syed mushtaq ali trophy
-
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముంబైదే (ఫొటోలు)
-
నేడు సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ ఫైనల్
-
టైటిల్ వేటలో ముంబై, మధ్యప్రదేశ్
బెంగళూరు: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో ముంబై జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న తుది పోరులో మధ్యప్రదేశ్తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్ దశలో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన ముంబై జట్టు టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉంటే... 13 ఏళ్ల తర్వాత తుదిపోరుకు అర్హత సాధించిన మధ్యప్రదేశ్ జట్టు ఇదే జోష్లో ట్రోఫీ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ముంబై జట్టు స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతుండగా... మధ్యప్రదేశ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ముంబై జట్టులో అజింక్య రహానే, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ వంటి టీమిండియా ప్లేయర్లు ఉన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ జట్టుకు రజత్ పటిదార్ సారథ్యం వహిస్తుండగా... ఇటీవల ఐపీఎల్ వేలంలో రికార్డు ధర (రూ. 23.75 కోట్లు) దక్కించుకున్న పేస్ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కీలకం కానున్నాడు. భారత టి20 జట్టు కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే తన మెరుపులతో అదరగొడుతున్నాడు. సంప్రదాయ ఆటతీరుకు చిరునామా అయిన రహానే... భారీ హిట్టింగ్తో విరుచుకుపడుతూ ముంబై జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించాడు. తాజా టోర్నీలో 8 మ్యాచ్లాడిన రహానే 170కి పైగా స్ట్రయిక్రేట్తో 432 పరుగులు సాధించాడంటే అతడి జోరు ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగుతున్న శ్రేయస్ అయ్యర్ 189 స్ట్రయిక్ రేట్తో 329 పరుగులు సాధించాడు. పృథ్వీ షా అడపాదడపా మెరుగైన ప్రదర్శన చేస్తుండగా... సూర్యకుమార్ రాణించాల్సిన అవసరముంది. మిడిలార్డర్లో శివమ్ దూబేతో పాటు స్పిన్ ఆల్రౌండర్ సూర్యాన్‡్ష షెగ్డే భారీ షాట్లు ఆడగల సమర్థులే. బౌలింగ్లో శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, తనుష్ కోటియాన్, సూర్యాన్‡్ష, అథర్వ కీలకం కానున్నారు.మరోవైపు సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఫైనల్ చేరిన మధ్యప్రదేశ్ జట్టు... తుది పోరులోనూ అదే కొనసాగించాలని భావిస్తోంది. ‘మా జట్టు సామర్థ్యంపై నమ్మకముంది. ఎవరితో తలపడుతున్నామనే విషయాన్ని పెద్దగా ఆలోచించడం లేదు. దీన్ని కూడా మరో మ్యాచ్లాగే చూస్తున్నాం. మెరుగైన ప్రదర్శనతో ట్రోఫీ చేజిక్కించుకోవడమే మా లక్ష్యం’ అని మధ్యప్రదేశ్ కెపె్టన్ రజత్ పటిదార్ అన్నాడు. ఈ టోర్నీలో పటిదార్ 183 స్ట్రయిక్ రేట్తో 347 పరుగులు చేసి మంచి టచ్లో ఉన్నాడు. మిడిలార్డర్లో వెంకటేశ్ అయ్యర్ హిట్టింగ్ జట్టుకు బలం కానుంది. ఈ టోర్నీలో అతడు 162 స్ట్రయిక్ రేట్తో 210 పరుగులు సాధించడంతో పాటు... ఉపయుక్తకరమైన మీడియం పేస్తో 6 వికెట్లు పడగొట్టాడు. అవేశ్ ఖాన్, త్రిపురేశ్ సింగ్, కుమార్ కార్తికేయ మధ్యప్రదేశ్ బౌలింగ్ భారం మోయనున్నారు. -
మధ్యప్రదేశ్ X ముంబై
దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై, మధ్యప్రదేశ్ జట్లు తుదిపోరుకు దూసుకెళ్లాయి. సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే దంచి కొట్టడంతో బరోడాపై ముంబై జట్టు ఘనవిజయం సాధిస్తే.... కెప్టెన్ రజత్ పాటిదార్ మెరుపులతో ఢిల్లీపై మధ్యప్రదేశ్ పైచేయి సాధించింది. బెంగళూరులో ఆదివారం జరగనున్న ఫైనల్లో మధ్యప్రదేశ్తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. బెంగళూరు: సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే (56 బంతుల్లో 98; 11 ఫోర్లు, 5 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్తో చెలరేగడంతో ముంబై జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో అడుగు పెట్టింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్లో ముంబై 6 వికెట్ల తేడాతో బరోడాను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. శివాలిక్ శర్మ (24 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... కెపె్టన్ కృనాల్ పాండ్యా (30; 4 ఫోర్లు), శాశ్వత్ రావత్ (33; 4 ఫోర్లు) రాణించారు. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (5) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ముంబై బౌలర్లలో సుర్యాంశ్ షెగ్డే 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 17.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్గా బరిలోకి దిగిన రహానే త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడాడు. ఈ టోర్నీలో ఫుల్ ఫామ్ కనబర్చిన రహానే... బరోడా బౌలర్లను కుదురుకోనివ్వకుండా మైదానం నలువైపులా షాట్లతో అలరించాడు. ఓపెనర్ పృథ్వీ షా (8), సూర్యకుమార్ యాదవ్ (1) విఫలమైనా... లక్ష్యం పెద్దది కాకపోవడంతో ముంబై జట్టుకు పెద్దగా ఇబ్బందులు ఎదురవలేదు. బరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అతిత్ సేత్, అభిమన్యు సింగ్, శాశ్వత్ రావత్ తలా ఒక వికెట్ తీశారు. రహానేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. 13 ఏళ్ల తర్వాత... ఢిల్లీతో జరిగిన రెండో సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 7 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ ఢిల్లీని చిత్తుచేసిన మధ్యప్రదేశ్ జట్టు 13 ఏళ్ల తర్వాత ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్కు చేరింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. వికెట్ కీపర్ అనూజ్ రావత్ (33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), ప్రియాన్‡్ష ఆర్య (29; 3 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ రావత్ (24; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టమైన బంతులతో ఆకట్టుకోవడంతో... ఢిల్లీ జట్టు పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ 2 వికెట్లు పడగొట్టగా... త్రిపురేశ్ సింగ్, అవేశ్ ఖాన్, కుమార్ కార్తికేయ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో మధ్యప్రదేశ్ జట్టు 15.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 152 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ (29 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్స్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... హర్ప్రీత్ సింగ్ (38 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), హర్‡్ష (18 బంతుల్లో 30, 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ముఖ్యంగా రజత్ పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలింగ్ను ఏమాత్రం లెక్కచేయని రజత్ భారీ షాట్లతో విజృంభించాడు. హర్ప్రీత్తో కలిసి రజత్ అబేధ్యమైన నాలుగో వికెట్కు 57 బంతుల్లోనే 106 పరుగులు జోడించడంతో... మధ్యప్రదేశ్ జట్టు మరో 26 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ 2 వికెట్లు, హిమాన్షు చౌహాన్ ఒక వికెట్ తీశారు. రజత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
వెంకటేశ్ అయ్యర్ ఆల్రౌండ్ షో.. సెమీస్లో మధ్యప్రదేశ్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ అడుగుపెట్టింది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 6 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను చిత్తు చేసిన మధ్యప్రదేశ్.. తమ సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. సౌరాష్ట్ర బ్యాటర్లలో చిరాగ్ జాని(80) టాప్ స్కోరర్గా నిలవగా.. హర్విక్ దేశాయ్917), మన్కడ్916) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. త్రిపురేష్ సింగ్, రాహుల్ బాథమ్, శుక్లా తలా వికెట్ సాధించారు.అదరగొట్టిన అర్పిత్, అయ్యర్.. అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని మధ్యప్రదేశ్ 4 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. మధ్యప్రదేశ్ బ్యాటర్లలో ఓపెనర్ అర్పిత్ గౌడ్(42) టాప్ స్కోరర్గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరితో పాటు హర్ప్రీత్ సింగ్ భాటియా(9 బంతుల్లో 22) మెరుపు మెరిపించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో ఉనద్కట్, అనుకుర్ పన్వార్, జాని తలా వికెట్ సాధించారు. కాగా ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. మరోవైపు సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ ప్రత్యర్ధి ఎవరో బెంగాల్, బరోడా మ్యాచ్తో తేలనుంది.చదవండి: PAK vs SA: షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు.. -
షమీ మళ్లీ మాయ చేస్తాడా?.. నేటి నుంచే ముస్తాక్ అలీ ట్రోఫీ క్వార్టర్స్ పోరు
శస్త్రచికిత్స అనంతరం తిరిగి మైదానంలో అడుగు పెట్టిన భారత సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ... దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మరో పోరుకు సిద్ధమయ్యాడు. రంజీ ట్రోఫీలో రాణించి ఫిట్నెస్ చాటుకున్న షమీ... ముస్తాక్ అలీ ట్రోఫీలో అటు బంతితో ఇటు బ్యాట్తోనూ అదరగొడుతున్నాడు. చండీగఢ్తో కీలక ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆల్రౌండ్ మెరుపులతో షమీ బెంగాల్ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో నేడు నాలుగు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. బరోడాతో బెంగాల్, మధ్యప్రదేశ్తో సౌరాష్ట్ర, ముంబైతో విదర్భ, ఢిల్లీతో ఉత్తరప్రదేశ్ తలపడనున్నాయి. గాయం నుంచి కోలుకున్న అనంతరం షమీ దేశవాళీల్లో 64 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 16 వికెట్లు పడగొట్టాడు. ఆ్రస్టేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ చివరి రెండు టెస్టుల కోసం షమీ ఆసీస్ వెళ్లనున్నాడనే వార్తల నేపథ్యంలో... అతడికి ముస్తాక్ అలీ టోర్నీ క్వార్టర్ ఫైనల్ మరో అవకాశం ఇస్తోంది.మరోవైపు ఇటీవల సిక్కింపై 20 ఓవర్లలో 349 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన బరోడా జట్టు... అదే జోష్లో సెమీఫైనల్లో అడుగు పెట్టాలని భావిస్తోంది. బరోడా బ్యాటింగ్ సామర్థ్యానికి... బెంగాల్ బౌలింగ్ నైపుణ్యానికి మధ్య తీవ్ర పోటీ ఖాయం. రింకూ మెరిసేనా?ఢిల్లీతో జరిగే మ్యాచ్లో ఉత్తరప్రదేశ్ నుంచి రింకూ సింగ్పై అందరి దృష్టి నిలవనుంది. మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర మ్యాచ్లో వెంకటేశ్ అయ్యర్, రజత్ పాటిదార్ కీలకం కానుండగా...విదర్భతో పోరులో ముంబై జట్టు తరఫున శ్రేయస్ అయ్యర్, అజింక్య రహానే, సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యారు.చదవండి: సిరాజ్ను సీనియర్లే నియంత్రించాలి: ఆసీస్ మాజీ కెప్టెన్ -
ఆంధ్ర అవుట్
బెంగళూరు: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు కథ ముగిసింది. లీగ్ దశలో ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదింట గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్న ఆంధ్ర ఈ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది. చిన్నస్వామి స్టేడియంలో ఉత్తరప్రదేశ్ జట్టుతో సోమవారం జరిగిన రెండో ప్రిక్వార్టర్ ఫైనల్లో రికీ భుయ్ నాయకత్వంలోని ఆంధ్ర జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆంధ్ర జట్టు నిర్దేశించిన 157 పరుగుల విజయలక్ష్యాన్ని ఉత్తరప్రదేశ్ (యూపీ) జట్టు 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత స్టార్ రింకూ సింగ్ (22 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), విప్రాజ్ నిగమ్ (8 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడి ఉత్తరప్రదేశ్ జట్టుకు విజయాన్ని అందించారు. ఒకదశలో ఉత్తరప్రదేశ్ జట్టు విజయానికి 24 బంతుల్లో 48 పరుగులు అవసరమయ్యాయి. ఆంధ్ర మీడియం పేసర్ కేవీ శశికాంత్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రింకూ, విప్రాజ్ 22 పరుగులు పిండుకోవడంతో ఫలితం యూపీ జట్టు వైపునకు మొగ్గింది. చివరి 3 ఓవర్లలో యూపీ విజయానికి 26 పరుగులు అవసరంకాగా... ఆ జట్టు 2 ఓవర్లలోనే 26 పరుగులు సాధించి విజయాన్ని ఖరారు చేసుకుంది. విప్రాజ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆంధ్ర బౌలర్లలో కొడవండ్ల సుదర్శన్ 22 పరుగులిచ్చి 3 వికెట్లు, త్రిపురాన విజయ్ 21 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. మరో వికెట్ సత్యనారాయణ రాజుకు దక్కింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు సాధించింది. ఎస్డీఎన్వీ ప్రసాద్ (22 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు), కేవీ శశికాంత్ (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించారు. శ్రీకర్ భరత్ (11 బంతుల్లో 4), అశ్విన్ హెబ్బర్ (11 బంతుల్లో 11; 1 ఫోర్, 1 సిక్స్), షేక్ రషీద్ (14 బంతుల్లో 18; 3 ఫోర్లు), పైలా అవినాశ్ (20 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్), రికీ భుయ్ (18 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్లు), త్రిపురాన విజయ్ (16 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్) క్రీజులో నిలదొక్కుకుంటున్న దశలో వెనుదిరిగారు. ఉత్తరప్రదేశ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, విప్రాజ్ నిగమ్ 2 వికెట్ల చొప్పున తీయగా... మొహసిన్ ఖాన్, శివమ్ మావిలకు ఒక్కో వికెట్ లభించింది. అంతకుముందు జరిగిన తొలి ప్రిక్వార్టర్ ఫైనల్లో బెంగాల్ జట్టు మూడు పరుగుల తేడాతో చండీగఢ్పై గెలిచింది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్లో మధ్యప్రదేశ్తో సౌరాష్ట్ర; బరోడాతో బెంగాల్; ముంబైతో విదర్భ; ఢిల్లీతో ఉత్తరప్రదేశ్ తలపడతాయి. -
మహ్మద్ షమీ విధ్వంసం.. కేవలం 17 బంతుల్లోనే! వీడియో వైరల్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన బ్యాట్ను ఝళిపించాడు. ఈ టోర్నీలో బెంగాల్కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. చంఢీఘర్తో జరుగుతున్న ప్రీ క్వార్టర్ మ్యాచ్లో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. పదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన షమీ ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కులు చూపించాడు.అద్భుతమైన షాట్లతో ఈ వెటరన్ క్రికెటర్ అలరించాడు. కేవలం 17 బంతులు మాత్రమే ఎదుర్కొన్న షమీ.. 3 ఫోర్లు, 2 సిక్స్లతో 32 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా షమీ మెరుపు ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ జట్టు 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బెంగాల్ బ్యాటర్లలో షమీతో పాటు కరణ్ లాల్(33), ప్రదీప్త ప్రమాణిక్(30) పరుగులతో రాణించారు. చంఢీగర్ బౌలర్లలో జగిత్ సింగ్ 4 వికెట్లు పడగొట్టగా.. రాజ్ భా రెండు, నికిల్, అమ్రిత్, లాథర్ తలా వికెట్ సాధించారు.టీమిండియాలోకి ఎంట్రీ ఎప్పుడంటే?బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి రెండు టెస్టులకు షమీ భారత జట్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. తొలుత బ్రిస్బేన్ వేదికగా జరిగే మూడో టెస్టుకు ముందు షమీ జట్టుతో కలుస్తాడని వార్తలు వినిపించాయి. కానీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఆ వార్తలను కొట్టిపారేశాడు. షమీ ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని, బ్రిస్బేన్ టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని పరోక్షంగా హిట్మ్యాన్ స్పష్టం చేశాడు. Bengal have set a target of 160 in front of Chandigarh 🎯Mohd. Shami provides a crucial late surge with 32*(17)Karan Lal top-scored with 33 (25)Jagjit Singh Sandhu was the pick of the Chandigarh bowlers with 4/21#SMAT | @IDFCFIRSTBankScorecard ▶️ https://t.co/u42rkbUfTJ pic.twitter.com/gQ32b5V9LN— BCCI Domestic (@BCCIdomestic) December 9, 2024 -
ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్.. సుడిగాలి ఇన్నింగ్స్!
భారత క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. సర్వీసెస్తో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల సునామీ సృష్టించాడు. అయితే, శతకానికి కేవలం మూడు పరుగుల దూరంలో ఉన్నప్పుడు రుతురాజ్ అవుట్ కావడం దురదృష్టకరం.కాగా దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్ర జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్.. ఇటీవల రంజీ ట్రోఫీ(ఫస్ట్క్లాస్ క్రికెట్)లో అదరగొట్టాడు. అయితే, దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం రుతుకు శుభారంభం లభించలేదు. గత నాలుగు మ్యాచ్లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ చేసిన పరుగులు వరుసగా.. 1, 19, 4, 2.48 బంతుల్లోనే 97 పరుగులుఈ నేపథ్యంలో రుతు టీ20 బ్యాటింగ్ తీరుపై విమర్శలు రాగా.. సర్వీసెస్తో మ్యాచ్ సందర్భంగా బ్యాట్తోనే సమాధానమిచ్చాడు. ఆష్రిన్ కులకర్ణి(29)తో కలిసి మహారాష్ట్ర ఇన్నింగ్స్ ఆరంభించిన రుతు.. 48 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి.ఇక 202కు పైగా స్ట్రైక్రేటుతో పరుగులు రాబట్టిన రుతు.. సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉన్నపుడు అవుటయ్యాడు. సర్వీసెస్ బౌలర్ మోహిత్ రాఠీ బౌలింగ్లో వికాస్ హథ్వాలాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రాహుల్ త్రిపాఠి విఫలంమిగతా వాళ్లలో రాహుల్ త్రిపాఠి(13) విఫలం కాగా.. సిద్ధార్థ్ మాత్రే మెరుపు ఇన్నింగ్స్(19 బంతుల్లో 32), ధన్రాజ్ షిండే(14 బంతుల్లో 32) ధనాధన్ బ్యాటింగ్తో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.చదవండి: టీ20 క్రికెట్లో పెను సంచలనం.. బరోడా జట్టు ప్రపంచ రికార్డు.. హార్దిక్ పాండ్యా లేకుండానే! -
టీ20 క్రికెట్లో పెను సంచలనం.. హార్దిక్ పాండ్యా లేకుండానే ప్రపంచ రికార్డు!
టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. కృనాల్ పాండ్యా కెప్టెన్సీలోని బరోడా జట్టు 349 పరుగులతో ప్రపంచ రికార్డు సాధించింది. భారత దేశీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో భాగంగా ఈ ఫీట్ నమోదు చేసింది. ఇండోర్ వేదికగా సిక్కింపై ఈ మేర పరుగుల విధ్వంసం సృష్టించింది.ఆది నుంచే దంచికొట్టారుఈ నేపథ్యంలో జింబాబ్వే పేరిట ఉన్న ఆల్టైమ్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన బరోడా.. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. అంతేకాదు.. హార్దిక్ పాండ్యా బ్యాట్తో రంగంలోకి దిగకుండానే.. బరోడా ప్లేయర్లు తమ వీరబాదుడుతో ఈ అరుదైన ఘనతను జట్టు ఖాతాలో వేశారు.కాగా ఇండోర్లోని ఎమరాల్డ్ హై స్కూల్ గ్రౌండ్లో గురువారం సిక్కిం జట్టుతో బరోడా తలపడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బరోడాకు ఓపెనర్లు శశ్వత్ రావత్(16 బంతుల్లో 43), అభిమన్యు సింగ్(53) అదిరిపోయే ఆరంభం అందించారు.ఊచకోత.. 15 సిక్సర్లువీళ్లిద్దరు మెరుపు ఇన్నింగ్స్ ఆడితే.. వన్డౌన్లో వచ్చిన భాను పనియా మాత్రం తుఫాన్ ఇన్నింగ్స్తో సిక్కిం బౌలింగ్ను ఊచకోత కోశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 51 బంతులు ఎదుర్కొని ఏకంగా 134 పరుగులతో అజేయంగా నిలిచాడు. భాను పనియా ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు ఉంటే.. సిక్సర్లు ఏకంగా 15 ఉండటం విశేషం.మిగతా వాళ్లలో శైవిక్ శర్మ(17 బంతుల్లో 55), వికెట్ కీపర్ విష్ణు సోలంకి(16 బంతుల్లో 50) బ్యాట్తో వీరవిహారం చేశారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయిన బరోడా జట్టు 349 పరుగులు చేసింది. సిక్కిం బౌలర్లలో పల్జోర్ తమాంగ్, రోషన్ కుమార్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. తరుణ్ శర్మ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వే రికార్డు బ్రేక్కాగా టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్లో భాగంగా జింబాబ్వే ఇటీవల గాంబియాపై 344-4 స్కోరు చేసింది. ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్లో ఇదే అత్యధిక స్కోరు. అయితే, ఈ రికార్డును ఇప్పుడు బరోడా అధిగమించింది.చదవండి: Ind vs Aus 2nd Test: పింక్ బాల్ టెస్టు.. అడిలైడ్ పిచ్ వారికే అనుకూలం! క్యూరేటర్ కీలక వ్యాఖ్యలు -
MP Vs HYD: రజత్ పాటిదార్ మెరుపులు.. తిలక్ వర్మను వెంటాడిన దురదృష్టం
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. పేలవ ఆటతీరు కొనసాగించిన తిలక్ సేన.. నాలుగో పరాజయంతో నాకౌట్ దశకు చేరే అవకాశాలను కోల్పోయింది.గ్రూప్ ‘ఎ’లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు మధ్యప్రదేశ్ చేతిలో 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 179 పరుగుల లక్ష్యఛేదనలో 14 ఓవర్లు ముగిసేసరికి 125/3తో పటిష్ట స్థితిలో కనిపించిన హైదరాబాద్ జట్టు ఆ తర్వాత మిడిలార్డర్ వైఫల్యంతో 16 బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి పరాజయాన్ని మూట గట్టుకుంది.రజత్ పాటిదార్ మెరుపులుటాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హర్ష్ గావ్లి (29 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధశతకంతో మెరవగా... సుభ్రాంషు సేనాపతి (42; 2 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ రజత్ పాటిదార్ (16 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడారు. హైదరాబాద్ బౌలర్లలో చామా మిలింద్, అజయ్దేవ్ గౌడ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.తిలక్ వర్మను వెంటాడినన దురదృష్టంఅనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ ఠాకూర్ తిలక్ వర్మ (34 బంతుల్లో 46; 1 ఫోర్, 2 సిక్స్లు), తన్మయ్ అగర్వాల్ (33 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించారు. దీంతో హైదరాబాద్ విజయందిశగా సాగిపోయింది. అయితే మధ్యప్రదేశ్ బౌలర్లు విజృంభించడంతో హైదరాబాద్ మిడిలార్డర్ కుప్పకూలింది.మికిల్ జైస్వాల్ (0), ప్రతీక్ రెడ్డి (1), తనయ్ త్యాగరాజన్ (9) విఫలమయ్యారు. చివర్లో మిలింద్ (19; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడినా హైదరాబాద్ జట్టును గట్టెక్కించలేకపోయాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో కుమార్ కార్తికేయ, కమల్ త్రిపాఠి చెరో 3 వికెట్లు తీశారు. మొత్తం 8 జట్లున్న గ్రూప్ ‘ఎ’లో 6 మ్యాచ్లాడిన హైదరాబాద్ జట్టు రెండింటిలో గెలిచి, నాలుగింటిలో ఓడిపోయి 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. గురువారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో మిజోరంతో హైదరాబాద్ తలపడనుంది. స్కోరు వివరాలు మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్: సుభ్రాంషు సేనాపతి (సి) రాహుల్ బుద్ధి (బి) నితిన్ సాయి యాదవ్ 42; హర్ష్ గావ్లి (సి) తన్మయ్ (బి) అజయ్దేవ్ గౌడ్ 51; రజత్ పాటిదార్ (సి) రోహిత్ రాయుడు (బి) నితిన్సాయి యాదవ్ 36; హర్ప్రీత్ సింగ్ (సి) తిలక్ వర్మ (బి) మిలింద్ 12; వెంకటేశ్ అయ్యర్ (సి) తనయ్ త్యాగరాజన్ (బి) మిలింద్ 22; అనికేత్ వర్మ (బి) మిలింద్ 0; రాహుల్ బాథమ్ (సి) నితిన్సాయి యాదవ్ (బి) అజయ్దేవ్ గౌడ్ 5; కమల్ త్రిపాఠి (సి) తిలక్ వర్మ (బి) అజయ్దేవ్ గౌడ్ 1; కుమార్ కార్తికేయ (నాటౌట్) 0; అవేశ్ ఖాన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–92, 2–105, 3–142, 4–151, 5–151, 6–163, 7–165, 8–177. బౌలింగ్: రవితేజ 4–0–42–0; మిలింద్ 4–0–33–3; అజయ్ దేవ్ గౌడ్ 4–0–20–3; తనయ్ 4–0–51–0; నితిన్ సాయి 4–0–29–2.హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) కమల్ త్రిపాఠి (బి) కార్తికేయ 47; రోహిత్ రాయుడు (సి) హర్‡్ష (బి) అవేశ్ ఖాన్ 8; తిలక్ వర్మ (సి) అనికేత్ వర్మ (బి) కమల్ త్రిపాఠి 46; రాహుల్ బుద్ధి (సి) అనికేత్ వర్మ (బి) కార్తికేయ 20; మికిల్ జైస్వాల్ (సి) రజత్ (బి) కార్తికేయ 0; ప్రతీక్ రెడ్డి (సి అండ్ బి) కమల్ త్రిపాఠి 1; తనయ్ త్యాగరాజన్ (సి) కార్తికేయ (బి) కమల్ త్రిపాఠి 9; అజయ్దేవ్ గౌడ్ (సి) పాటిదార్ (బి) అవేశ్ ఖాన్ 12; మిలింద్ (సి) అనికేత్ వర్మ (బి) రాహుల్ బాథమ్ 19; రవితేజ (నాటౌట్) 1; నితిన్సాయి యాదవ్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–31, 2–87, 3–125, 4–125, 5–127, 6–128, 7–143, 8–167, 9–168.బౌలింగ్: అవేశ్ ఖాన్ 4–0–31–2; ఖెజ్రోలియా 2–0–30–3; రాహుల్ 3–0–27–1; కమల్ 4–0–31–3; వెంకటేశ్ అయ్యర్ 3–0–24–0; కార్తికేయ 4–0–25–3. చదవండి: సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం.. శివమ్ దూబే ఊచకోత -
తిలక్ వర్మ విఫలం.. అన్మోల్ప్రీత్ సింగ్ విధ్వంసం
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు మూడో పరాజయం నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్తో మ్యాచ్లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఆల్రౌండర్ చామా మిలింద్ (22 బంతుల్లో 55; 3 ఫోర్లు, 6 సిక్స్లు) మెరుపులు మెరిపించినా హైదరాబాద్ను విజయతీరాలకు చేర్చలేకపోయాడు.అన్మోల్ప్రీత్ సింగ్ విధ్వంసంగ్రూప్ ‘ఎ’లో భాగంగా రాజ్కోట్ వేదికగా ఆదివారం జరిగిన ఈ పోరులో .. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది పంజాబ్. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36 బంతుల్లో 60; 8 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధశతకం సాధించగా... రమణ్దీప్ సింగ్ (11 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు), నేహల్ వధేరా (31; ఒక ఫోర్, 2 సిక్స్లు) రాణించారు.హైదరాబాద్ బౌలర్లలో రవితేజ, అజయ్దేవ్ గౌడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. చామా మిలింద్, రోహిత్ రాయుడు (37 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో రాణించగా... మికిల్ జైస్వాల్ (23 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు.తిలక్ వర్మ విఫలంకెప్టెన్ తిలక్ వర్మ (9), తన్మయ్ అగర్వాల్ (9), రాహుల్ బుద్ధి (5), అజయ్దేవ్ గౌడ్ (6), రవితేజ (0), ప్రతీక్ రెడ్డి (4) విఫలమయ్యారు. ఇన్నింగ్స్ చివరి బంతి వరకు క్రీజులో నిలిచిన మిలింద్ భారీ సిక్స్లతో విరుచుకుపడినా... జట్టును విజయతీరానికి చేర్చలేకపోయాడు. పంజాబ్ బౌలర్లలో నమన్ ధీర్ 5 వికెట్లు పడగొట్టాడు. తదుపరి మ్యాచ్లో మంగళవారం మధ్యప్రదేశ్తో హైదరాబాద్ తలపడనుంది. స్కోరు వివరాలు పంజాబ్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (బి) అజయ్దేవ్ గౌడ్ 21; ప్రభ్సిమ్రన్ సింగ్ (సి) తిలక్ వర్మ (బి) మిలింద్ 1; అన్మోల్ప్రీత్ సింగ్ (సి) ప్రతీక్ రెడ్డి (బి) అజయ్దేవ్ గౌడ్ 60; నేహల్ వధేరా (సి) మిలింద్ (బి) నితిన్సాయి యాదవ్ 31; నమన్ ధీర్ (సి) రాహుల్ బుద్ధి (బి) రవితేజ 9; సానీ్వర్ సింగ్ (సి) రోహిత్ రాయుడు (బి) రవితేజ 24; రమణ్దీప్ సింగ్ (నాటౌట్) 39; అర్ష్దీప్ సింగ్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 5, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–13, 2–28, 3–115, 4–115, 5–149, 6–151. బౌలింగ్: రవితేజ 4–0–49–2; మిలింద్ 4–0–28–1; అజయ్దేవ్ గౌడ్ 4–0–38–2; రక్షణ్ రెడ్డి 2–0–26–0, నితిన్సాయి యాదవ్ 4–0–40–1; రోహిత్ రాయుడు 2–0–13–0. హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) జసిందర్ సింగ్ (బి) నమన్ 9; రోహిత్ రాయుడు (సి) సాన్వీర్ సింగ్ (బి) నమన్ 56; తిలక్ వర్మ (సి) అర్ష్దీప్ (బి) జసిందర్ 9; మికిల్ జైస్వాల్ (సి) అన్మోల్ప్రీత్ (బి) మయాంక్ మార్కండే 39; రాహుల్ బుద్ధి (సి) అభిషేక్ శర్మ (బి) జసిందర్ 5; అజయ్దేవ్ గౌడ్ (సి) రమణ్దీప్ సింగ్ (బి) నమన్ 6; రవితేజ (ఎల్బీ) (బి) నమన్ 0; ప్రతీక్ రెడ్డి (స్టంప్డ్) ప్రభ్సిమ్రన్ (బి) నమన్ 4; మిలింద్ (సి) రమణ్దీప్ (బి) అర్ష్దీప్ 55; నితిన్సాయి యాదవ్ (రనౌట్) 0; రక్షణ్ రెడ్డి (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–25, 2–57, 3–118, 4–120, 5–127, 6–127, 7–133, 8–141, 9–142, 10–189. బౌలింగ్: అభిషేక్ 1–0–10–0; అర్‡్షదీప్ 4–0–47–1; బల్తేజ్ సింగ్ 3–0–35–0; నమన్ ధీర్ 4–0–19–5; జసిందర్ సింగ్ 4–0–44–2; మయాంక్ మార్కండే 2–0–22–1; సాన్వీర్ సింగ్ 2–0–14–0. -
