suhas
-
లవ్ అప్డేట్స్ గురూ
ప్రేమికుల రోజు(Valentine Day) సందర్భంగా ప్రేమ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమాల నుంచి ‘లవ్ అప్డేట్స్ గురూ’ అంటూ శుక్రవారం కొందరు తమ సినిమాల నుంచి పాటలు, లుక్స్ రిలీజ్ చేయగా, మరికొందరు సినిమా విడుదల తేదీలను ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళదాం...⇒ నితిన్, శ్రీలీల జోడీగా నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘వేర్ఎవర్ యు గో’.. అంటూ సాగే రెండో పాటని హీరో మహేశ్బాబు లాంచ్ చేశారు. ఈ పాటని కృష్ణకాంత్ రాయగా, అర్మాన్ మాలిక్ పాడారు. ⇒ సిద్ధు జొన్నలగడ్డ రోగా నీరజా కోన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి సరికొత్త పోస్టర్ విడుదలైంది. ⇒ కిరణ్ అబ్బవరం హీరోగా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘దిల్ రూబా’. విశ్వ కరుణ్ దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కావాల్సింది. అయితే తాజాగా మార్చి 14న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి, కిరణ్ అబ్బవరం పోస్టర్ని రిలీజ్ చేశారు. ⇒ సుహాస్, మాళవికా మనోజ్ జంటగా రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. హరీష్ నల్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాపై విడుదల చేయనున్నారు. ఈ మూవీ నుంచి సుహాస్, మాళవికా మనోజ్ల సరికొత్త పోస్టర్ను విడుదల చేశారు.⇒ హర్ష రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కోర్ట్–స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. రామ్ జగదీష్ దర్శకత్వంలో హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 14న విడుదల కానుంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘ప్రేమలో..’ అంటూ సాగే తొలి పాటని రిలీజ్ చేశారు. పూర్ణాచారి సాహిత్యం అందించిన ఈ పాటని అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడారు. ⇒ మోహిత్ పెద్దాడ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘నా లవ్ స్టోరీ’. వినయ్ గోను దర్శకత్వంలో దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ని దర్శకుడు అజయ్ భూపతి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘పోస్టర్ యునిక్గా ఉంది. స్టూడెంట్స్ హాస్టల్ బ్యాక్డ్రాప్లో జరిగే ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు’’ అన్నారు. -
'ఓ భామ అయ్యో రామా' అంటోన్న సుహాస్ .. గ్లింప్స్ వచ్చేసింది!
ఇటీవల జనక అయితే గనక అనే సినిమాతో అభిమానులను అలరించిన హీరో సుహాస్. సరికొత్త కథలతో ఆడియన్స్ను అలరిస్తోన్న సుహాస్ మరో కథతో రెడీ అయిపోయారు. 'ఓ భామ అయ్యోరామా' అంటూ వచ్చేస్తున్నాడు. ఈ చిత్రంలో మాళవిక మనోజ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ను విడుదల చేశారు. 'దేవుడినైనా రాముడినైనా నడిపించేది ఆడదే' అనే డైలాగ్ ఈ మూవీపై ఆసక్తి పెంచుతోంది. ఈ సినిమాను వీ ఆర్ట్స్ బ్యానర్పై హరీశ్ నల్లా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రాధన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో అనిత హాసానందని, అలీ, రవీందర్ విజయ్, బబ్లూ పృథివీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, మోయిన్, సాథ్విక్ ఆనంద్, నాయని పావని కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
మరో ఓటీటీలోకి వచ్చేసిన 'గొర్రె పురాణం'
టాలీవుడ్ అప్కమింగ్ హీరోల్లో సుహాస్ ఒకడు. కమెడియన్గా కెరీర్ మొదలుపెట్టాడు కానీ 'కలర్ ఫోటో' మూవీ హిట్ అయ్యేసరికి దశ తిరిగింది. ప్రస్తుతం ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాడు. ఇతడు నటించిన రెండు సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)సుహాస్ 'జనక అయితే గనక' సినిమా ఆహా ఓటీటీలోకి వచ్చింది. పిల్లలు వద్దనుకునే ఓ మధ్య తరగతి యువకుడు.. తన భార్య నెల తప్పిందనే కారణంతో కండోమ్ కంపెనీపై కేసు పెడతాడు. బోల్డ్ కాన్సెప్ట్ అయినప్పటికీ ఎక్కడా గీత దాటలేదు.మరోవైపు సెప్టెంబరులో సుహాస్ 'గొర్రె పురాణం' చిత్రం థియేటర్లలో రిలీజైంది. అక్టోబర్ 10న ఆహా ఓటీటీలో వచ్చింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో కూడా వచ్చేసింది. ఎలాంటి హడావుడి లేకుండా తీసుకొచ్చేశారు. ఓ గొర్రె వల్ల రెండు వర్గాలు ఎలా కొట్టుకున్నాయి? అనే కాన్సెప్ట్తో తీశారు. ఇంట్రెస్ట్ ఉంటే లుక్కేసేయండి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన దేవర, వేట్టయన్, జనక అయితే గనక.. ఏది ఎందులో?) -
అమెరికా ఎన్నికలు.. సుహాస్ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల ఫలితాల్లో భారతీయ అమెరికన్లు సత్తా చాటుతున్నారు. భారత సంతతికి చెందిన సుహాస్ సుబ్రమణ్యం ప్రతినిధుల సభకు గెలుపొందారు. వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరఫున గెలుపొందారు. వర్టీజినియా నుంచి ప్రతినిధుల సభకు గెలిచిన తొలి ఇండియన్ అమెరికన్గా సుహాస్ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు సృష్టించారు.గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో సాంకేతిక విధాన సలహాదారుగా సుబ్రహ్మణ్యం పనిచేశారు. 2020లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ ఎన్నికల్లో వర్జీనియా సెనేట్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వర్జీనియా నుంచే గెలుపొంది ప్రతినిధుల సభకు వెళుతున్నారు. ఇదీ చదవండి: ఇల్లినోయిస్ నుంచి రాజాకృష్ణమూర్తి గెలుపు -
ఓటీటీలోకి క్రేజీ సినిమా.. కండోమ్ కంపెనీపై కేసు పెడితే?
మరో తెలుగు సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. మిడిల్ క్లాస్ కథల్లో ఎక్కువగా కనిపించిన సుహాస్ లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. దసరాకి థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ఓటీటీ ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఎప్పుడు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?సుహాస్ 'జనక అయితే గనక' సినిమా కాన్సెప్ట్ బాగుంది. కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. కానీ థియేటర్లలో సరిగా ఆడలేదు. మూవీ సాగదీసినట్లు అనిపించిందనే టాక్ రావడంతో తేడా కొట్టేసింది. థియేటర్లలో సరిగా ఆడలేదు కానీ ఇప్పుడు ఆహా ఓటీటీలోకి వచ్చేస్తుంది. నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: నా ఉద్దేశం అదికాదు.. 'బిగ్బాస్ 8' వివాదంపై మెహబూబ్ వీడియో)'జనక అయితే గనక' విషయానికొస్తే.. తండ్రి అయితే ఖర్చులు పెరుగుతాయనే భయపడే ఓ కుర్రాడు, భార్య నెల తప్పిందని చెప్పడంతో షాకవుతాడు. తాను కండోమ్ ఉపయోగించినప్పటికీ తండ్రి కావడం ఇతడిని ఆలోచనలో పడేస్తుంది. దీంతో సదరు కండోమ్ కంపెనీపై కేసు పెడతాడు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.చెప్పుకోవడానికి కాస్త వల్గర్ అనిపిస్తుంది కానీ ఏ మాత్రం గీత దాటకుండా సున్నితమైన హాస్యంతో సినిమా తీశారు. కాసేపు అలా సరదాగా నవ్వుకునే సినిమా చూద్దానుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
‘జనక అయితే గనక’మూవీ రివ్యూ
టైటిల్: జనక అయితే గనకనటీనటులు: సుహాస్, సంగీర్తన, రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ, వెన్నెక కిశోర్, మురళీ శర్మ తదితరులునిర్మాణ సంస్థ: దిల్ రాజు ప్రొడక్షన్స్నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, హన్షిత్ రెడ్డిదర్శకత్వం: సందీప్రెడ్డి బండ్లసంగీతం: విజయ్ బుల్గానిక్సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్విడుదల తేది: అక్టోబర్ 12, 2024ఈ మధ్యే ‘గొర్రె పురాణం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుహాస్.. ఇప్పుడు ‘జనక అయితే గనక’ అనే సినిమాతో మరోసారి థియేటర్స్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు(అక్టోబర్ 12) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? సుహాస్ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ప్రసాద్ (సుహాస్) కి పిల్లలు కనడం అస్సలు ఇష్టం లేదు. ఈ రోజుల్లో పిల్లలను పోషించాలంటే లక్షల్లో డబ్బులు అవసరమని, అంత డబ్బు తన వద్ద లేదని పిల్లలే వద్దనుకుంటాడు. భార్య(సంగీత విపిన్) కూడా అతని మనసును అర్థం చేసుకుంటుంది. కుటుంబ నియంత్ర కోసం కండోమ్ వాడుతారు. అయినప్పటికీ ప్రసాద్ భార్య గర్భం దాల్చుతుంది. దీంతో కండోమ్ సరిగ్గా పని చేయలేదని వినియోగదారుల కోర్టును ఆశ్రయిస్తాడు ప్రసాద్. తాను వాడిన కండోమ్ సరిగా పనిచేయలేకపోవడంతో తన భార్య గర్భం దాల్చిందని, నష్టపరిహారంగా రూపాయలు కోటి ఇవ్వాలని ఆ కంపెనీపై కేసు వేస్తాడు. ఈ కేసు ప్రసాద్ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? అసలు ప్రసాద్ భార్య గర్భం ఎలా దాల్చింది? చివరకు ఈ కేసులో ప్రసాద్ గెలిచాడా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..మానవ జీవితంలో వస్తు వినియోగం తప్పని సరి. ఏదైనా ఒక వస్తువు కొని ఆ వస్తువు నకిలీ లేదా నాసిరకం అయితే అమ్మిన వ్యాపారిపై లేదా ఉత్పత్తిదారులపై కేసు వేయొచ్చనే విషయం చాలా మందికి తెలియదు. వినియోగదారుల చట్టం పై జనాలకు అవగాహన లేదు. ఈ పాయింట్ తో తెరకెక్కిన చిత్రమే జనగా అయితే గనక. ప్రస్తుతం సమాజం ఫేస్ చేస్తున్న ఓ సీరియస్ ఇష్యూ ని కామెడీ వేలో చూపిస్తూ చివరకు ఓ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దర్శకుడు రాసుకున్న కథ బాగుంది. కండోమ్ మీద కేసు పెట్టడమనే పాయింట్ ఆసక్తికరంగా ఉంది. కానీ అంతే ఆసక్తికరంగా కథనాన్ని నడిపించలేకపోయాడు.వినోదాత్మకంగా చూపించాలనే ఉద్దేశంతో చాలా చోట్ల లాజిక్ లెస్ సన్నివేశాలను జోడించాడు. ముఖ్యంగా కీలకమైన కోర్టు సన్నివేశాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి . వెన్నెల కిషోర్ చేసే కామెడీ కూడా రొటీన్ గానే అనిపిస్తుంది. కోర్టు డ్రామా మొదలవగానే సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు.ఇంటర్వెల్ ముందు వరకు అసలు కథను ప్రారంభించకుండా కథనాన్ని నడిపించాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలను చూపించేందుకు ప్రసాద్ పాత్ర చుట్టు అల్లిన సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేవు. ఈ రోజుల్లో పిల్లలను కనాలంటే ఎంత ఖర్చు అవుతుందో ప్రాక్టికల్గా చూపించే సీన్ నవ్వులు పూయించడంతో పాటు ఆలోచింపచేస్తుంది. ఫస్టాఫ్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలను చూపించి, సెకండ్ హాఫ్ లో వారి ఎమోషన్స్ తో కొందరు చేస్తున్న మోసపూరిత వ్యాపారాల చూపించారు. వైద్యం పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు చేస్తున్న దందా, నాణ్యమైన విద్య పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న మోసాన్ని వినోదాత్మకంగా చూపించారు. అయితే ముందుగా చెప్పినట్లుగా కోర్డు డ్రామాలో బలం లేదు. కొన్ని చోట్ల ప్రసాద్ పాత్ర చేసే ఆర్గ్యుమెంట్స్కి అర్థం ఉండదు. ఇక చివర్లో వచ్చే చిన్న ట్విస్ట్ అయితే అదిరిపోతుంది.ఎవరెలా చేశారంటే..సుహాస్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తాడు . మిడిల్ క్లాస్ యువకుడు ప్రకాష్ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కోటి సీన్లలో అతను చెప్పే డైలాగులు ఆలోచింపజేస్తాయి. హీరోయిన్ పాత్రనిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. సినిమా కథంతా చుట్టే తిరుగుతుంది. లాయర్ కిషోర్ గా వెన్నెల కిషోర్ తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. జడ్జి ధర్మారావుగా రాజేంద్రప్రసాద్ కొన్నిచోట్ల నవ్విస్తాడు. లాయర్ గా మురళి శర్మ, హీరో తండ్రిగా గోపరాజు, బామ్మ పాత్రను పోషించిన నటితోపాటు మిగిలిన వారంతా తమ పాత్రల పరిధి మీద చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పరవాలేదు. సంగీతం బావుంది. పాటలు కథలో భాగంగానే వస్తాయి. అయితే ఒక పాట మినహా మిగిలినవేవి గుర్తుండవు. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
సరికొత్త కాన్సెప్ట్తో జనక అయితే గనక.. ఆసక్తిగా ట్రైలర్
టాలీవుడ్ హీరో సుహాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాదిలో మరో మూవీతో అలరించేందుకు వస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్లతో సినీ ప్రియులను ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాడు. తాజాగా సుహాస్ నటించిన చిత్రం జనక అయితే గనక. ఈ సినిమాను సందీప్ రెడ్డి బండ్ల డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సంకీర్తన హీరోయిన్గా నటించగా.. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ విజయదశమి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం పిల్లలు పుడితే లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందో అన్న కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారుపిల్లలంటే భయపడే ఓ వ్యక్తి జీవితంగా ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించారు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా గురించి దిల్ రాజు మాట్లాడారు. సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని ఆయన తెలిపారు. ఈనెల 12న జనక అయితే గనక థియేటర్లలో అలరించనుంది. -
రిలీజైన మూడు వారాల్లోనే ఓటీటీలో 'గొర్రె పురాణం'
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదల అయింది. అయితే, విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. టాలీవుడ్లో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే నటుడిగా సుహాస్కు గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ఆయన నటించిన కొత్త సినిమా 'గొర్రె పురాణం' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ వచ్చినప్పటికీ అనుకున్నంతగా కలెక్షన్లు సాధించలేదు.'గొర్రె పురాణం' చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ఆహా అధికారికంగా సోషల్మీడియా ద్వారా వెళ్లడించింది. అక్టోబర్ 10 నుంచి తమ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ఆహా ఒక పోస్టర్ను రిలీజ్ చేసింది. టాలీవుడ్లో వరుస సినిమాలతో సుహాస్ బిజీగా ఉన్నారు. సుహాస్ కొత్త సినిమా 'జనక అయితే గనక' దసర సందర్భంగా అక్టోబర్ 12న థియేటర్లో విడుదల కానుంది.కథేంటంటే..టైటిల్ తగ్గట్టే ఈ సినిమా కథంతా ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది. రఫిక్ అనే ఓ ముస్లీం వ్యక్తి బక్రీద్ పండగ కోసం ఓ గొర్రెను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తాడు. పండగ రోజు దాన్ని బలి ఇచ్చేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పారిపోతుంది. రఫిక్ గ్యాంగ్ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పరుగెత్తి హిందువుల టెంపుల్లోకి వెళ్తుంది. ఆ పోచమ్మ తల్లే ఈ గొర్రెను మన దగ్గరకు పంపించింది అని చెప్పి.. నరహింహా(రఘు కారుమంచి) దాన్ని ఆ టెంపుల్లోనే బలి ఇవ్వాలని చెబుతాడు. చివరకు ఈ గొర్రె మాదంటే.. మాది అంటూ రెండు మతాల ప్రజలు గొడవకు దిగుతారు.ఆ వీడియో కాస్త వైరల్ అయి..రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతుంది. పోలీసులు ఆ గొర్రెను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తారు. కోర్టు జడ్జి(పొసాని కృష్ణ మురళి) ఎలాంటి తీర్పు ఇచ్చాడు. ఒక గొర్రె రెండు మతాల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ గొర్రె న్యూస్ ఇంత వైరల్ కావాడానికి గల కారణం ఏంటి? దీని వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్ర ఏంటి? జైలు ఖైది రవి(సుహాస్)కి ఈ గొర్రె కథకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు రవి జైలుపాలు ఎలా అయ్యాడు? అతనికి జరిగిన అన్యాయం ఏంటి? గొర్రె అతనికి ఎలాంటి సహాయం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
హీరో సుహాస్ 'జనక అయితే గనక' మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
ఓటీటీలోకి రానున్న 'గొర్రె పురాణం'.. అధికారిక ప్రకటన
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదల అయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. టాలీవుడ్లో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే నటుడిగా సుహాస్కు గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ఆయన నటించిన కొత్త సినిమా 'గొర్రె పురాణం' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ వచ్చినప్పటికీ అనుకున్నంతగా కలెక్షన్లు సాధించలేదు.'గొర్రె పురాణం' సినిమాలో ఒక జంతువునే ప్రధాన పాత్రధారిగా పెట్టుకుని అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు దర్శకులు. తాను భిన్నమైన కథలను ఎంచుకుంటానని మరోసారి సుహాస్ ఈ చిత్రంతో నిరూపించాడు. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది. అయితే, ఎప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొస్తారనేది మాత్రం వెళ్లడించలేదు. అక్టోబర్ 6న ఓటీటీలోకి రావచ్చని టాక్ నడుస్తోంది. లేదంటే, అక్టోబర్ 11న తప్పకుండా ఓటీటీలో రిలీజ్ అవుతుందని సమాచారం.కథేంటంటే..టైటిల్ తగ్గట్టే ఈ సినిమా కథంతా ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది. రఫిక్ అనే ఓ ముస్లీం వ్యక్తి బక్రీద్ పండగ కోసం ఓ గొర్రెను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తాడు. పండగ రోజు దాన్ని బలి ఇచ్చేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పారిపోతుంది. రఫిక్ గ్యాంగ్ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పరుగెత్తి హిందువుల టెంపుల్లోకి వెళ్తుంది. ఆ పోచమ్మ తల్లే ఈ గొర్రెను మన దగ్గరకు పంపించింది అని చెప్పి.. నరహింహా(రఘు కారుమంచి) దాన్ని ఆ టెంపుల్లోనే బలి ఇవ్వాలని చెబుతాడు. చివరకు ఈ గొర్రె మాదంటే.. మాది అంటూ రెండు మతాల ప్రజలు గొడవకు దిగుతారు.ఆ వీడియో కాస్త వైరల్ అయి..రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతుంది. పోలీసులు ఆ గొర్రెను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తారు. కోర్టు జడ్జి(పొసాని కృష్ణ మురళి) ఎలాంటి తీర్పు ఇచ్చాడు. ఒక గొర్రె రెండు మతాల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ గొర్రె న్యూస్ ఇంత వైరల్ కావాడానికి గల కారణం ఏంటి? దీని వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్ర ఏంటి? జైలు ఖైది రవి(సుహాస్)కి ఈ గొర్రె కథకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు రవి జైలుపాలు ఎలా అయ్యాడు? అతనికి జరిగిన అన్యాయం ఏంటి? గొర్రె అతనికి ఎలాంటి సహాయం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
గొర్రెతో సినిమా.. మంచి ప్రయత్నమే!
