Suresh Babu
-
ఎమ్మెల్యే మాధవీరెడ్డి సహా 8మంది కార్పొరేటర్లు సస్పెండ్
-
పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్గా పబ్బ సురేశ్బాబు
ఢిల్లీ: ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (Press Club of India) మేనేజింగ్ కమిటీ మెంబర్గా తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టు పబ్బ సురేశ్బాబు విజయం సాధించారు. ఢిల్లీలోని పీసీఐలో ఎన్నికల పోలింగ్ శనివారం జరగగా.. ఆదివారం ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 1357 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 85 శాతం ఓట్లతో గౌతమ్ లహిరి ప్యానెల్ విజయం సాధించింది. తెలంగాణ బిడ్డ పాలమూరు జిల్లా నడిగడ్డ గద్వాల ప్రాంతానికి చెందిన పబ్బ సురేశ్ 773 ఓట్లతో మేనేజింగ్ కమిటీమెంబర్గా ఎన్నికయ్యారు. కాగా, ఫలితాల అనంతరం సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్గా గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్యానెల్ దేశ వ్యాప్తంగా జర్నలిస్తుల హక్కుల కోసం పార్లమెంట్ వేదికగా పోరాడుతుందని చెప్పారు. జర్నలిస్ట్ లపై ఎలాంటి దాడులు, సంఘటనలు జరిగినా ఖండించిడంతో పాటు.. వారికి న్యాయం చేకూర్చడంలో ముందుందన్నారు.ఇకపై తెలంగాణ, ఏపీ జర్నలిస్టుల వాయిస్ వినిపించేందుకు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. తన గెలుపుకోసం సహకరించి ఓట్లతో మద్దతు తెలిపిన పీసీఐ మెంబర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో గౌతమ్ లహిరి ప్యానెల్ మొత్తం బంపర్ మెజారిటితో గెలిచారు.పలువురు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. -
వరద బాధితుల కోసం ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..సురేష్ బాబు, దిల్ రాజు భారీ విరాళం
తెలుగు రాష్ట్రాల్లో వరద వల్ల నష్టపోయిన బాధితులకు సాయం చేసేందకు తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితులపే ఆదుకునేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తాజాగా ప్రకటించింది. నివేదిక సాయంతో బాధితుల కోసం సహాయ కార్యక్రమాలను చేపడుతామని ఫిల్మ్ ఛాంబర్ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని సినిమా థియేటర్ల వద్ద విరాళాలు, ఆహార వస్తువలను సేకరించేందుకు ఒక టీమ్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చాలామంది సినీ ప్రముఖులు విరాళాలు అందించారు. తాజాగా ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షలు విరాళం ప్రకటించింది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరపున ఏపీకి 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు అందిస్తుండగా ఫెడరేషన్ తరపున రెండు రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. దగ్గుబాటి కుటుంబం తరఫున ఇరు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు నిర్మాత సురేశ్ బాబు ప్రకటించారు. అనంతరం దిల్ రాజు కూడా తెలంగాణకు రూ. 25 లక్షలు, ఏపీకి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చిన వరదల వల్ల చాలామంది నిరాశ్రయులయ్యారు. దీంతో బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినీ పరిశ్రమ చేయబోతున్న యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు.ఈ సందర్భంగా ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'విజయవాడ, ఖమ్మంలో వరదలు రావడం వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి విపత్తులు ఎప్పుడు వచ్చినా సాయం చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలాగే ఈసారి కూడా ఎలాంటి సహాయసహకారాలు చేస్తే బాగుంటుంది అనేదానిపై చర్చించాము. ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీ, తెలంగాణకు విరాళంగా ప్రకటిస్తున్నాం. రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్కు సంబంధించి అకౌంట్ నంబర్స్ అలాగే, ఛాంబర్ నుంచి ఒక అకౌంట్ నంబర్ ఇస్తున్నాం. సహాయం చేయాలనుకునేవారు ఈ అకౌంట్స్కు డబ్బులు పంపించవచ్చు.' అని తెలిపారు.నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ.. 'ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మన పరిశ్రమ ఆదుకునే విషయంలో ముందుంటుంది. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమ అండగా ఉంటుంది. డబ్బు రూపంలోనే కాకుండా నిత్యావసరాలను కూడా అందించే ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.' అని చెప్పారు.నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'తెలుగు రాష్ట్రాల్లో వరదల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలామంది హీరోలు విరాళాలు అందించారు. అలాగే చాంబర్ నుంచి కూడా సహాయం చేయాలని నిర్ణయించాం. ఫెడరేషన్ పిలుపుమేరకు ఇండస్ట్రీలోని అందరూ ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కోరుతున్నాం. తద్వారా వచ్చిన విరాళాలను ప్రభుత్వాలకు అందిస్తాం.' అని చెప్పారు.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ..'మేము ఈ స్థాయికి రావడానికి కారణం ప్రజల ఆదరణే. ఇప్పుడు వాళ్లు కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం వాళ్లను ఆదుకోవాలి. అలాగే మాకు ఎప్పుడూ అండగా ఉండే ప్రభుత్వాలకు మద్దతును తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. అని చెప్పారు.ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ..'రేపు అన్ని యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఒకరోజు వేతనం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. మా కార్మికుల తరపున తెలుగు రాష్ట్రాలకు ఎంత చేయాలో అంతా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం.' అని చెప్పారు.నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..'వరద బాధితులను ఆదుకోవడం కోసం ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేశాం. తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేం ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని కమిటీ వాటిని తీర్చేలా ముందుకు వెళ్తుంది.' అని చెప్పారు. -
టీడీపీ పందికొక్కులకు కడప మేయర్ సురేష్ బాబు వార్నింగ్
-
నిన్ను చంపేస్తే మా నాన్న మేనేజ్ చేస్తారు
కర్నూలు కల్చరల్: తెలుగుదేశం నాయకుడి కుమారుడు, రాయలసీమ విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ పీజీ సీనియర్ విద్యార్థి రామ్ప్రకాష్ సోమవారం వీరంగం వేశాడు. తన జూనియర్ విద్యార్థి జి.సురేష్బాబును బయటినుంచి వచ్చిన స్నేహితులతో కలిసి దూషిస్తూ తీవ్రంగా కొట్టాడు. బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఫేర్వెల్ పార్టీకి సంబంధించి డాటా సైన్స్ ల్యాబ్లో డెకొరేషన్, క్యాటరింగ్, సౌండ్ సిస్టమ్ పనులను తాను చెప్పినట్లు చేయలేదని సురేష్బాబు మీద రామ్ప్రకాష్ దాడిచేశాడు. అతడితోపాటు బయటి నుంచి వచ్చిన అతడి స్నేహితులు కూడా సురేష్బాబును తీవ్రంగా కొట్టారు.దీనిపై సురేష్బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘మా నాన్న టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జేమ్స్. నిన్ను కొట్టి చంపేస్తే ఎస్పీని మ్యానేజ్ చేస్తారు. కర్నూలులో ఉన్న సీఐలను, ఎస్ఐలను మ్యానేజ్ చేస్తారు. దాడిచేసినట్లు పోలీస్స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నేను నిన్ను చంపేస్తా..’ అని రామ్ప్రకాష్ వార్నింగ్ ఇచ్చినట్లు సురేష్బాబు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారినుంచి తనకు ప్రాణహాని ఉందని తెలిపాడు.ఈ విషయమై వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సముద్రాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గొడవ జరిగినట్లు తమకు ఆలస్యంగా తెలిసిందన్నారు. సురేష్బాబుతో మాట్లాడామని, బయటి వ్యక్తులు వచ్చి దాడిచేసినట్లు తెలిస్తే కేసు పెడతామని చెప్పారు. రామ్ప్రకాష్ తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడతామన్నారు. వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఎన్.టి.కె.నాయక్ సమక్షంలో మంగళవారం ఇద్దరు విద్యార్థులతో మాట్లాడి జరిగిన విషయం తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘కాంచనగంగ’పై నవరత్నాల బ్యానర్ ప్రదర్శించిన సురేష్బాబుగాయపడిన సురేష్బాబు పర్వతారోహకుడు. 2022 మే 21న ప్రముఖ పర్వతాల్లో ఒకటైన కాంచనగంగ పర్వతాన్ని అధిరోహించి అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల బ్యానర్ను ప్రదర్శించాడు. రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిన ఇలాంటి విద్యార్థిపై దాడిచేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
తిరుమలలో టాలీవుడ్ నిర్మాత సురేశ్ బాబు, తమన్, గోపిచంద్ మలినేని (ఫొటోలు)
-
జగన్ పై ఎల్లో మీడియా దుష్ప్రచారం సురేష్ బాబు ఫైర్
-
వైఎస్ జగన్ ఎంపీగా పోటీ చేస్తారనేది అవాస్తవం
కడప (కార్పొరేషన్): వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తారనేది శుద్ధ అబద్ధమని పార్టీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్ బాబు ఆక్షేపించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదికగా టీడీపీ దు్రష్పచారానికి పూనుకోవడం దారుణమన్నారు. ఈ ఊహా జనిత కథనం సృష్టికర్త టీడీపీ అని ధ్వజమెత్తారు.వైఎస్ జగన్ కడప ఎంపీగా పోటీ చేస్తారని, వైఎస్ అవినాశ్రెడ్డి పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని సోషల్ మీడియాలో వాళ్లే పోస్ట్ చేయడం.. ఆపై ఆంధ్రజ్యోతిలో ఊహాగానాలు, కలి్పతాలతో కథనం రాయించడం, దానిపై చంద్రబాబు శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ స్పందించడం మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమేనన్నారు. ప్రజలను గందరగోళపరిచేందుకే ఇలా చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.వైఎస్ కుటుంబంలో చిచ్చుపెట్టేలా రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. 2011లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పామని, ఇప్పుడొచ్చి తెలంగాణ సీఎం రేవంత్ గల్లీ గల్లీ తిరుగుతాననడం హాస్యాస్పదమన్నారు. ఉచిత ఇసుక ఇస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం ట్రాక్టర్ ఇసుకకు రూ.1,700 వసూలు చేస్తోందన్నారు. ట్రాక్టర్ ఇసుకను కడప తెచ్చుకునేసరికి రూ.3,500 అవుతోందన్నారు. -
కడప దెబ్బ.. ఢిల్లీ అబ్బా.. సీఎం రేవంత్ కు అదిరిపోయే కౌంటర్..
-
షష్టి పూర్తి!
తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రోడక్షన్స్ షష్టి పూర్తి (60 ఏళ్లు) ప్రయాణం పూర్తి చేసుకుంది. పద్మభూషణ్, దివంగత నిర్మాత డా. డి. రామానాయుడు 1964లో స్థాపించిన సురేష్ ప్రోడక్షన్స్ భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా పేరు పొందడంతో పాటు ప్రేక్షకుల మన్ననలను పొందింది. ప్రకాశం జిల్లా కారంచేడులో రైతు కుటుంబంలో పుట్టారు రామానాయుడు. రైసు మిల్లు వ్యాపారం చేస్తున్న సమయంలో ఆయన మద్రాసు వెళ్లారు. అక్కడ కొందరు సినీ ప్రముఖుల పరిచయం ఆయన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. భాగస్వామ్యంతో ‘అనురాగం’ చిత్రం నిర్మించారు రామానాయుడు.ఆ చిత్రం విజయవంతం అయింది. ఆ తర్వాత తన పెద్ద కుమారుడు సురేష్బాబు పేరుతో సురేష్ ప్రోడక్షన్స్ స్థాపించి, ఎన్టీఆర్తో ‘రాముడు–భీముడు’ (1964) సినిమా నిర్మించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. అప్పట్నుంచి పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తూ వస్తోంది సురేష్ ప్రోడక్షన్స్. శతాధిక చిత్రాల నిర్మాతగా రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లో స్థానం సంపాదించుకున్నారు. అలాగే అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించాలన్న తన సంకల్పాన్ని నెరవేర్చుకుని, చరిత్ర సృష్టించారు రామానాయుడు.2015 ఫిబ్రవరి 18న ఈ మూవీ మొఘల్ తుది శ్వాస విడిచారు. అప్పటికే తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను నిర్వర్తిస్తున్న సురేష్బాబు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. రెండో కుమారుడు వెంకటేశ్ హీరోగా కొనసాగుతున్నారు. మనవడు రానా నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. రానా సోదరుడు అభిరామ్ కూడా హీరో (‘అహింస’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు)గా చేసిన విషయం తెలిసిందే. ఇక సురేష్ ప్రోడక్షన్స్ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రయాణంలో భాగమైన అందరికీ నిర్మాణ సంస్థ కృతజ్ఞతలు తెలియజేసింది. -
CM Jagan: సింహంలా ఒక్కరే వస్తారు
సాక్షి, అన్నమయ్య: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. మంగళవారం అన్నమయ్య జిల్లాలో రాజంపేట నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర జరుగుతోంది. రాజంపేట బహిరంగ సభలో వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు మాట్లాడారు. ఇప్పటివరకు ఎంతో మంది ముఖ్యమంత్రులను చేశామని, కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం సామాజిక సాధికారత సాధించి చరిత్ర తిరగరాశారని అన్నారు. సీఎం జగన్ ఎంతో మంది సామాన్యులకు పదవులిచ్చారని తెలిపారు. బీసీలను రాజ్యసభకు పంపిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. మళ్లీ కొందరు అబద్దపు హామీలతో మోసం చేసేందుకు వస్తున్నారని అన్నారు. వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. వైఎస్ జగన్ను అశీర్వదించండని కోరారు. రాజంపేట ప్రజలు అదృష్టవంతులని.. రామలక్ష్మణుల్లా మల్లికార్జునరెడ్డి, అమరనాథ్రెడ్డిలు రాజంపేటను కాపాడుతున్నారని డిప్యూటి సీఎం అంజాద్ బాషా అన్నారు. రాజంపేట బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మల్లికార్జునరెడ్డి, అమరనాథ్రెడ్డి వంటి నాయకులు రాజంపేటకు ఉండటం అదృష్టమని తెలిపారు. సామాజిక న్యాయాన్ని ఇంత వరకు ఎప్పుడైనా చూశామా? బీసీలు తనకు పేటెంట్ అని చెప్పిన చంద్రబాబు బీసీలను వాడుకొని వదిలేశారని ఆరోపించారు. కానీ ఆచరణలో సీఎం వైఎస్ జగన్ చేసి చూపారని గుర్తుచేశారు. ఇంటికొకరు ఇంజనీరు, వైద్యలు ఉండాలని ఆనాడు దివంగత వైఎస్సార్ ఆశించారని తెలిపారు. ఇప్పుడు ఆయన తనయుడు అదే పరిపాలనను కొనసాగిస్తున్నారని అన్నారు. టీడీపీ హాయంలో మైనార్టీ మంత్రి, ఎమ్మెల్యే లేరని, ఓట్ల కోసమే చివరలో ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారని మండిపడ్డారు. అదే వైఎస్ జగన్ మైనార్టీని డిప్యూటి సీఎంను చేశారని గుర్తుచేశారు. అనేక మందిని కార్పోరేషన్లకు చైర్మన్లుగా చేశారని పేర్కొన్నారు. కేవలం జగన్ను ఎదుర్కొవడానికి అన్ని పార్టీలు ఎకమవుతున్నాయని అన్నారు. ఎంతమంది ఏకమైనా సింహంలా జగన్ ఒక్కరే వస్తారని తెలిపారు. సీఎం జగన్ను ప్రతి ఒక్కరు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని అంజాద్ బాషా అన్నారు. రాజంపేటలో అభివృద్ది జరిగిందంటే దివంగత వైఎస్అర్, వైఎస్ జగన్ హాయంలోనే జరిగిందని కడప జడ్పీ ఛైర్మన్ అకేపాటి అమరనాధరెడ్డి తెలిపారు. రాజంపేట బహిరంగ సభలో అకేపాటి అమరనాధరెడ్డి మాట్లాడారు. రాజంపేటలో తాగునీరు సమస్య లేదంటే అది వైఎస్అర్ చలువే అన్నారు. రాజంపేటకు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, తాను ప్రజలకు వాచ్మెన్లలా ఉన్నామని, అందరికీ అండగా ఉన్నామని తెలిపారు. ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించి రాష్టంలో సీఎంగా వైఎస్ జగన్ గెలిపించాలని అన్నారు. అన్ని కులాలపై ప్రేమ చూపిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. అందరినీ విద్యావంతులను చేయ్యాలని అనేక సంస్కరణలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడున్న పథకాలన్ని అమలవ్వాలంటే మళ్లీ జగనే రావాలని తెలిపారు. -
ఘనంగా టాలీవుడ్ హీరో రానా తమ్ముడి పెళ్లి.. వధువు ఎవరో తెలుసా?
