taapsee Pannu
-
హీరోలకు తక్కువేం కాదు.. ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తున్న హీరోయిన్లు
వెండితెరపై వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తుంటారు హీరోయిన్లు. కొన్ని చిత్రాల్లో ఫెరోషియస్ రోల్స్ చేస్తుంటారు. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తుంటారు. హీరోలా సినిమాని నడిపించేలా హీరోషియస్ రోల్స్ చేస్తున్న కొంతమంది హీరోయిన్స్పై కథనం.ప్రతీకారంపవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేసే అగ్రశ్రేణి హీరోయిన్స్ జాబితాలో అనుష్కా శెట్టి ముందు వరసలో ఉంటారు. ‘అరుంధతి, భాగమతి’ వంటి బ్లాక్బస్టర్ మూవీస్లో అనుష్క చేసిన నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్ను ఆడియన్స్ అంత సులభంగా మర్చిలేరు. కొంత గ్యాప్ తర్వాత ఇలాంటి ఓ పవర్ఫుల్ రోల్నే ‘ఘాటి’ చిత్రంలో చేస్తున్నారు అనుష్క. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇటీవల ‘ఘాటి’ సినిమా గ్లింప్స్ విడుదలైంది. ఈ వీడియోలో ఓ మనిషి తలను అతి క్రూరంగా కొడవలితో నరికిన మహిళగా అనుష్క కనిపించారు. ఈ విజువల్స్ ఆమె పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో స్పష్టం చేశాయి. ‘షూటి’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత రానుంది.ఇక వ్యాపారంలో అత్యుత్తమంగా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు దారుణంగా మోసం చేస్తారు. ఈ మోసంతో ఆ మహిళ మనసు విరిగిపోయి, కఠినంగా మారుతుంది. తనను మోసం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడే గెలవాలనుకుంటుంది. ఆ మహిళ ఎలా గెలిచింది? అన్నదే ‘ఘాటి’ కథ అని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... క్రిష్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ‘వేదం’ సినిమాలో అనుష్క ఓ లీడ్ రోల్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.శివశక్తిదాదాపు ఇరవైఏళ్ల సినీ కెరీర్లో హీరోయిన్ తమన్నా డిఫరెంట్ రోల్స్ చేశారు. వీటిలో కొన్ని యాక్షన్ తరహా చిత్రాలూ ఉన్నాయి. అయితే ఈసారి కొంచెం కొత్తగా యాక్షన్తో కూడిన ఆధ్యాత్మిక పాత్ర నాగసాధువు శివశక్తిగా కనిపించనున్నారు తమన్నా. దర్శకుడు సంపత్ నంది కథతో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓదెల 2’ సినిమాలోనే నాగసాధువు శివశక్తిగా తమన్నా కనిపిస్తారు.మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, యువ, నాగమహేశ్ వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఓదెల మల్లన్న ఆలయం, ఆ గ్రామంలో జరిగే కొన్ని ఊహాతీత ఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.కూతురి కోసం...ఓ రాక్షసుడి నుంచి తన చిన్నారి కుమార్తెను కాపాడుకోవడానికి ఓ తల్లి రాక్షసిగా మారింది. ఈ రాక్షసుడిపై యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో ఆ తల్లి ఎలా పోరాడింది? అనే ఇతివృత్తంతో తెరకెక్కుతున్న తమిళ సినిమా ‘రాక్కాయి’. నయనతార లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ఇది. ఇందులో కూతురి రక్షణ కోసం ఎంతకైనా తెగించే తల్లి పాత్రలో నయనతార నటిస్తున్నారు. సెంథిల్ నల్లసామి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ను రిలీజ్ చేశారు. ఓ చేతిలో బరిసె పట్టుకుని, ఆ బరిసెకు కొడవలి బిగించి, మరో చేతిలో మరో కొడవలిని పట్టుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న నయనతార విజువల్స్ ‘రాక్కాయి’ టైటిల్ గ్లింప్స్లో కనిపించాయి. ఇప్పటివరకు ‘డోరా, ఐరా, నెట్రిక్కన్’ వంటి హారర్ ఫిల్మ్స్, ‘కర్తవ్యం’ వంటి సామాజిక సందేశం ఉన్న సినిమాల్లోనే నయనతార ఎక్కువగా నటించారు. తొలిసారిగా ఆమె ‘రాక్కాయి’ వంటి పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.వంట గదిలో తుపాకీకిచెన్లో గరిటె పట్టుకునే గృహిణిగానే కాదు... అవసరమైతే అదే చేత్తో తుపాకీ కూడా పట్టుకోగలదు. ఇంతకీ ఆ గృహిణి పూర్తి కథ ఏంటో తెలుసుకోవాలంటే ‘మా ఇంటి బంగారం’ సినిమా థియేటర్స్లోకి వచ్చేంతవరకూ వేచి ఉండాలి. ఇందులో సమంత లీడ్ రోల్లో నటిస్తారు. ‘ట్రా లా లా’ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను సమంతనే నిర్మిస్తుండటం విశేషం. ఈ ఏడాది సమంత బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 28న ఈ సినిమాను ప్రకటించారు.అయితే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, షూటింగ్ అప్డేట్స్ వంటి విషయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కంద్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని, షూట్ మొదలైందని సమాచారం. ఇక ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్లో సమంత ఓ యాక్షన్ రోల్ చేసి, బుల్లితెరపై సూపర్హిట్ అయ్యారు. ఇప్పుడు వెండితెరపైనా ఈ రిజల్ట్ను రిపీట్ చేయాలనుకుని యాక్షన్ బేస్డ్ మూవీ ‘మా ఇంటి బంగారం’కి గ్రీన్సిగ్నల్ ఇచ్చారని టాక్.హ్యాండ్ బాగ్లో బాంబుఓ అమ్మాయి హ్యాండ్బ్యాగ్లో ఏముంటాయి? మేకప్ కిట్, మొబైల్ ఫోన్... వగైరా వస్తువులు ఉండటం కామన్. కానీ ఓ అమ్మాయి హ్యాండ్బ్యాగ్లో మాత్రం రక్తంతో తడిసిన కత్తి, ఓ తుపాకీ, బాంబు ఉన్నాయి. ఆ అమ్మాయి ఎవరు అంటే రివాల్వర్ రీటా. వెండితెరపై రివాల్వర్ రీటాగా చేస్తున్నారు కీర్తీ సురేష్. పవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేయడంలో సిద్ధహస్తురాలైన హీరోయిన్స్లో ఒకరైన కీర్తీ సురేష్ ‘రివాల్వర్ రీటా’లో మరోసారి నటిగా తానేంటో చూపించనున్నారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు కె. చంద్రు తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్పై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.గాంధారి గతంకిడ్నాప్కు గురైన తన కుమార్తెను రక్షించుకోవడం కోసం ఓ తల్లి చేసే సాహసాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘గాంధారి’. ఈ చిత్రంలో తల్లి పాత్రలో తాప్సీ నటిస్తున్నారు. ఈ ఫిల్మ్లోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్లను ఆమె డూప్ లేకుండా చేశారు. దేవాశిశ్ మఖీజా దర్శకత్వంలో ఈ సినిమాను కనికా థిల్లాన్ నిర్మిస్తున్నారు. ఓ తల్లి గతం వల్ల ఆమె కూతురు ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? కూతుర్ని కాపాడుకోవడం కోసం ఆ తల్లి ఏం చేసింది? అనే అంశాలతో ‘గాంధారి’ చిత్రకథ ఉంటుందని సమాచారం.ఇలా యాక్షన్ రోల్స్ చేసే హీరోయిన్స్ మరికొంతమంది ఉన్నారు. : ముసిమి శివాంజనేయులు -
ఓ తల్లి ప్రతీకారం
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అటు హీరోయిన్గా ఇటు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు తాప్సీ. తాజాగా ఆమె ప్రధానపాత్రలో నటిస్తున్న హిందీ చిత్రం ‘గాంధారి’. దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కనికా థిల్లాన్ కథ అందించడంతోపాటు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లోపాల్గొన్నారట తాప్సీ. తల్లీకూతుళ్ల అనుబంధం, ఓ తల్లి ప్రతీకారం అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం.కిడ్నాప్ అయిన తన కుమార్తెను కాపాడుకునేందుకు ఓ తల్లి చేసేపోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. వెండితెరపై తాప్సీ తల్లిపాత్రలో కనిపించనున్న తొలి చిత్రం ఇదే. త్వరలో ‘గాంధారి’ సినిమా విడుదల తేదీని ప్రకటించనుంది యూనిట్. ఇదిలా ఉంటే... తాప్సీ ఓ ప్రధానపాత్రలో నటించి, కనికా థిల్లాన్ కథ అందించిన ‘హసీన దిల్రుబా’, ఫిర్ ఆయీ హసీన దిల్ రుబా’లకు మంచి స్పందన లభించింది. దీంతో వీరి కాంబినేషన్లో రూపొందుతున్న ‘గాంధారి’పై బాలీవుడ్లో మంచి అంచనాలున్నాయి. -
నా ఇల్లు.. నా భారతీయత
‘నా ఇల్లంతా భారతీయత కనిపించాలి. ఆ కళతో నేను అనుభూతి చెందాలి’ అంటోంది నటి తాప్సీపన్ను. ముంబైలోని తాప్సీ పన్ను ఇల్లు ప్రాచీన పంజాబీ కళతో ఆకట్టుకుంటుంది. ఇందుకు సోదరి షగున్ తన కలకు సహాయం చేసిందని మరీ మరీ చెబుతుంది తాప్సీ.ఇంటి లోపలి అలంకరణలో ఎర్ర ఇటుక గోడలు, జూట్ చార్పైస్, గోడకు అమర్చిన ఝరోఖాలు ఉన్నాయి. ఇది పంజాబ్ ఇంటీరియర్లలో ఒక అద్భుతమైనప్రాచీన ఇంటిని గుర్తు చేస్తుంది. ‘నా సోదరి వెడ్డింగ్ ప్లానర్,ప్రొఫెషనల్ కూడా. దీంతో ప్రత్యేకమైన డిజైనర్ అవసరం లేకపోయింది. ఆమె మా ఇంటిని చాలా అర్ధవంతంగా మార్చడానికి సహాయం చేసింది. మేం దేశంలోని పంజాబ్, రాజస్థాన్, కచ్ వంటి ప్రాంతాలకు వెళ్లినప్పుడల్లా కొన్ని వస్తువులు సేకరించి, తీసుకొచ్చాం. అలా తీసుకొచ్చిన వాటితోనే మా ఇంటి అలంకరణ చేశాం.ప్రాచీన కళ‘నేనెప్పుడూ విలాసవంతమైన ఇల్లు కావాలనుకోలేదు. భారతీయత కనిపించాలని, అనుభూతి చెందాలని కోరుకుంటాను. అందుకు ఇది ఫ్యాన్సీదా, ఖరీదైనదా అనుకోను. ఇల్లు మన ఆత్మీయులందరినీ స్వాగతించేలా ఉండాలి.దేశీ – విదేశీ మా ఇల్లు అపార్ట్మెంట్లోని డ్యూప్లెక్స్ స్టైల్. ఒక అంతస్తు మొత్తం దేశీ అనుభూతిని పంచుతుంది. నా అభిరుచికి ఈ అంతస్తు అద్దం పడుతుంది. మరొక అంతస్తు నా వ్యక్తిగత స్థలం. అక్కడ, నా మానసిక స్థితిని బట్టి, మార్చుకోవడానికి అనువైనది ఉండేలా చూసుకుంటాను. నా స్నేహితులు దేశీ ఫ్లోర్పైనే సందడి చేస్తారు.ఇక నా గదిని చూసి మాత్రం పింటరెస్ట్ హౌస్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇంట్లోని ప్రతి మూలన ఏదో ఒక ఫొటో ఫ్రేమ్ ఉంటుంది. నాకెందుకో ఏ మూలన ఖాళీగా అనిపించినా, అక్కడ ఫొటో ఫ్రేమ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నా ఫొటో ఆల్బమ్లో అన్ని మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని ఫొటో ఫ్రేమ్స్లో పెట్టి, నచ్చిన చోటల్లా పెట్టేస్తుంటాను. మా నాన్నకు ఇంటీరియర్స్లో చాలా మంచి అభిరుచిని ఉంది. అందుకు ఉపయుక్తంగా, వైద్యపరంగా ఉండటానికి ఇష్టపడతాడు. మాస్టర్ బెడ్రూమ్ క్లాసిక్ వైట్తో ఉంటుంది. నలుగురు పడుకునేంత పెద్ద బెడ్, వుడెన్ ఫ్రేమ్స్, కార్వింగ్తో చేయించాం. వానిటీ ఏరియాలో పెద్ద డ్రెస్సింగ్ మిర్రర్ ఏర్పాటు చేయించాం. మిర్రర్ చుట్టూ ఎల్లో లైట్స్ డిజైన్ చేయించాం. మంచి రంగున్న కర్టెయిన్స్, బెడ్ కు ముందు కిటికీ, ఫ్లోరింగ్ కూడా ఉడ్తో తయారుచేసిందే. బాల్కనీ ఏరియాలో వుడెన్ ఫ్లోరింగ్, ముదురు గోధుమ రంగు కుషన్స్, ప్రింటె ప్యాబ్రిక్స్ ఉంటాయి. కొన్ని మొక్కలతో బాల్కనీ ఏరియాను డిజైన్ చేసుకున్నాం. యోగా చేసుకోవడానికి వీలుగా ప్లేస్ ఉంటుంది. కుండీలలో మొక్కలు, కలర్ఫుల్ ఫ్రేమ్స్, బుద్ద విగ్రహం, వాల్ హ్యాంగింగ్స్... అన్నీ కలిసి ఓ మినీ ఫారెస్ట్ని తలపించేలా డిజైన్ చేయించాం. ఇంటిని డిజైన్ చేయించం అంటే మనలోని కళకు అద్దం పట్టినట్టే’’ అంటోంది తాప్సీ. -
అందులో నిజం లేదు!
‘‘జుడ్వా 2’, ‘డంకీ’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటించినందుకు పెద్ద మొత్తంలో నేను పారితోషికం అందుకున్నానని చాలామంది భావిస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు’’ అంటున్నారు హీరోయిన్ తాప్సీ. బాలీవుడ్లోని స్టార్ హీరోయిన్లలో తాప్సీ ఒకరు. ఓ వైపు హీరోలకి జోడీగా వాణిజ్య చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ దూసుకెళుతున్నారు ఈ బ్యూటీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ హీరో, హీరోయిన్ల మధ్య పారితోషికం వ్యత్యాసంపై స్పందించారు. ‘‘వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని ఆలోచిస్తాను. పారితోషికం విషయంలో నటీనటుల మధ్య వ్యత్యాసం ఉంటుందని అందరికీ తెలుసు.‘జుడ్వా 2’, ‘డంకీ’ సినిమాలకు నేను భారీగా పారితోషికం అందుకున్నానని పలువురు భావిస్తున్నారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నప్పుడు కొందరు నిర్మాతలు ఏదో మాపై దయ చూపుతున్నట్లు వ్యవహరిస్తారు. మా సినిమాలో పెద్ద హీరో ఉన్నాడు. వేరే వాళ్లను ఎంచుకోవాల్సిన అవసరం ఏముంది? అన్నట్లు వారి ప్రవర్తన ఉంటుంది.. మరికొంతమంది ‘మేము మంచి ప్రాజెక్టులు ఇచ్చి మీ కెరీర్ ఉన్నతి కోసం సాయం చేస్తున్నాం.. డబ్బుదేముంది’ అన్నట్లు మాట్లాడతారు. ఇలాంటి మాటలపై నేను ప్రతిరోజూ పోరాటం చేస్తున్నాను. పెద్ద ప్రొడక్షన్స్లో హీరోయిన్ల పాత్రలపై చిన్నచూపు ఉంటుంది’’ అని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్లో వైరల్గా మారాయి. -
హీరోయిన్ ఎవరనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారు: తాప్సీ
సినిమాలో ఏ హీరోయిన్ను సెలక్ట్ చేసుకోవాలన్నది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారంటోంది తాప్సీ పన్ను. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. వరుణ్ ధావన్ 'జుడ్వా', షారూఖ్ ఖాన్ 'డుంకీ' సినిమాలు డబ్బు కోసం చేశానని అందరూ అనుకుంటారు. ఈ చిత్రాల వల్ల నేను ఎంతో సంపాదించానని ఫీలవుతుంటారు. కానీ అది నిజం కాదు. వాస్తవం.. మీ అంచనాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది.పెద్ద సినిమాల్లో ఎక్కువ పారితోషికం?నా చుట్టూ కథ తిరిగే సినిమాల్లోనే నాకు ఎక్కువ పారితోషికం లభిస్తుంది. ఉదాహరణకు హసీన్ దిల్రుబా వంటివి. మిగతా చిత్రాల్లో అంత డబ్బేమీ ఇవ్వరు. పైగా నన్ను పెద్ద సినిమాలో సెలక్ట్ చేసుకుని నాకే ఏదో ఉపకారం చేసినట్లు ఫీలవుతారు.హీరోలే డిసైడ్ చేస్తున్నారుఒక సినిమాలో ఆల్రెడీ పెద్ద హీరో ఉన్నాడు అంటే ఎక్కువ డబ్బు పెట్టి హీరోయిన్ను తీసుకోవాలనుకోరు. అంతేకాదు, ఎవర్ని హీరోయిన్గా తీసుకోవాలన్నది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారు. ఎవరో కొందరు సక్సెస్ఫుల్ దర్శకులు మాత్రమే హీరో మాటను కాదని కథకు తగ్గట్లు హీరోయిన్ను తీసుకుంటారు.ట్రెండింగ్లో ఉన్నవారే కావాలి!ఎక్కువగా హీరోలు ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్లతో కలిసి యాక్ట్ చేయాలనుకుంటారు. లేదా తమను డామినేట్ చేయని నటీమణులు పక్కన ఉండాలని ఫీలవుతారు అని చెప్పుకొచ్చింది. కాగా తాప్సీ పన్ను చివరగా ఖేల్ ఖేల్ మే సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె వో లడ్కీ హై కహా సినిమా చేస్తోంది.చదవండి: ఓటీటీలో 'దేవర' ఎంట్రీ సమయం వచ్చేసిందా..? -
26 సార్లు రీమేక్ అయిన సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, తాప్సి ప్రధాన పాత్రలో మదస్సర్ అజీజ్ తెరకెక్కించిన కామెడీ డ్రామా చిత్రం 'ఖేల్ ఖేల్ మే'. టీ-సిరీస్ నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 15న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీలో ఫర్దీన్ ఖాన్, వాణీ కపూర్, ప్రగ్యా జైస్వాల్, ఆదిత్య సీల్ కీలక పాత్రల్లో నటించారు.దసరా కానుకగా అక్టోబర్ 09 నుంచి 'ఖేల్ ఖేల్ మే' చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. సుమారు రూ. 100 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 60 కోట్ల వరకు రాబట్టింది.మూడు జంటల చుట్టూ తిరిగే కథతో, నవ్వులు పూయించే సన్నివేశాలతో ఉండే ఈ సినిమా ఇప్పటి వరకు ఏకంగా 26సార్లు రీమేక్ అయి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ చోటు సంపాదించుకుంది. 2016లో పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ పేరుతో మొదట ఇటాలియన్లో విడుదలైంది. ఈ ఎనిమిదేళ్లలో 26సార్లు ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఫ్రెంచ్, కొరియన్, మాండరిన్, రష్యన్, ఐస్ల్యాండిక్, తెలుగులో (రిచి గాడి పెళ్లి), మలయాళం (12th మ్యాన్), కన్నడలో (లౌడ్ స్పీకర్) పలు భాషల్లో ఈ చిత్రం రీమేక్ చేశారు. హిందీలో 'ఖేల్ ఖేల్ మే'గా ఈ చిత్రం ఈ ఏడాది విడుదలైంది. -
యాక్షన్ గాంధారి
తాప్సీ ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా హిందీ చిత్రానికి ‘గాంధారి’ టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహిస్తున్నారు. ‘గాంధారి’ సినిమాకు కనికా థిల్లాన్ కథ అందించడంతోపాటు నిర్మిస్తున్నారు. తల్లీకూతుళ్ల అనుబంధం, ఓ తల్లి ప్రతీకారం అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ సమాచారం.కాగా తాప్సీ ఓ ప్రధానపాత్రలో నటించి, కనికా థిల్లాన్ కథ అందించిన ‘హసీనా దిల్రుబా’, ‘ఫిర్ ఆయీ హసీనా దిల్ రుబా’లకు వీక్షకుల నుంచి మంచిపాజిటివ్ రెస్పాన్స్ లభించింది. దీంతో వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న ‘గాంధారి’పై బాలీవుడ్లో అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ‘గాంధారి’ చిత్రం నెట్ఫ్లిక్స్ ఓటీటీ ΄్లాట్ఫామ్లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. -
నో అంటే నో: తాప్సీ
‘‘నేను నటిని మాత్రమే. పబ్లిక్ప్రాపర్టీని కాదు’’ అంటున్నారు హీరోయిన్ తాప్సీ. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ఝుమ్మంది నాదం’ (2010) సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యారు తాప్సీ. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ కొన్నేళ్లుగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టారు. వరుస హిందీ సినిమాలతో దూసుకెళుతున్న తాప్సీ తాజాగా చేసిన బోల్డ్ కామెంట్స్ వైరల్గా మారాయి. సాధారణంగా సెలబ్రిటీలను చూసినప్పుడు వారి ఫోటోలు, వీడియోలు తీయడం కోసం ఉత్సాహం చూపుతుటాంటారు.ఇటీవల తాప్సీని తమ కెమెరాల్లో బంధించేందుకు కొందరు పోటీపడ్డారట. అయితే అందుకు ఆమె నో అంటే నో చెప్పారు. ‘‘నేను నటిని మాత్రమే.. పబ్లిక్ప్రాపర్టీని కాదు. రెండింటికీ చాలా తేడా ఉంది. కెమెరాలతో నా పైకి దూసుకురావడం, ఫిజికల్గా హ్యాండిల్ చేయడం చాలా తప్పు. ఎవరైనా నో అని చెబితే వారి అభి్రపాయానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. నేను ఇలా అంటున్నానని కొందరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఎందుకు హీరోయిన్గా చేస్తున్నావ్? అని కామెంట్ చేయొచ్చు. కానీ నటన నాకు నచ్చిన వృత్తి... అందుకే సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు తాప్సీ. -
శ్రీముఖి క్లాస్ లుక్.. చీరలో మౌనీ రాయ్ ధగధగ!
