత్త వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు కరోనా
గాంధీ ఆస్పత్రి: బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ ఐపీఎస్ అధికారి, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా నీరసంగా ఉన్న ఆయన మంగళవారం కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా తేలింది. దీంతో తక్షణమే సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు హోంఐసోలేషన్లో ఉండాలని సూచించారు. తనకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని, వైద్యుల సూచన మేరకు హోంఐసోలేషన్లో ఉంటున్నానని ప్రవీణ్కుమార్ తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నల్లగొండలోనే సోకిందా... ఐపీఎస్కు రాజీనామా చేసిన ప్రవీణ్కుమార్ గత పదిరోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈనెల 8న నల్లగొండలో జరిగిన రాజ్యాధికార సంకల్ప సభలో పాల్గొని బీఎస్పీలో చేరారు. ఈ సభకు హాజరైన ఆయనతో పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సన్నిహితంగా మెలిగారు. నల్లగొండ సభ పూర్తయిన తర్వాతే ప్రవీణ్కుమార్ ఆరోగ్యంలో స్వల్ప మార్పులు కనిపించాయి. దీంతో నల్లగొండ సభలోనే ప్రవీణ్కుమార్కు కరోనా సోకినట్లు భావిస్తున్నారు. -
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
-
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
హైదరాబాద్: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని ఎమ్మెల్యే గాదరి కిశోర్ హెచ్చరించారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి అయినా చేసేది ప్రభుత్వమేనని.. వ్యక్తులు కాదన్నారు. దళితుల కోసం రాజీనామా చేశానని ప్రవీణ్కుమార్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దందళిత బంధుకు ప్రవీణ్కుమార్ వ్యతిరేకమా? అని గాదరి కిశోర్ ప్రశ్నించారు. కాగా దళిత బంధు కోసం రూ.1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని అంటున్నారు.. ఆ డబ్బులు ఎవరివని సీఎం కేసీఆర్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దళితులపై ప్రేమ ఉంటే కేసీఆర్ తన ఆస్తులు అమ్మి దళితబంధు అమలు చేయాలి, తెలంగాణలో ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఇన్నేళ్లలో తెలంగాణలో ఎన్ని ఆస్పత్రులు కట్టారు? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎందుకు ఉండకూడదు? అని ఆయన నిలదీశారు. -
బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
సాక్షి, నల్లగొండ: మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆదివారం బహుజన్ సమాజ్ వాదీ పార్టీలో చేరారు. బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బీఎస్పీలో చేరిన ప్రవీణ్కుమార్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమించబడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల బతుకులు బాగు పడాలంటే విద్య, ఉపాధి కావాలని తెలిపారు. తాను రాజీనామా చేసిన రోజే కేసుపెట్టారని చెప్పారు. ఎన్ని కుట్రలు చేసిన జన సునామీని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. బహుజన సమాజంలో బానిసలం కామని, పాలకులమని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. దళిత బంధు కోసం రూ.1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని అంటున్నారు.. ఆ డబ్బులు ఎవరివని సీఎం కేసీఆర్ని ప్రశ్నించారు. దళితులపై ప్రేమ ఉంటే కేసీఆర్ తన ఆస్తులు అమ్మి దళితబంధు అమలు చేయాలన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఇన్నేళ్లలో తెలంగాణలో ఎన్ని ఆస్పత్రులు కట్టారు? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎందుకు ఉండకూడదు? అని నిలదీశారు. ఇప్పటివరకు సంపద మొత్తం 5 శాతం వర్గాల వద్దే ఉందని మండిపడ్డారు. -
నేడు బీఎస్పీలో చేరనున్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
నల్లగొండ: బహుజన సమాజ్పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండలో బహిరంగ సభ జరగనుంది. అందుకు జిల్లా పార్టీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాలనుంచి బహుజన సమాజ్పార్టీ కార్యకర్తలు, స్వేరోలు, ప్రవీణ్కుమార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది. నల్లగొండలోని ఎన్జీ కాలేజీ మైదానంలో సాయంత్రం 4గంటలకు సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభాస్థలిలో కూడా ప్రవీణ్కుమార్, ముఖ్య అతిథులతో కూడిన ఫొటోలతో భారీ కట్అవుట్లను ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు భిన్నంగా కార్యకర్తలు కూర్చునే విధంగా కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. బహుజన సమాజ్పార్టీ జిల్లా ఇన్చార్జ్, ఆర్ఎస్పీ రాజకీయ సంకల్ప సభకు కన్వీనర్ పూదరి సైదులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు ముఖ్య అతిథిగా బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజీగౌతమ్ హాజరవుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర , తెలంగాణ జిల్లాల ఇన్చార్జ్లు, జిల్లాకు చెందిన బీఎస్పీ నేతలు కూడా హాజరుకానున్నారు. బీఎస్పీలో చేరనున్న ప్రవీణ్కుమార్... నల్లగొండలో జరిగే బహిరంగ సభలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఎస్పీలో అధికారికంగా చేరుతున్నారు. ప్రస్తుతం ఆయన గురుకుల కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సొంతంగా పార్టీ పెడతరా లేదా ఇతర అధికార పార్టీలో చేరుతారన్న వదంతులు వచ్చాయి. కానీ, ఆయన బీఎస్పీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగానే ఆదివారం నల్లగొండలో జరిగే బహిరంగ సభలో బీఎస్పీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు. 4 గంటలకు బహిరంగ సభ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం 4గంటలకు ఎన్జీకళాశాల మైదానంలో బహిరంగ సభ జరుగునుంది. పోలీసులు కూడా సభాస్థలితో పాటు పార్కింగ్ తదితర వాటిని ఏర్పాట్లు చేశారు. అయితే బహిరంగ సభ రోజు ఉదయం డాన్బోస్కో నుంచి నల్లగొండ టౌన్లోకి 1000 మందితో ఫిట్ ఇండియా 5కే రన్ నిర్వహించనున్నారు. ఇదంతా స్వేరోల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మర్నిగూడ బైపాస్ నుంచి ర్యాలీ మధ్యాహ్నం 2:30 గంటలకు నల్లగొండ పట్టణ సమీపంలోని అద్దెంకి బైపాస్ వద్ద ముఖ్య అతిథులకు కార్యకర్తలంతా స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి డప్పు కళాకారులు , కోలాట కళాకారులతో ర్యాలీ ప్రారంభం కానుంది. రెండు గంటలపాటు ర్యాలీ నిర్వహించనున్నారు. తర్వాత 4గంటలకు ఎన్జీ కాలేజీ సభ స్థలి చేరుకుంటారు. కార్యకర్తలు స్వచ్ఛందంగా.. బహిరంగ సభకు ఎలాంటి వాహనాలు ఏర్పాటు చేయడం లేదు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అభిమానులు, స్వేరో కార్యకర్తలంతా స్వచ్ఛందంగానే సభకు హాజరవుతారని జిల్లా ఇన్చార్జి సైదులు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సభను నిర్వహించబోతున్నాం. శానిటైజర్ , మాస్కులు తప్పనిసరి , సమావేశం పూర్తయిన తర్వాత కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా సభ జరగనుంది. -
8న నల్లగొండలో రాజకీయ సంకల్ప సభ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఈ నెల 8న నల్లగొండలో రాజకీయ సంకల్ప సభ నిర్వహించనున్నారు. అదే రోజు బహుజన సమాజ్ పార్టీలో చేరుతున్నారని సమాచారం. ఈ సందర్భంగా లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీఎస్పీ జిల్లా ఇన్చార్జి పూదరి సైదులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సభకు ముఖ్యఅతిథిగా బీఎస్పీ నేషనల్ కో–ఆర్డినేటర్, ఎంపీ రాంజీ గౌతమ్ హాజరుకానున్నారు. బహిరంగ సభకు ఎటువంటి వాహనాలు ఏర్పాటు చేయట్లేదని, ప్రవీణ్కుమార్ అభిమానులు, స్వేరో కార్యకర్తలు స్వచ్ఛందం గా వస్తారని సైదులు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సభను నిర్వహిస్తామని చెప్పారు. -
నల్గొండలో ఈనెల 8న సభ: ప్రవీణ్ కుమార్
జడ్చర్ల టౌన్: తెలంగాణలో బహుజన రాజ్యం తెచ్చుకునేందుకు ముందుకు సాగాలని మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని ఇంపీరియల్ గార్డెన్లో ఉమ్మడి జిల్లా బహుజన సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. రాబోయే రెండేళ్లు ఎంతో కీలకమని, ప్రతి నిమిషం ఎంతో విలువైందని గుర్తుంచుకోవాల న్నారు. ఇక్కడ వేసిన అడుగులు ప్రగతిభవన్ వెళ్లే వరకు ఆ పొద్దని చెప్పారు. బండలు పిండిచేసి ప్రాజెక్టులు నిర్మించిన కూలీల జిల్లాగా పాలమూరుకు పేరుందని, అదే తరహాలో బహుజన రాజ్యం సాధించుకునేందుకు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. తన రాజీనామాతో ఫాంహౌజ్లు కూలటానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. తను రాజీనామా చేసిన మరుసటి రోజే కేసు పెట్టారని, అయినా భయపడేది లేదన్నారు. ప్రాణమున్నంత వరకు స్వేరోగానే ఉంటానని పేర్కొన్నారు. నల్లగొండలో ఈనెల 8న నిర్వహించనున్న సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. అంతకుముందు జడ్చర్ల క్రాస్రోడ్నుంచి ఇంపీరియల్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. -
కరీంనగర్ జిల్లా మన్నెం పల్లిలో చాకలి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ
-
ఓట్ల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు
తిమ్మాపూర్: ఎన్నికల్లో గెలవడం కోస మే నాయకులు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో పర్యటించారు. సర్పంచ్ మేడి అంజ య్యతో కలిసి గ్రామంలో పేదల జీవన శైలి గురించి తెలుసుకున్నారు. అనంత రం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూ రంలో ఉన్న మన్నెంపల్లి ప్రజలు ఇంకా పేదరికంలో మగ్గడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కుల వృత్తులకు లక్షల కోట్ల రూ పాయలు ఖర్చు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న పాలకులు వాటిని క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా చూడాలని కోరారు. వెనుకబడిన, బడుగు, బలహీ న వర్గాల అభివృద్ధి, రాజ్యాధికారమే ల క్ష్యంగా తాను ఉద్యోగానికి రాజీనామా చేశానని ప్రవీణ్కుమార్ స్పష్టం చేశారు. అందరి బతుకులు మార్చాలనే లక్ష్యం తో ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. అందుకే మ న్నెంపల్లిని సందర్శించానన్నారు. ఉప ఎన్నికలో ఓట్ల కోసం వందల కోట్ల రూ పాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పేద, బడుగు, బలహీన వర్గాల విద్య, ఉపాధికోసం ఖర్చు చేస్తే వారి జీవితా లు బాగుపడతాయని పేర్కొన్నారు. -
బీఎస్పీలోకి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్!?