SMAT 2024: రికీ భుయ్ ఊచకోత.. దుమ్మురేపుతున్న ఆంధ్ర జట్టు
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు విజయపరంపర కొనసాగుతోంది. టోర్నీలో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తున్న ఆంధ్ర జట్టు వరుసగా నాలుగో మ్యాచ్లోనూ గెలుపొందింది. గ్రూప్ ‘ఈ’లో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఆంధ్ర జట్టు 23 పరుగుల తేడాతో సర్వీసెస్ జట్టును ఓడించింది.కెప్టెన్ రికీ భుయ్ విధ్వంసంటాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కెప్టెన్ రికీ భుయ్ (35 బంతుల్లో 84; 10 ఫోర్లు, 5 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... ఓపెనర్ కోన శ్రీకర్ భరత్ (39 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధశతకంతో మెరిశాడు. మరోవైపు.. ప్రసాద్ (12 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సర్వీసెస్ బౌలర్లలో పూనమ్ పూనియా, మోహిత్ రాఠి, వినీత్ ధన్కడ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సర్వీసెస్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 199 పరుగులకు పరిమితమైంది.అగ్రస్థానంలోకెప్టెన్ మోహిత్ అహ్లావత్ (37 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్స్లు), వినీత్ ధన్కడ్ (32 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్సెంచరీలతో పోరాడారు. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్, శశికాంత్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... సత్యనారాయణ రాజు 2 వికెట్లు తీశాడు. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచిన ఆంధ్ర జట్టు 16 పాయింట్లతో గ్రూప్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తదుపరి పోరులో మంగళవారం కేరళతో ఆంధ్ర జట్టు ఆడుతుంది. స్కోరు వివరాలు ఆంధ్ర ఇన్నింగ్స్: కోన శ్రీకర్ భరత్ (సి) అరుణ్ (బి) పూనమ్ పూనియా 63; అశ్విన్ హెబర్ (సి) అరుణ్ (బి) విశాల్ 1; షేక్ రషీద్ (సి) అరుణ్ (బి) పుల్కిత్ నారంగ్ 21; రికీ భుయ్ (సి) వినీత్ (బి) విశాల్ 84; పైలా అవినాశ్ (సి) పూనమ్ పూనియా (బి) వినీత్ 5; ప్రసాద్ (సి) విశాల్ (బి) పూనమ్ పూనియా 28; శశికాంత్ (సి) పూనమ్ పూనియా (బి) వినీత్ 0; వినయ్ కుమార్ (నాటౌట్) 7; సత్యనారాయణ రాజు (రనౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 222. వికెట్ల పతనం: 1–24, 2–63, 3–151, 4–175, 5–188, 6–209, 7–222, 8–222. బౌలింగ్: పూనమ్ పూనియా 4–0–37–2; గౌరవ్ శర్మ 3–0–43–0; విశాల్ గౌర్ 4–0–50–2; మోహిత్ రాఠి 4–0–35–0; పుల్కిత్ 1.5–0–17–1; వినీత్ ధన్కడ్ 2.1–0–24–2; నితిన్ తన్వర్ 1–0–16–0. సర్వీసెస్ ఇన్నింగ్స్: కున్వర్ పాఠక్ (సి) అవినాశ్ (బి) స్టీఫెన్ 2; రజత్ (సి) భరత్ (బి) శశికాంత్ 33; నితిన్ తన్వర్ (ఎల్బీ) రాజు 1; వినీత్ (సి) వినయ్ (బి) శశికాంత్ 51; మోహిత్ అహ్లావత్ (సి) రికీ భుయ్ (బి) రాజు 74; అరుణ్ (బి) శశికాంత్ 0; మోహిత్ రాఠి (సి) అవినాశ్ (బి) స్టీఫెన్ 5; గౌరవ్ శర్మ (రనౌట్/స్టీఫెన్) 3; పూనమ్ పూనియా (సి) ప్రసాద్ (బి) స్టీఫెన్ 17; విశాల్ గౌర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–4, 2–38, 3–50, 4–150, 5–150, 6–173, 7–175, 8–187, 9–199. బౌలింగ్: స్టీఫెన్ 4–0–26–3; శశికాంత్ 4–0–50–3; సత్యనారాయణ రాజు 4–0–39–2; వినయ్ కుమార్ 4–0–35–0; యశ్వంత్ 4–0–43–0. -
ఇషాన్ కిషన్ ఊచకోత.. 5 ఫోర్లు, 9 సిక్స్లతో తుపాన్ ఇన్నింగ్స్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, జార్ఖండ్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం వాంఖడే వేదికగా అరుణాచాల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో జార్ఖండ్ తరపున కిషన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అరుణాచాల్ బౌలర్లను ఉతికారేశాడు. 23 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్లతో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా 94 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 4.3 ఓవర్లలోనే జార్ఖండ్ వికెట్ నష్టపోకుండా ఊదిపడేసింది. అతడితో పాటు మరో ఓపెనర్ ఉత్కర్ష్ సింగ్(13) ఆజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో తొలుత బౌలింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. జార్ఖండ్ బౌలర్లలో స్పిన్నర్ అనుకుల్ రాయ్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. రవి కుమార్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు.ఎస్ఆర్హెచ్లోకి ఎంట్రీ..కాగా ఇటీవలే జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో కిషన్ భారీ ధర దక్కింది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ వరకు అతడు ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించాడు.కానీ ఈసారి అతడిని ముంబై రిటైన్ చేసుకోలేదు. కాగా దేశీవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించడంతో కిషాన్ సెంట్రాల్ కాంట్రాక్ట్ను కోల్పోయాడు. దాదాపు ఏడాది నుంచి జాతీయ జట్టుకు కూడా దూరంగా ఉన్నాడు. -
వేలంలో అమ్ముడుపోలేదు.. ఇక్కడేమో బ్యాటర్లు ఉతికారేశారు! పాపం శార్దూల్..
భారత ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో లో ఓ మ్యాచ్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా నిలిచాడు. కాగా ఇండియాలో ప్రస్తుతం దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరుగుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా.. గ్రూప్-‘ఇ’లో ఉన్న కేరళ- ముంబై జట్లు శుక్రవారం తలపడ్డాయి. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కేరళకు శార్దూల్ ఠాకూర్ ఆరంభంలోనే షాకిచ్చాడు. కెప్టెన్, ఓపెనర్ సంజూ శాంసన్(4)ను ఆదిలోనే పెవిలియన్కు పంపాడు.అయితే, ఆ తర్వాత ముంబైకి పెద్దగా ఏదీ కలిసిరాలేదు. వరుస విరామాల్లో వికెట్లు తీసినా.. ఓపెనర్ రోహన్ కణ్ణుమల్, సల్మాన్ నిజార్ ధాటికి ముంబై బౌలర్లు చేతులెత్తేశారు. రోహన్ 48 బంతుల్లోనే 87 పరుగులతో చెలరేగగా.. సల్మాన్ 49 బంతుల్లో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా కేరళ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 234 పరుగులు చేసింది.కాగా ముంబై బౌలర్లలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. ఏకంగా 69 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓ మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న బౌలర్గా రమేశ్ రాహుల్ చెత్త రికార్డును సమం చేశాడు. కాగా రమేశ్ అరుణాచల్ప్రదేశ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్.ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలం-2025లో రూ. 2 కో ట్ల కనీస ధరతో శార్దూల్ ఠాకూర్ అందుబాటులో ఉన్నాడు. అయితే, ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపకపోవడంతో అతడు అమ్ముడుపోకుండానే మిగిలిపోయాడు. ప్పుడిలా టీ20మ్యాచ్లో చె త్త ప్రదర్శన కనబరిచాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. కేరళ విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై ఆఖరి వరకు పోరాడింది. ఓపెనర్లు పృథ్వీ షా(23), అంగ్క్రిష్ రఘువంశీ(16) నిరాశపరచగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(18 బంతుల్లో 32) కాసేపు బ్యాట్ ఝులిపించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న అజింక్య రహానే 35 బంతుల్లోనే 68 రన్స్ చేశాడు.రహానే ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉండటం విశేషం. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ హార్దిక్ తామోర్(23) ఒక్కడే కాస్త మెరుగ్గా ఆడాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ముంబై 191 పరుగులు చేయగలిగింది. దీంతో కేరళ 43 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా? -
హార్దిక్ పాండ్యా విధ్వంసం.. ఒకే ఓవర్లో 28 పరుగులు! వీడియో వైరల్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో బరోడాకు ప్రాతినిథ్యం వహిస్తున్న పాండ్యా మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా శుక్రవారం త్రిపురతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.త్రిపుర బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా త్రిపుర స్పిన్నర్ పర్వేజ్ సుల్తాన్ను ఈ బరోడా ఆల్రౌండర్ ఊతికారేశాడు. బరోడా ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన పర్వేజ్ బౌలింగ్లో 4 సిక్స్లు, ఒక ఫోర్తో పాండ్యా 28 పరుగులు పిండుకున్నాడు.ఓవరాల్గా 23 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. 3 ఫోర్లు, 5 సిక్స్లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. పాండ్యా విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా బరోడా 110 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 11.2 ఓవర్లలో చేధించింది. బరోడా బ్యాటర్లలో పాండ్యాతో పాటు మితీష్ పటేల్ 37 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. త్రిపుర బ్యాటర్లలో కెప్టెన్ మన్దీప్ సింగ్(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.బరోడా బౌలర్లలో అభిమన్యు సింగ్ మూడు వికెట్లు, కెప్టెన్ కృనాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడి 115.50 సగటుతో 231 పరుగులు చేశాడు.చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా? Hardik Pandya was on fire again 🔥🔥The Baroda all-rounder went berserk smashing 6⃣,6⃣,6⃣,4⃣,6⃣ in an over on his way to a whirlwind 47(23) against Tripura 🙌🙌#SMAT | @IDFCFIRSTBankScorecard ▶️ https://t.co/1WPFeVRTum pic.twitter.com/xhgWG63y9g— BCCI Domestic (@BCCIdomestic) November 29, 2024 -
సచిన్ కొడుకుకు చుక్కలు చూపించారు? వేలంలో ఎవరైనా కొంటారా?
ఈ ఏడాది రంజీ ట్రోఫీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన సచిన్ టెండూల్కర్ తనయుడు, గోవా ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్.. టీ20ల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ-2024 ట్రోఫీలో భాగంగా హైదరాబాద్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్లో అర్జున్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. అతడి బౌలింగ్ను ముంబై బ్యాటర్లు ఊతికారేశారు. ముఖ్యంగా ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే అర్జున్ను ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన జూనియర్ టెండూల్కర్.. 12.00 ఏకానమీతో ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. కనీసం ఒక్క వికెట్ కూడా అర్జున్ సాధించలేకపోయాడు.అర్జున్ అమ్ముడుపోతాడా?ఈ క్రమంలో నవంబర్ 24, 25వ తేదీల్లో జరిగే ఐపీఎల్-2025 మెగా వేలంలో అర్జున్ అస్సలు అమ్ముడు పోతాడా అన్నది ప్రశ్నర్ధాకంగా మారింది. అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్-2023, 2024 సీజనల్లో ముంబై ఇండియన్స్ ప్రాతినిథ్యం వహించాడు. ఈ రెండు సీజన్లలో మొత్తంగా ఐదు మ్యాచ్లు ఆడిన అర్జున్.. కేవలం మూడు వికెట్లు మాత్రమే సాధించగలిగాడు.దీంతో ఈసారి అతడిని ముంబై కూడా కొనుగోలు చేసే సూచనలు కన్పించడం లేదు. ఈ వేలంలో రూ. 30 లక్షల కనీస ధరగా నమోదు చేసుకున్న అర్జున్.. ఈసారి అమ్ముడుపోకపోయినా ఆశ్చర్యపోన్కర్లేదు.శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. ఇక ఈ మ్యాచ్లో గోవాపై 26 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(130) సెంచరీతో మెరిశాడు. అనంతరం లక్ష్య చేధనలో గోవా 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. గోవా బ్యాటర్లలో సుయాష్ ప్రభుదేశాయ్(52) టాప్ స్కోరర్గా నిలిచాడు. ముంబై బౌలర్లలో రాయ్స్టన్ ద్యాస్, సూర్యన్ష్ షెడ్గే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ములానీ, శార్ధూల్ ఠాకూర్, మొహిత్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా -
శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర సెంచరీ.. బౌలర్లకు చుక్కలు
ఐపీఎల్-2025 మెగా వేలానికి ఒక్క రోజు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ-2024లో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్లో అయ్యర్ అద్భుత శతకంతో సత్తాచాటాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముంబై సారథిగా బరిలోకి దిగిన అయ్యర్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 47 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 57 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ 11 ఫోర్లు, 10 సిక్సర్లతో 130 పరుగులుచేశాడు. శ్రేయస్తోపాటు పృథ్వీషా(33), ములానీ(41) రాణించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన గోవా జట్టు కూడా ఆఖరి వరకు పోరాడింది. లక్ష్య చేధనలో గోవా 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ఫలితంగా 26 పరుగుల తేడాతో గోవా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.గోవా బ్యాటర్లలో సుయాష్ ప్రభుదేశాయ్(52) టాప్ స్కోరర్గా నిలిచాడు. ముంబై బౌలర్లలో రాయ్స్టన్ ద్యాస్, సూర్యన్ష్ షెడ్గే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ములానీ, శార్ధూల్ ఠాకూర్, మొహిత్ తలా వికెట్ సాధించారు.వేలంలో కాసుల వర్షం కురవనుందా?కాగా అయ్యర్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నాడు. దీంతో నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డా వేదికగా జరగనున్న వేలంలో అయ్యర్పై కాసుల వర్షం కురిసే అవకాశముంది. కాగా మెగా వేలానికి ముందు కోల్కతా నైట్రైడర్స్ అయ్యర్ను వేలంలోకి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా -
దేశవాళీ ధనాధన్కు అంతా సిద్ధం
న్యూఢిల్లీ: దేశవాళీ ధనాధన్ మెరుపుల ‘షో’కు రంగం సిద్ధమైంది. సాధారణంగా ఐపీఎల్ మెగా వేలానికి ముందే ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీని నిర్వహిస్తారు. దీంతో ప్లేయర్లకు ఫ్రాంచైజీలను ఆకర్షించే అవకాశం లభించేది. కానీ ఈసారి వేలానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఈ టి20 టోర్నీ శనివారం నుంచి దేశంలోని వివిధ నగరాల్లో (హైదరాబాద్, విశాఖపట్నం, విజయనగరం, రాజ్కోట్, ఇండోర్, ముంబై) జరగనుంది. ఠాకూర్ తిలక్ వర్మ సారథ్యంలో హైదరాబాద్ జట్టు ఈ టోర్నీలో పోటీపడనుంది. రాజ్కోట్లో నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్లో మేఘాలయ జట్టుతో హైదరాబాద్ తలపడుతుంది. ఉప్పల్ స్టేడియంలో ఈనెల 25న జరిగే గ్రూప్ ‘ఇ’ తొలి లీగ్ మ్యాచ్లో నాగాలాండ్ జట్టుతో ఆంధ్ర పోటీపడుతుంది. డిసెంబర్ 15వ తేదీన జరిగే ఫైనల్తో ఈ టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నీలో పాల్గొంటున్న మొత్తం 38 జట్లను ఐదు గ్రూప్లుగా విభజించారు. డిఫెండింగ్ చాంపియన్గా పంజాబ్ జట్టు ఉంది. బరిలో స్టార్ క్రికెటర్లు... భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా (బరోడా), మొహమ్మద్ షమీ (బెంగాల్), శ్రేయస్ అయ్యర్ (ముంబై), యుజువేంద్ర చహల్ (హరియాణా) తదితరులతో పాటు దేశవాళీ స్టార్లు అభిషేక్ పొరెల్ (బెంగాల్), షారుక్ ఖాన్ (తమిళనాడు), అభినవ్ మనోహర్ (కర్ణాటక), మానవ్ సుతార్ (రాజస్తాన్), కరుణ్ నాయర్ (విదర్భ), కృనాల్ పాండ్యా (బరోడా), దీపక్ హుడా (రాజస్తాన్) ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరిపించడానికి ‘సై’ అంటున్నారు. ఇందులో ఒక్క హార్దిక్ పాండ్యానే రిటెయిన్ ప్లేయర్ కాగా మిగతా వారంతా ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోవాలని... తమపై కోట్ల రూపాయాలు కురవాలని గంపెడాశలతో ఉన్నారు. వేలాన్ని పక్కన బెడితే ముస్తాక్ అలీ టోర్నీలో ఏటికేడు పోటీ పెరుగుతోంది. ఆటగాళ్లు తమ సత్తా చాటుకుంటున్నారు. గాయం నుంచి కోలుకున్నాక రంజీ బరిలో దిగిన వెటరన్ సీమర్ షమీ మధ్యప్రదేశ్పై నిప్పులు చెరిగాడు. 7 వికెట్లతో అదరగొట్టిన 34 ఏళ్ల సీమర్ తనలో ఇంకా పేస్ పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఆసీస్లో జరుగుతున్న బోర్డర్–గావస్కర్ ట్రోఫీకి ఎంపిక కాలేకపోయినా... ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్లో పేస్ షమీ ఆడే అవకాశాల్ని తోసిపుచ్చలేం. ఈ టి20 టోర్నీలోనూ ఫిట్నెస్ నిరూపించుకుంటే ఆసీస్ ఫ్లయిట్ ఎక్కడం దాదాపు ఖాయమవుతుంది. ఏ గ్రూప్లో ఎవరంటే... గ్రూప్ ‘ఎ’: హైదరాబాద్, మధ్యప్రదేశ్, బెంగాల్, మేఘాలయ, పంజాబ్, మిజోరం, బిహార్, రాజస్తాన్. గ్రూప్ ‘బి’: బరోడా, సిక్కిం, గుజరాత్, సౌరాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, తమిళనాడు, త్రిపుర. గ్రూప్ ‘సి: హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, హరియాణా, జమ్మూ కశ్మీర్, మణిపూర్, ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్. గ్రూప్ ‘డి’: ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, అస్సాం, విదర్భ, రైల్వేస్, ఒడిశా, చండీగఢ్. గ్రూప్ ‘ఇ’: ఆంధ్ర, నాగాలాండ్, కేరళ, ముంబై, గోవా, సర్వీసెస్, మహారాష్ట్ర. -
మహారాష్ట్ర కెప్టెన్గా రుతురాజ్
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2024 కోసం మహారాష్ట్ర జట్టును నిన్న (నవంబర్ 19) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా టీమిండియా ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. ఈ జట్టు అనుభవజ్ఞులు, యువకుల మేళవింపుగా ఉంది. అంకిత్ బవానే, రాహుల్ త్రిపాఠి, ముకేశ్ చౌదరీ లాంటి సీనియర్లు జట్టులో ఉన్నారు. నిఖిల్ నాయక్, ధన్రాజ్ షిండే వికెట్కీపర్లుగా ఎంపికయ్యారు. రాజవర్ధన్ హంగర్గేకర్, ప్రశాంత్ సోలంకి బౌలింగ్ విభాగంలో కీలకంగా ఉంటారు.ఈ టోర్నీలో మహారాష్ట్ర గ్రూప్-ఈలో ఉంది. ఈ గ్రూప్లో కేరళ, ముంబై, ఆంధ్రప్రదేశ్, గోవా, సర్వీసెస్, నాగాలండ్ లాంటి పటిష్ట జట్లు ఉన్నాయి. మహారాష్ట్ర తమ తొలి మ్యాచ్ను నవంబర్ 23న ఆనుంది. ఈ మ్యాచ్లో రుతురాజ్ సేన నాగాలాండ్తో తలపడుతుంది. ఈ టోర్నీలో మహారాష్ట్ర గతేడాది నాకౌట్ దశకు చేరలేకపోయింది. ఈసారి పటిష్ట జట్టు ఉండటంతో పాటు రుతురాజ్ సారథ్యం తోడవ్వడంతో మహారాష్ట్ర టైటిల్పై కన్నేసింది.కాగా, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఈసారి రసవత్తరంగా మారనుంది. ఈ ఎడిషన్లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు పలు జట్లను ముందుండి నడిపించనున్నారు. మహారాష్ట్రకు రుతురాజ్ సారథ్యం వహిస్తుండగా.. ముంబైకు శ్రేయస్ అయ్యర్, ఉత్తర్ప్రదేశ్కు భువనేశ్వర్ కుమార్, కేరళకు సంజూ శాంసన్, బరోడాకు కృనాల్ పాండ్యా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా (బరోడా), మొహమ్మద్ షమీ (బెంగాల్) లాంటి టీమిండియా స్టార్లు కూడా పాల్గొననున్నారు. ఈ టోర్నీ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 135 మ్యాచ్లు జరుగనున్నాయి.మహారాష్ట్ర జట్టు..రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అంకిత్ బవానే, అర్షిన్ కులకర్ణి, రాహుల్ త్రిపాఠి, నిఖిల్ నాయక్ (వికెట్కీపర్), ధన్రాజ్ షిండే (వికెట్కీపర్), దివ్యాంగ్ హింగనేకర్, విక్కీ ఓస్త్వాల్, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, అథర్వ కాలే, సిద్ధార్థ్ మాత్రే, సత్యజీత్ బచ్చవ్, రాజవర్ధన్ హంగర్గేకర్, అజీమ్ కాజీ, రుషబ్ రాథోడ్, సన్నీ పండిట్ -
Hardik Pandya: అన్న సారథ్యంలో తమ్ముడు
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ టోర్నీలో హార్దిక్ తన అన్న కృనాల్ పాండ్యా సారథ్యంలో బరోడా జట్టుకు ఆడనున్నాడు. తొలుత ప్రకటించిన 17 మంది సభ్యుల జట్టులో హార్దిక్ పేరు లేదు. అయితే హార్దిక్ స్వయంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడేందుకు ఆసక్తి కనబర్చాడని తెలుస్తుంది. జాతీయ జట్టుకు ఆడని సమయంలో దేశవాలీ క్రికెట్లో ఆడతానని హార్దిక్ బీసీసీఐకి చెప్పాడట. దీంతో బరోడా క్రికెట్ అసోసియేషన్ హార్దిక్ను తమ జట్టులో చేర్చుకుంది. సహజంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి 18 మంది సభ్యుల జట్టును ప్రకటిస్తారు. తాజాగా హార్దిక్ చేరికతో బరోడా టీమ్ సంఖ్య 18కి పెరిగింది. ముస్తాక్ అలీ టోర్నీలో బరోడా గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్లో బరోడాతో పాటు తమిళనాడు, గుజరాత్, ఉత్తరాఖండ్, కర్ణాటక, సిక్కిం, త్రిపుర జట్లు ఉన్నాయి. హార్దిక్ త్వరలో ఇండోర్లో జరిగే ట్రైనింగ్ క్యాంప్లో బరోడా జట్టుతో జాయిన్ అవుతాడు. బరోడా తమ టోర్నీ తొలి మ్యాచ్లో గుజరాత్తో తలపడనుంది. ఈ మ్యాచ్ శనివారం (నవంబర్ 23) జరుగుతుంది.కాగా, హార్దిక్ ఇటీవల దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత టీ20 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. నాలుగు మ్యాచ్ల ఈ సిరీస్లో హార్దిక్ 59 పరుగులు చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్ను భారత్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది.ముంబై ట్రైనింగ్ క్యాంప్లోన కనిపించిన హార్దిక్హార్దిక్ దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన వెంటనే నవీ ముంబైలోని ఏర్పాటు చేసిన ముంబై ఇండియన్స్ ట్రైనింగ్ సెషన్స్లో కనపడ్డాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్మీడియాలో వైరలయ్యాయి.బరోడా జట్టుకు బూస్టప్హార్దిక్ చేరికతో బరోడా జట్టు బలపడింది. ఈ టోర్నీలో ఆ జట్టు విజయావకాశాలు మరింత మెరుగయ్యాయి. హార్దిక్ ఎనిమిదేళ్ల తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొంటున్నాడు. -
కెప్టెన్గా భువనేశ్వర్ కుమార్
దేశవాలీ క్రికెట్ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కోసం ఉత్తర్ప్రదేశ్ జట్టును ఇవాళ (నవంబర్ 18) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ను ఎంపిక చేశారు. ఈ జట్టులో టీమిండియా ఆటగాళ్లు రింకూ సింగ్, నితీశ్ రాణా, పియూశ్ చావ్లా, శివమ్ మావికి చోటు దక్కింది. ఈ జట్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సోదరుడు కార్తికేయ జైస్వాల్ కూడా ఉన్నాడు. ఈ టోర్నీలో భువీకి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) మాధవ్ కౌశిక్ వ్యవహరిస్తాడు.టోర్నీ విషయానికొస్తే.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2024-25 నవంబర్ 23 నుంచి మొదలవుతుంది. 38 జట్లు పాల్గొనే ఈ టోర్నీ దేశంలోని 12 వేర్వేరు వేదికలపై జరుగనుంది. డిసెంబర్ 15న జరిగే ఫైనల్తో ఈ టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నీలో ఉత్తర్ప్రదేశ్ గ్రూప్-సిలో ఉంది. ఈ గ్రూప్లో యూపీతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, మణిపూర్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్, జార్ఖండ్ జట్లు ఉన్నాయి. ఉత్తర్ప్రదేశ్ తమ తొలి మ్యాచ్ను నవంబర్ 23న ఆడనుంది. ఆ రోజు జరిగే మ్యాచ్లో యూపీ ఢిల్లీని ఢీకొట్టనుంది.కెప్టెన్గా భువనేశ్వర్ కుమార్ విషయానికొస్తే.. భువీకి ఐపీఎల్లో కెప్టెన్గా పని చేసిన అనుభవం ఉంది. భువీ ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు సారధిగా వ్యవహరించాడు. భువీ ఎనిమిది మ్యాచ్ల్లో ఆరెంజ్ ఆర్మీని నాయకత్వం వహించాడు. ఇందులో ఆరెంజ్ ఆర్మీ రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించి, ఆరింట ఓడింది.సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ కోసం ఉత్తర్ప్రదేశ్ జట్టు..భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), మాధవ్ కౌశిక్ (వైస్ కెప్టెన్), కరణ్ శర్మ, రింకూ సింగ్, నితీశ్ రాణా, సమీర్ రిజ్వి, స్వస్తిక్ చికార, ప్రియమ్ గార్గ్, ఆర్యన్ జుయల్, పియూశ్ చావ్లా, విప్రాజ్ నిగమ్, కార్తికేయ జైస్వాల్, శివమ్ శఱ్మ, యవ్ దయాల్, మొహిసిన్ ఖాన్, ఆకిబ్ ఖాన్, శివమ్ మావి, వినీత్ పన్వర్ -
SMT 2024: ముంబై జట్టు ప్రకటన.. పృథ్వీ షా, రహానేలకు చోటు
దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్నాడు. ఈ నెల 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరగనున్న ఈ ట్రోఫీ కోసం ముంబై క్రికెట్ సంఘం ఆదివారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. రంజీ ట్రోపీలో ముంబై జట్టుకు సారథ్యం వహించిన అజింక్యా రహానేతో పాటు... ఫిట్నెస్ లేమితో పాటు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడి రంజీ జట్టులో చోటు కోల్పోయిన ఓపెనర్ పృథ్వీ షా కూడా ముస్తాక్ అలీ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత టెస్టు జట్టులో సుస్థిర స్థానం సాధించాలనుకుంటున్న శ్రేయస్ అయ్యర్ ప్రస్తుత రంజీ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు.తాజా సీజన్లో అయ్యర్ 90.40 సగటుతో 452 పరుగులు సాధించాడు. అందులో ఒక డబుల్ సెంచరీ, మరో సెంచరీ ఉంది. ఇక ఇటీవల ఆస్ట్రేలియా–‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తనుశ్ కోటియాన్, పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్, సిద్ధేశ్ లాడ్, యువ ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ ముంబై జట్టులో చోటు దక్కించుకున్నారు. ముంబై జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, అంగ్క్రిష్ రఘువంశీ, జయ్ బిస్తా, అజింక్యా రహానే, సిద్ధేశ్ లాడ్, సూర్యాన్ష్ షెడ్గె, సాయిరాజ్ పాటిల్, హార్దిక్ తమోర్, ఆకాశ్ ఆనంద్, షమ్స్ ములానీ, హిమాన్షు సింగ్, తనుశ్ కోటియాన్, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, రోస్టన్ డియాస్, జునేద్ ఖాన్.చదవండి: కోహ్లిపై ఒత్తిడి పెంచండి! -
