Suresh Babu
-
ఎమ్మెల్యే మాధవీరెడ్డి సహా 8మంది కార్పొరేటర్లు సస్పెండ్
-
పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్గా పబ్బ సురేశ్బాబు
ఢిల్లీ: ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (Press Club of India) మేనేజింగ్ కమిటీ మెంబర్గా తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టు పబ్బ సురేశ్బాబు విజయం సాధించారు. ఢిల్లీలోని పీసీఐలో ఎన్నికల పోలింగ్ శనివారం జరగగా.. ఆదివారం ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 1357 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 85 శాతం ఓట్లతో గౌతమ్ లహిరి ప్యానెల్ విజయం సాధించింది. తెలంగాణ బిడ్డ పాలమూరు జిల్లా నడిగడ్డ గద్వాల ప్రాంతానికి చెందిన పబ్బ సురేశ్ 773 ఓట్లతో మేనేజింగ్ కమిటీమెంబర్గా ఎన్నికయ్యారు. కాగా, ఫలితాల అనంతరం సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్గా గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్యానెల్ దేశ వ్యాప్తంగా జర్నలిస్తుల హక్కుల కోసం పార్లమెంట్ వేదికగా పోరాడుతుందని చెప్పారు. జర్నలిస్ట్ లపై ఎలాంటి దాడులు, సంఘటనలు జరిగినా ఖండించిడంతో పాటు.. వారికి న్యాయం చేకూర్చడంలో ముందుందన్నారు.ఇకపై తెలంగాణ, ఏపీ జర్నలిస్టుల వాయిస్ వినిపించేందుకు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. తన గెలుపుకోసం సహకరించి ఓట్లతో మద్దతు తెలిపిన పీసీఐ మెంబర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో గౌతమ్ లహిరి ప్యానెల్ మొత్తం బంపర్ మెజారిటితో గెలిచారు.పలువురు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. -
వరద బాధితుల కోసం ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..సురేష్ బాబు, దిల్ రాజు భారీ విరాళం
తెలుగు రాష్ట్రాల్లో వరద వల్ల నష్టపోయిన బాధితులకు సాయం చేసేందకు తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితులపే ఆదుకునేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తాజాగా ప్రకటించింది. నివేదిక సాయంతో బాధితుల కోసం సహాయ కార్యక్రమాలను చేపడుతామని ఫిల్మ్ ఛాంబర్ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని సినిమా థియేటర్ల వద్ద విరాళాలు, ఆహార వస్తువలను సేకరించేందుకు ఒక టీమ్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చాలామంది సినీ ప్రముఖులు విరాళాలు అందించారు. తాజాగా ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షలు విరాళం ప్రకటించింది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరపున ఏపీకి 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు అందిస్తుండగా ఫెడరేషన్ తరపున రెండు రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. దగ్గుబాటి కుటుంబం తరఫున ఇరు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు నిర్మాత సురేశ్ బాబు ప్రకటించారు. అనంతరం దిల్ రాజు కూడా తెలంగాణకు రూ. 25 లక్షలు, ఏపీకి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చిన వరదల వల్ల చాలామంది నిరాశ్రయులయ్యారు. దీంతో బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినీ పరిశ్రమ చేయబోతున్న యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు.ఈ సందర్భంగా ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'విజయవాడ, ఖమ్మంలో వరదలు రావడం వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి విపత్తులు ఎప్పుడు వచ్చినా సాయం చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలాగే ఈసారి కూడా ఎలాంటి సహాయసహకారాలు చేస్తే బాగుంటుంది అనేదానిపై చర్చించాము. ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీ, తెలంగాణకు విరాళంగా ప్రకటిస్తున్నాం. రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్కు సంబంధించి అకౌంట్ నంబర్స్ అలాగే, ఛాంబర్ నుంచి ఒక అకౌంట్ నంబర్ ఇస్తున్నాం. సహాయం చేయాలనుకునేవారు ఈ అకౌంట్స్కు డబ్బులు పంపించవచ్చు.' అని తెలిపారు.నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ.. 'ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మన పరిశ్రమ ఆదుకునే విషయంలో ముందుంటుంది. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమ అండగా ఉంటుంది. డబ్బు రూపంలోనే కాకుండా నిత్యావసరాలను కూడా అందించే ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.' అని చెప్పారు.నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'తెలుగు రాష్ట్రాల్లో వరదల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలామంది హీరోలు విరాళాలు అందించారు. అలాగే చాంబర్ నుంచి కూడా సహాయం చేయాలని నిర్ణయించాం. ఫెడరేషన్ పిలుపుమేరకు ఇండస్ట్రీలోని అందరూ ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కోరుతున్నాం. తద్వారా వచ్చిన విరాళాలను ప్రభుత్వాలకు అందిస్తాం.' అని చెప్పారు.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ..'మేము ఈ స్థాయికి రావడానికి కారణం ప్రజల ఆదరణే. ఇప్పుడు వాళ్లు కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం వాళ్లను ఆదుకోవాలి. అలాగే మాకు ఎప్పుడూ అండగా ఉండే ప్రభుత్వాలకు మద్దతును తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. అని చెప్పారు.ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ..'రేపు అన్ని యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఒకరోజు వేతనం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. మా కార్మికుల తరపున తెలుగు రాష్ట్రాలకు ఎంత చేయాలో అంతా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం.' అని చెప్పారు.నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..'వరద బాధితులను ఆదుకోవడం కోసం ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేశాం. తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేం ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని కమిటీ వాటిని తీర్చేలా ముందుకు వెళ్తుంది.' అని చెప్పారు. -
టీడీపీ పందికొక్కులకు కడప మేయర్ సురేష్ బాబు వార్నింగ్
-
నిన్ను చంపేస్తే మా నాన్న మేనేజ్ చేస్తారు
కర్నూలు కల్చరల్: తెలుగుదేశం నాయకుడి కుమారుడు, రాయలసీమ విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ పీజీ సీనియర్ విద్యార్థి రామ్ప్రకాష్ సోమవారం వీరంగం వేశాడు. తన జూనియర్ విద్యార్థి జి.సురేష్బాబును బయటినుంచి వచ్చిన స్నేహితులతో కలిసి దూషిస్తూ తీవ్రంగా కొట్టాడు. బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఫేర్వెల్ పార్టీకి సంబంధించి డాటా సైన్స్ ల్యాబ్లో డెకొరేషన్, క్యాటరింగ్, సౌండ్ సిస్టమ్ పనులను తాను చెప్పినట్లు చేయలేదని సురేష్బాబు మీద రామ్ప్రకాష్ దాడిచేశాడు. అతడితోపాటు బయటి నుంచి వచ్చిన అతడి స్నేహితులు కూడా సురేష్బాబును తీవ్రంగా కొట్టారు.దీనిపై సురేష్బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘మా నాన్న టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జేమ్స్. నిన్ను కొట్టి చంపేస్తే ఎస్పీని మ్యానేజ్ చేస్తారు. కర్నూలులో ఉన్న సీఐలను, ఎస్ఐలను మ్యానేజ్ చేస్తారు. దాడిచేసినట్లు పోలీస్స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నేను నిన్ను చంపేస్తా..’ అని రామ్ప్రకాష్ వార్నింగ్ ఇచ్చినట్లు సురేష్బాబు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారినుంచి తనకు ప్రాణహాని ఉందని తెలిపాడు.ఈ విషయమై వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సముద్రాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గొడవ జరిగినట్లు తమకు ఆలస్యంగా తెలిసిందన్నారు. సురేష్బాబుతో మాట్లాడామని, బయటి వ్యక్తులు వచ్చి దాడిచేసినట్లు తెలిస్తే కేసు పెడతామని చెప్పారు. రామ్ప్రకాష్ తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడతామన్నారు. వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఎన్.టి.కె.నాయక్ సమక్షంలో మంగళవారం ఇద్దరు విద్యార్థులతో మాట్లాడి జరిగిన విషయం తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘కాంచనగంగ’పై నవరత్నాల బ్యానర్ ప్రదర్శించిన సురేష్బాబుగాయపడిన సురేష్బాబు పర్వతారోహకుడు. 2022 మే 21న ప్రముఖ పర్వతాల్లో ఒకటైన కాంచనగంగ పర్వతాన్ని అధిరోహించి అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల బ్యానర్ను ప్రదర్శించాడు. రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిన ఇలాంటి విద్యార్థిపై దాడిచేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
తిరుమలలో టాలీవుడ్ నిర్మాత సురేశ్ బాబు, తమన్, గోపిచంద్ మలినేని (ఫొటోలు)
-
జగన్ పై ఎల్లో మీడియా దుష్ప్రచారం సురేష్ బాబు ఫైర్
-
వైఎస్ జగన్ ఎంపీగా పోటీ చేస్తారనేది అవాస్తవం
కడప (కార్పొరేషన్): వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తారనేది శుద్ధ అబద్ధమని పార్టీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్ బాబు ఆక్షేపించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదికగా టీడీపీ దు్రష్పచారానికి పూనుకోవడం దారుణమన్నారు. ఈ ఊహా జనిత కథనం సృష్టికర్త టీడీపీ అని ధ్వజమెత్తారు.వైఎస్ జగన్ కడప ఎంపీగా పోటీ చేస్తారని, వైఎస్ అవినాశ్రెడ్డి పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని సోషల్ మీడియాలో వాళ్లే పోస్ట్ చేయడం.. ఆపై ఆంధ్రజ్యోతిలో ఊహాగానాలు, కలి్పతాలతో కథనం రాయించడం, దానిపై చంద్రబాబు శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ స్పందించడం మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమేనన్నారు. ప్రజలను గందరగోళపరిచేందుకే ఇలా చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.వైఎస్ కుటుంబంలో చిచ్చుపెట్టేలా రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. 2011లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పామని, ఇప్పుడొచ్చి తెలంగాణ సీఎం రేవంత్ గల్లీ గల్లీ తిరుగుతాననడం హాస్యాస్పదమన్నారు. ఉచిత ఇసుక ఇస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం ట్రాక్టర్ ఇసుకకు రూ.1,700 వసూలు చేస్తోందన్నారు. ట్రాక్టర్ ఇసుకను కడప తెచ్చుకునేసరికి రూ.3,500 అవుతోందన్నారు. -
కడప దెబ్బ.. ఢిల్లీ అబ్బా.. సీఎం రేవంత్ కు అదిరిపోయే కౌంటర్..
-
షష్టి పూర్తి!
తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రోడక్షన్స్ షష్టి పూర్తి (60 ఏళ్లు) ప్రయాణం పూర్తి చేసుకుంది. పద్మభూషణ్, దివంగత నిర్మాత డా. డి. రామానాయుడు 1964లో స్థాపించిన సురేష్ ప్రోడక్షన్స్ భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా పేరు పొందడంతో పాటు ప్రేక్షకుల మన్ననలను పొందింది. ప్రకాశం జిల్లా కారంచేడులో రైతు కుటుంబంలో పుట్టారు రామానాయుడు. రైసు మిల్లు వ్యాపారం చేస్తున్న సమయంలో ఆయన మద్రాసు వెళ్లారు. అక్కడ కొందరు సినీ ప్రముఖుల పరిచయం ఆయన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. భాగస్వామ్యంతో ‘అనురాగం’ చిత్రం నిర్మించారు రామానాయుడు.ఆ చిత్రం విజయవంతం అయింది. ఆ తర్వాత తన పెద్ద కుమారుడు సురేష్బాబు పేరుతో సురేష్ ప్రోడక్షన్స్ స్థాపించి, ఎన్టీఆర్తో ‘రాముడు–భీముడు’ (1964) సినిమా నిర్మించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. అప్పట్నుంచి పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తూ వస్తోంది సురేష్ ప్రోడక్షన్స్. శతాధిక చిత్రాల నిర్మాతగా రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లో స్థానం సంపాదించుకున్నారు. అలాగే అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించాలన్న తన సంకల్పాన్ని నెరవేర్చుకుని, చరిత్ర సృష్టించారు రామానాయుడు.2015 ఫిబ్రవరి 18న ఈ మూవీ మొఘల్ తుది శ్వాస విడిచారు. అప్పటికే తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను నిర్వర్తిస్తున్న సురేష్బాబు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. రెండో కుమారుడు వెంకటేశ్ హీరోగా కొనసాగుతున్నారు. మనవడు రానా నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. రానా సోదరుడు అభిరామ్ కూడా హీరో (‘అహింస’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు)గా చేసిన విషయం తెలిసిందే. ఇక సురేష్ ప్రోడక్షన్స్ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రయాణంలో భాగమైన అందరికీ నిర్మాణ సంస్థ కృతజ్ఞతలు తెలియజేసింది. -
CM Jagan: సింహంలా ఒక్కరే వస్తారు
సాక్షి, అన్నమయ్య: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. మంగళవారం అన్నమయ్య జిల్లాలో రాజంపేట నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర జరుగుతోంది. రాజంపేట బహిరంగ సభలో వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు మాట్లాడారు. ఇప్పటివరకు ఎంతో మంది ముఖ్యమంత్రులను చేశామని, కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం సామాజిక సాధికారత సాధించి చరిత్ర తిరగరాశారని అన్నారు. సీఎం జగన్ ఎంతో మంది సామాన్యులకు పదవులిచ్చారని తెలిపారు. బీసీలను రాజ్యసభకు పంపిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. మళ్లీ కొందరు అబద్దపు హామీలతో మోసం చేసేందుకు వస్తున్నారని అన్నారు. వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. వైఎస్ జగన్ను అశీర్వదించండని కోరారు. రాజంపేట ప్రజలు అదృష్టవంతులని.. రామలక్ష్మణుల్లా మల్లికార్జునరెడ్డి, అమరనాథ్రెడ్డిలు రాజంపేటను కాపాడుతున్నారని డిప్యూటి సీఎం అంజాద్ బాషా అన్నారు. రాజంపేట బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మల్లికార్జునరెడ్డి, అమరనాథ్రెడ్డి వంటి నాయకులు రాజంపేటకు ఉండటం అదృష్టమని తెలిపారు. సామాజిక న్యాయాన్ని ఇంత వరకు ఎప్పుడైనా చూశామా? బీసీలు తనకు పేటెంట్ అని చెప్పిన చంద్రబాబు బీసీలను వాడుకొని వదిలేశారని ఆరోపించారు. కానీ ఆచరణలో సీఎం వైఎస్ జగన్ చేసి చూపారని గుర్తుచేశారు. ఇంటికొకరు ఇంజనీరు, వైద్యలు ఉండాలని ఆనాడు దివంగత వైఎస్సార్ ఆశించారని తెలిపారు. ఇప్పుడు ఆయన తనయుడు అదే పరిపాలనను కొనసాగిస్తున్నారని అన్నారు. టీడీపీ హాయంలో మైనార్టీ మంత్రి, ఎమ్మెల్యే లేరని, ఓట్ల కోసమే చివరలో ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారని మండిపడ్డారు. అదే వైఎస్ జగన్ మైనార్టీని డిప్యూటి సీఎంను చేశారని గుర్తుచేశారు. అనేక మందిని కార్పోరేషన్లకు చైర్మన్లుగా చేశారని పేర్కొన్నారు. కేవలం జగన్ను ఎదుర్కొవడానికి అన్ని పార్టీలు ఎకమవుతున్నాయని అన్నారు. ఎంతమంది ఏకమైనా సింహంలా జగన్ ఒక్కరే వస్తారని తెలిపారు. సీఎం జగన్ను ప్రతి ఒక్కరు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని అంజాద్ బాషా అన్నారు. రాజంపేటలో అభివృద్ది జరిగిందంటే దివంగత వైఎస్అర్, వైఎస్ జగన్ హాయంలోనే జరిగిందని కడప జడ్పీ ఛైర్మన్ అకేపాటి అమరనాధరెడ్డి తెలిపారు. రాజంపేట బహిరంగ సభలో అకేపాటి అమరనాధరెడ్డి మాట్లాడారు. రాజంపేటలో తాగునీరు సమస్య లేదంటే అది వైఎస్అర్ చలువే అన్నారు. రాజంపేటకు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, తాను ప్రజలకు వాచ్మెన్లలా ఉన్నామని, అందరికీ అండగా ఉన్నామని తెలిపారు. ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించి రాష్టంలో సీఎంగా వైఎస్ జగన్ గెలిపించాలని అన్నారు. అన్ని కులాలపై ప్రేమ చూపిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. అందరినీ విద్యావంతులను చేయ్యాలని అనేక సంస్కరణలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడున్న పథకాలన్ని అమలవ్వాలంటే మళ్లీ జగనే రావాలని తెలిపారు. -
ఘనంగా టాలీవుడ్ హీరో రానా తమ్ముడి పెళ్లి.. వధువు ఎవరో తెలుసా?
టాలీవుడ్ నిర్మాత సురేశ బాబు తనయుడు అభిరామ్ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. రానాకు తమ్ముడైన అభిరామ్ వరసకు మరదలైన ప్రత్యూష అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. శ్రీలంకలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్కు బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరలవుతున్నాయి. దాదాపు మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుక జరిగింది. కాగా.. ఇటీవలే వరుణ్ తేజ్ సైతం పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేశ్ బాబుకి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి రానా ఇప్పటికే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రెండో అబ్బాయి అభిరామ్ కూడా 'అహింస' అనే మూవీతో టాలీవుడ్లో హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఈ మూవీ అంత గుర్తింపు తీసుకురాలేదు. దీంతో కొన్నాళ్లు గ్యాప్ తీసి సినిమాలు చేస్తానని ప్రకటించాడు. అతను ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్లోనూ నటించడం లేదు. దీంతో పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. దగ్గుబాటి కుటుంబంలోకి అడుగుపెట్టనున్న అమ్మాయి స్వస్థలం కారంచేడు అని తెలుస్తోంది. View this post on Instagram A post shared by South Celebrity (@southcelebrity.insta) -
అలాంటి రాజకీయ నాయకులను చూస్తే కోపం వస్తుంది నాకు
-
రానా డ్రగ్స్ కేసు పై సురేష్ బాబు రియాక్షన్
-
ఆత్రేయ, వేటూరి గారు పెద్ద రైటర్స్..కానీ తప్ప తాగి..!
-
ఆఖరికి పవన్ కళ్యాణ్ సినిమా అయినా అంతే అంటున్న సురేష్ బాబు
-
మనకు వద్దు నాన్న అని చెప్తే వినలేదు..!
-
నా తమ్ముడి సినిమా పెద్ద హిట్ కావాలని చాలా కష్టపడ్డా..!
-
నా తమ్ముడి సినిమా వల్లే.. పవన్ తో గొడవ..!
-
నేను సంతోషంగా లేకపోవడానికి కారణం ఇదే
-
నా పెద్ద కొడుకు చాలా పిరికివాడు..!
-
చంద్రబాబు అరెస్ట్.. సినిమా వాళ్లు స్పందించడం సరికాదు: సురేశ్ బాబు
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అరెస్ట్ ఖండించాలంటూ టాలీవుడ్ ప్రముఖులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. అయినప్పటికీ వారి నుంచి పెద్ద రెస్పాన్స్ రావట్లేదు. ఏ ఒక్క హీరో కూడా స్పందించలేదు. డైరెక్టర్ రాఘవేంద్రరావు, అశ్వినీదత్తో పాటు నట్టి కుమార్ మాత్రమే చంద్రబాబు అరెస్ట్ని ఖండించారు. బడా నిర్మాతలు, హీరోలు ఎవరూ స్పందించకపోవడంతో పలువురు టీడీపీ నాయకులు వారికి ఫోన్లు చేసి మరీ బ్రతిమిలాడుతున్నారట. (చదవండి: ఎన్టీఆర్పై చెప్పులు విసరడం నా కళ్లారా చూశా: మోహన్ బాబు) ఇదిలా ఉంటే..తాజాగా ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంపై స్పందించాడు. సినిమా వాళ్లు రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా సినిమా వ్యాపారం చేసుకోవడం మంచిదని హితవుపలికారు. తాజాగా ఆయన సప్త సాగరాలు అనే సినిమా ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్పై మీ స్పందన ఏంటని ఓ విలేకరి ప్రశ్నించగా ..సినిమా రంగం రాజకీయాలకు దూరంగా ఉండడమే మంచిదన్నారు. ‘ఇండస్ట్రీ ఎప్పుడూ రాజకీయాలకు, మతాలకు అతీతంగా ఉంటుంది. చాలా మంది పరిశ్రమ పెద్దలు ఇలానే ఉన్నారు. కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు పెట్టుకున్నప్పటికీ, ఇండస్ట్రీకి రాజకీయం ఆపాదించలేదు. చంద్రబాబు అరెస్ట్ అనేది సున్నితమైన అంశం. దీనిపై ఇండస్ట్రీ స్పందించాల్సిన అవసరం లేదు. మేం రాజకీయ నాయకులం కాదు.. మీడియా కాదు.. మేం మూవీ మేకర్స్. సినిమాలు మాత్రమే తీస్తాం. చాలా మంది స్టేట్మెంట్ ఇవ్వమంటారు. ఏం ఇస్తాం? రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ప్రతి అంశంపై స్టేట్మెంట్ ఇవ్వలేం కదా? తెలుగు దేశం పార్టీకీ సంబంధించిన వ్యక్తులు అయినప్పటికీ చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో సినిమా వాళ్లు స్పందించడం సరికాదు. ఇండస్ట్రీలో రాజకీయాలు ఉండకూడదని నా అభిప్రాయం’అని సురేశ్ బాబు అన్నారు. -
చంద్రయాన్–3లో దేవగుప్తం శాస్త్రవేత్త సురేశ్ బాబు
అల్లవరం: చంద్రుడి దక్షిణ ధృవంపైన ల్యాండర్ను దించిన తొలి దేశంగా భారత్ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. మన రాష్ట్రంలోని శ్రీహరికోట నుంచి చంద్రయాన్–3ని ప్రయోగించగా ఈ క్రతువులో ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పాలుపంచుకున్నారు. వీరిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం గ్రామానికి చెందిన శాస్త్రవేత్త బలభద్ర సురేష్బాబు ఒకరు. చంద్రయాన్–3 ప్రాజెక్టు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్సీ) క్రయోజెనిక్ విభాగంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఒక మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టినా సురేశ్ బాబు కుంగిపోలేదు. గ్రామంలోనే పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. విఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆయనలా తాను ప్రముఖ శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకోవాలనుకున్నారు. అమలాపురంలోని ఎస్కేబీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదివిన సురేశ్ బాబు తణుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత ట్రిఫుల్ ఐటీ బెంగళూరులో విద్యనభ్యసించి త్రివేండ్రంలోని ఇస్రో కేంద్రంలో తొలి పోస్టింగ్ పొందారు. చంద్రయాన్–3లో కీలక పాత్ర పోషించడం ద్వారా ఎట్టకేలకు తన ఆకాంక్షను నెరవేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో దేవగుప్తం సచివాలయంలో శాస్త్రవేత్త సురేశ్ బాబు తల్లిదండ్రులు సత్యభారతి, కామేశ్వరరావులను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు సాధనాల వెంకటరావు మాట్లాడుతూ.. చంద్రయాన్ విజయంలో గ్రామానికి చెందిన సురేశ్ బాబు కీలక పాత్ర పోషించడం దేశానికే గర్వకారణమని అభివర్ణించారు. నిరుపేద కుటుంబంలో పుట్టినా ఉన్నత స్థాయికి ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన మరిన్ని విజయాలు సాధించి గ్రామానికే కాకుండా, దేశానికి కూడా కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. సురేశ్ బాబు తండ్రి కామేశ్వరరావు మాట్లాడుతూ.. తన కుమారుడికి చిన్నప్పటి నుంచి ప్రశ్నించే తత్వం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు తిక్కిరెడ్డి శ్రీను, సుందరనీడి సాయి, ఎంపీటీసీ ముత్తాబత్తుల రాంబాబు, హెచ్ఎం వేణుగోపాల్, ఏఎంసీ డైరెక్టర్ ఈతకోట సతీష్, జగనన్న గృహ సారథుల కన్వీనర్ కుడుపూడి సూర్యప్రకాశరావు, వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పెచ్చెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నా తమ్ముడు అభిరామ్ ‘అహింస’ అలరిస్తుంది: రానా
సాక్షి, ప్రకాశం(చీరాల): మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు మనవడు, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్బాబు తనయుడు ప్రముఖ హీరో దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ చిత్రరంగంలోకి అరంగ్రేటం చేస్తున్న మొదటి సినిమా అహింస ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా జరిగింది. శనివారం రాత్రి చీరాలలో స్థానిక ఎన్ఆర్అండ్పీఎం హైస్కూల్ గ్రౌండ్స్లో ఈ వేడుక నిర్వహించారు. సినీ నటీనటులను చూసేందుకు వేల సంఖ్యలో సినీ అభిమానులు, దగ్గుబాటి అభిమానులు తరలి రావడం విశేషం. ఉదయభాను యాంకర్గా వ్యవహరించి ప్రేక్షకులను అలరించారు. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పాటలను పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్, హీరోయిన్ దీపిక దివని, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, డైరెక్టర్ తేజ, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, వైఎస్సార్ సీపీ ఇన్చార్జి కరణం వెంకటేష్లు హాజరయ్యారు. (చదవండి: సీరియల్ హత్యలు, పోలీసుల ఈగో.. కేసు చేధిస్తారా?) ఎమ్మెల్యే బలరాం మాట్లాడుతూ రామానాయుడు కుటుంబం నుంచి మరో హీరో సినీ అరంగ్రేటం చేయడం శుభపరిణామమన్నారు. తెలుగు సినీఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దగ్గుబాటి కుటుంబం ఎన్నో సందేశాత్మక చిత్రాలను రూపొందించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిందన్నారు. నూతన హీరో అభిరామ్ను అందరు ఆదరించాలన్నారు. దగ్గుబాటి కుటుంబంతో తమకు సన్నిహిత కుటుంబ సంబంధాలు ఉన్నాయని నూతన సినీమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చీరాలలో నిర్వహించడం గొప్ప విషయమన్నారు. సినీరంగానికి, చిత్రాల నిర్మాణానికి చీరాల నియోజకవర్గం అనుకూలమన్నారు. అహింస చిత్రం ప్రేక్షకులు ఆదరించి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాలన్నారు. సినీ హీరో దగ్గుబాటి రానా మాట్లాడుతూ తన తమ్ముడు అభిరామ్ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం అందరిని అలరిస్తుందని, ప్రేక్షకులు ఆదరించి విజయాన్ని చేకూర్చాలన్నారు. ప్రజల అభీష్టంతో ప్రేక్షకులను హత్తుకునేలా చిత్రాన్ని రూపొందించి చక్కని పాటలు, సంగీతం ఇచ్చామన్నారు. చీరాలతో మాకు విడదీయరాన్ని సంబంధం ఉందని తమ కుటుంబం సినీరంగం, సేవా కార్యక్రమాలు, రాజకీయాల్లో చెరగని ముద్రను పొందామని, నూతన నటీనటులను ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు. -
సుధీర్ పక్కన హీరోయిన్ ఎలా సిగ్గు పడుతుందో చూడండి
-
‘భారతీయన్స్’ టీజర్ బాగుంది: సురేశ్ బాబు
ప్రముఖ రచయిత, ప్రేమకథా చిత్రాల స్పెషలిష్ట్ (ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా ఫేమ్) దీన్ రాజ్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘భారతీయన్స్’. నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, హీరోలుగా... సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత నిర్మించారు. (చదవండి: యంగ్ హీరోతో కలిసి స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్) తాజాగా ఈ చిత్రం టీజర్ని ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు రిలీజ్ చేసి, చిత్ర యూనిట్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తమ సంస్థకు "ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా" వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దీన్ రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్న "భారతీయన్స్" బిగ్గెస్ట్ బ్లస్టర్ కావాలని ఆకాంక్షించారు. (చదవండి: ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!) దర్శకుడు దీనరాజ్ మాట్లాడుతూ ''దేశభక్తి సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని ఈ కథ రాశా. మా నిర్మాతకు కూడా దేశభక్తి ఎక్కువ. కథ నచ్చి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే చిత్రమిది. భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ప్రశంసలు అందుకున్న మా చిత్రం టీజర్ ను సురేష్ బాబు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది'అని అన్నారు. హీరో నీరోజ్ మాట్లాడుతూ ''హీరోగా నాకు ఫస్ట్ సినిమా ఇది. అవకాశం ఇచ్చిన నిర్మాత శంకర్ గారికి, దర్శకులు దీన్ రాజ్ గారికి థాంక్స్'' అని అన్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సత్య కశ్యప్ & కపిల్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. -
మన్యంరాజు టీజర్ బాగుంది: సురేశ్బాబు
‘‘మన్యంరాజు’ టీజర్ చాలా ఆసక్తిగా ఉంది. సినిమా చూడాలనే కుతూహలాన్ని రేపుతోంది. ఈ చిత్రం హిట్ అయి, యూనిట్కి మరిన్ని అవకాశాలు తీసుకురావాలి’’ అని నిర్మాత డి.సురేశ్ బాబు అన్నారు. జీవన్, బేబీ పరిణిక జంటగా బీయమ్ సోముసుందరం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మన్యంరాజు’. వాయుపుత్ర ఆర్ట్స్పై విజయ్ బాబు, వై.ప్రవీణ్, పుష్పలత.బి నిర్మించిన ఈ సినిమా టీజర్ని సురేశ్ బాబు రిలీజ్ చేశారు. బీయమ్ సోము సుందరం మాట్లాడుతూ–‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రం ఇది’’ అన్నారు. ‘‘నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు జీవన్. ‘‘మే లో సినిమా విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ కార్యక్రమంలో పరిపూర్ణానంద స్వామి, ఎంపీ, నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ, నటుడు సప్తగిరి తదితరులు పాల్గొన్నారు. -
హీరో వెంకటేశ్ ఇంట తీవ్ర విషాదం
హీరో దగ్గుబాటి వెంకటేశ్ ఇంట విషాదం నెలకొంది. వెంకటేశ్, సురేశ్ బాబుల బాబాయ్, మూవీ మొఘల్ దివంగత రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు(73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం బాపట్ల జిల్లా కారంచేడులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. విషయం తెలుకున్న సురేశ్ బాబు.. కొడుకు అభిరాంతో కలిసి కారెంచేడు వెళ్లి బాబాయ్ మృతదేహానికి నివాళులర్పించాడు. హీరో వెంకటేశ్ షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లడంతో కారెంచేడు రాలేకపోయినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం వెంకటేశ్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు దగ్గుబాటి మోహన్ బాబు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, చీరాల వైసీపీ సమన్వయకర్త కరణం వెంకటేశ్ .. మోహన్ బాబు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. -
అన్నపూర్ణ ఫోటో స్టూడియోలో ఏం జరిగింది?