సాక్షి, హైదరాబాద్: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బహుజన సమాజ్పార్టీ (బీఎస్పీ)లో చేరతారన్న చర్చ ఊపందుకుంటోంది. స్థానిక మీడియాతోపాటు జాతీయ చానళ్లలోనూ ఈ వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. బీఎస్పీ జాతీయస్థాయి నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారని, అందులో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మంగళవారం పలువురు స్వేరో ప్రతినిధుల పేరిట సోషల్మీడియాలో సందేశాలు వైరల్గా మారాయి. ఆగస్టు 8న నల్లగొండ జిల్లాలోని ఎన్జీ కాలేజ్ మైదానంలో ఐదు లక్షలమందితో భారీ బహిరంగసభ ఏర్పాటుచేసి, ప్రవీణ్ బీఎస్పీలో చేరతారన్నది వీటి సారాంశం. మరోవైపు తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల వారీగా ప్రవీణ్కుమార్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఎస్పీలో చేరాలా? లేదా స్వతంత్ర వేదిక ఏర్పాటు చేయాలా? అనే దానిపై సమాలోచనలు సాగిస్తున్నారు. ప్రవీణ్కుమార్ ఏ నిర్ణయం తీసుకున్నా వెంట నిలుస్తామని స్వేరో, పలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. పీడిత వర్గాలకు ఏకవచన సంబోధనా: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అగ్రవర్ణాల నాయకులను గారు అని సంబోధించి, పీడితవర్గాల నాయకులను ఏకవచనంతో సంబోధించారంటూ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రగతిభవన్లో జరిగిన దళిత సాధికారికత సమావేశంలో వేదికపైకి హుజూరాబాద్ నాయకులకు స్వాగతం పలుకుతూ కౌశిక్రెడ్డి వ్యవహరించిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంగళవారం ట్వీట్చేశారు. ఇలాంటి దురహంకార భావజాలం వల్లనే జనాలు బహుజన రాజ్యం రావాలంటున్నారని పేర్కొన్నారు. దీనిపై కౌశిక్రెడ్డి కూడా ట్వీట్చేస్తూ.. ఎడిట్ చేసిన వీడియోను చూసి విమర్శలు చేయడం మీ స్థాయికి తగదని బదులిచ్చారు. త్వరలోనే రాజకీయ కార్యాచరణ భానుపురి(సూర్యాపేట): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో త్వరలో బహిరంగసభ నిర్వహించి భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని గురుకుల పాఠశాలల మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ వెల్లడించారు. మంగళవారం సూర్యాపేటలో నిర్వహించిన బహుజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తన వద్ద డబ్బుల్లేవని, తన రాజకీయ కార్యాచరణకు ప్రతి ఒక్కరూ చందాలు వేసుకుని ముందుకు రావాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి గౌరవిస్తున్నారని, కానీ, ఎస్సీ ఉద్యోగుల ప్రమోషన్లు ఆపి అగౌరవ పర్చుతున్నారన్నారు. -
నన్ను లాగితే అంచనాలు తలకిందులే: ప్రవీణ్ కుమార్
సాక్షి,హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికలో తాను ఎవరికో మద్ద తు ఇస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. తాను ప్రస్తుతం ఇల్లు వెతుక్కునే పనిలో తలమునకలయ్యానని, తనను అనవసరంగా ఇందులోకి లాగొద్దన్నారు. తనను లాగితే అందరి అంచనాలు తలకిందులవుతాయని హెచ్చరిస్తూ సోమవారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు. హుజూరాబాద్ లో నేను ఎవరెవరికో మద్దతిస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్న ఫేక్ న్యూస్ ను నమ్మకండి. నా మద్దతు ఎప్పుడూ విద్య, వైద్యం, ఉపాదికే. అక్కడ వెదజల్లుతున్న డబ్బులను వీటికే పెట్టాలి. ఇప్పుడే రిటైరై ఒక ఇల్లు దేవులాడుట్ల బిజీగ ఉన్న. నన్ను ఊరికే ఆడికి లాగకుండ్రి. అంచనాలు తలక్రిందులయితై — Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) July 26, 2021 -
భయపడే ప్రసక్తే లేదు.. చావుకైనా సిద్ధం: ప్రవీణ్ కుమార్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పోలీసు కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్వేరోస్ వ్యవస్థాపకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ స్పష్టం చేశారు. బహుజన రాజ్యాధికార సాధన కోసం మరణించడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. పదవీ విరమణ చేసిన మరుసటి రోజే పోలీసులు తనపై కేసులు నమోదు చేశారని తెలిపారు. శుక్రవారం సంగారెడ్డిలో జరిగిన స్వేరోస్ కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోట్లాది మంది ప్రవీణ్కుమార్లు పుట్టుకొస్తారు అంబేడ్కర్ బాటలో నడిచేందుకు ఒంటరి పోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రవీణ్కుమార్ అన్నారు. ఒక్క ప్రవీణ్కుమార్పై కేసులు పెడితే కోట్లాది మంది ప్రవీణ్కుమార్లు పుట్టుకొస్తారని వ్యాఖ్యానించారు. పోలీసు ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నావని తన తల్లి ప్రశ్నిస్తే కోట్లాది మంది దళిత బిడ్డలను బాగు చేసేందుకే రాజీనామా చేశానని చెప్పానని తెలిపారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ గురించి నాలుగేళ్ల చిన్నపిల్ల ఎంతో చక్కగా మాట్లాడిందని, అలాంటి ధైర్యం ఆ 29 మంది ఎమ్మెల్యేలకు ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేదని విమర్శించారు. హుజురాబాద్లో దళితబంధు పథకాన్ని రూ.వెయ్యి కోట్లతో అమలు చేయాలని అనుకుంటున్నారని, ఆ డబ్బులతో దళిత బిడ్డలను అమెరికా, ఆస్ట్రేలియాల్లో చదివించేందుకు పంపితే సత్య నాదెళ్ల, బిల్గేట్స్, సుందర్ పిచాయ్లు అవుతారని పేర్కొన్నారు. తమ బిడ్డలు ఎన్ని రోజులు రోడ్లు ఊడ్వాలని, ఎన్ని రోజులు కల్లు గీయాలని, గొర్లు.. బర్లు కాయాలని ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. అమెరికా, ఆస్ట్రేలియా ఎందుకు వెళ్లకూడదని అన్నారు. మన రాజ్యం వస్తుందని ప్రచారం చేయాలి వందల సంవత్సరాలుగా దళితులు అణచివేతకు గురవుతున్నారని, వారిపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ప్రవీణ్కుమార్ అన్నారు. మటన్, చికెన్ దావత్, బీరు, బిర్యానీలు, తాయిలాలకు మోసపోయే జాతులు మనవి కావని, రాజ్యాధికారం సాధించుకునేందుకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మన రాజ్యం వస్తుందని అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు, తాండూర్ నుంచి నల్లగొండ వరకు ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. వీణ్కుమార్పై కేసు నమోదు కరీంనగర్ క్రైం: మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్తోపాటు మరొకరిపై కరీంనగర్ త్రీటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. మార్చిలో పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకాపూర్(దూళికట్ట) గ్రామంలో జరిగిన స్వేరోస్ కార్యక్రమంలో ప్రవీణ్కుమార్, ఎన్.శంకర్బాబు హిందువుల మత విశ్వాసాలను కించపరిచే విధంగా వ్యవహరించారంటూ న్యాయవాది బేతి మహేందర్రెడ్డి మార్చి 22న తన న్యాయవాది ద్వారా కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టు ఆదేశాల ప్రకారం గురువారం రాత్రి ప్రవీణ్కుమార్, శంకర్లపై కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