ఫుల్ ఆనందంగా 'మిస్టర్ బచ్చన్' బ్యూటీ భాగ్యశ్రీఈఫిల్ టవర్ దగ్గర దక్ష నగర్కర్ అందాల ఆరబోతవైట్ డ్రస్ లో మరింత క్యూట్గా ప్రియాభవానీ శంకర్చిట్టి హ్యాండ్ బ్యాగ్తో నాజుగ్గా మెరిసిపోతున్న తాప్సీఓరకంట అలా చూస్తూ మైమరిచిపోయిన శ్రద్ధా దాస్క్లాస్ ఔట్ఫిట్లో హాట్గా కనిపిస్తున్న శ్రీముఖిటర్కీలో గ్లామర్ హీట్ పెంచేస్తున్న హీరోయిన్ శాన్వీ శ్రీవత్సవ View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Nikita Dutta (@nikifying) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) -
Taapsee Pannu: పారిస్ ఒలింపిక్స్లో చీరలతో అలరిస్తున్న తాప్సీ..! (ఫోటోలు)
-
ఆ మూవీ కోసం వేరే నటిని అనుకున్నారు: తాప్సీ
హసీన్ దిల్రుబ సినిమాతో హిట్ అందుకుంది హీరోయిన్ తాప్సీ పన్ను. ఈ మూవీకి సీక్వెల్గా వస్తున్న హసీన్ దిల్రుబ 2 రేపు(ఆగస్టు 9న) నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా తాప్సీ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది.బిజీ అయిపోయాఒక డిఫరెంట్ స్టోరీతో సినిమా తీయాలనుకుంటున్నట్లు దర్శకురాలు కనికా ధిల్లాన్ చెప్పింది. ఆ కథ వినడానికి నేను ఆసక్తిగా ఉన్నానన్నాను. తర్వాత ఇతర సినిమాల షూటింగ్ బిజీలో పడిపోయాను. ఆ షూటింగ్ పూర్తి చేసుకునేసరికి కనిక.. తన కథను మరో నటికి వివరించిందని తెలిసింది.వెంటనే ఓకే చెప్పాకొన్ని నెలల తర్వాత తను మళ్లీ నాకు ఫోన్ చేసింది. తన ఆఫీసుకు రమ్మని కథ వినిపించింది. కథ చెప్పడం పూర్తవగానే గట్టిగా నవ్వేశాను. ఇంతకుముందే ఈ మూవీ చేద్దామని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను అన్నాను. అయినా స్క్రిప్ట్ విన్న వెంటనే నాకోసమే రాసినట్లు అనిపించి వెంటనే ఓకే చెప్పా అంది. -
ఒలింపిక్స్లో తాప్సీ సందడి.. ఆ తర్వాత అక్కడే మకాం!
బాలీవుడ్ నటి, హీరోయిన్ తాప్సీ పన్ను ప్రస్తుతం ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీని తాప్సీ నటించిన హిట్ చిత్రం హసీన్ దిల్రూబాకు సీక్వెల్గా తీసుకొస్తున్నారు. ఇందులో విక్రాంత్ మాస్సే, జిమ్మీ షెర్గిల్, సన్నీ కౌశల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 9 నుంచి నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.అయితే ఈ ఏడాది మార్చిలో తన ప్రియుడు మథియాస్ బో పెళ్లాడిన సంగతి తెలిసిందే. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినా మథియాస్ ప్రస్తుతం భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టుకు పురుషుల డబుల్స్ కోచ్గా ఉన్నారు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ గేమ్స్తో బిజీగా ఉన్నారు. తాజాగా తాప్సీ సైతం పారిస్ చేరుతుంది. భారత టీమ్తో పాటు భర్తకు మద్దతు తెలిపేందుకు పారిస్ చేరుకుంది.అయితే తాప్సీ పన్ను, తన భర్త మథియాస్ బో డెన్మార్క్లో కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. త్వరలోనే డెన్మార్క్ ఇంట్లో గృహప్రవేశం జరుగుతుందని తెలిపింది. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత తన భర్తతో పాటు డెన్మార్క్లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తాప్సీ పేర్కొంది. సమ్మర్లో డెన్మార్క్ ఎక్కువ సమయం ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చింది. -
ఆయన గురించి చెప్పుకునేంత సీన్ లేదు: తాప్సీ ఆసక్తికర కామెంట్స్
హీరోయిన్ తాప్సీ ప్రస్తుతం ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో సూపర్ హిట్గా నిలిచిన మూవీకి సీక్వెల్గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. విక్రాంత్ మాస్సే, సన్నీ కౌశల్ కీల పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నేరుగా ఆగస్టు 9న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది.అయితే ఈ ఏడాది మార్చిలో తాప్సీ పన్ను వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు మథియాస్ బోను పెళ్లాడింది. డెన్మార్కు చెందిన మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్తో ఏడడుగులు వేసింది. అయితే తాజా ఇంటర్వ్యూలో తన భర్త గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన భర్త మథియాస్ బో గురించి కొంతమందికి ఇంకా తెలియకపోవడం బాధకరమని తెలిపింది. అలాంటి వారి పట్ల విచారంగా ఉందని వెల్లడించింది.తాప్సీ మాట్లాడుతూ.." నా భర్త మథియాస్ బో ఎవరో తెలియని వారి గురించి నేను చాలా బాధపడ్డా. నేను బయటకు వచ్చి అతని గురించి ప్రజలకు చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే అతను పెద్ద క్రికెటర్ కాదు.. బిజినెస్మెన్ అంతకన్నా కాదు. అతని గురించి మీకు నిజంగా తెలుసుకోవాలని అనిపించడం లేదు అంతే. ప్రపంచంలో బ్యాడ్మింటన్లో అతిపెద్ద విజయాలు సాధించిన వారిలో ఈయన ఒకరు " అని వెల్లడించింది. కాగా.. తాప్సీ 2024 మార్చిలో ఉదయపూర్లో మాజీ డానిష్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోను వివాహం చేసుకుంది. కాగా.. ప్రస్తుతం తాప్సీ భర్త భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లకు కోచ్గా వ్యవహరిస్తున్నారు. -
జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం: తాప్సీ పన్ను
హీరోయిన్ తాప్సీ పన్ను ప్రస్తుతం ఫీర్ ఆయి హాసిన్ దిల్రుబా చిత్రంలో కనిపంచనుంది. 2021లో హసీన్ దిల్రుబా మూవీకి సీక్వెల్గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే, సన్నీ కె కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 9న నెట్ఫ్లిక్స్లో డైరెక్ట్గా రిలీజ్ కానుంది. అయితే ఈ ఏడాది మార్చిలో తన ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోను పెళ్లాడిన సంగతి తెలిసిందే. బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినా మథియాస్ ఇండియన్ ఆటగాళ్లు చిరాగ్ శెట్టి, సాత్విక్సాయిరాజ్ రాంకీరెడ్డికి 2021 నుంచి కోచ్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరు ఆటగాళ్లు పారిస్ ఒలింపిక్స్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.దీంతో తన భర్త కోసం నటి తాప్సీ పన్ను పారిస్ ఒలింపిక్ క్రీడలకు హాజరు కానున్నారు. ఈనెల 29న పారిస్కు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రత్యక్షంగా ఒలింపిక్స్ చూసే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని పేర్కొన్నారు. తన భర్తతో పాటు.. మనదేశ ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు పారిస్ వెళ్తున్నట్లు చెప్పుకొచ్చింది. కాగా.. ఇప్పటికే బాడ్మింటన్ క్రీడాకారులు చిరాగ్ శెట్టి, సాత్విక్సాయిరాజ్, తాప్సీ భర్త మథియాస్ బో పారిస్ చేరుకున్నారు. మథియోస్ను 2012లో ఒలింపిక్స్ పతకం గెలిచిన తర్వాత తొలిసారి కలుసుకున్నట్లు తాప్సీ వెల్లడించింది.కాగా.. తాస్పీ పన్ను తెలుగులో పలు చిత్రాలు చేసింది. బాలీవుడ్లో సూర్మ (2018), సాంద్ కి ఆంఖ్ (2019), రష్మీ రాకెట్ (2021), లూప్ లాపేట (2022), శభాష్ మిథు (2022) స్పోర్ట్స్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసింది. తాను స్క్వాష్ గేమ్ మాత్రమే బాగా ఆడగలనని తాప్సీ తెలిపింది. -
నాకు పెళ్లయిందన్న విషయమే మర్చిపోయా: తాప్సీ
కొందరు తారలకు తమ వ్యక్తిగత విషయాలను ఊరంతా చాటింపు వేసి చెప్పుకోవడం అస్సలు ఇష్టముండదు. హీరోయిన్ తాప్సీ పన్ను కూడా అదే కోవలోకి వస్తుంది. ప్రియుడు, డెన్మార్క బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోతో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ పెళ్లి చేసుకోనుందంటూ వార్తలు వస్తే అలాంటిదేం లేదని కప్పిపుచ్చింది. కట్ చేస్తే సీక్రెట్గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేసింది. మార్చి నెలలో వీరి వివాహం జరిగింది. తరర్వాత తమ పెళ్లి గురించి పరోక్షంగా మాట్లాడుతూ వచ్చింది.సాంగ్ లాంచ్ ఈవెంట్ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఖేల్ ఖేల్ మే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా నుంచి హాలి హాలి అనే పాటను గురువారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ నుంచి తిరిగొస్తున్న తాప్సీని చూసిన ఓ ఫోటోగ్రాఫర్ ఆమెకు శుభాకాంక్షలు చెప్పాడు. అదేంటి? మూవీ రిలీజ్ కాకముందే హిట్టయిందా? అని సరదాగా అడిగింది. నా పెళ్లి నేనే మర్చిపోయాఅందుకాయన పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నాడు. అది విన్న తాప్సీ.. పెళ్లి గురించి కంగ్రాట్స్ చెప్తున్నావా? నాకు వివాహమైందన్న విషయం నేనే మర్చిపోయాను అని ఫన్నీగా రిప్లై ఇచ్చింది. కాగా తాప్సీ 'ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా' సినిమాలో నటించింది. ఇది 'హసీన్ దిల్రుబా'కు సీక్వెల్గా తెరకెక్కింది. ఈ చిత్రం ఆగస్టు 9న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Snehkumar Zala (@snehzala) చదవండి: ఎప్పుడూ చావు గురించే ఆలోచిస్తున్నా.. -
తాప్సీ 'ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా' ట్రైలర్ విడుదల
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’.. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. 2021లో విడుదలైన ‘హసీన్ దిల్రుబా’ చిత్రానికి సీక్వెల్గా ఇప్పుడీ చిత్రం డైరెక్ట్గా ఓటీటీలో విడుదల కానుంది. మర్డర్ మిస్టరీ కథాంశంతో వినీల్ మాథ్యూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం కోసం అభిమానులు కూడా భారీగానే ఎదురుచూస్తున్నారు.‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ సీక్వెల్ను జయ్ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించారు. కనికా థిల్లాన్ నిర్మాత. ఇందులో విక్రాంత్ మాస్సే, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. మర్డర్ మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 9న డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందని కొద్దిరోజుల క్రితం మేకర్స్ ప్రకటించారు. ఇప్పడు విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. కథపై మంచి గ్రిప్పింగ్ ఉండేలా ట్రైలర్ను మేకర్స్ కట్ చేశారు.నిర్మాత కనికా ధిల్లాన్ మాట్లాడుతూ తాప్సీ పన్ను చాలా అద్భుతంగా ఈ చిత్రంలో నటించారని తెలిపింది. పార్ట్ 1 కంటే సీక్వెల్లో ఆమె అందరినీ ఆకట్టుకునేలా మెప్పించారని చెప్పారు. మరో ప్రధాన పాత్రలో నటించిన విక్రాంత్మాస్సే గురించి కూడా ఆమె మాట్లాడింది. ఆయనలోని ప్రతిభ ఈ సినిమాతో మరింతగా ప్రకాశిస్తుందని కనికా చెప్పింది. మీర్జాపూర్లో బబ్లూ పండిట్ పాత్రలో కనిపించిన విక్రాంత్ తెలుగువారికి పరిచయం అయ్యాడు. '12th ఫెయిల్' సినిమాతో మరింత పాపులర్ అయ్యాడు.ఫస్ట్ పార్ట్లో భర్త (విక్రాంత్ మాస్సే)తో కలిసి పక్కా ప్లాన్తో ప్రియుడిని చంపిన రాణి కశ్యప్(తాప్సీ) ఆపై అక్కడి నుంచి ఆమె పారిపోయి కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంది. ఈ కేసులో రాణిని తన భర్త కాపాడుతాడా..? అనేది తెలియాలంటే ఆగష్టు 9న నెట్ఫ్లిక్స్లో విడుదల కానున్న 'ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా' సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలు చేతులెత్తేస్తున్నాయి.. ప్రతి సినిమా తీసుకోవట: తాప్సీ
ఓటీటీల పుణ్యమా అని చిన్న సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. అటు లాభాల బాట పడుతున్నాయని అంతా అనుకుంటున్నారు. కానీ అందరికీ తెలియాల్సిన విషయం మరొకటి ఉందంటోంది హీరోయిన్ తాప్సీ పన్ను. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఇప్పటిదాకా ఏం జరిగేదంటే ఓటీటీల దగ్గర ప్రతి సినిమాకు ఓ ప్యాకేజీ మాట్లాడేసుకునేవారు.ఓటీటీల యూటర్న్దీనివల్ల మూవీలో పెద్ద పెద్ద హీరోలు ఉన్నాలేకున్నా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అంతగా రాకపోయినా నష్టం వాటిల్లకపోయేది. కానీ ఇప్పుడు ఓటీటీలు కూడా యూటర్న్ తీసుకున్నాయి. ప్రతి సినిమాను తీసుకోలేమని చెప్తున్నాయి. వాటిని ప్రమోట్ చేసేందుకు డబ్బు ఖర్చు పెట్టలేమని చేతులెత్తేస్తున్నాయి. పెద్ద స్టార్స్ లేని చిన్న సినిమాను ఆడియన్స్ చూసేలా చేయడం కష్టమని డిజిటల్ ప్లాట్ఫామ్స్ భావిస్తున్నాయి. ఎంతోకొంత ప్రమోషన్ చేసి థియేటర్లో విడుదల చేయమని, ఆ తర్వాతే ఫలానా వారానికి ఓటీటీలో తీసుకుంటామని చెప్తున్నాయి' అని తాప్సీ పేర్కొంది.సినిమాకాగా తాప్సీ చివరగా డంకీ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె నటించిన 'ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా' మూవీ విడుదలకు రెడీ అవుతోంది. ఇందులో విక్రాంత్ మాస్సే, సన్నీ కౌశల్ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే ఖేల్ ఖేల్ మే మూవీలోనూ తాప్సీ కనిపించనుంది.చదవండి: అనంత్ అంబానీతో స్టెప్పులేసిన బాలీవుడ్ స్టార్.. వీడియో వైరల్ -
ఇంత యాటిట్యూడ్ దేనికో.. తాప్సీపై నెటిజన్లు ఫైర్
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు సెల్ఫీలంటూ అభిమానులు ఎగబడుతుంటారు. కొందరు తారలు ఓపికగా వారితో ఫోటోలకు పోజిస్తుంటారు. మరికొందరు వారిని లెక్క చేయకుండా వెళ్లిపోతారు. హీరోయిన్ తాప్సీ రెండో రకానికి చెందినది. తాజాగా ఆమె తన కారు ఎక్కేందుకు వెళ్తుండగా ఫోటోగ్రాఫర్లు ఫోటో ప్లీజ్ అని వెంటపడ్డారు. వారిని ఆమె పట్టించుకోకుండా ముందుకెళ్లిపోయింది. సెల్ఫీకి నోఒక అభిమాని.. ఒక్క సెల్ఫీ మేడమ్ అని విన్నవించినా బేఖాతరు చేసింది. ప్లీజ్.. పక్కకు జరుగు అంటూ అతడివైపు కన్నెత్తి కూడా చూడకుండా నేరుగా కారెక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు తాప్సీ ప్రవర్తనపై విరుచుకుపడుతున్నారు. ఎందుకంత యాటిట్యూడ్జయాబచ్చన్ను చూసి నేర్చుకున్నావా? ఎందుకంత యాటిట్యూడ్ చూపిస్తున్నావ్.., నీ సినిమాలన్నీ షెడ్డుకు వెళ్లిపోతున్నాయన్న ఫ్రస్టేషన్లో ఉన్నావా?, వాళ్లేమీ నిన్ను షూట్ చేయట్లేదు.. ఫోటో తీసుకుంటామంటున్నారు.. అలా పట్టించుకోకుండా పోతున్నావేంటి? అని తాప్సీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood)చదవండి: షారూఖ్ ఖాన్ కంటే నేనే ఎక్కువ సంపాదించా.. -
అతన్ని సాధారణ మనిషిలాగే భావించా..చూడగానే ప్రేమ పుట్టలేదు: తాప్సీ
తమిళసినిమా: ఒకరిపై ప్రేమ కలగడానికి సరైన నిర్వచనం ఉండదు. కొందరు చూడగానే నచ్చేస్తారు. మరి కొందరు వారి ప్రవర్తన కారణంగా ప్రేమించబడతారు. మరొకరు ఒకరినొకరు అర్థం చేసుకున్న తరువాత ప్రేమలో పడతారు. ఇలా ప్రేమలో చాలా కోణాలు ఉంటాయి. కాగా తాప్సీ ఎలా ప్రేమలో పడ్డారో చూద్దాం. ఢిల్లీలో పుట్టి పెరిగన బ్యూటీ తాప్సీ. తొలుత బాలీవుడ్లో నటిగా పరిచయమైన, పాపులరైంది మాత్రం దక్షిణాది చిత్రాలతోనే. తెలుగులో జుమ్మందినాథం చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ, తమిళంలోకి ఆడుగళం చిత్రంతో దిగుమతయ్యారు. ఈ చిత్రం జాతీయ స్థాయిలో అవార్డులను గెలుచుకుంది. అయితే తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువగా స్టార్ హీరోలతో జతకట్టి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత హిందీలో అవకాశాలు రావడంతో అక్కడే ఎక్కువగా దృష్టి పెట్టారు. హిందీలో హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. కాగా ఈమె డెన్మార్క్కు చెందిన మాథియస్ బో అనే బ్యాడ్మింటన్ క్రీడాకారుడితో ప్రేమలో మునిగి తేలుతున్నారు. పెళ్లికి మాత్రం ఇంకా చాలా టైమ్ ఉందంటున్న చెబుతూ వచ్చిన తాప్సీ సమీప కాలంలో రహస్యంగా ప్రియుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. కాగా తన ప్రేమ అనుభవాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలుపుతూ తనకు మాథియస్ను చూడగానే, ఒక నెల తరువాతనో ప్రేమ పుట్టలేదన్నారు. ఆయన్ని చూడగానే గౌరవం ఏర్పడిందన్నారు. ఆయన్ని ఒక సాధారణ మనిషిగానే భావించానని చెప్పారు. ఆ తరువాత తరచూ కలుసుకునేవారిమని చెప్పారు. అలా ఆయన్ని ప్రేమించడం మొదలెట్టానని, అయితే వెంటనే మాథి యస్ బోకు తన ప్రేమను వ్యక్తం చేయలేదని, అందుకు చాలా కాలం తీసుకున్నానని చెప్పారు. ప్రేమ పెళ్లి విధానం వర్కౌట్ అవుతుందా? అని కూడా ఆలోచించడానికి కొంత సమయం తీసుకున్నానని చెప్పా రు. చివరికి తనకు కావలసిన వ్యక్తిని కనుగొన్నానన్న భావన కలగడంతో ఇద్దరం ప్రేమించుకోవడం మొదలెట్టామని తాప్సీ పేర్కొన్నారు. -
ప్రేమ పరీక్షలు పెట్టా!
‘‘మథియాస్తో నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. మథియాస్ కన్నా ముందు నేను కొంతమంది అబ్బాయిలతో డేటింగ్ చేశాను. కానీ మథియాస్ పరిచయమై, తనతో మాట్లాడటం మొదలుపెట్టాక ఫైనల్గా నా అభిప్రాయానికి తగ్గ మనిషిని కనుగొనగలిగాను అనిపించింది’’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్, తాప్సీ ఈ ఏడాది మార్చి 23న అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకున్నారు.ఈ ఇద్దరిదీ లవ్ మ్యారేజ్. అయితే మథియాస్తో ప్రేమలో పడే ముందు కొన్ని ప్రేమ పరీక్షలు పెట్టానని తాప్సీ చెబుతూ – ‘‘నాకు క్రీడాకారులంటే ఇష్టం. దేశం కోసం వాళ్లు ఆడుతుంటారు. ఇక మథియాస్తో నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. అలాగే ఒక నెలలో పుట్టిన ప్రేమ కూడా కాదు. మా మధ్య ఉన్నది నిజమైన ప్రేమేనా అని తెలుసుకోవడానికి కొన్ని ప్రేమ పరీక్షలు పెట్టాను. అన్నింటిలోనూ మథియాస్ గెలిచాడు.ఒక అనుబంధం బలంగా నిలవడం ముఖ్యం. అందుకే నేను తొందరపడలేదు. అంతకు ముందు నాకు పరిచయం ఉన్న అబ్బాయిలు వేరు... మథియాస్ వేరు. ఆ అబ్బాయిల్లో ఏ ఒక్కరినీ మథియాస్తో పోల్చలేం. పరిణతి, భద్రతాభావం... ఇవే అతను నాకు సరైన వ్యక్తి అని నిర్ణయించుకునేలా చేశాయి’’ అన్నారు. -
స్టార్ హీరోయిన్ను పట్టించుకోని డెలివరీ బాయ్.. నెటిజన్ల ప్రశంసలు!
ఎవరైనా సెలబ్రిటీ మనకు ఎదురైతే చాలు. సెల్ఫీల కోసం ఎగబడే కాలం ఇది. ఇక పొరపాటున స్టార్స్ హీరోయిన్స్, హీరోలు కనపడితే ఇంక అంతే. సెల్పీ కోసం క్యూ కడతారు. అలాంటి ఈ రోజుల్లో ఓ డెలివరీ బాయ్ చేసిన పని నెట్టింట తెగ వైరలవుతోంది. అసలేం అతను ఏం చేశాడు? ఎందుకు అంతలా హాట్ టాపిక్గా మారిందో తెలుసుకుందాం.తాజాగా ముంబయిలోని ఓ సెలూన్ నుంచి స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను బయటకొచ్చింది. దీంతో ఆమె అక్కడే వేచి ఉన్న ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ అనుకోకుండా అదే సమయంలో సెలూన్ లోపలికి వెళ్తూ కనిపించారు. అతనికి ఎదురుగా హీరోయిన్ తాప్సీ వస్తున్నప్పటికీ అసలు ఆమెను పట్టించుకోకుండా తన పనేంటో చూసుకుంటూ వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్స్ జరుగు అంటూ గట్టిగా అరిచినా ఎవరినీ లెక్కచేయకుండా సైలెంట్గా లోపలికి వెళ్లిపోయాడు. దీంతో ఆ డెలివరీ బాయ్పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని డెడికేషన్కు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అతను తన పని పట్ల అంకితభావంతో ఉన్నాడంటూ మరొకరు రాసుకొచ్చారు. అతన్ని చూస్తుంటే సంతోషంగా ఉందంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశారు. అతనికి కంపెనీ ప్రోత్సాహం ఇవ్వాలని కొందరు సూచించారు.ఆ తర్వాత తాప్సీ తన కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా.. ఈ ఏడాది మార్చిలో తాప్సీ తన చిరకాల ప్రియుడు, బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు రాజస్తాన్లోని ఉదయపూర్లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇక సినిమావ విషయానికొస్తే ఖేల్ ఖేల్ మే, ఫిర్ అయి హసీన్ దిల్రుబాలో తాప్సీ కనిపించనుంది.Hey @Swiggy, this delivery partner deserves an incentive for his dedication!! 😬😂pic.twitter.com/8MM6RfDZ2V— Divya Gandotra Tandon (@divya_gandotra) May 19, 2024 -
Taapsee Pannu Sister: తాప్సీ చెల్లిని చూశారా? ట్రై చేస్తే యాక్టరయ్యేది! (ఫోటోలు)
-
ఇక వ్యక్తిగత జీవితంపై ఫోకస్
వ్యక్తిగత జీవితానికి తాను ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చుకోవాల్సిన తరుణం వచ్చిందన్నట్లుగా మాట్లాడుతున్నారు హీరోయిన్ తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ వివాహం గత నెల 23న ఉదయ్పూర్లో జరిగిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాప్సీ, మథియాస్ తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించలేదు. కానీ వధూవరులుగా తాప్సీ, మథియాస్ ఉన్న వీడియోలు వైరల్ అవుతుండటంతో వీరిద్దరికీ వివాహం జరిగిందని స్పష్టమైంది. కాగా పెళ్లి తర్వాత తాప్సీ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కొన్నేళ్లు గడిచిన తర్వాత నేను నటించిన సినిమాల జాబితాను ఓ సారి చూసుకున్నప్పుడు ఆ జాబితా నాకు సంతోషాన్నివ్వాలి. ఎందుకుంటే నా జీవితంలోని ఎక్కువ సమయాన్ని సినిమాలకే కేటాయించాను. 24 గంటల్లో నేను పన్నెండు గంటలు పని చేసిన రోజులూ ఉన్నాయి. అయితే ఇకపై నేను నా వృత్తి జీవితంపైకన్నా, వ్యక్తిగత జీవితంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలనుకుంటున్నా. అందుకే ఈ సినిమా వదులుకోకూడదు అనిపించేంత మంచి స్క్రిప్ట్ అయితేనే చేయాలనుకుంటున్నాను. కెరీర్కి మించిన జీవితం ఒకటి ఉంటుంది. ఆ జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో సమయం గడపాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు తాప్సీ. -
ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో లీక్!