చైతన్యరావు, లావణ్య హీరో హీరోయిన్లుగా చెందు ముద్దు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ‘ఇచ్చట అందమైన ఫోటోలు తీయబడును’ అనేది ఉపశీర్షిక. బిగ్బెన్ సినిమాస్పై యశ్ రంగినేని నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్లుక్ని నిర్మాత డి.సురేష్బాబు విడుదల చేసి, సినిమా హిట్ సాధించాలని ఆకాంక్షించారు. చైతన్యరావు మాట్లాడుతూ –‘‘ఇప్పుడున్న ఫాస్ట్లైఫ్ నుంచి దూరంగా ప్రేక్షకులను 1980 నేపథ్యంలోకి తీసుకువెళ్లే సినిమా ఇది’’ అన్నారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథే ఈ చిత్రం. కథలో ఉన్న ట్విస్ట్లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి’’ అన్నారు చందు. ‘‘ఫన్, థ్రిల్లింగ్, క్రైమ్ ఎలిమెంట్స్తో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు నిర్మాత యశ్ రంగినేని. -
అవినాశ్ను ఇరికించేందుకే గూగుల్ టేకౌట్ కథ
కడప కార్పొరేషన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాశ్రెడ్డిని ఇరికించేందుకే గూగుల్ టేకౌట్ కథ అల్లుతున్నారని కడప మేయర్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు చెప్పారు. అందుకే తాము కోర్టును ఆశ్రయించామే తప్ప సీబీఐకి భయపడి కాదన్నారు. వైఎస్ కుటుంబం ఇలాంటి ఎన్నో కుట్రలను ఎదుర్కొని నిలబడిందన్నారు. వారిది పదిమందికి సాయం చేసే గుణమే తప్ప ద్రోహం చేసే ఆలోచన లేదన్నారు. సురేష్బాబు శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీబీఐపై ఉన్న నమ్మకం పోయేలా కేసు దర్యాప్తు సాగుతోందని అన్నారు. తాము లేవనెత్తుతున్న అనుమానాలపై దృష్టి పెట్టకుండా సీబీఐ ఒక కోణంలోనే దర్యాప్తు చేస్తోందని తెలిపారు. అవినాశ్రెడ్డి ఆయనకున్న అనుమానాలన్నీ లిఖితపూర్వకంగా ఇచ్చినా సీబీఐ అధికారులు పట్టించుకోలేదన్నారు. న్యాయవాది సమక్షంలో విచారించాలని, వీడియో తీయాలని కోరినా పట్టించుకోలేదన్నారు. వివేకా చనిపోయినప్పుడు మొదట ఫోన్చేసి చెప్పిన శివప్రకాశ్రెడ్డిని ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. దస్తగిరి అప్రూవర్గా మారడంతో అతడిని స్వేచ్ఛగా వదిలేశారన్నారు. హత్యకు ముందు సునీల్యాదవ్ అవినాశ్రెడ్డి ఇంట్లో ఉన్నాడని చెప్పడం దారుణమన్నారు. సీబీఐ అధికారులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎల్లో మీడియాకు లీకులిస్తూ అభూత కల్పనలకు తావిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా సీబీఐ అధికారులు వాస్తవాలను వెలికితీసి, నిజమైన దోషులను శిక్షించాలని కోరారు. దస్తగిరి ఎవరి పేరు చెబితే వారిని విచారిస్తున్నారు: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ఖాన్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డిని ఇరికించే కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ఖాన్ చెప్పారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. అప్రూవర్గా మారిన దస్తగిరి ఎవరి పేరు చెబితే వారిని చార్జిషీట్లో పెట్టి విచారణకు పిలవడం సరికాదన్నారు. ఎంపీ అవినాశ్రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా విచారణ పేరిట వేధించి, ఆయన రాజకీయ భవిష్యత్ను నాశనం చేయాలనే కుట్ర కనిపిస్తోందన్నారు. సీబీఐ విచారణను బీజేపీలోని టీడీపీ కోవర్టులు ప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయని చెప్పారు. -
Nenekkadunna: టాలీవుడ్లోకి బాలీవుడ్ సీనియర్ హీరో కొడుకు
బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మాధవ్ కోదాడ దర్శకత్వంలో ‘నేనెక్కడున్నా' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఎయిర్ టెల్ ఫేమ్ సశా ఛెత్రి కథానాయిక. కె.బి.ఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు టైటిల్ వెల్లడించడంతో పాటు పోస్టర్, టీజర్ విడుదల చేశారు. అనంతరం సురేశ్ బాబు మాట్లాడుతూ..‘టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. కథ బాగుంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు, ఇటువంటి కొత్త ప్రయత్నాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్' అని చెప్పారు. ‘జర్నలిజం, రాజకీయం నేపథ్యంలో వస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది’అని దర్శకుడు మాధవ్ కోదాడ అన్నారు. ‘సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం సెన్సార్ సన్నాహాల్లో ఉన్నాం. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’అని నిర్మాత మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి అన్నారు. -
ఫిలింనగర్ భూవివాదంలో కొత్త మలుపు
-
ఫిలింనగర్ భూవివాదంలో కొత్త మలుపు
-
భూ వివాదం: నిర్మాత సురేష్బాబు, రానాలపై క్రిమినల్ కేసు నమోదు
హైదరాబాద్: ఫిలింనగర్ భూ వివాదం కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు నిర్మాత సురేష్బాబు, రానాలపై క్రిమినల్ కేసు నమోదైంది. తమను దౌర్జన్యంగా ఖాళీ చేయించారని వ్యాపారి ప్రమోద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఖాళీ చేయకుంటే అంతు చూస్తామని సురేష్బాబు బెదిరించినట్లు ఆరోపించారు. ఫిర్యాదు చేసినా బంజరాహిల్స్ పోలీసులు పట్టించుకోలేదన్నారు. దాంతో నాంపల్లి కోర్టును బాధితుడు ఆశ్రయించాడు. సురేష్బాబు, రానా సహా మరికొందరిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశించింది. దాంతో సురేష్బాబు, రానాపై కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. -
జూబ్లీహిల్స్లో ట్రాఫిక్ను కంట్రోల్ చేసిన సురేష్ బాబు
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కారుదిగి స్వయంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్లోని ఫిల్మ్నగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో అటువైపు వెళ్తున్న నిర్మాత సురేష్ బాబు స్వయంగా కారులోంచి దిగి ట్రాఫిక్ను కంట్రోల్ చేశారు. వాహనదారులకు సూచనలు చేస్తూ ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాధ్యతగల పౌరుడిలా వ్యవహరించారంటూ సురేష్ బాబుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
తెలుగు నిర్మాతల మండలి నిర్ణయంపై నిర్మాత సురేశ్ బాబు సంచలన వ్యాఖ్యలు
గత కొంతకాలంగా టాలీవుడ్లో తెలుగు, తమిళ సినిమాల రిలీజ్ విషయం చిన్న వివాదం జరుగుతుంది. సంక్రాంతి సీజన్లో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల తెలుగు నిర్మాతల మండలి లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిని కొంతమంది సమర్థిస్తుంటే.. మరికొంతమంది తప్పుబడుతున్నారు. తాజాగా నిర్మాతల మండలి నిర్ణయంపై ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు స్పందించారు. ఇతర భాషల సినిమాలను ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. సంక్రాంతి సీజన్లో అన్ని సినిమాలు నడుస్తాయన్నారు. ‘తెలుగు సినిమా హద్దులు చెరిగిపోయాయి. మన సినిమాను ఏ భాషలో కూడా చులకనగా చూడట్లేదు. చెన్నైలో ఆర్ఆర్ఆర్ విడుదల చేసినప్పుడు అక్కడి వాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు. లోకల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. మంచి సినిమా అయితే.. ఎక్కువ థియేటర్స్లో ఆడిస్తారు. సినిమా బాలేకుంటే తరువాతి రోజే తీసేస్తారు. ఇదొక బిజినెస్ అంతే. ఎవరిష్టం వారిది. ఆడుతుందనే నమ్మకం ఉన్న సినిమాకు ఎక్కువ థియేటర్స్ ఇస్తారు. అది ఏ భాష సినిమా అని ఎవరూ చూడరు. మన తెలుగు సినిమా కూడా ఇతర భాషల్లో విడుదలయి విజయం సాధిస్తున్నాయి. -
సంచలనం సృష్టించిన బాలయ్య టాక్ షో, 5వ ఎపిసోడ్కు రికార్డ్ వ్యూస్
నందమూరి నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్-2’. బాలయ్య తనదైన శైలి, చమత్కారం, పంచ్లతో ఈ షోను విజయవంతం చేస్తున్నాడు. ఇప్పటికే మొదటి సీజన్ పలు రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సెకండ్ సీజన్ కూడా రికార్డ్ సృష్టించింది. లేటెస్ట్గా జరిగిన 5వ ఎపిసోడ్ రెండు రోజుల్లోనే 30 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ రాబట్టి సంచలనం రేపింది. దివంగత మాజీ సీఎం, సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా 5వ ఎపిసోడ్ టాలీవుడ్ స్టార్ నిర్మాతలైన దగ్గుబాటి సురేశ్ బాబు, అల్లు అరవింద్తో పాటు అగ్ర దర్శకుడు రాఘవేంద్రరావు, మరో దర్శకుడు కోదండరామి రెడ్డి అతిథులుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాళ్లు 90 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో వచ్చిన సినిమాల గురించి చర్చించారు. అల్లు అరవింద్, సురేష్ బాబును నేపోటిజం గురించి బాలకృష్ణ ప్రశ్నించారు. ఇంకా మూవీస్ గురించి డిస్కస్ చేశారు. హీరోయిన్ల నాభిపై పూలు, పళ్లు ఎందుకు వస్తారో రాఘవేంద్ర రావును అడిగారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ సరదాగా సాగింది. దాంతో ఈ షోకు ప్రేక్షకుల నుంచి కూడా విశేష ఆదరణ అభించింది. ఈ నేపథ్యంలో అన్స్టాపబుల్ 5వ ఎపిసోడ్కు రెండు రోజుల్లోనే ఏకంగా 30 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చినట్లు తాజాగా ఆహా అధికారికంగా ప్రకటించింది. Matallo marintha fire 🔥. Kaburlalo marintha fun. Maruvaleni kathalu, inka enneno. An episode that you can't miss😉 Watch #UnstoppableWithNBKS2 Episode 5 Streaming Now@SBDaggubati #alluarvind#kodandaramireddy @Ragavendraraoba #MansionHouse @tnldoublehorse @realmeIndia pic.twitter.com/f6JDjDfrtZ — ahavideoin (@ahavideoIN) December 5, 2022 -
మాదాపూర్లో గన్తో హల్చల్పై కొనసాగుతున్న దర్యాప్తు
-
సురేష్ బాబుతో భూవివాదం.. గన్తో బెదిరిస్తూ రియల్టర్ హల్చల్
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లో గురువారం రాత్రి కాల్పులు కలకలం రేపాయి. సంజీవ రెడ్డి అనే రియల్టర్ రాత్రి సమయంలో గన్తో హల్చల్ చేశారు. దీంతో, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, దగ్గుపాటి సురేష్బాబుకు చెందిన స్థలంలో జరుగుతున్న నిర్మాణాల వద్ద ఘటన చోటుచేసుకుంది. అయితే, సురేష్ బాబు స్థలంలో కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ను సంజీవ రెడ్డి తీసుకున్నారు. కాగా, కన్స్ట్రక్షన్ సందర్భంగా సురేష్ బాబు, రామకృష్ణారెడ్డికి మధ్య భూ వివాదం చోటుచేసుకుంది. తన స్థలంలోకి జరిగి నిర్మాణం చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. ఈ విషయంపై మాదాపూర్ పీఎస్లో సురేష్ బాబు సూపర్వైజర్ ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. గురువారం రామకృష్ణారెడ్డి మరోసారి కన్స్ట్రక్షన్ జరుగుతున్న చోటుకు వచ్చారు. ఈ సందర్భంగా రామకృష్ణ, సంజీవ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సంజీవ రెడ్డి తన గన్తో రామకృష్ణారెడ్డిని బెదిరించాడు. దీంతో, రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కాంట్రాక్టర్ సంజీవరెడ్డిని అదుపులోకి తీసుకుని గన్ను సీజ్ చేశారు. దీనిపై విచారణ కొనసాగుతున్నట్టు వెల్లడించారు. -
Kanipakam: కాణిపాకం ఇన్ఛార్జి ఈఓ సురేష్ బాబుపై బదిలీ వేటు
సాక్షి, చిత్తూరు: టికెట్ ధరల పెంపుపై కాణిపాకం ఇన్ ఛార్జి ఈఓ సురేష్ బాబు ఇచ్చిన ఉత్తర్వులపై దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఆయనపై బదిలీ వేటు వేసింది. సురేష్ బాబును కాణిపాకం ఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాణిపాకం ఇన్ఛార్జి ఈఓగా కర్నూలు డిసి రాణా ప్రతాప్ కి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కమీషనర్ హరి జవహర్ లాల్ ఇప్పటికే సురేష్ బాబుకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. కాణిపాకంలో అభిషేకం టిక్కెట్ ధరని పెంచడానికి ప్రజాభిప్రాయం పేరుతో జారీ చేసిన ఉత్తర్వులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిక్కెట్ ధరని పెంచడం లేదంటూ ఇప్పటికే దేవాదాయ శాఖ స్పష్టమైన ప్రకటన చేసిందని ఆయన తెలిపారు. సురేష్ బాబుపై విచారణ చేపటనున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. -
కూలింగ్తో ఈ–బైక్స్ ఫైరింగ్కు చెక్
కాజీపేట అర్బన్: విద్యుత్ చార్జింగ్తో నడిచే ద్విచక్ర వాహనాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నా తరచూ జరుగుతున్న బ్యాటరీల పేలుళ్ల ఉదంతాలు కలవరపెడుతున్నాయి. అయితే ప్రత్యేక పరికరాల ఏ ర్పాటుతో ఈ ప్రమాదాలను నివారించొ చ్చని వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఎలక్ట్రికల్ బ్రాంచ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్బాబు పేర్ల తెలిపారు. విద్యుత్ వాహనాలు, చార్జింగ్ స్టేషన్లపై రెండేళ్లుగా చేపడుతున్న తమ పరిశోధనల వివరాలను ఆయన గురువారం ‘సాక్షి’తో పంచుకున్నారు. కూలింగ్తో ఫైరింగ్కు చెక్.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈ–బైక్స్లోని బ్యాటరీలను చల్లబరిచేందుకు ఎలాంటి కూలింగ్ డిజైన్ లేదని సురేష్బాబు తెలిపారు. దీనివల్ల విద్యుత్ చార్జింగ్ సమయంలో లేదా వాహనాన్ని నడిపేటప్పుడు బ్యాటరీలో ఏర్పడిన వేడి బయటకు వెళ్లే అవకాశం లేక వాటి నుంచి మంటలు చెలరేగుతున్నాయని ఆయన వివరించారు. అలాగే సాధారణంగా ఈ–బైక్స్లో లిథియం అయాన్ బ్యాటరీలను వాడుతున్నారని.. వాటిని చార్జింగ్ పెట్టాక వాడకపోయినా విద్యుత్శక్తి అందులోనే ఉండిపోతుందని వివరించారు. దీనికితోడు ఈ–బైక్స్లోని బ్యాటరీలు ఎండకు, వానకు దెబ్బ తినకుండా ఉండేందుకు వీలుగా తయారీ కంపెనీలు వాటిని పూర్తిగా ఫైబర్ మెటీరియల్తో కప్పేసేలా డిజైన్ చేయడం కూడా ప్రమాద తీవ్రతను పెంచుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ–బైక్స్ను చల్లబరిచేలా ప్రత్యేక పరికరాలను డిజైన్ చేయగలిగితే అగ్నిప్రమాదాలను నివారించొచ్చని అన్నారు. కాగా, వరంగల్లో ఈ–బైక్స్కు ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై రెండేళ్లుగా పరిశోధనలు చేపట్టామని... ఇందుకు 8 ప్రాంతాలు (ఫాతిమానగర్, అదాలత్ సెంటర్, కేయూసీ, కుమార్పల్లి, హన్మకొండ చౌరస్తా, ఎంజీ రోడ్డు, భట్టుపల్లి, వరంగల్ స్టేషన్ రోడ్డు) అనువుగా ఉన్నట్లు గుర్తించామని సురేష్బాబు వివరించారు. -
సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్న రానా
స్టార్ హీరో దగ్గుబాటి రానా, ఆయన భార్య మిహీక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ దర్శనం ద్వారా వారు శ్రీవారి దర్శించుకున్నారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీరితో పాటు రానా తండ్రి, నిర్మాత సురేశ్ బాబు, ఆయన సోదరుడు అభిరాంలు కూడా ఉన్నారు. -
హ్యాకర్ల కంట పడకుండా సమాచార ప్రసారం!
కాజీపేట అర్బన్: ప్రతి రంగంలోనూ సమాచార ప్రసారం, దాని భద్రత ఎంతో కీలకం. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీలతో ఈ సమాచారం హ్యాకర్ల చేతిలో పడుతోంది. హ్యాకర్లు ఆ సమాచారంతో తప్పుడు పనులకు పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆన్లైన్లో సురక్షితంగా సమాచారాన్ని ప్రసారం చేసేందుకు, తప్పుడు సమాచారాన్ని తొలగించి రక్షణ కల్పించేందుకు వీలయ్యే సరికొత్త అల్గారిథమ్ను వరంగల్ నిట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ సురేశ్బాబు పేర్ల అభివృద్ధి చేశారు. ‘మోడల్ టు ఎన్హాన్స్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్ ద ఫాల్ట్ టాలరెన్స్’అంశంపై పరిశోధన చేసి రూపొందించిన ఈ అల్గారిథమ్కు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులు కూడా పొందినట్టు ఆయన వెల్లడించారు. గతంలో దేశంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ నెట్వర్క్లలో హ్యాకర్లు చొరబడి విద్యుత్ సరఫరాను స్తంభింప జేసిన ఘటనల నేపథ్యంలో ప్రత్యేక అల్గారిథమ్ రూపొందించినట్టు తెలిపారు. అన్ని రంగాల్లో వినియోగించవచ్చు ‘‘పవర్గ్రిడ్, టెలీ కమ్యూనికేషన్స్తోపాటు అన్ని రంగాల్లో సమాచారాన్ని పూర్తి రక్షణతో ప్రసారం చేసేందుకు నేను రూపొందించిన అల్గారిథమ్ను వినియోగించవచ్చు. ఇది సమాచార ప్రసారంలో హ్యాకర్లను గుర్తించి ఆ సమాచారం అందుకోకుండా ఆపుతుంది. సరైన వ్యక్తులను గుర్తించి సమాచారాన్ని ప్రసారం చేసేందుకు తోడ్పడుతుంది..’’అని సురేశ్బాబు తెలిపారు. -
షాకింగ్: నిర్మాత సురేష్ బాబు ఆ థియేటర్ను అమ్మేశారా?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఆయన డిస్ట్రిబ్యూటర్గా సేవలు అందిస్తున్నారు. అయితే తాజాగా సురేష్ బాబు తీసుకున్న ఓ నిర్ణయం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. వైజాగ్లోని జ్యోతి అనే ప్రముఖ థియేటర్ను ఆయన అమ్మేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఒకప్పుడు కొత్త సినిమాలు రిలీజైతే థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొనేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సూపర్ సూపర్ హిట్ అనే టాక్ వస్తే తప్పా జనాలు థియేటర్లకు రాని పరిస్థితి. ఓటీటీ వినియోగం పెరగిపోవడంతో ప్రేక్షకులు ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇప్పటికే పలు థియేరట్లు మూతపడ్డాయి. తాజాగా సురేష్ బాబు సైతం ఓ థియేటర్ను అమ్మేసినట్లు సమాచారం. వైజాగ్లో ఐకానిక్ థియేటర్గా పేరున్న అలాంటి థియేటర్ను సురేష్ బాబు అమ్మేసినట్లు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. -
కులాల మధ్య చిచ్చుకే.. పవన్ పర్యటన
కడప కార్పొరేషన్: తన స్వప్రయోజనాల కోసం వైఎస్సార్ జిల్లాలో కులాల మధ్య చిచ్చు రేపేందుకే పవన్కళ్యాణ్ పర్యటించారని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా విమర్శించారు. తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ కె. సురేష్బాబుతో కలిసి శనివారం అంజద్ బాషా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు కులమతాలకు అతీతంగా వైఎస్ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్నారన్న విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రైతుభరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్నామని, రైతులు విత్తు వేసినప్పటి నుంచి గిట్టుబాటు ధర కల్పించే వరకూ ప్రభుత్వం వారికి అండగా ఉంటోందన్నారు. పద్యం పుట్టిన చోట మద్యం ఏరులై పారుతోందని చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అంజద్ బాషా ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 45వేల బెల్టుషాపులను రద్దుచేసిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ వారసత్వ రాజకీయాలు చేయడంలేదని, కాంగ్రెస్ ఇచ్చిన కేంద్రమంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేశారన్నారు. ఇక పవన్ ఎవరి పేరు వాడుకుని రాజకీయాలు చేస్తున్నాడో గుర్తుచేసుకోవాలని చెప్పారు. 14 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ కేవలం ఒక్క ఎమ్మెల్యేనే గెలిపించుకున్నావని.. అందుకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. అప్పుడెందుకు ప్రశ్నించలేదు.. ప్రశ్నించడానికే వచ్చానని చెప్పుకుంటున్న పవన్ 2014కు ముందు ఎంతోమంది రైతులు అప్పులపాలై చనిపోతే ఎందుకు ప్రశ్నించలేదని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. కులాల ప్రస్తావన తేవడం బాబు, పవన్ ఆడుతున్న నాటకంలో భాగమేనన్నారు. కులాల మధ్య చిచ్చురేపేందుకు ప్రయత్నిస్తే ఉపేక్షించబోమని అంజద్ బాషా హెచ్చరించారు. తన వర్గం ఓట్లన్నీ గంపగుత్తగా చంద్రబాబుకు బదిలీచేసి ఆయన్ను సీఎం చేయడమే పవన్ ఎజెండా అని ఆరోపించారు. పవన్కళ్యాణ్ రాయలసీమకు ఏం చేశారో, ఈ ప్రాంత అభివృద్ధిపై ఆయన ప్రణాళిక, వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒంటరిగా పోటీచేసే దమ్ముందా పవన్.. మేయర్ సురేష్బాబు మాట్లాడుతూ తన సామాజిక వర్గం వారున్నారనే పవన్ సిద్ధవటంలో సభ పెట్టారన్నారు. టక్కోలు పంచాయతీ, డేగల వాండ్ల పల్లెలో శిరిగిరెడ్డి సాంబశివారెడ్డి అనే వ్యక్తి అప్పులతో చనిపోయాడని, వారి కుటుంబానికి ప్రభుత్వం రూ.7లక్షల పరిహారం ఇచ్చిందని గుర్తుచేశారు. అయినా, ప్రభుత్వంపై పవన్ విమర్శలు చేయడం అవివేకమన్నారు. కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు మెచ్చుకుని, అక్కడ అమలుచేస్తుంటే ఇక్కడి ప్రతిపక్షాలకు కడుపుమంటగా ఉందన్నారు. ఇక జగన్ వారసత్వంగా సీఎం కాలేదని, సొంతంగా పార్టీ పెట్టి, సుదీర్ఘ పాదయాత్ర చేసి అధికారంలోకొచ్చారన్నారు. ఒంటరిగా పోటీచేసే దమ్ము, ధైర్యం పవన్కు ఉందా అని సురేష్బాబు సవాల్ విసిరారు. -
'విరాట పర్వం'పై సరళ అన్నయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
Tumu Mohan Rao Comments On Virata Parvam In Success Meet: రానా దగ్గుబాటి, టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం విరాట పర్వం. 1990లో సరళ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్తో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో చిత్ర బృందంతో పాటు.. సరళ అన్నయ్య తూము మోహన్ రావు కూడా పాల్గొన్నారు. ''సురేష్ ప్రొడక్షన్ లో తొలిసారి యదార్థ సంఘటనల ద్వారా తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. దర్శకుడు వేణు కథని అద్భుతంగా చెప్పారు. సాయి పల్లవి గొప్పగా నటిచింది. విరాట పర్వం విజయం ఆనందాన్ని ఇచ్చింది. మేము కూడా ఒక మంచి బయోపిక్ చేశామనే తృప్తిని ఇచ్చింది. సరళ జీవితాన్ని సినిమాగా తీసుకునే అవకాశం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. ఇది స్వచ్ఛమైన ప్రేమకథ. సాయి పల్లవి, రానా, మిగతా నటీనటులు అందరూ గొప్పగా చేశారు. విరాటపర్వం గురించి అందరూ పాజిటివ్ గా చెబుతున్నారు. రానాకి ఈ సినిమా ఎందుకు చేస్తున్నావ్ ? అని అడిగితే 'ఇలాంటి కథ నేను చేయకపోతే ఎవరు చేస్తారని' చెప్పారు. కళాత్మక చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ ఎక్కువ మార్కులు వేస్తూనే ఉంటారు. విరాటపర్వం టీం అంతటికి కంగ్రాట్స్'' అని నిర్మాత సురేష్ బాబు తెలిపారు. సాయి పల్లవి మాట్లాడుతూ.. ''మోహన్ రావుకి ధన్యవాదాలు. వారి ఇంటికి వెళ్లి కలసినపుడు నన్ను ఆశీర్వదించి చీర బొట్టు పెట్టి దీవించారు. సరళ గారి కుటుంబాన్ని చూసిన తర్వాత గుండె బరువెక్కింది. కన్నీళ్లు వచ్చాయి. గొప్ప మనసున్న వాళ్లు మళ్లీ పుడతారు. వాళ్లు ఏం అనుకున్నారో ఇంకో మార్గంలో సాధించుకుంటారని చెప్పా. ఈ రోజు మోహన్ రావు ఇక్కడి వచ్చి సినిమా విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం ఆనందంగా ఉంది. సురేష్ బాబు ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. వెన్నెల పాత్ర పోషించినందుకు చాలా గర్వంగా ఫీలౌతున్నా. ప్రేక్షకులు సినిమాని మళ్లీ మళ్లీ చూస్తున్నామని, చూసిన ప్రతీ సారి ఇంకా గొప్పగా అనిపిస్తుందని చెప్పడం ఆనందంగా ఉంది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు.'' అన్నారు. చిత్రానికి అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రేక్షకుల నుంచి యునానిమస్ గా బిగ్ హిట్ టాక్ వచ్చింది. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి కారణమైన నిర్మాతలు రానా, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్, ఒక గాడ్ ఫాదర్ గా మా అందరినీ వెనుకుండి నడిపించిన సురేష్ బాబుకు కృతజ్ఞతలు. సాయి పల్లవి లేకపోతే ఈ కథ ఉండేది కాదు. ఆమెకు కృతజ్ఞతలు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అద్భుతమైన సంగీతం అందించారు. ఎమోషనల్ గా మరో స్థాయికి తీసుకెళ్లారు. 1990 వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్రకు థాంక్స్. అద్భుతమైన విజువల్స్ ఇచ్చిన డానీ, దివాకర్ మణికి కృతజ్ఞతలు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. సరళ అనే అమ్మాయి జీవితంలో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. సరళ గారి అన్నయ్య తూము మోహన్ రావు గారు ఈ ప్రెస్ మీట్ రావడం కూడా ఆనందంగా ఉంది. విరాట పర్వం చిత్రాన్ని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇలాంటి మీనింగ్ ఫుల్ సినిమాలు మౌత్ టాక్ ద్వారానే పబ్లిక్ లోకి వెళతాయి. ఇలాంటి మీనింగ్ ఫుల్ సినిమాని అందరూ ఆదరించాలని ప్రేక్షకులని, మీడియాని కోరుకుంటున్నాను. ఇలాంటి అర్థవంతమైన సినిమాలని నిలబెడితే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి'' అని డైరెక్టర్ వేణు ఊడుగుల పేర్కొన్నారు. తూము మోహన్ రావు మాట్లాడుతూ.. ''30ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. సురేష్ ప్రొడక్షన్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఆ సంఘటనని ఇంత గొప్ప చిత్రంగా నిర్మిస్తుందని ఊహించలేదు. వేణు ఊడుగుల కొన్ని నెలలు క్రితం నన్ను కలిశారు. ఈ సినిమా గురించి చెప్పారు. ఎలా చూపిస్తారో అనే భయం ఉండింది. కానీ వేణు గారు చెప్పిన తర్వాత కన్విన్సింగ్ గా అనిపించింది. రానా, సాయి పల్లవి పేరు చెప్పిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ప్రివ్యూకి రమ్మని చాలా సార్లు అడిగారు. అయితే ఈ సినిమాని ప్రేక్షకుడిగానే అందరితో కలసి చూడాలనుందని చెప్పా. సినిమా చూసిన తర్వాత మేము ఏం అనుకుంటున్నామో అదే తీశారు. కథ విషయానికి వస్తే.. మా ఇంట్లో కమ్యునిస్ట్ వాతావరణం వుంది. మా చెల్లి విప్లవాన్ని ప్రేమించింది. తను స్టూడెంట్ ఆర్గనై జేషన్ లోకి వెళ్లడం మేము వారించడం జరిగేది. కానీ తను నక్సల్ లోకి వెళ్లిపోతుందని మేము అనుకోలేదు. దాన్ని ప్రేమించి, ఇష్టంతో వెళ్లింది. సినిమాలో రవన్న రచనలకు ప్రభావతమై వెళ్లినట్లు చూపించారు. రెండూ ఒక్కటే. ఆమె విప్లవాన్ని ప్రేమించింది. విప్లవం వల్లే చనిపోయింది. ఇందులో ఎవరినీ తప్పుపట్టడం లేదు. మా కుటుంబం అంతా కలసి సినిమా చూశాం. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు అని నా భార్య అడిగింది. ఎప్పుడూ వినని మ్యూజిక్ విరాటపర్వంలో వినిపించిదని చెప్పింది. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలికి కంగ్రాట్స్. మాకు తెలిసిన కథలో శంకరన్న పాత్ర నెగిటివ్. తన వల్ల చనిపోయింది కాబట్టి కోపం ఉండేది. కానీ రానా, సాయి పల్లవిని దర్శకుడు చూపించిన విధానం అద్భుతంగా ఉంది. సురేష్ ప్రొడక్షన్ లాంటి బ్యానర్లో ఇలాంటి కథని తీసుకొని ఒక ప్రయోగం చేయడమనేది చాలా గొప్ప విషయం. వారికి అభినందనలు. రానా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ప్రయోగాలు ఇక చేయనని చెప్పారు. కానీ రానా గారే ఇలాంటి ప్రయోగాలు చేయగలరు. మంచి కథ దొరికితే ఆయన ప్రయోగాలు చేయాలని కోరుకుంటున్నాను. సురేష్ ప్రొడక్షన్ లో ఇలాంటి డిఫరెంట్ మూవీ మరొకటి రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. ''నాలో ప్రతిభని గుర్తించి సీనియారిటీ లెక్కలు వేసుకోకుండా ఈ చిత్రానికి అవకాశం కల్పించిన రానాకు కృతజ్ఞతలు. సురేష్ బాబు మా అందరికీ ఒక పెద్ద దిక్కులా ఉన్నారు. నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్, దర్శకుడు వేణు ఊడుగులకు థాంక్స్. ఈ సినిమాని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలి'' అని కొరుకున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఒక గొప్ప సినిమా చేసాం అనే భావన కలిగింది. ఈ సినిమాకి పని చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు వేణు, నిర్మాతలు సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్కు కృతజ్ఞతలు. సాయి పల్లవి, రానా గారు అద్భుతంగా చేశారు. చిత్రాన్ని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.'' అని ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తెలిపారు. చదవండి: తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి -
ఆ విషయంలో వెన్నెల.. నేనూ ఒకటే!
