-
Taapsee Pannu Sister: తాప్సీ చెల్లిని చూశారా? ట్రై చేస్తే యాక్టరయ్యేది! (ఫోటోలు)
-
ఇక వ్యక్తిగత జీవితంపై ఫోకస్
వ్యక్తిగత జీవితానికి తాను ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చుకోవాల్సిన తరుణం వచ్చిందన్నట్లుగా మాట్లాడుతున్నారు హీరోయిన్ తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ వివాహం గత నెల 23న ఉదయ్పూర్లో జరిగిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాప్సీ, మథియాస్ తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించలేదు. కానీ వధూవరులుగా తాప్సీ, మథియాస్ ఉన్న వీడియోలు వైరల్ అవుతుండటంతో వీరిద్దరికీ వివాహం జరిగిందని స్పష్టమైంది. కాగా పెళ్లి తర్వాత తాప్సీ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కొన్నేళ్లు గడిచిన తర్వాత నేను నటించిన సినిమాల జాబితాను ఓ సారి చూసుకున్నప్పుడు ఆ జాబితా నాకు సంతోషాన్నివ్వాలి. ఎందుకుంటే నా జీవితంలోని ఎక్కువ సమయాన్ని సినిమాలకే కేటాయించాను. 24 గంటల్లో నేను పన్నెండు గంటలు పని చేసిన రోజులూ ఉన్నాయి. అయితే ఇకపై నేను నా వృత్తి జీవితంపైకన్నా, వ్యక్తిగత జీవితంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలనుకుంటున్నా. అందుకే ఈ సినిమా వదులుకోకూడదు అనిపించేంత మంచి స్క్రిప్ట్ అయితేనే చేయాలనుకుంటున్నాను. కెరీర్కి మించిన జీవితం ఒకటి ఉంటుంది. ఆ జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో సమయం గడపాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు తాప్సీ. -
ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో లీక్!
ఇటీవలే హీరోయిన్ తాప్సీ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. పదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోను వివాహమాడింది. వీరిద్దరి వివాహం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో మార్చి 23న ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాహా వేడుకలో కేవలం ఇరుకుటుంబాలు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. తన పెళ్లి గురించి తాప్సీ ఎక్కడే గానీ వెల్లడించలేదు. ఇటీవల తాప్సీ పెళ్లికి సంబంధించిన ఫోటోలను కనిక తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. దానికి 'మేరే యార్కీ షాదీ' అన్న హ్యాష్ట్యాగ్ జత చేసింది. ఆ తర్వాత తాప్సీ తొలిసారి ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. ఈ శారీతో ఈ బంధం కలకాలం ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నానంటూ చీర కట్టుకుని దానిపై బ్లాక్ కలర్ కోట్ వేసుకుని దిగిన ఫోటోలు షేర్ చేసింది. దీంతో తాప్సీ సీక్రెట్గా పెళ్లి చేసుకుందని అభిమానులు విషెస్ తెలిపారు. పెళ్లి వీడియో లీక్.. తాజాగా తాప్సీ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లి కూతురిలా రెడీ అయిన ముద్దుగుమ్మ డ్యాన్స్ చేస్తూ కాబోయే వరుడి వద్దకు చేరుకుంది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాలా సింపుల్గా తాప్సీ పెళ్లి చేసుకుందంటూ పోస్టులు పెడుతున్నారు. తాప్సీ సీనీ కెరీర్.. తాప్సీ సినిమాల విషయానికి వస్తే.. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో పలు సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్ను వదిలేసి బాలీవుడ్కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ స్టార్ హీరోలతో నటిస్తూనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ యాక్ట్ చేసి క్రేజ్ దక్కించుకుంది. A Happy Bride is the prettiest of all! #TaapseePannu gets married to long time beau #MathiasBoe😍 @taapsee #BollywoodBubble pic.twitter.com/ULKZFTZp1T — Bollywood Bubble (@bollybubble) April 3, 2024 View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
పెళ్లి వార్తలు.. తాప్సీ ఫస్ట్ పోస్ట్ చూశారా?
సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొందరు అన్ని విషయాలను ఫ్యాన్స్తో పంచుకుంటారు. మరికొందరు తమ పర్సనల్ విషయాలను గోప్యంగా ఉంచుకోవడానికే ఇష్టపడతారు. అలా ఈ మధ్య హీరో సిద్దార్థ్ సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకోగా హీరోయిన్ తాప్సీ పన్ను అయితే ఏకంగా పెళ్లే చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను పెళ్లాడిందని బాలీవుడ్ సమాచారం. మార్చి 23న వివాహం? మార్చి 23న రాజస్తాన్లోని ఉదయ్పూర్లో ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వివాహ వార్తల నేపథ్యంలో తాప్సీ తొలిసారి ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. సారీతో ఈ బంధం కలకాలం ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నానంటూ చీర కట్టుకుని దానిపై బ్లాక్ కలర్ కోట్ వేసుకుని దిగిన ఫోటోలు షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు నిజంగా చీర గురించే మాట్లాడుతున్నావా? లేదా మథియస్తో నీ బంధం శాశ్వతంగా నిలిచిపోవాలని పరోక్షంగా చెప్తున్నావా? అని కామెంట్లు చేస్తున్నారు. కెరీర్.. తాప్సీ సినిమాల విషయానికి వస్తే.. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో పలు సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్ను వదిలేసి బాలీవుడ్కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ స్టార్ హీరోలతో నటిస్తూనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ యాక్ట్ చేసి క్రేజ్ దక్కించుకుంది. View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) చదవండి: కియారా భర్తను రాశీ పెళ్లి చేసుకుంటే బాగుండేది.. హీరోయిన్ ఏమందంటే? -
సీక్రెట్గా వివాహం చేసుకున్నారా?