ఇటీవలే హీరోయిన్ తాప్సీ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. పదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోను వివాహమాడింది. వీరిద్దరి వివాహం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో మార్చి 23న ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాహా వేడుకలో కేవలం ఇరుకుటుంబాలు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. తన పెళ్లి గురించి తాప్సీ ఎక్కడే గానీ వెల్లడించలేదు. ఇటీవల తాప్సీ పెళ్లికి సంబంధించిన ఫోటోలను కనిక తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. దానికి 'మేరే యార్కీ షాదీ' అన్న హ్యాష్ట్యాగ్ జత చేసింది. ఆ తర్వాత తాప్సీ తొలిసారి ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. ఈ శారీతో ఈ బంధం కలకాలం ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నానంటూ చీర కట్టుకుని దానిపై బ్లాక్ కలర్ కోట్ వేసుకుని దిగిన ఫోటోలు షేర్ చేసింది. దీంతో తాప్సీ సీక్రెట్గా పెళ్లి చేసుకుందని అభిమానులు విషెస్ తెలిపారు. పెళ్లి వీడియో లీక్.. తాజాగా తాప్సీ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లి కూతురిలా రెడీ అయిన ముద్దుగుమ్మ డ్యాన్స్ చేస్తూ కాబోయే వరుడి వద్దకు చేరుకుంది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాలా సింపుల్గా తాప్సీ పెళ్లి చేసుకుందంటూ పోస్టులు పెడుతున్నారు. తాప్సీ సీనీ కెరీర్.. తాప్సీ సినిమాల విషయానికి వస్తే.. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో పలు సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్ను వదిలేసి బాలీవుడ్కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ స్టార్ హీరోలతో నటిస్తూనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ యాక్ట్ చేసి క్రేజ్ దక్కించుకుంది. A Happy Bride is the prettiest of all! #TaapseePannu gets married to long time beau #MathiasBoe😍 @taapsee #BollywoodBubble pic.twitter.com/ULKZFTZp1T — Bollywood Bubble (@bollybubble) April 3, 2024 View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
పెళ్లి వార్తలు.. తాప్సీ ఫస్ట్ పోస్ట్ చూశారా?
సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొందరు అన్ని విషయాలను ఫ్యాన్స్తో పంచుకుంటారు. మరికొందరు తమ పర్సనల్ విషయాలను గోప్యంగా ఉంచుకోవడానికే ఇష్టపడతారు. అలా ఈ మధ్య హీరో సిద్దార్థ్ సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకోగా హీరోయిన్ తాప్సీ పన్ను అయితే ఏకంగా పెళ్లే చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను పెళ్లాడిందని బాలీవుడ్ సమాచారం. మార్చి 23న వివాహం? మార్చి 23న రాజస్తాన్లోని ఉదయ్పూర్లో ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వివాహ వార్తల నేపథ్యంలో తాప్సీ తొలిసారి ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. సారీతో ఈ బంధం కలకాలం ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నానంటూ చీర కట్టుకుని దానిపై బ్లాక్ కలర్ కోట్ వేసుకుని దిగిన ఫోటోలు షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు నిజంగా చీర గురించే మాట్లాడుతున్నావా? లేదా మథియస్తో నీ బంధం శాశ్వతంగా నిలిచిపోవాలని పరోక్షంగా చెప్తున్నావా? అని కామెంట్లు చేస్తున్నారు. కెరీర్.. తాప్సీ సినిమాల విషయానికి వస్తే.. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో పలు సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్ను వదిలేసి బాలీవుడ్కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ స్టార్ హీరోలతో నటిస్తూనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ యాక్ట్ చేసి క్రేజ్ దక్కించుకుంది. View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) చదవండి: కియారా భర్తను రాశీ పెళ్లి చేసుకుంటే బాగుండేది.. హీరోయిన్ ఏమందంటే? -
సీక్రెట్గా వివాహం చేసుకున్నారా?
హీరోయిన్ తాప్సీ సీక్రెట్గా వివాహం చేసుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ రిలేషన్ షిప్లో ఉన్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మథియాస్, తాప్సీ వివాహం చేసుకున్నట్లుగా గతంలో కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను తాప్సీ ఖండించారు. అయితే తాజాగా మథియాస్, తాప్సీల వివాహం తెరపైకి వచ్చింది. అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో మథియాస్, తాప్సీ వివాహబంధంతో ఒక్కటయ్యారని బాలీవుడ్ సమాచారం. వీరి పెళ్లి వేడుకలు ఈ నెల 20నే మొదలయ్యాయని, 23న వివాహం జరిగిందని టాక్. తాప్సీ మెయిన్ లీడ్గా నటించిన సినిమాలతో అసోసియేట్ అయిన కనికా థిల్లాన్ తో పాటు కొందరు బాలీవుడ్ నటీనటులు తాము ఓ పెళ్లి వేడుకలో పాల్గొంటున్నామన్నట్లుగా సోషల్ మీడియాలో హింట్ ఇచ్చారు. దీంతో వీరు హాజరైంది తాప్సీ వివాహానికే అనే ప్రచారం జరుగుతోంది. మరి.. తాప్సీ, మథియాస్ పెళ్లి జరిగిందా అనే విషయంపై ఆ ఇద్దరే క్లారిటీ ఇవ్వాలి. -
సీక్రెట్గా ప్రియుడిని పెళ్లాడిన తాప్సీ!
హీరోయిన్ తాప్సీ పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చాయో, లేదో అగ్గి మీద గుగ్గిలమైందీ బ్యూటీ. నేను నోరు విప్పితే చాలు ఏది పడితే అది రాసేస్తారా? ఇంకోసారి నా పర్సనల్ విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడనంటూ తెగ సీరియస్ అయింది. కట్ చేస్తే ఇప్పుడు పెళ్లికూతురిగా ముస్తాబైంది. పదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోను వివాహమాడింది. ఉదయ్పూర్లో రహస్య వివాహం బీటౌన్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం మార్చి 23న ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. కేవలం ఇరుకుటుంబాలు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. ముందుగా ప్రచారం జరిగినట్లుగానే ఉదయ్పూర్లో రహస్యంగా పెళ్లి చేసుకుందీ భామ. తన పెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్గా ఉండకూడదనే ఎవవరికీ పెద్దగా ఆహ్వానాలు పంపించలేదట. తనతో పని చేసిన పవైల్ గులాటి, కనిక ధిల్లాన్, అనురాగ్ కశ్యప్ వంటి కొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. ఆ పెళ్లిలోనే వీళ్లంతా.. ఇటీవలే కనిక తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. దానికి 'మేరే యార్కీ షాదీ' అన్న హ్యాష్ట్యాగ్ జత చేసింది. అటు పవైల్ కూడా తాప్సీ సోదరి షగ్ను పన్నుతో పాటు మరికొందరితో గ్రూప్గా దిగిన ఫోటో షేర్ చేశాడు. ఇవన్నీ చూసిన జనాలు.. తాప్సీకి పెళ్లయిపోయిందంటూ శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక తాప్సీ కెరీర్ విషయానికి వస్తే.. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. పలు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. కానీ తను అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్ను వదిలేసి బాలీవుడ్కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ ఓ పక్క స్టార్ హీరోలతో నటిస్తూనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ యాక్ట్ చేస్తోంది. View this post on Instagram A post shared by Pavail Gulati (@pavailgulati) View this post on Instagram A post shared by Kanika Dhillon (@kanika.d) చదవండి: సినిమా ఆఫర్ల కోసం నేను చేసిన వ్యాఖ్యలకు అర్థం ఇదే: ఆశిష్ విద్యార్థి -
రాత్రి పది తర్వాత అలా చేయడం ఇష్టముండదు: తాప్సీ కామెంట్స్ వైరల్
టాలీవుడ్లో ఝుమ్మంది నాదం సినిమాతో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ తాప్సీ. ఇటీవల తాను పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలొచ్చాయి. కానీ వాటిన్నింటిని కొట్టిపారేసింది. ఈ భామకు టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్కు మకాం మార్చింది. హిందీలో సినిమాలు చేస్తూ అలరిస్తోంది. అయితే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తాప్సీ తన పర్సనల్ విషయాలను మాత్రం సీక్రెట్గానే మెయింటెన్ చేస్తోంది. కానీ ఇండస్ట్రీలో జరిగే ఈవెంట్స్, పార్టీల్లో కూడా పెద్దగా కనిపించదు. ఇటీవల జామ్నగర్లో జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సైతం హాజరు కాలేదు. మీరేందుకు పార్చీలకు వెళ్లరంటూ ఆమెను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానాలిచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత పార్టీలు చేసుకోవడం తనకు ఇష్టముండదని వెల్లడించింది. తాప్సీ మాట్లాడుతూ..'పెద్ద స్టార్స్కి మెసేజ్లు పంపమని కొందరు చెప్పారు. అలా అయితేనే నన్ను పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానిస్తారు. కానీ నేను అలా చేయలేను. ఎందుకంటే పొద్దున్నే నిద్ర లేస్తా. అందుకే త్వరగా పడుకోవాలి. నాకు సిగరెట్, మందు తాగే అలవాటు లేదు. పార్టీలకు వెళ్లి ఏం చేయాలో నాకు తెలియదు' అని అన్నారు. అంతే కాకుండా.. 'నాకు పరిచయం లేని వ్యక్తులతో పార్టీ చేసుకునే ఉద్దేశం లేదు. వారితో ఏమి మాట్లాడాలనేది నాకు తెలియదు. పార్టీలకు రాకపోతే ఏం పనికి రారని అర్థం కాదు. ఇలా పార్టీలు చేసుకుంటే బాలీవుడ్లో ముందుకెళ్లడం చాలా సులభం. అంతే కాకుండా రాత్రి 10 గంటల తర్వాత పార్టీ చేసుకోవడం నాకు భారంగా అనిపిస్తుంది. నేను కేవలం ఇప్పటివరకు నా కష్టంతోనే ఇక్కడి వరకు వచ్చాను' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. తాప్సీ, మథాయుస్ బ్రో అనే వ్యక్తితో డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. -
అంత సింపుల్గా హీరోయిన్ తాప్సీ పెళ్లి..!
-
అందుకోసమే పెళ్లి అంటున్న బాలీవుడ్ తారలు
-
Taapsee-Mathias: తాప్సితో ప్రేమ.. మథియస్ బ్యాగ్రౌండ్ ఇదే! (ఫొటోలు)
-
హీరోయిన్ పెళ్లి అంటూ వార్తలు.. కాస్త గట్టిగానే ఇచ్చిపడేసింది!
ఇటీవల పలువురు సినీ తారలు పెళ్లిబంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా హీరోయిన్ తాప్సీ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బో త్వరలోనే పెళ్లాడనుందని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు ఆమె మార్చి చివరి వారంలో రాజస్థాన్ ఉదయ్పూర్లో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకోబోతోందని తెగ ప్రచారం జరుగుతోంది. తనపై పెళ్లి వార్తల నేపథ్యంలో హీరోయిన్ తాప్సీ స్పందించారు. ఇలాంటి వార్తలపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎప్పుడూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.. ఇక నుంచి భవిష్యత్తులోనూ ఎలాంటి స్పష్టత ఇవ్వనని తేల్చి చెప్పారు. తాజా కామెంట్స్తో తన పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది ముద్దుగుమ్మ. కాగా.. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. వారి రిలేషన్ గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సౌత్ నుంచి బాలీవుడ్లోకి అడుగుపెట్టిన తర్వాత అతడితో పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు. కాగా.. గతేడాది డిసెంబర్లో వచ్చిన షారుక్ మూవీ డంకీ చిత్రంలో మెరిసింది తాప్సీ. ఈ చిత్రాన్ని రాజ్కుమార్ హిరాణీ రూపొందించారు. ప్రస్తుతం తాప్సీ ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా చిత్రంలో నటిస్తున్నారు. హసీన్ దిల్రుబాకు సీక్వెల్గా వస్తోన్న ఈ చిత్రానికి జయ్ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) -
మనోళ్ల కోచ్.. వరల్డ్ నంబర్ 1: తాప్సితో ప్రేమ.. మథియస్ బ్యాగ్రౌండ్ ఇదే!
ప్రేమకు సరిహద్దులు ఉండవు.. మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడితే పరిచయాన్ని పరిణయం దాకా తీసుకువెళ్లడమే తరువాయి అన్నట్లు.. ఇప్పటికే ఎన్నో సెలబ్రిటీ జంటలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యాయి. తాప్సి పన్ను- మథియస్ బో కూడా ఆ జాబితాలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఉదయ్పూర్ వేదికగా ఈ లవ్ బర్డ్స్ మార్చిలో ఏడడుగులు వేయనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తాప్సి పన్ను బాలీవుడ్లో పింక్, థప్పడ్ వంటి సినిమాలో నటిగా తనను తాను నిరూపించుకుంది. ఇటీవల షారుఖ్ ఖాన్తో కలిసి డంకీ సినిమాలో కనిపించింది ఈ ఢిల్లీ సుందరి. ఎల్లలు దాటిన ప్రేమ హీరోయిన్గా ఎదుగుతున్న సమయంలోనే తాప్సి.. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోతో ప్రేమలో పడింది. 2014లో బో ఇండియా ఓపెన్ ఆడేందుకు వచ్చినపుడు స్టాండ్స్లో కూర్చుని అతడిని చీర్ చేసింది తాప్సి. అప్పటికే వీరి బంధం గురించి గుసగుసలు వినిపించగా.. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో సాధించిన విజయాలను పరస్పరం సెలబ్రేట్ చేసుకుంటూ తాము ప్రేమలో ఉన్న విషయాన్ని చెప్పకనే చెప్పారీ సెలబ్రిటీ పీపుల్. తాప్సీనే ఓ అడుగు ముందుకేసి.. రాజ్ షమాని పాడ్కాస్ట్లో తమ బంధం గురించి అధికారికంగా ప్రకటించింది. పదేళ్లుగా మథియస్ బోతో తాను రిలేషన్లో ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇప్పుడిక ప్రేమను పెళ్లిపీటలు ఎక్కించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాప్సి మాత్రం వీటిని ఖండించడం గమనార్హం. ఏదేమైనా మథియస్ పేరు నెట్టింట వైరల్ అవుతోంది. ఎవరీ మథియస్ బో? జూలై 11, 1980లో డెన్మార్క్లో జన్మించాడు మథియస్ బో. 1998లో అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో అడుగుపెట్టాడు. అనతి కాలంలోనే డబుల్స్ విభాగంలో వరల్డ్ నంబర్ వన్ స్థాయికి చేరుకున్నాడు. యూరోపియన్ చాంపియన్షిప్స్-2006లో పురుషుల డబుల్స్ విభాగంలో రజతం గెలిచిన మథియస్ బో.. 2010లో డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లునెగ్గాడు. 2011లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లోనూ చాంపియన్గా అవతరించాడు. ఒలింపిక్ మెడల్ విన్నర్ ఈ ఆ తర్వాత సహచర ఆటగాడు కార్స్టన్ మొగెన్సన్తో కలిసి మెన్స్ డబుల్స్ విభాగంలో 2012 లండన్ ఒలింపిక్స్లో రజత పతకం గెలిచాడు. చైనాలోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేస్తూ.. 2013 వరల్డ్ చాంపియన్షిప్స్లోనూ సిల్వర్ మెడల్ అందుకుంది ఈ జోడీ. ఇక 2015లో యూరోపియన్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించిన మథియస్ బో.. 2012, 2017లో యూరోపియన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్ విజేతగానూ నిలిచాడు. భారత బ్యాడ్మింటన్ మెన్స్ జట్టు కోచ్గా.. దాదాపు రెండు దశాబ్దాల పాటు విజయవంతమైన ఆటగాడిగా కొనసాగిన మథియస్ బో.. 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ క్రమంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ చిరాగ్ శెట్టి అభ్యర్థన మేరకు కోచ్గా అవతారమెత్తాడు. మనోళ్లను నంబర్ వన్గా నిలిపి 2021 నుంచి చిరాగ్ శెట్టి- ఆంధ్రప్రదేశ్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి సహా భారత బ్యాడ్మింటన్ డబుల్స్ టీమ్కు మార్గదర్శనం చేస్తున్నాడు మథియస్ బో. చిరాగ్- సాత్విక్ వరల్డ్ నంబర్ వన్ జోడీగా ఎదగడంలో కీలక పాత్ర పోషించాడు. తమ విజయాలకు మథియస్కే క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుందని ఈ ఇద్దరు ప్లేయర్లు ఓ సందర్భంలో పేర్కొన్నారు కూడా! ఇక ప్రస్తుతం మథియస్ బో చిరాగ్- సాత్విక్ను 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. సేవలోనూ ముందే.. తన ప్రేయసి తాప్సితో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మథియస్కు అలవాటు. ఇటీవలే వీరిద్దరు నన్హీ కాలి ప్రాజెక్టులో భాగమై.. బాలికా విద్య ఆవశ్యకతను చాటిచెప్పే బాధ్యత తీసుకున్నారు. -
హీరోయిన్ తాప్సీ.. సీక్రెట్గా ప్రియుడితో పెళ్లికి సిద్ధమైందా?
మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయిందా అంటే అవుననే సమాధానమే గట్టిగా వినిపిస్తోంది. మొన్నీమధ్యే రకుల్ ప్రీత్ సింగ్.. ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. తెలుగు హీరో ఆశిష్ కూడా కొన్నిరోజుల క్రితమే వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ తాప్సీ కూడా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైందట. ప్రియుడితో రహస్యంగా ఏడడుగులు వేయనుందని సమాచారం. (ఇదీ చదవండి: కాబోయే భర్త విజయ్ దేవరకొండలా? రష్మిక ట్వీట్ వైరల్) ఢిల్లీకి చెందిన తాప్సీ.. 'ఝమ్మంది నాదం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్కి షిఫ్ట్ అయిపోయింది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్, స్టార్ హీరోలతో నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్గా ఫేమ్ సంపాదించింది. రెండు నెలల క్రితం 'డంకీ'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాల సంగతి పక్కనబెడితే తాప్సీ.. గత పదేళ్ల నుంచి డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోతో రిలేషన్లో ఉంది. కాకపోతే ఈ విషయం బయటపడకుండా చాలా జాగ్రత్తగా మెంటైన్ చేస్తూ వచ్చింది. గతేడాది తమ బాండింగ్ గురించి అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు అతడితోనే ఏడడుగులు వేయనుందట. సెలబ్రిటీలు ఎక్కువగా ఒక్కటయ్యే ఉదయ్పూర్ వీళ్ల పెళ్లికి వేదిక కానుందట. అలానే కేవలం ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలోనే ఈ వేడుక జరగనుందట. అయితే ఈ పెళ్లిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కొత్త వాచ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే) -
నాజుకు నడుముతో తాప్సీ హొయలు.. పెళ్లిలో తెలుగు హీరోయిన్ బిజీ
కాక రేపుతున్న 'బిగ్బాస్' బ్యూటీ రతికా రోజ్ క్లాస్ లుక్లో మరింత అందంగా కనిపిస్తున్న శ్రీలీల పసుపు చీరలో క్యూట్నెస్తో చంపేస్తున్న అమృత అయ్యర్ నాభి అందాలతో టెంప్ట్ చేస్తున్న హీరోయిన్ తాప్సీ కిర్రాక్ బ్యాక్ పోజులతో హీరోయిన్ యషికా ఆనంద్ థార్ కారు పక్కన రేసుగుర్రంలా హాట్ బ్యూటీ రీతూ చౌదరి అందాల జాతర చేస్తున్న టీవీ బ్యూటీ దీపికా పిల్లి అక్క పెళ్లిలో కుందనపు బొమ్మలా హీరోయిన్ ఆషికా View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Gnaneswari Kandregula (@gnaneswari_kandregula) -
చాలా ఏళ్ల నుంచి అతనితో డేటింగ్ లో ఉన్నాను..