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా పంజాబ్..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023 విజేతగా పంజాబ్ జట్టు నిలిచింది. సోమవారం మొహాలీ వేదికగా జరిగిన ఫైనల్లో బరోడాను ఓడించిన పంజాబ్.. తొలిసారి టైటిల్ను ముద్దాడింది. 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 203 పరుగులు మాత్రమే చేయగల్గింది. బరోడా బ్యాటర్లలో అభిమన్యు సింగ్(61), కెప్టెన్ కృనాల్ పాండ్యా(45) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 4 వికెట్లతో అదరగొట్టగా.. కౌల్, బ్రార్, మార్కండే తలా వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్లో అన్మోల్ప్రీత్ సింగ్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. 61 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 113 పరుగులు చేశాడు. అతడితో పాటు వాదేరా(61) పరుగులతో ఆఖరిలో అదరగొట్టాడు. అతడి ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 61 పరుగులు చేశాడు. బరోడా బౌలర్లలో కృనాల్ పాండ్యా, సోపారియా, సేథ్ చెరో వికెట్ పడగొట్టారు. -
ముంబైకు చుక్కెదురు
ముల్లన్పూర్ (చండీగఢ్): సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు కథ క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బరోడా జట్టు మూడు వికెట్ల తేడాతో ముంబైను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ముందుగా ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులు చేసింది. శివమ్ దూబే (36 బంతుల్లో 48; 1 ఫోర్, 3 సిక్స్లు), సర్భరాజ్ ఖాన్ (22 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. అనంతరం బరోడా జట్టు 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి నెగ్గింది. విష్ణు సోలంకి (30 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) బరోడా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో ఉత్తరప్రదేశ్పై, ఢిల్లీ 39 పరుగుల తేడాతో విదర్భ జట్టుపై, కేరళ జట్టుపై అస్సాం ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ చేరుకున్నాయి. -
మరీ అంత అతి పనికిరాదు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి! పరాగ్పై ట్రోల్స్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అస్సాం కెప్టెన్ రియాన్ పరాగ్ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం బెంగాల్తో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో తన హాఫ్ సెంచరీతో మార్క్ను అందుకున్నాడు. అస్సాం విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా టోర్నీలో ఇది పరాగ్కు 7వ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. ఇప్పటివరకు ఆడిన 8 ఇన్నింగ్స్లలో పరాగ్ 490 పరుగులు చేశాడు. తన కెరీర్లోనే భీకర ఫామ్లో ఉన్న పరాగ్పై ఒకవైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే.. మరోవైపు విమర్శల వర్షం కురుస్తోంది. ఏం జరిగిందంటే? బెంగాల్తో మ్యాచ్లో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకోగానే పరాగ్ తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. అయితే అతడి సెలబ్రేషన్స్ శృతి మించాయి. ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లను పరాగ్ అవమానపరిచాడు. హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే పరాగ్ డ్రెస్సింగ్ రూమ్ వైపూ చూస్తూ.. "నేనే అందరికంటే తోపు, నన్నే అపేవారు ఇక్కడ లేరంటూ" సైగలు చేశాడు. దీంతో పరాగ్విమర్శకులకు మరోసారి తోవనిచ్చాడు.. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పటికే చాలా సార్లు పరాగ్ ట్రోల్స్కు గురైన సంగతి తెలిసిందే. ఓవరాక్షన్ స్టార్ అంటూ అభిమానులు ఓ ట్యాగ్ కూడా ఇచ్చేసారు. చదవండి: World cup 2023: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. మ్యాక్స్వెల్కు ప్రమాదం! తలకు తీవ్ర గాయం Celebration by Riyan Parag after his 7th consecutive 50 in T20 Cricket.pic.twitter.com/Z6PitN1XYc — Riyan Parag FC (@riyanparagfc_) October 31, 2023 Riyan Parag celebration myan 😭😭😭. He fucking just said, these guy's aren't on my level. I am fucking couple level ahead of them 😭😭😭 Proper Chad pic.twitter.com/Gd8fbECfM7 — HS27 (@Royal_HaRRa) October 31, 2023 -
హ్యాట్రిక్ వికెట్లు తీసిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెన్నై సూపర్ కింగ్స్ పేసర్, ముంబై ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్పాండే తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం మిజోరాంతో జరిగిన మ్యాచ్లో దేశ్పాండే హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. మిజోరాం బ్యాటర్లు వికాష్ కుమార్, జెహూ ఆండర్సన్, జోసెఫ్ లాల్థాన్ఖుమాను ఔట్ చేసిన దేశ్పాండే.. హ్యాట్రిక్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 3.3 ఓవర్లు బౌలింగ్ చేసిన తుషార్ 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన దేశ్పాండే 15 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మిజోరాం ముంబై బౌలర్ల ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 76 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో దేశ్పాండేతో పాటు రాయ్స్టన్ డయాస్, మోహిత్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం 77 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 6 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోయి ఛేదించింది. ముంబై బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(46 నాటౌట్) మ్యాచ్ను ఫినిష్ చేశాడు. చదవండి: World Cup 2023: మరీ ఇంత బద్దకమా? క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రనౌట్.. వీడియో వైరల్ -
తిలక్ వర్మ కెప్టెన్సీ అదుర్స్.. ముంబైకి ఊహించని షాక్
Syed Mushtaq Ali Trophy 2023- Hyderabad won by 23 runs: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు సంచలనం సృష్టించింది. రహానే సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టును తిలక్ వర్మ కెప్టెన్సీలోని హైదరాబాద్ జట్టు 23 పరుగుల తేడాతో ఓడించింది. ఈ టోర్నీలో హైదరాబాద్కిది ఐదో విజయం. జైపూర్లో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (46 బంతుల్లో 59; 3 ఫోర్లు, 3 సిక్స్లు), రాహుల్ సింగ్ (26 బంతుల్లో 37; 4 ఫోర్లు), చందన్ సహని (23 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. కెప్టెన్ తిలక్ వర్మ (6), రోహిత్ రాయుడు (8) తక్కువ స్కోరుకే అవుటయ్యారు. అనంతరం 156 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు చేసి ఓడిపోయింది. మీడియం పేసర్ రవితేజ 32 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... తిలక్ వర్మ 2 వికెట్లు తీసి ముంబై జట్టును దెబ్బ కొట్టారు. ప్రస్తుతం ముంబై, హైదరాబాద్, బరోడా జట్లు 20 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. చదవండి: BCCI: టీమిండియా హెడ్కోచ్గా రాజస్తాన్ రాయల్స్ మాజీ కోచ్ -
చెలరేగిన భువనేశ్వర్ కుమార్.. 9 బంతుల్లో 5 వికెట్లు
జాతీయ జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. దేశీవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తర ప్రదేశ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న భువీ నిప్పలు చేరుగుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్లో భువనేశ్వర్ 5వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో 3.3 ఓవర్లు వేసిన భువనేశ్వర్ కేవలం 16 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తొలి రెండు ఓవర్లలో వికెట్లు సాధించికపోయిన భువీ.. డెత్ ఓవర్లలో 9 బంతుల్లో 5 వికెట్లు తీశాడు. 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక.. భువీ దాటికి 156 పరుగులకు ఆలౌటైంది. భువీతో పాటు యశ్ దయాల్ రెండు వికెట్లు సాధించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యూపీ బ్యాటర్లలో గోస్వామి(77), నితీష్ రానా(40) పరుగులతో రాణించారు. చదవండి: World Cup 2023: ఓటమి బాధతో బాబర్ ఏడ్చాడు.. తప్పు అతనొక్కడిదే కాదు: పాకిస్తాన్ లెజెండ్ -
రుత్రాజ్ విధ్వంసకర శతకం.. కేవలం 51 బంతుల్లోనే
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో టీమిండియా ఓపెనర్, మహారాష్ట్ర ఆటగాడు రుత్రాజ్ గైక్వాడ్ తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా బుధవారం విదర్భతో జరిగిన మ్యాచ్లో రుత్రాజ్ మెరుపు శతకంతో చెలరేగాడు. కేవలం 51 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్ 102 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 11 ఫోర్లు, 6 సిక్స్లు ఉన్నాయి. గైక్వాడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా 178 పరుగుల టార్గెట్ను మహారాష్ట్ర.. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 16.1 ఓవర్లలో ఛేదించింది. గైక్వాడ్తో పాటు కెప్టెన్ కేదార్ జాదవ్(42) పరుగులతో రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. విదర్భ బ్యాటర్లలో ధ్రువ్ షోరే(62) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మహారాష్ట్ర బౌలర్లలో సత్యజిత్ బాచావ్ 4 వికెట్లు పడగొట్టగా.. సొలాంకి రెండు, దాదే, ఖాజీ, జాదవ్ తలా వికెట్ సాధించారు. చదవండి: WC 2023: నాకు మరీ ఎక్కువ రెస్ట్ ఇచ్చేశారు.. సెలక్టర్లపై సెంచరీ ‘హీరో’ విసుర్లు -
వరల్డ్కప్కు మిస్సయ్యాడు.. కానీ అక్కడ మాత్రం విధ్వంసం! కేవలం 27 బంతుల్లోనే
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా వన్డే ప్రపంచకప్-2023కు దూరమైన సంగతి తెలిసిందే. తొలుత ప్రకటించిన ప్రిలిమనరీ జట్టులో సభ్యునిగా ఉన్న అక్షర్.. టోర్నీ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కలేదు. వరల్డ్కప్కు దూరమైన అక్షర్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ప్రస్తుతం జరగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ జట్టు తరుపున అక్షర్ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అక్షర్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 27 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 52 పరగులు చేశాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 234 పరుగుల భారీ లక్ష్య చేధనలో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 197 పరుగులు మాత్రమే చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ(112) సెంచరీతో చెలరేగాడు. చదవండి: World Cup 2023: ఇంగ్లండ్తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్! -
తిలక్ వర్మ సెంచరీ వృథా
జైపూర్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జోరుకు బ్రేక్ పడింది. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో గెలిచి దూసుకెళ్తున్న హైదరాబాద్కు తొలి పరాజయం ఎదురైంది. బరోడా జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ (69 బంతుల్లో 121 నాటౌట్; 16 ఫోర్లు, 4 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి అజేయ సెంచరీతో అలరించాడు. అనంతరం బరోడా జట్టు 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బరోడా జట్టును కెపె్టన్ కృనాల్ పాండ్యా (36 బంతుల్లో 64 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్), విష్ణు సోలంకి (37 బంతుల్లో 71 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్లు) అజేయ అర్ధ సెంచరీలతో గెలిపించారు. వీరిద్దరు ఐదో వికెట్కు 70 బంతుల్లో 138 పరుగులు జోడించడం విశేషం. -
తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీ..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టీమిండియా యువ ఆటగాడు, హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. జైపూర్ వేదికగా బరోడాతో జరుగుతున్న మ్యాచ్లో తిలక్ వర్మ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. బరోడా బౌలర్లకు తిలక్ చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్లో కేవలం 69 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్స్లతో 121 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తిలక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కాగా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన తిలక్ వర్మ 271 పరుగులతో.. టాప్-2 రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. కాగా ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘ఎ’లో హైదరాబాద్ ప్రస్తుతం 16 పాయింట్లతో ముంబై జట్టుతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. చిన్న చిన్న తప్పులు సహజం! అతడొక మాస్టర్ క్లాస్: రోహిత్ శర్మ -
ఆంధ్రను గెలిపించిన భరత్, అశ్విన్
రాంచీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు ఖాతాలో వరుసగా రెండో విజయం చేరింది. గుజరాత్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్లో ఆంధ్ర జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ 19.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఆర్య దేశాయ్ (35 బంతుల్లో 62 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్లు) మెరుపు అర్ధ సెంచరీ చేశాడు. ఆంధ్ర బౌలర్లు స్టీఫెన్ (3/25), కావూరి సాయితేజ (2/45), కేవీ శశికాంత్ (2/22), మనీశ్ (2/47) గుజరాత్ జట్టును దెబ్బ తీశారు. అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 17.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెపె్టన్ కోన శ్రీకర్భరత్ (41 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్స్లు), అశి్వన్ హెబ్బర్ (36 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి తొలి వికెట్కు 10.2 ఓవర్లలో 87 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక విహారి (16 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు), రికీ భుయ్ (13 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు) ఆంధ్ర జట్టును విజయతీరానికి చేర్చారు. నేడు జరిగే తమ తదుపరి మ్యాచ్లో మణిపూర్ జట్టుతో ఆంధ్ర ఆడుతుంది. -
హైదరాబాద్కు నాలుగో విజయం
జైపూర్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు విజయపరంపర కొనసాగుతోంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా మిజోరం జట్టుతో జరిగిన మ్యాచ్లో తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచి ఈ టోరీ్నలో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన మిజోరం సరిగ్గా 20 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. అగ్ని చోప్రా (16 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్లు), జోసెఫ్ లాథన్కుమా (20 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. హైదరాబాద్ బౌలర్లు రవితేజ (3/30), సీవీ మిలింద్ (2/18), చింతల రక్షణ్ రెడ్డి (2/20) మిజోరం జట్టును కట్టడి చేశారు. 115 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 15.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ రాయుడు (31 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ తిలక్ వర్మ (24 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడి హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘ఎ’లో హైదరాబాద్ ప్రస్తుతం 16 పాయింట్లతో ముంబై జట్టుతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. నేడు జరిగే తదుపరి మ్యాచ్లో బరోడా జట్టుతో హైదరాబాద్ తలపడుతుంది. -
హడలెత్తించిన రవితేజ
జైపూర్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. ఛత్తీస్గఢ్తో గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్కు దిగిన ఛత్తీస్గఢ్ జట్టును హైదరాబాద్ మీడియం పేసర్ టి.రవితేజ హడలెత్తించాడు. రవితేజ కేవలం 13 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. సీవీ మిలింద్ (2/16), తనయ్ త్యాగరాజన్ (2/16) కూడా రాణించడంతో ఛత్తీస్గఢ్ 19.1 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌటైంది. శశాంక్ సింగ్ (47 బంతుల్లో 51; 5 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం హైదరాబాద్ 16 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 98 పరుగులు చేసి గెలిచింది. తన్మయ్ అగర్వాల్ (15 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ రాయుడు (10 బంతుల్లో 14; 2 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (13 బంతుల్లో 11; 1 ఫోర్), చందన్ సహని (22 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్లు), రాహుల్ సింగ్ (33 బంతుల్లో 25 నాటౌట్) రాణించారు. హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్లో 21న మిజోరం జట్టుతో ఆడుతుంది. -
షేక్ రషీద్ అజేయ శతకం
రాంచీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు తొలి విజయం నమోదు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్లో ఆంధ్ర 145 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత ఆంధ్ర జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసింది. షేక్ రషీద్ (54 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్స్లు) అరుణాచల్ బౌలర్లపై విరుచుకుపడి అజేయ సెంచరీ చేశాడు. హనుమ విహారి (32 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. రికీ భుయ్ (10 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్లు), కరణ్ షిండే (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా ధాటిగా ఆడారు. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అరుణాచల్ ప్రదేశ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసి ఓడిపోయింది. ఆంధ్ర జట్టు బౌలర్లలో స్టీఫెన్ (3/10), కేవీ శశికాంత్ (2/2) రాణించారు. ఆంధ్ర తమ తదుపరి మ్యాచ్ను ఈనెల 21న గుజరాత్తో ఆడుతుంది. -
ఆంధ్ర ఆటగాడి వీరోచిత పోరాటం.. భారీ లక్ష్య ఛేదనలో శతక్కొట్టుడు
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2023లో భాగంగా పంజాబ్తో నిన్న (అక్టోబర్ 17) జరిగిన మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు రికీ భుయ్ వీరోచితంగా పోరాడాడు. భారీ లక్ష్య ఛేదనలో భుయ్ అజేయ శతకంతో (52 బంతుల్లో 104; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరిశాడు. అతనికి మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో ఈ మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. అభిషేక్ శర్మ (51 బంతుల్లో 112; 9 ఫోర్లు, 9 సిక్సర్లు), అన్మోల్ప్రీత్ సింగ్ (26 బంతుల్లో 87; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 275 పరుగుల భారీ స్కోర్ చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్గా రికార్డుల్లోకెక్కింది. అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఆంధ్రప్రదేశ్.. పంజాబ్ బౌలర్లు హర్ప్రీత్ బ్రార్ (4-1-18-3), సిద్దార్థ్ కౌల్ (2/40), అర్షదీప్ సింగ్ (1/37), ప్రేరిత్ దత్తా (1/25) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది. ఆంధ్ర ఇన్నింగ్స్లో రికీ భుయ్ (104 నాటౌట్) ఒక్కడే ఒంటిపోరాటం చేసి శతక్కొట్టగా.. అశ్విన్ హెబ్బర్ (17), త్రిపురన విజయ్ (23) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
SMAT 2023: అరంగేట్రంలోనే ఐదు వికెట్లతో చెలరేగిన కేకేఆర్ బౌలర్
కోల్కతా నైట్రైడర్స్ బౌలర్ సుయాశ్ శర్మ.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2023లో ఢిల్లీ తరఫున తన అరంగేట్రం మ్యాచ్లోనే చెలరేగిపోయాడు. మధ్యప్రదేశ్తో ఇవాళ (అక్టోబర్ 17) జరుగుతున్న మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసిన సుయాశ్.. కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో సుయాశ్తో పాటు ఇషాంత్ శర్మ (4-0-29-2), హర్షిత్ రాణా (4-0-22-2) కూడా రాణించడంతో ఢిల్లీ టీమ్ మధ్యప్రదేశ్ను 115 పరుగులకు (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. ఈ మ్యాచ్లో మధ్యప్రదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ఒక్కరు కూడా పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. సుయాశ్.. మధ్యప్రదేశ్ పతనాన్ని శాసించాడు. గుర్తింపు కలిగిన ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్ (2), రజత్ పాటిదార్ (7) నిరాశపర్చగా.. శుభమ్ శర్మ (10), సాగర్ సోలంకి (13), రాకేశ్ ఠాకూర్ (15), రాహుల్ బాథమ్ (32), అర్షద్ ఖాన్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ విజయం దిశగా సాగుతుంది. ఆ జట్టు 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. ప్రియాంశ్ ఆర్య (22), అనూజ్ రావత్ (23), యశ్ ధుల్ (0) ఔట్ కాగా.. అయుశ్ బదోని (20), హిమ్మత్ సింగ్ (9) క్రీజ్లో ఉన్నారు. కాగా, ఢిల్లీ బౌలర్ సుయాశ్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్తో క్యాష్ రిచ్ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో 11 మ్యాచ్లు ఆడిన సుయాశ్ 8.23 సగటున 10 వికెట్లు పడగొట్టాడు. -
హైదరాబాద్ను గెలిపించిన తిలక్ వర్మ.. వరుసగా రెండో మ్యాచ్లో..!
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2023లో టీమిండియా అప్ కమింగ్ ఆటగాడు తిలక్ వర్మ (హైదరాబాద్ కెప్టెన్) సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈ టోర్నీలో నిన్న జరిగిన మ్యాచ్లో (మేఘాలయ) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (31 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడిన తిలక్.. జమ్ము అండ్ కశ్మీర్తో ఇవాళ (అక్టోబర్ 17) జరిగిన మ్యాచ్లోనూ అచ్చం అలాంటి ఇన్నింగ్సే ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇవాల్టి మ్యాచ్లో 43 బంతులు ఎదుర్కొన్న తిలక్ 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జమ్ము అండ్ కశ్మీర్.. శుభమ్ పుండిర్ (58) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ, మిలింద్, చింట్ల రక్షణ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అనికేత్ రెడ్డి ఓ వికెట్ దక్కించకున్నాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్.. తిలక్ వర్మతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా తలో చేయి వేయడంతో 18.3 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. తన్మయ్ అగర్వాల్ (20), రోహిత్ రాయుడు (38), రాహుల్ సింగ్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి రాణించారు. జమ్ము అండ్ కశ్మీర్ బౌలర్లలో యుద్ద్వీర్ సింగ్, సాహిల్ లోత్రా తలో వికెట్ పడగొట్టారు. -
రఫ్ఫాడించిన రహానే.. విధ్వంసం సృష్టించిన రుతురాజ్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023 తొలి రోజు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ల హవా కొనసాగింది. హర్యానాతో జరిగిన మ్యాచ్లో అజింక్య రహానే (ముంబై కెప్టెన్), బెంగాల్తో జరిగిన మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ (మహారాష్ట్ర) చెలరేగిపోయారు. హర్యానాతో జరిగిన మ్యాచ్లో రహానే 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 76 పరుగులు చేయగా.. బెంగాల్తో మ్యాచ్లో రుతురాజ్ 40 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు సీఎస్కే బ్యాటర్లు మెరుపు అర్ధశతకాలు సాధించి, తమతమ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషించారు. బెంగాల్-మహారాష్ట్ర మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. రుతురాజ్, కేదార్ జాదవ్ (40 నాటౌట్) రాణించడంతో మహారాష్ట్ర 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ముంబై-హర్యానా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. భారత బౌలర్ హర్షల్ పటేల్ ఈ మ్యాచ్లో హర్యానా ఓపెనర్గా బరిలోకి దిగి 38 పరుగులు చేశాడు. హర్యానా ఇన్నింగ్స్లో అంకిత్ (36), నిషాంత్ సంధు (30 నాటౌట్) పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లు తనుశ్ కోటియన్ (3-0-19-3), మోహిత్ అవస్తి (3-0-15-2) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు. అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రహానే, శివమ్ దూబే (26 నాటౌట్) రాణించడంతో 15.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ముంబై ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (12) మూడు ఫోర్లు బాది ఇన్నింగ్స్ను ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత ఔటయ్యాడు. హర్యానా బౌలర్లలో యుజ్వేంద్ర చహల్, అన్షుల్ తలో వికెట్ పడగొట్టారు. -
నిరాశపరిచిన సంజూ శాంసన్.. కేరళ ఘన విజయం
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023ను కేరళ జట్టు విజయంతో ఆరంభించింది. ముంబై వేదికగా హిమాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో 35 పరుగుల తేడాతో కేరళ విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కేరళ బ్యాటర్లలో విష్ణు వినోద్(44) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. సచిన్ బేబీ(30), నైజర్(23) పరుగులతో రాణించారు. నిరాశపరిచిన సంజూ.. ఫామ్ లేమితో భారత సీనియర్ జట్టులో చోటు కోల్పోయిన వికెట్ కీపర్ బ్యాటర్, కేరళ కెప్టెన్ సంజూ శాంసన్.. హిమాచల్ ప్రదేశ్తో మ్యాచ్లో తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో శాంసన్ కేవలం ఒక్కపరుగు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. హిమాచల్ బౌలర్ ముకల్ నేగీ బౌలింగ్లో సంజూ ఔటయ్యాడు. చెలరేగిన వినోద్ కుమార్, శ్రేయస్ గోపాల్.. ఇక 164 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన హిమాచల్ ప్రదేశ్ 128 పరుగులకు ఆలౌటైంది. కేరళ బౌలర్లలో వినోద్ కుమార్, శ్రేయస్ గోపాల్ తలా 4 వికెట్లతో హిమాచల్ పతనాన్ని శాసించారు. హిమాచల్ ప్రదేశ్ బ్యాటర్లలో నికిల్ గంగటా(42) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: SMT 2023: 3 వికెట్లు పడగొట్టిన అర్జున్ టెండూల్కర్.. పోరాడి ఓడిన ఆంధ్ర -
తిలక్ వర్మకు బంపరాఫర్.. ఏకంగా జట్టు కెప్టెన్గా ప్రమోషన్
దేశవాళీ జాతీయ టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును ప్రకటించారు. భారత యువ క్రికెటర్ తిలక్ వర్మకు తొలిసారి హైదరాబాద్ జట్టు పగ్గాలు అప్పగించారు. తిలక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవలే జరిగిన ఆసియా క్రీడల్లో తిలక్ దుమ్మురేపాడు. అంతకుముందు తను అరంగేట్రం చేసిన వెస్టిండీస్ సిరీస్లో తిలక్ అకట్టుకున్నాడు. ఈ క్రమంలో జట్టు కెప్టెన్సీ బాధ్యతలను తిలక్కు హెచ్సీఏ అప్పగించింది. ఈ టోర్నీ అక్టోబర్ 16 నుంచి దేశంలోని వివిధ నగరాల్లో జరుగుతుంది. ఈ టోర్నీలో అజింక్యా రహానే, రింకూ సింగ్, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగం కానున్నారు. హైదరాబాద్ టీ20 జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), సీవీ మిలింద్ (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, రాహుల్ సింగ్, రాహుల్ బుద్ది, రాహుల్ రాధేశ్, రోహిత్ రాయుడు, చందన్ సహని, భవేశ్ సేథ్, రవితేజ, రక్షణ్ రెడ్డి, సంకేత్, తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి, షౌనక్ కులకర్ణి, అమన్ రావు. చదవండి: WC 2023: చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్లు.. ఆసీస్కు ఘోర పరాభవం! వరుసగా రెండో ఓటమి -
WC 2023: చోటు ఆశించి భంగపడ్డ సంజూ.. టీ20 జట్టు కెప్టెన్గా..