మహనీయుల కలలను నిజంచేస్తా
సాక్షి, ఆదిలాబాద్: లక్షలాది మంది పేదల అభ్యున్నతి కోసమే తాను జనంలోకి వచ్చానని, వేరే ఎజెండా లేదని స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసిన సీనియర్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన ఆయన ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని సందర్శించారు. ఉట్నూర్ మండలం దంతన్పల్లిలో ఓ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. మార్గమధ్యలో ముత్నూర్ వద్ద కుమ్రంభీం విగ్రహానికి, ఇంద్రవెల్లిలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘అందరూ అనుకున్నట్టుగా నేను ఫలానా పార్టీలో అభ్యర్థి అనేది ఫేక్ న్యూస్.. ప్రజలు నమ్మొద్దు’అని పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, మాన్యవార్ కాన్షీరాం, కుమ్రంభీం, పూలే వంటి మహనీయుల ఆశయాలు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయని, వారి కలలను నిజం చేసేందుకే తాను ముందుకొచ్చానని తెలిపారు. వీఆర్ఎస్ ఒకరు చెబితే చేసింది కాదని, మనస్సాక్షిగా తీసుకున్న నిర్ణయమని చెప్పారు. 26 ఏళ్ల వృత్తిలో గిరిజన, దళిత, బహుజన బిడ్డల అభ్యున్నతి కోసం కృషి చేశానని, అది కేవలం ఒక శాతమేనన్నారు. మిగిలిన 99 శాతం కూడా సాధించేందుకే తన ఈ ప్రయత్నమన్నారు. పేద బిడ్డల అభ్యున్నతే నిజమైన సామాజిక విప్లవమని, ఇదే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. ఇలాంటి అభివృద్ధిని ప్రతి గ్రామానికి, ప్రతి గల్లీకి తీసుకెళ్లబోతున్నామని తెలిపారు. అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం ఎజెండాగా ముందుకుసాగుతామని వెల్లడించారు. ప్రవీణ్కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు ఆమోదం సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సోమవారం స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖా స్తు చేసుకోగా.. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. 26 ఏళ్లుగా పోలీస్ శాఖలో పలు హోదాల్లో పనిచేసిన ఆయన, తొమ్మిదేళ్లుగా సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా ఉంటూ, ఆ విద్యాసంస్థలకు గుర్తింపు తెచ్చిన సంగతి విదితమే. ఆయన స్థానంలో ఆర్థిక శాఖలో కార్యదర్శిగా ఉన్న రోనాల్డ్రాస్కు గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ రాజీనామా.. గురుకులాలకు షాక్!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థలకు బ్రాండ్గా నిలిచిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో గురుకుల సొసైటీ వర్గాలు షాక్కు గురయ్యాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) కార్యదర్శిగా 2012లో బాధ్యతలు చేపట్టారు. తక్కువ సమయంలోనే గురుకులాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి వాటి ఖ్యాతిని పెంచారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గురుకులాల కీర్తిని నిలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల్లో పెద్ద ఎత్తున కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. సాధారణంగా మూడేళ్ల పాటు ఒక పదవిలో పనిచేసిన వ్యక్తికి బదిలీ అనివార్యం. కానీ ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను అక్కడి నుంచి కదిలించలేదు. కీలక బాధ్యతల్లో కొనసాగుతూ.. రెండు సొసైటీల కార్యదర్శితో పాటు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ (ఈఎంఆర్ఎస్ఎస్) కార్యదర్శిగా, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. కేజీ టు పీజీ మిషన్ కింద గురుకుల విద్యా సంస్థలను పెద్ద సంఖ్యలో పెంచింది. ఈ క్రమంలో గురుకుల సొసైటీల్లో వేలాది ఉద్యోగాల భర్తీ చేయాల్సి రావడంతో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు (టీఆర్ఈఐఆర్బీ)ని ఏర్పాటు చేసి, ఈ బోర్డు చైర్మన్గా ప్రవీణ్కుమార్కు బాధ్యతలు అప్పగించింది. దాదాపు ఈ బోర్డుకు నాలుగేళ్ల నుంచి చైర్మన్గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ప్రవీణ్కుమార్ రాజీనామాతో ఈ నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఒకవేళ ఆయన రాజీనామాను ఆమోదిస్తే ఇప్పటికిప్పుడు కిందిస్థాయి అధికారులకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించినా.. వందల సంఖ్యల్లో విద్యాసంస్థలు నిర్వహిస్తున్న ఈ సొసైటీలకు హెచ్వోడీల నియామకం సులువైన విషయం కాదు. గరుకుల సంస్థల్లో చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లోని యూనివర్సిటీల్లో అడ్మిషన్లు సులువుగా పొందుతున్నారు. వీటిని ఇదే స్థాయిలో నిర్వహించాలంటే ప్రవీణ్కుమార్లా చురుగ్గా ఉండే అధికారి కావాలని విద్యార్థులు సైతం ఆకాంక్షిస్తున్నారు. -
రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త విప్లవం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సాక్షి, ఆదిలాబాద్: హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చేసే ఆలోచన తనకు లేదని ఐపీఎస్ అధికారి, సాంఘీక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త విప్లవం రాబోతోందని ఆయన అన్నారు. ఈ డెబ్బై, ఎనబై సంవత్సరాలలో అట్టడుగు వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, అట్టడుగు వర్గాల కోసం పోరాటం చేస్తానని తెలిపారు. అక్షరం, ఆర్ధికం, ఆరోగ్యం ఎజెండాగా.. పూలే , అంబేద్కర్, కాన్షిరాం ఆశయాల కోసం పోరాటం చేయనున్నట్లు పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా ప్రజల్లో 1 శాతం మార్పు తీసుకువచ్చానని, ఇంకా తొంబై తొమ్మిది శాతం ప్రజల జీవితాలలో మార్పు కోసం పనిచేయనున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజులలో అన్ని వివరాలు ప్రకటించనున్నట్లు తెలిపారు. సూర్యుడు తూర్పున ఉదయించి.. పశ్చిమాన అస్తమించేది.. ఎంత నిజమో.. ప్రవీణ్ కుమార్ పోటీ చేయకపోవడం అంతే నిజమని అన్నారు. సాంఘీక సంక్షేమ కార్యదర్శిగా గూడెం బిడ్డలు విదేశాలలో చదివేలా ప్రోత్సహించానని, ఇలా అన్ని వర్గాల బిడ్డలు అభివృద్ధి చెందాలనేది తన ఆకాంక్ష అని ఆయన అన్నారు. -
హుజురాబాద్: ఉప ఎన్నిక బరిలో ప్రవీణ్కుమార్?!