హీరోయిన్ తాప్సీ సీక్రెట్గా వివాహం చేసుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ రిలేషన్ షిప్లో ఉన్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మథియాస్, తాప్సీ వివాహం చేసుకున్నట్లుగా గతంలో కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను తాప్సీ ఖండించారు. అయితే తాజాగా మథియాస్, తాప్సీల వివాహం తెరపైకి వచ్చింది. అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో మథియాస్, తాప్సీ వివాహబంధంతో ఒక్కటయ్యారని బాలీవుడ్ సమాచారం. వీరి పెళ్లి వేడుకలు ఈ నెల 20నే మొదలయ్యాయని, 23న వివాహం జరిగిందని టాక్. తాప్సీ మెయిన్ లీడ్గా నటించిన సినిమాలతో అసోసియేట్ అయిన కనికా థిల్లాన్ తో పాటు కొందరు బాలీవుడ్ నటీనటులు తాము ఓ పెళ్లి వేడుకలో పాల్గొంటున్నామన్నట్లుగా సోషల్ మీడియాలో హింట్ ఇచ్చారు. దీంతో వీరు హాజరైంది తాప్సీ వివాహానికే అనే ప్రచారం జరుగుతోంది. మరి.. తాప్సీ, మథియాస్ పెళ్లి జరిగిందా అనే విషయంపై ఆ ఇద్దరే క్లారిటీ ఇవ్వాలి. -
సీక్రెట్గా ప్రియుడిని పెళ్లాడిన తాప్సీ!
హీరోయిన్ తాప్సీ పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చాయో, లేదో అగ్గి మీద గుగ్గిలమైందీ బ్యూటీ. నేను నోరు విప్పితే చాలు ఏది పడితే అది రాసేస్తారా? ఇంకోసారి నా పర్సనల్ విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడనంటూ తెగ సీరియస్ అయింది. కట్ చేస్తే ఇప్పుడు పెళ్లికూతురిగా ముస్తాబైంది. పదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోను వివాహమాడింది. ఉదయ్పూర్లో రహస్య వివాహం బీటౌన్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం మార్చి 23న ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. కేవలం ఇరుకుటుంబాలు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. ముందుగా ప్రచారం జరిగినట్లుగానే ఉదయ్పూర్లో రహస్యంగా పెళ్లి చేసుకుందీ భామ. తన పెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్గా ఉండకూడదనే ఎవవరికీ పెద్దగా ఆహ్వానాలు పంపించలేదట. తనతో పని చేసిన పవైల్ గులాటి, కనిక ధిల్లాన్, అనురాగ్ కశ్యప్ వంటి కొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. ఆ పెళ్లిలోనే వీళ్లంతా.. ఇటీవలే కనిక తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. దానికి 'మేరే యార్కీ షాదీ' అన్న హ్యాష్ట్యాగ్ జత చేసింది. అటు పవైల్ కూడా తాప్సీ సోదరి షగ్ను పన్నుతో పాటు మరికొందరితో గ్రూప్గా దిగిన ఫోటో షేర్ చేశాడు. ఇవన్నీ చూసిన జనాలు.. తాప్సీకి పెళ్లయిపోయిందంటూ శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక తాప్సీ కెరీర్ విషయానికి వస్తే.. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. పలు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. కానీ తను అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్ను వదిలేసి బాలీవుడ్కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ ఓ పక్క స్టార్ హీరోలతో నటిస్తూనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ యాక్ట్ చేస్తోంది. View this post on Instagram A post shared by Pavail Gulati (@pavailgulati) View this post on Instagram A post shared by Kanika Dhillon (@kanika.d) చదవండి: సినిమా ఆఫర్ల కోసం నేను చేసిన వ్యాఖ్యలకు అర్థం ఇదే: ఆశిష్ విద్యార్థి -
రాత్రి పది తర్వాత అలా చేయడం ఇష్టముండదు: తాప్సీ కామెంట్స్ వైరల్
టాలీవుడ్లో ఝుమ్మంది నాదం సినిమాతో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ తాప్సీ. ఇటీవల తాను పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలొచ్చాయి. కానీ వాటిన్నింటిని కొట్టిపారేసింది. ఈ భామకు టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్కు మకాం మార్చింది. హిందీలో సినిమాలు చేస్తూ అలరిస్తోంది. అయితే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తాప్సీ తన పర్సనల్ విషయాలను మాత్రం సీక్రెట్గానే మెయింటెన్ చేస్తోంది. కానీ ఇండస్ట్రీలో జరిగే ఈవెంట్స్, పార్టీల్లో కూడా పెద్దగా కనిపించదు. ఇటీవల జామ్నగర్లో జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సైతం హాజరు కాలేదు. మీరేందుకు పార్చీలకు వెళ్లరంటూ ఆమెను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానాలిచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత పార్టీలు చేసుకోవడం తనకు ఇష్టముండదని వెల్లడించింది. తాప్సీ మాట్లాడుతూ..'పెద్ద స్టార్స్కి మెసేజ్లు పంపమని కొందరు చెప్పారు. అలా అయితేనే నన్ను పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానిస్తారు. కానీ నేను అలా చేయలేను. ఎందుకంటే పొద్దున్నే నిద్ర లేస్తా. అందుకే త్వరగా పడుకోవాలి. నాకు సిగరెట్, మందు తాగే అలవాటు లేదు. పార్టీలకు వెళ్లి ఏం చేయాలో నాకు తెలియదు' అని అన్నారు. అంతే కాకుండా.. 'నాకు పరిచయం లేని వ్యక్తులతో పార్టీ చేసుకునే ఉద్దేశం లేదు. వారితో ఏమి మాట్లాడాలనేది నాకు తెలియదు. పార్టీలకు రాకపోతే ఏం పనికి రారని అర్థం కాదు. ఇలా పార్టీలు చేసుకుంటే బాలీవుడ్లో ముందుకెళ్లడం చాలా సులభం. అంతే కాకుండా రాత్రి 10 గంటల తర్వాత పార్టీ చేసుకోవడం నాకు భారంగా అనిపిస్తుంది. నేను కేవలం ఇప్పటివరకు నా కష్టంతోనే ఇక్కడి వరకు వచ్చాను' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. తాప్సీ, మథాయుస్ బ్రో అనే వ్యక్తితో డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. -
అంత సింపుల్గా హీరోయిన్ తాప్సీ పెళ్లి..!
