university
-
కొలంబియా వర్శిటీపై ట్రంప్ ఉక్కుపాదం
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కొలంబియా యూనివర్శిటీ(Columbia University)పైనా దృష్టిసారించారు. ఈ నేపధ్యంలో ట్రంప్ ఒత్తిడి మేరకు సదరు విశ్వవిద్యాలయం తన మిడిల్ ఈస్ట్ స్టడీస్ విభాగాన్ని నూతన పర్యవేక్షణలో ఉంచేందుకు, విద్యార్థుల క్రమశిక్షణకు సంబంధించిన నియమాలను మార్చడానికి అంగీకరించింది. వర్శిటీ తాత్కాలిక అధ్యక్షురాలు కత్రినా ఆర్మ్స్ట్రాంగ్ వెలువరించిన ఒక ప్రకటన ప్రకారం విశ్వవిద్యాలయం యూదు వ్యతిరేకతకు కొత్త నిర్వచనాన్ని స్వీకరించింది. ఇన్స్టిట్యూట్ ఫర్ ఇజ్రాయెల్ అండ్ యూదు స్టడీస్లో సిబ్బంది సంఖ్యను పెంచనుంది.కొలంబియా విశ్వవిద్యాలయం తీసుకున్న ఈ నిర్ణయం అక్కడ పనిచేస్తున్న కొంతమంది అధ్యాపకులకు నచ్చలేదు. ఇది వాక్ స్వేచ్ఛను హరించడమేనని వారు ఆరోపిస్తున్నారు. విశ్వవిద్యాలయం.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(President Donald Trump) ఒత్తిడికి లొంగిపోయిందని, ఇది దేశవ్యాప్తంగా విద్యా స్వేచ్ఛను హరించడమేనని న్యూయార్క్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డోనా లైబెర్మాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో ట్రంప్ సర్కారు గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయం నిరసనలు నిర్వహించిన తీరును తప్పుబట్టింది. ఆ దరిమిలా పరిశోధన గ్రాంట్లు, ఇతర నిధులను ఉపసంహరించుకుంది. ఈ నేపధ్యంలోనే కొలంబియా యూనిర్శిటీలో మార్పులు చేర్పులపై ఒత్తిడి తెచ్చింది.ఇటీవలి కాలంలో కొలంబియా విశ్వవిద్యాలయంపై ట్రంప్ సర్కారు తన దాడులను ముమ్మరం చేసింది. మార్చి 8న ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు పాలస్తీనా కార్యకర్త, చట్టబద్ధంగా శాశ్వత నివాసి అయిన మహమూద్ ఖలీల్ను విశ్వవిద్యాలయ అపార్ట్మెంట్లో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన నిరసనలలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. అయితే ఈ విద్యార్థులను యూనివర్శిటీ దాచిపెట్టిందా అనే అనుమానంతో న్యాయ శాఖ అధికారులు దర్యాప్తునకు దిగారు. కాగా తమ ఎజెండాను అనుసరించకపోతే విశ్వవిద్యాలయాల బడ్జెట్లను తగ్గిస్తామని ట్రంప్ హెచ్చరించారు.ఇది కూడా చదవండి: Haryana: జేజేపీ నేత దారుణ హత్య.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు -
మోహన్బాబు యూనివర్సిటీ 33వ వార్షికోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
Revanth Reddy: గతంలో యూనివర్సిటీలను కేసీఆర్ పట్టించుకోలేదు
-
‘ఇది చరిత్రలో నిలిచిపోయే యూనివర్శిటీ కావాలి’
హైదరాబాద్: కోఠి వుమెన్స్ కాలేజ్ ను యూనివర్శిటీగా మార్చడమే కాకుండా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీ(Chakali Ilamma Womens University)గా పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,. దొరలపై, నిజాములపై పోరాడిన చాకలి ఐలమ్మ.. చరిత్రలో తనకంటూ పేజీ లిఖించుకున్నారన్నారు. మహిళా దినోత్సవంలో భాగంగా ఈరోజు(శనివారం) అక్కడకు విచ్చేసిన సీఎం రేవంత్(Revanth Reddy).. నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ..ఈ గొప్ప చరిత్ర కల్గిన మహిళ పేరును ఒక యూనివర్శిటీకి పెట్టామన్నారు. వందేళ్ల చరిత్ర కల్గిన చరిత్ర ఈ మహిళా కళాశాలదని, దానిని యూనివర్శిటీగా మార్చి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీగా నామకరణం చేశామన్నారు. వందేళ్ల క్రితం ఏడుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఈ కళాశాల.. నేడు ఏడువేల మందితో యూనివర్శిటీగా రూపాంతరం చెందిందన్నారు. దీనికి ఐదు వందల కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. ఇది చరిత్రలో నిలిచిపోయే యూనివర్శిటీ కావాలన్నారు సీఎం రేవంత్. మీ అన్నగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, అలానే స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆడ బిడ్డలు వంటిళ్లు కుందేళ్లు కాదని, వారు వ్యాపారవేత్తలుగా రాణించాలనేది తన ఆశయమన్నారు. -
ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన పలువురు విద్యార్థులు
-
మోహన్ బాబు యూనివర్సిటీని సందర్శించిన రజినీకాంత్, ఐశ్వర్య (ఫోటోలు)
-
పండగ పూట మరోసారి ‘మంచు’ వివాదం (ఫోటోలు)
-
పరీక్షలకు ఫాతిమాను అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక పరిస్థితుల కారణంగా ఫీజు కట్టలేక గత పరీక్షలకు హాజరుకాలేకపోయిన వైద్య విద్యారి్థని అర్షియా ఫాతిమా (పిటిషనర్)ను.. 2025, జనవరిలో జరిగే బీడీఎస్ చివరి సంవత్సరం పరీక్షలకు అనుమతించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. మాజీ సైనికుడి కూతురైన ఫాతిమా 2016లో నిజామాబాద్లోని మేఘన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో బీడీఎస్లో చేరారు. 2017, 2018లో పరీక్షలకు హాజరయ్యారు. 2020లో మూడో ఏడాది పూర్తి చేశారు. 2021 నుంచి ఆర్థిక పరిస్థితుల కారణంగా నాలుగో ఏడాది ఫీజు కట్టలేక పరీక్షలకు హాజరుకాలేదు. 2024లో బీడీఎస్ చివరి సంవత్సరం పరీక్షలు రాసేందుకు అనుమతించాలని ఫాతిమా వర్సిటీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే అక్టోబర్ 28న వర్సిటీ దీన్ని తిరస్కరించింది. తనను బీడీఎస్ చివరి సంవత్సరం పరీక్షలకు అనుమతించకపోవడాన్ని, ఇంటర్న్íÙప్ పూర్తి చేయకుండా అడ్డుకోవడాన్ని సవాల్ చేస్తూ ఫాతిమా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. 2025, జనవరిలో జరిగే పరీక్షలకు అనుమతి ఇచ్చేలా వర్సిటీకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ ఒక్కసారికి అనుమతించాలని వర్సిటీని ఆదేశిస్తూ, విచారణ ముగించింది. -
వ్యవ‘సాయ’ వర్సిటీ.. వజ్రోత్సవ శోభ
సాక్షి, హైదరాబాద్/ఏజీవర్సిటీ: వ్యవసాయంలో నిత్య పరిశోధనలు..వివిధ పంటలకు సంబంధించి కొత్త వంగడాల సృష్టి, సూక్ష్మనీటి సేద్యం, వ్యవసాయంలో యాంత్రీకరణ, పశువైద్య శాస్త్రం దిశగా పురోగమనం, వ్యవసాయ విద్య ద్వారా రైతులకు మేలు చేస్తూ, శాస్త్రవేత్తలను అందించడం.. ఇలా అనేక రకాలుగా వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం విశేష కృషి చేస్తోంది. యూనివర్సిటీ ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 20, 21 తేదీల్లో వజ్రోత్సవాలు జరగనున్నాయి. వ్యవసాయ కళాశాల నుంచి జయశంకర్ వర్సిటీ దాకా.. దేశ తొలిప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మార్గదర్శకంలో వ్యవసాయ విద్య ఆలోచనలకు తొలిబీజం పడింది. 1955 జనవరి 6న అప్పటి భారత ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ రాజేంద్రనగర్లో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 1964 జూన్ 12న వ్యవసాయ కళాశాల ప్రారంభం కాగా, 1965 మార్చి 20న అప్పటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి చేతుల మీదుగా వర్సిటీని రైతులకు అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ప్రారంభమై..1996లో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీగా పేరు మార్చుకుంది. రాష్ట్ర విభజన తర్వాత 2014 సెపె్టంబర్ 3 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా అవతరించింది. » ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం 11 కళాశాలలు, 12 వ్యవసాయ పాలిటెక్నిక్, మూడు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలు, 12 వ్యవసాయ పరిశోధన స్థానాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రాలు , 9 ఏరువాక కేంద్రాలు కొనసాగుతున్నాయి. » అరవై ఏళ్ల వర్సిటీ ప్రస్థానంలో వ్యవసాయవిద్యలో సుమారు 32,300 మంది విద్యార్థులు డిగ్రీలు, 12,300 మంది పాలిటెక్నిక్ పట్టాలు సాధించారు. ఇంకా 9,500 మంది విద్యార్థులు వ్యవసాయశాస్త్రంలో పీజీ, 1500 మంది విద్యార్థులు పీహెచ్డీ పూర్తి చేశారు. నూతన వంగడాల సృష్టి.. పరిశోధనలు వరి, మొక్కజొన్నతోపాటు 50కిపైగా పంటల్లో దాదాపు 500 నూతన రకాలను వర్సిటీ అభివృద్ధి చేసింది. 1968లో వర్సిటీ భాగస్వామ్యంతో అఖిల భారత వరి సమన్వయ పరిశోధన సంస్థ ద్వారా తొలిసారిగా వరిలో అధిక దిగుబడి ఇచ్చే ‘జయ’అనే సంకర జాతి తొలి వంగడాన్ని అందుబాటులోకి తెచ్చారు. నాటి నుంచి స్వర్ణ, బీపీటీ–5204, ఎంటీయూ–1010, ఎంటీయూ–1001, తెలంగాణ సోనా ఇలా వరి ఎన్నో రకాలను వర్సిటీ అభివృద్ధి చేసింది. ఈ ఏడాది అధిక దిగుబడి ఇచ్చే ఎక్స్ట్రా ఎర్లీ రకం కంపసాగర్ వరి 6251 (కేపీఎస్ 6251)ని విడుదల చేసింది. » దేశవ్యాప్తంగా వరిసాగులో ఈ వర్సిటీ అభివృద్ధి చేసిన వరి రకాలు 25 శాతం దాకా ఉన్నాయి. 12 రాష్ట్రాలలో 12 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడి వరి వంగడాలే సాగవుతున్నాయి. » దేశవ్యాప్తంగా మొక్కజొన్న విస్తీర్ణంలో 10–12శాతం వరకూ ఇక్కడి సంకర రకాలే సాగవుతున్నాయి. వర్సిటీ అభివృద్ధి చేసిన దాంట్లో హైబ్రిడ్ రకాలైన డీహెచ్ఎం–115, 117, 121 ఉన్నాయి. » వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో చేసిన 23 ఆవిష్కరణలకు పేటెంట్లు సైతం సొంతం చేసుకుంది. వజ్రోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రైతులకు సేవలందిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణకే గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వజ్రోత్సవాల ఏర్పాట్లలోగురువారం రాజేంద్రనగర్లోని యూనివర్సిటీ రైతుమేళా ఏర్పాటు చేసే స్పోర్ట్స్ కాంప్లెక్స్తోపాటు ఆడిటోరియంను తుమ్మల పరిశీలించారు. శుక్రవారం జరిగే కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, సీఎం రేవంత్రెడ్డి పాల్గొంటున్నారని తెలిపారు. -
ఉపాధి కల్పనలో గేమ్ ఛేంజర్!
మన సంప్రదాయ విద్యావ్యవస్థ తయారు చేస్తున్న విద్యావంతులు నైపుణ్యాల లేమితో కునారిల్లుతున్నారు. ఒకవైపు ఏటికేడాది నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉంటే... మరోవైపు పరిశ్రమలు నైపుణ్యం గలవారు దొరక్క సమస్యల నెదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని మార్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని స్థాపించింది. విద్యా సంస్థలు– పరిశ్రమల సమన్వయం ఆధారంగా ఇది పనిచేస్తుంది. విద్యార్థులు సంప్రదాయ పరీక్షల విధానంలోనే కాకుండా... ఫ్యాక్టరీల్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో ‘ఆన్ హ్యాండ్’ పద్ధతిలో నైపుణ్యాలను నేర్చుకుంటారు. అప్రెంటిస్లుగా పనిచేస్తారు. మొత్తం మీద రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు దారి చూపే ఒక చుక్కాని లాంటి దార్శనిక సంస్థ ఇది. భారతదేశం ఇప్పుడు ఓ పరివర్తన దశలో ఉంది. నవ నవోన్మేషంతో ఉరకలెత్తే యువత అభివృద్ధిలో మరింత ఎత్తుకు ఎదిగే అవకాశం ఒకపక్క ఉంటే... నిరు ద్యోగం మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఉండటం, నైపుణ్యాలతో కూడిన మానవ వనరుల కోసం కర్మాగారాలు సమస్యలను ఎదుర్కో వడం ఇంకో పక్కన ఉన్నాయి. ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సి టీ’ని స్థాపించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఈ సవాలును ఎదు ర్కొనేందుకు సిద్ధమైంది. దేశంలో మునుపెన్నడూ లేని చందంగా విద్య, ఉపాధుల మధ్య వారధిగా నిలవడంతోపాటు... రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు దారి చూపే ఒక చుక్కానిలాంటి దార్శనిక సంస్థ ఇది. నైపుణ్యాలతో కూడిన మానవ వనరులను అందించి పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ వర్సిటీ ఎంతగానో ఉపకరిస్తుంది. ఎందుకంటే... ఇక్కడ పరిశ్రమలే తమకు అవసరమైన నైపు ణ్యాల్లో యువతకు శిక్షణ ఇచ్చి కార్మికులుగా, ఉద్యోగులుగా, ఇంజ నీర్లుగా ఉద్యోగాలిస్తాయి.దేశంలో ఏటా కొన్ని లక్షల మంది విద్యార్థులు పట్టభద్రులు అవు తున్నారు. పట్టభద్రుల్లో 47 శాతం మందికి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు లేని కారణంగా ఉద్యోగార్హత లేదని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే ఏటా రెండు లక్షల మంది ఇంజినీర్లు, మరో రెండు లక్షల మంది సాధారణ డిగ్రీలు, ఐటీఐ, డిప్లోమా కోర్సులు పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దురదృష్టవశాత్తు సంప్రదాయ విద్యా వ్యవస్థలో సిద్ధాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటోంది. ఫలితంగా ఈ వ్యవస్థ నుంచి బయ టకు వచ్చేవారికి నిజ జీవిత సవాళ్లను ఎదుర్కోవడం కష్టసాధ్య మవుతోంది. పాతబడిపోయిన పాఠ్యాంశాలు, ప్రాక్టికల్ ట్రెయినింగ్ తక్కువగా ఉండటం, సాఫ్ట్ స్కిల్స్కు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటివి... నైపుణ్యాల కొరతను ఎక్కువ చేశాయి. ఐటీ, ఉత్పాదన, ఆరోగ్య రంగం, సంప్రదాయేతర విద్యుత్తు... ఇలా ఏ రంగం తీసు కున్నా చాలామంది తాజా పట్టభద్రుల్లో నైపుణ్యాల లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా ఓ విచిత్రమైన ద్వైదీభావం ఏర్పడుతోంది. విద్యార్థులేమో ఉద్యోగాల కోసం... పరిశ్రమల వారేమో శిక్షణ, తగిన నైపుణ్యాలున్న వారి కోసం నిత్యం వెతుకుతూనే ఉన్న పరిస్థితి ఉంది. అందుకే నైపుణ్యాలే కేంద్ర బిందువుగా ఉండే విద్యా వ్యవస్థలోభాగంగా పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలను ప్రోదిచేసే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటైంది. ఈ యూనివర్సిటీ దేశంలోనే మొట్ట మొదటిది మాత్రమే కాదు, విప్లవాత్మకమైంది కూడా. నిరుద్యోగ యువత సాధికారత కోసం ఉద్దే శించింది. వివిధ రంగాల్లో డిమాండ్ ఉన్న నైపుణ్యాలను గుర్తించి వాటిల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. ఆధునిక టెక్నాలజీలను నిజ జీవిత పరిస్థితుల్లో విద్యార్థులకు ప్రాక్టికల్గా ట్రెయినింగ్ ఇస్తారు. తద్వారా విద్యార్థులు కేవలం పట్టభద్రుల్లా కాకుండా... అసలైన వృత్తి నిపుణుల్లా తయారవుతారు. విద్యా సంస్థలు, పరిశ్రమల సమన్వయం ఆధారంగానే ఈ వర్సిటీ పనిచేస్తుంది. విద్యార్థులు సంప్రదాయ పరీక్షల విధానంలోనే కాకుండా... ఫ్యాక్టరీల్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో ‘ఆన్ హ్యాండ్’ పద్ధతిలో నైపుణ్యాలను నేర్చుకుంటారు. అప్రెంటిస్లుగా పనిచేస్తారు. అది కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సంప్రదాయేతర ఇంధన వనరుల వంటి అత్యాధునిక టెక్నాలజీరంగాల్లో! పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా బోధనాంశాలను రూపొందించడం వల్ల తెలంగాణ విద్యార్థులకు డిమాండ్ పెరుగుతుంది. మంచి జీతం వచ్చే అవకాశం ఉంటుంది. వీరంతా ఉద్యోగాల్లో స్థిరపడితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటును అందించిన వారవుతారు. ఈ ఏడాది నవంబరు 4న ఏడు కోర్సులతో అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడం తెలిసిందే. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలు పెడితే తయారీ, సేవా రంగాలకు చెందిన 18 అంశాల్లో కోర్సులు ఉంటాయి. వర్సిటీ నిర్మాణం కోసం ముచ్చెర్ల వద్ద ‘నెట్జీరో సిటీ’లో 150 ఎకరాల స్థలం కేటాయించాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ రూ. 200 కోట్లతో వర్సిటీ నిర్మాణాన్ని చేపట్టింది. దేశంలోనే దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా ఇప్పటికే వర్సిటీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు కూడా. ఆనంద్ మహింద్రా నాయకత్వం, దార్శనికతలు ఈ విశ్వవిద్యాలయాన్ని నైపుణ్యాభివృద్ధి విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుపుతాయనడంలో సందేహం లేదు. మరో పక్క రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐల ఆధునికీకరణ కూడా చేపట్టాం. అడ్వాన్స్డ్ ట్రెయినింగ్ సెంటర్లుగా వీటిని ఇప్పటికే అప్ గ్రేడ్ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఇకపై ఈ సెంటర్లు స్కిల్స్ యూనివర్సిటీ సిలబస్ ప్రకారం విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్నిఅందిస్తూ... ప్రస్తుతం పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణఅందిస్తాయి. ఈ ఆధునికీకరణ కారణంగా నైపుణ్యాభివృద్ధిలో తెలంగాణలో ఒక సమగ్రమైన ప్రతిభావంతుల వ్యవస్థ ఏర్పాటు అవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పరిశ్రమలు కూడా పాలుపంచు కునేలా చేస్తున్నాం. తద్వారా వారు తమకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చుకునే వీలేర్పడుతుంది. అంటే పరిశ్రమలే తమకు అవసర మైన మానవ వనరులను తయారు చేసుకుంటాయన్నమాట. ప్రత్యేక కార్యక్రమాలు, కోర్సుల ద్వారా పరిశ్రమల అవసరాల న్నింటినీ వర్సిటీ తీరుస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, నాయకత్వం వంటి సాఫ్ట్ స్కిల్స్పై కూడా శిక్షణ ఇస్తుండటం వల్ల పరిశ్రమలకు అన్ని నైపుణ్యాలున్న మానవ వనరులు లభిస్తాయి. యువత సొంతంగా పరిశ్రమలు స్థాపించుకునేలా ప్రోత్సహించేందుకు కూడా ఈ వర్సిటీ చర్యలు తీసుకుంటుంది. ఉపాధి అవకాశాల్లో గేమ్ ఛేంజర్స్కిల్స్ యూనివర్సిటీ ఉద్యోగ ప్రపంచంపై చూపే ప్రభావాన్ని ఏమాత్రం తక్కువ చేయలేం. ఆధునిక నైపుణ్య శిక్షణకు వాస్తవిక విద్య కూడా తోడవడం వల్ల నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేందుకు ఇదో మేలిమి సాధనంగా మారనుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు లక్షల్లో ఉంటే ఖాళీలు వేలల్లో మాత్రమే ఉంటా యన్నది తెలిసిన విషయమే. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేందుకు ఉన్న అవకాశం 0.1 నుంచి ఒక శాతం మాత్రమే అన్నమాట. ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాల అవసరాన్ని ఈ అంకెలే చెబు తున్నాయి. ప్రైవేట్ రంగంలో నైపుణ్యాలున్న వారికి ఉద్యోగ అవ కాశాలు మెండు. అందుకే తెలంగాణ ప్రభుత్వపు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ దేశానికి ఒక మోడల్గా ఉపయోగపడుతుందని చెప్పడం! స్కిల్స్ యూనివర్సిటీలో కోర్సులు రెండు వేల మందితో మొద లవుతాయి. వచ్చే ఏడాది ఈ సంఖ్య పదివేలకు చేరుతుంది. క్రమంగా ఇది 30 వేలకు చేరుతుంది. యూనివర్సిటీ భవన నిర్మాణాలు పూర్త య్యేంత వరకు గచ్చిబౌలిలోని ‘ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ఇండియా’ (ఈఎస్సీఐ), హైటెక్ సిటీలోని ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్’ ప్రాంగణాల్లో ప్రస్తుతం శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. వర్సిటీ ఫీజుల విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల వారందరికీ ఫీజుల్లో రాయితీ ఉంటుంది. వర్సిటీ కార్యకలాపాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ. 100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఇది ప్రారంభమే కాదు... ఉపాధి విప్లవానికి రాచబాట!- వ్యాసకర్త తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి- దుద్దిళ్ల శ్రీధర్ బాబు -
ఎంఎస్ఎంఈలకు కేంద్రీకృత ఫిర్యాదుల పోర్టల్
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈలు) కేంద్రీకృత ఫిర్యాదుల పోర్టల్ను ఏర్పాటు చేయాలని అసోచామ్ డిమాండ్ చేసింది. ఆర్బీఐ అంబుడ్స్మన్ తరహాలో ఇది ఉండాని.. పలు శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు ఈ పోర్టల్ ద్వారా లేవనెత్తేందుకు అవకాశం ఉండాలని కోరింది. ఫిర్యాదుల దాఖలు, పరిష్కారం విషయంలో ఎంఎస్ఎంఈలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయంటూ ఈ కీలక సూచన చేసింది. వ్యాపార నిర్వహణలో ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈగ్రోవ్ ఫౌండేష్ సాయంతో అసోచామ్ సర్వే నిర్వహించింది. ఎంఎస్ఎంఈ సమస్యల పరిష్కారం, వాటి బలోపేతానికి సూచనలతో ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించే లక్ష్యంలో భాగంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించి వ్యూహాత్మక ప్రణాళిక, కార్యాచరణను ఈ నివేదిక తెలియజేస్తుంది. సంఘటిత, అసంఘటిత రంగంలోని మన ఎంఎస్ఎంఈలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంక్లు, దిగ్గజ కంపెనీల నుంచి మద్దతు అవసరం’’అని అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నయ్యర్ పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలకు కార్పొరేట్ ఆదాయపన్ను రేటును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని, సులభతర జీఎస్టీ వ్యవస్థను తీసుకురావాలని అసోచామ్ కోరింది. కేంద్రీకృత పోర్టల్.. ఎంఎస్ఎంఈల నమోదు, వ్యాపారానికి సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లను ఎలక్ట్రానిక్ రూపంలో సమర్పించేందుకు ఆన్లైన్ పోర్టల్ తీసుకురావాలని అసోచామ్ తన నివేదికలో కోరింది. జీఎస్టీ రిజి్రస్టేషన్, నిబంధనల అమలు ప్రక్రియలను సైతం సులభతరంగా మార్చాలని పేర్కొంది. స్పష్టమైన నిబంధనలతో మద్దతుగా నిలవాలని కోరింది. సహేతుక కారణాలున్నప్పటికీ సకాలంలో జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్, చెల్లింపులు చేయని ఎంఎస్ఎంఈలపై కఠిన జరిమానాలు విధిస్తున్నట్టు పేర్కొంది. జాప్యం తీవ్రత, కారణాలకు అనుగుణంగా పెనాల్టీలో మార్పులు ఉండాలని సూచించింది. జరిమానాలు ఎంఎస్ఎంఈలకు భారంగా మారరాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం సాకారం కావాలంటే వ్యాపార నమూనాలో నిర్మాణాత్మక మార్పు అవసరమని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు. ‘‘ఈ నిర్మాణాత్మక మార్పులో ఎంస్ఎంఈలు భాగంగా ఉండాలి. అభివృద్ధి చెందిన భారత్లో ఎంఎస్ఎంఈలు గొప్ప పాత్ర పోషించాలి. మా అధ్యయనం ఇదే అంశాన్ని బలంగా చెప్పింది’’అని సూద్ వివరించారు. పెరుగుతున్న కారి్మక శక్తికి ఎంఎస్ఎంఈలు పరిష్కారం చూపించగలవని, ఉత్పాదకతతో కూడిన ఉపాధిని అందించగలవని ఈగ్రోవ్ వ్యవస్థాపక చైర్మన్ చరణ్సింగ్ అన్నారు. వ్యవసాయ యూనివర్సిటీల మాదిరే ప్రతీ రాష్ట్రంలోనూ ఎంఎస్ఎంఈ యూనివర్సిటీ ఏర్పాటును పరిశీలించాలని, ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకంగా సమన్వయ మండలిని ఏర్పాటు చేసి, పథకాల అమలు సాఫీగా సాగేలా చూడాలని, రాష్ట్రాల పరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఈ నివేదిక సూచించింది. జీడీపీలో 30 శాతం వాటా, తయారీ రంగంలో 45 శాతం వాటా, ఎగుమతుల్లో 46 శాతం వాటా కలిగిన ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఈ నివేదిక గుర్తు చేసింది. -
కేజ్రివాల్ కంటే ఆతిశి నయం
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కంటే ఢిల్లీ ప్రస్తుత సీఎం ఆతిశి వెయ్యి రెట్లు నయమని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శుక్రవారం ప్రశంసలు కురిపించారు. ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ఆయన ఆతిశితో కలిసి పాల్గొన్నారు. వేదికపై నున్న ఆతిశిని ఉద్దేశిస్తూ.. ‘ఢిల్లీ సీఎంగా మహిళ ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. పూర్వ సీఎం కంటే ఆమె వెయ్యిరెట్లు నయమని నేను పూర్తి విశ్వాసంతో చెప్పగలను’ అని సక్సేనా వ్యాఖ్యానించారు. సాధారణంగా ఢిల్లీ ఎల్జీకి, ఆప్ ప్రభుత్వానికి పొసగదు. ఎప్పుడూ ఉప్పునిప్పుగా ఉండే సక్సేనా.. ఆతిశిపై ప్రశంసలు కురిపించడం విశేషం. జైలు నుంచి బెయిల్పై బయటికి వచ్చాక అరవింద్ కేజ్రివాల్ ఈ ఏడాది సెప్టెంబరులో సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన నిజాయితీకి ప్రజలు సర్టిఫికెట్ ఇచ్చాకే (ఎన్నికల్లో నెగ్గి) మళ్లీ సీఎం పదవిని చేపడతానని కేజ్రివాల్ అన్నారు. కేజ్రివాల్ బదులుగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆతిశి జెండా ఎగురవేస్తారని ఆప్ సర్కారు ప్రతిపాదించగా.. సక్సేనా నిరాకరించిన విషయం తెలిసిందే. -
పది రోజుల్లో పనులు షురూ‘
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవనాల నిర్మాణాలకు మరో ముందడుగు పడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐల్) అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఈ క్యాంపస్ను నిర్మించేందుకు అంగీకరించింది. అంతేకాదు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఇందుకు రూ.200 కోట్ల భూరి విరాళాన్ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబర్ 8న అకాడమిక్, పరిపాలన, ల్యాబొరేటరీ, గ్రంథాలయం, పార్కింగ్, ఫుడ్కోర్టు, 700 మంది కూర్చొనే సామర్థ్యం గల ఆడిటోరియం, భద్రతా సిబ్బంది వసతి గృహాలు, క్రీడా మైదానాల పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే టీఎస్ఐఐసీ, జిల్లా రెవెన్యూ యంత్రాంగాలు ఆయా భూములను సేకరించి, చదును చేసి వర్సిటీకి అప్పగించాయి. 17 కోర్సులు.. ఏటా 20 వేల మందికి శిక్షణకందుకూరు మండలం మీర్ఖాన్పేట సర్వే నంబర్ 112లోని 57 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో ‘యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ’ నిర్మాణానికి ఇటీవల సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. వర్సిటీలో ఫార్మా, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్, ఈ కామర్స్, లాజిస్టిక్, ప్యాకింగ్, హార్డ్వేర్, ఎలక్ట్రీషిన్ వంటి 17 రంగాల్లోæ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్, మూడేళ్ల డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ ఆన్లైన్/ ఆఫ్లైన్ కోర్సులను అందించనున్నారు.ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ కోర్సులను నిర్వహించనున్నారు. ఏటా 20 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ‘యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ బిల్లు–2024’ను కూడా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే .గవర్నర్/ సీఎం ఈ వర్సిటీకి చాన్స్లర్గా వ్యవహరించనున్నారు. వీసీ సహా 15 మందితో పాలకమండలి ఉంటుంది. ఇందులో ఏడుగురు సభ్యులు పరిశ్రమలకు చెందిన వారే ఉంటారు. వర్సిటీ మూడేళ్ల నిర్వహణకు రూ.312 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. రూ.170 కోట్లు కేవలం కోర్సుల ఫీజుల రూపంలో సమకూరనున్నాయి. -
‘జామియా’లో దీపావళి ఉద్రిక్తత
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. దీపావళి వేడుకల సందర్భంగా రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం యూనివర్శిటీకి చెందిన కొందరు హిందూ విద్యార్థులు దీపావళి వేడుకలకు ముందుగా దీపాలు వెలిగించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన మరోవర్గానికి చెందినవారు నిరసనకు దిగారు. అనంతరం ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ నేపధ్యంలో యూనివర్సిటీ క్యాంపస్లో పోలీసు భద్రతను మరింతగా పెంచారు. జామియా యూనివర్సిటీలో దీపావళి వేడుకల సందర్భంగా వెలిగించిన దీపాలను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యూనివర్శిటీలో మతపరమైన నినాదాలు వినిపించినట్లు పోలీసులు తెలిపారు. BIG BREAKING NEWS 🚨 Clash breaks out at Jamia Millia Islamia University during Diwali celebrations of Hindus.Conflict began when some individuals allegedly tried to erase off Rangoli with their feet & extinguish Diyas.Viral Video claims some students were raising… pic.twitter.com/Kg4tf9eA2k— Times Algebra (@TimesAlgebraIND) October 22, 2024ఇది కూడా చదవండి: కొనసాగుతున్న బాంబు బెదిరింపులు -
తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం
ప్రపంచ ధనవంతులలో ఒకరు, దిగ్గజ పారిశ్రామికవేత్త 'గౌతమ్ అదానీ' తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం అందించారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూ.100 కోట్ల చెక్కును అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నైపుణ్యాభివృద్ధి, యువత సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు నిరంతర మా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా అదానీ హామీ ఇచ్చారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు 2024 నవంబర్ 4నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందులో లాజిస్టిక్, హెల్త్, ఫార్మా వంటి సుమారు 17 రంగాల్లో యువతకు శిక్షణ అందించనున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్గా ఆనంద్ మహీంద్రాను నియమించారు.A delegation from Adani Foundation, led by Chairperson of Adani Group, Mr @gautam_adani, met with Hon’ble Chief Minister @revanth_anumula garu to handover a donation cheque of Rs 100 crore towards the establishment of Young India Skills University.Mr Adani also promised… pic.twitter.com/knd4bezz7e— Telangana CMO (@TelanganaCMO) October 18, 2024 -
తెలంగాణలో తొమ్మిది యూనివర్సిటీలకు వీసీల నియామకం
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది యూనివర్సిటీలకు వీసీలను నియమించింది. వీసీల నియామకం ఫైల్పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పాలమూరు యూనివర్సిటీ వీసీగా శ్రీనివాస్.కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రతాపరెడ్డిఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఎం కుమార్ శాతవాహన యూనివర్సిటీ వీసీగా ఉమేష్ కుమార్ తెలుగు యూనివర్సిటీ వీసీగా నిత్యానందరావుమహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీగా అల్తాఫ్ హుస్సేన్ తెలంగాణ యూనివర్సిటీ వీసీగా యాదగిరిరావుప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీగా ఆల్ దస్ జానయ్యకొండ లక్ష్మణ్ తెలంగాణ ఆర్టికల్చర్ యూనివర్సిటీ - రాజిరెడ్డిలను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది -
ఈజిప్టులో రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి
కైరో: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీ విద్యార్థులతో వెళ్తున్న ఒక బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐన్ సోఖ్నా హైవేపై ఈ ఘటన జరిగిందని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.బస్సులో సూయజ్లోని గలాలా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ బస్సు ఐన్ సోఖ్నా హైవే మీదుగా వెళుతుండగా ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి 28 అంబులెన్స్లు చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయని ప్రభుత్వం తెలిపింది. క్షతగాత్రులకు సూయజ్ మెడికల్ కాంప్లెక్స్లో చికిత్స అందిస్తున్నారు.ఈజిప్టులో ప్రతి ఏటా వేలాది మంది రోడ్డు ప్రమాదాలలో మృతి చెందుతున్నారు. దేశంలో రవాణా భద్రత రికార్డు అధ్వాన్నంగా ఉంది. అతివేగం, అధ్వాన్నమైన రోడ్లు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం కారణంగా దేశంలో అధికంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.ఇది కూడా చదవండి: రాజధానిలో నేటి నుంచి ‘గ్రాప్-1’ అమలు -
దేశంలో ‘ఐఐఎస్సీ’ టాప్
సాక్షి, అమరావతి : దేశంలో అగ్రశ్రేణి వర్సిటీగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ తాజా వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల ఓవరాలవిభాగంలో 251–300 మధ్య కొనసాగుతోంది. అయితే, గతేడాదితో 201–250 బాండ్ నుంచి స్వల్పంగా పడిపోయింది. ఫలితంగా వరల్డ్ టాప్–250లోకి ప్రవేశించలేకపోయింది. ఈ క్రమంలో 53.7–55.7 స్కోరు సాధించింది. పరిశోధన, ఇంటెన్సివ్ వర్సిటీలను ఐదు ప్రధాన అంశాల ఆధారంగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రపంచ ర్యాంకులు కేటాయిస్తోంది. వీటిల్లో బోధన, పరిశోధన వాతావరణం, పరిశోధన నాణ్యత, అంతర్జాతీయ అవుట్లుక్, ఇండస్ట్రీ ఆదాయం వంటి అంశాలను పరిశీలిస్తుంది. ఈ ఏడాది 115 దేశాలకు చెందిన 2,092 ఉత్తమ విద్యా సంస్థలకు ర్యాంకులను విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే 185 కొత్త ఎంట్రీలు వచి్చనట్లు పేర్కొంది. ఈ ఏడాది ర్యాంకుల్లో భారతీయ వర్సిటీలు కేవలం మిశ్రమ ఫలితాలు మాత్రమే చూశాయి. బెనారస్ హిందూ వర్సిటీ, భారతియార్ వర్సిటీ, ఐఐటీ గౌహతి వంటివి 2025లో భారతీయ టాప్–10 జాబితా నుంచి చోటుకోల్పోయాయి. ప్రపంచ వేదికపై బలమైన పోటీదారులు ఉండటంతోనే భారతీయ వర్సిటీలు కొంత వెనుకబడినట్లు విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఐఐటీల్లో కేవలం ఇండోర్ ఐఐటీ మాత్రమే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. భారతీయ వర్సిటీల పురోగతి.. అన్నా వర్సిటీ, మహాత్మా గాంధీ వర్సిటీ, సవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్, శూలినీ వర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ర్యాంకులను మెరుగుపర్చుకుని 401–500 బాండ్లోకి చేరుకున్నాయి. ఈ సంస్థల్లో ప్రతి ఒక్కటి 46–49.2 మధ్య స్కోర్ను సాధించాయి. అయినప్పటికీ కొన్ని వర్సిటీలు వెనుకబడ్డాయి. ఇక్కడ జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ర్యాంకు గతేడాదితో పోలిస్తే తగ్గింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–ఇండోర్, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యూపీఈఎస్)తో కలిసి 501–600 ర్యాంకును పంచుకుంది. ఈ రెండు సంస్థలు గణనీయమైన పురోగతి ప్రదర్శించడం విశేషం. 601–800 బెల్ట్లో 14 భారతీయ విద్యా సంస్థలు నిలిచాయి. వీటిల్లో అలీఘర్ ముస్లిం వర్సిటీ, అమిటీ వర్సిటీ, బెనారస్ హిందూ వర్సిటీ, బిట్స్ పిలానీ, చిత్కారా వర్సిటీ, ఐఐటీ పాటా్న, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండ్రస్టియల్ టెక్నాలజీ (కేఐఐటీ), లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీ, పంజాబ్ వర్సిటీ, సింబయాసిస్ ఇంటర్నేషనల్ వర్సిటీ, థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, విట్ వర్సిటీ (తమిళనాడు) స్థానం దక్కించుకున్నాయి.జేఎన్టీయూ అనంతపురం.. ఎస్వీయూలకు చోటు.. ఇక 801–1000 మధ్య 22 భారతీయ విద్యా సంస్థలు ఉండగా.. మన రాష్ట్రం నుంచి జేఎన్టీయూ అనంతపురం, కేఎల్యూ (34.5–38.1)లకు మాత్రమే చోటుదక్కింది. అలాగే, 1,201–1,500 మధ్య 23 సంస్థలు ఉండగా.. తిరుపతి శ్రీ వేంకటేశ్వర వర్సిటీ–ఎస్వీయూ (25.2–30.6)తో పాటు తెలంగాణకు చెందిన ఉస్మానియా, ఎన్ఐటీ–నిట్ (25.2–30.6) ఉంది. 1,501 ప్లస్ విభాగంలో.. ఆచార్య నాగార్జున వర్సిటీ, గీతం, జీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజ్ఞాన్ (10.5–25.1) నిలిచాయి. ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలతో సంచలనం సృష్టించిన ఐఐటీ గౌహతి 801–1000 బెల్డ్కు దిగజారింది.అగ్రస్థానంలో ఆక్స్ఫర్డ్.. మరోవైపు.. ప్రపంచ అత్యుత్తమ వర్సిటీగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వరుసగా తొమ్మిదో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)ని ఆరో స్థానానికి నెడుతూ స్టాన్ఫోర్డ్ వర్సిటీ రెండో స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది బ్రెజిల్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విద్యా సంస్థలు టాప్–200లో చోటు దక్కించుకోవడం విశేషం. కానీ, ఆ్రస్టేలియాలోని టాప్–5 విశ్వవిద్యాలయాలు ర్యాంకింగ్స్లో పడిపోయాయి. చైనా విశ్వవిద్యాలయాలు అద్భుత ప్రదర్శనతో టాప్–10కి చేరువలోకి రావడం విశేషం. యూఎస్, యూకే ఉన్నత విద్యా రంగాల ప్రతిష్ట క్షీణిస్తున్నట్లు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. -
తెలంగాణ వడ్డించిన విస్తరి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరి వంటిదని.. చైనా బయట పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా నిలిచేందుకు అనేక అనుకూలతలు ఉన్నాయని ముఖ్యమంత్రి ఎను ముల రేవంత్రెడ్డి చెప్పారు. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగం బలోపేతంతో వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తామని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చి.. ప్రస్తుతం రూ.3 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర వార్షిక బడ్జెట్ను 2028 నాటికి రూ.7 లక్షల కోట్లకు చేర్చడం లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ శిల్ప కళావేదికలో ‘తెలంగాణ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పాలసీ–2024’ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, పరిశ్రమల శాఖ అధికారులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్న ఈ భేటీలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలను సీఎం ప్రస్తావించారు. పెట్టుబడులతో సంపద పెంచుతాం ‘‘ఏ రంగంలోనైనా పాలసీ లేకుండా పురోగతి సాధ్యం కాదు. ఎంఎస్ఎంఈలో పెట్టుబడులు రాబడుతూ సంపద పెంచడంతోపాటు దళితులు, గిరిజనులు, మహిళలను ప్రోత్సహించే వాతా వరణం సృష్టిస్తాం. భేషజాలకు పోకుండా గత ప్రభుత్వం చేసిన మంచి పనులు కొనసాగిస్తూ.. నష్టం చేసే విధానాలను తొలగిస్తాం. పారిశ్రామిక అభివృద్ధితోనే తెలంగాణ ఆర్థికంగా బలోపేతం అవుతుంది..’’ అని సీఎం రేవంత్ చెప్పారు. వ్యవసాయ రంగంపై ఎక్కువ మంది ఆధారపడటంతో రైతులకు ప్రభుత్వపరంగా ఎన్ని విధాలుగా సాయం అందించినా వారి పరిస్థితి మెరుగుపడటం లేదని పేర్కొన్నారు. వ్యవసాయ కుటుంబాలు ఉద్యోగ, ఉపాధి కల్పన, వ్యాపార రంగాల్లోనూ ఎదగాలన్నారు. గతంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనే పరిస్థితి ఉండేదని.. తెలంగాణ యువత ఐటీ రంగంలో అడుగుపెట్టి సిలికాన్ వ్యాలీని శాసించే స్థాయికి ఎదగడంతో ఇప్పుడు పరిస్థితి తారుమారైందని, ఇక్కడ ఎకరా అమ్మితే ఆంధ్రాలో వంద ఎకరాలు కొనొచ్చని వ్యాఖ్యానించారు. స్కిల్ యూనివర్సిటీకి విరాళాలు సేకరిస్తాం నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకోసం యూనివర్సిటీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో రూ.300 కోట్ల నుంచి రూ. 500 కోట్ల కార్పస్ ఫండ్ సేకరిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. భూములు కోల్పోయే వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామన్నారు. అమెరికాలో హడ్సన్, లండన్లోని థేమ్స్ తరహాలో మూసీ నదిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.లక్ష కోట్లను సున్నా వడ్డీపై రుణాలుగా ఇస్తామని ప్రకటించారు. శిల్పారామంలో మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం మూడు ఎకరాలు కేటాయిస్తున్నామని చెప్పారు. సామాజిక న్యాయానికి పునాది: భట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతోనే రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగం వేళ్లూనుకుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈలు మూతపడుతున్నా తెలంగాణలో ఆ రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. చిన్న పరిశ్రమల టేకోవర్ల సమస్య కూడా తక్కువగా ఉంటోందని తెలిపారు. తాము ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా సామాజిక న్యాయానికి పునాదులు వేశామని... గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రూ.2వేల కోట్ల సబ్సిడీని ఎంఎస్ఎంఈలకు విడతల వారీగా చెల్లిస్తామని ప్రకటించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలసీ: మంత్రి శ్రీధర్బాబు అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎంఎస్ఎంఈలను తీర్చిదిద్దే లక్ష్యంతో కొత్త విధానం తెస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఎంఎస్ఎంఈలను గ్రోత్ సెంటర్లుగా మారుస్తామన్నారు. అన్ని జిల్లాల్లో ఎంఎస్ఎంఈలు, పారిశ్రామిక పార్కులు, స్టార్టప్ల కోసం ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేసి... మహిళలకు 5శాతం, ఎస్సీ, ఎస్టీ ఎంట్రప్రెన్యూర్లకు 15శాతం రిజర్వు చేస్తామని ప్రకటించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళలను ప్రోత్సహిస్తూ ‘ఫ్లాట్ ఫ్యాక్టరీలు’, ఎస్ఎంఎస్ఈ క్లస్టర్లలో పది చోట్ల కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంఎస్ఎంఈలకు సులభంగా ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రూ.100 కోట్లతో యంత్రాల ఆధునీకరణకు నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల కొనుగోలు కోసం ‘ప్రొక్యూర్మెంట్ పాలసీ’, బహుళ జాతి కంపెనీలతో భాగస్వామ్యాలు, పాలసీ అమలు కోసం టాస్్కఫోర్స్, లీజు పాలసీ వంటివాటిని కొత్త విధానంలో పొందుపర్చామని వెల్లడించారు. కేంద్ర పథకంపై ఒప్పందం..కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) శాఖ ప్రపంచ బ్యాంకు సహకారంతో దేశంలో ఎంఎస్ఎంఈల పనితీరును మెరుగుపర్చడం, వేగవంతం చేయడం కోసం పథకాన్ని అమలు చేస్తోంది. కరోనా సమయంలో దెబ్బతిన్న ఎంఎస్ఎంఈలు తిరిగి కోలుకునేందుకు ఉద్దేశించిన ఈ పథకంలో భాగంగా.. రాష్ట్రంలో స్టేట్ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఏర్పాటు కోసం బుధవారం ఎంఓయూ కుదుర్చుకున్నారు.కాగా.. పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు నిర్మల జగ్గారెడ్డి, రాయల నాగేశ్వర్రావు, ఐత ప్రకాశ్రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రైతులు.. వర్సిటీలు.. ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ కల్పన, మెరుగైన విద్య కోసం విశ్వవిద్యాలయాల అభివృద్ధి, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. గత ప్రభుత్వం కేవలం పదవులు, ఫామ్హౌస్లు, బంగళాలు, ఆస్తుల జమ లాంటి ప్రాధాన్యతలతో పదేళ్లు అధికారం చలాయించిందని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటోందని.. తనతోపాటు మంత్రులు, అధికారులను ఎవరైనా కలిసి ప్రశ్నించే వెసులుబాటు ఉందన్నారు. రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమంలో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్లో అర్హత సాధించి మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులకు సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు. స్కిల్స్, స్పోర్ట్స్ వర్సిటీలతో.. ‘గత ప్రభుత్వం పదేళ్లలో పరీక్షలు నిర్వహించకుండా తీవ్ర జాప్యం చేస్తే మేం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో 35 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు వేగవంతం చేశాం. రాష్ట్రంలో సర్టిఫికెట్ కోర్సులకే విద్య పరిమితమైంది. చదువుకు తగిన శిక్షణ లేకపోవడంతో యువత ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించాం. ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలతో వర్సిటీ పాలకమండలిని ఏర్పాటు చేశాం. వర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రాను ఎంపిక చేశాం. ఈ ఏడాది 2 వేల మందికి, వచ్చే ఏడాది 20 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నాం. ఇటీవల ఒలింపిక్స్లో భారత్కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాలని నిర్ణయించాం. వచ్చే ఒలింపిక్స్లో భారత్కు పెద్ద సంఖ్యలో పథకాలు వచ్చేలా క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’అని రేవంత్ వివరించారు. 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు రానున్న పది రోజుల్లో వైస్ చాన్స్లర్లను నియమించనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. ‘వీసీల నియామకం పూర్తి కాగానే ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను కూడా భర్తీ చేస్తాం. గత ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసినట్లు చెప్పుకుంది. కానీ కనీస వసతుల్లేక పౌల్ట్రీ షెడ్లో కోళ్ల మాదిరిగా వాటిని తయారు చేసింది. కానీ మేము మెరుగైన విద్య అందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నాం. ఒక్కో క్యాంపస్ను 20 నుంచి 25 ఎకరాలతో ఏర్పాటు చేస్తాం’అని రేవంత్ తెలిపారు. లక్ష్యంపైనే దృష్టిపెట్టండి.. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో మెరుగైన మార్కులు సాధించి మెయిన్స్ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులను సీఎం రేవంత్ ప్రత్యేకంగా అభినందించారు. కొంతకాలం ఇంటి సమస్యలను, ఇతర అంశాలను పక్కనపెట్టి కేవలం సివిల్ సరీ్వసుకు ఎంపిక కావాలనే లక్ష్యాన్నే గుర్తుంచుకోవాలని సూచించారు. మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులకు అందించిన రూ. లక్ష ఆర్థిక సాయం పెద్ద మొత్తం కానప్పటికీ ప్రభుత్వం విద్యార్థుల వెంట ఉందనే భావన కలిగించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైతే మరో రూ. లక్ష సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎక్కువ మంది సివిల్స్ ఉద్యోగాలు సాధించి రాష్ట్ర పరపతిని పెంచాలని కోరారు. మానవవనరుల వృద్ధి కోసమే స్కిల్స్ వర్సిటీ: డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్రంలో మానవవనరులను మెరుగపర్చేందుకే స్కిల్స్యూనివర్సిటీ ఏర్పాటు చేశామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మేధోసంపత్తిని ప్రోత్సహించి దేశానికి ఉపయోగపడేలా చేస్తామని చెప్పారు. గురుకులాలల్లో మౌలికవసతుల కల్పనకు గతేడాది రూ. 4 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం రూ. 5 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించిందని గుర్తుచేశారు. మూసివేతకు చేరువైన 63 ఐటీఐలను తమ ప్రభుత్వం ఏటీసీలుగా అభివృద్ధి చేసిందని భట్టి వివరించారు. అనంతరం రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సివిల్స్ మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ తదితరులు పాల్గొన్నారు. -
యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లపై చంద్రబాబు ప్రభుత్వం ప్రతీకారం
-
దసరా నుంచి స్కిల్స్ వర్సిటీ షురూ
సాక్షి, హైదరాబాద్: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో తరగతులను దసరా నుంచి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. స్కిల్స్ యూనివర్సిటీలో 20 కోర్సులను నిర్వహించనున్నామని.. అందులో దసరా నుంచి ప్రాథమికంగా ఆరు కోర్సు లను ప్రారంభించాలని నిర్ణయించామని తెలిపారు. స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభం, విధి విధానాల ఖరారు, కోర్సుల ప్రారంభం తదితరాలపై శనివారం ఆమె సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.ముచ్చర్ల వద్ద కేటాయించిన 57 ఎకరాల స్థలంలో స్కిల్స్ వర్సిటీ భవనాల నిర్మాణం పూర్తయ్యేదాకా.. తాత్కాలిక భవనంలో వర్సిటీని నిర్వ హించనున్నట్టు తెలిపారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా/ న్యాక్/ నిథమ్ భవనాల్లో తరగతులు నిర్వహిస్తామన్నారు. వర్సిటీ చైర్పర్సన్గా ఆనంద్ మహీంద్రా, కో–చైర్మన్గా శ్రీనివాస సి రాజును నియమించినట్టు వెల్లడించారు. స్కిల్స్ యూనివర్సిటీలో 140 కంపెనీలు భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.తొలుత స్కూల్ ఆఫ్ ఈ–కామర్స్, లాజిస్టిక్స్ రిటైల్ విభాగంలో సరి్టఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సులను ప్రారంభిస్తున్నామన్నారు. వివిధ విభాగాల్లో శిక్షణ నిమిత్తం దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన ఎస్బీఐ, న్యాక్, డాక్టర్ రెడ్డీస్, టీవీఏజీఏ, అదానీ కంపెనీలు భాగస్వాములుగా ఉండేందుకు అంగీకరించాయన్నారు. సీఐఐ కూడా ముందుకు వచి్చందని చెప్పారు. యూనివర్సిటీ లోగో, వెబ్సైట్ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోర్సు పూర్తి చేసిన వారికి ఆకర్షణీయమైన వేతనంతో కూడిన ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. -
NIRF rankings 2024: ఐఐటీ మద్రాస్ టాప్
న్యూఢిల్లీ: నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)–2024 ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఓవరాల్తోపాటు ఇంజినీరింగ్ కేటగిరీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ వరుసగా ఆరోసారి టాప్ ర్యాంక్లో నిలిచింది. ఐఐటీ హైదరాబాద్కు 8వ ర్యాంకు దక్కింది. ఉత్తమ యూనివర్సిటీగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) బెంగళూరు వరుసగా 9వసారి మొదటి స్థానం సంపాదించుకుంది. అదేవిధంగా, ఓవరాల్ కేటగిరీలో ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులు సాధించాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్బీఏ) రూపొందించిన ఈ ర్యాంకింగ్స్ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం విడుదల చేశారు. ఓవరాల్ టాప్–10 జాబితాలో 8 ఐఐటీలతోపాటు ఢిల్లీ ఎయిమ్స్, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ చోటుసంపాదించాయి. యూనివర్సిటీల కేటగిరీలో టాప్–3లో బెంగళూరు ఐఐఎస్సీ, ఢిల్లీలోని జేఎన్యూ, జామియా మిలియా ఇస్లామియాలున్నాయి. ఇన్నోవేషన్ విభాగంలో ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ తర్వాత ఐఐటీ హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ వర్సిటీల్లో హైదరాబాద్లోని ఉస్మానియాకు ఆరు, విశాఖపట్టణంలోని ఆంధ్రా వర్సిటీకి ఏడో ర్యాంకు దక్కాయి.ఫార్మసీ విభాగంలో... నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఎన్ఐపీఈఆర్)హైదరాబాద్ ఈ ఏడాది రెండో స్థానానికి పడిపోయింది. ఈసారి మొదటి స్థానాన్ని జామియా హందర్డ్ దక్కించుకోగా బిట్స్ పిలానీ మూడో ర్యాంకు సాధించింది. లా యూనివర్సిటీల్లో నల్సార్ హైదరాబాద్కు మూడో ర్యాంకు దక్కింది. -
ఉద్యమ స్ఫూర్తితో ఉపాధి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నీళ్లు, నిధులు, నియామ కాల పేరుతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తితో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలి్పంచనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోతున్న వర్సిటీలో ప్రవేశం పొందిన ప్రతి ఒక్కరికీ గ్యారంటీగా ఉపాధి లభిస్తుందని హామీ ఇచ్చారు.రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో 57 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్లతో నిర్మించతలపెట్టిన ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’కి గురువారం స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. తర్వాత నెట్ జీరో సిటీలో భాగంగా బేగరికంచె గ్రామ పరిధిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, మోడ్రన్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్ల నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్రెడ్డి మాట్లాడారు. నాలుగో నగరంగా బేగరికంచె అభివృద్ధి ‘హైదరాబాద్ను నవాబులు, సికింద్రాబాద్ను బ్రిటిషర్లు, సైబరాబాద్ను చంద్రబాబు, వైఎస్సార్లు నిర్మిస్తే.. నాలుగో నగరంగా బేగరికంచెను మేము అభివృద్ధి చేయబోతున్నాం. నాలుగేళ్లలోనే న్యూయార్క్ను మించిన నగరంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాం. హెల్త్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ టూరిజంగా అభివృద్ధి చేస్తాం. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఇక్కడికి తీసుకొస్తాం. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కలి్పస్తాం. తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్యపై కొనసాగింది. అందులో యువత కీలక పాత్ర పోషించింది.ఏటా లక్ష మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు బయటికి వస్తున్నా ఆశించిన స్థాయిలో ఉపాధి లభించడం లేదు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బులు ఖర్చు పెడుతూ అశోక్నగర్ చౌరస్తాలోని కోచింగ్ సెంటర్లలో చేరినా, సరైన నైపుణ్యం లేక ఉద్యోగాలు దొరకడం లేదు. పీజీ, పీహెచ్డీ పట్టాలు పొంది కూడా నిరుద్యోగులుగా మిగులుతున్న యువతకు ఈ స్కిల్స్ యూనివర్సిటీలో డిప్లొమా, డిగ్రీ సరి్టఫికెట్ కోర్సులు అందించడంతో పాటు ఆయా సంస్థల్లో ఉపాధి కలి్పస్తాం. ఇక్కడ అడ్మిషన్ పొందితే చాలు.. జాబ్ గ్యారంటీ. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల అవసరాలకు తగ్గట్లుగా శిక్షణ ఇప్పించి ఉపాధి కలి్పస్తాం..’అని సీఎం చెప్పారు. 3 నెలల్లో ఆర్ఆర్ఆర్ పనులు షురూ ‘రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఒకప్పుడు వేలల్లో ఉన్న భూముల ధరలు ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ రాకతో ప్రస్తుతం కోట్లకు చేరాయి. మరో మూడు నెలల్లో ఆర్ఆర్ఆర్ పనులను ప్రారంభిస్తాం. నెట్ జీరో సిటీ నుంచి ఓఆర్ఆర్ వరకు 200 అడుగుల ఎలివేటెడ్ కారిడార్ రోడ్డు సహా మెట్రో రైలు నిర్మాణానికి భూసేకరణ పనులు చేపడతాం. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓవైసీ ఆస్పత్రి, చాంద్రాయణగుట్ట, ఎయిర్పోర్టు మీదుగా బేగరికంచె వరకు మెట్రో రైలును విస్తరింపజేస్తాం. కడ్తాల్ అడవుల్లో నైట్ సఫారీ కడ్తాల్, ఆమనగల్లు అడవుల్లో నైట్ సఫారీ ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతాం. ఫార్మాసిటీ కోసం భూములు త్యాగం చేసిన రైతులు అధైర్యపడొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ పిల్లలను చదివించి వారికి మంచి భవిష్యత్తును ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వమే తీసుకుంటుంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలోనే అన్ని మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. విమానం కొనాలన్నా, ఎక్కాలన్నా ఇక్కడి నుంచే అవకాశాలు ఉంటాయి.ఈ ప్రాంతానికి తాగునీరు సహా రోడ్లు, పార్కులు ఇతర మౌలిక సదుపాయాలు కలి్పంచి అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దుతాం..’అని రేవంత్ చెప్పారు. ‘పండిట్ జవహర్లాల్ నెహ్రూ విద్య, నీటి పారుదలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన చొరవతోనే అనేక యూనివర్సిటీలు, ప్రాజెక్టులు వచ్చాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, భాక్రానంగల్ తదితర నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించడంతో రైతాంగానికి సాగు నీరు అందుతోంది..’అని అన్నారు. ప్రపంచానికే తలమానికం: డిప్యూటీ సీఎం భట్టి ‘స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడమే కాకుండా శంకుస్థాపన కూడా చేసుకోవడం సువర్ణ అక్షరాలతో లిఖించదగినది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు మించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. ఇది ప్రపంచానికే తలమానికం కాబోతోంది. భూములు కోల్పోయిన వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆలోచనతో 600 ఎకరాల్లో అద్భుతమైన కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తున్నాం. ప్లాట్లు పొందిన ప్రతి రైతు ఇక్కడే ఇల్లు కట్టుకుని జీవించే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాం. ఇందిరమ్మ పథకం ద్వారా ఇంటిì నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తాం..’అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మాది చేతల ప్రభుత్వం: మంత్రి కోమటిరెడ్డి తమది మాటల ప్రభుత్వం కాదు..చేతల ప్రభుత్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వందలకొద్దీ కాలుష్య కారక ఫార్మా కంపెనీలు ఒకే చోట వస్తున్నాయని తెలిసి అప్పట్లో ఎంపీగా ఆందోళన చెందానని అన్నారు. ఫార్మాను రైతులతో పాటు తాను కూడా వ్యతిరేకించానని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఫార్మాసిటీని రద్దు చేసి దాని స్థానంలో ఫార్మా విలేజ్లు చేపట్టామని తెలిపారు. కొత్త ఆలోచన, కొత్త గమ్యం: మంత్రి శ్రీధర్బాబు కొత్త ఆలోచన, కొత్త గమ్యం, కొత్త నగరం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. ఉద్యోగాలు కావాలని ఉద్యమాలు చేసిన యువత కల నెరవేరబోతోందన్నారు. ఇప్పటికే 40 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, రాష్ట్రంలో మిగిలిన మరో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కలి్పంచాలనే ఆలోచనతో స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. -
స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. స్కిల్ యూనివర్సిటీతో పాటు మరో నాలుగు సెంటర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, దామోదర నరసింహ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, మోడ్రన్ స్కూల్, కమ్యూనిటీ సెంటర్లకు భూమి పూజ చేశారు.ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మించనున్నారు. 57 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన అనంతరం సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. యువతకు సాంకేతిక నైపుణ్యాలు అందించి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోందన్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వం నిరుద్యోగులకు పట్టించుకోలేదన్నారు. పరిశ్రమల్లో యువతకు అవకాశాలు కల్పించడం కోసమే ఈ స్కిల్ యూనివర్శిటీ అన్నారు. ఈ ఏడాదిలో ఈ నగరం రూపురేఖలు మారిపోతాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. -
అలీఘర్ యూనివర్శిటీలో కాల్పుల కలకలం
యూపీలోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఎఎంయూ)లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈరోజు(బుధవారం) యూనివర్శిటీ క్యాంపస్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు ఉద్యోగులపై కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు దుండగులను పట్టుకున్నారు. కాల్పులలో గాయపడిన ఇద్దరు ఉద్యోగులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.ఎఎంయు తరచూ ఏదోఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఈ ఏడాది మార్చిలో హోలీ సందర్భంగా ఇక్కడ అల్లర్లు చోటుచేసుకున్నాయి. హోలీ సంబరాలు జరుపుకుంటున్న విద్యార్థులపై మరో వర్గం దాడి చేసింది. దీంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు సివిల్లైన్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళనకు దిగారు.గత మే నెలలోనూ ఎఎంయూలోని ఎస్ఎస్ హాల్ క్యాంపస్లో రెండు వర్గాల విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపధ్యంలో ఒక వర్గంవారు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఉదంతం జరిగినప్పుడు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించింది. గాయపడిన బీటెక్ విద్యార్థిని వెంటనే వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందించారు. -
అప్ టు డేట్గా ఉండటమే ఏఐ రంగంలో సవాలు!