‘‘ఒక నటిగా విభిన్న పాత్రలు చేయాలనుకుంటాను. ఒకే క్వొశ్చన్ పేపర్కు మళ్లీ మళ్లీ అదే సమాధానాలు రాయడంలో మజా ఉండదు. ప్రతి సినిమాకు కాస్త ప్రెజర్, పెయిన్ ఉండటమే బెటర్ అని నా ఫీలింగ్. లేకపోతే బోర్ కొడుతుంది’’ అన్నారు సాయిపల్లవి. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా రూపొందిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల17న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సాయిపల్లవి పంచుకున్న విశేషాలు. నేను తమిళనాడులో పుట్టాను. తెలంగాణాలోని పరిస్థితులపై నాకంత అవగాహన లేదు. అందుకే ‘విరాటపర్వం’ కొత్తగా అనిపించింది. అప్పటి నక్సలిజం పరిస్థితుల్లో ఏది తప్పో ఒప్పో కూడా నాకు తెలీదు. మా తాతగారు మాజీ పోలీసాఫీసర్. నక్సలిజం గురించి ఆయన నాకు ఏదైనా చెప్పడానికి ఆయనకు ‘విరాటపర్వం’ గురించి తెలియదు. ఇక వెన్నెల (‘విరాటపర్వం’లో సాయిపల్లవి పాత్ర)ను ఓ పాత్రగానే చేశాను. ఈ పాత్ర నాకో లెర్నింగ్ ప్రాసెస్. వెన్నెల ఒక సాధారణ అమ్మాయి. అమాయకత్వంతో కూడిన వ్యక్తిత్వం తనది. అలాగే తను నమ్మేదాన్ని సాధించే తెగువ కూడా ఉంది. వెన్నెల, సాయిపల్లవి (తనని తాను ఉద్దేశించి) ప్రేమను చూసే విధానం ఒకేలా ఉంటుంది. అయితే తన ప్రేమ కోసం వెన్నెల ఎంతైనా ఎఫర్ట్స్ పెడితే.. పల్లవి మాత్రం అంత ప్రయత్నించదేమో! సరళగారి (వెన్నెలకు స్ఫూర్తి) కుటుంబాన్ని కలిశాను. ఎమోషనల్గా అనిపించింది. ప్రాజెక్ట్ స్కేల్ మారింది నిర్మాతలు సుధాకర్, శ్రీకాంత్గార్లతో పాటు వేణు ఊడుగుల ముందుగా ‘విరాటపర్వం’ గురించి నాతో మాట్లాడారు. ఆ తర్వాత ఈ సినిమా స్క్రిప్ట్ సురేష్బాబుగారి దగ్గరికి వెళ్లింది. అలా రానాగారు ఈ ప్రాజెక్ట్లోకి వచ్చారు. రానాగారు స్టార్డమ్ ఉన్న హీరో. రవన్న పాత్రకు రానాగారి వాయిస్, హైట్ బాగా నప్పాయి. ఒక స్క్రిప్ట్ను ఒప్పుకున్నప్పుడు పేపర్ మీద ఉన్నదానికంటే ఎక్కువే చేయొచ్చని రానాగారి నుంచి నేర్చుకున్నాను. చెప్పా లంటే రానాగారు వచ్చాక ‘విరాటపర్వం’ ప్రాజెక్ట్ స్కేలే మారిపోయింది. దర్శకుడు వేణుగారు అద్భుతమైన రచయిత. తనకు తెలిసినదాని గురించి తనకంటే ఎవరూ బాగా చెప్పలేరని నమ్మే వ్యక్తి ఆయన. అలాగే అంతే స్థాయిలో రీసెర్చ్ కూడా చేస్తారు. రాసి పెట్టి ఉంటే వస్తుంది సినిమా సినిమాకు మధ్య ఉండే గ్యాప్ గురించి నేను ఆలోచించను. నాకు ఆర్ట్ (కళ)పై పూర్తి నమ్మకం ఉంది. ఏదైనా కథ మనకు రాసి పెట్టి ఉంటే అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుందని నా నమ్మకం. ఇక నా కోసమే కొందరు దర్శకులు కొన్ని పాత్రలను సృష్టిస్తున్నారంటే అది నాకు సంతోషాన్నిచ్చే అంశమే. కథలను ఎంపిక చేసుకోవడంలో నా ఇమేజ్ను నేను ఇబ్బందిగా ఫీల్ కావడంలేదు. ఒత్తిడి కూడా లేదు. మనం ఉన్నా లేకున్నా సినిమాలు శాశ్వతంగా ఉంటాయి. నేను వెళ్లిపోయిన తర్వాత కూడా నేను యాక్ట్ చేసిన ఓ సినిమాను చూసి ప్రేక్షకులు మెచ్చుకోవాలనే ఆలోచనతోనే సినిమా అంగీకరిస్తాను. గత జన్మలో ఇక్కడే పుట్టానేమో! ‘ఫిదా’, ‘లవ్స్టోరీ’, ఇప్పుడు ‘విరాటపర్వం’.. ఇలా వరుసగా తెలంగాణ బ్యాక్డ్రాప్ సినిమాలు చేశాను. మా ఇంట్లో కూడా నేను మారిపోయానని అంటున్నారు. బహుశా.. నేను గత జన్మలో ఇక్కడే పుట్టానేమో!’ అని చెప్పిన సాయిపల్లవితో ‘మీ జీవిత భాగస్వామి ఎలా ఉండాలనుకుంటున్నారు?’ అనడిగితే... ఇంకా పుట్టలేదని అనుకుంటున్నాను’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. -
అభిరాం తీరుకు విసిగిపోయిన తేజ?, ఏం చేశాడంటే!
Abhiram Troubles Director Teja Over Ahimsa Shooting?: దర్శకుడు తేజ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ లాంటి యంగ్ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన గొప్ప డైరెక్టర్ ఆయన. ఒకప్పుడు తేజ చిత్రాలకు యమ క్రేజ్ ఉండేది. ఎన్నో ఫ్లాప్ల అనంతరం నేనే రాజు నేనే మంత్రి మూవీతో హిట్ అందుకున్నాడు తేజ. అదే జోష్లో తేజ ఇప్పుడు దగ్గుబాటి మరో వారసుడు, రానా తమ్ముడు అభిరాంను హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి అహింస అనే టైటిల్ను ఖరారు చేస్తూ ఇటివల అభిరాం ఫస్ట్లుక్ను కూడా విడుదల చేశారు మేకర్స్. చదవండి: అసభ్యకర సంజ్ఞతో స్టార్ హీరోయిన్ ఫైర్, పక్కనే షారుఖ్.. ఫోటో వైరల్ దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ నెలాఖరు వరకు శరవేగంగా షూటింగ్ను పూర్తి చేసి ప్రమోషన్ కార్యాక్రమాలు, పోస్ట్ ప్రోడక్షన్ పనులను స్టార్ట్ చేయాలని తేజ ప్లాన్ చేస్తున్నాడట. అయితే దీనికి అభిరాం సహకరించకుండ ఇబ్బంది పెడుతున్నట్లు ఫిలిం సర్కీల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తన డెబ్యూ మూవీ విషయంలో అభిరాం చాలా నిర్లక్ష్య ధోరణి చూపిస్తున్నాడని, అతడి యాటిట్యూడ్ తీరుకు తేజ విసిగిపోయినట్లు టీ-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల షూటింగ్కు రావాల్సిందిగా అభిరాంకు తేజ ఫోన్ చేయగా.. కాలికి గాయమైందని, రెస్ట్ కావాలని అడిగాడట. చదవండి: RRR: తారక్, చరణ్, రాజమౌళితో యాంకర్ సుమ రచ్చ రచ్చ అయితే తీరా చూస్తే అభిరాం అబద్ధం చెప్పి స్నేహితులతో పార్టీకి వెళ్లినట్లు తేజ దృష్టికి వెళ్లింది. ఇలా ఒక్కసారి కాదు చాలాసార్లు చిన్నచిన్న విషయాలను సాకుగా చూపించి అభిరాం షూటింగ్కు డుమ్మా కొట్టాడని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇక అతడి తీరుపై అసహానికి లోనైన తేజ అభిరాం గురించి తండ్రి సురేశ్ బాబుకు చెప్పినట్లు సమాచారం. ‘ఫస్ట్మూవీకే యాటిట్యూడ్ చూపిస్తే ఫ్యూచర్ ఉండదంటూ’ నెటిజన్లు అభిరాంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెత్తుందో తెలియదు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉండగా డైరెక్టర్ తేజను విసిగిస్తున్న అభిరాం అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై స్పష్టత రావాలంటే చిత్ర బృందం స్పందించే వరకు వేచి చూడాలి. -
కొరియోగ్రఫీ మాత్రం వదలొద్దు – నాగచైతన్య
‘‘హే సినామిక’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా వేడుకకి రావడం గౌరవంగా భావిస్తున్నా. బృందా మాస్టర్ కొరియోగ్రఫీకి నేను పెద్ద ఫ్యాన్. మీరు సినిమాలను డైరెక్ట్ చేయండి.. కానీ కొరియోగ్రఫీ మాత్రం వదలొద్దు.. ప్లీజ్’’ అని హీరో నాగచైతన్య అన్నారు. దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితీరావ్ హైదరీ హీరో హీరోయిన్లుగా బృందా మాస్టర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హే సినామిక’. జియో, గ్లోబల్ వన్, వయాకామ్ 18 స్టూడియోస్పై నిర్మించిన ఈ సినిమా రేపు(గురువారం) రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘బృందా మాస్టర్గారు సినిమాని డైరెక్ట్ చేస్తున్నారని తెలిసినప్పుడు చాలా ఆనందపడ్డాను. ‘మనం’ సినిమాలోని ‘కనులను తాకే..’ అనే మాంటేజ్ పాటకు అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారామె. చెన్నైలో ఉన్నప్పటి నుంచే నాకు, దుల్కర్కి పరిచయం ఉంది. తను ప్రతి భాషలోనూ సినిమాలు చేస్తుండటం హ్యాపీ’’ అన్నారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ–‘‘హే సినామిక’ నాకు చాలా ప్రత్యేకం. పాటల్లో రొమాన్స్, ఎమోషన్స్ ఎలా చేయాలో నాతో బాగా చేయించేవారు బృందామాస్టర్. ఆమె నాకు తల్లిలాంటిది. ‘హే సినామిక’ చూసి నవ్వుతారు, ఏడుస్తారు, డాన్స్ చేస్తారు’’ అన్నారు. ‘‘తెలుగు చిత్రపరిశ్రమలో నేను డాన్స్ మాస్టర్గా ఉన్నానంటే కారణం నిర్మాతలు రామానాయుడుగారు, సురేశ్బాబుగారే. ‘హే సినామికా’ దర్శకురాలిగా నా తొలి చిత్రమైనా దుల్కర్ ఓకే చెప్పడం హ్యాపీ’’ అన్నారు బృందామాస్టర్. ‘‘హే సినామిక’ చూసి మీరందరూ తప్పకుండా నవ్వుతారు’’ అన్నారు అదితీరావ్ హైదరీ. నిర్మాత డి.సురేశ్ బాబు మాట్లాడుతూ–‘‘డాన్స్ మాస్టర్గా బృందాని చాలా రోజులుగా చూస్తున్నా. ఆమె సినిమాని డైరెక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ‘హే సినామికా’ బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘నా డాన్స్లో గురు బృందామాస్టర్. నాతో డాన్స్ చేయించేందుకు ఆమె ఎంత కష్టపడిందంటే.. ఆమె కెరీర్లో చాలా కష్టమైన హీరో నేనే అయ్యుంటాను.. అందుకే నేను హీరోగా మానేశాను కూడా(నవ్వుతూ)’’ అన్నారు నటుడు జగపతిబాబు. ‘‘బృంద కొరియోగ్రఫీ చేస్తున్నారంటే మణిరత్నంలాంటి డైరెక్టర్ కూడా సెట్స్లో ఉండరు.. ఆమె ప్రతిభపై అంత నమ్మకం. ‘హే సినామిక’ ద్వారా విజువల్ ట్రీట్ ఇస్తున్నారామె’’ అన్నారు డైరెక్టర్ నందినీ రెడ్డి. -
ఆ నమ్మకంతోనే ఈ సినిమా విడుదల చేస్తున్నాం : సురేశ్బాబు
Suresh Babu About Rajinikanths Peddanna Movie: ‘‘పెద్దన్న’ సినిమాని మేము ఎందుకు తీసుకున్నామా? అని అందరికీ అనుమానం రావొచ్చు. కరోనా తర్వాత ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లకి వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ పెద్ద సినిమాను తీసుకొస్తే ఇంకా బాగుంటుందనే నమ్మకంతో విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత డి. సురేశ్ బాబు అన్నారు. రజనీకాంత్, నయనతార జంటగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘అన్నాత్తే’. చదవండి: పెళ్లి చేసుకోవాలనుంది..అబ్బాయి దొరకడం లేదు: హీరోయిన్ ఈ సినిమాని ఏషియన్ ఇన్ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్పి, సురేశ్ బాబు, ‘దిల్’ రాజు కలిసి ‘పెద్దన్న’ పేరుతో తెలుగులో ఈ నెల 4న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సురేశ్ బాబు విలేకరులతో మాట్లాడుతూ–‘‘యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ఒక్కమాటలో చెప్పాలంటే ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది’’ అన్నారు. నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ మాట్లాడుతూ– ‘‘మాపై నమ్మకంతో ‘పెద్దన్న’ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఇచ్చిన సన్టీవీ వారికి, రజనీకాంత్కు ధన్యవాదాలు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు. చదవండి: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రజనీకాంత్ పునీత్ మరణం: లైవ్లో న్యూస్ చదువుతూ ఏడ్చేసిన యాంకర్ -
కుప్పంలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది:కడప మేయర్ సురేష్ బాబు
-
ఎవరు.. ఎక్కడ.. ఎందుకు?.. థ్రిల్గా ఫీలయ్యా : సురేశ్ బాబు
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’(ఎవరు, ఎక్కడ, ఎందుకు). రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో థియేటర్స్లో గ్రాండ్గా విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాత సురేశ్ బాబు మాట్లాడుతూ.. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు చిత్రాన్ని క్రిస్పీ నరేషన్తో మంచి పెర్ఫామెన్స్లతో చాలా థ్రిల్లింగ్గా తెరకెక్కించారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్ని, ఈ కరోనా వల్ల వర్చువల్ వరల్డ్ లో వచ్చిన మార్పులని చక్కగా చూపించారు. అంతర్లీనంగా ఒక మంచి ప్రేమకథ కూడా ఉంది. ఆడియోకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు వంటి ఒక మంచి చిత్రాన్ని మీకు థియేటర్లలో అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది`అన్నారు. (చదవండి: మేయర్ అభ్యర్థిగా సోనూసూద్.. క్లారిటీ ఇచ్చిన ‘రియల్ హీరో’!) చిత్ర నిర్మాత డా. రవి పి. రాజు దాట్ల మాట్లాడుతూ.. ‘మా బేనర్లో రూపొందిన ఫస్ట్ మూవీ `డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు` చిత్రానికి సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా ఫస్ట్ సక్సెస్ గా భావిస్తున్నాం. ఈ సందర్భంగా సురేశ్ బాబుగారికి మా బ్యానర్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైమ్ తెలుగులో వస్తోన్న కంప్యూటర్ స్క్రీన్ మూవీ ఇది. గుహన్గారి మేకింగ్ చాలా కొత్తగా ఉంటుంది. అలాగే అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ ఇద్దరు సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. వారిద్దరి కెమిస్ట్రి తప్పకుండా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయనున్నాం. కమర్షియల్గా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది`` అన్నారు. చిత్ర దర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ - ``సినిమా చాలా బాగా వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ మూవీ విడుదలవడం నిజంగా హ్యీపీగా ఉంది. అదిత్, శివాణి ఇద్దరు చాలా బాగా నటించారు. టెక్నీషియన్స్ అందరూ మంచి సపొర్ట్ అందించారు. తప్పకుండా ఒక డిఫరెంట్ మూవీ అవుతుంది` అన్నారు. -
చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ.. నాగ్, అల్లు అరవింద్ హాజరు
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ ప్రముఖులు ఆదివారం భేటీ అయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చిందే సినీ పెద్దలు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అపాయింట్మెంట్ కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న చిరంజీవి నివాసంలో సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సినీ పెద్దలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో హీరో నాగార్జున అక్కినేని, అల్లు అరవింద్, దగ్గుబాటి సూరేశ్ బాబు, దిల్ రాజు, మైత్రి మూవీస్ రవి ప్రసాద్ తదితరులు హజరయ్యారు. సినీ కార్మికులు, థియేటర్ కార్మికుల సమస్యలు, విద్యుత్ టారిఫ్, బీ, సీ సెంటర్లలో టికెట్ రేట్లు వంటి సమస్యలపై వారు చర్చించారు. -
వివేకా హత్య కేసు దర్యాప్తును టీడీపీ తప్పుదోవపట్టిస్తోంది
-
'నారప్ప'తో మ్యూజిక్ ఇండస్ట్రీలోకి సురేష్ ప్రొడక్షన్స్
Suresh Productions Music: "నారప్ప" మూవీతో తొలిసారి మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సురేష్ ప్రొడక్షన్స్. పారిస్కు చెందిన 'బిలీవ్' కంపెనీతో ఎస్పీ మ్యూజిక్ జత కట్టింది. వీరి భాగస్వామ్యంలో నారప్ప సినిమాలోని సంగీతాన్ని వరల్డ్ మ్యూజిక్ డయాస్పై బిలీవ్ ప్రమోట్ చేయనుంది. ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ మ్యూజిక్ కంపెనీ అయిన బిలీవ్కు దేశంలో పలు చోట్ల కార్యాలయాలు ఉన్నాయి. గతంలో 'బిలీవ్ ఇండియా' రానా దగ్గుబాటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'సౌత్ బే'తోనూ జట్టు కట్టింది. ఇప్పుడు తాజాగా బిలీవ్, ఎస్పీ మ్యూజిక్ భాగస్వామ్యంతో టాలీవుడ్ సంగీత ప్రపంచానికి కొత్త శకం మొదలైందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఎస్పీ మ్యూజిక్ ఎండీ, నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. 'బిలీవ్తో భాగస్వామి అవడం ఎస్పీ మ్యూజిక్కు ప్రారంభంలోనే దక్కిన గొప్ప అవకాశం. బిలీవ్కు ఉన్న ప్రపంచస్థాయి నెట్ వర్క్తో ఎస్పీ మ్యూజిక్ లేబుల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతప్రియులకు చేరువవుతుందని ఆశిస్తున్నాం. నారప్పతో మొదలైన మా పార్టనర్ షిప్ మరెన్నో చిత్రాలతో కొనసాగాలని కోరుకుంటున్నా' అన్నారు. బిలీవ్ ఇండియా ఎండీ వివేక్ రైనా మాట్లాడుతూ సౌతిండియాలో దిగ్గజ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ సురేష్ ప్రొడక్షన్గా భాగస్వామి అవడం ఎగ్జైటింగ్గా ఉందన్నాడు. -
చెట్టు కిందే ఆఫీస్ పెట్టా, నారప్ప యూనిట్ లో నలుగురు చనిపోయారు
-
నారప్ప : ఆ టైమ్లో నలుగురు చనిపోయారు
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నారప్ప’. తమిళ సినిమా అసురన్కి రీమేక్ ఇది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించారు. ప్రియమణి హీరోయిన్గా నటిస్తోంది. జూలై 20న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సురేశ్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘నారప్ప’షూటింగ్ అనుభవాలను పంచుకున్నాడు. ‘కరోనా కారణంగా భయం, భయంగానే ‘నారప్ప’షూటింగ్ చేశాం. మొదట తమిళనాడు షూటింగ్ చేస్తున్న సమయంలో 6 కిలో మీటర్ల దూరంలో రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్లు న్యూస్ రాగానే భయంతో అక్కడి నుంచి షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని పారిపోయాం. ఫస్ట్ వేవ్లో రెండు మూడు కేసులు వస్తేనే చాలా భయపడిపోయి షూటింగ్ని రద్దు చేసుకున్నాం. కానీ సెకండ్ వేవ్లో వేల సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు వచ్చినా పెద్దగా కంగారు పడలేదు. కానీ చాలా జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ని పూర్తి చేశాం.‘నారప్ప’నాన్ షూటింగ్ టైమ్లో ఈ సినిమాకు సంబంధించిన నలుగురు చనిపోయారు. జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రాణాలు పొగొట్టుకోవాల్సివస్తుంది’అని సురేశ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్ సిన్సియర్గా వర్క్ చేశాడు ‘నారప్ప’ లాంటి కథలను ఎవరూ వెంకటేశ్ కోసం రాయరు. ఈ సినిమాలో వెట్రిమారన్ స్టైల్ నాకు నచ్చింది. మాస్ ఎలిమెంట్స్తో పాటు భారీ ఫ్యామిలీఎమోషన్స్, సామాజిక అంశాలు ఉన్నాయి. సో.. ఈ సినిమా వర్కౌట్ అవుతుందని అనిపించింది. యాక్టర్గా వెంకటేశ్ చాలా బాగా చేశాడు. ఇంట్రవెల్కు ముందు ఇసకలో ఓ యాక్షన్ సీక్వెన్స్తీశాం. అది చాలా కష్టం. వెంకటేశ్ అయితే చాలా సిన్సియర్గా వర్క్ చేశాడు. ఎప్పుడు నారప్ప గెటప్లోనే కనిపించారు. బ్యాలెన్స్ షూట్ కోసం మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు. నారప్ప సినిమా రైట్స్ తీసుకున్న తర్వాత శ్రీకాంత్ అడ్డాల ఓ సారి వచ్చి ఓ కథ చెప్పారు. ఆ తర్వాత నారప్ప సినిమా గురించి మాట్లాడుకున్నాం. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తానన్నారు. చాలా బాగా తెరకెక్కించారు’అని సురేశ్ బాబు అన్నారు. -
వెంకటేశ్ చాలా ఫీలయ్యాడు : సురేశ్ బాబు
‘నారప్ప’ఓటీటీలో విడుదల చేయడం పట్ల వెంకటేశ్ చాలా ఫీలయ్యారని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సివచ్చిందని నిర్మాత సురేశ్ బాబు అన్నారు. విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నారప్ప’.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించారు. ప్రియమణి హీరోయిన్గా నటిస్తోంది. జూలై 20న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ‘నారప్ప’ యూనిట్ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఆదివారం సురేశ్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘మా సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్లో సినిమాలు నా నిర్ణయం మేరకే విడుదలవుతాయి. కానీ నారప్ప మేము మాత్రమే నిర్మించలేదు. నాతోపాటు.. ఎస్.థామస్ కూడా ఈ సినిమాకు నిర్మాత. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాత ఎస్.థామస్ నారప్ప సినిమాను అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకులకు చేరువ చేయాలని భావించారు. కరోనా థార్డ్ వేవ్ దృష్ట్యా ఎవరూ నష్టపోకూడదనే ఈ నిర్ణయానికి వచ్చాం. ఎగ్జిబిటర్లకు నాపై అసంతృప్తి ఉండడంలో న్యాయం ఉంది. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన కుటుంబసభ్యుల్నే థియేటర్కు పంపించడం లేదు. అలాంటిది ప్రేక్షకుల్ని థియేటర్లకు రమ్మని అడగడం న్యాయమా? తన సినిమాని ఎలాగైనా ప్రజలకు చేరువ చేసేందుకు నిర్మాత కష్టపడతాడు. భవిష్యత్తు ఓటీటీదే కావొచ్చు కానీ థియేటర్లు కూడా ఉంటాయి’అని సురేశ్ బాబు అన్నారు. -
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తో ఇంటర్వ్యూ
-
దృశ్యం, విరాట పర్వం కూడా ఓటీటీలోకే! డీల్ ఎంతో తెలుసా!
విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నారప్ప. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన అసురన్ మూవీకి నారప్ప రీమేక్. సూరేష్బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 20 నుంచి నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైం నారప్పకు 40 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో పాటు ‘దృశ్యం 2’ కూడా ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ‘నారప్ప, దృశ్యం-2’లను ఓటీటీకి భారీ మొత్తంలో సురేష్ బాబు ఢీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు కలిపి దాదాపు 76 కోట్లకు అమ్ముడు పోయాయట. ఇక ‘దృశ్యం 2’ అయితే శాటిలైట్, డిజిటల్, డైరెక్ట్-ఓటీటీ కలిపి డిస్నీ+హాట్స్టార్ మొత్తం 36 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. కాగా ఇటీవల ఈ మూవీ షూటింగ్ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘దృశ్యం 2’ రీమేక్గా తెరకెక్కిన ఈ మూవీ కేవలం 30 రోజుల్లోనే షూటింగ్ను పూర్తి చేసుకుంది. అయితే నారప్ప, దృశ్యం 2 తో పాటు రానా ‘విరాట పర్వం’ కూడా నేరుగా ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. -
నీలోఫర్: రికార్డుల్లో అంకెలు దిద్ది.. రూ.1.2 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రి డైట్ మాజీ కాంట్రాక్టర్ కోడూరి సురేష్ బాబును నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. బోగస్ బిల్లులతో రూ.1.2 కోట్లు స్వాహా చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇతడిపై కేసు నమోదైనట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి పేర్కొన్నారు. మియాపూర్నకు చెందిన సురేష్బాబు 2017 ఏప్రిల్ 1న నిలోఫర్ ఆస్పత్రి డైట్ సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇన్పేషేంట్లతో పాటు వైద్యులకు అవసరమైన ఆహారం సరఫరా చేయడం ఈయన బాధ్యత. 2020 జూలైతో ఈయన కాంట్రాక్టు పూర్తి కావడంతో టెండర్లు పిలిచి మరొకరికి ఈ బాధ్యతలు అప్పగించారు. 2017–18 నుంచి 2019–20 మధ్య ఆహార సరఫరాలో సురేష్ బాబు గోల్మాల్కు పాల్పడినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటి ఆధారంగా ఆస్పత్రి వర్గాలు విచారణ కోసం నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేశాయి. వీరి పరిశీలన నేపథ్యంలోనే ఆహార సరఫరా రికార్డుల్లో అనేక అవకతవకలు ఉన్నట్లు బహిర్గతమైంది. కొన్ని చోట్ల అంకెల్ని దిద్దినట్లు గుర్తించారు. దీంతో నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ గత నెలలో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్ బాబు మొత్తం రూ.1,13,28,320 స్వాహా చేసినట్లు అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఏసీపీ కట్టంగూర్ శ్రీనివాస్రెడ్డి దర్యాప్తు చేపట్టారు. దాదాపు నాలుగేళ్ల పాటు రోగులు, వైద్యులకు సాధారణ ఆహారం సరఫరా చేసిన సురేష్ బాబు హై ప్రొటీన్ డైట్ ఇచ్చినట్లు రికార్డులు సృష్టించాడని తేల్చారు. దీంతో పాటు ఉన్న వైద్యులు, రోగుల కంటే ఎక్కువ మందికి ఆహారం అందించినట్లు రికార్డులు ట్యాంపర్ చేసినట్లు తేల్చారు. ఆస్పత్రి వర్గాలు గుర్తించిన మొత్తానికి మించి రూ.1.2 కోట్లు స్వాహా చేసినట్లు ఆధారాలు సేకరించారు. దీంతో సోమవారం సురేష్ బాబును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
సంగీతంలోకి అడుగుపెడుతున్న సురేష్ ప్రొడక్షన్స్
ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సంగీత పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఎస్పీ మ్యూజిక్ అనే కొత్త మ్యాజిక్ లేబుల్ను ప్రారంభించారు. నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. "1964లో మా నాన్న రామానాయుడుగారు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ 50 ఏళ్లకు పైగా భారతదేశపు పెద్ద చిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలిచింది" "అత్యధిక భారతీయ భాషల్లో సినిమాలు తీసిన ఘనత మాదే. సంగీతం సినిమాలకు హృదయం లాంటది. దాన్ని సొంతంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరాన్ని మేము గుర్తించాం. సురేష్ ప్రొడక్షన్స్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్న ఎస్పీ మ్యూజిక్ లేబుల్ మంచి సంగీతాన్ని అందించడానికి వేదికగా ఉపయోగపడంతో పాటు సంగీత శక్తి కేంద్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అన్నారు. చదవండి: వ్యాక్సిన్ పేరుతో సురేష్బాబుకు టోకరా.. నిందితుడు అరెస్ట్ -
వ్యాక్సిన్ పేరుతో సురేష్బాబుకు టోకరా.. నిందితుడు అరెస్ట్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబును మోసం చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వ్యాక్సిన్ టీకాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడిన నాగార్జున రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాక్సిన్ పేరుతో ఇప్పటి వరకు 10 మంది ప్రముఖులను మోసం చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఓ మంత్రి పేరుతో కూడా నాగార్జునరెడ్డి మోసానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కాగా, కరోనా టీకాలు ఇప్పిస్తానని నమ్మబలికిన నాగార్జున రెడ్డి.. సురేష్ బాబు మేనేజర్ నుంచి లక్ష రూపాయలు అకౌంట్లో వేయించుకున్నాడు. అయితే, నగదు డ్రా చేసుకున్న తర్వాత నిందితుడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. ఈ క్రమంలో మోసపోయినట్లు గ్రహించిన సురేష్ బాబు మేనేజర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. చదవండి: నిర్మాత సురేష్ బాబును బురిడీ కొట్టించిన కేటుగాడు -
నిర్మాత సురేష్ బాబును బురిడీ కొట్టించిన కేటుగాడు
-
నిర్మాత సురేష్ బాబును బురిడీ కొట్టించిన కేటుగాడు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ బడా నిర్మాత సురేష్ బాబును ఓ కేటుగాడు బురిడీ కొట్టించాడు. తన వద్ద వ్యాక్సిన్లు ఉన్నాయంటూ లక్ష రూపాయలు దోచుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్బాబు ఆఫీస్కు ఫోన్ చేశాడు. దీంతో అది నిజమని నమ్మిన మేనేజర్ అతడు అడిగిన లక్ష రూపాయల సొమ్మును ట్రాన్స్ఫర్ చేశాడు. కానీ ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా అతడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇదంతా పెద్ద మోసం అని గ్రహించిన మేనేజర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. చదవండి: హీరోగా రానా తమ్ముడు.. ఆ డైరెక్టర్కు గ్రీన్ సిగ్నల్! -
‘నాన్న ఎప్పుడూ విలువలతో కూడిన చిత్రాలే తీశారు’ - డి. సురేష్బాబు
మస్కట్: డా॥ డి. రామానాయుడు 86వ జయంతి సందర్భంగా వంశీ గ్లోబల్ అవార్డ్స్, ఇండియా, సంతోషం ఫిలిమ్ న్యూస్, తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో సంయుక్తంగా అంతర్జాల వేదికగా మస్కట్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులతో పాటు ఐదు ఖండాలలోని ఇతర ప్రముఖులు ఆయనకు ఘననివాళి అర్పించారు. నిర్మాత అనే పదానికి అసలు సిసలైన చిరునామా డా॥ డి. రామానాయుడు అని వక్తలు కొనియాడారు. ఆయన కుమారుడు, సినీ నిర్మాత డి. సురేష్బాబు మాట్లాడుతూ.. ‘నాన్న చాలా సినిమాలు తీశారు. ఆయన ఎప్పుడూ విలువలతో కూడిన చిత్రాలే నిర్మించారు. పరిశ్రమకు ఏదైనా అవసరమైతే నాన్న ఎలాగైతే స్పందించారో అదే స్ఫూర్తితో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటాన’ని అన్నారు. నటుడు, నిర్మాత, మాజీ పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ..‘సినిమా అనేది అద్భుతమైన మాధ్యమం. సినిమా నిర్మాత అవ్వాలంటే అన్ని విభాగాల మీద పూర్తి అవగాహన ఉండాలని చెప్పిన వ్యక్తి రామానాయుడుగారు’ అని కొనియాడారు. డా॥ వంశీ రామరాజు మాట్లాడుతూ..‘ప్రేమించు’ చిత్రం జయప్రదమైన సందర్భంలో దివ్యాంగుల ఆశ్రమాలకు చేయూతనిచ్చిన మానవతామూర్తి రామానాయుడుగారు’ అన్నారు. తెలుగు కళాసమితి ఓమాన్ కన్వీనర్ అనిల్కుమార్ మాట్లాడుతూ.. ‘ఓడిపోతామనే ఆలోచనలో ఉన్నవారు రామానాయుడు జీవితాన్ని తెరచి చూస్తే ఆయనను ఆదర్శంగా తీసుకొని వారి బాటలో పయనిస్తార’ని అన్నారు. కార్యక్రమాన్ని ప్రముఖ అంతర్జాతీయ గాయని శివశంకరి గీతాంజలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్ కొండేటి, మండలి బుద్ధప్రసాద్, దర్శకుడు బి. గోపాల్, మాధవపెద్ది సురేష్, బలభద్రపాత్రుని రమణి, భువనచంద్ర, చంద్రబోస్, కాశీ విశ్వనాథ్, వి.ఎన్. ఆదిత్య, రామకృష్ణ గౌడ్, రవి కొండబోలు, ముప్పలనేని శివ, ఉపేంద్ర చివుకుల, డా॥ ఎల్లాప్రగడ రామకృష్ణారావు, రత్నకుమార్ కవుటూరు, చింతగుంట ఉదయపద్మ, డా॥ బూరుగుపల్లి వ్యాసకృష్ణ, లలితా రామ్, హరివేణుగోపాల్, రాజేష్ తోలేటి, సరోజా కొమరవోలు, శ్రీదేవి జాగర్లమూడి, సుబ్బు వి. పాలపర్తి, చింతలపూడి త్రినాథరావు, లయన్ ఎ. విజయకుమార్, చైతన్య సూరపనేని, దైవజ్ఞ శర్మ, శ్రీవాణి, రేలంగి నరసింహారావు పాల్గొని ప్రసంగించారు. చదవండి: న్యూజెర్సీలో ఎస్పీ బాలుకు స్వర నీరాజనం! -
హీరోగా రానా తమ్ముడు.. ఆ డైరెక్టర్కు గ్రీన్ సిగ్నల్!