-
అందుకోసమే పెళ్లి అంటున్న బాలీవుడ్ తారలు
-
Taapsee-Mathias: తాప్సితో ప్రేమ.. మథియస్ బ్యాగ్రౌండ్ ఇదే! (ఫొటోలు)
-
హీరోయిన్ పెళ్లి అంటూ వార్తలు.. కాస్త గట్టిగానే ఇచ్చిపడేసింది!
ఇటీవల పలువురు సినీ తారలు పెళ్లిబంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా హీరోయిన్ తాప్సీ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బో త్వరలోనే పెళ్లాడనుందని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు ఆమె మార్చి చివరి వారంలో రాజస్థాన్ ఉదయ్పూర్లో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకోబోతోందని తెగ ప్రచారం జరుగుతోంది. తనపై పెళ్లి వార్తల నేపథ్యంలో హీరోయిన్ తాప్సీ స్పందించారు. ఇలాంటి వార్తలపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎప్పుడూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.. ఇక నుంచి భవిష్యత్తులోనూ ఎలాంటి స్పష్టత ఇవ్వనని తేల్చి చెప్పారు. తాజా కామెంట్స్తో తన పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది ముద్దుగుమ్మ. కాగా.. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. వారి రిలేషన్ గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సౌత్ నుంచి బాలీవుడ్లోకి అడుగుపెట్టిన తర్వాత అతడితో పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు. కాగా.. గతేడాది డిసెంబర్లో వచ్చిన షారుక్ మూవీ డంకీ చిత్రంలో మెరిసింది తాప్సీ. ఈ చిత్రాన్ని రాజ్కుమార్ హిరాణీ రూపొందించారు. ప్రస్తుతం తాప్సీ ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా చిత్రంలో నటిస్తున్నారు. హసీన్ దిల్రుబాకు సీక్వెల్గా వస్తోన్న ఈ చిత్రానికి జయ్ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) -
మనోళ్ల కోచ్.. వరల్డ్ నంబర్ 1: తాప్సితో ప్రేమ.. మథియస్ బ్యాగ్రౌండ్ ఇదే!
ప్రేమకు సరిహద్దులు ఉండవు.. మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడితే పరిచయాన్ని పరిణయం దాకా తీసుకువెళ్లడమే తరువాయి అన్నట్లు.. ఇప్పటికే ఎన్నో సెలబ్రిటీ జంటలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యాయి. తాప్సి పన్ను- మథియస్ బో కూడా ఆ జాబితాలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఉదయ్పూర్ వేదికగా ఈ లవ్ బర్డ్స్ మార్చిలో ఏడడుగులు వేయనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తాప్సి పన్ను బాలీవుడ్లో పింక్, థప్పడ్ వంటి సినిమాలో నటిగా తనను తాను నిరూపించుకుంది. ఇటీవల షారుఖ్ ఖాన్తో కలిసి డంకీ సినిమాలో కనిపించింది ఈ ఢిల్లీ సుందరి. ఎల్లలు దాటిన ప్రేమ హీరోయిన్గా ఎదుగుతున్న సమయంలోనే తాప్సి.. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోతో ప్రేమలో పడింది. 2014లో బో ఇండియా ఓపెన్ ఆడేందుకు వచ్చినపుడు స్టాండ్స్లో కూర్చుని అతడిని చీర్ చేసింది తాప్సి. అప్పటికే వీరి బంధం గురించి గుసగుసలు వినిపించగా.. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో సాధించిన విజయాలను పరస్పరం సెలబ్రేట్ చేసుకుంటూ తాము ప్రేమలో ఉన్న విషయాన్ని చెప్పకనే చెప్పారీ సెలబ్రిటీ పీపుల్. తాప్సీనే ఓ అడుగు ముందుకేసి.. రాజ్ షమాని పాడ్కాస్ట్లో తమ బంధం గురించి అధికారికంగా ప్రకటించింది. పదేళ్లుగా మథియస్ బోతో తాను రిలేషన్లో ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇప్పుడిక ప్రేమను పెళ్లిపీటలు ఎక్కించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాప్సి మాత్రం వీటిని ఖండించడం గమనార్హం. ఏదేమైనా మథియస్ పేరు నెట్టింట వైరల్ అవుతోంది. ఎవరీ మథియస్ బో? జూలై 11, 1980లో డెన్మార్క్లో జన్మించాడు మథియస్ బో. 1998లో అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో అడుగుపెట్టాడు. అనతి కాలంలోనే డబుల్స్ విభాగంలో వరల్డ్ నంబర్ వన్ స్థాయికి చేరుకున్నాడు. యూరోపియన్ చాంపియన్షిప్స్-2006లో పురుషుల డబుల్స్ విభాగంలో రజతం గెలిచిన మథియస్ బో.. 2010లో డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లునెగ్గాడు. 2011లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లోనూ చాంపియన్గా అవతరించాడు. ఒలింపిక్ మెడల్ విన్నర్ ఈ ఆ తర్వాత సహచర ఆటగాడు కార్స్టన్ మొగెన్సన్తో కలిసి మెన్స్ డబుల్స్ విభాగంలో 2012 లండన్ ఒలింపిక్స్లో రజత పతకం గెలిచాడు. చైనాలోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేస్తూ.. 2013 వరల్డ్ చాంపియన్షిప్స్లోనూ సిల్వర్ మెడల్ అందుకుంది ఈ జోడీ. ఇక 2015లో యూరోపియన్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించిన మథియస్ బో.. 2012, 2017లో యూరోపియన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్ విజేతగానూ నిలిచాడు. భారత బ్యాడ్మింటన్ మెన్స్ జట్టు కోచ్గా.. దాదాపు రెండు దశాబ్దాల పాటు విజయవంతమైన ఆటగాడిగా కొనసాగిన మథియస్ బో.. 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ క్రమంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ చిరాగ్ శెట్టి అభ్యర్థన మేరకు కోచ్గా అవతారమెత్తాడు. మనోళ్లను నంబర్ వన్గా నిలిపి 2021 నుంచి చిరాగ్ శెట్టి- ఆంధ్రప్రదేశ్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి సహా భారత బ్యాడ్మింటన్ డబుల్స్ టీమ్కు మార్గదర్శనం చేస్తున్నాడు మథియస్ బో. చిరాగ్- సాత్విక్ వరల్డ్ నంబర్ వన్ జోడీగా ఎదగడంలో కీలక పాత్ర పోషించాడు. తమ విజయాలకు మథియస్కే క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుందని ఈ ఇద్దరు ప్లేయర్లు ఓ సందర్భంలో పేర్కొన్నారు కూడా! ఇక ప్రస్తుతం మథియస్ బో చిరాగ్- సాత్విక్ను 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. సేవలోనూ ముందే.. తన ప్రేయసి తాప్సితో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మథియస్కు అలవాటు. ఇటీవలే వీరిద్దరు నన్హీ కాలి ప్రాజెక్టులో భాగమై.. బాలికా విద్య ఆవశ్యకతను చాటిచెప్పే బాధ్యత తీసుకున్నారు. -
హీరోయిన్ తాప్సీ.. సీక్రెట్గా ప్రియుడితో పెళ్లికి సిద్ధమైందా?
మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయిందా అంటే అవుననే సమాధానమే గట్టిగా వినిపిస్తోంది. మొన్నీమధ్యే రకుల్ ప్రీత్ సింగ్.. ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. తెలుగు హీరో ఆశిష్ కూడా కొన్నిరోజుల క్రితమే వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ తాప్సీ కూడా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైందట. ప్రియుడితో రహస్యంగా ఏడడుగులు వేయనుందని సమాచారం. (ఇదీ చదవండి: కాబోయే భర్త విజయ్ దేవరకొండలా? రష్మిక ట్వీట్ వైరల్) ఢిల్లీకి చెందిన తాప్సీ.. 'ఝమ్మంది నాదం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్కి షిఫ్ట్ అయిపోయింది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్, స్టార్ హీరోలతో నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్గా ఫేమ్ సంపాదించింది. రెండు నెలల క్రితం 'డంకీ'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాల సంగతి పక్కనబెడితే తాప్సీ.. గత పదేళ్ల నుంచి డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోతో రిలేషన్లో ఉంది. కాకపోతే ఈ విషయం బయటపడకుండా చాలా జాగ్రత్తగా మెంటైన్ చేస్తూ వచ్చింది. గతేడాది తమ బాండింగ్ గురించి అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు అతడితోనే ఏడడుగులు వేయనుందట. సెలబ్రిటీలు ఎక్కువగా ఒక్కటయ్యే ఉదయ్పూర్ వీళ్ల పెళ్లికి వేదిక కానుందట. అలానే కేవలం ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలోనే ఈ వేడుక జరగనుందట. అయితే ఈ పెళ్లిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కొత్త వాచ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే) -
నాజుకు నడుముతో తాప్సీ హొయలు.. పెళ్లిలో తెలుగు హీరోయిన్ బిజీ
కాక రేపుతున్న 'బిగ్బాస్' బ్యూటీ రతికా రోజ్ క్లాస్ లుక్లో మరింత అందంగా కనిపిస్తున్న శ్రీలీల పసుపు చీరలో క్యూట్నెస్తో చంపేస్తున్న అమృత అయ్యర్ నాభి అందాలతో టెంప్ట్ చేస్తున్న హీరోయిన్ తాప్సీ కిర్రాక్ బ్యాక్ పోజులతో హీరోయిన్ యషికా ఆనంద్ థార్ కారు పక్కన రేసుగుర్రంలా హాట్ బ్యూటీ రీతూ చౌదరి అందాల జాతర చేస్తున్న టీవీ బ్యూటీ దీపికా పిల్లి అక్క పెళ్లిలో కుందనపు బొమ్మలా హీరోయిన్ ఆషికా View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Gnaneswari Kandregula (@gnaneswari_kandregula) -
చాలా ఏళ్ల నుంచి అతనితో డేటింగ్ లో ఉన్నాను..
-
చాలా ఏళ్ల నుంచి అతనితో డేటింగ్లో ఉన్నాను: తాప్సీ
టాలీవుడ్లో ‘ఝుమ్మంది నాదం’తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథిస్ బోతో తాప్సీ ప్రేమలో ఉన్నట్లు ఇప్పటికే అనేక వార్తలొచ్చాయి. అయితే తాప్సీ మాత్రం తన ప్రేమ గురించి ఎప్పుడూ పెదవి విప్పలేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై తొలిసారి ఆమె మాట్లాడింది. దాదాపు పదేళ్ల నుంచి మాథిస్ బోతో ప్రేమలో ఉన్నానని ఇలా చెప్పింది. 'దక్షిణాది నుంచి బాలీవుడ్లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అతడితో పరిచయం ఏర్పడింది. ఇన్నేళ్ల కాలంలో మా బంధం మరింతగా బలపడుతూ వచ్చింది. ఆ సమయం నుంచి అతడి వెంటే నేను ఉన్నాను. అతనితో బ్రేకప్ చెప్పేసి మరో బంధంలో అడుగుపెట్టాలనే ఆలోచన ఏ రోజూ నాకు రాలేదు. అతడి వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. ప్రేమ, పెళ్లి విషయంలో నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే మా ప్రేమ వ్యవహారం గురించి ఇప్పటివరకు నేను ఎక్కడా మాట్లాడలేదు.' అని తాప్సీ చెప్పింది. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 13 ఏళ్లు అయ్యిందని తాప్సీ గుర్తు చేసుకుంది. ప్రేక్షకాదరణ వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని ఆమె పేర్కొంది. అభిమానుల తనపై చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు చెప్పింది. గతేడాదిలో షారుక్ ఖాన్తో 'డంకీ' చిత్రంలో తాప్సీ మెరిసింది. బాలీవుడ్లో ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. వహ లడ్కీ హై కహా, ఫిర్ అయీ హసీన్ దిల్రుబా, ఖేల్ ఖేల్ మే చిత్రాల్లో ఆమె నటిస్తుంది. (ఇదీ చదవండి: జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణ చెప్పిన నయనతార) -
మత్తెక్కించేలా పోజిచ్చిన ఆ బ్యూటీ.. కేక పుట్టించేలా తాప్సీ
బీచ్ ఒడ్డున క్యూట్గా హాట్ బ్యూటీ హంస నందిని స్పాట్ లైట్ వెలుగులో మెరిసిపోతున్న హీరోయిన్ తాప్సీ మెడపై చెయ్యి పెట్టి మత్తెక్కిస్తున్న తెలుగమ్మాయి రీతూవర్మ చీరలో మరింత అందంగా కనిపిస్తున్న సంయుక్త మేనన్ కొబ్బరితోటలో వయ్యారంగా పోజులిస్తున్న పూజాహెగ్డే వర్కౌట్ బిజీలో బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి నాభి అందాలతో రెచ్చిపోతున్న భూమీ పెడ్నేకర్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్ View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