కృత్రిమ మేధ రంగంలో ఉద్యోగం కావాలని చూస్తున్నారా? అయితే మీరు ఎప్పటికప్పుడు ఆ రంగంలో వచ్చే మార్పులకు తగ్గట్టుగా ఉండాల్సిందే అంటున్నారు జయతి మూర్తి. ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ ప్రెసిడెంట్గా ఉన్న ఈ తెలుగింటి ఆడపడుచు యూనివర్శిటీ వ్యవహారాలు, పరిశోధనల వివరాలను ‘సాక్షి.కామ్’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. అప్-టు-డేట్గా ఉండటమే కృత్రిమ మేధ రంగంలో ఉపాధి అవకాశాల కోసం చూస్తున్న వారు ఎదుర్కోబోయే అతిపెద్ద సమస్య అని అంటున్నారు జయతి మూర్తి. కృత్రిమ మేధ రంగంలో ఉద్యోగావకాశాలు మొదలుకొని పలు ఇతర అంశాలపై జయతి మూర్తి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే..సాక్షి: కృత్రిమ మేధతో ఉద్యోగాల అవకాశాలు దెబ్బతినవు అని చాలా మంది చెబుతున్నారు. మీరేమంటారు? జయతి: కొన్ని రకాల ఉద్యోగాల్లో కోత పడుతుంది.. అదే సమయంలో కొన్ని కొత్త రకాలు ఉద్యోగాలు పట్టుకొస్తాయి కూడా. ఏఐ విస్తృత వాడకం తరువాత కూడా అన్ని రకాల ఉద్యోగాలు భద్రంగా ఉంటాయని చెప్పలేము. కొంత మార్పు అనివార్యం. కొందరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది కూడా. కొందరికి ఏఐ వల్ల లాభం చేకూరితే మరికొందరికి నష్టమూ, బాధ జరగొచ్చు. నష్టపోయే వారికి కొత్త నైపుణ్యాలను అందించేందుకు ప్రయత్నాలు జరగాలి. మార్పు తాలూకూ దుష్ప్రభావం తక్కువగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి వచ్చినప్పుడు గతంలోనూ కొందరు సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడూ అదే జరుగుతుంది. సాక్షి: రీస్కిల్లింగ్ అనేది అందరికీ సాధ్యమవుతుందా? కృత్రిమ మేధతో ఉద్యోగాలు కోల్పోయే వారికి కలిగే నష్టాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి? జయతి: స్పష్టమైన ఆర్థిక విధానాల అవసరం ఏర్పడవచ్చు. సమాజంలో అట్టడుగున ఉన్న వారికి కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తాలూకూ ఫలితాలు అందాలి. లేదంటే అంతరాలు పెరిగిపోతాయి. ఇంకోలా చెప్పాలంటే ఇప్పటికే ఆ అంతరం ఉంది. మనలో చాలామంది కంప్యూటర్లతో పని చేస్తూ సంపాదించుకుంటున్నాం. పేదలకు ఆ అవకాశం లేదు. కొన్ని పాఠశాలల్లో కంప్యూటర్ స్క్రీన్లు, ల్యాప్టాప్లూ ఉంటే కొన్నింటిలో కనీస వసతులు కూడా లేకపోవడం వాస్తవం. ఈ అంతరాన్ని తగ్గించేలా కొత్త ఆర్థిక విధానాలు రూపొందితే ప్రయోజనం ఉంటుంది. సాక్షి: డిజిటల్ అంతరాలను తగ్గించేందుకు ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ ఏం చేస్తోంది? జయతి: మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ మా యూనివర్శిటీలో మూడొంతుల మంది విద్యార్థులు మొట్ట మొదటిసారి కాలేజీలోకి అడుగుపెడుతున్న వారు. వీరందరికీ కూడా కృత్రిమ మేధ వంటి అత్యాధునిక టెక్నాలజీలపై బోధన జరుగుతోంది. ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతులు రెండింటిలోనూ కోర్సులు అందిస్తున్నాం. సాక్షి: కృత్రిమ మేధ రంగంలో ఉద్యోగావకాశాలు ఎలా ఉండబోతున్నాయి? జయతి: ఈ ప్రశ్నకు పూర్తి సమాధానం చెప్పడం కూడా తొందరపాటు అవుతుందని అనుకుంటున్నాను. ఎల్ఎల్ఎంలు, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వంటివి ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృత్రిమ మేధ టెక్నాలజీల్లో ఉద్యోగాలకు ఉపయోగపడవచ్చు. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. సమీప భవిష్యత్తులో కృత్రిమ మేధ అనేది కేవలం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్కు మాత్రమే పరిమితం కాదు. మెకానికల్ వంటి ఇతర బ్రాంచ్లకూ విస్తరిస్తుంది. వ్యవసాయంతోపాటు అన్ని రంగాల్లోనూ దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఏం జరగబోతుంది అని ఇప్పుడే చెప్పడం కష్టం. అవకాశాలు బోలెడు వస్తాయని మాత్రం చెప్పవచ్చు. సాక్షి: మరి... కృత్రిమ మేధ రంగంలో ఉపాధి పొందాలని అనుకునే వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది? జయతి: మొట్టమొదటి సవాలు. అప్-టు-డేట్గా ఉండటం. ఎందుకంటే ఈ టెక్నాలజీ చాలా వేగంగా మారిపోతూంటుంది. ఈ రోజు ఉన్న ఛాట్జీపీటీ రేపు ఉంటుందన్న గ్యారెంటీ లేదు. బహుశా సమీప భవిష్యత్తులో ఏఐ కోర్సులు ఏడాదికోసారి మార్చాల్సి వస్తుందేమో. అటువంటి పరిస్థితుల్లో ఏఐలో ఉపాధి వెతుక్కునే వాళ్లు.. అప్-టు-డేట్గా ఉండటం చాలా కీలకం అవుతుంది. సాక్షి: మీరు స్వతహాగా మెకానికల్ ఇంజినీర్. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకునేందుకు మెకానికల్ ఇంజినీరంగ్ పరిష్కారాలు సాధ్యమని భావిస్తున్నారా? జయతి: ఇంజినీరింగ్ రంగం ఒక్కదానితోనే వాతావరణ మార్పుల సమస్యను అధిగమించలేము. ఇంజినీరింగ్ కొన్ని రకాల సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత పరిష్కారాలను అందివ్వవచ్చు. కానీ.. అసలు సమస్యలు సామాజిక, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నవి. వాతావరణం నుంచి కర్బన ఉద్గారాలను నేరుగా పీల్చేసే టెక్నాలజీలపై కొంతవరకూ ఏకాభిప్రాయం కుదిరినా.. ఆయా దేశాల స్థాయిలో తీసుకునే విధానపరమైన నిర్ణయాలు కూడా ప్రభావం చూపుతాయి. దేశాలన్నీ కలిసికట్టుగా ముందకు కదిలినప్పుడే వాతావరణ మార్పుల వంటి సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుందని నేను భావిస్తున్నాను. సాక్షి: రోబోలు మనకు దశాబ్దాలుగా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వస్తున్న కృత్రిమ మేధ ఈ రోబోటిక్స్తో ఎప్పుడు కలసిపోతాయి? జయతి: ఇప్పటికే కలిసిపోయాయని చెప్పాలి. ఎలాన్ మస్క్ లాంటి వాళ్లు ప్రతిపాదించిన న్యూరల్ లింక్ వంటివి ఇప్పటికే మొదలయ్యాయి. నిజానికి రొబోటిక్స్, కృత్రిమ మేధ రెండూ వేర్వేరు కాదు. ఒక్కటే అని చెప్పాలి. చూపు మొదలుకొని, ఇతర అన్ని మానవ సంబంధిత ఇంద్రియ జ్ఞానాలను రోబోట్లకు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంప్యూటర్ విజన్ వంటివాటిని రొబోటిక్స్, డ్రైవర్ల అవసరం లేని కార్లలో ఇప్పటికే ఏఐతో కలిపి వాడుతున్నారు. ఏఐ ఆధారిత హ్యూమనాయిడ్లూ అందుబాటులోకి వస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనూ రొబోటిక్స్, ఏఐ రెండూ కీలకం. ఇందుకు తగ్గట్టుగా ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ వాతావరణం, సుస్థిరాభివృద్ధి, కాలుష్య రహిత ఇంధన ఉత్పత్తి, రొబోటిక్స్, బయాలజీ, ఆరోగ్యం వంటి రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. సాక్షి: ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీలో విద్యార్థులు ఎంతమంది? ఏయే దేశాల వారు ఉన్నారు? జయతి: విదేశీ విద్యార్థులు రెండు వేల మంది వరకూ ఉన్నారు. భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు 400. ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ అబ్రహాం లింకన్ కాలంలో ఏర్పాటైన లాండ్ గ్రాంట్ యూనివర్శిటీ. రైతులు, పశు పోషకుల వంటివారికి సాయం చేసే లక్ష్యంతో ఏర్పాటైన వర్శిటీలు లాండ్ గ్రాంట్ యూనివర్శిటీలంటారు. అందుకే మా యూనివర్శిటీ అటవీ, వ్యవసాయ, ఇంజినీరింగ్ రంగాల్లో బలంగా ఉంది. ర్యాంకింగ్ల విషయానికి వస్తే సముద్ర శాస్త్రం, వాతావరణ శాస్త్రాల్లో వర్శిటీకి మంచి పేరుంది. అంతేకాకుండా... కంప్యూటర్స్ సైన్స్ రంగలో దేశంలోనే అతిపెద్ద అండర్గ్రాడ్యుయేట్ సంస్థ మాది. సాక్షి: ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీలో కృత్రిమ మేధ సాయంతో వ్యవసాయ రంగంపై ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి? జయతి: రెండేళ్ల క్రితం ఓఎస్యూ పూర్వ విద్యార్థి, ఎన్విడియా అధిపతి జెన్సెంగ్ హువాంగ్ ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీకి భారీ విరాళం అందించారు. ఇందులో అత్యాధునిక ఎన్విడియా జీపీయూ సూపర్ కంప్యూటర్ కూడా ఉంది. దీని సాయంతో ప్రస్తుతం మేము కృత్రిమ మేధను వాడుకుని వ్యవసాయంపై పలు పరిశోధనలు చేస్తున్నాం. యూనివర్శిటీ పరిధిలోని అటవీ ప్రాంతం, వ్యవసాయ క్షేత్రాల ద్వారా సమాచారం సేకరించి ఈ సూపర్ కంప్యూటర్ ద్వారా పెద్ద ఎత్తున కంప్యూటేషన్ చేస్తున్నాం. విసృ్తత సమాచారాన్ని కంప్యూటర్ మోడళ్లుగా మలచడంలో కృత్రిమ మేధ చాలా ఉపయోగకరమైంది. ఎన్విడియా వద్ద ఉన్న అతిపెద్ద గ్లోబల్ ఎర్త్ సిములేటర్ను కూడా ఉపయోగించుకుంటున్నాం. ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రపంచస్థాయి మోడళ్ల ఆధారంగా.. స్థానిక వాతావరణంపై వాటి ప్రభావం ఎలా ఉంటుందన్నది అర్థం చేసుకుంటున్నాము. రానున్న వందేళ్లలో వాతావరణ మార్పులను తట్టుకుని మనగలిగే పంటలు ఏవి? పంటల నీటి అవసరాలు, నేల సారం, చీడపీడల బెడద వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాం. ఒరెగాన్ యూనివర్శిటీ సముద్రతీరంలో ఉన్న నేపథ్యంలో మత్స్య, ఇతర జలచరాలపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా అధ్యయనం చేస్తున్నాం. వ్యవసాయ సమస్యలు తీర్చేందుకు ఇంజినీరింగ్ సెన్సర్ల రూపంలో కొంతవరకూ సాయపడవచ్చు కానీ.. జీవ, రసాయన శాస్త్రాల అవసరమూ ఉంటుంది.సాక్షి: యూనివర్శిటీలో సుమారు 130 ఏళ్లుగా వ్యవసాయ పరిశోధన ఒకటి కొనసాగుతోందని విన్నాము. దాని వివరాలు? జయతి: ఒరేగాన్ రాష్ట్రం తూర్పు ప్రాంతంలో సీబార్క్ అనే వ్యవసాయ పరిశోధన క్షేత్రం ఉంది. అక్కడ గోధుమ, బార్లీ, చిక్కుళ్లు, కాయధాన్యాలపై, నేల, చీడపీడలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఏఐ సాయంతో ఈ సమాచారాన్ని విశ్లేషించేందుకు తద్వారా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాము. అలాగే వర్శిటీలోని ఒక ప్రాంతంలో ఉన్న చెట్లు అన్నింటికీ సెన్సర్లు ఏర్పాటు చేశాము. అవి పంపే సమాచారాన్ని... వాతావరణ వివరాలతో సరిచూసుకుని భవిష్యత్తులో ఏ పరిస్థితిలో ఏమవుతుందనే విషయాలను అంచనా కట్టగలుగుతున్నాము. సాక్షి: ఛాట్జీపీటీ వంటి ప్రస్తుత జనరేటివ్ ఏఐ మోడళ్లు ట్యూరింగ్ టెస్ట్ను పాస్ అయ్యాయా? జయతి: నాకు తెలిసి ఏవీ పాస్ కాలేదు. వాస్తవం చెప్పాలంటే ట్యూరింగ్ టెస్ట్ అంటే ఏదో ఒక్కటి మాత్రమే కాదు. చాలా రకాలు ఉన్నాయి. ప్రస్తుత జనరేటివ్ ఏఐ మోడళ్లు ఏదో ఒక టెస్ట్ పాస్ అయ్యే ఉంటాయి. అయితే వీటి పరిధి చాలా పరిమితమైంది. ఛాట్బోట్లను సేల్స్, మార్కెటింగ్ వంటి పరిమిత ప్రయోజనాలకు వాడుకునేలా టెస్ట్లు ఉంటాయి. సంక్లిష్టమైన, జనరల్ ఇంటెలిజెన్స్ దిశగా ఉండవు. అయితే మనం మాట్లాడుతున్నది కృత్రిమ మేధతో అన్న విషయాన్ని సమర్థంగా కప్పిపుచ్చగల ట్యూరింగ్ టెస్ట్తో పరీక్షలు చేశారా లేదా అన్నది అస్పష్టం. సాక్షి: కృత్రిమ మేధ మానవజాతిపై పెత్తనం చెలాయించే రోజు వస్తుందా? జయతి: లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ల వంటి కృత్రిమ మేధ టెక్నాలజీలు చాలా బాగున్నాయి. కానీ ఇవేవీ ఆర్టిఫిషల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ)కు చాలా చాలా దూరం. అయితే ఒక్క విషయం. ఐదేళ్ల క్రితం ఛాట్జీపీటీ వంటిది సాధ్యమవుతుందని ఎవరూ అనుకోలేదు. ఈ రంగంలో మార్పులు చాలా వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదకరమా? కాదా? అన్నది ఇప్పుడిప్పుడే చెప్పలేము. కాకపోతే మానవజాతిపై పెత్తనం చెలాయిస్తుందా? వంటి ప్రశ్నలు రావడం మంచిదే. ప్రజల్లో కృత్రిమ మేధపై అవగాహన మరింత పెరుగుతుంది. తద్వారా జాగ్రత్తగా ఉండేందుకు అవకాశమూ ఏర్పడుతుంది. -
ఇక్ఫాయి యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ దాడి
సాక్షి, హైదరాబాద్: శంకర్పల్లి ఇక్ఫాయి యూనివర్శిటీలో దారుణం చేసుకుంది. బీటెక్ విద్యార్థిని లేఖపై యాసిడ్ దాడి జరిగింది. కాలేజీలో జరుగుతున్న వేడుకల్లో యాసిడ్ దాడి జరిగింది. విద్యార్థిని లేఖ్యపై తోటి విద్యార్థులు యాసిడ్ దాడి చేశారు. రంగు నీళ్లకు బదులు బకెట్లో యాసిడ్ను విద్యార్థులు నింపారు. రంగు నీళ్లు అనుకొని యాసిడ్ని తోటి విద్యార్థులు విద్యార్థినిపై పోశారు. విద్యార్థిని లేఖకు తీవ్రగాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. -
పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
నాడుప్రైవేట్ యూనివర్సిటీల్లో మెరిట్ ఉన్నా పేదింటి విద్యార్థులు చదువుకోవాలంటే రూ.లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. ఆ చదువులు కావాలంటే ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వచ్చేది. ఆస్తులు లేనివారు నిరాశతో, ప్రత్యామ్నాయాలు వెతుక్కునేవారు. దీనికంతటికీ కారణం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేట్ వర్సిటీ బిల్లు. నేడు మెరిట్ సాధించిన పేద విద్యార్థులు ప్రైవేట్ వర్సిటీల్లో పైసా చెల్లించకుండానే ఉన్నత విద్యను సొంతం చేసుకోవచ్చు. గ్రీన్ఫీల్డ్ వర్సిటీల్లో 35 శాతం, బ్రౌన్ఫీల్డ్ వర్సిటీల్లో 70 శాతం కన్వినర్ కోటా సీట్లను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వారికే కేటాయించేలా సీఎం జగన్ ప్రైవేట్ వర్సిటీ బిల్లులో మార్పులు చేశారు. సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో విప్లవాత్మక సంస్కరణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతిభ గల పేదింటి విద్యార్థులను టాప్ క్లాస్ ప్రైవేట్ యూనివర్సిటీల్లో పైసా ఖర్చులేకుండా చదివిస్తూ, వారు ఉన్నత లక్ష్యాన్ని అధిగమించేలా ప్రోత్సహిస్తున్నారు. ఆర్థిక స్తోమత కలిగిన విద్యార్థులు మాత్రమే అందుకునే ప్రైవేట్ యూనివర్సిటీ విద్యను తొలిసారిగా పేదింటి విద్యార్థులకు చేరువ చేశారు. ఏపీఈఏపీ సెట్(ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ద్వారా మెరిట్ సాధించిన పేదింటి విద్యార్థులకు ప్రైవేట్ వర్సిటీల్లో ప్రవేశాలు కల్పించి, ఉత్తమ విద్య అందేలా ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతోంది. రెండేళ్లలో 6,996 సీట్లు భర్తీ ఏపీలోని ప్రైవేట్ వర్సిటీల్లో ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సులన్నింటా ప్రతిభ గల పేద విద్యార్థులకు ప్రవేశాలు దక్కుతున్నాయి. ఈ వర్సిటీల్లో ఏడాదికి రూ.5 లక్షల వరకు ఫీజులు చెల్లించాలి. ప్రభుత్వ నిర్ణయంతో పేద మెరిట్ విద్యార్థులకు గ్రీన్ఫీల్డ్ వర్సిటీల్లో 35 శాతం సీట్లు, బ్రౌన్ఫీల్డ్ వర్సిటీల్లో 70 శాతం సీట్లు లభిస్తున్నాయి. ఇందులో ఎస్ఆర్ఎం–అమరావతి, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఏపీ వీఐటీ), సెంచూరియన్, అపోలో వర్సిటీ, భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్, మోహన్బాబు యూనివర్సిటీలలో 2022–23, 2023–24 విద్యా సంవత్సరాల్లో 6,996 సీట్లు పేద విద్యార్థులకు దక్కాయి. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల ద్వారా ప్రభుత్వం ఐదేళ్లలో ఏకంగా రూ.18 వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రైవేట్ వర్సిటీల్లో కన్వినర్ కేటగిరీలో చేరిన విద్యార్థులకు ఉచితంగానే చదువులు చెప్పిస్తోంది. అప్పట్లో ప్రైవేట్ వర్సిటీలకు చంద్రబాబు అండ ప్రైవేట్ వర్సిటీల చట్టాన్ని రూపొందించిన గత టీడీపీ ప్రభుత్వం వర్సిటీ యాజమాన్యాలకు లబ్ధి చేకూరేలా నిబంధనలు పెట్టింది. ఆయా వర్సిటీలకు భూములను తక్కువ ధరకే ఇవ్వడంతో పాటు ఇతర రాయితీలూ కల్పించింది. ఇన్ని ప్రయోజనాలు అందిస్తూ రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేకుండా చట్టాన్ని రూపొందించింది. ప్రవేశాలు, ఫీజుల నుంచి అన్నింటా వర్సిటీల ఇష్టానికే వదిలేసింది. దీంతో ఆ వర్సిటీలు సీట్లను అత్యధిక ఫీజులు చెల్లించిన వారికి మాత్రమే కేటాయించేవి. ఫలితంగా పేద మెరిట్ విద్యార్థులకు ప్రయోజనం లేకుండా పోయింది. సీఎం జగన్ దార్శనికత సీఎం జగన్ అధికారం చేపట్టాక పరిస్థితి మారింది. ఉన్నత బోధన, వనరులు ఉన్న ప్రైవేట్ వర్సిటీ విద్య పేద విద్యార్థులకూ దక్కాలనుకున్నారు. వారిపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా గ్రీన్ఫీల్డ్ విధానంలో ఏర్పాటైన ప్రైవేట్ వర్సిటీల్లో చదువుకునే అవకాశాలపై తొలుత దృష్టి సారించారు. ప్రైవేట్ వర్సిటీల చట్ట సవరణ ద్వారా ఆయా వర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులకు 35 శాతం సీట్లను కేటాయించారు. ఆ తర్వాత ప్రైవేట్ రంగంలో బ్రౌన్ఫీల్డ్ వర్సిటీల ఏర్పాటుకు చట్టంలో వెసులుబాటు కల్పించారు.ఇప్పటికే కొనసాగుతున్న కాలేజీలు నిరీ్ణత నిబంధనలతో, వనరులను కలిగి ఉంటే ఆయా యాజమాన్యాలు తమ సంస్థలను బ్రౌన్ఫీల్డ్ వర్సిటీలుగా మార్చుకునే అవకాశమిచ్చారు. అయితే వర్సిటీగా మారక ముందు వరకు ఈ కాలేజీల్లోని సీట్లలో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో పేద మెరిట్ విద్యార్థులకు దక్కేవి. వర్సిటీగా మారాక 35 శాతం సీట్లే దక్కితే పేద మెరిట్ విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని సీఎం జగన్ భావించారు. దీంతో బ్రౌన్ఫీల్డ్ వర్సిటీల్లోని 70 శాతం సీట్లు రాష్ట్ర కన్వినర్ కోటాలో కేటాయించేలా చట్టాన్ని సవరించారు.బ్రౌన్ఫీల్డ్ వర్సిటీగా ఏర్పాటయ్యాక కొత్త కోర్సులు ప్రారంభించినా, అదనపు సీట్లు తెచ్చుకున్నా వాటిలో మాత్రం గ్రీన్ఫీల్డ్ వర్సిటీల మాదిరి 35 శాతం సీట్లు రాష్ట్ర కన్వినర్ కోటాకు దక్కుతాయి. ఇటీవల మరో మూడు విద్యా సంస్థలు బ్రౌన్ఫీల్డ్ వర్సిటీలుగా మారాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిల్లో మరిన్ని అదనపు సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. -
ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
భువనేశ్వర్: ఒడిశాలోని బిజూ జనతాదళ్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను గురువారం విడుదల చేసింది. ఒడిశా అసెంబ్లీ తోపాటు లోక్సభకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సమానంగా కళింగశ్రీ, కళింగ భూషణ్ అవార్డులను ప్రవేశపెడుతున్నట్లు బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ మేనిఫెస్టో విడుదల చేస్తూ ప్రకటించారు.ఏఐ (AI) యూనివర్సిటీ, 100 యూనిట్ల ఉచిత విద్యుత్, కలియా పథకం వంటి కార్యక్రమాలను కొనసాగించాలని, విస్తరించాలని పార్టీ యోచిస్తోంది. ఎన్నికల తర్వాత కొత్త బీజేడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గం తన మొదటి సమావేశంలోనే ఈ మేనిఫెస్టోను ఆమోదిస్తుందని నవీన్ పట్నాయక్ చెప్పారు. 5టీ గవర్నెన్స్ మోడల్ ద్వారా ఈ మ్యానిఫెస్టోను అమలు చేస్తే ఒడిశా ఆధునికత, అభివృద్ధిలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.మేనిఫెస్టోలో కీలక అంశాలు⇒ వచ్చే దశాబ్దంలో ఒడిశా యువత కోసం రూ. 1 లక్ష కోట్ల ప్రత్యేక బడ్జెట్⇒ వచ్చే ఐదేళ్లలో బాలబాలికలకు స్కాలర్షిప్ల పెంపు⇒ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు⇒ స్కిల్స్ అండ్ ఎంట్రాప్రీన్యూర్షిప్ యూనివర్సిటీ, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఏఐ యూనివర్సిటీ కోసం ప్రణాళికలు⇒ 100 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్⇒ 100 నుంచి 150 యూనిట్లు వరకు సబ్సిడీపై విద్యుత్⇒ మధ్యతరగతి కుటుంబాల కోసం బిజూ స్వాస్త్య కళ్యాణ్ యోజన, గృహ రుణాలపై వడ్డీ రాయితీ, పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్లు⇒ మహిళలు, గిరిజన, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు వడ్డీ లేని రుణాలు⇒ స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సాయం, పెన్షన్ పథకాల ద్వారా సాధికారత⇒ రైతులకు పంట రుణాలు, కలియా పథకం కొనసాగింపు, రైతుల అమ్మాయిల వివాహాల కోసం ఆర్థిక సహాయం. -
యూనివర్సిటీ వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. పరారీలో భర్త, అత్త? ..?
లక్నో: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఘోరం వెలుగుచూసింది. గౌతమ్ బుద్దా యూనివర్సిటీలోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంలోని వాటర్ ట్యాంక్లో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళ తన భర్త, అత్తతో కలిసి అక్కడే నివసించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మహిళను భర్త, అత్తే హత్య చేసి అక్కడి నుంచి పరారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ భర్త సమీపంలోని జిమ్స్ ఆసపత్రిలో పనిచేస్తున్నట్లు తేలింది. దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఆదివారం రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్పారు. ఆ గొడవే మహిళ హత్యకు దారి తీసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలి భర్త, అత్త కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి శివహరి మీనా తెలిపారు. కేసుపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని, త్వరలోనే వాస్తవాలను బయటపెడతామని చెప్పారు. -
ఉత్తర కొరియా కిమ్ సంచలన వ్యాఖ్యలు
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాలో నెలకొన్న అస్థిరమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం తప్పదని అన్నారు. యుద్ధాన్నికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆయన బుధవారం దేశంలోనే కీలకమైన కిమ్ జోంగ్-ఇల్ మిలిటరీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ యూనివర్సిటీ కిమ్ తండ్రి పేరు మీద 2011లో స్థాపించారు. దేశంలో మిలిటరీ విద్యలో అత్యధికంగా సీట్లు ఉన్న యూనివర్సిటీ ఇది. యూనివర్సిటీ సందర్శన సమయంలో విద్యార్థులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడారు. ‘ఉత్తర కొరియా చుట్టూ.. అంతర్జాతీయంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో దేశంలో నెలకొన్న అస్థిరమైన పరిస్థితుల నడుమ యుద్ధం తప్పదు. శత్రు దేశాలు యుద్ధ కవ్వింపు చర్యలకు పాల్పడితే.. ఎలాంటి సంకోచం లేకుండా యుద్ధం చేయడానికి నార్త్ కొరియా సిద్ధంగా ఉంది’ అని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యానించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఇప్పటికే నార్త్ కొరియా రాజకీయంగా, ఆయుధ తయారీలో రష్యాతో సంబంధాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యూహాత్మక మిలిటరీ ప్రాజెక్టుల్లో నార్త్ కొరియా సాయం అందిస్తోంది. ఇటీవల కొరియా ఘన ఇందనంతో మధ్యశ్రేణి సూపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్ను ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే ఇది ద్రవ ఇందనంతో పోల్చితే చాలా శక్తివంతమైందని నిపుణులు పేర్కొన్నారు. తరచూ అమెరికా, దక్షిణ కొరియా తమ సైనిక విన్యాసాలతో ఉత్తర కొరియాను కవ్విస్త్ను విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. -
చదువు శక్తినిస్తుంది
‘ఈ రోజులను చూస్తుంటే మా రోజుల్లోనే అమ్మాయిలకు తగినంత స్వేచ్చ,అనుకున్నవి సాధించే ధైర్యం, సమాజాన్ని అర్ధం చేసుకునే పరిణతిని పొందారు’ అనిపిస్తుంటుంది అన్నారు రిటైర్డ్ ప్రిన్సిపల్ కమలా మీనన్. తిరుపతి పద్మావతి మహిళా కళాశాల మూడవ ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహించిన కమలా మీనన్ సికింద్రాబాద్ బోయినపల్లిలో ఉంటున్నారు. భర్త డగ్లస్ ఎమ్ కాక్రన్ జ్ఞాపకాలతో పాటు, 86 ఏళ్ల జీవితంలో ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు తనను ఎలా నిలబెట్టాయో వివరించారు. ‘‘చదువు అమ్మాయిలను శక్తిమంతులను చేస్తుంది. ఈ విషయాన్ని ఆ రోజుల్లోనే మా అమ్మ గుర్తించారు..’ అంటూ గతకాలపు విషయాలను మన ముందుంచారు. చదువు వేసిన మార్గం.. ‘‘పుట్టి పెరిగింది చెన్నైలో. నాన్నగారు బ్రిటిష్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసేవారు.అమ్మానాన్నలకు ఎనిమిది మంది సంతానం. అక్కతోపాటు ఆరుగురు అన్నలు నాకు. ఆడ, మగ అనే వివక్ష ఏ మాత్రం లేదు. అందరికీ మంచి చదువులు చదువుకునే అవకాశం ఇచ్చారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి ఆనర్స్ పూర్తయ్యాక బెంగుళూరు మౌంట్ కార్మెల్ కాలేజీలో లెక్చరర్గా ఐదేళ్లు పని చేశాను. ఆ ఎక్స్పీరియెన్స్ నాకు చాలా హెల్ప్ అయ్యింది. అప్పుడు చదువుకునే అమ్మాయిల శాతం కూడా బాగానే ఉంది. ఆ తర్వాత మార్పు కోసం తిరిగి మద్రాస్కు వచ్చేశాను. తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాలలో పొలిటికల్ విభాగంలో టెంపరరీ జాబ్ గురించి పేపర్లో ప్రకటన చూసి, అప్లై చేసి, సెలక్ట్ అయ్యాను. ఆరు నెలల తర్వాత పర్మినెంట్ అయ్యింది. సవాళ్లను తట్టుకుని ఎదుగుతూ.. జీవితంలో సవాళ్లు, బాధలు ఎక్కడి నుంచైనా ఎదురు కావచ్చు. నన్ను విపరీతంగా బాధపెట్టే సంఘటన నుంచి కోలుకోవడానికి సమయం పట్టింది. మా అక్క ఢిల్లీలో ఉండేవారు. జబ్బు పడి అక్క, నాన్న ఇద్దరూ ఒకే రోజు చనిపోయారు. ఈ సంఘటన నన్ను బాగా కదిలించాయి. ఆ టైమ్లో డా.రాజేశ్వరి మూర్తి కాలేజీ ప్రిన్సిపల్గా ఉండేవారు. ఆవిడ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లినప్పుడు సెలక్షన్ కమిటీ నన్ను ఇన్ఛార్జిగా ఎంపిక చేసింది. నా మైండ్ కూడా ఛేంజ్ కావాలనుకొని, 1975లో ఆ బాధ్యత తీసుకున్నాను. ఇంటర్వ్యూ ద్వారా టెంపరరీ జాబ్ వచ్చింది. తర్వాత పర్మినెంట్ అయ్యింది. ఆ తర్వాత ఇన్ఛార్జి ప్రిన్సిపల్గా అవకాశం వచ్చింది. నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అదే సమయంలో విదేశాలకు వెళ్లిన మరో సీనియర్ మహిళా లెక్చరర్ తిరిగి వచ్చారు. అప్పుడు మేనేజ్మెంట్ సీనియర్ కాబట్టి ఆవిడను నా ప్లేస్లో రీ ప్లేస్ చేశారు. అప్పటికే నన్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది, ఆ తర్వాత మరొకరికి ఇచ్చింది. దీంతో నా పొజిషన్ కోసం కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నేను గెలిచాను. అలా యూనివర్శిటీకి 3వ మహిళా ప్రిన్సిపల్గా బాధ్యతలు తీసుకున్నాను. ఆ తర్వాత 1993లో రిటైర్ అయ్యేవరకు ప్రిన్సిపల్గా చేశాను. 1997 వరకు దేవస్థానం ఎడ్యుకేషన్ ఆఫీసర్గా వర్క్ చేశాను. లెక్చరర్గా ఎంతో మంది విద్యార్థులను చూశాను. ఎంతోమంది విద్యార్థులతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పటికీ కలిసేవారు, ఫోన్లు చేసి మాట్లాడేవారున్నారు. ఆత్మీయులుగా మారినవారు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన, మొదటి తరం అమ్మాయిలే అక్కడంతా. వారిలో భవిష్యత్తుని చక్కగా మార్చుకోవాలనే పరిణతి బాగా కనిపించేది. వారి భవిష్యత్తుకు ప్రత్యేక క్లాసులు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేర్చాం. లెక్చరర్లు ఎంతో సపోర్ట్గా నిలిచేవారు. నాటి ఆ విద్యార్థుల్లో నేడు ఎంతోమంది పెద్ద పెద్ద పొజిషన్లలో, దేశ విదేశాల్లో ఉన్నారు. జీవితంలో ముఖ్యమైన మలుపు 1979–80లో నాటి మద్రాస్లో సౌత్ ఇండియా అమెరికా రాయబార కార్యాలయానికి డగ్లస్ ఎమ్ కాక్రన్ కాన్సులేట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాలేజీ సెమినార్ సందర్భంగా మద్రాస్ నుంచి తిరుపతికి సెమినార్కు వచ్చారు. అక్కడ డిస్కషన్స్ అన్నీ పూర్తయి, వెళ్లిపోయారు. ఆ సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఇరాన్ పొలిటికల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. చెన్నైలోని అమెరికన్ ఎంబసీ ఎదుట నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో సేఫ్గా ఉండమని రాసిన నోట్ తిరిగి మమ్మల్ని కలిపింది. ఆ తర్వాత జరిగిన డిస్కషన్స్ మమ్మల్ని మంచి స్నేహితులుగా మార్చాయి. 1985లో మేం పెళ్లి చేసుకున్నాం. ఆ విధంగా శ్రీమతి డగ్లస్ ఎమ్ కాక్రన్ అయ్యాను. జీవితంలో ఒక అద్భుతమైన వ్యక్తిని కలిసాను అనిపించేది. మా అమ్మను ఆమె సొంత కొడుకుల కన్నా డగ్లస్ గొప్పగా చూసుకున్నారు. ఇన్నేళ్ల మా జీవనంలో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఇటీవల డగ్లస్ అనారోగ్యంతో భౌతికంగా దూరమయ్యారు. అయితేనేం.... ఆ జ్ఞాపకాలు ఎంతో పదిలంగా ఉన్నాయి. అవే నన్ను శక్తిమంతురాలిని చేస్తున్నాయి. విశ్రాంత జీవనంలో.. రిటైర్ అయినా కొన్ని విదేశీ కంపెనీలు, సూపర్మార్కెట్స్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించేవారు డగ్లస్. నేను రిటైర్ అయిన తర్వాత ఎక్కడ ఉండాలో ఇద్దరమూ ఆలోచించుకున్నాం. అందుకు, సికింద్రాబాద్లోని బోయినపల్లి మాకు అనువైనదిగా అనిపించింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. మా ఇంట్లోనే కాదు మా చుట్టుపక్కల ఇళ్లలో పనులు చేసే వారి పిల్లలకు మంచి చదువు చెప్పించాలనే ఉద్దేశ్యంతో వారిని ఒక చోట చేర్చి చదువులు చెప్పేవాళ్లం. కాలనీలోని చదువుకున్న మహిళల చేత ట్యూషన్స్ చెప్పించేవాళ్లం. వారి పిల్లలను కాన్వెంట్ స్కూల్లో చేర్పించి, మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకునేవాళ్లం. అలా, ఆ పిల్లలు కూడా ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అమ్మానాన్నల పెంపకంలోనూ, చదువులోనూ, సమాజంలో మనకు లభించే స్వేచ్ఛ దుర్వినియోగం చేసుకోకూడదు. ఆ స్వేచ్ఛను మనకు అనుకూలంగా మలచుకోవాలి. అదే మనల్ని శక్తిమంతులుగా నిలుపుతుంది అది ఏ దేశమైనా అని నేనూ కాక్రన్ అనుకునేవాళ్లం’’ అంటూ నేటి తరంలో వస్తున్న మార్పులను అన్వయించుకుంటూ తెలియజేశారు’’ కమలా మీనన్. – నిర్మలారెడ్డి -
గుజరాత్ వర్సిటీలో విదేశీ విద్యార్థులపై దాడి.. ఇద్దరు అరెస్ట్
అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులపై కొందరు దాడికి దిగారు. క్యాంపస్లోని ఎ–బ్లాక్ హాస్టల్లో విదేశీ విద్యార్థులు కొందరు శనివారం రాత్రి నమాజ్ చేస్తుండగా ముగ్గురు విద్యార్థులు అడ్డుకున్నారు. వారికి మరో 200 మంది తోడై విధ్వంసం సృష్టించారు. రాళ్లు రువ్వడంతో శ్రీలంక, తజికిస్తాన్కు చెందిన ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు 25 మందిపై కేసులు పెట్టి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలను పునరావృతం కానివ్వబోమని వీసీ నీరజా అరుణ్ గుప్తా స్పష్టం చేశారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని విదేశాంగ శాఖ పేర్కొంది. -
Ahmedabad: గుజరాత్ వర్సిటీలో విదేశీ విద్యార్థులపై దాడి
అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడి ఘటన శనివారం రాత్రి జరిగింది. విదేశీ స్టూడెంట్స్పైకి రాళ్లు విసరడమే కాకుండా హాస్టల్ గదిని కూడా ధ్వంసం చేశారు. దాడిలో గాయపడ్డ విద్యార్థులను సమీపంలోని ఎస్వీపీ ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. దాడితో అప్రమత్తమైన పోలీసులు యూనివర్సిటీ గేట్లన్నీ మూసివేశారు. విదేశీ విద్యార్థులపై దాడి చేసింది ఎవరనేది తేల్చేందుకు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షా స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ తరహా ఘటనలు ప్రపంచంలో భారత్ ప్రతిష్టను దెబ్బతీస్తాయన్నారు. What a shame. When your devotion & religious slogans only come out when Muslims peacefully practice their religion. When you become unexplainably angry at the mere sight of Muslims. What is this, if not mass radicalisation? This is the home state of @AmitShah & @narendramodi,… https://t.co/OshZUIoWjl — Asaduddin Owaisi (@asadowaisi) March 16, 2024 ఇదీ చదవండి.. కశ్మీర్ వేర్పాటువాద గ్రూపులపై నిషేధం -
త్వరలో నైపుణ్య విశ్వవిద్యాలయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని (స్కిల్ యూనివర్సిటీ) ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రివర్గ సహచరులు, అధికారులు చిత్తశుద్ధితో ఉన్నట్లు ఆయన వివరించారు. విద్యా శాఖ, ఉన్నత విద్యామండలి, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ‘‘తెలంగాణలో ఉద్యోగ–ఉపాధి అవకాశాలు, ఇంటర్న్షిప్, ఉద్యోగాల కల్పన, విద్యార్థుల అభివృద్ధి’’అనే అంశంపై గురువారం అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రాష్ట్రం విద్య, ఐటీ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉందని అన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే ఏ విద్యార్థి కూడా నైపుణ్య లేమితో ఉపాధి అవకాశాలు కోల్పోరాదని, ఆ దిశగా ఉన్నత విద్యా మండలి, విద్యా శాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు. డిగ్రీ స్థాయిలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే విద్యార్థులు రాష్ట్రంలోని ప్రఖ్యాత పరిశ్రమల్లో ఇంటర్న్షిప్ పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఆయా కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధికోసం ప్రత్యేక శిక్షణను ఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్నత విద్య స్థూల నమోదు జాతీయ స్థాయి సగటు కంటే ఎక్కువగా ఉందని, రాష్ట్ర విద్యారంగంలో అమలు అవుతున్న కార్యక్రమాలు ఉన్నతమైన గుర్తింపు పొందాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొ. వెంకట రమణ, ప్రొ. ఎస్.కె. మహమూద్ తదితరులు ప్రసంగించారు. -
దేశాభివృద్ధిలో మహిళల శకం: ముర్ము
బెర్హంపూర్: దేశాభివృద్ధిలో మహిళల శకం మొదలైందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. జాతి నిర్మాణంలో నేడు బాలికలు అన్ని రంగాల్లో కీలకంగా మారారని, ఈ పరిణామం ఎంతో ప్రోత్సాహకరమైందని పేర్కొన్నారు. గంజాం జిల్లాలోని బెర్హంపూర్ యూనివర్సిటీ 25వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. సాహిత్యం, సంస్కృతి, సంగీతం వంటి రంగాల్లో మహిళ భాగస్వామ్యం ప్రశంసనీయమని తెలిపారు. ‘సైన్స్, టెక్నాలజీ మొదలుకొని పోలీసు, ఆర్మీ వరకు ప్రతి రంగంలోనూ మన కుమార్తెల సామర్థ్యం కనిపిస్తోంది. ఇప్పుడు మనం మహిళాభివృద్ధి దశ నుంచి మహిళల సారథ్యంలో అభివృద్ధి వైపు పయనిస్తున్నాం’అని రాష్ట్రపతి తెలిపారు. -
న్యూయార్క్ వర్సిటీలో కలకలం.. స్టూడెంట్స్ వరుస మరణాలు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. కేవంల రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 15వ తేదీన 19 ఏళ్ల జాక్వెలిన్ బీజిల్ అనే విద్యార్థిని లిప్టన్ హాల్లో అచేతన స్థితిలో పడి ఉంది. ఎమర్జెన్సీ డాక్టర్ల బృందం వచ్చి పరిశీలించగా ఆ స్టూడెంట్ చనిపోయినట్లు తేలింది. ఇక డోరీ సాల్టి అనే మరో విద్యార్థి శనివారం ఆర్ట్ డిపార్ట్మెంట్కు చెందిన బర్నే బిల్డింగ్ బయట పడిపోయి ఉంది. ఈ విద్యార్థిని బిల్డింగ్ మీద నుంచి పడిపోయిందా లేక భవనం మీద నుంచి దూకిందా అన్న విషయంపై క్లారిటీ లేదు. సాల్టి కుటుంబానికి సన్నిహితులు మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నట్లు చెప్పారు. యూనివర్సిటీలో మానసిక సంబంధమైన సమస్యలకు సరైన కౌన్సెలింగ్ లేకపోవడం వల్లే విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి.. కనీసం చివరి చూపు చూసుకోనివ్వండి -
కొత్త బిజినెస్లోకి దిగిన ఎల్జీ.. విద్యార్థులే టార్గెట్!
టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మిషన్లు వంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు తయారు చేసే ఎల్జీ కంపెనీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వివిధ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ తయారు చేసే ఈ దక్షిణ కొరియా కంపెనీ ఇప్పుడు సరికొత్త వ్యాపారంలోకి దిగింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ( LG Electronics India ) విద్యారంగాన్ని లక్ష్యంగా చేసుకుని దేశంలో స్వీయ-లాండ్రీ సేవా వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇక్కడ వాణిజ్య వాషింగ్ మెషీన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ఏడాదికల్లా 200 సెల్ఫ్ లాండ్రీ సర్వీస్ సెంటర్లను ప్రారంభించే ప్రణాళికలతో కంపెనీ ఈ వ్యాపారంలో 4 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.33 కోట్లు ) పెట్టుబడి పెడుతోంది. ఈ మేరకు గ్రేటర్ నోయిడాలోని గల్గోటియాస్ విశ్వవిద్యాలయంతో ఎల్జీ జత కట్టంది. అక్కడున్న 1500 మంది విద్యార్థులకు మొదటి సారిగా లాండ్రీ సేవలు ప్రారంభించింది. మెషిన్ రిజర్వేషన్, ఆపరేషన్, ఆటోమేటెడ్ చెల్లింపులను సులభతరం చేసేందుకు ఓ యాప్ను కూడా రూపొందించింది. ఈ యాప్ ద్వారా విద్యార్థులు ఎల్జీ కమర్షియల్ వాషింగ్ మెషీన్లను ఉపయోగించుకునే సౌలభ్యం ఉంటుంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హాంగ్ జు జియోన్ మాట్లాడుతూ.. విద్యా సంస్థల్లో సెల్ఫ్ లాండ్రీ సర్వీస్తో విద్యార్థులకు సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో కొత్త వ్యాపార రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. "ఈ వ్యాపారంలో 4 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నాం. 2024 చివరి నాటికి 200 సెల్ఫ్-లాండ్రీ సర్వీస్ సెంటర్లను తెరవడానికి ప్లాన్ చేస్తున్నాం" అని జియోన్ పేర్కొన్నారు. -
CJI Chandrachud: నేటి యువత సామర్థ్యం అద్భుతం
వడోదర: అవకాశాలను అందిపుచ్చుకుంటూ, ఎన్నో సవాళ్లను పరిష్కరిస్తున్న నేటి యువత సామర్థ్యం చూసి తనకు ఆశ్చర్యం కలుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని, ఓటమిని అభివృద్ధికి బాటగా మలుచుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. జీవితమంటే మారథాన్(సుదీర్ఘ 42 కిలోమీటర్ల పరుగు పందెం) వంటిదే తప్ప 100 మీటర్ల స్ప్రింట్(స్వల్ప దూరం పరుగు పందెం) కాదని ఆయన పేర్కొన్నారు. బరోడా లోని మహారాజా శాయాజీరావ్ యూనివర్సిటీ 72వ వార్షిక స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ఆదివారం జస్టిస్ డీవై చంద్రచూడ్ వర్చువల్గా ప్రసంగించారు. ఈ ఏడాది యూనివర్సిటీ ప్రదానం చేసిన మొత్తం 346 బంగారు పతకాల్లో అత్యధికంగా 336 పతకాలు మహిళలు అందుకోవడాన్ని మన దేశం మారుతోందనడానికి నిజమైన గుర్తుగా ఆయన అభివరి్ణంచారు. ‘చరిత్రలో ఇది ఒక ప్రత్యేకమైన సమయం. మునుపెన్నడూ లేనంతగా టెక్నాలజీ నేడు ప్రజలను అనుసంధానం చేస్తోంది. అదే సమయంలో వారిలో భయాలు, ఆందోళనలకు సైతం కారణమవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వృత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇవి సంప్రదాయ వృత్తులతో సంబంధం లేనివి. వీటిల్లో ఎవరికి వారు తమ ప్రయాణం సాగిస్తున్నారు. ఈ సమయంలో పట్టభద్రులుగా బయటికి వస్తున్న మీ అందరికీ ఇది ఉత్తేజకర సమ యం. అదే సమయంలో అనిశి్చతిని, గందరగోళాన్నీ సృష్టిస్తాయి’అని హెచ్చరించారు. -
ఎన్జీ రంగా వర్సిటీలో పరిశోధనలు భేష్
ల్లూరు(సెంట్రల్): నెల్లూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలోని పరిశోధనలు చాలా బాగున్నాయని, అమెరికాలోని టెన్నెసీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్స్ దిలీప్ నందు వాణి, ప్రొఫెసర్ జాన్ రికార్డ్స్ ప్రశంసించారు. నెల్లూరు నగరంలోని పరిశోధనా క్షేత్రాన్ని బుధవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ పరిశోధనా స్థానాలను తాము పరిశీలించామని, అన్నిచోట్ల చాలా బాగున్నాయని కొనియాడారు. అదేవిధంగా నెల్లూరులో ఉన్న ఎన్జీ రంగా పరిశోధనా క్షేత్రంలో పరిశోధనలు తమకు ఎంతో సంతృప్తినిచ్చాయని వివరించారు. తమ ప్రాంతంలో ఉన్న విద్యార్థులను కూడా నెల్లూరులోని పరిశోధనా క్షేత్రానికి పంపి ఇక్కడి స్థితిగతులను తెలుసుకునేలా చేస్తామన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కోదండరామిరెడ్డి, డాక్టర్ గురవారెడ్డి, డాక్టర్ సి.రమణ, ప్రధాన శాస్త్రవేత్త వినీత ఈ బృందానికి క్షేత్రంలో చేస్తున్న పరిశోధనలను వివరించారు. ప్రధానంగా కొత్త వంగడాలు, తెగుళ్ల నివారణపై కూలంకషంగా వివరించారు. -
మత్స్యరంగం కొత్త పుంతలు
సాక్షి, అమరావతి: ‘ఆక్వా హబ్ ఆఫ్ ఇండియా’గా ఖ్యాతి గడించిన ఆంధ్రప్రదేశ్లో మత్స్య యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే మూడోదిగా ఏర్పాటైన ఈ వర్సిటీకి ఓ వైపు నూతన భవన సముదాయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుంటే.. మరోవైపు దీనికి అనుబంధంగా కొత్త మత్స్య కళాశాల కొలువు దీరింది. తొలి ఏడాదిలోనే కేటాయించిన 60 సీట్లు భర్తీ కావడమే కాదు..నిష్ణాతులైన అధ్యాపక బృందంతో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. 1200కు మించి పట్టభద్రుల్లేని పరిస్థితి రాష్ట్రంలో 974 కి.మీ. సువిశాల తీర ప్రాంతం..1.10 లక్షల హెక్టార్ల మంచినీటి సాగు..80 వేల హెక్టార్లలో ఉప్పునీటి సాగు విస్తీర్ణం ఉంది. 1.75 లక్షల మంది ఆక్వా రైతులు..8.50 లక్షల మంది మత్స్యకారులున్నారు. ఈ రంగంపై ఆధారపడి 16.50 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. 51.06 లక్షల టన్నుల చేపలు, రొయ్యల ఉత్పత్తితో రాష్ట్రం దేశంలోనే నం.1 స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో చేపల ఉత్పత్తిలో 25.60 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 78 శాతం ఏపీ నుంచే జరుగుతోంది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్రానికి 11,901 డిప్లమో హోల్డర్లు, 6118 బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్ఎస్సీ), 2541 మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (ఎంఎఫ్ఎస్సీ) చదివిన వారు అవసరం. 2030 నాటికి కనీసం 50 వేల మందికి పైగా అవసరమవుతారని అంచనా. కానీ ప్రస్తుతం కేవలం 450 మంది డిప్లమో, 700 మంది బీఎఫ్ఎస్సీ, 50–60 మంది ఎంఎఫ్ఎస్సీ పూర్తిచేసిన వారు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు ఈ పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2005 వరకు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలో, ఆ తర్వాత వెటర్నరీ యూనివర్సిటీకీ అనుబంధంగా ఉన్న మత్స్య యూనివర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందుకోసం ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ యాక్టు–2020ను తీసుకురావడమే కాదు..2022 ఫిబ్రవరి 19 నుంచి వర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ పరిధిలో ఉన్న నెల్లూరు జిల్లా ముతుకూరులోని కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్తో పాటు అవనిగడ్డ మండలం బావదేవర పల్లి వద్ద ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల, కాకినాడలో ఉప్పునీటి రొయ్యలు, బిక్కవోలు మండలం బలభధ్రపురంలో మంచినీటి చేపల పరిశోధనా కేంద్రం, ఉండి వద్ద మంచి నీటి చేపలు, రొయ్యల పరిశోధన కేంద్రంతో పాటు 8 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలను మత్స్య వర్సిటీ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తొలి ఏడాదిలోనే గుర్తింపు వర్సిటీకి అనుబంధంగా 60 బీఎఫ్ఎస్సీ సీట్లతో కొత్తగా నర్సాపురం మత్స్య కళాశాలను మంజూరు చేసిన ప్రభుత్వం ముత్తుకూరు మత్స్య కళాశాలలో సీట్ల సంఖ్యను 40 నుంచి 60కి పెంచింది. కొత్తగా ఏర్పాటు చేసిన నర్సాపురం కళాశాలకు నిష్ణాతులైన అధ్యాపక బృందాన్ని నియమించి 2022–23 విద్యా సంవత్సరం నుంచే నర్సాపురంలోని తుఫాన్ భవనం (తాత్కాలికంగా)లో తరగతులకు శ్రీకారం చుట్టారు. తొలి ఏడాదిలోనే కేటాయించిన 60 సీట్లు భర్తీ కావడమే కాదు యూజీసీ, ఐసీఏఆర్ గుర్తింపు కూడా లభించడం గమనార్హం. వచ్చే ఏడాది నుంచి మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్, పీహెచ్డీ కోర్సులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస, కృష్ణా జిల్లా కైకలూరు వద్ద ఫిషరీస్ కళాశాలలతో పాటు కొత్తగా నాలుగు మత్స్య పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విజయవాడ తాడిగడపలో వర్సిటీ క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అధికారికంగా కార్యకలాపాలకు శ్రీకారంచుట్టారు. శరవేగంగా నిర్మాణ పనులు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో లఖితపూడి– సరిపల్లి గ్రామాల మధ్య 400 ఎకరాల్లో రూ.332 కోట్ల అంచనాతో యూనివర్సిటీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే 40 ఎకరాలను గుర్తించగా, దాంట్లో రూ.100 కోట్లతో పరిపాలనా భవనంతో పాటు అకడమిక్ బ్లాక్, బాలుర, బాలికల హాస్టళ్లు, రైతుల శిక్షణ కేంద్రం, వైస్ చాన్సలర్ బంగ్లా, మల్టీపర్పస్ బిల్డింగ్ నిర్మాణ పనులు జోరందుకున్నాయి. పిల్లర్ల దశకు చేరుకున్నాయి. మరొక పక్క వర్సిటీతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన మత్స్యకళాశాల కోసం 48 టీచింగ్, 52 నాన్ టీచింగ్, 40 అవుట్సోర్సింగ్ కలిపి 140 పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనామోదం కూడా ఇచ్చింది. శాస్త్రవేత్తను కావాలని.. మాది నెల్లూరు. మా నాన్న ఆర్టీసీ కండక్టర్.గురుకుల పాఠశాలలో చదువుకున్నాను. ఎంసెట్తో పాటు నీట్లో కూడా క్వాలిఫై అయ్యాను. చిన్నప్పటి నుంచి మత్స్యశాస్త్రవేత్త కావాలన్న సంకల్పంతో బ్యాచురల్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్లో చేరాను. నర్సాపురంలో కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాలలో సీటు వచ్చింది. ఫ్యాకల్టీ చాలా బాగుంది. నర్సాపురం సమీపంలోనే ప్రాసెసింగ్ ప్లాంట్స్, హేచరీలు, మత్స్య పరిశ్రమలుండడం మాకెంతో ఉపయోగంగా ఉంది. –పి.హరిబాబు, బీఎఫ్ఎస్సీ విద్యార్థి అపార అవకాశాలు మాది గుంటూరు. నాన్న బ్యాంక్ మేనేజర్. ఎంబీబీఎస్ చేయాలని నీట్ రాశాను. క్వాలీఫై కాలేకపోయాను. అపారమైన ఉపాధి అవకాశాలున్న మత్స్య రంగంలో అడుగు పెట్టాలన్న సంకల్పంతో నర్సాపురం కళాశాలలో బీఎఫ్ఎస్సీలో సీటు సాధించా. మత్స్య శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలన్నదే నా లక్ష్యం. –ఎస్డీ షరీఫాతేజ్, బీఎఫ్ఎస్సీ విద్యార్థిని త్వరలో నూతన ప్రాంగణంలోకి.. అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్న మత్స్యరంగం బలోపేతం కావాలంటే ప్రత్యేకంగా మత్స్య యూనివర్సిటీ అవసరం. ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో మూడో మత్స్య వర్సిటీని ఏర్పాటు చేశారు. తొలిదశలో రూ.100 కోట్లతో వర్సిటీ భవనాలు నిర్మాణమవుతున్నాయి. వర్సిటీ భవనాలు వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా నూతన ప్రాంగణంలో వర్సిటీ కార్యకలాపాలతో పాటు మరిన్ని కోర్సులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. –డాక్టర్ ఓగిరాల సుధాకర్, రిజిస్ట్రార్, ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం -
భారతీదాసన్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధాని
-
హాజరుకూ మార్కులు!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులను కళాశాలకు రప్పించే విధానానికి ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టబోతోంది. సమగ్ర నిరంతర మూల్యాంకన విధానంలో భాగంగా వారి హాజరుకూ మార్కులివ్వనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఈ ఏడాది దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టగా, మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలోనే డిగ్రీ స్థాయిలోనూ దీన్ని అమలులోకి తేవాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. అకడమిక్ మార్కులే కాకుండా, వాస్తవ ప్రతిభను వెలికి తీయడం దీని ముఖ్యోద్దేశమని మండలి అధికారులు చెబుతున్నారు. మూల్యాంకన విధానంపై అధ్యయనానంతరం ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ)చేసిన సిఫారసులకు విశ్వవిద్యాలయాల వీసీలూ ఆమోదం తెలిపారు. ఐఎస్బీ అభిప్రాయ సేకరణ అధ్యయనంలో భాగంగా ఐఎస్బీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. 258 కాలేజీల అధ్యాపకుల మనోగతాన్ని పరిశీలించింది. 692 మంది విద్యార్థులతో మూల్యాంకన విధానంపై చర్చించింది. విద్యార్థి ప్రతిభను అంచనా వేయాలని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. థియరీ ద్వారా మార్కులు నిర్ణయించే ప్రస్తుత విధానం కన్నా సమర్థవంతమైంది కావాలని 82 శాతం తెలిపారు. ఉపాధి కోర్సుల అవసరం ఉందని 24 శాతం మంది పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం డిగ్రీ స్థాయిలో నైపుణ్యం పెంచాలని 38 శాతం తెలిపారు. డిగ్రీ క్లాసులకు హాజరయ్యేలా విద్యార్థులను ప్రోత్సహించాలని 76 శాతం అధ్యాపకులు పేర్కొన్నారు. కొత్త అంశాల అన్వేషణకు క్లాస్ రూం వేదిక కావాలని 84 శాతం మంది ఆకాంక్షించారు. ఈ అభిప్రాయాల ఆధారంగానే ఐఎస్బీ కొన్ని సిఫార్సులు చేసింది. ముఖ్యంగా హాజరు తప్పనిసరి చేయడమే కాకుండా, క్లాసు రూంలో వివిధ బోధన పద్ధతులను సూచించింది. ప్రతి 20 రోజులకు విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా పరీక్షలుండాలని స్పష్టం చేసింది. ప్రతి అంశానికీ మార్కులు సంవత్సరం మొత్తంలో 75 శాతానికి పైగా హాజరు ఉన్న వారికి 10 మార్కులు ఇవ్వాల్సిన అవసరాన్ని ఐఎస్బీ ప్రస్తావించింది. యాక్టివ్గా ఉండే విద్యార్థులను వెలికితీయడం, వారు ఏ అంశాల్లో ఆసక్తిగా ఉన్నారనేది అధ్యాపకుడు గుర్తించాలి. దీనికీ కొన్ని మార్కులు నిర్దేశించారు. మంచి సంస్థలను గుర్తించి, అక్కడే ప్రాజెక్టు వర్క్ చేయాలి. ప్రాజెక్టు వర్క్లో నైపుణ్యానికి మార్కులుంటాయి. నెలకు కనీసం నాలుగు క్విజ్లు, వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, మార్కులివ్వాలి. ఈ విధానం ఎలా ఉండాలనేది ఆయా యూనివర్సిటీలు నిర్ణయిస్తాయి. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అనుసంధానం పెంచడం, ఇంటర్న్షిప్, ప్రాంగణ నియామకాల కల్పనకు ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటును వర్సిటీలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి వారం విద్యార్థి ప్రతిభకు మార్కులు నిర్ణయించి, వాటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తారు. ప్రతి యూనివర్సిటీలోనూ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఎవాల్యుయేషన్ అండ్ అసెస్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. డిగ్రీ స్థాయిలోనూ పరిశోధన సంస్కృతికి ఊతం ఇవ్వడం కొత్త విధాన లక్ష్యం. కృత్రిమ మేధ కోర్సులు, డేటాసైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ కోర్సులను పెద్ద ఎత్తున డిగ్రీలో చేపట్టాలని ఐఎస్బీ సిఫారసు చేసింది. గుణాత్మక మార్పుకు దోహదం దేశంలోనే తొలిసారి నిరంతర మూల్యాంకన విధానం ఈ ఏడాది ప్రవేశపెట్టాం. పీజీ (నాన్– ఇంజనీరింగ్) కోర్సుల్లో దీన్ని అమలు చేస్తున్నారు. దీనికోసం సాఫ్ట్వేర్ కూడా రూపొందించాం. ప్రశ్నపత్రాల రూపకల్పనపై అన్ని వర్గాల ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. ఇబ్బందులుంటే చర్యలు చేపడుతున్నాం. గుణాత్మక మార్పునకు ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నాం. దీన్ని డిగ్రీ స్థాయికీ విస్తరించాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. – ప్రొఫెసర్ డి.రవీందర్ (వీసీ, ఉస్మానియా యూనివర్సిటీ) -
వచ్చే ఏడాది 300 వర్సిటీల్లో ఆనర్స్ డిగ్రీ
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా 300కు పైగా విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ ఆనర్స్ (నాలుగేళ్ల డిగ్రీ) ప్రోగ్రామ్ అందుబాటులోకి రానుంది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యార్థులకు పరిశోధన స్పెషలైజేషన్ డిగ్రీని అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నాలుగేళ్ల డిగ్రీని ప్రవేశపెట్టింది. ఆనర్స్ డిగ్రీ అందించేందుకు 150 విశ్వవిద్యాలయాలు ముందుకు రాగా, ఇప్పటికే 105 వర్సిటీలు కోర్సు ప్రారంభించాయి. 19 కేంద్రీయ, 24 రాష్ట్ర స్థాయి, 44 డీమ్డ్, 18 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. నాలుగేళ్ల కోర్సు ఐచ్ఛికమే నాలుగేళ్ల డిగ్రీ పాఠ్యాంశాలు, క్రెడిట్ ఫ్రేమ్వర్క్ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రూపొందించారు. నాలుగేళ్ల డిగ్రీ విద్యార్థుల ఐచ్ఛికమే. మూడేళ్ల సాంప్రదాయ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆసక్తి ఉన్న వారు నాలుగో ఏడాది ఆనర్స్ డిగ్రీని అభ్యసించవచ్చు. విద్యార్థులు 120 క్రెడిట్లు పూర్తి చేసిన తర్వాత మూడేళ్ల యూజీ డిగ్రీని, 160 క్రెడిట్లు పూర్తి చేస్తే ఆనర్స్ డిగ్రీని అందిస్తారు. పరిశోధన స్పెషలైజేషన్ అభ్యసించే వారు నాలుగేళ్ల యూజీ కోర్సులో పరిశోధన ప్రాజెక్టు చేపట్టాలి. దీంతో వారికి రీసెర్చ్ స్పెషలైజేషన్తో పాటు ఆనర్స్ డిగ్రీ లభిస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి ఇది సహాయపడుతుంది. విదేశాల్లో చదువుకునేందుకు భారతీయ విద్యార్థుల్లో డిమాండ్ పెరుగుతోంది. గతేడాది నవంబర్ వరకు 6 లక్షల మందికిపైగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికాలో ఎక్కువ మంది భారతీయలు చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. -
రూ. 1,600 కోట్ల మోసం కేసు.. అశోకా యూనివర్సిటీ కో-ఫౌండర్స్ అరెస్ట్
పారాబొలిక్ డ్రగ్స్ లిమిటెడ్ డైరెక్టర్లు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తా రూ.1600 కోట్ల బ్యాంక్ మోసానికి పాల్పడ్డారని ఈడీ వర్గాలు తెలిపాయి. వీరిద్దరూ అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకులని తమ విచారణలో తేలినట్టు తెలిపింది. దీనిపై అశోకా యూనివర్సిటీ స్పందిస్తూ ఈ కేసుకు, యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. మనీలాండరింగ్ కేసులో హర్యానాకు చెందిన అశోకా యూనివర్సిటీ సహా వ్యవస్థాపకులు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. వీరితోపాటు చార్టెట్ అకౌంటెంట్ ఎస్కే బన్సాల్ను సైతం అదుపులోకి తీసుకుంది. ఈ ముగ్గురిని ఈడీ చంఢీగడ్ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అయిదు రోజుల కస్టడీకి అనుమతినినచ్చింది. కాగా పారాబోలిక్ డ్రగ్స్ కంపెనీ డైరెక్టర్లు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తాపై రూ. 1,627 కోట్ల బ్యాంకు మోసానికి సంబంధించి మనీలాండరింగ్ కేసు నమోదైంది. వీరిద్దరిపై, సదరు ఫార్మా కంపెనీపై సీబీఐ 2021లో కేసు నమోదు చేసింది. దీంతో 2022లో వారు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం పారాబోలిక్ కంపెనీలకు చెందిన మొత్తం 17 చోట్ల ఈడీ సోదాలు జరిపింది. ఢిల్లీ, ముంబై, ఛండీగఢ్, పంచకుల, అంబాల తదితర ప్రాంతాల్లోని ఈ సోదాలు జరిగాయి. దీనిపై అశోకా యూనివర్సిటీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈడీ విచారిస్తున్న పారాబోలిక్ డ్రగ్స్ కంపెనీకి అశోకా యూనివర్సిటీక ప్రస్తుతం ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది. తమ యూనివర్సిటికి 200కుపైగా ఫౌండర్లు, డోనర్స్ ఉన్నారని, వారిలో వినీత్, ప్రణవ్ గుప్తా ఒకరని తెలిపారు. చదవండి: అవును.. పార్లమెంట్ లాగిన్ ఐడీ ఇచ్చా: ఎంపీ మహువా మొయిత్రా -
విద్యా వ్యవస్థపై సినీ విమర్శనాస్త్రం
ఆర్. నారాయణ మూర్తి ‘యూనివర్సిటీ: పేపర్ లీక్’ అనే కొత్త సినిమా తీశారు. అది ఇటీవల విడుదలయింది. మూర్తి ఆహ్వానం మేరకు, ప్రైవేట్ థియేటర్లో ప్రీ–రిలీజ్ స్పెషల్ షో చూశాను. నారాయణ మూర్తి ప్రభుత్వ యూనివర్సిటీ ప్రొఫెసర్గా, పోలీస్ ఆఫీసర్గా డబుల్ యాక్షన్లో ప్రధాన పాత్రలో నటించారు. నేటి విద్యా వ్యవస్థను ఎడ్యుకేషన్ మాఫియా ఎలా తన గుప్పిట పెట్టుకుంటున్నదో చూపించిన కమర్షియల్ సినిమా ఇది. మొట్టమొదటిసారిగా పాఠశాల, విశ్వవిద్యాలయ స్థాయి విద్యా మాధ్యమం మీద, ప్రభుత్వ సదుద్దేశానికీ విద్యారంగంలో ప్రైవేట్ మాఫియా విధ్వంసక పాత్రకూ మధ్య వైరుద్ధ్యంపై ఒక సినిమా రూపొందించారు. ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ మీడియం అమలు చేయాలనే సాహసోపేతమైన నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం చేస్తున్న కొత్త ప్రయోగం లేకుండా, చంద్రబాబు నాయుడు మద్దతు ఉన్న ప్రైవేట్ మాఫియా ఆంధ్రప్రదేశ్లోనూ, తెలంగాణలో కూడా ప్రతికూల పాత్ర పోషిస్తుండటం లేకుండా ఈ సినిమా తీయడం అసాధ్యం. ఒక తెలుగు పండితుడు తన ఎనిమిది వేళ్లకు వజ్రాల ఉంగరాలు ధరించి ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ‘దేశభాషలందు తెలుగు లెస్స’ ఎందుకవుతుందో గర్జిస్తూ పాఠాలు చెప్పే సన్నివేశంతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. తెలుగువారంతా తెలుగు మాధ్యమంలోనే చదవాలనీ, తెలుగువారు కేవలం తెలుగు మాధ్యమంలో చదివితేనే తెలుగువారి ఆత్మగౌరవం, జ్ఞానం విశ్వగురువు అవుతాయని ఆయన చెప్తారు. కానీ అదే తెలుగు పండితుడు ఓ పెద్ద ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ కాలేజీని దాని అసలు యజమానిని మోసం చేసి సొంతం చేసుకుంటాడు. దానిని ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మారుస్తాడు. ఆ తర్వాత విపరీతమైన ఫీజుల ద్వారా ప్రజలను దోచుకోవడం ప్రారంభిస్తాడు. ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుతున్న ఒక తెలివైన విద్యార్థి అన్నీ ఫస్ట్ ర్యాంకులు పొందుతున్న ఈ ప్రైవేట్ యూనివర్సిటీకి పంపాలంటూ తల్లి తండ్రులపై ఒత్తిడి చేస్తాడు. అప్పటికే అతడి తల్లి ఈ పిల్లవాడి చదువుకోసం పుస్తెలతాడు అమ్మి ఉన్నందున, అతని తండ్రి తన కిడ్నీని అమ్మి, అతడిని తెలుగు పండిట్ నిర్వహిస్తున్న ప్రైవేట్ ఇంగ్లీషు మీడియం యూనివర్సిటీలో చేర్పిస్తాడు. నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలకు లాగే, అన్ని నంబర్ వన్ ర్యాంకులూ తెలుగు పండిట్ సొంత విశ్వవిద్యాలయ విద్యార్థులకే వచ్చాయి. అతని విశ్వవిద్యాలయ ప్రకటనలు ఎంత ప్రాచుర్యం పొందాయంటే, గ్రామస్థులు కూడా పుస్తెలమ్ముకుని మరీ వారి అబ్బాయిలను, అమ్మా యిలను ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయానికి పంపేంతగా. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య కోసం ప్రజానీకం పోరాడుతున్నప్పుడు వారిపై దాడి చేసేందుకు ఈ తెలుగు పండితుడు పోలీసులకు లంచం ఇస్తాడు. మంత్రులకు లంచం ఇవ్వ డానికి కూడా ప్రయత్నిస్తాడు కానీ ఇప్పుడిక్కడ నిజాయతీపరుడైన ఈ ముఖ్యమంత్రి ఉన్నారు. తర్వాత ఈ యూనివర్సిటీ వ్యవహారాలపై ఆయన విచారణకు ఆదేశిస్తాడు. తెలుగు పండితుడు అన్ని దిగువ స్థాయి ప్రభుత్వ వ్యవస్థ లనూ కొనుగోలు చేస్తాడు. పైగా పేపర్ల లీకేజీకి పాల్పడతాడు. తన విశ్వవిద్యాలయంలోని ధనవంతులైన విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకొని వారి బదులు విద్యార్థులు కాని బయటి వారితో పరీక్షలు రాయిస్తాడు. పరీక్షా పత్రాలు దిద్దే మాస్టర్లకు డబ్బు చెల్లించడం ద్వారా ప్రభుత్వ విశ్వ విద్యాలయంలోని తెలివైన విద్యార్థులు ఫెయిలయ్యే వ్యవస్థ కోసం అతను ప్లాన్ చేస్తున్నాడు. అలా ఫెయిలైన కారణంగా ఒక తెలివైన విద్యార్థిని ప్రభుత్వ విద్యాలయం క్యాంపస్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. దీంతో ప్రభుత్వ విద్యాసంస్థలు ఏమాత్రం సరిగా బోధించడం లేదని ప్రజలు భావించేలా చేయగలుగుతాడు. రాష్ట్ర స్థాయి సర్వీస్ కమిషన్ పరీక్షల ప్రశ్న పత్రాలను ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయం కూడా మేనేజ్ చేయగలుగుతుంది. పేద విద్యార్థులు డిగ్రీలు పొందినప్పటికీ వారికి ఉద్యోగాలు రాకుండా తెలుగు పండిట్ మేనేజ్ చేయగలుగుతాడు. తన సొంత విశ్వవిద్యాలయంలోని ఒక నిజాయతీగల విద్యార్థిని... విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరీక్షను ఒకరికి బదులు మరొకరు రాస్తున్న విష యాన్ని తన మొబైల్ ఫోన్తో రికార్డు చేసిందనే కారణంతో దారుణానికి ఒడిగడతాడు. ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి చెందిన తన తొత్తు అయిన సీఐ కుమారుడి గ్యాంగ్తో ఆమెను అత్యాచారం చేయించి హత్య చేయిస్తాడు. అలాగే ప్రొఫెసర్ పాత్రలో ఉన్న నారాయణ మూర్తిని సీఐ చంపే స్తాడు, కానీ అదే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పాత్రధారి అయిన నారాయణమూర్తి ఎడ్యుకేషన్ మాఫియా లీడర్ అయిన సీఐని చంపేస్తాడు. నారాయణమూర్తి సినిమాలో సందేశం చాలా స్పష్టంగా ఉంది. ప్రస్తుత ఆంధ్రా మోడల్ విద్యా విధానాన్ని ఆయన ఎత్తిపడుతున్నారు. అదే సమయంలో ప్రైవేట్ విద్యా మాఫియాను ఎండగడు తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు అనుస రించిన ప్రైవేట్ అనుకూల విద్యను కేసీఆర్ హయాంలో తెలంగాణలో కొనసాగిస్తున్న విషయం ఆర్. నారాయణ మూర్తి దృష్టిలో ఉంది. ఈ రకమైన సినిమాలు డాక్యుమెంటరీ రూపంలో కూడా చాలా అరుదు, జనాదరణ పొందిన వాణిజ్య సినిమాలను వదిలివేయండి. ప్రైవేట్ మాఫియా విద్య వల్ల ప్రాణాలను, వనరులను కోల్పోతున్న తల్లితండ్రులు, విద్యార్థులు తప్పక చూడాల్సిన సినిమా ‘యూనివర్సిటీ: పేపర్ లీక్’. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
రేపే నారాయణమూర్తి యూనివర్సిటీ
‘‘యూనివర్సిటీ’ విద్యార్థులే కాదు.. వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు చూడాల్సిన సినిమా’’ అని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆర్. నారాయణమూర్తి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ’ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు ‘యూనివర్సిటీ’ ప్రివ్యూ వేశారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ– ‘‘దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలి. అప్పుడే ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ ఉండదు’ అనే అంశాన్ని ఈ చిత్రం ద్వారా గట్టిగా చెప్పారు నారాయణమూర్తి’’ అన్నారు. ‘‘నిరుద్యోగ సమస్య దేశాన్ని ఎంత పట్టి పీడిస్తోందో ఈ చిత్రంలో బాగా చెప్పారు’’ అన్నారు ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. ‘‘పరీక్షల మీద పరీక్షలంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. -
యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి?
‘‘విద్యార్థులు జాతి సంపద. వాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంపై, ప్రభుత్వాలపై, మన అందరి పైనా ఉంది అని చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అని ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ఆయన లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై రూ΄÷ందిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం అయితే మొత్తం వ్యవస్థే దెబ్బతింటుంది. యూనివర్సిటీల్లో పేపరు లీకేజీలు, గ్రూపు 1, 2 ప్రశ్నా పత్రాల లీకేజీలు... ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమై΄ోవాలి? సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీగారు దయచేసి ఇవ్వాలి. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేసుకుంటూ΄ోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? వంటి విషయాలను మా సినిమాలో ప్రస్తావించాం’’ అన్నారు. -
వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో.. భారత్వే 91!
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) మ్యాగజైన్ సెప్టెంబర్ 27న ప్రకటించిన వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2024లో రికార్డు స్థాయిలో 91 భారతీయ విశ్వవిద్యాలయాలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ ర్యాంకింగ్లలో అత్యంత ప్రముఖ భారతీయ విశ్వవిద్యాలయం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు, 2017 తర్వాత తొలిసారిగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. 2024 ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్లో భారతదేశం ఇప్పుడు నాల్గవ ఉత్తమ ప్రాతినిధ్యం కలిగిన దేశంగా ఎదిగింది. గతేడాది భారత్ నుంచి కేవలం 75 ఇన్స్టిట్యూట్లు మాత్రమే ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకోగా.. ఇండియా ఆరో స్థానంలో నిలిచింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తర్వాత, అన్నా యూనివర్శిటీ, జామియా మిలియా ఇస్లామియా, మహాత్మా గాంధీ యూనివర్శిటీ, శూలినీ యూనివర్శిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్లు భారతదేశం నుండి తదుపరి ఉత్తమ సంస్థలు. ఈ విశ్వవిద్యాలయాలన్నీ 501-600 బ్యాండ్లో ఉన్నాయి. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం గత సంవత్సరం 801-1000 బ్యాండ్ నుంచి 601-800కి పెరిగింది. కోయంబత్తూరులోని భారతియార్ విశ్వవిద్యాలయం గత సంవత్సరం 801-1000 బ్యాండ్ నుంచి 601-800 బ్యాండ్కి మారింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌహతి (IIT గౌహతి) మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) ధన్బాద్ ప్రపంచంలోని టాప్ 800 విశ్వవిద్యాలయాలలో స్థానం పొందాయి. ఈ ఇన్స్టిట్యూట్ తమ ర్యాంకింగ్లను 1001-1200 బ్యాండ్ నుండి 601-800కి మెరుగుపరుచుకుంది. జాబితాలో మొదటిసారిగా ప్రవేశించడం ద్వారా, మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జైపూర్ 601-800 బ్యాండ్లోకి ర్యాంక్ చేయబడింది. అయితే అనేక అగ్రశ్రేణి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు).. వరుసగా నాల్గవ సంవత్సరం ర్యాంకింగ్లను బహిష్కరించి ర్యాంకింగ్ల పారదర్శకత, ప్రమాణాలపై సందేహాన్ని వ్యక్తం చేశాయి. ఈ ఇన్స్టిట్యూట్లలో బాంబే, ఢిల్లీ, గౌహతి, కాన్పూర్, ఖరగ్పూర్, మద్రాస్, రూర్కీకి చెందిన ఏడు IITలు ఉన్నాయి. ఐఐటీ గౌహతి గతేడాది ర్యాంకింగ్స్లో చేరడం గమనార్హం. -
ప్రపంచ వారసత్వ జాబితాలోకి శాంతినికేతన్
న్యూఢిల్లీ: నోబెల్ గ్రహీత, విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన పశి్చమ బెంగాల్లోని ప్రఖ్యాత శాంతినికేతన్ విశ్వవిద్యాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కింది. యునెస్కో ఆదివారం ‘ఎక్స్’లో ఈ మేరకు ప్రకటించింది. ‘వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కినందుకు శాంతినికేతన్కు అభినందనలు’అని పేర్కొంది. బీర్భమ్ జిల్లాలోని ఈ చారిత్రక నిర్మాణానికి వారసత్వ గుర్తింపు కోసం భారత్ ఎప్పటినుంచో కృషి చేస్తోంది. ఈ విశ్వవిద్యాలయ నగరి పశి్చమ కోల్కతాకు 160 కి.మీ.ల దూరంలో ఉంది. గీతాంజలి కర్త, విశ్వ కవి రవీంద్రుని తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ దీన్ని మొదట్లో ఒక ఆశ్రమంగా ప్రారంభించారు. కులమతాలతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. శాంతినికేతన్ ప్రాంగణంలో చిన్న విద్యా సంస్థగా రవీంద్రుని ఆధ్వర్యంలో మొదలైన విశ్వభారతి నేడు దేశంలో అతి పెద్ద విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఎదిగింది. హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్, సంగీతం, అగ్రికల్చరల్ సైన్స్, రూరల్ రీ కన్సŠట్రక్షన్ వంటి వాటిలో ఎన్నెన్నో కోర్సులు అందిస్తోంది. దివంగత ప్రధాని ఇందిరా గాం«దీ, మరో నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ వంటి మహామహులు ఎందరో ఈ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులే. -
అమెరికాలో తెలుగు భాషకున్న స్థానం అంత ఇంత కాదు!