దగ్గుబాటి కుటుంబం నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కానున్నారు. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ రీఎంట్రీకి అంతా సిద్ధమైంది. అతి త్వరలోనే ఓ ప్రముఖ దర్శకుడితో అభిరామ్ సినిమా చేయనున్నారు. ఇప్పటికే వంశీ, తరుణ్ భాస్కర్, రవి బాబులతో చర్చలు జరిగినా అవి వర్కవుట్ కాలేదు. ఫైనల్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ఓ స్ర్కిప్ట్ను సురేష్బాబు ఓకే చేసినట్లు సమాచారాం. దీంతో అతి త్వరలోనే అభిరామ్ను గ్రాండ్గా పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు సురేష్బాబు. ఇది వరకే తేజ దర్శకత్వంలో రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి సినిమా విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నమ్మకంతోనే అభిరామ్కు కూడా డెబ్యూ మూవీతోనే హిట్ కొట్టించాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా తేజ డైరెక్ట్ చేసే ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన..త్వరలోనే ఓ మంచి ప్రాజెక్ట్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పారు. దీంతో ఆర్పీ పట్నాయక్ అభిరామ్ మూవీకి సంగీతం అందించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక తేజ- ఆర్పీ పట్నాయక్ కాంబినేషన్లో ఇప్పటికే జయం, నీ స్నేహం,నువ్వు నేను వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి : సిద్ శ్రీరామ్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా? మన శరీరం కేవలం అందుకోసమే కాదు కదా : రేణు దేశాయ్ -
ఓటీటీలో దృశ్యం-2.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత సురేశ్బాబు
అనుకోకుండా చిక్కుకున్న ఓ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కూతురిని ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం-2. ‘దృశ్యం’ సినిమాకి సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ జంటగా నటించారు. మలయాళంలో డైరెక్ట్ చేసిన జీతూ జోసఫే తెలుగు రీమేక్ను కూడా తెరకెక్కిస్తున్నారు. సురేశ్బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా మలయాళంలో కేవలం 45 రోజుల్లో మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 19న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. అక్కడ ఈ మూవీకి మంచి స్పందన రావడంతో, అదే సినిమాను తెలుగులో వెంకటేశ్తో రీమేక్ చేశారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలాంటి తరుణంలో దృశ్యం-2 సబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి చెందిన ఒక ప్రముఖ సంస్థవారు భారీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాతలు అంగీకరించారనీ, త్వరలోనే ఈ సినిమా ఓటీటీ సంస్థలో విడుదల కానుందని పుకార్లు వచ్చాయి. వీటిపై తాజాగా నిర్మాత సురేశ్ బాబు స్పందించారు. ఓటీటీలో విడుదల అనేది కేవలం పుకారు మాత్రమేనని, తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తామే స్వయంగా చెప్పే వరకు ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. చదవండి: ఈ వీకెండ్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే.. హాట్ టాపిక్గా మారిన పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ -
తండ్రి వర్థంతి: హీరో వెంకటేష్ భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: తెలుగు చలన చిత్ర నిర్మాతగా వచ్చి దేశవ్యాప్తంగా ఎన్నో బాషల్లో సినిమాలు నిర్మించి తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచారు ప్రముఖ దివంగత నిర్మాత దగ్గుబాటి రామానాయుడు. నేడు ఆయన 6వ వర్థంతి. 2015 ఫిబ్రవరి 18న ఆయన అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రెండవ కుమారుడు, హీరో విక్టర్ వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా తండ్రికి నివాళులు అర్పించారు. తన ట్విటర్ ఖాతాలో తండ్రి చిత్ర పటాన్ని గురువారం షేర్ చేస్తూ ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘ఇన్నేళ్లు గడిచాయి. కానీ ఈ రోజు మిగిల్చిన చేదు అనుభవాన్ని మాత్రం అంత ఈజీగా మరవకలేకపోతున్నాం. ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చినందుకు ధన్యవాదాలు నాన్న. లవ్ యూ. మిస్ యూ’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే ఆయన పెద్ద కూమారుడు, నిర్మాత సురేష్ బాబు.. తండ్రికి ఘన నివాళులు అర్పించారు. ఫిల్మ్ నగర్లోని రామానాయడు విగ్రహానికి సురేష్ బాబు, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సత్యనారాయణ, సంతోషం పత్రిక అధినేత నిర్మాత సురేష్ కొండేటి పూల మాలలు వేసి నివాళులు ఘటించారు. Even after all these years, this day is never easy. Thank you for all the memories Nana. Love you and miss you 😞♥️ pic.twitter.com/lLPGe9nyMH — Venkatesh Daggubati (@VenkyMama) February 18, 2021 (చదవండి: ఆసక్తి రేపుతున్న నారప్ప టీజర్) (వెంకీ మామ ఇంటి పని అదిరింది) -
విరాటపర్వం మళ్లీ ఆరంభం
రానా విరామ పర్వం పూర్తయింది. త్వరలోనే విరాట పర్వానికి సంబంధించిన పని ప్రారంభిస్తారని టాక్. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ప్రియమణి, నందితా దాస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బాబు, చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. నక్సలైట్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రకథాంశం ఉంటుంది. రానా, సాయిపల్లవి ఉద్యమకారుల పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ మొదటివారం నుంచి మళ్లీ మొదలు కానుందని టాక్. దాదాపు 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన భాగాన్ని తాజా షెడ్యూల్లో పూర్తి చేయడానికి ప్లాన్ చేశారు. -
దోపిడి కేసును చేధించిన విశాఖ క్రైం పోలీసులు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో తీవ్ర సంచలనం రేపిన పీఎం పాలెం దోపిడీ కేసును విశాఖ క్రైం పోలీసులు చేధించారు. ఈ కేసులో నిందితులైన ఆరుగురిని సోమవారం అరెస్ట్ చేసి వారి నుంచి 12.50 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా విశాఖ క్రైం డీసీసీ సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సుదర్శన్ రెడ్డి పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టమని చెప్పారు. అరెస్టు అయిన వారంతా విశాఖకు చెందిన వారేనని, నిందితులపై గతంలో కలకత్త, పంజాగుట్ట, ఆనకాపల్లీ, శ్రీకాకుళం, గోపాలపట్నంలలో ఇలాంటి కేసులే నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. పోలీసుల వివరాలు ప్రకారం... విశాఖ రైల్వే న్యూ కాలనీకి చెందిన కోటేశ్వర రావు కిరాణా వ్యాపారం చేస్తుంటాడు. అదే ప్రాంతంలో నివసించే అతడి బావ ఏటూరి చిట్టిరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో చిట్టిరాజుకు చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ క్రమంలో తాను బంగారం అవసరమైతే తక్కువ రేటుకి ఇప్పిస్తానని, అయితే అరకేజి కంటే తక్కువ బంగారం ఇవ్వడం సాధ్యం కాదని చిట్టిరాజు, కోటేశ్వరరావును నమ్మించాడు. ఈ నేపథ్యంలో చిట్టిరాజు, కోటేశ్వర రావులను 20 లక్షల రూపాయలను తీసుకు రమ్మని వారిని చెప్పి దోపిడీ చేయాలని ప్రయత్నించి రెండు సార్లు విఫలమయ్యారు. చివరగా గత నెల ఆగస్ట్ 17న మరోసారి పిఎం పాలెం క్రికెట్ స్టేడియం దగ్గరికి 20 లక్షల రుపాయలు తీసుకుని రమ్మని చెప్పాడు. ఆ డబ్బును బయటకు తీసి లెక్కబెడుతుండగా ఇన్నోవా వాహనంలో పోలీస్ సైరన్తో వచ్చి వారిని భయపెట్టి 20 లక్షలతో ఉడాయించాడు. ఇక జరిగిన సంఘటనపై బాధితుడు కోటేశ్వర రావు స్థానిక పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కోటేశ్వరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎంవీపీ పోలీసులు డీసీపీ సురేష్ బాబు ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. -
ఎమ్మెల్సీగా పెన్మత్స సురేష్ బాబు ఏకగ్రీవం
సాక్షి, అమరావతి : ఎమ్మెల్సీగా వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు దివంగత నేత పెనుమత్స సాంబశివరాజు తనయుడు డాక్టర్ సూర్యనారాయణరాజు(సురేష్ బాబు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో సురేష్ బాబు ఏకగ్రీవం అయ్యారని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. (విధేయతకు పట్టం) సురేష్బాబు గురించి సంక్షిప్తంగా పేరు: పెనుమత్స వీర వెంకట సూర్యనారాయణరాజు(సురేష్ బాబు) విద్యార్హత: బీడీఎస్(డెంటల్) వృత్తి: డెంటిస్ట్ పుట్టిన తేది: 6.7.1966 చేపట్టిన పదవులు: ఎంపీటీసీ(మొయిద గ్రామం) ♦ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెంటల్ కౌన్సిల్ మెంబర్(డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వం) ♦ ఇండియన్ డెంటిస్ట్స్ ప్రెసిడెంట్ ♦ వైఎస్సార్సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త ♦ ప్రస్తుతం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి -
నామినేషన్ వేసిన పెన్మత్స సురేష్ బాబు
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేష్ బాబు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. (విధేయతకు పట్టం) ఈ సందర్భంగా పెన్మత్స సురేష్ బాబు మాట్లాడుతూ అందరినీ కలుపుకుని పార్టీకి మంచిపేరు తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. పార్టీకి విధేయుడిగా ఉంటానని, చెడ్డపేరు తీసుకురానని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... పెన్మత్స సాంబశివరావు వారసుడుగా సురేష్ బాబు పార్టీకి విధేయుడుగా ఉన్నారన్నారు. కాగా, రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి దివంగత నేత పెన్మత్స సాంబశివరాజు తనయుడు సురేష్ బాబు పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేసిన విషయం విదితమే. ఇప్పటికే ఈ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్ దాఖలుకు ఈ నెల 13వ తేదీ ఆఖరు. ఈ నెల 24న ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఈ స్థానం సంఖ్యాపరంగా వైఎస్సార్సీపీకే దక్కనుంది. టీడీపీ బరిలో నిలిచే అవకాశం కూడా పెద్దగా లేనందున సురేష్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. -
విధేయతకు పట్టం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విధేయతకు సరైన గుర్తింపు లభించింది. వైఎస్సార్ సీనియర్ నాయకుడు దివంగత నేత పెనుమత్స సాంబశివరాజు తనయుడు డాక్టర్ సూర్యనారాయణరాజు(సురేష్ బాబు)ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి సురేష్ బాబు పేరును మంగళవారం ఖరారు చేశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో పార్టీ పురోభివృద్ధికిసాంబశివరాజు అహర్నిశలూ కృషి చేశారు. వయోభారంతో కొద్దికాలంగా ఆయన చురుగ్గా వ్యవహరించలేకపోయారు. అనారోగ్యంతో సోమవారం ఆయన కన్నుమూశారు. పెద్దాయన మరణంతో ఆయన కుటుంబసభ్యులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించి, డాక్టర్ సురేష్ బాబు ను ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే మంగళవారం ఆయన పేరును ఎమ్మెల్సీ స్థానానికి ఖరారు చేశారు. 13న నామినేషన్ దాఖలు ఇప్పటికే ఈ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్ దాఖలుకు ఈ నెల 13వ తేదీ ఆఖరు. ఈ నెల 24న ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఈ స్థానం సంఖ్యాపరంగా వైఎస్సార్సీపీకే దక్కనుంది. టీడీపీ బరిలో నిలిచే అవకాశం కూడా పెద్దగా లేనందున సురేష్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లో అడుగుపెట్టిన సురేష్ బాబు, 2014 ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీచేసి ఓటమిచెందారు. అయినప్పటికీ నిత్యం పార్టీ కార్యక్రమా ల్లో చురుకుగా పాల్గొంటున్నారు. 2019 ఎన్నికల్లో తన కుమారుడికి బరిలోకి దింపాలని సాంబశివరాజు యత్నించినా రాజకీయ సమీకరణాల దృష్ట్యా అది సాధ్యపడలేదు. జిల్లాలో జరిగిన ప్రజా సంకల్పయాత్రలోనే ఆ కుటుంబా నికి తగిన గుర్తింపునిస్తానని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్సీని చేస్తున్నారు. కాగా గురువా రం ఉదయం నామినేషన్ దాఖలుచేయనున్నట్లు సురేష్ బాబు ’సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. సురేష్బాబు గురించి సంక్షిప్తంగా పేరు: పెనుమత్స వీర వెంకట సూర్యనారాయణరాజు(సురేష్ బాబు) విద్యార్హత: బీడీఎస్(డెంటల్) వృత్తి: డెంటిస్ట్ పుట్టిన తేది: 6.7.1966 చేపట్టిన పదవులు: ఎంపీటీసీ(మొయిద గ్రామం) ♦ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెంటల్ కౌన్సిల్ మెంబర్(డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వం) ♦ ఇండియన్ డెంటిస్ట్స్ ప్రెసిడెంట్ ♦ వైఎస్సార్సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త ♦ ప్రస్తుతం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి -
రెడీ: రానా దగ్గుబాటి
దగ్గుబాటి వారసుడు, టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి నేడు పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. తన ప్రేయసి మిహికా బజాజ్ మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక బంధంలో అడుపెట్టనున్నాడు. ఈ సందర్భంగా రానా ట్విటర్లో షేర్ చేసిన ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘‘రెడీ!!’’ అంటూ వరుడిగా మారిన ఈ బాహుబలి స్టార్ తన తండ్రి సురేశ్ బాబు, బాబాయ్ వెంకటేశ్లతో కలిసి సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న ఫొటోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇన్ అడ్వాన్స్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా పెళ్లికి ముందు నిర్వహించే సంప్రదాయ వేడుకల(హల్దీ, మెహందీ)కు సంబంధించిన రానా- మిహికా ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. (మెరిసే.. మురిసే...) ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో అతికొద్ది సన్నిహితుల సమక్షంలో రానా- మిహికా వివాహం నిరాడంబంరంగా జరుగనుంది. పెళ్లికి హాజరయ్యే ప్రతి ఒక్కరు కచ్చితంగా కోవిడ్-19 పరీక్ష చేయించుకుంటారని, పెళ్లి వేదిక వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేయడంతో పాటుగా... భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటామని వరుడి తండ్రి, ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా ఈ శుభకార్యానికి కేవలం 30 మంది అతిథులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. -
రానా-మిహికా పెళ్లి; వీరికి మాత్రమే ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ హీరో, దగ్గుబాటి వారసుడు రానా తన ప్రేయసి మిహికా బజాజ్తో ఈ నెల 8న ఏడడుగులు వేయనున్నారు. పెళ్లికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో పనులన్నీ చకాచకా జరుతున్నాయి. ఇక ‘మేం ప్రేమలో ఉన్నాం’ అని రానా సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం, ఆ తర్వాత పెద్దలు కలుసుకుని, పెళ్లి ముహూర్తం ఖరారు చేయడం తెలిసిందే. అయితే పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరగబోతుందని, వివాహానికి ఎంతో మంది అతిథులు వస్తున్నారనే వార్తలు ఇటీవల వినిపించడంతో ఈ వదంతులపై రానా తండ్రి సురేష్ బాబు స్పందించారు. రోకా ఫంక్షన్ నిర్వహించిన రామానాయుడు స్టూడియోలోనే వివాహ వేడుక జరగనుందని ఆయన స్పష్టం చేశారు. (రానా-మిహికా ప్రీ వెడ్డింగ్ సందడి షురూ!) సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘వివాహానికి కేవలం 30 మంది మాత్రమే హాజరవుతారు. ఇరు కుటుంబ సభ్యులు మినహా అతిథులు ఎవరూ ఉండరు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతుండటం వల్ల ఈ పెళ్లి వేడుకలో ఎవరి ఆరోగ్యాన్ని రిస్క్లో పడేయాలని మేం అనుకోవడం లేదు. సినిమా ఇండస్ట్రీలో, బయట ఉన్న మా అత్యంత సన్నిహితులను కూడా ఆహ్వానించడం లేదు. పెళ్లి చాలా సింపుల్గా జరుగుతుంది. కానీ, అంతే అందంగా కూడా ఉంటుంది’ అని సురేష్ బాబు చెప్పారు. (మిహికా.. ముందు షాక్ అయ్యింది: రానా) కాగా పెళ్లి వేడుక మొత్తాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని దగ్గుబాటి కుటుంబం ఆలోచిస్తుంది. కరోనా నేపథ్యంలో పెళ్లిలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘పెళ్లికి హాజరయ్యే ప్రతి ఒక్కరు కచ్చితంగా కోవిడ్-19 పరీక్ష చేయించుకుంటారు. వివాహ వేదిక వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేస్తున్నాం. భౌతిక దూరాన్ని పాటిస్తాం. ఇది ఎంతో సంతోషంగా జరుపుకునే వేడుక కాబట్టి దీన్ని అత్యంత భద్రత కలిగిన పండుగగా మారుస్తాం’ అని తెలిపారు. కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా పార్టీని నిర్వహిస్తామని సురేష్ బాబు వెల్లడించారు. (రానా రోకా ఫంక్షన్: సామ్ ఫుల్ హ్యాపీ) View this post on Instagram And it’s official!! 💥💥💥💥 A post shared by Rana Daggubati (@ranadaggubati) on May 20, 2020 at 11:00pm PDT View this post on Instagram To the beginning of forever 💕 @ranadaggubati A post shared by miheeka (@miheeka) on May 20, 2020 at 11:28pm PDT -
ఆలయ అభివృద్ధికి దాతలు భాగస్వాములవ్వాలి
సాక్షి, విజయవాడ: కనక దుర్గ గుడిలో శాశ్వత కేశఖండన శాల నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు అన్నారు. గురువారం మూడు గంటల పాటు కొనసాగిన పాలకమండలి సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా బారిన పడిన సిబ్బందిని ఆలయపరంగా ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం దాతలు ముందు రావాలని కోరారు. డోనర్స్ సెల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా ఆలయ ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ.. పాలకమండలి సమావేశంలో 38 అంశాలపై చర్చించామని తెలిపారు. శివాలయం పునర్నిమాణం, అన్నదానం, ప్రసాదం పొటు, కేశఖండన శాల నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పనులకు సంబంధించి అనుమతులు కూడా వచ్చాయని తెలిపారు. తూర్పు రాజగోపురం నుండి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో దాతలు భాగస్వాములు అవ్వాలని కోరారు. సిబ్బందికి కోవిడ్ ఇన్సూరెన్స్ కల్పించేలా కమిషనర్ దృష్టి కి తీసుకు వెళతామన్నారు. భక్తులు నిర్భయంగా దర్శనానికి రావచ్చని, ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. లాక్ డౌన్ ఎత్తేస్తే దర్శన సమయంలో మార్పులు చేస్తామని వ్యాఖ్యానించారు. -
కనక దుర్గమ్మకి బంగారు బోనం
సాక్షి, విజయవాడ: బెజవాడ కనక దుర్గమ్మకి తెలంగాణ మహాంకాళి ఉమ్మడి దేవాలయాల కమిటీ బంగారు బోనం సమర్పించింది. ఆదివారం తెలంగాణ నుంచి వచ్చిన బోనాలకు దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈఓ సురేష్ బాబు స్వాగతం పలికారు. జమ్మిదొడ్డి నుంచి ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారి సన్నిధికి తెలంగాణ మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు కాలినడకన చేరుకున్నారు. జమ్మిదొడ్డి వద్ద కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. (కరువు సీమలో సిరులు) రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రతి ఏడాది దుర్గమ్మకు బోనం సమర్పిస్తున్నామని తెలిపారు. కరొనా కారణంగా అమ్మవారికి ఆడంబరంగా కాకుండా కేవలం పరిమితంగానే బంగారు బోనం సమర్పిస్తున్నామని చెప్పారు. అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. అదే విదంగా ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు తలిపారు. సాయంత్రం 7 గంటల వరకు శాకాంబరిదేవీగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిబంధనలను అనుసరించి శాకాంబరి ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు. కరోనా నిబంధనల ప్రకారం పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నట్లు చెప్పారు. -
ప్రేక్షకులు ఆమోదిస్తేనే స్టార్స్ అవుతారు
రానా దగ్గుబాటి సమర్పణలో వయాకామ్ 1 మీడియాతో కలిసి సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, షాలినీ వడ్నికట్టి, సీరత్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 25న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఈ సందర్భంగా సురేశ్బాబు సోమవారం మీడియాతో చెప్పిన విశేషాలు. ► ఈ సినిమా ఆహా చానల్లో కూడా జూలై 4 నుండి ప్రసారం అవుతుంది. నిజానికి ఈ సినిమా కథను రానా ఓకే చేయగానే ‘ఏంటిరా... ఇలాంటి కథని ఎలా ఓకే చేశావు’ అని అడిగాను. ‘ప్రస్తుతం నా ఫ్రెండ్స్లో చాలామంది సేమ్ సిట్యువేషన్ ఫేస్ చేస్తున్నారు’ అన్నాడు. వాళ్ల అమ్మ కూడా ‘ఏంటిరా ఈ సినిమా’ అని రానాని తిట్టింది (నవ్వుతూ). సమాజంలో ప్రస్తుతం ఇలానే జరుగుతుందమ్మా అన్నాడు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నదే ఈ సినిమాలో ఉంది. ► ప్రస్తుతానికి మా బ్యానర్లో రవిబాబు దర్శకత్వంలో ‘క్రష్’ సినిమా నిర్మిస్తున్నాం. ఓ నాలుగు పాటలు మాత్రమే బ్యాలెన్స్ షూట్ ఉంది. అది 25 మందితో షూట్ చేయటానికి రవిబాబు ప్లాన్ చేస్తున్నారు. అందుకని ఈ సినిమాని పూర్తి చేసేస్తాం. ‘నారప్ప’, ‘విరాటపర్వం’ సినిమాల షూటింగ్ ఇప్పట్లో మొదలుపెట్టం. ఆ సినిమాలకు సంబంధించి చాలా పెద్ద ఫైట్ సీక్వెన్స్లు చేయాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని నలభై. యాభై మందితో చేయలేం. ‘హిరణ్యకశ్యప’ మూవీని చాలా పెద్ద స్కేల్లో చేస్తాం. ► ఓటీటీ ప్లాట్ఫామ్ మొదట డెవలప్ అయింది ఇతర దేశాల్లోనే. అక్కడ వాళ్లకు సెన్సార్ సర్టిఫికెట్ అంటూ ఏమీ ఉండదు. అందుకే వాళ్లు 18ప్లస్, 13ప్లస్ అని రాస్తారు. అక్కడనుండి దిగుమతి అయిన కల్చర్ కావటంతో అవి అలానే బోల్డ్ కంటెంట్ రూపంలో వస్తున్నాయి. చూడాలి.. ఫ్యూచర్లో ఎలాంటి చట్టాలు వస్తాయో. ► రానా పెళ్లి పనుల గురించి చెప్పాలంటే.. మామూలు టైమ్లో అయితే ఈపాటికి కార్డులు పంచేవాళ్లం. షాపింగ్, పెళ్లి పనులు ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వం ఎంతమందితో చేసుకోమంటే అంతమందితో చేసుకోవాలి. అందుకే పెద్ద పనులేమీ లేవు. అభిరామ్ యాక్టర్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. కొన్ని కథలు కూడా తయారవుతున్నాయి. తెలిసిన వాళ్ల పిల్లలకైనా, మన పిల్లలకైనా, ఎవరికైనా మొదట్లో కొంచెం పుష్ ఇస్తాం కానీ, వాడిని హీరోగా ఒప్పుకోవలసింది, స్క్రీన్ మీద చూసేది ప్రేక్షకులే. ► నెపోటిజమ్ టాపిక్ను సమర్థించను, విమర్శించను. కారణం ఏంటంటే ఎంతోమంది దర్శకుల, నిర్మాతల, హీరోల పిల్లలు ఈ ఇండస్ట్రీలోకి వచ్చి నిరూపించుకోలేకపోయారు. స్టార్స్ ఇళ్లల్లోనుండి పుట్టరు, ఆడియన్స్ ఆమోదంతో స్టార్స్ అవుతారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటుడిగా చాలా సాధించాడు. స్టార్ నుండి సూపర్ స్టార్గా మారే దశలో ఉన్నవాడు ఆత్మహత్య చేసుకోవడం బాధ అనిపించింది. ఉదాహరణకు మన హీరోలనే తీసుకోండి. రవితేజ, నాని, రాజ్ తరుణ్.. ఇలా ఎంతోమంది వచ్చారు. అందరి హీరోలకు గుడ్టైమ్, బ్యాడ్టైమ్ అనేది ఉంటుంది. నేను చెన్నైలో ఉన్నప్పుడు క్రికెట్ చాలా బాగా ఆడేవాణ్ని. అప్పుడు నన్ను టీమ్లో సెలక్ట్ చేయలేదు. అప్పుడు నేను డిప్రెషన్ ఫీలయితే ఎలా? ఏదేమైనా మనం ట్రై చేస్తూనే ఉండాలి. అదే జీవితం. -
నా భర్తను స్వదేశానికి చేర్చండి
వైఎస్ఆర్ జిల్లా, రైల్వేకోడూరు రూరల్ : కువైట్లో తన భర్త అనారోగ్యంతో అవస్థలు పడుతున్నాడని, క్షేమంగా స్వదేశానికి చేర్చాలని ఓ మహిళ వేడుకుంటోంది. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతరాజుపేట పంచాయతీ బీసీ కాలనీకి చెందిన ఇర్ల సురేష్బాబు డ్రైవర్గా జీవనం సాగించే వాడు. ఆయనకు భార్య తేజావతి, కుమారుడు వంశీ(14), మధురిమ(13), మరో కుమారుడు సంతోష్(10) ఉన్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని భావించి, నాలుగేళ్ల క్రితం కువైట్ వెళ్లారు. గతేడాది అక్టోబరులో ఇండియాకు వచ్చారు. భార్య, పిల్లలతో కొన్ని రోజులు గడిపారు. (మరదలిని చంపిన బావ ) రెండో సారి వెళితే జీతం పెరుగుతుందని.. గతేడాది నవంబరు 1న కువైట్ వెళ్లారు. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో.. జనవరిలో అనారోగ్యంగా ఉందని కువైట్లో ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు చేయించుకున్నారు. విషయం భార్య, పిల్లలకు తెలిపారు. మే 2న అదే ఆసుపత్రికి వెళ్లి తనకు ఆరోగ్యం కుదుట పడలేదని, అడ్మిట్ అవుతున్నానని భార్య పిల్లలతో వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన నుంచి ఎటువంటి సమాచారం అందలేదు. అక్కడే ఉంటున్న బంధువులకు ఫోన్ చేసి విచారణ చేయగా.. ఆసుపత్రిలో ఉన్నాడని, వైద్య సేవలు సక్రమంగా అందలేదని తెలిపారు. కోవిడ్ – 19 లాక్డౌన్ కారణంగా ఆసుపత్రిలోకి ఎవరినీ అనుమతించడం లేదని చెప్పారు. తన భర్త ఎలా ఉన్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలియదని తేజావతి ఆందోళన చెందుతోంది. ప్రభుత్వం ఆదుకుని ఆయనకు మంచి వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటోంది. (కువైట్ నుంచి ప్రవాసాంధ్రుల రాక) -
రానా పెళ్లి ముహూర్తం ఫిక్స్..
లాక్డౌన్కు ముందు లవ్ కన్ఫర్మ్ అయిన హీరో రానా తన ప్రేయసి మిహికా బజాజ్తో ఏడడుగులేసేందుకు ఎదురు చూస్తున్నాడు. "ఇట్స్ మై లగ్గం టైమ్" అంటూ బ్యాచిలర్ లైఫ్కు పుల్స్టాప్ పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఇప్పటికే రామానాయుడు స్టూడియోలో రోకా ఫంక్షన్తో పెళ్లి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఇప్పట్లో పెళ్లి తంతు పెట్టుకోరు, డిసెంబర్లో వివాహం జరుగుతుండొచ్చు అని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రానా తండ్రి దగ్గుబాటి సురేష్ బాబు ఆగస్టులోనే పెళ్లి చేసేయాలనుకుంటున్నారట. (ఇదే.. నాకు సంతోషాన్నిచ్చేది: మిహీకా బజాజ్) ఆగస్టు 8వ తేదీన మంచి ముహూర్తం ఉందని, ఆ రోజే ఈ ప్రేమపక్షులను పెళ్లి బంధంతో కలిపేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. హైదరాబాద్లోనే జరగనున్న ఈ పెళ్లి వేడుకకు కేవలం ఇరు కుటుంబాలు మాత్రమే హాజరవనున్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా వచ్చినా, ఇంకేదైనా ప్రళయమే వచ్చినా పెళ్లి ఆగేదే లేదని నిఖిల్ తన ప్రేయసి పల్లవికి మూడు ముళ్లు వేసి ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. దీంతో రానా కూడా ఇదే రూట్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. హీరో నితిన్ మాత్రం నిశ్చితార్థం జరిగినా పెళ్లిని వాయిదా వేస్తూ ఇంకా మంచి ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నాడు. (అమ్మాయిని కలిశాను, నచ్చింది, ఓకే అనుకున్నాం) -
రానా పెళ్లిపై సురేష్ బాబు క్లారిటీ
సోషల్ మీడియా వేదికగా తన ప్రేమ విషయాన్ని వెల్లడించిన హీరో రానా చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. హైదరాబాద్కు చెందిన మిహీక బజాజ్ను ప్రేమిస్తున్నానని.. ఆమె ఒకే చెప్పిందని రానా ప్రకటించారు. దీంతో టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్గా ఉన్న రానా.. ఓ ఇంటివాడు కాబోతుండటంతో పలువురు సినీ ప్రముఖులు రానాకు శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా రానా ప్రేమ, పెళ్లిపై ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పందించారు. బాంబే టైమ్స్తో మాట్లాడిన సురేష్ బాబు... రానా నిశ్చితార్థం గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాదిలోనే రానా పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. (చదవండి : రానా ప్రేయసి మిహీకా వివరాలు ఇవే..) ‘రానా, మిహీకాలు చాలా కాలంగా ఒకరికొకరు తెలుసు. వారిద్దరు ఒకటి కావాలని నిర్ణయం తీసుకోవడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలను సరైన సమయంలో వెల్లడిస్తాం. ఈ ఏడాదిలోనే వారి పెళ్లి జరుగుతుంది. డిసెంబర్లో పెళ్లి చేయాలని మేము అనుకుంటున్నాం.. కానీ అంతకు ముందే జరిగే అవకాశం కూడా ఉంది. అన్ని ఖరారు అయ్యాక వివరాలు వెల్లడిస్తాం. ఈ లాక్డౌన్ సమయంలో మేము ఖాళీగా ఉండకుండా.. పిల్లలు మాకు పని కల్పించారు. మేము ఇప్పుడు పెళ్లికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాం’ అని సురేష్ బాబు తెలిపారు. మరోవైపు రానా, మిహీకా కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్టు బాంబే టైమ్స్ పేర్కొంది. (చదవండి : ఆమె యస్ చెప్పింది : రానా) -
కరోనా డేంజర్: దుర్గ గుడిలో సేవలు నిలిపివేత
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ విజృంభిస్తున్నందున దుర్గ గుడిలో మార్చి 31 వరకు అన్ని సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు పేర్కొన్నారు. అమ్మవారి అంతరాలయ దర్శనాలను రద్దు చేశామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలను నిలిపేసినట్లు వెల్లడించారు. కేశ ఖండనశాలను, అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లే బస్సులను, లిఫ్టులను నిలిపివేశామన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు శానిటైజేషన్ లిక్విడ్ అందజేస్తున్నామని తెలిపారు. భక్తులందరికీ వైద్యపరీక్షలు చేసిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాక దేశ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని హోమాలు జరిపిస్తున్నామన్నారు. (హమ్మయ్యా.. మనోళ్లు వచ్చేశారు) దుర్గాగుడి ఆలయ ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ.. ఉగాది రోజు పంచాగశ్రవణం ఉంటుందని, కానీ అమ్మవారి సేవలకు భక్తులకు అనుమతి లేదన్నారు. అమ్మవారికి జరిగే సేవలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. భక్తులు ఎవరైనా ముందుగా సేవలను బుక్ చేసుకుని ఉంటే వారిపేరున సేవలు నిర్వహిస్తామన్నారు. లేదు, డబ్బు తిరిగి కావాలనుకుంటే చెల్లిస్తామన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిసరాలను శుభ్రపరుస్తున్నామని తెలిపారు. మహామండపం నుంచి మెట్లమార్గం ద్వారా ఘాట్ రోడ్డు మార్గాల్లోనే భక్తుల అనుమతినిచ్చామన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు దర్శనానికి రాకపోవడమే మంచిదని సూచించారు. పొంగలి, కదబం, దద్దోజనం వంటి ప్రసాదాలు ప్యాకెట్ల రూపంలో అందిస్తున్నామని తెలిపారు. (ఓ మై గాడ్... వెంకన్న రక్షించాడు) చదవండి: కరోనాపై టీటీడీ దండయాత్ర -
అల్లరి నరేష్కు జోడీగా కాజల్!