Sanju Samson: వన్డే ప్రపంచకప్-2023 జట్టులో చోటు ఆశించి భంగపడిన టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ దేశవాళీ క్రికెట్పై దృష్టి సారించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో కేరళ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నమెంట్లో సంజూకు రోహన్ కన్నుమ్మాళ్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. కాగా అక్టోబరు 16 నుంచి నవంబరు 6 వరకు ఈ ఈవెంట్ జరుగనుంది. ఇందులో భాగంగా గ్రూప్-బిలో ఉన్న కేరళ ముంబైలో హిమాచల్ ప్రదేశ్ జట్టుతో తొలి మ్యాచ్లో తలపడనుంది. ఆసియా కప్-2023లో బ్యాకప్ ప్లేయర్గా ఇక ఈ గ్రూపులో కేరళ, హిమాచల్ ప్రదేశ్తో పాటు సిక్కిం, అసోం, బిహార్, చండీగఢ్, ఒడిశా, సర్వీసెస్ టీమ్లు పోటీపడనున్నాయి. కాగా ఆసియా వన్డే కప్-2023లో సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు బ్యాకప్గా ఎంపికైన సంజూ శాంసన్.. రాహుల్ పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వన్డే వరల్డ్కప్ జట్టు ఎంపిక సమయంలోనూ బీసీసీఐ సెలక్టర్లు సంజూను పక్కనపెట్టేశారు. 50 ఓవర్ల ఫార్మాట్లో మెరుగైన రికార్డు ఉన్న ఈ కేరళ వికెట్ కీపర్ను కాదని.. ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేశారు. సూర్యకు పెద్దపీట.. మేనేజ్మెంట్ అండదండలు వన్డేల్లో వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకున్న ఈ నంబర్ 1 టీ20 బ్యాటర్ కోసం సంజూను బలిచేశారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో సిరీస్లో వరుస అర్ధ శతకాలతో రాణించిన సూర్యకు మేనేజ్మెంట్ అండగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషం(సెప్టెంబరు 28వరకు జట్టులో మార్పులకు అవకాశం ఉన్న నేపథ్యంలో)లోనైనా అద్భుతం జరుగుతుందని ఆశించిన సంజూ శాంసన్ అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ క్రమంలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీతో సంజూ తిరిగి మైదానంలో దిగనున్నాడు. దేశవాళీ టీ20 జట్టు కెప్టెన్గా మరోసారి ఇక ఈ టీ20 ఈవెంట్ కోసం కేరళ పద్దెనిమిది మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. గత నెలలో కర్ణాటక టీమ్ నుంచి వైదొలిగిన ఆల్రౌండర్ శ్రేయస్ గోపాల్ ఈసారి కేరళకు ఆడనున్నాడు. స్పిన్ దళానికి అతడు నాయకత్వం వహించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో కేరళ జట్టుకు ఈ సీజన్లో తమిళనాడు మాజీ క్రికెటర్ ఎం.వెంకటరమణ హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీకి కేరళ జట్టు: సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రోహన్ కన్నుమ్మాళ్ (వైస్ కెప్టెన్), శ్రేయస్ గోపాల్, జలజ్ సక్సేనా, సచిన్ బేబీ, మహ్మద్ అజారుద్దీన్, విష్ణు వినోద్, అబ్దుల్ బాసిత్, సిజోమోన్ జోసెఫ్, వైశాఖ్ చంద్రన్, బాసిల్ థంపి, కేఎం ఆసిఫ్, వినోద్ కుమార్, మను కృష్ణన్, వరుణ్ నయనార్, ఎం. అజ్నాస్, పీకే మిథున్, సల్మాన్ నిసార్. చదవండి: WC 2023- Ind vs Pak: అతడి బ్యాటింగ్ అంతగొప్పగా ఏమీ ఉండదు.. షమీని ఆడించండి! 👉 సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
కెప్టెన్గా వాషింగ్టన్ సుందర్.. జట్టులో ఐపీఎల్ స్టార్లు!
Syed Mushtaq Ali Trophy 2023-24: టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ దేశవాళీ టీ20 క్రికెట్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023-24 సీజన్కు గానూ తమిళనాడు జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇందుకు సంబంధించి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రకటన చేసింది. వాషీకి సాయి సుదర్శన్ డిప్యూటీగా వ్యవహరిస్తాడని పేర్కొంది. ఈ మేరకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగమయ్యే 15 మంది ఆటగాళ్ల పేర్లను బుధవారం వెల్లడించింది. కాగా అక్టోబరు 16 నుంచి ఈ దేశవాళీ టీ20 టోర్నమెంట్ ఆరంభం కానుంది. ఈ పొట్టి ఫార్మాట్లో ఈవెంట్ చరిత్రలో తమిళనాడుకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటి వరకు మూడుసార్లు ట్రోఫీ గెలిచిన ఘనత తమిళనాడు సొంతం. తాజా సీజన్లో వాషింగ్టన్ సుందర్ సారథ్యంలో సాయి సుదర్శన్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ సేన్, నారాయణ్ జగదీశన్, విజయ్ శంకర్, షారుఖ్ ఖాన్, టి.నటరాజన్ తదితర ఐపీఎల్ స్టార్లు ఆడనున్నారు. కాగా వన్డే వరల్డ్కప్-2023 జట్టులో సుందర్కు స్థానం దక్కలేదన్న విషయం తెలిసిందే. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా అతడి స్థానంలో చెన్నై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో పోటీ పడ్డ వాషీకి మొండిచేయి ఎదురైంది. అనుభవానికి పెద్దపీట వేసిన బీసీసీఐ సెలక్టర్లు అశూ వైపే మొగ్గుచూపారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023 తమిళనాడు జట్టు: వాషింగ్టన్ సుందర్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), నారాయణ్ జగదీశన్, విజయ్ శంకర్, సి హరి నిశాంత్, జి.అజితేష్, బాబా అపరాజిత్, ఆర్. సంజయ్ యాదవ్, ఎం. మహ్మద్, ఆర్.సాయి కిషోర్, వరుణ్ చక్రవర్తి, టి. నటరాజన్, కుల్దీప్ సేన్, సందీప్ వారియర్. -
క్రికెట్లో కొత్త రూల్.. ఇకపై ఓవర్కు..!
దేశవాళీ క్రికెట్లో బీసీసీఐ కొత్త రూల్ను అమల్లోకి తేనుంది. త్వరలో ప్రారంభంకానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఓవర్కు రెండు బౌన్సర్లకు అనుమతిచ్చింది. ఇప్పటివరకు టీ20ల్లో ఓవర్కు ఒకే బౌన్సర్ నిబంధన అమల్లో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్కు మధ్య పోటీని బ్యాలెన్స్ చేసేందుకు ఈ రూల్ను అమల్లోకి తేవాలని నిర్ణయించినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. ఈ రూల్తో పాటు మరో నిబంధనను కూడా ముస్తాక్ అలీ టోర్నీలో అమల్లోకి తెస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన సక్సెస్ కావడంతో ఆ రూల్ను కూడా ముస్తాక్ అలీ టోర్నీలో అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా, ముస్తాక్ అలీ టోర్నీలో రెండు బౌన్సర్లు, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్స్ సక్సెస్ అయితే మిగిలిన దేశవాళీ టోర్నీల్లోనూ ఈ రెండు రూల్స్ను అమల్లోకి తెస్తారని సమాచారం. టీ20 ఫార్మాట్లో రెండు బౌన్సర్ల నిబంధన అమల్లోకి తెస్తే బౌలర్ల ప్రభావం పెరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు వివరించారు. ఇదిలా ఉంటే, 2023-24 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 6 వరకు జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 38 టీమ్లు తలపడనున్నాయి. -
శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్! ఫైనల్లో ముంబై
సయ్యద్ ముస్తాక్ అలీ-2022 ఫైనల్లో ముంబై జట్టు తొలి సారి అడుగుపెట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా విదర్భతో జరిగిన సెమీఫైనల్లో 5 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 16.5 ఓవర్లలోనే ఛేదించింది. కాగా ఈ విజయంలో ఆ జట్టు స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో 44 బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు సాధించాడు. అతడితో పాటు ఓపెనర్ పృథ్వీ షా (21 బంతుల్లో 34) కూడా రాణించాడు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే, అక్షయ్ కర్నేవార్ తలా రెండు వికెట్లు సాధించగా.. లలిత్ యాదవ్ ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసింది. విదర్భ బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ 46 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ముంబై బౌలర్లలో షామ్స్ ములానీ మూడు వికెట్లు, దేశ్పాండే, దుబే తలా రెండు వికెట్లు సాధించారు. మరో వైపు హిమాచల్ ప్రదేశ్ ఈ టోర్నీ ఫైనల్కు చేరుకుంది. ఈడెన్ గార్డెన్స్లో గురువారం జరిగిన సెమీఫైనల్స్లో హిమాచల్ ప్రదేశ్ 13 పరుగులతో పంజాబ్పై విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య ఫైనల్ శనివారం జరుగుతుంది. చదవండి: కోహ్లి "ఫేక్ ఫీల్డింగ్" ఆరోపణలు .. వివరణ ఇచ్చిన భారత మాజీ క్రికెటర్ -
టీ20 టోర్నీ ఫైనల్లో తొలిసారిగా.. మరో ట్రోఫీకి అడుగు దూరంలో ధావన్ సేన
Syed Mushtaq Ali Trophy 2022- Punjab vs Himachal Pradesh, Semi Final 1: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2022 సెమీ ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. సమిష్టి కృషితో తొలిసారిగా దేశవాళీ టీ20 టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది. కోల్కతాలో పంజాబ్తో గురువారం జరిగిన మ్యాచ్లో గెలుపొందడం ద్వారా టైటిల్కు అడుగుదూరంలో నిలిచింది. సెమీ ఫైనల్-1 ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2022 తొలి సెమీ ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్- పంజాబ్ తలపడ్డాయి. టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన రిషి ధావన్ సేనకు ఆదిలోనే షాకిచ్చారు పంజాబ్ బౌలర్లు. ఆదుకున్న సుమీత్ వర్మ, ఆకాశ్ ఓపెనర్లు ప్రశాంత్ చోప్రా, అంకుశ్ బైన్స్ వరుసగా 17, 16 పరుగులు చేయగా.. వన్డౌన్లో వచ్చిన అభిమన్యు రాణా(2 రన్స్) పూర్తిగా నిరాశపరిచాడు. జట్టు ఇలా కష్టాల్లో కూరుకుపోయిన వేళ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సుమీత్ వర్మ పట్టుదలగా నిలబడ్డాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 51 పరుగులు సాధించాడు. మరో ఎండ్లో ఆకాశ్ వశిష్ట్ 43 పరుగులతో సహకారం అందించాడు. వీరిద్దరు కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించగా.. పంకజ్ జైస్వాల్ సైతం 27 పరుగులతో రాణించాడు. శుభారంభం లభించకపోయినా మిడిలార్డర్ రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో హిమాచల్ ప్రదేశ్ 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగలిగింది. రిషి మూడు వికెట్లు పడగొట్టి ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్కు ఓపెనర్లలో శుబ్మన్ గిల్ 45 పరుగులతో ఆకట్టుకోగా.. అభిషేక్ శర్మ మాత్రం ఒక్క పరుగుకే పెవిలియన్కు చేరాడు. మిగిలిన వాళ్లలో అన్మోల్ప్రీత్ సింగ్ 30, కెప్టెన్ మన్దీప్ సింగ్ 29(నాటౌట్), రమణ్దీప్ సింగ్ 29 పరుగులు చేశారు. అయితే, అప్పటికే మ్యాచ్ పంజాబ్ చేజారిపోయింది. డెత్ ఓవర్లలో హిమాచల్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మరో టైటిల్ దిశగా హిమాచల్ బౌలర్లలో కెప్టెన్ రిషి ధావన్కు మూడు, కున్వార్ అభినయ్ సింగ్కు ఒకటి, మయాంక్ దాగర్కు రెండు, ఆకాశ్ వశిష్ట్కు ఒక వికెట్ దక్కాయి. ఇక ఈ విజయంతో హిమాచల్ ప్రదేశ్ తొలిసారిగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్కు అర్హత సాధించింది. మరో సెమీ ఫైనల్లో విజేత(విదర్భ వర్సెస్ ముంబై)తో తుదిపోరులో అమీతుమీ తేల్చుకోనుంది. పరిమిత ఓవర్లలో మరో దేశవాళీ టైటిల్ను గెలిచి చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా గతేడాది.. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని హిమాచల్ ప్రదేశ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పటిష్ట జట్టు అయిన తమిళనాడును ఓడించి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. చదవండి: T20 WC Ind Vs Ban: అప్పుడు కూడా నరాలు తెగే ఉత్కంఠ! బంగ్లా ఒక్క పరుగుతో.. టాయ్లెట్కి వెళ్లి Ind Vs Ban: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఆరోపణలు.. లేదంటే విజయం తమదేనన్న బంగ్లా క్రికెటర్ 4⃣ Overs 2⃣5⃣ Runs 3⃣ Wickets Talk about leading from the front! 👏 👏 #SyedMushtaqAliT20 | @mastercardindia Relive Himachal Pradesh skipper @rishid100's match-winning bowling display against Punjab in #SF1 of the #PUNvHP contest🎥 🔽https://t.co/cW86hcSBTa — BCCI Domestic (@BCCIdomestic) November 3, 2022 -
Syed Mushtaq Ali Trophy: ఓటమితో ఆంధ్ర ముగింపు
ఇండోర్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ ట్రోఫీ టి20 క్రికెట్ టోర్నీని ఆంధ్ర జట్టు ఓటమితో ముగించింది. శనివారం జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్లో ఆంధ్ర 11 పరుగుల తేడాతో బరోడా చేతిలో ఓడిపోయింది. ఏడు జట్లున్న గ్రూప్ ‘డి’లో ఆంధ్ర రెండు మ్యాచ్ల్లో గెలిచి, రెండు మ్యాచ్ల్లో ఓడింది. మరో రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దాంతో ఆంధ్ర 12 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. బరోడాతో జరిగిన మ్యాచ్లో 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. కరణ్ షిండే (26 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), రికీ భుయ్ (26 బంతుల్లో 37; 6 ఫోర్లు) రాణించారు. అంతకుముందు బరోడా 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు సాధించింది. ఐదు గ్రూపుల్లో ‘టాపర్’గా నిలిచిన ముంబై, పంజాబ్, కర్ణాటక, హిమాచల్ప్రదేశ్, బెంగాల్ నేరుగా క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాయి. మూడు ప్రిక్వార్టర్ ఫైనల్స్లో గెలిచిన మరో మూడు జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుతాయి. -
ఉత్తర్ప్రదేశ్ చేతిలో హైదరాబాద్ ఓటమి..
జైపూర్: దేశవాళీ టి20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్ ‘బి’లో హైదరాబాద్కు మూడో పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన మ్యాచ్లో ఉత్తరప్రదేశ్ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఠాకూర్ తిలక్ వర్మ (37 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్స్లు) మరో సారి జట్టు టాప్ స్కోరర్గా నిలవగా, భవేశ్ సేఠ్ (27), రవితేజ (18) రెండంకెల స్కోరు చేశారు. కరణ్ శర్మ 3, కార్తీక్ త్యాగి 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం యూపీ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఆర్యన్ జుయాల్ (58 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో చెలరేగగా, కరణ్ శర్మ (31 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించాడు. చదవండి: T20 World Cup 2022: నమీబియాపై యూఏఈ విజయం.. నెదర్లాండ్స్ సెలబ్రేషన్స్ అదుర్స్ -
టీమిండియా ఆల్రౌండర్కు గాయం.. టోర్నీ నుంచి ఔట్!
టీమిండియా యువ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ గాయం కారణంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2022 నుంచి తప్పుకున్నాడు. ఈ టోర్నీలో మధ్యప్రదేశ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అయ్యర్.. ప్రాక్టీస్ చేస్తుండగా అతడి చీలమండకి తీవ్ర గాయమైంది. ఈ క్రమంలో టోర్నీలో మిగిలిన మ్యాచ్ల మొత్తానికి అయ్యర్ దూరమయ్యాడు. కాగా ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మూడు మ్యాచ్లు ఆడిన అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రైల్వేస్తో జరిగిన తొలి మ్యాచ్లో అయ్యర్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో తొలుత 62 పరుగులతో ఆజేయంగా నిలిచిన వెంకటేశ్.. బౌలింగ్లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక తన గాయానికి సంబంధించిన అప్డేట్ను సోషల్ మీడియా వేదికగా అయ్యర్ అందించాడు. "చీలమండ గాయం కారణంగా సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరం కానున్నాను. త్వరలో మళ్లీ మైదానంలోకి అడుగుపెడతానని ఆశిస్తున్నాను. నేను జట్టుకు దూరమైన్పటికీ.. మా బాయ్స్ ఈ టోర్నీలో అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నాను" అని సోషల్ మీడియాలో అయ్యర్ పోస్ట్ చేశాడు. కాగా ఐపీఎల్-2021లో అద్భుతమైన ప్రదర్శన చేసిన అయ్యర్కు భారత జట్టులో చోటు దక్కింది. అయితే జట్టులో మాత్రం తన స్థానాన్ని అయ్యర్ సుస్థిరం చేసుకోలేకపోయాడు. ఇప్పటి వరకు టీమిండియా తరపున 9 టీ20లు, రెండు వన్డేల్లో అయ్యర్ ప్రాతినిథ్యం వహించాడు. View this post on Instagram A post shared by Venkatesh R Iyer (@venkatesh -
Ind Vs SA: పరుగులు సాధిస్తున్నా టీమిండియాలో చోటు దక్కట్లేదు! చైనీస్ ఫుడ్ మానేశా!
India Vs South Africa 2022 ODI Series- T20 Syed Mushtaq Ali Trophy: ‘‘నేను పరుగులు సాధించడంలో ఎప్పుడూ వెనుకపడలేదు. ఎంతో కష్టపడుతున్నాను. అయినా, నాకు భారత జట్టులో చోటు దక్కడం లేదు. పర్లేదు. నేను టీమిండియాలో ఆడేందుకు సన్నద్ధంగా ఉన్నానని సెలక్టర్లు ఎప్పుడు భావిస్తారో అప్పుడే నన్ను ఎంపిక చేస్తారు’’ అని టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా అన్నాడు. దేశవాళీ టోర్నీల్లో గత కొంతకాలంగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ ఈ ముంబై బ్యాటర్కు జాతీయ జట్టులో చోటు దక్కడం లేదు. ఇటీవల ఐర్లాండ్, జింబాబ్వే పర్యటన సహా ప్రస్తుతం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ ఆడుతున్న జట్టులోనూ పృథ్వీ షాకు స్థానం దక్కలేదు. సెలక్టర్లు నన్ను పట్టించుకోవడం లేదు ఇక ప్రస్తుతం దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీకి సిద్ధమవుతున్న అతడు తాజాగా మిడ్ డేతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన పట్ల టీమిండియా సెలక్టర్లు వ్యవహరిస్తున్న తీరుపై స్పందించాడు. ‘‘ఇటీవలి కాలంలో నేను బాగానే పరుగులు రాబడుతున్నాను. అయినా సరే నన్ను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం లేదు. నిజానికి నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూనే ఉన్నాను. భారత ‘ఏ’ జట్టు లేదంటే దేశవాళీ క్రికెట్లోని జట్ల తరఫున ఆడుతున్నపుడైనా నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నా. ఫిట్నెస్ కాపాడుకుంటూ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడుతున్నా. కానీ.. టీమిండియాలో మాత్రం చోటు దక్కడం లేదు’’ అని 22 ఏళ్ల పృథ్వీ షా ఆవేదన వ్యక్తం చేశాడు. ఏడెనిమిది కిలోలు తగ్గాను భారత జట్టులో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానన్న పృథ్వీ షా ఫిట్నెస్ను మరింత మెరుగుపరచుకునే పనిలో ఉన్నట్లు వెల్లడించాడు. ‘‘గత ఐపీఎల్ ముగిసిన తర్వాత బరువు తగ్గడంపై దృష్టి సారించాను. దాదాను ఏడెనిమిది కిలోలు తగ్గాను. జిమ్లో ఎక్కువసేపు వర్కౌట్లు చేస్తున్నా. రన్నింగ్ కూడా చేస్తున్నా. స్వీట్లు, చైనీస్ ఫుడ్ దూరం పెట్టేశా స్వీట్లు తినడం, కూల్డ్రింక్స్ తాగటం మానేశాను. ఇక ఇప్పుడు నా మెనూ నుంచి చైనీస్ ఫుడ్ను పూర్తిగా పక్కనపెట్టేశా. కచ్చితంగా టీమిండియాలో స్థానం సంపాదిస్తాననే నమ్మకం ఉంది. అందుకోసం ఆట పట్ల అంకితభావంతో ముందుకు సాగడమే నా పని’’ అని పృథ్వీ చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలో వరుసగా రెండు సెంచరీలు కొట్టిన ఈ ముంబై బ్యాటర్.. న్యూజిలాండ్ ‘ఏ’ జట్టుతో జరిగిన వన్డే సిరీస్లో 44 బంతుల్లో 77 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక 2018లో టెస్టు మ్యాచ్ ద్వారా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన అతడు.. మొదటి మ్యాచ్లోనే శతకం బాదాడు. చివరిసారిగా 2020లో భారత్ తరఫున టెస్టు ఆడిన పృథ్వీ.. 2021లో శ్రీలంకతో ఆఖరిసారిగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాడు. ఇదిలా ఉంటే.. అక్టోబరు 11న ఆరంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం ప్రస్తుతం అతడు సన్నద్ధమవుతున్నాడు. అజింక్య రహానే సారథ్యంలో ముంబై జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. చదవండి: Ind Vs SA- WC 2023: వన్డే వరల్డ్కప్-2023కి మేము ‘అర్హత’ సాధించడం కష్టమని తెలుసు! అయినా.. Deepak Chahar: దీపక్ చహర్కు గాయం..! -
'ఐపీఎల్లో అదరగొడతా.. మళ్లీ తిరిగి టీమిండియాలోకి వస్తా'
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత కొన్నాళ్లుగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. అతడు చివరి సారిగా టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియా తరపున ఆడాడు. ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో అతడిని సెలక్టర్లు గతేడాది ప్రపంచకప్కు ఎంపిక చేశారు. అయితే ఈ మెగా ఈవెంట్లో వరుణ్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మార్క్యూ ఈవెంట్లో మూడు మ్యాచ్లు ఆడిన అతడు కేవలం ఒకే ఒక్క వికెట్ సాధించాడు. టీ20 ప్రపంచకప్లో విఫలం కావడంతో అప్పటి నుంచి అతడిని సెలక్టర్లు పక్కనబెట్టారు. ఇక ఇది ఇలా ఉండగా.. భారత జట్టులోకి పునరాగమనం చేసి తన సత్తాను నిరూపించుకోవాలని వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం భావిస్తున్నాడు. ఈ విషయాన్ని అతడు స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. త్వరలో జరగనున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు ఐపీఎల్-2023లో రాణించి తిరిగి భారత జట్టులోకి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. స్పోర్ట్స్ కీడాతో మాట్లాడుతూ.. "సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నాకు చాలా ముఖ్యమైనది. అక్కడ మెరుగైన ప్రదర్శన చేసి తిరిగి భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నాను. అదే విధంగా వచ్చే ఏడాది ఐపీఎల్లో అద్భుతంగా రాణించడానికి ప్రయత్నిస్తాను. ఈ రెండు ఈవెంట్లలో నేను బాగా రాణిస్తే.. ఖచ్చితంగా తిరిగి భారత జట్టులోకి చోటు దక్కుతుంది" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2022: ఎంసీజీ నా హోం గ్రౌండ్.. భారత బ్యాటర్లు నన్ను తట్టుకోలేరు! అవునా?! -
ఒడిశా ఆటగాడికి బంఫర్ ఆఫర్.. ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్కు!
ఒడిశా ఆటగాడు సుభ్రాంశు సేనాపతికి బంఫర్ ఆఫర్ తగిలింది. ఢిపిండింగ్ ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ వచ్చే సీజన్కు ముందు ట్రయల్స్ కోసం ఒడిశా బ్యాటర్ సుభ్రాంశు సేనాపతికి పిలుపునిచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో సుభ్రాంశు సేనాపతి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఆడిన 7మ్యాచ్ల్లో 275 పరుగులు సాధించాడు. ఈ టోర్నీలో ఒడిశా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా అంతకుముందు జరిగిన సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలోను అద్బుతంగా రాణించాడు. ఈ టోర్నీలో 5 మ్యాచ్లు ఆడిన సేనాపతి 138 పరుగులు సాధించాడు. ఇక సీఎస్కే విషయానికి వస్తే.. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు నలుగురు ఆటగాళ్లను రీటైన్ చేసుకుంది. జట్టులో అత్యధికంగా రవీంద్ర జడేజాను 16 కోట్లకు రిటైన్ చేసుకుంది. కెప్టెన్ ఎంఎస్ ధోనిని 12 కోట్లకు, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ, భారత బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్లను 8 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. చదవండి: Ashes Series 2021: వార్నర్ నువ్వు గ్రేట్.. నొప్పి బాదిస్తున్నా -
Krunal Pandya: కృనాల్ పాండ్యా సంచలన నిర్ణయం.. గుడ్బై చెప్పేశాడు!