అంతర్జాతీయ సంబంధాల కేంద్రం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం,తిరుపతి వారు తానా పూర్వాధ్యక్షులు డా ప్రసాద్ తోటకూర గారితో విద్యార్థినుల ముఖాముఖి కార్యక్రమాన్ని సావేరి సెమినార్ హాల్ లో 2023 సెప్టెంబర్ 4న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య దేపూరు భారతిగారు విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ తానా సంస్థ ముఖ్య లక్ష్యాన్ని, వారు నిర్వహిస్తున్న కార్యకలాపాలను కొనియాడారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకోసం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సంగీత, నృత్య విభాగం వాళ్ళు అధునాతన డిప్లొమా కోర్సులను నడుపుతున్నారని తెలియజేశారు. పదుల సంఖ్యల్లో నుంచి వందల సంఖ్యల్లోకి అడ్మిషన్లు పెరిగాయని తెలుపుతూ భవిష్యత్ కార్యాచరణను డా ప్రసాద్ తోటకూర గారి ముందుంచారు. గౌరవ అతిథి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య నల్లనాగుల రజినీగారు మాట్లాడుతూ అమెరికా నుంచి డా ప్రసాద్ గారు మన విశ్వవిద్యాలయానికి రావడం సంతోషదాయకం అన్నారు. కార్యనిర్వాహకులు అంతర్జాతీయ సంబంధాల కేంద్రం డీన్ ఆచార్య పి విజయలక్ష్మి గారు మాట్లాడుతూ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని, కోర్సులు ప్రారంభంకావడానికి నాంది పలికిన వారు పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య వీరమాచినేని దుర్గాభవాని గారు, డా తోటకూర ప్రసాద్ గారని తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన డా ప్రసాద్ తోటకూర గారు మాట్లాడుతూ.. అగ్రరాజ్యం అమెరికాలో ఉండే ఉద్యోగ అవకాశాల్ని, అక్కడి జీవన విధానాన్ని వివరించారు. అమెరికా గురించి చాలామంది విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తెలుగు భాషకు అక్కడున్న స్థాయిని, స్థానాన్ని తానా సంస్థ ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేశారు. సత్య నాదెండ్ల, సుందర్ పిచాయ్, ఇంద్రనూయి కార్పోరేట్ దిగ్గజాలుగా ఎదిగిన ప్రస్తానాన్ని, పారిశ్రామిక దిగ్గజాలు వారెన్ బఫెట్, బిల్ గేట్స్ లాంటివారు చేస్తున్న ధార్మిక కార్యక్రమాలను సోదాహరణంగా వివరించారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులతో కలిసి తానా ప్రపంచ సాహిత్య వేదిక "సిరివెన్నెల సీతారామశాస్త్రి" గారు సృష్టించిన సాహిత్యం మొత్తాన్ని ఆరు సంపుటాల్లో ముద్రించిన గ్రంథాలను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గ్రంథాలయనికి ప్రసాద్ గారు బహూకరించారు. ఈ కార్యక్రమానికి డా. హిమబిందు ఆహ్వానం పలుకగా, డా. యువశ్రీ వందన సమర్పణ చేశారు. డా శిరీష ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. అంతర్జాతీయ సంబంధాల కేంద్రం ఆచార్యులు, వివిధ విభాగాల ఆచార్యులు, విద్యార్థినులు, బోధనేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమానంతరం డా ప్రసాద్ తోటకూర గారు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి 2016వ సంవత్సరంలో కానుకగా బహూకరించిన మహాత్మా గాంధీ విగ్రహానికి ఆచార్యదేపూరు భారతి గారు, ఆచార్య వీరమాచినేని దుర్గాభవాని గారు, డా ప్రసాద్ తోటకూర గారు, ఆచార్య పి విజయలక్ష్మి గారు పుష్పాంజలి ఘటించారు. (చదవండి: అమెరికాలోని ఓ రహదారికి భారత సంతతి పోలీస్ పేరు!) -
వాస్తవ సంఘటనలే యూనివర్సిటీలో చూపించాం: ఆర్.నారాయణమూర్తి
దేశంలో విద్య, వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలనే అంశంపై తీసిన ఆర్ నారాయణమూర్తి తెరకెక్కించిన సందేశాత్మక చిత్రం యూనివర్సిటీ. ఈ చిత్రానికి నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా వ్యహరించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడారు. మనిషికి విద్య, వైద్యం ఎంతో అవసరమని, ఇవి ప్రైవేట్ రంగంలో ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. యూనివర్సిటీ చిత్రాన్ని విద్యార్థులందరూ ఆదరించాలని ఆయన కోరారు. అక్టోబర్ 4వ తేదీన సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆర్ నారాయణ మూర్తి విద్యార్థులతో మాట్లాడతూ.. 'సినిమాలో పదో తరగతి పేపర్ లీకేజీ దగ్గర నుంచి గ్రూప్స్ పరీక్షల పేపర్ లీకేజీలపై చూపించాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు సాక్షిగా రూ. 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాం. భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల కోటా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. తల్లిదండ్రుల కలలన్నీ ప్రభుత్వాలు కల్లలు చేస్తున్నాయి. సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలను సినిమాను తెరకెక్కించాం. ' అని అన్నారు. -
అభూతకల్పనతో ఈనాడు ఒప్పందం
సాక్షి, అమరావతి: విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో ఈనాడుకు గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది. వర్సిటీల్లో బోధన పోస్టుల నియామకాల అంశం కోర్టులో ఉన్నంత కాలం ఒక్క పోస్టు కూడా ప్రభుత్వం భర్తీ చేయట్లేదని మొసలి కన్నీరు కార్చిన రామోజీ.. ఇప్పుడు ఒప్పంద ఉద్యోగులకు భద్రత లేదంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అభూతకల్పనలు, అవాస్తవాలతో ఒప్పందం చేసుకుని విషపూరిత రాతలతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ఇందులో భాగంగానే ‘ఒప్పంద అధ్యాపకుల ఉద్యోగాలకు జగన్ ఎసరు’ అంటూ అసత్య కథనాన్ని అచ్చేశారు. దీనిని ఉన్నత విద్యామండలి గురువారం ఓ ప్రకటనలో ఖండించింది. 3,295 పోస్టుల భర్తీ ప్రభుత్వం ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. చంద్రబాబు హయాంలో చేసిన తప్పులను సరిదిద్దుతూ బోధన సిబ్బంది నియామకాలు చేపడుతోంది. వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిని జీర్ణించుకోలేని రామోజీరావు ఒప్పంద ఉద్యోగులకు భద్రత కరువైందంటూ ఊహాజనిత వార్తను అచ్చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో 20 వర్సిటీల్లో దాదాపు 3,046 మంది ఒప్పంద అధ్యాపకులు పని చేస్తున్నారు. వీరిలో అత్యధిక శాతం సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రోగ్రామ్లలో ఉన్నారు. వర్సిటీల్లో కొత్తగా చేపడుతున్న అధ్యాపక నియామకాలన్నీ రెగ్యులర్ పోస్టుల్లోనివే. అందువల్ల సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రోగ్రామ్లలో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు ఎటువంటి ఇబ్బందీ లేదు. వెయిటేజీతో భరోసా వర్సిటీల్లో పోస్టుల భర్తీలోనూ ఒప్పంద అధ్యాపకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెయిటేజీ రూపంలో భరోసా కల్పించారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ వెయిటేజితో చాలా మంది ఒప్పంద అధ్యాపకులు రెగ్యులర్గా మారతారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గతంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసింది. అయితే వర్సిటీల్లో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. చాలా వర్సిటీల్లో ఒప్పంద అధ్యాపకులను నియమించేటప్పుడు రిజిర్వేషన్ విధానాన్ని అవలంభించలేదు. రోస్టర్ పద్ధతిని పాటించలేదు.ఏ వర్సిటీ కూడా యూజీసీ నిర్దేశించిన పద్ధతుల్లో ఒప్పంద అధ్యాపకులను నియమించలేదు. కొన్ని వర్సిటీల్లో ఎవరు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు పని చేస్తున్నారు, ఎవరు రెగ్యులర్ పోస్టులకు పని చేస్తున్నారో కూడా తెలియదు. ఆ వ్యత్యాసాన్ని పాటించలేదు. మరీ ముఖ్యంగా ఆర్థిక శాఖ ఆమోదాన్ని పొందలేదు. వీటన్నింటీకి తోడు కోర్టు ఉత్తర్వులు వీరిని రెగ్యులరైజ్ చేయడానికి ప్రతిబంధకాలుగా మారాయి. అంతేగానీ ఎవరికీ అన్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలోని వర్సిటీల్లో పని చేస్తున్న పలువురు ఒప్పంద అధ్యాపకులు రెగ్యులర్ అవుతారు. మిగతా వారు ఇప్పుడున్నట్లుగానే కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతారు. ఎవరి ఉద్యోగాలకూ ఎటువంటి ఇబ్బందీ ఉండదు. పైగా కాంట్రాక్టు ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వెయిటేజీని ప్రస్తావిస్తుంటే వారి ఉద్యోగాలు పోతాయంటూ ఈనాడు దుర్మార్గపు రాతలు రాయడం సిగ్గుచేటు. -
తెలుగు వర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలి
నాంపల్లి (హైదరాబాద్): దేశంలో సంస్కృత, హిందీ, పాశ్చాత్య భాషలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పడినట్లుగా తెలుగు భాషకు కూడా జాతీయ స్థాయిలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పడితే తప్ప తెలుగు భాషా, సంస్కృతిని విస్తృత స్థాయిలో భవిష్యత్ తరాలకు అందించలేమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. శనివారం తెలుగు వర్సిటీ ఎన్టీఆర్ కళా మందిరంలో ఏర్పాటు చేసిన మండలి వెంకటకృష్ణారావు సంస్కృతీ పురస్కార ప్రదానోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగు వర్సిటీ ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. నగర శివార్లలోని బాచుపల్లిలో వందెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కాబోతున్న తెలుగు విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తెలుగు భాషపై మక్కువ కలిగిన, భాషకు ఎనలేని కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్రావు మాట్లాడుతూ... రాష్ట్ర తర తెలుగు సంస్థలకు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాషా సంస్కృతి ఔన్నత్యాన్ని పెంచే సాహిత్యాన్ని అందజేయడమే కాకుండా ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుని తెలుగు భాష, బోధన, పరివ్యాప్తికి కృషి చేస్తున్నదని అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ... శాస్త్రీయ విజ్ఞానం మాతృ భాషలో విద్యార్థులకు అందుబాటులో ఉంచితే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఆత్మియ అతిథిగా హాజరైన మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ... ఉభయ తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వారికన్నా ప్రవాసాంధ్రులకే తెలుగు భాషపై మక్కువ ఎక్కువని అన్నారు. జర్మనీ మాజీ ఎంపీ డాక్టర్ జి.రవీంద్ర కార్యక్రమంలో పాల్గొని తెలుగులో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. అంతర్జాతీయంగా తెలుగు భాషా సంస్కృతి, ఆధ్యాత్మిక వికాసానికి చిరస్మరణీయమైన సేవలందిస్తున్న లండన్లోని యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్తా) సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సత్య ప్రసాద్ కిల్లీకి మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మండలి వెంకటకృష్ణారావు తెలుగు కేంద్రం సంచాలకులు ఆచార్య వై.రెడ్డి శ్యామల సమన్వయకర్తగా వ్యవహరించగా, సంస్థ కో ఆర్డినేటర్ డాక్టర్ విజయ్పాల్ పాత్లోత్ వందన సమర్పణ చేశారు. -
కరిగి, విరిగిన ‘బేబీ’ అగ్ని పర్వతం
అదో కొత్త అగ్ని పర్వతం.. రెండు వారాల కిందే పుట్టింది.. ఇంతలోనే అంతెత్తున పెరిగింది.. లోపలి నుంచి ఉబికివచ్చిన లావా వేడికి అంచులు కరిగి, విరిగి పడింది. లావాను బాంబుల్లా ఎగజల్లింది. ఐస్ల్యాండ్లోని రేక్జానెస్ ద్వీపకల్పం ప్రాంతంలోని ‘బేబీ’ అగ్నిపర్వతం విశేషమిది. అగ్నిపర్వతాలకు నిలయమైన రేక్జానెస్ ప్రాంతంలో గత నెల రోజుల్లో ఏకంగా ఏడు వేల భూప్రకంపనలు వచ్చాయి. రెండు వారాల కింద ఓ చోట అకస్మాత్తుగా సుమారు రెండున్నర కిలోమీటర్ల పొడవున భూమిలో పగుళ్లు వచ్చాయి. అందులో ఓ చోట లావా వెలువడటం మొదలై, మెల్లగా అగ్ని పర్వతంలా ఏర్పడింది. ప్రస్తుతం ‘బేబీ వల్కనో’గా పిలుస్తున్న ఈ అగ్నిపర్వతం.. రెండు రోజుల కింద తీవ్రస్థాయిలో లావా వెలువరించడం మొదలుపెట్టింది. అది తీవ్ర స్థాయికి చేరి ఓ పక్క విరిగి.. లావా నదిలా ప్రవహిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఐస్ల్యాండ్ యూనివర్సిటీ వల్కనాలజీ అండ్ నేచురల్ హజార్డ్స్ పరిశోధకుల బృందం విడుదల చేసింది. -
అందుకే మళ్లీ ‘యూనివర్సిటీ’ని రిలీజ్ చేస్తున్నా: ఆర్. నారాయణమూర్తి
‘‘విద్యార్థులు, నిరుద్యోగుల ఆవేదన, కష్టాలు, వారి తల్లిదండ్రుల కన్నీళ్లను ‘యూనివర్సిటీ’లో చూపించాను. వేసవి, వడగాల్పుల వల్ల ఈ చిత్రాన్ని ప్రేక్షకులు సరిగ్గా చూడలేకపోయారు.. అందుకే మళ్లీ విడుదల చేస్తే జనాలకు బాగా చేరువ అవుతుందని రిలీజ్ చేస్తున్నాను’’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆర్. నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ’ జూన్ 9న విడుదలైంది. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ‘‘పదో తరగతి పేపరు లీకేజీలు, గ్రూప్ 1, 2లాంటి ఉద్యోగ పరీక్ష ప్రశ్నా పత్రాల లీకేజీలు జరుగుతుంటే విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్ ఏం కావాలి? అనే సందేశంతో ఈ సినిమా తీశాను. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాను’’ అన్నారు. -
వడివడిగా ఆక్వా యూనివర్సిటీ నిర్మాణ పనులు
-
అరవై ఏళ్లు.. 239 రకాలు..
సాక్షి, అమరావతి: దేశంలో ప్రతీ ముగ్గురిలో ఒకరు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ పది మందిలో తొమ్మిది మందికి ఈ విశ్వవిద్యాలయం అన్నం పెడుతోంది. అంటే.. ఆ వర్సిటీ అభివృద్ధి చేసిన రకాలనే దేశంలో మూడోవంతు ప్రజలు ఆహారంగా తీసుకుంటున్నారు. అదే మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) ప్రత్యేకత. దేశంలోనే పురాతనమైన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఈ వర్సిటీకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అరవై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఈ వర్సిటీ సాధించిన విజయాలెన్నో.. ఎన్నెన్నో. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి.. రెట్టింపు ఆదాయం లక్ష్యంగా ఏటా పదుల సంఖ్యలో కొత్త వరి రకాలను మార్కెట్లోకి తీసుకొస్తోంది. తెగుళ్లు, కీటకాలు, చీడపీడలు, వాతావరణ స్థితిగతులను తట్టుకునే వంగడాలను అభివృద్ధి చేయడమే కాదు.. సన్నరకాల సృష్టికర్తగా ఖ్యాతి గడించింది. ఫలితంగా దశాబ్దాలుగా వరి వినియోగంలో వర్సిటీ సృష్టించిన రకాలే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. దేశంలో సాగయ్యే వరిలో మూడోవంతు.. దేశంలో వరి సాగవుతున్న 46 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో 14 మిలియన్ హెక్టార్లలో ‘ఆంగ్రూ’ రకాలే సాగవుతున్నాయంటే ఏ స్థాయిలో ఈ వర్సిటీ రైతుల మన్ననలు చూరగొందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. జాతీయ స్థాయి వరి ఉత్పత్తి (131 మిలియన్ టన్నులు)లో 33.15 శాతం (37.76 మిలియన్ టన్నులు) ఈ వర్సిటీ రకాలే కావడం గమనార్హం. సగటు దిగుబడి జాతీయ స్థాయిలో హెక్టార్కు 2,832 కిలోలు.. ఏపీలో హెక్టార్కు 5,048 కిలోలు ఉంటే, ఈ వర్సిటీ రూపొందించిన రకాలు ఏకంగా హెక్టార్కు 5,669 కిలోల దిగుబడినివ్వడమే కాదు జాతీయ స్థాయిలో రూ.62,317 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నాయి. 60 ఏళ్లలో 239 రకాల సృష్టి.. 1964 జూన్ 12న ఏర్పాటైన ఈ వర్సిటీ.. వ్యవసాయ, అనుబంధ రంగాలలో ఉత్పత్తి, ఉత్పాదకత, లాభదాయకతను పెంచడంలో నిరంతరం కృషిచేస్తోంది. 60 ఏళ్లలో 123 అధిక దిగుబడినిచ్చే వరి రకాలతో పాటు 47 రకాల పప్పు ధాన్యాలు, 29 రకాల నూనె గింజలు, 21 రకాల వాణిజ్య పంటలు, 19 రకాల చిరుధాన్యాలను ‘ఆంగ్రూ’ అభివృద్ధి చేసింది. ఈ స్థాయిలో నూతన వంగడాలను అభివృద్ధి చేసిన వర్సిటీ దేశంలో మరొకటి లేదనే చెప్పాలి. వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా, తెగుళ్లు, చీడపీడలు, కీటకాలను ఎదుర్కొనే రకాలను అభివృద్ధి చేయడంలో వర్సిటీ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఈ కోవలో అభివృద్ధి చేసిన ఎంటీయూ 7029 (స్వర్ణ), బీపీటీ 5204 (సాంబా మసూరి) వరి రకాలు జాతీయ స్థాయిలో ప్రజాదరణ పొందాయి. దేశంలోనే మొట్టమొదటి బూజు తెగులు నిరోధక మినుము రకం ఎల్బీజీ 17 (కృష్ణయ్య)తో పాటు ప్రసిద్ధి చెందిన కే6, నారాయణి, లేపాక్షి వంటి వేరుశనగ రకాలు సైతం వర్సిటీ అభివృద్ధి చేసినవే. ఆంగ్రూ రకాలతో రూ.25వేల కోట్ల ఆదాయం.. ♦ ఆంధ్రలో 90.29 శాతం అంటే అక్షరాల 21.78 లక్షల హెక్టార్లలో వర్సిటీ సృష్టించిన వరి రకాలే సాగవుతున్నాయి. ♦ సాగు విస్తీర్ణంలో 72.63 శాతం, ఉత్పత్తిలో 87.27 శాతం వర్సిటీ రకాలే. ♦ పప్పు ధాన్యాల సాగులో 35.63 శాతం, ఉత్పత్తిలో 32.16 శాతం వర్సిటీ రూపొందించినవే.. ♦ వేరుశనగ ఉత్పత్తిలో 94.03 శాతం వర్సిటీ రకాలే. ఒక్క కే6 రకమే 82 శాతం అందిస్తోంది. ♦ నువ్వుల సాగులో కూడా 87.50 శాతం ఆంగ్రూ రకాలదే కావడం విశేషం. ♦ వరి రకాల ద్వారా రూ.20,243 కోట్లు, అపరాల ద్వారా రూ.2,113 కోట్లు, నూనెగింజల ద్వారా రూ.2,862 కోట్లు కలిపి.. మొత్తం రూ.25వేల కోట్లకుపైగా ఆదాయాన్ని రాష్ట్ర రైతులు ఆర్జిస్తున్నారు. ఏటా రూ.8వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం.. ఇక ఎగుమతుల్లో బాస్మతేతర బియ్యం రకాలదే సింహభాగం. వీటిలో మూడోవంతు ‘ఆంగ్రూ’ అభివృద్ధి చేసినవే. ఉదా.. దేశం నుంచి 2021–22లో బియ్యం ఎగుమతుల ద్వారా రూ.46,914.28 కోట్ల విదేశీ మారక ద్రవ్యం దేశానికి వచ్చింది. ఈ బియ్యం ఎగుమతుల్లో 33 శాతం (రూ.15,481.71కోట్లు) ఆంగ్రూ అభివృద్ధి చేసిన రకాలకు చెందిన బియ్యమే. అలాగే, మిగతా కాలంలో ఏటా ఆంగ్రూ రకాల బియ్యం ఎగుమతి ద్వారా సగటున రూ.8,073 కోట్ల ఆదాయం సమకూరుతోందంటే ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో స్పష్టమవుతోంది. 12న మెగా సీడ్ మేళా.. వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 12న గుంటూరు లాంలోని వర్సిటీ ప్రాంగణంలో ‘మన రైతు కోసం మన నాణ్యమైన విత్తనం’ అనే నినాదంతో విత్తన మహోత్సవం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సాగయ్యే, వర్సిటీ అభివృద్ధి చేసిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించిన విత్తనాలను ప్రదర్శన, అమ్మకానికి ఉంచుతూ రైతు మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పెట్టుబడికి ఢోకాలేదు ఆంగ్రూ అభివృద్ధి చేసిన వివిధ రకాల సాగుతో పెట్టుబడికి ఢోకాలేదని నిరూపితమైంది. ఇటీవలే ఆంగ్రూ రకాల రాబడి–ఖర్చులను విశ్లేíÙంచాం. ఖరీఫ్ కంటే రబీలో నికర రాబడులు ఎక్కువగా ఉన్నాయి. సాగుకోసం రైతులు ఖర్చుచేసే ప్రతీ రూ.100కు, వరికి రూ.103, మినుముకి రూ.132, కందికి రూ.133, మిరపకి రూ.160, శనగకి రూ.102, వేరుశనగకి రూ. 124ల చొప్పున ఆదాయం వస్తోందని గుర్తించాం. – డాక్టర్ జి. రఘునాథరెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ పరిశోధనా స్థానం, లాం సీజన్ ఏదైనా మన రకాలదే ఆధిపత్యం.. ప్రధాన పంటలలో అధిక దిగుబడినిచ్చే రకాలను అభివృద్ధి చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో విడుదల చేయడంలో ‘ఆంగ్రూ’ ముఖ్యపాత్ర పోషిస్తోంది. ‘ఆంగ్రూ’ వరి రకాలు హెక్టారుకు 5,669 కిలోల దిగుబడిని సాధిస్తుండగా, ఇది రాష్ట్ర సగటు దిగుబడి (హెక్టారుకు 5,048 కిలోలు) కంటే ఎక్కువ. వరిలోనే కాదు అపరాలు, నూనె గింజల సాగులో కూడా ఆంగ్రూ రకాలదే సింహభాగం. దాదాపు రెండు సీజన్లలోనూ వర్సిటీ రకాలకున్న డిమాండ్ ఇతర రకాలకు లేదనే చెప్పాలి. – డాక్టర్ ఎల్. ప్రశాంతి, పరిశోధనా సంచాలకులు ఏటా రూ.2,967 కోట్ల లాభాలు.. జాతీయ స్థాయి వరి ఉత్పత్తిలో మూడో వంతు ఆంగ్రూ రకాలదే. అలాగే, జాతీయ స్థాయిలో 40 శాతం మంది రైతులు ఈ రకాలనే సాగు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతీ రైతు ఈ వర్సిటీ రకాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఏటా వరితో పాటు ఇతర పంటల్లో కూడా పెద్ద సంఖ్యలో కొత్త వంగడాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. సంప్రదాయ వరి రకాల కంటే ఆంగ్రూ రకాల సాగువలన ఏటా రూ.2,967 కోట్ల లాభాలను రైతులు ఆర్జిస్తున్నారు. – డాక్టర్ ఆదాల విష్ణువర్థన్రెడ్డి, వైస్ చాన్సలర్ -
ఆ మాటలే నాకు దీవెనలు
‘‘సమాజంలో బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను చర్చించడానికి ఎన్నో వేదికలు ఉన్నాయి. ఒక సినిమా కళాకారుడిగా వెండితెర వేదికగా ఆ సమస్యలు చూపిస్తున్నాను’’ అని అన్నారు దర్శక–నిర్మాత–నటుడు ఆర్. నారాయణమూర్తి. ఆయన స్వీయదర్శకత్వంలో రూపొందించి, నటించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు ఈ విధంగా... ► సమాజంలో ఉన్న సమస్యలతోనే 40 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నారు... రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు తీస్తే సేఫ్ కదా? సేఫ్టీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నా వంతుగా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడే సినిమా ఇవ్వాలన్నదే నా ఆశయం. అనాదిగా మంచి కోసం, సమసమాజం కోసం ఎందరో మహనీయులు వారివారి వేదికల్లో కృషి చేస్తూనే ఉన్నారు. అదే కోవలో నేను సినిమా వేదికగా ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నాను. ఒక సమస్య ఉత్పన్నం అయినప్పుడు జర్నలిస్టు తన కలంతో, వాగ్గేయకారుడు పాటతో, రచయిత తన రచనలతో పరిష్కారం కోసం పోరాడతారు. అలాగే ఒక సినిమా సాంస్కృతిక సైనికుడిగా 40 ఏళ్లుగా సామాజిక సమస్యలే ఇతివృత్తంగా సినిమాలు తీస్తున్నాను. ఇందులోనే నాకు సంతృప్తి, ఆనందం దక్కుతున్నాయి. శ్రీశ్రీ చెప్పినట్లు నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అనేలా సామాజిక అంశాలపైన సినిమాలు తీస్తున్నాను తప్ప నేనేదో సమాజాన్ని ఉద్ధరించడం కోసం తీస్తున్నానని అనుకోవడంలేదు. గూడవల్లి రామబ్రహ్మంవంటి మహనీయులు సామాజిక అంశాలతో సినిమాలను రూపొందించి లెజెండ్స్గా నిలిచారు. వారి అడుగుజాడల్లో నడుస్తున్న చిన్నపిల్లవాడిని నేను. ► ‘యూనివర్సిటీ’ సినిమా గురించి? విద్య, నిరుద్యోగం ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని రూపొందించాను. ప్రైవేటు విద్య వద్దు, పబ్లిక్ విద్యే ముద్దు అనే అంశంతో తీశాను. ప్రస్తుతం ప్రైవేటు విద్యా వ్యవస్థ వల్ల చదువు వ్యాపారంగా మారిపోయింది. ఈ వ్యవస్థలో ఫస్ట్ ర్యాంకులు సాధించాలని పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్లు పెరిగిపోయాయి. దీనివల్ల బాగా చదివిన విద్యార్థులు వెనకబడిపోతున్నారు. ఇవి భరించలేక ఆ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా క్యాంపస్ వేదికల్లోనిప్రొఫెసర్లు కూడా కులాలకు, మతాలకు ప్రాధాన్యతనిస్తూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఇలాంటి అసమానతలు పోవాలంటే కొఠారీ కమిషన్ పేర్కొన్నట్టు ప్రభుత్వ విద్యకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి, ప్రైవేటు సంస్థల్లోని వసతులు ఇక్కడ కూడా అందేలా చూడాలి. ఈ అంశాలు ప్రతిబింబించేలా ఈ సినిమా తీశాను. ► విద్య గురించి మాత్రమేనా? ఇతర విషయాలేమైనా ఈ సినిమాలో చె΄్పారా? ఉద్యోగాల గురించి కూడా చర్చించాను. అతి పెద్ద గ్లోబల్ విలేజ్ అయినటువంటి భారత్ నుంచి ఎందరో విద్యార్థులు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్నారు. కానీ అక్కడ కూడా నిరుద్యోగం పెరిగిపోయి మనవారికి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ రాజ్యాంగ హక్కు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అవన్నీ కోల్పోతున్నారు. అందుకే 1986లో మురళీధర్ రావు కమిషన్, 1990లో మండల్ కమిషన్ తెలిపిన రిపోర్టు ప్రకారం ప్రైవేటు సెక్టార్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరముంది. మనది నిరుద్యోగ భారతం కాదు... ఉద్యోగ భారతం కావాలని చెప్పే చిత్రం ఇది. ► తెలుగు భాషకు ్రపాధాన్యం ఇచ్చే మీరు ఈ చిత్రంలో రెండు ఇంగ్లిష్ పాటలు పెట్టారు? ‘ఎవిరీ బడీ సే నో టు ప్రైవేట్ స్కూల్స్.. ఎవిరీ బడీ సే యస్ టు పబ్లిక్ స్కూల్స్.. ఎవిరీ బడీ వాంట్స్ కామన్ ఎడ్యుకేషన్’ అనే మహోన్నత ఆశయంతో వేల్పుల నారాయణగారు గొప్ప పాట రాశారు. ఈ పాటను సాయిచరణ్ అంతే గొప్పగా పాడారు. ఇంకో ఇంగ్లిష్ పాటను జలదంకి సుధాకర్ రాయగా, సాయిచరణ్ పాడారు. ఈ రెండు ఇంగ్లిష్ పాటలతో పాటు ‘తాత. తాత..’ అని గద్దరన్న రాసి, పాడిన పాట, ఇతర పాటలు కూడా సందర్భానుసారం సాగుతాయి. ► ప్రజా సమస్యలతో సినిమాలు తీస్తున్న మీ గురించి ప్రజలు నాలుగు మంచి మాటలు మాట్లాడినప్పుడు కలిగే అనుభూతి.. నారాయణమూర్తి మన సమస్యలు తీస్తున్నాడు.. మన కథలను చూపిస్తున్నాడు.. ఒక కళాకారుడుగా మన గుండెల్లోని బాధను సినిమాలో చూపించాడు... పరిష్కారం మార్గం చూపిస్తున్నాడు. అతను మన మనిషి. ప్రజా కళాకారుడు అని ప్రజలు అంటున్న ఆ మాటలను పెద్ద దీవెనలుగా భావిస్తున్నాను. ఏ కథాంశం అయినా ఆకట్టుకుంటేనే అభిమానులు చూస్తారు. ‘అర్ధరాత్రి స్వతంత్రం’ నుంచి ఇప్పటివరకు సామాజిక సమస్యలే ప్రధానాంశాలుగా సినిమాలు తీస్తున్నాను. ప్రజలు దీవిస్తే అదే నా సంపాదన. నా సినిమాలు వంద రోజులు, జూబ్లీ వేడుకలు చేసుకున్నాయి. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సినిమాలు తీస్తూనే ఉంటాను. -
నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి?
ఆర్.నారాయణ మూర్తి ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. స్నేహచిత్ర పిక్చర్స్ బ్యానర్పై రూపొందిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. జూన్ 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘10వ తరగతిలో పేపరు లీకేజీలు.. గ్రూప్ 1, 2లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరు లీకేజీలు జరుగుతున్నాయి. ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి?. కుంభ కోణాలు చేసే వారి వల్ల విద్యావ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ నిర్వీర్యం కావాలా?. మనది నిరుద్యోగ భారతం కాదు.. ఉద్యోగ భారతం కావాలని చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాబూరావు దాస్, కథ–స్క్రీన్ ప్లే–మాటలు– సంగీతం– దర్శకత్వం– నిర్మాత: ఆర్. నారాయణ మూర్తి. -
విద్య.. వైద్యాన్ని జాతీయం చేయాలి: ఆర్. నారాయణ మూర్తి
‘‘పేపర్ లీకేజ్ వ్యవహారాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కూడా జరిగాయి. ఇలాగైతే నిరుద్యోగులు ఏమైపోవాలి? అందుకే విద్య, వైద్యాన్ని జాతీయం చేయాలని చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అన్నారు ఆర్. నారాయణ మూర్తి. స్నేహచిత్ర పిక్చర్స్పై ఆర్. నారాయణ మూర్తి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ నెల 26న ఈ చిత్రం రిలీజ్ కానుంది. (చదవండి: ఆఖరి రోజుల్లో దయనీయ స్థితిలో కమెడియన్.. వీడియో వైరల్) ఈ సందర్భంగా ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘భారత దేశంలో చాలా చోట్ల పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి.. దీన్ని జాతీయ సమస్యగా పరిగణించాలని రాష్ట్రపతి, ప్రధానిగార్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ చిత్రంలోని ఐదు పాటలు ఆలోచింపజేసేలా ఉంటాయి’’ అన్నారు. ‘యూనివర్సిటీ’ ప్రదర్శనకు హాజరైన పలువురు జర్నలిస్టులు ఇది అందరూ చూడాల్సిన సినిమా అన్నారు. ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రముఖుల్లో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రొఫెసర్స్ లక్ష్మీ నారాయణ, కోయి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
మేడం మీరు మోడ్రన్ డ్రెస్లో బాగుంటారు.. వర్సిటీ డీన్ వేధింపులు..
దేశంలో మహిళలు, యువతులపై ఏదో ఒక చోట.. వేధింపులు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. పనిచేసేచోట, ప్రయాణ సమయాల్లో మహిళలు వేధింపులకు గురువుతూనే ఉన్నారు. తాజాగా ఓ డిపార్ట్మెంట్ డీన్.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్కు వేధింపులకు గురిచేశాడు. విదేశీ దుస్తుల్లో నువ్వు అందంగా ఉంటావ్ అంటూ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ షాకింగ్ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గురుగ్రామ్ యూనివర్సిటీలో ఫార్మాస్యూటికల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ డీన్ ధీరేంద్ర కౌశిక్ పనిచేస్తున్నారు. అదే వర్సిటీలో ఓ మహిళ.. అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తన్నారు. ఈ క్రమంలో డీన్ ధీరేంద్ర.. ఆమెపై కన్నేసి అనుచితంగా ప్రవర్తించాడు. శారీరకంగా వేధింపులకు గురిచేశాడు. ఇటీవల ధీరేంద్ర.. ఆమెతో మాట్లాడుతూ.. మీరు మోడ్రన్ దుస్తుల్లో చాలా అందంగా కనిపిస్తారు. మీ భర్త లేనప్పుడు నన్ను హోట్ల్లో కలవండి అంటూ కామెంట్స్ చేశాడు. అలాగే, పలు సందర్భాల్లో ఆమె ప్రైవేటు భాగాలను తాకే ప్రయత్నం చేశాడు. దీంతో, ఆమె.. తనతో ఇలా ప్రవర్తించవద్దని ధీరేంద్రను కోరింది. అనంతరం.. ఈ విషయాలపై వీసీకి ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఆయన నిరాకరించడం గమనార్హం. ఇలా, ధీరేంద్ర.. ఆమెను వేధింపులకు గురిచేయడం పీక్ స్టేజ్కు చేరుకుంది. ఏప్రిల్ 28వ తేదీన యూనివర్సిటీ ఆవరణలోని ఒక గదిలో తనను వేధించడంతో ఆమె.. పోలీసులను ఆశ్రయించింది. ఆమె.. గురుగ్రామ్లోని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. కాగా, ఫిర్యాదు సమయంలో తనపై జరిగిన వేధింపులను వీసీ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిద్దరి మధ్య ఉన్న కొన్ని సంబంధాల కారణంగా వీసీ పట్టించుకోలేదని తెలిపారు. ఇది కూడా చదవండి: థాయ్లాండ్లో చికోటి ప్రవీణ్ అరెస్ట్.. -
పేపరు లీకేజీ.. విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి?: ఆర్. నారాయణ మూర్తి
‘‘పదో తరగతి పరీక్ష ప్రశ్నా ప్రతాల లీకేజీ, గ్రూపు 1, 2 వంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరు లీకేజీ... ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి? అనే కథాంశంతో ‘యూనివర్సిటీ’ చిత్రం తీశాను’’ అన్నారు ఆర్. నారాయణ మూర్తి. ఆయన లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘యూనివర్సిటీ’. ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. (చదవండి: ఎందుకంత ఓవరాక్షన్?.. సమంతపై నెటిజన్స్ కామెంట్స్ వైరల్!) ఈ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘పాలకుల నిర్లక్ష్యంతో విద్యార్థులు, నిరుద్యోగులు రెక్కలు తెగిన పావురాల్లా నిస్సహాయ స్థితిలో ఇబ్బందులు పడుతున్నారు. కొందరి వల్ల విద్యా వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ నిర్వీర్యం కావాలా? కాకూడదు. మనది నిరుద్యోగ భారతం కాదు.. ఉద్యోగ భారతం కావాలని చాటి చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’. అతి త్వరలో ఆడియో రిలీజ్ చేసి, త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కథ–్రస్కీన్ ప్లే–మాటలు–సంగీతం–దర్శకత్వం–నిర్మాత: ఆర్. నారాయణ మూర్తి, కెమెరా: బాబూరావు. -
యూనివర్సిటీ: పేపర్ లీకేజీ.. నిరుద్యోగుల భవిష్యత్తు ఏమైపోతుంది?
‘‘డిగ్రీ పట్టాలు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలుగా కాలేజీలు ఉండకూడదు. విద్యార్థులకు జ్ఞానసందను పంచాలి.. విలువలను కాపాడాలి. రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కు, పని హక్కు నిర్వీర్యం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అన్నారు దర్శకనిర్మాత, నటుడు ఆర్.నారాయణ మూర్తి. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై ఆయన నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తాజా చిత్రం ‘యూనివర్సిటీ’. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘యువత జాతి సంపద. వారిని మనం కాపాడుకోవాలి. వారి మేధస్సు దేశ భవిష్యత్తుకు ఉపయోగపడాలి. కానీ పేపర్ లీకేజీ వల్ల యువత తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. పేపర్ లీకేజీ అనే అంశం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా గమనిస్తూనే ఉన్నాం. పేపర్ లీకేజీల వల్ల విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతుంది. విద్యార్థులు, ప్రభుత్వ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగుల భవిష్యత్తు ఏమైపోతుంది? అనే అంశాల ఇతివృత్తంగా ‘యూనివర్సిటీ’ సినిమా తీశాం. విద్య, వైద్య, విమానయానం, బ్యాంకింగ్, రైల్వేస్ వంటి రంగాల్లో ప్రైవేటీకరణ జరుగుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. వీటి వల్ల మైనార్టీలు, బడుగు, బలహీన వర్గాల వారు రిజర్వేషన్లు కోల్పోయి, ఉపాధి దక్కని పరిస్థితులు ఉండొచ్చు. ఆ అంశాలను కూడా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం’’ అని పేర్కొన్నారు. -
కాల్పుల భయంలో అమెరికా..హడావిడి చేసిన యూనివర్సిటీ
అమెరికాలో గతేడాది నుంచి వరుస కాల్పుల ఘటనలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ప్రజలు దుండగులు కాల్పుల భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక యూనివర్సిటీ సైతం కాల్పులు జరిగే అవకాశం ఉందంటూ హడావిడి చేసింది. అందుకోసం యూనివర్సిటీ ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించి ట్విట్టర్ వేదికగా విద్యార్థులను అప్రమత్తం చేసింది కూడా. ఈ అనూహ్య ఘటన అమెరికాలోని నార్మన్లో ఉన్న ఓక్లహోమ్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఓక్లహోమ్ యూనివర్సిటీలో ఓ సాయుధుడు కాల్పులు జరుపుతున్నాడని విద్యార్థులను అప్రమత్తంగా ఉండండి అంటూ యూనివర్సటీ అధికారులు ట్విట్టర్ వేదికగా సర్క్యూలర్ జారీ చేశారు. అత్యవసర పరిస్థితని కూడా ప్రకటించింది. పైగా క్యాంపస్లో విద్యార్థులు ఉంటే పరిగెత్తండి, దాక్కోండి లేదా ఆత్మరక్షణ కోసం ఫైట్ చేయండి అంటూ ట్వీట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యూనివర్సిటీ మొత్తం సోదా చేయగా.. అలాంటిదేమీ లేదని తేలింది. వెంటనే యూనివర్సిటీ అధికారులు క్యాంపస్కి ఎలాంటి ముప్పు లేదంటూ ఆ హెచ్చరికను కూడా రద్దు చేసింది. ఇటీవలే నాషేవిల్లే పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులతో సహా ఒక ఉపాద్యాయుడు మృతి చెందిన కొద్దిరోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. గత కొంతకాలంగా కళాశాల, పాఠశాలల్లోనే కాల్పులు చోటు చేసుకోవడంతో ఈ తుపాకీ హింసతో అమెరికా వాసులు బెంబేలెత్తిపోతున్నట్లు తెలుస్తోంది. OU-NORMAN Critical 10:53pm: OUPD has issued an ALL CLEAR. After a thorough search, no threat was found. There is no threat to campus. Alert has been canceled. — Univ. of Oklahoma (@UofOklahoma) April 8, 2023 (చదవండి: పాక్ 2026 నాటికి చైనా, సౌదీ అరేబియాలకు రూ. 63 వేల కోట్లు చెల్లించాలి) -
కాకతీయ మెడికల్ కాలేజీలో రీసెర్చ్ యూనిట్ ఏర్పాటు
ఎంజీఎం: వరంగల్ నగరంలోని కాకతీయ ప్రభుత్వ మెడికల్ కళాశాల (కేఎంసీ) మరో మైలురాయిని అధిగమించింది. 15 రోజుల క్రితం రీజినల్ శిక్షణ కేంద్రం ప్రారంభానికి అనుమతులు రాగా, వారంరోజుల క్రితం సూపర్ స్పెషాలిటీ సీట్లు సాధించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా రీసెర్చ్ యూనిట్ ప్రారంభానికి కేంద్రంనుంచి అనుమతులు వచ్చా యి. పదిహేను రోజుల వ్యవధిలో మూడు ప్రత్యేకతలను సాధించుకోవడంతో కేఎంసీ అధికారులు, సిబ్బందిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాకతీయ మెడికల్ కాలేజీకి 2007లో రీసెర్చ్ యూ నిట్ మంజూరు చేయాలని అప్పటి ప్రిన్సిపల్ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఆ తరువాత విషయం మరుగునపడింది. ఏడాదిన్నర కాలం నుంచి కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్దాస్ రీసెర్చ్ యూనిట్ మంజూరు కోసం చేసిన విన్నపం ఎట్టకేలకు ఫలించింది. కేంద్రప్రభుత్వం రూ.1.25 కోట్ల నిధులు మంజూరు చేసి రీసెర్చ్ సెంటర్ నెలకొల్పడానికి అనుమతినిస్తూ గురువారం కాలేజీకి ఉత్తర్వులు అందజేసింది. ఢిల్లీలోని ఐసీఎంఆర్ పథకంలో భాగంగా కేంద్రం ప్రభుత్వం ఈ రీసెర్చ్ యూనిట్లను దేశవ్యాప్తంగా ఐదు మంజూరు చేయగా అందులో ఒకటి సిద్దిపేట మెడికల్ కళాశాలకు, మరోటి వరంగల్ కేఎంసీకి దక్కింది. 15 రోజుల వ్యవధిలో రెండు ప్రత్యేక అనుమతులు కాకతీయ మెడికల్ కళాశాలలో నెల్స్ (నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్టు) పథకంలో భాగంగా నెలరోజుల్లో రీజినల్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడానికి పూర్తిస్థాయి అనుమతులు లభించి 15 రోజులు గడవకముందే రీసెర్చ్ సెంటర్ మంజూరుపై వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్స్ శిక్షణ కేంద్రం ప్రస్తుతం ఒక్క ఉస్మానియా మెడికల్ కళాశాలలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి శిక్షణ కేంద్రాన్ని వరంగల్లోనే ప్రారంభించాలని సంకల్పించి రూ.1.50 కోట్ల పరికరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి కేఎంసీకి చేర్చింది. అంతేకాకుండా ఎమర్జెన్సీ సమయంలో ప్రాణాలు కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై వైద్యసిబ్బంది, వైద్యులకు అందించే ఈ శిక్షణ కార్యక్రమాలపై 16మంది ప్రొఫెసర్ స్థాయి వైద్యులకు తర్ఫీదు ఇచ్చారు. ఈ శిక్షణ కేంద్రం అందుబాటులోకి వస్తే అకస్మికంగా కుప్పకూలే వారిని కాపాడేందుకు శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వైద్యులు జరిపే పరిశోధలకు పూర్తిస్థాయిలో సహకరించే విధంగా రీసెర్చ్ కేంద్రాన్ని సైతం కేఎంసీకి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి వైద్యవిద్యార్థుల విద్యబోధనలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. కాగా, వారం రోజులక్రితం ఐదు సూపర్స్పెషాలిటీ సీట్లు, ఐదు ఎమర్జెన్సీ మెడిసిన్ సీట్లు సాధించకోవడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఏడాదిన్నర కృషి ఫలితం ఎట్టకేలకు కేఎంసీకి రీసెర్చ్ సెంటర్ మంజూరైంది. ఇక్కడ రీసెర్చ్ యూనిట్ ఏర్పాటుకు 2007లో ఐసీఎంఆర్కు అప్పటి ప్రిన్సిపాల్ దరఖాస్తు చేశారు. కొన్ని కారణాల వల్ల దానిని తిరస్కరించారు. 2021 జూన్ నెలలో కేఎంసీ బోధన సిబ్బందితో సైంటిఫిక్ కమిటీ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం అడిగిన అన్ని రకాల నివేదికలను సమర్పించాం. వాటిని పరిశీలించిన కేంద్రం రూ.1.25 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.కోటితో రీసెర్చ్ యూనిట్ సంబంధించిన పరికరాలు, రూ.25 లక్షలతో సివి ల్ పనులు చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఈ రీసెర్చ్ యూనిట్ ఏర్పాటుతో కేఎంసీ, ఎంజీఎంలోని వైద్యులు, వైద్యసిబ్బందికి వివిధ కోర్సుల్లో పరిశోధనలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. – మోహన్దాస్, కేఎంసీ ప్రిన్సిపాల్ -
తక్కువ ధరకే ఎలక్ట్రిక్ సైకిల్: సింగిల్ ఛార్జ్తో..
భారతదేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ కారణంగానే వాహన వినియోగదారులు ప్రత్యామ్నాయ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్, CNG వాహనాలు దేశీయ విఫణిలో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం బస్సులు, కార్లు, బైకులు మాత్రమే కాకుండా.. సైకిల్స్ కూడా ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదలవుతున్నాయి. ఇటీవల రాజస్థాన్ ఉదయపూర్ నగరంలోని మహారాణా ప్రతాప్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఒక ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసింది. ఇది సింగిల్ ఛార్జ్తో గరిష్టంగా 45 కిమీ రేంజ్ అందిస్తుంది. సుమారు 160 కేజీల బరువును మోయగల సామర్థ్యం ఉన్న ఈ ఎలక్ట్రిక్ సైకిల్ నిత్యజీవితంలో రోజువారీ ఉపయోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది కేవలం 30 నిముషాల్లో ఛార్జ్ చేసుకోగలదు. ఈ విషయాన్ని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ హెడ్ డాక్టర్ విక్రమాదిత్య దవే వెల్లడించారు. (ఇదీ చదవండి: 1964లో అంబాసిడర్ ధర అంతేనా? వైరల్ అవుతున్న ఫోటోలు!) ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గేర్, పెడల్ సిస్టమ్ రెండింటినీ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ప్యానెల్ ప్లేట్, లైట్, హార్న్ వంటివి కూడా అమర్చారు. పాత సైకిల్ని ఇలాంటి కొత్త సైకిల్ మాదిరిగా మార్చడానికి రూ. 18,000, కొత్త సైకిల్ కావాలంటే రూ. 30,000 నుంచి రూ. 35,000 ఖర్చవుతుందని డాక్టర్ విక్రమాదిత్య తెలిపారు. ఈ సైకిల్ కావాలనుకునే వారు కాలేజీని సంప్రదించి తీసుకోవచ్చని కూడా వెల్లడించారు. -
శ్రీ విద్యానికేతన్ 31వ వార్షికోత్సవ వేడుకలు.. హాజరైన మంచు ఫ్యామిలీ
-
నారాయణ మూర్తి ప్రజా దర్శకుడు
‘‘ఇండస్ట్రీలో కళా దర్శకులు, వ్యాపారాత్మక దర్శకులు ఉన్నారు. కానీ, ప్రజా దర్శకుడు అంటే ఆర్. నారాయణ మూర్తి ఒక్కరే. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పాటు పడే వ్యక్తి ఆయన’’ అన్నారు ప్రముఖ నటుడు బ్రహ్మానందం. ఆర్. నారాయణ మూర్తి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ సినిమా టైటిల్ లోగోని బ్రహ్మానందం రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘ఎడ్యుకేషన్ మాఫియా, విద్యా వ్యవస్థ లోని లోపాలతో నారాయణ మూర్తిగారు తీసిన ఈ చిత్రాన్ని ఆదరించాలని ప్రేక్షకులను, నా ఫ్యాన్స్ని కోరుతున్నాను’’ అన్నారు. ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘వైజాగ్ సత్యానంద్ గారి శిష్యులు ఈ సినిమాలో నటించారు. భారతదేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో ‘యూనివర్సిటీ’ తీశాను. విద్య, వైద్యం ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలి. విజయనగరం పార్లకిమిడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాను.. నాకు సహకరించిన మంత్రి బొత్స సత్యనారాయణగారికి, ఇతరులకు థ్యాంక్స్’’ అన్నారు. -
అదిరిపోయే ఫీచర్లతో.. వారి కోసం ప్రత్యేక స్మార్ట్ వాచ్!
అంధుల కోసం ఓ ప్రత్యేక స్మార్ట్ వాచ్(Smart Watch)ను తయారు చేశారు. దృష్టిలోపం ఉన్నవారి కోసం ఆధునిక టెక్నాలజీతో ఓ స్మార్ట్ వాచ్ను కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. వీటిని పెద్ద మొత్తంలో తయారీతో పాటు విక్రయించేందుకు యాంబ్రేన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఐఐటీ కాన్పూర్ జతకట్టింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్లలో లోపాలను సరిచేసి యూజర్లకు మెరుగైన అనుభూతిని ఇచ్చేందుకు హాప్టిక్ వాచ్ను రూపొందించినట్లు ఐఐటీ కాన్పూర్ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో టాక్టిల్, టాకింగ్, వైబ్రేషన్, బ్రెయిలీ ఆధారిత వాచ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో అనేక లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను అధిగమిస్తూ ఈ స్మార్ట్ వాచ్ రాబోతోంది. యాంబ్రేన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి త్వరలో ఈ స్మార్ట్ వాచ్ను లాంచ్ చేయనున్నట్లు ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అభయ్ కరందికర్ తెలిపారు. ఇందులో ఏ ఫీచర్లు ఉన్నాయంటే! ఈ హాప్టిక్ స్మార్ట్ వాచ్ రెండు వేరియంట్లలో రానుంది. ఇందులో డయల్ఫ్రీ ఆప్షన్తోపాటు 12 టచ్-సెన్సిటివ్ హవర్ మార్కర్స్ ఉంటాయి. వాచ్ను ధరించిన వారు ఈ మార్కర్స్పై ఫింగర్ను స్కాన్ చేయడం ద్వారా టైమ్ తెలుసుకోవచ్చు. ఈ వాచ్.. టాక్టిల్, వైబ్రేషన్ వాచ్ల సమ్మిళతంగా ఉంటుంది. అయితే వైబ్రేషన్ వాచ్లలో 20పైగా ఉండే వైబ్రేషన్ పల్సెస్ను ఈ వాచ్లో 2 పల్సెస్కు తగ్గించారు. టాక్టిల్ వాచ్కు ఉండే సులువుగా విరిగిపోయే స్వభావం ఇందులో ఉండదు. వీటితోపాటు హార్ట్ రేట్, స్టెప్ కౌంట్, హైడ్రేషన్ రిమైండర్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. అంధుల కోసం ప్రస్తుతం ఉన్న స్మార్ట్ వాచ్లు ఆడియో ఆధారిత అవుట్పుట్తో పనిచేసేవి కావడం వల్ల వాటిని ధరించిన వారి ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉంది. ఈ ఇబ్బంది లేకుండా ఐఐటీ కాన్పూర్ ఈ హాప్టిక్ స్మార్ట్వాచ్ను రూపొందించింది. చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. మార్పులు రానున్నాయ్, నిమిషానికి 2 లక్షల టికెట్లు! -
రోజుకు 24 గంటలు కదా! కానీ, అప్పట్లో 19 గంటలే! ఆసక్తికర అధ్యయనం
ఎంతకూ రోజు గడవడం లేదని ఎప్పుడైనా అనిపించిందా? ఒంటరిగా ఉన్నప్పుడో.. చేసేందుకు పనేమీ లేకపోయినప్పుడో... 24 గంటలు గడిచేదెప్పుడబ్బా అని ఒక్కసారైనా అనిపించి ఉంటుంది! మరి రోజులో కేవలం 19 గంటలే ఉంటే? అదెలా అంటారా? అయితే కచ్చితంగా ఇది చదవాల్సిందే... భూమ్మీద రోజు నిడివి ఎన్నడూ స్థిరంగా లేదట. కోటానుకోట్ల ఏళ్ల కింద ఇప్పటి కంటే కనీసం ఆరు గంటలు తక్కువగా ఉండేదట! అంటే అప్పట్లో భూ భ్రమణానికి, అంటే తన చుట్టు తాను ఒకసారి తిరిగేందుకు 19 గంటలు మాత్రమే పట్టేదని చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనపూర్వకంగా చెబుతున్నారు. మరిప్పుడు రోజుకు 24 గంటలు ఎందుకైనట్టు? భూమి నిర్మాణం గురించి కొంచెం తెలుసుకుంటే దీనికి సమాధానమూ తెలుస్తుంది. భూమి ఉల్లిపాయ మాదిరిగా పొరలుగా ఉంటుందని, ఈ పొరల సంఖ్య నాలుగని చిన్నప్పుడే చదువుకున్నాం. మనముండేది క్రస్ట్ అని పిలిచే పై పొరలో. దీనికింద మాంటెల్, ఔటర్ కోర్, చివరగా భూమి మధ్య భాగంలో ఇన్నర్ కోర్ ఉంటాయి. ఇన్నర్ కోర్ సుమారు 1,220 కిలోమీటర్ల పొడవుంటుంది. ఇది దాదాపుగా ఘనస్థితిలో ఉన్న ఇనుప ముద్ద. ఇది తిరిగే వేగం, పద్ధతుల్లో వచ్చే తేడాలను బట్టి రోజు తాలూకు నిడివిలోనూ హెచ్చుతగ్గులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్నర్ కోర్పైన ద్రవ స్థితిలో ఉండే ఔటర్ కోర్ ఉంటుంది. ఇది సృష్టించే అయస్కాంత క్షేత్రాన్ని బట్టి ఇన్నర్ కోర్ వేగం, దిశ ఆధారపడి ఉంటాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే కోట్ల ఏళ్లుగా ఇన్నర్ కోర్ దిశ, వేగం తగ్గుతూ వస్తున్నాయి. దీని ప్రభావం వల్ల రోజు నిడివీ పెరుగుతూ వస్తోంది. ఆ లెక్కన 140 కోట్ల ఏళ్ల క్రితం భూ భ్రమణానికి 19 గంటలే పట్టేదని అంచనా. అధ్యయనం చేసిందిలా... భూమి లోపలి పొరలన్నీ వేటికవే వేర్వేరు దిశ, వేగాల్లో తిరుగుతూంటాయి. కొన్ని కదలికలు అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరిస్తే ఇంకొన్ని పొరల గురుత్వాకర్షణ శక్తి ఆ క్షేత్ర ప్రభావాన్ని తగ్గిస్తూంటుంది. కచ్చితంగా ఎలా జరుగుతుందో తెలుసుకోవడం కష్టం కాబట్టి శాస్త్రవేత్తలు పరోక్ష పద్ధతుల ద్వారా భూమి లోపలి పొరల్లో ఏం జరుగుతోందో పరిశీలిస్తూంటారు. భూకంప తరంగాలు అన్ని పొరల ద్వారా ప్రయాణించగలవు. పొర మారినప్పుడల్లా వాటి వేగంలో మార్పులు వస్తూంటాయి. వాటి ఆధారంగానే ఆ ప్రాంతంలో ఏ రకమైన ఖనిజాలున్నాయి, ఉష్ణోగ్రత, సాంద్రత ఎంత వంటి వివరాలు తెలుస్తూంటాయి. అలాగే భూమి ఇన్నర్ కోర్ వేగం, దిశల్లో వచ్చిన మార్పులు కూడా! పెకింగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు కొన్ని వేల భూకంపాల వివరాలను సేకరించి పరిశీలించారు. 1960ల నుంచి ఇప్పటిదాకా భూమి ఇన్నర్ కోర్ను దాటుకుంటూ వెళ్లిన భూకంప తరంగాల తీరును విశ్లేషించినప్పుడు ఆసక్తికరమైన అంశం బయటపడింది. 2009కి ముందు ఈ తరంగాలు ఇన్నర్ కోర్ గుండా వెళ్లేందుకు పట్టిన సమయంతో పాటు ఆ తరంగాల రూపురేఖల్లోనూ గణనీయమైన మార్పులొచ్చాయి. ఇక 2009లో భూకంప తరంగాల ప్రభావం ఇన్నర్ కోర్పై దాదాపు లేకుండా పోయింది. అంటే 2009లో ఇన్నర్ కోర్ కూడా భూమితో సమాన వేగంతో తిరుగుతున్నట్లు అంచనా కట్టారు. 2009 తర్వాత భూమి కంటే తక్కువ వేగంతో తిరుగుతున్నట్టు భూకంపాల తరంగాల పరిశీలనలో వెల్లడైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ 70 ఏళ్లకోసారి రివర్స్ ఈ అధ్యయనం ప్రకారం ఇన్నర్ కోర్ తిరిగే దిశ 70 ఏళ్లకోసారి మారుతూంటుంది. అలా చివరిసారి 1970 ప్రాంతంలో మారిందట. రోజు నిడివి, భూ అయస్కాంత క్షేత్రాల ద్వారా ఇది నిర్ధారౖణెంది కూడా. ఇలా ఇన్నర్ కోర్ తిరిగే దిశ, వేగంలో మార్పుల వల్ల భూ భ్రమణానికి పట్టే సమయంలోనూ తేడాలొచ్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్నర్ కోర్ వేగం తగ్గినప్పుడు మాంటెల్ తాలూకూ గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుందని, ఫలితంగా భూ భ్రమణ వేగం తగ్గుతుందని తెలిపారు. దీనివల్ల రోజు నిడివి పెరుగుతుందన్నమాట. ఎంతో తెలుసా? ఏడాదికి సెకనులో 74,000వ వంతు! అలా 140 కోట్ల ఏళ్ల క్రితం 19 గంటలుండే రోజు నిడివి ఇప్పుడు 24 గంటలకు పెరిగిందని వివరించారు. అన్నట్టూ, భూమి ఇన్నర్ కోర్ ఆరేళ్ల సమయంలో ఒక మైలు దూరం అటు ఇటూ లోలకం మాదిరిగా ఊగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
బిల్డింగ్పై నుంచి దూకి ఇఫ్లూ యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ఓయూ పరిధిలోని ఇఫ్లూ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. హర్యానాకు చెందిన విద్యార్థిని శనివారం హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి మృతిచెందింది. మృతురాలిని ఏంఏ ఇంగ్లీష్ చదువుతున్న అంజలిగా(22) గుర్తించారు. కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. -
JNTU విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య
-
మా అమ్మ, సోదరికి చదువు లేనప్పుడూ..మాకు వద్దు అంటూ సర్టిఫికేట్లను..