టాలీవుడ్ నిర్మాత సురేశ బాబు తనయుడు అభిరామ్ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. రానాకు తమ్ముడైన అభిరామ్ వరసకు మరదలైన ప్రత్యూష అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. శ్రీలంకలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్కు బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరలవుతున్నాయి. దాదాపు మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుక జరిగింది. కాగా.. ఇటీవలే వరుణ్ తేజ్ సైతం పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేశ్ బాబుకి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి రానా ఇప్పటికే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రెండో అబ్బాయి అభిరామ్ కూడా 'అహింస' అనే మూవీతో టాలీవుడ్లో హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఈ మూవీ అంత గుర్తింపు తీసుకురాలేదు. దీంతో కొన్నాళ్లు గ్యాప్ తీసి సినిమాలు చేస్తానని ప్రకటించాడు. అతను ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్లోనూ నటించడం లేదు. దీంతో పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. దగ్గుబాటి కుటుంబంలోకి అడుగుపెట్టనున్న అమ్మాయి స్వస్థలం కారంచేడు అని తెలుస్తోంది. View this post on Instagram A post shared by South Celebrity (@southcelebrity.insta) -
అలాంటి రాజకీయ నాయకులను చూస్తే కోపం వస్తుంది నాకు
-
రానా డ్రగ్స్ కేసు పై సురేష్ బాబు రియాక్షన్
-
ఆత్రేయ, వేటూరి గారు పెద్ద రైటర్స్..కానీ తప్ప తాగి..!
-
ఆఖరికి పవన్ కళ్యాణ్ సినిమా అయినా అంతే అంటున్న సురేష్ బాబు
-
మనకు వద్దు నాన్న అని చెప్తే వినలేదు..!
-
నా తమ్ముడి సినిమా పెద్ద హిట్ కావాలని చాలా కష్టపడ్డా..!
-
నా తమ్ముడి సినిమా వల్లే.. పవన్ తో గొడవ..!
-
నేను సంతోషంగా లేకపోవడానికి కారణం ఇదే
-
నా పెద్ద కొడుకు చాలా పిరికివాడు..!
-
చంద్రబాబు అరెస్ట్.. సినిమా వాళ్లు స్పందించడం సరికాదు: సురేశ్ బాబు
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అరెస్ట్ ఖండించాలంటూ టాలీవుడ్ ప్రముఖులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. అయినప్పటికీ వారి నుంచి పెద్ద రెస్పాన్స్ రావట్లేదు. ఏ ఒక్క హీరో కూడా స్పందించలేదు. డైరెక్టర్ రాఘవేంద్రరావు, అశ్వినీదత్తో పాటు నట్టి కుమార్ మాత్రమే చంద్రబాబు అరెస్ట్ని ఖండించారు. బడా నిర్మాతలు, హీరోలు ఎవరూ స్పందించకపోవడంతో పలువురు టీడీపీ నాయకులు వారికి ఫోన్లు చేసి మరీ బ్రతిమిలాడుతున్నారట. (చదవండి: ఎన్టీఆర్పై చెప్పులు విసరడం నా కళ్లారా చూశా: మోహన్ బాబు) ఇదిలా ఉంటే..తాజాగా ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంపై స్పందించాడు. సినిమా వాళ్లు రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా సినిమా వ్యాపారం చేసుకోవడం మంచిదని హితవుపలికారు. తాజాగా ఆయన సప్త సాగరాలు అనే సినిమా ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్పై మీ స్పందన ఏంటని ఓ విలేకరి ప్రశ్నించగా ..సినిమా రంగం రాజకీయాలకు దూరంగా ఉండడమే మంచిదన్నారు. ‘ఇండస్ట్రీ ఎప్పుడూ రాజకీయాలకు, మతాలకు అతీతంగా ఉంటుంది. చాలా మంది పరిశ్రమ పెద్దలు ఇలానే ఉన్నారు. కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు పెట్టుకున్నప్పటికీ, ఇండస్ట్రీకి రాజకీయం ఆపాదించలేదు. చంద్రబాబు అరెస్ట్ అనేది సున్నితమైన అంశం. దీనిపై ఇండస్ట్రీ స్పందించాల్సిన అవసరం లేదు. మేం రాజకీయ నాయకులం కాదు.. మీడియా కాదు.. మేం మూవీ మేకర్స్. సినిమాలు మాత్రమే తీస్తాం. చాలా మంది స్టేట్మెంట్ ఇవ్వమంటారు. ఏం ఇస్తాం? రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ప్రతి అంశంపై స్టేట్మెంట్ ఇవ్వలేం కదా? తెలుగు దేశం పార్టీకీ సంబంధించిన వ్యక్తులు అయినప్పటికీ చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో సినిమా వాళ్లు స్పందించడం సరికాదు. ఇండస్ట్రీలో రాజకీయాలు ఉండకూడదని నా అభిప్రాయం’అని సురేశ్ బాబు అన్నారు. -
చంద్రయాన్–3లో దేవగుప్తం శాస్త్రవేత్త సురేశ్ బాబు
అల్లవరం: చంద్రుడి దక్షిణ ధృవంపైన ల్యాండర్ను దించిన తొలి దేశంగా భారత్ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. మన రాష్ట్రంలోని శ్రీహరికోట నుంచి చంద్రయాన్–3ని ప్రయోగించగా ఈ క్రతువులో ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పాలుపంచుకున్నారు. వీరిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం గ్రామానికి చెందిన శాస్త్రవేత్త బలభద్ర సురేష్బాబు ఒకరు. చంద్రయాన్–3 ప్రాజెక్టు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్సీ) క్రయోజెనిక్ విభాగంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఒక మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టినా సురేశ్ బాబు కుంగిపోలేదు. గ్రామంలోనే పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. విఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆయనలా తాను ప్రముఖ శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకోవాలనుకున్నారు. అమలాపురంలోని ఎస్కేబీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదివిన సురేశ్ బాబు తణుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత ట్రిఫుల్ ఐటీ బెంగళూరులో విద్యనభ్యసించి త్రివేండ్రంలోని ఇస్రో కేంద్రంలో తొలి పోస్టింగ్ పొందారు. చంద్రయాన్–3లో కీలక పాత్ర పోషించడం ద్వారా ఎట్టకేలకు తన ఆకాంక్షను నెరవేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో దేవగుప్తం సచివాలయంలో శాస్త్రవేత్త సురేశ్ బాబు తల్లిదండ్రులు సత్యభారతి, కామేశ్వరరావులను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు సాధనాల వెంకటరావు మాట్లాడుతూ.. చంద్రయాన్ విజయంలో గ్రామానికి చెందిన సురేశ్ బాబు కీలక పాత్ర పోషించడం దేశానికే గర్వకారణమని అభివర్ణించారు. నిరుపేద కుటుంబంలో పుట్టినా ఉన్నత స్థాయికి ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన మరిన్ని విజయాలు సాధించి గ్రామానికే కాకుండా, దేశానికి కూడా కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. సురేశ్ బాబు తండ్రి కామేశ్వరరావు మాట్లాడుతూ.. తన కుమారుడికి చిన్నప్పటి నుంచి ప్రశ్నించే తత్వం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు తిక్కిరెడ్డి శ్రీను, సుందరనీడి సాయి, ఎంపీటీసీ ముత్తాబత్తుల రాంబాబు, హెచ్ఎం వేణుగోపాల్, ఏఎంసీ డైరెక్టర్ ఈతకోట సతీష్, జగనన్న గృహ సారథుల కన్వీనర్ కుడుపూడి సూర్యప్రకాశరావు, వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పెచ్చెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నా తమ్ముడు అభిరామ్ ‘అహింస’ అలరిస్తుంది: రానా
సాక్షి, ప్రకాశం(చీరాల): మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు మనవడు, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్బాబు తనయుడు ప్రముఖ హీరో దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ చిత్రరంగంలోకి అరంగ్రేటం చేస్తున్న మొదటి సినిమా అహింస ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా జరిగింది. శనివారం రాత్రి చీరాలలో స్థానిక ఎన్ఆర్అండ్పీఎం హైస్కూల్ గ్రౌండ్స్లో ఈ వేడుక నిర్వహించారు. సినీ నటీనటులను చూసేందుకు వేల సంఖ్యలో సినీ అభిమానులు, దగ్గుబాటి అభిమానులు తరలి రావడం విశేషం. ఉదయభాను యాంకర్గా వ్యవహరించి ప్రేక్షకులను అలరించారు. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పాటలను పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్, హీరోయిన్ దీపిక దివని, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, డైరెక్టర్ తేజ, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, వైఎస్సార్ సీపీ ఇన్చార్జి కరణం వెంకటేష్లు హాజరయ్యారు. (చదవండి: సీరియల్ హత్యలు, పోలీసుల ఈగో.. కేసు చేధిస్తారా?) ఎమ్మెల్యే బలరాం మాట్లాడుతూ రామానాయుడు కుటుంబం నుంచి మరో హీరో సినీ అరంగ్రేటం చేయడం శుభపరిణామమన్నారు. తెలుగు సినీఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దగ్గుబాటి కుటుంబం ఎన్నో సందేశాత్మక చిత్రాలను రూపొందించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిందన్నారు. నూతన హీరో అభిరామ్ను అందరు ఆదరించాలన్నారు. దగ్గుబాటి కుటుంబంతో తమకు సన్నిహిత కుటుంబ సంబంధాలు ఉన్నాయని నూతన సినీమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చీరాలలో నిర్వహించడం గొప్ప విషయమన్నారు. సినీరంగానికి, చిత్రాల నిర్మాణానికి చీరాల నియోజకవర్గం అనుకూలమన్నారు. అహింస చిత్రం ప్రేక్షకులు ఆదరించి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాలన్నారు. సినీ హీరో దగ్గుబాటి రానా మాట్లాడుతూ తన తమ్ముడు అభిరామ్ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం అందరిని అలరిస్తుందని, ప్రేక్షకులు ఆదరించి విజయాన్ని చేకూర్చాలన్నారు. ప్రజల అభీష్టంతో ప్రేక్షకులను హత్తుకునేలా చిత్రాన్ని రూపొందించి చక్కని పాటలు, సంగీతం ఇచ్చామన్నారు. చీరాలతో మాకు విడదీయరాన్ని సంబంధం ఉందని తమ కుటుంబం సినీరంగం, సేవా కార్యక్రమాలు, రాజకీయాల్లో చెరగని ముద్రను పొందామని, నూతన నటీనటులను ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు. -
సుధీర్ పక్కన హీరోయిన్ ఎలా సిగ్గు పడుతుందో చూడండి
-
‘భారతీయన్స్’ టీజర్ బాగుంది: సురేశ్ బాబు
ప్రముఖ రచయిత, ప్రేమకథా చిత్రాల స్పెషలిష్ట్ (ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా ఫేమ్) దీన్ రాజ్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘భారతీయన్స్’. నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, హీరోలుగా... సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత నిర్మించారు. (చదవండి: యంగ్ హీరోతో కలిసి స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్) తాజాగా ఈ చిత్రం టీజర్ని ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు రిలీజ్ చేసి, చిత్ర యూనిట్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తమ సంస్థకు "ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా" వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దీన్ రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్న "భారతీయన్స్" బిగ్గెస్ట్ బ్లస్టర్ కావాలని ఆకాంక్షించారు. (చదవండి: ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!) దర్శకుడు దీనరాజ్ మాట్లాడుతూ ''దేశభక్తి సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని ఈ కథ రాశా. మా నిర్మాతకు కూడా దేశభక్తి ఎక్కువ. కథ నచ్చి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే చిత్రమిది. భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ప్రశంసలు అందుకున్న మా చిత్రం టీజర్ ను సురేష్ బాబు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది'అని అన్నారు. హీరో నీరోజ్ మాట్లాడుతూ ''హీరోగా నాకు ఫస్ట్ సినిమా ఇది. అవకాశం ఇచ్చిన నిర్మాత శంకర్ గారికి, దర్శకులు దీన్ రాజ్ గారికి థాంక్స్'' అని అన్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సత్య కశ్యప్ & కపిల్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. -
మన్యంరాజు టీజర్ బాగుంది: సురేశ్బాబు
‘‘మన్యంరాజు’ టీజర్ చాలా ఆసక్తిగా ఉంది. సినిమా చూడాలనే కుతూహలాన్ని రేపుతోంది. ఈ చిత్రం హిట్ అయి, యూనిట్కి మరిన్ని అవకాశాలు తీసుకురావాలి’’ అని నిర్మాత డి.సురేశ్ బాబు అన్నారు. జీవన్, బేబీ పరిణిక జంటగా బీయమ్ సోముసుందరం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మన్యంరాజు’. వాయుపుత్ర ఆర్ట్స్పై విజయ్ బాబు, వై.ప్రవీణ్, పుష్పలత.బి నిర్మించిన ఈ సినిమా టీజర్ని సురేశ్ బాబు రిలీజ్ చేశారు. బీయమ్ సోము సుందరం మాట్లాడుతూ–‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రం ఇది’’ అన్నారు. ‘‘నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు జీవన్. ‘‘మే లో సినిమా విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ కార్యక్రమంలో పరిపూర్ణానంద స్వామి, ఎంపీ, నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ, నటుడు సప్తగిరి తదితరులు పాల్గొన్నారు. -
హీరో వెంకటేశ్ ఇంట తీవ్ర విషాదం
హీరో దగ్గుబాటి వెంకటేశ్ ఇంట విషాదం నెలకొంది. వెంకటేశ్, సురేశ్ బాబుల బాబాయ్, మూవీ మొఘల్ దివంగత రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు(73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం బాపట్ల జిల్లా కారంచేడులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. విషయం తెలుకున్న సురేశ్ బాబు.. కొడుకు అభిరాంతో కలిసి కారెంచేడు వెళ్లి బాబాయ్ మృతదేహానికి నివాళులర్పించాడు. హీరో వెంకటేశ్ షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లడంతో కారెంచేడు రాలేకపోయినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం వెంకటేశ్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు దగ్గుబాటి మోహన్ బాబు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, చీరాల వైసీపీ సమన్వయకర్త కరణం వెంకటేశ్ .. మోహన్ బాబు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. -
అన్నపూర్ణ ఫోటో స్టూడియోలో ఏం జరిగింది?