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ పదవికి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ తరఫున ఆయన బరిలో దిగుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్కు కంచుకోటగా ఉన్న హుజురాబాద్లో గెలుపునకై టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ముద్దసాని పురుషోత్తంరెడ్డి, కడియం శ్రీహరి తదితర పేర్లు తెరమీదకు వచ్చినా ఎటువంటి ముందడుగు పడలేదు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్రెడ్డి టీఆర్ఎస్లో చేరతారన్న వార్తలు వినిపిస్తున్నా.. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ ప్రవీణ్కుమార్ ప్రభుత్వానికి సోమవారం లేఖ రాయడం, ఉప ఎన్నిక బాధ్యతలు భుజాన వేసుకున్న మంత్రి గంగుల కమలాకర్ నేడు మాట్లాడుతూ.. ఉప ఎన్నిక అభ్యర్థి అంశం ఖరారైందన్నట్లు సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. కాగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అలంపూర్కు చెందిన ప్రవీణ్కుమార్.. అడిషనల్ డీజీపీ హోదాలో సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కరీంనగర్లో ఎస్పీగా పనిచేసిన ఆయనకు జిల్లాతో మంచి అనుబంధం ఉంది. ఇందుకుతోడు ప్రవీణ్కుమార్కు రాజకీయాలు అంటే ఆసక్తి అనే ప్రచారం కూడా సాగుతోంది. ఇక నేడు రాజీనామా సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘కుట్రపూరితంగా నన్ను ఒక వర్గానికి పరిమితం చేసే ప్రయత్నం జరిగింది. వ్యక్తిగత కారణాల వల్ల ఆరేళ్లకు ముందే తప్పుకుంటున్నా. ఎక్కువ మందికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేశా. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తానో? లేదో? ఇప్పుడే చెప్పలేను’’ అని వ్యాఖ్యానించడం ఈ ఊహాగానాలకు మరింత ఊతం ఇస్తోంది. మరోవైపు.. ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో.. ఇప్పటికే ఉద్యోగాల భర్తీ, దళిత బంధు పథకం(హుజురాబాద్ పైలట్ ప్రాజెక్టు) ప్రకటన వంటి అంశాలతో అధికార పార్టీ ఓటర్లకు గాలం వేస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోటీలో దింపేందుకే ప్రవీణ్కుమార్తో రాజీనామా చేయించారనే ప్రచారం సాగుతోంది. ఏదేమైనా సోమవారం నాటి పరిణామాలు హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో హాట్టాపిక్గా మారాయి. -
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సంచలన నిర్ణయం: ఐపీఎస్ పదవికి రాజీనామా
RS Praveen Kumar Resignation: సాక్షి, హైదరాబాద్: సంచలనాలు, సంస్కరణలకు చిరునామా అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి, అడిషనల్ డైరెక్టర్ జనరల్ రేపల్లె శివ ప్రవీణ్కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ– మెయిల్ ద్వారా సమాచారం అందించారు. సోమ వారం ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 1995 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. మరో ఆరేళ్ల సర్వీసు మిగిలి ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసు కోవడంపై పోలీస్ శాఖ, ప్రస్తుతం ఆయన కార్యదర్శిగా ఉన్న గురుకుల సొసైటీల్లో కలకలం రేపుతోంది. వ్యక్తిగత కారణా లతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఏడీజీ హోదాలో యూసఫ్గూడ బెటాలియన్లో ఉన్న కొందరు ఆత్మీయులు, ఐపీఎస్ మిత్రులను కలుసుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో బయటికొచ్చారు. తర్వాత కొద్దిసేపటికే తన వీఆర్ఎస్ నిర్ణయాన్ని వెలువరించారు. రాష్ట్రవ్యాప్త గుర్తింపు.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రవీణ్కుమార్ కరీంనగర్, అనంతపూర్ జిల్లాలకు ఎస్పీగా, హైదరాబాద్లో డీసీపీ (క్రైమ్), జాయింట్ సీపీ (స్పెషల్ బ్రాంచ్), తర్వాత గురుకుల సొసైటీకి కార్యదర్శిగా పనిచేశారు. కరీంనగర్ ఎస్పీ (2001 నుంచి 2004)గా పనిచేయడం ఆయనకు చాలా గుర్తింపు తెచ్చింది. మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేస్తూనే, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్న గ్రామంలోనే ఉండాలంటూ ఆయన ఇచ్చిన నినాదం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, తల్లిదండ్రులను ఎంతగానో ప్రభావితం చేసింది. ‘గురువా మా ఊర్లోనే ఉండు..’అన్న నినాదం జిల్లావ్యాప్తంగా ఉద్యమంగా మారింది. భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇదీ ఆయన నేపథ్యం.. పూర్తిపేరు: రేపల్లె శివ ప్రవీణ్కుమార్ పుట్టింది: ఆలంపూర్, 1967 తల్లిదండ్రులు: ప్రేమమ్మ, బీఆర్ సవరన్న విద్యార్హతలు: వెటర్నరీ సైన్స్లో రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీ నుంచి మాస్టర్స్, హార్వర్డ్, మసాచుసెట్స్ వర్సిటీల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ అవార్డులు: పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ, ప్రెసిడెంట్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, సెక్యూరిటీ మెడల్ (కేంద్ర హోం శాఖ), యునైటెడ్ నేషన్స్ పోలీస్ మెడల్ (వార్ క్రైం ఇన్వెస్టిగేటర్) సమీప బంధువులు: మాజీ ఎమ్మెల్యే సంపత్, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పోలీసు వెబ్సైట్ సృష్టికర్త హైదరాబాద్లో డీసీపీ (క్రైమ్), జాయింట్ సీపీ (స్పెషల్ బ్రాంచ్)గా పనిచేసిన సమయంలో పోలీస్ శాఖలో ఆయన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. సైబర్ నేరాలు పెరుగుతుండటంతో సీసీఎస్లో సైబర్ క్రైమ్ సెల్ ఏర్పాటు చేయడంతో పాటు ఓ ఠాణా కావాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటి ఆధారంగానే ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్, సైబరాబాద్లకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు మంజూరయ్యాయి. నగర పోలీస్ వెబ్సైట్, ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్, ఆన్లైన్ పాస్పోర్ట్ వెరిఫికేషన్, ఫారినర్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తదితరాలకు శ్రీకారం చుట్టారు. పోలీసుల మధ్య ఎస్ఎంఎస్ల రూపంలో సమాచార మార్పిడికి హోషియార్, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ డిలీట్ దెమ్ కార్యక్రమాలు ఆయన ఆలోచనల నుంచి పుట్టినవే. హుజూరాబాద్లో పోటీ చేసే ఉద్దేశం లేదు హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని, రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని ప్రవీణ్కుమార్ స్పష్టంచేశారు. సోమవారం సాయంత్రం కుందన్బాగ్లోని తన నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. వ్యక్తిగతంగా కొంత విశ్రాంతి కావాలని, 26 ఏళ్లు ప్రభుత్వ సర్వీసులోనే గడిచిపోయాయని, మిగిలిన విషయాలను పట్టించుకోలేదన్నారు. ఇకపై పూర్తిస్థాయిలో పేదలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే పదవీ విరమణ చేశానని వెల్లడించారు. తాను వెళ్లిపోయినంత మాత్రాన గురుకులాల విద్యా సంస్థలకు వచ్చే ఇబ్బందేమీ లేదని వివరించారు. స్వేరోస్ తన సృష్టి కాదని, దాన్ని పూర్వ విద్యార్థులు స్థాపించారని, అందులో తాను అనుకోకుండా చేరానని చెప్పారు. స్వేరోస్లో లక్షలాదిమంది ఉన్నారని, దాంట్లో ప్రవీణ్ ఒకడని, తాను ఉన్నా లేకున్నా స్వేరోస్ ముందుకు సాగుతుందదని స్పష్టం చేశారు. pic.twitter.com/AnaEek8baJ — Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) July 19, 2021 -
మానస స్వప్నం నిరుపేదలకు ఓపాడ్ ఇళ్లు