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. వాస్తవానికి ఇందులో హీరో గొర్రె అనే చెప్పాలి. సినిమా మొత్తంలో సుహాస్ ఓ 20 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. మిగతా భాగం అంతా గొర్రె చుట్టే తిరుగుతుంది. ఈ కథ బాగున్నప్పటికీ హీరో సుహాస్ ప్రమోషన్స్కి రాకపోవడం.. పబ్లిసిటీ అంతగా లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. కానీ దర్శకుడు బాబీ మాత్రం ఓ బోల్డ్ అటెంప్ట్ చేశాడు. (చదవండి: గొర్రె పురాణం మూవీ రివ్యూ)గొర్రెతో సినిమా చేయడం అంత చిన్న విషయం కాదు, గొర్రెను ఒక పాత్రగా తెరపై చూపించడం అంటే ఎంత కష్టపడాలో అది మేకర్స్ కు మాత్రమే తెలుసు. అలాంటిది ఎక్కడా వీఎఫ్ఎక్స్ వాడకుండా నిజమైన గొర్రెతో సినిమా తీసిన దర్శకుడి ప్రతిభ మెచ్చుకోదగినది, ఈ విషయంలో దర్శకుడు బాబీ విజయం సాధించాడు అని చెప్పాలి. అందుకే బాబీకి మంచి ప్రశంసలు అందుతున్నాయి.సినిమాను చాలా తక్కువ బడ్జెట్తో తెరకెక్కించాడు. ఈ బడ్జెట్లో ఇంత మంచి సెటైరికల్ సినిమా తీయడంలో డైరెక్టర్ బాబి సక్సెస్ అయ్యాడు. అయితే సినిమాలో మంచి కంటెంట్ ఉంది కానీ, ల్యాగ్ ఎక్కువైందనే విమర్శలు మాత్రం వస్తున్నాయి. -
Gorre Puranam Review: ‘గొర్రె పురాణం’ మూవీ రివ్యూ
టైటిల్: గొర్రె పురాణంనటీనటులు: సుహాస్, పోసాని కృష్ణ మురళి, రఘు తదితరులునిర్మాత: ప్రవీణ్ రెడ్డిదర్శకత్వం: బాబీసంగీతం: పవన్ సీహెచ్సినిమాటోగ్రఫీ: సురేశ్ సారంగంవిడుదల తేది: సెప్టెంబర్ 21, 2024యంగ్ హీరో సుహాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనం లాంటి సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు అదే జోష్లో ‘గొర్రెపురాణం’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..టైటిల్ తగ్గట్టే ఈ సినిమా కథంతా ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది. రఫిక్ అనే ఓ ముస్లీం వ్యక్తి బక్రీద్ పండగ కోసం ఓ గొర్రెను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తాడు. పండగ రోజు దాన్ని బలి ఇచ్చేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పారిపోతుంది. రఫిక్ గ్యాంగ్ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పరుగెత్తి హిందువుల టెంపుల్లోకి వెళ్తుంది. ఆ పోచమ్మ తల్లే ఈ గొర్రెను మన దగ్గరకు పంపించింది అని చెప్పి.. నరహింహా(రఘు కారుమంచి) దాన్ని ఆ టెంపుల్లోనే బలి ఇవ్వాలని చెబుతాడు. చివరకు ఈ గొర్రె మాదంటే.. మాది అంటూ రెండు మతాల ప్రజలు గొడవకు దిగుతారు. ఆ వీడియో కాస్త వైరల్ అయి..రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతుంది. పోలీసులు ఆ గొర్రెను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తారు. కోర్టు జడ్జి(పొసాని కృష్ణ మురళి) ఎలాంటి తీర్పు ఇచ్చాడు. ఒక గొర్రె రెండు మతాల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ గొర్రె న్యూస్ ఇంత వైరల్ కావాడానికి గల కారణం ఏంటి? దీని వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్ర ఏంటి? జైలు ఖైది రవి(సుహాస్)కి ఈ గొర్రె కథకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు రవి జైలుపాలు ఎలా అయ్యాడు? అతనికి జరిగిన అన్యాయం ఏంటి? గొర్రె అతనికి ఎలాంటి సహాయం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఒక జంతువునే ప్రధాన పాత్రధారిగా పెట్టుకొని హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. ఇక తెలుగులో అయితే రాజమౌళి చిన్న ఈగతో సినిమా తీసి హిట్ కొట్టాడు. ఈ సినిమాలో కూడా ఒక జంతువునే హీరో. కథంతా గొర్రె చుట్టే నడిపిస్తూ... ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న చాలా అంశాలను ప్రస్తావించారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ప్రజలను ఎలా తప్పుదారి పట్టిస్తారు? తమపై వచ్చే వ్యతిరేకతను తగ్గించుకోవడానికి మీడియాను ఎలా వాడుకుంటారు? అనేది సెటైరికల్గా తెరపై చూపించారు. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. అయితే దాన్ని తెరపై చూపించే విషయంలో కాస్త తడబడ్డాడు. స్క్రీన్ప్లేని బలంగా రాసుకోలేకపోయాడు. బహుశా బడ్జెట్ ప్రాబ్లమ్ కావొచ్చ కొన్ని ముఖ్యమైన సీన్లను కూడా సాదా సీదాగా తీసేశారు. ఓ మర్డర్ సీన్తో కథను ప్రారంభించి మొదట్లోనే ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించాడు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్తో గొర్రె ఎంట్రీ ఆకట్టుకుంటుంది. అది రెండు మతాల మధ్య చిచ్చు పెట్టినప్పటి నుంచి కథపై ఆసక్తి కలుగుతుంది. గొర్రె చుట్టూ సాగే సరదా సన్నివేశాలతో బోర్ కొట్టకుండా ఫస్టాఫ్ సాగుతుంది. ఒక్క సీన్ మీనహా ఇంటర్వెల్ వరకు సుహాస్ తెరపై కనిపించదు. ఇక ద్వితియార్థంలో ఎక్కువ భాగం జైలు, కోర్టు సీన్లతోనే సాగుతుంది. రవి ప్లాష్ బ్యాక్ స్టోరీ భావోద్వేగానికి గురి చేస్తుంది. గొర్రెను జైలు నుంచి తప్పించేందుకు హీరో చేసే ప్రయత్నాలు సిల్లీగా అనిపిస్తాయి. కోర్టు సీన్లో సుహాస్ చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. లాజిక్స్ వెతక్కుకుండా చూస్తే..‘గొర్రె పురాణం’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో హీరో గొర్రె అనే చెప్పాలి. ఒక గొర్రెకు తరుణ్ భాస్కర్, మరొక గొర్రెకు గెటప్ శ్రీను వాయిస్ ఓవర్ ఇచ్చారు. రెండు గొర్రెల మధ్య వచ్చే సీన్లకు వీరిద్దరు ఇచ్చే వాయిస్ ఓవర్ నవ్వులు పూయిస్తాయి. ఇక ఈ చిత్రంలోసుహాస్ది కీలక పాత్ర. నిడివి తక్కువే అయినా ఎప్పటి మాదిరిగానే తన పాత్రలో లీనమై నటించాడు సుహాస్. ఖైదీ రవి పాత్రకు న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్లలో చక్కగా నటించాడు. ఇక హిందూ వాదిగా రఘు, జడ్జీగా పొసాని తమదైన కామెడీ పంచులతో నవ్వించే ప్రయత్నం చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. పవన్ సీహెచ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగా వస్తాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెర ఇంకాస్త పని చెప్పాల్సింది. నిడివి తక్కువ ఉన్నప్పటికీ కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. -
గొర్రె మీద కేసా?
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు.‘గొర్రె మీద కేసా? ఎవడా కేసుపెట్టిన గొర్రె? మనం బతకడం కోసం వాటిని చంపేయొచ్చు... మనది ఆకలి... మరి అవి బతకడం కోసం మనల్ని చంపేస్తే అది ఆత్మరక్షణే కదా సార్...’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. -
ఆసక్తికరంగా సుహాస్ ‘గొర్రె పురాణం’ ట్రైలర్
టాలీవుడ్లో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడిగా సుహాస్కు గుర్తింపు ఉంది . ఈ క్రమంలో ఆయన నటించిన కొత్త సినిమా 'గొర్రె పురాణం' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. తాజాగా చిత్ర ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇటీవలే అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్, శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం వంటి సినిమాలతో ప్రేక్షకులకు సుహాస్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు 'గొర్రె పురాణం' చిత్రంతో సెప్టెంబర్ 20న థియేటర్లోకి రానున్నారు. ఒక గ్రామంలో రెండు మతాల మధ్య ఒక గొర్రె ఎలా చిచ్చు పెట్టిందో ట్రైలర్తో హింట్ ఇచ్చారు. కోర్టు, కేసులు, గొడవలు ఇలా అన్నీ ఒక గొర్రె చుట్టూ సాగే ఎమోషనల్ డ్రామాగా సినిమా తెరకెక్కించారు. -
స్వర్ణం గెలవలేకపోయా: ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్
వరుసగా రెండు పారాలింపిక్స్లో రజత పతకాలు సాధించిన భారత పారా షట్లర్ సుహాస్ యతిరాజ్... విశ్వక్రీడల్లో స్వర్ణం గెలవలేకపోవడం నిరాశగా ఉందని అన్నారు. పారిస్ పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 ఫైనల్లో పరాజయం పాలై రజతం దక్కించుకున్న 41 ఏళ్ల ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్... మూడేళ్ల క్రితం టోక్యోలోనూ రెండో స్థానంలోనే నిలిచారు.‘పసిడి పతకం సాధించాలని ఎంతో శ్రమించా. ప్రపంచ నంబర్వన్ ర్యాంక్తో విశ్వ క్రీడలకు రావడంతో అంచనాల భారం కూడా పెరిగింది. రజతం దక్కడం కూడా ఆనందంగానే ఉన్నా... ఏదో వెలితి అనిపిస్తోంది. బంగారు పతకం చేజారిందనే బాధ ఒకవైపు... పారాలింపిక్స్ వంటి అత్యుత్తమ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ పతకం నెగ్గాననే భావన మరో వైపు ఉంది. గత కొంతకాలంగా దేశంలో క్రీడా సంస్కృతి పెరిగింది. గతంలో క్రికెట్కే ఎక్కువ క్రేజ్ ఉండేది. ఇప్పుడు అన్ని క్రీడలకు ఆదరణ దక్కుతోంది. పారా అథ్లెట్లకు కూడా మంచి తోడ్పాటు లభిస్తోంది. రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో మనవాళ్లు మరిన్ని పతకాలు సాధించగలరు’ అని సుహాస్ అన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాకు చెందిన సుహాస్ 2007 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం సుహాస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ప్రాంతీయ రక్షక్ దళ్, యూత్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సెక్రటరీ డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వహిస్తున్నారు. -
వర్షాల ఎఫెక్ట్.. వాయిదా పడిన సుహాస్ సినిమా
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. అవసరముంటే తప్పితే జనాలు పెద్దగా బయటకు రావట్లేదు. ఈ వర్షం వల్ల గతవారం థియేటర్లలో రిలీజైన 'సరిపోదా శనివారం' సినిమాకు పెద్ద దెబ్బ పడింది. బాగుందనే టాక్ వచ్చినప్పటికీ వర్షం వల్ల కలెక్షన్స్ పడిపోయాయి. 5 రోజుల్లో రూ.65 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది.(ఇదీ చదవండి: ప్రభాస్ భారీ విరాళం.. మీరు విన్నది నిజం కాదు!)ఇలా వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలతో పాటు తెలుగు స్టార్ హీరోలు చాలామంది లక్షల రూపాయల్ని విరాళంగా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే సుహాస్ హీరోగా దిల్ రాజు నిర్మాణ సంస్థ తీసిన 'జనక అయితే గనక' సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.లెక్క ప్రకారం సెప్టెంబరు 7న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాలి. ముందు రోజు ప్రీమియర్లు కూడా ప్లాన్ చేశారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఇంతలోనే మరోసారి తెలుగు రాష్ట్రాలకు వర్షం పోటెత్తనుందనే హెచ్చరిక వచ్చింది. 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడబోతున్నాయని అంటున్నారు. దీనిబట్టి చూస్తే వాయిదా వేసి మంచి పనే చేశారనిపిస్తోంది.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్!) -
దిల్ రాజు వాట్సాప్ చాట్ బయటపెట్టిన సుహాస్!
చిన్న సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం చాలా కష్టం. ఎంత ప్రచారం చేసినా..కొన్ని చిన్న చిత్రాలు రిలీజ్ అయిన విషయం కూడా ప్రేక్షకులకు తెలియదు. అందుకే మేకర్స్ డిఫరెంట్ వేలో ప్రచారం చేయడం ప్రారంభించారు. ప్రాంక్ వీడియోలు చేస్తూ..కాంట్రవర్సీ క్రియేట్ చేసి సినిమా పేరును ప్రేక్షకులను చేరవయ్యేలా చేస్తున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్స్ కూడా డిఫరెంట్గానే ప్లాన్ చేస్తున్నారు. తాజాగా హీరో సుహాస్ తన కొత్త సినిమా ప్రచారం కోసం ఏకంగా దిల్ రాజు వాట్సాప్ చాట్నే బయటపెట్టాడు.ప్రీమియర్ షో ఫిక్స్!సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. దిల్ రాజు ప్రోడక్షన్స్ బ్యానర్పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించారు. సందీర్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. రిలీజ్కి ఒక రోజు ముందు అంటే.. సెప్టెంబర్ 6న ప్రీమియర్ షో వేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ..నిర్మాత దిల్ రాజుతో చేసిన వాట్సాప్ చాట్ని హీరో సుహాస్ బయటపెట్టాడు.వాట్సాప్ చాట్లో ఏముందంటే..సుహాస్: సర్ మనం ప్రీమియర్ షో వేస్తే బాగుంటుంది. ఈ మధ్య ప్రీమియర్స్ వేసిన సినిమాలన్నీ బాగా వర్కౌట్ అవుతున్నాయి.దిల్ రాజు: చూడాలి సుహాస్. ఇప్పటికిప్పుడు అంటే ప్లాన్ చేయాలి. చెక్ చేసి చెబుతా.సుహాస్: ఈ నెల 6న సాయంత్రం ఏఎంబీ, నెక్సెస్ ఇలా అన్ని ఓపెన్ చేద్దాం సర్.దిల్ రాజు: కొంచెం టైమ్ ఇవ్వు సుహాస్.. చెప్తా.సుహాస్: వాయిస్ రికార్డుదిల్ రాజు: 6న కన్ఫామ్ సుహాస్. ప్రీమియర్స్ వేసేద్దాంసుహాస్: క్లాప్ కొడుతున్న ఎమోజీThat's how @ThisIsDSP Garu helped us 🤗❤️#JanakaAitheGanaka premieres on September 6th 🤗#JAGOnSeptember7th pic.twitter.com/i1Kog2gh2y— Suhas 📸 (@ActorSuhas) September 3, 2024 -
‘జనక అయితే గనక’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
మా లైన్ దాటలేదు: ‘దిల్’ రాజు
‘‘దిల్’ రాజు ప్రోడక్షన్ అంటే కుటుంబంతో కలిసి చూసే సినిమా ఉంటుంది. అయితే ‘జనక అయితే గనక’ కాస్త భిన్నంగా ఉంటుంది. కానీ మా బేనర్ లైన్ దాటకుండా తీశాం’’ అన్నారు ‘దిల్’ రాజు. సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. దిల్ రాజు ప్రోడక్షన్స్ బ్యానర్పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించారు. సందీర్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది.ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘చేస్తున్న ప్రతి సినిమాకీ ఒక్కో మెట్టు ఎక్కుతున్న సుహాస్ కొత్త కథలు ఎంచుకుంటున్నాడు. సుహాస్ అంటే మినిమమ్ గ్యారెంటీ అని యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా అంటున్నారు. ఇక చిన్న సినిమాలకు ప్రీమియర్లు కలిసి వస్తున్నాయి. మేం సెప్టెంబర్ 6న ప్రీమియర్లు వేస్తున్నాం.ఈ సినిమా చూశాక వినోదంతో పాటు మంచి సందేశం ఇచ్చారనే ఫీల్తో థియేటర్ నుంచి బయటకు వస్తారు’’ అని అన్నారు. ‘‘ప్రశాంత్ నీల్కి ఈ కథ తెలుసు... చాలా బాగుందన్నారు’’ అని సందీప్ రెడ్డి చెప్పారు. ‘‘ఈ సినిమాని ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నానని ‘దిల్’ రాజుగారితో చెబితే ఓకే అన్నారు’’ అని సుహాస్ తెలిపారు. ఎడిటర్ కోదాటి, సంగీతదర్శకుడు విజయ్ బుల్గానిన్ పాల్గొన్నారు. -
‘పసిడి’ వేటలో భారత షట్లర్లు
పారిస్: పారాలింపిక్స్లో ఆదివారం భారత షట్లర్లు మెరిపించారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–4 కేటగిరీలో సుహాస్ యతిరాజ్... ఎస్ఎల్–3 కేటగిరీలో నితేశ్ కుమార్ ఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం రజత పతకాలను ఖరారు చేసుకున్నారు. 2007 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన సుహాస్ గత టోక్యో పారాలింపిక్స్లోనూ ఫైనల్కు చేరి రజత పతకం దక్కించుకున్నాడు. ఈసారి సెమీఫైనల్లో సుహాస్ 21–17, 21–12తో భారత్కే చెందిన సుకాంత్ కదమ్ను ఓడించాడు. మరో విభాగం సెమీఫైనల్లో నితేశ్ 21–16, 21–12తో దైసుకె ఫుజిహారా (జపాన్)పై గెలిచి తొలిసారి పారాలింపిక్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. నేడు జరిగే ఫైనల్స్లో టోక్యో పారాలింపిక్స్ చాంపియన్ లుకాస్ మజుర్ (ఫ్రాన్స్)తో సుహాస్; డేనియల్ బెథెలి (బ్రిటన్)తో నితేశ్ తలపడతారు. మహిళల సింగిల్స్ ఎస్యు5 కేటగిరీలో ఇద్దరు భారత క్రీడాకారిణులు తులసిమతి మురుగేశన్, మనీషా రామదాస్ సెమీఫైనల్లో పోటీపడనున్నారు. ఇద్దరిలో ఒకరు ఫైనల్కు చేరుకోనుండటంతో ఈ విభాగంలోనూ భారత్కు కనీసం రజతం లభించనుంది. ఈరోజు జరిగే కాంస్య పతక మ్యాచ్లో ఫ్రెడీ సెతియావాన్ (ఇండోనేసియా)తో సుకాంత్ తలపడతాడు. ప్రీతికి రెండో పతకం మహిళల అథ్లెటిక్స్ టి35 200 మీటర్ల విభాగంలో భారత అథ్లెట్ ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని సాధించింది. ప్రీతి 200 మీటర్ల దూరాన్ని 30.01 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. టి35 100 మీటర్ల విభాగంలోనూ ప్రీతికి కాంస్య పతకం లభించిన సంగతి తెలిసిందే. రాకేశ్కు దక్కని కాంస్యం పురుషుల ఆర్చరీ కాంపౌండ్ ఓపెన్ విభాగంలో భారత ప్లేయర్ రాకేశ్ కుమార్ కాంస్య పతక మ్యాచ్లో ఓడిపోయాడు. హి జిహావో (చైనా)తో జరిగిన కాంస్య పతక మ్యాచ్లో రాకేశ్ 146–147 స్కోరుతో పరాజయం పాలయ్యాడు. రవికి ఐదో స్థానం పురుషుల షాట్పుట్ ఎఫ్40 కేటగిరీలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు రవి రొంగలి ఐదో స్థానంలో నిలిచాడు. ఇనుప గుండును రవి 10.63 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది ఆసియా పారా గేమ్స్లో రజతం గెలిచిన రవి ఈసారి తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినా ఫలితం లేకపోయింది. మిగెల్ మోంటెరో (పోర్చుగల్; 11.21 మీటర్లు) స్వర్ణం సాధించాడు. మరోవైపు మహిళల 1500 మీటర్ల టి11 విభాగం తొలి రౌండ్లో భారత అథ్లెట్ రక్షిత రాజు 5 నిమిషాల 29.92 సెకన్లలో గమ్యానికి చేరి ఫైనల్కు అర్హత పొందలేకపోయింది. షూటర్ల గురి కుదరలేదు భారత షూటర్లకు ఆదివారం అచి్చరాలేదు. ఆదివారం లక్ష్యంపై గురి పెట్టిన ఏ షూటర్ కూడా పోడియంపై నిలువలేకపోయాడు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్హెచ్1) ఈవెంట్లో అవని లేఖరా 11వ స్థానంలో నిలువగా, సిద్ధార్థ బాబు 28వ స్థానంలో నిలిచి ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయారు. ఇదే విభాగం వ్యక్తిగత ఈవెంట్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన అవని గురి ‘మిక్స్డ్’లో మాత్రం కుదర్లేదు. ఆమె 632.8 స్కోరు చేయగా, సిద్ధార్థ 628.3 స్కోరు చేశాడు. ఈ ఈవెంట్ల్లో టాప్–8 స్థానాల్లో నిలిచిన వారే ఫైనల్స్కు అర్హత సాధిస్తారు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్హెచ్2) ఈవెంట్లోనూ శ్రీహర్ష రామకృష్ణకు క్వాలిఫయింగ్లోనే చుక్కెదురైంది. అతను 630.2 స్కోరుతో 26వ స్థానంలో నిలిచాడు. రోయింగ్లో నిరాశ భారత రోయింగ్ జోడీ కొంగనపల్లి నారాయణ–అనితకు పారాలింపిక్స్లో నిరాశ ఎదురైంది. ఆసియా పారా క్రీడల్లో రజత పతకం నెగ్గుకొచి్చన ఈ జంట పారిస్ నుంచి రిక్తహస్తాలతో రానుంది. ఆదివారం జరిగిన పీఆర్3 మిక్స్డ్ డబుల్ స్కల్స్ రోయింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నారాయణ–అనిత జోడీ ఓవరాల్గా ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. 7 నుంచి 12వ స్థానాల కోసం నిర్వహించిన వర్గీకరణ పోటీల్లో భారత ద్వయానికి 8వ స్థానం దక్కింది. ఈ జంట పోటీని 8 నిమిషాల 16.96 సెకన్లలో పూర్తి చేసింది. ఆర్మీ సిపాయి అయిన కొంగనపల్లి నారాయణ 2015లో జమ్మూ కశీ్మర్లోని సరిహద్దు విధుల్లో ఉండగా ల్యాండ్మైన్ పేలి ఎడమ కాలిని మోకాలు నుంచి పాదం వరకు పూర్తిగా కోల్పోయాడు. అనిత రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయింది. -
'జనక అయితే గనక'.. ట్రైలర్ వచ్చేసింది!