అతడితో ప్రేమలో పడ్డా, కానీ.. తాప్సీ బ్రేకప్ స్టోరీ
తాను ఎప్పుడో ప్రేమలో పడ్డానంటోంది హీరోయిన్ తాప్సీ. ఈ ఉత్తరాది బ్యూటీ మొదట కథానాయికగా పాపులర్ అయింది దక్షిణాది చిత్రాలతోనే. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల దర్శక నిర్మాతలే ఈమెను స్టార్ హీరోయిన్ను చేశారు. ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఆడుగళం చిత్రం ద్వారా తాప్సీ కోలీవుడ్లో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వందాన్ వెండ్రాన్, కాంచన 3, గేమ్ ఓవర్ తదితర చిత్రాల్లో నటించింది. అదే విధంగా తెలుగులో ఝుమ్మంది నాదం చిత్రంతో పరిచయమైన తాప్సీ అక్కడ స్టార్ హీరోల సరసన నటించింది. బాలీవుడ్లో బిజీ ఇలా దక్షిణాది చిత్రాల్లో నటిస్తుండగానే బాలీవుడ్ నుంచి పిలుపువచ్చింది. అక్కడ నటించిన తొలి చిత్రం బేబీ మంచి విజయాన్ని సాధించడంతో వరుసగా అవకాశాలు వరించాయి. హిందీలో పలు లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాల్లోనూ నటించి విజయాలు సాధించింది. ఆ మధ్య అమితాబ్ బచ్చన్తో కలిసి నటించిన పింక్ సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా షారుక్ ఖాన్ సరసన నటించిన డంకీ గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. సీనియర్తో లవ్.. బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణిస్తున్న తాప్సీ ఇటీవల ఒక భేటీలో తన సినీ పయనం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా తన ప్రేమ గురించి మాట్లాడుతూ.. తాను తొమ్మిదవ తరగతి చదువుతున్న సమయంలోనే ప్రేమలో పడ్డానని చెప్పింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రేమించానని చెప్పింది. మొదట్లో అతను తనపై ఆసక్తి చూపాడని, ఆ తరువాత చదువు పాడై పోతుందని భావించి తనకు దూరం అయ్యాడని పేర్కొంది. చదువుపై శ్రద్ధ పెట్టాలని తనకు ఉచిత సలహా కూడా ఇచ్చాడని తెలిపింది. తన తొలి ప్రేమ విఫలం నుంచి బయట పడటానికి చాలా కాలం పట్టిందని తాప్సీ వెల్లడించింది. చదవండి: మాజీ ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన స్టార్ హీరో 'విన్ డీజిల్' -
Dunki Movie Review: ‘డంకీ’ మూవీ రివ్యూ
టైటిల్: డంకీ నటీనటులు: షారుక్ ఖాన్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, బొమాన్ ఇరానీ, అనీల్ గ్రోవర్ తదితరులు నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్కుమార్ హిరాణి ఫిల్మ్స్ నిర్మాతలు:గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్పాండే దర్శకత్వం: రాజ్ కుమార్ హిరాణీ సంగీతం: అమన్ పంత్, ప్రీతమ్(పాటలు) సినిమాటోగ్రఫీ: సీకే మురళీధరన్, మనుష్ నందన్, అమిత్ రాయ్, కుమార్ పంకజ్ విడుదల తేది: డిసెంబర్ 21, 2023 ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా సినిమాలను తెరకెక్కించే అతికొద్ది మంది దర్శకుల్లో రాజ్ కుమార్ హిరాణీ ఒకరు. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. అలాంటిది షారుక్ ఖాన్తో సినిమా అంటే.. ఆ అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. డంకీ విషయంలో అదే జరిగింది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇది. అందుకే డంకీపై మొదటి నుంచే ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 21)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పఠాన్, జవాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ల తర్వాత షారుక్ నటించిన ఈ చిత్రం ఎలా ఉంది? షారుక్ ఖాతాలో హ్యాట్రిక్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం. డంకీ కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1995లో సాగుతుంది. శత్రువుల దాడిలో గాయపడిన సైనికుడు హార్డీ(షారుఖ్)ని ఓ వ్యక్తి కాపాడుతాడు. కొన్నాళ్ల తర్వాత అతన్ని కలిసేందుకు హార్డీ పంజాబ్కి వస్తాడు. అయితే అప్పటికే ఆ వ్యక్తి మరణిస్తాడు. అతని సోదరి మను రంధ్వా అలియాస్ మన్ను(తాప్సీ పన్ను) కుటుంబ బాధ్యతను తీసుకుంటుంది. అప్పులు కట్టలేక ఇంటిని కూడా ఆమ్మేస్తారు. లండన్ వెళ్లి బాగా డబ్బు సంపాదించి.. అమ్ముకున్న ఇంటిని మళ్లీ కొనాలనేది మను కల. అలాగే ఆమె స్నేహితులు బుగ్గు లక్నపాల్(విక్రమ్ కొచ్చర్), బల్లి(అనిల్ గ్రోవర్) కూడా డబ్బు సంపాదించడానికై లండన్ వెళ్లాలనుకుంటారు. వీసా కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు. తన ప్రాణాలను కాపాడిన ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న హార్డీ.. మనుని లండన్ పంపించేందుకు సహాయం చేస్తాడు. ఈ నలుగురు వీసా కోసం ట్రై చేస్తారు. అందుకోసం ఇంగ్లీష్ నేర్చుకోవాలని అష్టకష్టాలు పడతారు. ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లో ఈ నలుగురికి సుఖీ(విక్కీ కౌశల్) పరిచయం అవుతాడు. తన ప్రియురాలి జెస్సీని కలిసేందుకు అతను లండన్ వెళ్లాలనుకుంటాడు. వీళ్లంతా లీగల్గా ఇంగ్లండ్ వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. దీంతో దేశ సరిహద్దుల గుండా అక్రమంగా ప్రయాణించి లండన్ వెళ్లాలని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంగ్లండ్కు అక్రమంగా వెళ్లే క్రమంలో వీళ్లు పడిన కష్టాలేంటి? లండన్లో వీళ్లకు ఎదురైన సమస్యలు ఏంటి? ప్రియురాలి కోసం ఇంగ్లండ్ వెళ్లాలనుకున్న సుఖీ కల నెరవేరిందా లేదా? మన్నుతో ప్రేమలో పడిన హర్డీ.. తిరిగి ఇండియాకు ఎందుకు వచ్చాడు? పాతికేళ్ల తర్వాత.. మన్ను తిరిగి ఇండియాకు ఎందుకు రావాలనుకుంది? ఈ క్రమంలో హార్డీ మళ్లీ ఎలాంటి సహాయం అందించాడు? మను, హర్డీల ప్రేమ కథ సంగతేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మంచి కథ, భావోద్వేగాలతో పాటు చక్కటి సామాజిక సందేశం ఉన్న సినిమాలను తెరకెక్కించడం రాజ్ కుమార్ హిరాణి స్పెషాలిటీ. సామాజిక అంశాలకు వినోదాన్ని మేళవించి ప్రేక్షకులకు అర్థమయ్యేలా సినిమాను తీర్చిదిద్దుతాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, త్రి ఇడియట్స్, పీకే, సంజు..చిత్రాలే వీటికి నిదర్శనం. డంకీ చిత్రంలో కూడా మంచి సోషల్ మెసేజ్ఉంది. కానీ దాన్ని ప్రేక్షకులకు ఆకట్టుకునేదే తీర్చిదిద్దడంలో రాజ్ కుమార్ హిరాణీ పూర్తిగా సఫలం కాలేదు. భారత్ నుంచి అక్రమంగా యూకేలోకి ప్రవేశించాలనుకునే నలుగురు స్నేహితుల కథే డంకీ. దర్శకుడు రాజ్ కుమార్.. అక్రమ వలసదారుల కాన్సెప్ట్ని తీసుకొని దానికి దేశభక్తి, లవ్స్టోరీని టచ్ చేసి ఎమోషనల్ యాంగిల్లో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ పాత్రలదారుల భావోద్వేగాలను ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేయలేకపోయాడు. ఎమోషనల్ సీన్లను ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయాడు. వినోదం పండించడంలో మాత్రం తన పట్టు నిలుపుకున్నాడు. ఫస్టాఫ్ అంతా చాలా సరదాగా సాగిపోతుంది. పాతికేళ్లుగా లండన్లో ఉన్న మన్ను తిరిగి ఇండియా రావాలనుకొని ఆస్పత్రి నుంచి బయటకు పారిపోయే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కాసేపటికే కథ 1995లోకి వెళ్తుంది. మన్ను.. ఆమె స్నేహితులు బల్లి,బుగ్గుల నేపథ్యం నవ్విస్తూనే.. ఎమోషనల్గా టచ్ అవుతుంది. ఇక హీరో ఎంట్రీ అయిన కాసేపటికే కథంతా కామెడీ మూడ్లోకి వెళ్తుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఈ మను గ్యాంగ్ పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. అలాగే వీసా కోసం చేసే ప్రయత్నాలు కూడా నవ్విస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం ఎమోషనల్కు గురి చేస్తుంది. ఇక సెకండాఫ్ అంతా కాస్త సీరియస్గా సాగుతుంది. డంకీ రూటులో( దేశ సరిహద్దులగుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్ అంటారు. పంజాబ్లో దాన్ని డంకీ అని పిలుస్తారు) ఇంగ్లండ్కి వెళ్లే క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇక లండన్ వెళ్లాక ఈ నలుగు పడే కష్టాలు నవ్విస్తూనే..కంటతడి పెట్టిస్తాయి. కొన్ని సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. తిరిగి ఇండియాకు రావాలనుకున్నా..మళ్లీ డాంకీ ట్రావెలే చేయాల్సి వస్తుంది. ఆ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కన్నీళ్లను పెట్టిస్తుంది. కథ సాగదీసినట్లుగా అనిపించడం.. ప్రేక్షకుడి ఊహకు అందేలా కథనం సాగడం కూడా మైనస్. ఎవరెలా చేశారంటే.. పఠాన్, జవాన్ చిత్రాల్లో యాక్షన్తో ఇరగదీసిన షారుక్.. ఇందులో సాదాసీదా పాత్రలో కనిపించి, తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హార్డీసింగ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. కామెడీ పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా అద్భుతంగా నటించాడు. అయితే ఓల్డ్ లుక్లో షారుఖ్ని చూడడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో తాప్సీకి మరో బలమైన పాత్ర లభించింది. మన్ను పాత్రలో ఆమె ఒదిగిపోయింది. సినిమా మొత్తం ఆమె పాత్ర ఉంటుంది. కొన్ని చోట్ల అయితే తనదైన నటనతో కన్నీళ్లను తెప్పిస్తుంది. ఇక విక్కీ కౌశల్ ఈ చిత్రంలో కనిపించేది కొద్ది సేపే అయినా..గుర్తిండిపోయే పాత్రలో నటించాడు. విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్, బోమన్ ఇరాన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. అమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ప్రీతమ్ పాటలు పర్వలేదు.లుట్ ఫుట్ గయా సాంగ్ ఆకట్టకుంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
Taapsee Latest HD Photos: చీర అందాలతో రెచ్చిపోయిన తాప్సీ.. కుర్రకారుల మతి పోగొట్టేస్తుంది (ఫోటోలు)
-
షారుక్ ఖాన్ డంకీ ట్రైలర్ వచ్చేసింది.. తక్కువ అంచనా వేయకండి
బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్, తాప్సీ పన్ను నటించిన డంకీ మూవీ ట్రైలర్ వచ్చేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల నటించడం విశేషం. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తాజాగా మంగళవారం (డిసెంబర్ 5) రిలీజైన ఈ ట్రైలర్ ఫన్, ఎమోషన్ కలగలిపి ఎంతో ఆసక్తి రేపేలా ఉంది. ఈ ట్రైలర్ SRK వాయిస్తో ప్రారంభం అవుతుంది. ఇందులో స్నేహం, కామెడీ, విషాదం వంటి అంశాలు కీలకంగా ఉన్నాయి. ఈ చిత్రంలో ఇంగ్లిష్ నేర్చుకొని యూకే వెళ్లి సెటిలవ్వాలనుకునే ఓ గ్రామీణ యువకుడి పాత్రలో షారుక్ ఖాన్ అదరగొట్టేశాడు అనిపిస్తుంది. కానీ అతనికి ఎంత ప్రయత్నించినా ఇంగ్లిష్ రాకపోవడంతో అక్రమంగా చూకేలోకి చొరబడాలని ప్రయత్నించడం ఆపై అక్కడి వారికి దొరికిపోవడం వంటి అంశాలు ఈ కథలో కీలకంగా ఉండనున్నాయి. షారుక్ జర్నీలో స్నేహితులతో అతను పడే ఇబ్బందులు ఎలా ఎదుర్కొన్నాడో డంకీ ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. తాజాగా డంకీ ట్రైలర్ను షారుక్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఇలా చెప్పాడు. 'ఈ కథను నేను లాల్టూ నుంచి మొదలు పెట్టాను. నా ఫ్రెండ్స్ తో కలిసి రాజు సర్ విజన్ నుంచి మొదలైన ప్రయాణాన్ని డంకీ ట్రైలర్ చూపిస్తుంది. ఈ ట్రైలర్ స్నేహం, కామెడీ, విషాదంతో పాటు ఇల్లు, కుటుంబ జ్ఞాపకాలను అందరినీ తట్టిలేపేలా ఉంటుంది. నేను ఎంతో కాలంగా ఎదరు చూస్తున్న సమయం వచ్చేసింది. డంకీ డ్రాప్ వచ్చేసింది.' అనే క్యాప్షన్తో షారుక్ ఈ ట్రైలర్ రిలీజ్ చేశాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్, పీకే లాంటి సినిమాలను తీసిన రాజు హిరానీ డైరెక్షన్లో డంకీ చిత్రం రావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
సినిమా ఇండస్ట్రీ వాళ్ల చుట్టే తిరుగుతోంది: స్టార్ హీరోయిన్ కామెంట్స్
మొదట దక్షిణాది చిత్రాల్లో నటించి స్టార్ ఇమేజ్ను తెచ్చుకున్న నటి తాప్సీ. ఆ తర్వాత బాలీవుడ్కు మకాం మార్చింది. అక్కడ వరుసగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించి పాపులరిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో కలిసి నటిస్తోన్న తాప్సీ ఇటీవల నిర్మాతగా కూడా అవతారం ఎత్తి 'వీక్ ధక్' అనే హిందీ చిత్రాన్ని నిర్మించింది. బైక్ రైడ్ ఇతివృత్తంతో రూపొందించిన లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం ఇది. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయితే తాజాగా విజయవాడలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన తాప్సీ ప్రస్తుత సినీ పరిశ్రమపై విమర్శలు చేసింది. (ఇది చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్) సినిమా అనేది ప్రస్తుతం స్టార్స్ చుట్టూనే తిరుగుతోందని విమర్శించింది. ఇక్కడ ప్రముఖ నటులకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతోందని, ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలిపింది. ఇది చాలా విచారించదగ్గ విషయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాను ఓ చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్నప్పుడు సహనటుల అర్హత ఏమిటన్నది చూడనని చెప్పింది. అయితే స్టార్స్తో లేని చిత్రాలను ఓటీటీలోకి నెట్టాలని చూస్తున్నారని, అలాంటి భావన సినిమాకు మంచిది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పెద్ద చిత్రాలు చిన్న చిత్రాలను మరుగున పడేస్తున్నాయని.. ఈ పరిస్థితి మారాలని తాప్సీ పేర్కొంది. (ఇది చదవండి: ఒకప్పుడు టాటా నానో.. ఇప్పుడు బీఎమ్డబ్ల్యూ - అట్లుంటది కిమ్ శర్మ అంటే!) -
మార్పు రావాలి
కథానాయికగా సౌత్, నార్త్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తాప్సీ. అయితే హీరోయిన్గా మిగిలిపోకుండా నిర్మాతగానూ నిరూపించుకోవాలనుకున్నారామె. తొలి ప్రయత్నంగా తాప్సీ నిర్మించిన హిందీ చిత్రం ‘ధక్ ధక్’ శుక్రవారం విడుదలైంది. అయితే నిర్మాతగా తనకు చేదు అనుభవం ఎదురైందని తాప్సీ అంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్లో స్టార్ సిస్టమ్ వల్ల చిన్న సినిమాలకు నష్టం జరుగుతోంది. కథ వినేటప్పుడే ‘హీరో ఎవరు?’ అని అడుగుతున్నారు. దాంతో జనాలు ‘కంటెంటే కింగ్’ అనుకుంటారనే నా భ్రమ తొలగిపోయింది. హీరోని బట్టి పెట్టుబడి ఉంటుంది. ఓ నటిగా నేను ఒక కథ వినేటప్పుడు ఆ నిర్మాతలు ఎంత పెద్దవాళ్లు, కో–స్టార్ ఎవరు? అని అడగలేదు. కొత్త దర్శకులతో, కొత్త నటులతో సినిమాలు చేశాను. కానీ వేరేవాళ్లు అలా చేయడానికి ఇష్టపడటంలేదు. ఎందుకీ తేడా? ఈ విషయంలో ఏ ఒక్కర్నో నిందించాల్సిన అవసరం లేదు. యాక్టర్లు, స్టూడియోలు, ప్రేక్షకులు... అందరూ బాధ్యులే. బాలీవుడ్ అర్థవంతమైన చిత్రాలు చేయడంలేదని అంటుంటారు. కానీ, చేసినప్పుడు మాత్రం సపోర్ట్ దక్కదు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. పెద్ద సినిమాలకు పెట్టుబడి పెట్టి, డిజిటల్ రైట్స్ ద్వారా డబ్బు రికవర్ చేసుకోవచ్చని అనుకుంటారు. చిన్న సినిమాలకు పెట్టుబడి పెట్టడం కష్టం.. రిలీజ్ చేసుకోవడమూ కష్టమే. ఈ పరిస్థితి స్టార్స్కి, యాక్టర్స్కి మధ్య దూరం పెంచుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ఇక తాప్సీ ఒక నిర్మాతగా వ్యవహరించిన ‘ధక్ ధక్’ కథ నలుగురు మహిళల చుట్టూ తిరుగుతుంది. -
నటి తాప్సీ కొత్త కారు ఇదే.. ధర తెలిస్తే అవాక్కవుతారు!