అఫ్గాన్లో మహిళలకు యూనివర్సిటీల్లో ప్రవేశం లేదని తాలిబన్లు హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తిన తాలిబన్లు లెక్కచేయకుండా నిరంకుశత్వ ధోరణితో మహిళలపై ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో కాబూల్ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ అప్గాన్ మహిళలపై యూనివర్సిటీ నిషేధానికి వ్యతిరేకంగా తన డిప్లొమా సర్టిఫికేట్లను చించేస్తూ నిరసన తెలిపారు. నా సోదరి, మా అమ్మ చదుకుకోలేనప్పుడూ నాకు ఈ విద్య వద్దు అంటే ఆ సర్టిఫికేట్లను లైవ్ టీవీ ఇంటర్వ్యూలో చించేశారు. ఈ రోజు నుంచి నాకు ఈ చదుకు అవసరం లేదు. అయినా ఈ దేశం విద్యకు తగిన స్థలం కాదు అంటూ మండిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియోని సామాజిక కార్యకర్త షబ్నం నసిమి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా, మహిళలు, మైనారిటీల హక్కులకు సంబంధించి మరి మితవాద పాలనను మొదట్లో వాగ్దానం చేసినప్పటికీ.. తాలిబాన్లు అఫ్గాన్ మహిళలకు విశ్వవిద్యాలయంలో చదువుకోనివ్వకుండా నిర్వధిక నిషేధాన్ని విధించారు. బాలికలను మిడిల్ స్కూల్స్కే పరిమితం చేసి, హైస్కూల్కి హాజరు కాకుండా నిషేధించారు. అంతేగాదు మహిళలను చాలా ఉద్యోగాల నుంచి తొలగించారు. అలాగే బహిరంగంగా తల నుంచి కాలి వరకు దుస్తులను ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆఖరికి మహిళలు మగ బంధువులు లేకుండా ప్రయాణించేందుకు కూడా వీలు లేదు. (చదవండి: యూనివర్సిటీల్లో అమ్మాయిలపై నిషేధం.. క్లాస్లు బాయ్కాట్ చేసి అబ్బాయిల నిరసన..) -
గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్.. లేఖపై మంత్రి సబిత కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి గవర్నర్ నుంచి లేఖ వచ్చిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్ను కలవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. అపాయింట్మెంట్ కోరాం.. ఇంకా ఖరారు కాలేదన్నారు. గవర్నర్ను కలిసి ఆమె సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాసిన విషయం తెలిసిందే. యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై రాజ్భవన్కు వచ్చి విద్యాశాఖ మంత్రి చర్చించాలని సూచించారు. ప్రభుత్వంతో పాటు యూజీసీకి కూడా గవర్నర్ లేఖ రాశారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ చెల్లుబాటు అవుతుందా అని యూజీసీ అభిప్రాయాన్ని గవర్నర్ కోరారు. మూడేళ్లుగా ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవలేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త విధానంలో న్యాయపరమైన సమస్యలు వస్తే ఖాళీల భర్తీ మరింత ఆలస్యమవుతుందని గవర్నర్ పేర్కొన్నారు. చదవండి: మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు -
Viral Video: బుర్ఖా ధరించని విద్యార్థులపై తాలిబన్ అధికారుల దాడి
కాబూల్: అఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ఆరాచక పాలన రోజురోజుకీ మితిమీరిపోతుంది. గతేడాది దేశాన్ని తాలిబన్లు తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడి మహిళల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. చదువులు, ఉద్యోగాలకు అనుమతి నిరాకరిస్తూ మహిళలను ఆంక్షల చట్రంలో బంధిస్తున్నారు. మహిళల స్వేచ్చ, భావవ్యక్తీకరణ, వస్త్రధారణ ఇలా ప్రతి దానిపై నిషేధం విధిస్తున్నారు. ఆరో తరగతి నుంచి బాలికలు పాఠశాలకు రాకుండా నిషేధించారు. మహిళలు కేవలం వంటింటికే పరిమితం అయ్యేలా వారిని అణిచివేతకు గురిచేస్తున్నారు. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టిన మహిళలకు హిజాబ్(బుర్భా) ధరించడం తప్పనిసరి చేసింది తాలిబన్ ప్రభుత్వం. ఆఖరికి విద్యాసంస్థలకు కూడా ఇలాగే రావాలని ఆదేశించింది. అయితే అక్కడి మహిళలు తాలిబన్ల నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు బుర్భా పూర్తిగా ధరించకుండా వచ్చినందుకు అధికారులు యూనివర్సిటీ లోపలికి అనుమతివ్వలేదు. దీంతో చదవుకోవడం మా హక్కు అంటూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. అయితే నిరసన చేస్తున్న మహిళా విద్యార్థులపై తాలిబన్ అధికారులు దాడి చేశారు. దీంతో విద్యార్థులు భయంతో అక్కడినుంచి పరుగులు తీశారు. Taliban beat female students Even though the girls are wearing hijabs, why are they not allowed to enter the university? The #Taliban want to close the universities for #Female students. Today the the Taliban didn’t allow female students to enter university. #Badakhshan pic.twitter.com/xXmZ8eDolH — Panjshir_Province (@PanjshirProvin1) October 30, 2022 యూనివర్సిటీ ముందు నిరసన తెలుపుతున్న మహిళా విద్యార్థులను కొడుతున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విద్యార్థులపై దాడి చేసిన వ్యక్తి తాలిబాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందినవారుగా తెలిసింది. ఈ సంఘటన ఆదివారం ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్లోని బదక్షన్ విశ్వవిద్యాలయం గేట్ బయట జరిగింది. అయితే వీరంతా ముఖం కనిపించకుండా బుర్భా కప్పుకోకపోవడంతో అధికారులు యూనివర్సిటీలోకి అనుమతించలేదని తెలుస్తోంది. -
ముదురుతున్న వివాదం.. కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం
తిరువనంతపురం: కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి, గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్కు వివాదం ముదురుతోంది. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టేలా వర్సిటీ విద్యార్థుల దగ్గర ప్రసంగాలు చేశారని, ఆయనపై రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం పినరయి విజయన్కు గవర్నర్ సూచించారు. ఆర్థిక మంత్రిపై తాను విశ్వాసం కోల్పోయానని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలన్న అర్థం వచ్చేలా బుధవారం లేఖ రాశారు. గవర్నర్ డిమాండ్ను సీఎం తోసిపుచ్చారు. యూపీ నుంచి వచ్చే విద్యార్థులకు కేరళలో పరిస్థితులు అర్థం కావడం సంక్లిష్టంగా ఉంటుందని ఈ నెల 18న కేరళ వర్సిటీలో విద్యార్థుల సమావేశంలో బాలగోపాల్ అన్నారు. ‘‘మంత్రి తన ప్రమాణాన్ని మరిచారు. దేశ ఐక్యత, సమగ్రతలను తక్కువ చేసి చూపిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి పదవిలో ఉండకూడదు. ఆయన నా విశ్వాసాన్ని కోల్పోయారు’’ అంటూ లేఖలో పేర్కొన్నారు. మంత్రిపై తనకు పరిపూర్ణ విశ్వాసముందంటూ సీఎం ఘాటుగా బదులిచ్చారు. ఆయనను తప్పించడానికి ఏ కారణాలూ లేవన్నారు. కేరళలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకం అంశంలో ఇప్పటికే ప్రభుత్వం, రాజ్భవన్ మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. -
యూనివర్సిటీలో యువతి నృత్యం వివాదాస్పదం... పాక్ స్ట్రాంగ్ వార్నింగ్
ఒక ప్రైవేట్ యునివర్సిటీ కార్యక్రమంలో యువతీ చేసిన నృత్యం వివాదాస్పదమైంది. దీంతో సదరు యూనివర్సిటీకి నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. పాక్లో పెషావర్లోని ఎన్ఎస్ యూనివర్సిటీలో హునార్ మేళ ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆ వేడుకల్లో దాదాపు 13 కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగానే ఒక యువతి డ్యాన్స్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఇలాంటి కార్యక్రమాలకు దేశానికి అవసరమా అంటూ మండిపడతూ ట్వీట్ చేశారు. సర్వత్రా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాక్ ఖైబర్ మెడికల్ యూనివర్సిటీ(కేఎంయూ) ఈ విషయమై సీరియస్ అయ్యి నోటీసులు జారీ చేసింది. ఆ వీడియోలో సదరు యువతి బిగుతుగా ఉండే డ్రస్ వేసుకుని వేదికపై డ్యాన్స్లు చేయడం వల్లే వివాదాస్పదంగా మారింది. ఈ మేరకు ఖైబర్ మెడికల్ యూనిర్సిటీ ఇలాంటి కార్యక్రమాలు చాలా అనేతికం, అసాంఘీకం అంటూ మండిపడుతూ చివాట్లు పెట్టింది. అంతేగాదు ఈ విషయమై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా సదరు యూనివర్సిటి ఎన్ఎస్సీ డైరెక్టర్కి నోటీసులు జారీ చేసింది. లేనిపక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇలాంటి కార్యక్రమాలను కేఎంయూ లోగో పేరుతో కార్యక్రమాలు నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యాసంస్థలు నైతిక విలువలతో కూడిన ప్రమాణాలు పాటిస్తూ పవిత్రతను కాపాడుకోవాలని మందలించింది. అవసరమనుకుంటే సదరు ప్రైవేట్ యూనివర్సిటీ గుర్తింపును సైతం రద్దు చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. pic.twitter.com/FhjROmiJbW — Sami (@Pediatric__OT) October 20, 2022 Pakistan: Khyber Medical University issues notice to NCS University System, Peshawar, warns of de-affiliation after this dance video from NCS goes viral 🤩 pic.twitter.com/MYd5P57gyN — Sonam Mahajan (@AsYouNotWish) October 21, 2022 (చదవండి: చైనా కమ్యునిస్ట్ పార్టీ ముగింపు వేడుకలో అనూహ్య ఘటన...హఠాత్తుగా నిష్క్రమించిన జుంటావో) -
వీడియో లీక్ ఘటన.. అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిన ఆర్మీ జవాన్ అరెస్టు
చండీగఢ్: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ కేసుకు సంబంధించి ఆర్మీ జవాన్ సంజీవ్ సింగ్ను శనివారం అరెస్టు చేశారు మొహాలీ పోలీసులు. అరుణాచల్ ప్రదేశ్లో విధులు నిర్వహిస్తున్న ఇతను వీడియో లీక్ చేసిన విద్యార్థినిని బ్లాక్మెయిల్ చేశాడని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాలు లభించిన తర్వతే సంజీవ్ సింగ్ను అదుపులోకి తీసుకున్నట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. ఇందుకు అరుణాచల్ పోలీసులు సహకరించినట్లు పేర్కొన్నారు. ఆర్మీ అధికారులు కూడా సంజీవ్ సింగ్ అరెస్టును ధ్రువీకరించారు. ఈ కేసుతో అతనికి సంబంధం ఉందని ఆధారాలు లభించిన తర్వాత పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్ పోలీసులకు తాము సహకరించామని పేర్కొన్నారు. విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు. సంజీవ్ సింగ్ అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లయింది. మరోవైపు చండీగఢ్ వీడియో లీక్ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణకు ధర్మాసనం తేదీని నిర్ణయించాల్సి ఉంది. చండీగఢ్ యూనివర్సీటీలో 60 మంది అమ్మాయిలు బాత్రూంలో స్నానం చేసే వీడియోలు లీక్ అయ్యాయని కొద్ది రోజుల క్రితం వార్తలు రావడం దుమారం రేపింది. అయితే విచారణలో ఒక్క అమ్మాయి వీడియో మాత్రమే లీక్ అయినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. అది కూడా ఆ అమ్మాయే స్వయంగా తన వీడియోను రికార్డు చేసుకుని బాయ్ఫ్రెండ్కు పంపిందని చెప్పారు. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ -
వీడియో లీక్ ఘటన.. పంజాబ్ సీఎం కీలక నిర్ణయం
చండీగఢ్: చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు మహిళా అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఈమేరకు సీఎం భగవంత్ మాన్ ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి గురుప్రీత్ దేవ్ పర్యవేక్షణలో సిట్ ఈ కేసును వేగంగా విచారించనుంది. ముగ్గురు అరెస్టు.. యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనలో ఇప్పటివరకు మొత్తం ముగ్గురుని అరెస్టు చేశారు పోలీసులు. స్నానం చేస్తుండగా తానే స్వయంగా రికార్డు చేసుకున్న వీడియోను పంపిన అమ్మాయి, దీన్ని రిసీవ్ చేసుకున్న సిమ్లాకు చెందిన ఆమె బాయ్ఫ్రెండ్ సన్నీ మెహతాతో పాటు అతని స్నేహితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సహకరించిన హిమాచల్ప్రదేశ్ పోలీసులకు పంజాబ్ పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. వార్డెన్ల సస్పెన్షన్ వీడియో లీక్ చేసిన అమ్మాయిని హాస్టల్ వార్డెన్ తిట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో లీక్ విషయాన్ని పోలీసులకు ముందుగా చెప్పనందుకు ఆమెను, మరో వార్డెన్ను కూడా అధికారులు సస్పెండ్ చేశారు. 6 రోజులు క్లాసులు బంద్.. విద్యార్థినుల నిరసనలతో యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి శనివారం(సెప్టెంబర్ 24) వరకు క్లాసులు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే విద్యార్థుల డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించిందని, దీంతో వాళ్లు నిరసన విరమించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యూనివర్సిటీలో తమకు భద్రత లేదని కొంతమంది విద్యార్థినులు బ్యాగులు సర్ధుకుని ఇంటిబాట పట్టారు. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? -
యూనివర్సిటీ విద్యార్థిని వీడియో లీకు ఘటన.. పోలీసులు ఏం చెప్తున్నారంటే..
చండీగఢ్: చండీగఢ్ యూనివర్సీలో అమ్మాయిల ప్రైవేటు వీడియోల లీక్ ఘటనపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఒక అమ్మాయి తన సొంత వీడియోను మాత్రమే బాయ్ఫ్రెండ్కు పంపిందని చెప్పారు. అతను హిమచాల్ ప్రదేశ్కు చెందినవాడని వెల్లడించారు. వీడియో పంపిన అమ్మాయిని అరెస్టు చేసి విచారించిన తర్వాతే ఈ విషయం తెలిసిందని చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో అమ్మాయి బాయ్ఫ్రెండ్ పాత్ర ఏమైనా ఉందా? అనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. అతడ్ని అరెస్టు చేసి విచారిస్తేనే అసలు నిజం బయటపడుతుందన్నారు. సొంత వీడియో లీక్ చేసుకున్న అమ్మాయి ఇతర అమ్మాయిల వీడియోలను కూడా రికార్డు చేసిందా? అనే విషయంపైనా విచారణ చేస్తామన్నారు. అలాగే యూనివర్సిటీలో ఇప్పటివరకు ఒక్క విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు. అత్యంత సున్నితమైన ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది అమ్మాయిలు స్నానం చేస్తుండగా తీసిన వీడియోలు లీక్ అయ్యాయని ప్రచారం జరిగింది. దీనిపై విద్యార్థినులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి యూనివర్సిటీలో నిరసనలు చేపట్టారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అయితే లీక్ అయింది ఒక్క అమ్మాయి వీడియోనే అని యూనివర్సిటీ అధికారులతో పాటు పోలీసులు స్పష్టతనిచ్చారు. మరోవైపు ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు. కాగా.. యూనివర్సిటీలో ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు (సెప్టెంబర్ 19,20) క్లాసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ -
వారితో టచ్లో ఉన్నా.. దయచేసి వదంతులు నమ్మొద్దు: పంజాబ్ సీఎం
చండీగఢ్: చండీగఢ్ యూనివర్సిటీలో అమ్మాయిల ప్రైవేటు వీడియోల లీక్ వ్యవహారంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించిటన్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. 'చండీగఢ్ యూనివర్సిటీ ఘటన దురదృష్టకరం. మన బిడ్డలే మనకు గర్వకారణం. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించాం. దోషులుగా తేలినవారిపై అత్యంత కఠినచర్యలు తీసుకుంటాం. అధికారయంత్రాంగంతో నేను టచ్లోనే ఉన్నా. దయచేసి వదంతులు నమ్మొద్దు' అని భగవంత్ మాన్ హిందీలో ట్వీట్ చేశారు. चंडीगढ़ यूनिवर्सिटी की घटना सुनकर दुख हुआ...हमारी बेटियां हमारी शान हैं...घटना की उच्च स्तरीय जांच के आदेश दे दिए हैं..जो भी दोषी होगा सख्त कार्रवाई करेंगे... मैं लगातार प्रशासन के संपर्क में हूं...मैं आप सब से अपील करता हूं कि अफवाहों से बचें... https://t.co/kgEGszUhAq — Bhagwant Mann (@BhagwantMann) September 18, 2022 చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది అమ్మాయిల ప్రైవేటు వీడియోలు లీకైనట్లు వార్తలు రావడం తీవ్రదుమారం రేపింది. దీనిపై యూనివర్సిటీ విద్యార్థినులు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే యూనివర్సిటీ యాజమాన్యం ఈ ఆరోపణలను కొట్టి పారేసింది. ఒక్క అమ్మాయి వీడియో మాత్రమే లీకైనట్లు వెల్లడించింది. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పింది. అలాగే యూనివర్సిటోలో ఏ ఒక్క విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకోలేదని, ఆస్పత్రిలో కూడా చేరలేదని ప్రకటనలో తెలిపింది. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ -
దయచేసి ఆ వీడియోలు షేర్ చేయొద్దు.. సోనూసూద్ విజ్ఞప్తి
పంజాబ్ చండీగఢ్ యూనివర్సిటీ ఘటనపై బాలీవుడ్ నటుడు సోనూసూద్ స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. దయచేసి ఎవరూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మనం వారికి పూర్తి అండగా నిలవాలని ట్విట్టర్ ద్వారా సోనూ సూద్ కోరారు. 'చండీగఢ్ యూనివర్శిటీలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. ఈ కష్ట సమయంలో మనందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ విషయంలో మన సిస్టర్స్కు అండగా నిలుద్దాం. దయచేసి ఎవరూ కూడా సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలు షేర్ చేయొద్దు. ఇది మనందరికీ పరీక్ష సమయం. బాధ్యత గల పౌరులుగా మన బాధితుల తరఫున నిలుద్దాం' అని ట్విట్టర్లో సోనూసూద్ కోరారు. Something that happened in Chandigarh University is very unfortunate. It’s time for us to stand with our sisters and set an example of a responsible society. These are testing times for us, not for the victims. Be responsible 🙏 — sonu sood (@SonuSood) September 18, 2022 అసలేం జరిగిందంటే: పంజాబ్లోని చండీగఢ్ యూనివర్సీటీలోని హాస్టల్లో దాదాపు 60 మంది యువతుల ప్రైవేటు వీడియోలను వారితో కలిసి ఉండే మరో యువతి తీయడం సంచలనంగా మారింది. అంతే కాకుండా ఆ వీడియోలు ఆ యువతి స్నేహితుల ద్వారా సోషల్ మీడియాలో షేర్ కావడంతో బాధిత యువతులు ఆందోళనకు దిగారు. కొంతమంది బాధితులు ఆత్మహత్యకు కూడా యత్నించారు. అయితే ఈ ఘటనను పోలీసులు, యూనివర్శిటీ యాజమాన్యం ఖండించింది. దీనిపై విచారణ జరుగుతోందని పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. -
60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ
చండీగఢ్: పంజాబ్ చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది అమ్మాయిల ప్రైవేటు వీడియోలు లీకైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం చెలరేగి యూనివర్సిటీ విద్యార్థినిలు నిరసనకు కూడా దిగారు. అయితే విషయంపై యాజమాన్యం స్పందించింది. మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారం, అర్థరహితం అని కొట్టిపారేసింది. యూనివర్సిటీలో ఒక్క అమ్మాయి ప్రైవేటు వీడియో మాత్రమే లీక్ అయినట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. ఓ అమ్మాయి తన సొంత వీడియోను సోషల్ మీడియాలో తన బాయ్ఫ్రెండ్కు పంపిందని వెల్లడించింది. తాము చేపట్టిన ప్రాథమిక విచారణలో ఈ ఒక్క వీడియో తప్ప మరే ఇతర అమ్మాయిల వీడియోలు లీక్ కాలేదని తేలిందని చెప్పింది. 60 ప్రైవేటు వీడియోలు లీక్ అయ్యాయని మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ డా.బవా స్పష్టం చేశారు. ఈ వదంతులను ఎవరూ నమ్మవద్దని సూచించారు. There are rumours that 7 girls have committed suicide whereas the fact is that no girl has attempted any such step. No girl has been admitted to hospital in the incident: Chandigarh University pic.twitter.com/5zsMeibsxW — ANI (@ANI) September 18, 2022 అలాగే చండీగఢ్ యూనివర్సిటీలో ఏడుగురు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో కూడా నిజం లేదని బవా చెప్పారు. ఏ ఒక్క విద్యార్థిని కనీసం ఆస్పత్రిలో కూడా చేరలేదని వెల్లడించారు. వీడియో లీక్ చేసిన అమ్మాయిని పోలీసులు అరెస్టు చేశారని, కేసు విచారణలో పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. This is Horrible Scenes From Chandigarh University #justiceforCUgirls #chandigarhuniversity pic.twitter.com/5eLP7BIYTc — r/Ghar Ke Kalesh (@gharkekalesh) September 17, 2022 Chandigarh University videos scandal: Protests over objectionable clips of girls bathing in hostel Girl student arrested; police deny reports of suicide attempt on campus Details: https://t.co/RK1H5IZ5WU#chandigarhuniversity #protests pic.twitter.com/y94OTRibmN — Asianet Newsable (@AsianetNewsEN) September 18, 2022 చదవండి: ఫ్రెండే కదా అని నమ్మారు.. హాస్టల్ యువతుల ప్రైవేటు వీడియోలు తీసి..! -
ఫ్రెండే కదా అని నమ్మారు.. హాస్టల్ యువతుల ప్రైవేటు వీడియోలు తీసి..!
ఓ యువతి యూనివర్సిటీలో తన హాస్టల్మేట్స్ (60 మంది అమ్మాయిల) ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడం కలకలం సృష్టించింది. దీంతో, హాస్టల్ విద్యార్థులు నిరసనలకు దిగారు. ఈ షాకింగ్ ఘటన పంజాబ్లోని చండీగఢ్ యూనివర్సిటీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ యువతి తనతో పాటు చదువుకుంటూ తన రూమ్లో ఉంటున్న యువతుల వీడియోలను తీసింది. బాత్రూమ్లో స్నానం చేస్తున్న సమయంలో ఫోన్లో సీక్రెట్గా వీడియోలు తీసి అనంతరం, ఆ వీడియోలను సోషల్ మీడియాలో, తన ఫ్రెండ్స్కు షేర్ చేసింది. ఈ విషయం బాధితురాలికి తెలియడంతో ఆమెను నిలదీసింది. దీంతో, హాస్టల్లోని విద్యార్థులంతా నిరసనకు దిగారు. రంగంలోకి దిగిన యూనివర్సిటీ అధికారులు, పోలీసులు.. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితురాలు.. మరికొందరు విద్యార్థుల ప్రైవేటు వీడియోలను సైతం లీక్ చేస్తున్నట్టు కూడా విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ షాకింగ్ ఘటనపై నిరసనలు తెలుపుతుండగా ఓ విద్యార్థిని స్పృహ తప్పి కిందపడిపోవడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. This girl viral the 60 girls mms in Chandigarh university kindly take strict action on this girl @INCChandigarh @narendramodi @ChandigarhUT #chandigarhuniversity #justiceforcugirls pic.twitter.com/7JVHN0oBNZ — Shanu XD (@shanu00001) September 17, 2022 కాగా, ఈ ఘటన కారణంగా హాస్టల్లోని పలువురు యువతులు ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు వార్తలు బయటకు వచ్చాయి. అయితే, ఈ వార్తలను పోలీసులు, యూనివర్సిటీ పరిపాలనా విభాగం ఖండించింది. పుక్లార్లు నమ్మవద్దంటూ స్పష్టం చేశారు. ఇక, ఘటనపై పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ స్పందించారు. ఈ వ్యవహారంలో నిందితులను విడిచిపెట్టే ప్రసక్తేలేదు. విద్యార్థులందరూ ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. Protest breaks out in Chandigarh University after someone secretly recorded videos of girls from hostel bathroom and leaked them online. University administration is trying to muzzle the protest, according to a student : @PunYaab pic.twitter.com/BIi1jTBPCN — Yogita Bhayana योगिता भयाना (@yogitabhayana) September 17, 2022 A female student recorded videos of 60+ females while bathing & made it viral. 3 girls in #ChandigarhUniversity & attempted suîcide today and 1 of them is deceased. Management is acting very carelessly on this incident & wants to suppress it for the reputation of the college. pic.twitter.com/JWwGf1jEeX — Ankur🇮🇳™ (@unapologeticAnk) September 17, 2022 -
జంతువుల మాదిరిగానే.. మనుషులకు తోక!
ఆధునిక మానవుల పూర్వజీవులు లక్షలాది సంవత్సరాల పరిణామ క్రమంలో తోకలు కోల్పోవడం జరిగింది. మనుషులకు తోకలు ఉంటే, వయసు మళ్లినా జంతువుల మాదిరిగానే నడకలో బ్యాలెన్స్ కోల్పోకుండా ఉంటారు కదా అని ఆలోచించారు జపానీస్ పరిశోధకులు. ఆ ఆలోచనతోనే కీయో యూనివర్సిటీ పరిశోధకులు ఒక మీటరు పొడవు ఉండే రోబోటిక్ తోకను రూపొందించారు. వెనుకవైపు వేలాడేలా దీన్ని తొడుక్కుంటే, ఇది అచ్చం జంతువుల తోకల మాదిరిగానే పనిచేస్తుంది. ఈ తోక గడియారంలోని పెండ్యూలంలా కదులుతూ, నడకలో బ్యాలెన్స్ కోల్పోకుండా చేస్తుందని కీయో వర్సిటీ పరిశోధకుడు జునిచి నబెషిమా తెలిపారు. -
ఆచార్య జయశంకర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం
-
తాను తవ్వుకున్న గోతిలో తానే.. విద్యార్థినిపై లైంగిక వేధింపులు, ఆపై
సాక్షి, చెన్నై: పెరియార్ వర్సిటీ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ గోపీని సోమవారం సాయంత్రం సేలం సూర మంగళం పోలీసులు అరెస్టు చేశారు. ఓ విద్యార్థిని లైంగికంగా వేధించడమే కాకుండా, ఆమెకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసి ఆయన అడ్డంగా బుక్కయ్యాడు. వివరాలు.. సేలం పెరియార్ వర్సిటీలో ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా గోపీ పనిచేస్తున్నారు. ఆదివారం పరిశోధక ఓ విద్యార్థినిని వర్సిటీలోని తన చాంబర్కు రావాలని ఆయన ఆదేశించాడు. అక్కడికి వచ్చిన ఆ విద్యార్థిని కాసేపటి తర్వాత మౌనంగా బయటకు వెళ్లి పోయింది. అయితే, ఆ విద్యార్థినిపై సాయంత్రం ఆయన సూర మంగళం పోలీసు స్టేషన్లో ఓ ఫిర్యాదు చేశాడు. అధిక మార్కులతో పాటుగా త్వరితగతిన డిగ్రీ దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తన బంధువుల ద్వారా ఆ విద్యార్థిని దాడి తనపై చేయించినట్టు ఆరోపించాడు. అంతే కాకుండా, రాత్రి ఓ ప్రైవేటు ఆస్పత్రిలోనూ అడ్మిట్ అయ్యాడు. సోమవారం ఉదయాన్నే పోలీసులు సంబంధిత విద్యార్థిని పిలిపించి విచారించగా రిజిస్ట్రార్ బండారం బయట పడింది. చాంబర్కు పిలిపించి తనపై లైంగిక దాడికి ప్రయత్నించినట్లు, తాను బయటకు చెప్పుకోలేక మౌనంగా ఉండి పోయినట్లు ఆ విద్యార్థిని ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు. ఆ విద్యార్థినితో పోలీసులే ఫిర్యాదు చేయించారు. అలాగే, గోపీతో పాటుగా ఆదివారం వర్సిటీలో విధుల్లో ఉన్న సిబ్బంది, సహచర విద్యార్థుల్ని పోలీసులు విచారించారు. గోపీ బండారం బయట పడడంతో ఆయన్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. కాగా, చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు పోలీసుల్ని ఆశ్రయించిన నాటకం ఆడిన రిజిస్ట్రార్ గోపీ.. చివరకు తాను తవ్వుకున్న గోతిలోనే పడ్డారని పలువురు వాఖ్యానించారు. -
ఇందులో తక్కువ కులం ఏది? ప్రశ్నాపత్రంపై తీవ్ర దుమారం
చెన్నై: తమిళనాడు పెరియార్ యూనివర్సిటీ పరీక్షల్లో ఓ ప్రశ్నాపత్రంలో కులానికి సంబంధించిన ప్రశ్న అడగటం తీవ్ర దుమారం రేపింది. ఎంఏ హిస్టరీ మొదటి ఏడాది రెండో సెమిస్టర్ పరీక్ష గురువారం జరిగింది. అయితే ప్రశ్నాపత్రంలో 'కింది వాటిలో తమిళనాడుకు చెందిన తక్కువ కులం ఏది?' అనే ప్రశ్న వచ్చింది. జవాబు ఎంచుకునేందుకు నాలుగు కులాల పేర్లను ఆప్షన్లుగా ఇచ్చారు. 'ఫ్రీడం మూవ్మెంట్ ఆఫ్ తమిళనాడు ఫ్రం 1800-1947' అనే సబ్జెక్టు పరీక్ష రాసిన విద్యార్థులకు ఈ ప్రశ్న ఎదురైంది. Tamil Nadu | 1st-year MA History students of Periyar University in Salem got asked in the exam, "Which one is the lower caste that belongs to Tamil Nadu?" with 4 options mentioning different castes pic.twitter.com/kdJxQrMo5R — ANI (@ANI) July 15, 2022 అయితే పరీక్షలో కులానికి సంబంధించిన ప్రశ్న అడగటం వివాదాస్పదమైంది. దీనిపై పెరియార్ యూనివర్సిటీ ఉప కులపతి జగన్నాథన్ స్పందించారు. సమాజంలో అసమానతలు రూపుమాపే దిశగా విద్యను అందించాల్సిన ప్రొఫెసర్లు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ప్రశ్నాపత్రం తాము తయారు చేయలేదని, వేరే యూనివర్సిటీ సిబ్బంది రూపొందించారని జగన్నాథన్ తెలిపారు. క్వశ్చన్ పేపర్ లీక్ కాకూడదనే ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష జరిగే వరకు ప్రశ్నాపత్రాన్ని ఎవరూ చూడలేదని, అందులోని వివాదాస్పద ప్రశ్న గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. ఈ విషయంపై కచ్చితంగా విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. చదవండి: పిల్లాడు బూతులు మాట్లాడుతున్నాడు.. పొలిటికల్ లీడర్లు మాట్లాడుతుంటే టీవీ పెట్టారా..? -
వైఎస్సార్ ఏఎఫ్యూ సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఏఎఫ్యూ: కడపలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో 2021–22 బ్యాచ్ కాలేజి ఆఫ్ ఫైన్ఆర్ట్స్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ విద్యార్థుల ప్రథమ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం విశ్వవిద్యాలయంలో ఇన్చార్జి వైస్ చాన్స్లర్ ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సి. సురేంద్రనాథ్రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్ష ఫలితాలను సకాలంలో విడుదల చేయడం పట్ల పరీక్షల విభాగం అధ్యాపకులు, సిబ్బందిని వారు అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్ రాజేష్కుమార్రెడ్డి, సూపరింటెండెంట్ వై. పవన్కుమార్రెడ్డి, పరీక్షల నిర్వహణ అధికారులు శ్రీలక్ష్మి, భారతి తదితరులు పాల్గొన్నారు. -
యోగి సర్కార్పై కోర్టు ధిక్కరణ దావా!
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ యోగి సర్కార్పై కోర్టు ధిక్కరణ దావాకి సిద్ధమయ్యారు సమాజ్వాదీ పార్టీ నేత ఆజాం ఖాన్. రామ్పూర్లోని తన యూనివర్సిటీని సీల్ చేసిన విషయంలో యోగి ప్రభుత్వంపై కోర్టుకెక్కనున్నట్లు ప్రకటించారు ఆజాం ఖాన్. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా.. తనకు చెందిన మొహమ్మద్ అలీ జవుహార్ యూనివర్సిటీ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ను తొలగించకపోవడంపై కోర్టు ధిక్కరణ కింద సుప్రీంను ఆశ్రయించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సుప్రీం కోర్టు సైతం ఈ వ్యవహారంపై గురువారం యూపీ ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. ఫెన్సింగ్ తొలగించకపోవడం వల్ల.. యూనివర్సిటీ కార్యకలాపాలు నిలిచిపోయానని కోర్టుకు తెలిపారు ఆజాంఖాన్. ఈ మేరకు జస్టిస్ ఏఎం ఖాన్వలీకర్, జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసం.. జులై 19లోపు వివరణ ఇవ్వాలని యూపీ సర్కార్ను కోరుతూ.. జులై 22వ తేదీకి విచారణను వాయిదా వేసింది. మే 27వ తేదీన జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ బెలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం.. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన యూనివర్సిటీ స్థలాల జప్తు ఆదేశాలపై స్టే విధించింది. ఈ క్రమంలో యూనివర్సిటీ ఫెన్సింగ్ను తొలగించకపోవడం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆక్రమించారు ఆయన. ఇదిలా ఉంటే.. ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేతగా పేరున్న ఆజాం ఖాన్.. వివాదాస్పద వ్యాఖ్యలు, వైఖరితో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు కూడా. భూ కబ్జాతో పాటు చాలా కేసులు ఆయనపై నమోదు అయ్యాయి. ఒకానొక తరుణంలో ఆయన జైలు శిక్షపై న్యాయస్థానాల్లోనూ ఆసక్తికరమైన చర్చ కూడా నడిచింది. మరోవైపు రాజకీయ వైరంతోనే జైలుకు పంపారంటూ ఆజాం ఖాన్ అనుచరులు ఆరోపిస్తున్నారు. మొన్న యూపీ ఎన్నికల్లో జైలు నుంచే ఆయన ఘన విజయం సాధించడం విశేషం. 27 నెలలు జైల్లో గడిపిన ఈయన.. మే నెలలో జైలు నుంచి విడుదల అయ్యారు. -
ప్రకృతి సేద్యంపై యూనివర్సిటీ
ఇంతకు ముందు స్కూళ్ల పరిస్థితి ఎలా ఉంది.. ఈ రోజు పరిస్థితి ఎలా మారిందో మీరు చూడొచ్చు. (గతంలో స్కూల్ – పునర్ నిర్మాణం తర్వాత ఇప్పటి స్కూల్ ఫోటో చూపిస్తూ) మీరంతా బాగా చదివాలి. పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు ఏ మాదిరిగా చదువుతారో, మాట్లాడుతారో అదే మాదిరిగా గొప్పగా చదవాలి. గొప్పగా ఇంగ్లిష్ మాట్లాడాలి. ప్రపంచంతో పోటీ పడేలా ఎదగాలి. – వేంపల్లె విద్యార్థులతో సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, కడప/వేంపల్లి : ‘జర్మన్ ప్రభుత్వం, కేంద్రం సహకారంతో మనం ప్రకృతి వ్యవసాయంలో ఓ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. తద్వారా ప్రకృతి సేద్యంలో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలతోపాటు పీహెచ్డీలు కూడా అందిస్తాం. అప్పుడు ఇక్కడి నుంచి వచ్చే విద్యార్థులకు ప్రపంచం మొత్తం ఆహ్వానం పలుకుతుంది. ప్రపంచం మొత్తానికి ప్రకృతి సేద్యం అందుబాటులోకి వస్తుంది. అదే మన స్వప్నం. ఆ లక్ష్యంతోనే ప్రకృతి సేద్యంపై ప్రపంచ స్థాయి పరిశోధనకు ఇండో–జర్మన్ అకాడమి ఏర్పాటు చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఏపీ కార్ల్ ప్రాంగణంలో ఇండో–జర్మన్ ప్రపంచ వ్యవసాయ విజ్ఞాన పరిశోధన–శిక్షణా అకాడమి (ఐజీజీఏఏఆర్ఎల్ –ఇండో – జర్మన్ గ్లోబల్ అకాడమి ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చి అండ్ లెర్నింగ్.. ఐజీ గార్ల్) ఏర్పాటుకు గురువారం ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా న్యూటెక్ బయో సైన్సెస్కు శంకుస్థాపన చేశారు. ప్రకృతి వ్యవసాయ శాస్త్ర విజ్ఞానాన్ని ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో దేశ విదేశాల్లో విస్తరింపజేసే ఆశయంతో రూ.222 కోట్ల ఖర్చుతో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఇండో–జర్మన్ గ్లోబల్ అకాడమీని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామ స్థాయిలో సమగ్ర అవగాహన ముఖ్యం ► ఇవాళ మనం రకరకాల క్యాన్సర్ వ్యాధుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇటీవల కాలంలో క్యాన్సర్ విస్తరిస్తోంది. ప్రధానంగా మనం ఆహారం రూపంలో తీసుకుంటున్న వివిధ రకాల కెమికల్స్ వల్ల రకరకాల వ్యాధుల బారిన పడుతున్నాం. దీన్ని నివారించేందుకు ఉన్న ఏకైక మార్గం మనం తీసుకుంటున్న ఆహారంలో రసాయనాలు (కెమికల్స్) తగ్గించడమే. ► అది కేవలం గ్రామ స్థాయిలో సమగ్రమైన అవగాహన, విజ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రకృతి వ్యవసాయంపై గ్రామ స్థాయిలో సరైన అవగాహన అవసరం. గ్రామ స్థాయిలో ఇప్పటికే ఆర్బీకేలు పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం సుమారు 10,700 గ్రామాల్లో రైతులకు వాటి ద్వారా సేవలు అందుతున్నాయి. ► ఆర్బీకేలు రైతులను విత్తనం నుంచి విక్రయం వరకు సాగులో చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, ఫెస్టిసైడ్స్ నాణ్యతను పరీక్షించి వాటికి గ్యారంటీ ఇస్తూ కల్తీ విత్తనాలు, ఎరువులను నివారించడమే లక్ష్యంగా పని చేస్తున్నాయి. ఆర్బీకేల పాత్ర మరింత కీలకం ► ఇకపై ఆర్బీకేలకు ప్రకృతి సేద్యాన్ని కూడా జత చేస్తున్నాం. ఇందుకు సంబంధించి తొలుత మనం నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. అన్ని ఆర్బీకేల్లో కచ్చితంగా ఆగ్రో ఎకాలజీపై పరిశోధన చేసిన మాస్టర్ ట్రైనర్, సైంటిస్టు ఉండాలి. ► గ్రామంలో ఉన్న కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్ (సీఆర్పీస్), అగ్రి సైంటిస్టు ఇద్దరూ కలిస్తే వారికున్న పరిజ్ఞానాన్ని గ్రామంలోని మిగిలిన రైతులకు అందించగలుగుతారు. ప్రకృతి సాగుకు కావాల్సిన ఉపకరణాలను కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ (సీహెచ్సీ) ద్వారా అందుబాటులో ఉంచుతారు. తద్వారా గ్రామాలను ప్రకృతి సాగు దిశగా నడిపించే ప్రయత్నం చేస్తాం. ► రసాయనాల వినియోగం తగ్గించి, ప్రకృతి సాగు వైపు వస్తే వెంటనే విపరీతమైన ఆదాయాలు వస్తాయని చెప్పలేం. ఆదాయాలు తొలుత తగ్గవచ్చు కూడా. అందుకే రైతుకు మూడు ఎకరాలు ఉంటే తొలి ఏడాది మూడవ వంతు మాత్రమే ప్రకృతి సాగు చేపట్టాలి. రెండవ ఏడాది 50 శాతం, మూడవ ఏడాది మొత్తం ప్రకృతి సాగువైపు మళ్లాలి. నాల్గవ సంవత్సరంలో ఫెస్టిసైడ్స్ వాడకపోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది. భూమిలో సారం పెరగడం వల్ల ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎఫ్పీఓ సర్టిఫికేషన్ ► ఐజీజీఏఏఆర్ఎల్ ఏర్పాటు ద్వారానే ఇదంతా సాధ్యమవుతుంది. గ్రామ స్థాయిలో ఈ రకమైన శిక్షణ కోసం మనం ఈ అకాడమి ఏర్పాటు చేసుకుంటున్నాం. రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది రైతులు ఉంటే కేవలం ఆరు లక్షల మంది మాత్రమే ప్రకృతి సాగులో మమేకమై ఉన్నారు. సుమారు కోటిన్నర ఎకరాల్లో కేవలం ఆరు లక్షల ఎకరాల్లో మాత్రమే ప్రకృతి వ్యవసాయం సాగులో ఉంది. ► సహజ సాగు ఉత్పత్తులకు ఆర్బీకే స్థాయిలో సర్టిఫికేషన్ చేసే సౌలభ్యం అందుబాటులో ఉన్నప్పుడే మన ఉత్పత్తులకు అధిక ధరలు లభిస్తాయి. ప్రతి ఆర్బీకే పరిధిలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్పీఓ) కనీసం ఒక్కటి ఉండేలా భవిష్యత్తులో అడుగులు వేస్తాం. ఒక్కసారి ప్రకృతి సాగు ఉత్పత్తులకు అధిక ధరలు లభించడం మొదలైతే అప్పుడు రసాయనాల వాడకానికి రైతులు స్వస్తి చెబుతారు. ఇదీ మన స్వప్నం ► ఇది మనం ఆశిస్తున్న మార్పు, మనం కంటున్న కల. ఇవాళ మనం మొదటి అంకంలో ఉన్నాం. ఏడెనిమిది ఏళ్లలో అసా««ధారణమైన ఫలితాలను చూడవచ్చు. పులివెందులలో ఐజీ కార్ల్(ఏపీ కార్ల్) గా ఉన్న కాలేజీ ఐజీ గార్ల్గా ఇవాల్టి నుంచి మారిపోతోంది. త్వరలో ఒక యూనివర్సిటీగా రూపుదిద్దుకుంటుంది. ఇక్కడి నుంచి సహజ సాగులో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ► జర్మన్ ప్రభుత్వం, కేంద్రంతో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీలను కూడా భాగస్వాములను చేసి గొప్ప వ్యక్తులను తీసుకు రావాలన్న ప్రయత్నం జరుగుతోంది. దేవుడి దయవల్ల అది కచ్చితంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. పులివెందుల అభివృద్ధి పనులపై సీఎం జగన్ సమీక్ష ► వైఎస్సార్ జిల్లాలో రెండు రోజుల పర్యటన కోసం సీఎం జగన్ గురువారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి 11.40 గంటలకు పులివెందుల చేరుకున్నారు. నియోజకవర్గ పరిధిలో పాడా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో అధికారులతో సమీక్షించారు. ► పాడా అభివృద్ధి పనులను ఓఎస్డీ అనిల్కుమార్రెడ్డి, పులివెందుల మోడల్ టౌన్ పనుల పురోగతిని రాష్ట్ర ప్రణాళిక ముఖ్య కార్యదర్శి విజయ్కుమార్లు వివరించారు. డిసెంబర్ నాటికి దాదాపు అన్ని పనులు పూర్తి అవుతాయని చెప్పారు. పనుల్లో నాణ్యత ముఖ్యం అని సీఎం వారికి సూచించారు. ► పులివెందుల మున్సిపాలిటీ, పలు మండలాలకు చెందిన ముఖ్య నేతలతో సీఎం సమావేశమయ్యారు. అందరి సమస్యలు విని, పరిష్కరిస్తామని చెప్పారు. ► వేంపల్లెలో రూ.3.32 కోట్లతో నిర్మించిన వైఎస్సార్ మెమోరియల్ పార్కును ప్రారంభించారు. ఆ తర్వాత వేంపల్లెలోని జిల్లా పరిషత్ పాఠశాలలో రూ.7.80 కోట్లతో నిర్మించిన బాలికల పాఠశాల భవనాలను, మరో రూ.7 కోట్లతో నిర్మించిన బాలుర జిల్లా పరిషత్ పాఠశాల భవనాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా విద్యార్థులతో ముచ్చటించారు. ► ఈ కార్యక్రమంలో అభివృద్ధి సహకార మంత్రిత్వ శాఖ రాష్ట్ర కార్యదర్శి జోచన్ ప్లాస్బార్ట్, జర్మన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇండియా ఆఫీసు కేఎఫ్ డబ్లు్య డైరెక్టర్ క్రిస్టోఫ్ కెస్లర్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్బాష, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మా ఊరు మొత్తం ప్రకృతి వ్యవసాయమే నా భర్త మరణించిన తర్వాత రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ పెట్టుబడి ఖర్చు తక్కువగా ఉండే ప్రకృతి వ్యవసాయానికి మళ్లాను. లాభసాటిగా ఉండడంతో డ్వాక్రా సంఘాల మహిళలకు పని కల్పించాను. ఇప్పుడు మా ఊరు ఊరంతా ప్రకృతి వ్యవసాయం చేస్తోంది. పెట్టుబడి సగమైంది. ఆదాయం రెట్టింపు అయింది. – సుశీలమ్మ, మన్యం జిల్లా, కురుపాం మండలం దేశం మొత్తం మీ వెంటే నడవడం ఖాయం కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహిస్తోంది. కానీ మీరు (ముఖ్యమంత్రి) ప్రతి ఒక్క రైతుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను చేరవేయాలని ఆలోచిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు కూడా మీ అడుగు జాడల్లో నడుస్తాయి. ఐజీ గార్ల్ న్యూటెక్ బయో సైన్సెస్గా నిలిచిపోతుంది. – నీలం పటేల్, నీతి అయోగ్ సీనియర్ అడ్వయిజర్ విశ్వజనానికి ప్రకృతి వ్యవసాయ ఫలాలు ఐజీ గార్ల్ సంస్థ కేవలం ఆంధ్రప్రదేశ్కో లేదా దేశంలోని ఒక ప్రాంతానికో పరిమితం కాదు. ప్రపంచంలో ప్రతి ఒక్క రైతుకు విజ్ఞానాన్ని అందించి ప్రకృతి వ్యవసాయ ఫలాలను ప్రతి ఒక్కరికీ అందించే ఆలోచనకు ప్రతి రూపం. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా ఈ సంస్థలో భాగస్వామ్యమైనందుకు సంతోషిస్తున్నాం. – ఎన్ఎన్ సిన్హా, కేంద్ర పంచాయతీరాజ్ సెక్రటరీ సీఎం కృషి అమోఘం సీఎం వైఎస్ జగన్ రైతాంగం, వ్యవసాయం పట్ల చూపుతున్న ఆసక్తి గతంలో ఏ సీఎం చూపించలేదు. జర్మన్ ప్రభుత్వం, కేంద్రం, నీతి అయోగ్, ఐకార్తోపాటు పలు విశ్వవిద్యాలయాల సహకారంతో రైతాంగానికి అండగా నిలబడేందుకు కృషి చేశారు. – కాకాణి గోవర్దన్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి మా స్కూలు చాలా బాగుంది ఇప్పుడు మా స్కూళ్లు చాలా బాగున్నాయి. ఇదంతా మీ (సీఎం) వల్లే. అమ్మ ఒడి పథకం చాలా గొప్పగా ఉంది. గోరుముద్ద వల్ల మంచి భోజనం తింటున్నాం. మీరు లెజండరీ సీఎం. మీలాంటి సీఎం దొరకడం మా అదృష్టం. మీ అండతో మేము గ్లోబల్ స్టూడెంట్స్గా మారుతాం. – శశికుమార్, జి.భానుశ్రీ, 10వ తరగతి, జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాల, వేంపల్లె -
రూ.23 లక్షల జీతాన్ని తిరిగి ఇచ్చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్.. కారణం ఏంటంటే!