డిఫరెంట్ స్టోరీస్తో అభిమానులను అలరిస్తోన్న నటుడు సుహాస్. తాజాగా మరో ఆసక్తికర టైటిల్తో ఫ్యాన్స్ను అలరించేందుకు వచ్చేస్తున్నాడు. సుహాస్, సంగీర్తన జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'జనక అయితే గనక'. ఈ సినిమాకు సందీప్రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే మధ్య తరగతి వ్యక్తి జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. భార్య, భర్త, పిల్లలు అనే ఆసక్తికర కథాంశంతో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. టైటిల్ చూస్తేనే ఆడియన్స్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 7న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. -
కీర్తీ సురేష్ సినిమా.. డైరెక్ట్గా ఓటీటీలోనే విడుదల
హీరోయిన్ కీర్తీ సురేశ్ మెయిన్ లీడ్ రోల్లో నటిస్తున్న కొత్త సినిమా ‘ఉప్పు కప్పురంబు’ డైరెక్ట్గా ఓటీటీలో విడుదల కానుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సుహాస్ మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. ఐవీ శశి దర్శకత్వంలో తెరకెక్కుత్ను ఈ చిత్రాన్ని రాధికా లావు నిర్మించారు. వసంత్ మురళీ కృష్ణ మరింగంటి కథ అందిస్తున్నారు.ఓ గ్రామంలోని స్మశానం విస్తరణ నేపథ్యంలో ‘ఉప్పు కప్పురంబు’ సినిమా కథనం ఉంటుందనే ప్రచారం ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలో కీర్తీ సురేశ్, సుహాస్ జంటగా నటిస్తారా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే. అయితే, ఉప్పు కప్పురంబు మూవీ డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. అమెజాన్ ప్రైమ్ కోసమే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల కానుంది. త్వరలోనే మరిన్ని విషయాలు ఉప్పు కప్పురంబు మేకర్స్ వెల్లడించనున్నారు. కీర్తీ సురేశ్ నటించిన రఘుతాత సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. మరోవైపు బేబీ జాన్ సినిమాతో ఆమె బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుంది. -
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘శ్రీరంగనీతులు’
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాన్ నటించిన తాజా చిత్రం ‘శ్రీరంగనీతులు’. ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 11న థియేటర్స్లో విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది.ఈ సినిమాలో సుహాస్ తో పాటు కేరాఫ్ కంచరపాలెం తో ఆకట్టుకున్న కార్తీక్రత్నం, బేబీ తో యూత్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్న విరాజ్ అశ్విన్, రుహానిశర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నలుగురి పెర్ఫార్మెన్స్ శ్రీరంగనీతులు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఇటీవల ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ చేయగా..అక్కడ కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రెమ్లో టాప్ ట్రెండింగ్ చిత్రంగా కొనసాగుతుంది. థియేటర్స్కి మించిన స్పందన ఓటీటీల్లో రావడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.‘శ్రీరంగనీతులు’ స్టోరీ ఇదేఈ సినిమా కథంతా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. బస్తీకి చెందిన శివ(సుహాస్) టీవీ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. అతనికి ఫ్లెక్సీల పిచ్చి. బతుకమ్మ సందర్భంగా ఆ ఏరియాలోని గ్రౌండ్లో ఎమ్మెల్యేతో కలిసి దిగిన ఫోటోతో ఫ్లెక్సీ కట్టిస్తాడు. అయితే దాన్ని రాత్రికి రాత్రే ఎవరో మాయం చేస్తారు. మరో ప్లెక్సీ కట్టించడానికి డబ్బులు ఉండవు. ఎలాగైన పండక్కి గ్రౌండ్లో తన ప్లెక్సీ ఉండాలనుకుంటాడు. దాని కోసం శివ ఏం చేశాడు? చివరకు ఏం జరిగింది?మరోవైపు వరుణ్(విరాజ్ అశ్విన్), ఐశ్వర్య(రుహానీ శర్మ) ప్రేమించుకుంటారు. తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడుతుంది ఐశ్వర్య. పెళ్లి చేసుకుందామని వరుణ్ పదే పదే అడగడంతో ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు రెడీ అవుతుంది. ఇంతలోపు ఆమె తండ్రి ఓ పెళ్లి సంబంధం తీసుకొస్తాడు. వారికి అమ్మాయి నచ్చడంతో త్వరలోనే పెళ్లి చేయాలనుకుంటారు. ప్రేమ విషయాన్ని చెప్పలేక, పెద్దలు చూసిన సంబంధం చేసుకోలేక సతమతమవుతారు. దీంతో పాటు ఐశ్వర్యకు మరో సమస్య వస్తుంది. ఆది ఏంటి? చివరకు వరుణ్, విరాజ్లు పెళ్లి చేసుకున్నారా లేదా?ఇంకోవైపు ఉన్నత చదువులు చదివిన కార్తిక్(కార్తీక్ రత్నం) డ్రగ్స్కి అలవాటు పడి జులాయిగా తిరుగుతుంటాడు. ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్నాడని తెలిసి అతన్ని పట్టుకోవడం కోసం పోలీసులు తీరుగుతుంటారు. కొడుకును పోలీసులకు చిక్కకుండా కాపాడుకునే క్రమంలో తండ్రి(దేవీ ప్రసాద్) చిక్కుల్లో పడతారు. చివరకు తండ్రిని కూడా పోలీసులు పట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? కార్తిక్ డ్రగ్స్కు ఎందుకు బానిసయ్యాడు? చివరకు ఈ ముగ్గురి జీవితాల్లో వచ్చిన మార్పు ఏంటి? అనేదే మిగతా కథ. -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మరో తెలుగు సినిమా చెప్పపెట్టకుండా ఓటీటీలోకి వచ్చేసింది. లెక్క ప్రకారం యూట్యూబ్లో దీన్ని నేరుగా రిలీజ్ చేస్తారనే న్యూస్ వచ్చింది. ఈ క్రమంలోనే దీనికి ఒకరోజు ముందు ఇప్పుడు సైలెంట్గా ఈ మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.కమెడియన్గా కెరీర్ మొదలుపెట్టినప్పటికీ 'కలర్ ఫోటో'తో హిట్ కొట్టిన సుహాస్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్లో ప్రామిసింగ్ మూవీస్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు', 'ప్రసన్న వదనం' లాంటి మూవీస్తో ఆకట్టుకున్నాడు. ఇతడు కీలక పాత్రలో నటించిన మూవీనే 'శ్రీరంగనీతులు'. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)సుహాస్, విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ కీలక పాత్రలు పోషించిన 'శ్రీరంగనీతులు'.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. జనాల్ని ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే మే 30న దీన్ని యూట్యూబ్లో ఉచితంగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇంతలోనే ఆహా ఓటీటీ ఈ మూవీని స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చేసింది.'శ్రీరంగనీతులు' కథ విషయానికొస్తే.. బస్తీ కుర్రాడు శ్యాంసంగ్ శివ (సుహాస్)ది ఫ్లెక్సీల పిచ్చి. లోకల్ రాజకీయ నాయకుడితో ఫొటో దిగి ఫ్లెక్సీ వేయిస్తాడు. కానీ అది మాయమవుతుంది. మరోవైపు జీవితంలో ఫెయిలయ్యానని కార్తీక్ (కార్తిక్ రత్నం) మద్యానికి బానిస అయిపోతాడు. ఇంకోవైపు ఐశ్వర్య (రుహానీ శర్మ), వరుణ్ (విరాజ్ అశ్విన్) ప్రేమికులు. కానీ తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పే ధైర్యముండదు. మరి ఈ నలుగురి జీవితాల్లో ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)🔥 Drama, love, and suspense 🔥 "Sriranga Neethulu" takes you on a journey of unexpected twists and emotional highs. Watch now #SrirangaNeethulu only on aha▶️https://t.co/4BJf8LDbAm pic.twitter.com/DcMAoezh3Q— ahavideoin (@ahavideoIN) May 29, 2024 -
ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్
మరో క్రేజీ సినిమా ఓటీటీ రిలీజ్కి రెడీ అయిపోయింది. సుహాస్ హీరోగా నటించిన ఆ సినిమా పేరే 'ప్రనస్న వదనం'. విడుదలకు ముందే అంచనాలు ఏర్పరుచుకున్న ఈ చిత్రం.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత బాగుందనే టాక్ సొంతం చేసుకుంది. కాకపోతే కాన్సెప్ట్ కాస్త కొత్తగా ఉండటంతో జనాలకు అనుకున్న స్థాయిలో రీచ్ కాలేకపోయింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అలరించేందుకు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.తెలుగులో ఈ మధ్య కాలంలో సుహాస్ పేరు బాగా వినిపిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీతో హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో.. రీసెంట్గా 'ప్రసన్న వదనం'తో వచ్చాడు. మే 3న థియేటర్లలోకి వచ్చింది. హీరోకి ఫేస్ బ్లైండ్నెస్ అనే కథ ఆసక్తికరంగా అనిపించింది. సినిమా కూడా బాగానే ఉందని చూసినవాళ్లు అభిప్రాయపడ్డారు. ఇప్పుడీ మూవీ మూడు వారాల్లోనే అంటే మే 24 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: భూ వివాదంలో ట్విస్ట్.. క్లారిటీ ఇచ్చిన జూ.ఎన్టీఆర్ టీమ్)'ప్రసన్నవదనం' కథేంటి?సూర్య (సుహాస్) ఓ రేడియో జాకీ. ఓ యాక్సిడెంట్ కారణంగా ప్రొసోపగ్నోషియా అనే పరిస్థితి వస్తుంది. ఇది ఓ లోపం. అదేంటంటే ఇతడికి మొహాలు గుర్తుండవు, కనిపించవు. అన్నీ గుర్తుంటాయి ముఖాలు తప్ప. దీన్ని ఫేస్ బ్లైండ్నెస్ అంటారు. ఈ సమస్యతో ఉన్నోడు కాస్త ఓ హత్యలో సాక్షి అవుతాడు. అసలా మర్డర్ చేసిందెవరు? లోపమున్న హీరో నిందుతుల్ని ఎలా పోలీసులకు పట్టిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు థియేటర్లలో చూడాలంటే కాస్త కష్టం కానీ ఓటీటీలో మాత్రం క్రేజీగా ఆడేస్తాయి. ప్రస్తుతం అటు థియేటర్, ఇటు ఓటీటీలో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. వచ్చే వారం ఓటీటీలోకి వచ్చేస్తుంది కాబట్టి 'ప్రసన్నవదనం'.. డిజిటల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఛాన్సులు గట్టిగా ఉంటాయనమాట.(ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. స్పాట్లో చనిపోయిన స్టార్ హీరో బంధువులు)Without a Face, But Not Without Courage..💪A Hero's Journey Beyond Sight!🎭A gripping thriller-drama #PrasannaVadanamOnAha Premieres May 24th!(24 hours early access for aha gold subscribers)@ahavideoIN @ActorSuhas @payal_radhu @RashiReal_ @ManikantaJS @ReddyPrasadLTC… pic.twitter.com/NG4CmDnW94— ahavideoin (@ahavideoIN) May 17, 2024 -
సుహాస్ ప్రసన్న వదనం.. మరో హిట్ పడినట్టేనా?