-
చాలా ఏళ్ల నుంచి అతనితో డేటింగ్లో ఉన్నాను: తాప్సీ
టాలీవుడ్లో ‘ఝుమ్మంది నాదం’తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథిస్ బోతో తాప్సీ ప్రేమలో ఉన్నట్లు ఇప్పటికే అనేక వార్తలొచ్చాయి. అయితే తాప్సీ మాత్రం తన ప్రేమ గురించి ఎప్పుడూ పెదవి విప్పలేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై తొలిసారి ఆమె మాట్లాడింది. దాదాపు పదేళ్ల నుంచి మాథిస్ బోతో ప్రేమలో ఉన్నానని ఇలా చెప్పింది. 'దక్షిణాది నుంచి బాలీవుడ్లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అతడితో పరిచయం ఏర్పడింది. ఇన్నేళ్ల కాలంలో మా బంధం మరింతగా బలపడుతూ వచ్చింది. ఆ సమయం నుంచి అతడి వెంటే నేను ఉన్నాను. అతనితో బ్రేకప్ చెప్పేసి మరో బంధంలో అడుగుపెట్టాలనే ఆలోచన ఏ రోజూ నాకు రాలేదు. అతడి వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. ప్రేమ, పెళ్లి విషయంలో నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే మా ప్రేమ వ్యవహారం గురించి ఇప్పటివరకు నేను ఎక్కడా మాట్లాడలేదు.' అని తాప్సీ చెప్పింది. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 13 ఏళ్లు అయ్యిందని తాప్సీ గుర్తు చేసుకుంది. ప్రేక్షకాదరణ వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని ఆమె పేర్కొంది. అభిమానుల తనపై చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు చెప్పింది. గతేడాదిలో షారుక్ ఖాన్తో 'డంకీ' చిత్రంలో తాప్సీ మెరిసింది. బాలీవుడ్లో ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. వహ లడ్కీ హై కహా, ఫిర్ అయీ హసీన్ దిల్రుబా, ఖేల్ ఖేల్ మే చిత్రాల్లో ఆమె నటిస్తుంది. (ఇదీ చదవండి: జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణ చెప్పిన నయనతార) -
మత్తెక్కించేలా పోజిచ్చిన ఆ బ్యూటీ.. కేక పుట్టించేలా తాప్సీ
బీచ్ ఒడ్డున క్యూట్గా హాట్ బ్యూటీ హంస నందిని స్పాట్ లైట్ వెలుగులో మెరిసిపోతున్న హీరోయిన్ తాప్సీ మెడపై చెయ్యి పెట్టి మత్తెక్కిస్తున్న తెలుగమ్మాయి రీతూవర్మ చీరలో మరింత అందంగా కనిపిస్తున్న సంయుక్త మేనన్ కొబ్బరితోటలో వయ్యారంగా పోజులిస్తున్న పూజాహెగ్డే వర్కౌట్ బిజీలో బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి నాభి అందాలతో రెచ్చిపోతున్న భూమీ పెడ్నేకర్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్ View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
అతడితో ప్రేమలో పడ్డా, కానీ.. తాప్సీ బ్రేకప్ స్టోరీ
తాను ఎప్పుడో ప్రేమలో పడ్డానంటోంది హీరోయిన్ తాప్సీ. ఈ ఉత్తరాది బ్యూటీ మొదట కథానాయికగా పాపులర్ అయింది దక్షిణాది చిత్రాలతోనే. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల దర్శక నిర్మాతలే ఈమెను స్టార్ హీరోయిన్ను చేశారు. ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఆడుగళం చిత్రం ద్వారా తాప్సీ కోలీవుడ్లో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వందాన్ వెండ్రాన్, కాంచన 3, గేమ్ ఓవర్ తదితర చిత్రాల్లో నటించింది. అదే విధంగా తెలుగులో ఝుమ్మంది నాదం చిత్రంతో పరిచయమైన తాప్సీ అక్కడ స్టార్ హీరోల సరసన నటించింది. బాలీవుడ్లో బిజీ ఇలా దక్షిణాది చిత్రాల్లో నటిస్తుండగానే బాలీవుడ్ నుంచి పిలుపువచ్చింది. అక్కడ నటించిన తొలి చిత్రం బేబీ మంచి విజయాన్ని సాధించడంతో వరుసగా అవకాశాలు వరించాయి. హిందీలో పలు లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాల్లోనూ నటించి విజయాలు సాధించింది. ఆ మధ్య అమితాబ్ బచ్చన్తో కలిసి నటించిన పింక్ సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా షారుక్ ఖాన్ సరసన నటించిన డంకీ గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. సీనియర్తో లవ్.. బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణిస్తున్న తాప్సీ ఇటీవల ఒక భేటీలో తన సినీ పయనం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా తన ప్రేమ గురించి మాట్లాడుతూ.. తాను తొమ్మిదవ తరగతి చదువుతున్న సమయంలోనే ప్రేమలో పడ్డానని చెప్పింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రేమించానని చెప్పింది. మొదట్లో అతను తనపై ఆసక్తి చూపాడని, ఆ తరువాత చదువు పాడై పోతుందని భావించి తనకు దూరం అయ్యాడని పేర్కొంది. చదువుపై శ్రద్ధ పెట్టాలని తనకు ఉచిత సలహా కూడా ఇచ్చాడని తెలిపింది. తన తొలి ప్రేమ విఫలం నుంచి బయట పడటానికి చాలా కాలం పట్టిందని తాప్సీ వెల్లడించింది. చదవండి: మాజీ ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన స్టార్ హీరో 'విన్ డీజిల్' -
Dunki Movie Review: ‘డంకీ’ మూవీ రివ్యూ
టైటిల్: డంకీ నటీనటులు: షారుక్ ఖాన్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, బొమాన్ ఇరానీ, అనీల్ గ్రోవర్ తదితరులు నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్కుమార్ హిరాణి ఫిల్మ్స్ నిర్మాతలు:గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్పాండే దర్శకత్వం: రాజ్ కుమార్ హిరాణీ సంగీతం: అమన్ పంత్, ప్రీతమ్(పాటలు) సినిమాటోగ్రఫీ: సీకే మురళీధరన్, మనుష్ నందన్, అమిత్ రాయ్, కుమార్ పంకజ్ విడుదల తేది: డిసెంబర్ 21, 2023 ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా సినిమాలను తెరకెక్కించే అతికొద్ది మంది దర్శకుల్లో రాజ్ కుమార్ హిరాణీ ఒకరు. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. అలాంటిది షారుక్ ఖాన్తో సినిమా అంటే.. ఆ అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. డంకీ విషయంలో అదే జరిగింది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇది. అందుకే డంకీపై మొదటి నుంచే ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 21)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పఠాన్, జవాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ల తర్వాత షారుక్ నటించిన ఈ చిత్రం ఎలా ఉంది? షారుక్ ఖాతాలో హ్యాట్రిక్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం. డంకీ కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1995లో సాగుతుంది. శత్రువుల దాడిలో గాయపడిన సైనికుడు హార్డీ(షారుఖ్)ని ఓ వ్యక్తి కాపాడుతాడు. కొన్నాళ్ల తర్వాత అతన్ని కలిసేందుకు హార్డీ పంజాబ్కి వస్తాడు. అయితే అప్పటికే ఆ వ్యక్తి మరణిస్తాడు. అతని సోదరి మను రంధ్వా అలియాస్ మన్ను(తాప్సీ పన్ను) కుటుంబ బాధ్యతను తీసుకుంటుంది. అప్పులు కట్టలేక ఇంటిని కూడా ఆమ్మేస్తారు. లండన్ వెళ్లి బాగా డబ్బు సంపాదించి.. అమ్ముకున్న ఇంటిని మళ్లీ కొనాలనేది మను కల. అలాగే ఆమె స్నేహితులు బుగ్గు లక్నపాల్(విక్రమ్ కొచ్చర్), బల్లి(అనిల్ గ్రోవర్) కూడా డబ్బు సంపాదించడానికై లండన్ వెళ్లాలనుకుంటారు. వీసా కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు. తన ప్రాణాలను కాపాడిన ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న హార్డీ.. మనుని లండన్ పంపించేందుకు సహాయం చేస్తాడు. ఈ నలుగురు వీసా కోసం ట్రై చేస్తారు. అందుకోసం ఇంగ్లీష్ నేర్చుకోవాలని అష్టకష్టాలు పడతారు. ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లో ఈ నలుగురికి సుఖీ(విక్కీ కౌశల్) పరిచయం అవుతాడు. తన ప్రియురాలి జెస్సీని కలిసేందుకు అతను లండన్ వెళ్లాలనుకుంటాడు. వీళ్లంతా లీగల్గా ఇంగ్లండ్ వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. దీంతో దేశ సరిహద్దుల గుండా అక్రమంగా ప్రయాణించి లండన్ వెళ్లాలని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంగ్లండ్కు అక్రమంగా వెళ్లే క్రమంలో వీళ్లు పడిన కష్టాలేంటి? లండన్లో వీళ్లకు ఎదురైన సమస్యలు ఏంటి? ప్రియురాలి కోసం ఇంగ్లండ్ వెళ్లాలనుకున్న సుఖీ కల నెరవేరిందా లేదా? మన్నుతో ప్రేమలో పడిన హర్డీ.. తిరిగి ఇండియాకు ఎందుకు వచ్చాడు? పాతికేళ్ల తర్వాత.. మన్ను తిరిగి ఇండియాకు ఎందుకు రావాలనుకుంది? ఈ క్రమంలో హార్డీ మళ్లీ ఎలాంటి సహాయం అందించాడు? మను, హర్డీల ప్రేమ కథ సంగతేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మంచి కథ, భావోద్వేగాలతో పాటు చక్కటి సామాజిక సందేశం ఉన్న సినిమాలను తెరకెక్కించడం రాజ్ కుమార్ హిరాణి స్పెషాలిటీ. సామాజిక అంశాలకు వినోదాన్ని మేళవించి ప్రేక్షకులకు అర్థమయ్యేలా సినిమాను తీర్చిదిద్దుతాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, త్రి ఇడియట్స్, పీకే, సంజు..చిత్రాలే వీటికి నిదర్శనం. డంకీ చిత్రంలో కూడా మంచి సోషల్ మెసేజ్ఉంది. కానీ దాన్ని ప్రేక్షకులకు ఆకట్టుకునేదే తీర్చిదిద్దడంలో రాజ్ కుమార్ హిరాణీ పూర్తిగా సఫలం కాలేదు. భారత్ నుంచి అక్రమంగా యూకేలోకి ప్రవేశించాలనుకునే నలుగురు స్నేహితుల కథే డంకీ. దర్శకుడు రాజ్ కుమార్.. అక్రమ వలసదారుల కాన్సెప్ట్ని తీసుకొని దానికి దేశభక్తి, లవ్స్టోరీని టచ్ చేసి ఎమోషనల్ యాంగిల్లో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ పాత్రలదారుల భావోద్వేగాలను ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేయలేకపోయాడు. ఎమోషనల్ సీన్లను ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయాడు. వినోదం పండించడంలో మాత్రం తన పట్టు నిలుపుకున్నాడు. ఫస్టాఫ్ అంతా చాలా సరదాగా సాగిపోతుంది. పాతికేళ్లుగా లండన్లో ఉన్న మన్ను తిరిగి ఇండియా రావాలనుకొని ఆస్పత్రి నుంచి బయటకు పారిపోయే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కాసేపటికే కథ 1995లోకి వెళ్తుంది. మన్ను.. ఆమె స్నేహితులు బల్లి,బుగ్గుల నేపథ్యం నవ్విస్తూనే.. ఎమోషనల్గా టచ్ అవుతుంది. ఇక హీరో ఎంట్రీ అయిన కాసేపటికే కథంతా కామెడీ మూడ్లోకి వెళ్తుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఈ మను గ్యాంగ్ పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. అలాగే వీసా కోసం చేసే ప్రయత్నాలు కూడా నవ్విస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం ఎమోషనల్కు గురి చేస్తుంది. ఇక సెకండాఫ్ అంతా కాస్త సీరియస్గా సాగుతుంది. డంకీ రూటులో( దేశ సరిహద్దులగుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్ అంటారు. పంజాబ్లో దాన్ని డంకీ అని పిలుస్తారు) ఇంగ్లండ్కి వెళ్లే క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇక లండన్ వెళ్లాక ఈ నలుగు పడే కష్టాలు నవ్విస్తూనే..కంటతడి పెట్టిస్తాయి. కొన్ని సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. తిరిగి ఇండియాకు రావాలనుకున్నా..మళ్లీ డాంకీ ట్రావెలే చేయాల్సి వస్తుంది. ఆ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కన్నీళ్లను పెట్టిస్తుంది. కథ సాగదీసినట్లుగా అనిపించడం.. ప్రేక్షకుడి ఊహకు అందేలా కథనం సాగడం కూడా మైనస్. ఎవరెలా చేశారంటే.. పఠాన్, జవాన్ చిత్రాల్లో యాక్షన్తో ఇరగదీసిన షారుక్.. ఇందులో సాదాసీదా పాత్రలో కనిపించి, తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హార్డీసింగ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. కామెడీ పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా అద్భుతంగా నటించాడు. అయితే ఓల్డ్ లుక్లో షారుఖ్ని చూడడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో తాప్సీకి మరో బలమైన పాత్ర లభించింది. మన్ను పాత్రలో ఆమె ఒదిగిపోయింది. సినిమా మొత్తం ఆమె పాత్ర ఉంటుంది. కొన్ని చోట్ల అయితే తనదైన నటనతో కన్నీళ్లను తెప్పిస్తుంది. ఇక విక్కీ కౌశల్ ఈ చిత్రంలో కనిపించేది కొద్ది సేపే అయినా..గుర్తిండిపోయే పాత్రలో నటించాడు. విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్, బోమన్ ఇరాన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. అమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ప్రీతమ్ పాటలు పర్వలేదు.లుట్ ఫుట్ గయా సాంగ్ ఆకట్టకుంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
Taapsee Latest HD Photos: చీర అందాలతో రెచ్చిపోయిన తాప్సీ.. కుర్రకారుల మతి పోగొట్టేస్తుంది (ఫోటోలు)
-
షారుక్ ఖాన్ డంకీ ట్రైలర్ వచ్చేసింది.. తక్కువ అంచనా వేయకండి
బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్, తాప్సీ పన్ను నటించిన డంకీ మూవీ ట్రైలర్ వచ్చేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల నటించడం విశేషం. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తాజాగా మంగళవారం (డిసెంబర్ 5) రిలీజైన ఈ ట్రైలర్ ఫన్, ఎమోషన్ కలగలిపి ఎంతో ఆసక్తి రేపేలా ఉంది. ఈ ట్రైలర్ SRK వాయిస్తో ప్రారంభం అవుతుంది. ఇందులో స్నేహం, కామెడీ, విషాదం వంటి అంశాలు కీలకంగా ఉన్నాయి. ఈ చిత్రంలో ఇంగ్లిష్ నేర్చుకొని యూకే వెళ్లి సెటిలవ్వాలనుకునే ఓ గ్రామీణ యువకుడి పాత్రలో షారుక్ ఖాన్ అదరగొట్టేశాడు అనిపిస్తుంది. కానీ అతనికి ఎంత ప్రయత్నించినా ఇంగ్లిష్ రాకపోవడంతో అక్రమంగా చూకేలోకి చొరబడాలని ప్రయత్నించడం ఆపై అక్కడి వారికి దొరికిపోవడం వంటి అంశాలు ఈ కథలో కీలకంగా ఉండనున్నాయి. షారుక్ జర్నీలో స్నేహితులతో అతను పడే ఇబ్బందులు ఎలా ఎదుర్కొన్నాడో డంకీ ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. తాజాగా డంకీ ట్రైలర్ను షారుక్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఇలా చెప్పాడు. 'ఈ కథను నేను లాల్టూ నుంచి మొదలు పెట్టాను. నా ఫ్రెండ్స్ తో కలిసి రాజు సర్ విజన్ నుంచి మొదలైన ప్రయాణాన్ని డంకీ ట్రైలర్ చూపిస్తుంది. ఈ ట్రైలర్ స్నేహం, కామెడీ, విషాదంతో పాటు ఇల్లు, కుటుంబ జ్ఞాపకాలను అందరినీ తట్టిలేపేలా ఉంటుంది. నేను ఎంతో కాలంగా ఎదరు చూస్తున్న సమయం వచ్చేసింది. డంకీ డ్రాప్ వచ్చేసింది.' అనే క్యాప్షన్తో షారుక్ ఈ ట్రైలర్ రిలీజ్ చేశాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్, పీకే లాంటి సినిమాలను తీసిన రాజు హిరానీ డైరెక్షన్లో డంకీ చిత్రం రావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
సినిమా ఇండస్ట్రీ వాళ్ల చుట్టే తిరుగుతోంది: స్టార్ హీరోయిన్ కామెంట్స్
మొదట దక్షిణాది చిత్రాల్లో నటించి స్టార్ ఇమేజ్ను తెచ్చుకున్న నటి తాప్సీ. ఆ తర్వాత బాలీవుడ్కు మకాం మార్చింది. అక్కడ వరుసగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించి పాపులరిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో కలిసి నటిస్తోన్న తాప్సీ ఇటీవల నిర్మాతగా కూడా అవతారం ఎత్తి 'వీక్ ధక్' అనే హిందీ చిత్రాన్ని నిర్మించింది. బైక్ రైడ్ ఇతివృత్తంతో రూపొందించిన లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం ఇది. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయితే తాజాగా విజయవాడలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన తాప్సీ ప్రస్తుత సినీ పరిశ్రమపై విమర్శలు చేసింది. (ఇది చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్) సినిమా అనేది ప్రస్తుతం స్టార్స్ చుట్టూనే తిరుగుతోందని విమర్శించింది. ఇక్కడ ప్రముఖ నటులకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతోందని, ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలిపింది. ఇది చాలా విచారించదగ్గ విషయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాను ఓ చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్నప్పుడు సహనటుల అర్హత ఏమిటన్నది చూడనని చెప్పింది. అయితే స్టార్స్తో లేని చిత్రాలను ఓటీటీలోకి నెట్టాలని చూస్తున్నారని, అలాంటి భావన సినిమాకు మంచిది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పెద్ద చిత్రాలు చిన్న చిత్రాలను మరుగున పడేస్తున్నాయని.. ఈ పరిస్థితి మారాలని తాప్సీ పేర్కొంది. (ఇది చదవండి: ఒకప్పుడు టాటా నానో.. ఇప్పుడు బీఎమ్డబ్ల్యూ - అట్లుంటది కిమ్ శర్మ అంటే!) -
మార్పు రావాలి
కథానాయికగా సౌత్, నార్త్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తాప్సీ. అయితే హీరోయిన్గా మిగిలిపోకుండా నిర్మాతగానూ నిరూపించుకోవాలనుకున్నారామె. తొలి ప్రయత్నంగా తాప్సీ నిర్మించిన హిందీ చిత్రం ‘ధక్ ధక్’ శుక్రవారం విడుదలైంది. అయితే నిర్మాతగా తనకు చేదు అనుభవం ఎదురైందని తాప్సీ అంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్లో స్టార్ సిస్టమ్ వల్ల చిన్న సినిమాలకు నష్టం జరుగుతోంది. కథ వినేటప్పుడే ‘హీరో ఎవరు?’ అని అడుగుతున్నారు. దాంతో జనాలు ‘కంటెంటే కింగ్’ అనుకుంటారనే నా భ్రమ తొలగిపోయింది. హీరోని బట్టి పెట్టుబడి ఉంటుంది. ఓ నటిగా నేను ఒక కథ వినేటప్పుడు ఆ నిర్మాతలు ఎంత పెద్దవాళ్లు, కో–స్టార్ ఎవరు? అని అడగలేదు. కొత్త దర్శకులతో, కొత్త నటులతో సినిమాలు చేశాను. కానీ వేరేవాళ్లు అలా చేయడానికి ఇష్టపడటంలేదు. ఎందుకీ తేడా? ఈ విషయంలో ఏ ఒక్కర్నో నిందించాల్సిన అవసరం లేదు. యాక్టర్లు, స్టూడియోలు, ప్రేక్షకులు... అందరూ బాధ్యులే. బాలీవుడ్ అర్థవంతమైన చిత్రాలు చేయడంలేదని అంటుంటారు. కానీ, చేసినప్పుడు మాత్రం సపోర్ట్ దక్కదు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. పెద్ద సినిమాలకు పెట్టుబడి పెట్టి, డిజిటల్ రైట్స్ ద్వారా డబ్బు రికవర్ చేసుకోవచ్చని అనుకుంటారు. చిన్న సినిమాలకు పెట్టుబడి పెట్టడం కష్టం.. రిలీజ్ చేసుకోవడమూ కష్టమే. ఈ పరిస్థితి స్టార్స్కి, యాక్టర్స్కి మధ్య దూరం పెంచుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ఇక తాప్సీ ఒక నిర్మాతగా వ్యవహరించిన ‘ధక్ ధక్’ కథ నలుగురు మహిళల చుట్టూ తిరుగుతుంది. -
నటి తాప్సీ కొత్త కారు ఇదే.. ధర తెలిస్తే అవాక్కవుతారు!
'ఝుమ్మంది నాదం'తో తెలుగు చలన చిత్ర సీమలో అడుగుపెట్టిన 'తాప్సీ' ఆ తరువాత షాడో, వీర వంటి సినిమాలతో తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈమె గణేష్ చతుర్థి సందర్భంగా ఒక ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నటి తాప్సీ కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'జిఎల్ఎస్ 600'. దీని ధర రూ. 3 కోట్లు కంటే ఎక్కువే. దీనిని కంపెనీ ఆదివారం ఆమె ముంబై నివాసంలో డెలివరీ చేసింది. పల్లాడియం సిల్వర్ కలర్ ఆప్షన్ కలిగిన ఈ కారు తన గ్యారేజిలో చేరిన రెండవ బెంజ్ కారు. తాప్సీ గ్యారేజిలో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ, జీప్ కంపాస్, బీఎండబ్ల్యూ 3-సిరీస్, ఆడి ఏ8ఎల్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి జిఎల్ఎస్ 600 చేరింది. ఈ కొత్త కారు చాలా లగ్జరీ ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇక మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 600 విషయానికి వస్తే.. 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజన్ కలిగి 550 హెచ్పి పవర్ అండ్ 730 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఇది EQ బూస్ట్ టెక్నాలజీ కూడా పొందుతుంది. కావున అదనపు పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇదీ చదవండి: ఇదే జరిగితే 'డిస్నీ ఇండియా' ముఖేష్ అంబానీ చేతికి! జిఎల్ఎస్ 600 పెద్ద 12.3 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే & 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే కలిగి కారుకి సంబంధించిన అన్ని వివరాలు డ్రైవర్కి అందిస్తుంది. అంతే కాకుండా నప్పా లెదర్ అపోల్స్ట్రే, రిక్లైనింగ్ రియర్ సీట్లు, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, రిఫ్రిజిరేటర్ కంపార్ట్మెంట్ కలిగిన రియర్ సీట్లు మొదలైన ఆధునిక ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. ఇదీ చదవండి: గడ్కరీ చెప్పినా అప్పటివరకు తప్పదు.. టాటా ఎండీ శైలేశ్ చంద్ర ఇప్పటికే ఈ ఖరీదైన లగ్జరీ కారుని ఆయుష్మాన్ ఖురానా, దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్, కృతి సనన్, అజయ్ దేవగన్, ఆదిత్య రాయ్ కపూర్, అర్జున్ కపూర్, శిల్పా శెట్టి మాత్రమే కాకుండా ఆర్ఆర్ఆర్ నటుడు రామ్ చరణ్ కూడా కొనుగోలు చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈ కారుపై సెలబ్రిటీలకు ఎంత మక్కువ ఉందో ఇట్టే అర్థమైపోతోంది. -
సమంత ఆ డ్రస్లో.. మెరిసిపోతున్న అతుల్య
క్రేజీ పోజుల్లో హీరోయిన్ హన్సిక ఎంబ్రయిడరీ ఔట్ఫిట్లో సమంత మహాలక్ష్మిలా మెరిసిపోతున్న అతుల్య మెల్బోర్న్లో ఎంజాయ్ చేస్తున్న హరితేజ రెడ్ మిర్చిలా రెచ్చిపోయిన పరిణితీ చోప్రా బికినీలో హీట్ పెంచేస్తున్న దిశా పటానీ పల్లెటూరి పిల్లలా దివి పోజులు కేక చేతులు పైకెత్తి మరీ నడుము చూపిస్తున్న రీతూ View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by @parineetichopra View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) -
ఆ డైరెక్టర్ వల్ల చాలా ఇబ్బంది పడ్డా
-
భారతదేశంలో తెలుగు సినిమా అని నాకు తెలియదు : తాప్సీ పన్ను
-
సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్లను ఎలా బాధ్యుల్ని చేస్తారు?: తాప్సీ
ఉత్తరాది సినీ అందగత్తెల్లో నటి తాప్సీ ఒకరు. ఆరంభ దశలో అందాలనే నమ్ముకున్న ఈమె తెలుగు, తమిళం భాషల్లో పాత్రల్లోనే ఎక్కువగా నటించారు. ఇంకా చెప్పాలంటే దక్షిణాదిలో గ్లామరస్ పాత్రలే తాప్సీని నటిగా నిలబెట్టాయి. అయితే తమిళంలో ధనుష్ సరసన ఆడుగళం చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. కాంచన, గేమ్ ఓవర్ వంటి చిత్రాలు అవకాశం ఉన్న పాత్రలో నటించి సత్తా చాటారు. అయితే ఈమె ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలపై దృష్టి సారించారు. అక్కడ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించి వరుసగా విజయాలు అందుకున్నారు. దీంతో దక్షిణాది చిత్రాలకు దాదాపు దూరమయ్యారు. అలాంటిది ఇటీవల దక్షిణాది చిత్రాలపై మక్కువ చూపుతున్నారనిపిస్తోంది. తాప్సీ తాజాగా ఏలియన్ అనే తమిళ చిత్రంలో నాయకిగా నటిస్తున్నారు. కాగా ఇటీవల ఆమె ఒక భేటీలో ఆదిలో తాను ఎదుర్కొన్న ఆటంకాలను, అవమానాలను ఏకరువు పెట్టారు. తాను దక్షిణాదిలో నటించిన కొన్ని చిత్రాలు ఆశించిన విజయాలను సాధించలేదన్నారు. ముఖ్యంగా తెలుగులో నటించిన చిత్రాలు ప్లాప్ అయ్యాయన్నారు. దీంతో అందరూ తనపై రాశిలేని నటి అనే ముద్ర వేశారన్నారు. అయినా చిత్రాలు అపజయం పాలైతే ఆ నెపాన్ని ఎందుకు హీరోయిన్లపై నెట్టేస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిజం చెప్పాలంటే కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ పరిధి కొన్ని సన్నివేశాలు పాటలకు వరకేనన్నారు. అలాంటిది చిత్రాల అపజయాలకు హీరోయిన్లను ఎలా బాధ్యుల్ని చేస్తారని ప్రశ్నించారు. తన విషయం లోనూ ఇదే జరిగిందని, ఇలాంటి వాటికి ఆరంభంలో ఆవేదన చెందినా, ఆ తరువాత విమర్శకులను పట్టించుకోవడం మానేశానన్నారు. తాను సినిమా నేపథ్యం నుంచి వచ్చిన నటిని కాదని, అందువల్ల ఎలాంటి కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటించాలో తెలియలేదని పేర్కొన్నారు. అలా చేసిన తప్పులనుంచి చాలా నేర్చుకున్నానని తాప్సీ అన్నారు. -
నిషా కళ్లతో రితిక.. కేతిక అందాల విందు!