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగమంటే పని చేసినా చేయకపోయినా సమయానికి జీతం తీసుకున్నామా, అందినంత వరకు సంపాదించుకున్నామా అన్నట్లు కొందరు ఉద్యోగులు ప్రవర్తిస్తుంటారు. అయితే వీటికి భిన్నంగా ఓ యూనివర్శిటీ మాష్టారు తన జీతం ఏకంగా రూ.23 లక్షలను తిరిగి తన పని చేసే కాలేజీ యాజమాన్యానికి తిరిగి ఇచ్చేశాడు. దీని వెనుక అతను చెప్పిన కారణం విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ షాకింగ్ నిర్ణయంతో బీహార్లోని ముజఫర్పూర్ ప్రాంతంలోని నితీశ్వర్ కాలేజీకి చెందిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ వార్తల్లో నిలవడమే కాకుండా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఈ విషయంపై లాలన్ ఏమంటున్నారంటే.. నితీశ్వర్ కళాశాలలో అతను చేస్తున్న టీచింగ్తో సంతృప్తిగా లేనని తెలిపారు. ఏ మాత్రం తీసుకుంటున్న చేస్తున్న పనికి సమతూకంగా లేదని తన మనస్సాక్షి చెప్పినట్టుగానే తనకు వచ్చిన 33 నెలల జీతాన్ని మొత్తం( రూ. 23 లక్షలు) పని చేస్తున్న విశ్వవిద్యాలయానికి అంకితం చేస్తున్నాను అని అన్నారు. లాలన్ కుమార్ లేఖలో ఈ విధంగా రాశారు.. విద్యార్థులకు విధ్య నేర్పించకపోతే తానేందుకు జీతం తీసుకోవాలి. ఇక 25 సెప్టెంబర్ 2019 నుంచి కళాశాలలో పని చేస్తున్నాను. అండర్ గ్రాడ్యుయేట్ హిందీ విభాగంలో 131 మంది విద్యార్థులకు ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఇక్కడి యూనివర్శిటీ విద్యార్ధులు చదువుకునే వాతావరణం లేదన్నారు. తనను మరో కళాశాలకు బదిలీ చేయాలని ఆ లేఖలో కోరారు. తాను రిజిస్ట్రార్కు లేఖ రాసిన కాపీలను వైస్ ఛాన్సలర్, ఛాన్సలర్, పీఎంవో, రాష్ట్రపతికి కూడా పంపారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఠాకూర్ తన చెక్కును స్వీకరించడానికి మొదట నిరాకరించారు. బదులుగా అతనిని తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించమని కోరాడు. అయితే అతను తనను బదిలీ చేయాలని పట్టుబట్టాడు. -
యూనివర్సిటీలపై పగబట్టిన పెద్దదొర: షర్మిల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వ విద్యాల యాలపై పెద్దదొర పగబట్టారని, సీఎం కేసీఆర్పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. యూనివర్సిటీలకొస్తే విద్యార్థులు ఎక్కడ తిరగబడతా రోనని దొరకు, దొర దందా టీమ్కి భయం పట్టుకుందని సోమ వారం ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. ‘మిమ్మల్ని అడుగు పెట్టనివ్వ లేదని వర్సిటీలను భ్రష్టు పట్టించాలని చూస్తున్నారా’ అని ఆమె ప్రశ్నించారు. ‘చదువు కుంటే ప్రశ్నిస్తరు, కొలువులు అడుగుతరనే ఖాళీగా ఉన్న 1869 ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయడం లేదా’ అని షర్మిల నిలదీశారు. విద్యార్థుల చదువును ఆగం చేసేందుకే అధ్యా పకుల పోస్టులను భర్తీ చేస్తలేరని విమర్శిం చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాల యాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసేవరకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ కొట్లాడుతుందని ఆమె స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో మెరుగైన విద్య అందేవరకూ విద్యార్థుల పక్షాన పోరాడుతామని షర్మిల హెచ్చరించారు. -
తమిళనాడులో.. ప్రపంచస్థాయి మేధస్సు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రపంచం మొత్తం మీద మేధస్సు, నైపుణ్యం కలిగిన విద్యార్థులు తమిళనాడులోనే ఉండేలా నాన్ ముదల్వన్ అనే పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు. చెంగల్పట్టు జిల్లా పయనూరులోని సాయ్ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన భవనాలను ప్రారంభించి, మరికొన్నింటికి సీఎం స్టాలిన్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ, తమిళనాడు ప్రభుత్వ అజమాయిషీలో 13 యూనివర్సిటీలు ఉండగా, నేడు ప్రైవేటు విద్యాసంస్థ అయిన సాయ్ యూనివర్సిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ముఖ్యమంత్రి కరుణానిధి ఉన్నతవిద్యకు ప్రవేశ పరీక్షను రద్దు చేశారని గుర్తుచేశారు. అందుకే ప్రస్తుతం తమిళనాడులో 51.4 శాతానికి పైగా విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘనత కరుణానిధికే చెందుతుందన్నారు. ఇంజినీరింగ్, వైద్య విద్యలో ప్రవేశపరీక్ష రద్దును సుప్రీంకోర్టు ద్వారా ఆయన సాధించారని గుర్తు చేశారు. అందుబాటులోకి సంచార వైద్య వాహనాలు పేదల ఆరోగ్య సంరక్షణకై రెండోదశ సంచార వైద్యసేవలను సీఎం స్టాలిన్ మంగళవారం ప్రారంభించారు. తొలిదశలో ఏప్రిల్ 8వ తేదీన 133 సంచార వైద్యవాహనాలను, మలిదశగా మంగళవారం 256 సంచార వైద్య వాహనాలను జెండా ఊపి ఆవిష్కరించారు. ఈసీఆర్ ఇకపై.. కలైంజ్ఞర్ కరుణానిధి రోడ్డు చెన్నై–మహాబలిపురం మధ్యనున్న రహదారి ఈసీఆర్ (ఈస్ట్ కోస్ట్ రోడ్డు)గా పేరుగాంచింది. ఈ రహదారికి స్టాలిన్ ప్రభుత్వం ‘కలైంజ్ఞర్ కరు ణానిధి రోడ్డు’గా నామకరణం చేసింది. ఇందుకు సంబంధించి మంగళవారం జీవో జారీ చేసింది. చదవండి: Karti Chidambaram: కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు.. సెటైర్ వేసిన ఎంపీ -
ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ వర్సిటీ సాధ్యమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం నియమించిన కమిటీ పలు సిఫారసులు చేసింది. ప్రస్తుతం మాదాపూర్లో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్)ను విశ్వవిద్యాలయం స్థాయికి పెంచేందుకు వీలుగా సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం ఇటీవల ఓ కమిటీని నియమించింది. రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి చైర్మన్గా ఉండే ఈ కమిటీలో న్యాక్ డైరెక్టర్ జనరల్ సభ్యకార్యదర్శిగా, క్రెడాయ్ నుంచి ముగ్గురు, బిల్డర్స్ అసోసియేషన్ నుంచి ఇద్దరు ప్రతినిధులు, సీఐఐ నుంచి ఒకరు చొప్పున సభ్యులుగా ఉన్న కమిటీ లోతుగా పరిశీలించి తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. యూనివర్సిటీ స్థాయికి ఎదిగే అన్ని అర్హతలు, సామర్థ్యాలు న్యాక్కు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే వర్సిటీని స్థాపించేందుకు ఏర్పాట్లు ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వం అనుమతించిన తర్వాత వర్సిటీ ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నివేదికలో పొందుపరిచిన అంశాల్లో కొన్ని ఇలా ఉన్నాయి. ► దీన్ని గ్లోబల్ కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ లేదా ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ యూనివర్సిటీగా పేర్కొనాలి. విదేశాల నుంచి కూడా సివిల్ ఇంజనీర్లు ఇం దులో చేరే స్థాయికి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ► ఇందులో స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ కన్స్ట్రక్షన్, స్కూల్ ఆఫ్ సస్టెయినబుల్ కన్స్ట్రక్షన్ ఫర్ అర్బన్ ప్లానింగ్, డిజిటల్ కన్స్ట్రక్షన్ స్కూల్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ స్కూల్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, స్కూల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్ఛర్ ఇంజనీరింగ్.. ఇలా ఐదు రకాల విభాగాల కింద స్పెషల్ కోర్సులు ఏర్పాటు చేయాలి. ► సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 40 ఏళ్ల క్రితం నాటి బోధనే ఇప్పుడూ సాగుతుండటంతో అందులో పురోగతి లేకుండా పోయింది. దాన్ని ఈ యూనివర్సిటీతో భర్తీ చేసి యూరప్, అమె రికా, సింగపూర్ లాంటి దేశాల నిర్మాణ రం గంలో వస్తున్న ఆధునికతను ఈ యూనివర్సిటీ కూడా స్థానికంగా అందిస్తుంది. ► యూనివర్సిటీని ఎంటెక్తో ప్రారంభించాలి. బీటెక్ విద్యార్థులకు పీజీ కోర్సులు అందిస్తూ రెండు, మూడేళ్లలో బీటెక్, ఆ తర్వాత రీసెర్చ్ విభాగాలు ప్రారంభించాలి. -
త్వరలో మహిళా వర్సిటీ కార్యకలాపాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం (2022– 23) నుంచి తెలంగాణ తొలి మహిళా యూనివర్సిటీ కార్య కలాపాలు కొనసాగిస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటిం చారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు సమకూరు స్తున్నా మని తెలిపారు. విశ్వవిద్యాలయ ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఉస్మా నియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రవీందర్కు మంత్రి సోమవారం అందజేశారు. అనంతరం ఉన్నత విద్యాధికారులతో సబిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా వర్సిటీ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. యూని వర్సిటీలో అవసరాలు, నియా మకాలకు సంబంధించి విధి విధానాలు రూపొందించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రికి సూచించినట్లు చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, కోఠి ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ విద్యుల్లత తదితరులున్నారు. టీచర్ల పదోన్నతులపై వీడని ప్రతిష్టంభన మరోవైపు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్న తులపై టీచర్ల సంఘాలతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం జరిపిన చర్చల్లో స్పష్టత రాలేదు. మరో మూడు రోజుల్లో చర్చలు తిరిగి కొనసాగిం చాలని నిర్ణయించారు. ముఖ్యంగా ప్రధానో పాధ్యాయుల పదోన్నతుల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఎంఈ వోలుగా పదోన్నతులు తమకే ఇవ్వాలని ప్రభుత్వ టీచర్లు డిమాండ్ చేస్తుంటే, పంచా యతీరాజ్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకూ ప్రాధా న్యత ఇవ్వాలని కొన్ని సంఘాలు మంత్రికి నివేదించాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల మంది ఉపాధ్యాయులుంటే, ఇందులో 90 వేల మంది స్థానిక సంస్థలకు చెందిన వారే ఉన్నారని ఉపాధ్యా య సంఘాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో పదోన్నతులన్నీ ప్రభుత్వ ఉపాధ్యాయులకే ఇవ్వడం సరికాదని ఆ సంఘాల నేతలుపేర్కొన్నారు. -
కరెంట్ కొరతకు కొత్త జవాబు
నా ఉచ్ఛ్వాసం కవనం... నా నిశ్వాసం గానం.. అన్నాడో కవి. నా ఉచ్ఛ్వాసం మీథేన్.. నా నిశ్వాసం విద్యుత్.. అంటున్నాయి ఒక రకం బ్యాక్టీరియాలు. మానవాళిని వేధిస్తున్న పర్యావరణ కాలుష్యం, ఇంధన కొరతకు అవి సమాధానం చెబుతాయంటున్నారు శాస్త్రవేత్తలు.. జనాభా పెరిగిపోయే కొద్దీ శిలాజ ఇంధనాల వాడకం పెరిగి వాతావరణ కాలుష్యం హద్దులు దాటుతోంది. అలాగని ఇంధన వాడకాన్ని పరిమితం చేయదలిస్తే మానవ అభివృద్ధి కుంటుపడుతుంది. ఈ నేపథ్యంలో పర్యావరణహిత ఇంధనాల కోసం మనిషి అన్వేషణ చాలా రోజులుగా జరుగుతోంది. వాయు, సౌర విద్యుత్లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం జరుగుతున్నా అది శిలాజ ఇంథనాలను పరిమితం చేసే స్థాయిలో జరగడంలేదు. వీటికయ్యే ఖర్చు, సాంకేతిక సమస్యలు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని విరివిగా వాడేందుకు అడ్డంకిగా మారుతున్నాయి. తాజాగా ఈ సమస్యకు పరిష్కారం దొరికిందంటున్నారు శాస్త్రవేత్తలు. వాయు కాలుష్యకాల్లో కీలకమైన మీథేన్ను వాడుకుని విద్యుత్ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాను కనుగొన్నామని నెదర్లాండ్స్ పరిశోధకులు చెప్పారు. మీథేన్ను ఇంధనంగా వాడుకోవడం చాలా రోజులుగా జరుగుతున్నదే. బయోగ్యాస్ ప్లాంట్లలో వ్యర్థాలను సూక్ష్మ జీవులు మీథేన్గా మారుస్తాయి. ఇలా ఉత్పత్తి అయిన మీథేన్ను మండించి టర్బైన్లు తిరిగేందుకు వాడతారు. దీంతో విద్యుదుత్పాదన జరుగుతుంది. అయితే ఉత్పత్తి అయిన బయోగ్యాస్లో సగానికన్నా తక్కువే విద్యుదుత్పాదనకు ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో తమ ప్రయోగం ప్రత్యామ్నాయ ఇంధనోత్పత్తిలో ముందడుగు అని రాడ్బౌడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కార్నెలియా వెల్టె చెప్పారు. ప్రయోగ ఫలితాలను ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీలో ప్రచురించారు. ఇలా చేశారు పరిశోధనలో భాగంగా కాండిడేటస్ మిథేనోపెరెండెన్స్ అనే బ్యాక్టీరియాకున్న ప్రత్యేక టాలెంట్ను గుర్తించామని వెల్టె చెప్పారు. ఈ సూక్ష్మజీవులు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా బతుకుతుంటాయి. ఇవి మీథేన్ను ఆక్సిజన్ అవసరం లేకుండానే విడగొట్టి శక్తిని ఉత్పత్తి చేస్తాయని చెప్పారు. ఏఎన్ఎంఈ (అనరోబిక్ మీథనోట్రోపిక్) ఆర్కియాగా పిలిచే ఈ జీవులు కొన్ని రసాయన ప్రక్రియల ద్వారా తమ సమీపంలోని పదార్ధాల నుంచి ఎలక్ట్రానులను విడగొడతాయి. కరెంటంటేనే ఎలక్ట్రానుల ప్రవాహం. అంటే ఇవి తమ దగ్గరలోని పదార్ధాలను ఆక్సిడైజ్ చేసి కరెంటును ఉత్పత్తి చేస్తాయి. ఇందుకు కొద్దిగా నైట్రేట్ల సాయం తీసుకుంటాయి. ప్రయోగంలో భాగంగా ఈ సూక్ష్మజీవులను ఆక్సిజన్ రహిత ట్యాంకులో మీథేన్తో కలిపి ఉంచారు. దగ్గరలో ఒక మెటల్ ఆనోడ్ను జీరో ఓల్టేజ్ వద్ద సెట్ చేసి పెట్టారు. దీంతో ఈ మొత్తం సెటప్ ఒక బ్యాటరీలా మారిందని, ఇందులో ఒకటి బయో టెర్మినల్ కాగా ఇంకోటి కెమికల్ టెర్మినల్ అని వెల్టె తెలిపారు. సదరు బ్యాక్టీరియా తమ దగ్గరలోని మీథేన్నుంచి ఎలక్ట్రానులను విడగొట్టి కార్బన్ డైఆక్సైడ్గా మారుస్తాయి. ఈ ప్రక్రియలో దాదాపు చదరపు సెంటీమీటర్కు 274 మిల్లీ యాంప్ల కరెంటు ఉత్పత్తి అయింది. దీన్ని మరింత పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిశోధన ఆధారంగా భారీ స్థాయిలో బ్యాక్టీరియా బ్యాటరీలను నిర్మించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ► ప్రపంచ జనాభాలో 94 కోట్ల మంది (13 శాతం)కి ఇంకా విద్యుత్ సౌకర్యం లేదు. ► భూతాపాన్ని పెంచే గ్రీన్హౌస్ వాయువుల్లో మీథేన్ కీలకమైనది. మొత్తం గ్రీన్హస్ వాయువుల్లో దీని వాటా 20 శాతం. ► కార్బన్ డై ఆక్సైడ్తో పోలిస్తే మీథేన్ భూమిపై సూర్యతాపాన్ని 25 శాతం వరకు పట్టి ఉంచుతుంది. ► పశువ్యర్థాలు, బొగ్గు గనుల నుంచి ఎక్కువగా మీథేన్ విడుదలవుతుంది. ► భారీస్థాయిలో శిలాజ ఇంధనాల వాడకం తగ్గితే భూతాపం గణనీయంగా అదుపులోకి వస్తుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఊసులాడే ఫంగస్లు
లండన్: భూమి మీద పుట్టిన దాదాపు ప్రతి జీవి ఏదో రూపంలో సాటి జీవులతో సమాచార ప్రసారం చేస్తుంటాయి. మనిషి మాటల ద్వారా భావాన్ని ప్రసారం చేస్తే, జంతువులు పలు శబ్దాల ద్వారా, కదలికల ద్వారా చేస్తుంటాయి. వృక్షాలు రసాయన సంకేతాలతో సంభాషించుకుంటాయి. మరి జీవ పటంలో ఇంకా దిగువకు వెళ్లే కనిపించే శిలీంద్రాల సంగతేంటి? పుట్టగొడుగుల్లాంటి శిలీంద్రాలన్నీ మొద్దబ్బాయిల్లాంటివేనా? లేదా మనకు తెలీని రూపంలో వీటిలో సమాచార ప్రసారం జరుగుతుందా? వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ సైంటిస్టు అండ్రూ అడమట్జీ్క చేపట్టిన నూతన పరిశోధన ఈ ప్రశ్నలకు సమాధానాలిస్తోంది. శిలీంద్రాలు వాటికే సొంతమైన ఎలక్ట్రికల్ భాషలో ఊసులాడుకుంటాయని పరిశోధన సూచిస్తోంది. పుట్టగొడుగులు ఇరుగుపొరుగుతో సంభాషించేందుకు వాక్యాలను కూడా వాడతాయని పేర్కొంది. ప్రతి బహుకణ జీవిలో కూడా సమాచార ప్రసారానికి నాడులు కారణం. ఇవి విడుదల చేసే ఎలక్ట్రిక్ తరంగాల ఆధారంగానే జీవజాలంలో ప్రసారం సాధ్యమవుతోంది. ఫంగస్లో కూడా ఇలాంటి నాడులుంటాయి. వీటిని హైఫే అంటారు. ఒక ఫంగల్ కాలనీలోని జీవులన్నింటి హైఫేలన్నీ కలిసి భూమి ఉపరితలం దిగువన ఒక వలలాంటి నిర్మాణం (మైసీలియం)ను ఏర్పాటు చేస్తాయి. ఈ వల ద్వారా మొత్తం కాలనీకి సమాచారం అందుతుంది. ఈ నెట్వర్క్ను జీవుల్లోని నాడీ వ్యవస్థతో పోల్చవచ్చు. ఇలా కనుగొన్నారు చిన్న చిన్న ఎలక్ట్రోడులను ఉపయోగించి నాలుగు ప్రజాతుల ఫంగస్ మైసీలియంలు విడుదల చేసే విద్యుత్ ప్రేరణలను ఆండ్రూ రికార్డు చేశారు. వీటిని పరిశీలిస్తే ప్రతి ప్రేరణ తరంగధైర్ఘ్యం, తరచుదనం, కాలపరిమితి వేరేగా ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రేరణల నమూనాలను గణిత సూత్రాల ఆధారంగా విశ్లేషిస్తే అవి మానవ ప్రసంగ నమూనా(ప్యాటర్న్)తో పోలినట్లు గుర్తించారు. ఫంగస్ల భాషలో దాదాపు 50 వరకు పదాలు వివిధ వాక్యాల రూపంలో పేర్చడం గమనించినట్లు ఆండ్రూ చెప్పారు. ఒక్కో ఫంగస్ ప్రజాతిలో ఒక్కో రకమైన భాష వాడుకలో ఉందని, షైజోఫైలమ్ కమ్యూనే అనే ప్రజాతి అత్యంత క్లిష్టమైన భాషను వాడుతోందని తెలిపారు. దగ్గరలోని ఆహార లభ్యత, ప్రమాద హెచ్చరికలు, నష్టం కలిగించే అంశాల గురించి ఇవి మాట్లాడుకుంటాయని అంచనా వేశారు. ఫంగస్లు భూమిలోపల అంతర్గత నెట్వర్క్తో సమాచార ప్రసారం చేస్తాయని గతంలోనే అంచనాలున్నాయి. తాజా పరిశోధనతో ఈ సమాచార ప్రసారం ఆషామాషీగా జరగదని, మానవుల్లో జరిగినంత పకడ్బందీగా జరుగుతుందని తెలిసింది. ఫంగస్ల తెలివితేటలు, చేతనపై మరిన్ని పరిశోధనలకు తాజా సమాచారం ఉపయోగపడనుంది. సో, ఇకపై పుట్టగొడుగులు తినేముందు అవి ఏం చెబుతున్నాయో తెలుసుకోండి! -
ఏడాదికి రెండుసార్లు ‘క్యూట్’ !
న్యూఢిల్లీ: కొత్తగా నిర్వహించనున్న ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ–క్యూట్)’ను వచ్చే సెషన్ నుంచి ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని భావిస్తున్నట్లు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ చెప్పారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబం ధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కొత్తగా క్యూట్ను నిర్వహించనున్న విషయం తెల్సిందే. బోర్డు ఎగ్జామ్ మార్కుల ప్రాధాన్యతను తగ్గించాలనో, కోచింగ్ సంస్కృ తిని మరింత పెంచాలనే ఉద్దేశంతోనో క్యూట్ ను ప్రవేశపెట్టడంలేదని జగదీశ్ స్పష్టంచేశారు. (చదవండి: కేంద్ర పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి: మోదీ) -
భారత యూనివర్శటీలో చేర్చుకోవాలి: ఎంపీ మిథున్ రెడ్డి
-
శివనాడార్ వర్సిటీలో ప్రవేశానికి దరఖాస్తులు
UG Admissions In Shiv Nadar University 2022: ఢిల్లీకి చెందిన విశ్వవిద్యాలయం శివనాడార్ 2022–23 విద్యా ఏడాదికి పలు కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంజనీరింగ్, నేచురల్ సైన్సెస్, మేనేజ్మెంట్– ఎంటర్ ప్రెన్యూర్షిప్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్లో అండర్ గ్రాడ్యుయేట్ పరిశోధన అందించే అకాడమీ ఆఫ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు చేపడుతోంది. బీఎస్సీ (పరిశోధన), కెమిస్ట్రీ డిగ్రీతో పాటు ఒక కొత్త ఏకీకృత బ్యాచిలర్ ఇన్ టెక్నాలజీ ప్రోగ్రామ్ను పరిచయం చేయనుంది. శాట్, ఏసీటీ, ఎస్ఎన్యూ, జేఈఈ మెయిన్స్ స్కోరుతో ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని శివనాడార్ ఈడీ కల్నల్ గోపాల్ కరుణాకరన్ ఒక ప్రకటనలో తెలిపారు. (క్లిక్: అందుకే భారతీయులు ఉక్రెయిన్ బాట!) -
గౌతమ్రెడ్డి పేరిట అగ్రికల్చర్ యూనివర్సిటీ
సాక్షి, ఉదయగిరి: మేకపాటి రాజమోహన్రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (మెరిట్స్)ను మేకపాటి గౌతమ్రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజమోహన్రెడ్డి కోరారు. అత్యంత విషాదకర సమయం.. తన ముద్దుల కొడుకు, మేకపాటి కుటుంబ రాజకీయ ఆశాసౌధం హఠాన్మరణం తట్టుకోలేక దుఃఖాన్ని పంటి బిగువున బిగబట్టుకున్న వేళ.. ఇంతటి బాధాతప్త సమయంలో కూడా నెల్లూరు పెద్దాయన రాజమోహన్రెడ్డి ఉదయగిరి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాల అభివృద్ధిని మరువలేదు. బుధవారం ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన మంత్రి గౌతమ్రెడ్డి అంత్యక్రియలకు సీఎం వైఎస్ జగన్ విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎంతో పెద్దాయన మెట్ట ప్రాంత అభివృద్ధి, పలు విషయాల గురించి మాట్లాడారు. ఉదయగిరిలో వందెకరాల్లో తాను ఏర్పాటుచేసిన ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన రూ.225 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎంతో చెప్పారు. దీనికిగానూ మేకపాటి గౌతమ్రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని కోరారు. స్పందించిన సీఎం త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే కళాశాల పేరు మార్చడంతోపాటు అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పెద్దాయనకు హామీ ఇచ్చారు. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలతోపాటు గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఒంగోలు మెట్ట ప్రాంతాలకు తాగు, సాగునీరందించే వెలుగొండ ప్రాజెక్టు, సోమశిల హై లెవెల్ కెనాల్, ఫేజ్–1, ఫేజ్–2లను పూర్తి చేసి త్వరగా డెల్టాగా మార్చాలని రాజమోహన్రెడ్డి కోరారు. వెలుగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. చదవండి: (పోలీస్ స్టేషన్ల పరిధి మార్పు.. ప్రభుత్వం ఉత్తర్వులు) వీఎస్యూలో ఘన నివాళి వెంకటాచలం: మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్యూ)లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి గురువారం ఘన నివాళులర్పించారు. వీఎస్యూ వీసీ జీఎం సుందరవల్లి, రెక్టార్ ఎం.చంద్రయ్య, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి తదితరులు గౌతమ్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ మంచి వ్యక్తిత్వం కలిగిన గౌతమ్రెడ్డి అకాల మరణం చాలా బాధాకరమన్నారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడు, వ్యాపారవేత్త అయిన వ్యక్తి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. అనతికాలంలోనే పలు అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చి అభివృద్దిలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఆయన అకాలమరణం రాష్ట్రానికి తీరనిలోటని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ సాయిప్రసాద్రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సుజయ్కుమార్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. -
యూనివర్సిటీలకు అన్నివిధాలా సాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచస్థాయి సాంకే తికతను చేరువ చేసేం దుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం ముందుకు వచ్చింది. యూనివర్సిటీలకు అన్నివిధాలా సాయం అంది స్తామని యూజీసీ తెలిపింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్చైర్మన్ ప్రొఫెసర్ వి.వెంకటరమణ, ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ల బృందం గురువారం ఢిల్లీలో యూజీసీ నూతన చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ను కలిసింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో తీసుకొస్తున్న మార్పులను, పురోగతిని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన బీఏ, బీకాం ఆనర్స్ కోర్సుల విషయాన్ని ప్రొఫెసర్ రవీందర్ యూజీసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. వర్సిటీలకు అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు. ఫ్యాకల్టీ అభివృద్ధి, విద్యార్థులకు ఉపకార వేతనాలివ్వ డం, పరిశోధన విధానాలను విస్తరింపజేయడంపై విశ్వవిద్యాలయాలు ప్రధానంగా దృష్టి పెట్టాయని ప్రొఫెసర్ వి.వెంకటరమణ యూజీసీ చైర్మన్కు వివరించారు. త్వరలో వీసీల సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, దానికి ముఖ్య అతిథిగా రావాలని కోరగా యూజీసీ చైర్మన్ అంగీకరించారు. తర్వాత వారు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్తో భేటీ అయ్యారు. అనంతరం సామాజిక న్యాయ, సాధికారిత విభాగం కార్యదర్శి ఆర్.సుబ్రహ్మణ్యంను కలసి రాష్ట్రంలో వివిధ వర్గాల విద్యార్థులకు పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలు, మౌలిక వసతులు, లైబ్రరీ సదుపాయాలపై తోడ్పాటు గురించి చర్చించారు. అనంతరం ఈ సమావేశాల వివరాలను ప్రొఫెసర్ లింబాద్రి మీడియాకు వివరించారు. -
రిపబ్లిక్ వేడుకల్లో తెలుగు కళారూపం
సాక్షి, హైదరాబాద్: తెలుగు కలంకారీ కళాకారుడు సుధీర్కు అరుదైన గుర్తింపు లభించింది. దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ వేడుకల్లో సుధీర్ కలంకారీ కళారూపానికి చోటు దక్కింది. పంజాబ్లోని రాజ్పురా చిట్కారా విశ్వవిద్యాలయంలోని కళాకుంభ్లో స్క్రోల్ తయారీ ప్రక్రియలో భాగంగా ఉన్న కొన్ని సంప్రదాయ రీతులను ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ కవాతు సందర్భంగా న్యూఢిల్లీ రాజ్ పథ్లో ప్రదర్శించనున్నారు. ఇందులో భాగంగా రాజ్పథ్లోని ఓపెన్ గ్యాలరీలో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (ఎన్జీఎంఎ) భారీ స్క్రోల్స్ను ప్రదర్శించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 500 మందికి పైగా కళాకారులు (వీటి పొడవు ఒక్కొక్కటి 750 మీటర్లు) దీనిని చిత్రించారు. కళారూపాల జాబితాలో కలంకారీ కళారూపం గణతంత్ర దినోత్సవ ప్రదర్శనకు ఎంపిక చేసిన ప్రతిష్టాత్మక కళారూపాల జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తికి చెందిన కళాకారుడు సుధీర్ రూపొందించిన కళారూపం కూడా ఉండటం విశేషం. సుధీర్ అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్న సంప్రదాయ కలంకారీ కళాకారుడు. కలంకారీ అనేది సహజమైన రంగులను ఉపయోగించి, చింతపండు, పెన్నుతో కాటన్ లేదా సిల్క్ ఫ్యాబ్రిక్పై చేసే చేతి పెయింటింగ్ పురాతన శైలి. ఈ కళలో డైయింగ్, బ్లీచింగ్, హ్యాండ్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, స్టార్చింగ్, క్లీనింగ్ ఇంకా మరెన్నో 23 శ్రమతో కూడిన దశలుంటాయి. కలంకారీలో గీసిన మోటిఫ్లు, పువ్వులు, నెమలి, పైస్లీలు మొదలు మహాభారతం, రామాయణం వంటి హిందూ ఇతిహాసాల దైవిక పాత్రల వరకు విస్తరించి ఉంటాయి. -
కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదా
బంజారాహిల్స్: కరోనా విజృంభణతో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పలు యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేశాయి. కొన్ని పరీక్షలను రద్దు చేశాయి. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఏవీఎన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామన్నారు. పూర్తి వివరాలను విశ్వ విద్యాలయ వెబ్సైట్లో చూడవచ్చన్నారు. జేఎన్టీయూ పరిధిలో... కేపీహెచ్బీ కాలనీ: జేఏన్టీయూహెచ్లో జరగనున్న అన్ని పరీక్షలను ఈ నెల 30వరకు వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ యం. మంజూర్ హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీ వార్షిక పరీక్షలు (థియరీ, ప్రాక్టికల్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు), మధ్యస్థ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షల రీషెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఓయూలో పరీక్షలు రద్దు.. ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 17 నుంచి 31 వరకు జరిగే పరీక్షలను రద్దు చేసినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సోమవారం పేర్కొన్నారు. వివిధ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా రెగ్యులర్, దూరవిద్య కోర్సుల సెమిస్టర్ పరీక్షలతో పాటు ఇంటర్నల్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. -
విద్యల నగరానికి సాంకేతిక విద్యాహారం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విద్యల నగరంగా పేరొందిన విజయనగరం వాసులకు ఇన్నాళ్లకు యూనివర్సిటీ లేని లోటు తీరింది. ఉత్తరాంధ్ర ప్రజలకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. విజయనగరంలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం–కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీకి పూర్తిస్థాయి యూనివర్సిటీ హోదాను కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గురజాడకు గౌరవం.. విజయనగరంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఇన్నాళ్లూ జేఎన్టీయూ–కాకినాడకు అనుబంధంగా కొనసాగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఇప్పుడు జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జేఎన్టీయూ–జీవీ) యూనివర్సిటీగా అవతరించింది. ఈ మేరకు రాష్ట్ర యూనివర్సిటీల చట్టాన్ని సవరించగా తాజాగా అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన ఇంజనీరింగ్ కళాశాలను యూనివర్సిటీగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్పు చేశారు. అంతేకాదు సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు పేరుతో వర్సిటీని నెలకొల్పి ఉత్తరాంధ్ర ప్రతిష్టను ఇనుమడింపజేశారు. వైఎస్సార్ హయాంలో ఏర్పాటు.. పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేలా ప్రభుత్వ విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తానని నాడు దివంగత వైఎస్సార్ పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. అనంతరం విజయనగరం శివారులో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను 2007లో 80 ఎకరాల విస్తీర్ణంలో ప్రశాంత వాతావరణంలో నెలకొల్పారు. ఎప్పటికైనా యూనివర్సిటీగా విస్తరించాలని భావించారు. ఐదు గ్రూప్లతో ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభమైంది. తొలుత స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తరగతులను నిర్వహించారు. మూడేళ్లలోనే రెండు వసతి గృహాలను నిర్మించారు. పక్కా భవనాల నిర్మాణం పూర్తి కావడంతో 2010 నుంచి సొంత స్థలంలోనే కళాశాల ప్రారంభమైంది. ఐదు కోర్సులకు సంబంధించి ఫ్యాకల్టీ పోస్టులను మంజూరు చేస్తూ వైఎస్సార్ హయాంలోనే ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఏడు ఇంజనీరింగ్ కోర్సులతో ఏడాదికి 420 మంది బీటెక్ విద్యార్థులు పట్టభద్రులవుతున్నారు. ఆరు కోర్సుల్లో ఎంటెక్ నిర్వహిస్తున్నారు. ఎంసీఏ కూడా ఉంది. ఉత్తరాంధ్ర విద్యార్థులకు వరం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను యూనివర్సిటీగా విస్తరించడం ఉత్తరాంధ్ర విద్యార్థులకు వరం లాంటిది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు 40 ఇంజనీరింగ్ కళాశాలల నిర్వహణ జేఎన్టీయూ–కాకినాడ పర్యవేక్షణలో జరుగుతోంది. విద్యార్థులు ఎలాంటి సమస్య తలెత్తినా, మార్కుల జాబితాలు, ఇతరత్రా ధ్రువపత్రాల కోసం కాకినాడ వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడే యూనివర్సిటీ ఏర్పాటు కావడం వల్ల ఆ సమస్యలు ఉండవు. మరింత నాణ్యమైన బోధన అందుతుంది. – ప్రొఫెసర్ జి.స్వామినాయుడు, ప్రిన్సిపాల్, జేఎన్టీయూ విజయనగరం పెరిగిన ప్లేస్మెంట్స్, నాణ్యత.. వైఎస్సార్ హఠాన్మరణం అనంతరం జేఎన్టీయూ కళాశాలపై పాలకులు నిర్లక్ష్యం వహించారు. నిధులు కేటాయించక పోవడంతో పూర్తి స్థాయిలో బోధన, బోధనేతర సిబ్బందిని నియమించలేని పరిస్థితి ఏర్పడింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీ మేరకు యూనివర్సిటీగా సీఎం జగన్ మార్పు చేశారు. రెండేళ్లుగా ఏటా 150 మందికిపైగా విద్యార్థులకు ప్లేస్మెంట్లు లభించడంతో నాణ్యత పెరిగింది. కొండవాలున సుందర ప్రాంగణం విజయనగరం శివారులోని కొండవాలున జేఎన్టీయూ ఏర్పాటైంది. దాదాపు 15,265 చదరపు మీటర్ల స్థలంలో మూడు అకడమిక్ బ్లాక్ భవనాలు, 2,865 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కళాశాల కేంద్ర గ్రంథాలయ భవనం ఇక్కడి ప్రత్యేకత. విద్యార్థులకు వైద్య సదుపాయాల కోసం 354 చదరపు మీటర్ల స్థలంలో డిస్పెన్సరీకి పక్కా భవనం ఉంది. శాఖల వారీగా వర్క్షాప్ షెడ్స్, ల్యాబ్లు, క్యాంటీన్లకు పక్కా భవనాలున్నాయి. చెరో రెండు చొప్పున విద్యార్థులు, విద్యార్థినులకు వసతి గృహాలను కేటాయించారు. క్రీడా మైదానం, ఇండోర్ స్టేడియం సదుపాయాలు కూడా ఉన్నాయి. -
చేదు వేపకు.. చెడ్డ రోగం!
సాక్షి, హైదరాబాద్: పురుగులు, కీటకాలను నివారించేందుకు, మరెన్నో సమస్యలకు మందుగా వాడే వేప చెట్లను.. ఓ చిన్న కీటకం, మూడు శిలీంద్రాలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. చెట్లను నిలువునా మాడ్చేస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఏ ఊళ్లో చూసినా వేపచెట్ల కొమ్మలు ఎండిపోతున్నాయి. అప్పటివరకు బాగున్న చెట్లు కూడా.. చిగుళ్లు, ఆకులు, కొమ్మలు వరుసగా ఎండిపోయి నిట్టనిలువుగా మాడిపోయినట్టు కనిపిస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో.. వ్యవసాయ విశ్వవిద్యాలయం రంగంలోకి దిగింది. వర్సిటీ పరిశోధన విభాగం సంచాలకుడు జగదీశ్వర్ ఆధ్వర్యంలో నిపుణులు టి.కిరణ్బాబు, జి.ఉమాదేవి, ఎన్.రామ్గోపాల్వర్మల బృందం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేపకొమ్మలు సేకరించి పరిశీలించింది. తెగులు సోకిన భాగాలను ల్యాబ్లో పరీక్షించి సమస్యకు కారణాలను గుర్తించింది. వేపచెట్లను కాపాడే చర్యలపై ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. కానీ ప్రభుత్వ పరంగా చర్యలేమీ లేకపోవటంతో రోజురోజుకు వేప చెట్లు మాడిపోతూనే ఉన్నాయి. కీటకం కొరికి.. శిలీంద్రాలు (ఫంగస్) ఆశించి.. వేపకొమ్మల చివరిభాగంలో టిమస్కిటో బగ్ అన్న కీటకం కొరికి రసాన్ని పీల్చడంతో ఈ సమస్య మొదలైందని పరిశోధకులు గుర్తించారు. ఈ కీటకాలు ముందునుంచే ఉన్నా.. దానికితోడుగా కొన్నిరకాల శిలీంద్రాలు వ్యాపించడంతో సమస్య ముదిరిందని తేల్చారు. వేపచెట్లపై టిమస్కిటో బగ్ కొరికేసి రసం పీల్చడంతో ఆ ప్రాంతంలోని చిగుళ్లు ఎండిపోవటం మొదలవుతోంది. అదేచోట కొన్నిరకాల శిలీంద్రాలు పాగా వేసి.. మెల్లగా విస్తరిస్తూ చెట్టు నిలువునా మాడిపోయేలా చేస్తున్నాయి. ఇందులో ‘ఫోమోప్సిస్ అజాడిరెక్టే’ అన్న శిలీంద్రం తీవ్ర విధ్వంసానికి కారణమవుతోందని గుర్తించారు. వ్యవసాయ వర్సిటీ పరిశోధన బృందం చేసిన కల్చర్ టెస్టుల్లో మూడొంతులకుపైగా ఈ శిలీంద్రమే కనిపించింది. ఆ తర్వాత ఫ్యుజేరియం, కర్వులేరియా అనే ఫంగస్లు ప్రభావం చూపుతున్నట్టు తేలింది. ఇవి కాకుండా మరో ఏడెనిమిది రకాల ఫంగస్లు కనిపించినా.. అవి నామమాత్రంగానే ఉన్నట్టు పరిశోధకులు చెప్పారు. వేప చెట్ల కొమ్మలపై కనిపిస్తున్న జిగురు మచ్చలు ఈ ఫంగస్ల వల్ల ఏర్పడినవేనని తెలిపారు. వాడాల్సిన కీటకనాశనులివీ.. కీటకాలను నిర్మూలించేందుకు.. ప్రతి లీటర్ నీటిలో థయోమెథాక్సమ్ 0.2 గ్రాములు, అసిటామిప్రిడ్ 0.2 గ్రాముల చొప్పున కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. శిలీంద్రాల తెగులును నాశనం చేసేందుకు కార్బండాజిమ్, మ్యాంకోజెబ్ల మిశ్రమాన్ని ప్రతి లీటర్కు 2.5 గ్రాముల చొప్పున కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. ఆ వేపపుల్లలు వాడొచ్చు శిలీంద్రాలు ఆశించిన వేప చెట్లు ఎండిపోతున్న నేపథ్యంలో.. చాలాచోట్ల వేపపుల్లలతో పళ్లు తోముకునేందుకు జనం జంకుతున్నారు. అయితే వాటి నుంచి మనుషుల ఆరోగ్యానికి ప్రమాదమేమీ లేదని, మాడినంత మేర తొలగించి మిగతా పుల్లలతో పళ్లు తోముకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జామ చెట్లపైనా ప్రభావం ఈ శిలీంద్రాలు వేపకే పరిమితం కాకుండా కొన్ని ఇతర రకాల చెట్లపైనా కనిపిస్తున్నట్టు నిపుణులు తాజాగా గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో జామకాయలపై పెద్దపెద్ద మచ్చలు ఏర్పడుతున్నాయన్న ఫిర్యాదులు వచ్చాయని.. వాటిని పరిశీలించగా ఈ శిలీంద్రాల ప్రభావమేనని తేలిందని అనురాగ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ప్రస్తుతం జామకాయలపైనే ఈ సమస్య ఉందని, ఆ చెట్లపై ఇంకా ప్రభావం కనిపించలేదని పేర్కొన్నారు. మరోవైపు కానుగ చెట్లకు కూడా ఈ సమస్య వస్తోందని ఏజీ వర్సిటీ నిపుణులు చెప్తున్నారు. -
ఐదు జవాబులు రాస్తే సరి..
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ సాంకేతిక విద్య కోర్సుల్లోని విద్యార్థులకు యూనివర్సిటీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కనీస హాజరుశాతం నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే సులభతరమైన పరీక్షావిధానాన్ని ప్రకటించింది. గతానికి భిన్నంగా ఈ సారి కేవలం 8 ప్రశ్నలనే పరీక్షల్లో ఇస్తారు. ఇందులో ఐదింటికి సమాధానం రాస్తే సరిపోతుంది. బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మాడీ, ఫార్మాడీ (పీబీ) కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుందని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ డాక్టర్ మంజూర్ హుస్సేన్ బుధవారం ‘సాక్షి’ప్రతినిధికి తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల (నాలుగేళ్లకు కలిపి)మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. మిగతా యూనివర్సిటీలు కూడా ఇదే విధానాన్ని అనుసరించనున్నట్టు ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. గతానికి ఇప్పటికీ తేడా ♦సాధారణంగా కాలేజీ పనిదినాల్లో 75 శాతం హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతిస్తారు. ఇందులో 10 శాతం మెడికల్ గ్రౌండ్లో మినహాయింపు ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ప్రత్యక్ష బోధన ఆలస్యమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హాజరు శాతాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ♦కరోనాకు ముందు ప్రశ్నపత్రం రెండు భాగాలుగా (పార్ట్–ఏ, పార్ట్–బీ) ఉండేది. పార్ట్–ఏ నుంచి మూడు మార్కుల ప్రశ్నలు ఐదు, రెండు మార్కులవి 5.. మొత్తం 25 మార్కులుంటాయి. పార్ట్–బీలో ఐదు మార్కుల ప్రశ్నలు 10 ఇస్తారు. దీంతో రెండు పార్టుల్లో మొత్తం 75 మార్కులు, ఇంటర్నల్స్ 25 మార్కులకు పరీక్ష విధానం ఉండేది. ♦ఇప్పుడు ఒకే పార్ట్గా పరీక్ష ఉంటుంది. మొత్తం 8 ప్రశ్నలిస్తారు. ఇందులో ఐదింటికి జవాబులు రాస్తే సరిపోతుంది. ఒక్కో ప్రశ్నకు 15 మార్కులు.. మొత్తం 75 మార్కులుంటాయి. ఇంటర్నల్స్కు 25 మార్కులు ఉంటాయి. కనీస పాస్ మార్క్ 40 (ఇంటర్నల్స్తో కలిపి)గా నిర్ణయించారు. -
కరోనాతో మృతి.. టీకా వేసుకుంటే బతికేవాడేమో..