టైటిల్: ప్రసన్న వదనంనటీనటులు: సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులుడైరెక్టర్: అర్జున్ వైకేనిర్మాతలు: మణికంఠ జేఎస్, ప్రసాద్రెడ్డి టీఆర్సంగీతం: విజయ్ బుల్గానిన్సినిమాటోగ్రఫీ: ఎస్.చంద్రశేఖరన్ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్విడుదల తేదీ: 03-05-2024టాలీవుడ్లో యంగ్ హీరో సుహాస్ ప్రత్యేక శైలితో దూసుకెళ్తున్నారు. ఫ్యామిలీ డ్రామా, కలర్ ఫోటో, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. తాజాగా మరోసారి ప్రసన్న వదనం అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. సుకుమార్ వద్ద పని చేసిన అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫేస్ అండ్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి సరికొత్త కాన్సెప్ట్ వర్కవుట్ అయ్యిందా? కొత్త దర్శకుడితో సుహాస్ ఖాతాలో మరో హిట్ పడిందా? చూసేద్దాం పదండి. అసలు కథేంటంటే...ఓ ప్రమాదంలో తల్లితండ్రులను కోల్పోతాడు సూర్య(సుహాస్). అసలే కష్టాల్లో ఉన్న అతనికి మరో వింత డిజార్డర్ కూడా వస్తుంది. తలకి బలంగా గాయం కావడంతో ఫేస్ బ్లైండ్నెస్ డిజార్డర్ వస్తుంది. అంటే అతను ఎవరినీ గుర్తించలేడు. ఓ ఎఫ్ఎం స్టేషన్లో ఆర్జేగా పని చేస్తున్న సూర్య ఓ అర్ధరాత్రి దారుణమైన ఘటనను ప్రత్యక్షంగా చూస్తాడు. అమృత(సాయి శ్వేత)అనే అమ్మాయిని ఎవరో లారీ కింద తోసేస్తారు. అయితే ఈ ఘటనని ప్రత్యక్షంగా చూసిన సూర్య.. తనకి ఫేస్ బ్లైండ్నెస్ ఉండటం వల్ల ఆ వ్యక్తి ఎవరనేది గుర్తుపట్టలేడు. మరుసటి రోజే అది యాక్సిడెంట్ అని వార్తల్లో వస్తుంది. ఇది చూసిన సూర్య బాధితురాలికి న్యాయం చేయాలని భావించి పోలీసులకు ఫోన్ చేసి అసలు సంగతి చెబుతాడు. ఈ కేసుని ఏసీపీ వైదేహి(రాశి సింగ్) ఎస్ఐ( నితిన్ ప్రసన్న) చాలా సీరియస్గా తీసుకుంటారు. అసలు పోలీసులు నిందితున్ని పట్టుకున్నారా? దర్యాప్తులో ఎలాంటి నిజాలు రాబట్టారు? ఫేస్ బ్లైండ్నెస్తో సూర్య ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు ? అసలు అమృతని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ? అనేది తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే.ఎలా సాగిందంటే.. ఇలాంటి ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్తో తెలుగులో ఇప్పటివరకూ సినిమాలు రాలేదు. సరికొత్త పాయింట్ను తీసుకున్న డైరెక్టర్ అర్జున్ ఆ పాయింట్ను అంతే కొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యారు కూడా. సూర్య తల్లితండ్రులు ప్రమాదంలో చనిపోవడం.. సూర్యకి ఫేస్ బ్లైండ్ నెస్ రావడం.. ఆ తర్వాత అతను పడే ఇబ్బందులు, అధ్య(పాయల్ రాధకృష్ణ) రూపంలో ఓ క్యూట్ లవ్ స్టొరీతో కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లాడు. కథలోకి క్రైమ్ ఎలిమెంట్ వచ్చిన తరవాత వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ మాత్రం నిజంగానే బ్లైండ్నెస్ వచ్చేలా చేస్తుంది. అంటే అంతలా సస్పెన్ష్ ఉంటుందన్నమాట.సెకండాఫ్కు వచ్చేసరికి కథను మరింత గ్రిప్పింగ్గా నడిపించారు డైరెక్టర్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ ట్విస్ట్ను ఎవరూ ఊహించలేరు. కథను అంత పకడ్బందీగా రాసుకున్నాడు దర్శకుడు. క్లైమాక్స్ ఈ సినిమాకి మరో హైలెట్గా నిలిచింది. అప్పటివరకూ కాస్తా స్లో నేరేషన్ అనిపించినప్పటికీ ఈ కథకు ఇచ్చిన ముగింపు మాత్రం అదిరిపోయింది.ఎవరెలా చేశారంటే...సూర్య పాత్రలో సుహాస్ సహజంగా ఒదిగిపోయాడు .తనదైన నటనలో ఎమోషనల్ సీన్స్లో అదరగొట్టేశాడు. యాక్షన్ సీక్వెన్స్లోనూ సూపర్బ్ అనిపించాడు. పాయల్ తన అందంతో పాత్రలో ఒదిగిపోయింది. రాశి సింగ్, నితిన్ తమ పాత్రల పరిధి మేర నటించారు. హర్ష, సత్య కామెడీతో అదరగొట్టేశారు. ఓవరాల్గా నందుతో పాటు మిగిలిన నటీనటులు తమపాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే.. విజయ్ బుల్గానిన్ నేపధ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్లో తన కత్తెరకు కాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. ఓవరాల్గా తొలి సినిమాతోనే దర్శకుడు అర్జున్ తన మార్క్ చూపించారు. -
ఆనందంతో డైరెక్టర్ని హత్తుకున్నాను: సుహాస్
‘‘ప్రసన్న వదనం’ మూవీ ఫేస్ బ్లైండ్నెస్ (ముఖాలను గుర్తు పట్టడంలో ఇబ్బంది) కాన్సెప్ట్తో రూపొందింది. డైరెక్టర్ అర్జున్గారు సినిమా తీసిన విధానం, స్క్రీన్ ప్లే అదిరిపోయాయి. ఈ సినిమా తొలి కాపీ చూశాక భావోద్వేగం, ఆనందంతో డైరెక్టర్ని హత్తుకున్నాను. ఇంత అద్భుతంగా వచ్చిన మా చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని సుహాస్ అన్నారు. అర్జున్ వైకే దర్శకత్వంలో సుహాస్ హీరోగా, పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రసన్న వదనం’. జేఎస్ మణికంఠ, టీఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో రేడియో జాకీ పాత్ర చేశాను. అతను తనకున్న ఫేస్ బ్లైండ్నెస్ కారణంగా ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు? దాన్ని ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఈ చిత్రకథ. ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. అవి చేయడం కాస్త సవాల్గా అనిపించింది. ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని నిర్మించారు నిర్మాతలు. ప్రస్తుతానికి నా చేతిలో ఎనిమిది సినిమాలున్నాయి’’ అన్నారు. -
'ప్రసన్న వదనం'థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్, డౌటే లేదు: సుహాస్
‘ప్రసన్న వదనం’ ఫస్ట్ కాపీ నిన్ననే చూశాను. సినిమా థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్. ఇందులో డౌట్ లేదు.ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమా చాలా బాగా రన్ అవుతుందని భావిస్తున్నాను. ప్రేక్షులకు చాలా తృప్తిని ఇచ్చే సినిమా ఇది’ అన్నారు హీరో సుహాస్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్రసన్న వదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటించారు. మే 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో సుహాస్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సీట్ ఎడ్జ్ లో కూర్చుని సినిమా చూస్తారు. అదిరిపోయిందని క్లాప్స్ కొడతారు. నా సినిమాలు మౌత్ టాక్ వలన వెళ్తాయి కాబట్టి తొందరగా ఎవరికి కుదిరితే వారు సినిమా చూసి మిగతా వారికి చెప్పాలి’ అని కోరారు. ‘ఇది యూనిక్ కాన్సెప్ట్ తో రియల్ కమర్షియల్ ఫిల్మ్. ఫన్, థ్రిల్ రోమాన్స్, ఎమోషన్స్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి’ అని అన్నారు దర్శకుడు అర్జున్. ‘ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది. ఈ చిత్రం కచ్చితంగా అందరిని అలరిస్తుంది’ అన్నారు హీరోయిన్ రాశిసింగ్. ‘ ఈ సినిమా పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.అందరూ థియేటర్స్ కి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం’ అని నిర్మాతలు ప్రసాద్ రెడ్డి, జెస్ మణికంఠ అన్నారు. -
నేను వాటితో నటించాలంటే కాస్త రెమ్యునరేషన్ పెంచాల్సిందే: ట్రెండింగ్ హీరోయిన్
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన చిత్రం 'ప్రసన్న వదనం'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అర్జున్ వైకే దర్శకత్వం వహించిన ఈ మూవీలో సుహాస్కు జోడీగా కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ ఎంట్రీ ఇచ్చింది. ట్రైలర్లో ఈ బ్యూటీని చూసిన వారందరూ ఫిదా అవుతున్నారు. దీంతో మే 3న విడుదల కానున్న ప్రసన్న వదనం చిత్రం కోసం ప్రేక్షకులు మరింత ఈగర్గా ఎదురుచూస్తున్నారు.మంగళూరులో పుట్టిన పాయల్ రాధాకృష్ణ మోడల్గా ఎంట్రీ ఇచ్చి ఆపై 'బెంగళూరు అండర్ వరల్డ్' సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. బెంగళూరులో ఇంజినీరింగ్ చేరిన పాయల్ మొదటి సంవత్సరంలోనే చదువు ఆపేసి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. అనంతరం అమెజాన్, సఫోలా వంటి ప్రముఖ బ్రాండ్ల కోసం ఆమె పనిచేసింది. తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా యాక్టింగ్లో డిప్లొమా చేసిన ఈ బ్యూటీ 19 ఏళ్లకే సినిమా అవకాశాలపై కన్నేసింది. తల్లి క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో పాయల్ రాధాకృష్ణ కూడా మంచి ట్రెడిషినల్ డ్సాన్సర్. ఆమె అమ్మగారు డ్యాన్స్ అకాడమీని కూడా రన్ చేస్తున్నారు.మిగతా హీరోయిన్లకు భిన్నంగా తన ఆలోచనలు ఉన్న పాయలకు పెంపుడు జంతువులు అంటే ఏ మాత్రం ఇష్టం లేదట. ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు ఎక్కువగా కుక్కలు,పిల్లులు పెంచుకుంటూ ఉంటారు. కానీ ఈ కన్నడ బ్యూటీకి పెట్స్ అంటే ఏమాత్రం ఇష్టం లేదని చెప్పింది. తనకు సంబంధించిన యాడ్స్ , సినిమాల్లో పెంపుడు జంతువులతో ఏదైనా సీన్ చేయాలంటే అందుకు రెమ్యునరేషన్ ఎక్కువగా అడుగుతానని ఈ బ్యూటీ చెప్పుకొస్తుంది.సినిమా ఇండస్ట్రీలో మొదట్లో తనకు తెలుగు భాష అంటే కాస్త ఇబ్బందిగా ఉండేదని చెప్పింది. పలు యాడ్లు చేస్తున్నప్పుడు తను తెలుగు మాట్లాడుతుంటే కొందరు కామెంట్లు కూడా చేశారని చెప్పుకొచ్చింది. దీంతో కష్టపడి తెలుగు నేర్చుకున్నానని ఆమె తెలిపింది. టాలీవుడ్లో అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబుతో ఒక సినిమాలో అయినా నటించాలనేది తన కోరిక అంటూ తెలిపింది. కోలీవుడ్లో అయితే ధనుష్తో నటించాలని ఉందని పేర్కొంది. ప్రసన్న వదనం చిత్రంతో పాటు 'చారీ పాఠం' అనే మరో సినిమాలోనూ పాయల్ రాధాకృష్ణ నటిస్తోంది. View this post on Instagram A post shared by Payal Radhakrishna Shenoy (@payal_radhakrishna) -
సుహాస్ 'ప్రసన్న వదనం' ట్రైలర్ విడుదల
యంగ్ హీరో సుహాస్ నటించిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్ 'ప్రసన్న వదనం'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్కు భారీ రెస్పాన్స్ వచ్చింది. మే3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ చేసింది. అందుకోసం ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని మేకర్స్ నిర్వహించారు. అందుకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ వేడుక చాలా గ్రాండ్గా జరిగింది. దర్శకులు బుచ్చిబాబు, కార్తిక్ దండు, శ్రీనివాస్ అవసరాల, రైటర్ ప్రసన్న ఈ వేడుకలో పాల్గొన్నారు.హీరో సుహాస్ మాట్లాడుతూ.. 'ప్రసన్న వదనం' మే 3న విడుదల అవుతుంది. కలర్ ఫోటో, రైటర్ పద్మ భూషణ్, అంబాజీ పేట.. ఈ సినిమాలన్నీ ప్రేక్షకులని అలరించాయి. ప్రసన్న వదనం కూడా ఖచ్చితంగా ఆడియన్స్ ని అలరిస్తుంది. ప్రేక్షకులు థియేటర్స్ దాక వస్తే చాలు.. అక్కడ మేము చూసుకుంటాం. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.' అని ఆయన అన్నారు. -
టాలీవుడ్ యంగ్ హీరో సస్పెన్స్ థ్రిల్లర్.. సాంగ్ రిలీజ్!
ఇటీవల అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో ప్రేక్షకులను అలరించిన సుహాస్ హీరో మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం ప్రసన్న వదనం. ఈ సినిమాకు అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జేఎస్ మణికంఠ, టీఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ ఉగాది శుభ సందర్భంగా ఈ చిత్రంలోని 'నిన్నా మొన్న' అనే సాంగ్ను విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ ఈ పాటని ఆకట్టుకునే లవ్లీ మెలోడీగా కంపోజ్ చేశారు. కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యం మరో ఆకర్షణగా నిలిచింది. ఈ సాంగ్లో సుహాస్, పాయల్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మే 3న థియేటర్లలో సందడి చేయనుంది. -
సుహాస్ మూవీతో 'నువ్వు నేను' హీరోయిన్ రీ ఎంట్రీ (ఫోటోలు)
-
సుహాస్ కొత్త సినిమా.. నువ్వు నేను హీరోయిన్ రీఎంట్రీ
వైవిధ్యమైన చిత్రాలతో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్న హీరో సుహాస్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. తమిళ సూపర్ హిట్ మూవీ 'జో' ఫేమ్ మాళవిక మనోజ్ హీరోయిన్గా నటిస్తోంది. రామ్ గోదాల దర్శకుడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు శనివారం హైదరాబాద్లోని ఫిలింనగర్ దైవసన్నిధానంలో ప్రారంభమయ్యాయి. వి ఆర్ట్స్అండ్ చిత్రలహరి టాకీస్ పతాకంపై హరీష్ నల్లా, ప్రదీప్ తాళ్లపు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ నిచ్చారు. దర్శకుడు వశిష్ట కెమెరా స్విచ్చాన్ చేశారు. మరో దర్శకుడు కొలను శైలేష్ బౌండెడ్ స్క్రిప్ట్ను దర్శకుడికి అందజేశారు. టైటిల్ పోస్టర్ను దర్శకులు విజయ్ కనకమేడల, కిషోర్ తిరుమల, నిర్మాత సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న నువ్వు నేను ఫేం అనితా హస్సానందని మాట్లాడుతూ.. నా సెకండ్ ఇన్నింగ్స్కు ఫర్ఫెక్ట్గా కుదిరిన చిత్రమిదన్నారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె తెలుగు తెరపై కనిపించనుంది. దర్శకుడు రామ్ మాట్లాడుతూ ఇదొక బ్యూటిఫుల్ లవ్స్టోరీ, సుహాస్ కొత్తగా దర్శకత్వం చేసే వాళ్లకు దొరికిన వరం. ఎంతో కంఫర్టబుల్ ఆర్టిస్ట్ అన్నారు. చదవండి: పెళ్లైన ఏడాదికే విడాకులు.. ఒకప్పుడు స్టార్ హీరోలతో జోడీ.. ఇప్పుడేమో! -
ట్రైలర్తో ‘శ్రీరంగనీతులు’ చెబుతున్న సుహాస్
సుహాస్, కార్తీక్ రత్నం, విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శ్రీరంగనీతులు’. ప్రవీణ్కుమార్ వీఎస్ఎస్ దర్శకుడు. వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మాత. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ చిత్రం సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. రీసెంట్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో హిట్ కొట్టిన సుహాస్ ఇప్పుడు ‘శ్రీరంగనీతులు’ చెప్పేందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేటి యువత ఆలోచనలు, కుటుంబ బంధాలు, వినోదం.. ఇలా అన్ని అంశాలతో ఈ చిత్రం ఉండనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. 'వినరా వినరా చెబుతా వినరా.. ఈ కాలం శ్రీరంగనీతులు' అంటూ సాగే పాట ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను పెంచుతున్నాయి. -
సుహాస్తో కీర్తి సురేశ్ కొత్త మూవీ!
హీరోయిన్ కీర్తీ సురేశ్ మెయిన్ లీడ్ రోల్లో నటించనున్న కొత్త సినిమాకు ‘ఉప్పు కప్పురంబు’ అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ‘కలర్ ఫోటో’ ఫేమ్ సుహాస్ మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. అని ఐవీ శశి దర్శకత్వంలో రాధికా లావు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. వసంత్ మురళీ కృష్ణ మరింగంటి కథ అందిస్తున్నారు. ఓ గ్రామంలోని స్మశానం విస్తరణ నేపథ్యంలో ‘ఉప్పు కప్పురంబు’ సినిమా కథనం ఉంటుందనే ప్రచారం ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలో కీర్తీ సురేశ్, సుహాస్ జంటగా నటిస్తారా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మహానటితో సినిమా అనగానే సుహాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి కీర్తి అతిథి పాత్రలో కనిపించనుందా? ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. చదవండి: ఓటీటీలో సడెన్గా మాయమైన హిట్ సినిమా.. కారణం ఇదేనా -
ఆ సీన్ గురించి తప్పుడు ప్రచారం.. చాలా బాధ పడ్డాను: నటి శరణ్య
శరణ్య ప్రదీప్ తెలంగాణ యువతి .. చిన్న చిన్న పాత్రలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుని, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ఆర్టిస్ట్. తెలంగాణ యాస మాట్లాడటంలో ఆమె కంటూ ఒక స్టైల్ ఉంది .. అందువలన పల్లె పాత్రలలో ఆమె ఇట్టే ఒదిగిపోతుంది. ఫిదా సినిమాతో శరణ్యకు మంచి గుర్తింపు దక్కింది. తాజాగా సుహాస్కు అక్కగా 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'లో తన నటనతో విశ్వరూపాన్ని చూపింది. ఈ సినిమాలో సుహాస్ను పూర్తిగా శరణ్య ప్రదీప్ డామినేట్ చేసింది. నిజంగానే శరణ్య సినిమా మొత్తానికి ఆమెనే హీరోలా అనిపించేలా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో విలన్ ఆమెను బట్టలు తొలగించి ఓ స్కూళ్లో బంధించి వెళ్లినప్పుడు గానీ… పోలీస్ స్టేషన్లో విలన్ను కాలితో తన్నిన సీన్లో గానీ శరణ్య విజృంభించేసింది. శరణ్యతో పాటుగా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలో పుష్ప ఫేమ్ జగదీశ్ కూడా నటించాడు. ఈ చిత్రంలో శరణ్యకు ప్రియుడి పాత్రలో ఆయన నటించిన విషయం తెలిసిందే. ఒక యువతిని ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఆమె ఆత్మహత్యకి కారణం అయ్యాడనే ఆరోపణలతో జగదీశ్ జైలుకు వెళ్లి ఆపై బెయిల్పై వచ్చాడు. ఈ అంశం గురించి శరణ్య తాజాగా ఇలా రియాక్ట్ అయింది. 'జగదీస్ కేసులో ఏం జరిగిందో నాకు తెలియదు. అలాంటి సమయంలో మాట్లాడడం కరెక్ట్ కాదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందిన జగదీశ్ ఇలాంటి కేసులో చిక్కుకోవడం బాధాకరం. అయితే మా సినిమా సెట్లో మాత్రం జగదీశ్ అందరితో చాలా బాగా ఉండేవాడు. నాతో పాటు అందరినీ కూడా చాలా గౌరవంగా పలకరించేవాడు. నాకు తెలిసినంత వరకు అతడి క్యారెక్టర్లో ఎలాంటి తేడా లేదు. కానీ ఆయన కేసు విషయంలో ఏం జరిగిందో మనం చూడలేదు కాబట్టి దాని గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు.' అని శరణ్య పేర్కొంది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలో ఆమెను వివస్త్రను చేసిన సీన్ గురించి ఆమె ఇప్పటికే పంచుకుంది. తన భర్త సపోర్ట్ ద్వారా మాత్రమే ఆ సీన్ చేయగలిగానని చెప్పింది. కానీ కొంతమంది యూట్యూబ్ వారు తప్పుడు థంబ్నైల్స్ పెట్టి మరో రకంగా ప్రచారం చేస్తున్నారని తెలిపింది. సినిమాలో ఎం లేకపోయినా కూడా ఎదో ఉంది అనేలా క్రియేట్ చేసి వీడియోలు పోస్ట్ చేశారు. దీంతో చాలా వీడియోలకు స్ట్రైక్స్ కొట్టినా ఉపయోగం లేదని శరణ్య వాపోయింది. వాస్తవంగా ఆ సీన్లో ఎలాంటి అసభ్యత లేదు. ఆ సీన్లో నటించాలంటే గట్స్ ఉండాలి. కానీ శరణ్య ఎంతో ధైర్యంగా ఒప్పుకుని ఆ సీన్లో మెప్పించింది. దీంతో తన సినీ కెరియర్లో మరో పది మెట్లు ఎక్కేలా చేసింది. ఏదేమైనా సరైన కథ,దర్శకుడి చేతిలో శరణ్య పడితే మరోసారి తన నటనతో దుమ్మురేపడం ఖాయం అని చెప్పవచ్చు. -