హీరోయిన్ రితికా సింగ్ నిషా పోజులు బొడ్డు చూపిస్తూ రెచ్చగొడుతున్న భూమి బ్లాక్ ఔట్ ఫిట్లో రెచ్చిపోయేలా తాప్సీ రెడ్ కలర్ పొట్టి డ్రస్లో ప్రగ్యా పరువాల విందు కేతిక శర్మ ఎద అందాల ప్రదర్శన 'సాహో' బ్యూటీ శ్రద్ధా కపూర్ సోయగాలు నవ్వుతో మెరుపులు మాయ చేస్తున్న దివ్యభారతి మెగా డాటర్ నిహారిక క్యూట్ ర్యాండమ్ స్టిల్స్ పింక్ చీరలో ఆలియా భట్ హోయగాలు నీలగిరి కొండల్లో నందితా శ్వేతా పోజులు కేజీఎఫ్ నటి జోష్ ఆర్చీ సూపర్ డ్యాన్స్ చీరలో హీరోయిన్ హనీరోజ్ వయ్యారాలు నోరు తడారిపోయేలా నోరా ఫతేహా పోజులు View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Archana Jois (@jois_archie) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) -
ఏలియన్ని కాను!
ఏలియన్స్తో సావాసం చేస్తున్నారు హీరోయిన్ తాప్సీ. ఎందుకంటే ఏలియన్స్తో కలిసి తాప్సీ ఓ మిషన్లో భాగమయ్యారు. ఈ మిషన్ తాలూకు వివరాలు తెలియడానికి కాస్త టైమ్ పడుతుంది. ఇటీవల హిందీప్రాజెక్ట్స్తో బిజీగా ఉంటున్న తాప్సీ ఓ తమిళ సినిమాకు సైన్ చేశారు. ‘‘తమిళంలో నేను చేస్తున్న తాజా సినిమా ‘ఏలియన్’. కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. కానీ ఈ చిత్రంలో నేను ఏలియన్గా నటించడం లేదు. తమిళంలో నేను చేసిన ‘గేమ్ ఓవర్’ (2019) మూవీ నచ్చినవారికి ఈ సినిమా మరింత బాగా నచ్చుతుందనే నమ్మకం నాకుంది. ఈ సినిమా ప్రయాణం నాకు ఓ కొత్త అనుభూతిని ఇస్తోంది’’ అని తాప్సీ పేర్కొన్నారు. 2021లో వచ్చిన ‘అన్నాబెల్లె సేతుపతి’ తర్వాత తాప్సీ అంగీకరించిన తమిళ చిత్రం ఇదే. ఇక హిందీలో ‘ఓ లడ్కీ హై కహా’, ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’, ‘డంకీ’ చిత్రాలు చేస్తున్నారు తాప్సీ. -
హీరోయిన్ తాప్సీ ప్రెగ్నెంటా? ఆమె రియాక్షన్ ఇదే!
అదేంటో కొందరు హీరోయిన్లు కావాలని కాంట్రవర్సీ చేస్తారో లేదంటే వాళ్లు మాట్లాడిన తర్వాత ఆ కామెంట్స్ వివాదాస్పద అవుతుందో అస్సలు అర్థం కాదు. కానీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవుతుంటారు. ఇప్పుడు కూడా హీరోయిన్ తాప్సీ అలానే మాట్లాడింది. తనవైపు అందరూ చూసేలా చేసింది. హీరోయిన్ తాప్సీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే 'ఝమ్మంది నాదం' అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్గా మారింది. ఆ తర్వాత ఇక్కడ పలు చిత్రాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. దీంతో బాలీవుడ్కి చెక్కేసింది. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. బోలెడన్ని క్రేజీ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. (ఇదీ చదవండి: రిలీజ్కి ముందే 'సలార్' మరో రికార్డ్) చాలాకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న తాప్సీ.. తాజాగా ఇన్ స్టాలో నెటిజన్స్ చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగా ఒకతను.. 'మీ పెళ్లి ఎప్పుడు?' అని అడిగాడు. దీనికి తిన్నగా సమాధానమివ్వొచ్చుగా కానీ తాప్సీ అలా ఇవ్వలేదు. 'నేనింకా ప్రెగ్నెంట్ కాలేదు కాబట్టి అతి త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు' అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు కామెంట్స్ బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్- రణ్బీర్ కపూర్కి కౌంటర్లా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ జంట ఏప్రిల్లో 14న పెళ్లి చేసుకున్నారు. నవంబరు 6న ఆలియా బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ విషయమై తాప్సీ.. పరోక్షంగా కామెంట్స్ చేసినట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: 'బేబీ' సినిమా.. ఆ దర్శకుడి రియల్ ప్రేమకథేనా?) -
వాళ్లకు కావాల్సిన వారికే అవకాశాలు: తాప్సీ
సొట్టబుగ్గల సుందరి తాప్సీ ఎప్పటికపుడు వైరల్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. టాలీవుడ్లో ఝమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. కానీ ఇక్కడ తను అనుకున్నంతగా సక్సస్ కాలేకపోయింది. దీంతో బాలీవుడ్కు మకాం మార్చేసి తక్కువ సమయంలోనే క్లిక్ అయింది. అయితే తాజాగా తాప్సీ షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్లో అవి తెగ వైరల్ అవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్పై పలు ఆరోపణలు చేసింది. అవి నిజమే అంటూ తాప్సీ కూడా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. (ఇదీ చదవండి; Adipurush: ఫస్ట్ డే కలెక్షన్స్ తుఫాన్.. పక్కాగా ఆ సినిమాలను దాటేస్తుంది) బాలీవుడ్లో ఒక సినిమా కోసం ఎవరిని తీసుకోవాలనేది కొంతమంది ప్రముఖ నటీనటులు డిసైడ్ చేస్తారని తాప్సీ చెప్పుకొచ్చింది. వారికి నచ్చకపోతే టాలెంట్ ఉన్నా పక్కన పెట్టేస్తారు. ఒక్కోసారి క్యారెక్టర్కు సూట్ అయ్యేవాళ్లను కూడా తీసుకోరు. కానీ వారికి కావాల్సిన వ్యక్తులను మాత్రం తీసుకుంటారు. అంతేకాకుండా ఏజెన్సీ వాళ్లను కూడా రిఫర్ చేస్తారు. హిందీలో ఫేవరిటిజం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అవకాశాల కోసం తిరగడం అనవసరం అని తాప్సీ తెలిపింది. (ఇదీ చదవండి: Adipurush: ప్రభాస్ ఎక్కడ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు) -
దక్షిణాది చిత్రపరిశ్రమపై తాప్సీ వివాదస్పద వ్యాఖ్యలు.. నెటిజన్స్ ఫైర్
సౌత్ సినిమా ఇండస్ట్రీపై సొట్టబుగ్గల సుందరి తాప్సీ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది సినిమాల్లో నటించడం వల్ల తను గుర్తింపు రాలేదని చెప్పింది. నటిగా తనను తాను నిరూపించుకోవడానికి సరైన పాత్రలు సౌత్లో రాలేదని తెలిపింది. అక్కడ స్టార్ హీరోయిన్గా కొనసాగినప్పటికీ సంతృప్తిని ఇచ్చే క్యారెక్టర్స్ లభించలేదని చెప్పింది. (చదవండి: నా బెడ్రూమ్లో ఇప్పటికీ ఆయన పోస్టర్స్ ఉంటాయి: ఖుష్బూ) బాలీవుడ్లో నటించిన ‘పింక్’ చిత్రం తనకెంతో గుర్తింపుని తెచ్చిపెట్టిందని వెల్లడించింది. ఈ సినిమా తర్వాత తన జీవితం మలుపు తిరిగిందని తాప్సీ చెప్పుకొచ్చింది. తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలపై దక్షిణాది సినీ ప్రేక్షకులు, నెటిజన్స్ మండిపడుతున్నారు. టాలీవుడ్లో గుర్తింపు వచ్చింది కాబట్టే బాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయని కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనూ టాలీవుడ్పై ఇలాంటి వ్యాఖ్యలే చేని విమర్శలు ఎదుర్కొంది తాప్సీ. టాలీవుడ్ హీరోయిన్స్ను గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం చేస్తారంటూ ఓ ప్రముఖ దర్శకుడిని ఉద్దేశించి కామెంట్ చేసింది. అప్పట్లో నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. -
గ్లామర్ షోతో రచ్చ చేస్తున్న తాప్సీ (ఫోటోలు)
-
తాప్సీ డైటిషియన్ నెల జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే! స్వయంగా చెప్పిన నటి
సినీ సెలబ్రెటీలది లగ్జరీ లైఫ్. అందుకే వారికి సంబంధించిన ప్రతి విషయం ఆసక్తిగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ తమ అభిమాన నటీనటులు ఏం చేస్తుంటారు, ఏం తింటుంటారో తెలుసుకునేందుకు అమితాసక్తిని కనబరుస్తారు. సాధారణ ప్రజల కంటే వారి ఆహారపు అలవాట్లు కాస్తా భిన్నంగా ఉంటాయి. అలాగే నటీనటులు కూడా ఇండస్ట్రీలో రాణించాలంటే ఫిట్నెస్, గ్లామర్పై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇందు కోసం వారు వెచ్చించే డబ్బు లక్షల్లోనే ఉంటుంది. అలాంటి విషయాలు తెలిసినప్పడు అంతా అవాక్కవుతుంటారు. చదవండి: ఓ ఇంటివాడైన చై! నాగార్జున ఇంటికి సమీపంలోనే మకాం? తాజాగా స్టార్ హీరోయిన్ తాప్సీ తన ఫిట్నెస్ కోసం పెట్టే ఖర్చు ఎంతో బయటపెట్టింది. ఇది తెలిసి అంతా నోళ్లు వెల్లబెడుతున్నారు. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్న తాప్సీ రీసెంట్గా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన ఫిట్నెస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘హీరోయిన్గా ఉండాలంటే చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నేను చేసే సినిమాను బట్టి నా శరీరాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. అయితే శరీరం ఎప్పుడు ఒకేలా ఉండదు. ప్రతి మూడు, నాలుగు సంవత్సరాలకు బాడీలో మార్పులు వస్తుంటాయి. చదవండి: అమెరికాలో లగ్జరీ బంగ్లా రెంట్కు తీసుకున్న ఉపాసన! ఎందుకంటే.. ఫిట్గా ఉండాలంటే ప్రాంతం, దేశం బట్టి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో డైటీషియన్స్ సలహా చాలా అవసరం. మనం ఎప్పుడు ఏం తినాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో వారు సూచిస్తుంటారు. అందుకే ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా డైటిషియన్ను పెట్టుకున్నా. నా డైటిషియన్కే నెలకు లక్ష రూపాయలు పే చేస్తాను. అది నా ప్రోఫెషన్. తప్పుదు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక తాప్పీ డైటీషియన్ జీతం తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ‘ఒక్క డైటిషియన్కే నెలకు లక్ష రూపాయలు ఖర్చు చేస్తే.. ఇక మిగలిన వాటికి ఎంత చేస్తుందో?’ అంటూ నెటిజన్లు నాలుక కరుచుకుంటున్నారు. కాగా తాప్సీ చివరగా తెలుగులో మిషన్ ఇంపాజిబుల్లో నటించింది. -
Year End 2022: అక్కడ హిట్.. ఇక్కడ ఫట్.. ఫ్లాప్ రీమేక్ చిత్రాలివే
విదేశీ తెరపై హిట్టయిన సినిమా ఇక్కడ కూడా హిట్టవుతుందా? అంటే ‘గ్యారంటీ’ ఇవ్వలేం. అందుకు ఉదాహరణ ఈ ఏడాది విడుదలైన దాదాపు అరడజను చిత్రాలు. అక్కడ హిట్టయిన చిత్రాలు రీమేక్ రూపంలో వచ్చి, ఇక్కడ ఫట్ అయ్యాయి. ఆ రీమేక్ చిత్రాలను రౌండప్ చేద్దాం. అరడజను ఆస్కార్ అవార్డ్స్ సాధించిన హాలీవుడ్ ఫిల్మ్ ‘ది ఫారెస్ట్గంప్’ (1994) హిందీలో ‘లాల్సింగ్ చడ్డా’గా రీమేక్ అయింది. టైటిల్ రోల్ను ఆమిర్ ఖాన్ చేయగా, అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాగచైతన్య ఓ కీ రోల్ చేశారు. హిందీలో చైతూకు ఇదే తొలి చిత్రం. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజైన ఈ ఎమోషనల్ కామెడీ డ్రామా ఫిల్మ్కు బాక్సాఫీస్ వద్ద నిరాశే ఎదురైంది. లాల్సింగ్ చడ్డా జీవితంలో ఎలాంటి ఘటనలు జరిగాయి? దేశవ్యాప్తంగా జరిగిన ఘటనల వల్ల అతని జీవితం ఎలా ప్రభావితం అయింది? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇక ఈ ఏడాది అరడజను సినిమాలతో (హిందీలో ‘లూప్ లపేట’, ‘శభాష్ మిథు’, ‘దోబార’, ‘తడ్కా’, ‘బ్లర్’ తెలుగులో ‘మిషన్ ఇంపాజిబుల్) ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు తాప్సీ. ఈ ఆరులో మూడు సినిమాలు ‘లూప్ లపేట, దోబార, బ్లర్’ విదేశీ చిత్రాలకు రీమేక్. 1988లో వచ్చిన జపాన్ హిట్ ఫిల్మ్ ‘రన్ లోలా రన్’కు హిందీ రీమేక్గా ‘లూప్ లపేట’ తెరకెక్కింది. ఆకాష్ భాటియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న రిలీజైంది. యజమాని డబ్బును పోగొట్టి, చిక్కుల్లో పడ్డ తన ప్రియుడి కోసం గాయపడ్డ ఓ రన్నింగ్ అథ్లెట్ ఎలాంటి సాహసాలు చేసింది? ఆమెకు ఎలాంటి ప్రమాదాలు ఎదురయ్యాయి? ఎలా ఎదుర్కొంది? అన్నదే ‘లూప్ లపేట’ కథాంశం. ఇక స్పానిష్ చిత్రాలైన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ ‘మిరాజ్’ (2018) ఆధారంగా ‘దోబార (2:12)’, స్పానిస్ హారర్ థ్రిల్లర్ ‘లాస్ ఓజోస్ దే జూలియా (2010) ఆధారంగా ‘బ్లర్’ చిత్రాలు రూపొందాయి. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘దోబార’ ఆగస్టు 19న రిలీజైంది. పాతికేళ్ల క్రితం ఓ అమ్మాయి చూస్తుండగానే పిడుగు పాటుతో ఒకరు మరణిస్తారు. ఆ అమ్మాయి పెద్దయ్యాక ఆ పరిస్థితులే పునరావృతమై ఓ పన్నెండేళ్ల బాలుడు చిక్కుల్లో పడతాడు. ఓ టీవీ సెట్ ఆధారంగా ఆ బాలుడిని ఈ యువతి ఎలా కాపాడగలిగింది? అన్నదే ‘దోబార’ కథనం. ఇక ‘బ్లర్’ విషయానికి వస్తే... అజయ్ భాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాప్సీ ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 9 నుంచి జీ5 ఓటీటీ ఫ్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రకథ విషయానికి వస్తే.. గాయత్రి, గౌతమి కవలలు. కానీ ఇద్దరూ దృష్టి లోపంతో బాధపడుతుంటారు. అయితే హఠాత్తుగా గౌతమి మరణిస్తుంది. గౌతమి మరణానికి దారితీసిన పరిస్థితులను గాయత్రి తెలుసుకోవాలనుకుంటుంది? ఈ ప్రయత్నంలో ఆమెకు ఎదురైన సవాళ్లు ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ‘బ్లర్’ చిత్రం సాగుతుంది. విదేశీ కథలతో తాప్సీ చేసిన ఈ మూడు చిత్రాలూ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఇక ఈ ఏడాది సెప్టెంబరులో విడుదలైన తెలుగు చిత్రం ‘శాకినీ డాకినీ’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రెజీనా, నివేదా థామస్ టైటిల్ రోల్స్ చేసిన ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకుడు. 2017లో వచ్చిన సౌత్ కొరియన్ హిట్ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’కు రీమేక్గా ‘శాకినీ డాకినీ’ తెరకెక్కింది. అక్రమాలకు ΄ాల్పడే ఓ ముఠా ఆటను ఇద్దరు ట్రైనీ ΄ోలీసాఫీసర్లు ఎలా అడ్డుకున్నారు? అన్నదే ఈ చిత్రకథాంశం. -
వాళ్ల మాటలతో చాలా బాధపడ్డా: తాప్సీ
కొందరిలా కెమెరాల ముందు తనకు నటించడం రాదని నటి తాప్సీ పన్ను షాకింగ్ చేశారు. కెమెరా ముందు ఒకలా.. వెనుక మరోలా చేయడం తనకు చేతకాదని.. తానెప్పుడూ నిజాయితీగానే ఉంటానని స్పష్టం చేశారు. అయితే ఇటీవల విలేకర్లపై నేను ఆగ్రహం వ్యక్తం చేసిన పలు వీడియోలు నెట్టింట వైరల్గా మారడంపై ఆమె స్పందించారు. తాప్సీ మాట్లాడుతూ.. 'వాటిని చూసి చాలామంది నాపై విమర్శలు చేశారు. సోషల్మీడియాలోనూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.వాళ్ల మాటల వల్ల నేనెంతో బాధపడ్డాను. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకున్నా. నాపై వచ్చే వార్తల గురించి వెతకకూడదని నిర్ణయించుకున్నా. నాకు నచ్చిన విధంగా ఉంటా. ఎక్కడైనా నా మనసుకు నచ్చింది మనస్ఫూర్తిగా మాట్లాడతా. సమాజంలో మంచి మార్కులు కొట్టేయడానికి కొంతమంది స్టార్స్ బయట నటిస్తుంటారు. అలాంటి వారి గురించి నిజాలు బయటకు వచ్చినప్పుడు ప్రజల్లో వారి గౌరవం దెబ్బ తింటుంది. అందరికీ నేను నచ్చాలని లేదు. నటిగా నా పని మెచ్చుకుంటే చాలు.' అని అన్నారు. బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటి తాప్సీ. ఇటీవల ‘దోబారా’ ప్రమోషన్స్లో పాల్గొన్న ఆమె విలేకర్లు అడిగిన ప్రశ్నల పట్ల అసహనం వ్యక్తం చేశారు. మరో ఇంటర్వ్యూలోనూ ఆమె అదే విధంగా మాట్లాడారు. దీంతో ఈ వీడియోలు చూసిన నెటిజన్లు.. తాప్సీకి పొగరెక్కువ అంటూ కామెంట్స్ చేశారు. కాగా.. ఇటీవల బ్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ముద్దుగుమ్మ. తాప్సీకి వచ్చే ఏడాది కొన్ని భారీ ప్రాజెక్ట్లు ఉన్నాయి. ఆమె షారుఖ్ ఖాన్తో అతని తదుపరి చిత్రం డుంకీలో కనిపించనుంది. ఆ తర్వాత వో లడ్కీ హై కహాన్లో కూడా నటిస్తోంది. -
‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి నటించిన తెలుగు మూవీ తెలుసా?
చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన లేటెస్ట్ మూవీ కాంతార. తొలుత కన్నడ ప్రాంతీయ సినిమాగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళంలో సంచలన విజయం సాధించింది. అన్ని భాషల్లో ఈ సినిమాకు బ్రహ్మర్థం పడుతున్నారు. దీంతో ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక చిత్రంలో లీడ్ రోల్ పోషించిన రిషబ్ శెట్టి ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ మూవీ ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే ఎవరో తెలియదు. చదవండి: అరుదైన వ్యాధితో బాధపడుతున్న ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ కానీ ఇప్పుడు ఈ పేరు వినగానే వెంటనే కాంతార హీరో, దర్శకుడని చెప్పేంతగా గుర్తింపు పొందాడు. ఇదిలా ఉంటే కాంతారకు ముందు రిషబ్ తెలుగులో నేరుగా ఓ సినిమా చేసిన విషయం మీకు తెలుసా? అది కూడా ఎలాంటి పారితోషికం లేకుండా? ఏంటి షాక్ అవుతున్నారా? అవును ఈ మూవీకి ముందు గతేడాది రిషబ్ శెట్టి తెలుగులో ఓ సినిమా చేశాడు. కానీ అందులో కనిపించింది ఓ రెండు, మూడు నిమిషాలు మాత్రమే. ఇంతకి ఈ సినిమా ఎంటంటే ఈ ఏడాది వచ్చిన ‘మిషన్ ఇంపాజిబుల్’. ఈ ఏడాది ఏప్రిల్లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ను సొంతం చేసుకుంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ఫేం స్వరూప్ దర్శకత్వంలో తాప్సీ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపించాడు. చదవండి: హన్సిక కాబోయే భర్త ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసా? మూవీలో కీలక మలుపు తెచ్చే ఖలీల్ అనే దొంగ పాత్రలో కనిపించారు. అయితే అప్పటికి ఆయనకు ఈ స్థాయిలో గుర్తింపు లేకపోవడంతో రిషబ్ శెట్టిన ఎవరు గుర్తించలేదు. ఈ మూవీ డైరెక్టర్ స్వరూప్, రిషబ్కు మంచి స్నేహితుడట. ఆ స్నేహంతోనే ఇందులో ఖలీల్ పాత్ర చేయమని అడగ్గా రిషబ్ వెంటనే ఒకే చెప్పాడట. అంతేకాదు ఈ సినిమాకు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సమాచారం. ఇక సినిమాలో ముగ్గురు పిల్లలు ముంబై వెళ్తున్నాము అనుకుని పొరపాటున బెంగళూరు వెళ్తారు. ఇక అక్కడ వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని ఎలా అధికమించారు అనేదే ‘మిషన్ ఇంపాజిబుల్’ కథ. -
ఓటీటీలో తాప్సీ ‘దొబారా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అగ్ర కథానాయిక తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'దొబారా'. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 19న థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా అక్టోబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. అసలు కథేంటంటే: ఓ యువతి చనిపోయిన అబ్బాయి ఆత్మతో మాట్లాడిన తర్వాత గతంలోకి వెళ్లి అతడి ప్రాణాలను ఎలా రక్షించిందన్నదే కథ. దొబారా సినిమా 2018లో వచ్చిన మిరేగ్ అనే స్పానిష్ సినిమాకు రీమేక్. ఏక్తాకపూర్ ‘కల్ట్ మూవీస్’, సునీర్ ఖేత్రాపాల్ ‘అథీనా’ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సుమారు రూ.30 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. -
వాళ్లు ఇండస్ట్రీకి హాని చేయాలని చూస్తున్నారు: తాప్సీ
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం దొబారా. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 19న రిలీజైంది. సినిమాకు పెద్దగా ఓపెనింగ్స్ లేవంటూ పలువురు సినీవిశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే కమల్ రషీద్ ఖాన్ (కేఆర్కే) మాత్రం ఓ అడుగు ముందుకేసి తాప్సీపై, ఆమె సినిమాపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. బాలీవుడ్లో పెద్ద హీరోయిన్ అయిన తాప్సీ దొబారా మూవీ 215 స్క్రీన్స్లో రిలీజైంది. జనాలు లేకపోవడంతో మార్నింగ్ షోలు రద్దయ్యాయంటూ నవ్వుతున్న ఎమోజీలు యాడ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దొబారా మూవీకి ఎక్కడ చూసినా హౌస్ఫులే, కానీ కలెక్షన్లు మాత్రం ఎనిమిది లక్షలే వచ్చాయంటూ సెటైర్ వేస్తూ ట్వీట్ చేశాడు. అలాగే రోహిత్ జైస్వాల్ అనే రివ్యూయర్ సైతం 'కోల్కతాలో ఒకరోజు హల్దిరామ్స్ స్వీట్స్ అమ్మితే ఎంత డబ్బు వస్తుందో దొబారా సినిమా ఫస్ట్డేకి కూడా అంత కలెక్షన్లు రాలేదు' అని విమర్శించాడు. అయితే హన్సల్ మెహతా అనే సినీ విశ్లేషకుడు వీరి మాటలను తప్పుపట్టాడు. 'దొబారా 370 స్క్రీన్లలోనే రూ.72 లక్షలు వసూలు చేసింది. ఇదేం చిన్న విషయం కాదు. కానీ విశ్లేషకులం అని చెప్పుకునే మీలాంటివారే సినిమాకు నష్టాన్ని కలగజేస్తున్నారు' అని రిప్లై ఇచ్చాడు. దీనికి తాప్సీ స్పందిస్తూ.. 'సర్, ఒక అబద్ధాన్ని ఎన్నిసార్లు వల్లెవేసినా అది నిజం కాలేదు. కేవలం సినిమాల గురించి మాట్లాడుతూ పేరు తెచ్చుకున్న ఇలాంటివారు ఇండస్ట్రీకి హాని తలపెట్టాలనే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. వాళ్లెంత మూర్ఖులో చూడండి. అయినా ఇలాంటివాళ్లకు దొబారా సినిమా అర్థం కావడం కొంత కష్టమేలెండి. దానికి మనమేం చేయగలం చెప్పండి' అని ట్విటర్లో చురకలంటించింది. Sir झूट को जितना मर्ज़ी ज़ोर ज़ोर से बोला जाए वो सच नहीं बन जाता । और ये लोग जिनकी relevance ही films की वजह से है वो ही industry को खतम करने में लगे है तो सोचो कितने मूर्ख होंगे। वैसे भी #Dobaaraa इनके दिमाग़ के लिए थोड़ी कठिन फ़िल्म है तो बेचारे क्या कर सकते है। https://t.co/p4q0A82S5M — taapsee pannu (@taapsee) August 20, 2022 చదవండి: బస్సు డ్రైవర్ అసభ్యంగా తాకాడు: సీఎంలను ట్యాగ్ చేసిన నటి -
హతవిధీ.. తాప్సీ సినిమాకు కూడా అదే గతి!
బాలీవుడ్కు ఏదో శని పట్టుకున్నట్లే ఉంది. వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న హిందీ పరిశ్రమకు ఊపిరిపోద్దామనుకున్న బడా డైరెక్టర్లు, స్టార్ హీరోల ఆశ అత్యాశే అయింది. బస్తీమే సవాల్ అంటూ బాక్సాఫీస్ బరిలో దిగిన ఎన్నో పెద్ద సినిమాలు అట్టర్ ఫ్లాప్గా నిలిచాయి. తాజాగా ఈ జాబితాలో తాప్సీ కొత్త మూవీ దొబారా వచ్చి చేరింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం (ఆగస్టు 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అనూహ్యంగా కేవలం 2 నుంచి మూడు శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అవుతున్నాయట. అసలు జనాలే రాకపోవడంతో చాలావరకు షోలు క్యాన్సిల్ చేసుకుంటున్నారట. మహా అయితే ఈ సినిమా మొదటి రోజు రూ.30 లక్షలు, ఫుల్ రన్లో కోటిన్నర రూపాయలు రాబడుతుందని అంచనా వేస్తున్నారు అక్కడి సినీవిశ్లేషకులు. నిజానికి సినిమా ప్రమోషన్స్లో బాయ్కాట్ ట్రెండ్పై తాప్సీ, అనురాగ్లు స్పందిస్తూ.. దొబారా మూవీని కూడా బాయ్కాట్ చేయాలని కోరారు. అన్నట్లే ఆ సినిమాను ఆదరించే నాదుడే కరువయ్యాడు. కాగా దొబారా సినిమా 2018లో వచ్చిన మిరేగ్ అనే స్పానిష్ సినిమాకు రీమేక్. For Me….#Dobaaraa is a Successful film, it SUCCESSFULLY MADE ME SLEEP inside the theatre also made me believe in TIME TRAVEL because I wanted to go back in time when I purchased the ticket for the film… 1.5*/5 ⭐️ ½ #DobaaraaReview #AnuragKashyap #TaapseePannu pic.twitter.com/XPFIuaelTz — Rohit Jaiswal (@rohitjswl01) August 19, 2022 #Dobaaraa is off to a DISASTROUS start at the box office, film is registering merely 2-3% occupancy while many early shows are getting canceled due to NO AUDIENCE.. — Sumit Kadel (@SumitkadeI) August 19, 2022 చదవండి: బుల్లితెర తారలతో నిండిన 'వాంటెడ్ పండుగాడ్' మూవీ రివ్యూ స్టార్ హీరోల సినిమాలను వెనక్కునెట్టిన నిఖిల్ మూవీ -
The Dirty Picture Sequel: డర్టీ పిక్చర్ హీరోయిన్ ఎవరు?
‘ది డర్టీ పిక్చర్’కి సీక్వెల్ రానుందా? అంటే బాలీవుడ్ అవునంటోంది. విద్యాబాలన్ కథానాయికగా ఏక్తా కపూర్ నిర్మించిన ‘ది డర్టీ పిక్చర్’ (2011) గుర్తుండే ఉంటుంది. విద్యా నటనకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. మిలన్ లూథ్రియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దివంగత ప్రముఖ నటి సిల్క్ స్మిత జీవితంలోని కొన్ని అంశాలతో రూపొందినట్లుగా టాక్ వినిపించింది. అయితే దర్శక–నిర్మాతలు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఆ సంగతలా ఉంచితే ‘ది డర్టీ పిక్చర్’కి సీక్వెల్ నిర్మించడానికి ఏక్తా కపూర్ సన్నాహాలు మొదలుపెట్టారని సమాచారం. మరో రచయితతో కలిసి కనికా థిల్లాన్ ఈ సీక్వెల్కి స్టోరీ సిద్ధం చేస్తున్నారట. సీక్వెల్లో విద్యాబాలన్ కాదు... సీక్వెల్లో విద్యాబాలన్ నటించడంలేదు. కాగా ఫస్ట్ పార్ట్ అప్పుడే కంగనా రనౌత్ని కథానాయికగా అడిగారు ఏక్తా కపూర్. అయితే కంగన తిరస్కరించారు. సీక్వెల్కి అడగ్గా.. మళ్లీ తిరస్కరించారట. ఈ నేపథ్యంలో తాప్సీ, కృతీ సనన్ వంటి తారలతో సెకండ్ పార్ట్ గురించి ఏక్తా చెప్పారట. ఇద్దరూ నటించడానికి సుముఖత వ్యక్తపరచారని టాక్. అయితే పూర్తి కథ రెడీ అయ్యాక మరోసారి కలుద్దామని కృతీ, తాప్సీతో అన్నారట ఏక్తా. మరి.. ఇద్దరిలో ‘డర్టీ పిక్చర్ 2’ హీరోయిన్ ఎవరు? అనేది కాలం చెబుతుంది. అలాగే తొలి భాగానికి దర్శకత్వం వహించిన మిలన్ మలి భాగాన్ని కూడా తెరకెక్కిస్తారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. వేరే కథ... ‘ది డర్టీ పిక్చర్’ విద్యాబాలన్ పాత్ర చనిపోవడంతో ముగుస్తుంది. మరి.. సీక్వెల్ కథ ఏంటి? అనే చర్చ జరుగుతోంది. అయితే పూర్తిగా వేరే కథ తయారు చేస్తున్నారట. ఈ ఏడాది చివరికి కథ సిద్ధమవుతుందని సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సీక్వెల్ షూటింగ్ ఆరంభించాలను కుంటున్నారని భోగట్టా. -
‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్... అనురాగ్ అంచనాలు నిజమైతే!
ఇండియన్ సినిమాకు ఆస్కార్ అన్నది ఒక కల. ప్రతీ ఏటా మనం సినిమాను ఎంపిక చేసి ఆస్కార్ కమిటీకి పంపడం.. వారు మన సినిమాను రిజెక్ట్ చేయడం పరిపాటిగా మారింది. కాని 2023 ఆస్కార్ కు ఇండియా నుంచి వెళ్లే సినిమాను ఎంపిక చేయాల్సి వస్తే గుడ్డిగా ఆర్ ఆర్ ఆర్ ను సెలక్ట్ చేయమంటున్నాడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ అవార్డ్ ఈవెంట్ కు మన దేశం తరుపున కమిటీ కనుక ఆర్ ఆర్ ఆర్ ను సెలక్ట్ చేసి పంపితే ఉత్తమ విదేశి చిత్రం క్యాటగరీలో ఆస్కార్ అందుకోవడానికి 99 శాతం చాన్స్ ఉందని అభిప్రాయపడ్డాడు. తాప్సీ ప్రధాన పాత్రలో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన హిందీ చిత్రం ‘దోబారా’. ఆగస్ట్ 19న ఈ చిత్రం విడుదల కాబోతుంది. కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా అనురాగ్ మీడియాతో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా నుంచి అధికారిక ఎంట్రీ లభిస్తే.. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ లభించే అవకాశం ఉందని చెప్పారు. (చదవండి: తాప్సీపై డైరెక్టర్ వల్గర్ కామెంట్స్, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు) హాలీవుడ్పై ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రభావితం చేసిందని, అక్కడ తెరకెక్కిన మార్వెల్ మూవీస్ కంటే కూడా ఆర్ఆర్ఆర్ హాలీవుడ్ ఆడియెన్స్ కు బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు అనురాగ్. ఇక వెరైటీ అనే మరో హాలీవుడ్ మ్యాగజైన్ఆస్కార్ బెస్ యాక్టర్ క్యాటగరీస్ లిస్ట్ లో తారక్ కూడా ఎంపిక అయ్యే అవకాశం ఉందంటూ లిస్ట్ బయటపెట్టింది.మొత్తంగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన తర్వాత ఆర్ ఆర్ ఆర్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. -
తాప్సీపై డైరెక్టర్ వల్గర్ కామెంట్స్, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను ప్రస్తుతం తన తాజా చిత్రం ‘దొబారా’ మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అనురాగ్తో కలిసి తాప్సీ ఓ చానల్ ఇంటర్య్వూకు హాజరైంది. ఈ సందర్భందగా అనురాగ్ తాప్సీపై చేసిన వల్గర్ కామెంట్స్ ప్రస్తుతం హాట్టాపిక్ నిలిచాయి. ఈ సందర్భంగా యాంకర్ రణ్వీర్ సింగ్ నగ్న ఫొటోషూట్పై మీ అభిప్రాయం ఏంటని అనురాగ్ కశ్యప్ను ప్రశ్నించాడు. దీనిపై డైరెక్టర్ స్పందిస్తూ.. అది తనకు నచ్చిందని, ప్రస్తుతం ఇలాంటివి సర్వసాధారణమని బదులిచ్చాడు. చదవండి: ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది: అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు అయితే మీరు కూడా ట్రై చేయండి.. ఆ ఫొటోషూట్ బాగా వైరల్ అవుతుందంటూ యాంకర్ చమత్కిరించాడు. దీంతో తాప్సీ మధ్యలో మాట్లాడుతూ.. ప్లీజ్ హారర్ షోకు తెరలేపకండి అని సరదాగా కామెంట్స్ చేసింది. ఇక తాప్సీ కామెంట్స్కు రియాక్ట్ అయిన దర్శకుడు అనురాగ్.. నువ్వేందుకు భయపడుతున్నావ్.. ‘హో తనకంటే నా బూ** పెద్దగా ఉంటాయి.. అందుకే తను అసూయ పడుతుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక అతడి కామెంట్కి కాస్తా ఇబ్బంది పడ్డ తాప్సీ ఆ తర్వాత లైట్ తీసుకుని నవ్వేసింది. దీంతో నెట్టింట ఈ వీడియో వైరల్గా మారింది. అనురాగ్ అంత అసభ్యంగా కామెంట్స్ చేయడంతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇక తాప్సీ రియాక్షన్ చూసి ఆమెను తప్పుబడుతూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
స్టేజ్పై తమన్నా తీరుకు సౌత్ ఫ్యాన్స్ ఫిదా, ఏం చేసిందంటే..
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది. ఓ అవార్డు ఫంక్షన్ కార్యక్రమంలో స్టేజ్పై తమన్నా వ్యవహించిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. రీసెంట్గా ఆస్ట్రేలియాలోని జరిగిన ఐఎఫ్ఎఫ్ఎమ్ (ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్) అవార్డు కార్యక్రమానికి తమన్నా ముఖ్య అతిథిగా హాజరైంది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చదవండి: ఆమె అంటే క్రష్, ఆ స్టార్ హీరోయిన్తో నటించాలని ఉంది: నాగ చైతన్య ఈ క్రమంలో ఈవెంట్ నిర్వాహకులు ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరోయిన్లు తమన్నా, తాప్సీ పన్ను సైతం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా తాప్సీ చెప్పులు ధరించే జ్యోతి ప్రజ్వలన చేయగా.. తమన్నా మాత్రం దక్షిణాది సంస్కృతి ఉట్టిపడేలా వ్యవహరించి, సౌత్ ప్రజలు ఔరా అనేలా చేసింది. జ్యోతి ప్రజ్వలన చేసే ముందు చెప్పులు పక్కకు విడిచి దీపం వెలిగించింది. ఆ పక్కనే ఉన్న ఈవెంట్ ఆర్గనైజర్ తమన్నాను.. ఇలా ఎందుకు చేశారు అని అడ్గగా.. ఇది దక్షిణాది సంస్కృతి అని బదులులిచ్చింది. చదవండి: రూ. 2 కోట్లు ఇస్తే రిటర్న్ పంపించాడు: విజయ్పై పూరీ ఆసక్తికర వ్యాఖ్యలు ఇందుకు సంబంధించిన వీడియోను తమన్నా ఫ్యాన్ ఒకరు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ అంత తమన్నాకు ఫిదా అవుతున్నారు. ‘తమన్నాకు దక్షిణాది నేర్పించింది ఇదే’ ,‘సంస్కృతిని గౌరవించడమంటే ఇదే కదా’, ‘చిన్న చిన్న విషయాలే గొప్పగా నిలబెడతాయి’, ‘భారతదేశ గొప్ప వారసత్వ సంస్కృతిని తమన్నా చూపించింది’ అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Karthick_Speaks ✳️🏅 (@suriya_tamannaah) View this post on Instagram A post shared by Karthick_Speaks ✳️🏅 (@suriya_tamannaah) -
ఆళ్ల సినిమాలు చూడొద్దంతే.. ఇప్పుడిదే నడుస్తోంది!
బాలీవుడ్లో బాయ్కాట్ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాను బాయ్కాట్ చేయాలని గత కొద్ది రోజులుగా ట్విటర్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ఇది కూడా ఒక కారణమన్న వాదన అప్పుడే మొదలైంది. ఆమిర్.. ట్రోలింగ్ గతంలో పీకే సినిమాలో ఇతర గ్రహం నుంచి భూమికి వచ్చిన పాత్రలో ఆమిర్ నట్టించారు. కళ్లను పెద్దవిగా చేసి, వెడల్పాటి చెవులతో చిత్రమైన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజా సినిమాలోనూ ఇలాగే నటించారని కొందరు విమర్శిస్తుంటే.. సిక్కులను చిత్రీకరించిన తీరు బాలేదంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమిర్ను హిందు వ్యతిరేకిగా పేర్కొంటూ #BoycottLaalSinghChaddha హ్యాష్టాగ్తో ట్విటర్లో నెటిజనులు ట్రోల్ చేశారు. భారత సైన్యాన్ని అగౌరవపరిచారని మరి కొందరు అలిగారు. తన చిత్రాన్ని బహిష్కరించవద్దని ఆమిర్ ఖాన్ పబ్లిగ్గా కన్నీళ్లు పెట్టుకున్నా నిరసనకారులు శాంతించలేదు. అయితే బాయ్కాట్ బాలీవుడ్కు కొత్తేమి కాదు. గతంలోనూ, ఇప్పుడు కూడా పలు చిత్రాలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయి. గతంలో ఆమిర్ఖాన్ దంగల్, దీపికా పదుకోన్ పద్మావత్ సినిమాల విడుదల సమయంలోనూ ఇలాంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈ రెండు సినిమా ఘన విజయం సాధించడం విశేషం. అక్షయ్కు తప్పని తలనొప్పి ఇక లాల్ సింగ్ చద్దాతో పాటే విడుదలైన అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్' సినిమా కూడా బహిష్కరణాస్త్రాన్ని ఎదుర్కొంది. ఈ సినిమా రచయిత్రి కనికా ధిల్లాన్ గతంలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో #BoycottRakshaBandhanMovie హ్యాష్టాగ్తో ట్విటర్లో ప్రచారం చేశారు. అయితే వివాదస్పద ట్వీట్లను తొలగించి నిరసనకారులను చల్లబరిచే ప్రయత్నం చేశారు కనికా ధిల్లాన్. సినిమాలు చూడొద్దంటూ ప్రచారం చేయడం సమంజసం కాదని హీరో అక్షయ్ కుమార్ కూడా విన్నవించుకున్నాడు. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. తాప్సి సినిమా చూడొద్దు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన దొబారా మూవీని చూడొద్దంటూ సోషల్ మీడియాలో ప్రచారం షురూ అయింది. అనురాగ్, తాప్సి తీరు నచ్చని సంప్రదాయవాదులు ట్విటర్లో వారికి వ్యతిరేకంగా #CancelDobaaraa హ్యాష్టాగ్తో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆగస్టు 19న విడుదలవుతున్న ఈ సినిమాను బాయ్కాట్ చేయాలని ట్విటర్ వేదికగా పిలుపునిస్తున్నారు. బాయ్కాట్ ప్రచారాన్ని అనురాగ్, తాప్సి చాలా తేలిగ్గా తీసుకున్నారు. (క్లిక్: 'పోకిరి' స్పెషల్ షో.. దిమ్మతిరిగే కలెక్షన్స్ వసూలు) ఒటీటీలనూ వదలడం లేదు అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన డార్లింగ్స్ సినిమా ఆగస్టు 5న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఈ సినిమా కూడా బాయ్కాట్ ప్రచారాన్ని ఎదుర్కొంది. #BoycottAliaBhatt హ్యాష్టాగ్తో అలియా భట్పై అక్కసు వెళ్లగక్కారు కొంతమంది. పురుషులను కించేపరిచేలా సినిమా తీసిన అలియా భట్ని అందరూ బహిష్కరించాలని పిలుపునిచ్చారు. పురుషులపై గృహ హింస అనేది బాలీవుడ్కు నవ్వులాటగా ఉందని ఫైర్ అవుతున్నారు. గౌరీ ఖాన్, గౌరవ్ వర్మతో కలసి అలియా భట్ నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రారంభ వారాంతంలోనే 10 మిలియన్లపైగా వాచ్ అవర్స్ నమోదు చేసి దూసుకుపోతోంది. (క్లిక్: ట్విటర్లో తెగ ట్రెండ్ అవుతున్న దిల్రాజు.. కారణమిదే!) `బ్రహ్మాస్త్ర`పై నిషేధాస్త్రం రణ్బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటిస్తున్న `బ్రహ్మాస్త్ర` మూవీ ట్రైలర్ అలా రిలీజైందో లేదో వెంటనే బాయ్కాటర్లు రెడీ అయిపోయారు. #BycottBrahmastra ట్యాగ్తో వ్యతిరేక ప్రచారం మొదలెట్టేశారు. హీరో రణబీర్ కపూర్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని ట్విటర్ వేదికగా ఏకీపారేశారు. కాగా, ఈ సినిమాలో బిగ్బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించనున్నారు. (క్లిక్: ‘సీతారామం’ నేను చేయాల్సింది.. నాగార్జున) -
తాప్సీ మూవీని బాయ్కాట్ చేయాలంటూ డిమాండ్!