సాక్షి, వరంగల్: కాకతీయ యూనివర్సిటీ పరిధి హనుమకొండలోని సుబేదారి యూనివర్సిటీ పీజీ కళాశాలలో పార్ట్టైం లెక్చరర్గా పనిచేస్తున్న డాక్టర్ దబ్బెట మహేశ్(39) గురువారం తెల్లవారుజామున కరోనాతో మృతి చెందారు. మహేశ్కు నెల క్రితం కరోనా సోకింది. ఆయనను వరంగల్ ఎంజీఎంలో చేర్పించారు. కొద్దిరోజులకు కరోనా నెగిటివ్ వచ్చింది. కానీ ఊపరితిత్తులు దెబ్బతిని శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన మహేశ్ కేయూలో రాజనీతి శాస్త్రం పీజీతో పాటు పీహెచ్డీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పని చేశారు. కేయూ పార్ట్ టైం లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మహేశ్ మృతితో కుటుంబీకులు, విద్యార్థి సంఘాల నాయకులు, సహచర పార్ట్టైం లెక్చరర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. కేయూ ఎస్డీఎల్సీఈ మాజీ డైరెక్టర్ దినేశ్కుమార్, కేయూ అబివృద్ధి అధికారి రాంచంద్రం, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లాఖాద్రి, వివిధ సంఘాల బాధ్యులు నివాళులర్పించారు సంతాపం కేయూ ఫ్రొఫెసర్లు దినేశ్కుమార్, రామచంద్రం, ఓయూ, కేయూ జేఏసీ నాయకులు సాదురాజేశ్, దుర్గం సారయ్య, విజయ్ఖన్నా, స్టాలిన్, విజయ్, పృద్వీ, మోహన్రాజ్, సోమలింగం, నర్సింహారావు, శ్రీధర్, నివాస్, దేవోజీ నివాళులు అర్పించారు. కేయూ మొదటి గేట్ వద్ద మహేశ్ చిత్రపటానికి ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ కేయూ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు కొంగర జగన్ మహేశ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మహేశ్ చిత్రపటానికి నివాళులర్పించారు. స్వగ్రామంలో విషాదం కురవి మండల కేంద్రానికి చెందిన దబ్బెట సీతయ్య, కాంతమ్మకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మహేశ్, చిన్న కుమారుడు శ్రీను. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో శ్రీను మృతి చెందాడు. ప్రస్తుతం కరోనా కాటుకు మహేశ్ బలవడంతో తల్లిదండ్రుల రోదనలు అందరినీ కలిచివేశాయి. స్వరాష్ట్ర ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన మహేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఓయూ, కేయూ జేఏసీ నేతలు, విద్యార్థి సంఘాల బాధ్యులు కోరుతున్నారు. టీకా వేసుకుంటే బతికేవాడేమో.. మహేశ్ ఉన్నత విద్యావంతుడై ఉండి టీకా ఎందుకు వేసుకోలేదు అనే ప్రశ్న అంతిమయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. కరోనాను అరికట్టడానికి టీకా ఒక్కటే మార్గమని ప్రభుత్వం, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చైతన్య పరుస్తున్నారు. టీకా వేసుకొని ఉంటే బతికేవాడేమో అని అంతిమయాత్రలో పాల్గొన్న వారు చర్చించుకున్నారు. చదవండి: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ వల.. లాంగ్ డ్రైవ్ పేరుతో కిడ్నాప్ -
రండి బాబు రండి!.... రూ.50 వేలకే బీటెక్, డిగ్రి, ఇంటర్ సర్టిఫికేట్లు!!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ), తెలంగాణ విశ్వ విద్యాలయం (టీయూ), మహారాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్ల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసి.. నకిలీవి తయారు చేస్తూ అవసరమున్న వారికి విక్రయిస్తోంది ఓ కన్సల్టెన్సీ. రూ.50 వేల నుంచి రూ.75 వేలకు ఆయా వర్సిటీల బీటెక్, డిగ్రీ, ఇంటర్ సర్టిఫికెట్లను విక్రయిస్తున్నట్లు వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ దృష్టికి రావటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఏయూకు చెందిన 130, టీయూకు చెందిన 63, మహారాష్ట్ర ఇంటర్ బోర్డుకు చెందిన 27 నకిలీ సర్టిఫికెట్లను, 6 కంప్యూటర్లు, 4 ల్యాప్టాప్లు, 2 హెచ్పీ ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు. నగర సీపీ అంజనీకుమార్ వివరాలను వెల్లడించారు. యాకుత్పురా దోభీఘాట్కు చెందిన సయ్యద్ నవీద్ అలియాస్ ఫైసల్ (30)కు బషీర్బాగ్లోని బాబుఖాన్ ఎస్టేట్స్ 7వ అంతస్తులో క్యూబెస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కన్సల్టెన్సీ ఉంది. ఇందులో గౌలిపురకు చెందిన సయ్యద్ ఓవైస్ అలీ అలియాస్ ఓవైస్ (22) డీటీపీ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. ఈ కన్సల్టెన్సీ డీటీపీ వర్క్, వీసా ప్రాసెసింగ్, సర్టిఫికేషన్ వర్క్స్ వంటి అన్ని రకాల ఆన్లైన్ సేవలను అందిస్తోంది. కరోనా నేపథ్యంలో వ్యాపారం నష్టాల్లో ఉండటంతో అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది జులై నుంచి నకిలీ సర్టిఫికెట్లు, సాలరీ స్లిప్లు, మెడికల్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, జాబ్ ఆఫర్, రిలీవింగ్ లెటర్లు వంటివి తయారు చేస్తూ.. అవసరం ఉన్న కస్టమర్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా యూనివర్సిటీ వెబ్సైట్ల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకొని అభ్యర్థుల పేర్లు, రోల్ నంబర్లను ఫొటోషాప్, డీటీపీ వర్క్తో ఎడిట్ చేసి నకిలీవి తయారు చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేయడానికి వెళ్లే ప్రైవేట్ ఉద్యోగులకు, అల్రెడీ చేస్తున్న వారికి అంతర్గత ప్రమోషన్ల కోసం ఈ నకిలీ సర్టిఫికెట్లను విక్రయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే యూకేలోని టీసైడ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బ్లాక్పోల్, యూనివర్సిటీ ఆఫ్ లా, స్కాంట్లాండ్లోని హెరియట్వాట్ యూనివర్సిటీ, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ షిల్లెర్, యూనివర్సిటీ ఆఫ్ కన్కార్డియాలలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయించారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తే వాస్తవాలు బయటపడతాయని టాస్క్ఫోర్స్ ఓఎస్డీ డీసీపీ పి. రాధాకిషన్ రావు తెలిపారు. నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న నిందితులు నవీద్, సయ్యద్ ఓవైస్ అలీలపై సైఫాబాద్, అబిద్ రోడ్, ముషీరాబాద్, నిజామాబాద్లోని డిచ్పల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. (చదవండి: ఫిలిప్పీన్స్లో టైఫూన్ తుపాను బీభత్సం.. 21 మంది మృతి) -
Tuktuki Das: ఎం.ఏ ఇంగ్లిష్ చాయ్వాలీ
ఎం.ఏ ఇంగ్లిష్ చదివిన అమ్మాయిలు టీచర్ అవుతారు. లెక్చరర్లు కావాలని ప్రయత్నిస్తారు. ప్రయివేటు ఉద్యోగాలు అన్వేషిస్తారు. కాని టుక్టుకీ దాస్ అలా కాదు. ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’ పేరుతో టీకొట్టు తెరిచింది. నేను ఉపాధి వెతుక్కోవడం కాదు. వ్యాపార రంగంలో ఎదిగి నలుగురికీ ఉపాధి ఇస్తాను అంటోంది. కుతూహలం రేపుతున్న ఈ పోస్ట్గ్రాడ్యుయేట్ కథ ఏంటి? ‘ఐయామ్ హ్యాపిలీ సేయింగ్ దట్ ఐయామ్ బిజీ’ అంటుంది 26 ఏళ్ల టుక్టుకీదాస్. ఎంత బిజీ ఆ అమ్మాయి? ఉదయం ఐదు గంటలకు లేచి సైకిల్ మీద తన ఇంటికి రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉన్న రైల్వేస్టేషన్కు వెళుతుంది. అప్పటికే ఆమె టీ కోసం కస్టమర్లు వెయిట్ చేస్తుంటారు. అప్పటి నుంచి రాత్రి 10 వరకూ తన టీకొట్టులోనే ఉంటుంది. వచ్చిన వారందరికీ టీ ఇస్తుంది. వారితో కబుర్లు చెబుతుంది. టీ అన్నీ చోట్లా ఉంటుంది. మరి ఎందుకు ఆమె దగ్గరికే వచ్చి కొంటారు అనంటే ఆమె టీకొట్టు పేరు ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’. ఎం.ఏ ఇంగ్లిష్ చేసిన ఒక అమ్మాయి తయారు చేసి అమ్ముతున్న టీ కనుక ఇప్పుడు ఈ క్రేజ్. బెంగాల్ అమ్మాయి టుక్టుకీదాస్ది పశ్చిమ బెంగాల్లోని 24 పరగణ జిల్లాలోని హాబ్రా. ముగ్గురు పిల్లల్లో తను పెద్దది. తండ్రి వ్యాన్ డ్రైవర్. తల్లికి చిన్న కిరాణాషాపు ఉంది. ‘అందరు ఆడపిల్లల్లాగే నేను కూడా రెండు విషయాలు వింటూ పెరిగి పెద్దదాన్నయ్యా. ఒకటి:గవర్నమెంట్ ఉద్యోగం, రెండు: పెళ్లి’ అంటుంది టుక్టుకీ దాస్. 2020లో రవీంద్రభారతి యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్లో పోస్ట్గ్రాడ్యుయేషన్ చేశాక కొన్నాళ్లు ట్యూషన్ చెప్పింది. ‘నాకు టీచింగ్ అంటే ఇష్టమే కాని అది ఒకేచోట ఆపేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఇంకా ఏదో సాధించాలి. నా కాళ్ల మీద నేను నిలబడాలి’ అంటుంది టుక్టుకీ దాస్. ఎం.బి.ఏ చాయ్వాలా స్ఫూర్తి ఎం.బి.ఏ చాయ్వాలా పేరుతో ప్రఫుల్ బిల్లోర్ అనే ఎంబిఏ కేండిడేట్ తెరిచిన వరుస టీకొట్లు హిట్ అయ్యాయి. అలాగే ఆస్ట్రేలియాలో ఉప్మా విర్ది అనే ఆమె చాయ్వాలీ పేరుతో టీ అమ్ముతూ ఫేమస్ అయ్యింది. ‘నేను కూడా వారిలాగే చాయ్ దుకాణం తెరుద్దామని అనుకున్నాను. నేను ఎం.ఏ ఇంగ్లిష్ చదివాను కనుక ఎం.ఏ ఇంగ్లిష్ చాయ్వాలీ పేరుతో టీకొట్టు తెరిచాను. దీనికి ముందు ఎక్కడ టీకొట్టు పెట్టాలా అని ఆలోచిస్తే కాలేజీల వద్ద, హాస్పిటల్స్ వల్ల లేదా రైల్వే స్టేషన్లో అనే ఆప్షన్స్ కనిపించాయి. కాలేజీలు కరోనా వల్ల సరిగ్గా నడవడం లేదు. హాస్పిటల్స్ దగ్గర మనుషులు తాగడం లేదు. అందుకని రైల్వేస్టేషన్ను ఎంచుకున్నాను’ అంటుంది టుక్టుకీ దాస్. ఆ షాపు తెరవడానికి గత సంవత్సరం ట్యూషన్ చెప్పి దాచుకున్న 10 వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టింది. ‘అమ్మా నాన్నలకు నేను చాయ్ దుకాణం పెడతానని చెప్తే వద్దనలేదు కాని ఆశ్చర్యపోయారు. పైగా రైల్వేస్టేషన్ అనేసరికి ఎలా ఉంటుందో అనుకున్నారు. కాని వారి మద్దతుతో ముందుకే వెళ్లాను’ అంటుందామె. మొదటిరోజే ఉచితంగా నవంబర్ 1, 2021న హాబ్రా రైల్వేస్టేషన్లో కొంతమంది మిత్రుల మధ్య, మైక్లో వినిపిస్తున్న అనౌన్స్మెంట్ల మధ్య ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’ దుకాణాన్ని తెరిచింది టుక్టుకీదాస్. దానికి ముందు నుంచే ఆమె బ్లాగింగ్ కూడా చేస్తుండటం వల్ల తన రోజువారీ అనుభవాలను కూడా వీడియో తీసి బ్లాగ్లో ఉంచడం మొదలెట్టింది. ఈ పేరు కొత్తగా ఉండటం, ఫేస్బుక్లో ఆమె రోజూ వీడియోలు పెడుతుండటంతో వెంటనే గుర్తింపు వచ్చేసింది. జనం కుతూహలంతో ఆమె షాపుకు వచ్చి టీ తాగడం మొదలెట్టారు. ‘అక్కా.. టీ ఇవ్వు. అలాగే ఒక సెల్ఫీ కూడా’ అని కాలేజీ పిల్లలు అడగడం మొదలైంది. మొదటి రోజు రెండు గంటల పాటు కస్టమర్లను ఆకర్షించడానికి ఉచితంగా టీ ఇచ్చింది టుక్టుకీ దాస్. ఆ తర్వాత డబ్బులు అవే గల్లాపెట్టెలో పడటం మొదలయ్యాయి. ఏదీ తక్కువ కాదు రైల్వే స్టేషన్లో టీ అమ్మే అమ్మాయిని చూసి అక్కడి పోర్టర్లే మొదట చులకనగా చూశారు టుక్టుకీ దాస్ని. ‘ఏ పనైనా గౌరవప్రదమైనదే అని మన దేశంలో గ్రహించరు. అమ్మాయిలు శ్రమ చేసి తమ కాళ్ల మీద తాము నిలబడటాన్ని చూసి హర్షించాలి’ అంటుంది టుక్టుకీ దాస్. అయితే ఇప్పుడు అందరూ ఆమెను ప్రశంసాపూర్వకంగా చూస్తున్నారు. సాయం వద్దు టుక్టుకీ దాస్ చాయ్ దుకాణం పాపులర్ అయ్యేసరికి కొంతమంది పెద్దలు వచ్చి సాయం చేస్తామన్నారు. ‘నేను సున్నితంగా వారించాను. నేను పైకి వస్తే నా వల్లే రావాలి తప్ప వేరొకరి సాయంతో కాదు. నేను ఇప్పుడు నా చాయ్ దుకాణంతో సంతోషంగా ఉన్నాను. ఇంకా నేను ఈ బ్రాండ్తో కోల్కటాలో దుకాణాలు తెరవాలి. కాని ఈ దుకాణం మాత్రం మూసేయను. ఇది మొదటిది. నా సెంటిమెంట్‘ అంటుంది టుక్టుకీ దాస్. టుక్టుకీ దాస్ రోజూ చాలా బిజీగా ఉంటోంది. చాలామంది ఫుడ్బ్లాగర్స్ ఆమెతో వీడియోలు చేస్తున్నారు. ఒక అమ్మాయి ఆత్మవిశ్వాసంతో టీ అమ్ముతూ ఉండటం సంతోషంగా ఉండటం అందరికీ ఎందుకు నచ్చదు. భిన్నంగా ఆలోచిస్తే మామూలు టీ కూడా ఇలా బ్రాండ్ అయి కూచుంటుంది. -
తెలంగాణ వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్పై వేటు
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రక్షాళన మొదలైంది. శనివారం ఉన్నత విద్యామండలి కమిషనర్ నవీన్ మిట్టల్ 5 గంటలపాటు పాలకమండలి సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఇన్చార్జి రిజిస్ట్రార్ కనకయ్యను ఆ పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో ప్రొఫెసర్ యాదగిరిని నియమించారు. పదేళ్ల అనుభవం అవసరమైన సీనియర్ ప్రొఫెసర్ పోస్టుకు కేవలం ఐదేళ్ల అనుభవం ఉన్న కనకయ్య తనకు తానే ఆర్డర్లు ఇచ్చుకుని, పాలకమండలి అప్రూవల్ అయినట్లుగా ప్రకటించుకొని యూజీసీ నిబంధనలను అతిక్రమించారని నవీన్ మిట్టల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్లికేషన్ చూపించమని అడిగినా కనకయ్య చూపించలేకపోయారు. దీంతో కనకయ్య సీనియర్ ప్రొఫెసర్ పోస్టుకు అనర్హుడని నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు. కనకయ్యపై క్రమశిక్షణ చర్యల కోసం అప్పటికప్పుడే ఛార్జ్ మెమో తయారు చేశారు. అక్కడికక్కడే ప్రొ.యాదగిరికి రిజిస్ట్రార్గా ఛార్జ్ ఇప్పించి కనకయ్యను సమావేశం నుంచి బయటకు పంపించారు. అదేవిధంగా సీనియారిటీ లేని యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజును కూడా పాలకమండలి సమావేశం నుంచి నవీన్ మిట్టల్ బయటకు పంపారు. గత నెలలో అవుట్ సోర్సింగ్ విధానంలో చేపట్టిన 113 మంది అక్రమ నియామకాలను రద్దు చేస్తున్నట్లు వైస్ చాన్స్లర్ రవీందర్ గుప్తా ప్రెస్మీట్లో ప్రకటించారు. బోధన సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో అన్నిరకాల డిప్యుటేషన్లను రద్దు చేసి అందరినీ వెనక్కు పిలవాలని మిట్టల్ ఆదేశించారు. నవంబర్ 1 నుంచి టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి బయోమెట్రిక్ కచ్చితంగా అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. నవంబర్ 27న హైదరాబాద్లో మరోసారి పాలకమండలి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అక్రమ నియామకాలు, ప్రమోషన్లు, ఇన్చార్జి రిజిస్ట్రార్ వ్యవహారాలపై ‘సాక్షి’లో వరుసగా ప్రచురితమైన కథనాలను కొందరు పాలకమండలి సభ్యులు బుక్లెట్ రూపంలో నవీన్ మిట్టల్కు అందించగా వీటిపై చర్చ జరిగింది. -
టెస్లా, స్పేస్ ఎక్స్ తాజాగా ‘టెక్సాస్’.. ఎలన్ మస్క్ మరో ప్రయోగం !
Elon Musk: అతి తక్కువ కాలంలోనే తన తెలివి తేటలతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మారిన ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ టెక్నాలజీ, స్పేస్ టూరిజం, డ్రైవర్ లెస్ కారు అంటూ మాట్లాడే ఎలన్ మస్క్ తొలిసారిగా అకాడమిక్ అంశాలపై స్పందించారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ త్వరలో యూనివర్సిటీ పెట్టాలని అనుకుంటున్నట్టు ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. టెక్సాస్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పేరుతో కొత్త యూనివర్సిటీ స్థాపించే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించాడు. విద్యారంగంలో అడుగు పెట్టాలని ఉందంటూ ఎలన్ మస్క్ తాజా నిర్ణయం పట్ల నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. Am thinking of starting new university: Texas Institute of Technology & Science — Elon Musk (@elonmusk) October 29, 2021 కారణం అదేనా లోకం పోకడలకు భిన్నంగా అవుటాఫ్ ది బాక్స్ ఆలోచనలు చేయడం ఎలన్ మస్క్కి అలవాటు. అదే అతని విజయ రహస్యం కూడా. ఇరవై ఏళ్ల క్రితం ఎవరూ నమ్మని సమయంలోనే ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్తు అని అంచనా వేశాడు. స్పేస్ టూరిజంకి ఫ్యూచర్ ఉందని భారీ పెట్టుబడులు పెట్టింది కూడా తనే. అయితే డ్రైవర్ లెస్ కారుకి సంబంధించి ఎలన్ మస్క్ ఎంతగా ప్రయత్నించినా పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ధి చేయడం సాధ్యం కావడం లేదు. ఒక అడుగు ముందుకి అయితే రెండడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది పరిస్థితి. దీంతో తన ఆలోచనలకు తగ్గట్టుగా యువతను కాలేజీ డేస్ నుంచే తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ వర్సిటీని ఎలన్ మస్క్ స్థాపించే అవకాశ ఉందని అంచనాలు నెలకొన్నాయి. ఎలన్ను టచ్ చేయగలరా ఇటీవల కాలంలో ఎలన్మస్క్కి చెందిన టెస్లాతో పాటు స్పేస్ఎక్స్ కంపెనీ షేర్లు విపరీతంగా పెరిగాయి. టెస్లా కంపెనీ మార్కెట్ క్యాపిటల్ విలువ వన్ ట్రిలియన్ డాలర్లను దాటేసింది. దీంతో ఎలన్ మస్క్ సంపద ఏకంగా 300 బిలియన్లకు చేరుకుంది. అతని దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ఈ సమయంలో ఎలన్ మస్క్ ఎడ్యుకేషన్ సెక్టార్లోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన సైన్స్ అండ్ టెక్నాలజీలే ప్రధానంగా యూనివర్సిటీ స్థాపించాలని కలలు కంటున్నాడు. చదవండి: 2008లో టెస్లా కార్లపై ఎలన్ వ్యాఖ్యలు, ఇప్పుడు వైరల్ -
కొబ్బరి చెట్లకు క్లోనింగ్
తిరువనంతపురం: చాలా నెమ్మదిగా పెరిగే కొబ్బరి చెట్లను కూడా తాము క్లోనింగ్ చేయగలిగినట్లు బెల్జియం యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. బెల్జియంలోని కె.యు.ల్యువెన్ అండ్ అలయెన్స్ ఆఫ్ బయో డైవర్సిటీ ఇంటర్నేషనల్కు చెందిన పరిశోధకులు వేగంగా కొబ్బరి మొక్కలను ఎక్కువ సంఖ్యలో పెంచడంతోపాటు, కొబ్బరి జన్యు మూలాలను దీర్ఘకాలం పరిరక్షించే వీలుంది. వీరు సాధించిన విజయం భారత్ వంటి దేశాల్లోని కొబ్బరి రైతులు ఎదుర్కొనే వ్యాధులు, వాతావరణ మార్పులు, సముద్ర మట్టాల్లో పెరుగుదల వంటి సమస్యల నుంచి విముక్తి కలగనుంది. ‘అసాధ్యమని భావిస్తున్న కొబ్బరి క్లోనింగ్ను మేం సాధించాం. మా పరిశోధన కొబ్బరి జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, కొబ్బరికి పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు సాయపడుతుంది’ ఈ పరిశోధకులు ఒక ప్రకటనలో తెలిపారు. అరటి పండుపై సాగించిన పరిశోధనల ఫలితాల స్ఫూర్తితోనే ఈ విజయం సాధించినట్లు చెప్పారు. తమ విధానంపై పేటెంట్ కోసం త్వరలో దరఖాస్తు చేసుకోనున్నట్లు చెప్పారు. ఈ ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ సెప్టెంబర్ ఎడిషన్లో ప్రచురితమయ్యాయి. -
రష్యా వర్సిటీలో కాల్పులు..ఆరుగురు మృతి
మాస్కో: రష్యాలోని పెర్మ్ నగరంలోని విశ్వవిద్యాలయం సోమవారం కాల్పులతో దద్దరిల్లింది. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోగా మరో 28 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు తెగబడింది వర్సిటీ విద్యార్థేనని రష్యా దర్యాప్తు కమిటీ తెలిపింది. ఘటనకు కారణాలను వెల్లడించలేదు. కాల్పుల చప్పుళ్లకు కొందరు విద్యార్థులు భయపడి భవనం రెండో అంతస్తులోని కిటికీల నుంచి కిందికి దూకుతున్న దృశ్యాలు స్థానిక వార్తా చానెళ్లు ప్రసారం చేశాయి. కాల్పుల సమాచారం అందుకున్న ఘటనా స్థలికి ముందుగా చేరుకున్న ట్రాఫిక్ పోలీసులపైకి దుండగుడు కాల్పులు తెగబడ్డాడు. ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు గాయపడ్డాడని, నిరాయుధుడిని చేసి అదుపులోకి తీసుకున్నట్లు అంతరంగిక శాఖ వెల్లడించింది. పెర్మ్ యూనివర్సిటీలో మొత్తం 12వేల మంది చదువుకుంటుండగా ఘటన సమయంలో సుమారు 3వేల మంది ఉన్నట్లు అంచనా. వర్సిటీలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులంతా క్షేమంగానే ఉన్నారని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. -
గైడ్లకు రూ.లక్ష.. ఆపరేటర్లకు రూ.10 లక్షలు
(గువాహటి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): నవంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరిం చుకుని, టూర్ గైడ్లకు రూ.లక్ష చొప్పున, ఆపరేటర్ల(సంస్థలు)కు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొంది, రిజిస్ట్రేషన్లు ఉన్న గైడ్లు, ఆపరేటర్లకు ఈ సాయాన్ని అందజేస్తామన్నారు. కరోనా కారణంగా పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిన్నందున, వారిని ఆదుకునేందుకు కేంద్రం చర్యలు చేపడుతోందని చెప్పారు. మొత్తంగా 10 వేల మంది గైడ్లకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. సోమవారం ఈశాన్య రాష్ట్రాల మంత్రుల సదస్సులో పాల్గొన్న సందర్భంగా కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2022, జనవరి 1 నుంచి దేశ, విదేశ పర్యాటకుల కోసం దేశంలోని పర్యాటక కేంద్రాలను తెరవాలని భావిస్తున్నామని అన్నారు. అయితే, ఈ ప్రతిపాదనకు ప్రధాని మోదీ, హోం, విదేశాంగ ఇతర శాఖల నుంచి ఆమోదం లభించాల్సి ఉందని వెల్లడించారు. ఈ ఏడాది చివరికల్లా దేశంలోని అత్యధిక శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తికానుందని చెప్పారు. ఒలింపిక్స్, కామన్వెల్త్, పారాలింపిక్స్ వంటి క్రీడల్లో భారత్ మరిన్ని పతకాలు సాధించేందుకు మణిపూర్లోని ఇంఫాల్ సమీపంలో జాతీయ క్రీడల విశ్వవి ద్యాలయాన్ని ప్రారంభించేందుకు అడుగులు వేస్తున్నామని మంత్రి వివరించారు. వచ్చే రెండేళ్లలో దేశంలోని వంద విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. -
20 వరకు వైఎస్సార్ఏఎఫ్యూ పీజీసెట్ దరఖాస్తు గడువు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కడపలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో 6 కోర్సుల్లో ప్రవేశాల కోసం రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీసెట్)కు దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు నిర్ణయించారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఈసీ సురేంద్రనాథరెడ్డి శనివారం ప్రకటన విడుదల చేశారు. రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ఆఫ్ ప్లానింగ్, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (పెయింటింగ్), మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (అప్లయిడ్ ఆర్ట్స్), పీజీ డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ కోర్సుల్లో 2021–22 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హతలు, ఇతర వివరాలకు www.ysrafu.ac.in వెబ్సైట్ను సందర్శించాలని కోరారు. ఈ కోర్సుల్లో చేరాలనుకొనే వారు డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ నిర్వహిస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2021 రాయవలసి ఉంటుంది. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 20 చివరి తేదీ. ఆలస్య రుసుముతో ఈనెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు 8790571779 నంబర్లో సంప్రదించవచ్చు. ఆయా కోర్సుల్లో సీట్లు ఇలా.. ♦మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్: 20 సీట్లు ♦మాస్టర్ ఆఫ్ ప్లానింగ్: 20 సీట్లు ♦మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (పెయింటింగ్): 20 సీట్లు ♦మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (అప్లయిడ్ ఆర్ట్స్): 20 సీట్లు ♦పీజీ డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ: 20 సీట్లు ♦పీజీ డిప్లొమా ఇన్ సైంటిఫిక్ వాస్తు శాస్త్ర: 20 సీట్లు -
రజినీకాంత్కు అరుదైన గౌరవం.. పక్కా ఫేక్!
వెండితెరపై తన స్టైలిష్ ఆటిట్యూడ్తో సౌత్లోనే కాదు యావత్ ప్రపంచంలో క్రేజ్ సంపాదించుకున్నారు సూపర్స్టార్ రజినీకాంత్. అలాంటి వ్యక్తికి ఓ అరుదైన గౌరవం దక్కింది. రజినీకాంత్ పేరు మీద మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్లో వైరల్ కాగా, అశేష అభిమానగణం మురిసిపోయింది. అయితే.. ఈ వ్యవహారం ఉత్త పాత ముచ్చటేనని కాసేపటికే ఫ్యాక్ట్ చెక్లో వెల్లడైంది. సోషల్ మీడియాలో ఎక్కడో వైరల్ అవుతున్న ఒక ఫొటోను.. ప్రముఖ ఎంట్రెప్రెన్యూర్ కిరణ్ మజుందర్ షా ఆగష్టు 1న తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. రజినీకాంత్ మెడికల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ కామర్స్(అన్నీ స్పెల్లింగ్ మిస్టేక్సే) అండ్ ఆర్ట్స్ పేరిట ఈ కాలేజ్ బోర్డు ఉంది. దీంతో ఆమె సూపర్ స్టార్కు అరుదైన గౌరవం దక్కిందంటూ హర్షం వ్యక్తం చేసింది. అయితే కాసేపటికే అందులో ఉన్న పొరపాట్లను ఆమె గమనించి ట్వీట్ను డిలీజ్ చేసింది. అప్పటికే అది నిజమనుకుని చాలామంది ఆ ఫొటోను షేర్ చేశారు. ఇంకొంత మంది సెటైర్లు వేశారు. దీంతో తలైవా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఫ్యాక్ట్ చెక్.. నిజానికి అది సెటైరిక్గా రూపొందించిన ఒక మీమ్. పైగా ఎప్పుడో పదేళ్ల క్రితం పుట్టుకొచ్చింది. చాలా సార్లు వైరల్ అయ్యింది కూడా. ఇప్పుడు రజినీపై రెగ్యులర్గా వచ్చే మీమ్స్లో భాగంగా వచ్చిందా? లేదంటే యాంటీ ఫ్యాన్ కావాలని ఇప్పుడు పనిగట్టుకుని చేసిన పనేనా? అనేది తెలియాల్సి ఉంది. ఇంకోవైపు తలైవా ఫ్యాన్స్ ఎవరూ ఆ ఫొటోను షేర్ చేయొద్దని రజినీ ఫ్యాన్స్ అసోషియేషన్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేస్తోంది. ఇక ఆ ఒరిజినల్ ఫొటో మాత్రం.. భువనేశ్వర్లోని క్సేవియర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ భువనేశ్వర్ యూనివర్సిటీది. -
డాక్టర్ వైఎస్సార్ ఎఫ్యూకు 2(ఎఫ్) గుర్తింపు
ఏఎఫ్యూ (వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా కడపలో గతేడాది ఏర్పాటైన డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి 2(ఎఫ్) గుర్తింపు లభించింది. ఈ మేరకు యూజీసీ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ పరిధిలోని విశ్వవిద్యాలయాల జాబితాలో డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీకి చోటు దక్కినట్లయింది. దీంతో విశ్వవిద్యాలయం జారీ చేసే సర్టిఫికెట్లకు యూజీసీ గుర్తింపు దక్కనుంది. యూనివర్సిటీలో పరిశోధనలు, ప్రాజెక్టులు నిర్వహించేందుకు వెసులుబాటు కలుగుతుంది. వర్సిటీ ఏర్పాటైన ఏడాదికే యూజీసీ నుంచి 2(ఎఫ్) గుర్తింపు లభించడంపై వీసీ ఆచార్య దురైరాజ్ విజయ్కిశోర్, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సి.సురేంద్రనాథ్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
ఒలింపిక్స్ పతకాలే లక్ష్యం: వీసీ కరణం మల్లీశ్వరి
సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్స్ పతకాల సాధనే లక్ష్యంగా ఢిల్లీ క్రీడా యూనివర్సిటీ పనిచేస్తుందని వైస్ చాన్సలర్(ప్రకటిత) కరణం మల్లీశ్వరి చెప్పారు. దేశంలో ప్రస్తుతం క్రీడలకు కావాల్సిన వనరులున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో పతకాల సాధన సులభమేనన్నారు. ఢిల్లీ క్రీడా వర్సిటీ వీసీగా నియమితులైన క్రమంలో బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. చిన్నతనం నుంచే క్రీడలపై మనసు లగ్నం చేస్తే.. యుక్త వయసు నాటికి అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవడం, పతకాలు సాధించడం వీలవుతుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ క్రీడా యూనివర్సిటీలో ఆరో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ వరకు కోర్సులుంటాయన్నారు. ‘ఆరో తరగతి నుంచే క్రీడల్లో శిక్షణ ఇస్తే ఈ రంగంలో మరింత దూసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అకాడమీల్లో ఏదో ఒక క్రీడ మాత్రమే నేర్చుకునే వీలుంది. యూనివర్సిటీలో పలు క్రీడల పట్ల అవగాహన పెంచుకుని తగిన క్రీడను ఎంచుకునేందుకు అనేక అవకాశాలుంటాయి. క్రీడలను కెరియర్గా ఎంచుకుని ఎదగగలమన్న విశ్వాసాన్ని కల్పించేలా ఈ వర్సిటీ ఉంటుంది. క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. తెలుగు రాష్ట్రాలకే కాదు.. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఇది ఒక వరం లాంటింది. త్వరలోనే బాధ్యతలు చేపడతా. అధికారులు, ప్రభుత్వంతో చర్చించి ప్రవేశాలు, అర్హతలు, ఇతరత్రా అంశాలపై నిర్ణయం తీసుకుంటాం’ అని కరణం మల్లీశ్వరి వివరించారు. చదవండి: ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా కరణం మల్లీశ్వరి -
ధనవంతులు ఎక్కువగా ఇష్టపడే దేశం తెలుసా?
సింగపూర్: విస్తీర్ణ పరంగా చూస్తే భారత్ రాజధాని ఢిల్లీ అంత కూడా లేని చిన్న దేశం సింగపూర్. 55 ఏళ్ల క్రితం ఆ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు చాలామంది ప్రజలు మురికివాడల్లోనే జీవించేవారు. అలాంటిది పూరి గుడిసెల నుంచి ధగధగలాడే ఆకాశ మేడల దేశంగా ఎదిగింది. అతి తక్కువ కాలంలోనే శక్తిమంతమైన, సంపన్న దేశంగా సింగపూర్ ఎదగడానికి అక్కడి పౌరులు చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు రవాణా, భద్రత, ఉత్పాదకత, ఆరోగ్యం లాంటి అనేక అంశాల్లో సింగపూర్ ముందు వరసలో ఉంది. అక్కడి నేతలు, అధికారులు అవినీతికి పాల్పడకుండా నిరోధించడానికి చాలా కఠినమైన చట్టాలను ప్రవేశపెట్టింది. సింగపూర్లో సగటు ఆదాయం కూడా ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది విదేశీ ధనవంతులు అక్కడ స్థిరనివాసాలు ఏర్పరుచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా మహమ్మారితో వచ్చిన మార్పు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం...చైనా, ఇండోనేషియా ,మలేషియా నుంచి చాలా మంది ధనవంతులు షాపింగ్ చేయడానికి, క్యాసినోలో బాకరట్ ఆడటానికి లేదా ప్రపంచ స్థాయి క్లినిక్లలో వైద్య పరీక్షలు పొందటానికి సింగపూర్ వస్తుంటారు. కరోనా మహమ్మారి అన్నింటినీ మార్చింది. ఎంతో మంది వ్యాపారవేత్తలు తమ కుటుంబంతో సహా వచ్చి నెలల తరబడి సింగపూర్లో నివాసం ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో తుపాను నుంచి బయటపడటానికి వసతిని కోరుతున్నారు. అంతే కాకుండా తలసరి ప్రాతిపదికన మలేషియా, ఇండోనేషియాలో మరణాల రేటు సింగపూర్ కంటే 10 నుంచి 30 రెట్లు ఎక్కువని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. ఇక కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి సింగపూర్ కఠినమైన ఆంక్షలను అవలంబిస్తోంది. ఇప్పటివరకు ఆ దేశ జనాభాలో 30శాతం మందికి వ్యాక్సిన్లను అందించారు. ఇది చైనా, మలేషయా, ఇండేనేషియా దేశాలతో పోల్చితే రెండు రెట్లు ఎక్కువ. (చదవండి: వైరల్: వేలంలో 213 కోట్లు పలికిన ‘‘ది సాకురా’’) -
లాహోర్ యూనివర్సిటీలో లవ్ ప్రపోజ్
-
వీఐటీఏపీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబురాలు!
అమరావతి: వీ.ఐ.టీ.ఏ.పీ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వర్చవల్ విధానంలో ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ‘‘వ్యాక్సిన్ గాడ్ మదర్ ఆఫ్ ఇండియా’’ డైరెక్టర్ డాక్టర్ గగన్ దీప్ కాంగ్, ప్రొఫెసర్ మరియు లాబరేటరీ డైరెక్టర్, వెల్కమ్ ట్రస్ట్ రీసెర్చ్ లాబరేటరీ, సి.ఎం.సి. వెల్లూరు గౌరవ అతిధిగా, (వీఐఈసీఈ 1991 బ్యాచ్ పూర్వ విద్యార్థిని) సీనియర్ డైరెక్టర్, ఒరాకిల్ కార్పొరేషన్, యు.ఎస్.ఏ.. శైలజ మలిరెడ్డి హజరయ్యారు. కాగా, ముఖ్యఅతిథిగా హజరైన గగన్ దీప్ కాంగ్మామాట్లాడుతూ.. అంటూ వ్యాధులు, వ్యాధి నిరోధక టీకాల గురించి వివరించారు. ప్రస్తుతం మరియు భవిష్యత్ లలో వ్యాధుల వ్యాప్తిలో జరిగే మార్పులు గురించి తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో వ్యాధులు అతి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని దీనికి జనాభా పెరుగుదల ఇతర కారణాలు దోహదం చేస్తున్నాయని అన్నారు. ఎయిడ్స్, జిక, ఎబోలా, సార్స్, కోవిడ్ వంటి మహామ్మారులు ఎలా వ్యాప్తి చెందుతాయో, వ్యాధినిరోధక టీకాలతో వీటిని కట్టడిచేసి మరణాల రేటుని ఎలా తగ్గించావచ్చో, వివిధ వ్యాధి నిరోదోక టీకాల పనితీరు, అభివృద్ధి, భవిష్యత్ తరాలకు అవి ఉపయోగపడే విధానాల గురించి వివరించారు. గౌరవఅతిధి శ్రీమతి. శైలజ మలిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశలో వి.ఐ.టి.లో గడిపిన క్షణాలను గుర్తు చేస్తుకున్నారు. విద్యతోనే మహిళా అభివృద్ధి సాధ్యమని, జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవటానికి ప్రతి మహిళా కృషి చేయాలనీ తెలియచేస్తూ, సామజిక సేవా రంగంలో తను చేస్తున్న కార్యక్రమాల గురించి కూడా వివరించారు.వి.ఐ.టి.ఏ.పి విశ్వవిద్యాలయ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సంధ్య పెంటారెడ్డి మాట్లాడుతూ మహిళల సమన హక్కులు , వరకట్న నిషేధం, లింగ మరియు ఆర్థిక అసమానతలు, మహిళల్లో బహుళ సామర్థ్యం గురించి చక్కటి ప్రజెంటేషన ద్వారా వివరించారు. వి.ఐ.టి. ఫౌండర్ మరియు ఛాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాథన్ మాట్లాడుతూ... అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిధి, గౌరవ అతిధులను కొనియాడారు. ఆడపిల్లగా పుట్టడం అదృష్టమని, ప్రపంచ జనాభాలో 49.9 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారని, అదే భారత దేశంలో కేవలం 48.4 శాతం మంది మాత్రమే ఉన్నారని తెలియచేసారు. మహిళా సాధికారికత, రాజకీయాలలో మహిళల పాత్ర గురించి వివరించారు.మహిళలు ఉన్నత విద్యలో రాణించేందుకు యూనివర్సిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ (University Higher Education Trust) ద్వార సహాయం అందిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అనేక పోటీలలో విజేతలుగా నిలచిన విద్యార్థులకు, సిబ్బంది మరియు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వి.ఐ.టి.ఏ.పివిశ్వవిద్యాలయవైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ విశ్వనాథన్, వైస్ ఛాన్సలర్ ఎస్.వి. కోటా రెడ్డి , రిజిస్ట్రార్ సి.యల్.వి. శివకుమార్, స్టూడెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ అనుపమ నంబూరు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, వీ.ఐ.టీ.ఏ.పీ విశ్వవిద్యాలయంలో 30 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉండడం విశేషం. -
వందేళ్ల ఆనందంలో రూ.100 నాణేం
సాక్షి, న్యూఢిల్లీ: లక్నో విశ్వవిద్యాలయం 100 ఏళ్ల శంకుస్థాపన దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. యూనివర్సిటీలలో కోర్సుల రూపకల్పనలో తగిన జాగ్రత్తలు తీసుకొవాలని సలహా ఇచ్చారు. విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసగించారు. డిజిటల్ పరికరాలకు, సామాజిక మాధ్యమాలకు ఎల్లప్పుడూ సమయం కేటాయిస్తున్నారని.. సొంత విషయాలను కూడా చూసుకోవాలని సూచించారు. తమను తాము తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని.. అత్మవిశ్వాసం, సామర్థ్యంపై ఇది ప్రభావం చూపుతుందన్నారు. స్థానిక వస్తువులను ప్రోత్సహించేలా కోర్సులు ఎందుకు రూపొందించకూడదని వర్సీటీ ప్రతినిధులను ప్రశ్నించారు. ఈ వేడుక సందర్భంగా ప్రత్యేక స్టాంప్తో పాటు రూ.100 నాణాన్ని ఆయన విడుదల చేశారు. కాగా, నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి డిసెంబర్లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పార్లమెంట్ ఆవరణలో ఉన్న 5 విగ్రహాలను తాత్కాలికంగా తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. మొదట్లో డిసెంబర్ 10న శంకుస్థాపన తేదీగా అధికారులు ప్రతిపాదించారు. అయితే ప్రధాని అందుబాటులో ఉండే సమయాన్ని బట్టి తుది తేదీని ఖరారు చేయనున్నారు. PM Narendra Modi releases special stamp and Rs 100 coin to commemorate the Centennial Foundation Day of the University of Lucknow. pic.twitter.com/tMYE10vbIo — ANI (@ANI) November 25, 2020 -
కాబూల్ వర్సిటీలో కాల్పులు
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లోని కాబూల్ విశ్వవిద్యాలయంలో సోమవారం ఉదయం కాల్పులు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో కనీసం 25 మంది మృతి చెందడంగానీ, గాయపడటంగానీ జరిగిందని అఫ్గానిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. అయితే, ఎంతమంది చనిపోయారు, ఎంత మంది గాయపడ్డారనే కచ్చితమైన సమాచారం వెల్లడించలేదు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. 20 మంది మరణించి ఉంటారని అంచనా. యూనివర్సిటీలో పుస్తక ప్రదర్శన జరుగుతుండగా ముగ్గురు వ్యక్తులు హఠాత్తుగా తుపాకులతో కాల్పులు ప్రారంభించినట్లు సమాచారం. అఫ్గానిస్తాన్లోని ఇరాన్ రాయబారి ఈ పుస్తక ప్రదర్శనకు హాజరయ్యారు. కాల్పుల గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వర్సిటీ ప్రాంగణాన్ని చుట్టుముట్టారు. వర్సిటీకి దారితీసే రోడ్లను మూసివేశారు. ముష్కరులు, పోలీసుల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు జరిగాయి. కొన్ని గంటల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలీసుల ఎదురుదాడిలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. కాబూల్ విశ్వవిద్యాలయంలో కాల్పులు తామే జరిపామంటూ ఇప్పటిదాకా ఉగ్రవాద సంస్థలేవీ ప్రకటన జారీ చేయలేదు. సాయుధులైన ఉగ్రవాదులు కాబూల్ యూనివర్సిటీపై జరిపిన దాడిని ప్రధాని మోదీ ఖండించారు. -
వర్సిటీపై దాడి: 19 మంది విద్యార్థులు మృతి
ఆప్ఘనిస్తాన్: కాబూల్ యూనివర్సిటీపై ఉగ్రవాదులు సోమవారం దాడికి పాల్పడ్డారు. పేలుళ్లు, కాల్పుల శబ్ధాలతో కాబూల్ యూనివర్సిటీ ప్రాంగణం దద్దరిల్లింది. ఈ దాడిలో 19 మంది విద్యార్థులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం. మరో 22మంది గాయపడినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో నిర్వహించబోయే ఇరానియన్ బుక్ ఫెయిర్ను ప్రారంభించడానికి వచ్చే అధికారులే లక్ష్యంగా ఈ ఉగ్రదాడి జరిగినట్లు భావిస్తున్నారు. ఈ దాడిని ఆప్ఘన్ ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. అయితే ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అఫ్ఘనిస్తాన్ హోం శాఖ మంత్రి తారీఖ్ ఆరియన్ వెల్లడించారు. దాడికి పాల్పడిన ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మృతుల్లో ఎక్కువమంది విద్యార్థులే. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. -
మౌత్వాష్తో కరోనా వ్యాప్తికి చెక్?!
బెర్లిన్: గొంతులో గరగరగా అనిపించినా.. ఇబ్బందిగా ఉన్నా వేడినీటిలో కాస్తా పసుపు వేసుకుని పుక్కిలిస్తారు మనలో చాలమంది. కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైన నాటి నుంచి జనాలు తిరిగి ఈ పెరటి వైద్యం వైపు మళ్లారు. గోరు వెచ్చని నీటిలో ఉప్పు, పసుపు వేసి పుక్కిలించడం.. జీలకర్ర, అల్లం, సొంఠి, మిరియాలు వంటి మసలా దినుసులతో చేసిన కషయాలు తాగడం ప్రస్తుతం చాలామంది దినచర్యలో భాగమయ్యింది. ఈ నేపథ్యంలో మౌత్వాష్తో పుక్కిలించడం వల్ల కరోనా వ్యాప్తికి చెక్ పెట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఇలా చేయడం వల్ల నోరు, గొంతులోని కరోనా వైరస్ కణజాలం తగ్గుతుందని.. ఫలితంగా వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం తగ్గుతుందని జర్మనీలోని రూర్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అయితే మౌత్వాష్తో పుక్కిలించడం వల్ల కేవలం వైరస్ వ్యాప్తిని మాత్రమే అరికట్టగలమని.. తగ్గించడం సాధ్యం కాదంటున్నారు. ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేశారు. (లిక్విడ్ బదులు జెల్ శానిటైజర్లు విక్రయించాలి) కరోనా రోగుల్లో గొంతు, కావిటీలోల ఎక్కువ మొత్తంలో వైరల్ లోడు కనిపిస్తుందని పరిశోధకులు తెలిపారు. కరోనా వ్యాప్తికి ప్రధాన కారణం.. వైరస్ బారిన పడిన వారు ఇతరులతో మాట్లాడటం, దగ్గడం, చీదడం వంటివి చేసినప్పుడు వైరస్ డ్రాప్లెట్స్ అవతలి వారి మీద పడటంతో వారు కోవిడ్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మౌత్వాష్తో నోటిని పుక్కిలించడం వల్ల నోట్లోని వైరస్ కణాల సంఖ్య తగ్గి.. వ్యాప్తి తగ్గుతుంది అంటున్నారు పరిశోధకులు. ఈ పరిశోధన కోసం వారు జర్మనీలోని ఫార్మసీలలో లభించే 8 రకాల మౌత్వాష్లను పరీక్షించారు. ఇవన్ని వేరు వేరు పదార్థాలతో తయారు చేయబడ్డాయి. పుక్కిలించడం వల్ల లాలాజల వైరల్ లోడ్ తగ్గి.. తద్వారా కరోనా వైరస్ ప్రసారం తగ్గుతుందన్నారు. స్టడీలో భాగంగా పరిశోధకులు మౌత్వాష్లను వైరస్ కణాలతో కలిపి.. నోటిలోని లాలాజలాన్ని పోలిన ద్రవాన్ని సృష్టించారు. 30 సెకన్ల పాటు పుక్కిలించిన తర్వాత వెరో ఈ6 కణాలను పరీక్షించగా వైరస్ కణాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వెరో ఈ6 కణాలు వైరస్ను ఆకర్షిస్తాయని తెలిపారు. ఈ పరిశోధనలో చాలా మౌత్వాష్లు సమర్థవంతంగా పని చేశాయని.. ప్రత్యేకంగా మూడు రకాలు వైరస్ను పూర్తిగా తొలగించినట్లు కనుగొన్నామన్నారు. పుక్కిలించిన తర్వాత ఎంత సమయం వరకు ఈ ప్రభావం ఉంటుందనే అంశం గురించి ఇంకా స్పష్టంగా తెలియలేదన్నారు పరిశోధకులు. ముఖ్యంగా ఇతరులతో మాట్లాడే ముందు మౌత్వాష్తో నోరు పుక్కిలించడం వల్ల వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేయవచ్చు అంటున్నారు.(కరోనా సీజనల్ వైరస్ కాదు: డబ్ల్యూహెచ్వో) -
వ్యవసాయ వర్సిటీ వీసీ పీఠం ఎవరికో?