సొంతింట్లో నివసించాలని కోరుకునే వారు మన సమాజంలో చాలామంది ఉంటారు. పేద, మధ్యతరగతి వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు 23 ఏళ్ల పేరాల మానస రెడ్డి సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. డ్రైనేజి నీటి పారుదల కోసం ఉపయోగించే.. పైపుల్లో సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను అతి తక్కువ ఖర్చుకే అందించనున్నట్లు మానస ప్రకటించింది. ప్రకటించినట్లుగానే రెండు వేల మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన కాంక్రీట్ పైపు (తూము)లో 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓపాడ్స్ లేదా మైక్రో ఇళ్లుగా పిలిచే ఇల్లును నిర్మించి ఔరా అనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించింది మానస. తను మూడో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి మరణించడంతో మానసను, ఆమె చెల్లిని తల్లి ఎంతో కష్టపడి పెంచింది. చిన్నప్పటి నుంచి తల్లి పడుతోన్న కష్టాలను దగ్గర నుంచి చూస్తూ పెరిగిన మానస... తల్లి ప్రోత్సాహంతో ‘లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ’లో సివిల్ ఇంజనీరింగ్లో బి.టెక్ పూర్తిచేసింది. ఇంజినీరింగ్ అయిన తరువాత మరో ఆరు నెలలపాటు కొత్త కొత్త ఇళ్ల నిర్మాణ నమూనాలపై ఆమె పరిశోధనలు చేసింది. పరిశోధనలో భాగంగా జపాన్, హాంగ్కాంగ్, ఇతర ప్రదేశాల్లో అక్కడి వాతావరణ స్థితిగతులకు అనుగుణంగా నిర్మించిన ఇళ్ల నమూనాలపై లోతుగా అధ్యయనం చేసింది. వీటి ఆధారంగా మన దేశంలోని వాతావరణానికి తగ్గట్టుగా తక్కువ ఖర్చుతో ఎలాంటి ఇంటిని నిర్మించవచ్చో నిర్ణయించుకుని కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టడానికి రిజిస్టర్ చేసుకుంది. నిరుపేద కుటుంబాల కోసం 12 రకాల డిజైన్లు రూపొందించగా... ఇప్పుడు ఒక నమూనాతో ‘ఓపాడ్’ ఇంటిని నిర్మించింది. ఓపాడ్.. సిమెంటు తూములు (పైపు)ల్లో నిర్మించే ఈ ఇళ్లు చిన్నగా... చూడముచ్చటగా కనిపిస్తాయి. ఓపాడ్ లో ఒక బెడ్రూమ్, కిచెన్, హాల్, వాష్రూమ్లు ఉంటాయి. వస్తువులను పెట్టుకునేందుకు అల్మారాలు, ఎలక్ట్రిసిటీæ, వాటర్, డ్రైనేజీ సదుపాయాలు ఉంటాయి. పైపు పైన లాంజ్ లాంటి బాల్కనీ కూడా ఉంది. ఈ ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు సౌకర్యంగా జీవించవచ్చు. ఇండియాలోనే తొలిసారి నిర్మించే ఈ ఓపాడ్ ఇళ్లు 40 నుంచి 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో 15 రోజుల్లో నివసించడానికి వీలుగా తయారవుతుంది. ‘‘అన్ని వాతావరణ పరిస్థితుల్లో అటూ ఇటూ కదపగల ఈ ఇళ్లæజీవిత కాలం వందేళ్లు అని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని మానస చెప్పింది. సరికొత్త ఓపాడ్ ఇళ్లలో డబుల్, త్రిబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరలో నిర్మించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ..‘‘పట్టణాలు, గ్రామాలు, స్లమ్స్లో నివసించే వారు ఎక్కువగా పూరి గుడిసె ల్లో నివసిస్తుంటారు. వర్షం పడిందంటే ఇళ్లలోకి నీరు చేరడం, పైకప్పు నుంచి వర్షం కురవడం, కొన్నిసార్లు నీటి ప్రవాహానికి ఇళ్లు కొట్టుకుపోవడం వంటివి సంభవిస్తుంటాయి. నేను బి.టెక్ చదివేటప్పుడు ఇటువంటి సందర్భాలెన్నింటినో దగ్గరగా గమనించాను. సమస్యలు ఏవీ ఎదురుకాని ఇళ్లను నిర్మించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే తక్కువ ఖర్చుతో తయారయ్యే ఓపాడ్ ఇళ్లను నిర్మిస్తున్నాను. ఈ ఇళ్లు ఎంతో చల్లగా ఉండడంతో పాటు ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. నిరుపేదలకోసం రూపొందించిన ఈ డిజైన్లలో కొన్ని రెస్టారెంట్లు, రిసార్టులు, మొబైల్ హోమ్స్, మొబైల్ క్లినిక్లు, గెస్ట్ హౌస్, గార్డులు నివసించే రూములుగా కూడా ఉపయోగపడతాయి’’ అని వివరించింది. మానస తల్లి రమాదేవి మాట్లాడుతూ.. మా అమ్మాయి మానసకు వచ్చిన ఐడియాను మొదట్లో ఎవరూ ప్రోత్సహించలేదు. కానీ ఇప్పుడు ఎంతోమంది తన డిజైన్స్ గురించి మెచ్చుకోవడం నాకెంతో సంతోషంగా, గర్వంగా ఉంది. మానస నిరుపేదలు ఖర్చుచేయగల సరసమైన ధరలకు ఇళ్లను నిర్మించాలని కోరుకుంటున్నాను’’ అని రమాదేవి చెప్పారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి, సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... మానసకు వచ్చిన ఆలోచన కొత్త ఆవిష్కరణలకు పునాది వేసేదిగా ఉంది. ఇది తన విజయ ప్రస్థానంలో కేవలం ప్రారంభం మాత్రమే. ముందుముందు తను మంచి విజయాలను అందుకుంటుందని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు. మానస చెంగిచెర్లలో డెమో కోసం నిర్మించిన ఓపాడ్ ఇల్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లి రమాదేవితో మానస -
లిక్కర్ కాదు..లైబ్రరీ కావాలి
శంకరపట్నం(మానకొండూర్): గ్రామాల్లో లిక్క ర్ కాదు ..చదువుకునేందుకు లైబ్రరీ ఉండాలే... ఆకలేస్తే అక్షరాలు తినాలని గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ అన్నారు. శంకరపట్నం మండలం కన్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించారు. ప్రభుత్వ బడిలో చదువుకున్న ఎస్సెస్సీలో 600మార్కులకు 389 మార్కులు సాధించిన, ఇంటర్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని కష్టపడి ఐపీఎస్ సాధించినప్పుడు మీరెందుకు ఐఏఎస్ కాకూడదని విద్యార్థుల్లో ఆలోచనలు రేకెత్తించారు. ప్రభుత్వ బడుల్లో చదువుకున్న పేదవిద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, శాస్త్రవేత్తలు అయ్యేందుకు ఉపాధ్యాయులు ప్రోత్సహించా లని సూచించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థికి ఒక్క రూపాయి ఇవ్వండి మీరు ఇచ్చేది రూపాయే కని విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందన్నారు. విద్యార్థి దశలో కష్టపడి చదువుకున్న ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇంటర్ తర్వాత ముఖ్యంగా బాలికలు మంచి కాలేజీ ఎంపిక చేసుకుని డిగ్రీ చదువుకోవాలన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు విద్యార్థులు శ్రద్ధ పెట్టాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ను సన్మానించారు. -
సోమాజీగూడ ప్రెస్క్లబ్లో ఘర్షణ
-
టీజీసెట్–2019 ఫలితాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్ష(టీజీసెట్–2019) ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఏప్రిల్ తొలివారంలో జరిగిన ఈ పరీక్ష.. ఫలితాలను టీజీసెట్ కన్వీనర్ ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీలకు చెందిన 613 సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో 47,740 సీట్ల భర్తీకోసం టీజీసెట్–2019 నిర్వహించారు. ఇందులో భాగంగా 1,46,411 మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా... 1,35,608 (92.62శాతం) మంది పరీక్ష రాశారు. తాజాగా విడుదలైన ఫలితాలను www. tswreis.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పరీక్ష రాసిన విద్యార్థి హాల్టిక్కెట్ నంబర్తో పాటు పుట్టిన తేదీని నమోదు చేస్తే విద్యార్థికి వచ్చిన మార్కులు, ఎక్కడ సీటు కేటాయించారనే వివరాలుంటాయి. మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయించగా... తక్కువ మార్కులు వచ్చిన వారికి మాత్రం ఎక్కడా సీటు ఇవ్వలేదు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 21వ తేదీ నుంచి 31లోగా నిర్దేశిత పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవాలని సెట్ కన్వీనర్ స్పష్టం చేశారు. ఈసారి కొత్తగా ప్రారంభమవుతున్న 119 బీసీ గురుకులాల్లో ఐదోతరగతి ప్రవేశాలను కూడా టీజీసెట్ ద్వారానే భర్తీ చేస్తున్నారు. ఇవి తప్పనిసరి... టీజీసెట్లో సీటు సాధించిన విద్యార్థులు కేటాయించిన పాఠశాలకు నేరుగా వెళ్లాలి. ఈ సమయంలో టీజీసెట్ అర్హత పత్రాన్ని ఆన్లైన్లో ప్రింట్ తీసుకోవాలి. వీటితో పాటు నాల్గో తరగతి టీసీ, బోనఫైడ్, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, అసిస్టెంట్ సివిల్ సర్జన్ నుంచి పొందిన ఆరోగ్య ధ్రువీకరణ పత్రం, బ్లడ్ గ్రూప్ సూచించే పత్రం, ఆధార్ జిరాక్సు కాపీతో పాటు నాలుగు పాస్పోర్టు సైజు ఫోటోలు పాఠశాలలో సమర్పించాలి. దివ్యాంగులు, మైనార్టీలు, అనాథలు అయితే సంబంధిత ధ్రువీకరణపత్రాలను జత చేయాలి. అడ్మిషన్ తీసుకున్న తర్వాత విద్యార్థికి పాఠశాలలో ప్లేటు, గ్లాసు, కటోర, ట్రంకుబాక్సు, దుప్పట్లు, నోటు పుస్తకాలు, సబ్బులు, తల నూనె, బకెట్, మగ్గు, టార్చిలైట్, యూనిఫాం ఇస్తారు. వీటిని ఆ విద్యార్థి ఏడాది పాటు వినియోగించుకోవాల్సి ఉంటుంది. -
అక్షర చైతన్యంతోనే అభివృద్ధి