చైతన్యరావు, లావణ్య హీరో హీరోయిన్లుగా చెందు ముద్దు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ‘ఇచ్చట అందమైన ఫోటోలు తీయబడును’ అనేది ఉపశీర్షిక. బిగ్బెన్ సినిమాస్పై యశ్ రంగినేని నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్లుక్ని నిర్మాత డి.సురేష్బాబు విడుదల చేసి, సినిమా హిట్ సాధించాలని ఆకాంక్షించారు. చైతన్యరావు మాట్లాడుతూ –‘‘ఇప్పుడున్న ఫాస్ట్లైఫ్ నుంచి దూరంగా ప్రేక్షకులను 1980 నేపథ్యంలోకి తీసుకువెళ్లే సినిమా ఇది’’ అన్నారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథే ఈ చిత్రం. కథలో ఉన్న ట్విస్ట్లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి’’ అన్నారు చందు. ‘‘ఫన్, థ్రిల్లింగ్, క్రైమ్ ఎలిమెంట్స్తో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు నిర్మాత యశ్ రంగినేని. -
అవినాశ్ను ఇరికించేందుకే గూగుల్ టేకౌట్ కథ
కడప కార్పొరేషన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాశ్రెడ్డిని ఇరికించేందుకే గూగుల్ టేకౌట్ కథ అల్లుతున్నారని కడప మేయర్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు చెప్పారు. అందుకే తాము కోర్టును ఆశ్రయించామే తప్ప సీబీఐకి భయపడి కాదన్నారు. వైఎస్ కుటుంబం ఇలాంటి ఎన్నో కుట్రలను ఎదుర్కొని నిలబడిందన్నారు. వారిది పదిమందికి సాయం చేసే గుణమే తప్ప ద్రోహం చేసే ఆలోచన లేదన్నారు. సురేష్బాబు శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీబీఐపై ఉన్న నమ్మకం పోయేలా కేసు దర్యాప్తు సాగుతోందని అన్నారు. తాము లేవనెత్తుతున్న అనుమానాలపై దృష్టి పెట్టకుండా సీబీఐ ఒక కోణంలోనే దర్యాప్తు చేస్తోందని తెలిపారు. అవినాశ్రెడ్డి ఆయనకున్న అనుమానాలన్నీ లిఖితపూర్వకంగా ఇచ్చినా సీబీఐ అధికారులు పట్టించుకోలేదన్నారు. న్యాయవాది సమక్షంలో విచారించాలని, వీడియో తీయాలని కోరినా పట్టించుకోలేదన్నారు. వివేకా చనిపోయినప్పుడు మొదట ఫోన్చేసి చెప్పిన శివప్రకాశ్రెడ్డిని ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. దస్తగిరి అప్రూవర్గా మారడంతో అతడిని స్వేచ్ఛగా వదిలేశారన్నారు. హత్యకు ముందు సునీల్యాదవ్ అవినాశ్రెడ్డి ఇంట్లో ఉన్నాడని చెప్పడం దారుణమన్నారు. సీబీఐ అధికారులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎల్లో మీడియాకు లీకులిస్తూ అభూత కల్పనలకు తావిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా సీబీఐ అధికారులు వాస్తవాలను వెలికితీసి, నిజమైన దోషులను శిక్షించాలని కోరారు. దస్తగిరి ఎవరి పేరు చెబితే వారిని విచారిస్తున్నారు: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ఖాన్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డిని ఇరికించే కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ఖాన్ చెప్పారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. అప్రూవర్గా మారిన దస్తగిరి ఎవరి పేరు చెబితే వారిని చార్జిషీట్లో పెట్టి విచారణకు పిలవడం సరికాదన్నారు. ఎంపీ అవినాశ్రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా విచారణ పేరిట వేధించి, ఆయన రాజకీయ భవిష్యత్ను నాశనం చేయాలనే కుట్ర కనిపిస్తోందన్నారు. సీబీఐ విచారణను బీజేపీలోని టీడీపీ కోవర్టులు ప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయని చెప్పారు. -
Nenekkadunna: టాలీవుడ్లోకి బాలీవుడ్ సీనియర్ హీరో కొడుకు
బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మాధవ్ కోదాడ దర్శకత్వంలో ‘నేనెక్కడున్నా' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఎయిర్ టెల్ ఫేమ్ సశా ఛెత్రి కథానాయిక. కె.బి.ఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు టైటిల్ వెల్లడించడంతో పాటు పోస్టర్, టీజర్ విడుదల చేశారు. అనంతరం సురేశ్ బాబు మాట్లాడుతూ..‘టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. కథ బాగుంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు, ఇటువంటి కొత్త ప్రయత్నాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్' అని చెప్పారు. ‘జర్నలిజం, రాజకీయం నేపథ్యంలో వస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది’అని దర్శకుడు మాధవ్ కోదాడ అన్నారు. ‘సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం సెన్సార్ సన్నాహాల్లో ఉన్నాం. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’అని నిర్మాత మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి అన్నారు. -
ఫిలింనగర్ భూవివాదంలో కొత్త మలుపు
-
ఫిలింనగర్ భూవివాదంలో కొత్త మలుపు
-
భూ వివాదం: నిర్మాత సురేష్బాబు, రానాలపై క్రిమినల్ కేసు నమోదు
హైదరాబాద్: ఫిలింనగర్ భూ వివాదం కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు నిర్మాత సురేష్బాబు, రానాలపై క్రిమినల్ కేసు నమోదైంది. తమను దౌర్జన్యంగా ఖాళీ చేయించారని వ్యాపారి ప్రమోద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఖాళీ చేయకుంటే అంతు చూస్తామని సురేష్బాబు బెదిరించినట్లు ఆరోపించారు. ఫిర్యాదు చేసినా బంజరాహిల్స్ పోలీసులు పట్టించుకోలేదన్నారు. దాంతో నాంపల్లి కోర్టును బాధితుడు ఆశ్రయించాడు. సురేష్బాబు, రానా సహా మరికొందరిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశించింది. దాంతో సురేష్బాబు, రానాపై కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. -
జూబ్లీహిల్స్లో ట్రాఫిక్ను కంట్రోల్ చేసిన సురేష్ బాబు
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కారుదిగి స్వయంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్లోని ఫిల్మ్నగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో అటువైపు వెళ్తున్న నిర్మాత సురేష్ బాబు స్వయంగా కారులోంచి దిగి ట్రాఫిక్ను కంట్రోల్ చేశారు. వాహనదారులకు సూచనలు చేస్తూ ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాధ్యతగల పౌరుడిలా వ్యవహరించారంటూ సురేష్ బాబుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
తెలుగు నిర్మాతల మండలి నిర్ణయంపై నిర్మాత సురేశ్ బాబు సంచలన వ్యాఖ్యలు
గత కొంతకాలంగా టాలీవుడ్లో తెలుగు, తమిళ సినిమాల రిలీజ్ విషయం చిన్న వివాదం జరుగుతుంది. సంక్రాంతి సీజన్లో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల తెలుగు నిర్మాతల మండలి లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిని కొంతమంది సమర్థిస్తుంటే.. మరికొంతమంది తప్పుబడుతున్నారు. తాజాగా నిర్మాతల మండలి నిర్ణయంపై ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు స్పందించారు. ఇతర భాషల సినిమాలను ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. సంక్రాంతి సీజన్లో అన్ని సినిమాలు నడుస్తాయన్నారు. ‘తెలుగు సినిమా హద్దులు చెరిగిపోయాయి. మన సినిమాను ఏ భాషలో కూడా చులకనగా చూడట్లేదు. చెన్నైలో ఆర్ఆర్ఆర్ విడుదల చేసినప్పుడు అక్కడి వాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు. లోకల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. మంచి సినిమా అయితే.. ఎక్కువ థియేటర్స్లో ఆడిస్తారు. సినిమా బాలేకుంటే తరువాతి రోజే తీసేస్తారు. ఇదొక బిజినెస్ అంతే. ఎవరిష్టం వారిది. ఆడుతుందనే నమ్మకం ఉన్న సినిమాకు ఎక్కువ థియేటర్స్ ఇస్తారు. అది ఏ భాష సినిమా అని ఎవరూ చూడరు. మన తెలుగు సినిమా కూడా ఇతర భాషల్లో విడుదలయి విజయం సాధిస్తున్నాయి. -
సంచలనం సృష్టించిన బాలయ్య టాక్ షో, 5వ ఎపిసోడ్కు రికార్డ్ వ్యూస్
నందమూరి నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్-2’. బాలయ్య తనదైన శైలి, చమత్కారం, పంచ్లతో ఈ షోను విజయవంతం చేస్తున్నాడు. ఇప్పటికే మొదటి సీజన్ పలు రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సెకండ్ సీజన్ కూడా రికార్డ్ సృష్టించింది. లేటెస్ట్గా జరిగిన 5వ ఎపిసోడ్ రెండు రోజుల్లోనే 30 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ రాబట్టి సంచలనం రేపింది. దివంగత మాజీ సీఎం, సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా 5వ ఎపిసోడ్ టాలీవుడ్ స్టార్ నిర్మాతలైన దగ్గుబాటి సురేశ్ బాబు, అల్లు అరవింద్తో పాటు అగ్ర దర్శకుడు రాఘవేంద్రరావు, మరో దర్శకుడు కోదండరామి రెడ్డి అతిథులుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాళ్లు 90 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో వచ్చిన సినిమాల గురించి చర్చించారు. అల్లు అరవింద్, సురేష్ బాబును నేపోటిజం గురించి బాలకృష్ణ ప్రశ్నించారు. ఇంకా మూవీస్ గురించి డిస్కస్ చేశారు. హీరోయిన్ల నాభిపై పూలు, పళ్లు ఎందుకు వస్తారో రాఘవేంద్ర రావును అడిగారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ సరదాగా సాగింది. దాంతో ఈ షోకు ప్రేక్షకుల నుంచి కూడా విశేష ఆదరణ అభించింది. ఈ నేపథ్యంలో అన్స్టాపబుల్ 5వ ఎపిసోడ్కు రెండు రోజుల్లోనే ఏకంగా 30 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చినట్లు తాజాగా ఆహా అధికారికంగా ప్రకటించింది. Matallo marintha fire 🔥. Kaburlalo marintha fun. Maruvaleni kathalu, inka enneno. An episode that you can't miss😉 Watch #UnstoppableWithNBKS2 Episode 5 Streaming Now@SBDaggubati #alluarvind#kodandaramireddy @Ragavendraraoba #MansionHouse @tnldoublehorse @realmeIndia pic.twitter.com/f6JDjDfrtZ — ahavideoin (@ahavideoIN) December 5, 2022 -
మాదాపూర్లో గన్తో హల్చల్పై కొనసాగుతున్న దర్యాప్తు
-
సురేష్ బాబుతో భూవివాదం.. గన్తో బెదిరిస్తూ రియల్టర్ హల్చల్
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లో గురువారం రాత్రి కాల్పులు కలకలం రేపాయి. సంజీవ రెడ్డి అనే రియల్టర్ రాత్రి సమయంలో గన్తో హల్చల్ చేశారు. దీంతో, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, దగ్గుపాటి సురేష్బాబుకు చెందిన స్థలంలో జరుగుతున్న నిర్మాణాల వద్ద ఘటన చోటుచేసుకుంది. అయితే, సురేష్ బాబు స్థలంలో కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ను సంజీవ రెడ్డి తీసుకున్నారు. కాగా, కన్స్ట్రక్షన్ సందర్భంగా సురేష్ బాబు, రామకృష్ణారెడ్డికి మధ్య భూ వివాదం చోటుచేసుకుంది. తన స్థలంలోకి జరిగి నిర్మాణం చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. ఈ విషయంపై మాదాపూర్ పీఎస్లో సురేష్ బాబు సూపర్వైజర్ ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. గురువారం రామకృష్ణారెడ్డి మరోసారి కన్స్ట్రక్షన్ జరుగుతున్న చోటుకు వచ్చారు. ఈ సందర్భంగా రామకృష్ణ, సంజీవ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సంజీవ రెడ్డి తన గన్తో రామకృష్ణారెడ్డిని బెదిరించాడు. దీంతో, రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కాంట్రాక్టర్ సంజీవరెడ్డిని అదుపులోకి తీసుకుని గన్ను సీజ్ చేశారు. దీనిపై విచారణ కొనసాగుతున్నట్టు వెల్లడించారు. -
Kanipakam: కాణిపాకం ఇన్ఛార్జి ఈఓ సురేష్ బాబుపై బదిలీ వేటు
సాక్షి, చిత్తూరు: టికెట్ ధరల పెంపుపై కాణిపాకం ఇన్ ఛార్జి ఈఓ సురేష్ బాబు ఇచ్చిన ఉత్తర్వులపై దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఆయనపై బదిలీ వేటు వేసింది. సురేష్ బాబును కాణిపాకం ఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాణిపాకం ఇన్ఛార్జి ఈఓగా కర్నూలు డిసి రాణా ప్రతాప్ కి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కమీషనర్ హరి జవహర్ లాల్ ఇప్పటికే సురేష్ బాబుకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. కాణిపాకంలో అభిషేకం టిక్కెట్ ధరని పెంచడానికి ప్రజాభిప్రాయం పేరుతో జారీ చేసిన ఉత్తర్వులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిక్కెట్ ధరని పెంచడం లేదంటూ ఇప్పటికే దేవాదాయ శాఖ స్పష్టమైన ప్రకటన చేసిందని ఆయన తెలిపారు. సురేష్ బాబుపై విచారణ చేపటనున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. -
కూలింగ్తో ఈ–బైక్స్ ఫైరింగ్కు చెక్
కాజీపేట అర్బన్: విద్యుత్ చార్జింగ్తో నడిచే ద్విచక్ర వాహనాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నా తరచూ జరుగుతున్న బ్యాటరీల పేలుళ్ల ఉదంతాలు కలవరపెడుతున్నాయి. అయితే ప్రత్యేక పరికరాల ఏ ర్పాటుతో ఈ ప్రమాదాలను నివారించొ చ్చని వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఎలక్ట్రికల్ బ్రాంచ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్బాబు పేర్ల తెలిపారు. విద్యుత్ వాహనాలు, చార్జింగ్ స్టేషన్లపై రెండేళ్లుగా చేపడుతున్న తమ పరిశోధనల వివరాలను ఆయన గురువారం ‘సాక్షి’తో పంచుకున్నారు. కూలింగ్తో ఫైరింగ్కు చెక్.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈ–బైక్స్లోని బ్యాటరీలను చల్లబరిచేందుకు ఎలాంటి కూలింగ్ డిజైన్ లేదని సురేష్బాబు తెలిపారు. దీనివల్ల విద్యుత్ చార్జింగ్ సమయంలో లేదా వాహనాన్ని నడిపేటప్పుడు బ్యాటరీలో ఏర్పడిన వేడి బయటకు వెళ్లే అవకాశం లేక వాటి నుంచి మంటలు చెలరేగుతున్నాయని ఆయన వివరించారు. అలాగే సాధారణంగా ఈ–బైక్స్లో లిథియం అయాన్ బ్యాటరీలను వాడుతున్నారని.. వాటిని చార్జింగ్ పెట్టాక వాడకపోయినా విద్యుత్శక్తి అందులోనే ఉండిపోతుందని వివరించారు. దీనికితోడు ఈ–బైక్స్లోని బ్యాటరీలు ఎండకు, వానకు దెబ్బ తినకుండా ఉండేందుకు వీలుగా తయారీ కంపెనీలు వాటిని పూర్తిగా ఫైబర్ మెటీరియల్తో కప్పేసేలా డిజైన్ చేయడం కూడా ప్రమాద తీవ్రతను పెంచుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ–బైక్స్ను చల్లబరిచేలా ప్రత్యేక పరికరాలను డిజైన్ చేయగలిగితే అగ్నిప్రమాదాలను నివారించొచ్చని అన్నారు. కాగా, వరంగల్లో ఈ–బైక్స్కు ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై రెండేళ్లుగా పరిశోధనలు చేపట్టామని... ఇందుకు 8 ప్రాంతాలు (ఫాతిమానగర్, అదాలత్ సెంటర్, కేయూసీ, కుమార్పల్లి, హన్మకొండ చౌరస్తా, ఎంజీ రోడ్డు, భట్టుపల్లి, వరంగల్ స్టేషన్ రోడ్డు) అనువుగా ఉన్నట్లు గుర్తించామని సురేష్బాబు వివరించారు. -
సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్న రానా
స్టార్ హీరో దగ్గుబాటి రానా, ఆయన భార్య మిహీక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ దర్శనం ద్వారా వారు శ్రీవారి దర్శించుకున్నారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీరితో పాటు రానా తండ్రి, నిర్మాత సురేశ్ బాబు, ఆయన సోదరుడు అభిరాంలు కూడా ఉన్నారు. -
హ్యాకర్ల కంట పడకుండా సమాచార ప్రసారం!