Krunal Pandya Steps Down As Baroda Captain Why Report Says This: టీమిండియా ఆల్రౌండర్, బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్నాడు. బరోడా జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు కృనాల్ బరోడా క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) అధ్యక్షుడు ప్రణశ్ అమిన్కు శుక్రవారం ఇ- మెయిల్ పంపాడు. కాగా దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లతో విభేదాలు తలెత్తిన కారణంగానే కృనాల్ పాండ్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం... ‘‘ప్రస్తుత దేశవాళీ సీజన్లో బరోడా కెప్టెన్గా కొనసాగబోను. అయితే, సెలక్షన్కు మాత్రం అందుబాటులో ఉంటాను. జట్టు కోసం ఆడతాను. ఆటగాడిగా బరోడా క్రికెట్ కోసం నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ప్రయత్నిస్తాను. జట్టు ప్రయోజనాల కోసం నా వంతు కృషి చేస్తాను. ఎల్లప్పుడూ జట్టు మెరుగైన ప్రదర్శన కోసం పాటుపడతాను’’అని కృనాల్ పాండ్యా మెయిల్లో పేర్కొన్నాడు. కాగా ఇటీవల ముగిసిన ముస్తాక్ అలీ ట్రోఫీలో కృనాల్ సారథ్యంలోని బరోడా జట్టు దారుణంగా విఫలమైంది. ఐదింట కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి గ్రూపు-బిలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఇక ఆటగాడిగా కూడా కృనాల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. టోర్నీ మొత్తంలో కేవలం 87 పరుగులు మాత్రమే చేశాడు. 5.94 ఎకానమీతో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. జట్టు ఎంపిక విషయంలో కృనాల్ తనకు నచ్చిన ఆటగాళ్ల వైపే మొగ్గు చూపాడంటూ ఆరోపణలు వచ్చాయని బీసీఏ సన్నిహిత వర్గాల సమాచారం. ఈ క్రమంలో ఓ ఆటగాడు సెలక్టర్లతో వాదనకు దిగినట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కృనాల్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పగా.. అతడి స్థానంలో బీసీఏ కేదార్ దేవ్ధర్కు పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది తమిళనాడు ఈ దేశవాళీ టోర్నీ టైటిల్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో కర్ణాటకను ఓడించి మూడోసారి ట్రోఫీని గెలిచింది. ఇక కృనాల్ విషయానికొస్తే.. టీ20ల ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ ముంబై ఇండియన్స్ ఆటగాడు... ఈ ఏడాది మార్చిలో స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్తో వన్డేల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. చదవండి: IND Vs NZ: సూపర్ భరత్... సాహా స్థానంలో వచ్చీరాగానే.. -
MS Dhoni: అరె అచ్చం నాలాగే.. కొట్టేశావు పో.. ధోని ఫొటో వైరల్
MS Dhoni Watches Shahrukh Khan Hit Last Ball Six SMAT Final Goes Viral: ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపిస్తే ఆ కిక్కే వేరప్పా.. అది కూడా ఆ ‘విన్నింగ్ షాట్’తో టైటిల్ సొంతమైతే..!! ఇక చెప్పేదేముంటుంది!! ఇలాంటి మజాను ఎన్నోసార్లు ఆస్వాదించాడు టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని. తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చి జట్టును విజయాల బాట పట్టించాడు ఈ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్. అచ్చంగా అలాగే.. ధోని మాదిరిగానే తమిళనాడు క్రికెటర్ షారూఖ్ ఖాన్ సైతం.. చివరి బంతికి సిక్సర్ బాది తమ జట్టుకు విజయం అందించాడు. తమిళనాడు మూడోసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో కర్ణాటకపై తమిళనాడు జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతికి 5 పరుగులు అవసరమైన సమయంలో షారుఖ్ ఖాన్ సిక్స్ కొట్టడంతో విజయం ఖరారైంది. PC: BCCI ఈ నేపథ్యంలో తలా ధోని షారుఖ్ షాట్ను వీక్షిస్తున్న దృశ్యాలను చెన్నై సూపర్కింగ్స్ ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘ధోని తరహాలో ఫినిషింగ్!’’ అంటూ హర్షం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఇక పంజాబ్ కింగ్స్ సైతం తమ జట్టు ఆటగాడి అద్భుత విజయాన్ని ఉటంకిస్తూ... ‘‘నువ్వు అందరి మనసులు గెలిచావు’’ అంటూ ఆనందాన్ని పంచుకుంది. చదవండి: Rahul Dravid: నా ఫస్ట్లవ్ ద్రవిడ్.. తన కోసం మళ్లీ క్రికెట్ చూస్తా: నటి చదవండి: MS Dhoni: ‘నా చివరి మ్యాచ్ చెన్నైలోనే’ Fini 𝙎𝙚𝙚 ing off in sty7e! 💛#SyedMushtaqAliTrophy #WhistlePodu 🦁 pic.twitter.com/QeuLPrJ9Mh — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) November 22, 2021 When cricket meets bolllywood , #Sharukhkhan - the real hero of #SMATFinal.#SyedMushtaqAliTrophy #TNvKAR pic.twitter.com/q4JPsCbTcY — LeoTamil (@Leotamil14) November 22, 2021 5 needed off 1 and SRK hits a six off the final ball to take Tamil Nadu over the line! 💥💥💥 Shahrukh Khan, you beauty! ❤️ In the end, it had to be SRK who wins all the hearts! ❤️#SyedMushtaqAliTrophy #SaddaPunjab #PunjabKings — Punjab Kings (@PunjabKingsIPL) November 22, 2021 Sensational Shahrukh! 💪 💪 Sit back & relive this @shahrukh_35 blitz which powered Tamil Nadu to #SyedMushtaqAliT20 title triumph. 🏆 👏 #TNvKAR #Final Watch his knock 🎥 ⬇️https://t.co/6wa9fwKkzu pic.twitter.com/evxBiUdETk — BCCI Domestic (@BCCIdomestic) November 22, 2021 -
SMAT 2021 Winner Tamil Nadu: తమిళనాడు తడాఖా.. మూడోసారి
Syed Mushtaq Ali Trophy 2021 Final: Tamil Nadu Won Their 3rd Syed Mushtaq Ali Trophy Title: దేశవాళీ టి20 క్రికెట్లో తమిళనాడు జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. సోమవారం ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో తమిళనాడు జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన తమిళనాడు ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో కర్ణాటక జట్టును ఓడించింది. తద్వారా 2019 ఫైనల్ పోరులో కర్ణాటక చేతిలో ఒక పరుగు తేడాతో ఎదురైన ఓటమికి ఈ గెలుపుతో తమిళనాడు ప్రతీకారం తీర్చుకుంది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు సరిగ్గా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి గెలిచింది. షారుఖ్ ఖాన్ (15 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు), సాయికిశోర్ (3 బంతుల్లో 6 నాటౌట్; 1 ఫోర్) తమిళనాడు గెలుపులో కీలకపాత్ర పోషించారు. తమిళనాడు విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు అవసరమయ్యాయి. కర్ణాటక బౌలర్ ప్రతీక్ జైన్ ఆఖరి ఓవర్ వేసేందుకు వచ్చాడు. తొలి బంతికి సాయికిశోర్ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత ప్రతీక్ రెండు వైడ్లు వేయడంతోపాటు ఐదు పరుగులు ఇచ్చాడు. దాంతో తమిళనాడు విజయసమీకరణం ఆఖరి బంతికి ఐదు పరుగులుగా మారింది. ప్రతీక్ వేసిన ఆఖరి బంతిని షారుఖ్ ఖాన్ డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్గా మలిచి తమిళనాడుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్కు దిగిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు సాధించింది. ఓపెనర్ రోహన్ కదమ్ ‘డకౌట్’ కాగా... మనీశ్ పాండే (15 బంతుల్లో 13; 2 ఫోర్లు), కరుణ్ నాయర్ (14 బంతుల్లో 18; 2 ఫోర్లు) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. చివర్లో అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్లు), ప్రవీణ్ దూబే (25 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), సుచిత్ (7 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో కర్ణాటక స్కోరు 150 పరుగులు దాటింది. తమిళనాడు బౌలర్లలో సాయికిశోర్ (3/12) రాణించాడు. 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు ఒకదశలో 17.1 ఓవర్లలో 116 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గెలుపు కోసం 17 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన దశలో షారుఖ్ సూపర్ ఇన్నింగ్స్తో తమ జట్టును గెలిపించాడు. ► ముస్తాక్ అలీ ట్రోఫీని అత్యధికంగా మూడుసార్లు గెలిచిన జట్టుగా తమిళనాడు గుర్తింపు పొందింది. 2006–07 సీజన్లో, 2020– 2021 సీజన్లోనూ తమిళనాడు చాంపియన్గా నిలిచింది. బరోడా, గుజరాత్, కర్ణాటక జట్లు రెండుసార్లు చొప్పున ముస్తాక్ అలీ ట్రోఫీని సాధించాయి. ► గుర్తింపు పొందిన టి20 క్రికెట్ టోర్నీ ఫైనల్లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి టైటిల్ సాధించిన రెండో జట్టు తమిళనాడు. బంగ్లాదేశ్తో జరిగిన 2018 నిదాహాస్ ట్రోఫీ ఫైనల్లో దినేశ్ కార్తీక్ చివరి బంతికి సిక్స్ కొట్టి భారత్ను గెలిపించాడు. Sensational Shahrukh! 💪 💪 Sit back & relive this @shahrukh_35 blitz which powered Tamil Nadu to #SyedMushtaqAliT20 title triumph. 🏆 👏 #TNvKAR #Final Watch his knock 🎥 ⬇️https://t.co/6wa9fwKkzu pic.twitter.com/evxBiUdETk — BCCI Domestic (@BCCIdomestic) November 22, 2021 -
Sanju Samson: పెద్ద మనసు చాటుకున్న సంజూ.. అతడి కోసం ఏకంగా
Sanju Samson Lends Help Kerala Budding Footballer: టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ పెద్ద మనసు చాటుకున్నాడు. ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న యువ ఫుట్బాల్ ఆటగాడికి అండగా నిలబడ్డాడు. కేరళలోని మన్నార్లో గల కుట్టంపెరూర్కు చెందిన ఆదర్శ్ తిరువళ్లలో డిగ్రీ చదువుతున్నాడు. చిన్ననాటి నుంచి ఫుట్బాల్ ఆటపై ఆసక్తి పెంచుకున్న అతడు.. వివిధ టోర్నీల్లో తన ప్రతిభ నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో స్పానిష్ ఫుట్బాల్ జట్టు సీడీ లా విర్జెన్ డెల్ కామినోతో మమేకమయ్యేందుకు వీలుగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి ఎంపికయ్యాడు. నెలరోజుల పాటు జరుగనున్న ప్రోగ్రామ్ కోసం అతడు స్పెయిన్ వెళ్లాల్సి ఉంది. అయితే, అందుకు తగిన ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆదర్శ్.. చెంగనూర్ ఎమ్మెల్యే, క్రీడా శాఖా మంత్రి సజీ చెరియన్ను ఆశ్రయించాడు. తన స్పెయిన్ ట్రిప్పునకు నిధులు సమకూర్చాల్సిందిగా కోరాడు. PC: Saji Cherian Facebook ఈ క్రమంలో మంత్రి చెరియన్ ఆదర్శ్తో కలిసి ఉన్న ఫొటోను శుక్రవారం రాత్రి ఫేస్బుక్లో షేర్ చేసి.. అతడికి సహాయం అందించాల్సిందిగా కోరారు. ఇందుకు స్పందించిన సంజూ శాంసన్.. ఆదర్శ్ ప్రయాణానికి కావాల్సిన విమాన టిక్కెట్ల కొనుగోలు బాధ్యతను తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు సంజూ శాంసన్ గొప్ప మనసును అభినందిస్తున్నారు. మరోవైపు కరకోడే లియో క్లబ్ ఆదర్శ్ ఖర్చుల కోసం 50 వేల రూపాయలు జమచేసింది. PC: Saji Cherian Facebook ఇక కేరళకు చెందిన సంజూ శాంసన్ ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడటంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నా న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు అతడిని ఎంపిక చేయకపోవడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా సెలక్టర్ల తీరును విమర్శిస్తున్నారు. చదవండి: #JusticeForSanjuSamson: మా గుండె పగిలింది.. అసలేంటి ఇదంతా?! -
Murali Vijay: ఓర్నీ.. అందుకే మురళీ విజయ్ టోర్నీకి దూరంగా ఉన్నాడా?!
Murali Vijay Refuses Covid 19 Jab Out Of Syed Mushtaq Ali Trophy: తమిళనాడు వెటరన్ క్రికెటర్ మురళీ విజయ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, అతడు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకునేందుకు ఈ ఓపెనర్ సిద్ధంగా లేడని.. అందుకే టోర్నీ నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. అంతేగాక బయో బబుల్లో ఉండేందుకు మురళీ విజయ్ నిరాకరించినట్లు సమాచారం. ఈ విషయం గురించి తెలిసిన వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... ‘‘అది తన వ్యక్తిగత నిర్ణయం. వ్యాక్సిన్ తీసుకోవడానికి అతడు సుముఖంగా లేడు. కరోనా నేపథ్యంలో బీసీసీఐ మార్గదర్శకాలు పాటించడానికి సిద్ధంగా లేడు. టోర్నీ ఆరంభానికి ముందు బయో బబుల్లో ఉండాలని బీసీసీఐ నిబంధన విధించింది. విజయ్ మాత్రం ఎందుకో ఆసక్తి చూపలేదు. దీంతో తమిళనాడు జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లు అతడిని పరిగణనలోకి తీసుకోలేదు’’అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో తెలిపింది. ఒకవేళ అతడు ఇప్పుడు జట్టులోకి రావాలన్నా ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని సదరు వర్గాలు తెలిపినట్లు వెల్లడించింది. ఇక ఈ విషయం గురించి మురళీ విజయ్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. అతడు అందుబాటులోకి రాలేదని పేర్కొంది. కాగా 37 ఏళ్ల మురళీ విజయ్ ఒకప్పుడు టీమిండియాలో కీలక ప్లేయర్గా ఉన్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో 3982 పరుగులు సాధించిన అతడు.. గతేడాది ఐపీఎల్లో ఆడాడు. ఇక తమిళనాడు తరఫున 2019లో చివరిసారిగా రంజీ ట్రోఫీ ఆడాడు. చదవండి: T20 World Cup 2021: అదరగొడుతున్న ఆడం జంపా.. అయినా గానీ... -
#JusticeForSanjuSamson: మా గుండె పగిలింది.. అసలేంటి ఇదంతా?!
Sanju Samson posts a cryptic tweet after being left out of the T20I squad against New Zealand: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపారు. న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు అతడిని ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో ఫిట్నెస్ కారణాల వల్లే ఈ కేరళ బ్యాటర్ను పక్కనపెట్టారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2021 టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సంజూ.. తనపై వస్తున్న వార్తలకు ట్విటర్ వేదికగా దీటుగా బదులిచ్చాడు. వివిధ సందర్భాల్లో బౌండరీ వద్ద అద్భుత క్యాచ్లు అందుకుంటున్న ఫొటోలు షేర్ చేసి తన సత్తా ఏమిటో చెప్పాడు. కాగా న్యూజిలాండ్తో టీ20, టెస్టు సిరీస్ నేపథ్యంలో బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది. ఐపీఎల్లో అద్భుతంగా ఆకట్టుకున్న వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్లకు టీ20 జట్టులో స్థానం కల్పించింది. రాజస్తాన్ కెప్టెన్ అయిన సంజూ సైతం ఐపీఎల్ 2021లో మంచి ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో 14 ఇన్నింగ్స్లో 484 పరుగులు చేసి ఆరోస్థానంలో నిలిచాడు. అయినప్పటికీ సంజూకి చోటు దక్కకపోవడంతో.. అతడికి న్యాయం చేయాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇంత మంచి ఆటగాడిని ఎందుకు సెలక్ట్ చేయడం లేదో అర్థం కావడం లేదు. మా గుండె పగిలింది. ఐపీఎల్లో అత్యుత్తమంగా రాణించినా, దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా ఆడుతున్నా ఎందుకు సెలక్ట్ చేయడం లేదు’’ అంటూ సెలక్టర్ల తీరును విమర్శిస్తున్నారు. భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, మొహమ్మద్ సిరాజ్. భారత్, న్యూజిలాండ్ టి20 సిరీస్ షెడ్యూల్ నవంబర్ 17: తొలి మ్యాచ్ (జైపూర్లో) నవంబర్ 19: రెండో మ్యాచ్ (రాంచీలో) నవంబర్ 21: మూడో మ్యాచ్ (కోల్కతాలో) చదవండి: Harbhajan Singh: 62 నాటౌట్, 70, 79 నాటౌట్.. అతడేం పాపం చేశాడు.. ఇంకేం చేస్తే సెలక్ట్ చేస్తారు? So as usual Sanju is dropped🙂 Man literally had his best IPL season🥲 Sanju started playing IPL at the age of 18 also won the emerging player award. He is now 26! If groomed earlier he could hv been our no4. Don't want him to be a wasted talent🥺#JusticeForSanjuSamson pic.twitter.com/eRi3Vuvsll — RO45 ☀️ (@Maanvi_264) November 9, 2021 Kumar Sangakara could recognize but when will BCCI recognize Sanju Samson 💔 #JusticeForSanjuSamson pic.twitter.com/aqv2iHU6Dc — Just Butter (@JustButter07) November 9, 2021 Rohit sharma till 2013 He was also useless like sanju but dhoni backed him Now he should also back sanju in t20Is but he is biased towards mumbai players #JusticeForSanjuSamson pic.twitter.com/6Mw56gRa4W — FL1CK🇦🇺🇦🇺🇦🇺 (@55of37) November 9, 2021 pic.twitter.com/rUxkLvLBSV — Sanju Samson (@IamSanjuSamson) November 10, 2021 -
హడలెత్తించిన మిలింద్..క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్
సుల్తాన్పూర్ (గురుగ్రామ్): సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 క్రికెట్ టోర్నీ లో హైదరాబాద్ జట్టు క్వార్టర్ ఫైనల్ బెర్త్ను సొంతం చేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘ఈ’లో భాగంగా మంగళవారం జరిగిన చివరిదైన ఐదో మ్యాచ్లో హైదరాబాద్ 29 పరుగులతో ఉత్తరప్రదేశ్ను ఓడించింది. హైదరాబాద్ ఎడంచేతి వాటం పేసర్ సీవీ మిలింద్ ప్రత్యర్థి జట్టును హడలెత్తించాడు. 3.2 ఓవర్లు వేసిన మిలింద్ కేవలం 8 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి ఉత్తరప్రదేశ్ను దెబ్బ తీశాడు. దాంతో 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరప్రదేశ్ 19.2 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఈ గెలుపుతో హైదరాబాద్ ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ గెలిచి 20 పాయింట్లతో గ్రూప్లో టాపర్గా నిలిచి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈనెల 18న జరిగే క్వార్టర్ ఫైనల్లో గుజరాత్ జట్టుతో హైదరాబాద్ ఆడుతుంది. ఓవరాల్గా లీగ్ దశలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా సీవీ మిలింద్ (16 వికెట్లు) నిలిచాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (46 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్) ఈ టోర్నీలో నాలుగో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. చదవండి: IND Vs NZ: ఆ ముగ్గురు ఐపీఎల్ స్టార్లకు టీమిండియాలో చోటు దక్కలేదు.. అయినా..! -
ఓటమితో ఆంధ్ర ముగింపు...
వడోదర: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీని ఆంధ్ర జట్టు ఓటమితో ముగించింది. ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా మంగళవారం హిమాచల్ప్రదేశ్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆంధ్ర 30 పరుగుల తేడాతో ఓడింది. దాంతో ఆడిన ఐదు మ్యాచ్ల్లో రెండింటిలో నెగ్గి మరో మూడింటిలో ఓడిన ఆంధ్ర 8 పాయింట్లతో గ్రూప్లో నాలుగో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. తొలుత హిమాచల్ప్రదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఆంధ్ర పేసర్ చీపురపల్లి స్టీఫెన్ 11 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఛేదనలో ఆంధ్ర 20 ఓవర్లలో 118 పరుగులు మాత్రమే చేసింది. అశ్విన్ హెబ్బార్ (43; 3 ఫోర్లు, 1 సిక్స్), రికీ భుయ్ (41; 1 ఫోర్, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. హిమాచల్ బౌలర్లలో పంకజ్ జైస్వాల్ ఐదు వికెట్లు... రిషి ధావన్ 3 వికెట్లు తీశారు. చదవండి: T20 WC 2021: ఇంగ్లండ్ ఫెవరెట్.. న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంటుందా! -
ఎదురులేని హైదరాబాద్... వారెవ్వా మిలింద్.. ఆల్రౌండ్ ప్రదర్శనతో..
Syed Mushtaq Ali Trophy: Hyderabad Beat Delhi By 3 Wickets- సుల్తాన్పూర్ (గురుగ్రామ్): సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ ఖాతాలో నాలుగో విజయం చేరింది. ఢిల్లీ జట్టుతో సోమవారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఈ’ మ్యాచ్లో హైదరాబాద్ మూడు వికెట్లతో నెగ్గింది. సీవీ మిలింద్ (2/49; 8 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్) ఆల్రౌండ్ ప్రదర్శనతో హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 170 పరుగులు చేసింది. 171 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ సరిగ్గా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కప్టెన్ తన్మయ్ అగర్వాల్ (34 బంతుల్లో 54; 6 ఫోర్లు, 2 సిక్స్లు), తిలక్ వర్మ (32 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. చివర్లో హైదరాబాద్ విజయానికి 17 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన స్థితిలో తనయ్ త్యాగరాజన్ (10 బంతుల్లో 17 నాటౌట్; 2 సిక్స్లు), మిలింద్ 8వ వికెట్కు 33 పరుగులు జోడించి గెలిపించారు. చదవండి: Akshay Karnewar: 4–4–0–2.. అక్షయ్ కర్నేవార్ అరుదైన రికార్డు -
Akshay Karnewar: 4–4–0–2.. అక్షయ్ కర్నేవార్ అరుదైన రికార్డు
Karnewar first player in T20 to concede zero runs after bowling full quota: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నమెంట్లో విదర్భ స్పిన్నర్ అక్షయ్ కర్నేవార్ చరిత్ర పుటలకెక్కే బౌలింగ్ ప్రదర్శన చేశాడు. మణిపూర్తో జరిగిన ప్లేట్ గ్రూప్ మ్యాచ్లో అక్షయ్ 4–4–0–2తో పరుగు ఇవ్వకుండా ప్రతాపం చూపాడు. మొత్తం టి20 క్రికెట్ చరిత్రలోనే ఇది రికార్డు! దీంతో విదర్భ జట్టు 167 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. మొదట విదర్భ 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగుల భారీస్కోరు చేసింది. తర్వాత మణిపూర్ 16.3 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. చదవండి: Virat Kohli: అందరికీ థాంక్స్.. ఆరోజే గనుక వస్తే క్రికెట్ ఆడటం మానేస్తాను.. కోహ్లి ఉద్వేగం The Perfect T20 Spell from Akshay Karnewar, India's First Ambidextrous Bowler 4 overs, All Maiden against Manipur 4-4-0-2 for Vidarbha in #MushtaqAliT20 pic.twitter.com/xjJqSMUCR7 — HashTag Cricket ♞ (@TheYorkerBall) November 8, 2021 -
Syed Mushtaq Ali Trophy: కెప్టెన్ సెంచరీ మిస్.. అయితేనేం భారీ విజయం
Hyderabad Beat Uttarakhand Tanmay And Milind Well Played - సుల్తాన్పూర్ (గురుగ్రామ్): సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఉత్తరాఖండ్ జట్టుతో శుక్రవారం జరిగిన ఎలైట్గ్రూప్ ‘ఈ’ లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ 61 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (59 బంతుల్లో 97 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచాడు. చివర్లో బుద్ధి రాహుల్ (13 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) కూడా దూకుడుగా ఆడాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు స్కోరు చేసింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరాఖండ్ జట్టును హైదరాబాద్ జట్టు ఎడంచేతి వాటం పేస్ బౌలర్ సీవీ మిలింద్ (5/16) బెంబేలెత్తించాడు. దాంతో ఉత్తరాఖండ్ జట్టు 18.3 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. హైదరాబాద్ బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్, రక్షణ్, తనయ్ త్యాగరాజన్, హనుమ విహారి, రోహిత్ రాయుడు ఒక్కో వికెట్ తీశారు. సౌరాష్ట్ర జట్టుతో గురువారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ రెండు వికెట్ల తేడాతో గెలిచింది. ప్రస్తుతం హైదరాబాద్ ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. చదవండి: Ravindra Jadeja: ఇంకేం చేస్తాం.. బ్యాగులు సర్దేసి ఇంటికి వెళ్తాం.. ఇచ్చిపడేశావ్ కదా భయ్యా! -
ముంబై జట్టు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్...