సాక్షి ప్రతినిధి మహబూబ్నగర్: దేశం అభివృద్ధి చెందాలంటే అక్షర చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని తెలంగాణ గురుకులాల సొసైటీ కార్యదర్శి, స్వేరోస్ ఫౌండర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. మహబూబ్ నగర్లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన స్వేరోస్ 4వ జాతీయ సదస్సుకు తెలంగాణ తోపాటు, ఏపీ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి గురుకులాల పూర్వ విద్యార్థులు (స్వేరోలు) హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి గురుకులాలు మాత్రమే సరిపోవని, ప్రతి ఇల్లు ఒక పాఠశాల కావాలని, అప్పుడే విద్యావ్యాప్తి జరుగుతుందన్నారు. పాలకుల నిర్లక్ష్యంతోనే.. దేశంలో పేదరిక నిర్మూలన కోసం విద్య ఎంతో అవసరమని, ఇందులో భాగంగానే అమెరికా విద్యా విధానాన్ని అమలు చేయాలని పురావస్తు శాఖ డైరెక్టర్ ఆకునూరి మురళి అన్నారు. రాష్ట్రంలో విద్యాభ్యున్నతిని పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ వ్యవస్థ భ్రష్టు పట్టిందని అన్నారు. ఫలితంగా అభివృద్ధికి ఆస్కారం లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలను నిషేధించడం ద్వారా అనుకున్న ఫలితాలు సాధించవచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వం నాలుగేళ్లలో ఒక గంట కూడా విద్య కోసం కేటాయించకపోవడం శోచనీయమని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల రద్దు కోసం రాష్ట్రస్థాయిలో హైదరాబాద్లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సదస్సులో సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, ఇన్కంటాక్స్ కమిషనర్ డాక్టర్ ప్రీతిహరిత్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్ఐఆర్డీ రాధిక రస్తోగి, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ రతన్లాల్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి తదితరులు పాల్గొన్నారు. -
అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్
కోదాడ : చదువులో తిరుగులేని ప్రతిభను కనబరుస్తున్న సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాల విద్యార్థులు క్రీడల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రీడా సమరానికి సూర్యపేట జిల్లా, కోదాడ మండలంలోని నడిగూడెం బాలికల గురుకుల పాఠశాల ఆతిథ్యం ఇస్తోంది. గురుకుల విద్యాలయాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ చేతుల మీదుగా బుధవారం ఈ క్రీడాసమరానికి తెరలేవనుంది. నాలుగురోజుల పాటు జరిగే ఈ ఐదో జోనల్ మేట్-2018లో అండర్-17 విభాగంలో 28 పాఠశాలల బాలికలు, అండర్-19 విభాగంలో 33 కళాశాలల 1840 మంది విద్యార్థినులు తమ సత్తా చాటనున్నారు. నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్థులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. -
పీఈసెట్ స్టేట్ ర్యాంకర్లు ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్టులో గిరిజన సంక్షేమశాఖ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం గర్వకారణమని గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొనియాడారు. భద్రాచలం టీటీడబ్ల్యూఆర్సీకు చెందిన విద్యార్థిని కె.మధుమిత స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించగా, పాయం చంద్రకళ నాల్గవ ర్యాంకు, అంకపాలెం టీటీడబ్ల్యూఆర్జేసీ విద్యార్థి అనూష తొమ్మిదోర్యాంకు సాధించారన్నారు. గురుకులాల విద్యార్థులు జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధిస్తున్నారన్నారు. గిరిజన, పేద విద్యార్థులకు గురుకులాలు ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వం గొప్పతనమన్నారు. బడ్జెట్లో గిరిజన సంక్షేమ గురుకులాలకు నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు, గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్కు కృతజ్ఞతలు తెలిపారు. -
త్వరలో కరీంనగర్ జిల్లాలో సైనిక్ స్కూలు
జ్యోతినగర్ (రామగుండం): కరీంనగర్ జిల్లా రుక్మాపూర్లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్షిప్లోని ఉద్యోగ వికాస కేంద్రం ఆడిటోరియంలో స్వేరోస్ స్వర సునామి సీడీ–3 ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2013లో స్వేరోస్ స్థాపించి అందరికీ చదువుకునే అవకాశం కల్పించేలా ప్రతి గ్రామంలో చదువు విలువను తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 577 గురుకుల పాఠశాలల్లో 3 లక్షల పైచిలుకు విద్యార్థులు విద్యను పొందుతున్నారని, రాబోయే 2021 సంవత్సరం వరకు 8 లక్షల 60 వేల మందికి విద్యా బోధన చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. -
ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్గా ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్గా ఆర్ఎస్.ప్రవీణ్కుమార్కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా ఉన్నారు. ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్గా ఉన్న హన్మంతునాయక్ రిలీవ్ కావడంతో ఆ బాధ్యతల్ని ప్రవీణ్కుమార్కు అప్పగిస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి బుద్ధప్రకాశ్ జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు. -
జ్ఞాన సమాజమే లక్ష్యం
సాక్షి, గద్వాల: జ్ఞానసమాజ నిర్మాణమే స్వేరోస్ అంతిమలక్ష్యమని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. స్వేరోస్ అధ్వర్యంలో అలంపూర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన జ్ఞానయుద్ధం మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వివక్షకు తావులేకుండా జ్ఞానసమాజాన్ని సృష్టించడం కోసం స్వేరోస్ నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ తల్లిగర్భం నుంచి భూమి మీదకు అడుగుపెట్టిన ప్రతి జీవికి తనశక్తిని తాను తెలుసుకునే వాతావరణం కల్పించడమే స్వేరోయిజం అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను రెండు చేతులతో అందుకోని ఆకాశమే హద్దుగా ముందుకు సాగాలన్నారు. ఎవరెస్ట్ను అధిరోహించిన మాలావత్ పూర్ణ, ఆనంద్, దర్శానాల సుష్మా, సుందర్రాజు, తేజాబాయి, అంచిపాక సునిల్, సైదులు ఇలా అనేక విజయాలు సాధించిన గురుకుల విద్యార్ధులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఫ్యాక్షనిస్టుల గురించి కాదు.. అనేక విజయాలు సాధించిన మహనీయుల గురించి చెప్పాలన్నారు. అంబేద్కర్ కలలు నిజం చేయాలి రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ మాట్లాడుతూ.. అంబేద్కర్ కలలు భవిష్యత్లో నిజం అవుతాయనడానికి ఈ సభ నిదర్శనమన్నారు. దేశంలో అందరు సమానమేనని చెబుతున్న రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఇప్పటికీ నిర్లక్ష్యం ఉందన్నారు. అంటరాని కులాలను సమాజం అణిచివేసిందన్నారు. అణిచివేతను ఎదుర్కొని ప్రపంచ మేధావిగా ఎదిగిన భారతరత్న అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతిభ జ్ఞానం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. అవకాశం ఇస్తే దేనినైనా సాధించగలరని ఇక్కడ స్వేరోస్ను చూస్తే అర్ధమవుతుందన్నారు. గురుకులాల విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేస్తూనే సమాజ శ్రేయస్సుకు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. పూర్ణ, ఆనంద్ స్ఫూర్తికావాలి మాజీ డీజీపీ డాక్టర్ ప్రసాద్రావు మాట్లాడుతూ.. అతి సామాన్య కుటుంబంలో జన్మించి డీజీపీ స్థాయికి ఎదగడానికి అంబేద్కర్ చూపిన స్ఫూర్తియే కారణమన్నారు. కష్టపడి చదివి అత్యున్నతస్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. కేవలం పది నెలల శిక్షణతోనే ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్ ప్రతి విద్యార్థికి స్ఫూర్తి కావాలని పిలుపునిచ్చారు. పిల్లలను ఎంతైనా చదివించాలి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు మాట్లాడుతూ.. జీవితంలో ఎంత ఉన్నతస్థాయికి ఎదిగినా గతాన్ని, తల్లిదండ్రులను మరిచిపోవద్దన్నారు. తమ పిల్లలను చదివించాలని, స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి సభలు నిర్వహించడం అభినందనీయమన్నారు. దళితుల పిల్లలు చదువుకోవడమే నేరమనే సమాజం నుంచి నేడు జ్ఞాన సమాజం వైపు ముందుకు సాగడం శుభశూచకమన్నారు. మన పిల్లలు చదువుకోవద్దనేది ధనికుడి నైజమని...ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివించాలని పిలుపునిచ్చారు. ఎన్ఆర్ఐ పగిడిపాటి దేవయ్య మాట్లాడుతూ..గురుకులాల్లో చదువుకుని అంబేద్కర్ స్ఫూర్తితో చదువుకోని దేశవిదేశాల్లో వ్యాపారరంగాల్లో రాణించినట్లు తెలిపారు. దేశంలో ఉన్న పేద విద్యార్ధులకు విద్య, వైద్య, ఉపాధిరంగాల్లో సేవలు అందించాలనే ఉద్దేశంతో నాదం స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలందిస్తున్నట్లు చెప్పారు. కింది కులాల బాగుపడాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు. పూర్ణ, ఆనంద్ ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఎత్తయిన శిఖరాలను అధిరోహించేందుకు ఖర్చును తాము భరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్కుమార్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అందించిన ప్రోత్సాహం, స్ఫూర్తితోనే అతి పేద కుంటుబాలకు చెందిన తాము ఎవరెస్ట్ శిక్షరాన్ని అధిరోహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఊషన్న, సెంట్రల్ కమిటీ సభ్యులు ఎస్.స్వాములు, రాష్ట్ర కార్యదర్శి తోకల కృష్ణయ్య, ముకురాల శ్రీహరి, రవిందర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యతోనే సామాజిక మార్పు
పరిగి: విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. పరిగిలోని అంబేద్కర్, జగ్జీవన్రాం విగ్రహాలకు ఆదివారం ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉద్యోగులు, ఉపాధ్యాయులతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యతోనే పేదరికం నుంచి బయటపడతారని ప్రత్యామ్నాయ మార్గం లేదని తెలపారు. అట్టడుగు వర్గాల పిల్లలందరూ బడుల్లో ఉండేలా విద్యావంతులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్, డిప్యూటీ ఈఓ హరిశ్చందర్, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులు వెంకటయ్య, చంద్రయ్య, శ్రీనివాస్, రవికుమార్, శ్రీనివాస్, శ్రీను, బుగ్గయ్య, బిచ్చయ్య, గోపాల్, వెంకటయ్య, చందు తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థుల కోసం విజ్ఞాన కేంద్రాలు దోమ: విజ్ఞాన కేంద్రాలు పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తున్నట్లు సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల రాష్ర్ట కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామంలో స్వేరోస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విజ్ఞాన మందిరాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పుట్టుకతోనే గొప్పవాడు కాదని మంచి చదువు ఉన్న వారు ఎప్పుడైన, ఎక్కడైనా సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు మంచి పుస్తకాలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటుండడంతో విజ్ఞాన మందిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మంచి జ్ఞానం సంపాదించి విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీటీఓ రాంచందర్, డిప్యూటీ ఈఓ హరిశ్చందర్, జెడ్పీటీసీ సభ్యురాలు సరోజ, పశ్చిమ రంగారెడ్డి జిల్లా స్వేరోస్ అధ్యక్షుడు ఆనందం, కార్యదర్శి బాబూరావు, మండల అధ్యక్షుడు యాదయ్య, దిర్సంపల్లి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ, కార్యదర్శి నర్సిములు తదితరులు పాల్గొన్నారు. -
లారీడ్రైవర్ కావాలన్న ఆకాంక్షే ఐపీఎస్ను చేసింది
సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ దసరా, దీపావళి మన పండగలు కావు.. మనం నరకాసురుడి వారసులం 2050 నాటికి మాదిగలు రాజులుగా మారాలి మార్చి 15 నుంచి భీమ్ దీక్ష చేస్తాం.. హైదరాబాద్: లారీ డ్రైవర్ కావాలన్న ఆకాంక్షే తనను ఐపీఎస్ అధికారిని చేసిందని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఆదివారం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరంలో తెలంగాణ మాదిగ సంఘం ఆధ్వర్యంలో దసరా-దీపావళి పండగలను పురస్కరించుకుని సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారి ప్రవీణ్కుమార్ను సత్కరించారు. సత్కారం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘మారుమూల ప్రాంతంలో పుట్టాను. దారిద్య్రంలో పెరిగాను. బానిస బతుకులను వెళ్లదీసే సమయంలో నా తల్లి నన్ను చదివించింది. చదివే సమయంలో నా తల్లి పెద్దయ్యాక ఏమవుతావని ప్రశ్నించింది. వెంటనే లారీ డ్రైవర్ను అవుతానని చెప్పారు. సమాధానమిచ్చానో లేదో నా చెంప చెళ్లుమంది. లారీ డ్రైవర్ అయ్యేందుకేనా చదివించేది అంటూ ఇంటి నుంచి బయటకు తోసేసింది. అప్పటి నుంచి కసితో సాంఘీక గురుకుల విద్యాలయాల్లో ఉంటూ విద్యను అభ్యసించాను. నా తల్లి ఆశించిన ఐపీఎస్ను సాధించాను. ఇదంతా డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ పెట్టిన భిక్ష. దొర దగ్గర బానిస బతుకు వెళ్లదీస్తున్న కుటుంబం నుంచి వచ్చిన నాకు ప్రజలకు సేవ చేసే అధికారం వచ్చిందంటే అందుకు కారణం రిజర్వేషన్లే. అవి లేకుంటే నేను ఈ స్థాయిలో ఉండే వాడిని కాదు. వసతి గృహాల్లో ఉండి చదువుకోకుంటే ఐపీఎస్ అయ్యేవాడినే కాదు. అందుకే విద్యార్థులందరూ వసతి గృహాల్లో చేరండి. హాస్టల్స్లో చేరిన ప్రతి ఒక్కరూ నాలా కాకుంటే నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తాను’’ అని చెప్పారు. రాబోయే మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు భీమ్ దీక్ష చేపట్టనున్నట్లు ప్రవీణ్కుమార్ వెల్లడించారు. ఇది అయ్యప్ప దీక్షలాగా ఉండదని, ప్రతి ఒక్కరూ ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి మహనీయుల చరిత్రను చదివి పిల్లలకు ప్రబోధిస్తారని, అలాగే నెల రోజుల పాటు మాంసాహారం స్వీకరించరని, దీక్షలో ఉన్న వారందరూ పొగ, మందు సేవించరని స్పష్టం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన మక్కాకు ముస్లింలు ఎలా యాత్రను చేపడతారో అలాగే మనందరం ఉత్తరప్రదేశ్లో మాయావతి నిర్మించిన సామాజిక పరివర్తన స్థలాన్ని సందర్శించాలని కోరారు. మార్చి 15న కాన్షీరామ్ జయంతి, ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 11న జ్యోతి రావు పూలే జయంతి, ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి క్రమంగా రావడంతో ఈ సమయంలో దీక్ష చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, రిటైర్డ్ ఐఆర్టీఎస్ నాయకులు ఎ.భరత్ భూషణ్, మాదిగ సంఘం నాయకులు టి.వి.నారాయణ, బోయిన ఎల్లేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ మన సంస్కృతి కాదు తిండి పెట్టిన వాడే(అంబేడ్కర్) మన దేవుడని, వారినే మనం నిరంతరం స్మరించుకోవాలి, పూజించాలి కానీ బతుకమ్మలను కాదని ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. మనతో బతుకమ్మ ఆడించిన వారు బంగళాల్లో ఉంటారని, మనం మాత్రం బానిసలుగానే ఉంటామని చెప్పారు. బతుకమ్మ మన సంస్కృతి కాదని, దసరా, దీపావళి మన పండగలు కావని, మనమంతా నరకాసురుడి వారసులమని చెప్పారు. నరకాసురుడిని చంపి మనతోనే దసరా, దీపావళి పండగలను చేయిస్తున్నారని దుయ్యబట్టారు. క్రీ.పూ 2500 కాలంలో దళితులందరూ రాజులుగా ఉండేవారని, ఆ వారసత్వాన్ని మళ్లీ పొందాలని, రాజులు కావాలనుకునే వారు బానిసలుగా ఉండకూడదని చెప్పారు. 2050 సంవత్సరానికి మాదిగలకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా యువకులంతా పనిచేయాలని సూచించారు. రాజ్యాధికారం దక్కించుకోవాలంటే ఎవరి ముందూ చేతులు కట్టుకుని నిలబడరాదని, ఒంగి నడవాల్సిన పనిలేదని, ఏ ప్రభుత్వాధికారినైనా కలిసే సమయంలో కాళ్లకు చెప్పులు విడవకుండా ఉండాలని హితువు పలికారు. -