సినిమా రిలీజ్ అవడానికంటే ముందే దాన్ని నిలిపివేయాలంటూ బాయ్కాట్ చేసే ప్రచారం ఈమధ్య పరిపాటి అయింది. బాలీవుడ్లో ఈ వైఖరి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ బడా హీరోల నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే చాలు దాన్ని చూడొద్దంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో నేడు రిలీజైన ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా కూడా ఉంది. తాజాగా ఇప్పుడు మరో సినిమాను బాయ్కాట్ చేయాలంటూ ట్విటర్ హోరెత్తిపోతోంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన దొబారా మూవీ ఆగస్టు 19న రిలీజ్ కాబోతోంది. ఇందులో తాప్సీ పన్ను ప్రధాన కథానాయిక. అయితే అన్ని బాలీవుడ్ సినిమాల్లాగే తమ మూవీని కూడా బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియా ఊగిపోవాలని తాప్సీ, అనురాగ్ కోరుకోవడం గమనార్హం. అసలు థియేటర్లలో రిలీజయ్యే అర్హత దొబారాకు లేనే లేదు, తాప్సీ ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్ని చేస్తుంది? మేము చూడటం ఆపేస్తే అప్పుడు తెలిసొస్తుంది, మన దేశం కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ సహించాల్సిన అవసరం లేదు, ఇలాంటి చీప్ మనుషులను మనం గౌరవించాల్సిన అవసరం లేదు అంటూ క్యాన్సల్ దొబారా అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. They used to show the capability of net together and will boycott your film.#CancelDobaaraa @anuragkashyap72 @taapsee pic.twitter.com/yHfKtcayFo — Rishabh (@rishi12300) August 10, 2022 Its not cool to create always controversies by speaking against our country #CancelDobaaraa pic.twitter.com/ThinlwbxWp — Rahul (@Rahul__Roy18) August 10, 2022 I think this #CancelDobaaraa trend has been planned by the two jokers Anurag Kashyap and Taapsee Pannu. — Debmalya Banerjee (@DebmalyaDgp) August 10, 2022 Fake people are @anuragkashyap72 & @taapsee don't deserve our attention at all #CancelDobaaraa 💯 pic.twitter.com/W3Ll5y9y0e — Nitin_Reddy (@Nitinreddy2003) August 10, 2022 #CancelDobaaraa is needy thing at this time of point.. We need to full boycott such films pic.twitter.com/ilx9WwE6EC — Aayan (@ayanali9563) August 10, 2022 చదవండి: ఘనంగా ప్రముఖ సీరియల్ నటి సీమంతం, ఫొటోలు వైరల్ ఆ హీరోయిన్తో బ్రేకప్, మరొకరితో డేటింగ్? స్పందించిన హీరో -
నేనేం తప్పు చేశానని అరుస్తున్నారు.. మీడియాతో తాప్సీ వాగ్వాదం
‘ఝుమ్మంది నాదం’తో టాలీవుడ్కి పరిచయం అయిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను.. తొలి సినిమాతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో తెలుగు వరస ఆఫర్లు, స్టార్ హీరో సరసన నటించిన ఆమె ఉన్నట్టుంటి బాలీవుడ్కు మాకాం మార్చింది. అక్కడ మహిళ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఈ భామ బాలీవుడ్లోనే సెటిలైపోయింది. అప్పుడప్పుడు 'మిషన్ ఇంపాజిబుల్' వంటి తెలుగు సినిమాలు చేస్తూ పలకరిస్తోంది. కాగా ఇటీవల స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'శభాష్ మిథూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విజయం సంగతి ఎలా ఉన్న మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది తాప్సి. ఈ సొట్ట బుగ్గల బ్యూటీ నటించిన తాజా చిత్రం 'దొబారా'. ఈ మూవీ ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటుంది తాప్సీ. అయితే ఈ క్రమంలో ఫొటోగ్రాఫర్లతో తాప్సీకి కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ముంబైలో సినిమా ప్రమోషన్ కోసం హాజరైన తాప్సీ గుమ్మం దగ్గర ఉన్న ఫొటోగ్రాఫర్లను పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయింది. వారు వెనుక నుంచి ఎంత పిలిచినా స్పందించలేదు. 'ఇప్పటికే ఆలస్యంగా వచ్చారు. కొద్దిగా ఆగి వెళ్లండి' అంటూ అరుస్తున్నా, అవేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయింది తాప్సీ. ఇక ఆమె బయటకు వచ్చిన తర్వాత వారితో చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. 'నేనేం లేటుగా రాలేదు. నా టైం ప్రకారమే నేను వచ్చాను. నేను ఇప్పటివరకు ప్రతి చోటుకు సరైన సమయానికే వెళ్లాను. నేనేం తప్పు చేశానని అరుస్తున్నారు' అని అడిగింది తాప్సీ. అందుకు వారు 'మేము రెండు గంటల నుంచి మీకోసం ఎదురుచూస్తున్నాం. కానీ మేము పిలుస్తున్నా మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్లిపోవడం ఏంటి?' అని నిలదీశారు. 'అందులో నా తప్పు ఏముంది? నా పని నేను చేసుకుంటూ.. వెళ్లిపోతున్నాను' అని చెప్పగా 'మేము మీకోసం రెండు గంటల నుంచి ఎదురుచూస్తున్నాం' అని ఫొటోగ్రాఫర్స్ గట్టిగా అరిచేసరికి 'దయచేసి మీరు నాతో మర్యాదగా మాట్లాడండి. నేను కూడా మీతో మర్యాదాగ మాట్లాడతాను' అంటూ గొడవకు దిగింది. తర్వాత పరిస్థితిని సద్దుమణిగించేందుకు పలువురు ఫొటోగ్రాఫర్లు ప్రయత్నించగా, తాప్సీ సహనటుడు పావైల్ గులాటి కూడా ఆమె వెనుక నిలబడ్డాడు. 'కెమెరా నాపై ఉంది కాబట్టే నా వైపు మాత్రమే కనిపిస్తుంది. అదే ఒక్కసారి మీపై ఉంటే మీరు ఎలా నాతో మాట్లాడుతున్నారో మీకు అర్థమయ్యేదు. ఎప్పుడు మీరే కరెక్ట్. ప్రతిసారి నటీనటులదే తప్పు' అని అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. కొంతమంది నెటిజన్స్ 'తాప్సీకి ఎంత పొగరు' అని విమర్శిస్తుంటే, పలువురు 'ఆమె అలా మాట్లాడటంలో తప్పు ఏముంది?' అని సమర్థిస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
శృంగార జీవితంపై హీరోయిన్ తాప్సీ బోల్డ్ కామెంట్స్
సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను ప్రస్తుతం బాలీవుడ్లో తనదైన గుర్తింపు సంపాదించుకుంది. పింక్, తప్పడ్ , రష్మీ రాకెట్ వంటి సినిమాలతో అలరించింది. తాజాగా ఆమె నటించిన చిత్రం దోబారా ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్లో పాల్గొంటున్న ఈ బ్యూటీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. అయితే ఇటీవలి కాలంలోహీరో, హీరోయిన్స్ ఎక్కువగా తమ మూవీ ప్రమోషన్స్ కోసం కాఫీ విత్ కరణ్ సీజన్-7లో పాల్గొంటున్నారు. చదవండి: మీడియాకు క్షమాపణలు చెప్పిన అమీర్ ఖాన్.. ఎందుకంటే అయితే తాప్సీ మాత్రం ఆ షోకి వెళ్లకపోవడంపై మీడియా నుంచి ఆమెకు ఇదే ప్రశ్న ఎదురైంది. కరణ్ షోకు మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించడం లేదని అడగ్గా.. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనేంత గొప్పగా నా శృంగార జీవితం లేదు అంటూ బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం కరణ్ షోపై తాప్సీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. కాగా ఇప్పటివరకు కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సెలబ్రిటీలకు కరణ్ శృంగార జీవితం(సెక్స్ లైఫ్)పై అనేక ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. చదవండి: ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆలియా భట్ ఎంత సంపాదిస్తుందో తెలుసా? -
నా విజయాల ఖరీదు చాలా ఎక్కువ: తాప్సీ
తన విజయాల ఖరీదు చాలా ఎక్కువ అంటోంది తాప్సీ. బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటిస్తూ రాణిస్తోంది ఈ అమ్మడు. అయితే తొలి రోజుల్లో నటిగా పునాది వేసింది, నిలబెట్టింది, పేరు తెచ్చిపెట్టిండి మాత్రం టాలీవుడే. ఆ తరువాత కోలీవుడ్లో అడుగుపెట్టినా ఆశించిన విజయాలు మాత్రం దక్కలేదు. అలాంటి తరుణంలో బాలీవుడ్ నుంచి పింక్ రూపంలో అదృష్టం తలుపుతట్టింది. ఆ తరువాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస విజయాలతో అవకాశాలను కొల్లగొడుతోంది. అలాంటి ఈ టాప్ హీరోయిన్ తాజాగా తన తొలి రోజుల్ని గుర్తు చేసుకుంది. ఒక భేటీలో పేర్కొంటూ.. తన మనసులోని భావాలు పంచుకోవడానికి కెరీర్ ప్రారంభంలో ఎవరూ ఉండేవారు కాదని చెప్పింది. అంతా సీనియర్లేనని, దీంతో దూరంగా ఉండే వారి చరిత్రలోనూ చూస్తూ నటిగా పరిణితి పెంచుకుంటూ వచ్చానని వెల్లడించింది. అయితే తాను తన ఇష్టానుసారమే నడుచుకున్నానని, ఈ రంగంలోకి ఎవరికివారు తమ సొంత ఫార్ములాతో రావాలని సూచించింది. కష్టానికి, విజయానికి కచ్చితంగా ఖరీదు ఉంటుందని పేర్కొంది. ఇప్పుడు తాను తలుపు తెరుచుకుని కాలు బయట పెట్టగానే ఎన్నో కళ్లు తనను వెంటాడతాయంది. ప్రతి నడవడికను గమనిస్తారని, అందుకే తాను చాలా జాగ్రత్తగా తప్పులు జరగకుండా చూసుకుంటానని చెప్పింది. ప్రస్తుతం నటిగా మంచి స్థాయిలో ఉన్నానని, అయితే ఇందుకు చెల్లించిన ఖరీదు అధికమేనని తాప్సీ పేర్కొంది. -
Shabaash Mithu: సండే సినిమా ఉమన్ ఇన్ బ్లూ
‘మెన్ ఇన్ బ్లూ’ అంటే భారత క్రికెట్ జట్టు. అంటే మగ జట్టు. క్రికెట్ మగవారి ఆట. క్రికెట్ కీర్తి మగవారిది. క్రికెట్ గ్రౌండ్ మగవారిది. కాని ఈ ఆటను మార్చే అమ్మాయి వచ్చింది. ‘మెన్ ఇన్ బ్లూ’ స్థానంలో ‘ఉమెన్ ఇన్ బ్లూ’ అనిపించింది. స్త్రీలు క్రికెట్ ఆడలేరు అనే విమర్శకు తన బ్యాట్తో సమాధానం ఇచ్చింది. ‘మిథాలి రాజ్’ మన హైదరాబాదీ కావడం గర్వకారణం. ఆమె బయోపిక్ ‘శభాష్ మిథు’ తాజాగా విడుదలైంది. అంచనాలకు తగ్గట్టు లేకపోయినా స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. సినిమాలో ఒక ప్రెస్మీట్లో మిథాలి రాజ్ పాత్రధారి అయిన తాప్సీ పన్నును అడుగుతాడు జర్నలిస్టు– మీ ఫేవరెట్ పురుష క్రికెటర్ ఎవరు? అని. దానికి తాప్సీ ఎదురు ప్రశ్న వేస్తుంది– ఈ ప్రశ్నను మీరెప్పుడైనా పురుష క్రికెటర్లను అడిగారా... వాళ్ల అభిమాన మహిళా క్రికెటర్ ఎవరు అని? మిథాలి రాజ్ నిజ జీవితంలో జరిగిన ఈ ఘటన సినిమాలో అంతే ప్రభావవంతంగా ఉంటుంది. ఏ ప్రశ్న ఎవరికి వేయాలో కూడా మన సమాజంలో ‘కండీషనింగ్’ ఉంటుంది. మహిళా క్రికెట్ బోర్డును బిసిసిఐలో విలీనం చేశాక (సినిమాలో) టీమ్ యూనిఫామ్స్ పంపమంటే పురుష జట్టు వాడేసిన యూనిఫామ్స్ను పంపుతారు. ‘మా పేర్లతో మాకు బ్లూ కలర్ యూనిఫామ్స్ కావాలి’ అని మిథాలి డిమాండ్ చేస్తుంది. దానికి బిసిసిఐ చైర్మన్ ముప్పై ఏళ్లుగా అక్కడ పని చేస్తున్న ప్యూన్ను పిలిచి ‘నీకు తెలిసిన మహిళా క్రికెటర్ల పేర్లు చెప్పు?’ అంటాడు. ప్యూన్ చెప్పలేకపోతాడు. ‘మీ గుర్తింపు ఇంత. మీకు ఇవి చాలు’ అంటాడు. మిథాలి ఆ మాసిన యూనిఫామ్ను అక్కడే పడేసి వచ్చేస్తుంది. మన దేశంలో మహిళలు చదువులోనే ఎంతో ఆలస్యంగా రావాల్సి వచ్చింది. ఇక ఆటల్లో మరింత ఆలస్యంగా ప్రవేశించారు. అసలు ఆటల్లో ఆడపిల్లలను, యువతులను ప్రోత్సహించాలన్న భావన సమాజానికి, ప్రభుత్వాలకు కలగడానికి కూడా చాలా సమయం పట్టింది. ఒకవేళ వాళ్లు ఆడుతున్నా మన ‘సంప్రదాయ ఆలోచనా విధానం’ వారికి అడుగడుగున ఆంక్షలు విధిస్తుంది. సినిమాలో/ నిజ జీవితంలో మిథాలి రాజ్ కుటుంబం మొదట కొడుకునే క్రికెట్లో చేరుస్తుంది. సినిమాలో కొంత డ్రామా మిక్స్ చేసి కూతరు కూడా క్రికెట్లో ప్రవేశించినట్టు చూపారు. నిజ జీవితంలో మిథాలి బాల్యంలో బద్దకంగా ఉంటోందని ఆమెను కూడా క్రికెట్లో చేర్చాడు తండ్రి. సోదరుడి ఆట కంటే మిథాలి ఆట బాగుందని కోచ్ చెప్పడంతో మిథాలి అసలైన శిక్షణ మొదలవుతుంది. ఆమె ఎలా ఎదిగిందనేది ఈ సినిమా చూపిస్తుంది. 1983లో భారత జట్టు ‘వరల్డ్ కప్’ సాధించాక క్రికెట్ ఆటగాళ్లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. క్రికెట్లో వ్యాపారాన్ని కనిపెట్టిన బిసిసిఐ విపరీతంగా మేచ్లు ఆడిస్తూ ఆటగాళ్లను పాపులర్ చేసింది. టెస్ట్లు, వన్డేలు, టూర్లు ఇవి క్రికెట్ను మరపురానీకుండా చేశాయి. 1987 ‘రిలయన్స్ కప్’ నాటికి ఈ దేశంలో క్రికెట్ ఎదురు లేని క్రీడగా అవతరించింది. మహిళా క్రికెట్ జట్టు 1978 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా వరల్డ్ కప్లో ప్రాతినిధ్యం వహిస్తున్నా దాని గురించి ఎవరికీ తెలియదు. ఎవరూ పట్టించుకోలేదు. మిథాలి రాజ్కు ముందు భారత మహిళా క్రికెట్లో మంచి మంచి ప్లేయర్లు ఉన్నా మిథాలి రాజ్ తర్వాత పరిస్థితి మారింది. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి ఆడిన తొలి మేచ్లోనే సెంచరీ కొట్టిన అద్భుత ప్రతిభ మిథాలిది. అతి చిన్న వయసులో ఆమె కెప్టెన్ అయ్యింది. 2013, 2017 ప్రపంచ కప్లలో ఆమె వల్ల టీమ్ ఫైనల్స్ వరకూ వెళ్లింది. టెస్ట్లలో, వన్ డేలలో, టి20లో అన్నీ కలిపి దాదాపు 10 వేల పరుగులు చేసిన మిథాలి ప్రపంచంలో మరో మహిళా క్రికెటర్కు లేని అలాగే పురుష క్రికెటర్లకు లేని అనేక రికార్డులు సొంతం చేసుకుంది. అయితే సినిమాలో చూపినట్టు ఆమెకు సౌకర్యవంతమైన జీవన నేపథ్యం ఉంది. కాని జట్టులో ఉన్న మిగిలిన సభ్యులు భిన్న నేపథ్యాలు, అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వారు. మిథాలీకి, ఈ సభ్యులకు మధ్య సఖ్యత కుదరడం వారందరిలో ఒక టీమ్ స్పిరిట్ రావడం... ఇదంతా ఈ సినిమాలో చూడొచ్చు. మహిళా జట్టుగా తాము ఎదుర్కొన్న తీవ్ర వివక్ష, ఆశ నిరాశలు, మరోవైపు పురుష జట్టు ఎక్కుతున్న అందలాలు... ఇవన్నీ సినిమాలో ఉన్నాయి. మిథాలి రాజ్ బయోపిక్గా వచ్చిన ‘శభాష్ మిథు’ బహుశా హైదరాబాద్ ఆటగాళ్ల మీద వచ్చిన మూడో బయోపిక్. దీనికి ముందు అజారుద్దీన్ మీద ‘అజార్’, సైనా నెహ్వాల్ మీద ‘సైనా’ వచ్చాయి. అవి రెండు నిరాశ పరిచాయి. ‘శభాష్ మిథు’ ఇంకా బాగా ఉండొచ్చు. దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ మిథాలి కేరెక్టర్ గ్రాఫ్ను పైకి తీసుకెళ్లడంలో విఫలమయ్యాడు. గొప్ప ఎమోషన్ తీసుకురాలేకపోయాడు. క్లయిమాక్స్ను ఆట ఫుటేజ్తో నింపడం మరో లోపం. ఈ సినిమా మరింత బడ్జెట్తో మరింత పెద్ద దర్శకుడు తీయాలేమో అనిపిస్తుంది. అయినా సరే ఈ కాలపు బాలికలకు, యువ క్రీడాకారిణులకు ఈ సినిమా మంచి బలాన్ని ఇస్తుంది. ధైర్యాన్ని ఇచ్చి ముందుకు పొమ్మంటుంది. క్రీడల్లో సత్తా చాటుకోమంటుంది. తల్లిదండ్రులను, సమాజాన్ని ఆడపిల్లలను క్రీడల్లో ప్రోత్సహించమని చెబుతుంది. ఏ నిరాడంబర ఇంటిలో ఏ మిథాలి రాజ్ ఉందో ఎవరికి తెలుసు. -
సవాల్గా తీసుకుని ఈ సినిమా చేశాను: తాప్సీ
‘‘రెగ్యులర్ సినిమాల కన్నా బయోపిక్స్ కాస్త కష్టంగా, డిఫరెంట్గా ఉంటాయి. ఆల్రెడీ ఒక వ్యక్తి యాక్టివ్గా ఉన్నప్పుడు ఆ పాత్ర పోషించడం అనేది ఇంకా కష్టం. నా కెరీర్లో చేసిన అత్యంత కష్టమైన పాత్రల్లో ‘శభాష్ మిథు’లో చేసిన పాత్ర ఒకటి’’ అన్నారు తాప్సీ. భారత మాజీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘శభాష్ మిథు’. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో తాప్సీ టైటిల్ రోల్ చేశారు. వయాకామ్ 18 సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో తాప్సీ మాట్లాడుతూ – ‘‘నాకు క్రికెట్ గురించి అంతగా తెలియదు. బ్యాట్ పట్టుకోవడం కూడా రాదు. చిన్నతనంలో ‘రేస్’, ‘బాస్కెట్బాల్’ వంటి ఆటలు ఆడాను కానీ క్రికెట్ ఆడలేదు. అందుకే ‘శభాష్ మిథు’ సినిమా ప్రాక్టీస్లో చిన్నప్పుడు క్రికెట్ ఎందుకు ఆడలేదా? అని మాత్రం ఫీలయ్యాను. ‘శభాష్ మిథు’ సినిమా క్రికెట్ గురించి మాత్రమే కాదు.. మిథాలీ రాజ్ జీవితం కూడా. అందుకే ఓ సవాల్గా తీసుకుని ఈ సినిమా చేశాను. మిథాలి జర్నీ నచ్చి ఓకే చెప్పాను. ట్రెండ్ను బ్రేక్ చేయాలనుకునే యాక్టర్ని నేను. సమంతతో కలిసి వర్క్ చేయనున్నాను. ఈ ప్రాజెక్ట్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను’’ అని అన్నారు. ‘‘కవర్ డ్రైవ్ను తాప్సీ నాలాగే ఆడుతుంది. మహిళా క్రికెట్లో నేను రికార్డులు సాధించానని నా టీమ్ నాతో చెప్పారు. అయితే ఆ రికార్డ్స్ గురించి నాకు అంత పెద్దగా తెలియదు. కెరీర్లో మైల్స్టోన్స్ ఉన్నప్పుడు అవి హ్యాపీ మూమెంట్స్ అవుతాయి. కీర్తి, డబ్బు కోసం నేను క్రికెట్ను వృత్తిగా ఎంచుకోలేదు. ఇండియాకు ఆడాలనే ఓ తపనతోనే హార్డ్వర్క్ చేశాను. నాపై ఏ ఒత్తిడి లేదు. నా ఇష్ట ప్రకారంగానే రిటైర్మెంట్ ప్రకటించాను’’ అన్నారు మిథాలీ రాజ్. -
పాన్ ఇండియా మల్టీస్టారర్పై సామ్ ఫోకస్.. అప్పుడు నయన్, ఇప్పుడు తాప్సీ
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా మార్కెట్లో వసూళ్ల వర్షం కురిపించింది. కమల్ హాసన్ విక్రమ్ కూడా మల్టీస్టారర్గా వచ్చి.. కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ పై హీరోయిన్స్ కూడా ఇంట్రెస్ పెడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సమంత పాన్ ఇండియా మల్టీస్టారర్ సెట్ చేస్తూ ముందుకెళ్తోంది. కోలీవుడ్ వరకు వెళ్లి అక్కడ నయనతారతో, కణ్మణి రాంబో కతిజా(కేఆర్కే) చేసింది. సమంత.ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు లేడీ సూపర్ స్టార్స్ కనిపించడంతో ఆ సినిమా ఏకంగా ఈ ఏడాది కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి గా నిలిచింది. అందుకే సేమ్ సీన్ ను బాలీవుడ్ లోనూ రిపీట్ చేయాలనుకుంటోంది సమంత.అక్కడి లీడింగ్ లేడీ తాప్సీతో కలసి పాన్ ఇండియా మూవీ చేయనుంది సమంత. కొద్ది రోజుల క్రితమే ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అంటూ రూమర్ వచ్చింది. ఇప్పుడు అదే వార్త నిజమైంది. (చదవండి: రామ్పై బాలయ్య సెంటిమెంట్ ను అప్లై చేస్తున్న బోయపాటి!) ప్రస్తుతానికి తాప్సీ బ్యానర్ లో సమంత నటించే చిత్రానికి సంబంధించి స్టోరీ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాలో తాను కూడా ఓ కీలకమైన పాత్రలో నటించేందుకు సిద్ధం అంటోంది తాప్సీ. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానంటోంది. సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ స్టార్ డమ్ అందుకుంది తాప్సీ. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా తెరకెక్కుతున్న డంకీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు తాప్సీ దారిలోనే సమంత కూడా బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర కోసం ప్రయత్నిస్తోంది. -
ఎవరు మర్చిపోలేని ఆట ఆడి చూపిస్తా.. ఆసక్తిగా ట్రైలర్
Taapsee Pannu Starrer Shabaash Mithu Trailer Released: ప్రత్యేకమైన శైలీలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్లో ఉంది తాప్సీ పన్ను. ఇప్పటివరకు తప్పడ్, హసీనా దిల్రూబా, రష్మీ రాకెట్, లూప్ లపేటా చిత్రాలతో అలరించింది ఈ పంజాబీ భామ. తాజగా తాప్సీ నటించిన చిత్రం 'శభాష్ మిథూ'. శ్రీజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్గా తెరకెక్కింది. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శభాష్ మిథూ ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. రెండు నిమిషాల 44 సెకన్లపాటు సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. మిథాలీ చిన్నతనంలో కన్న కలను చెబుతూ ప్రారంభమైన ట్రైలర్ ఎమోషనల్గా ఆకట్టుకునేలా ఉంది. మిథాలీ ఆటను మొదలు పెట్టడం, ప్రాక్టీస్, కెప్టెన్గా మారడం, క్రికెట్లో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత, వారికి గుర్తింపు తీసుకువచ్చేందుకు పడిన కష్టాలు తదితర అంశాలను సినిమాలో చక్కగా చూపించనున్నట్లు తెలుస్తోంది. తాప్సీ నటన అద్భుతంగా ఉంది. మన గుర్తింపును ఎవరూ మరిచిపోలేనంతలా ఆట ఆడి చూపిస్తా అని తాప్సీ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. వయకామ్ 18 స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్లో కరణ్ జోహార్.. వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! -
'బ్లైండ్'గా వచ్చేస్తున్న హీరోహీరోయిన్లు..