లక్ష్మీ కళ్యాణం సినిమాతో సినిమా రంగానికి పరిచయమైన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నారు. సినిమాల్లోకి అడుగుపెట్టి 12 ఏళ్లు గడుస్తున్న వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే దుల్కర్ సల్మాన్తో కలిసి ‘హే సినామికా’ సినిమా చేయనున్నట్లు కాజల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మరో కథానాయికగా అదితి రావు హైదరీ నటిస్తున్నారు. కొరియోగ్రాఫర్ బృందా ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కానున్నారు. అలాగే కమల్ హాసన్ భారతీయుడు 2 లోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు. అదే విధంగా మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న మోసగాళ్లు సినిమాల్లో నటిస్తున్నారు. (హే సినామికా) ఇదిలా ఉండగా కాజల్ త్వరలో కొరియన్ సినిమా రీమేక్లో నటించనున్నట్లు సమాచారం.ఇప్పటికే గతేడాది సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో సమంత.. ‘ఓ బేబి’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కొరియాలో హిట్టైయిన ‘మిస్ గ్రానీ’ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. తాజాగా 2012లో విడుదలై కొరియన్లో సూపర్ హిట్ సాధించిన ‘డ్యాన్సింగ్ క్వీన్’ను తెలుగులో సురేష్ బాబు తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేయగా.. హీరో పాత్రలో అల్లరి నరేష్ నటించనున్నారు. మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాతో అల్లరి నరేష్కు సెంకడ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు.(డైరెక్టర్గా మారిన ప్రముఖ కొరియోగాఫ్రర్) అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన కాజల్ నటించబోతోన్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇప్పటికే కాజల్ను సంప్రదించినట్లు సురేష్ బాబు చెప్పారు. అయితే ప్రస్తుతం చర్చ నడుస్తోందని ఈ నెల చివరలో స్పష్టత ఇస్తామంటూ ఆయన వెల్లడించారు. ‘డాన్సింగ్ క్వీన్’.. సింగర్ కావాలని కోరుకునే ఓ యువతి జీవితం చుట్టూ తిరిగే కథ. ఈ సినిమా షూటింగ్ మే మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సినిమాకు దర్శకుడిని మాత్రం ఖరారు చేయలేదు.(ఉత్కంఠ రేపుతున్న అల్లరి నరేష్ న్యూ లుక్..!) Look forward to joining my fabulous co artists @dulQuer @aditiraohydari on this wonderful project, ‘Hey Sinamika’ directed by adorable @BrindhaGopal1 master.. this ones going to be special ! 💜 pic.twitter.com/0CtVuFSzy5 — Kajal Aggarwal (@MsKajalAggarwal) March 12, 2020 -
‘మంచి చేయకపోగా..మోసం చేశారు’
సాక్షి, కడప: చంద్రబాబు బీసీల వ్యతిరేకి అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. బీసీల ఓటు బ్యాంకుతో గెలిచిన చంద్రబాబు.. వారికి అన్యాయం చేశారని మండిపడ్డారు. బీసీలు, దళితులకు మంచి చేయకపోగా వారిని మోసం చేయడం దారుణమన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యోచిస్తే.. దాన్ని టీడీపీ అడ్డుకుందని ధ్వజమెత్తారు. చంద్రబాబులా బీసీలను వైఎస్ జగన్ వాడుకోలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధి కి చంద్రబాబు సహకరించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు. (బీసీల ఎదుగుదల ఓర్చుకోలేకపోతున్నారు) రాష్ట్రంలో ఎన్నికలు జరగకూడదని.. రాష్ట్రానికి నిధులు రాకూడదన్నదే చంద్రబాబు దురుద్దేశ్యమని శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. అమ్మ ఒడి, ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ, రైతు భరోసాతో రికార్డు సృష్టించామని తెలిపారు. ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో రాబోయే నాలుగేళ్లలో జిల్లాను,రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆయనకు మాట్లాడే అర్హత లేదు: సురేష్బాబు బీసీలను మోసం చేసింది చంద్రబాబేనని.. వారి గురించే మాట్లాడే అర్హత ఆయనకు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేయాలని నిరంతరం సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబును బీసీలు చీదరించుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికలు జరగకూడదనే దురుద్దేశ్యంతో తన అనుచరులతో కోర్టులో స్టే తెచ్చారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని టీడీపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడు జైలుకెళ్లక తప్పదని సురేష్బాబు పేర్కొన్నారు. (చంద్రబాబు వల్లే బీసీలకు అన్యాయం) -
వెరైటీ టైటిల్.. కొత్త గెటప్తో వెంకీ
ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే హీరో విక్టరీ వెంకటేష్. వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు. ప్రస్తుతం ఆయన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘అసురన్’ తెలుగు రీమేక్లో నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర ప్రకటన వెలువడింది. మరికొన్ని గంటల్లో.. మంగళవారం అర్థరాత్రి 12 గంటలకు ఈ చిత్రం టైటిల్, ఫస్ట్లుక్ను విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉండగా.. విక్టరీ వెంకటేష్ సినిమా టైటిల్ ఇదే అంటూ గుబురు గడ్డంతో ఉన్న వెంకటేష్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వెంకటేష్ కొత్త సినిమా టైటిల్ ‘ నారప్ప’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాగా, సినిమా టైటిల్పై చిత్ర బృదం ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రతీకార కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. వెంకటేశ్ భార్యగా ప్రియమణి కనిపించనున్నారు. మార్చి నెలాఖరుకల్లా షూటింగ్ పూర్తి చేసి వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
అనంతపురంలో అసురన్
తమిళ సూపర్ హిట్ చిత్రం ‘అసురన్’ తెలుగు రీమేక్లో నటించనున్నారు వెంకటేశ్. ఈ సినిమా ఎక్కువ శాతం చిత్రీకరణ రాయలసీమలో జరగనుందని తెలిసింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. కలైపులి యస్.థాను, సురేశ్బాబు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ నెల మధ్యలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందని తెలిసింది. ఈ సినిమాను ఎక్కువగా అనంతపురం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారట. ఇందులో వెంకటేశ్ భార్యగా ప్రియమణి కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రతీకార కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. మార్చి నెలాఖరుకల్లా షూటింగ్ పూర్తి చేసి వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
‘అన్ని దేవాలయాలకు ఒకే వెబ్సైట్’
సాక్షి, విజయవాడ : ఈ ఏడాది భవానీ దీక్షా విరమణలకు అరు లక్షల మంది భవానీలు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారని ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు. 13 లక్షల 39 వేల లడ్డూలను భవానీలకు విక్రయించామని అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చీరలు, లడ్డూ ప్రసాదాల ద్వారా అమ్మవారికి 2 కోట్ల 53 లక్షల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఇంకా హుండీలను లెక్కించాల్సి ఉందని, ఇరుముడుల ద్వారా వచ్చిన సామాగ్రికి 26 న ఆక్షన్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఆక్షన్లో ఎవరైనా పాల్గొనవచ్చని, ప్రతీ మంగళవారం వృద్ధాశ్రమాలకు భోజన అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్నవృద్ధులకు అమ్మవారి దర్శనం చేయించి వారికి చీరలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 26 న సూర్యగ్రహణం సందర్భంగా దుర్గమ్మ ఆలయం మూసివేస్తున్నామన్నారు. రేపు(డిసెంబర్ 25) రాత్రి 9 గంటల 30 నిముషాలకు అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాలు మూసివేస్తున్నామని అన్నారు. తిరిగి 26 సాయంత్రం అమ్మవారి స్నపనాభిషేకం అనంతరం దుర్గమ్మ ఆలయ తలుపులు తెరిచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా నకిలీ వెబ్ సైట్లపై ఫిర్యాదు చేశామని, విచారణ జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాయాలకు ఒకటే వెబ్ సైట్ ఉండాలని ప్లాన్ చేస్తున్నామని, జనవరి 8 న అన్ని దేవాలయాల ఈవోలతో దేవాదాయ శాఖ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం ప్రకటిస్తుందని పేర్కొన్నారు. ఇకపై దుర్గమ్మ దర్శనం కోసం ముందుగానే అన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకొనే వెసులుబాటు భక్తులకు కల్పిస్తున్నామని ఈ ప్రక్రియ ఉగాది నాటికి అమల్లోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. -
నిలువెత్తు తెలుగుదనం గొల్లపూడి సోంతం: ఎస్పీ బాలు
-
వెంకీ మామ ఫ్యామిలీ ప్యాక్
-
తప్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి
‘‘37 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్నాను. మన పాత హిట్ సినిమాలతో పోలిస్తే ఇప్పుడు సినిమాలు సంతృప్తిగా అనిపించవు. హిట్ అవుతాయి. కానీ ఏదో వెలితిగా ఉంటుంది. సొంత యాక్టర్స్ని పెట్టి సరైన సినిమాలు తీయకపోతే ప్రేక్షకులు నవ్వుతారనే భయం ఉంటుంది. అందుకే కథలను సులువుగా అంగీకరించలేను’’ అన్నారు సురేశ్బాబు. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో సురేశ్బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ‘వెంకీ మామ’. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఈ శుక్రవారం చిత్రం రిలీజ్ సందర్భంగా సురేశ్బాబు, టీజీ విశ్వప్రసాద్ మాట్లాడారు. సురేశ్బాబు మాట్లాడుతూ – ‘‘వెంకీ మామ’ కథను జనార్థన మహర్షి రాశారు. ఐడియా బావుంది. కానీ ట్రీట్మెంట్లో చాలా మార్పులు చేయాల్సి ఉంది. ఈ ఐడియాను కోన వెంకట్కు చెప్పాను. వర్క్ చేయొచ్చు అన్నారు. బాబీ పేరుని కోన వెంకట్ సూచించారు. బాబీ తన టీమ్తో తన స్టయిల్లో వర్క్ చేసి నాకు చెప్పాడు. మామాఅల్లుడి బంధాన్ని చూపించే ఓ సన్నివేశాన్ని నాకు వివరించగానే నా కళ్లలో నీళ్లు ఆగకుండా వచ్చాయి. ఈ సినిమా చేస్తున్నాం అన్నాను. ‘వెంకీ మామ’ సినిమా సూపర్, బంపర్ అలాంటివి చెప్పలేను. పూర్తి స్థాయి తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. వెంకటేశ్, నాగచైతన్య కెమిస్ట్రీ హైలైట్గా ఉంటుంది. వెంకీ, చైతన్య ఇద్దరి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమా. ఇంతకుముందు కథ విన్న తర్వాత ‘కానీ... ఏదో మిస్ అయింది’ అనేవాణ్ణి. ఇప్పుడు ఏం మిస్ అయిందో చెప్పగలుగుతున్నాను. సినిమా గురించి ఎక్కువ తెలుసుకుంటున్న కొద్దీ అందులో తప్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కథ చెప్పే దశలోనే ఉన్న సందేహాలు ఎక్కువగా అడిగేస్తుంటాను. కథలు అంత సులువుగా ఓకే చేయనని కూడా అనుకోవచ్చు(నవ్వుతూ). ఇంతకుముందు షూటింగ్కి వెళ్లాక కూడా డౌట్స్ అడిగేవాణ్ణి. ఇప్పుడు వేలు పెట్టడం తగ్గించేశాను(నవ్వుతూ). గుణశేఖర్ దర్శకత్వంలో రానా చేసే ‘హిర ణ్య’కు రెండేళ్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాం. ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ను సక్రమంగా అనుసరించి ఆ సినిమాను తక్కువ టైమ్లో వరల్డ్ క్లాస్ మూవీగా రూపొందించనున్నాం. ‘అసురన్’ రీమేక్తో పాటు, తరుణ్ భాస్కర్తో, త్రినాథరావు నక్కినలతో సినిమాలు చేస్తారు వెంకటేశ్. టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘సురేశ్ ప్రొడక్షన్స్తో కలిసి పని చేయడంతో నమ్మకం ఏర్పడింది. ఈ కథను మొదట వివేక్ కూచిభొట్ల విన్నారు. ఆ తర్వాత సురేశ్బాబుగారి దగ్గరకు తీసుకెళ్లాం. దేనికైనా ప్లానింగ్ ముఖ్యం. మా బేనర్లో 20 సినిమాల వరకూ సిద్ధం కాబోతున్నాయి’’ అన్నారు. ► ‘వెంకీ మామ’ను దసరాకు రిలీజ్ చేయాలనుకున్నాం. వెంకటేశ్ కాలికి గాయం కావడంతో ఆలస్యం అయింది. నవంబర్ అనుకున్నాం. ఆ తర్వాత డిసెంబర్ 13కి ఫిక్స్ చేశాం. రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యాం. సంక్రాంతి పండక్కి రిలీజ్ చేయాలనే ఆలోచన మాత్రం ఎప్పుడూ లేదు. ► డిజిటల్ మాద్యమాలు అమేజాన్, నెట్ఫ్లిక్స్ రావడంతో థియేటర్కి వెళ్లే ప్రేక్షకులు తగ్గుతున్నారు అంటున్నారు. వాళ్లను థియేటర్కి రప్పించే సినిమాలు చేయడం మీద దృష్టిపెట్టాలి. హీరోలందరూ ఏడాదికి రెండు సినిమాలు చేస్తే బావుంటుంది. సినిమా మేకింగ్లో చాలా శాతం అసమర్థత కనిపిసోంది. దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. ► గతంలో దాసరి గురువు పాత్రను పోషించారు. ఇప్పుడు ఎవరూ ఆ బాధ్యతను తీసుకోవడంలేదనే ప్రశ్నకు స్పందిస్తూ – ‘‘దాసరిగారిని గురువులా అందరూ అంగీకరించారు. ఆ స్థానంలో ఇప్పుడు ఎవర్నీ అంగీకరించలేకపోతున్నారు’’ అని అన్నారు. -
ఈ మామకు ఇంకేం కావాలి : వెంకటేష్
‘‘వెంకీ మామ’ సినిమాలోని ‘అమ్మయినా నాన్నయినా నువ్వేలే వెంకీ మామ...’ పాటలా నాకంతా నా అభిమానులే. నా 30 ఏళ్ల కెరీర్లో మీరే నా బలం. ఈ నెల 13న కలుద్దాం’’ అని వెంకటేష్ అన్నారు. కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా, రాశీఖన్నా, పాయల్ రాజ్పుత్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘వెంకీ మామ’. సురేష్బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలవుతోంది. ఖమ్మంలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో చైతూకు మాత్రమే మామ.. కానీ, సినిమా విడుదల తర్వాత అందరికీ వెంకీ మామనే. ఎక్కడికి వెళ్లినా వెంకీ మామ అంటున్నారు. ఈ సినిమాలో చైతూ చించేశాడు.. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ మామకు ఇంకేం కావాలి చెప్పండి. మామ– అల్లుడు సెంటిమెంట్ని బాబీ చాలా బాగా తీశాడు. తమన్ మంచి పాటలిచ్చాడు’’ అన్నారు. నాగ చైతన్య మాట్లాడుతూ– ‘‘నా లైఫ్లో రెండే రెండు సినిమాలు.. ఒకటి ‘మనం’.. రెండోది ‘వెంకీ మామ’. కెమెరా వెనుక ఓ మామ(సురేష్బాబు).. ముందు మరో మామ(వెంకటేష్).. నన్ను చాలా బాగా చూసుకున్నారు. బాబీ కూల్ డైరెక్టర్. ఈ మూవీలో మామా అల్లుళ్ల అల్లరి మామూలుగా ఉండదు’’ అన్నారు. బాబీ మాట్లాడుతూ– ‘‘ఇక్కడికి వచ్చిన వెంకటేష్, నాగచైతన్య, మెగా, నందమూరి, ఘట్టమనేని అభిమానులందరికీ నమస్కారం. ఏ హీరో అభిమానులు కూడా నెగిటివ్ మాట్లాడని హీరో వెంకటేష్గారు. చిన్నప్పుడు వీసీఆర్ కోసం వెళ్తే వెంకీగారి సీడీలు దొరికేవి కావు.. మహిళలు తీసుకుని వెళ్లేవాళ్లు. బ్లాక్లో తీసుకుని రావాల్సి వచ్చేది. ‘ఎఫ్ 2’లో వెంకటేష్గారి ఫన్ చూశారు.. ‘వెంకీ మామ’ లో ఆయన మాస్ యాంగిల్ చూపించాను. ఎంతో కుటుంబ నేపథ్యం ఉన్నా చైతూ కొత్త హీరోగానే ఆలోచిస్తాడు. సురేష్ బాబుగారు పెద్ద పుస్తకం’’ అని తెలిపారు. ‘‘వెంకీ మామ’ నాకు చాలా ప్రత్యేకం’’ అన్నారు రాశీఖన్నా. ‘‘వెంకటేష్గారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో ఇంత త్వరగా పని చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు పాయల్ రాజ్పుత్. ‘‘అన్ని రకాల భావోద్వేగాలున్న మంచి సినిమా ‘వెంకీ మామ’’ అన్నారు సురేష్ బాబు. ‘‘వెంకటేష్, నాగ చైతన్యలతో గ్రేట్ మల్టీస్టారర్ నిర్మించడం ఆనందంగా ఉంది’’ అన్నారు విశ్వప్రసాద్. ‘‘వెంకీ, చైతూల నటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల. -
నాన్నా... ఈ సినిమా మీ కోసమే
‘‘వెంకీమామ’ పక్కా తెలుగు చిత్రం. వల్గారిటీ తప్ప సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయి’’ అన్నారు డి. సురేష్బాబు. వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. పాయల్రాజ్పుత్, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు. డి. సురేష్బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాత. ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాను. కానీ ‘వెంకీమామ’ ప్రత్యేకమైనది. రానా, నాగచైతన్యలతో కలిసి పని చేయాలనుకుంటాను. ఆ కల నేరవేరిందని చెప్పొచ్చు. నాన్నగారు (డి.రామానాయుడు) మా అందరితో సినిమా చేయాలనుకునేవారు. నాన్నగారు ఉండి ఉంటే ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసేవారు. ‘నాన్నా.. ఈ సినిమా మీ కోసమే’. ఇందులో నాగచైతన్య ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్ చేశాడు. మామా అల్లుళ్ల కథను చాలా సెన్సిబుల్గా తెరకెక్కించాడు బాబీ. తమన్ మంచి సంగీతం ఇచ్చాడు’’ అన్నారు. ‘‘నేను ఎన్ని సినిమాలు చేసినా ‘మనం, వెంకీమామ’ నాకు మంచి జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి. కాస్త ఆలస్యమైనా సురేష్ ప్రొడక్షన్స్లో సినిమా చేయాలనే నా ఆశ నేరవేరింది. ‘ప్రేమమ్’ సినిమాలో ఓ చిన్న సన్నివేశంలో మామయ్య వెంకటేష్గారితో కలిసి నటించినప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇప్పుడు ‘వెంకీమామ’లో మామయ్యతో కలిసి చేయడం చాలా సంతోషంగా ఉంది. రాశీతో కలిసి ఇంకా సినిమాలు చేయాలని ఉంది’’ అన్నారు నాగచైతన్య. ‘‘వెంకీమామ’ సినిమా షూటింగ్ టైమ్లో నా మామయ్య సురేంద్ర నాకు గుర్తుకు వచ్చారు. అలా ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరికీ వాళ్ల జీవితాల్లోని వారి మామయ్యలు గుర్తుకు వస్తారు. బాబీ సినిమాను బాగా తీశాడు. నాకు సినిమా అంటే చాలా భయం. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూశాను. నాకంటూ ఓ అభిప్రాయం ఉన్నప్పటికీ ఇతరుల అభిప్రాయల కోసం కంగారుగా ఎదురుచూస్తుంటాను. ఈ సినిమాను తొలిసారి తమన్ చూశాడు. చాలా ఎమోషనల్గా ఉందన్నాడు. వెంకటేశ్, నాగచైతన్యలు కూడా చూసి బాగుందన్నారు. మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమా నచ్చిందన్నారు. చివర్లో వచ్చి సినిమాలో చాలా కీలకమైన పాత్ర చేసిన ప్రకాశ్రాజ్గారికి థ్యాంక్స్’’ అన్నారు డి. సురేష్బాబు. ‘‘సురేష్బాబుగారికి కథ చెప్పబోతున్నాను అన్నప్పుడు కొందరు భయపెట్టారు. ఆయన బుక్ లాంటి వారు అన్నారు. నేను కథ చెప్పిన తర్వాత ‘సూపర్బ్ సూపర్బ్’ అన్నారు. ఈ సినిమా చూసేప్పుడు ప్రతి ఇంట్లో ఉన్న మేనమామకి తన అల్లుడు, అల్లుడికి తన మామ గుర్తుకు వస్తారు. వెంకటేష్గారికి కథ చెప్పినప్పుడు.. చైతూ పాత్రను ఇంకొంచెం బాగా చేయమన్నారు. అప్పడు నాకు మరింత తెలిసింది.. నిజమైన మామాఅల్లుళ్ల బంధం గురించి. ఇద్దరూ బాగా నటించారు’’ అన్నారు బాబీ. ‘‘భావోద్వేగ సన్నివేశాల్లో వెంకటేష్గారు మాస్టర్. ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా ఎమోషనల్ సీన్స్లో బాగా నటించారు’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. ‘‘ఎమోషన్స్తో కూడిన ఎంటర్టైనింగ్ చిత్రం ఇది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘వెంకటేష్గారితో నాకు కొన్ని కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. చైతూ మంచి కో–స్టార్’’ అన్నారు రాశీఖన్నా. -
చూసీ చూడంగానే నచ్చుతుంది
నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా నటించిన చిత్రం ‘చూసీ చూడంగానే’. శేష సింధురావు దర్శకత్వం వహించారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటించారు. ‘పెళ్ళి చూపులు, మెంటల్ మదిలో’ వంటి చిత్రాలను నిర్మించిన రాజ్ కందుకూరి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ని నిర్మాత డి. సురేష్బాబు, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ – ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. మా గత చిత్రాల్లాగానే ఈ సినిమా కూడా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై విడుదల కానుంది. గోపీసుందర్ మంచి సంగీతం అందించారు. ‘మెంటల్ మదిలో’ ఫేమ్ వేద రామన్ చక్కని విజువల్స్ అందించారు. ఈ నెల చివరి వారంలో సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. -
టాలీవుడ్లో ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆదాయపన్నుశాఖ (ఐటీ) దాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భాగ్యనగరంలో టాలీవుడ్కు చెందిన ప్రముఖులు, వారి సంస్థలకు సంబంధించిన కార్యాలయాల్లో 10 చోట్ల ఏకకాలంలో దాడులు జరిగాయి. బుధవారం ఉదయం 6 గంటలకే రామానాయుడు స్టూడియోలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. రెండు మూడేళ్లుగా ఐటీ పన్ను బకాయిలు, బ్యాలెన్స్ షీట్ల రికార్డుల్లో అవకతవకలు దొర్లాయని.. సినిమా నిర్మాణ వ్యయాలు, వార్షిక ఆదాయాల లెక్కల్లోనూ భారీగా అవకతవకలు జరిగాయన్న సమాచారంతో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారని తెలుస్తోంది. రామానాయుడు స్టూడియోతోపాటు దానికి అనుబంధంగా ఉన్న ఏడు సంస్థలపై అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. రామానాయుడు స్టూడియోలోని ఆడిటింగ్ కార్యాలయం, జూబ్లీహిల్స్లోని సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయం, సురేష్ బాబు ఇల్లు, గెస్ట్ హౌస్లలోనూ సోదాలు జరిగాయి. దాదాపు 50 మందికి పైగా అధికారులు సోదాలు నిర్వహించారని సమాచారం. దాడులు జరిగిన అనుబంధ కంపెనీలివే.. సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, దగ్గుపాటి ఫార్స్ అండ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, రాజేశ్వరి ఫార్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ, సురేష్ ప్రొడక్షన్స్, సురేష్ యాడ్స్ కంపెనీలపై దాడులు నిర్వహించారు. అన్ని కార్యాలయాల ఐటీ రిటర్నులు, బ్యాలెన్స్ షీట్లను ఆయా సంస్థల ఆడిటర్ల సమక్షంలో తనిఖీలు చేశారు. ఐటీ రిటర్నులకు సంబంధించిన అనుమానాలతో సాధారణంగా చేసిన తనిఖీలేనని అధికారులు తెలిపారు. హీరోలు వెంకటేష్, నాని ఇళ్లపైనా.. రామానాయుడు స్టూడియోకు సంబంధించి ఏడు చోట్ల తనిఖీలు జరుగుతుండగానే.. నటుడు వెంకటేష్ నివాసం (పుప్పాలగూడలోని డాలర్హిల్స్), అన్నపూర్ణ స్టూడియో, నటుడు నాని ఇల్లు, కార్యాలయం, అక్కినేని నాగార్జున ఇల్లు, కార్యాలయాలపైనా ఐటీ దాడులు జరిగాయి. కూకట్పల్లి ఎమ్మెల్యేపైనా.. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటిపైనా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. కూకట్పల్లిలోని వెంకట్రావునగర్ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయంలో బుధవారం ఉదయం నుంచే అధికారులు సోదాలు చేశారు. ఎమ్మెల్యే కుమారుడు సందీప్రావు డైరెక్టర్గా కొనసాగుతున్న ప్రణీత్ హోమ్స్ కంపెనీ కార్యాలయాలతోపాటు, ఎండీ నరేందర్, మరో ఐదుగురు డైరెక్టర్ల ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి. సోదాల సందర్భంగా అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. -
బాబు కపట దీక్షలను ప్రజలు నమ్మరు
సాక్షి, కడప : ఇసుకపై ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు చేసే కపట దీక్షలను ప్రజలు నమ్మబోరని వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్బాబు అన్నారు. గురువారం కడపలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ లేని విధంగా నూతన పాలసీని తీసుకొని ఉచిత ఇసుక పేరుతో వేలకోట్లు దోచేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి క్యూబిక్ మీటర్ రూ.90–120గా ఉన్న దాన్ని అమాంతం పెంచేసి రైతులకు ఇవ్వకుండా, మామూళ్లు, టోల్గేట్లుపెట్టి, ఇతర రాష్ట్రాలకు తరలించి వేల కోట్లు దోపిడీ చేశారన్నారు. తెలంగాణలో నూతన ఇసుక పాలసీ ద్వారా రూ. 2900కోట్లు ఆదాయం రాగా, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీలో రూ.50కోట్లకు మించి రాలేదన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుందని తహసీల్దార్ వనజాక్షిని దెందులూరు ఎమ్మె ల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టి ఈడ్చినా అతనిపై కేసు పెట్టకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రే రాజీ చేసిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు. ఇసుక మాఫియాగా ఏర్పడి టీడీపీ నేతలు సాగించిన అక్రమాల వల్లే గత ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైందని ఎద్దేవా చేశారు. టీడీపీ సర్కార్ చేసిన తప్పులను తమ ప్రభుత్వం చేసేందుకు సిద్ధగా లేదన్నారు. వరదలు తగ్గుముఖం పట్టినందున కావాల్సినంత ఇసుక అందుబాటులో ఉందన్నారు. అందుకే కిలోమీటర్కు రూ.4.90 లతో ఇసుక ధర నిర్ణయించి సరఫరా చేస్తున్నామని, కొత్త రీచ్లు ఏర్పాటు చేసిన ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఐదేళ్లపాటు ఇసుక దోపిడీ చేసి ఇప్పుడు తగుదునమ్మా అంటూ చంద్రబాబు దీక్ష చేయడం హాస్యాస్పదమని అన్నారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక కడుపు మంటతో దీక్ష చేస్తున్నారని, ఇలాంటివాటిని ప్రజలు నమ్మరని తెలిపారు. వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. -
టీడీపీ ఉనికి కోసమే డ్రామాలు
సాక్షి, కడప కార్పొరేషన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వంద రోజుల పాలనకు ప్రజల నుంచి వస్తున్న ప్రశంసలు, మన్ననలను ఓర్వలేకే ప్రతిపక్షనేత చంద్రబాబు పక్కదారి పట్టించేందుకు ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమం చేపట్టారని వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్బాబు, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి విమర్శించారు. బుధవారం ఇక్కడి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ దేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్ వంద రోజులు విజయవంతంగా పాలన అందించారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు సంబంధించి 20 అంశాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టి 19 తీర్మాణాలు ఆమోదించారన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 75 శాతం హామీలను అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారన్నారు. గ్రామ సచివాలయాల పరీక్షలు 8 రోజుల పాటు ఎక్కడా ఒక్క విమర్శ రాకుండా యూపీపీఎస్సీ తరహాలో నిర్వహించారని చెప్పారు. ఇంటర్వ్యూలు నిర్వహిస్తే తప్పులు జరుగుతాయని, ఎమ్మెల్యేలు, నాయకులు ఒత్తిడి తెచ్చినా మెరిట్ ప్రాతిపదికన పారదర్శకంగా ఉద్యోగాలిస్తున్నారని, తద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని అక్టోబర్ నుంచి తెస్తున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులు గుర్తించి ఆ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకుంటూ, అన్ని సామాజిక వర్గాలకు మేలు చేకూరే విధంగా ప్రతినెలలో ఒక్కో సంక్షేమ పథకాన్ని అమలు చేసేందుకు వీలుగా షడ్యూల్ ప్రకటించారన్నారు. వైఎస్ జగన్ వంద రోజుల పాలనపై అన్ని వర్గాల ప్రజల మన్ననలు, ప్రశంసలు ఓర్వలేక ప్రతిపక్షనేత చంద్రబాబు ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమం నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. దళిత ఎమ్మార్వో వనజాక్షిని చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టి ఈడ్చినప్పుడు, యరపతినేని ఆధ్వర్యంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయినప్పుడు, కోడెల, ఆయన కుమార్తె, కుమారుడు విచ్చలవిడిగా అక్రమాలు చేస్తున్నప్పుడు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో లెక్కలేనన్ని అరాచకాలు, అక్రమాలు చేశారని ఇప్పుడు అవన్నీ వెలుగులోకి వస్తుంటే తట్టుకోలేకపోతున్నారన్నారు. ఆత్మకూరులో 40 ఏళ్లుగా ఫ్యాక్షన్ ఉందని, అక్కడ ఏడుగురిని హత్య చేశారన్నారు. దీన్ని బూచిగా చూపి ప్రజలను పక్కదారి పట్టించాలనుకోవడం దారుణమన్నారు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేస్తే చంద్రబాబు గగ్గోలు పెట్టడం హాస్యాస్పదమన్నారు. ఇదంతా నీవు నేర్పిన విద్యే కదా అని వారు ఎద్దేవా చేశారు. ఆత్మకూరులో నిషేదాజ్ఞలు అమల్లో ఉన్నాయని, అందుకే చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేశారన్నారు. కానీ గత ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి ఎప్పుడు జిల్లాకు వచ్చినా నిషేధాజ్ఞలు అమల్లో లేకపోయినా వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులను హౌస్ అరెస్టులు చేసిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. నీవు ప్రవేశపెట్టిన సంప్రదాయంపై ప్రశ్నించే హక్కు నీకుందా అని వారు నిలదీశారు. టీడీపీ హయాంలో వేలకోట్ల కాంట్రాక్టులు చేసి సంపాదించిన వారంతా ఏ పార్టీలో ఉన్నారో అందరీ తెలుసన్నారు. టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరింది నీ అనుమతితో కాదా అని వారు సూటిగా ప్రశ్నించారు. బ్రహ్మం సాగర్లో నీటిని నింపాలని ఎంపీ, ఎమ్మెల్యేలమంతా ఎన్ని ఆందోళనలు, ధర్నాలు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, 0–18 కీ.మీ కాలువ పనులను పూర్తి చేసి 5వేల క్యూసెక్కుల నీటిని తీసుకొచ్చే వీలున్నా ఆ పని చేయలేదన్నారు. డిసెంబర్ 26న ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన, కుందూ నుంచి తెలుగుంగకు లిఫ్ట్ ద్వారా 1500 క్యూసెక్కుల నీటిని తీసుకురావడానికి రూ.500కోట్లతో పనులు చేపట్టనున్నారని వివరించారు. మాజీ జెడ్పీ వైస్ ఛైర్మెన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి, బీసీ విభాçV ం జిల్లా అధ్యక్షుడు బంగారు నాగయ్య యాదవ్, చీర్ల సురేష్యాదవ్ పాల్గొన్నారు. -
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలోని ఓక్లహాం టర్నర్ జలపాతంలో పడి దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన నూనె సురేష్బాబు (41) అమెరికాలోని డల్లాస్ రాష్ట్రంలో సింటెల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. శుక్రవారం భార్య రూప, పిల్లలు గాయత్రీ అక్షయసంధ్య, సాయిమోహనీష్తో కలిసి ఓక్లహాం టర్నర్ జలపాతానికి హాలిడే ట్రిప్నకు వెళ్లి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి దుర్మరణం పాలయ్యాడు. ‘రెండు నెలల్లో ఇంటికి వస్తానమ్మా అన్నాడు. కానరాని లోకాలకు వెళ్లాడని తెలిసింది. ఎదిగొచ్చిన కొడుకు చేతికి అందివచ్చాడనుకున్న సమయంలో జరిగిన ఈ దుర్ఘటనను ఎలా జీర్ణించుకోవాలో అర్థం కావడం లేదంటూ’ సురేష్బాబు తల్లిదండ్రులు వీరాస్వామి, సుబ్బరత్నం కన్నీరు మున్నీరయ్యారు. కుటుంబ నేపథ్యం ఇదీ.. ఒంగోలు మండలం కొప్పోలు గ్రామ నివాసి నూనె వీరాస్వామి. ఈయన భార్య సుబ్బరత్నం. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వెంకట రమేష్. చిన్న కుమారుడు నూనె సురేష్బాబు (41). ప్రస్తుతం ఒంగోలు నగరంలోని రంగుతోట 5వ లైనులో ఉంటున్నారు. సురేష్బాబుకు 15 సంవత్సరాల క్రితం నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన రూపతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. పాప గాయత్రీ అక్షయ సంధ్య (13), బాబు సాయిమోహనీష్ (8). మూడేళ్ల క్రితం ఉద్యోగం నిమిత్తం వీరు అమెరికా వెళ్లారు. ఏడాది క్రితం తల్లిదండ్రులను చూసేందుకు వచ్చాడు. ఇటీవలే మరో రెండు నెలల్లో వస్తానని చెప్పాడు. ఈ లోపుగానే విషాద ఘటన సమాచారం అందింది. మృతదేహం తరలించేందుకు తెలుగు సంఘాల కృషి.. సురేష్బాబు మృతదేహాన్ని ఒంగోలుకు తరలించేందుకు కుటుంబ సభ్యులకు అండగా అమెరికాలో స్థిరపడ్డ తెలుగు సంఘాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే సురేష్ మృతదేహాన్ని రెస్క్యూ టీం ఆస్పత్రికి తరలించింది. మృతదేహాన్ని డల్లాస్ నుంచి ఇండియాకు తరలించేందుకు 80 వేల డాలర్లు (రూ.53 లక్షలు) వ్యయం అవుతుందని అంచనా. ఈ మొత్తాన్ని ఆ కుటుంబం భరించడం అసాధ్యం అని భావించిన తెలుగు సంఘాలు సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే ఫండ్ రైజింగ్ వెబ్సైట్లో తమవంతు సాయాన్ని వారు అందిస్తున్నారు. -
‘జీవితాంతం రుణపడి వుంటాము’