30న గురుకులాల్లో ‘బోధన సిబ్బంది’ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో బోధనా సిబ్బంది ఖాళీలకు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన చేపట్టిన నియామక పరీక్ష ఈ నెల 30 న నిర్వహిస్తున్నట్లు ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తె లిపారు. మాసబ్ట్యాంక్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉదయం 11-1 గంటల మధ్య రాతపరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష హాలుకు రావాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని తెలిపారు. హాల్టికెట్లను www.tgtwgurukulam.telangana.gov.inలో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. -
గిరిజన గురుకులాల్లో ‘గెస్ట్’గోల
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలికల గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఎట్టి పరిస్థితుల్లో పురుషులు ఫ్యాకల్టీగా ఉండవద్దని, ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని గురుకుల కార్యదర్శి ప్రవీణ్కుమార్ ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదమవుతున్నాయి. బాలికల గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి దళారులు ఓవైపు వేలాది రూపాయలు వసూలు చేస్తుండగా, మరోవైపు గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా ఏళ్ల తరబడి పనిచేస్తున్న గిరిజన నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అసలేం జరుగుతోంది? రాష్ట్రంలోని పది జిల్లాల్లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 33 గురుకుల పాఠశాలలు, 29 కళాశాలలు నడుస్తున్నాయి. పీజీతోపాటు, ట్రైనింగ్ పూర్తి చేసిన నిరుద్యోగులు అనేకమంది ఖాళీగా ఉన్నపోస్టుల్లో పనిచేస్తున్నారు. వీరికి వేతనం రూపంలో రూ.5 వేల వరకు వస్తోంది. ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 657 మంది పనిచేస్తుండగా, అందులో 353 మంది పురుషులు, 304 మంది మహిళలు ఉన్నారు. అయితే, గురుకులాల కార్యదర్శిగా డాక్టర్. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ జారీచేసిన జీవోలో స్పష్టత లేకపోవడం వివాదానికి దారితీస్తోంది. బాలికల గురుకులాల్లో మహిళా ఫ్యాకల్టీని నియమించాల్సి వస్తే అక్కడ పనిచేసే పురుష ఫ్యాకల్టీని మరో గురుకులానికి బదిలీ చేయాలని నిబంధన ఉత్తర్వుల్లో చెప్పి ఉంటే పరస్పర బదిలీలు జరిగేవి. కానీ, అలాంటి స్పష్టత లేకపోవడంతో ఇప్పుడు పురుష ఫ్యాకల్టీ రోడ్డున పడాల్సిన దుస్థితి ఎదురవుతోంది. వాస్తవానికి గెస్ట్ ఫ్యాకల్టీని ఎప్పుడైనా తీసేసే అధికారం సంస్థకు ఉంది. అయితే, ఏళ్ల తరబడి తాము గురుకులాల్లో పనిచేస్తుండడంతో ఎప్పటికయినా ఉద్యోగ భద్రత కలగకపోతుందా అనే ఆశతో గిరిజన నిరుద్యోగ యువత ఉంది. మహిళా ఫ్యాకల్టీని బాలికల గురుకులాల్లో నియమించడానికి తాము వ్యతిరేకం కాదని పురుష ఫ్యాకల్టీ అంటున్నారు. కానీ, ఒక బాలికల గురుకులంలో పురుష ఫ్యాకల్టీ స్థానంలో మహిళను తీసుకుంటే ఆమె పనిచేస్తున్న స్థానానికి తమను పంపాలని వారు కోరుతున్నారు. దీనికి తోడు, ఈ విధంగా కొత్త వారిని తీసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో దళారులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. గురుకులాల్లో అధ్యాపక పోస్టులు ఇప్పిస్తామని చెప్పి రూ.50 వేల వరకు తీసుకుని పోస్టింగ్లు ఇప్పిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. -
గురుకులాలకు సంక్రాంతి సెలవుల పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంక్రాంతి సెలవులను మూడు నుంచి ఆరు రోజులకు పెంచారు. మూడు రోజులే సెలవులు ఇవ్వడంతో పాఠశాలల జేఏసీ నేతలు గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తో చర్చలు జరిపారు. ఈ నెల 13 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ప్రకటించిన సెలవులు 5-9తరగతుల విద్యార్థులకు వ ర్తిస్తాయి. దీనితో పాటు హిస్టరెక్టమీ ఆపరేషన్ చేయించుకునే ఈ పాఠశాలల మహిళా సిబ్బందికి జీవో 52 ప్రకారం 45 రోజుల సెలవు వర్తించేలా కార్యదర్శి ప్రవీణ్ ఉత్తర్వులు జారీచేశారు. జేఏసీ నాయకులు ఎ.వెంకటరెడ్డి, సీహెచ్ బాలరాజు, కె.అర్జున్, రవీంద్ర రెడ్డి, యాదయ్య, పరంధాములు కార్యదర్శిని కలిశారు. -
విద్యతోనే వికాసం
సమాజంలో దశాబ్దాల తరబడి అణచివేతకు గురైనవారి జీవితాలలో విద్యతోనే సమూల మార్పు వస్తుందని తెలంగాణ గురుకులాల సంఘం కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఆదివారం ఆయన భీమ్గల్లోనూ, ఆర్మూరు మండలం సుర్బిర్యాలలోనూ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాలను ప్రారంభించారు. వీటిని గురుకుల పాఠశాలల పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేశారు. ఆర్మూర్ టౌన్ : సమాజంలో శతాబ్దాల తరబడి అణచివేతకు గురైనవారి జీవితాల్లో విద్యతోనే మార్పు సాధ్యమని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విభాగం కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు లక్ష్యం ఇదేనన్నారు. ఆదివారం సుర్బిర్యాల్లో స్వేరోస్( ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బాణాలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల పూర్వ విద్యార్థులు) సంస్థ ఆధ్వర్యంలో, గ్రామవాసి డాక్టర్ రాజేశ్వర్ సౌజన్యంతో అంబేద్కర్ విజ్ఞాన కేం ద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రవీణ్కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను గౌరవించని దేశాలు బాగుపడవన్నారు. ఇది చరిత్ర చెప్పిన సత్యమని పేర్కొన్నారు. స్త్రీలను గౌరవించాలని సూచించారు. సాహసంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదన్నారు. ఇందుకు గురుకుల విద్యార్థులు మాలవత్ పూర్ణ, ఆనంద్ సాక్ష్యమన్నారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే.. టీవీలు చూస్తూ, సినిమాల గురించి చర్చించుకుంటూ ఉండడం వల్ల ప్రయోజనం ఉండదు. లక్ష్యాలను నిర్దేశించుకుని, దానిని చేరేందుకు అవిశ్రాంతంగా కృషి చేయాలి. తల్లిదండ్రులు పిల్లల మనోభావాలను గౌరవించాలని, వారి ఆలోచనా విధానాలను గుర్తించి సక్రమ మార్గంలో నడిపించాలి. పిల్లలకు మహనీయుల జీవితాలను వివరించాలి. తద్వారా వారిలో తాము ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆకాంక్ష బలోపేతమవుతుంది. పిల్లలను నిరుత్సాహ పరచవద్దు. వారిపై అది తీవ్ర ప్రభావం చూపుతుంది. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుంచే సుగుణాలను అలవర్చాలి. పిల్లలపై ప్రేమతో ఇంటివద్దనే చదివించాలని చూడవద్దు. అవసరమైతే వారిని దూర ప్రాంతానికి పంపి చదివించడానికీ వెనుదీయవద్దు. కార్యక్రమంలో ప్రవీణ్కుమార్ను డాక్టర్ రాజేశ్వర్ సన్మానించారు. ఈ సందర్భంగా పోచంపాడ్, కంజర గురుకుల పాఠశాలల విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో సర్పంచ్ భారతి మోహన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు సత్తెమ్మ లింగారెడ్డి, నందిపేట తహశీల్దార్ బావయ్య, పీఆర్ ఏఈ రాజేశ్వర్, స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్, జిల్లా అధ్యక్షుడు రాజన్న, వైద్యులు బాబూరావు, ప్రవీణ్, ఐఆర్ఎస్ సాధించిన మదన్ తదితరులు పాల్గొన్నారు. పుస్తకమే ప్రపంచం కావాలి భీమ్గల్ : విద్యార్థికి పుస్తకమే ప్రపంచం కావాలని, చదువే సర్వస్వమవ్వాలని రాష్ర్ట సాంఘిక సంక్షేమ గురకుల పాఠశాలల సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సూచించారు. ఆదివారం ఆయన భీమ్గల్లోని ముచ్కూర్ రోడ్లో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. మంచి పుస్తకాలు జీవితాన్నే మార్చేస్తాయన్నారు. మహాత్ముల జీవిత చరిత్రల ద్వారా జీవన శైలిని మార్చుకోవచ్చని, వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకోవచ్చని పేర్కొన్నారు. చిన్నప్పటినుంచే చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. చక్కగా చదివితే ఉద్యోగాలు వాటంతటవే వస్తాయన్నారు. ఈ విజ్ఞాన కేంద్రాన్ని మరింత విస్తరించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుగులోత్ రవినాయక్, డిచ్పల్లి ఎంఈఓ సాయిలు, ప్రొఫెసర్ సుధాకర్, డాక్టర్లు అశోక్, ప్రేమానందం, రాజన్న తదితరలు పాల్గొన్నారు.