Upcoming Movies Of Bollywood Actors And Actresses Playing In Blind Role: చాలెంజింగ్ రోల్స్ ఒప్పుకోవాలంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకోవాలి. ‘గెలుచుకుంటామనే నమ్మకం ఉంది’ అంటున్నారు కొందరు తారలు. ‘మైండ్లో ఫిక్సయితే.. బ్లైండ్గా చేస్తాం’ అంటూ అంధులుగా నటించడానికి రెడీ అయ్యారు. నటనతో తమ సత్తా చూపిస్తామంటున్నారు. ఈ స్టార్స్ చేస్తున్న చిత్రాలపై ఓ లుక్కేయండి. బిజినెస్ డీలింగ్స్తో బిజీ కానున్నారు బాలీవుడ్ హీరో రాజ్కుమార్ రావ్. ఆయన అన్ని విషయాలనూ శ్రద్ధగా వింటారు.. కానీ చూడరు. ఎందుకంటే.. బ్లైండ్. చూపు లేకపోయినా సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్మేన్. ఆంధ్ర ప్రదేశ్లోని మచిలీపట్నంలో పుట్టిన బొల్లా శ్రీకాంత్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో శ్రీకాంత్గా రాజ్కుమార్ రావ్ నటించనున్నారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్లో చేరిన తొలి అంధుడిగా శ్రీకాంత్ బొల్లా రికార్డు సృష్టించిన విషయం చాలామందికి తెలుసు. అలాగే ఎంతో మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు శ్రీకాంత్. ఈ సక్సెస్ఫుల్ మేన్ జీవితంతో దర్శకురాలు తుషార్ హిద్రానీ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి టీ సిరీస్ భూషణ్ కుమార్ ఓ నిర్మాత. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఓ సీరియల్ కిల్లర్ను పట్టుకోవడానికి ఓ లేడీ పోలీసాఫీసర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే..n ఈ పోలీసాఫీసర్ బ్లైండ్. మరి.. ఆ సీరియల్ కిల్లర్ను ఈ బ్లైండ్ పోలీసాఫీసర్ ఎలా పట్టుకున్నారు? ఆమెకు హెల్ప్ చేసింది ఎవరు? అనే అంశాలు ఆసక్తికరం. పోలీసాఫీసర్గా సోనమ్కపూర్ నటించిన చిత్రం ‘బ్లైండ్’. షోమ్ మఖీజా ఈ చిత్రానికి దర్శకుడు. 2011లో వచ్చిన సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘బ్లైండ్’కు రీమేక్ ఇది. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం సోనమ్ కపూర్ ప్రెగ్నెంట్గా ఉన్నారు. ఆమె డెలివరీ తర్వాత హిందీ ‘బ్లైండ్’ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కళ్లు కనబడకపోతే సాధారణ జీవితాన్ని ఎలా మేనేజ్ చేయవచ్చో తెలుసుకున్నారు తాప్సీ. హఠాత్తుగా తాప్సీ ఇలా ఎందుకు చేశారంటే.. ‘బ్లర్’ సినిమా కోసమే. 2010లో వచ్చిన స్పానిష్ థ్రిల్లర్ ‘జూలియాస్ ఐస్’ చిత్రం హిందీలో ‘బ్లర్’గా రీమేక్ అవుతోంది. ఈ చిత్రంలోనే తాప్సీ అంధురాలి పాత్ర చేస్తున్నారు. ఈ కథ నచ్చి తాప్సీ ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే... క్రమంగా చూపు మందగించే ఓ గృహిణి పాత్రలో తాప్సీ కనిపిస్తారు. సరిగ్గా చూపు కనిపించాలని ఓ సర్జరీ కూడా చేయించుకోవాలనుకుంటారు. కానీ ఇంతలో ఊహించని పరిణామాలు. ఆమె సోదరి హత్యకు గురవుతుంది. అయితే అప్పటికే ఆమె తన పూర్తి కంటి చూపును కోల్పోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే ‘బ్లర్’ చిత్రం. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంకోవైపు అంధురాలిగా ఓ సమూహాన్నే లీడ్ చేయనున్నారు హీరోయిన్ హీనాఖాన్. హీనాతో ఉన్న సమూహంలోని అందరూ కూడా బ్లైండే. ‘ది కంట్రీ ఆఫ్ బ్లైండ్’ అనే నవల ఆధారంగా ఆమె చేస్తున్న సినిమా కథాంశం ఇది. ‘ది కంట్రీ ఆఫ్ బ్లైండ్’ టైటిల్తోనే తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను ఇటీవల కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో రిలీజ్ చేశారు. ఈ ఇండో ఇంగ్లిష్ సినిమాకు రహత్ కజ్మీ దర్శకుడు. రాజ్కుమార్, సోనమ్, తాప్సీ, హీనా.. ఈ నలుగురూ సవాల్లాంటి పాత్రలతో బాక్సాఫీస్పై గురి పెట్టారు. ఈ సినిమాల వైపు ప్రేక్షకులు చల్లని చూపు చూస్తే ఈ స్టార్స్ కళ్లనుంచి ఆనందభాష్పాలు రావడం ఖాయం. -
నా పెళ్లిలో నేను నేనులా కనిపిస్తా: తాప్సీ
‘‘సినిమా ఇండస్ట్రీ కాకుండా బయట వ్యక్తితో నాకు అనుబంధం కుదరాలని కోరుకున్నాను. కెరీర్ ఆరంభించిన తక్కువ టైమ్లోనే అది జరిగింది. నాకెవరితో ఉంటే సౌకర్యవంతంగా ఉంటుందో అలాంటి వ్యక్తే దొరకడం ఆనందంగా ఉంది’’ అంటున్నారు తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోతో తాప్సీ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మథియాస్తో అనుబంధం గురించి ఓ పత్రిక అడిగితే.. పై విధంగా స్పందించారు తాప్సీ. ఇంకా ఆ ఇంటర్వ్యూలో మథియాస్ గురించి తాప్సీ మాట్లాడుతూ – ‘‘మా ఇద్దరి ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. అందుకే మా మధ్య జరిగే చర్చలు ఆసక్తికరంగా ఉంటాయి’’ అన్నారు. పెళ్లికి వధువు చేసుకునే అలంకరణ గురించి మాట్లాడుతూ – ‘‘మందంగా మేకప్ వేసుకుని కనిపించే పెళ్లికూతుళ్లను చూస్తే నాకు బాధగా ఉంటుంది. ఎందుకంటే అంత మేకప్లో మనం మనలా కనపడం. మన పెళ్లి ఫొటోల్లో మనల్ని మనమే గుర్తుపట్టలేనంతగా ఉంటే ఎలా? పెళ్లి తాలూకు జ్ఞాపకం ఆ క్షణాల వరకే కాదు.. జీవితాంతం ఆ అనుభూతి మిగిలిపోవాలి. అందుకే నా పెళ్లిలో నేను నేనులా కనిపిం చేట్లే ఉంటా. మామూలుగా నా జుత్తు వంకీలు తిరిగి ఉంటుంది. పెళ్లికి కూడా అలానే ఉంచేస్తా’’ అన్నారు తాప్సీ. -
‘మిషన్ ఇంపాజిబుల్’ మూవీ రివ్యూ
టైటిల్ : మిషన్ ఇంపాజిబుల్ నటీనటులు : తాప్సీ, హరీశ్ పేరడీ, రోషన్, భానుప్రకాశ్, జై తీర్థ తదితరులు నిర్మాణ సంస్థ : మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మాత: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి దర్శకత్వం : స్వరూప్ ఆర్.ఎస్.జె సంగీతం : మార్క్ కె రాబిన్ సినిమాటోగ్రఫీ : దీపక్ యెరగరా విడుదల తేది : ఏప్రిల్ 01, 2022 టాలీవుడ్లో పెద్ద తరహా చిత్రాలే కాదు.. కాన్సెఫ్ట్ బాగుంటే చిన్న సినిమాలు కూడా భారీ విజయం సాధిస్తున్నాయి. కథలో కొత్తదనం ఉంటే చాలు చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు థియేటర్స్కు వస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో టాలీవుడ్లో చిన్న చిత్రాలు ధైర్యంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వాటిలో చాలా వరకు విజయం సాధించాయి కూడా. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో చిన్న చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. చాలాకాలం తర్వాత తాప్సీ పన్ను తెలుగులో ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఏప్రిల్ 1) రిలీజైన ‘మిషన్ ఇంపాజిబుల్’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేటంటే.. శైలజ అలియాస్ శైలు(తాప్సీ) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియాపై పరిశోధనలు చేస్తుంటారు. రామ్శెట్టి(హరీశ్ పేరడీ) అనే మాఫియా డాన్ని రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టించాలని ఆమె ప్లాన్ వేస్తారు. బెంగళూరు నుంచి చిన్న పిల్లలను దుబాయ్కి తరలించేందుకు రామ్శెట్టి స్కెచ్ వేసినట్లు తెలుసుకున్న శైలు.. పక్కా ఆధారాలతో అతన్ని పోలీసులకు పట్టించి, పిల్లలను రక్షించాలని బయలుదేరుతుంది. కట్చేస్తే.. తిరుపతికి చెందిన రఘుపతి, రాఘవ, రాజారాం(ఆర్.ఆర్.ఆర్) అనే ముగ్గురు కుర్రాళ్లకు చదువు తప్ప అన్ని పనులు వస్తాయి. ఎలాగైనా డబ్బులు సంపాదించి, ఫేమస్ కావలనేదే వాళ్ల లక్ష్యం. డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్న క్రమంలో.. దావూద్ని పట్టిస్తే..రూ.50 లక్షల బహుమతి పొందొచ్చు అనే వార్త టీవీలో వస్తుంది. అది చూసి దావుద్ని పట్టించి, రూ.50 లక్షల బహుమతి దక్కించుకోవాలని ఆ ముగ్గురు.. ఇంట్లో చెప్పాపెట్టకుండా ముంబైకి బయలు దేరుతారు. మరి ఆ ముగ్గురు ముంబైకి వెళ్లి దావూద్ని పట్టుకున్నారా? మాఫియా డాన్ని పోలీసులకు పట్టించాలని చూస్తున్న శైలుకీ, దావూద్ని పట్టించి రూ.50 లక్షలు ప్రైజ్ మనీ పొందాలనుకున్న రఘుపతి, రాఘవ, రాజారాంలకు లింకు ఏంటి? అసలు వాళ్లు నిజంగానే ముంబై వెళ్లారా? మాఫియా డాన్ రామ్శెట్టిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంలో.. ఈ ముగ్గురు స్నేహితులు ఎలా సహాయపడ్డారు? శైలు మిషన్కి ఆర్.ఆర్.ఆర్ మిషన్ ఎలా ఉపయోగపడింది? ఈ మిషన్లో ఎవరు విజయం సాధించారు అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`అనే తొలి మూవీతో అందరి దృష్టి ఆకర్షించాడు దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె. ఆయన నుంచి మరో సినిమా వస్తుందంటే.. కచ్చితంగా ఓ మోస్తరు అంచనాలు ఉంటాయి. దానికి తోడు చాలా కాలం తర్వాత తాప్సీ టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తుండడంతో ‘మిషన్ ఇంపాజిబుల్’పై సినీ ప్రేక్షకులు భారీ హోప్స్ పెంచుకున్నారు. కానీ వారి అంచనాలను రీచ్ కాలేకపోయాడు దర్శకుడు స్వరూప్. కథలో కొత్తదనం లోపించింది. చాలా చోట్ల లాజిక్ మిస్ అవుతుంది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ శైలుయే స్వయంగా ఓ పదిహేడేళ్ల కుర్రాడితో డాన్ను చంపించడం, దాన్ని సమర్థించేందుకు ఓ అంతుచిక్కని లాజిక్కుని చొప్పించడంతో ‘మిషన్ ఇంపాజిబుల్’ కథ మొదలవుతుంది. రఘుపతి, రాఘవ, రాజారాం పాత్రల కామెడీతో ఫస్టాఫ్ అంతా సరదాగా సాగుతుంది. డబ్బులు సంపాదించే క్రమంలో పిల్లలు చేసిన అమాయకపు పనులు నవ్వులు పూయిస్తాయి. త్రివిక్రమ్, రాజమౌళి, సుకుమార్, పూరి జగన్నాథ్లపై వేసిన జోకులు కూడా బాగా పేలాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్లో కథంతా ఇన్వెస్టిగేషన్ చుట్టే తిరుగుతుంది. అయితే చైల్డ్ ట్రాఫికింగ్, పిల్లలు పడే కష్టాలు.. ఇవన్నీ గత సినిమాల్లో చూసిన సీన్లలాగే అనిపిస్తాయి. కథలో ట్విస్టులు ఉండకపోవడమే కాకుండా.. లాజిక్ లేని సీన్స్ బోలెడు ఉన్నాయి. ఫస్టాఫ్లో ముంబై, బొంబాయి రెండూ ఒకటేనని కూడా తెలియని పిల్లలు.. సెకండాఫ్కు వచ్చేసరికి చాలా తెలివిగా వ్యవహరించడం సినిమాటిక్గా అనిపిస్తుంది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు అయిన శైలజ.. ఓ ప్రమాదకరమైన మిషన్కి ముగ్గురు పిల్లలను అడ్డుపెట్టుకోవడం.. సగటు ప్రేక్షకుడికి మింగుడుపడదు. హరీశ్ పేరడీ విలనిజం కూడా అంతగా పేలలేదు. క్లైమాక్స్ కూడా చాలా రొటీన్గా ఉంది. ఎవరెలా చేశారంటే.. చాలా కాలం తర్వాత తాప్సీ నటించిన తెలుగు సినిమా ఇది. ఓ కొత్త పాత్రతో ఆమె రీఎంట్రీ ఇచ్చింది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు శైలు పాత్రకు తాప్సీ న్యాయం చేసింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువే అయినప్పటికీ.. ఉన్నంతలో బాగా నటించింది. ఇక సినిమాకు ప్రధాన బలం రోషన్, భానుప్రకాశ్, జై తీర్థ నటన అనే చెప్పాలి. రఘుపతి, రాఘవ, రాజారాం అనే కుర్రాళ్ల పాత్రల్లో ఈ ముగ్గురు ఒదిగిపోయారు. తమదైన కామెడీతో నవ్వించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. మార్క్ కె రాబిన్ సంగీతం బాగుంది. పాటలు తెచ్చిపెట్టినట్లు కాకుండా కథలో భాగంగానే సాగుతాయి. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. దీపక్ యెరగరా సినిమాటోగ్రఫీ బాగుంది. కథకు తగ్గట్టుగా ప్రతి సీన్ చాలా సహజంగా తెరపై చూపించాడు. డైలాగ్స్ ఓకే. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. చివరగా.. లాజిక్కులు వెతక్కుండా చూస్తే.. మిషన్ ఇంపాజిబుల్ అక్కడక్కడా నవ్విస్తుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
తెలుగు సినిమాలు ఎందుకు చేస్తున్నావ్ అంటున్నారు: తాప్సీ
Taapsee Open Up On Why She Take Long Gap To Telugu Movie: ‘ఝుమ్మంది నాదం’తో టాలీవుడ్కి పరిచయం అయిన సొట్టబుగ్గల బ్యూటీ తాప్సీ పన్ను.. తొలి సినిమాతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో తెలుగు వరస ఆఫర్లు, స్టార్ హీరో సరసన నటించిన ఆమె ఉన్నట్టుంటి బాలీవుడ్కు మాకాం మార్చింది. అక్కడ మహిళ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఈ భామ బాలీవుడ్లోనే సెటిలైపోయింది. ఈ నేపథ్యంలో గతంలో తాప్సీ ఘాజీ సినిమాలో మెరిరవగా.. చాలా కాలం తర్వాత తాజాగా తెలుగు సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్’ చేసింది. ఆర్ఎస్జే స్వరూప్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కాబోతోంది. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’పై కేఏ పాల్ అనుచిత వ్యాఖ్యలు, ఆర్జీవీ కౌంటర్ ఈ క్రమంలో రీసెంట్గా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ను జరుపుకుంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ.. చిరంజీవిగా ధన్యవాదాలు తెలిపింది. తన మొదటి చిత్రం ఝమ్మంది నాదంకు ఆయనే ముఖ్య అతిథిగా వచ్చారనీ, ఇప్పుడు ఈ మూవీకి కూడా స్పెషల్ గెస్ట్ రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. అందుకే ఈ రెండు సినిమాలు తనకు స్పెషల్ అని పేర్కొంది. ఆ తర్వాత ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్ ముగ్గురు చిన్నారులు భాను, జయ, రోషన్ అని, వీరికి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పింది. ఈ సినిమాలో మీరే హీరోలని, పెద్దవాళ్లు అయ్యి, స్టార్ హీరోలుగా మారితే తనకోక అవకాశం ఇవ్వాలంటూ చమత్కరించింది. చదవండి: సూర్య ఈటీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ ఈ సందర్భంగా తెలుగు సినిమాలకు గ్యాప్ ఇవ్వడంపై తాప్సీ స్పందించింది. ఈ మధ్య కొందరూ ఇప్పుడేందుకు తెలుగు సినిమాలు చేస్తున్నావని అడుగుతున్నారంది. ‘హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇప్పుడెందుకు తెలుగు సినిమాలు చేస్తున్నారు? అని కొందరు అడుగుతున్నారు. దీనికి నా దగ్గర ఖచ్చితమైన సమాధానం లేదు. కానీ గత రెండేళ్లుగా నేను హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాను అందుకే తెలుగులో నటించే సమయం లేదు. ఇదే నా సమాధానం అంతే తప్ప లాజిక్గా చెప్పే కారణం లేదు. ఎందుకంటే మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైందో అది మరచిపోకూడదు. నా ప్రయాణం తెలుగు సినిమాలతోనే ప్రారంభమైంది.. అందుకే తెలుగు సినిమాలు చేస్తా.. చేస్తూనే ఉంటా’ అని చెప్పుకొచ్చింది. -
ఎందుకు రాజకీయాల్లోకి వెళ్లానా అని రిగ్రేట్ ఫీలవుతుంటాను: చిరంజీవి
‘‘మిషన్ ఇంపాజిబుల్’ చిన్న సినిమా. పెద్ద మనసుతో చూస్తే, మిమ్మల్ని (ప్రేక్షకులు) రంజింపజేస్తుంది. నా మాట నమ్మి వెళ్లినవాళ్లకి నష్టం జరగదని భరోసా ఇస్తున్నా’’ అని చిరంజీవి అన్నారు. తాప్సీ ప్రధాన పాత్రలో రోషన్, భానుప్రకాశ్, జై తీర్థ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకత్వం వహించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఆచార్య’ తీస్తున్నప్పుడు నిరంజన్, అవినాష్కి ఎప్పుడు సమయం కుదిరిందో తెలియదు కానీ ‘మిషన్ ఇంపాజిబుల్’ తీశారు. తాప్సీ, స్వరూప్ వంటి మంచి కాంబినేషన్లో ఈ సినిమా తీయబట్టే, ప్రీ రిలీజ్కి రావాలని నిరంజన్ అడగ్గానే వస్తానని చెప్పాను. ఈ సినిమా చూశాను.. అద్భుతంగా ఉంది. తాప్సీ, ముగ్గురు పిల్లలు చాలా బాగా నటించారు. విషయం, పరిజ్ఞానం, ప్రతిభ ఉన్న డైరెక్టర్ స్వరూప్. ‘మిషన్ ఇంపాజిబుల్’ చిన్న సినిమా అంటున్నారు కానీ రిలీజ్ అయ్యాక పెద్ద సినిమా అవుతుంది’’ అన్నారు. నిర్మాతలు ఇన్వాల్వ్ కావాలి: కథలో ఏదైనా ప్రత్యేకత ఉంటే కాని నిరంజన్ ఓకే చెప్పడు. ‘ఆచార్య’ కూడా తను ఓకే అన్నాకే మా వద్దకు వచ్చింది. కథలో, కథల ఎంపికలో నిర్మాతల ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. నిర్మాత అనేవాడు ఓ క్యాషియర్, ఫైనాన్స్ సపోర్ట్ చేసేవాడు అనేట్లుగా పరిస్థితి మారింది. దానికి కారణం నిర్మాతలు కాదు.. నిర్మాతలను కథల ఎంపికలో ఇన్వాల్వ్ చేయాలి. నా నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, కేఎస్ రామారావు, దేవీ వరప్రసాద్.. ఇలా ఎంతోమంది పూర్తిగా కథ, సంగీతం.. ఇలా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేవారు. దానివల్ల డైరెక్టర్స్తో పాటు నటీనటులకు ఒక భరోసా ఉంటుంది. ఆ భరోసా ఇప్పుడు నిర్మాతల చేతుల్లో నుంచి ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుండటం బాధగా ఉంది. ఇలాంటి రోజుల్లో అలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్న నా నిర్మాత నిరంజన్ అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా అనిపిస్తోంది ‘ఝుమ్మంది నాదం’ అప్పుడు తాప్సీని చూసి ‘వావ్.. ఎంత బాగుంది.. యాక్టివ్గా ఉంది’ అనుకున్నాను.. అప్పుడు నేను రాజకీయాల్లోకి వెళ్లి, తనతో సినిమా చేసే అవకాశం అందుకోలేకపోయాను. ఒక్కోసారి తాప్సీలాంటి వాళ్లని చూసినప్పుడు ఎందుకు రాజకీయాల్లోకి వెళ్లానా అని రిగ్రేట్ ఫీలవుతుంటాను. ‘మెయిన్ లీడ్గా తను నాతో చేసే అవకాశం నువ్వు ఎందుకు ఇవ్వకూడదు (నవ్వుతూ).. తనని కమిట్ చేయిద్దాం.. నిర్మాత నువ్వే అవ్వాలి. స్టేజ్పై ఉన్న ఈ యంగ్ డైరెక్టర్స్లో లాటరీ వేసి ఒక్కర్ని ఓకే చేయ్’ అని నిరంజన్ని ఉద్దేశించి అన్నారు చిరంజీవి. ఇంకా చిరంజీవి మాట్లాడుతూ – ‘‘ఆర్ఆర్ఆర్’ తెలుగు, భారతీయ చిత్రపరిశ్రమ గర్వించే సినిమా అయింది. ఇక ‘మిషన్ ఇంపాజిబుల్’ లాంటి సినిమాలను ఆదరించినప్పుడే ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్, యంగ్ యాక్టర్స్కి ప్రోత్సాహంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘మిషన్ ఇంపాజిబుల్’ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. మంచి డైరెక్టర్స్కి మంచి నటీనటులు తోడైతే ‘మిషన్ ఇంపాజిబుల్, ఆచార్య’ వంటి సినిమాలొస్తాయి’’ అన్నారు నిరంజన్ రెడ్డి. తాప్సీ మాట్లాడుతూ– ‘‘హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇప్పుడెందుకు తెలుగు సినిమాలు చేస్తున్నారు? అని కొందరు అడుగుతున్నారు. మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైందో అది మరచిపోకూడదు. నా ప్రయాణం తెలుగు సినిమాలతోనే ప్రారంభమైంది.. అందుకే తెలుగు సినిమాలు చేస్తా.. చేస్తూనే ఉంటా’’ అన్నారు.