కాజీపేట అర్బన్: ప్రతి రంగంలోనూ సమాచార ప్రసారం, దాని భద్రత ఎంతో కీలకం. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీలతో ఈ సమాచారం హ్యాకర్ల చేతిలో పడుతోంది. హ్యాకర్లు ఆ సమాచారంతో తప్పుడు పనులకు పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆన్లైన్లో సురక్షితంగా సమాచారాన్ని ప్రసారం చేసేందుకు, తప్పుడు సమాచారాన్ని తొలగించి రక్షణ కల్పించేందుకు వీలయ్యే సరికొత్త అల్గారిథమ్ను వరంగల్ నిట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ సురేశ్బాబు పేర్ల అభివృద్ధి చేశారు. ‘మోడల్ టు ఎన్హాన్స్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్ ద ఫాల్ట్ టాలరెన్స్’అంశంపై పరిశోధన చేసి రూపొందించిన ఈ అల్గారిథమ్కు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులు కూడా పొందినట్టు ఆయన వెల్లడించారు. గతంలో దేశంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ నెట్వర్క్లలో హ్యాకర్లు చొరబడి విద్యుత్ సరఫరాను స్తంభింప జేసిన ఘటనల నేపథ్యంలో ప్రత్యేక అల్గారిథమ్ రూపొందించినట్టు తెలిపారు. అన్ని రంగాల్లో వినియోగించవచ్చు ‘‘పవర్గ్రిడ్, టెలీ కమ్యూనికేషన్స్తోపాటు అన్ని రంగాల్లో సమాచారాన్ని పూర్తి రక్షణతో ప్రసారం చేసేందుకు నేను రూపొందించిన అల్గారిథమ్ను వినియోగించవచ్చు. ఇది సమాచార ప్రసారంలో హ్యాకర్లను గుర్తించి ఆ సమాచారం అందుకోకుండా ఆపుతుంది. సరైన వ్యక్తులను గుర్తించి సమాచారాన్ని ప్రసారం చేసేందుకు తోడ్పడుతుంది..’’అని సురేశ్బాబు తెలిపారు. -
షాకింగ్: నిర్మాత సురేష్ బాబు ఆ థియేటర్ను అమ్మేశారా?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఆయన డిస్ట్రిబ్యూటర్గా సేవలు అందిస్తున్నారు. అయితే తాజాగా సురేష్ బాబు తీసుకున్న ఓ నిర్ణయం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. వైజాగ్లోని జ్యోతి అనే ప్రముఖ థియేటర్ను ఆయన అమ్మేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఒకప్పుడు కొత్త సినిమాలు రిలీజైతే థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొనేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సూపర్ సూపర్ హిట్ అనే టాక్ వస్తే తప్పా జనాలు థియేటర్లకు రాని పరిస్థితి. ఓటీటీ వినియోగం పెరగిపోవడంతో ప్రేక్షకులు ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇప్పటికే పలు థియేరట్లు మూతపడ్డాయి. తాజాగా సురేష్ బాబు సైతం ఓ థియేటర్ను అమ్మేసినట్లు సమాచారం. వైజాగ్లో ఐకానిక్ థియేటర్గా పేరున్న అలాంటి థియేటర్ను సురేష్ బాబు అమ్మేసినట్లు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. -
కులాల మధ్య చిచ్చుకే.. పవన్ పర్యటన
కడప కార్పొరేషన్: తన స్వప్రయోజనాల కోసం వైఎస్సార్ జిల్లాలో కులాల మధ్య చిచ్చు రేపేందుకే పవన్కళ్యాణ్ పర్యటించారని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా విమర్శించారు. తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ కె. సురేష్బాబుతో కలిసి శనివారం అంజద్ బాషా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు కులమతాలకు అతీతంగా వైఎస్ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్నారన్న విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రైతుభరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్నామని, రైతులు విత్తు వేసినప్పటి నుంచి గిట్టుబాటు ధర కల్పించే వరకూ ప్రభుత్వం వారికి అండగా ఉంటోందన్నారు. పద్యం పుట్టిన చోట మద్యం ఏరులై పారుతోందని చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అంజద్ బాషా ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 45వేల బెల్టుషాపులను రద్దుచేసిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ వారసత్వ రాజకీయాలు చేయడంలేదని, కాంగ్రెస్ ఇచ్చిన కేంద్రమంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేశారన్నారు. ఇక పవన్ ఎవరి పేరు వాడుకుని రాజకీయాలు చేస్తున్నాడో గుర్తుచేసుకోవాలని చెప్పారు. 14 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ కేవలం ఒక్క ఎమ్మెల్యేనే గెలిపించుకున్నావని.. అందుకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. అప్పుడెందుకు ప్రశ్నించలేదు.. ప్రశ్నించడానికే వచ్చానని చెప్పుకుంటున్న పవన్ 2014కు ముందు ఎంతోమంది రైతులు అప్పులపాలై చనిపోతే ఎందుకు ప్రశ్నించలేదని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. కులాల ప్రస్తావన తేవడం బాబు, పవన్ ఆడుతున్న నాటకంలో భాగమేనన్నారు. కులాల మధ్య చిచ్చురేపేందుకు ప్రయత్నిస్తే ఉపేక్షించబోమని అంజద్ బాషా హెచ్చరించారు. తన వర్గం ఓట్లన్నీ గంపగుత్తగా చంద్రబాబుకు బదిలీచేసి ఆయన్ను సీఎం చేయడమే పవన్ ఎజెండా అని ఆరోపించారు. పవన్కళ్యాణ్ రాయలసీమకు ఏం చేశారో, ఈ ప్రాంత అభివృద్ధిపై ఆయన ప్రణాళిక, వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒంటరిగా పోటీచేసే దమ్ముందా పవన్.. మేయర్ సురేష్బాబు మాట్లాడుతూ తన సామాజిక వర్గం వారున్నారనే పవన్ సిద్ధవటంలో సభ పెట్టారన్నారు. టక్కోలు పంచాయతీ, డేగల వాండ్ల పల్లెలో శిరిగిరెడ్డి సాంబశివారెడ్డి అనే వ్యక్తి అప్పులతో చనిపోయాడని, వారి కుటుంబానికి ప్రభుత్వం రూ.7లక్షల పరిహారం ఇచ్చిందని గుర్తుచేశారు. అయినా, ప్రభుత్వంపై పవన్ విమర్శలు చేయడం అవివేకమన్నారు. కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు మెచ్చుకుని, అక్కడ అమలుచేస్తుంటే ఇక్కడి ప్రతిపక్షాలకు కడుపుమంటగా ఉందన్నారు. ఇక జగన్ వారసత్వంగా సీఎం కాలేదని, సొంతంగా పార్టీ పెట్టి, సుదీర్ఘ పాదయాత్ర చేసి అధికారంలోకొచ్చారన్నారు. ఒంటరిగా పోటీచేసే దమ్ము, ధైర్యం పవన్కు ఉందా అని సురేష్బాబు సవాల్ విసిరారు. -
'విరాట పర్వం'పై సరళ అన్నయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
Tumu Mohan Rao Comments On Virata Parvam In Success Meet: రానా దగ్గుబాటి, టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం విరాట పర్వం. 1990లో సరళ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్తో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో చిత్ర బృందంతో పాటు.. సరళ అన్నయ్య తూము మోహన్ రావు కూడా పాల్గొన్నారు. ''సురేష్ ప్రొడక్షన్ లో తొలిసారి యదార్థ సంఘటనల ద్వారా తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. దర్శకుడు వేణు కథని అద్భుతంగా చెప్పారు. సాయి పల్లవి గొప్పగా నటిచింది. విరాట పర్వం విజయం ఆనందాన్ని ఇచ్చింది. మేము కూడా ఒక మంచి బయోపిక్ చేశామనే తృప్తిని ఇచ్చింది. సరళ జీవితాన్ని సినిమాగా తీసుకునే అవకాశం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. ఇది స్వచ్ఛమైన ప్రేమకథ. సాయి పల్లవి, రానా, మిగతా నటీనటులు అందరూ గొప్పగా చేశారు. విరాటపర్వం గురించి అందరూ పాజిటివ్ గా చెబుతున్నారు. రానాకి ఈ సినిమా ఎందుకు చేస్తున్నావ్ ? అని అడిగితే 'ఇలాంటి కథ నేను చేయకపోతే ఎవరు చేస్తారని' చెప్పారు. కళాత్మక చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ ఎక్కువ మార్కులు వేస్తూనే ఉంటారు. విరాటపర్వం టీం అంతటికి కంగ్రాట్స్'' అని నిర్మాత సురేష్ బాబు తెలిపారు. సాయి పల్లవి మాట్లాడుతూ.. ''మోహన్ రావుకి ధన్యవాదాలు. వారి ఇంటికి వెళ్లి కలసినపుడు నన్ను ఆశీర్వదించి చీర బొట్టు పెట్టి దీవించారు. సరళ గారి కుటుంబాన్ని చూసిన తర్వాత గుండె బరువెక్కింది. కన్నీళ్లు వచ్చాయి. గొప్ప మనసున్న వాళ్లు మళ్లీ పుడతారు. వాళ్లు ఏం అనుకున్నారో ఇంకో మార్గంలో సాధించుకుంటారని చెప్పా. ఈ రోజు మోహన్ రావు ఇక్కడి వచ్చి సినిమా విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం ఆనందంగా ఉంది. సురేష్ బాబు ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. వెన్నెల పాత్ర పోషించినందుకు చాలా గర్వంగా ఫీలౌతున్నా. ప్రేక్షకులు సినిమాని మళ్లీ మళ్లీ చూస్తున్నామని, చూసిన ప్రతీ సారి ఇంకా గొప్పగా అనిపిస్తుందని చెప్పడం ఆనందంగా ఉంది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు.'' అన్నారు. చిత్రానికి అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రేక్షకుల నుంచి యునానిమస్ గా బిగ్ హిట్ టాక్ వచ్చింది. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి కారణమైన నిర్మాతలు రానా, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్, ఒక గాడ్ ఫాదర్ గా మా అందరినీ వెనుకుండి నడిపించిన సురేష్ బాబుకు కృతజ్ఞతలు. సాయి పల్లవి లేకపోతే ఈ కథ ఉండేది కాదు. ఆమెకు కృతజ్ఞతలు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అద్భుతమైన సంగీతం అందించారు. ఎమోషనల్ గా మరో స్థాయికి తీసుకెళ్లారు. 1990 వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్రకు థాంక్స్. అద్భుతమైన విజువల్స్ ఇచ్చిన డానీ, దివాకర్ మణికి కృతజ్ఞతలు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. సరళ అనే అమ్మాయి జీవితంలో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. సరళ గారి అన్నయ్య తూము మోహన్ రావు గారు ఈ ప్రెస్ మీట్ రావడం కూడా ఆనందంగా ఉంది. విరాట పర్వం చిత్రాన్ని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇలాంటి మీనింగ్ ఫుల్ సినిమాలు మౌత్ టాక్ ద్వారానే పబ్లిక్ లోకి వెళతాయి. ఇలాంటి మీనింగ్ ఫుల్ సినిమాని అందరూ ఆదరించాలని ప్రేక్షకులని, మీడియాని కోరుకుంటున్నాను. ఇలాంటి అర్థవంతమైన సినిమాలని నిలబెడితే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి'' అని డైరెక్టర్ వేణు ఊడుగుల పేర్కొన్నారు. తూము మోహన్ రావు మాట్లాడుతూ.. ''30ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. సురేష్ ప్రొడక్షన్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఆ సంఘటనని ఇంత గొప్ప చిత్రంగా నిర్మిస్తుందని ఊహించలేదు. వేణు ఊడుగుల కొన్ని నెలలు క్రితం నన్ను కలిశారు. ఈ సినిమా గురించి చెప్పారు. ఎలా చూపిస్తారో అనే భయం ఉండింది. కానీ వేణు గారు చెప్పిన తర్వాత కన్విన్సింగ్ గా అనిపించింది. రానా, సాయి పల్లవి పేరు చెప్పిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ప్రివ్యూకి రమ్మని చాలా సార్లు అడిగారు. అయితే ఈ సినిమాని ప్రేక్షకుడిగానే అందరితో కలసి చూడాలనుందని చెప్పా. సినిమా చూసిన తర్వాత మేము ఏం అనుకుంటున్నామో అదే తీశారు. కథ విషయానికి వస్తే.. మా ఇంట్లో కమ్యునిస్ట్ వాతావరణం వుంది. మా చెల్లి విప్లవాన్ని ప్రేమించింది. తను స్టూడెంట్ ఆర్గనై జేషన్ లోకి వెళ్లడం మేము వారించడం జరిగేది. కానీ తను నక్సల్ లోకి వెళ్లిపోతుందని మేము అనుకోలేదు. దాన్ని ప్రేమించి, ఇష్టంతో వెళ్లింది. సినిమాలో రవన్న రచనలకు ప్రభావతమై వెళ్లినట్లు చూపించారు. రెండూ ఒక్కటే. ఆమె విప్లవాన్ని ప్రేమించింది. విప్లవం వల్లే చనిపోయింది. ఇందులో ఎవరినీ తప్పుపట్టడం లేదు. మా కుటుంబం అంతా కలసి సినిమా చూశాం. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు అని నా భార్య అడిగింది. ఎప్పుడూ వినని మ్యూజిక్ విరాటపర్వంలో వినిపించిదని చెప్పింది. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలికి కంగ్రాట్స్. మాకు తెలిసిన కథలో శంకరన్న పాత్ర నెగిటివ్. తన వల్ల చనిపోయింది కాబట్టి కోపం ఉండేది. కానీ రానా, సాయి పల్లవిని దర్శకుడు చూపించిన విధానం అద్భుతంగా ఉంది. సురేష్ ప్రొడక్షన్ లాంటి బ్యానర్లో ఇలాంటి కథని తీసుకొని ఒక ప్రయోగం చేయడమనేది చాలా గొప్ప విషయం. వారికి అభినందనలు. రానా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ప్రయోగాలు ఇక చేయనని చెప్పారు. కానీ రానా గారే ఇలాంటి ప్రయోగాలు చేయగలరు. మంచి కథ దొరికితే ఆయన ప్రయోగాలు చేయాలని కోరుకుంటున్నాను. సురేష్ ప్రొడక్షన్ లో ఇలాంటి డిఫరెంట్ మూవీ మరొకటి రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. ''నాలో ప్రతిభని గుర్తించి సీనియారిటీ లెక్కలు వేసుకోకుండా ఈ చిత్రానికి అవకాశం కల్పించిన రానాకు కృతజ్ఞతలు. సురేష్ బాబు మా అందరికీ ఒక పెద్ద దిక్కులా ఉన్నారు. నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్, దర్శకుడు వేణు ఊడుగులకు థాంక్స్. ఈ సినిమాని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలి'' అని కొరుకున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఒక గొప్ప సినిమా చేసాం అనే భావన కలిగింది. ఈ సినిమాకి పని చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు వేణు, నిర్మాతలు సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్కు కృతజ్ఞతలు. సాయి పల్లవి, రానా గారు అద్భుతంగా చేశారు. చిత్రాన్ని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.'' అని ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తెలిపారు. చదవండి: తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి -
ఆ విషయంలో వెన్నెల.. నేనూ ఒకటే!