Four Mumbai players test positive for COVID 19: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ప్రారంభానికి ముందు ముంబై జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టులోని నలుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. షామ్స్ ములానీ, సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ సోలంకి,సాయిరాజ్ పాటిల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణైంది. ఈ దేశవాళీ టీ20 లీగ్ నవంబరు 4 నుంచి ప్రారంభంకానుంది. ఎలైట్ గ్రూపు-బిలో ఉన్న ముంబై లీగ్ స్టేజ్లో గౌహతిలో మ్యాచ్లు ఆడనుంది. ఈ క్రమంలో ముంబై విమానాశ్రయానికి చేరుకున్న ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్హహించగా పాజిటివ్గా తేలింది. దీంతో ఈ నలుగురు ఆటగాళ్లు సెల్ఫ్ ఐషోలేషన్కు వెళ్లారు. మిగితా ఆటగాళ్లకు నెగిటివ్గా తేలడంతో గౌహతి చేరుకున్నారు. కాగా ముంబై జట్టుకు అజింక్యా రహానే సారథ్యం వహిస్తున్నాడు. ముంబై జట్టు: అజింక్యా రహానే (కెప్టెన్), పృథ్వీ షా (వైస్ కెప్టెన్), ఆదిత్య తారే, శివమ్ దూబే, తుషార్ దేశ్పాండే, సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ సోలంకి, శామ్స్ ములానీ, అథర్వ అంకోలేకర్, ధవల్ కులకర్ణి, హార్దిక్ తమోర్, మోహిత్ అవస్తీ, సిద్ధేష్ పాటిల్, సిద్ధేష్ లాడ్ అమన్ ఖాన్, అర్మాన్ జాఫర్, యశస్వి జైస్వాల్, తనుష్ కోటియన్, దీపక్ శెట్టి , రాయిస్తాన్ డయాస్ చదవండి: T20 World Cup 2021: న్యూజిలాండ్కు మరో బిగ్ షాక్.. స్టార్ ఓపెనర్ దూరం! -
కార్తీక్ నాయకత్వంలో తమిళనాడు తడాఖా
అహ్మదాబాద్: ఆద్యంతం తమ ఆధిపత్యాన్ని చాటుకున్న తమిళనాడు క్రికెట్ జట్టు దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో దినేశ్ కార్తీక్ నాయకత్వంలోని తమిళనాడు ఏడు వికెట్ల తేడాతో బరోడాపై ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీని అజేయంగా ముగించిన తమిళనాడు 14 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ చాంపియన్ అయ్యింది. చివరిసారి తమిళనాడు 2007లో టైటిల్ గెల్చుకుంది. ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా తమిళనాడు, బరోడా ఫైనల్ చేరగా... తుది పోరులో తమిళనాడుదే పైచేయిగా నిలిచింది. టాస్ గెలిచి తమిళనాడు ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన బరోడా 20 ఓవర్లలో 9 వికెట్లకు 120 పరుగులు చేసింది. విష్ణు సోలంకి (49; ఫోర్, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. తమిళనాడు బౌలర్ మణిమారన్ సిద్ధార్థ్ 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం తమిళనాడు, 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసి విజయం సాధించింది. హరి నిశాంత్ (35; 3 ఫోర్లు, సిక్స్), బాబా అపరాజిత్ (29 నాటౌట్; ఫోర్), దినేశ్ కార్తీక్ (22; 3 ఫోర్లు), షారుఖ్ ఖాన్ (18 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) రాణించారు. బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా విజేత, రన్నరప్ జట్లకు ట్రోఫీలు అందజేశారు. -
ధోని తరహాలో.. చివరి బంతికి సిక్స్ కొట్టి
అహ్మదాబాద్: టీ20 అంటేనే ఉత్కంఠకు పేరు... ఇన్నింగ్స్ చివరి బంతి వరకు ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాడుతూనే ఉంటుంది. అంతర్జాతీయ టీ20లు, ఐపీఎల్, బిగ్బాష్ వంటి టోర్నీలలో జరిగిన కొన్ని మ్యాచ్లు అభిమానులకు థ్రిల్ కలిగించడమే గాక వారిని మునివేళ్లపై నిలబెట్టేలా చేశాయి. తాజాగా దేశవాలీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా బుధవారం బరోడా, హర్యానాల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ థ్రిల్లర్ను తలపించింది. బరోడా బ్యాట్స్మన్ విష్ణు సోలంకి చివరి బంతికి ధోని తరహాలో హెలికాప్టర్ సిక్స్ కొట్టి జట్టును సెమీస్ చేర్చాడు. మొదట బ్యాటింగ్ చేసిన హర్యానా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన బరోడా జట్టు ఆరంభం నుంచి దూకుడుగానే ఆడింది. ఓపెనర్ స్మిత్ పటేల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విష్ణు సోలంకి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 46 బంతుల్లోనే 71 పరుగులతో వీరవిహారం చేశాడు. సోలంకి దాటిని చూస్తే మాత్రం బరోడా ఈజీగానే మ్యాచ్ను గెలవాల్సి ఉండేది. కానీ ఇదే సమయంలో 19వ ఓవర్ వేసిన హర్యానా బౌలర్ మోహిత్ శర్మ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. మోహిత్ వేసిన ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే రావడంతో చివరి ఓవర్కు బరోడా జట్టు విజయానికి 6 బంతుల్లో 18 పరుగులు కావాల్సి వచ్చింది.చదవండి: 'పైన్ను తీసేయండి.. అతన్ని కెప్టెన్ చేయండి' ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన సుమిత్ కుమార్ వేయగా.. మొదటి బంతికి సింగిల్ వచ్చింది. రెండో బంతిని విష్ణు సోలంకి ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను సుమీత్ వదిలేశాడు. ఆ తర్వాత బంతికి సింగిల్ రావడంతో బరోడాకు 3 బంతుల్లో 15 పరుగులు కావాల్సి వచ్చింది. నాలగో బంతిని సిక్స్ కొట్టిన సోలంకి.. ఐదో బంతిని ఫోర్గా మలిచాడు. ఇక చివరి బంతికి 5 పరుగులు అవసరమైన దశలో సోలంకి.. ధోని ఫేవరెట్ షాట్ అయిన హెలికాప్టర్ సిక్స్తో జట్టును ఒంటిచేత్తో సెమీస్కు చేర్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోలంకి ఆడిన హెలికాప్టర్ షాట్ను చూస్తే ధోని మెచ్చుకోకుండా ఉండలేడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.చదవండి: టాప్లో కోహ్లి.. రెండుకే పరిమితమైన రోహిత్ — varun seggari (@SeggariVarun) January 27, 2021 -
హైదరాబాద్ ఖేల్ఖతమ్
కోల్కతా: మరోసారి ఆల్రౌండ్ వైఫల్యంతో హైదరాబాద్ క్రికెట్ జట్టు మూల్యం చెల్లించుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 టోర్నమెంట్లో హైదరాబాద్ నాకౌట్ చేరుకునే అవకాశాలకు తెరపడింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా తమిళనాడుతో శనివారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. సందీప్ (36 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలువగా... ఓపెనర్ ప్రజ్ఞయ్ రెడ్డి (23 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్లు), చివర్లో తనయ్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), సీవీ మిలింద్ (11 బంతుల్లో 24 నాటౌట్; 3 సిక్స్లు) ధాటిగా ఆడటంతో హైదరాబాద్ స్కోరు 150 దాటింది. అనంతరం తమిళనాడు జట్టు 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ జగదీశన్ (51 బంతు ల్లో 78 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్లు), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (30 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) నాలుగో వికెట్కు అజేయంగా 69 పరుగులు జోడించారు. వరుసగా నాలుగో విజయం సాధించిన తమిళనాడు జట్టు ప్రస్తుతం గ్రూప్ ‘బి’లో 16 పాయింట్లతో టాప్ ర్యాంక్లో ఉంది. దాదాపుగా నాకౌట్ బెర్త్ను ఖాయం చేసుకుంది. బెంగాల్ జట్టు 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఒకే విజయం సాధించిన హైదరాబాద్ నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. చివరి లీగ్ మ్యాచ్లో తమిళనాడు, బెంగాల్ తలపడనున్నాయి. ఒకవేళ తమిళనాడు ఓడిపోతే బెంగాల్ కూడా 16 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలుస్తుంది. అయితే బెంగాల్కంటే తమ నెట్ రన్రేట్ మెరుగ్గా ఉండటం తమిళనాడుకు కలిసొచ్చే అంశం. సోమవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో జార్ఖండ్తో హైదరాబాద్ తలపడుతుంది. -
అర్జున్ టెండూల్కర్ మెయిడిన్ వికెట్..వైరల్
ముంబై : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ‘ఇ’ గ్రూప్లో హరియాణాతో జరిగిన మ్యాచ్లో ముంబై 8 వికెట్ల తేడాతో ఓడింది. తొలుత ముంబై 143 పరుగులకు ఆలౌటైంది. హరియాణా 17.4 ఓవర్లలో 2 వికెట్లకు 144 పరుగలు చేసి గెలిచింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఈ మ్యాచ్తో సీనియర్ ముంబై జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. బ్యాటింగ్లో అర్జున్ (0 నాటౌట్) ఖాతా తెరవకపోయినా... బౌలింగ్లో 3 ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీశాడు. అర్జున్ టెండూల్కర్ తీసిన మెయిడిన్ వికెట్ వైరల్గా మారింది. హరియాణా ఓపెనర్ సీకే బిష్నోయ్ను ఔట్ చేసి సీనియర్ ముంబై జట్టు తరఫున మెయిడిన్ వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు. అర్జున్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికి బిష్నోయ్ వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.(లంచ్కు ముందే ఆసీస్ ఆలౌట్) అయ్యో... ఆంధ్ర ఆంధ్ర జట్టుకు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘ఇ’లోనే శుక్రవారం పుదుచ్చేరి జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆంధ్ర జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్లో ఆంధ్ర 226 పరుగుల భారీ స్కోరు చేసినా ఓడిపోవడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర... శ్రీకర్ భరత్ (34 బంతుల్లో 62; 4 ఫోర్లు, 5 సిక్స్లు), కెప్టెన్ బటి రాయుడు (26 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్తో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 226 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పుదుచ్చేరి జట్టును షెల్డన్ జాక్సన్ ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చాడు. షెల్డన్ జాక్సన్ 50 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్లతో అజేయంగా 106 పరుగులు చేశాడు. దాంతో దుచ్చేరి 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసి గెలిచింది. ఆంధ్ర బౌలర్లలో హరిశంకర్ రెడ్డి 35 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. (36 బంతుల్లోనే శతకం...ఫాస్టెస్ట్ రికార్డు) Arjun Tendulkar getting his first Wicket on debut. !!! 👏👏 Cc: Vinesh Prabhu pic.twitter.com/gEiJmcdnbU — Sachin Tendulkar🇮🇳 Fan Club 🇮🇳 (@CrickeTendulkar) January 15, 2021 -
టీ20ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు
చెన్నై: ముస్తాక్ అలీ టి20 టోర్నీలో మేఘాలయ కెప్టెన్ పునీత్ బిష్త్ మిజోరాం తో జరిగిన మ్యాచ్లో 51 బంతుల్లోనే 6 ఫోర్లు, 17 సిక్సర్లతో 146 పరుగులు చేసి టి20ల్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్గా ఘనత వహించాడు. గతంలో శ్రేయస్ అయ్యర్ అత్యధికంగా 15 సిక్సర్లు కొట్టాడు. ఓవరాల్గా ఎక్కువ సిక్సర్లు కొట్టిన రికార్డు క్రిస్ గేల్ (18) పేరిట ఉంది. మేఘాలయ 230 పరుగులు సాధించగా, 100 పరుగులు మాత్రమే చేయగలిగిన మిజోరాం 130 పరుగుల తేడాతో చిత్తయింది. ముంబైతో జరిగిన మరో మ్యాచ్లో మొహమ్మద్ అజహరుద్దీన్ (54 బంతుల్లో 137 నాటౌట్; 9 ఫోర్లు, 11 సిక్సర్లు) మెరుపు ప్రదర్శనతో కేరళ జట్టు 8 వికెట్లతో ఘన విజయం సాధించింది. ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 పరుగులు చేయగా... కేరళ 15.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 201 పరుగులు సాధించింది. -
కెప్టెన్తో గొడవ.. టీమ్ నుంచి వెళ్లిపోయిన ఆల్రౌండర్
ఢిల్లీ: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ప్రారంభానికి ముందే బరోడా టీమ్కు ఊహించని షాక్ తగిలింది. ఆదివారం నుంచి టోర్నీ ప్రారంభం అవుతుండగా జట్టు సీనియర్ ఆల్రౌండర్ దీపక్ హుడా..కెప్టెన్ కృనాల్ పాండ్యాతో గొడవ కారణంగా క్యాంప్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయాడు. బరోడా టీమ్కి కృనాల్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఈ టీమ్కి కెప్టెన్గా పనిచేసిన దీపక్ హుడా ప్రస్తుతం వైస్ కెప్టెన్ హోదాలో ఉన్నాడు.కాగా క్యాంప్ నుంచి వెళ్లిన అనంతరం తాను టీమ్ నుంచి వెళ్లిపోవడానికి గల కారణాన్ని దీపక్ హుడా ఈ మెయిల్ ద్వారా బరోడా క్రికెట్ అసోసియేషన్కు వివరించాడు. (చదవండి: బుమ్రా చేసిన పనికి షాక్ తిన్న అంపైర్) 'ఇటీవల జరిగిన టీమ్ సమావేశాల్లో పదే పదే నన్ను టార్గెట్ చేస్తూ కృనాల్ పాండ్యా దూషిస్తున్నాడు. తాను ఒక సీనియర్ ఆటగాడినేనని.. భారత్ జట్టుతో పాటు ఐపీఎల్లోనూ పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాను. గతంలో ఇదే బరోడా జట్టకు కెప్టెన్గా పనిచేసిన నేను ఇప్పుడు వైస్ కెప్టెన్ హోదాలో ఏదైనా సలహా ఇచ్చినా కృనాల్ దానిని స్వీకరించడం లేదు. పైగా జట్టు సహచరుల ముందే నన్ను దూషించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. గతంలో ఎన్నో జట్లకు ఆడాను.. ఒక ఆటగాడిగా చాలా మంది కెప్టెన్సీలో పనిచేశాను.. కానీ కృనాల్ పాండ్యా తరహా వేధింపులు ఎక్కడా ఎదుర్కోలేదు. కేవలం కృనాల్ బ్యాడ్ బిహేవియర్ కారణంగానే టీమ్ క్యాంప్ నుంచి బయటికి వెళ్లిపోయానంటూ ' దీపక్ హుడా ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే వీరిద్దరి గొడవపై ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా బరోడా టీమ్ మేనేజర్ని బరోడా క్రికెట్ అసోసియేషన్ కోరింది. కృనాల్ పాండ్యా టీమిండియాకి ఆడాడు. 2018లో భారత్ తరఫున టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఆల్రౌండర్ ఇప్పటి వరకూ 18 టీ20 మ్యాచ్లు ఆడాడు. మరోవైపు దీపక్ హుడా భారత్ జట్టులోకి 2017-18లో భారత టీ20 జట్టులోకి ఎంపికయ్యాడు. కానీ.. తుది జట్టులో మాత్రం అవకాశం దక్కించుకోలేకపోయాడు. ఇక ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున కృనాల్ పాండ్యా ఆడుతుండగా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్కి ఐపీఎల్ 2020 సీజన్లో దీపక్ హుడా ఆడాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బయో- సెక్యూర్ వాతావరణంలో ఈ ట్రోఫీని బీసీసీఐ నిర్వహించనుంది. ముస్తాక్ అలీ ట్రోపీలో 38 జట్లు క్వారంటైన్లో ఉండి బయో బబుల్లోకి వచ్చాయి. కృనాల్తో గొడవ కారణంగా క్యాంప్ నుంచి వెళ్లిపోయిన దీపక్ హుడా మళ్లీ జట్టులోకి రావాలంటే.. 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి కానుంది.(చదవండి: ఒకవేళ అక్కడ సచిన్ ఉంటే పరిస్థితి ఏంటి?) -
7 వేదికలు... 38 జట్లు... 102 మ్యాచ్లు
ముంబై: ఎట్టకేలకు భారత దేశవాళీ క్రికెట్ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. నేటి నుంచి దేశంలోని ఆరు నగరాల్లో (నాకౌట్ మ్యాచ్లు అహ్మదాబాద్లో) దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరగనుంది. కరోనా నేపథ్య పరిస్థితుల్లో ‘బయో బబుల్’ వాతావరణంలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో ఐపీఎల్–2021 వేలం ఉండటం... ఈ ఏడాదే స్వదేశంలో టి20 ప్రపంచకప్ జరగనుండటంతో... ఐపీఎల్ ఫ్రాంచైజీలను, బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు యువ ఆటగాళ్లకు ఈ టోర్నీ మంచి అవకాశం కల్పించనుంది. ► స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఏడేళ్ల నిషేధం ఎదుర్కొని... నిషేధం గడువు పూర్తి కావడంతో భారత మాజీ బౌలర్, కేరళ స్పీడ్స్టర్ శ్రీశాంత్ ఈ టోర్నీతో దేశవాళీ క్రికెట్లో పునరాగమనం చేయనున్నాడు. కర్ణాటక జట్టు డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పోటీపడనుంది. ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్నా... జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న ముంబై ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. సూర్యకుమార్ ముంబై జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. ► గాయం నుంచి కోలుకున్న ఇషాంత్ శర్మ ఢిల్లీ తరఫున, గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న సురేశ్ రైనా ఉత్తరప్రదేశ్ తరఫున బరిలోకి దిగనున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తొలిసారి ముంబై సీనియర్ జట్టులో చోటు సంపాదించాడు. అర్జున్ ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ ఆడినా ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు అర్హత సాధిస్తాడు. ► గత రెండు సీజన్లలో విజేతగా నిలిచిన కర్ణాటక మూడోసారీ టైటిల్ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఆంధ్ర, హైదరాబాద్ జట్లకు తమ ఉనికిని చాటుకోవడానికి ఈ టోర్నీ వేదికగా నిలువనుంది. ఆంధ్ర జట్టుకు అంబటి రాయుడు... హైదరాబాద్ జట్టుకు తన్మయ్ అగర్వాల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. అయితే ‘డ్రా’ను పరిశీలిస్తే ఆంధ్ర, హైదరబాద్ జట్లు నాకౌట్కు చేరాలంటే విశేషంగా రాణించాల్సి ఉంటుంది. నేడు జరిగే తమ తొలి మ్యాచ్లో అస్సాంతో హైదరాబాద్ తలపడుతుంది. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఫార్మాట్ ఎలా ఉందంటే? మొత్తం 38 జట్లను ఆరు గ్రూప్లుగా విభజించారు. ఆరేసి జట్లతో కూడుకున్న ఐదు ఎలైట్ గ్రూప్లు... ఎనిమిది జట్లతో కూడిన ఒక ప్లేట్ గ్రూప్ ఉంది. జనవరి 19వ తేదీ వరకు లీగ్ దశ మ్యాచ్లు జరుగుతాయి. లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాక ఎనిమిది జట్లు నాకౌట్ దశకు అర్హత పొందుతాయి. ఆరు గ్రూప్లలో అగ్రస్థానంలో నిలిచిన ఆరు జట్లతోపాటు ఓవరాల్గా రెండో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లు క్వార్టర్ ఫైనల్ బెర్త్లు దక్కించుకుంటాయి. లీగ్ దశలో 95 మ్యాచ్లు, నాకౌట్ దశలో 7 మ్యాచ్లు కలిపి టోర్నీలో మొత్తం 102 మ్యాచ్లు జరగనున్నాయి. నాకౌట్ మ్యాచ్లు ఎక్కడంటే? జనవరి 26 నుంచి నాకౌట్ దశ మ్యాచ్లన్నీ అహ్మదాబాద్లోని మొతెరా సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తారు. జనవరి 26న రెండు క్వార్టర్ ఫైనల్స్... 27న మరో రెండు క్వార్టర్ ఫైనల్స్ ఉంటాయి. 29న రెండు సెమీఫైనల్స్ జరుగుతాయి. జనవరి 31న జరిగే ఫైనల్తో టోర్నీ ముగుస్తుంది. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే? కరోనా నేపథ్యంలో ఏ వేదికలోనూ ప్రేక్షకులకు ప్రవేశం లేదు. లీగ్ దశ మ్యాచ్లు రోజూ మధ్యాహ్నం 12 గంటలకు, ఆ తర్వాత రాత్రి 7 గంటలకు మొదలవుతాయి. లీగ్ దశలో గ్రూప్ ‘ఇ’, ‘బి’ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. జియో టీవీలోనూ మ్యాచ్లను వీక్షించవచ్చు. దీపక్ హుడా అవుట్... బరోడా జట్టు ఆల్రౌండర్ దీపక్ హుడా ముస్తాక్ అలీ టి20 టోర్నీ నుంచి చివరి నిమిషంలో వైదొలిగాడు. బరోడా జట్టు కెప్టెన్ , భారత జట్టు సభ్యుడు కృనాల్ పాండ్యా గత రెండు రోజులుగా తనతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని... ఇతర జట్ల ఆటగాళ్ల ముందు తనను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపిస్తూ దీపక్ హుడా బరోడా క్రికెట్ సంఘానికి లేఖ రాశాడు. జట్ల వివరాలు ఎలైట్ గ్రూప్ ‘ఎ’: జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, రైల్వేస్, త్రిపుర. వేదిక: బెంగళూరు ఎలైట్ గ్రూప్ ‘బి’: హైదరాబాద్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, తమిళనాడు, అస్సాం. వేదిక: కోల్కతా ఎలైట్ గ్రూప్ ‘సి’: గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, హిమాచల్ప్రదేశ్, బరోడా, ఉత్తరాఖండ్. వేదిక: వడోదర ఎలైట్ గ్రూప్ ‘డి’: సర్వీసెస్, సౌరాష్ట్ర, విదర్భ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గోవా. వేదిక: ఇండోర్ ఎలైట్ గ్రూప్ ‘ఇ’: ఆంధ్ర, హరియాణా, ముంబై, ఢిల్లీ, కేరళ, పుదుచ్చేరి. వేదిక: ముంబై ప్లేట్ గ్రూప్: మేఘాలయ, చండీగఢ్, బిహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, సిక్కిం, అరుణాచల్ప్రదేశ్. వేదిక: చెన్నైడిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక (ఫైల్) -
8 ఏళ్ల తర్వాత కూడా అదే తీరు
తిరువనంతపురం : టీమిండియా క్రికెటర్.. కేరళ స్పీడస్టర్ శ్రీశాంత్ 8 ఏళ్ల తర్వాత మళ్లీ మైదానంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే సయ్యద్ ముస్తాక్ టోర్నీకి సంబంధించి కేరళ జట్టు ప్రాబబుల్స్లో శ్రీశాంత్ చోటు దక్కించుకున్నాడు. జనవరి 10 నుంచి సయ్యద్ ముస్తాక్ టోర్నీ జరగనుంది. ఈ క్రమంలో తన ప్రాక్టీస్ను ఆరంభించిన శ్రీశాంత్ 8 ఏళ్ల తర్వాత అదే కోపాన్ని చూపించడం ఆసక్తికరంగా మారింది. (చదవండి : 'ఆ మ్యాచ్లో నన్ను గెట్ అవుట్ అన్నారు') ఆది నుంచి టీమిండియాలో అగ్రెసివ్ క్రికెటర్గా పేరు పొందిన శ్రీశాంత్కు బాధ వేసినా.. సంతోషం కలిగినా అస్సలు తట్టుకోలేడు. ఎదుటివారిని బోల్తా కొట్టించేందుకు తనదైన శైలిలో కవ్వింపు చర్యలకు పాల్పడేవాడు. శ్రీశాంత్ కెరీర్లో ఇలాంటివి చాలానే చూశాం. తాజాగా శ్రీశాంత్ సయ్యద్ ముస్తాక్ టోర్నీ సన్నాహకంగా వార్మప్ మ్యాచ్ల్లో ఆడుతున్నాడు. ఈ సందర్భంగా శ్రీశాంత్ వేసిన బంతిని ప్రత్యర్థి బ్యాట్స్మన్ భారీ షాట్ ఆడాడు. ఆ షాట్ను కోపంతో చూస్తూ శ్రీశాంత్ మళ్లీ పాతరోజులకు వెళ్లిపోయాడు. పిచ్పై నిలబడి బ్యాట్స్మన్పై స్లెడ్జింజ్కు దిగాడు. కాగా శ్రీశాంత్ బౌలింగ్ వీడియోనూ కేరళ క్రికెట్ అసోసియేషన్ యూట్యూబ్లో షేర్ చేసింది. కాగా శ్రీశాంత్ చర్యపై నెటిజన్లు తమదైశ శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 8 ఏళ్ల తర్వాత కూడా శ్రీశాంత్ తీరులో ఏ మార్పు లేదు. శ్రీశాంత్ అంటేనే కోపానికి మారుపేరు.. అతను అలా ఉంటేనే కరెక్ట్.. అని పేర్కొన్నారు. కాగా 2013 ఐపీఎల్ సీజన్లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు తేలడంతో బీసీసీఐ శ్రీశాంత్తో పాటు అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై జీవితకాలం నిషేధం విధించింది. అయితే బీసీసీఐ శ్రీశాంత్పై విధించిన నిషేధాన్ని ఏడేళ్లకి కుదించగా.. గతేడాది సెప్టెంబరుతో అది ముగిసింది. -
అర్జున్ను చితక్కొట్టిన సూర్యకుమార్.. 47 బంతుల్లో 120
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్లో విశేషంగా రాణించిన ముంబై ఇండియన్స్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ అదే ఫామ్ను కొనసాగిస్తున్నాడు. దేశవాళీ టోర్నీల్లో భాగంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి సిద్ధమవుతున్న సూర్యకుమార్ యాదవ్ మరొకసారి బ్యాట్ ఝుళిపించాడు. ఓ ప్రాక్టీస్ మ్యాచ్లో భాగంగా టీమ్-బికి నేతృత్వం వహిస్తున్న సూర్యకుమార్ యాదవ్.. యశస్వి జైస్వాల్ సారథ్యం వహిస్తున్న టీమ్-డితో జరిగిన మ్యాచ్లో 47 బంతుల్లో 120 పరుగులు సాధించాడు. (రైనా, టాప్ హీరో మాజీ భార్య అరెస్ట్) మ్యాచ్ మొత్తం ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించిన సూర్యకుమార్ 10 ఫోర్లు, 9 సిక్స్లతో విశ్వరూపం ప్రదర్శించాడు. 250కి పైగా స్టైక్రేట్తో టీమ్-డి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ప్రధానంగా టీమ్-డి బౌలర్ అర్జున్ టెండూల్కర్(సచిన్ టెండూల్కర్ తనయుడు) వేసిన ఒక ఓవర్లో 21 పరుగులు సాధించడం మ్యాచ్లో హైలైట్గా నిలిచింది. అర్జున్ వేసిన ఇన్నింగ్స్ 13 ఓవర్లో సూర్యకుమార్ రెచ్చిపోయి ఆడాడు.తన తొలి రెండు ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసిన ఈ లెఫ్మార్మ్ పేసర్.. సూర్యకుమార్ హిట్టింగ్కు సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్తో టీమ్-బి నిర్ణీత 20 ఓవర్లలో213 పరుగులు చేసింది. -
దేశవాళీ క్రికెట్కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్కు బీసీసీఐ ఆదివారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జనవరి 10 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 టోర్నమెంట్ నిర్వహణకు ఓకే చెప్పింది. ఈమేరకు బీసీసీఐ కార్యదర్శి జైషా అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు సమాచారం ఇచ్చారు. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాది తర్వాత దేశవాళీ క్రికెట్ అభిమానులను అలరించనుంది. ఇక ముస్తాక్ అలీ టోర్నీకి సంబంధించి ఇప్పటివరకైతే వేదికల్ని నిర్ణయించలేదు. జనవరి 2 తర్వాత ఏయే వేదికల్లో మ్యాచ్లు నిర్వహిస్తారో ఫైనల్ కానుంది. ఇదిలాఉండగా.. కరోనా భయాల నేపథ్యంలో బీసీసీఐ ఐసీఎల్-2020 ని దుబాయ్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ అనంతరం భారత జట్టు నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరి వెళ్లింది. అటు తర్వాత వచ్చే ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లండ్ జట్టు భారత్లో పర్యటించనుంది. కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత దేశంలో జరిగే తొలి అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ అదే కానుంది. -
రంజీ సమరానికి వేళాయె
మూలపాడు (విజయవాడ): విజయ్ హజారే వన్డే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ వంటి పరిమిత ఓవర్ల క్రికెట్లో ధనాధన్ ఇన్నింగ్స్లతో అలరించిన భారత యువ క్రికెటర్లను ఇక నాలుగు రోజులపాటు సాగే మ్యాచ్లు సవాళ్లు విసరనున్నాయి. వారిలోని నిజమైన టెక్నిక్ను, ఓపికను, ఫిట్నెస్ను పరీక్షించేందుకు నేటి నుంచి రంజీ ట్రోఫీ వేదిక కానుంది. ఇప్పటికే పరిమిత ఓవర్ల దేశవాళీ టోర్నీల్లో ఆకట్టుకున్న యువ ఆటగాళ్లు ఇక్కడ కూడా మెరిసి భారత టెస్టు జట్టులో స్థానం సంపాదించాలని చూస్తుండగా... పునరాగమనం కోసం మరికొందరు ఈ రంజీ సీజన్ను ఉపయోగించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఇక గత రెండు సీజన్ల్లో టైటిల్ గెలిచి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో దిగుతున్న విదర్భ మరోసారి టైటిల్ గెలిచి హ్యాట్రిక్ను పూర్తి చేయాలని చూస్తోంది. అదే గనుక జరిగితే ముంబై తర్వాత హ్యాట్రిక్ టైటిల్స్ను గెలిచిన జట్టుగా నిలుస్తుంది. తొలి రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో ఆంధ్రతో విదర్భ... హైదరాబాద్తో గుజరాత్ జట్లు తలపడనున్నాయి. సీజన్ జరిగే తీరు... గత సీజన్లో 37 జట్లు బరిలో దిగగా... ఈసారి చండీగఢ్ రూపంలో కొత్త జట్టు ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో మొత్తం 38 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాక గ్రూప్ ‘ఎ’–‘బి’లను కలిపి ‘టాప్–5’ స్థానాల్లో నిలిచిన జట్లు, గ్రూప్ ‘సి’ నుంచి ‘టాప్–2’ జట్లు, ప్లేట్ గ్రూప్ నుంచి ఒక జట్టు క్వార్టర్స్కు అర్హత సాధిస్తాయి. మార్చి 9 నుంచి ఫైనల్ జరుగుతుంది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’: ఆంధ్ర, హైదరాబాద్, విదర్భ, కేరళ, ఢిల్లీ, గుజరాత్, రాజస్తాన్, పంజాబ్, బెంగాల్. ఎలైట్ గ్రూప్ ‘బి’: ముంబై, బరోడా, హిమాచల్ ప్రదేశ్, సౌరాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రైల్వేస్, మధ్యప్రదేశ్. ఎలైట్ గ్రూప్ ‘సి’: త్రిపుర, జమ్మూ కశీ్మర్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఒడిశా, సరీ్వసెస్, హరియాణా, జార్ఖండ్, అస్సాం. ప్లేట్ గ్రూప్: గోవా, మేఘాలయ, మణిపూర్, మిజోరం, చండీగఢ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, బిహార్. -
చాంప్ కర్ణాటక
సూరత్: చివరి ఓవర్లో 13 పరుగులు... డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటకను ఓడించి సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 ట్రోఫీని అందుకునేందుకు తమిళనాడు ముందున్న విజయ సమీకరణం. కృష్ణప్ప గౌతమ్ వేసిన తొలి రెండు బంతుల్లోనే రెండు ఫోర్లు బాది అశ్విన్ సమీకరణాన్ని సులువుగా మార్చాడు. అయితే తర్వాతి రెండు బంతులకు ఒకే పరుగు వచి్చంది. ఐదో బంతికి రెండో పరుగు తీసే ప్రయత్నంలో విజయ్ శంకర్ రనౌటయ్యాడు. చివరి బంతికి మూడు పరుగులు కావాల్సి ఉండగా సింగిల్ మాత్రమే రావడంతో కర్ణాటక విజయం ఖాయమైంది. నేడు పెళ్లి చేసుకోబోతున్న తమ కెప్టెన్ మనీశ్ పాండేకు జట్టు చక్కటి బహుమతిని అందించింది. ఆదివారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో కర్ణాటక ఒక పరుగు తేడాతో తమిళనాడును ఓడించింది. ముందుగా కర్ణాటక 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. మనీశ్ పాండే (45 బంతుల్లో 60 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, ఆర్పీ కదమ్ (28 బంతుల్లో 35; 5 ఫోర్లు), దేవదత్ (23 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం తమిళనాడు 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. బాబా అపరాజిత్ (25 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్సర్లు), విజయ్ శంకర్ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు) పోరాడినా లాభం లేకపోయింది. -
రికార్డు బ్యాటింగ్తో చెలరేగిపోయాడు..