నేను బతకొద్దా.. రెమ్యునరేషన్ పెంపుపై సుహాస్ వ్యాఖ్యలు
ఒకప్పుడు చిన్నాచితకా పాత్రలు చేసుకుంటూ వచ్చిన సుహాస్.. ఇప్పుడు హీరో రేంజ్కు ఎదిగిపోయాడు. సక్సెస్ అన్న పదానికి నిర్వచనంలా మారాడు. ఇటీవలే అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సుహాస్ ప్రస్తుతం ప్రసన్నవదనం అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో సుహాస్కు ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. అందుకే కొత్తవారికి ఛాన్స్ మీ రెమ్యునరేషన్ మూడు వేల నుంచి మూడు కోట్లకు పెంచారట కదా? అన్న ప్రశ్నకు సుహాస్ స్పందిస్తూ.. పారితోషికం పెంచాలి కదా! నేను బతకొద్దా.. జూనియర్ ఆర్టిస్టుగా రోజుకు వంద రూపాయలు తీసుకునే స్థాయి నుంచి ఇక్కడిదాకా వచ్చాను. నాకూ ఎంతో కొంత తీసుకోవాలని ఉంటుందిగా! కాకపోతే మరీ మీరు అనుకున్నంత కాదు అని నవ్వేశాడు. ఎక్కువగా కొత్త దర్శకులకు అవకాశమివ్వడానికి కారణమేంటన్న ప్రశ్నకు.. ఎవరైనా మొదటి సినిమాను ప్రేమించినట్లు తర్వాతివాటిని ప్రేమించరు. అందుకే చాలామటుకు కొత్తవాళ్లతో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తాను అని చెప్పుకొచ్చాడు. నా బతుకేంటో నాకే.. యూట్యూబ్ నుంచి మొదలై మంచి హీరోగా ఎదిగారు. కొత్తగా వచ్చే హీరోలకు ఏమైనా సందేశమిస్తారా? అన్న ప్రశ్నకు.. నా బతుకేంటో నాకే అర్థం కావట్లేదు.. నీ భవిష్యత్తు ఎవడికి కావాలి? అని ఓ డైలాగ్ ఉంటుంది.. నా పరిస్థితి కూడా అలాంటిదే! నేను హీరో అవుతాననే అనుకోలేదు. అంతా ఓ కలలా ఉంది. ఎవరైనా హీరో అంటున్నా కొత్తగానే ఉంటుంది. షార్ట్ ఫిలింస్లో మన టాలెంట్ చూపిస్తే సినిమా ఛాన్సులు అవే వస్తాయి అని సలహా ఇచ్చాడు. చదవండి: Hanuman Movie: ఓటీటీలో హనుమాన్?.. ఇప్పట్లో లేనట్లేనా? -
సుహాస్కు స్వర్ణం
పట్టాయ: పారా బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత షట్లర్లు మూడు స్వర్ణాలు, నాలుగు రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 18 పతకాలతో అదరగొట్టారు. పురుషుల సింగిల్స్లో ఎస్ఎల్–4 విభాగంలో ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్... ఎస్ఎల్–3 విభాగంలో ప్రమోద్ భగత్... ఎస్హెచ్–6 విభాగంలో కృష్ణ నాగర్ పసిడి పతకాలు సొంతం చేసుకొని ప్రపంచ చాంపియన్స్గా అవతరించారు. ఫైనల్స్లో సుహాస్ 21–18, 21–18తో ఫ్రెడీ సెతియవాన్ (ఇండోనేసియా)పై, ప్రమోద్ 14–21, 21–15, 21–14తో డేనియల్ బెథెల్ (ఇంగ్లండ్)పై, కృష్ణ నాగర్ 22–20, 22–20తో లిన్ నైలీ (చైనా)పై గెలుపొంది విజేతలుగా నిలిచారు. -
క్రైమ్ థ్రిల్లర్
‘‘కలర్ ఫోటో’ చిత్రానికి ముందు ‘మను చరిత్ర’ సినిమాలో శివ స్నేహితుడిగా చేశాను. నిర్మాత రాజ్ కందుకూరిగారు నన్ను కూడా తన కుమారుడు శివలానే చూసుకునే వారు. నేను హీరో కాకముందే నన్ను ఓ హీరోలా చూశారాయన. ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’లోని ‘శివ ట్రాప్ ట్రాన్స్..’ పాట అద్భుతంగా ఉంది. ఈ సినిమాని అందరూ చూడాలి’’ అని హీరో సుహాస్ అన్నారు. శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ మూవీ మార్చి 1న విడుదల అవుతోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘శివ ట్రాప్ ట్రాన్స్..’ అనే పాటని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ లాంచ్ చేశారు. అనంతరం నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్కి సుహాస్ ముఖ్య అతిథిగా హాజరై, పాట రిలీజ్ చేశారు. చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించిన ఈ పాటని కాలభైరవ పాడారు. ‘‘మా సినిమాని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు శివ కందుకూరి. ‘‘యునిక్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది’’ అన్నారు పురుషోత్తం రాజ్. ‘‘మా మూవీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు స్నేహాల్, శశిధర్, కార్తీక్. ఈ వేడుకలో దర్శకుడు విజయ్ కనకమేడల, హీరోయిన్ వర్ష బొల్లమ్మ, నిర్మాత రాజ్ కందుకూరి, సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల పాల్గొన్నారు. -
ఐదుగురి మధ్యలో ఆ సీన్ చేశా.. నా భర్త ప్రోత్సహించాడు: శరణ్య
టాలీవుడ్లో చాలా మంది టాలెంటెడ్ నటులు ఉన్నారు. సరైన పాత్ర దొరికితే కానీ వాళ్ల టాలెంట్ ఏంటో ప్రపంచానికి తెలియదు. అలా అని అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తూ కూర్చోలేరు. వచ్చిన పాత్రలు చేస్తూ..నచ్చిన పాత్ర దొరికినప్పుడు రెచ్చిపోయి నటిస్తారు. అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో నటి శరణ్య అదే పని చేసింది. ఈ సినిమాలో హీరో సుహాస్ అయినప్పటికీ.. సినిమా చూసినవారంతా నటి శరణ్యనే హీరో అని అంటున్నారు. అంతలా తన నటనతో ఆకట్టుకుంది ఈ తెలంగాణ అమ్మాయి. మొదట్లో న్యూస్ రీడర్గా కెరీర్ని ఆరంభించి.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది శరణ్య. ఫిదా సినిమాతో శరణ్యకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంలో సాయి పల్లవి అక్కగా నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా.. శరణ్యకు ఆ స్థాయి గుర్తింపు రాలేదు. కానీ ఇటీవల విడుదలైన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు శరణ్యలోని అసలైన నటిని పరిచయం చేసింది. ఈ సినిమాలో ఆమె నటనకు సినీ ప్రియులు ‘ఫిదా’ అయ్యారు. ముఖ్యంగా పోలీసు స్టేషన్ సన్నివేశంతో పాటు స్కూల్లో విలన్తో వచ్చే సీన్లో శరణ్య నటన గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సినిమాకు ఎంతో కీలకమైన సీన్లో నగ్నంగా నటించి అందరిని షాక్కు గురి చేసింది. (చదవండి: ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ రివ్యూ) తాజాగా ఆ సన్నివేశం గురించి శరణ్య మాట్లాడుతూ.. ‘ఆ సీన్ గురించి డైరెక్టర్ చెప్పగానే కాస్త భయం అనిపించింది. అలాంటి సన్నివేశంలో ఇంతవరకు నటించలేదు. కానీ నా భయాన్ని పోగొట్టి సపోర్ట్గా నిలిచింది మాత్రం నా భర్త. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అది.. ధైర్యంగా నటించు అని నా భర్త ప్రోత్సహించాడు. అలాగే చిత్ర యూనిట్ కూడా నాకు సపోర్ట్గా నిలిచింది. ఆ సీన్లో నటించేటప్పుడు సెట్లో ఐదుగురు మాత్రమే ఉన్నారు. డీవోపీ, డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, అసిస్టెంట్స్, మరో వ్యక్తి..ఇలా ఐదుగురి సమక్షంలో చాలా కంఫర్టబుల్గా ఆ సీన్లో నటించా. టీమ్ సహకారంతోనే ఆ సీన్ అద్భుతంగా వచ్చింది’అని శరణ్య చెప్పుకొచ్చింది. -
గట్టిగానే కొట్టిన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' కలెక్షన్స్
కలర్ఫొటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో సుహాస్. గతంలో వచ్చిన ఆ రెండు చిత్రాలు సూపర్ హిట్ కొట్టాయి. తాజగా విడుదలైన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్తోనే దూసుకుపోతుంది. సమాజంలోని అంతరాలు, పరువు, ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా యూత్కు బాగా దగ్గరైందని చెప్పవచ్చు. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివాని నాగరం హీరోయిన్గా మెప్పిస్తే.. హీరో అక్కగా శరణ్య ప్రదీప్ దుమ్మురేపిందని ప్రేక్షకులు తెలుపుతున్నారు. 'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ బండారి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ అయిన మోషన్ పిక్చర్స్,ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రానికి తొలిరోజు అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కాయి. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.28 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం అందరి అంచనాలకు మించి ఓపెనింగ్స్ను సాధించింది. హార్డ్ హిట్టింగ్ బ్లాక్బాస్టర్ అంటూ మేకర్స్ ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది. రెండో రోజు సుమారు రెండున్న కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా రెండు రోజుల్లోనే రూ.5.16 కోట్లు రాబట్టింది. ఏదేమైనా హీరో సుహాస్ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సౌండ్ గట్టిగానే వినిపిస్తోంది. రాయలసీమకు రానున్న హీరో,హీరోయిన్ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' చిత్రానికి పాజిటివ్ రావడంతో చిత్ర యూనిట్తో పాటు సుహాస్, హీరోయిన్ శివాని నాగరం రాయలసీమలో సక్సెస్ టూర్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా నేడు (ఫిబ్రవరి 4న) మొదటగా కర్నూలులోని ఆనంద్ థియేటర్కు మధ్యాహ్నం 12: 30గంటలకు చిత్ర యూనిట్ రానుంది. ఆ తర్వాత కడపలోని రాజా థియేటర్కు మధ్యాహ్నం 3:30 గంటలకు వారి షెడ్యూల్ ఉంది. చివరగా తిరుపతిలోని ప్రతాప్ థియేటర్ వద్దకు సాయింత్రం 7 గంటలకు చిత్ర యూనిట్ రానుంది. 🫶 pic.twitter.com/KjPyTtN54o — Suhas 📸 (@ActorSuhas) February 3, 2024 ❤️❤️❤️ pic.twitter.com/pt9TpJGItb — Suhas 📸 (@ActorSuhas) February 4, 2024 -
పూరి గారి ప్రాజెక్ట్ లో హీరోగా..!
-
గుండు గురించి అసలు కథ చెప్పేసిన సుహాస్..!
-
సుహాస్ నన్ను సైకోల భయపెట్టాడు: నటి శివాని
-
అందరూ సైకో క్యారెక్టర్స్ ఇస్తున్నారు..!
-
‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ రివ్యూ
టైటిల్: అంబాజీపేట మ్యారేజీ బ్యాండు నటీనటులు:సుహస్, శరణ్య ప్రదీఫ్, శివానీ నాగారం, నితిన్ ప్రసన్న, జగదీష్ తదితరులు నిర్మాణ సంస్థలు: జీఏ2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్, మహయానా మోషన్ పిక్చర్స్ నిర్మాత: ధీరజ్మొగిలినేని దర్శకత్వం: దుశ్యంత్ కటికనేని సంగీతం: శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్ ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్ విడుదల తేది: ఫిబ్రవరి 2, 2024 కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2007లో సాగుతుంది. అంబాజీపేట అనే గ్రామానికి చెందిన మల్లీ(సుహాస్), పద్మ(శరణ్య) కవలలు. మల్లీ ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ లో పని చేస్తుంటాడు. పద్మ ఆ ఊరి స్కూల్లో టీచర్గా పని చేస్తుంది. తండ్రి కనకయ్య సెలూన్ షాప్ రన్ చేస్తుంటాడు. మల్లీకి ఆ ఊరిపెద్ద, ఎక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చే వెంకట బాబు(నితిన్ ప్రసన్న) చెల్లెలు లక్ష్మీ(శివానీ నాగారం) అంటే చాలా ఇష్టం. లక్ష్మీకి కూడా మల్లీని ఇష్టపడుతుంది. వీరిద్దరు సెలూన్ షాప్నే అడ్డాగా మార్చుకొని రహస్యంగా ప్రేమించుకుంటారు. మరోవైపు వెంకట బాబు, పద్మల మధ్య అక్రమ సంబంధం ఉందని ఊర్లో పుకారు పుడుతుంది. పద్మ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా పేద పిల్లలకు విద్యను అందిస్తుంది. ఓ సారి వెంకట బాబు తమ్ముడు శ్రీను బాబు (వినయ్ మహాదేవ్), మధ్య మధ్య గొడవ జరుగుతుంది. ఈ క్రమంలో పద్మ శ్రీను చెంప పగలగొడుతుంది. అదే సమయంలో మల్లీ తన చెల్లితో ప్రేమలో ఉన్న విషయం వెంకట్కి తెలుస్తుంది. దీంతో పద్మను ఒంటరిగా స్కూల్లోకి రప్పించి ఘోరంగా అవమానిస్తాడు వెంకట్. ఈ విషయం మల్లీకి తెలిసిన తర్వాత ఏం జరిగింది? అసలు వెంకటబాబు పద్మను ఏ రకంగా అవమానించాడు? పోలీసు స్టేషన్కి వెళ్లిన పద్మకు న్యాయం జరిగిందా లేదా? న్యాయం కోసం పద్మ ఏం చేసింది? మల్లీకి వెంకట్ ఎందుకు గుండు గీశాడు? అక్క కోసం మల్లీ చేసిన పోరాటం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. అంటరానితనం, కులవివక్ష నేపథ్యంలో తమిళ్తో పాటు తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా కథ కూడా అదే. ఈ సినిమాలో కులాల ప్రస్తావన ఉంటుంది కానీ సినిమా అసలు నేపథ్యం కులాల గురించి కాదు. మనుషుల మధ్య అహం ఎలాంటి అడ్డుగోడలు సృష్టిస్తుంది అనేది మెయిన్ పాయింట్. రొటీన్ స్టోరీనే అయినప్పటికీ దుష్కంత్ కటికనేని రాసుకొన్న స్క్రీన్ ప్లే, కథను నడిపించిన తీరు కొత్తగా అనిపిస్తుంది. కులాల పేర్లు ప్రస్తావించకుండా..కులాల మధ్య అంతరాన్ని తెరపై స్పష్టంగా చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. సినిమాను సరదాగా ప్రారంభించి.. ఎమోషనల్గా ముగించాడు. తక్కువ కులానికి చెందిన హీరో..పెద్ద కులానికి చెందిన హీరోయిన్ని ప్రేమించడం అనే రొటీన్ సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. హీరోహీరోయిన్ల మధ్య జరిగే లవ్స్టోరీ కొత్తగా అనిపించదు కానీ.. వినోదాన్ని మాత్రం అందిస్తుంది. ఇద్దరూ ప్రతి మంగళవారం సెలూన్ షాపులో కలుసుకోవడం.. ఫోన్లో జరుపుకునే సంభాషణలు, మధ్యలో హీరో స్నేహితుడు సంజీవ్(జగదీష్) వేసే పంచులు.. ఇవన్నీ నవ్వులు పూయిస్తాయి. ఈ సినిమా కథ ఇంటర్వెల్ ఇరవై నిమిషాల ముందు వరకు సరదాగా సాగుతుంది. అక్కడి నుంచి ఒక హైలోకి వెళ్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థం ప్రారంభంలో వచ్చే సన్నివేశాలు రొటీన్గా ఉంటాయి. కొన్ని సీన్లు అయితే వాస్తవికానికి దూరంగా అనిపిస్తాయి. ‘ఆధారం లేని ఆక్రమణ సంబంధం ..అవమాన పడ్డ ఆత్మాభిమానం’ అంటూ న్యాయం కోసం పద్మ చేసే న్యాయ పోరాటం మాత్రం ఆకట్టుకుంటుంది. పోలీసు స్టేషన్ సీన్ అయితే అదిరిపోతుంది. కొన్ని సంభాషణలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. క్లైమాక్స్ కాస్త సినిమాటిక్గా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. షార్ట్ ఫిల్మ్స్తో కెరీర్ను ప్రారంభించిన సుహాస్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత డిఫరెంట్ స్టోరీలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన ప్రతి సినిమాలోని పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేస్తాడు. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’లోనూ అదే చేశాడు. మల్లీగాడు పాత్రలో సుహాస్ ఒదిగిపోయాడు. లవర్గా, అక్క కోసం ఎంతకైనా తెగించే తమ్ముడిగా అద్భుతంగా నటించాడు. ఎమోషనల్ సన్నీవేశాల్లోనూ చక్కగా నటించాడు. ఇక ఈ సినిమాలో సుహాస్ కంటే బాగా పండిన పాత్ర శరణ్యది. ఇన్నాళ్లు చిన్న చిన్న పాత్రలతో మెప్పించిన శరణ్య.. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’లో డిఫరెంట్ పాత్ర పోషించి, తనదైన నటనతో మెప్పించింది. ఈ సినిమా చూసిన వాళ్లు పద్మ పాత్రను మరిచిపోలేరు. ఆ పాత్రలో అంత గొప్పగా నటించింది శరణ్య. ఆమె నటనకు థియేటర్స్లో విజిల్స్ పడడం గ్యారెంటీ. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. లక్ష్మీగా శివానీ నాగారం తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. తెరపై అందంగానూ కనిపించింది. విలన్గా నితిన్ ప్రసన్న అదరగొట్టేశాడు. పుష్ప ఫేమ్ జగదీష్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గోపరాజు రమణ, కిట్టయ్య, సురభితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాకేతికంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా ఉంది. శేఖర్ చంద్ర సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. మంచి పాటలతో పాటు అద్భుతమైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
రేపు బ్యాండు మోగించాలి : హీరో అడివి శేష్
‘‘చాయ్ బిస్కట్ సంస్థలో సుహాస్ వీడియోలు చేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు. ఇలాంటి ప్రతిభ ఉన్న నటులు చాలా అరుదుగా ఉంటారు. తను ఏ స్థాయికి వెళతాడో ఊహించలేను. ఏదో ఒక రోజు తను నా వేడుకకి అతిథిగా రావాలి. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ట్రైలర్ నచ్చడంతో పది సార్లు చూశా. రేపు (శుక్రవారం) మనమంతా ఈ సినిమా బ్యాండ్ మోగించాలి’’ అని హీరో అడివి శేష్ అన్నారు. సుహాస్, శివానీ నాగరం జంటగా దుష్యంత్ కటికినేని దర్శకత్వం వహించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుష్యంత్ కటికనేని మాట్లాడుతూ– ‘‘సుహాస్ లేకుంటే డైరెక్టర్గా ఈ వేదికపైకి వచ్చేందుకు ఇంకా ఎన్నేళ్లు పట్టేదో తెలియదు’’ అన్నారు. ‘‘నేను నిర్మాతగా ఈ వేదికపై నిలబడటానికి అల్లు అరవింద్, అల్లు శిరీష్, ‘బన్నీ’ వాసుగార్లే కారణం. సుహాస్ లేకుంటే ఈ చిత్రం లేదు’’ అన్నారు ధీరజ్ మొగలినేని. -
బ్యాండ్ నేర్చుకున్నా.. రెండు సార్లు గుండు గీయించుకున్నా: సుహాస్
‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాకు ఎక్కువ రోజులు ప్రిపేర్ అయ్యాం. బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నా. కథలో బాగా కనెక్ట్ అవ్వాలని అనుకున్న సీన్స్ ప్రాక్టీస్ చేశాం. రెండు సార్లు గుండు గీయించుకున్నా. అలా రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ ను నమ్మి కష్టపడ్డాం. మా నమ్మకం, రెండేళ్ల కష్టం సక్సెస్ రూపంలో మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం’ అని సుహాస్ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. శివాని హీరోయిన్. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సుహాస్ మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలు.. ► ఈ కథలో జరిగిన ఇన్సిడెంట్స్ నేను రియల్ లైఫ్ లో చూడలేదు గానీ మా డైరెక్టర్ చూసిన సంఘటనలు కథలో సగం వరకు ఉంటాయి. తను చూసినవి, తనకు లైఫ్ లో జరిగిన కొన్ని సందర్భాల స్ఫూర్తి ఈ కథలో ఉంది. మిగతాది సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చేశాడు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" 2007 లో జరిగే కథ. ఈ సినిమా కథ ఇంటర్వెల్ ఇరవై నిమిషాల ముందు వరకు సరదాగా సాగుతుంది. అక్కడి నుంచి ఒక హైలోకి వెళ్తుంది. ఇంటర్వెల్ వరకు చూశాక సినిమా బాగా చేశారని ఫీల్ అవుతారు. ఆ తర్వాత మూవీ ఎమోషనల్ గా ఫీల్ తో సాగుతుంది. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలు సరదాగా సాగుతుంటాయి. కలర్ ఫొటోలో ఎమోషన్ కూడా ఉంటుంది. కానీ ఈ సినిమాలో హై ఎమోషన్ ఉంటుంది. రేపు సినిమా చూశాక ఇంత ఎమోషనల్ గా ఎలా నటించారని మీరే అడుగుతారు. ► నేను షార్ట్ ఫిలింస్ లో నటిస్తున్నప్పటి నుంచి డైరెక్టర్ దుశ్యంత్ తెలుసు. డియర్ కామ్రేడ్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మూవీస్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా తను వర్క్ చేశాడు. అప్పటి నుంచే నీతో సినిమా చేస్తా అనేవాడు. కలర్ ఫొటో మూవీ వచ్చాక...మీ వాళ్లతోనే హీరోగా చేసుకుంటావా నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా కదా అన్నాడు. అప్పుడు వెంటనే ఈ మూవీ స్టార్ట్ చేశాం. ► కలర్ ఫొటో సినిమాకు "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీకి ఎలాంటి పోలిక, సంబంధం లేదు. రెండూ వేటికవి భిన్నమైన కథలు. ఊరి నేపథ్యం వల్ల మీకు సిమిలర్ గా అనిపిస్తుంటాయి. ► "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాలో కులాల ప్రస్తావన ఉంటుంది కానీ సినిమా అసలు నేపథ్యం కులాల గురించి కాదు. మనుషుల మధ్య అహం ఎలాంటి అడ్డుగోడలు సృష్టిస్తుంది అనేది మెయిన్ పాయింట్. నేను, శరణ్య కవల పిల్లలం. మా పుట్టినరోజున జరిగిన సంఘటనలు జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పాయి అనేది ఈ మూవీలో కీలకంగా ఉండే అంశం. ► ఈ స్క్రిప్ట్ చదివేప్పుడు ఉన్న ఎగ్జైట్ మెంట్ మేకింగ్ టైమ్ లో మరింత పెరిగింది. ఇప్పుడు శేఖర్ చంద్ర ఇచ్చిన బీజీఎంతో చూసుకున్నప్పుడు మరో లెవెల్ కు వెళ్లింది. ఫైనల్ కాపీ చూశాక చాలా సంతృప్తిగా అనిపించింది. మూవీకి హీరోను కాబట్టి రిలీజ్ టైమ్ లో ప్రెజర్ ఫీలవుతాం. నా భుజాల మీదే సినిమాను మోస్తానని అంటారు కదా. ఆ మాట వింటే భయమేస్తుంటుంది. ► టైటిలో మ్యారేజి బ్యాండు అనేది ఉంది. అయితే ఊరు పేర్లు వేరేవి అనుకున్నాం కానీ పలికేందుకు బాగుందని అంబాజీపేట యాడ్ చేశారు. దుశ్యంత్, వెంకటేష్ మహా ఫ్రెండ్స్. దుశ్యంత్ చెప్పిన కథ నచ్చి వెంకటేష్ ధీరజ్ కు, గీతా ఆర్ట్స్ వాళ్లకు వినిపించి ప్రాజెక్ట్ సెట్ చేశాడు. ► అమలాపురంలో షూటింగ్ చేసినప్పుడు అక్కడి వాళ్లు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. హోటల్ లో టిఫిన్ చేసి డబ్బులు ఇచ్చినా తీసుకునేవారు కాదు. మా ఊళ్లో షూటింగ్ చేస్తూ డబ్బులు ఇస్తారా అనేవారు. వాళ్ల ప్రేమతో మాకు మాటలు రాకుండా చేశారు. ► హీరోయిన్ శివానికి ఈ సినిమా తర్వాత మంచి పేరొస్తుంది. ఆమె పర్ ఫార్మెన్స్ అంత బాగా చేసింది. శివాని డ్యాన్సర్, సింగర్ కూడా. అక్క క్యారెక్టర్ చేసిన శరణ్య గారు, విలన్ గా చేసిన నితిన్ కూడా ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ► నాకు రొమాంటిక్ సీన్స్ చేయాలంటే సిగ్గు. మా డైరెక్టర్స్ మందలిస్తుంటారు. ఈ మూవీలో రొమాంటిక్ సీన్స్ చేసేప్పుడు డైరెక్టర్ సందీప్ లాంటి వాళ్లు ఫోన్ చేసి దుశ్యంత్ కు చెప్పారు ఈ సీన్స్ సరిగ్గా చేయడు జాగ్రత్త అని. నీ కెరీర్ లో ఇంకెప్పుడు చేస్తావ్ బ్రో రొమాంటిక్ సీన్స్.. చేయి అని దుశ్యంత్ అనేవాడు. ► రైటర్ పద్మభూషణ్ కు ప్రీమియర్స్ వేయడం వల్ల మంచి టాక్ వచ్చింది. నా సినిమాలకు ప్రీమియర్స్ పడాలి. చూసిన వాళ్లు బాగుందని చెబితే మిగతా వాళ్లు బుకింగ్ చేసుకుని థియేటర్స్ కు వెళ్తారు. నాలాంటి హీరోలకు ప్రీమియర్స్ కు వచ్చే రెస్పాన్స్ చాలా ముఖ్యం. యూఎస్ లో రైటర్ పద్మభూషణ్ సినిమాకు 400 కె కలెక్షన్స్ వచ్చాయి. నా ఫస్ట్ యూఎస్ రిలీజ్ అది. ఇప్పుడు "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు 200 లొకేషన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. మంచి కలెక్షన్స్ వస్తాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నా. ► నేను చేసిన టైప్ కథలు కాకుండా కొత్తగా ఉండాలని కాన్సెప్ట్స్ తీసుకొస్తున్నారు. వాటిలో నేను నాకు నప్పేవి సెలెక్ట్ చేసుకుంటున్నా. హీరోగా కంటే నటుడిగా పేరు తెచ్చుకోవడమే ఇష్టం. హిట్ 2లో విలన్ గా నటించిన తర్వాత అలాంటివే చాలా ఆఫర్స్ వచ్చాయి. విలన్ రోల్స్ వద్దనుకుని మళ్లీ హీరోగా చేస్తున్నా. నాకు ఇంకొంత వయసు వచ్చాక మరికొన్ని భిన్నమైన క్యారెక్టర్స్ కు సెట్ అవుతా అనిపిస్తోంది. ఇప్పుడు చిన్నగా కనిపించడం వల్ల అన్ని రకాల క్యారెక్టర్స్ కు సెట్ కానేమో అనిపిస్తుంటుంది. ► కలర్ ఫొటో థియేటర్స్ లో రిలీజ్ అయితే బాగుండేది అని నా ఫ్రెండ్స్ అంటుంటారు. కానీ అప్పుడు అలా జరిగిపోయింది. ఓటీటీ అయినా మనకు మంచి గుర్తింపు వచ్చింది కదా అనిపిస్తుంది. ఆ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు మాకు మంచి గుర్తింపు దక్కిందని సంతోషపడ్డాం. ► రైటర్ పద్మభూషణ్ థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో అని భయపడ్డాం. ఆ మూవీకి లాభాలు వచ్చాయి. ఫర్వాలేదు మన సినిమా కూడా చూస్తున్నారనే సంతృప్తి కలిగింది. ఇంకా మంచి కంటెంట్ చేయాలి, జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా. ► కలర్ ఫొటో సందీప్ తో ఓ సినిమా చేయబోతున్నా. కథ చెప్పాడు. నెక్ట్ లెవెల్ లో ఉంది. ఆ మూవీకి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సుకుమార్ గారి అసోసియేట్ తో ప్రసన్నవదనం అనే ఒక సినిమా చేశా. అది కంప్లీట్ అయ్యింది. కేబుల్ రెడ్డి అనే మరో మూవీ చేస్తున్నా. దిల్ రాజు గారి బ్యానర్ లో సలార్ రైటర్ తో ఒక మూవీ జరుగుతోంది. -
‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’లో ఏ కులాన్ని కించపరచలేదు: నిర్మాత
‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’సినిమా ట్రైలర్ చూసి ఇందులో కులాల గురించి డిస్కషన్ ఉంటుందేమో అనుకుంటున్నారు. కానీ అలాంటిదేమీ ఉండదు. ఊరిలో జరిగే కథ కాబట్టి సహజంగా పెద్ద కులాలు, చిన్న కులాలు ఉంటాయి. అంతే గానీ ఒక కులాన్ని కించపరచడం గానీ మరో కులాన్ని గొప్పగా చూపించడం గానీ చేయలేదు’అని చిత్ర నిర్మాత ధీరజ్ మొగిలినేని అన్నారు. సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ధీరజ్ మిగిలినేని నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ధీరజ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు. ► ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇది కామెడీ మూవీ అనుకున్నారు. పాటలు రిలీజ్ చేశాక ఇది లవ్ స్టోరీ కావొచ్చని అన్నారు. ట్రైలర్ చూశాక సీరియస్ సబ్జెక్ట్ అని రివీల్ అయ్యింది. సుహాస్ కలర్ ఫొటో లాంటి మూవీ చేశాడు. పెద్ద హీరోల సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. తన నెక్ట్ మూవీ "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" అవ్వాలని సుహాస్ కోరుకున్నాడు. అలాగే ఎంతో కమిట్ మెంట్ తో కష్టపడి నటించాడు. సహాస్ పర్ ఫార్మెన్స్ ఎంత బాగుంటుందో స్క్రీన్ మీద చూస్తారు. మేము కూడా అతన్ని ఒక సీరియస్ సబ్జెక్ట్ లోనే చూపించాలని అనుకున్నాం. ► మా సినిమా ద్వారా ఎలాంటి సందేశం చెప్పడం లేదు. ఇలా ఉండాలని సూచించడం లేదు. ఒక ప్రాంతంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ను అలాగే సినిమాగా తెరకెక్కించి చూపిస్తున్నాం. ఇది మంచీ ఇది చెడు..ఇలా మారిపోండి అని ప్రేక్షకులకు చెప్పాలని అనుకోవడం లేదు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" ఒక ప్రేమ కథ మాత్రమే కాదు. ఇందులో లవ్ అనేది ఒక ఎలిమెంట్ మాత్రమే. సుహాస్ అక్క క్యారెక్టర్ లో స్కూల్ టీచర్ గా శరణ్య ప్రదీప్ నటించింది. ఆమెది కథలో ఒక కీ రోల్. కథలోని ప్రధాన భాగం ఆమె క్యారెక్టర్ చుట్టూ సాగుతుంది. శరణ్య క్యారెక్టర్ ద్వారా స్టోరీలోని కొన్ని అంశాలు చెప్పాం. ►మేము కథ వినే టైమ్ కు సుహాస్ కలర్ ఫొటో రిలీజైంది, రైటర్ పద్మభూషణ్ షూటింగ్ జరుగుతోంది. కథ విన్నప్పుడు ఈ క్యారెక్టర్ కు సుహాస్ అయితే యాప్ట్ అవుతాడు అని అనుకున్నాం. తను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశాడు. రెండు సార్లు గుండు చేసుకున్నాడు. కథలో భాగంగా వచ్చే కొన్ని సీన్స్ కోసం సుహాస్ గుండుతో కనిపించాలి. సహజంగా ఉండాలంటే విగ్ పెట్టుకోవద్దు. అయితే తొలిసారి గుండు చేయించుకున్నప్పుడు కొన్ని సన్నివేశాలను మాత్రమే షూట్ చేశాం. జుట్టు పెరిగిన తర్వాత మరిన్ని సన్నివేశాలకు గుండుతో కావాల్సి వచ్చింది. దీంతో సుహాస్ వెంటనే రెండో సారి గుండు చేయించుకున్నాడు. సుహాస్ బిజీ ఆర్టిస్ట్. కలర్ ఫొటో తర్వాత హీరోగా ఓ పది మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యారు. వాటి గురించి ఆలోచించకుండా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు"లో గుండు చేసుకుని నటించారు. ఆయన కమిట్ మెంట్ కు మేము సర్ ప్రైజ్ అయ్యాం. ►‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ లో హీరోయిన్ గా పేరున్న వారిని తీసుకుంటే కమర్షియల్ ఫీల్ వస్తుందేమో అనుకుని కొత్త వాళ్ల కోసం ఆడిషన్ చేశాం. శివానీ హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కోసం ఆడిషన్ కు వచ్చింది. అయితే ఆమె పర్ ఫార్మెన్స్ చూసి హీరోయిన్ గా తీసుకోవచ్చు అని డైరెక్టర్ అన్నారు. అలా మళ్లీ ఆమెను పిలిచి హీరోయిన్ క్యారెక్టర్ కు ఆడిషన్ చేశారు దుశ్యంత్. బాగా చేస్తుందనే కాన్ఫిడెన్స్ రావడంతో హీరోయిన్ గా తీసుకున్నాం. మేము అనుకున్నట్లే తన రోల్ బాగా ప్లే చేసింది. ►గీతా ఆర్ట్స్ లో చాలా పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలు చేస్తుంటారు. మేము ఈ మూవీని డిజైన్ చేసిందే కొత్తదనం కనిపించాలని. గీతా ఆర్ట్స్ గుడ్ విల్ కాపాడేలా ఉంటూనే ఒక ఫ్రెష్ నెస్, కొత్త వాళ్లతో సినిమా చేశాం. శరణ్య క్యారెక్టర్ కు మరో పేరున్న నటిని తీసుకోవచ్చు కానీ కథలోని ఆ ఒరిజినాలిటీ కనిపించాలంటే సీనియర్స్ వద్దనే అనిపించింది. ►అల్లు అరవింద్ గారు "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాను చూసి సంతోషంతో మమ్మల్ని హగ్ చేసుకున్నారు. చిన్న కరెక్షన్ కూడా చెప్పలేదు. సినిమా బాగా నచ్చడంతో రెండోసారి కూడా చూశారు. ►మా సినిమాకు శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయన చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. తన సంగీతంతో మా సినిమా ఫీల్ ను రెట్టింపు చేశారు. దర్శకుడు దుశ్యంత్ కథతో పాటే డైలాగ్స్ రాసుకుంటాడు. ఆయన కథ, డైలాగ్స్ లో నేటివిటీ కనిపిస్తుంటుంది. దర్శకులు కథ చెప్పినంత బాగా సినిమా చేయరు. కానీ దుశ్యంత్ కథ చెప్పినంత బాగా మూవీని రూపొందించాడు. టెక్నికల్ గా కూడా సినిమా ఆకట్టుకుంటుంది. ►ప్రస్తుతం రశ్మిక మందన్నతో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చేస్తున్నాం. ఈ సినిమా 40 శాతం షూటింగ్ చేశాం. ఈ ఏడాదే విడుదల చేస్తాం. మరో మూడు ప్రాజెక్ట్స్ రెడీ చేసుకుంటున్నాం. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తాను. -
‘అంబాజీపేట ..’ కోసం రెండు సార్లు గుండు చేయించుకున్నాను: హీరో
‘‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీ నాకెంతో స్పెషల్. ఈ సినిమా కోసం రెండు సార్లు గుండు చేయించుకున్నాను. బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నాను. మా సినిమాకు ప్రేక్షకులు మంచి సక్సెస్ అందిస్తారని ఆశిస్తున్నా’’ అని హీరో సుహాస్ అన్నారు. దుష్యంత్ కటికినేని దర్శకత్వంలో సుహాస్, శివానీ నాగరం జంటగా నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. (చదవండి: నెల తిరగకుండానే ఓటీటీలోకి రానున్న విజయ్ సేతుపతి థ్రిల్లర్ సినిమా) ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో దుష్యంత్ కటికనేని మాట్లాడుతూ– ‘‘కొన్ని వాస్తవ ఘటనలతో ఈ సినిమా తీశాం. లవ్ స్టోరీతో పాటు ఇంటెన్స్ డ్రామా ఉంటుంది’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు మా సంస్థకి ‘బేబీ’ వంటి బ్లాక్ బస్టర్ అందించారు. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’తో మరో సూపర్ హిట్ ఇస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు ధీరజ్ మొగిలినేని. -
సినిమా చూశాక మీ గుండె బరువెక్కుతుంది: హీరో సుహాస్
-
అంబాజిపేట మ్యారేజి బ్యాండు ట్రైలర్.. హీరోయిన్ చనిపోతుందా?
కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఓ మెట్టు ఎక్కేశాడు సుహాస్. కమెడియన్గా నవ్వులు పూయించడమే కాదు నటుడిగా కన్నీళ్లు పెట్టించగలనని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అతడు హీరోగా నటిస్తున్న చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. దుశ్యంత్ కటికనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శివానీ నాగరం హీరోయిన్గా యాక్ట్ చేసింది. బుధవారం (జనవరి 24న) ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. బ్యాండ్ కొట్టే అబ్బాయి ప్రేమలో పడ్డాక అతడి జీవితం ఎలా ఉంది? అతడి అక్క ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ఆమె కోసం ఈ హీరో ఏం చేశాడు? అన్నదే కథ. ప్రేమ, అవమానం, ప్రగ, ప్రతీకారాల సమ్మేళనమే అంబాజీపేట మ్యారేజి బ్యాండు. అయితే ట్రైలర్ చివర్లో చితి ముందు హీరో కూర్చుని ఏడుస్తున్నాడు. ఆ సమయంలో 'మన ప్రేమ నీ ప్రాణం మీదకు తేకూడదు మల్లి' అని హీరోయిన్ చెప్పిన డైలాగ్ వేశారు. అంటే ఈ మూవీలో హీరోయిన్ చనిపోతుందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఏదైతేనేం.. ట్రైలర్ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. కలర్ ఫోటో అంత పెద్ద హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతమందించారు. -
తండ్రి అయిన తెలుగు యంగ్ హీరో.. ఫొటో వైరల్
ప్రస్తుతం అందరూ శ్రీరామ నామజపం చేస్తున్నారు. అయోధ్య రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇలాంటి అద్భుతమైన రోజున ఓ తెలుగు హీరో సుహాస్ తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసి తన ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. ఆ తర్వాత పలు సినిమాల్లో కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్టు రోల్స్ చేశాడు. 'కలర్ ఫోటో' మూవీతో హీరోగా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది 'రైటర్ పద్మభూషణ్' అనే సినిమాతోనూ ఆకట్టుకున్నాడు. ఇతడు నటించిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్'.. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) తాజాగా సోమవారం (జనవరి 22)న తన భార్యకు మగబిడ్డ పుట్టినట్లు సుహాస్ వెల్లడించాడు. 'ప్రొడక్షన్ నం.1' అని ఓ ఫన్నీ క్యాప్షన్తో తను తండ్రి అయిన విషయాన్ని బయటపెట్టాడు. ఇకపోతే సుహాస్ భార్య పేరు లలిత. వీళ్లిది ప్రేమ వివాహం. దాదాపు ఏడేళ్లు పాటు ప్రేమించుకున్నారు. కానీ పెద్దలు నో చెప్పడంతో లేచిపోయి వచ్చి 2017లో పెళ్లి చేసుకున్నారు. ఇక లలిత.. తనకు భార్య అయిన తర్వాత చాలా కలిసొచ్చిందని సుహాస్ పలుమార్లు చెప్పుకొచ్చాడు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో భార్యతో ఉన్న ఫొటోలని సుహాస్ చేస్తుంటాడు. ఇప్పుడు వీళ్ల ప్రేమకు గుర్తుగా బుల్లి సుహాస్ వచ్చాడనమాట. (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) View this post on Instagram A post shared by Suhas (@suhassssssss) -
కాళభైరవ నోట ‘రారో మా ఊరు సిత్రాన్ని సూద్దాం’ పాట
సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివానీ నాగరం హీరోయిన్గా నటించింది. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ నిర్మించాయి. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇవాళ యంగ్ హీరో తేజ సజ్జ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" నుంచి 'మా ఊరు..' లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. పాట తనకు ఎంతో నచ్చిందన్న తేజ సజ్జ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. 'మా ఊరు....' సాంగ్ కు రెహ్మాన్ లిరిక్స్ అందించగా...శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు. కాళభైరవ పాడారు. 'రారో మా ఊరు సిత్రాన్ని సూద్దాం...ఇటు రారో ఈ బతుకు పాటను ఇందాం. ఈ సన్నాయి నొక్కుల్లోనా ఊరించే సంగతులెన్నో ఉన్నాయ్..'అంటూ వినగానే ఆకట్టుకునేలా సాగిందీ పాట. -
సుహాస్ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' రిలీజ్ డేట్ ఫిక్స్
సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'. ఇందులో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి అనే పాత్రని సుహాస్ చేశాడు. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దుశ్యంత్ కటికినేని దర్శకుడు. ఇప్పుడీ సినిమా రిలీజ్ తేదీని ప్రకటించారు. (ఇదీ చదవండి: Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వహకులు షాకింగ్ డెసిషన్) కామెడీ డ్రామా కథతో తీస్తున్న'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమా.. ఫిబ్రవరి 2న గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో శివాని నాగరం హీరోయిన్ కాగా శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. శేఖర్ చంద్ర సంగీతమందించారు. కొన్నిరోజుల 'గుమ్మ' అనే సాంగ్ రిలీజ్ చేయగా, సంగీత ప్రియుల్ని అది ఆకట్టుకుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే) The Intense & hard-hitting tale of 'Malligadu' is all set to unveil itself on the Big Screens 🔥🥁#AmbajipetaMarriageBand GRAND RELEASE WORLDWIDE ON 2nd FEBRUARY, 2024 ❤️🔥#BunnyVas @ActorSuhas @Shivani_Nagaram @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @KalyanKodati… pic.twitter.com/opDxatjM4V — Geetha Arts (@GeethaArts) December 26, 2023 -
‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’సినిమా టీజర్ ఈవెంట్ (ఫొటోలు)
-
అంబాజీపేట బ్యాండు
సుహాస్, శివానీ నాగరం జంటగా నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’. దుశ్యంత్ కటికినేని దర్శకుడు. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్పై నిర్మించారు. హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా టీజర్ విడుదలలో దర్శకులు మారుతి, హను రాఘవపూడి, శైలేష్ కొలను, సాయి రాజేశ్, సందీప్ రాజ్, ప్రశాంత్, మెహర్ రమేశ్, భరత్ కమ్మ, నిర్మాతలు ఎస్కేఎన్, శరత్ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘నాలాంటి కొత్త డైరెక్టర్కు చాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్, ‘బన్ని’ వాసు, వెంకటేష్ మహాగార్లకు, సుహాస్కి థ్యాంక్స్’’ అన్నారు దుశ్యంత్ కటికినేని. ‘‘నా కెరీర్లో ఈ మూవీ మైలురాయిగా నిలుస్తుంది’’అన్నారు సుహాస్. సినిమాటోగ్రాఫర్ వాజిద్ బేగ్, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడారు. -
ఆర్.నారాయణమూర్తికి సారీ చెప్పిన యంగ్ హీరో!