‘‘ఒక నటిగా విభిన్న పాత్రలు చేయాలనుకుంటాను. ఒకే క్వొశ్చన్ పేపర్కు మళ్లీ మళ్లీ అదే సమాధానాలు రాయడంలో మజా ఉండదు. ప్రతి సినిమాకు కాస్త ప్రెజర్, పెయిన్ ఉండటమే బెటర్ అని నా ఫీలింగ్. లేకపోతే బోర్ కొడుతుంది’’ అన్నారు సాయిపల్లవి. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా రూపొందిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల17న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సాయిపల్లవి పంచుకున్న విశేషాలు. నేను తమిళనాడులో పుట్టాను. తెలంగాణాలోని పరిస్థితులపై నాకంత అవగాహన లేదు. అందుకే ‘విరాటపర్వం’ కొత్తగా అనిపించింది. అప్పటి నక్సలిజం పరిస్థితుల్లో ఏది తప్పో ఒప్పో కూడా నాకు తెలీదు. మా తాతగారు మాజీ పోలీసాఫీసర్. నక్సలిజం గురించి ఆయన నాకు ఏదైనా చెప్పడానికి ఆయనకు ‘విరాటపర్వం’ గురించి తెలియదు. ఇక వెన్నెల (‘విరాటపర్వం’లో సాయిపల్లవి పాత్ర)ను ఓ పాత్రగానే చేశాను. ఈ పాత్ర నాకో లెర్నింగ్ ప్రాసెస్. వెన్నెల ఒక సాధారణ అమ్మాయి. అమాయకత్వంతో కూడిన వ్యక్తిత్వం తనది. అలాగే తను నమ్మేదాన్ని సాధించే తెగువ కూడా ఉంది. వెన్నెల, సాయిపల్లవి (తనని తాను ఉద్దేశించి) ప్రేమను చూసే విధానం ఒకేలా ఉంటుంది. అయితే తన ప్రేమ కోసం వెన్నెల ఎంతైనా ఎఫర్ట్స్ పెడితే.. పల్లవి మాత్రం అంత ప్రయత్నించదేమో! సరళగారి (వెన్నెలకు స్ఫూర్తి) కుటుంబాన్ని కలిశాను. ఎమోషనల్గా అనిపించింది. ప్రాజెక్ట్ స్కేల్ మారింది నిర్మాతలు సుధాకర్, శ్రీకాంత్గార్లతో పాటు వేణు ఊడుగుల ముందుగా ‘విరాటపర్వం’ గురించి నాతో మాట్లాడారు. ఆ తర్వాత ఈ సినిమా స్క్రిప్ట్ సురేష్బాబుగారి దగ్గరికి వెళ్లింది. అలా రానాగారు ఈ ప్రాజెక్ట్లోకి వచ్చారు. రానాగారు స్టార్డమ్ ఉన్న హీరో. రవన్న పాత్రకు రానాగారి వాయిస్, హైట్ బాగా నప్పాయి. ఒక స్క్రిప్ట్ను ఒప్పుకున్నప్పుడు పేపర్ మీద ఉన్నదానికంటే ఎక్కువే చేయొచ్చని రానాగారి నుంచి నేర్చుకున్నాను. చెప్పా లంటే రానాగారు వచ్చాక ‘విరాటపర్వం’ ప్రాజెక్ట్ స్కేలే మారిపోయింది. దర్శకుడు వేణుగారు అద్భుతమైన రచయిత. తనకు తెలిసినదాని గురించి తనకంటే ఎవరూ బాగా చెప్పలేరని నమ్మే వ్యక్తి ఆయన. అలాగే అంతే స్థాయిలో రీసెర్చ్ కూడా చేస్తారు. రాసి పెట్టి ఉంటే వస్తుంది సినిమా సినిమాకు మధ్య ఉండే గ్యాప్ గురించి నేను ఆలోచించను. నాకు ఆర్ట్ (కళ)పై పూర్తి నమ్మకం ఉంది. ఏదైనా కథ మనకు రాసి పెట్టి ఉంటే అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుందని నా నమ్మకం. ఇక నా కోసమే కొందరు దర్శకులు కొన్ని పాత్రలను సృష్టిస్తున్నారంటే అది నాకు సంతోషాన్నిచ్చే అంశమే. కథలను ఎంపిక చేసుకోవడంలో నా ఇమేజ్ను నేను ఇబ్బందిగా ఫీల్ కావడంలేదు. ఒత్తిడి కూడా లేదు. మనం ఉన్నా లేకున్నా సినిమాలు శాశ్వతంగా ఉంటాయి. నేను వెళ్లిపోయిన తర్వాత కూడా నేను యాక్ట్ చేసిన ఓ సినిమాను చూసి ప్రేక్షకులు మెచ్చుకోవాలనే ఆలోచనతోనే సినిమా అంగీకరిస్తాను. గత జన్మలో ఇక్కడే పుట్టానేమో! ‘ఫిదా’, ‘లవ్స్టోరీ’, ఇప్పుడు ‘విరాటపర్వం’.. ఇలా వరుసగా తెలంగాణ బ్యాక్డ్రాప్ సినిమాలు చేశాను. మా ఇంట్లో కూడా నేను మారిపోయానని అంటున్నారు. బహుశా.. నేను గత జన్మలో ఇక్కడే పుట్టానేమో!’ అని చెప్పిన సాయిపల్లవితో ‘మీ జీవిత భాగస్వామి ఎలా ఉండాలనుకుంటున్నారు?’ అనడిగితే... ఇంకా పుట్టలేదని అనుకుంటున్నాను’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. -
అభిరాం తీరుకు విసిగిపోయిన తేజ?, ఏం చేశాడంటే!
Abhiram Troubles Director Teja Over Ahimsa Shooting?: దర్శకుడు తేజ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ లాంటి యంగ్ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన గొప్ప డైరెక్టర్ ఆయన. ఒకప్పుడు తేజ చిత్రాలకు యమ క్రేజ్ ఉండేది. ఎన్నో ఫ్లాప్ల అనంతరం నేనే రాజు నేనే మంత్రి మూవీతో హిట్ అందుకున్నాడు తేజ. అదే జోష్లో తేజ ఇప్పుడు దగ్గుబాటి మరో వారసుడు, రానా తమ్ముడు అభిరాంను హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి అహింస అనే టైటిల్ను ఖరారు చేస్తూ ఇటివల అభిరాం ఫస్ట్లుక్ను కూడా విడుదల చేశారు మేకర్స్. చదవండి: అసభ్యకర సంజ్ఞతో స్టార్ హీరోయిన్ ఫైర్, పక్కనే షారుఖ్.. ఫోటో వైరల్ దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ నెలాఖరు వరకు శరవేగంగా షూటింగ్ను పూర్తి చేసి ప్రమోషన్ కార్యాక్రమాలు, పోస్ట్ ప్రోడక్షన్ పనులను స్టార్ట్ చేయాలని తేజ ప్లాన్ చేస్తున్నాడట. అయితే దీనికి అభిరాం సహకరించకుండ ఇబ్బంది పెడుతున్నట్లు ఫిలిం సర్కీల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తన డెబ్యూ మూవీ విషయంలో అభిరాం చాలా నిర్లక్ష్య ధోరణి చూపిస్తున్నాడని, అతడి యాటిట్యూడ్ తీరుకు తేజ విసిగిపోయినట్లు టీ-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల షూటింగ్కు రావాల్సిందిగా అభిరాంకు తేజ ఫోన్ చేయగా.. కాలికి గాయమైందని, రెస్ట్ కావాలని అడిగాడట. చదవండి: RRR: తారక్, చరణ్, రాజమౌళితో యాంకర్ సుమ రచ్చ రచ్చ అయితే తీరా చూస్తే అభిరాం అబద్ధం చెప్పి స్నేహితులతో పార్టీకి వెళ్లినట్లు తేజ దృష్టికి వెళ్లింది. ఇలా ఒక్కసారి కాదు చాలాసార్లు చిన్నచిన్న విషయాలను సాకుగా చూపించి అభిరాం షూటింగ్కు డుమ్మా కొట్టాడని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇక అతడి తీరుపై అసహానికి లోనైన తేజ అభిరాం గురించి తండ్రి సురేశ్ బాబుకు చెప్పినట్లు సమాచారం. ‘ఫస్ట్మూవీకే యాటిట్యూడ్ చూపిస్తే ఫ్యూచర్ ఉండదంటూ’ నెటిజన్లు అభిరాంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెత్తుందో తెలియదు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉండగా డైరెక్టర్ తేజను విసిగిస్తున్న అభిరాం అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై స్పష్టత రావాలంటే చిత్ర బృందం స్పందించే వరకు వేచి చూడాలి. -
కొరియోగ్రఫీ మాత్రం వదలొద్దు – నాగచైతన్య
‘‘హే సినామిక’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా వేడుకకి రావడం గౌరవంగా భావిస్తున్నా. బృందా మాస్టర్ కొరియోగ్రఫీకి నేను పెద్ద ఫ్యాన్. మీరు సినిమాలను డైరెక్ట్ చేయండి.. కానీ కొరియోగ్రఫీ మాత్రం వదలొద్దు.. ప్లీజ్’’ అని హీరో నాగచైతన్య అన్నారు. దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితీరావ్ హైదరీ హీరో హీరోయిన్లుగా బృందా మాస్టర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హే సినామిక’. జియో, గ్లోబల్ వన్, వయాకామ్ 18 స్టూడియోస్పై నిర్మించిన ఈ సినిమా రేపు(గురువారం) రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘బృందా మాస్టర్గారు సినిమాని డైరెక్ట్ చేస్తున్నారని తెలిసినప్పుడు చాలా ఆనందపడ్డాను. ‘మనం’ సినిమాలోని ‘కనులను తాకే..’ అనే మాంటేజ్ పాటకు అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారామె. చెన్నైలో ఉన్నప్పటి నుంచే నాకు, దుల్కర్కి పరిచయం ఉంది. తను ప్రతి భాషలోనూ సినిమాలు చేస్తుండటం హ్యాపీ’’ అన్నారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ–‘‘హే సినామిక’ నాకు చాలా ప్రత్యేకం. పాటల్లో రొమాన్స్, ఎమోషన్స్ ఎలా చేయాలో నాతో బాగా చేయించేవారు బృందామాస్టర్. ఆమె నాకు తల్లిలాంటిది. ‘హే సినామిక’ చూసి నవ్వుతారు, ఏడుస్తారు, డాన్స్ చేస్తారు’’ అన్నారు. ‘‘తెలుగు చిత్రపరిశ్రమలో నేను డాన్స్ మాస్టర్గా ఉన్నానంటే కారణం నిర్మాతలు రామానాయుడుగారు, సురేశ్బాబుగారే. ‘హే సినామికా’ దర్శకురాలిగా నా తొలి చిత్రమైనా దుల్కర్ ఓకే చెప్పడం హ్యాపీ’’ అన్నారు బృందామాస్టర్. ‘‘హే సినామిక’ చూసి మీరందరూ తప్పకుండా నవ్వుతారు’’ అన్నారు అదితీరావ్ హైదరీ. నిర్మాత డి.సురేశ్ బాబు మాట్లాడుతూ–‘‘డాన్స్ మాస్టర్గా బృందాని చాలా రోజులుగా చూస్తున్నా. ఆమె సినిమాని డైరెక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ‘హే సినామికా’ బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘నా డాన్స్లో గురు బృందామాస్టర్. నాతో డాన్స్ చేయించేందుకు ఆమె ఎంత కష్టపడిందంటే.. ఆమె కెరీర్లో చాలా కష్టమైన హీరో నేనే అయ్యుంటాను.. అందుకే నేను హీరోగా మానేశాను కూడా(నవ్వుతూ)’’ అన్నారు నటుడు జగపతిబాబు. ‘‘బృంద కొరియోగ్రఫీ చేస్తున్నారంటే మణిరత్నంలాంటి డైరెక్టర్ కూడా సెట్స్లో ఉండరు.. ఆమె ప్రతిభపై అంత నమ్మకం. ‘హే సినామిక’ ద్వారా విజువల్ ట్రీట్ ఇస్తున్నారామె’’ అన్నారు డైరెక్టర్ నందినీ రెడ్డి. -
ఆ నమ్మకంతోనే ఈ సినిమా విడుదల చేస్తున్నాం : సురేశ్బాబు
Suresh Babu About Rajinikanths Peddanna Movie: ‘‘పెద్దన్న’ సినిమాని మేము ఎందుకు తీసుకున్నామా? అని అందరికీ అనుమానం రావొచ్చు. కరోనా తర్వాత ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లకి వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ పెద్ద సినిమాను తీసుకొస్తే ఇంకా బాగుంటుందనే నమ్మకంతో విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత డి. సురేశ్ బాబు అన్నారు. రజనీకాంత్, నయనతార జంటగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘అన్నాత్తే’. చదవండి: పెళ్లి చేసుకోవాలనుంది..అబ్బాయి దొరకడం లేదు: హీరోయిన్ ఈ సినిమాని ఏషియన్ ఇన్ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్పి, సురేశ్ బాబు, ‘దిల్’ రాజు కలిసి ‘పెద్దన్న’ పేరుతో తెలుగులో ఈ నెల 4న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సురేశ్ బాబు విలేకరులతో మాట్లాడుతూ–‘‘యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ఒక్కమాటలో చెప్పాలంటే ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది’’ అన్నారు. నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ మాట్లాడుతూ– ‘‘మాపై నమ్మకంతో ‘పెద్దన్న’ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఇచ్చిన సన్టీవీ వారికి, రజనీకాంత్కు ధన్యవాదాలు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు. చదవండి: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రజనీకాంత్ పునీత్ మరణం: లైవ్లో న్యూస్ చదువుతూ ఏడ్చేసిన యాంకర్ -
కుప్పంలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది:కడప మేయర్ సురేష్ బాబు
-
ఎవరు.. ఎక్కడ.. ఎందుకు?.. థ్రిల్గా ఫీలయ్యా : సురేశ్ బాబు
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’(ఎవరు, ఎక్కడ, ఎందుకు). రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో థియేటర్స్లో గ్రాండ్గా విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాత సురేశ్ బాబు మాట్లాడుతూ.. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు చిత్రాన్ని క్రిస్పీ నరేషన్తో మంచి పెర్ఫామెన్స్లతో చాలా థ్రిల్లింగ్గా తెరకెక్కించారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్ని, ఈ కరోనా వల్ల వర్చువల్ వరల్డ్ లో వచ్చిన మార్పులని చక్కగా చూపించారు. అంతర్లీనంగా ఒక మంచి ప్రేమకథ కూడా ఉంది. ఆడియోకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు వంటి ఒక మంచి చిత్రాన్ని మీకు థియేటర్లలో అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది`అన్నారు. (చదవండి: మేయర్ అభ్యర్థిగా సోనూసూద్.. క్లారిటీ ఇచ్చిన ‘రియల్ హీరో’!) చిత్ర నిర్మాత డా. రవి పి. రాజు దాట్ల మాట్లాడుతూ.. ‘మా బేనర్లో రూపొందిన ఫస్ట్ మూవీ `డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు` చిత్రానికి సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా ఫస్ట్ సక్సెస్ గా భావిస్తున్నాం. ఈ సందర్భంగా సురేశ్ బాబుగారికి మా బ్యానర్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైమ్ తెలుగులో వస్తోన్న కంప్యూటర్ స్క్రీన్ మూవీ ఇది. గుహన్గారి మేకింగ్ చాలా కొత్తగా ఉంటుంది. అలాగే అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ ఇద్దరు సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. వారిద్దరి కెమిస్ట్రి తప్పకుండా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయనున్నాం. కమర్షియల్గా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది`` అన్నారు. చిత్ర దర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ - ``సినిమా చాలా బాగా వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ మూవీ విడుదలవడం నిజంగా హ్యీపీగా ఉంది. అదిత్, శివాణి ఇద్దరు చాలా బాగా నటించారు. టెక్నీషియన్స్ అందరూ మంచి సపొర్ట్ అందించారు. తప్పకుండా ఒక డిఫరెంట్ మూవీ అవుతుంది` అన్నారు. -
చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ.. నాగ్, అల్లు అరవింద్ హాజరు
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ ప్రముఖులు ఆదివారం భేటీ అయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చిందే సినీ పెద్దలు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అపాయింట్మెంట్ కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న చిరంజీవి నివాసంలో సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సినీ పెద్దలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో హీరో నాగార్జున అక్కినేని, అల్లు అరవింద్, దగ్గుబాటి సూరేశ్ బాబు, దిల్ రాజు, మైత్రి మూవీస్ రవి ప్రసాద్ తదితరులు హజరయ్యారు. సినీ కార్మికులు, థియేటర్ కార్మికుల సమస్యలు, విద్యుత్ టారిఫ్, బీ, సీ సెంటర్లలో టికెట్ రేట్లు వంటి సమస్యలపై వారు చర్చించారు. -
వివేకా హత్య కేసు దర్యాప్తును టీడీపీ తప్పుదోవపట్టిస్తోంది
-
'నారప్ప'తో మ్యూజిక్ ఇండస్ట్రీలోకి సురేష్ ప్రొడక్షన్స్