ముంబై: మేఘాలయా క్రికెటర్ అభయ్ నేగి ముస్తాక్ అలీ టోర్నీలో రికార్డు బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. ఆదివారం మిజోరంతో జరిగిన మ్యాచ్లో అభయ్ 14 బంతుల్లోనే అర్ధశతకం బాది ఈ దేశవాళీ టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఈ క్రమంలోనే రాబిన్ ఊతప్ప పేరిటనున్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును నేగి అధిగమించాడు. ఈ మ్యాచ్లో అభయ్ ( 50 నాటౌట్; 15 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు)కు తోడు రవితేజ (53 నాటౌట్) అదరగొట్టడంతో మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన మిజోరం 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి ఓటమి పాలైంది. మిజోరం ఆటగాడు తరువార్ కోహ్లి(90; 59 బంతుల్లో(90; 59 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. కాగా, ఆ తర్వాత కేబీ పవన్(72 నాటౌట్; 46 బంతుల్లో 6 పోర్లు, 3 సిక్సర్లు) చెలరేగినా జట్టును గెలిపించలేకపోయాడు.( ఇక్కడ చదవండి: నిషేధం తర్వాత పృథ్వీ షా మెరుపులు) -
ఓటమితో ముగించారు
సాక్షి, విశాఖపట్నం: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ఆంధ్ర జట్టు ఓటమితో ముగించింది. ఆదివారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో ఆంధ్ర 5 వికెట్ల తేడాతో సర్వీసెస్ చేతిలో ఓడింది. దీంతో టోర్నీలో మూడు విజయాలు, మూడు ఓటములతో 12 పాయింట్లు సాధించిన ఆంధ్ర... తమ గ్రూప్లో నాలుగో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. 27 పరుగులకే 3 వికెట్లు నష్టపోయి కష్టాల్లో ఉన్న జట్టును క్రాంతి కుమార్ (36 బంతుల్లో 43; 3 ఫోర్లు, సిక్స్), నరేన్ రెడ్డి (23 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్స్లు) ఆదుకోవడంతో మెరుగైన స్కోరు సాధించింది. ఛేదనకు దిగిన సర్వీసెస్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. రాహుల్ సింగ్ (23 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడాడు. ఆంధ్ర బౌలర్ శశికాంత్ (3/32) రాణించాడు. చండీగఢ్ వేదికగా జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్లో హైదరాబాద్ 21 పరుగుల తేడాతో ఛత్తీస్గఢ్పై విజయం సాధించింది. తొలుత హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు సాధించగా... అనంతరం ఛత్తీస్గఢ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి ఓడిపోయింది. తమ లీగ్ మ్యాచ్లను పూర్తి చేసుకున్న హైదరాబాద్ 16 పాయింట్లతో ... పంజాబ్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, రైల్వేస్లతో సమానంగా నిలిచింది. అయితే మెరుగైన రన్రేట్ లేకపోవడంతో సూపర్లీగ్ దశకు అర్హత సాధించలేకపోయింది. -
పృథ్వీ షా మెరుపులు
ముంబై: డోపింగ్ నిషేధం గడువు ముగియడంతో... సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 టోర్నీలో భారత క్రికెటర్, ముంబై ఓపెనర్ పృథ్వీ షా ఘనంగా పునరాగమనం చేశాడు. వాంఖడే మైదానంలో అస్సాంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో ముంబై 83 పరుగుల తేడాతో గెలిచింది. 20 ఏళ్ల పృథ్వీ షా 39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఆదిత్య తారే 48 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్తో 82 పరుగులు సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్కు 13.4 ఓవర్లలో 138 పరుగులు జోడించారు. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 5 వికెట్లకు 206 పరుగులు చేసింది. అనంతరం అస్సాం 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు చేసి ఓడిపోయింది. అభయ్ నేగి ‘రికార్డు’ అర్ధ సెంచరీ.... మిజోరంతో జరిగిన మరో మ్యాచ్లో మేఘాలయ బ్యాట్స్మన్ అభయ్ నేగి 14 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి ఈ టోర్నీ చరిత్రలో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన ప్లేయర్గా గుర్తింపు పొందాడు. రాబిన్ ఉతప్ప (15 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును అతను తిరగరాశాడు. అభయ్ నేగి (15 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్స్లు), ద్వారక రవితేజ (31 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేయడంతో మేఘాలయ 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగులు చేసింది. మిజోరం 20 ఓవర్లలో 2 వికెట్లకు 182 పరుగులు సాధించి ఓడిపోయింది. తరువార్ కోహ్లి (59 బంతుల్లో 90; 7 ఫోర్లు, 4 సిక్స్లు), పవన్ (46 బంతుల్లో 72; 6 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది. -
నిషేధం తర్వాత పృథ్వీ షా మెరుపులు
ముంబై: నిషేధిత ఉత్ప్రేరకం వాడి నిషేధానికి గురై ఇటీవల క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చిన ముంబై ఓపెనర్ పృథ్వీ షా తన బ్యాటింగ్లో పవర్ చూపించాడు. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీలో భాగంగా ఆదివారం అస్సాంతో జరిగిన మ్యాచ్లో పృథ్వీ షా మెరుపులు మెరిపించాడు. టాస్ గెలిచిన అస్సాం ముందుగా ముంబైను బ్యాటింగ్కు ఆహ్వానించడంతో ఆ జట్టు ఇన్నింగ్స్ను పృథ్వీ షా, ఆదిత్యా తారేలు ఆరంభించారు. వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ ముంబై స్కోరును పరుగులు పెట్టించారు. పృథ్వీ షా 39 బంతుల్లో 7 ఫోర్లు, 2సిక్సర్లతో 63 పరుగులు చేయగా, ఆదిత్యా తారే 48 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్తో 82 పరుగులు చేశాడు. ఈ జోడి తొలి వికెట్కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. నిషేధిత డ్రగ్ వాడిన పృథ్వీషాపై 8 నెలలు నిషేధం పడింది. కొన్ని రోజుల క్రితం అతనిపై ఉన్న నిషేధం ముగియడంతో తిరిగి క్రికెట్లోకి అడుగుపెట్టాడు. దాంతో ప్రస్తుత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతున్నాడు. ఈ సీజన్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పృథ్వీషాకు ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్లో ముంబై 83 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా, అస్సాం 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 123 పరుగులే చేసింది. దాంతో ముంబై ఖాతాలో మరో విజయం చేరింది. -
మెరిసిన సిరాజ్, మెహదీ హసన్
సాక్షి, హైదరాబాద్: వరుస ఓటములకు హైదరాబాద్ జట్టు ఫుల్స్టాప్ పెట్టింది. దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం చండీగఢ్లో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో చండీగఢ్పై విజయం సాధించింది. మొదట బౌలింగ్లో మొహమ్మద్ సిరాజ్ (3/15), మెహదీ హసన్ (3/23) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యరి్థని కుప్పకూల్చారు. దీంతో చండీగఢ్ 19.5 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. అనంతరం హైదరాబాద్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసింది. ఛేదనలో కాస్త తడబడినా బావనక సందీప్ (39 బంతుల్లో 32 నాటౌట్; ఫోర్) జట్టుకు విజయాన్ని అందించాడు. నిప్పులు చెరిగిన బౌలర్లు... టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన చండీగఢ్ను హైదరాబాద్ బౌలర్లు ఆరంభం నుంచే బెంబేలెత్తించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ మూడో బం తికే అమిత్ (0)ను సిరాజ్ ఔట్ చేశాడు. రెండో ఓవర్ చివరి బంతికి సారథి మనన్ వోహ్రా (1)ని యు«ద్వీర్ సింగ్ పెవిలియన్కు పంపి ప్రత్యర్థిని ఇరకాటంలోకి నెట్టాడు. అయితే ఈ దశలో జత కలిసిన శివమ్ బాంబ్రీ (14 బంతు ల్లో 12; 2 ఫోర్లు), గౌరవ్ పురి (13 బంతుల్లో 19; 3 ఫోర్లు, సిక్స్) జోడీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈ దశలో బౌలింగ్కు వచి్చన మెహదీ హసన్ వరుస బంతుల్లో శివమ్, గౌరవ్ పురిలను ఔట్ చేశాడు. దీంతో చండీగఢ్ 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బిపుల్ శర్మ (27 బంతుల్లో 35; 3 ఫోర్లు, సిక్స్), గురీందర్ సింగ్ (18 బంతుల్లో 20; ఫోర్, సిక్స్) ఆదుకున్నారు. చివర్లో సిరాజ్ మరోసారి కీలకమైన సమయంలో వికెట్లు తీయడంతో ప్రత్యర్థి జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. యుధ్వీర్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ వైడ్ రూపంలో ఒక్క పరుగును మాత్రమే ప్రత్యర్థికి ఎక్స్ట్రా రూపంలో ఇవ్వడం విశేషం. తడబడి... నిలబడి స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్కు తన్మయ్ అగర్వాల్ (15 బంతు ల్లో 28; 6ఫోర్లు) అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. దీంతో తొలి మూడు ఓవర్లలోనే హైదరాబాద్ 35 పరుగులు చేసింది. ఈ దశలో ప్రత్యర్థి బౌల ర్లు పుంజుకొని రాయుడు (10; ఫోర్), తన్మయ్, అక్షత్ రెడ్డి (0), హిమాలయ్ (8) వెంటవెంటనే ఔట్ చేసి హైదరాబాద్ శిబిరంలో ఆందోళ న కలిగించారు. ఇక్కడ హైదరాబాద్ 12 పరుగుల తేడాలో నాలుగు వికెట్లను కోల్పోయింది. మరో ఓటమి ఖాయం అనుకునే సమయంలో బావనక సందీప్ నేనున్నానంటూ ఆదుకున్నా డు. అతడు మల్లికార్జున్ (27 బంతుల్లో 22; సిక్స్), చామా మిలింద్ (17 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్)లతో కలిసి జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. స్కోరు వివరాలు చండీగఢ్ ఇన్నింగ్స్: వోహ్రా (సి) మల్లికార్జున్ (బి) యు«ద్వీర్ 1; అమిత్ (ఎల్బీ) (బి) సిరాజ్ 0; శివమ్ (సి) యుధ్వీర్ (బి) మెహదీ హసన్ 12; గౌరవ్ పురి (సి) రాయుడు (బి) మెహదీ హసన్ 19; జస్కరన్వీర్ సింగ్ (సి) యు«ద్వీర్ (బి) ఆకాశ్ 14; బిపుల్ శర్మ (సి) తన్మయ్ (బి) మిలింద్ 35; జస్కరన్ సింగ్ (బి) మెహదీ హసన్ 12; గురీందర్ సింగ్ (సి) మల్లికార్జున్ (బి) సిరాజ్ 20; గౌరవ్ గంభీర్ (ఎల్బీ) (బి) యుద్వీర్ 3; శరణ్ (సి) ఆకాశ్ (బి) సిరాజ్ 5; శ్రేష్ట్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 1; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 123 వికెట్ల పతనం: 1–1, 2–5, 3–32, 4–42, 5–52, 6–76, 7–100, 8–106, 9–118, 10–123. బౌలింగ్: సిరాజ్ 3.5–0–15–3, యుధ్వీర్ సింగ్ 4–0–37–2, మిలింద్ 4–0–24–1, మెహదీ హసన్ 4–0–23–3, బావనక సందీప్ 2–0–13–0, ఆకాశ్ భండారి 2–0–11–1. హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ (బి) జస్కరన్ 28; రాయుడు (బి) శ్రేష్ట 10; హిమాలయ్ (సి) గౌరవ్ పురి (బి) శ్రేష్ట్ 8; అక్షత్ రెడ్డి (సి) గౌరవ్ గంభీర్ (బి) జస్కరన్ 0; సందీప్ (నాటౌట్) 32 మల్లికార్జున్ (సి) జస్కరన్వీర్ సింగ్ (బి) గురీందర్ సింగ్ 22; మిలింద్ (నాటౌట్) 23; ఎక్స్ట్రాలు 3; మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 123 వికెట్ల పతనం: 1–35, 2–43, 3–43, 4–47, 5–90. బౌలింగ్: బిపుల్ శర్మ 4–0–19–0, శ్రేష్ట్ నిర్మోహి 3–0–23–2, శరణ్ 4–0–36–0, జస్కరన్ సింగ్ 4–0–17–2, గౌరవ్ గంభీర్ 1–0–10–0, గురీందర్ సింగ్ 3–0–19–1. -
మనీశ్ పాండే మెరుపు సెంచరీ
సాక్షి, విజయనగరం: వన్డౌన్ బ్యాట్స్మన్ మనీశ్ పాండే (54 బంతుల్లో 129 నాటౌట్; 12 ఫోర్లు, 10 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో... సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో కర్ణాటక మూడో విజయం నమోదు చేసింది. సర్వీసెస్తో మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో కర్ణాటక 80 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత కర్ణాటక 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగులు సాధించింది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (43 బంతుల్లో 75; 8 ఫోర్లు, 4 సిక్స్లు) కూడా వీరవిహారం చేశాడు. మనీశ్ పాండే, దేవదత్ రెండో వికెట్కు కేవలం 13.5 ఓవర్లలో ఏకంగా 167 పరుగులు జోడించడం విశేషం. 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్వీసెస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి ఓడిపోయింది. కర్ణాటక బౌలర్ శ్రేయస్ గోపాల్ 19 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. దీపక్ చాహర్, మయాంక్ మిశ్రా ‘హ్యాట్రిక్’... మంగళవారం ఇతర వేదికల్లో జరిగిన మ్యాచ్ల్లో రెండు హ్యాట్రిక్లు నమోదయ్యాయి. బంగ్లాదేశ్తో ఆదివారం జరిగిన మూడో టి20 మ్యాచ్లో హ్యాట్రిక్ తీసిన దీపక్ చాహర్... ఈ టోర్నీలో రాజస్తాన్ తరఫున బరిలోకి దిగాడు. తిరువనంతపురంలో విదర్భతో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్లో దీపక్ చాహర్ (4/18) ఇన్నింగ్స్ చివరి ఓవర్లో దర్శన్, శ్రీకాంత్, అక్షయ్లను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ సాధించాడు. వర్షంవల్ల ఈ మ్యాచ్ను 13 ఓవర్లకు కుదించగా... విదర్భ 9 వికెట్లకు 99 పరుగులు చేసింది. అనంతరం వీజేడీ పద్ధతిలో రాజస్తాన్ లక్ష్యాన్ని 13 ఓవర్లలో 107 పరుగులుగా నిర్ణయించారు. అయితే రాజస్తాన్ 8 వికెట్లకు 105 పరుగులు చేసి ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. విశాఖపట్నంలో గోవాతో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో ఉత్తరాఖండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మయాంక్ మిశ్రా (4/6) హ్యాట్రిక్ సాధించాడు. మయాంక్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో ఆదిత్య, అమిత్ వర్మ, సుయశ్లను అవుట్ చేశాడు. తొలుత గోవా 20 ఓవర్లలో 9 వికెట్లకు 119 పరుగులు సాధించగా... ఉత్తరాఖండ్ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి గెలిచింది. -
వాటే స్టన్నింగ్ క్యాచ్
విశాఖ: యూసఫ్ పఠాన్ అనూహ్యంగా భారత్ జట్టులోకి దూసుకొచ్చి అంతే వేగంగా దూరమైన పోయిన క్రికెటర్. 2012లో చివరిసారి భారత్ తరఫున ఆడిన యూసఫ్ పఠాన్.. ఇంకా దేశవాళీ మ్యాచ్లు మాత్రం ఆడుతూనే ఉన్నాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ టీ20లో భాగంగా యూసఫ్ పఠాన్ అద్భుతమైన క్యాచ్ పట్టి మళ్లీ వార్తల్లో నిలిచాడు. బరోడా తరఫున ఆడుతున్న యూసఫ్.. శుక్రవారం గోవాతో జరిగిన మ్యాచ్లో ఒక స్టన్నింగ్ క్యాచ్తో అలరించాడు. గోవా కెప్టెన్ దర్శన్ మిశాల్ కవర్స్ మీదుగా షాట్ ఆడగా అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న యూసఫ్ ఒక్కసారిగా గాల్లోకి డైవ్ కొట్టి క్యాచ్ అందుకున్నాడు. గోవా ఇన్నింగ్స్ 19 ఓవర్ను అరోథి వేయగా దర్శన్ భారీ షాట్ కొట్టబోయాడు. అది కవర్స్ మీదుగా గాల్లోకి లేచిన సమయంలో యూసఫ్ మెరుపు ఫీల్డింగ్తో అతన్ని పెవిలియన్కు పంపాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ మ్యాచ్లో గోవా 4 వికెట్ల తేడాతో గెలిచింది. బరోడా నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్ను గోవా 19.4 ఓవర్లలో ఛేదించింది. కాగా, యూసఫ్ బ్యాటింగ్లో మాత్రం నిరాశపరిచాడు. రెండు బంతులు ఆడి డకౌట్గా పెవిలియన్ చేరాడు. తన సోదరుడు క్యాచ్కు సంబంధించిన వీడియోను ఇర్ఫాన్ పఠాన్ ట్వీటర్లో షేర్ చేశాడు. దీనిపై స్పందించిన అఫ్గానిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. అదొక అద్భుతమైన క్యాచ్ అంటూ కొనియాడాడు. Is it a bird ? No this is @yusuf_pathan Great catch today lala.All ur hard work in pre season is paying off #hardwork @BCCI @StarSportsIndia pic.twitter.com/bcpO5pvuZI — Irfan Pathan (@IrfanPathan) November 8, 2019 -
హైదరాబాద్ టి20 జట్టు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే హైదరాబాద్ పురుషుల జట్టును సోమవారం ప్రకటించారు. ఈ జట్టుకు భారత క్రికెటర్ అంబటి రాయుడు సారథ్యం వహించనున్నాడు. కోచ్గా ఎన్. అర్జున్ యాదవ్, మేనేజర్గా ఎస్. వైజయంత్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. న్యూఢిల్లీలో ఈనెల 20 నుంచి మార్చి 3 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. జట్టు వివరాలు: అంబటి రాయుడు (కెప్టెన్), పి. అక్షత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, రోహిత్ రాయుడు, బి. సందీప్, కె. సుమంత్ (వికెట్ కీపర్), మెహదీ హసన్, ఆశిష్ రెడ్డి, సాకేత్ సాయిరాం, సీవీ మిలింద్, హిమాలయ్ అగర్వాల్, మొహమ్మద్ సిరాజ్, జె. మల్లికార్జున్ (వికెట్ కీపర్), ఆకాశ్ భండారి, టి. రవితేజ, అర్జున్ యాదవ్ (కోచ్), ఎన్పీ సింగ్ (బౌలింగ్ కోచ్), టి. దిలీప్ (ఫీల్డింగ్ కోచ్), వైజయంత్ (మేనేజర్), ప్రతాప్ సింగ్ (ఫిజియో), నవీన్ రెడ్డి (ట్రెయినర్). -
పంజాబ్కు ‘సూపర్’ విజయం
కోల్కతా: భారత వెటరన్ స్టార్స్ యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ మెరుపులతో ఉత్కం‘టై’న మ్యాచ్లో పంజాబ్ సూపర్ ఓవర్తో గెలిచింది. ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ సూపర్లీగ్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ 4 పరుగుల తేడాతో కర్ణాటకపై నెగ్గింది. మొదట బ్యాటింగ్కు దిగిన కర్ణాటక 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. అనిరుధ జోషి (19 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు, 1 ఫోర్) ధాటిగా ఆడాడు. తర్వాత 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కూడా నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్ల నష్టానికి సరిగ్గా 158 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. పంజాబ్ ఓపెనర్ మన్దీప్ సింగ్ (45; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, వన్డౌన్లో దిగిన కెప్టెన్ భజ్జీ (19 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్), యువీ (25 బంతుల్లో 29; 5 ఫోర్లు) తమ అనుభవాన్ని చాటారు. ఫలితం కోసం సూపర్ ఓవర్ ఆడించగా మొదట పంజాబ్ 15 పరుగులు చేసింది. తర్వాత కర్ణాటక 11 పరుగులే చేసి ఓడింది. గ్రూప్ ‘ఎ’లో మరో మ్యాచ్లో ముంబై 13 పరుగుల తేడాతో జార్ఖండ్పై గెలిచింది. గ్రూప్ ‘బి’లో రిషభ్ పంత్ (58; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటికి ఢిల్లీ 8 వికెట్ల తేడాతో తమిళనాడుపై... బరోడా 17 పరుగులతో బెంగాల్పై విజయం సాధించాయి. -
పంత్ సూపర్ ఫాస్ట్
ఢిల్లీ యువ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముస్తాక్ అలీ టి20 టోర్నీలో భాగంగా హిమాచల్ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో 32 బంతుల్లోనే అతను సెంచరీ సాధించాడు. ఏ ఫార్మాట్లోనైనా భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. ఓవరాల్ జాబితాలో పంత్ శతకం రెండో స్థానంలో నిలిచింది. గతంలో క్రిస్ గేల్ ఐపీఎల్లో 30 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ (35 బంతుల్లో) చేసిన శతకాన్ని మూడు బంతుల తేడాతో రిషభ్ సవరించాడు. న్యూఢిల్లీ: వారం క్రితమే రిషభ్ పంత్ను ఢిల్లీ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించారు. దానికి తానేమీ కుంగిపోలేదని... చేతల్లో చూపెట్టాడు. వేగవంతమైన చరిత్రలో భాగమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో పంత్ (38 బంతుల్లో 116 నాటౌట్; 8 ఫోర్లు, 12 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్తో క్రిస్ గేల్ను తలపించాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. భారత్ తరఫున వేగవంతమైన రికార్డుకు వేదికైన ఈ మ్యాచ్లో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో హిమాచల్ ప్రదేశ్పై ఘనవిజయం సాధించింది. ఆదివారం ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన హిమాచల్ ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్ సాంగ్వాన్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ తరఫున రిషభ్ పంత్ సిక్సర్ల జడివాన కురిపించాడు. దీంతో కేవలం 11.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ఢిల్లీ విజయాన్నందుకుంది. ఆకాశమే హద్దుగా చెలరేగిన పంత్ 18 బంతుల్లో అర్ధసెంచరీని, మరో 14 బంతుల్లో సెంచరీని పూర్తిచేశాడు. పంత్ కంటే ముందు వరుసలో ఒకే ఒక్కడు గేల్ (30 బంతుల్లో 100) ఉన్నాడు. 2013 ఐపీఎల్లో పుణే వారియర్స్పై బెంగళూరు తరఫున గేల్ ఈ ఘనత సాధించాడు. కెప్టెన్గా రిషబ్ పంత్కు ఉద్వాసన -
హైదరాబాద్ టి20 క్రికెట్ జట్టు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సౌత్జోన్ ఇంటర్ స్టేట్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే హైదరాబాద్ జట్టును సోమవారం ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా అంబటి రాయుడు, వైస్ కెప్టెన్గా పి. అక్షత్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ జట్టుకు డి. కిషన్ రావు మేనేజర్గా వ్యవహరించనున్నారు. విశాఖపట్నంలో జనవరి 8 నుంచి 14 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. జట్టు వివరాలు: అంబటి రాయుడు (కెప్టెన్), పి. అక్షత్ రెడ్డి (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, బి. సందీప్, ఎ. ఆశిష్రెడ్డి, మొహమ్మద్ సిరాజ్, ఎం.రవికిరణ్, మెహదీహసన్, ఆకాశ్ భండారి, టి. రవితేజ, సుమంత్ కొల్లా (వికెట్ కీపర్), పి. రోహిత్ రెడ్డి (వికెట్ కీపర్), పి. సాకేత్ సాయిరాం, ప్రజ్ఞాన్ ఓజా, తనయ్ త్యాగరాజన్, కార్తికేయ, డి. కిషన్రావు (మేనేజర్), జె.అరుణ్ కుమార్ (కోచ్), ప్రతాప్ సింగ్ (ఫిజియో), నవీన్ రెడ్డి (ట్రైనర్). -
ఓటమితో ముగించారు
ఆంధ్ర చేతిలో హైదరాబాద్ పరాజయం సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ సాక్షి, హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. బౌలర్లు రాణిం చినా... బ్యాట్స్మెన్ విఫలం కావడంతో చివరి మ్యాచ్ను కోల్పోయి ఈ టోర్నీని హైదరాబాద్ జట్టు ఓటమితో ముగించింది. చెన్నైలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టుపై 11 పరుగుల తేడాతో ఆంధ్ర జట్టు గెలుపొందింది. సౌత్జోన్ విభాగంలో జరిగిన పోటీల్లో మొత్తం 5 మ్యాచ్లాడిన హైదరాబాద్ మొదటి 3 మ్యాచ్లు గెలిచి... చివరి 2 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో 12 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టు 19.2 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (49; 5 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. రికీ భుయ్ (21; 1 ఫోర్) పర్వాలేదనిపించాడు. హైదరాబాద్ బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లతో చెలరేగగా... రవికిరణ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. తన్మయ్ అగర్వాల్ (49; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడగా... ఆకాశ్ భండారి (26; 1 ఫోర్, 1 సిక్సర్) రాణించాడు. ఆంధ్ర బౌలర్లలో స్వరూప్ కుమార్ 5 వికెట్లతో విజృంభించగా...గిరినాథ్ రెడ్డి 3 వికెట్లు దక్కించుకున్నాడు. ఓపెనర్ల జోరు: టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆంధ్ర జట్టుకు ఓపెనర్లు భరత్ (16), హనుమ విహారి శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ తొలి వికెట్కు 37 బంతుల్లో 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం సిరాజ్ బౌలింగ్లో భరత్ పెవిలియన్ చేరాడు. విహారికి జతకలిసిన రికీ భుయ్ ఆచితూచి ఆడాడు. రికీ ఎక్కువగా సింగిల్స్కు ప్రాధాన్యమిస్తూ స్ట్రరుుక్ రొటేట్ చేయగా... విహారి దూకుడు ప్రదర్శించాడు. ఈ క్రమంలోనే రవికిరణ్ బౌలింగ్లో సుమంత్కు క్యాచ్ ఇచ్చి విహారి వెనుదిరిగాడు. గిరినాథ్ రెడ్డి (15) ఒక సిక్సర్తో దూకుడు కనబరిచినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. తర్వాత హైదరాబాద్ బౌలర్లు చెలరేగడంతో రవితేజ (8), గణేశ్ (7), శ్రీనివాస్ (2), స్వరూప్ (6), భట్ (1), అయ్యప్ప (0), శశికాంత్ (9 నాటౌట్) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఒకరి తర్వాత మరొకరు: స్వల్ప లక్ష్యఛేదనలో హైదరాబాద్ జట్టు విఫలమైంది. తన్మయ్ ధాటిగా ఆడినా ... మిగతా బ్యాట్స్మెన్ పేలవ ప్రదర్శనతో జట్టు ఓటమిని తప్పించుకోలేకపోయింది. జట్టు స్కోరు 10 పరుగుల వద్ద ఓపెనర్ అక్షత్ (7) వెనుదిరగగా... తన్మయ్, బద్రీనాథ్ (19) ఇన్నింగ్స నిర్మించే బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తర్వాత స్వరూప్ ధాటికి అనిరుధ్ (6), ఆకాశ్ (4), సుమంత్ (2) పెవిలియన్కు చేరారు. ఆంధ్ర బౌలర్లను ఓ ఎండ్లో ఆకాశ్ భండారి సమర్థంగా ఎదుర్కొన్నప్పటికీ... మరో ఎండ్లో హసన్ (5), మిలింద్ (5), సిరాజ్ (1) క్రీజులో నిలవలేకపోయారు. చివరి ఓవర్లో భండారి ఔటయ్యాడు. -