ఒకప్పటితో పోలిస్తే తెలుగు సినీ ఇండస్ట్రీ చాలా మారిపోయింది. కొత్త హీరోలు వస్తున్నారు. తమ అద్భుతమైన టాలెంట్తో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. అలా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోల్లో సుహాస్ ఒకడు. డిఫరెంట్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న ఇతడు.. ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తికి క్షమాపణలు చెప్పాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు రిలీజ్) ఏం జరిగింది? 'కలర్ ఫోటో' సినిమాతో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. ఈ ఏడాది 'రైటర్ పద్మభూషణ్' అంటూ వచ్చి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇతడు నటించిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ఈ కార్యక్రమం జరిగింది. అయితే సినిమా టైటిల్కి తగ్గట్లే ఈవెంట్ జరిగే చోట కూడా బ్యాండ్ సెటప్ చేసి, వాటిని వాయించారు. అయితే అక్కడికి కాస్త దగ్గర్లో ఉన్న ఆర్.నారాయణమూర్తి కాస్త చిరాకు పడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సుహాస్.. ఆయన దగ్గరకు వెళ్లి సారీ చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' టీజర్ కూడా బాగుంది. (ఇదీ చదవండి: ఆ స్టార్ డైరెక్టర్కి ఇంత అందమైన చెల్లెలు ఉందా? ఎవరో గుర్తుపట్టారా?) -
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండులో గట్టిగానే కొట్టిన మల్లిగాడు
కేరాఫ్ కంచర పాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేశ్ మహా. ఇప్పుడాయన సమర్పణలో సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. ఈ సినిమాకు దుశ్యంత్ కటికనేని దర్శకత్వం వహిస్తున్నారు.జీఏ2 పిక్చర్స్, స్వేచ్ఛ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. (ఇదీ చదవండి: సూర్యచంద్రులకు కూడా నిన్ను చూపించేదాన్ని కాదు: విజయ్ ఆంటోనీ భార్య) ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫోటో’ జాతీయ స్థాయిలో అవార్డు దక్కడంతో సుహాస్కు మంచి గుర్తింపు దక్కినా రైటర్ పద్మభూషణ్తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు మరింత చేరువయ్యాడు. తాజాగా ఆయన నుంచి వస్తున్న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు టీజర్ అందరినీ మెప్పించేలా ఉంది. మల్లిగాడు (సుహాస్) ఒక సెలూన్ నడుపుతూనే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో డప్పు కొడుతుంటాడు. అలాంటి వాడికి ఒక కాలేజీ అమ్మాయి పరిచయం కావడం.. వారిద్దరూ ప్రేమలో పడటం వల్ల ఎదరయ్యే సమస్యలు కథలు ప్రధానంగా ఉన్నట్లు టీజర్లో తెలుస్తోంది. టీజర్ చివరిలో సుహాస్కు గుండు కొట్టిస్తూ ఉన్న షాట్ హైలైట్గా ఉన్నా.. అందుకు ప్రధాన కారణాలు ఎంటి..? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది. టీజర్ చూస్తుంటే మల్లిగాడు బ్యాండ్ గట్టిగానే కొట్టినట్లు ఉన్నాడు. -
కేబుల్రెడ్డి కథ
సుహాస్ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘కేబుల్ రెడ్డి’. షాలిని కొండేపూడి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో బాలు వల్లు, ఫణి ఆచార్య, మణికంఠ జేఎస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను గురువారం విడుదల చేశారు. ‘‘2000 సమయంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో గ్రామీణ యువకుడిగా కనిపిస్తారు సుహాస్’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: మహి రెడ్డి పండుగుల. -
పట్టణంలో వినోదం
సుహాస్, షాలిని కొండేపూడి జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘కేబుల్ రెడ్డి’. శ్రీధర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు శ్రీధర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు శైలేష్ కొలను క్లాప్ కొట్టి, స్క్రిప్ట్ని మేకర్స్కు అందించారు. అనంతరం సుహాస్ మాట్లాడుతూ– ‘‘రెండు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఒక టౌన్లో జరిగే క్లీన్ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు శ్రీధర్ రెడ్డి. ‘‘బౌండెడ్ స్క్రిప్ట్తో షూట్కి వెళ్తున్నాం. మొదటి షెడ్యూల్ను 20 రోజుల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు బాలు వల్లు. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: మహి రెడ్డి పండుగల. -
కలర్ ఫోటో సుహాసిని విలన్ ని చేసిన కీర్తి సురేష్
-
కలర్ ఫోటో సుహాస్ ని విలన్ ని చేసిన కీర్తి సురేష్
-
పాఠ్యపుస్తకాల సలహాదారులుగా కొనసాగలేం
న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైయినింగ్(ఎన్సీఈఆర్టీ) పాఠ్యపుస్తకాల సిలబస్లో కోతలపై ప్రధాన సలహాదారులుగా వ్యవహరిస్తున్న సుహాస్ పల్షికర్, యోగేంద్ర యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 9 నుంచి 12వ తరగతి వరకు పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకాల సిలబస్ నుంచి కొన్ని అంశాల తొలగింపు ఏకపక్షంగా, అహేతుకంగా ఉందని వారు పేర్కొన్నారు. హేతుబద్ధీకరణ అంటూ పాఠ్యాంశాలను వికృతీకరించి, వాటిని విద్యాపరంగా పనికిరానివిగా మార్చారని ఆరోపించారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, అభిప్రాయం తెలుసుకోకుండా ఎన్సీఈఆర్టీ తీసుకున్న ఈ చర్య ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. ఆయా పాఠ్యపుస్తకాల్లో ప్రధాన సలహాదారుల జాబితాలో ఉన్న తమ పేర్లను వెంటనే తొలగించాలని కోరుతూ ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ సక్లానీకి లేఖ రాశారు. మహాత్మాగాంధీ మరణం దేశంలో మత సామరస్యతపై చూపిన సానుకూల ప్రభావం, ఆర్ఎస్ఎస్పై కొంతకాలం నిషేధం, 2002లో గుజరాత్ అల్లర్లు వంటి విషయాలను సిలబస్ నుంచి తొలగిస్తూ గత నెలలో ఎన్సీఈఆర్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. 2006–07లో ముద్రించిన ఎన్సీఈఆర్టీ 9 నుంచి 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకాలకు వీరిద్దరూ ప్రధాన సలహాదారులుగా ఉన్నారు. పల్షికర్, యోగేంద్ర యాదవ్ రాజనీతి శాస్త్ర నిపుణులు. కాగా, యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అనే సంస్థను నడుపుతున్నారు. -
సుహాస్ ' అంబాజీపేట మ్యారేజి బ్యాండు'.. ఆసక్తిగా ఫస్ట్లుక్ పోస్టర్
సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'. దుశ్యంత్ కటికనేని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై తెరకెక్కిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. సెలూన్ షాప్ ముందు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మెంబర్స్తో నిలబడి ఉన్న పోస్టర్ సినిమాపై ఆసక్తి కలిగిస్తోంది. మ్యారేజ్ బ్యాండ్లో పనిచేసే మల్లి అనే కుర్రాడి పాత్రలో సుహాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. కాగా.. మొదటి సినిమా కలర్ ఫోటోతోనే ఫేమ్ సంపాదించుకున్న సుహాస్ ఇటీవలే రైటర్ పద్మభూషణ్ సినిమాతో అలరించాడు. ప్రస్తుతం షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన వివరాలను త్వరలో చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది. గ్యాంగ్ ల్యాండ్ అయ్యింది... ఇంక బ్యాండ్ మోగిపోతుంది 🎺🥁 Here's the first look of #AmbajipetaMarriageBand 💥💥#BunnyVas @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @GA2Official @Mahayana_MP pic.twitter.com/WQ1EyPcwMt — Suhas 📸 (@ActorSuhas) April 11, 2023 -
సుహాస్ హీరోగా అంబాజీపేట మ్యారేజి బ్యాండు.. పోస్టర్ చూశారా?
క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా టర్న్ అయ్యారు సుహాస్. కలర్ ఫోటో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయాడు. ఇటీవలె రైటర్ పద్మభూషణ్ సినిమాతో హిట్టు కొట్టిన సుహాస్ తాజాగా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ అనే సినిమాతో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, 18 పేజెస్ వంటి సినిమాలతో సక్సెస్ అందుకున్న జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో సుహాస్ ఈ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ వేసవిలో మోత మోగించడానికి మల్లిగాడు వచ్చేస్తున్నాడు అంటూ మేకర్స్ పోస్టర్ను రిలీజ్ చేశారు. రేపు(మంగళవారం) సుహాస్ ఫస్ట్లుక్ను విడుదల చేస్తామని పేర్కొన్నారు. My next ☺️#AmbajipetaMarriageBand First look on 11th April 🔥💥 @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @GA2Official #SwechaCreations pic.twitter.com/iOqaIUGA2w — Suhas 📸 (@ActorSuhas) April 10, 2023 -
ఓటీటీకి 'రైటర్ పద్మభూషణ్'.. రిలీజ్ డేట్ ఫిక్స్
కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. టీనా శిల్పరాజ్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఓటీటీ రైట్స్ను జీ5 దక్కించుకుంది. ఈనెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. అసలు కథేంటంటే.. పద్మ భూషణ్ అలియాస్ రైటర్ పద్మభూషణ్(సుహాస్) విజయవాడలో లైబ్రేరియన్గా పని చేస్తుంటాడు. ఎప్పటికైనా గొప్ప రైటర్ కావాలని కలలు కంటాడు. అతని ఇష్టాన్ని ప్రోత్సహిస్తుంటారు తండ్రి మధుసూధన్రావు(అశిష్ విద్యార్థి), తల్లి సరస్వతి(రోహిణి). పద్మభూషన్ కష్టపడి ‘తొలి అడుగు’ అనే ఒక పుస్తకాన్ని రాస్తాడు. పేరెంట్స్కి తెలియకుండా అప్పుచేసి మరీ ఆ పుస్తకాన్ని పబ్లీష్ చేయిస్తాడు. కానీ ఆ పుస్తకాన్ని ఎవరూ కొనుగోలు చేయరు. ఉచితంగా ఇచ్చినా చదవరు. దీంతో తీవ్ర నిరాశకు గురవుతాడు. కట్ చేస్తే.. పద్మ భూషన్ పేరుతో మార్కెట్లోకి ఓ పుస్తకం వస్తుంది. అది బాగా సేల్ అవుతుంది. అంతేకాదు అతని పేరు మీద బ్లాగ్ కూడా రన్ అవుతుంది. దీంతో పద్మభూషన్ సెలెబ్రెటీ అవుతాడు. మేనల్లుడు గొప్ప రైటర్ అని కూతురు సారిక(టీనా శిల్పరాజ్)ని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్దమవుతాడు పద్మభూషన్ మామ లోకేంద్ర కుమార్(గోపరాజు రమణ). ఇష్టపడిన మరదలితో పెళ్లి అవుతుందన్న సమయంలో షాకింగ్ ట్విస్ట్ ఎదురవుతుంది. అదేంటి? రైటర్ పద్మభూషణ్ పేరుతో పుస్తకాలు రాసేది ఎవరు? ఎందుకు రాస్తున్నారు? మరదలు సారికాతో పద్మభూషణ్ పెళ్లి జరిగిందా లేదా? గొప్ప రైటర్ కావాలన్న పద్మ భూషణ్ కల నెరవేరిందా? లేదా? అనేదే మిగతా కథ. థియేటర్లలో మిస్సయినావారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. -
ఓటీటీలోకి రైటర్ పద్మభూషణ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ్నుంచి?
విలక్షణమైన పాత్రలతో గుర్తింపు పొందిన నటుడు సుహాస్. మజిలీ, ప్రతిరోజూ పండగే వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆకట్టుకున్న సుహాన్ హీరోగా నటించిన తొలి చిత్రం కలర్ ఫోటో. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రంలో సుహాస్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తాజాగా రైటర్ పద్మభూషణ్ సినిమాలోనూ హీరోగా అలరించాడు. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆశీష్ విద్యార్థి, రోహిణి, టీనా శిల్పరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిన్న సినిమాగా విడుదలైన రైటర్ పద్మభూషణ్ డీసెంట్ టాక్ను సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోనూ అలరించిందుకు రెడీ అయ్యింది.ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ5’ రైటర్ పద్మభూషణ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి 22న ఉగాది సందర్భంగా ఈ సినిమాను ఓటీటీలో అందుబాటులోకి తెచ్చేందుకు చూస్తున్నారట. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. Xclusive🔔 #Suhas 's #WriterPadmabhushan post theatrical digital streaming rights acquired by #Zee5 .. For more faster updates on OTT Info do follow @celerupdates pic.twitter.com/UyJdeaYCc3 — Celer Updates (@celerottupdates) February 4, 2023 -
రైటర్ పద్మభూషణ్ మూవీ.. హీరోయిన్ గురించి ఈ విషయాలు తెలుసా?