Suresh Productions Music: "నారప్ప" మూవీతో తొలిసారి మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సురేష్ ప్రొడక్షన్స్. పారిస్కు చెందిన 'బిలీవ్' కంపెనీతో ఎస్పీ మ్యూజిక్ జత కట్టింది. వీరి భాగస్వామ్యంలో నారప్ప సినిమాలోని సంగీతాన్ని వరల్డ్ మ్యూజిక్ డయాస్పై బిలీవ్ ప్రమోట్ చేయనుంది. ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ మ్యూజిక్ కంపెనీ అయిన బిలీవ్కు దేశంలో పలు చోట్ల కార్యాలయాలు ఉన్నాయి. గతంలో 'బిలీవ్ ఇండియా' రానా దగ్గుబాటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'సౌత్ బే'తోనూ జట్టు కట్టింది. ఇప్పుడు తాజాగా బిలీవ్, ఎస్పీ మ్యూజిక్ భాగస్వామ్యంతో టాలీవుడ్ సంగీత ప్రపంచానికి కొత్త శకం మొదలైందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఎస్పీ మ్యూజిక్ ఎండీ, నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. 'బిలీవ్తో భాగస్వామి అవడం ఎస్పీ మ్యూజిక్కు ప్రారంభంలోనే దక్కిన గొప్ప అవకాశం. బిలీవ్కు ఉన్న ప్రపంచస్థాయి నెట్ వర్క్తో ఎస్పీ మ్యూజిక్ లేబుల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతప్రియులకు చేరువవుతుందని ఆశిస్తున్నాం. నారప్పతో మొదలైన మా పార్టనర్ షిప్ మరెన్నో చిత్రాలతో కొనసాగాలని కోరుకుంటున్నా' అన్నారు. బిలీవ్ ఇండియా ఎండీ వివేక్ రైనా మాట్లాడుతూ సౌతిండియాలో దిగ్గజ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ సురేష్ ప్రొడక్షన్గా భాగస్వామి అవడం ఎగ్జైటింగ్గా ఉందన్నాడు. -
చెట్టు కిందే ఆఫీస్ పెట్టా, నారప్ప యూనిట్ లో నలుగురు చనిపోయారు
-
నారప్ప : ఆ టైమ్లో నలుగురు చనిపోయారు
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నారప్ప’. తమిళ సినిమా అసురన్కి రీమేక్ ఇది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించారు. ప్రియమణి హీరోయిన్గా నటిస్తోంది. జూలై 20న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సురేశ్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘నారప్ప’షూటింగ్ అనుభవాలను పంచుకున్నాడు. ‘కరోనా కారణంగా భయం, భయంగానే ‘నారప్ప’షూటింగ్ చేశాం. మొదట తమిళనాడు షూటింగ్ చేస్తున్న సమయంలో 6 కిలో మీటర్ల దూరంలో రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్లు న్యూస్ రాగానే భయంతో అక్కడి నుంచి షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని పారిపోయాం. ఫస్ట్ వేవ్లో రెండు మూడు కేసులు వస్తేనే చాలా భయపడిపోయి షూటింగ్ని రద్దు చేసుకున్నాం. కానీ సెకండ్ వేవ్లో వేల సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు వచ్చినా పెద్దగా కంగారు పడలేదు. కానీ చాలా జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ని పూర్తి చేశాం.‘నారప్ప’నాన్ షూటింగ్ టైమ్లో ఈ సినిమాకు సంబంధించిన నలుగురు చనిపోయారు. జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రాణాలు పొగొట్టుకోవాల్సివస్తుంది’అని సురేశ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్ సిన్సియర్గా వర్క్ చేశాడు ‘నారప్ప’ లాంటి కథలను ఎవరూ వెంకటేశ్ కోసం రాయరు. ఈ సినిమాలో వెట్రిమారన్ స్టైల్ నాకు నచ్చింది. మాస్ ఎలిమెంట్స్తో పాటు భారీ ఫ్యామిలీఎమోషన్స్, సామాజిక అంశాలు ఉన్నాయి. సో.. ఈ సినిమా వర్కౌట్ అవుతుందని అనిపించింది. యాక్టర్గా వెంకటేశ్ చాలా బాగా చేశాడు. ఇంట్రవెల్కు ముందు ఇసకలో ఓ యాక్షన్ సీక్వెన్స్తీశాం. అది చాలా కష్టం. వెంకటేశ్ అయితే చాలా సిన్సియర్గా వర్క్ చేశాడు. ఎప్పుడు నారప్ప గెటప్లోనే కనిపించారు. బ్యాలెన్స్ షూట్ కోసం మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు. నారప్ప సినిమా రైట్స్ తీసుకున్న తర్వాత శ్రీకాంత్ అడ్డాల ఓ సారి వచ్చి ఓ కథ చెప్పారు. ఆ తర్వాత నారప్ప సినిమా గురించి మాట్లాడుకున్నాం. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తానన్నారు. చాలా బాగా తెరకెక్కించారు’అని సురేశ్ బాబు అన్నారు. -
వెంకటేశ్ చాలా ఫీలయ్యాడు : సురేశ్ బాబు
‘నారప్ప’ఓటీటీలో విడుదల చేయడం పట్ల వెంకటేశ్ చాలా ఫీలయ్యారని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సివచ్చిందని నిర్మాత సురేశ్ బాబు అన్నారు. విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నారప్ప’.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించారు. ప్రియమణి హీరోయిన్గా నటిస్తోంది. జూలై 20న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ‘నారప్ప’ యూనిట్ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఆదివారం సురేశ్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘మా సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్లో సినిమాలు నా నిర్ణయం మేరకే విడుదలవుతాయి. కానీ నారప్ప మేము మాత్రమే నిర్మించలేదు. నాతోపాటు.. ఎస్.థామస్ కూడా ఈ సినిమాకు నిర్మాత. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాత ఎస్.థామస్ నారప్ప సినిమాను అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకులకు చేరువ చేయాలని భావించారు. కరోనా థార్డ్ వేవ్ దృష్ట్యా ఎవరూ నష్టపోకూడదనే ఈ నిర్ణయానికి వచ్చాం. ఎగ్జిబిటర్లకు నాపై అసంతృప్తి ఉండడంలో న్యాయం ఉంది. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన కుటుంబసభ్యుల్నే థియేటర్కు పంపించడం లేదు. అలాంటిది ప్రేక్షకుల్ని థియేటర్లకు రమ్మని అడగడం న్యాయమా? తన సినిమాని ఎలాగైనా ప్రజలకు చేరువ చేసేందుకు నిర్మాత కష్టపడతాడు. భవిష్యత్తు ఓటీటీదే కావొచ్చు కానీ థియేటర్లు కూడా ఉంటాయి’అని సురేశ్ బాబు అన్నారు. -
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తో ఇంటర్వ్యూ
-
దృశ్యం, విరాట పర్వం కూడా ఓటీటీలోకే! డీల్ ఎంతో తెలుసా!
విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నారప్ప. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన అసురన్ మూవీకి నారప్ప రీమేక్. సూరేష్బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 20 నుంచి నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైం నారప్పకు 40 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో పాటు ‘దృశ్యం 2’ కూడా ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ‘నారప్ప, దృశ్యం-2’లను ఓటీటీకి భారీ మొత్తంలో సురేష్ బాబు ఢీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు కలిపి దాదాపు 76 కోట్లకు అమ్ముడు పోయాయట. ఇక ‘దృశ్యం 2’ అయితే శాటిలైట్, డిజిటల్, డైరెక్ట్-ఓటీటీ కలిపి డిస్నీ+హాట్స్టార్ మొత్తం 36 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. కాగా ఇటీవల ఈ మూవీ షూటింగ్ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘దృశ్యం 2’ రీమేక్గా తెరకెక్కిన ఈ మూవీ కేవలం 30 రోజుల్లోనే షూటింగ్ను పూర్తి చేసుకుంది. అయితే నారప్ప, దృశ్యం 2 తో పాటు రానా ‘విరాట పర్వం’ కూడా నేరుగా ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. -
నీలోఫర్: రికార్డుల్లో అంకెలు దిద్ది.. రూ.1.2 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రి డైట్ మాజీ కాంట్రాక్టర్ కోడూరి సురేష్ బాబును నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. బోగస్ బిల్లులతో రూ.1.2 కోట్లు స్వాహా చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇతడిపై కేసు నమోదైనట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి పేర్కొన్నారు. మియాపూర్నకు చెందిన సురేష్బాబు 2017 ఏప్రిల్ 1న నిలోఫర్ ఆస్పత్రి డైట్ సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇన్పేషేంట్లతో పాటు వైద్యులకు అవసరమైన ఆహారం సరఫరా చేయడం ఈయన బాధ్యత. 2020 జూలైతో ఈయన కాంట్రాక్టు పూర్తి కావడంతో టెండర్లు పిలిచి మరొకరికి ఈ బాధ్యతలు అప్పగించారు. 2017–18 నుంచి 2019–20 మధ్య ఆహార సరఫరాలో సురేష్ బాబు గోల్మాల్కు పాల్పడినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటి ఆధారంగా ఆస్పత్రి వర్గాలు విచారణ కోసం నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేశాయి. వీరి పరిశీలన నేపథ్యంలోనే ఆహార సరఫరా రికార్డుల్లో అనేక అవకతవకలు ఉన్నట్లు బహిర్గతమైంది. కొన్ని చోట్ల అంకెల్ని దిద్దినట్లు గుర్తించారు. దీంతో నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ గత నెలలో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్ బాబు మొత్తం రూ.1,13,28,320 స్వాహా చేసినట్లు అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఏసీపీ కట్టంగూర్ శ్రీనివాస్రెడ్డి దర్యాప్తు చేపట్టారు. దాదాపు నాలుగేళ్ల పాటు రోగులు, వైద్యులకు సాధారణ ఆహారం సరఫరా చేసిన సురేష్ బాబు హై ప్రొటీన్ డైట్ ఇచ్చినట్లు రికార్డులు సృష్టించాడని తేల్చారు. దీంతో పాటు ఉన్న వైద్యులు, రోగుల కంటే ఎక్కువ మందికి ఆహారం అందించినట్లు రికార్డులు ట్యాంపర్ చేసినట్లు తేల్చారు. ఆస్పత్రి వర్గాలు గుర్తించిన మొత్తానికి మించి రూ.1.2 కోట్లు స్వాహా చేసినట్లు ఆధారాలు సేకరించారు. దీంతో సోమవారం సురేష్ బాబును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
సంగీతంలోకి అడుగుపెడుతున్న సురేష్ ప్రొడక్షన్స్
ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సంగీత పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఎస్పీ మ్యూజిక్ అనే కొత్త మ్యాజిక్ లేబుల్ను ప్రారంభించారు. నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. "1964లో మా నాన్న రామానాయుడుగారు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ 50 ఏళ్లకు పైగా భారతదేశపు పెద్ద చిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలిచింది" "అత్యధిక భారతీయ భాషల్లో సినిమాలు తీసిన ఘనత మాదే. సంగీతం సినిమాలకు హృదయం లాంటది. దాన్ని సొంతంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరాన్ని మేము గుర్తించాం. సురేష్ ప్రొడక్షన్స్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్న ఎస్పీ మ్యూజిక్ లేబుల్ మంచి సంగీతాన్ని అందించడానికి వేదికగా ఉపయోగపడంతో పాటు సంగీత శక్తి కేంద్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అన్నారు. చదవండి: వ్యాక్సిన్ పేరుతో సురేష్బాబుకు టోకరా.. నిందితుడు అరెస్ట్ -
వ్యాక్సిన్ పేరుతో సురేష్బాబుకు టోకరా.. నిందితుడు అరెస్ట్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబును మోసం చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వ్యాక్సిన్ టీకాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడిన నాగార్జున రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాక్సిన్ పేరుతో ఇప్పటి వరకు 10 మంది ప్రముఖులను మోసం చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఓ మంత్రి పేరుతో కూడా నాగార్జునరెడ్డి మోసానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కాగా, కరోనా టీకాలు ఇప్పిస్తానని నమ్మబలికిన నాగార్జున రెడ్డి.. సురేష్ బాబు మేనేజర్ నుంచి లక్ష రూపాయలు అకౌంట్లో వేయించుకున్నాడు. అయితే, నగదు డ్రా చేసుకున్న తర్వాత నిందితుడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. ఈ క్రమంలో మోసపోయినట్లు గ్రహించిన సురేష్ బాబు మేనేజర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. చదవండి: నిర్మాత సురేష్ బాబును బురిడీ కొట్టించిన కేటుగాడు -
నిర్మాత సురేష్ బాబును బురిడీ కొట్టించిన కేటుగాడు
-
నిర్మాత సురేష్ బాబును బురిడీ కొట్టించిన కేటుగాడు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ బడా నిర్మాత సురేష్ బాబును ఓ కేటుగాడు బురిడీ కొట్టించాడు. తన వద్ద వ్యాక్సిన్లు ఉన్నాయంటూ లక్ష రూపాయలు దోచుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్బాబు ఆఫీస్కు ఫోన్ చేశాడు. దీంతో అది నిజమని నమ్మిన మేనేజర్ అతడు అడిగిన లక్ష రూపాయల సొమ్మును ట్రాన్స్ఫర్ చేశాడు. కానీ ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా అతడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇదంతా పెద్ద మోసం అని గ్రహించిన మేనేజర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. చదవండి: హీరోగా రానా తమ్ముడు.. ఆ డైరెక్టర్కు గ్రీన్ సిగ్నల్! -
‘నాన్న ఎప్పుడూ విలువలతో కూడిన చిత్రాలే తీశారు’ - డి. సురేష్బాబు
మస్కట్: డా॥ డి. రామానాయుడు 86వ జయంతి సందర్భంగా వంశీ గ్లోబల్ అవార్డ్స్, ఇండియా, సంతోషం ఫిలిమ్ న్యూస్, తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో సంయుక్తంగా అంతర్జాల వేదికగా మస్కట్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులతో పాటు ఐదు ఖండాలలోని ఇతర ప్రముఖులు ఆయనకు ఘననివాళి అర్పించారు. నిర్మాత అనే పదానికి అసలు సిసలైన చిరునామా డా॥ డి. రామానాయుడు అని వక్తలు కొనియాడారు. ఆయన కుమారుడు, సినీ నిర్మాత డి. సురేష్బాబు మాట్లాడుతూ.. ‘నాన్న చాలా సినిమాలు తీశారు. ఆయన ఎప్పుడూ విలువలతో కూడిన చిత్రాలే నిర్మించారు. పరిశ్రమకు ఏదైనా అవసరమైతే నాన్న ఎలాగైతే స్పందించారో అదే స్ఫూర్తితో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటాన’ని అన్నారు. నటుడు, నిర్మాత, మాజీ పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ..‘సినిమా అనేది అద్భుతమైన మాధ్యమం. సినిమా నిర్మాత అవ్వాలంటే అన్ని విభాగాల మీద పూర్తి అవగాహన ఉండాలని చెప్పిన వ్యక్తి రామానాయుడుగారు’ అని కొనియాడారు. డా॥ వంశీ రామరాజు మాట్లాడుతూ..‘ప్రేమించు’ చిత్రం జయప్రదమైన సందర్భంలో దివ్యాంగుల ఆశ్రమాలకు చేయూతనిచ్చిన మానవతామూర్తి రామానాయుడుగారు’ అన్నారు. తెలుగు కళాసమితి ఓమాన్ కన్వీనర్ అనిల్కుమార్ మాట్లాడుతూ.. ‘ఓడిపోతామనే ఆలోచనలో ఉన్నవారు రామానాయుడు జీవితాన్ని తెరచి చూస్తే ఆయనను ఆదర్శంగా తీసుకొని వారి బాటలో పయనిస్తార’ని అన్నారు. కార్యక్రమాన్ని ప్రముఖ అంతర్జాతీయ గాయని శివశంకరి గీతాంజలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్ కొండేటి, మండలి బుద్ధప్రసాద్, దర్శకుడు బి. గోపాల్, మాధవపెద్ది సురేష్, బలభద్రపాత్రుని రమణి, భువనచంద్ర, చంద్రబోస్, కాశీ విశ్వనాథ్, వి.ఎన్. ఆదిత్య, రామకృష్ణ గౌడ్, రవి కొండబోలు, ముప్పలనేని శివ, ఉపేంద్ర చివుకుల, డా॥ ఎల్లాప్రగడ రామకృష్ణారావు, రత్నకుమార్ కవుటూరు, చింతగుంట ఉదయపద్మ, డా॥ బూరుగుపల్లి వ్యాసకృష్ణ, లలితా రామ్, హరివేణుగోపాల్, రాజేష్ తోలేటి, సరోజా కొమరవోలు, శ్రీదేవి జాగర్లమూడి, సుబ్బు వి. పాలపర్తి, చింతలపూడి త్రినాథరావు, లయన్ ఎ. విజయకుమార్, చైతన్య సూరపనేని, దైవజ్ఞ శర్మ, శ్రీవాణి, రేలంగి నరసింహారావు పాల్గొని ప్రసంగించారు. చదవండి: న్యూజెర్సీలో ఎస్పీ బాలుకు స్వర నీరాజనం! -
హీరోగా రానా తమ్ముడు.. ఆ డైరెక్టర్కు గ్రీన్ సిగ్నల్!