మూవీ మొఘల్ డా.డి రామానాయుడు జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఫిలింఛాంబర్లో ఆవిష్కరించారు. సురేష్ బాబు రామానాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించగా.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, జి. ఆదిశేషగిరి రావు, పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్, సురేష్ బాబు, రానా, నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు. తన కొడుకు, మనవడు కలిసి నటిస్తే చూడాలన్నది రామానాయుడు గారి కోరిక అని.. అది ‘వెంకీమామా’ సినిమాతో తీరుతుందని సురేష్ బాబు అన్నారు. కానీ ఈ సమయంలో ఆయనను చాలా మిస్ అవుతున్నామని సురేష్ బాబు తెలిపారు. ‘వెంకీ మామా చిత్రం నీకోసమే తాత’ అంటూ నాగచైతన్య ట్వీట్ చేశాడు. మై బిగ్గెస్ట్ హీరో అంటూ రానా.. ‘మీరు ఎప్పటికీ మాతోనే ఉంటారు నాన్న, మీ కలను నిజం చేస్తున్నాము. మిమ్మల్ని మిస్ అవుతున్నాం. హ్యాపీ బర్త్డే’ అంటూ వెంకటేష్ పోస్ట్ చేశారు. ‘ఎంతోమంది సినీ ప్రముఖులకు జీవితాన్నిచ్చిన రామానాయుడుగారి జన్మదినం నేడు. ఈ నాడు ఆయన శిలా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో పాల్గొని నివాళి అర్పించాను. నాయుడు గారూ మేము మీకు ముందడుగు సినిమారాస్తే , మమ్మల్ని మీరు పరిశ్రమలో ముందడుగు వేయించారు. జీవితాంతం రుణపడివుంటాము’ అని పరుచూరి గోపాలకృష్ణ భావోద్వేగంగా స్పందించారు. -
అవన్నీ రూమర్స్ : నిర్మాత సురేష్ బాబు
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ మళ్లీ స్పీడు పెంచారు. ఇటీవల లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకటేష్ ఎఫ్2తో గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి వెంకీ మామ సినిమాలో నటిస్తున్న విక్టరీ హీరో ఓ కోలీవుడ్ సూపర్ హిట్ను తెలుగు రీమేక్ చేయనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా తెరకెక్కిన విక్రమ్ వేదా సినిమాను వెంకటేష్, నారా రోహిత్లు రీమేక్ చేస్తున్నారంటు ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై నిర్మాత సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. ‘వెంకటేష్ తమిళ సినిమా విక్రమ్ వేదాను టాలీవుడ్లో రీమేక్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజంలేదు. వెంకటేష్ ప్రస్తుతం వెంకీ మామ సినిమా మాత్రమే చేస్తున్నారు. తదుపరి చిత్రాల వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. There is no truth in reports doing rounds in media that #VenkateshDaggubati garu is doing ‘Vikram Vedha’ Telugu remake. He is currently busy filming for #VenkyMama. The next films will be announced shortly. 😊 — Suresh Productions (@SureshProdns) 7 May 2019 -
ఏకపక్ష గెలుపు వైఎస్సార్ సీపీదే
సాక్షి, వైఎస్సార్ జిల్లా : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా గెలవనుందని ఆ పార్టీ కడప పార్లమెంటు అధ్యక్షుడు సురేష్ బాబు అన్నారు. శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో టీడీపీ చేసిన కుట్రలు పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కేవలం కేసీఆర్, మోదీ, వైఎస్ జగన్ జపం చేశారే తప్ప ప్రజలకు ఏం చేస్తారో మాత్రం చెప్పలేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తన ఓటమిని ఒప్పుకోకుండా ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇంటలెజిన్స్ వ్యవస్థను నాశనం చేసేలా డీజీ వెంకటేశ్వరరావు వ్యవహరించారని మండిపడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను తప్పుదోవ పట్టేలా వైఎస్ కుటుంబంపై నిందలు వేశారని మండిపడ్డారు. చంద్రబాబు కుయుక్తులు, వైఫల్యాలను ప్రజలు గుర్తించారని.. ఆయనకు ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో హైప్ క్రియేట్ చేసినట్లుగా.. చంద్రబాబు పాలనలో చేసిందేమీ లేదని వైఎస్సార్ సీపీ కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రనాధ్ రెడ్డి అన్నారు. ‘ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రైతులకు ఏదో మేలు చేసేలా చంద్రబాబు అన్నదాత సుఖీభవ చెక్కులు ఇచ్చారు.. తెలంగాణలో హైప్ చేసినట్లుగా ఇక్కడ కూడా చేయాలని అనుకున్నారు. కానీ చంద్రబాబు అన్ని రకాలుగా విఫలమయ్యారు’ అని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్కు పట్టం కట్టేలా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్కు ఓట్లు వేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కచ్చితంగా పూర్తి మెజార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రానుందని వ్యాఖ్యానించారు. ఇవన్నీ తెలిసే చంద్రబాబు తన వైఫల్యాలను ఈసీపై నెట్టుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు అందరినీ మోసం చేశాడు.. ఐదేళ్ల కాలంలో అందరినీ మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని కడప అసెంబ్లీ అభ్యర్థి అంజాద్ బాషా మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు స్పష్టం అవుతోందన్నారు. ప్రజలు పాలనలో మార్పు రావాలని కోరుకుంటున్నారని.. ఎన్నికల్లో తీర్పు ప్రభంజనంలా ఉండబోతుందని పేర్కొన్నారు. కొన్నిచోట్ల ఈవీఎంలు సహకరించకపోయినా ప్రజలు ఓర్పుతో ఉన్నారన్నారు. తాను కనుగొన్నాను అని చెప్పుకునే టెక్నాలజీపై ఇప్పుడు బాబు నిందలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. -
జూన్ నుంచి రోలింగ్
పీరియాడికల్ చిత్రాలు, ప్యాన్ ఇండియా చిత్రాలపై రానా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారన్న సంగతి ఆయన సినిమాల ఎంపిక విషయాన్ని చూసి గమనించవచ్చు. ‘హాధీమేరీ సాథీ, 1945’ వంటి బహుబాషా చిత్రాలతోప్రస్తుతం బిజీగా ఉన్నారు రానా. ఇది వరకే అంగీకరించిన ‘హిరణ్యకశిప’ చిత్రాన్ని జూన్ నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారట. గుణశేఖర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సుమారు 180 కోట్ల బడ్జెట్తో సురేశ్బాబు నిర్మించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయని సమాచారం. ఈ చిత్ర వీఎఫ్ఎక్స్కు సుమారు 17 వీఎఫ్ఎక్స్ స్టూడియోలు పని చేయనున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్లపై అక్రమ కేసులు
కడప అర్బన్: జిల్లాలో ఫారం–7 పేరుతో తమ పార్టీకి చెందిన బూత్ కమిటీ కన్వీనర్లను పోలీస్ స్టేషన్లకు పిలిపించి వేధింపులకు గురి చేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన వ్యక్తంచేశారు. వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ సురేష్బాబు, ఎమ్మెల్యేలు అంజద్బాషా, ఎస్. రఘురామిరెడి, పార్టీ నాయకులు గురువారం ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను కలిశారు. తమ బూత్ కన్వీనర్లను వేధింపులకు గురిచేస్తున్న వైనాలను వారు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ఎస్పీ సానుకూలంగా స్పందించారు. ఈసందర్భంగా కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, కడప నగర మేయర్ కె.సురేష్బాబు మాట్లాడుతూ కడప పరిధిలో లక్షా 28వేల ఓట్లు అక్రమంగా తొలగించారన్నారు. వాటిలో దాదాపు 77వేల ఓట్లు రెన్యూవల్చేయడంలో వైఎస్ఆర్సిపి బూత్ కమిటీ కన్వీనర్లే కీలకపాత్ర పోషించారన్నారు. కానీ ఇందుకు భిన్నంగా పార్టీ బూత్ కమిటీ కన్వీనర్లను పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఎలాంటి భయాలకు లోనుకావాల్సిన అవసరంలేదని బూత్ కన్వీనర్లకు ఆయన భరోసా ఇచ్చారు. 2009, 2014 ఎన్నికల్లో కేసుల్లో వున్న వారిని మాత్రమే బైండోవర్ చేయాలని.. అనవసరంగా ఎవరిపైనా బైండోవర్లు చేసి, ఇబ్బందులకు గురి చేయవద్దనీ ఎస్పీని కోరామన్నారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ కేసుల విషయంలో ఎన్నికల కమిషన్ సిఫారసులను అనుసరిస్తామని ఎస్పీహామీ ఇచ్చారన్నారు, క్షణ్ణంగా విచారించి చర్యలు చేపడతామన్నారన్నారు. ఓట్ల తొలగింపు పేరుతో బూత్ కమిటీ కన్వీనర్లపై కేసులు బనాయించడం సరికాదనీ కడప ఎమ్మెల్యే అంజద్బాష ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో 2లక్షల 56వేల ఓట్లు వుండగా, లక్షా 64 వేల ఓట్లను అక్రమంగా తొలగించారన్నారు. వైఎస్ఆర్సిపి బూత్ కమిటీ కన్వీనర్లు చొరవ తీసుకుని, ఓట్ల సంఖ్యను పెంచేలా ప్రజలను చైతన్య పరిచారని గుర్తు చేశారు. అధికార పార్టీ వారు చేయలేని పనిని తమ పార్టీ స్వచ్చందంగా నిర్వహించిదన్నారు. తమకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కొందరు అధికార పార్టీ అండదండలతో ఫారం–7 పేరిట దొంగ దరఖాస్తులు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వెళతామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నేతలు భరత్రెడ్డి, షఫీవుల్లా, యానాదయ్యలు పాల్గొన్నారు. -
‘చంద్రబాబుది నియంతపాలన’
సాక్షి, వైఎస్సార్: రేపు కడపలో జరిగే వైఎస్సార్ కాంగ్రెస్ సమర శంఖారావంను విజయవంతం చేయాలని కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, ఎమ్మెల్యే అంజాద్ పాషా పిలుపునిచ్చారు. సభ ద్వారా జిల్లాలోని బూత్స్థాయి సభ్యులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారని వారు తెలిపారు. పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నిపేందుకునే సమర శంఖారావంను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో చంద్రబాబు నియంత పాలన సాగిస్తున్నారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి లాగుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలపై గతంలో విమర్శలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అవే పథకాలను కాపీ కొట్టారని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. -
టీజర్ ఫ్రెష్గా ఉంది – డి. సురేశ్బాబు
‘‘మళ్లీ మళ్లీ చూశా’ సినిమా టీజర్ చాలా ఫ్రెష్గా ఉంది. ఈ చిత్రకథాంశం యువతకు బాగా చేరువయ్యేలా ఉంది. అనురాగ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. టీమ్కి ఆల్ ది బెస్ట్’’ అని నిర్మాత డి. సురేశ్బాబు అన్నారు. అనురాగ్ కొణిదెన హీరోగా, శ్వేతా అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లుగా సాయిదేవ రామన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మళ్లీ మళ్లీ చూశా’. క్రిషి క్రియేషన్స్ పతాకంపై కొణిదెన కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా టీజర్ని సురేశ్బాబు విడుదల చేశారు. నిర్మాత కోటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘మేం అనుకున్న దానికంటే ‘మళ్లీ మళ్లీ చూశా’ సినిమా బాగా వచ్చింది. మా చిత్రకథ నచ్చి టీజర్ విడుదల చేసిన సురేశ్బాబుగారికి ధన్యవాదాలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ప్రకృతి సృష్టించిన అందమైన ప్రేమకథ మా ‘మళ్లీ మళ్లీ చూశా. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అన్నారు సాయిదేవ రామన్. ‘‘కంటెంట్ ఓరియంటెడ్ సినిమాతో హీరోగా పరిచయమవడం హ్యాపీ’’ అన్నారు అనురాగ్. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, కెమెరా: సతీష్ ముత్యాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి సతీష్ పాలకుర్తి. -
సురేష్ బాబు చేతుల మీదుగా ‘మళ్ళీ మళ్ళీ చూశా’ టీజర్
అనురాగ్ కొణిదెనని హీరోగా పరిచయ చేస్తూ క్రిషి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా ‘మళ్ళీ మళ్ళీ చూశా’. సాయిదేవ రామన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కొణిదెన కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరొయిన్ లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ను నిర్మాత సురేష్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘మళ్ళీ మళ్ళీ చూశా’ టీజర్ చాలా ఫ్రెష్గా ఉంది. కంటెంట్ యూత్ కు బాగా చెరువయ్యేలా ఉంది. హీరో అనురాగ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. టీమ్ కు ఆల్ ది బెస్ట్’ అన్నారు. దర్శకుడు సాయిదేవ రామన్ మాట్లాడుతూ.. ‘సురేష్ బాబు గారికి ధన్యవాదాలు. ప్రకృతి సృష్టించిన అందమైన ప్రేమకథ చిత్రం మా మళ్ళీ మళ్ళీ చూశా సినిమా’ అన్నారు. నిర్మాత కోటేశ్వరరావు కొణిదెన మాట్లాడుతూ.. ‘మా సినిమా కంటెంట్ నచ్చి టీజర్ విడుదల చేసిన సురేష్ బాబు గారికి ధన్యవాదాలు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సినిమా మేం అనుకున్న దానికంటే బాగా వచ్చింది. త్వరలోనే ఆడియో రిలీజ్ ని చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం.’ అన్నారు. -
కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తాం
ఎర్రగుంట్ల: వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ముందుగా కాంట్రాక్టు కార్మికులందరిని పర్మినెంట్ చేసి, విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని వైఎస్సార్ సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు తెలిపారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లు– 2018ను ఉపసంహరించాలంటూ 1104 యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక అ«ధ్యక్షడు జగదీశ్వర్ చేస్తున్న నిరాహార దీక్షను సందర్శించి జగదీశ్వర్కు నిమ్మరసం ఇచ్చి సురేష్బాబు, సుధీర్రెడ్డిలు, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ బుధవారం సాయంత్రం దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా సురేష్బాబు మాట్లాడుతూ కార్మిక సోదరులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం చూస్తే చాలా బాధాకరమన్నారు. నాలుగేళ్లుగా జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలలో ఔట్ సోర్సింగ్ బాధితులు చాలా ఎక్కువగా కన్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 35 వేల మంది కార్మికులు కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ సీఎం రమేష్ నియంతగా వ్యవహరిస్తున్నారన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనే 600 మెగావాట్ల యూనిట్ను పెంచిన వ్యక్తి వైఎస్సారే అని యువతకు ఉపాధి కల్పించారన్నారు. ఈ రోజు ఆ యూనిట్లను రన్ కాకుండా నిలుపుదల చేసే పరిస్థితి ఉందన్నారు. 600 మెగావాట్లను రన్ కాకుండా చేస్తున్నారని చెప్పారు. జిల్లా వాసి అయిన సీఎండీ ఈ ప్రాంత వాసులను అన్యాయం చేస్తున్నారని చెప్పారు. బినామీగా సీఎం రమేష్, నారా లోకేష్ ద్వారా బొగ్గులో కుంభకోణం జరిగిందన్నారు. ఉక్కు పరిశ్రమ వస్తే చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వం అవినీతిమయం టీడీపీ ప్రభుత్వంలో ప్రతి డిపార్ట్మెంట్ అవినీతిమయం అయిందని తెలిపారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాగానే ఆర్టీపీపీలో అన్ని యూనిట్లు పనిచేసేలా బాధ్యత తీసుకుంటామన్నారు.ఎన్నికల ముందు చంద్రబాబు ఉచిత హామీలను ఇచ్చి మోసం చేశారన్నారు. కార్మికులకు సంపూర్ణ మద్దతు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎం. సుధీర్రెడ్డి మాట్లాడుతూ కార్మికులకు వైఎస్సార్ సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ప్రవేటీకరణ పేరుతో టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను మూయించే ఆలోచనలో ఉందన్నారు. అందులో భాగంగానే గతంలో సీసీఐను ప్రవేటీకరణ చేసి ఎందరో ఉద్యోగులను, కార్మికులను రోడ్డున వేశారన్నారు. ఈ బిల్లు వల్ల విద్యుత్ సంస్థలను కూడా ప్రవేటీకరణ చేసి పెద్ద కంపెనీలకు అప్పగించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచనలో ఉన్నాయని, అందుకే బిల్లు ఆమోదం పొందకుండా ఐక్యంగా ఉండి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీపీపీని స్థానిక అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారని చెప్పారు. బ్యాక్డౌన్ పేరుతో ఆర్టీపీపీని నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. ఆర్టీపీపీకి బ్రహ్మంసాగర్ నుంచి నీటిని సరఫరా చేసి దానిని మనుగడను కాపాడిన ఏకైక వ్యక్తి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి అని చెప్పారు. అందుకే వైఎస్ జగనన్న సీఎం అయితే మన ప్రాంతంలోని అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎం.హర్షవర్ధన్రెడ్డి, 1104 యూనియన్ రాష్ట్ర అ««ధ్యక్షుడు పి.చంద్రశేఖర్లు ప్రసంగించారు. -
‘చంద్రబాబు ఫ్లైట్ ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానాలకు పెట్టిన ఖర్చుపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సురేష్ బాబు డిమాండ్ చేశారు. బుధవారం కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా రేపు (గురువారం) ఉదయం కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం తొలి నుంచి పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. హోదా వద్దు ప్యాకేజీ ముద్దన్న చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్ తీసుకొని నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెట్టింది చంద్రబాబేనని, ముఖ్యమంత్రిగా ఆయన అన్ని రంగాల్లో విఫలమయ్యారని విమర్శించారు. జనవరి 9న ఇచ్చాపురంలో జరిగే ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా.. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ చంద్రబాబుకు ఉక్కు పరిశ్రమ గుర్తుకు వచ్చిందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాద్ రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వంతో అంటకాగిన చంద్రబాబుకు ఉక్కుపరిశ్రమ గుర్తుకు రాలేదని, విభజన హామీల అమలు కోసం ఏనాడైనా నిలదీసారా?అని ప్రశ్నించారు. ధర్మపోరాట దీక్షల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, శ్వేత పత్రాలతో ప్రజలకు పూర్తి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దోపిడీ అరాచకాలను ప్రజలు గమిస్తున్నారన్నారు. వైఎస్ జగన్ పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి ఈ సందర్భంగా రవీంద్రనాద్ ధన్యవాదాలు తెలిపారు. పచ్చ చొక్కాలకే నిరుద్యోగ భృతి.. పచ్చ చొక్కాలు వేసుకున్న వారికే నిరుద్యోగ భృతి ఇస్తున్నారని కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా తెలిపారు. జాబు కావాలంటే బాబు కావాలి అన్న చంద్రబాబు నాలుగేళ్లుగా ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. నాడు సోనియాగాంధీని ఇష్టం వచ్చినట్లు తిట్టి, ఇప్పుడు సిగ్గు లేకుండా కాంగ్రెస్తో పొత్తుపెట్టుకుంటున్నారని మండిపడ్డారు. రాజధాని ముసుగులో లక్షల కోట్ల రూపాయలను తెలుగు తమ్ముళ్లు దండుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు దుష్ట పాలనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారని, ఆయనను ఏ ఒక్కరు నమ్మే స్థితిలో లేరన్నారు. -
ఉక్కు శంకుస్థాపన ఎన్నికల జిమ్మిక్కు
కడప అగ్రికల్చర్: ఉక్కుఫ్యాక్టరీ శంకుస్థాపన కేవలం జిమ్మిక్కులు.. నిరుద్యోగ యువతను మభ్యపెట్టడానికే తప్ప చిత్తశుద్ధితో చేసిన పనికాదని వైస్సార్సీపీ కడప పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు ధ్వజమెత్తారు. శుక్రవారం కడప నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో అంటకాగి ని«ధులు తెచ్చుకుని వాటిని దిగమిగుతూ, హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తగుదునమ్మా అంటూ 120 రోజుల్లో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి కొత్త డ్రామాకు, నాటకానికి తెరలేపారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 1700 రోజులు గడిపోయాయని, ఇక మిగిలింది తట్టాబుట్టా సర్దుకునే సమయంలో జిల్లా ప్రజలను, రైతులను, నిరుద్యోగ యువతను మభ్య పెట్టడానికే ఈ ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన తప్ప మరొకటి కాదని దుయ్యబట్టారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ను ఉక్కుదీక్షకు కూర్చొబెట్టి నాడు నాటకం ఆడారన్నారు. ఇప్పుడు శంకుస్థాపనతో ప్రజలను పక్కదోవ పట్టించడానికి డ్రామా లాడుతున్నారన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉక్కుఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి వెంటనే పనులు ప్రారంభిస్తామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, రైతులకు ఉపాధి కల్పిస్తామని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించగానే సీఎం ఆయన మంత్రులు ఉలిక్కిపడి ఇప్పుడు శంకుస్థాపన చేశారని అన్నారు. కేవలం 120 రోజుల్లో ఫ్యాక్టరీ ఎలా నిర్మిస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు విభజన సమయంలో కేటాయించిన రూ.1600 కోట్లు కాగా, దాన్ని తామే చేపడతామని రూ.58వేల కోట్లకు పెంచుకుని కమీషన్లు దోచుకుని ప్రాజెక్టు పూర్తికాకుండా చేశారని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. రాష్ట్రానికి జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని మా నాయకుడు ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు వివరిస్తూ జనం మధ్య తిరుగూ ప్రజా సంకల్పయాత్ర చేపట్టి దిగ్విజయంగా నిర్వహిస్తున్నారని అన్నారు. మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం, విభజన చట్టంలోని హామీలపై పోరాటాలు చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. నాలుగేళ్లుగా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు ప్రతి సభలోను ప్రతిపక్షం అభివృద్ధిని అడ్డుకుంటోందని చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రతి సభలో నాకు అన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పడం దారుణమన్నారు. అక్రమాలను, అవినీతిని అడ్డుకుంటున్నామేగానీ, అభివృద్ధికి ఎనాడు అడ్డుపడలేదని అన్నారు. ఉక్కుఫ్యాక్టరీ సాధన కోసం ఆందోళనలు, నిరసనలు, నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టిన వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం, ఆర్సీపీ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టింది టీడీపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నిస్తున్నామన్నారు. నాలుగున్నరేళ్లుగా సీఎం చంద్రబాబునాయుడు జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఎన్నో హామీలు ఇస్తూ పోతున్నా ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదన్నారు. రైతులు, ప్రజలు ఉమ్మివేస్తున్నా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీసీ వర్గాల ప్రజలను, చేతి వృత్తుల వారిని మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం రాగానే బీసీ కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలైన చేయడానికి సిద్ధంగా ఉంటుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బీసీలు, ఇతర వర్గాల పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి ఉన్నత చదువులను ప్రోత్సహించారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో పార్టీ యుత్వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాకా సురేష్, పార్టీ నగర అధ్యక్షుడు పులి సునిల్ కుమార్, అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కడప పార్లమెంటు అధ్యక్షుడు చిత్తా విజయప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఆ ఘనత వైఎస్సార్కే దక్కుతుంది’
సాక్షి, వైఎస్సార్ : జమ్మలమడుగులో 42 వేల ఇల్లు కట్టించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మాత్రమే దక్కుతుందని వైఎస్సార్ సీపీ నేత సురేష్ బాబు వ్యాఖ్యానించారు. సోమవారం వైఎస్సార్ సీపీ జిల్లా కేంద్రంలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో సురేష్ బాబు, రవీంద్రనాథ్ రెడ్డి, పులి సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. జిల్లా అభివృద్దిలో మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. మంత్రి సొంత గ్రామంలో ప్రజలు వైఎస్సార్ సీపీని ఆదరిస్తున్నారని, దాన్ని ఓర్చుకోలేక బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన గ్రామాల్లోకి వెళ్లి టీడీపీ వారిని మళ్లీ టీడీపీలో చేర్చుకున్న ఘనత ఆదినారాయణరెడ్డిదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ జిల్లాకు కృష్టా జలాలు రావటానికి వైఎస్సార్ కారణమని, దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఆ ఘనత కూడా తమ ఖాతాలో వేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే రానున్న ఎన్నికల్లో తమ పార్టీపై పోటీచేసి డిపాజిట్లు తెచ్చుకోవాలని ఆదినారాయణరెడ్డికి సవాల్ విసిరారు. అనంతరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఫ్యాన్ గుర్తుపై గెలిచి టీడీపీలోకి వెళ్లిన ఆదికి బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. జగన్ చలువ వల్ల నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావన్నది మర్చిపోవద్దు. మార్కుఫెడ్ ద్వారా భారీగా అక్రమాలకు పాల్పడ్డ మంత్రి ఆదినారాయణరెడ్డి.. నీ స్థాయి ఏమిటో గుర్తు పెట్టుకుని మాట్లాడితే మంచిది. లేదంటే ప్రజలు నీకు తప్పనిసరిగా బుద్ది చెబుతార’ని అన్నారు. అనంతరం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పులి సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ‘దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంత్రి స్థాయిలో ఉన్న ఆదికి తగదు. కారంచేడు సంఘటన నుంచి ఇప్పటివరకు దళితులపై దాడులకు టీడీపీ కారణం. రాబోయే రోజుల్లో దళిత వర్గాలు మీకు బుద్ది చెప్పడం ఖాయం. ఓట్ల కోసం దళితుడు కావాలి కానీ పక్కన కూర్చోవడానికి టీడీపీకి దళితుడు అవసరం లేదా’ అని ప్రశ్నించారు. -
అందుకే దీపావళికి వస్తున్నాం
‘‘అదుగో’ సినిమాకి సహకరించిన అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాతోనే చాలా మంది కెరీర్లు మొదలవబోతున్నాయి. వారికి ఆల్ ది బెస్ట్. మా సినిమాని దీపావళి రోజు విడుదల చేయడానికి కారణం ఉంది. ఆరోజైతే సినిమా తప్పకుండా చూస్తారని వస్తున్నాం’’ అన్నారు నిర్మాత సురేశ్ బాబు. పంది పిల్ల(బంటి) ప్రధాన పాత్రలో, అభిషేక్, నభ నటేష్ కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అదుగో’. సురేశ్ బాబు సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్లో రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈనెల 7న విడుదలవుతోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్లో ఈ సినిమాని చూపిస్తుండటం విశేషం. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా సినిమాలో నటించిన పందిపిల్లతో చిత్ర యూనిట్ అంతా కేబీఆర్ పార్క్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు పాదయాత్ర చేశారు. రవి బాబు మాట్లాడుతూ– ‘‘ఏ సినిమాకైనా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో ఫంక్షన్ ఉంటుంది. మా సినిమాకి అవన్నీ చేయడానికి పెద్ద స్టార్స్ లేరు. ప్రమోషనల్ బడ్జెట్ కూడా లేదు. అందుకే ఈ పాదయాత్ర ద్వారా మా సినిమా గురించి అందరికి తెలియజేయాలనుకున్నాం. ఈ సినిమాని తప్పక చూడండి.. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ దీపావళికి ఎక్కువగా టపాకాయలు పేల్చకండి’’ అన్నారు. ‘‘నటుడిగా నా ఫస్ట్ సినిమా ‘నచ్చావులే’. నా 101 వ సినిమా ‘అదుగో’. ‘నచ్చావులే’ సినిమా లాగే ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు నటుడు కాశీ విశ్వనాథ్, హీరో అభిషేక్ వర్మ, చిత్ర బృందం పాల్గొన్నారు. -
ఆ వార్తల్లో వాస్తవం లేదు : ‘వెంకీ మామ’ టీం
విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్ లో ఓ సినిమా రానుందని..ఈ చిత్రానికి టైటిల్ వెంకీ మామ అని తెలిసినప్పటి నుంచి అటు వెంకీ అభిమానులు ఇటు నాగ్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని తెర పై చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్ కి జై లవకుశ ఫేమ్ బాబీ దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే..ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది కానీ...ఇంకా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాకపోవడంతో వెంకీ మామ ఆగిపోయింది అనే ప్రచారం మొదలైంది. ఈ విషయంపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే...వెంకటేష్ ప్రస్తుతం ఎఫ్ 2 సినిమాలో బిజీగా ఉన్నారు నాగచైతన్య ఓ వైపు సవ్యసాచి ప్రమోషన్స్, మరో వైపు శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వలన ‘వెంకీ మామా’ ఇంకా స్టార్ట్ కాలేదు. నవంబర్ నెలలోనే ఈ సినిమా సెట్స్మీదకు వెళ్లనుందని తెలిపారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందే ఈ సినిమా అక్కినేని, దగ్గుబాటి అభిమానులకు ఓ పండగ అని చెప్పచ్చు -
చంద్రబాబు దర్శకత్వం.. శివాజీ నటనతో
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడితో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి మాట్లాడుతూ..ఎమ్మెల్యేలను రూ.30 కోట్లకు కొనుగోలు చేసిన చంద్రబాబు, శ్రీనివాసరావుకు రూ.100 కోట్లు ఆఫర్ చేసినా చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కుటుంబం లేకపోతే తనకు తిరుగులేదని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. రాజారెడ్డిని హత్య చేయించింది నువ్వు కాదా..దోషులకు ఆశ్రయం కల్పించింది నువ్వు కాదా? అని సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు. వైఎస్సార్ మరణం వెనక కూడా అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇంత వరకు ఆ కేసు గురించి నిజాలు బయటకు రాలేదని తెలిపారు. చిచ్చరపిడుగులా ఎదుగుతున్న వైఎస్ జగన్పై కచ్చితంగా చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు తప్ప అన్ని పార్టీలు దాడిని ఖండించాయని తెలిపారు.ఇతర పార్టీలు ఖండించినా జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. తెలుగు దేశం నేతల స్పందన ఎంత జుగుప్సాకరంగా ఉందో ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. జగన్ ఎంత హుందాగా వ్యహరించారో గమనించాలని కోరారు. చంద్రబాబు దర్శకత్వంలో..సినీ నటుడు శివాజీ నటనతో గరుడపురాణం నడుస్తున్నదని అన్నారు. శివాజీని అరెస్ట్ చేస్తే ఆపరేషన్ గరుడ సూత్రధారులు ఎవరో బయటకు వస్తారని చెప్పారు. దీనిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. కడప మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ..మూడు నెలల నుంచి ఈ కుట్ర జరుగుతోందని స్పష్టం అవుతోందని వ్యాక్యానించారు. శివాజీ గరుడ లీక్ దీనికి నాంది అని వివరించారు. దీని వెనక ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఒక మీడియా అధిపతి ఉన్నారని వెల్లడించారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. శివాజీ ఇప్పుడే అమెరికా వెళ్లడంపై కూడా అనుమానాలకు తావిస్తుందని అన్నారు. ఇది అంతా ఒక పథకంలో భాగంగానే జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. మీలా తాము దిగజారదలచుకోలేదని చెప్పారు. వారి మాటలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. మేధావులు, ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. అప్పుడు పెరుగువడ అన్నాను కానీ..ఇప్పుడు అసలు కథ అర్ధం అవుతోందని పరోక్షంగా టీడీపీ కుట్రల గురించి ప్రస్తావించారు. ఇలానే వదిలేస్తే చాలా ఘోరాలు జరుగుతాయని పేర్కొన్నారు. తాము అడ్డదారిలో గద్దెనెక్కే వాళ్లం కాదని, భయపడి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయవద్దని కోరారు. టీడీపీ నేతలు తమ భాషను ఒకసారి చెక్ చేసుకోవాలని సూచించారు. -
గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే..
వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో ఏమి జరిగినా టీడీపీ నాయకులు గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నట్లు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించారు. కడప పార్లమెంటు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు సురేష్ బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిలు పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బినామీలలో మొదటి వాడు సీఎం రమేశ్ అని ఆరోపించారు. సారా దుకాణం నుంచి వేల కోట్ల రూపాయల ఆస్తికి సీఎం రమేశ్ ఎలా వచ్చాడని ప్రశ్నించారు. అనేక మందిని మోసం చేసిన, కడుపుకొట్టి అక్రమాస్తులు సంపాదించారని విమర్శించారు. 2014 ముందు ఏడాదికి రూ.50 కోట్ల కాంట్రాక్టు పనులు చేసే రుత్విక్ కంపెనీ ఈ రోజు రూ.3500 కోట్ల రూపాయలకు ఎలా వచ్చిందని సూటిగా అడిగారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. ఉక్కు పరిశ్రమ అడిగితే ఐటీ దాడులు అని చెప్పడం శోచనీయమన్నారు. నాలుగేళుల బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ఉక్కుపరిశ్రమ గుర్తుకు రాలేదా అని సూటిగా ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వీటి అన్నింటిపైన విచారణ చేస్తామని చెప్పారు. చంద్రబాబు బినామీలపై లోతుగా విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని అన్నారు. -
‘ప్రజలు ఛీ కొట్టిన నేత చంద్రబాబు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రజలు ఛీ కొట్టిన నేత అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి విమర్శించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు నడుం బిగించాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఫలితంగానే కేసీ కెనాల్కు నీరు వచ్చిందన్నారు. రాష్ట్రంలో దోపిడీ దొంగలు రాజ్యం ఏలుతున్నారని విమర్శించారు. మైదుకూరు నియోజకవర్గంలోని రాజోలు రిజర్వాయర్ పూర్తి అవ్వాలంటే వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. మైదుకూరు మున్సిపాలిటీకి 5కోట్లు ఇస్తామన్న చంద్రబాబు పంగనామాలు పెట్టాడని తెలిపారు. మైదుకూరు ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా అవినాష్ రెడ్డిని ఘన మెజార్టీతో గెలిపించాలని కోరారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కరువు కవల పిల్లలని కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన, రైతుల వ్యతిరేక పాలన కొనసాగుతూందని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణంగానే జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు వస్తున్నాయని అన్నారు. మైదుకూరు కేసీ కెనాల్కు నీళ్లు రావటానికి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి కారణమన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఇప్పుడు రైతుల పట్ల కపట నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రజలకోసం తపిస్తున్న ఏకైక నాయకుడని అన్నారు. ఆ ఘనత వైఎస్కే దక్కుతుంది పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు తెప్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు అన్నారు. 2019లో జరగబోయే ఎన్నికల యుద్ధానికి వైఎస్సార్ కాంగ్రెస్ సైనికులు సిద్దం అవ్వాలని సూచించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. జిల్లాకు సాగు నీరు ఇచ్చామని చెప్పుకోవటానికి చంద్రబాబుకు సిగ్గుండాలన్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిట్టనిలువునా ముంచిన ఘనుడని అన్నారు. -
‘పటాస్’ రానా కోసం రెడీ చేసిన కథ.. కానీ!
‘‘ఈ సినిమాను నాకు దర్శకుడు వెంకటేశ్, విజయ ఆరేడు నెలల క్రితం చూపించారు. సినిమా చాలా బాగా నచ్చింది. అయితే ప్రమోట్ చేయడం చాలా కష్టం అనుకున్నాను. ఎందుకంటే మంచి మనలోకి వెళ్లడానికి టైమ్ పడుతుంది కదా. మంచి చెప్పులు వేసుకొనే లోపే చెడు ఊరు చుట్టి వస్తుంది అంటాం కదా.. అలాగ. అప్పట్లో సినిమాలకు మూడు వారాల లైఫ్ ఉండేది. కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయింది. దానికి మౌత్ పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్ అని నమ్ముతాను’’ అని సురేశ్బాబు అన్నారు. వెంకటేశ్ మహా దర్శకత్వంలో నూతన నటీనటులతో విజయా పరుచూరి నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’. ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది ఈ సందర్భంగా సురేశ్బాబు చెప్పిన విశేషాలు... ► స్పాట్బాయిగా ఇక్కడ పని చేసి దర్శకుడుగా మారదాం అని ఒక కథ తయారు చేసుకొని, ఆ కథకి టీజర్ రెడీ చేసుకొని నిర్మాతను వెతికి పట్టుకొని, కంచెరపాలెం అనే ఊరికి వెళ్లిపోయాడు వెంకట్ మహా. అక్కడ నటీనటులతో సినిమా తీశాడు. అది చాలా కష్టం. విజయా పరుచూరి అమెరికాలో డాక్టర్. తెలుగు సినిమాలకు తను చాలా దూరం. సాధారణంగా అందరూ ఫారిన్ సినిమాల గురించే మాట్లాడతారు.. తెలుగు సినిమాల గురించి ఎందుకు మాట్లాడుకోరు? అనే ఉద్దేశంతో తెలుగు సినిమా తీద్దామనుకుంది. కానీ ఇంట్లో డాక్టర్ అవ్వాలన్నారు. డాక్టర్ అయ్యి, దాచుకున్న డబ్బులతో ఈ పెద్ద చిన్న సినిమా తీసింది. ► ఈ సినిమా ప్రీమియర్స్కి సెలబ్రిటీలను మేం ‘మీరు తప్పక రావాలి’ అని ఆహ్వానించలేదు. ఫస్ట్ చూసినవాళ్లే మిగతా వాళ్లను తీసుకువచ్చారు. చంద్రశేఖర్ యేలేటి చూసి కీరవాణిని తీసుకువచ్చాడు. కీరవాణి రాజమౌళిని తీసుకొచ్చాడు. వాళ్లు కూడా ప్రీమియర్ చూశాం కదా ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పలేదు. సినిమా చుసి తర్వాత మాట్లాడతాం అన్నారు. ఇంటికి వెళ్లిపోయి మరుసటి రోజు పిలిచి సినిమా గురించి వివరంగా మాట్లాడారు. ఈ ప్రీమియర్స్ కాన్సెప్ట్ అంతా మౌత్ పబ్లిసిటీ కోసం. ► ఇది ఫుల్ కమర్షియల్ సినిమా. నాలుగు జంటల లవ్ స్టోరీలు ఈ సినిమా కథ. ఇందులో మ్యూజిక్ బావుంటుంది. మన డైలీ లైఫ్లో చూసే తమాషా సంఘటనలుంటాయి. మానవత్వాన్ని తెలియజేస్తుంది. అందుకే ఇలాంటి పెద్ద చిన్న సినిమాలంటే నాకు ఇష్టం. ఇలాంటి సినిమాలను బ్యాక్ చేయడం ముఖ్యం అని ఫీల్ అయ్యాను. ► విశేషం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ తర్వాత దర్శకుడు వెంకటేశ్ మహా న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో జాయిన్ అవుతున్నాడు. నేనేదో గొప్ప సినిమా తీశాను అని కూర్చోవడం లేదు. తన క్రాఫ్ట్లో ఇంప్రూవ్ అవ్వాలని క్రాఫ్ట్ నేర్చుకోవాలనే తపన. అలాంటి వాళ్లంటే నాకు చాలా ఇష్టం. ► సినిమాలో ఆల్మోస్ట్ 52 మంది కొత్తవాళ్లు నటించారు. సినిమా అయిపోగానే వాళ్ల పనుల్లో వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి ఓ నలుగురైదుగురు యాక్టింగ్ మీద ఆసక్తితో ఉండి ఉంటారు. ఇందులోని క్యారెక్టర్స్ను ఆధారం చేసుకొని వెబ్ సిరీస్ కూడా రూపొందించొచ్చు. రానాకు సినిమా విపరీతంగా నచ్చింది. వాళ్లందర్నీ కలవడానికి కంచరపాలెం కూడా వెళ్లాడు. అలాంటి చిన్న ఫిల్మ్ మేకర్స్ షైన్ అయితేనే ఇండస్ట్రీ బావుంటుంది. చిన్న వాళ్లను తొక్కేస్తున్నారు అని అనడం కరెక్ట్ కాదు. ఆర్ట్కి ఎప్పుడూ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అవకాశాలు అందరికీ ఉన్నాయి. ► ఇలాంటి సినిమాలను ఎప్పుడైనా మా సంస్థ ప్రమోట్ చేస్తుంది. ఈ మధ్య యంగ్ ఫిల్మ్ మేకర్స్ కేవలం కమర్షియల్ పం«థాలోనే సినిమాలు చెప్పాలనుకోవడం లేదు. కొత్త కొత్తగా స్టోరీ టెల్లింగ్ చేస్తున్నారు. ► నేను ఇలాంటి కథలు విని రిజెక్ట్ చేసినవి ఏమీ లేవు. ఓ కథ విని వద్దని, ఆ తర్వాత అబ్బా ఈ కథ మిస్ అయ్యానని ఫీలైన సందర్భాలు తక్కువ. అలా అయితే మన జడ్జిమెంట్లో తేడా ఉన్నట్టు లెక్క. ‘పటాస్’ కథ నచ్చింది. రానా కోసం రెడీ చేసిన కథ. తను ‘బాహుబలి’తో బిజీగా ఉండటంవల్ల కుదర్లేదు. -
‘అదుగో’ ఫస్ట్ లుక్
రవిబాబు నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా అదుగో. ఈ సినిమాలో ఓ పంది పిల్ల కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పుడు ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో పిగ్ లెట్ బంటిని పరిచయం చేసారు దర్శక నిర్మాతలు. చెక్క కంచెకు వేలాడుతూ నవ్వుతూ ఉన్న పందిపిల్ల చాలా క్యూట్ గా అందర్నీ అలరిస్తుంది. రవిబాబుతో పాటు ఈ చిత్రంలో అభిషేక్ వర్మ, నభా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్ ను చూపిస్తోన్న సినిమా అదుగో. దీనికోసం చాలా విజువల్ ఎఫెక్ట్స్ కూడా వాడుకున్నారు రవిబాబు. షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. సురేష్ ప్రొడక్షన్ సంస్థలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిన్న పిల్లలను అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. తెలుగులో అదుగో అనే టైటిల్ తోనే రానున్న ఈ చిత్రం.. మిగిలిన భాషల్లో మాత్రం బంటి పేరుతో విడుదల కానుంది. -
బాబు సర్కార్ అన్నింటా వైఫల్యం!
వైఎస్ఆర్ జిల్లా: చంద్రబాబు సర్కార్ అన్నింటా వైఫల్యం చెందిందని కడప మేయర్, వైఎస్సార్సీపీ నేత సురేష్ బాబు వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద కరవుపై పోరు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామి రెడ్డి, రవీంద్రనాథ్, అంజద్ బాషా, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ గోవింద రెడ్డి, జమ్మలమడుగు సమన్వయకర్త సుధీర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ..రైతులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వడంలో వైఫల్యం కనబడుతోందని విమర్శించారు. జిల్లాలో 50 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించినా ఇంతవరకు సాయం అందించలేదని వెల్లడించారు. నాలుగేళ్లుగా కరవు విలయతాండవం చేస్తుంటే రైతులను ఆదుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే బీమా, బాబు ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఆగిపోయిందని అన్నారు. అన్నదాతలకు అండగా కరవుపై పోరాటం చేపట్టామని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషా మాట్లాడుతూ.. జిల్లాకు సాగునీరు ఇవ్వడంలో వివక్ష చూపుతున్నారని తెలిపారు. కరువు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. మంచి పరిపాలకుడు ఉంటే భగవంతుడు కరుణిస్తాడని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ ఉన్నపుడు వర్షాలు పడ్డాయి...బాబు పాలనలో వర్షం జాడే లేదని ఎద్దేవా చేశారు. రాయలసీమ కరువు కోరల్లో చిక్కుకుందని, రైతులను, ప్రజా సమస్యలను చంద్రబాబు గాలికి వదిలేశారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. జమ్మలమడుగు వైఎస్సార్సీపీ సమన్వయకర్త సుధీర్ రెడ్డి మాట్లాడుతూ..ఇంత వరకు జమ్మలమడుగులో ఒక్క విత్తనం కూడా వేయలేదని తెలిపారు. మా దగ్గర ఒక మంత్రి, ఒక విప్, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. వారు ఒక్క రోజు కూడా కరువు గురించి మాట్లాడలేదని మండిపడ్డారు. మంత్రి సాగునీరు తెచ్చేందుకు ప్రయత్నం చేయడం లేదని, కేవలం కమీషన్ల కోసం వెంపర్లాట తప్ప రైతుల గురించి ఆలోచించడం లేదని తీవ్రంగా ధ్వజమెత్తారు. జగనన్న సీఎం అయితేనే రైతులకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. గోవింద రెడ్డి మాట్లాడుతూ..వంద టీఎంసీ నీళ్ల కోసం కడపలో జలాశయాలు కట్టానని చంద్రబాబు అంటున్నారు..మరి ఈ కరువు పరిస్థితి ఎందుకు వచ్చింది చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది మీరు కాదా అని సూటిగా అడిగారు. వైఎస్సార్ కట్టిన ప్రాజెక్టులను చంద్రబాబు తన ఘనతగా చెప్పుకుంటున్నారని, ఆయన చర్యల వల్ల రైతులు ఖరీఫ్ సాగు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ..జిల్లాలో సకాలంలో వర్షాలు లేక కనీసం పశువులకు మేత కూడా కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు కపట ప్రేమను చూపిస్తున్నారని విమర్శించారు. కుందూ నదిలో నెల్లూరుకి 20 వేల క్యూసెక్కుల నీరు వృధాగా పోతుందని, ఆ నీటిని తెలుగుగంగ ప్రాజెక్టుకు తరలిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. దీని పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు...ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం మన ఖర్మ అని వ్యాఖ్యానించారు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు... కానీ ఏమైంది బాబు కుమారుడికి మాత్రమే జాజ్ వచ్చిందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే వైఎస్సార్ జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణమన్నారు. కరవు కోరల్లో కొట్టుమిట్టాడుతున్న వైఎస్సార్ జిల్లాను కాపాడుకోవాల్సిన బాధ్యత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భుజస్కందలపై వేసుకుందని వ్యాఖ్యానించారు. కేవలం చంద్రబాబు ఆయన బంధువులకు న్యాయం చేస్తున్నారు తప్ప రైతులకు ఎలాంటి న్యాయం చేయడం లేదు..ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు పూర్తి అనర్హుడు..మంత్రి ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు భజన మనుకుని తన సొంత నియోజకవర్గంలో నీటి సమస్యను పరిష్కరించాలని హితవు పలికారు. -
అభ్యర్థులను ప్రకటించే దమ్ము ఉందా?
సాక్షి, వైఎస్సార్ : సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా అభివృద్ది కోసం కాదని, పార్టీ అంతర్గత కలహాలను అరికట్టేందుకు మాత్రమే కడప వస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి, మేయర్ సురేష్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు కడప పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మంగళవారం వైఎస్సార్సీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఇప్పటి వరకు 25 సార్లు జిల్లాకు వచ్చారు. నాలుగేళ్లలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలైనా చేశారా? అభివృద్ది కాలేదు కాని అప్పులు మాత్రం అయ్యాయి. నెల్లూరు ప్రజలు ఛీ కొడితే దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ జిల్లాపై పెత్తనం చెలాయించడం దుర్మార్గం. రైతులను మంత్రి సోమిరెడ్డి నిలువునా మోసం చేశారు. రాయలసీమ పట్ల చంద్రబాబు ఎందుకంత వివక్ష చూపుతున్నారు. ఇప్పటికిప్పుడు జిల్లాలోని జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థిని ప్రకటించే దమ్ము చంద్రబాబుకు ఉందా? తెలంగాణలో సీఎం కేసీఆర్ సెప్టెంబర్లోపు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తామని అంటున్నారు. ఆ ధైర్యం మన సీఎంకి ఉందా?’ అని పేర్కొన్నారు. -
‘మంత్రి ఆదేశించినా పట్టించుకోరా’
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కడప జిల్లాలోని కేసీ కెనాల్ నుంచి తెలుగు గంగా, బ్రహ్మం సాగర్ కాలువలకు సాగు కొరకు నీటిని విడుదల చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. నీటిని విడుదల చేయకపోతే వైఎస్సార్సీపీ తరుఫున పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని పార్టీ ఎమ్మెల్యేలు, రఘురామిరెడ్డి, అంజద్ బాషా, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబా పేర్కొన్నారు. ఆగస్ట్ 1 లోపు నీటిని విడుదల చేయాలని గురువారం ఓ సమావేశంలో మాట్లాడుతు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని, ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. రైతులకు ఎప్పుడూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. జిల్లాలో కాలువలకు నీటిని విడుదల చేయాలని రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియ ఆదేశించిన్పటికి అధికారులు పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. -
‘చంద్రబాబు మోసాలు తేటతెల్లం’
సాక్షి, కడప : సీఎం చంద్రబాబు మోసాలను పార్లమెంట్లో ప్రధాని మోదీ, రాజ్నాథ్లు తేటతెల్లం చేశారని వైఎస్సార్సీపీ నేతలు సురేష్బాబు, అంజాద్ బాషాలు పేర్కొన్నారు. శనివారం నేతలు మీడియాతో మాట్లాడుతూ.. 24వ తేదీన వైఎస్సార్సీపీ చేపట్టిన రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ సీట్లను పెంచుకోవడానికి బాబు ఢిల్లీ వెళ్లారని తప్ప.. ప్రత్యేక హోదా విషయం ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని వారు ధ్వజమెత్తారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో 5కోట్ల మంది ప్రజల ఆశలు గల్లంతయ్యాయి. పార్లమెంట్లో టీడీపీ, బీజేపీ మధ్యబంధం ఏంటో కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారని నేతలు అన్నారు. విభజన హామీలు సాధించడం వైఎస్ జగన్కే సాధ్యం.. విభజన హామీలు సాధించడం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని వైఎస్సార్సీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, అమరనాథ్రెడ్డిలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు హోదా అంశం సజీవంగా ఉందంటే వైఎస్ జగన్ పోరాట ఫలితమే అన్నారు. అంతేకాక ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబును నేతలు దుయ్యబట్టారు. చంద్రబాబు ప్యాకేజీని స్వాగతించి హోదాను సమాధి చేశారని ఆరోపించారు. -
రానాతో భారీ బడ్జెట్ మూవీ?
రుద్రమదేవి సినిమాతో సక్సెస్ను అందుకున్నారు దర్శకులు గుణశేఖర్. అయితే ఈ సినిమా విడుదలై చాలా కాలం అవుతున్నా.. ఇంకో సినిమాను తెరకెక్కించలేదు గుణశేఖర్. అప్పట్లో హిరణ్యకశ్యప సినిమాను తెరకెక్కించబోతున్నానని ప్రకటించారు ఈ డైరెక్టర్. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్పై అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను దాదాపు 180కోట్లతో నిర్మాత సురేశ్బాబు నిర్మించబోతున్నట్లు వినికిడి. రానా హిరణ్యకశ్యపుడిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. -
థియేటర్లన్నీ ఆ నలుగురి చేతుల్లోనే..
యాదగిరిగుట్ట (ఆలేరు) : తెలుగు సినీ ఇండస్ట్రీలో థియేటర్లు అన్నీ సురేష్బాబు, అల్లు అరవింద్, దిల్రాజ్, సునీల్ చేతిల్లోనే ఉన్నాయని తెలంగాణ ఫిలిమ్ చాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ నలుగురు రెండు రాష్ట్రాల్లోని థియేటర్లను తమచేతుల్లో పెట్టుకుని చిన్న సినిమాలు విడుదల కాకుండా చేస్తున్నారని అన్నారు. ఆ నలుగురికి దీటుగా చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు త్వరలోనే డిజిటల్ చానల్ ప్రారంభిస్తున్నామని.. దీనికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉందని తెలిపారు. ప్రభుత్వానికి 20శాతం పన్ను కడుతూ.. చిన్న, పెద్ద సినిమాలను రిలీజ్ చేసేం దుకు ముందుకు వెళ్తుమన్నారు. థియేటర్లు అవస రం లేకుండానే మా డిజిటల్ ద్వారానే అన్ని టీవీ ల్లో సినిమాలను విడుదల చేస్తామని అన్నారు. ఇం డియాలో ఎక్కడ లేని విధంగా ‘మా’ డిజిటల్ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ‘మా’ డిజిటల్ ద్వారా సుమారు 1000 చిన్న సినిమాలను రిలీజ్ చేస్తామన్నారు. ఇది విజయవంతం కావాలని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని వేడుకున్నట్లు చెప్పారు. సమావేశంలో సోగ్గాడే శోభన్ కృష్ణ సినిమా హీరో రాయగిరి ఉమాపతిగౌడ్, డైరెక్టర్ జింక హరీష్బాబు, సినిమా ఆర్టిస్టు సత్యనారాయణ ఉన్నారు. -
పుకార్లు సృష్టించకండి : రానా
టాలీవుడ్ యంగ్ హీరో రానా ఆరోగ్య పరిస్థితిపై కొద్దిరోజులుగా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కంటి సమస్యతో బాధపడుతున్నాడన్న వార్తలు ప్రముఖంగా వినిపించగా తీవ్ర సమస్యలు ఉన్నాయన్న ప్రచారం కూడా జరిగింది. ఈ విషయంపై దగ్గుబాటి కుటుంబ సభ్యుల ఒకటి రెండు సార్లు స్పందించిన రూమర్స్ మాత్రం అలాగే కొనసాగాయి. ముఖ్యంగా ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన రానా తండ్రి సురేష్ బాబు, రానా అనారోగ్యంతో బాధపడుతున్నాడని త్వరలోనే చికిత్స ప్రారంభమవుతుందని చెప్పటంతో పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా ఈ వార్తలపై హీరో రానా స్పందించాడు. ‘నా ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. నేను బాగానే ఉన్నా... కేవలం బీపీకి సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడుతున్నా. కొద్ది రోజుల్లో అంతా సెట్ అవుతుంది. మీ ప్రేమ అభిమానానికి కృతజ్ఞతలు. కానీ పుకార్లు సృష్టించకండి ఇది నా ఆరోగ్యం మీది కాదు.’ అంటూ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు రానా. Hearing lots of strange things about my health, I’m fine guys just some BP based issues I’m addressing. Will be fixed and sorted soon. Thanks for the concern and love but don’t speculate it’s my health not yours ;). — Rana Daggubati (@RanaDaggubati) 24 June 2018 -
రాక్షస రాజుగా రానానే ఫిక్స్
రుద్రమదేవి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న దర్శకుడు గుణశేఖర్, ఈ సారి పౌరాణిక కథ మీద వర్క్ చేస్తున్నారు. మహా భక్తుడు ప్రహ్లాదుడి కథను హిరణ్య కశిపుడి కోణంలో రూపొందించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాపై చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నా ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తాజా ఈ సినిమాపై సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. గుణశేఖర్, రానా కాంబినేషన్లో హిరణ్య చిత్రం రూపొందుతుందని వెల్లడించారు. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లోనే భారీ బడ్జెట్తో రూపొందుతుందని తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఆర్ట్ వర్క్ జరుగుతుందని చెప్పిన సురేష్, సినిమా ఎప్పుడు సెట్స్మీదకు వెళుతుందన్న విషయం ఇప్పుడు చెప్పలేమన్నారు. -
పాల వ్యాపారంలోకి ప్రముఖ నిర్మాత
ఇన్నాళ్లు సినిమా, థియేటర్ల వ్యాపారంతో బిజీబిజీగా ఉన్న నిర్మాత దగ్గుబాటి సురేష్బాబు సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. 'హ్యాపీ ఆవులు' పేరుతో స్వచ్ఛమైన పాల ఉత్పత్తికి ఆయన శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నగర శివార్లలో తనకున్న 30 ఎకరాల వ్యవసాయ భూమిలో 30 ఆవులను పెంచుతున్నారు. మార్కెట్లో లభిస్తున్న పాలు, కూరగాయల్లో రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో స్వచ్ఛమైన పాలు, సేంద్రీయ సేద్యంతో కూరగాయలు అందించాలని నిర్ణయానికి వచ్చారు. తన వ్యవసాయ క్షేత్రంలో ఆవులకు సేంద్రీయ ఆహారం, స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నట్టు సురేష్ బాబు తెలిపారు. దీంతో అవి స్వచ్ఛమైన పాలను ఇస్తున్నాయన్నారు. డబ్బు సంపాదించాలనే ధ్యేయంతో కాకుండా స్వచ్ఛమైన పాలకు, బయట దొరుకుతున్న పాలకు ఉన్న తేడా ఏమిటో ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. తన ఫాంలోని ఆవు ఇచ్చిన పాలను లీటరు 150 రూపాయలకు విక్రయించాలని నిర్ణయించామన్నారు. అదేవిధంగా రామానాయుడు స్టూడియోని పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదిగా చేయాలనుకుంటున్నానని తెలిపారు. ఇప్పటికే ప్లాస్టిక్బాటిళ్ల స్థానంలో స్టీలు సీసాలను వాడుతున్నామని సురేష్బాబు తెలిపారు. -
చెప్పింది చేసి చూపించారు
-
ఏబీసీడీలకు వేళాయె
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ఏబీసీడీ’ చిత్రాన్ని అల్లు శిరీష్ కథానాయకుడిగా తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రుక్సార్ థిల్లాన్ కథానాయిక. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై మధుర శ్రీధర్, బిగ్బెన్ సినిమాస్ బ్యానర్పై యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి నిర్మాతల అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా మరో నిర్మాత సురేశ్ బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. పలు చిత్రాల్లో బాల నటుడిగా అలరించిన మాస్టర్ భరత్ ‘ఏబీసీడీ’ చిత్రంలో అల్లు శిరీష్ స్నేహితుడిగా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలినేని. -
‘సిస్టర్.. ఎంకరేజ్ న్యూ టాలెంట్.. ప్లీజ్’
తొలి చిత్రం పెళ్లి చూపులు సినిమాతో సంచలన విజయం సాధించిన దర్శకుడు తరుణ్ భాస్కర్. లఘు చిత్ర నేపథ్యం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈ యువ దర్శకుడు తొలి సినిమాతోనే మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. తొలి చిత్రం ఘనవిజయం సాధించినా.. రెండో సినిమాను ప్రారంభించేందుకు చాలా సమయం తీసుకున్నాడు తరుణ్. తన రెండో సినిమాను డిఫరెంట్ కాన్సెప్ట్తో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో పాపులర్ అయిన ఈ నగరానికి ఏమైంది..? అనే పదాన్నే సినిమా టైటిల్ గా తీసుకున్న తరుణ్ భాస్కర్ మరోసారి విభిన్న కథా కథనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నూతన నటీనటులు విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్, వెంకటేష్లతో పాటు అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. -
రానా కంటికి శస్త్రచికిత్స
ప్రముఖ కథనాయకుడు దగ్గుబాటి రానా కంటి ఆపరేషన్కు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి సురేశ్ బాబు వెల్లడించారు. రానా కుడి కన్నుకు గతంలో ఓ హాస్పిటల్లో చికిత్స నిర్వహించారు. కాగా కొద్ది రోజులగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న రానా ఈ సారి విదేశాల్లో చికిత్స చేయించుకోనున్నారు. చికిత్స నిమిత్తం సెట్స్పై ఉన్న షూటింగ్లకు విరామం ఇచ్చారు. రానా ప్రస్తుతం పీరియాడిక్ జానర్లో తెరకెక్కుత్తున్న 1945, హథీ మేరీ సాథీ, రాజా మార్తండ వర్మ చిత్రాల్లో నటిస్తున్నారు. -
చంద్రబాబు నియంత పాలనను తలపిస్తున్న వరద
ప్రొద్దుటూరు టౌన్ : చంద్రబాబు నియంత పాలనను మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తలపిస్తున్నాడని మేయర్ సురేష్బాబు అన్నారు. ప్రొద్దుటూరు పాత బస్టాండ్లో ఆవరణలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి చేస్తున్న దీక్షకు మద్దతుగా శనివారం మేయర్ సురేష్బాబు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి దీక్షాశిబిరానికి వచ్చారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఐదేళ్ల కిందట ప్రొద్దుటూరులోని శివాలయాన్ని ఐదు నెలలు మూయించి దేవునికి పూజలు లేకుండా చేసిన ఘనత వరదరాజులరెడ్డిదేనన్నారు. కూరగాయలమార్కెట్ను తొలగించాలని ప్రయత్నించాడన్నారు. వైస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుందూ–పెన్నా కాలువకు నిధులు ఇచ్చారన్నారు. అయితే అలైన్మెంట్ మార్చడంతో రైతులు కోర్టును ఆశ్రయించారన్నారు. నీరు రాకుండా చేసింది కూడా వరదరాజులరెడ్డిని పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న పార్కును ఆడుకోవడానికి లేకుండా ట్యాంక్ నిర్మాణం చేయాలని చూడటం చట్టవిరుద్దమని, ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. కడప నగరంలో 12 ట్యాంకులు కడుతున్నామని, ఎక్కడా అభ్యంతరం లేదన్నారు. పాత మార్కెట్ను ఆదుణీకరించేందుకు రూ.12 కోట్లు మంజూరు చేశారన్నారు. అయితే ప్రజలు అలాగే ఉంచాలని కోరితే ముఖ్యమంత్రి వైఎస్ దాన్ని చెక్కుచెదరనివ్వలేదన్నారు. ప్రజల మనోభాలవను పరిగణలోకి తీసుకున్న నాయకుడన్నారు. స్వార్థరాజకీయాల కోసం... స్వార్థ రాజకీయాల కోసం వరద ఎవ్వరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోరన్నారు. తాను చెప్పిందే జరగాలన్న వ్యక్తి అన్నారు. అన్నా క్యాంటిన్ కూడా అతని అనునాయకులకు ఇచ్చి నడిపించే వ్యక్తి వరద అన్నారు. రూ.2 కే 20 లీటర్ల నీళ్లు ఇస్తామని చెప్పి ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. అన్నా క్యాంటిన్ పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. 2800 పోస్టులు రూ.200 కోట్లకు అమ్ముకున్న లోకేష్ సర్వశిక్షా అభియాన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లోని స్కూళ్లకు కేంద్రం రూ.వేల కోట్ల నిధులు ఇస్తోందన్నారు. దీన్ని అడ్డుగా పెట్టుకొని జిల్లాకు 150 పోస్టులని సృష్టించి 2800 ఔట్ సోర్సింగ్ పోస్టులను రూ.200 కోట్లకు లోకేష్బాబు అమ్ముకున్నారన్నారు. నాలుగేళ్ల తరువాత అన్నా క్యాంటిన్ గుర్తుకు వచ్చిందా: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి నాలుగేళ్లు అయిందని, ఇప్పుడు అన్నా క్యాంటిన్ గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఎన్నికల కోసం ఏర్పాటు చేసే ఈ క్యాంటిన్ మరో రెండు, మూడు నెలలు గడుస్తుందన్నారు. దీని కోసం పాత బస్టాండ్లో 50 ఏళ్లుగా దుకాణాలు పెట్టుకొని జీవిస్తున్న వారిని రోడ్డున పడేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. త్రీటౌన్ పోలీస్స్టేషన్ ప్రక్కన స్థలం ఉందని అక్కడ కడితే ఏ సమస్య లేదని పేర్కొన్నారు. పన్నులు కట్టించుకుంటున్న అధికారులు ప్రజలకు సౌకర్యాలు కల్పించక పోతే చొక్కా పట్టుకొని ఎందుకు నిలదీయకూడదని అన్నారు. ప్రజలకు ఏదో ఒక అసౌకర్యం కల్పించాలనేది వరద తత్వమని తెలిపారు. నేల మాలి లోని గుప్త నిధులు ఏమయ్యాయి... నేలమాలిలోని గుప్త నిధులు ఏమయ్యాయని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రశ్నించారు. వజ్రాలు, అన్నీ విదేశాల్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారన్నారు. ఏమయ్యాయని ప్రశ్నిస్తే జవాబు లేదన్నారు. నిన్నకాక మొన్న చార్జి తీసుకున్న పాపాల భైరవుడు మా సుధాకర్ యాదవ్పై పడుతున్నాయని అన్నారు. ఆయన ఏం సమాధానం చెబుతారన్నారు. ఇదీ చంద్రబాబు నాయుడు పాలన అని చెప్పారు. వివాద సామ్రాట్ వరద : ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వరద కాలువను, హౌసింగ్ పథకాన్ని , అనిబిసెంట్ హైస్కూల్లో అభివృద్ధి పనులను, చేనేత పింఛన్లు ఇప్పించడంలో వివాదాలు తెస్తున్న వరదరాజులరెడ్డి ఇప్పటికైనా తన మనస్తత్వాన్ని మార్చుకోవాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీలో కార్మికుడు చనిపోతే అతని భార్య మేరీకి ఇవ్వాల్సిన ఉద్యోగాన్ని ఎక్స్ కౌన్సిలర్ మేరువ వరదరాజులు కుమారుడికి ఇచ్చి వరద వివాదం చేశారన్నారు.పాత బస్టాండ్లో బస్షెల్టర్ కూల్చకూడదు, కానీ కూలుస్తానంటూ వివాదం చేస్తున్నారని తెలిపారు. తాను తన గురువు విషయంలో బాధపడుతున్నానన్నారు. 16 మంది టీడీపీ కౌన్సిలర్లు పార్కులో ట్యాంక్ నిర్మాణం, పాత బస్టాండ్లో ఉండే షెల్టర్ కూల్చి వేయడం తప్పని చెబుతున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, వారి కౌన్సిలర్లను స్వాగతిస్తున్నానన్నారు. అభినందిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఏ పేదలు అయితే ఓట్లు వేసి అధికారం ఇచ్చారో వారిని నిరాశ్రయులను చేస్తామని చెప్పడం సిగ్గు చేటన్నారు. పోలీసుల బూటు కాలి దెబ్బ మొదట తన ఎదపై పడాలన్నారు. తరువాత వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లపై పడాలన్నారు. ఈ విషయంలో కలుగ చేసుకోవాలని కలెక్టర్ను ఎమ్మెల్యే కోరారు.లా అండ్ ఆర్డర్ లేకుండా చేసేందుకు వరదరాజులరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు, కలెక్టర్ చొరవ తీసుకోవాలని చెప్పారు. -
‘టీడీపీ కనుమరుగవడం ఖాయం’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : చంద్రబాబు నాయుడు సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని కడప వైఎస్సార్సీపీ పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్ బాబు ఆరోపించారు. నాలుగేళ్ల పాటు బీజేపీతో సంసారం చేసి ఆ పార్టీ నుంచి లక్షల కోట్లు తెచ్చుకున్న చంద్రబాబు, లోకేష్.. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో నాటకాలాడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. దమ్ముంటే చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. చంద్రబాబు అలా చేస్తే బీజేపీ ఎందుకు దిగిరాదో చూద్దామంటూ ఆయన వ్యాఖ్యానించారు. జిల్లాలో టీడీపీ ఉండదు.. ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చని తెలుగుదేశం పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని లేదని సురేష్ బాబు వ్యాఖ్యానించారు. ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన జగన్తో ప్రజలు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారని.. బాబుకు బుద్ది చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లాలో జరిగిన మినీ మహానాడులో అన్ని నియోజక వర్గాల్లో టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పటికే జిల్లాలో కొన ఊపిరితో పోరాడుతున్న టీడీపీ కనుమరుగవడం ఖాయమన్నారు. -
విమర్శించేందుకు టీడీపీకి సిగ్గు ఉండాలి..