'ఝుమ్మంది నాదం'తో తెలుగు చలన చిత్ర సీమలో అడుగుపెట్టిన 'తాప్సీ' ఆ తరువాత షాడో, వీర వంటి సినిమాలతో తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈమె గణేష్ చతుర్థి సందర్భంగా ఒక ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నటి తాప్సీ కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'జిఎల్ఎస్ 600'. దీని ధర రూ. 3 కోట్లు కంటే ఎక్కువే. దీనిని కంపెనీ ఆదివారం ఆమె ముంబై నివాసంలో డెలివరీ చేసింది. పల్లాడియం సిల్వర్ కలర్ ఆప్షన్ కలిగిన ఈ కారు తన గ్యారేజిలో చేరిన రెండవ బెంజ్ కారు. తాప్సీ గ్యారేజిలో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ, జీప్ కంపాస్, బీఎండబ్ల్యూ 3-సిరీస్, ఆడి ఏ8ఎల్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి జిఎల్ఎస్ 600 చేరింది. ఈ కొత్త కారు చాలా లగ్జరీ ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇక మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 600 విషయానికి వస్తే.. 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజన్ కలిగి 550 హెచ్పి పవర్ అండ్ 730 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఇది EQ బూస్ట్ టెక్నాలజీ కూడా పొందుతుంది. కావున అదనపు పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇదీ చదవండి: ఇదే జరిగితే 'డిస్నీ ఇండియా' ముఖేష్ అంబానీ చేతికి! జిఎల్ఎస్ 600 పెద్ద 12.3 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే & 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే కలిగి కారుకి సంబంధించిన అన్ని వివరాలు డ్రైవర్కి అందిస్తుంది. అంతే కాకుండా నప్పా లెదర్ అపోల్స్ట్రే, రిక్లైనింగ్ రియర్ సీట్లు, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, రిఫ్రిజిరేటర్ కంపార్ట్మెంట్ కలిగిన రియర్ సీట్లు మొదలైన ఆధునిక ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. ఇదీ చదవండి: గడ్కరీ చెప్పినా అప్పటివరకు తప్పదు.. టాటా ఎండీ శైలేశ్ చంద్ర ఇప్పటికే ఈ ఖరీదైన లగ్జరీ కారుని ఆయుష్మాన్ ఖురానా, దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్, కృతి సనన్, అజయ్ దేవగన్, ఆదిత్య రాయ్ కపూర్, అర్జున్ కపూర్, శిల్పా శెట్టి మాత్రమే కాకుండా ఆర్ఆర్ఆర్ నటుడు రామ్ చరణ్ కూడా కొనుగోలు చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈ కారుపై సెలబ్రిటీలకు ఎంత మక్కువ ఉందో ఇట్టే అర్థమైపోతోంది. -
సమంత ఆ డ్రస్లో.. మెరిసిపోతున్న అతుల్య
క్రేజీ పోజుల్లో హీరోయిన్ హన్సిక ఎంబ్రయిడరీ ఔట్ఫిట్లో సమంత మహాలక్ష్మిలా మెరిసిపోతున్న అతుల్య మెల్బోర్న్లో ఎంజాయ్ చేస్తున్న హరితేజ రెడ్ మిర్చిలా రెచ్చిపోయిన పరిణితీ చోప్రా బికినీలో హీట్ పెంచేస్తున్న దిశా పటానీ పల్లెటూరి పిల్లలా దివి పోజులు కేక చేతులు పైకెత్తి మరీ నడుము చూపిస్తున్న రీతూ View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by @parineetichopra View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
‘కాంగ్రెస్ గూండాల దాడి.. ఇదా రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం?’
గుర్తు పెట్టుకోలేనన్ని హామీలిచ్చి.. ఇప్పుడు గుర్తుకు రావడం లేదంటే ఎలా సార్! గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదంటారా!!
ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి..
రాజమాత మాధవి రాజే సింధియా కన్నుమూత
లక్నోపై ఢిల్లీ గెలుపు.. ప్లే ఆఫ్స్లో రాజస్తాన్
మళ్లీ కలకలం రేపుతున్న సుచిత్ర లీక్స్..
పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
ప్రేమలు హీరోయిన్ తో ప్రేమలో పడనున్న రౌడీ..
మళ్లీ జగనే సీఎం..తేల్చేసిన కొమ్మినేని
ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
తప్పక చదవండి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?
- సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
- 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
Advertisement