దగ్గుబాటి కుటుంబం నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కానున్నారు. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ రీఎంట్రీకి అంతా సిద్ధమైంది. అతి త్వరలోనే ఓ ప్రముఖ దర్శకుడితో అభిరామ్ సినిమా చేయనున్నారు. ఇప్పటికే వంశీ, తరుణ్ భాస్కర్, రవి బాబులతో చర్చలు జరిగినా అవి వర్కవుట్ కాలేదు. ఫైనల్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ఓ స్ర్కిప్ట్ను సురేష్బాబు ఓకే చేసినట్లు సమాచారాం. దీంతో అతి త్వరలోనే అభిరామ్ను గ్రాండ్గా పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు సురేష్బాబు. ఇది వరకే తేజ దర్శకత్వంలో రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి సినిమా విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నమ్మకంతోనే అభిరామ్కు కూడా డెబ్యూ మూవీతోనే హిట్ కొట్టించాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా తేజ డైరెక్ట్ చేసే ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన..త్వరలోనే ఓ మంచి ప్రాజెక్ట్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పారు. దీంతో ఆర్పీ పట్నాయక్ అభిరామ్ మూవీకి సంగీతం అందించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక తేజ- ఆర్పీ పట్నాయక్ కాంబినేషన్లో ఇప్పటికే జయం, నీ స్నేహం,నువ్వు నేను వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి : సిద్ శ్రీరామ్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా? మన శరీరం కేవలం అందుకోసమే కాదు కదా : రేణు దేశాయ్ -
ఓటీటీలో దృశ్యం-2.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత సురేశ్బాబు
అనుకోకుండా చిక్కుకున్న ఓ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కూతురిని ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం-2. ‘దృశ్యం’ సినిమాకి సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ జంటగా నటించారు. మలయాళంలో డైరెక్ట్ చేసిన జీతూ జోసఫే తెలుగు రీమేక్ను కూడా తెరకెక్కిస్తున్నారు. సురేశ్బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా మలయాళంలో కేవలం 45 రోజుల్లో మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 19న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. అక్కడ ఈ మూవీకి మంచి స్పందన రావడంతో, అదే సినిమాను తెలుగులో వెంకటేశ్తో రీమేక్ చేశారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలాంటి తరుణంలో దృశ్యం-2 సబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి చెందిన ఒక ప్రముఖ సంస్థవారు భారీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాతలు అంగీకరించారనీ, త్వరలోనే ఈ సినిమా ఓటీటీ సంస్థలో విడుదల కానుందని పుకార్లు వచ్చాయి. వీటిపై తాజాగా నిర్మాత సురేశ్ బాబు స్పందించారు. ఓటీటీలో విడుదల అనేది కేవలం పుకారు మాత్రమేనని, తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తామే స్వయంగా చెప్పే వరకు ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. చదవండి: ఈ వీకెండ్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే.. హాట్ టాపిక్గా మారిన పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ -
తండ్రి వర్థంతి: హీరో వెంకటేష్ భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: తెలుగు చలన చిత్ర నిర్మాతగా వచ్చి దేశవ్యాప్తంగా ఎన్నో బాషల్లో సినిమాలు నిర్మించి తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచారు ప్రముఖ దివంగత నిర్మాత దగ్గుబాటి రామానాయుడు. నేడు ఆయన 6వ వర్థంతి. 2015 ఫిబ్రవరి 18న ఆయన అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రెండవ కుమారుడు, హీరో విక్టర్ వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా తండ్రికి నివాళులు అర్పించారు. తన ట్విటర్ ఖాతాలో తండ్రి చిత్ర పటాన్ని గురువారం షేర్ చేస్తూ ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘ఇన్నేళ్లు గడిచాయి. కానీ ఈ రోజు మిగిల్చిన చేదు అనుభవాన్ని మాత్రం అంత ఈజీగా మరవకలేకపోతున్నాం. ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చినందుకు ధన్యవాదాలు నాన్న. లవ్ యూ. మిస్ యూ’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే ఆయన పెద్ద కూమారుడు, నిర్మాత సురేష్ బాబు.. తండ్రికి ఘన నివాళులు అర్పించారు. ఫిల్మ్ నగర్లోని రామానాయడు విగ్రహానికి సురేష్ బాబు, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సత్యనారాయణ, సంతోషం పత్రిక అధినేత నిర్మాత సురేష్ కొండేటి పూల మాలలు వేసి నివాళులు ఘటించారు. Even after all these years, this day is never easy. Thank you for all the memories Nana. Love you and miss you 😞♥️ pic.twitter.com/lLPGe9nyMH — Venkatesh Daggubati (@VenkyMama) February 18, 2021 (చదవండి: ఆసక్తి రేపుతున్న నారప్ప టీజర్) (వెంకీ మామ ఇంటి పని అదిరింది) -
విరాటపర్వం మళ్లీ ఆరంభం
రానా విరామ పర్వం పూర్తయింది. త్వరలోనే విరాట పర్వానికి సంబంధించిన పని ప్రారంభిస్తారని టాక్. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ప్రియమణి, నందితా దాస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బాబు, చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. నక్సలైట్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రకథాంశం ఉంటుంది. రానా, సాయిపల్లవి ఉద్యమకారుల పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ మొదటివారం నుంచి మళ్లీ మొదలు కానుందని టాక్. దాదాపు 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన భాగాన్ని తాజా షెడ్యూల్లో పూర్తి చేయడానికి ప్లాన్ చేశారు. -
దోపిడి కేసును చేధించిన విశాఖ క్రైం పోలీసులు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో తీవ్ర సంచలనం రేపిన పీఎం పాలెం దోపిడీ కేసును విశాఖ క్రైం పోలీసులు చేధించారు. ఈ కేసులో నిందితులైన ఆరుగురిని సోమవారం అరెస్ట్ చేసి వారి నుంచి 12.50 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా విశాఖ క్రైం డీసీసీ సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సుదర్శన్ రెడ్డి పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టమని చెప్పారు. అరెస్టు అయిన వారంతా విశాఖకు చెందిన వారేనని, నిందితులపై గతంలో కలకత్త, పంజాగుట్ట, ఆనకాపల్లీ, శ్రీకాకుళం, గోపాలపట్నంలలో ఇలాంటి కేసులే నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. పోలీసుల వివరాలు ప్రకారం... విశాఖ రైల్వే న్యూ కాలనీకి చెందిన కోటేశ్వర రావు కిరాణా వ్యాపారం చేస్తుంటాడు. అదే ప్రాంతంలో నివసించే అతడి బావ ఏటూరి చిట్టిరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో చిట్టిరాజుకు చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ క్రమంలో తాను బంగారం అవసరమైతే తక్కువ రేటుకి ఇప్పిస్తానని, అయితే అరకేజి కంటే తక్కువ బంగారం ఇవ్వడం సాధ్యం కాదని చిట్టిరాజు, కోటేశ్వరరావును నమ్మించాడు. ఈ నేపథ్యంలో చిట్టిరాజు, కోటేశ్వర రావులను 20 లక్షల రూపాయలను తీసుకు రమ్మని వారిని చెప్పి దోపిడీ చేయాలని ప్రయత్నించి రెండు సార్లు విఫలమయ్యారు. చివరగా గత నెల ఆగస్ట్ 17న మరోసారి పిఎం పాలెం క్రికెట్ స్టేడియం దగ్గరికి 20 లక్షల రుపాయలు తీసుకుని రమ్మని చెప్పాడు. ఆ డబ్బును బయటకు తీసి లెక్కబెడుతుండగా ఇన్నోవా వాహనంలో పోలీస్ సైరన్తో వచ్చి వారిని భయపెట్టి 20 లక్షలతో ఉడాయించాడు. ఇక జరిగిన సంఘటనపై బాధితుడు కోటేశ్వర రావు స్థానిక పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కోటేశ్వరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎంవీపీ పోలీసులు డీసీపీ సురేష్ బాబు ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. -
ఎమ్మెల్సీగా పెన్మత్స సురేష్ బాబు ఏకగ్రీవం
సాక్షి, అమరావతి : ఎమ్మెల్సీగా వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు దివంగత నేత పెనుమత్స సాంబశివరాజు తనయుడు డాక్టర్ సూర్యనారాయణరాజు(సురేష్ బాబు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో సురేష్ బాబు ఏకగ్రీవం అయ్యారని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. (విధేయతకు పట్టం) సురేష్బాబు గురించి సంక్షిప్తంగా పేరు: పెనుమత్స వీర వెంకట సూర్యనారాయణరాజు(సురేష్ బాబు) విద్యార్హత: బీడీఎస్(డెంటల్) వృత్తి: డెంటిస్ట్ పుట్టిన తేది: 6.7.1966 చేపట్టిన పదవులు: ఎంపీటీసీ(మొయిద గ్రామం) ♦ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెంటల్ కౌన్సిల్ మెంబర్(డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వం) ♦ ఇండియన్ డెంటిస్ట్స్ ప్రెసిడెంట్ ♦ వైఎస్సార్సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త ♦ ప్రస్తుతం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి -
నామినేషన్ వేసిన పెన్మత్స సురేష్ బాబు
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేష్ బాబు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. (విధేయతకు పట్టం) ఈ సందర్భంగా పెన్మత్స సురేష్ బాబు మాట్లాడుతూ అందరినీ కలుపుకుని పార్టీకి మంచిపేరు తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. పార్టీకి విధేయుడిగా ఉంటానని, చెడ్డపేరు తీసుకురానని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... పెన్మత్స సాంబశివరావు వారసుడుగా సురేష్ బాబు పార్టీకి విధేయుడుగా ఉన్నారన్నారు. కాగా, రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి దివంగత నేత పెన్మత్స సాంబశివరాజు తనయుడు సురేష్ బాబు పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేసిన విషయం విదితమే. ఇప్పటికే ఈ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్ దాఖలుకు ఈ నెల 13వ తేదీ ఆఖరు. ఈ నెల 24న ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఈ స్థానం సంఖ్యాపరంగా వైఎస్సార్సీపీకే దక్కనుంది. టీడీపీ బరిలో నిలిచే అవకాశం కూడా పెద్దగా లేనందున సురేష్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. -
విధేయతకు పట్టం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విధేయతకు సరైన గుర్తింపు లభించింది. వైఎస్సార్ సీనియర్ నాయకుడు దివంగత నేత పెనుమత్స సాంబశివరాజు తనయుడు డాక్టర్ సూర్యనారాయణరాజు(సురేష్ బాబు)ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి సురేష్ బాబు పేరును మంగళవారం ఖరారు చేశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో పార్టీ పురోభివృద్ధికిసాంబశివరాజు అహర్నిశలూ కృషి చేశారు. వయోభారంతో కొద్దికాలంగా ఆయన చురుగ్గా వ్యవహరించలేకపోయారు. అనారోగ్యంతో సోమవారం ఆయన కన్నుమూశారు. పెద్దాయన మరణంతో ఆయన కుటుంబసభ్యులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించి, డాక్టర్ సురేష్ బాబు ను ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే మంగళవారం ఆయన పేరును ఎమ్మెల్సీ స్థానానికి ఖరారు చేశారు. 13న నామినేషన్ దాఖలు ఇప్పటికే ఈ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్ దాఖలుకు ఈ నెల 13వ తేదీ ఆఖరు. ఈ నెల 24న ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఈ స్థానం సంఖ్యాపరంగా వైఎస్సార్సీపీకే దక్కనుంది. టీడీపీ బరిలో నిలిచే అవకాశం కూడా పెద్దగా లేనందున సురేష్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లో అడుగుపెట్టిన సురేష్ బాబు, 2014 ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీచేసి ఓటమిచెందారు. అయినప్పటికీ నిత్యం పార్టీ కార్యక్రమా ల్లో చురుకుగా పాల్గొంటున్నారు. 2019 ఎన్నికల్లో తన కుమారుడికి బరిలోకి దింపాలని సాంబశివరాజు యత్నించినా రాజకీయ సమీకరణాల దృష్ట్యా అది సాధ్యపడలేదు. జిల్లాలో జరిగిన ప్రజా సంకల్పయాత్రలోనే ఆ కుటుంబా నికి తగిన గుర్తింపునిస్తానని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్సీని చేస్తున్నారు. కాగా గురువా రం ఉదయం నామినేషన్ దాఖలుచేయనున్నట్లు సురేష్ బాబు ’సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. సురేష్బాబు గురించి సంక్షిప్తంగా పేరు: పెనుమత్స వీర వెంకట సూర్యనారాయణరాజు(సురేష్ బాబు) విద్యార్హత: బీడీఎస్(డెంటల్) వృత్తి: డెంటిస్ట్ పుట్టిన తేది: 6.7.1966 చేపట్టిన పదవులు: ఎంపీటీసీ(మొయిద గ్రామం) ♦ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెంటల్ కౌన్సిల్ మెంబర్(డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వం) ♦ ఇండియన్ డెంటిస్ట్స్ ప్రెసిడెంట్ ♦ వైఎస్సార్సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త ♦ ప్రస్తుతం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి -
రెడీ: రానా దగ్గుబాటి
దగ్గుబాటి వారసుడు, టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి నేడు పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. తన ప్రేయసి మిహికా బజాజ్ మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక బంధంలో అడుపెట్టనున్నాడు. ఈ సందర్భంగా రానా ట్విటర్లో షేర్ చేసిన ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘‘రెడీ!!’’ అంటూ వరుడిగా మారిన ఈ బాహుబలి స్టార్ తన తండ్రి సురేశ్ బాబు, బాబాయ్ వెంకటేశ్లతో కలిసి సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న ఫొటోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇన్ అడ్వాన్స్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా పెళ్లికి ముందు నిర్వహించే సంప్రదాయ వేడుకల(హల్దీ, మెహందీ)కు సంబంధించిన రానా- మిహికా ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. (మెరిసే.. మురిసే...) ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో అతికొద్ది సన్నిహితుల సమక్షంలో రానా- మిహికా వివాహం నిరాడంబంరంగా జరుగనుంది. పెళ్లికి హాజరయ్యే ప్రతి ఒక్కరు కచ్చితంగా కోవిడ్-19 పరీక్ష చేయించుకుంటారని, పెళ్లి వేదిక వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేయడంతో పాటుగా... భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటామని వరుడి తండ్రి, ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా ఈ శుభకార్యానికి కేవలం 30 మంది అతిథులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. -
రానా-మిహికా పెళ్లి; వీరికి మాత్రమే ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ హీరో, దగ్గుబాటి వారసుడు రానా తన ప్రేయసి మిహికా బజాజ్తో ఈ నెల 8న ఏడడుగులు వేయనున్నారు. పెళ్లికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో పనులన్నీ చకాచకా జరుతున్నాయి. ఇక ‘మేం ప్రేమలో ఉన్నాం’ అని రానా సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం, ఆ తర్వాత పెద్దలు కలుసుకుని, పెళ్లి ముహూర్తం ఖరారు చేయడం తెలిసిందే. అయితే పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరగబోతుందని, వివాహానికి ఎంతో మంది అతిథులు వస్తున్నారనే వార్తలు ఇటీవల వినిపించడంతో ఈ వదంతులపై రానా తండ్రి సురేష్ బాబు స్పందించారు. రోకా ఫంక్షన్ నిర్వహించిన రామానాయుడు స్టూడియోలోనే వివాహ వేడుక జరగనుందని ఆయన స్పష్టం చేశారు. (రానా-మిహికా ప్రీ వెడ్డింగ్ సందడి షురూ!) సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘వివాహానికి కేవలం 30 మంది మాత్రమే హాజరవుతారు. ఇరు కుటుంబ సభ్యులు మినహా అతిథులు ఎవరూ ఉండరు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతుండటం వల్ల ఈ పెళ్లి వేడుకలో ఎవరి ఆరోగ్యాన్ని రిస్క్లో పడేయాలని మేం అనుకోవడం లేదు. సినిమా ఇండస్ట్రీలో, బయట ఉన్న మా అత్యంత సన్నిహితులను కూడా ఆహ్వానించడం లేదు. పెళ్లి చాలా సింపుల్గా జరుగుతుంది. కానీ, అంతే అందంగా కూడా ఉంటుంది’ అని సురేష్ బాబు చెప్పారు. (మిహికా.. ముందు షాక్ అయ్యింది: రానా) కాగా పెళ్లి వేడుక మొత్తాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని దగ్గుబాటి కుటుంబం ఆలోచిస్తుంది. కరోనా నేపథ్యంలో పెళ్లిలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘పెళ్లికి హాజరయ్యే ప్రతి ఒక్కరు కచ్చితంగా కోవిడ్-19 పరీక్ష చేయించుకుంటారు. వివాహ వేదిక వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేస్తున్నాం. భౌతిక దూరాన్ని పాటిస్తాం. ఇది ఎంతో సంతోషంగా జరుపుకునే వేడుక కాబట్టి దీన్ని అత్యంత భద్రత కలిగిన పండుగగా మారుస్తాం’ అని తెలిపారు. కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా పార్టీని నిర్వహిస్తామని సురేష్ బాబు వెల్లడించారు. (రానా రోకా ఫంక్షన్: సామ్ ఫుల్ హ్యాపీ) View this post on Instagram And it’s official!! 💥💥💥💥 A post shared by Rana Daggubati (@ranadaggubati) on May 20, 2020 at 11:00pm PDT View this post on Instagram To the beginning of forever 💕 @ranadaggubati A post shared by miheeka (@miheeka) on May 20, 2020 at 11:28pm PDT -
ఆలయ అభివృద్ధికి దాతలు భాగస్వాములవ్వాలి
సాక్షి, విజయవాడ: కనక దుర్గ గుడిలో శాశ్వత కేశఖండన శాల నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు అన్నారు. గురువారం మూడు గంటల పాటు కొనసాగిన పాలకమండలి సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా బారిన పడిన సిబ్బందిని ఆలయపరంగా ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం దాతలు ముందు రావాలని కోరారు. డోనర్స్ సెల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా ఆలయ ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ.. పాలకమండలి సమావేశంలో 38 అంశాలపై చర్చించామని తెలిపారు. శివాలయం పునర్నిమాణం, అన్నదానం, ప్రసాదం పొటు, కేశఖండన శాల నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పనులకు సంబంధించి అనుమతులు కూడా వచ్చాయని తెలిపారు. తూర్పు రాజగోపురం నుండి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో దాతలు భాగస్వాములు అవ్వాలని కోరారు. సిబ్బందికి కోవిడ్ ఇన్సూరెన్స్ కల్పించేలా కమిషనర్ దృష్టి కి తీసుకు వెళతామన్నారు. భక్తులు నిర్భయంగా దర్శనానికి రావచ్చని, ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. లాక్ డౌన్ ఎత్తేస్తే దర్శన సమయంలో మార్పులు చేస్తామని వ్యాఖ్యానించారు. -
కనక దుర్గమ్మకి బంగారు బోనం
సాక్షి, విజయవాడ: బెజవాడ కనక దుర్గమ్మకి తెలంగాణ మహాంకాళి ఉమ్మడి దేవాలయాల కమిటీ బంగారు బోనం సమర్పించింది. ఆదివారం తెలంగాణ నుంచి వచ్చిన బోనాలకు దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈఓ సురేష్ బాబు స్వాగతం పలికారు. జమ్మిదొడ్డి నుంచి ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారి సన్నిధికి తెలంగాణ మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు కాలినడకన చేరుకున్నారు. జమ్మిదొడ్డి వద్ద కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. (కరువు సీమలో సిరులు) రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రతి ఏడాది దుర్గమ్మకు బోనం సమర్పిస్తున్నామని తెలిపారు. కరొనా కారణంగా అమ్మవారికి ఆడంబరంగా కాకుండా కేవలం పరిమితంగానే బంగారు బోనం సమర్పిస్తున్నామని చెప్పారు. అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. అదే విదంగా ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు తలిపారు. సాయంత్రం 7 గంటల వరకు శాకాంబరిదేవీగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిబంధనలను అనుసరించి శాకాంబరి ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు. కరోనా నిబంధనల ప్రకారం పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నట్లు చెప్పారు. -
ప్రేక్షకులు ఆమోదిస్తేనే స్టార్స్ అవుతారు
రానా దగ్గుబాటి సమర్పణలో వయాకామ్ 1 మీడియాతో కలిసి సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, షాలినీ వడ్నికట్టి, సీరత్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 25న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఈ సందర్భంగా సురేశ్బాబు సోమవారం మీడియాతో చెప్పిన విశేషాలు. ► ఈ సినిమా ఆహా చానల్లో కూడా జూలై 4 నుండి ప్రసారం అవుతుంది. నిజానికి ఈ సినిమా కథను రానా ఓకే చేయగానే ‘ఏంటిరా... ఇలాంటి కథని ఎలా ఓకే చేశావు’ అని అడిగాను. ‘ప్రస్తుతం నా ఫ్రెండ్స్లో చాలామంది సేమ్ సిట్యువేషన్ ఫేస్ చేస్తున్నారు’ అన్నాడు. వాళ్ల అమ్మ కూడా ‘ఏంటిరా ఈ సినిమా’ అని రానాని తిట్టింది (నవ్వుతూ). సమాజంలో ప్రస్తుతం ఇలానే జరుగుతుందమ్మా అన్నాడు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నదే ఈ సినిమాలో ఉంది. ► ప్రస్తుతానికి మా బ్యానర్లో రవిబాబు దర్శకత్వంలో ‘క్రష్’ సినిమా నిర్మిస్తున్నాం. ఓ నాలుగు పాటలు మాత్రమే బ్యాలెన్స్ షూట్ ఉంది. అది 25 మందితో షూట్ చేయటానికి రవిబాబు ప్లాన్ చేస్తున్నారు. అందుకని ఈ సినిమాని పూర్తి చేసేస్తాం. ‘నారప్ప’, ‘విరాటపర్వం’ సినిమాల షూటింగ్ ఇప్పట్లో మొదలుపెట్టం. ఆ సినిమాలకు సంబంధించి చాలా పెద్ద ఫైట్ సీక్వెన్స్లు చేయాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని నలభై. యాభై మందితో చేయలేం. ‘హిరణ్యకశ్యప’ మూవీని చాలా పెద్ద స్కేల్లో చేస్తాం. ► ఓటీటీ ప్లాట్ఫామ్ మొదట డెవలప్ అయింది ఇతర దేశాల్లోనే. అక్కడ వాళ్లకు సెన్సార్ సర్టిఫికెట్ అంటూ ఏమీ ఉండదు. అందుకే వాళ్లు 18ప్లస్, 13ప్లస్ అని రాస్తారు. అక్కడనుండి దిగుమతి అయిన కల్చర్ కావటంతో అవి అలానే బోల్డ్ కంటెంట్ రూపంలో వస్తున్నాయి. చూడాలి.. ఫ్యూచర్లో ఎలాంటి చట్టాలు వస్తాయో. ► రానా పెళ్లి పనుల గురించి చెప్పాలంటే.. మామూలు టైమ్లో అయితే ఈపాటికి కార్డులు పంచేవాళ్లం. షాపింగ్, పెళ్లి పనులు ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వం ఎంతమందితో చేసుకోమంటే అంతమందితో చేసుకోవాలి. అందుకే పెద్ద పనులేమీ లేవు. అభిరామ్ యాక్టర్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. కొన్ని కథలు కూడా తయారవుతున్నాయి. తెలిసిన వాళ్ల పిల్లలకైనా, మన పిల్లలకైనా, ఎవరికైనా మొదట్లో కొంచెం పుష్ ఇస్తాం కానీ, వాడిని హీరోగా ఒప్పుకోవలసింది, స్క్రీన్ మీద చూసేది ప్రేక్షకులే. ► నెపోటిజమ్ టాపిక్ను సమర్థించను, విమర్శించను. కారణం ఏంటంటే ఎంతోమంది దర్శకుల, నిర్మాతల, హీరోల పిల్లలు ఈ ఇండస్ట్రీలోకి వచ్చి నిరూపించుకోలేకపోయారు. స్టార్స్ ఇళ్లల్లోనుండి పుట్టరు, ఆడియన్స్ ఆమోదంతో స్టార్స్ అవుతారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటుడిగా చాలా సాధించాడు. స్టార్ నుండి సూపర్ స్టార్గా మారే దశలో ఉన్నవాడు ఆత్మహత్య చేసుకోవడం బాధ అనిపించింది. ఉదాహరణకు మన హీరోలనే తీసుకోండి. రవితేజ, నాని, రాజ్ తరుణ్.. ఇలా ఎంతోమంది వచ్చారు. అందరి హీరోలకు గుడ్టైమ్, బ్యాడ్టైమ్ అనేది ఉంటుంది. నేను చెన్నైలో ఉన్నప్పుడు క్రికెట్ చాలా బాగా ఆడేవాణ్ని. అప్పుడు నన్ను టీమ్లో సెలక్ట్ చేయలేదు. అప్పుడు నేను డిప్రెషన్ ఫీలయితే ఎలా? ఏదేమైనా మనం ట్రై చేస్తూనే ఉండాలి. అదే జీవితం. -
నా భర్తను స్వదేశానికి చేర్చండి
వైఎస్ఆర్ జిల్లా, రైల్వేకోడూరు రూరల్ : కువైట్లో తన భర్త అనారోగ్యంతో అవస్థలు పడుతున్నాడని, క్షేమంగా స్వదేశానికి చేర్చాలని ఓ మహిళ వేడుకుంటోంది. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతరాజుపేట పంచాయతీ బీసీ కాలనీకి చెందిన ఇర్ల సురేష్బాబు డ్రైవర్గా జీవనం సాగించే వాడు. ఆయనకు భార్య తేజావతి, కుమారుడు వంశీ(14), మధురిమ(13), మరో కుమారుడు సంతోష్(10) ఉన్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని భావించి, నాలుగేళ్ల క్రితం కువైట్ వెళ్లారు. గతేడాది అక్టోబరులో ఇండియాకు వచ్చారు. భార్య, పిల్లలతో కొన్ని రోజులు గడిపారు. (మరదలిని చంపిన బావ ) రెండో సారి వెళితే జీతం పెరుగుతుందని.. గతేడాది నవంబరు 1న కువైట్ వెళ్లారు. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో.. జనవరిలో అనారోగ్యంగా ఉందని కువైట్లో ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు చేయించుకున్నారు. విషయం భార్య, పిల్లలకు తెలిపారు. మే 2న అదే ఆసుపత్రికి వెళ్లి తనకు ఆరోగ్యం కుదుట పడలేదని, అడ్మిట్ అవుతున్నానని భార్య పిల్లలతో వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన నుంచి ఎటువంటి సమాచారం అందలేదు. అక్కడే ఉంటున్న బంధువులకు ఫోన్ చేసి విచారణ చేయగా.. ఆసుపత్రిలో ఉన్నాడని, వైద్య సేవలు సక్రమంగా అందలేదని తెలిపారు. కోవిడ్ – 19 లాక్డౌన్ కారణంగా ఆసుపత్రిలోకి ఎవరినీ అనుమతించడం లేదని చెప్పారు. తన భర్త ఎలా ఉన్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలియదని తేజావతి ఆందోళన చెందుతోంది. ప్రభుత్వం ఆదుకుని ఆయనకు మంచి వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటోంది. (కువైట్ నుంచి ప్రవాసాంధ్రుల రాక)