తెలుగు చిత్రపరిశ్రమలో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ’ అన్న మాటను తప్పని రుజువు చేస్తున్నారు ఎంతోమంది తెలుగు అమ్మాయిలు తమ ప్రతిభతో..! తాజాగా ఆ జాబితాలోకి చేరిన నటే టీనా శిల్పరాజ్. ఇటీవల రైటర్ పద్మభూషణ్ సినిమాలో టాలీవుడ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. యాక్టర్గా మనల్ని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన బలాలు, బలహీనతలు ఏంటీ? ఎక్కడ మనం బాగా చేయగలుగుతున్నాం. ఇంకా ఎక్కడ మెరుగుపరచుకోవాలి? ఇలా చాలా విషయాలను నేర్చుకున్నాను ఈ ప్రయాణంలో – టీనా శిల్పరాజ్ టీనా శిల్పరాజ్.. పక్కా హైదరాబాదీ. పుట్టింది, పెరిగింది, చదివింది అంతా హైదరాబాద్లోనే. చదువు పూర్తయిన వెంటనే నటనపై ఉన్న ఆసక్తితో మోడల్గా కెరీర్ ప్రారంభించింది. ఆమె అందానికి అభినయం కూడా తోడవటంతో అవకాశాలు ఆమె ఇంటి తలుపు తట్టాయి. ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ వెబ్ సిరీస్తో వీక్షకులకు పరిచయం అయింది. అయితే ఆమె చేసింది ఒక్క సిరీసే అయినా.. అందులో ఆమె నటనను మెచ్చి సినిమా ఛాన్స్ కూడా వచ్చి చేరింది ఆమె కాల్షీట్స్ డైరీలో. ఆడిషన్కు వెళ్లటం, సెలెక్ట్ అయ్యి సినిమాలో నటించడం, ఇప్పుడు ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటం అన్నీ చకచకా జరిగిపోయాయి. అదే ఆమె నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా. చిన్న సినిమా అయినా థియేటర్లలో సందడి చేసింది. -
చాలా అందమైన సినిమా: రష్మిక ప్రశంసల వర్షం
విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాన్. యూట్యూబ్ యాక్టర్గా కెరీర్ని ఆరంభించి.. కలర్ ఫోటోతో హీరో అయ్యాడు. ఈ తర్వాత ఫ్యామిలీ డ్రామా, హిట్ 2 చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ లో మెప్పించాడు. ఇక ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన సుహాస్ మూవీని పలువురు సినీతారలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ లిస్ట్లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా చేరిపోయింది. ఈ సందర్భంగా చిత్రబృందాన్ని ట్వీట్ చేసింది పుష్ప భామ. రష్మిక తన ట్విటర్లో రాస్తూ.. ' మీరు చాలా అందమైన సినిమా తీశారు. మీ చిత్రబృందాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న మీకు ప్రత్యేక అభినందనలు. ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి వెళ్లి ఈ చిత్రాన్ని చూస్తారని ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. మహిళల కోసం ప్రత్యేకంగా ఈనెల 8న ఉచిత షోలు ఏర్పాటు చేసినట్లు రైటర్ పద్మభూషణ్ చిత్రబృందం ప్రకటించింది. మాస్ మహారాజా రవితేజ సైతం రైటర్ పద్మభూషణ్ చిత్రాన్ని కొనియాడారు. సుహాస్ నటన అద్భుతంగా ఉందని.. ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేశానని తెలిపారు. క్లైమాక్స్ హృదయానికి హత్తుకునేలా ఉందని ప్రశంసించారు రవితేజ. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మరో హీరో నవీన్ పోలిశెట్టి సైతం రైటర్ పద్మభూషణ్ చిత్రబృందాన్ని అభిందిస్తూ ట్వీట్ చేశారు. You guys have made such a beautiful film..@SharathWhat @anuragmayreddy and @ActorSuhas Dear comrade to now- so so proud! ❤️Congratulations on this huge success you guys🤗🤗❤️ I hope all of you go give it a watch.. highly recommended for u my beautiful ladies❤️ and guess what.👇🏻 pic.twitter.com/t7NtOdO7ls — Rashmika Mandanna (@iamRashmika) February 7, 2023 What a performance by @ActorSuhas.Thoroughly enjoyed watching #WriterPadmabhushan. The climax is heart of the film❤️ Absolutely loved it. A must watch for all. Kudos to @anuragmayreddy @SharathWhat, director @prasanthshanmuk & young team for pulling off such a refreshing film — Ravi Teja (@RaviTeja_offl) February 7, 2023 So happy to see the response to #WriterPadmabhushan . The team deserves all the love. Go watch the film with your families if you haven’t yet. Congrats Agent Bobby @ActorSuhas . And super happy for my brothers @SharathWhat @anuragmayreddy ❤️ — Naveen Polishetty (@NaveenPolishety) February 7, 2023 -
మహిళల కోసం ‘రైటర్ పద్మభూషణ్’ టీం కీలక నిర్ణయం
కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషన్’. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని విజయవంతంగా కొనసాగుతుంది. సూపర్ స్టార్ మహేశ్బాబు, నేషనల్ క్రష్ రష్మిక సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఫ్యామిలీ ఆడియన్స్ తప్పక చూడాల్సిన చిత్రమని కామెంట్ చేశారు. తాజాగా మహిళల కోసం రైటర్ పద్మభూషణ్ చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు(ఫిబ్రవరి 8) తెలుగు రాష్ట్రాలలోని మహిళలకు ఈ చిత్రాన్ని ఉచితంగా చూపిస్తామని ప్రకటించింది. 38 థియేటర్లలో రైటర్ పద్మభూషణ్ చిత్రం నాలుగు షోలు ఉచితంగా ప్రదర్శిస్తామని వెల్లడించింది. 60 నుంచి 70 వేల మంది మహిళలకు ఫ్రీగా చిత్రాన్ని చూపించబోతున్నామని నిర్మాత శరత్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో పాసులు ఇస్తామని చెప్పారు. We humbly, respectfully and with all our heart invite the women across the telugu states to watch our film #WriterPadmabhushan tomorrow, without needing to buy a ticket. Theatres list also attached where this initiative is applicable. Details in next tweet: pic.twitter.com/SjhQ2sv3N3 — Sharath Chandra (@SharathWhat) February 7, 2023 -
రైటర్ పద్మభూషణ్పై మహేశ్బాబు ప్రశంసలు.. ఏడ్చేసిన సుహాస్
సుహాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. చిన్న సినిమా అయినా మంచి కంటెంట్తో పాటు చక్కని సందేశం ఉండడంతో ఈ సినిమాకు స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రంపై సూపర్స్టార్ మహేష్బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేశానని.. సుహాస్ నటన అద్భుతంగా ఉందని కొనియాడారు. అలాగే దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్, నిర్మాతలు శరత్చంద్ర, అనురాగ్రెడ్డిని కృషిని ప్రశంసించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. మహేష్ బాబు ట్వీట్లో రాస్తూ.. ’రైటర్ పద్మభూషణ్ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశా. హార్ట్ టచింగ్గా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయింది. కుటుంబంతో కలిసి తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమాలో సుహాస్ నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమాతో విజయాన్ని అందుకున్న శరత్, అనురాగ్ రెడ్డి, షణ్ముఖ ప్రశాంత్ అండ్ టీమ్ అందరికీ అభినందనలు.' అంటూ పోస్ట్ చేశారు ప్రిన్స్. అలాగే హీరో సుహాస్, దర్శకుడు, నిర్మాతలతో కలిసి ఉన్న ఫోటోని మహేశ్ బాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. Enjoyed watching #WriterPadmabhushan! A heartwarming film, especially the climax! ❤️ A must-watch for families! Loved @ActorSuhas' performance in the film! Congratulations @SharathWhat, @anuragmayreddy, @prasanthshanmuk & the entire team on its huge success 👍👍👍 pic.twitter.com/yCg2MEKpiY — Mahesh Babu (@urstrulyMahesh) February 6, 2023 ఏడ్చేసిన సుహాస్ రైటర్ పద్మభూషణ్పై మహేశ్ బాబు ప్రశంసలు కురిపించడంతో హీరో సుహాన్ భావోద్వేగాలను ఆపుకోలేక పోయాడు. ఈ ఆనందకర క్షణాలను తట్టుకోలేక ఏడ్చేశాడు. ఈ సందర్భంగా మహేశ్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు సుహాస్. Team : Endhuku Edusthunav? Me : Emo Vacchesthundhi 🥹 Super Size Thank you Sir🙏. Happy tears ❤️ https://t.co/DUHyhZqyjN — Suhas 📸 (@ActorSuhas) February 6, 2023 -
‘రైటర్ పద్మభూషన్’ మూవీ రివ్యూ
టైటిల్: రైటర్ పద్మభూషన్ నటీనటులు: సుహాస్,టీనా శిల్పారాజ్, ఆశిష్ విద్యార్థి, రోహిణి, శ్రీగౌరి ప్రియ, గోపరాజు రమణ, ప్రవీణ్ కఠారీ తదితరులు నిర్మాణ సంస్థలు: లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ దర్శకత్వం:షణ్ముక్ ప్రశాంత్ నిర్మాతలు: చంద్రు మనోహరన్, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంగీతం:శేఖర్ చంద్ర, కల్యాణ్ నాయక్ సినిమాటోగ్రఫీ:వెంకట్ ఆర్ శాఖమూరి విడుదల తేది: ఫిబ్రవరి 3, 2023 విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాన్. యూట్యూబ్ యాక్టర్గా కెరీర్ని ఆరంభించి.. కలర్ ఫోటోతో హీరో అయ్యాడు. ఈ తర్వాత ఫ్యామిలీ డ్రామా, హిట్ 2 చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ లో మెప్పించాడు. ఇక ఇప్పుడు రైటర్ పద్మభూషన్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. రైటర్ పద్మభూషణ్ కథేంటంటే.. పద్మ భూషణ్ అలియాస్ రైటర్ పద్మభూషన్(సుహాస్) విజయవాడలో లైబ్రేరియన్గా పని చేస్తుంటాడు. ఎప్పటికైనా గొప్ప రైటర్ కావాలని కలలు కంటాడు. అతని ఇష్టాన్ని ప్రోత్సహిస్తుంటారు తండ్రి మధుసూధన్రావు(అశిష్ విద్యార్థి), తల్లి సరస్వతి(రోహిణి). పద్మభూషన్ కష్టపడి ‘తొలి అడుగు’ అనే ఒక పుస్తకాన్ని రాస్తాడు. పేరెంట్స్కి తెలియకుండా అప్పుచేసి మరీ ఆ పుస్తకాన్ని పబ్లీష్ చేయిస్తాడు. కానీ ఆ పుస్తకాన్ని ఎవరూ కొనుగోలు చేయరు. ఉచితంగా ఇచ్చినా చదవరు. దీంతో తీవ్ర నిరాశకు గురవుతాడు. కట్ చేస్తే.. పద్మ భూషన్ పేరుతో మార్కెట్లోకి ఓ పుస్తకం వస్తుంది. అది బాగా సేల్ అవుతుంది. అంతేకాదు అతని పేరు మీద బ్లాగ్ కూడా రన్ అవుతుంది. దీంతో పద్మభూషన్ సెలెబ్రెటీ అవుతాడు. మేనల్లుడు గొప్ప రైటర్ అని కూతురు సారిక(టీనా శిల్పరాజ్)ని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్దమవుతాడు పద్మభూషన్ మామ లోకేంద్ర కుమార్(గోపరాజు రమణ). ఇష్టపడిన మరదలితో పెళ్లి అవుతుందన్న సమయంలో షాకింగ్ ట్విస్ట్ ఎదురవుతుంది. అదేంటి? రైటర్ పద్మభూషణ్ పేరుతో పుస్తకాలు రాసేది ఎవరు? ఎందుకు రాస్తున్నారు? మరదలు సారికాతో పద్మభూషణ్ పెళ్లి జరిగిందా లేదా? గొప్ప రైటర్ కావాలన్న పద్మ భూషణ్ కల నెరవేరిందా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. రైటర్ పద్మ భూషణ్ టైటిల్ అనగానే ఏదో కామెడీగా సాగే చిత్రం అనుకుంటాం. కానీ ఇందులో కామెడీతో పాటు మంచి సందేశం ఉంది. ఆడియన్స్ని నవ్వించడమే కాదు కొన్ని చోట్ల ఏడిపిస్తాడు పద్మ భూషణ్. అన్ని రకాల ఎమోషన్స్ ఉండేలా కథను అల్లుకున్నాడు దర్శకుడు షణ్ముఖ్ ప్రశాంత్. అలా అని ఇది కొత్త కథ కాదు. స్క్రీన్ప్లే, ట్విస్ట్లతో కథనం కొత్తగా సాగుతుంది. పద్మ భూషణ్ క్యారెక్టర్ని పరిచయం చేస్తూ సినిమా ప్రారంభించాడు . గొప్ప రైటర్గా పేరు తెచ్చుకోవాలని ఆశపడే పద్మభూషణ్.. హౌస్ వైఫ్గా ఇంటిపని చేసే తల్లి సరస్వతి, ఖర్చులన్నీ పోగా నెలకు 8000 మిగిలితే పొంగిపోయే తండ్రి మధు సూదనరావు పాత్రల చుట్టే ఫస్టాఫ్ సాగుతుంది. ఈ ముగ్గురి పాత్రలు క్రియేట్ చేసే ఫన్ బాగుంటుంది. ఇక పద్మభూషణ్ మరదలు సారిక ఎంట్రీ తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ అంతగా వర్కౌట్ కాలేదు కానీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడమే కాకుండా సెకండాఫ్పై ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. ఇక సెకండాఫ్లో కొత్త పుస్తకం రాసేందుకు పద్మభూషణ్ పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. అదేసమయంలో క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల గుండెను బరువెక్కేలా చేస్తాయి. అమ్మ కోసం చూడాల్సిన సినిమా ఇది. ఇంతకంటే ఎక్కువ చెబితే ట్విస్ట్ రివీల్ అయ్యే ప్రమాదం ఉంది. క్లైమాక్స్ ఒక్క సీన్ సినిమా స్థాయిని పెంచుతుంది. దర్శకుడికి ఇది తొలి సినిమా అయినా.. మంచి పాయింట్ని ఎంచుకొని, తెరపై అంతే మంచిగా చూపించాడు. ఎవరెలా చేశారంటే.. సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రల్లోనైనా ఈజీగా నటించగలడు. రైటర్ పద్మభూషణ్ పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన నటనతో నవ్విస్తూనే..కొన్ని చోట్ల ఏడిపించాడు. తల్లి పాత్రలు చేయడం రోహిణికి కొత్తేమి కాదు. గతంలో అనేక సినిమాల్లో హీరోకి తల్లిగా నటించింది. ఇందులో కూడా ఆమెది ఆ తరహా పాత్రే. సరస్వతి క్యారెక్టర్కు న్యాయం చేసింది. ఇక చాలా కాలం తర్వాత కామెడీ తరహా పాత్రలు చేశాడు ఆశిష్ విద్యార్థి. హీరో తండ్రిగా ఆయన చేసే కామెడీ బాగా వర్కౌట్ అయింది. సారిక పాత్రకి టీనా శిల్పరాజ్ న్యాయం చేసింది. శ్రీగౌరి ప్రియ, గోపరాజు రమణ, ప్రవీణ్ కఠారీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. శేఖర్ చంద్ర, కల్యాణ్ నాయక్ సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఈ వారం థియేటర్/ఓటీటీలో రానున్న సినిమాలివే..!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేయగా.. ఆ తర్వాత చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇక ఫిబ్రవరి మొదటి వారంలోనే పలు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ వారం సినీ ప్రేక్షకులకు కనువిందు చేయనున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. థియేటర్లతో పాటు ఓటీటీలో రిలీజ్కు సిద్ధమైన సినిమాలేవో ఓసారి చూసేద్దాం. సందీప్ కిషన్- మైఖేల్ టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించింది. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి3న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుహాస్- రైటర్ పద్మభూషణ్ కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రైటర్ పద్మభూషణ్. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టీనా శిల్పరాజ్ హీరోయిన్గా నటిస్తుంది.చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ఇప్పటికే పాజిటివ్ బజ్ను క్రియేట్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జయప్రద- సువర్ణ సుందరి సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. డాక్టర్ ఎమ్వీకే రెడ్డి సమర్పణలో ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న భారీ స్థాయిలో విడుదల కానుంది. ప్రేమదేశం త్రిగుణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమదేశం’. శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మధుబాల ప్రత్యేక పాత్రలో నటించారు. శిరీష సిద్ధమ్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది. బుట్టబొమ్మ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో అవార్డులు అందుకున్న అనిఖా సురేంద్రన్ తెలుగులో హీరోయిన్గా నటిస్తున్న చిత్రం బుట్టబొమ్మ. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్సిరీస్లు నెట్ఫ్లిక్స్ పమీలా (హాలీవుడ్) జనవరి 31 గంతర్స్ మిలియన్స్ (వెబ్సిరీస్) ఫిబ్రవరి 1 క్లాస్ (వెబ్సిరీస్- సీజన్-1) ఫిబ్రవరి 3 ట్రూ స్పిరిట్ ఫిబ్రవరి 3 ఇన్ఫయీస్టో (హాలీవుడ్) ఫిబ్రవరి 3 స్ట్రామ్ బాయిల్ ఫిబ్రవరి 3 వైకింగ్ ఊల్ఫ్ ఫిబ్రవరి 3 డిస్నీ+హాట్స్టార్ బ్లాక్ పాంథర్ వాఖండా ఫరెవర్ (హాలీవుడ్) ఫిబ్రవరి 1 సెంబి (తమిళ్) ఫిబ్రవరి 3 ఆహా అన్స్టాపబుల్ సీజన్-2 విత్ ఎన్బీకే- ఫిబ్రవరి 3 ముఖచిత్రం(తెలుగు)- ఫిబ్రవరి 3 కపుల్ ఆన్ బ్యాక్ట్రాక్( కొరియన్ మూవీ ఇన్ తెలుగు)- ఫిబ్రవరి 4 కామెడీ స్టాక్ ఎక్సేంజ్- ఫినాలే ఎపిసోడ్- ఫిబ్రవరి 4 సోనీలివ్ జహనాబాద్ ఆఫ్ లవ్ అండ్ వార్ (హిందీ) ఫిబ్రవరి 3 -
ఆ విషయంలో అనుమానమే లేదు: సుహాస్
‘‘రైటర్ పద్మభూషణ్’ ఎగ్జయిటింగ్గా ఉంటుంది. క్లైమాక్స్కి అందరూ కనెక్ట్ అవుతారు. మా సినిమా చూసిన ప్రేక్షకులు మంచి సినిమా చేశారని అభినందిస్తారు. ఆ విషయంలో అనుమానమే లేదు’’ అని హీరో సుహాస్ అన్నారు. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో సుహాస్, టీనా శిల్పరాజ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. జి. మనోహర్ సమర్పణలో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న రిలీజవుతోంది. సుహాస్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని ట్విస్టులను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2లో నేను నటిస్తున్న సినిమా పూర్తయింది. అలాగే ‘ఆనందరావు అడ్వంచర్స్’ అనే మరో సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
ఓ రచయిత ప్రయాణం
‘‘రైటర్ పద్మభూషణ్’ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. విజయవాడలోని ఓ మధ్య తరగతి యువకుడి కథ ఇది’’ అని దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ అన్నారు. సుహాస్, టీనా శిల్పరాజ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. జి. మనోహర్ సమర్పణలో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా షణ్ముఖ ప్రశాంత్ మాట్లాడుతూ– ‘‘నా దృష్టిలో కథని అమ్మలానే చూస్తాను. ఎంత బడ్జెట్ పెట్టినా మొదట కంటెంట్ రాయాల్సింది రచయితనే. అలాంటి ఒక రచయిత ప్రయాణం ఈ చిత్రంలో ఉంటుంది. ఇందులో హీరో ΄ాత్ర పేరు పద్మభూషణ్. తను రైటర్ కావాలనుకుంటాడు. మరి అయ్యాడా? లేదా అనేదే కథ. దర్శకులు జంధ్యాల, ఈవీవీ, శ్రీను వైట్లగార్ల సినిమాలంటే ఇష్టం. నా బలం కూడా కామెడీనే. మా సినిమాలో మంచి వినోదం ఉంటుంది’’ అన్నారు. -
అది చూసి నా భార్య నన్ను ఇంట్లోకి రానివ్వలేదు : సుహాస్
క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా టర్న్ అయ్యారు సుహాస్. కలర్ ఫోటో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయాడు. ఇటీవలె ఆయన నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా మరోసారి హీరోగా ‘రైటర్ పద్మభూషణం’గా థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అయిపోయాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుహాస్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేశాడు. లైఫ్లో కాస్త డిప్రెషన్లోకి వెళ్లిన సమయంలో ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇంట్లో వాళ్లకు, కనీసం ఫ్రెండ్స్కి కూడా చెప్పకుండా చేసుకున్నాను. ఇక పెళ్లి తర్వాత కెరీర్ ఊపందుకుంది. సినిమాల్లో వరుస ఛాన్సులు వచ్చాయి. రీసెంట్గా ఫ్యామిలీ డ్రామా సిరీస్లో సైకోగా నటించడంతో నా వైఫ్ చాలా బయపడింది. మూడు రోజులు నన్ను ఇంటికి కూడా రానివ్వకుండా ఆఫీస్లోనే పడుకోమని చెప్నింది. ఆ తర్వాత ఇంట్లో నార్మల్గా నవ్వుతున్నా సరే.. కాస్త భయపడేదంటూ చెప్పుకొచ్చాడు. -
Ashish Vidyarthi: ఆ బాధ్యత మాదే
‘‘తోటి నటీనటులతో పాటు యాక్ట్ చేస్తూ, నా పాత్రకు ఎంతవరకు న్యాయం చేస్తున్నాననే విషయంపై మాత్రమే నేను దృష్టి పెడతాను. అంతేకానీ ఇది చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు చూడను’’ అన్నారు నటుడు ఆశిష్ విద్యార్థి. సుహాస్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో జి. మనోహర్ సమర్పణలో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీ రోల్ చేసిన నటుడు ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ– ‘‘మంచి హ్యూమర్, ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. ఈ చిత్రంలో కొడుకు ఏదో సాధిస్తాడని ఆశపడే ఓ మధ్యతరగతి తండ్రి పాత్రలో నటించాను. కానీ ఈ తండ్రి జీవితంలో ఓ ట్విస్ట్ ఉంటుంది. ఈ సినిమాలో నాకు, రోహిణీగారికి మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘చేసే ప్రతి పాత్రను నేను డ్రీమ్ రోల్గానే భావిస్తాను. మొదట్లో విలన్ రోల్స్ చేశాను. అయితే నాకు కామెడీ అంటే ఇష్టం. కానీ నాకు అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంది. అయితే మనకు ఎటువంటి పాత్రలు ఇవ్వాలనేది దర్శక–రచయితలపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు మేం న్యాయం చేస్తామనే నమ్మకాన్ని వారిలో కలిగించే బాధ్యత మా ఆర్టిస్టులదే’’ అని అన్నారు. -
సుహాస్ హీరోగా నటించిన 'రైటర్ పద్మభూషణ్' ట్రైలర్ చూశారా?
కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రైటర్ పద్మభూషణ్. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టీనా శిల్పరాజ్ హీరోయిన్గా నటిస్తుంది.చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ఇప్పటికే పాజిటివ్ బజ్ను క్రియేట్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. రైటర్గా ఓ బుక్ రాసి దాన్ని పబ్లిష్ చేసే క్రమంలో హీరో సుహాస్ పడే కష్టాలను హిలేరియస్గా చూపించారు దర్శకుడు. నెలబడ్జెట్లో వెయ్యి రూపాయలు మిగిలిన పొంగిపోయే నాన్న, సీరియల్స్లో ట్విస్ట్లు ముందే కనిపెట్టే అమ్మ, రాబోయే కాలంలో కాబోయే గొప్ప రైటర్ను అని ఫీలయ్యే నేను అంటూ సుహాస్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. -
చిల్డ్రన్ ఫ్యాంటసీ కథతో ‘ఆనందరావు అడ్వెంచర్స్’
‘సుహాస్ హీరోగా రామ్ పసుపులేటి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆనందరావు అడ్వెంచర్స్’. ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే, సురేష్ కోతింటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభమైంది. ‘ఆనందరావు అడ్వెంచర్స్’ టైటిల్, ఫస్ట్ లుక్ని హీరో రానా రిలీజ్ చేయగా, దర్శకుడు క్రిష్ స్క్రిప్ట్ను టీమ్కి అందించారు. ‘‘చిల్డ్రన్ ఫ్యాంటసీ కథతో తెరకెక్కుతోన్న చిత్రమిది’’ అన్నారు రామ్ పసుపులేటి. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: రాకేష్ ఎస్. నారాయణ్, సహ నిర్మాతలు: సుహాసిని రాహుల్, మురళీ జంపన.