సాక్షి, వైఎస్సార్ కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకు టీడీపీకి సిగ్గుండాలని కడప ఎమ్మెల్యే అంజద్ బాషా, ఆ పార్టీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేశ్ బాబు వ్యాఖ్యానించారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. వార్డు మెంబర్గా కూడా గెలవలేని వ్యక్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఢిల్లీలో కడప అంటే ఏంటో చూపించిన నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. కేసులు పెడతారని తెలిసి కూడా కొత్త పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. ఏపీకి ప్రతేక హోదా కోసం తమ పదవులకు రాజీనామాలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను.. రాజీనామాలను ఆమోదించుకుని ఎన్నికలకు రావానలి టీడీపీ చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. టీడీపీ, బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. అందులో భాగంగానే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చి.. తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం దారుణం అన్నారు. -
‘బాబు బినామీలకు రూ.240 కోట్ల భూమి’
సాక్షి, కడప: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ ప్రతి పనుల్లో లక్షల కోట్ల రూపాయలలో అవినీతి చేశారని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శించారు. రూ. 240 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని జీఓ నెంబర్.523, 547 ద్వారా చంద్రబాబు తన బంధువులకు, బినామీలకు కారుచౌకగా, అప్పనంగా అప్పజెప్పారని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమలాపురం, మైదుకూరు ఎమ్మెల్యేలు రవీంద్రనాధ్ రెడ్డి, రఘురామిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేశ్బాబు సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మూడేళ్లు సంసారం చేసి ఇప్పుడు మూడు పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని టీడీపీ, బీజేపీ, జనసేనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. లక్షల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసి ఈరోజు కేంద్రం ఇవ్వలేదని టీడీపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మొదటి నుంచి హోదా కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ప్రత్యేక హోదాకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పారు. ప్రత్యేక హోదా ఇచ్చే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామన్నారే తప్ప బీజేపీకి మద్దతు ఇస్తామని వైఎస్ జగన్ ఎప్పుడూ చెప్పలేదని గుర్తుచేశారు. జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలకు మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిందీ ఏమీ లేదన్నారు. గండికోట ముంపు బాధితులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని, కేంద్రం అడుగుతున్న ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచి కేవలం వసూళ్ల కోసమే చంద్రబాబు పని చేస్తున్నారని ఆరోపించారు. -
ఫైనల్గా సినిమా పట్టాడు..!
తొలి సినిమా బొమ్మరిల్లుతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన యువ దర్శకుడు భాస్కర్, తరువాత ఒక్క ఫ్లాప్తో కష్టాల్లో పడ్డాడు. ఆరెంజ్ సినిమాతో డిజాస్టర్ రావటంతో భాస్కర్ కు ఛాన్స్ ఇచ్చే వారే కరువయ్యారు. లాంగ్ గ్యాప్ తరువాత ఓ తమిళ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకున్నా వర్క్ అవుట్ కాలేదు. దీంతో భాస్కర్కు మరోసారి అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాంగ్ గ్యాప్ తరువాత ఈ యువ దర్శకుడిగా ఓ ఛాన్స్ వచ్చింది. తాజాగా భాస్కర్.. గోపిచంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాతో పాటు అల్లు అరవింద్, సురేష్ బాబుల నిర్మాణంలోనూ సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు బొమ్మరిల్లు భాస్కర్. -
థియేటర్లు బంద్
-
నేటి నుంచి థియేటర్లు బంద్
సాక్షి, హైదరాబాద్: సినిమా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరుకు నిరసనగా 5 రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి సినిమా థియేటర్లను బంద్ చేస్తున్నట్టు దక్షిణాది సినీ నిర్మాతల మండలి ప్రకటించింది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు (క్యూబ్, యూఎఫ్వో సంస్థలు) వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్)ను తగ్గించాలని డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్లోని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జేఏసీ చైర్మన్ డి.సురేశ్బాబు ఈ వివరాలను వెల్లడించారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి సినిమాల ప్రదర్శనను నిలిపివేస్తున్నామని ప్రకటించారు. ‘‘డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు (క్యూబ్, యూ ఎఫ్వో సంస్థలు) ఏర్పాటు చేసిన కొన్నాళ్ల తర్వాత వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్)ను తీసేయాల్సి ఉంది. అమెరికాలో పూర్తిగా తీసేశారు. మన దేశంలో ఇప్పటికీ వసూలు చేస్తున్నారు. ఉత్తరా దిలో కొన్ని చోట్ల ఎక్కువ, మరికొన్ని చోట్ల తక్కువగా.. దక్షిణాదిలో ఎక్కువగా రేటు వసూలు చేస్తున్నారు. అసలు దక్షిణాదిలో ఈ ఫీజును పూర్తిగా తీసేయాలి..’’అని సురేశ్ బాబు డిమాండ్ చేశారు. ఆంగ్ల సినిమాలకు వీపీఎఫ్ వసూలు చేయని డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రాంతీయ చిత్రాలకు ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏమాత్రం పట్టించుకోవడం లేదు..: థియేటర్లలో వాణిజ్య ప్రకటనల నిడివిని 8 నిమిషాలకి తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిల్మ్ చాంబర్ నుంచి పంపిన 2 సినిమా ట్రైలర్లను తప్పకుండా ప్రదర్శించా లని చెప్పినా సర్వీసు ప్రొవైడర్లు వేయడం లేదన్నారు. మార్కెట్లో 90% క్యూబ్, యూఎఫ్వోల వాటా ఉందని, మిగతా 10% పీఎక్స్డీ, రాక్స్, అల్ట్రా, ప్రొవిజ్ వంటి సంస్థల చేతిలో ఉందని తెలి పారు. రేట్లు తగ్గించడం సహా పలు అంశాలపై చర్చలు కొనసా గుతున్నాయని.. చర్చలు ఫలిస్తే సినిమాల ప్రదర్శన యథావిధి గా ఉంటుందని చెప్పారు. చిన్న సినిమాలకూ మరింత ప్రయోజనం ఉండేలా చర్చలు జరుపుతున్నామన్నారు. ప్రాంతీయ భాషా సినిమా ప్రదర్శనలను శుక్రవారం నుంచి నిలిపివేస్తున్నామని.. హిందీ, ఇంగ్లిష్ సినిమాల వాళ్లతోనూ మాట్లా డుతున్నామన్నారు. సమావేశంలో జేఏసీ కన్వీనర్ íకిరణ్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ ముత్యాల రాందాస్, డిజిటల్ కమిటీ చైర్మన్ దామోదర్ ప్రసాద్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ తరఫున మురళీమోహన్, నిర్మాతలు సి.కల్యాణ్, సునీల్ నారంగ్ పాల్గొన్నారు. -
అప్పటి వరకూ థియేటర్లు బంద్
-
అప్పటి వరకూ థియేటర్లు బంద్ : సురేష్ బాబు
సాక్షి, హైదరాబాద్ : డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల వైఖరికి నిరసనగా శుక్రవారం నుంచి థియేటర్లను మూసివేస్తున్నట్లు దక్షిణ భారత నిర్మాతల మండలి తీర్మానించింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,కేరళ, తమిళనాడులో బంద్కు పిలుపునిస్తూ టాలీవుడ్ నిర్మాత సురేష్బాబు పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంగ్లీస్ చిత్రాలకు విర్చువల్ ప్రింటింగ్ చార్జీలు వేయడం లేదని, కానీ ప్రాంతీయ చిత్రాలకు మాత్రం అధికంగా వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రాంతీయ చిత్రాలకు వీపీఎస్ ధరలను పూర్తిగా రద్దు చేయాలని అప్పటి వరకూ థియేటర్ల బంద్ కొనసాగుతుందని పేర్కొన్నారు. -
హామీలన్నీ బూటకమని తెలిసిపోయింది
వైఎస్సార్ జిల్లా : నువ్వు ఇచ్చిన హామీలన్నీ పచ్చి బూటకమని ప్రజలకు తెలిసిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు సురేష్ బాబు విమర్శించారు. కడపలో విలేకరులతో మాట్లాడుతూ..అందరికి భరోసా ఇస్తూ జగన్ ముందుకు వెళ్తున్నాడని అన్నారు. కేవలం పత్రికల్లో చంద్రబాబు ప్రచారం తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని అభిప్రాయపడ్డాడు. నిధులపై బీజేపీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సినీ నటుడు పవన్ కల్యాణ్ను అడ్డుపెట్టుకుని హోదా నాటకం ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. హోదా కోసం పోరాడిన, పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్ అని అన్నారు. ఎందాకైనా హోదా కోసం జగన్ వెన్నంటి నడుస్తామని చెప్పారు. నలభై ఏళ్ల అనుభవశాలి అంటూ పొగడ్తల వర్షం తనపై కురుపించుకుంటూ మరో పక్క జగన్ పై అక్కసు వెళ్లగక్కుతున్నాడని చంద్రబాబుపై మండిపడ్డారు. నిన్నటి వరకు కేంద్రం మనకు ఎక్కువ నిధులు ఇస్తుందంటూ ప్రచారం చేసిన బాబు ఇప్పుడు యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా కావాలంటూ ప్లేట్ ఫిరాయించాడని ఆరోపించారు. -
దేశ ప్రతిష్టను దెబ్బతీసింది బాబే
కడప అగ్రికల్చర్: ‘రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో జపాన్ కంపెనీ మకీ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం తీరు అధ్వానమని, చాలా ఇబ్బంది పెట్టారని ఆధారాలతో సహా దుమ్మెత్తిపోయలేదా? ఓటుకు నోటు కేసులో దేశవ్యాప్తంగా చర్చ జరిగినప్పుడు రాష్ట్రప్రతిష్ట ఏమైందని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను, సీఎంను వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్రెడ్డి, అంజద్బాషా ప్రశ్నించారు. శుక్రవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు తమకు అన్యాయం జరిగిందని, ప్రత్యేక హోదా కావాలని నినదిస్తూ రోడ్ల మీదకు వస్తున్న తరుణంలో తమ పార్టీ మనుగడకు ముప్పు వాటిల్లుతుందని గ్రహించిన టీడీపీ నేతలు కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎలాంటి సంబంధంలేని విషయాన్ని అంటగట్టి దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నామన్నారు. వైఎస్ జగన్ను టార్గెట్ చేసి సీఎం వద్ద ఉండే భజనపరులైన మంత్రులు, టీడీపీ నేతలు, ఎల్లో మీడియా చిలువలు పలువలు చేసి మాట్లాడటాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. వైఎస్సార్ హయాంలో ఐఏఎస్లు, రాష్ట్ర ఉన్నతాధికారులు ఏ తప్పు చేయలేదని కోర్టులు క్లీన్చిట్ ఇచ్చిన విషయం వాస్తవం కాదా? అని అడుగుతున్నామన్నారు. ప్రజలారా...పోరాడండి, రోడ్లపైకి రండి రాష్ట్రం తరఫున నినదించండి మేం మాత్రం బయటకు రామనే ధోరణిలో సీఎం చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. స్వయంగా సీఎం తిరుపతి సభలో ఈ దేశం అవినీతి మయమయ్యే వరకు నిద్రపోనన్నారు. మంత్రి లోకేష్ కూడా అవినీతి, కులపిచ్చి, మత పిచ్చి ఉన్నదంటే అది ఒక్క టీడీపీనే అన్న మాటలను టీడీపీ నేతలు మరచినట్లున్నారని ఎద్దేవా చేశారు. నిన్నటికి నిన్న మంత్రి ఆదినారాయణరెడ్డి ఐఏఎస్ల సమక్షంలో సీఎం పంచాయితీ చేసి పనులు పంచుకోమన్నారని, అవినీతి వాటాలకు సీఎం పచ్చజెండా ఊపారని చెప్పిన విషయం వాస్తవం కాదా?అని టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నామన్నారు. వైఎస్ ప్రభుత్వ హాయంలో పరిశ్రమలు వస్తుంటే అడ్డుపుల్ల వేసింది మీరు కాదా? అని అన్నారు. నాడు బంగారు భూముల్లో పరిశ్రమలు ఎలా పెడతారని అడిగిన టీడీపీ నేతలు, నేడు పచ్చని పొలాల్లో రాజధాని కడుతుంటే నోరు మెదపరెందుకని ప్రశ్నించారు. జిల్లాలో వైఎస్సార్ హయంలోనే రిమ్స్, మెడికల్ కశాశాల, ఫుడ్అండ్ సైన్సు కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలు, రింగ్రోడ్లు, గృహకల్ప కింద ఇళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో ఏం అభివృద్ధి జరిగిందో శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రజలకు తెలుస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వం 14 ఏళ్లుగా పరిపాలన చేసిందని, ఈ కాలంలో ఒక్క బలపం ఫ్యాక్టరీనైనా ఏర్పాటు చేశారా? అని నిలదీశారు. నాలుగేళ్లుగా అభివృద్ధిని మరచి అక్రమాలకు పాల్పడుతూ, రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ, అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంతో సంసారం బాగాలేదని చెప్పడం టీడీపీ నేతలకే చెల్లిందని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. -
బోండా ఉమ భూకబ్జా ఎపిసోడులో కీలక మలుపు!
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కుటుంబం భూకబ్జా ఎసిసోడులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ భూభాగోతంపై ఫిర్యాదు చేసిన బాధితుడు కేసిరెడ్డి సురేష్ బాబు ఫిర్యాదు మేరకు ఆర్డీవో విచారణ చేపట్టనున్నారు. ఈ నెల 24న విచారణకు హాజరై బోండా ఉమపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని ఈ మేరకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా 1951లో సూర్యనారాయణ అనే స్వాతంత్య్ర సమరయోధుడికి ప్రభుత్వం పదెకరాల స్థలాన్ని కేటాయించింది. 2016లో నకిలీ పత్రాలు సృష్టించి బోండా ఉమ కబ్జాకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న సూర్యనారాయణ మనువడు సురేష్ 2017, ఫిబ్రవరి 10న విజయవాడ సింగ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సురేష్ సీఐడీ అధికారులను ఆశ్రయించారు. సీఐడీ అధికారుల దర్యాప్తులో ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం భూబాగోతం వెలుగులోకి వచ్చింది. మరోవైపు తనపై నమోదు అయిన కేసులు కొట్టివేయాలంటూ బోండా ఉమ సతీమణి సుజాత హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు 8వారాల స్టే విధించింది. ఆలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో బోండా సుజాత ఏ-8 ముద్దాయిగా ఉన్నారు. -
అలా కలెక్టర్ చెప్పడం దారుణం : వైఎస్సార్సీపీ
సాక్షి, కడప: పోలీసుల రక్షణలో జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టండని జిల్లా కలెక్టర్ చెప్పడం దారుణమని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానించారు. కడప వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నేతలు సురేష్ బాబు, అమర్నాధ్ రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్ బాషా పాల్గొన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. గత ఏడాది జన్మభూమి నుంచి ఇప్పటి వరకు ఒక్క అర్జీని కూడా టీడీపీ నేతలు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ప్రజలు నిలదీస్తారనే భయంతోనే పోలీసుల రక్షణ కావాలని అంటున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఒక్క రేషన్ కార్డుకానీ, ఇళ్ల స్థలాలు, ఫించన్లు కానీ ఇచ్చారా అని ప్రశ్నించారు. జననేత జగన్ చేస్తున్న పాదయాత్రను చూసి టీడీపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ పాదయాత్రతో టీడీపీ పునాదులు కదలడం ఖాయమన్నారు. -
సురేష్ బాబు చేతికి మెంటల్ మదిలో..
గత ఏడాది పెళ్లిచూపులు సినిమాతో ఘనవిజయం సాధించిన రాజ్ కందుకూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న మరో మూవీ మెంటల్ మదిలో... అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. న్యూ ఏజ్ యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాజ్ కందుకూరి నిర్మించిన పెళ్లి చూపులు సినిమా రైట్స్ తీసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, మెంటల్ మదిలో సినిమా రైట్స్ కూడా సొంతం చేసుకోవటం విశేషం. ఇటీవల చిత్రయూనిట్ తో కలిసి మెంటల్ మదిలో ఫస్ట్ కాపీ చూసిన సురేష్ బాబు వెంటనే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకునేందుకు ఓకె చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటించనున్నారు. -
పెళ్లి చూపులు నిర్మాతల 'మెంటల్ మదిలో..'
-
పెళ్లి చూపులు నిర్మాతల 'మెంటల్ మదిలో..'
'పెళ్ళిచూపులు' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన నిర్మాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న తాజా చిత్రం 'మెంటల్ మదిలో'. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు. పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకొన్న వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. 'ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ లో కథ గురించి చెప్పిన విషయాలు ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. 'పెళ్ళిచూపులు' తరహాలోనే 'మెంటల్ మదిలో' కూడా ఘన విజయం సాధించాలని కోరుకొంటున్నాను. వివేక్ ఆత్రేయ ఓ సరికొత్త ప్రయత్నంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు' అన్నారు. నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. 'సురేష్ బాబుగారు మా 'మెంటల్ మదిలో' ట్రైలర్ ను విడుదల చేసి.. క్వాలీటీ అండ్ కంటెంట్ చూసి మమ్మల్ని అభినందించడం చాలా ఆనందంగా ఉంది. చాలా పాజిటివ్ బజ్ ఉన్న సినిమా ఇది. మా టీం అంతా కూడా సినిమా రిజల్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. త్వరలోనే ఆడియో విడుదల చేసి.. విడుదల తేదీని ప్రకటిస్తాం' అన్నారు. -
రాజశేఖర్తో అనుకున్న సినిమా రానాతో చేశారా..!
బాహుబలి లాంటి భారీ సినిమా తరువాత యంగ్ హీరో రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. కొంత కాలంగా సరైన సక్సెస్ లు లేక ఇబ్బందుల్లో ఉన్న తేజ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కింది. ఈ శుక్రవారం (11-08-2017) రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబందించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. కొంత కాలం క్రితం తేజ సీనియర్ హీరో రాజశేఖర్ తో అహం అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే క్లైమాక్స్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో ఆ సినిమా సెట్స్ మీదకు రాలేదు. తరువాత అదే కథను రానాతో నేనే రాజు నేనే మంత్రి గా మార్చి చేశారట. రాజశేఖర్ సినిమాను తీసుకున్నట్టుగా చెప్పకపోయినా.. అహం కథనే రానా కోసం కొన్ని మార్పులు చేసినట్టుగా నిర్మాత సురేష్ బాబు తెలిపారు. మరి రాజశేఖర్ అనుకున్న క్యారెక్టర్ కు రానా ఎంత వరకు సూట్ అవుతాడు. రానాకు తగ్గట్టుగా కథలో ఏం మార్పులు చేశారో తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
డ్రగ్స్ కేసుపై స్పందించిన రానా
ప్రస్తుతం టాలీవుడ్ ను కుదిపేస్తున్న అంశం డ్రగ్స్. పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులకు నోటీసులు అందటంతో ఈ విషయం మరింత సీరియస్ గా మారింది. అయితే ఈ విషయంలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారిని తప్పించేందుకే ఎలాంటి అండ లేనివారిని ఫోకస్ చేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా సినీ రంగాన్ని శాసించే కొత్త మంది వారసులు కూడా ఇందులో భాగమన్నా టాక్ వినిపిస్తుంది. అయితే ఇదే విషయం పై జాతీయ మీడియాతో స్పంధించిన రానా, తనకు అలాంటి అలవాట్లు లేవని క్లారిటీ ఇచ్చాడు. 'రోజుకు 20 కిలో మీటర్లు జాగింగ్ చేస్తూ ఫిట్ గా ఉండేందుకు కష్టపడుతున్నా.. డైట్, ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఒక వేళ డ్రగ్స్ వాడితే ఇవన్ని సాధ్యమేనా.. మీరే చెప్పండ'న్నాడు. ఇప్పటికే రానా తండ్రి సురేష్ కూడా డ్రగ్స్ కేసు వివరణ ఇచ్చారు. -
డ్రగ్స్ కలకలంపై స్పందించిన సినీ పెద్దలు
హైదరాబాద్లో పట్టుబడ్డ డ్రగ్స్ రాకెట్ విషయంలో పలువురు సినీ ప్రముఖుల ప్రమేయం ఉన్నట్టుగా వచ్చిన వార్తలపై తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు స్పందించారు. కొంత మంది డ్రగ్స్ వాడటం వల్ల మొత్తం ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు శివాజీ రాజాతో పాటు నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, హీరో శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'మేం కేవలం పది మంది గురించే మాట్లాడుతున్నాం..ఆ పది మంది వల్లే ఇండస్ట్రీకి నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా వారు తమ పద్ధతిని మార్చుకోవాల'ని హెచ్చరించారు. ఈ డ్రగ్స్ వాడకం వల్ల హైదరాబాద్తో పాటు తెలుగు సినీ పరిశ్రమ కూడా తన ఇమేజ్ను కోల్పోతుందన్నారు సురేష్ బాబు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సమస్య పట్ల చాలా బాధ్యతగా వ్యవహరిస్తుందని.. ఇండస్ట్రీ నుంచి వారికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. -
వైరస్: మూవీ రివ్యూ
‘బర్నింగ్ స్టార్’గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంపూర్ణేష్ బాబు సినిమాలంటే.. టాలీవుడ్లో ఒక వెరైటీ గుర్తింపు ఉంది. అతని సినిమాలంటే.. మొదటినుంచి చివరివరకు బాగా నవ్వుకోవచ్చనేది ఆ ఇమేజ్. అందుకే...... సంపూ సినిమాలంటే ఆడియెన్స్ కాస్త ఆసక్తి చూపుతారు. తాజాగా అతను చేసిన ‘వైరస్’కీ అలాంటి క్రేజే నెలకొంది. ఈ చిత్రంపై సంపూర్ణేశ్బాబు చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వం వహించిన వైరస్ మునుపటి చిత్రాల్లాగే ఆడియన్స్ని మెప్పించిందా? లేదా? సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం పదండి.... కథ కిట్టు (సంపూర్ణేష్ బాబు) ఓ పేదకుటుంబానికి చెందిన అబ్బాయి. ఇతను కంప్యూటర్ ఇంజనీరింగ్లో యూనివర్సిటీ టాపర్గా నిలుస్తాడు. అయితే.. మాస్టర్ డిగ్రీ చదివేందుకు ఆర్థిక స్థోమత సరిగ్గా లేకపోవడంతో ఓ కాఫీ షాప్లో పనిచేస్తుంటాడు. ఓ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న అనన్య (నిదిషా)కి కిట్టు టాలెంట్ గురించి తెలుస్తుంది. దాంతో... ఆ అమ్మాయి అతనికి ఆర్థికంగా సహాయం చేస్తుంది. ఆమె సాయం చేయడంతో కిట్టు అమెరికా వెళ్లి మాస్టర్ డిగ్రీ చేసి, అక్కడే ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరుతాడు. కట్ చేస్తే.... తనకు ఎంతో సహాయం చేసిన అనన్య ఆత్మహత్య చేసుకుందని కిట్టుకి విషయం తెలుస్తుంది. ఈ వార్త విని కిట్టు హుటాహుటిన ఇండియాకి తిరిగి వస్తాడు. అసలు అనన్య ఎందుకు ఆత్మహత్య చేసుకుందోనని తెలుసుకోవడం కోసం ఆమె చనిపోయిన అపార్ట్మెంట్లోనే ఓ నెట్వర్క్ ఆపరేటర్గా అవతారం ఎత్తుతాడు. ఈ క్రమంలో అతనికి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. ‘వైరస్ డాట్ కాం’ అనే వెబ్సైట్లో అమ్మాయిల అశ్లీల వీడియోలు పెడుతూ ఓ ముఠా దారుణాలకు పాల్పడుతోందని, వారికి అనన్య చావుకి మధ్య సంబంధం ఉందని తెలుసుకుంటాడు. అసలు ఆ వెబ్సైట్ని ఎవరు నిర్వహిస్తున్నారు? అనన్య ఆత్మహత్య మిస్టరీని కిట్టు ఎలా చేధించాడు? ఈ కథలో దుర్గాప్రసాద్ ఎవరు? అనే విషయాలతో ఈ సినిమా కథ నడుస్తుంది. నటీనటులు సంపూర్ణేశ్బాబు ఎప్పటిలాగే తనదైన మేనరిజం, యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. అన్నీతానై సినిమాని నడిపించాడు. క్లైమాక్స్లో అతను చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి. హీరోయిన్గా చేసిన గీత్షా అందాల్ని బాగానే ఆరబోసింది కానీ.. నటనపరంగా ఆకట్టుకోలేదు. సినిమాలో మరో ఆసక్తికర పాత్ర వాచ్మెన్ బాబా పాత్రలో నటించిన వెన్నెల కిషోర్. సినిమాలో వెన్నెల కిషోర్ ఇచ్చే ట్విస్ట్ మామూలుగా ఉండదు. ఆ విషయం ఇప్పుడే చెబితే మీరు థ్రిల్ మిస్సవుతారు కాబట్టి అందుకే చెప్పడం లేదు. నటనపరంగా వెన్నెల కిషోర్ బాగా చేశాడు. ఇంతకు మించి సినిమాలో అంతగా చెప్పుకోదగ్గ పాత్రలేమీ లేవు. మొత్తం మీద సంపూర్ణేష్ బాబు చేసిన ఈ చిత్రం నిరుత్సాహపరిచేదిగానే ఉంది. ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నా కథనం మాత్రం రొటీన్గా, చప్పగా ఉంది. ఖాళీ సమయం దొరికి, సంపూర్ణేష్ బాబు అందించే వెరైటీ తరహా ఎంటర్టైన్మెట్ చూడటానికి ఇష్టపడే వారు ఒకేసారి ఈ సినిమాను చూడొచ్చు సాంకేతిక విభాగం దర్శకుడు కృష్ణ సినిమా ద్వారా ప్రస్తుతం సోషల్ మీడియా వలన జరిగే అనర్ధాలని చెప్పాలనుకున్న ప్రయత్నం కాస్తా మెచ్చుకోవాల్సిన విషయం. అయితే దాని కోసం ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రేక్షకులని పూర్తిగా నిరాశ పరిస్తుంది. సినిమాలో డైలాగ్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. మ్యూజిక్ డైరెక్టర్ గా సునీల్ కశ్యప్ సినిమాకి కాస్తా మైనస్ అని చెప్పుకోవాలి. అటు పాటలు, ఇటు బ్యాగ్రౌండ్ స్కోర్ రెండు విషయాల్లో ఆయన విఫలం అయ్యాడనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఉన్నంతలో భాగానే ఉంటుంది. ఇక ఎడిటింగ్ అంటే సినిమాలో చాలా సన్నివేశాలకి కత్తెర వేయొచ్చు. నిర్మాణ విలువలు ఉన్నంతంలో బాగానే ఉన్నాయి.– సాక్షి స్కూల్ ఎడిషన్