హైదరాబాద్ శుభారంభం
ముస్తాక్ అలీ టి20 క్రికెట్ టోర్నీ చెన్నై: సయ్యద్ ముస్తాక్ అలీ అంతర్రాష్ట్ర టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు బ్యాట్స్మన్ తన్మయ్ అగర్వాల్ (48 బంతుల్లో 91; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించాడు. దీంతో గోవా జట్టుతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ 51 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లనష్టానికి 224 పరుగుల భారీ స్కోరు చేసింది. అక్షత్ రెడ్డి (32 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగగా... బద్రీనాథ్ (22 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లలో సౌరభ్, అమిత్, గణేశ్రాజ్ తలో వికెట్ తీశారు. అనంతరం గోవా జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసి ఓడిపోయింది. షగుణ్ కామత్ (44 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సౌరభ్ (25 బంతుల్లో 53; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) పోరాడారు. హైదరాబాద్ బౌలర్లలో సిరాజ్, టి. రవితేజ, ఆకాశ్ భండారి, మెహదీ హసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఓపెనర్ల జోరు హైదరాబాద్ ఓపెనర్లు తన్మయ్, అక్షత్ రెడ్డి ధాటిగా ఇన్నింగ్సను ఆరంభించారు. వీరిద్దరూ ఫోర్లతో, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగుపెట్టించారు. అక్షత్ క్రీజులో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకోగా... తన్మయ్ ఆరంభం నుంచే గోవా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో తన్మయ్ టి20లో తొలి అర్ధసెంచరీని నమోదు చేశాడు. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ తొలి వికెట్కు 111 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అక్షత్ 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మిషాల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన బద్రీనాథ్ (49), తన్మయ్కి చక్కని సహకారం అందించాడు. ఈ జంట ఆరు ఓవర్ల పాటు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొని రెండో వికెట్కు 87 పరుగుల్ని జోడించింది. తన్మయ్ 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సౌరభ్ బౌలింగ్లో రితురాజ్ సింగ్కు క్యాచ్ ఇవ్వడంతో గోవా ఊపిరి పీల్చుకుంది. మరో మూడు బంతుల వ్యవధిలోనే బద్రీనాథ్ రనౌట్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రవితేజ (3) నిరాశపరిచాడు. అనిరుధ్ (9 నాటౌట్), సుమంత్ (12 నాటౌట్) క్రీజులో ఉన్నారు. రాణించిన షగుణ్, సౌరభ్ భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన గోవా నెమ్మదిగా ఇన్నింగ్సను ఆరంభించింది. షగుణ్ కామత్ (50) ఆచితూచి పరుగులు చేయగా... స్వప్నిల్ అస్నోద్కర్ (19) త్వరగానే పెవిలియన్కు చేరాడు. స్నేహల్ కౌథాంకర్ (2) మరో నాలుగు పరుగుల వ్యవధిలోనే ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మిషాల్ (25) కామత్కు చక్కగా సహకరించాడు. ఈ జంట మూడో వికెట్కు 70 పరుగుల జోడించాక భండారి బౌలింగ్లో కామత్ వెనుదిరిగాడు. వెంటనే విషాల్ కూడా పెవిలియన్ బాట పట్టగా, కీనన్ వాజ్ (9) రాణించలేకపోయాడు. చివర్లో సౌరభ్ బండేకర్ (53 నాటౌట్) మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయాడు. స్కోరు వివరాలు హైదరాబాద్ ఇన్నింగ్స: తన్మయ్ అగర్వాల్ (సి) సింగ్ (బి) బండేకర్ 91; అక్షత్ రెడ్డి (సి) మిషాల్ (బి) నర్వేకర్ 55, బద్రీనాథ్ రనౌట్ (బండేకర్) 49, అనిరుధ్ 9 నాటౌట్, రవితేజ (బి) అమిత్ 3, సుమంత్ 12 నాటౌట్; ఎక్స్ట్రాలు 5; మొత్తం 20 ఓవర్లలో 4 వికెట్లకు 224. వికెట్ల పతనం: 1-111, 2-198, 3-201, 4-211. బౌలింగ్: ఆర్ఆర్ సింగ్: 4-0-38-0; సౌరభ్ 4-0-54-1; జకాతి 3-0-36-0; అమిత్ యాదవ్ 3-0-34-1; జీడీ నర్వేకర్ 4-0-28-1; మిషాల్: 1-0-15-0; డీడీ గగోయ్ 1-0-18-0. గోవా ఇన్నింగ్స: షగుణ్ కామత్ (స్టంప్డ్) సుమంత్ (బి) భండారి 50, ఎస్ఏ అస్నోద్కర్ రనౌట్ (రవికిరణ్) 19, ఎస్ఎస్ కౌథాంకర్ (బి) సిరాజ్ 2, మిషాల్ (సి) రవికిరణ్ (బి) రవితేజ 25, బండేకర్ 53 నాటౌట్, వాజ్ (సి) మిలింద్ (బి) హసన్ 9, అమిత్ 6 నాటౌట్; ఎక్స్ట్రాలు 9; మొత్తం 20 ఓవర్లలో 5 వికెట్లకు 173. వికెట్లపతనం: 1-28, 2-32, 3-102, 4-104, 5-132. బౌలింగ్: రవికిరణ్ 4-0-29-0; మిలింద్: 4-0-38-0, సిరాజ్ 4-0-24-1, టి. రవితేజ 4-0-33-1, భండారీ 3-0-30-1, హసన్ 1-0-14-1. -
‘ముస్తాక్’ విజేత యూపీ
ముంబై: దేశవాళీ టి20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ఉత్తరప్రదేశ్ గెలుచుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో యూపీ 38 పరుగుల తేడాతో బరోడాపై విజయం సాధించింది. ముందుగా యూపీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. ప్రశాంత్ గుప్తా (49), సురేశ్ రైనా (37 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం బరోడా 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. సోయబ్ తాయి (26) టాప్స్కోరర్గా నిలిచాడు. అంకిత్కు 3 వికెట్లు దక్కాయి. -
ఢిల్లీ చేతిలో ఆంధ్ర చిత్తు
వడోదర: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ జాతీయ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టుకు మరో పరాజయం ఎదురైంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆంధ్ర జట్టు 111 పరుగుల తేడాతో ఢిల్లీ చేతిలో చిత్తుగా ఓడింది. ఆంధ్ర టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 236 పరుగులు చేసింది. నితిష్ రాణా (40 బంతుల్లో 97; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మిలింద్ కుమార్ (58) అర్ధసెంచరీ చేశాడు. ఆంధ్ర బౌలర్ స్టీఫెన్ ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఆంధ్ర జట్టు 19.2 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. శ్రీకాంత్ (37) టాప్ స్కోరర్. ఢిల్లీ బౌలర్లలో నేగి, సుబోధ్, శివమ్ శర్మ రెండేసి వికెట్లు తీసుకున్నారు. కటక్లో ఆసక్తికరంగా జరిగిన మరో మ్యాచ్లో కర్ణాటక జట్టు ఒక్క పరుగు తేడాతో ముంబైపై గెలిచింది. తొలుత కర్ణాటక 20 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటయింది. బిన్నీ (38), తాహా (37), ఉతప్ప (30) రాణించారు. ధావల్ కులకర్ణి, రోహన్ రాజే మూడేసి వికెట్లు తీశారు. తర్వాత ముంబై జట్టు 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. అభిషేక్ నాయర్ (49). శ్రేయస్ అయ్యర్ (32) ఆకట్టుకున్నారు. ముంబై విజయానికి చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం కాగా... వినయ్ కుమార్ బౌలింగ్లో నాయర్ అవుట్ కాగా, చివరి బంతికి తాంబే రనౌట్ అయ్యాడు. అరవింద్, బిన్నీ, కరియప్ప రెండేసి వికెట్లు తీశారు. భజ్జీ సూపర్ బౌలింగ్ కొచ్చిలో జరిగిన మ్యాచ్లో హర్భజన్ అద్భుతమైన బౌలింగ్తో పంజాబ్ జట్టు 8 వికెట్లతో జమ్మూకశ్మీర్ను ఓడించింది. తొలుత జమ్ము జట్టు 19.3 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటయింది. హర్భజన్ (4-0-8-3) ఆకట్టుకున్నాడు. పంజాబ్ 14.3 ఓవర్లలో రెండు వికెట్లకు 108 పరుగులు చేసి గెలిచింది. నాగ్పూర్లో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 14 పరుగులతో హిమాచల్ ప్రదేశ్ను ఓడించింది. ఆశిష్ రెడ్డి (37) రాణించడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 140 పరుగులు చేసింది. బదులుగా హిమాచల్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులు మాత్రమే చేసింది. ఇతర మ్యాచ్ల ఫలితాలు ⇒ బెంగాల్పై 69 పరుగులతో తమిళనాడు విజయం ⇒గోవాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన మధ్యప్రదేశ్ ⇒విదర్భపై 60 పరుగులతో నెగ్గిన గుజరాత్ ⇒ఒడిషాపై 32 పరుగులతో గెలిచిన ఉత్తరప్రదేశ్ ⇒రైల్వేస్పై 9 పరుగుల తేడాతో గట్టెక్కిన బరోడా ⇒త్రిపురపై 9 వికెట్లతో జార్ఖండ్ ఘన విజయం. -
ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత గుజరాత్
ఫైనల్లో పంజాబ్పై విజయం భువనేశ్వర్ : జాతీయ టి20 క్రికెట్ టోర్నీ ‘సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ’ని గుజరాత్ కైవసం చేసుకుంది. మంగళవారం ఇక్కడ ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో గుజరాత్ 2 వికెట్ల తేడాతో పంజాబ్ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 117 పరుగులు చేసింది. ఇందర్ సింగ్ (41 బంతుల్లో 30; 2 ఫోర్లు), హిమాన్షు చావ్లా (17 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్ రోహిత్ దహియా 15 పరుగులకే 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం గుజరాత్ 19.5 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు చేసింది. స్మిత్ పటేల్ (49 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక అర్ధ సెంచరీతో జట్టును గెలిపించాడు. -
ఆంధ్ర, హైదరాబాద్ ఓటమి
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ కటక్ / భువనేశ్వర్: బ్యాట్స్మెన్ వైఫల్యంలో హైదరాబాద్, ఆంధ్ర జట్లు సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ఓటమిని చవిచూశాయి. గ్రూప్-బి మ్యాచ్లో రాజస్తాన్ 86 పరుగులతో హైదరాబాద్ను ఓడించిం ది. తొలుత రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగులు చేయగా... హైదరాబాద్ 18.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్లో మధ్య ప్రదేశ్ 9 వికెట్లతో ఆంధ్రను ఓడించింది. తొలుత ఆంధ్ర16.4 ఓవర్లలో 58 పరుగులకు ఆలౌట్ కాగా... మధ్య ప్రదేశ్ 6.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 59 పరుగులు చేసి నెగ్గింది. -
గోవా శుభారంభం
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ముంబై: స్వప్నిల్ అస్నోడ్కర్ (59 బంతుల్లో 70 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగడంతో సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ సూపర్ లీగ్లో సౌత్జోన్ చాంపియన్ గోవా జట్టు శుభారంభం చేసింది. రాజ్కోట్లో మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో గోవా 8 వికెట్ల తేడాతో హర్యానాపై విజయం సాధించింది. మొదట హర్యానా 20 ఓవర్లలో 9 వికెట్లకు 116 పరుగులు చేసింది. జోగిందర్ శర్మ (29), రాహుల్ దలాల్ (25) రాణించారు. గడేకర్, గౌరేష్, గార్డ్ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన గోవా 18 ఓవర్లలో 2 వికెట్లకు 117 పరుగులు చేసింది. డోంగ్రే (29) ఫర్వాలేదనిపించాడు. మరో మ్యాచ్లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో జార్ఖండ్ను ఓడించింది. ముంబైలో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్ల్లో బరోడా 7 వికెట్ల తేడాతో బెంగాల్పై; కేరళ 14 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపొందాయి. మొత్తం 10 జట్లు రెండు గ్రూప్లుగా తలపడుతున్న ఈ టోర్నీలో అగ్రస్థానంలో నిలిచిన టీమ్లు ఈనెల 14న జరిగే ఫైనల్లో పోటీపడతాయి. గ్రూప్ ‘ఎ’లో హర్యానా, గోవా, జార్ఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్; గ్రూప్ ‘బి’లో ఢిల్లీ, కేరళ, బెంగాల్, బరోడా, రాజస్థాన్ జట్లు ఉన్నాయి. -
ఓటమితో ముగింపు
సాక్షి, విశాఖపట్నం: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (సౌత్జోన్ టి20)లో హైదరాబాద్ తమ పోరాటాన్ని ఓటమితో ముగించింది. ఇక్కడి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన చివరిదైన ఐదో రౌండ్ లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ రెండు వికెట్ల తేడాతో గోవా చేతిలో పరాజయం చవిచూసింది. గోవా టెయిలెండర్లకు అడ్డుకట్ట వేయలేకపోయిన హైదరాబాద్ బౌలర్లు చేతిలోకి వచ్చిన మ్యాచ్ను చేజార్చారు. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులు చేసింది. తర్వాత గోవా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. హైదరాబాద్ రెండు విజయాలు, మూడు పరాజయాలతో 8 పాయింట్లు సంపాదించి నాలుగో స్థానంలో నిలిచింది. టాస్ నెగ్గిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ అక్షత్ రెడ్డితో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన రవితేజ (45 బంతుల్లో 48, 7 ఫోర్లు) కుదురుగా ఆడాడు. కానీ అక్షత్ (13) విఫలమవగా... క్రీజ్లోకి వచ్చిన విహారి (27 బంతుల్లో 27, 2 ఫోర్లు 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ రాహుల్ సింగ్ (5), ఆశిష్ రెడ్డి (6) చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. చివర్లో అమోల్ షిండే (13 బంతుల్లో 28, 1 ఫోర్, 3 సిక్స్లు) భారీ సిక్సర్లతో గోవా బౌలర్లపై విరుచుకుపడటంతో జట్టు స్కోరు అమాంతం పెరిగింది. గోవా బౌలర్లలో హర్షద్ గడేకర్, గౌరేశ్ గవాస్, లక్ష్యయ్ గార్గ్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గోవా జట్టులో సగుణ్ (44 బంతుల్లో 56, 2 ఫోర్లు, 4 సిక్స్లు) చక్కని స్ట్రోక్స్తో అలరించినప్పటికీ అతనికి సహకారమిచ్చేవారే కరువయ్యారు. స్వప్నిల్ అస్నోడ్కర్ (1), దేశాయ్ (9), రోహిత్ అస్నోడ్కర్ (0), డోంగ్రే (10), కీనన్ వాజ్ (2), మిశా ల్ (2) ఇలా టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వరకు అందరిని తక్కువ స్కోర్లకే ఔట్ చేసిన హైదరాబాద్ బౌలర్లు... గోవా టెయిలెండర్లు గడేకర్ (30), అమిత్ యాదవ్ (15 బంతుల్లో 38 నాటౌట్; 5 సిక్స్లు)లపై ప్రభావం చూపలేకపోయారు. షిండే, కనిష్క్, ఆశిష్ రెడ్డిలు తలా 2 వికెట్లు పడగొట్టారు. గోవా టాప్... మొత్తం ఐదు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో గోవా ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ నెగ్గి 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మూడు విజయాలు నమోదు చేసిన కేరళ 12 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈనెల 8 నుంచి 14 వరకు రాజ్కోట్, ముంబైలలో జరిగే సూపర్ లీగ్ దశకు సౌత్జోన్ నుంచి గోవా, కేరళ అర్హత సాధించాయి. స్కోరు వివరాలు హైదరాబాద్ ఇన్నింగ్స్: అక్షత్ (సి) రోహిత్ అస్నోడ్కర్ (బి) గడేకర్ 13; రవితేజ (సి) స్వప్నిల్ (బి) గార్గ్ 48; విహారి (సి) అమిత్ (బి) మిశాల్ 27; రాహుల్ సింగ్ (బి) గార్గ్ 5; ఆశిష్ (సి) గడేకర్ (బి) గవాస్ 6; షిండే (సి) కామత్ (బి) గడేకర్ 28; ఆకాశ్ భండారి (సి) మిశాల్ (బి) గవాస్ 5; సందీప్ నాటౌట్ 6; కనిష్క్ నాయుడు నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 149 వికెట్ల పతనం: 1-21, 2-57, 3-92, 4-99, 5-125, 6-139, 7-144 బౌలింగ్: గడేకర్ 4-0-37-2, గవాస్ 4-0-26-2, గార్గ్ 4-0-24-2, అమిత్ యాదవ్ 3-0-21-0, మిశాల్ 4-0-23-1, దేశాయ్ 1-0-12-0 గోవా ఇన్నింగ్స్: సగుణ్ కామత్ (సి) రాహుల్ (బి) ఆశిష్ 56; స్వప్నిల్ అస్నోడ్కర్ (బి) రవికిరణ్ 1; దేశాయ్ (బి) కనిష్క్ నాయుడు 9; రోహిత్ అస్నోడ్కర్ (సి) రవితేజ (బి) కనిష్క్ 0; సూరజ్ (సి) ఆశిష్ (బి) షిండే 10; వాజ్ (ఎల్బీడబ్ల్యూ-బి) షిండే 2; మిశాల్ (సి) విహారి (బి) ఆశిష్ 2; గడేకర్ (బి) ఓజా 30; అమిత్ యాదవ్ నాటౌట్ 38; గార్గ్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 151 వికెట్ల పతనం: 1-16, 2-33, 3-33, 4-46, 5-51, 6-56, 7-100, 8-144 బౌలింగ్: షిండే 4-0-28-2, రవికిరణ్ 4-0-31-1, ఓజా 4-0-39-1, కనిష్క్ నాయుడు 4-0-30-2, ఆశిష్ 4-0-22-2. -
దుమ్మురేపిన సెహ్వాగ్, గంభీర్
ఢిల్లీకి వరుసగా నాలుగో విజయం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చండీగఢ్: జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన ఢిల్లీ స్టార్ ఆటగాళ్లు గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాంత్ శర్మ దేశవాళీ టోర్నీలో సత్తా చాటుకుంటున్నారు. ఈ త్రయం ప్రతిభతో సయ్యద్ ముస్తాక్ అలీ (నార్త్జోన్) టి20 టోర్నీలో ఢిల్లీ జట్టు వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. గౌతమ్ గంభీర్ (53 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), వీరేంద్ర సెహ్వాగ్ (50 బంతుల్లో 49; 3 ఫోర్లు, 1 సిక్సర్)... బౌలింగ్లో ఇషాంత్ శర్మ (4/9) చెలరేగారు. ఫలితంగా హర్యానాతో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 9 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత హర్యానా 20 ఓవర్లలో 7 వికెట్లకు 140 పరుగులు చేసింది. ఇషాంత్ వరుస విరామాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అనంతరం ఢిల్లీ 17.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి 142 పరుగులు చేసింది. గంభీర్, వీరూ తొలి వికెట్కు 121 పరుగులు జోడించి ఢిల్లీ విజయాన్ని ఖాయం చేశారు. -
శివ 4-3-6-4
చెలరేగిన ఆంధ్ర బౌలర్ హైదరాబాద్ పరాజయం సాక్షి, విజయనగరం: సరిగ్గా నెల రోజుల క్రితం సుబ్బయ్య పిళ్లై వన్డే టోర్నీలో హైదరాబాద్ను చిత్తు చేసిన ఆంధ్ర జట్టు పరిమిత ఓవర్లలో మరోసారి తన ఆధిక్యం ప్రదర్శించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (సౌత్జోన్)లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన టి20 మ్యాచ్లో ఆంధ్ర 8 వికెట్ల తేడాతో హైదరాబాద్పై ఘన విజయం సాధించింది. టోర్నీలో తొలి మూడు మ్యాచ్లు ఓడిన ఆంధ్రకు ఇది తొలి గెలుపు కాగా... హైదరాబాద్కు వరుసగా రెండో ఓటమి. దువ్వారపు శివకుమార్ (4-3-6-4) అద్భుత బౌలింగ్తో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ జట్టు శివకుమార్, బోడవరపు సుధాకర్ (3/9) ధాటికి 20 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. సందీప్ రాజన్ (35 బంతుల్లో 21; 3 ఫోర్లు)దే టాప్ స్కోర్ కాగా, ముగ్గురు బ్యాట్స్మెన్ డకౌటయ్యారు. శివకుమార్ 3 మెయిడిన్ ఓవర్లు వేయడం విశేషం. అనంతరం ఆంధ్ర 11.3 ఓవర్లలో 2 వికెట్లకు 77 పరుగులు చేసి విజయాన్నందుకుంది. శ్రీకాంత్ (0) తొలి ఓవర్లోనే అవుటైనా... కెప్టెన్ ప్రశాంత్ కుమార్ (34 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), జ్యోతి సాయికృష్ణ (24 బంతుల్లో 33; 6 ఫోర్లు) రెండో వికెట్కు 47 బంతుల్లో 56 పరుగులు జోడించి మరో 51 బంతులు మిగిలి ఉండగానే ఆంధ్రను గెలిపించారు. ఈ పరాజయంతో హైదరాబాద్ నాకౌట్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. శనివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లలో గోవాతో హైదరాబాద్, కేరళతో ఆంధ్ర తలపడతాయి. -
ఆంధ్ర చేతిలోనూ చిత్తు
సాక్షి, విజయనగరం: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ (సౌత్జోన్)లో పటిష్టమైన కర్ణాటకను ఓడించి ఆశలు రేకెత్తించిన హైదరాబాద్ అంతలోనే పేలవంగా మారిపోయింది. గత మ్యాచ్లో తమిళనాడు చేతిలో చిత్తయిన జట్టు... తాజాగా ఆంధ్ర ముందు కూడా తలవంచింది. శుక్రవారం ఇక్కడి పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన లీగ్ మ్యాచ్లో ఆంధ్ర 8 వికెట్ల తేడాతో హైదరాబాద్పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ సరిగ్గా 20 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం ఆంధ్ర 11.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 77 పరుగులు సాధించింది. శివకుమార్ (4/6), సుధాకర్ (3/9) ధాటికి హైదరాబాద్ బ్యాట్స్మెన్లో ఒక్కరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. వరుస కట్టి పెవిలియన్కు... టాస్ ఓడిన హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్కు దిగింది. ఇన్నింగ్స్ నాలుగో బంతికే రవితేజ (0)ను అవుట్ చేసి సుధాకర్ హైదరాబాద్ పతనానికి శ్రీకారం చుట్టాడు. తర్వాత శివకుమార్ తన తొలి ఓవర్లోనే విహారి (2)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం తన రెండో ఓవర్లో వరుస బంతుల్లో అక్షత్ (9), రాహుల్ (0)లను కూడా అవుట్ చేసిన శివ... తన చివరి ఓవర్లో భండారి (1)ని వెనక్కి పంపాడు. 13 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఈ దశలో సందీప్ రాజన్ (35 బంతుల్లో 21; 3 ఫోర్లు), హబీబ్ (23 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) 27 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. వీరిద్దరిని వరుస ఓవర్లలో స్వరూప్ అవుట్ చేశాడు. ఆఖరి ఓవర్లో సుధాకర్ మరో 2 వికెట్లు తీయడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. అలవోకగా... సునాయాస లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర కూడా నాలుగో బంతికే శ్రీకాంత్ (0) వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ ప్రశాంత్ (34 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), సాయికృష్ణ (24 బంతుల్లో 33; 6 ఫోర్లు) కలిసి ఎలాంటి ఇబ్బందీ లేకుండా స్కోరును నడిపించారు. వీరిద్దరు రెండో వికెట్కు 47 బంతుల్లో 56 పరుగులు జోడించి జట్టును విజయానికి చేరువగా తెచ్చారు. ఈ దశలో సాయికృష్ణ అవుటైనా, రికీ భుయ్ (9 నాటౌట్) తో కలిసి ప్రశాంత్ జట్టుకు విజయాన్నందించాడు. ఈ గెలుపుతో ఆంధ్రకు 4 పాయింట్లు దక్కాయి. స్కోరు వివరాలు హైదరాబాద్ ఇన్నింగ్స్: అక్షత్ (ఎల్బీ) (బి) శివకుమార్ 9; రవితేజ (సి) సాయికృష్ణ (బి) సుధాకర్ 0; విహారి (బి) శివకుమార్ 2; రాజన్ (ఎల్బీ) (బి) స్వరూప్ 21; రాహుల్ (సి) భరత్ (బి) శివకుమార్ 0; భండారి (సి) సాయికృష్ణ (బి) శివకుమార్ 1; హబీబ్ (సి) శివకుమార్ (బి) స్వరూప్ 18; ఆశిష్ (సి) ప్రశాంత్ (బి) హరీశ్ 0; ఓజా (సి) శ్రీకాంత్ (బి) సుధాకర్ 10; కనిష్క్ (సి) శ్రీకాంత్ (బి) సుధాకర్ 11; రవికిరణ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 76 వికెట్ల పతనం: 1-1; 2-8; 3-11; 4-11; 5-13; 6-40; 7-54; 8-56; 9-75; 10-76. బౌలింగ్: సుధాకర్ 3-0-9-3; శివకుమార్ 4-3-6-4; ప్రవీణ్ 4-0-10-0; హరీశ్ 4-0-24-1; ప్రశాంత్ 1-0-9-0; స్వరూప్ 4-0-17-2. ఆంధ్ర ఇన్నింగ్స్: ప్రశాంత్ (నాటౌట్) 33; శ్రీకాంత్ (సి) ఆశిష్ (బి) కనిష్క్ 0; సాయికృష్ణ (సి) రవితేజ (బి) ఆశిష్ 33; రికీ భుయ్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 2; మొత్తం (11.3 ఓవర్లలో 2 వికెట్లకు) 77 వికెట్ల పతనం: 1-1; 2-57 బౌలింగ్: కనిష్క్ 3-0-17-1; రవికిరణ్ 3-0-21-0; ఆశిష్ రెడ్డి 3-0-21-1; ఓజా 2-0-15-0; భండారి 0.3-0-2-0.