సాక్షి, యూనివర్సిటీ: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వీసీ పోస్టుకు ముగ్గురు అధ్యాపకుల ఎంపిక కోసం శుక్రవారం సెర్చ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సెర్చ్ కమిటీలో తమిళనాడు అగ్రికల్చర్ వర్సిటీ మాజీ వీసీ డాక్టర్ ఎన్.కుమార్, భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్, ఏపీ ప్రభుత్వ ఛీప్ సెక్రటరీ సభ్యులుగా ఉన్నారు. ఈ నెల 2న సెర్చ్ కమిటీ సమావేశం జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో సమావేశం రద్దు చేశారు. తిరిగి ఈ నెల 10న సమావేశం కానున్నారు. ఆన్లైన్ ద్వారా ఈ సమావేశం నిర్వహించి ముగ్గురు అధ్యాపకుల పేర్లను వీసీ పోస్టు కోసం సిఫార్సు చేయనున్నా రు. ఇక్కడ వీసీగా పనిచేసిన దామోదర నాయు డు పదవీ కాలం జూన్ 5తో ముగిసింది. ప్రస్తుతం మార్కెంటింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి తాత్కాలిక వీసీగా పనిచేస్తున్నారు. ఆది నుంచి అన్యాయమేనా? ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి దేశ స్థాయిలో గుర్తింపు ఉంది. 50 ఏళ్ల చరిత్ర ఉంది. గతంలో రాజేంద్రనగర్లో వర్సిటీ ఉండగా, రాష్ట్రం విడిపోయాక గుంటూరులో ఏర్పాటు చేశారు. నూతన వర్సిటీ ఏర్పాటు సమయంలో తిరుపతిలో వర్సిటీ ప్రధాన కార్యా లయం ఏర్పాటు చేయాలని డిమాండ్లు వినిపించాయి. తిరుపతిలో వర్సిటీ ఏర్పాటుకు అన్ని హంగులు, వసతులు, పరిశోధన సౌకర్యాలు ఉన్నా ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయలేదు. తిరుపతిలోని పలు పరిశోధన ప్రాజెక్ట్లను గుంటూరుకు తరలించారు. 2017 నుంచి 2020 జూన్ వరకు వీసీగా పనిచేసిన దామోదరనాయుడు కూడా తన హయాంలో రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు. పలు పరిశోధన ప్రాజెక్ట్లను గుంటూరు, ఇతర ప్రాంతాలకు తరలించారు. రాయలసీమ జిల్లాల్లో అధ్యాపకులు, ఉద్యోగులు అవస్థలు పడ్డారు. గత 13 ఏళ్లుగా ఈ యూనివర్సిటీకి వీసీలుగా ఈ ప్రాంతం వారు లేరు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాంతానికి చెందిన రాఘవరెడ్డిని వీసీగా నియమించారు. ఆ తర్వాత సీమ జిల్లాలకు ఆ పదవి దక్కలేదు. ఫిబ్రవరిలో విడుదల చేసిన నోటిఫికేషన్కు స్పందించి 26 మంది అధ్యాపకులు దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన వారికి వీసీ పదవి ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల భర్తీ అయిన వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీ వీసీ పోస్టు కూడా గుంటూరు ప్రాంతానికి చెందిన అధ్యాపకుడికి ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. హార్టీకల్చర్ వర్సిటీ వీసీ పదవికి సెర్చ్ ప్రతిపాదించిన ప్యానల్లో సీమ ప్రాంతానికి చెందిన ఇద్దరు అధ్యాపకులు ఉన్నప్పటికీ పదవి దక్కలేదని ప్రచారం జరుగుతోంది. వ్యవసాయ వర్సిటీ వీసీ పదవి ఈ సారైనా రాయలసీమ జిల్లాలకు దక్కుతుందో లేదో వేచి చూడాలి. -
స్కిల్ వర్సిటీ @ ఏపీఎస్ఆర్టీసీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఏపీఎస్ఆర్టీసీ స్కిల్ యూనివర్సిటీగా మారి పలు కార్యక్రమాల్ని చేపట్టింది. అంతర్జాతీయ స్ధాయిలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసి అక్కడే భారీ వాహనాల డ్రైవింగ్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించనుంది. జేసీబీలు, క్రేన్లు కొనుగోలు వాటిపైనా శిక్షణ ఇవ్వనుంది. ఈ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల ద్వారా ఏటా 5 వేల మంది స్కిల్డ్ డ్రైవర్లను అందించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ బస్ రెజునేషన్’ కార్యక్రమం కింద దేశంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలను ఎంపిక చేసింది. ఈ కార్యక్రమం కింద కేంద్రం గ్రాంటుగా నిధుల్ని అందించనుంది. ఈ నిధులతో ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సిటీ, సబర్బన్ సర్వీసులను పెంచుకునే అవకాశం ఉంది. సెట్విన్ తరహాలో బస్సులను ప్రవేశ పెట్టడం, డిపోల నిర్మాణం తదితర పనులు చేపట్టవచ్చు. కేంద్ర నిధులతో నిరుద్యోగ యువత సెట్విన్ తరహా బస్సులు కొనుగోలు చేసుకుని బస్సు ఆపరేటర్లుగా మారి సొంతంగా నడుపుకునేందుకు అవకాశముంది. రాష్ట్రంలో ప్రస్తుతం విశాఖ, విజయవాడలో తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా సిటీ సబర్బన్ సర్వీసులు లేవు. దీంతో ఆ ప్రాంతాల్లో సిటీ సర్వీసులు పెంచేందుకు ఆర్టీసీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అర్బన్ మాస్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ (యుఎంటీసీ) ద్వారా అధ్యయనం చేయించనుంది. ఇప్పటికే కాకినాడ నగరంలో అధ్యయనం చేసింది. కాకినాడకు 20 కి.మీ పరిధిలో 215 సిటీ సర్వీసులు నడిపేలా ప్రతిపాదనల్ని యుఎంటీసీకి అందించింది. కాకినాడకు చుట్టుపక్కల ఉన్న పెద్దాపురం, రామచంద్రపురం, సామర్లకోట, కరపల నుంచి సిటీ సర్వీసులు నడపే విధంగా ప్రతిపాదనలు రూపొందించారు. ఇలా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 20 కి.మీ వరకు 10 వేల సిటీ సర్వీసులు నడపాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో 60 శాతం చిన్న బస్సులు, మిగిలిన 40 శాతం పెద్ద బస్సులు అర్బన్ ట్రాన్స్పోర్ట్ కింద నడపడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. డ్రైవర్ల కొరత తీర్చేందుకే శిక్షణ కేంద్రాలు ఏపీఎస్ఆర్టీసీ ఫ్లిప్ కార్ట్తో ఓ సర్వే నిర్వహించగా, ప్రతి వెయ్యి వాహనాలకు 600 మంది డ్రైవర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఈ లెక్కన 400 మంది డ్రైవర్ల కొరత ఉంది. రాష్ట్రంలో ఒక్క విజయవాడలో మాత్రమే లారీ డ్రైవర్స్ అసోసియేషన్ వారి ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఉంది. అందువల్లే ఆర్టీసీ అంతర్జాతీయ స్థాయిలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసింది. నామ మాత్రంగా నిధులు కేటాయించి కాలం చెల్లిన బస్సులకు వర్క్షాపులలో మరమ్మతులు చేయించి డ్రైవింగ్కు సిద్ధం చేసింది. ఈ డ్రైవింగ్ శిక్షణ కేంద్రంలో ఆర్టీసీ డ్రైవర్ను అధ్యాపకుడిగా నియమించి ‘జూమ్ కార్’ తరహాలో డ్రైవింగ్లో మెలకువలు నేర్పుతారు. స్క్రాప్ బస్సుకు ఇంటెలికార్ డ్రైవింగ్ సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసి డ్రైవింగ్ను కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షిస్తారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్కోదానిలో 200 మందికి అంతర్జాతీయ స్థాయిలో డ్రైవింగ్ నేర్పిస్తారు. భారీ వాహనాల లైసెన్స్ కోసం శిక్షణ తీసుకునే వారు డీజిల్ ఖర్చు, డ్రైవర్ బత్తాలను మాత్రమే భరించాలి. స్క్రాప్ బస్సులను వినియోగించి ఆదాయం ఏటా ఆర్టీసీలో 1,600 బస్సులు స్క్రాప్ కింద వస్తున్నాయి. 10 లక్షల కి.మీ తిరిగిన బస్సులను స్క్రాప్గా గుర్తిస్తున్నారు. వీటికి రూ.లక్షతో కొత్త ఇంజిన్ ఏర్పాటు చేసి పలు చోట్ల వీటిని వినియోగించడం ద్వారా ఆదాయం ఆర్జించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో జనతా బజార్ల కోసం ఈ బస్సులను వినియోగించనుంది. వుమెన్ ఫ్రెండ్లీ కార్యక్రమం కింద మెరుగైన సౌకర్యాలతో మొబైల్ టాయిలెట్లుగా బస్సులను తీర్చిదిద్ది, ఎక్కడ అవసరమైతే అక్కడకు తరలించే ఏర్పాట్లు చేసింది. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ విధానంలో వీటిని అప్పగించనున్నారు. పట్టణాలు/నగరాల్లో చెత్తను తీసుకెళ్లే విధంగా హైడ్రాలిక్ బస్సులుగా వినియోగించనున్నారు. పలు బస్సులను కార్గో సర్వీసులుగా మార్చి.. ఏపీ సివిల్ సప్లయిస్, బెవరేజెస్ కార్పొరేషన్, సీడ్స్ కార్పొరేషన్, మార్క్ఫెడ్, ఆగ్రోస్ల ద్వారా రూ.450 కోట్ల కాంట్రాక్టులను దక్కించుకుంది. వచ్చే ఏడాదికి కార్గో ద్వారా రూ.2 వేల కోట్ల వ్యాపారం చేసేలా ఆర్టీసీ లక్ష్యం విధించుకుంది. ఏసీ బస్సులు ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో వీటిని కరోనా పరీక్షల కోసం వినియోగించనున్నారు. మొత్తం 53 బస్సులను కరోనా పరీక్షలకు వినియోగించేలా ‘సంజీవిని’ అనే కార్యక్రమం అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఆర్టీసీ అడుగులు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగానే ఆర్టీసీ అడుగులేస్తుంది. జనతా బజార్లకు బస్సులను సిద్ధం చేయడం, పరిపాలన వికేంద్రీకరణకు అనుగుణంగా సర్వీసులు ఏర్పాటు చేయడం వంటివి చేపడుతున్నాం. ఆర్టీసీకి గత ఏడాది మార్చి 21 నుంచి జూన్ 21 వరకు రూ.1,215 కోట్ల ఆదాయం వస్తే, ఈ ఏడాది ఇదే సీజన్లో కోవిడ్ కారణంగా కేవలం రూ.86 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. ఆర్టీసీ నాన్ టిక్కెట్ రెవెన్యూ పెంచుకునేందుకు స్క్రాప్ బస్సులను సాంకేతికంగా పరీక్షించి రవాణా శాఖ ద్వారా ఫిట్నెస్ పరీక్షలు చేయించి తిప్పి కొంత ఆదాయాన్ని సాధిస్తున్నాం. – మాదిరెడ్డి ప్రతాప్, ఆర్టీసీ ఎండీ -
సత్తా చాటిన ఏపీ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యా ర్థులు చండీగఢ్ వర్సిటీ ప్రాంగణ నియామకాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పంజాబ్లోని చండీగఢ్ వర్సిటీలో జరిగిన ప్రాంగణ నియామకాలు– 2020 ఫేజ్–1లో 4 వేల మంది విద్యార్థులు వివిధ కంపెనీలకు ఎంపిక కాగా.. వారిలో 64 మంది ఏపీ విద్యార్థులేనని వర్సిటీ వీసీ ఆర్.ఎస్.బావా తెలిపారు. ఇందులోనూ 36 మంది ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందుకున్నవారేనని తెలిపారు. గుంటూరు జిల్లాకు చెందిన గగన్ చాటు ఐబీఎం, కాగ్నిజెంట్, పెర్సిస్టెంట్, వర్చ్యూసా సిస్టమ్స్ అనే 4 కంపెనీల నుంచి, విశాఖపట్టణానికి చెందిన గొంటిన ఉదయ్ కుమార్కు విప్రో, కాగ్నిజెంట్, సార్టప్ ఫామ్ వంటి మూడు కంపెనీల నుంచి జాబ్ ఆఫర్లు వచ్చినట్లు వర్సిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
ఏపీ గవర్నర్కు గౌరవ డాక్టరేట్
-
ఏపీ గవర్నర్కు గౌరవ డాక్టరేట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు పంజాబ్లోని దేశ్ భగత్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. సామాజిక, శాస్త్ర రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికిగాను ఈ డాక్టరేట్ను ప్రదానం చేసినట్టు ఆ విశ్వవిద్యాలయం ప్రకటించింది. న్యాయ నిపుణుడిగా, ప్రజాప్రతినిధిగా, రచయితగా ఆయన సమాజానికి విశేష సేవలు అందించారని కొనియాడింది. పంజాబ్లోని మండీ గోబింద్గర్హ్లోని దేశ్ భగత్ విశ్వవిద్యాలయం ఏడో స్నాతకోత్సవం సందర్భంగా ఆ విశ్వవిద్యాలయ కులపతి జోరాసింగ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు శుక్రవారం డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో తమ వంతు భాగస్వామ్యం ఉండేలా యువత ప్రయత్నించాలని ఉద్భోదించారు. -
యూనివర్సిటీ యూనిట్గానే రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో అమలు చేయనున్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానం దాదాపుగా ఖరారైంది. యూనివర్సిటీ యూనిట్గానే రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిర్ణయానికి ఉన్నత విద్యామండలి నియమించిన ఏడుగురితో కూడిన అధికారుల కమిటీ నిర్ణయానికి వచ్చింది. సోమవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశం జరిగింది. త్వరలోనే దీనిపై ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నారు. అధ్యాపక నియామకాల్లో యూజీసీ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని నిర్ణయించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు రాష్ట్రంలో రాత పరీక్షను నిర్వహించాలన్న అంశంపైనా సమావేశంలో చర్చించారు. మరోవైపు 2021 నుంచి యూని వర్సిటీల్లో నియమితులయ్యే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు తప్పనిసరిగా పీహెచ్డీ ఉండాలని యూజీసీ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిర్వహించబోయే నియామకాల్లో పీహెచ్డీని అమలు చేయాలా? వద్దా? అనేది చర్చించారు. సోమవారం జరిగిన సమావేశంలో కమిటీ ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు తెలిసింది. రిజర్వేషన్లను యూ నివర్సిటీ యూనిట్గా కొనసాగిస్తేనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరుగుతుందని, డిపార్ట్మెంట్ యూనిట్గా చేస్తే అన్యాయం జరిగే ప్రమాదం ఉందని కమిటీ అభిప్రాయపడింది. వీటిపై కమిటీ త్వరలో మరోసారి సమావేశమై ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించింది. ఈలోగా యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్ల నియామకం జరుగుతుందని, ఆ తరువాత అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయని ఉన్నత విద్యా మండలి అధికారి ఒకరు పేర్కొన్నారు. -
ముందే చెప్పాం.. పట్టించుకోలేదు
న్యూఢిల్లీ: యూనివర్సిటీలో దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మూక గురించి పోలీసులకు ముందే సమాచారమిచ్చామని, అయినా వారు చర్యలు తీసుకోలేదని జేఎన్యూ విద్యార్థి సంఘం (జేఎన్యూఎస్యూ) ఆరోపించింది. ఈ నెల 5న మధ్యాహ్నం 3:00 గంటలకు వాట్సాప్లో పోలీసులకు మెసేజ్ పెట్టామని, ఆ మెసేజ్ను పోలీసులు 3:07 గంటలకు చూసి కూడా పట్టించుకోలేదని విద్యార్థి సంఘం తెలిపింది. ఈ దాడికి పాల్పడింది ఆరెస్సెస్కు చెందిన ఏబీవీపీ వర్గం వారేనని ఆరోపించింది. గత వారంలోకూడా తమ సంఘానికి చెందిన నాయకుల మీద వారు దాడిచేసినట్లు తెలిపింది. దాడికి ముందురోజు సాయంత్రం కూడా విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర యాదవ్పై దాడిచేశారని చెప్పింది. -
ఢిల్లీ జామియా వర్శిటీ వద్ద టెన్షన్
-
చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం
న్యూఢిల్లీ: భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగిత రేటు పెరిగిందని ప్రముఖ అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం తన అధ్యయనంలో పేర్కొంది. కాగా 2011-12, 2017-18 సంవత్సరాలలో దేశంలో 90లక్షల మంది ఉపాధికి దూరమయ్యారని తెలిపింది. కాగా దేశంలో 2011-12సంవత్సరాలలో 474మిలియన్లుగా ఉన్న ఉపాధి 2017-18లో 465 మిలియన్లకు పడిపోయిందని ఎంప్లాయిమెంట్ క్రైసిస్ అనే కొత్త నివేదిక పేర్కొంది. యువత, శ్రామికులు, విద్యావంతులు నిరుద్యోగంలో మగ్గిపోతున్నారని తమ అధ్యయంలో తేలినట్లు స్పష్టం చేసింది. నివేదికలోని కీలక అంశాలు నివేదిక ప్రకారం ప్రైవేట్ రంగంలో ఉపాధి స్వల్పంగా పెరిగింది. ప్రభుత్వ రంగంలో అసంఘటిత రంగానికి మెరుగైన ఉపాధి కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమ రంగాలు సైతం ఏ విధమైన కాంట్రాక్టు లేకుండా ఉపాధిని కల్పిస్తున్నట్లు తెలిపింది. దేశంలో వ్యవసాయేతర రంగాలలో సేవల రంగం అత్యధిక ఉపాధిని కల్పిస్తున్నదని తెలిపింది. కానీ పెరుగుతున్న జనాభాకు, చదువుకున్న లక్షలాది విద్యార్థులకు ఆశించిన మేర ఉపాధి లభించలేదని నివేదిక తెలిపింది. కాగా వ్యవసాయ రంగం 2011-12, 2017-18 సంవత్సరాల్లో సుమారు 27 మిలియన్ల మేర ఉపాధి క్షీణించింది అని తెలిపింది. వ్యవసాయ అనుబంధ రంగాలలో ఉపాధి వాటా కూడా 49 శాతం నుండి 44 శాతానికి పడిపోయిందని నివేదిక పేర్కొంది. తయారీయేతర రంగాలలో ముఖ్యంగా నిర్మాణ రంగం 2004-05, 2011-12 సంవత్సరాల్లో సంవత్సరానికి 4 మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తే (2011-12), (2017-18) మధ్య కాలంలో కేవలం 0.6 మిలియన్ మాత్రమే సృష్టించిందని నివేదిక పేర్కొంది. దేశంలో శ్రామిక, విద్య శిక్షణ (ఎన్ఎల్ఇటి) పొందని యువత 2004-05, 2011-12 లో మూడు మిలియన్లు ఉంటే 2017-18లో 100మిలియన్లు ఉన్నారని నివేదిక తెలిపింది. 2017-18లో ఎన్ఎల్ఇటి యువత అత్యధిక కలిగిన రాష్ట్ర్రాలలో యూపీ మొదటి స్థానంలో ఉండగా తరువాతి స్థానాలలో బిహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, అసోం తదితర రాష్ట్రాలు ఉన్నాయి. ఇక సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు 68శాతం ఉపాధిని కల్పిస్తున్నట్లు నివేదిక తెలిపింది. కాగా 2017-18 సంవత్సరం తయారీ రంగంలో 61శాతం ఉపాధిని కల్పిస్తుండగా, తయారీయేతర రంగాలలో 66శాతం నుంచి 71శాతానికి ఉపాధిని కల్పిస్తున్నట్లు తెలిపింది. కాగా దేశంలో రిజిస్టర్డ్ సంస్థల సంఖ్య భారీగా పెరిగాయి. కానీ మెరుగైన వ్యాపారం కోసం జీఎస్టి కింద సంస్థలను నమోదు చేసుకున్నప్పటికీ, వారి వ్యాపారం తక్కువ స్థాయిలో ఉండడం వల్ల ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనాలతో కూడిన ఉపాధిని కల్పించలేకపోయారని నివేదిక తెలిపింది. -
చదువుల చాందినీ!
సుమారు ఒకటిన్నర శతాబ్దాల సుదీర్ఘ ఘన చరితకు తార్కాణం. ఉత్తమ విద్యకు, అత్యుత్తమ క్రమశిక్షణకు నిదర్శనం. దక్కన్లోనే తొలి అరబిక్ యూనివర్సిటీగా సువర్ణ అధ్యాయం. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఎంతోమంది ప్రముఖులు ఉన్నతస్థాయిలో నిలిచారు. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ విశ్వవిద్యాలయం దేశంలో పేరెన్నిక గన్నది. విద్యాభ్యాసంతో పాటు ఉచితంగా హాస్టల్ వసతి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఎంతోమంది పేదలకు విద్యాదానం చేస్తోంది. అదే పాతబస్తీ సిబ్లీగంజ్లోని జామియా నిజామియా విశ్వవిద్యాలయం. జకాత్, విరాళాలు, విశ్వవిద్యాలయానికి సంబంధించిన స్థిర, చరాస్తులతో వచ్చే ఆదాయంతో ఇది కొనసాగుతోంది. ముస్లిం విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటల వేస్తోంది. అంతేకాకుండా ఉమ్మడి తెలుగు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో పాటు ఎంతో మంది ప్రముఖులు ఈ విశ్వవిద్యాలయంలోనే విద్యాభ్యాసం కొనసాగించడం గమనార్హం. ఇక్కడ చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు రాష్ట్రపతి అవార్డులు సైతం అందుకున్నారు. కొందరు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగానూ స్థిరపడ్డారు. ఈ యూనివర్సిటీ మరో రెండేళ్లలో 150 ఏళ్ల ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో జామియా నిజామియాలో రూ.14.60 కోట్లతో కొత్తగా నిర్మించిన ఆడిటోరియాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి యూనివర్సిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఆవిర్భావమిలా.. జామియా నిజామియా యూనివర్సిటీని షేక్ ఉల్ ఇస్లాం హజ్రత్ హఫేజ్ మహ్మద్ అన్వరుల్ ఫారూఖీ ఫజీలత్ జంగ్ 1872లో స్థాపించారు. ప్రస్తుతం యూనివర్సిటీ చాన్స్లర్గా సయ్యద్ అక్బర్ నిజాముద్దీన్ హుస్సేనీ కొనసాగుతున్నారు. ప్రతి ఏటా అరబిక్ కేలండర్ ప్రకారం షవ్వాల్ 9 నుంచి షాబాన్ 15 వరకు ప్రవేశాల ప్రక్రియ ఉంటుంది. 1997లో ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.11 ఖర్చు కాగా, ప్రస్తుతం రూ.200కుపైగా అవుతోంది. ఉచితమే సముచితం.. జామియా నిజామియా విశ్వవిద్యాలయంలో చదువుతో పాటు పుస్తకాలు, దుస్తులు, ఆహారం.. అన్నీ ఉచితమే. యూనివర్సిటీకి అనుసంధానంగా దేశవ్యాప్తంగా 210 పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఖురాన్, మాతృభాష, అరబిక్, పార్శీ, మతం, జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, చరిత్ర విభాగాల్లో బోధనఉంటుంది. అపురూప గ్రంథాలకు ఆలవాలం.. ఇక్కడి గ్రంథాలయంలో చేతితో రాసిన పుస్తకాలు దాదాపు 1800కుపైగా కొలువుదీరాయి. ఉర్దూ, అరబిక్, పార్శీ భాషల్లో లిఖించిన ఈ పుస్తకాలను భద్రపరిచారు. పర్షియన్ భాషలో రాసిన ‘మహాభారత’ గ్రంథం ఇక్కడి లైబ్రరీలో ఉంది. దాదాపు 209 పేజీలతో కూడిన ఈ గ్రంథాన్ని అక్బర్ కాలంలోని నవరత్నాల్లో ఒకరైన అబుల్ ఫాజిల్ పర్షియన్ భాషలోకి తర్జుమా చేసినట్లు చెబుతారు. వీటితో పాటు 400 ఏళ్ల క్రితం ఔరంగజేబ్ చేతితో రాసిన ‘రోజ్ నామ్ చా ఆలంగిరీ’ అనే డైరీ సైతం ఇక్కడ ఉండడం విశేషం. 700 ఏళ్ల క్రితం రాసిన 2,200 పుస్తకాలు ఇక్కడి లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి. వీటిని చెక్కుచెదరకుండా రసాయాలను అద్దుతూ శుభ్రపరుస్తున్నారు. ప్రధాన కోర్సులివే.. జామియా నిజామియా విశ్వ విద్యాలయంలో మౌల్వీ, ఆలీం, ఫాజీల్, కాలీం తదితర పీజీ ప్రధాన కోర్సులలో విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు. ఒక్కో కోర్సు వ్యవధి రెండేళ్ల పాటు ఉంటుంది. ఇందులో ఖురాన్ తర్జుమా, హదీస్, ఫికా, అకాయత్, కలాం, అరబిక్లలో విద్యాభ్యాసం కొనసాగుతోంది. జామియా నిజామియా జారీ చేసే ఫత్వా (నిర్ణయాత్మకమైన ఆదేశం)ను దేశం మొత్తం ఆచరించడం విశేషం. నేలపై కూర్చునేచదువుకోవాలి.. ఇక్కడి విద్యార్థులంతా నేలపై కూర్చుని చదువుకోవడం ఓ ప్రత్యేకత. టీచర్లు, ప్రొఫెసర్లకు సైతం కుర్చీలు, టేబుళ్లు ఉండవు. నిల్చొని లేదా కూర్చుని విద్యార్థులకు పాఠాలు చెబుతారు. దీవీ తాలీం కాబట్టి.. కూర్చునే విద్యాభ్యాసం చేయాలని ఇక్కడి ప్రొఫెసర్లు చెబుతున్నారు. పరీక్షలు సైతం నేలపై కూర్చునే రాయాలి. యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ సైతం తన చాంబర్లో నేలపై కూర్చుని విద్యార్థులకు విద్యాబోధన చేస్తుంటారు. 1వ తరగతి నుంచి పీజీ వరకు కూడా ఇదే సంప్రదాయం. పాదరక్షలను కూడా తరగతి గది బయటే విడవాలి. ప్రతి విద్యార్థీ విధిగా కమీజ్ ఫైజామా, తతలపై టోపీ ధరించడం ఆనవాయితీ. గడ్డంతో ఉండాలనేది ఇక్కడి నిబంధన. మూడు పూటలా పౌష్టికాహారం.. అరబిక్, పర్షియన్, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో విద్యాబోధన ఉంటుంది. విద్యార్థులకు మూడు పూటలా బలవర్థకమై ఆహార పదార్థాలను అందిస్తున్నాం. ప్రతిరోజు మధ్యాహ్నం పొట్టేలు మాసంతో భోజనం అందజేస్తాం. కాలుష్య రహితమైన కిచెన్లో కేవలం గ్యాస్ ద్వారా ఆహార పదార్థాలను వండి వడ్డిస్తున్నాం.– సయ్యద్ అహ్మద్ అలీ, రిజిస్ట్రార్ క్రమశిక్షణతో విద్యాభ్యాసం.. క్రమశిక్షణకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది. విద్యార్థులు దుర్వ్యవసనాలకు దూరంగా ఉంటారు. గుణాత్మకమైన విద్యను అందజేస్తున్నాం. ఇస్లాం సంస్కృతీ సంప్రదాయాలకనుగుణంగా విద్యాభ్యాసం అందిస్తున్నాం. కొత్తగా నిర్మించిన ఆడిటోరియాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి కృషి చేస్తున్నాం. – ముఫ్తీ కలీల్ అహ్మద్, వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ అవుతా.. నేను ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. ఇక్కడ క్వాలిటీ విద్య అందుతోంది. అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. బయటి విద్యార్థులకు మాకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. చెడు వ్యసనాల జోలికి వెళ్లం. నేను ఇక్కడే డిగ్రీ కూడా పూర్తి చేసుకుని అరబిక్లో ప్రొఫెసర్ అవుతాను.– మహ్మద్ అన్వరుల్లా, ఇంటర్ విద్యార్థి -
యూనివర్సిటీ ప్రకాశించేనా..!
సాక్షి, ఒంగోలు(ప్రకాశం) : ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు చివరి ఏడాది ఒంగోలుకు యూనివర్సిటీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీగా నామకరణం చేశారు. ఈ ప్రకటన వెలువడటంతో జిల్లాలోని పీజీ చదవాలనుకునే విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన యూనివర్శిటీకి మౌలిక వసతుల కోసం అప్పటి ఇన్చార్జి వైస్ ఛాన్సలర్ సుదర్శనరావు రూ.126 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రూ.10 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. చివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా చిన్నచూపు చూసింది. ఒంగోలులో యూనివర్సిటీ ఉన్నప్పటికీ దానికి నిధులు విడుదల చేయకపోవడంతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్గానే చెలామణి అవుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడటం, రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం, యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్సలర్గా జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ నియమితులు కావడంతో యూనివర్సిటీకీ త్వరలోనే జవసత్వాలు వస్తాయని విద్యార్థులు ఆశగా ఉన్నారు. ఫస్ట్ ఇయర్ యూనివర్సిటీ..సెకండ్ ఇయర్ పీజీ సెంటర్: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీ కింద, సెకండ్ ఇయర్ చదువుతున్న వారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్ కింద ఉన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ నడుస్తున్న పీజీ సెంటర్ను యూనివర్సిటీగా మార్చినప్పటికీ దానికి సంబంధించిన విభజన ఇంత వరకు జరగలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ ఇయర్లో 124 మంది, సెకండ్ ఇయర్లో 214 మంది చదువుకుంటున్నారు. వాస్తవానికి యూనివర్సిటీ ఉంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 1500 నుంచి 2 వేల మంది విద్యార్థులు ఉంటారు. అయితే అందుకు విరుద్ధంగా కేవలం 338 మంది విద్యార్థులతో నామమాత్రపు యూనివర్సిటీతోపాటు పీజీ సెంటర్ను నెట్టుకు వస్తున్నారు. డిపార్ట్మెంట్లు తక్కువ.. కోర్సులు తక్కువ: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీకి సంబంధించి గత ప్రభుత్వం ప్రకటన చేయడం తప్పితే తదుపరి దృష్టి సారించకపోవడంతో దాని ప్రభావం ప్రస్తుత విద్యా సంవత్సరంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లకు సంబంధించి కేవలం ఎనిమిది డిపార్ట్మెంట్లు, పది కోర్సులు మాత్రమే ఉన్నాయి. దానికితోడు సైన్స్ కోర్సులకు ల్యాబ్లు లేకపోవడంతో విద్యార్థులు ఇక్కడ చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆర్ట్స్ కోర్సులతోపాటు స్టాటిస్టిక్స్, మ్యాథ్స్ కోర్సులను నిర్వహిస్తున్నారు. వాస్తవానికి యూనివర్శిటీ పూర్తి స్థాయిలో ఏర్పడి ఉంటే డిపార్ట్మెంట్లు పెరగడంతోపాటు కోర్సులు కూడా పెరిగేవి. యూనివర్సిటీ విద్యార్థులతో కళకళలాడుతూ ఉండేది. అయితే యూనివర్శిటీకి సంబంధించి ఎలాంటి కదలిక లేకపోవడంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎక్కువ మంది విద్యార్థులు పీజీ చేసేందుకు నాగార్జున యూనివర్సిటీ వైపే మొగ్గు చూపారు. రూ.కోటి భవనం నిరుపయోగం: ఒంగోలుకు సమీపంలోని పేర్నమిట్ట వద్ద ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి 110 ఎకరాల స్థలం ఉంది. పీజీ సెంటర్లో చదువుకునే విద్యార్థుల కోసం అక్కడ కోటి రూపాయలతో రెండేళ్ల క్రితం భవనాన్ని నిర్మించారు. రూ.70 లక్షలతో చుట్టూ ప్రహరీ నిర్మించారు. అయితే కోటి రూపాయల భవనం నిరుపయోగంగా ఉంది. పీజీ సెంటర్కు హాస్టల్ నిర్మాణం జరిగిన ప్రాంతం దూరంగా ఉండటం, విద్యార్థుల సంఖ్య నామమాత్రంగా ఉండటంతో ఆ హాస్టల్ నిరుపయోగంగా ఉంది. జగన్ ప్రభుత్వం దృష్టి: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీౖపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ యూనివర్సిటీకి నెల్లూరులోని సింహపూరి యూనివర్సిటీ వైస్ చాన్సలర్ సుదర్శనరావును ఇన్చార్జి వైస్ చాన్సలర్గా గత ప్రభుత్వం నియమించింది. ప్రకాశం యూనివర్శిటీతో కలుపుకుంటే సుదర్శనరావు మూడు యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్గా ఉండటంతో ఆయన స్థానంలో జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ను ఇన్చార్జి వైస్ ఛాన్సలర్గా ప్రభుత్వం నియమించింది. విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ జిల్లాకు చెందినవారు కావడంతో యూనివర్సిటీకి సంబంధించిన కదలిక కలెక్టర్ తీసుకువస్తారని విద్యార్థులు ఆశిస్తున్నారు. -
వర్సిటీల్లో కులవివక్ష నిర్మూలించండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వర్సిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో కులవివక్ష ఆరోపణలపై స్పందించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కుల వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్న రోహిత్ వేముల, పాయల్ తాడ్విల మాతృమూర్తులు రాధిక, అబేదా దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు శుక్రవారం జస్టిస్ ఎన్.వి.రమణ, అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. కుల వివక్ష నివారణకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను వర్సిటీలు అమలు చేయడం లేదని ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాది ఇందిరా జైసింగ్ పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు, జీవించే హక్కు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 2004 నుంచి దాదాపు 20 మంది విద్యార్థుల ఆత్మహత్యలు ఈ కోవలోనివే అని న్యాయవాది వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల (2016), ముంబైకి చెందిన వైద్య విద్యార్థిని పాయల్ తాడ్వి(2019, మే) ఆత్మహత్యలకు కులవివక్షే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయోధ్యపై వాదనలకు మరో గంట బాబ్రీ మసీదు భూవివాద కేసుకు సంబంధించి ఈనెల 23న వాదనలు వినడానికి అదనంగా గంట సమయం కేటాయిస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా, కేసుల భారాన్ని తగ్గించడానికి సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఇకపై అప్పీళ్లు, బెయిళ్లు, యాంటిసిపేటరీ బెయిళ్లకు సంబంధించిన 7ఏళ్ల వరకు జైలు శిక్ష విధించగలిగే కేసులను ఒకే న్యాయమూర్తి విచారించేలా నిబంధనలను సవరించింది. -
కపిల్దేవ్కు అరుదైన గౌరవం
చండీగఢ్: టీమిండియాకు తొలి ప్రపంచకప్ అందించిన సారథి, క్రికెట్ లెజెండ్ కపిల్దేవ్కు అరుదైన గౌరవం దక్కింది. హరియాణా స్పోర్ట్స్ యూనివర్సిటీ తొలి ఛాన్స్లర్గా కపిల్దేవ్ నియమితులయ్యారు. ఈ మేరకు హరియాణా క్రీడా శాఖ మంత్రి అనిల్ విజ్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే హరియాణ స్పోర్ట్ యూనివర్సిటీకి అక్కడ కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పిన మూడో రాష్ట్రంగా హరియాణా నిలిచింది. ఇప్పటివరకు గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు మాత్రమే క్రీడా విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేశాయి. కపిల్దేవ్ సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్ గెలిచింది.. అతడి మార్గదర్శకంలో ఈ విశ్వవిద్యాలయం అభివృద్ది చెందాలని తాము భావిస్తున్నట్లు మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు. ఇప్పటికే యునివర్సిటీలో చేర్చాల్సిన కోర్సులు, సిలబస్, విధివిధానాలను రూపొందించినట్లు తెలిపారు. గ్రామస్థాయి నుంచి క్రీడలను అభివృద్ది చేస్తున్నామని, ఈ యూనివర్సిటీలో అందిస్తున్న సౌకర్యాలతో హరియాణా క్రీడా రాష్ట్రంగా రూపుదిద్దుకోవాలని మంత్రి అనిల్ విజ్ ఆకాంక్షించారు. -
తప్పు చేస్తే.. ‘మొక్క’ల్సిందే!
సూరత్: విద్యార్థులు ఏ చిన్న తప్పు చేసినా... ఆఖరికి యూనిఫామ్ వేసుకు రాకపోయినా దారుణంగా దండించే స్కూళ్లను మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే గుజరాత్లోని వీర్ నర్మాద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ వినూత్నమైన శిక్షలు వేస్తోంది. ఇక్కడి ఓ ప్రొఫెసర్కు వచ్చిన ఆలోచన ఫలితంగా... విద్యార్థులు చిన్న చిన్న తప్పులు చేసినప్పుడల్లా వారి చేత ఓ మొక్కను నాటించేలా శిక్ష విధిస్తున్నారు. దీంతో గత ఎనిమిదేళ్లలో ఈ వర్సిటీలో 550కి పైగా చెట్లు వచ్చాయి. వర్సిటీలోని ఆర్కిటెక్చర్ విభాగంలో ‘బేసిక్ డిజైన్’ సబ్జెక్టును బోధిస్తున్న ప్రొఫెసర్ మెహుల్ పటేల్ (36) ఈ వినూత్న పద్ధతికి తెరలేపారు. క్లాసులకు లేటుగా రావడం, అసైన్మెంట్లు చేయకపోవడం, క్లాసులో ఫోన్ వాడడం వంటి చిన్న చిన్న తప్పులకు మొక్కలను నాటడాన్ని శిక్షగా విధిస్తున్నారు. పచ్చదనం పెరగడం సంతోషాన్నిస్తోందని చెబుతున్నారు విద్యార్థులు. ‘పర్యావరణానికి నా వంతుగా ఏదోటి చేయాలన్న ఆలోచనతో ఈ పద్ధతిని అమలు చేస్తున్నాను. విద్యార్థులు చేసిన చిన్న చిన్న తప్పులకు మొక్కలు నాటిస్తున్నాను. 8 ఏళ్లలో క్యాంపస్లో 550పైగా మొక్కలు నాటించాను. ముందుగా నాటిన మొక్కలు 20 మీటర్లు ఎత్తు వరకు పెరిగాయి. మొక్క నాటడంతో అయిపోదు. దాన్ని కాపాడేందుకు నీళ్లు పోయడం, ఎరువులు వేయడం చేస్తుంటాం. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ సమీపంలో పచ్చదనం బాగా పెరగడంతో పక్షులు, సీతాకోక చిలుకలు, తేనెటీగల సందడి చేస్తున్నాయ’ని ప్రొఫెసర్ పటేల్ తెలిపారు. మొక్కలకు నీళ్ల కోసం విద్యార్థులు చిన్న కుంట కూడా తవ్వారని వెల్లడించారు. ఈ ప్రొఫెసర్ను చూసి మన ‘దండో’పాధ్యాయులు చాలా నేర్చుకోవాలేమో!!. -
విశ్వవిద్యాలయాల ప్రక్షాళన అత్యవసరం
విశ్వవిద్యాలయాల పాలనలో కొంత స్వేచ్ఛ తీసుకొని తమ విధానాలను అమలు చేసుకోవచ్చు అనే వెసులుబాటు ఉండడం వల్ల కొన్ని రాష్ట్రాలు వాటికున్న అధికారాలను దుర్వినియోగం చేసి వర్సిటీల వ్యవహారాల్లో పీకల్లోతున జోక్యం చేసుకొని ఉన్నత విద్యా ప్రమాణాలను దిగజార్చే పనులు చేస్తున్నాయి. ఉమ్మడి ఏపీలో ఇలాంటివి చాలా జరిగాయి. గతంలో ఏపీ ప్రభుత్వం వర్సిటీల్లో సహాయాచార్యులను నియమించే ప్రక్రియను తాను లాక్కొని వీరి నియామకం ఏపీపీఎస్సీ ద్వారా జరిపే విధంగా మార్చింది. ఇది విశ్వవిద్యాలయాలకున్న స్వయంప్రతిపత్తిని పూర్తిగా హరించి వాటిని నాయకులు తమ కనుసన్నలలో ఉంచుకునే తీరులోనే సాగింది. ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలో వచ్చిన నూతన ప్రభుత్వం వర్సిటీల పాలనలో జరుగుతున్న అన్ని అక్రమాలను కడిగేసి, అన్ని నియామకాల్లో ప్రమాణాలను పాటించే బాధ్యత తప్పక తీసుకోవాలి. గడచిన ఐదారేళ్లుగా తెలుగు రాష్ట్రాలలో విశ్వవిద్యాలయాల పాలన గాడి తప్పి కంగాళీ అయింది. ఏయే అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో వివేచించి దారికి తెచ్చే మార్గాన్ని ఆలోచించి ప్రస్తుత ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మన విశ్వవిద్యాలయాలు రెండు అధికారాల అధీనంలో పనిచేయవలసి ఉంటుంది. మనకు విద్యారంగం రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి జాబితాలో ఉంటుంది. యూజీసీ పార్లమెంటు అనుమతితో ఉన్నత విద్యకు సంబంధించి కొన్ని అధికరణాలను చేస్తుంది. ఇవి పార్లమెంటు చేసే చట్టాలలో భాగం. అదేవిధంగా ఆయా రాష్ట్రప్రభుత్వాలు విశ్వవిద్యాలయాల పాలనకు సంబంధించి మరికొన్ని నిబంధనలను పెట్టుకుంటాయి. ఉదాహరణకు యూజీసీ ప్రకారం ఆచార్యుల పదవీ విరమణ 65 ఏళ్లకు జరగాలి. కాని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని 60, కొన్ని 62 మరికొన్ని 65 ఏళ్లుగా పెట్టుకున్నాయి. కాగా విశ్వవిద్యాలయాల కేంద్ర రెగ్యులేషన్ ప్రకారం 65 సంవత్సరాలుగా మాత్రమే ఉండాలని ఆదేశించవలసిందిగా రాష్ట్రాల ఆచార్యులు కొందరు సుప్రీంకోర్టును కోరారు. దానికి సుప్రీంకోర్టు నిరాకరిస్తూ రాష్ట్రాలకు వారి పాలన పద్ధతి ప్రకారం పదవీ విరమణ వయస్సును పెట్టుకోవచ్చు అని చెప్పింది. కాని అదే సుప్రీంకోర్టు యూజీసీ నిబంధనలు కొన్నింటిని రాష్ట్రాలు అధిగమించరాదని చెప్పింది. ఆచార్యుని అనుభవం పదేళ్లు ఉంటేనే వీసీ పదవికి అర్హుడు అనే విషయంలో సుప్రీం తుది తీర్పు ఇంకా రావలసే ఉంది. అందాక అదే అమలులో ఉంది చాలా రాష్ట్రాలలో. విశ్వవిద్యాలయాల పాలనలో కొంత స్వేచ్ఛ తీసుకొని వారి వారి విధానాలను అమలు చేసుకోవచ్చు అనే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండడం వల్ల కొన్ని రాష్ట్రాలు వాటికున్న అధికారాలను దుర్వినియోగం చేసి వర్సిటీల పాలనలో పీకల్లోతున జోక్యం చేసుకొని, వాటి స్వయం ప్రతిపత్తిని తుంగలో తొక్కి, రకరకాల గందరగోళాలు సృష్టించి ఉన్నత విద్యా ప్రమాణాలను దిగజార్చే పనులు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో గడచిన దశాబ్దంలో ఇలాంటివి చాలా జరిగాయి. వర్సిటీల ఆచార్యులను మూడు స్థాయిలలోని వారిని నియమించుకునే స్వతంత్ర ప్రతిపత్తి విశ్వవిద్యాలయాలకే ఉంటుంది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యక్షజోక్యం ఏ విధంగానూ ఉండదు. కాని గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలలో సహాయాచార్యులను నియమించే పద్ధతిని తాను లాక్కొని వీరి నియామకం ఏపీపీయస్సీ ద్వారా జరిపే విధంగా మార్చింది. వారికి సర్వీసుకమీషనే పరీక్షపెట్టి వారిలో ఉత్తీర్ణత పొందిన వారి జాబితాను విశ్వవిద్యాలయాలకు పంపితే ప్రభుత్వ నియమాల ప్రకారం వారిని నియమించుకునేలా చట్టాలు మార్చింది. ఇది విశ్వవిద్యాలయాలకున్న స్వయంప్రతిపత్తిని పూర్తిగా హరించి తిరిగి వాటిని నాయకుల కనుసన్నలలో ఉంచుకునే తీరులోనే సాగింది. దీని వల్ల విశ్వవిద్యాలయాలు మరో రకం డిగ్రీ కాలేజీలుగా మారిపోతాయి. ఇలా చేయడానికి ప్రభుత్వం చూపిన సాకు ఏమంటే విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులు సహాయాచార్యుల నియామకాలలో అక్రమాలకు పాల్పడుతున్నారని అవినీతి జరుగుతూందని. కానీ సర్వీసు కమిషన్లు కూడా అవినీతికి అక్రమాలకు పాల్పడిన ఘట్టాలు గతంలో ఎన్నో జరిగిన ఉదంతాలు కోర్టు కేసులు పరిశీలిస్తే చరిత్రే తెలుస్తుంది. ప్రభుత్వం చేసిన ఈ మార్పు వల్ల అవినీతి ఒకచోటునుండి మరొక చోటుకు మారుతుందే కాని ఆగదు అని ప్రభుత్వం గమనించలేదు. దీనికి బదులు అసలు ఉపాధ్యక్షుల నియామకంలోనే నిజాయితీపరులను నియమిస్తే, యూజీసీ నిబంధనలను పాటిస్తే ఈ అక్రమాలు జరగవు. అలా కాక కొన్ని ప్రభుత్వాలు వీసీల నియామకాలలోనే యూజీసీ నియమాలను ఉల్లంఘించి అనర్హులకు అనుభవం లేనివారికి అవకాశాలిచ్చాయి. దీనికి రాజకీయ కారణాలు ఒత్తిడులే కారణం. అంతే కాదు ఆచార్యులను ప్రభుత్వమే నియమించడం వల్ల విశ్వవిద్యాలయాలకు చాలా నష్టం జరుగుతుంది. కొన్ని విశ్వవిద్యాలయాలలో ప్రత్యేకమైన శాఖలుంటాయి. అసలు కొన్ని విశ్వవిద్యాలయాలే ప్రత్యేక అవసరాలకోసం ఏర్పడతాయి. వాటికి ఏవిధమైన పోస్టులు కావాలి ఏశాఖలు కావాలి ఎలాంటి వారితో వీటిని నింపుకోవాలి అనే విషయం ఆయా విశ్వవిద్యాలయాలకే తెలుస్తుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల ప్రమాణాలను, విద్యావసరాలను దెబ్బకొట్టే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఖర్చును తగ్గించుకొని ఉన్నత విద్య బడ్జెట్కు తీవ్రంగా కోత పెట్టే దిశలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. కొన్ని శాఖలను అనవసరమైనవిగా ప్రభుత్వమే నిర్ణయించుకుంది. కొన్ని శాఖలను రద్దు చేసి వాటిలో ఉన్న ఆచార్యులను వేరే శాఖలకు పంపి శాఖలను కలిపేయడం లేదా రద్దు చేయడం చేసింది. ఆచార్యుల పోస్టులు వందల సంఖ్యలో రద్దు చేయడం లేదా ఆచార్యుల పోస్టులను సహాయ ఆచార్యుల పోస్టులుగా మార్చి వాటి రిక్రూట్మెంటును సర్వీసు కమిషన్ ద్వారా చేయడం, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా కొన్నింటిని రద్దుచేయడం కొన్నింటినే ఉద్యోగ ప్రకటనలలో ఉంచడం చేసింది. జానపదశాఖ, సంగీత లలితకళ శాఖలు, తత్వశాస్త్రశాఖ కొన్ని సంప్రదాయసైన్సు శాఖలలోని పోస్టులను రద్దుచేసింది. కొన్నింటిని మూసివేయడం చేసింది. సమాజానికి కంప్యూటర్ శాస్త్రం, విజ్ఞాన శాస్త్రాలు ఎంత అవసరమో ఒక అర్థశాస్త్ర శాఖ, ఒక చరిత్ర శాఖ, ఒక జానపద శాఖ తత్వశాస్త్రశాఖ కూడా అంతే అవసరం అనే స్పృహను ప్రభుత్వం కోల్పోయింది. ఈశాఖలు ఎందుకు వాటిని రద్దుచేస్తేనే మంచిది అనే ధోరణిలో ఇలా హేతుబద్ధీకరణ చేసింది ప్రభుత్వం. ఇది ఉన్నత విద్యకు సమాజ ప్రగతికి శరాఘాతం లాంటిది. ఉమ్మడి రాష్ట్రంలో 1990 దశకంలో చరిత్ర శాఖలు ఎందుకు వాటిని తీసివేయాలి అని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్దఎత్తున మేధావులలో, విశ్వవిద్యాలయాల పరిధిలో అలజడి చెలరేగింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. కానీ కిరణ్కుమార్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆ విధానాలనే అమలుచేస్తూ వచ్చింది. విభజనానంతరం 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తిరిగి ఒక హైపవర్ కమిటీని వేసి హేతుబద్ధీకరణ పేరుతో పైన చెప్పిన అవాంఛనీయమైన పనులు అన్నీచేసింది. ఇక విశ్వవిద్యాలయాలను డిగ్రీకళాశాలలుగా మార్చే మరొక చర్యతీసుకుంది ప్రభుత్వం. అదేమంటే పీజీ ఎంట్రెన్స్కి కామన్ పరీక్ష పెట్టడం, కామన్ సిలబస్లు అన్ని కోర్సులకు ఉండాలని చెప్పడం ఇలాంటిదే. రీసెర్చి ప్రవేశాలకు కూడా కామన్ ప్రవేశ పరీక్షపెట్టడం కూడా ఇలాంటిదే. దీనివల్ల చాలా విశ్వవిద్యాలయాలకు వాటి స్వేచ్ఛపోతుంది. కొన్ని విశ్వవిద్యాలయాలు వాటి అవసరాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళిక రచన చేసుకుంటాయి. కరిక్యులమ్ డిజైనింగ్కి నాక్ అత్యంత ప్రాముఖ్యం ఇస్తుంది. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తిం చలేదు. ఇటీవలి కాలంలో విశ్వవిద్యాలయాలలోనే ఆయా ఉపాధ్యక్షుల అలసత్వం వల్లనేమి, భిన్నమైన ఆలోచనల వల్లనేమి పరిశోధనల ప్రమాణాలు పాతాళానికి పడిపోయే పరిస్థితి వచ్చింది. దూరవిద్యలో పీహెచ్డీ పరిశోధనకు అవకాశం కల్పించడం యూజీసీ చేసిన ఘోరమైన తప్పిదంగా అది గుర్తించే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తిరిగి 2009లో దాన్ని రద్దుచేసినా కొన్ని విశ్వవిద్యాలయాలు పాత డేట్లతో అడ్మిషన్లు చేసాయి. ధనసంపాదనే ధ్యేయంగా ఆయా విశ్వవిద్యాలయాలు ఈ పాపానికి దిగాయి. ఎనిమిదివేల పీహెచ్డీ ప్రవేశాలు కేవలం మూడు నాలుగేళ్లలోనే చేసి ద్రవిడ వర్సిటీ ప్రపంచ రికార్డు నెలకొల్పడంపైన ఎంతో చర్చ జరిగింది ఎన్నో కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కావలసినంత రచ్చ జరిగింది. ఆ వర్సిటీ దాన్ని ప్రక్షాళన చేసుకునే పని ఇంకా చేసుకుంటూనే ఉంది. కాగా ఓయాలో కూడా ఏడువేల పీహెచ్డీ ప్రవేశాలు జరిగాయని ఇటీవలే వార్తలు పొక్కాయి. ఒక శాఖలో శాశ్వత ఉద్యోగిగా ఉన్న ఆచార్యుడు మాత్రమే ఆ శాఖలో పీహెచ్డీ పర్యవేక్షణకు అర్హుడు కాగా తాత్కాలిక ఆచార్యులకు అవకాశం ఇవ్వడం, ఒక శాఖలో పనిచేసే వారికి మరొక శాఖలో పరిశోధకులకు పర్యవేక్షణ చేసే అవకాశాలు ఇవ్వడం. డాక్టరేట్ ఉందని బోధనేతర సిబ్బందికీ పర్యవేక్షణ ఇవ్వడం ఇలాంటి అక్రమవిధానాలు కూడా కొన్ని చోట్ల జరిగాయి. విశ్వవిద్యాలయాలకు ఈసీ మెంబర్లను ఎంపిక చేసేటప్పుడు ఉన్నత విద్యావంతులకు, విద్యావేత్తలకు అవకాశం పూర్తిగా ఇవ్వాలి. కానీ ప్రభుత్వాలు రాజకీయ కోణంలోనే పునరావాస కల్పన చేసే దిశగా ఆ పద్ధతికి గండి కొట్టి కొన్ని ఎంపికలను రాజకీయ నాయకులతో చేశాయి. దీనివల్ల విశ్వవిద్యాలయ పాలన రాజకీయమయం అవుతుందే కాని విద్యాప్రమాణాలకు ఏవిధంగానూ ఉపయోగపడదు. గ్రాంటులు చాలినంత ఇవ్వకుండా మీ వనరులు మీరే చూసుకోండి అని విశ్వవిద్యాలయాలను వదిలివేయడం వల్ల కూడా అవి ఆర్థిక సంపాదన పైన ధ్యాస పెట్టడంతో íపీహెచ్డీ అక్రమాలకు గేట్లు ఎత్తినట్లు అయింది. ఏపీలో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. పరిపాలనను అన్ని కోణాలలో అన్ని స్థాయిలలో చక్కదిద్దే ప్రయత్నం ఇది చేస్తూ ఉంది. ఈ సందర్భంలో విశ్వవిద్యాలయ పాలనపైన ఈ కొత్త ప్రభుత్వం ధ్యాసపెట్టాలి. పైన చెప్పిన అక్రమాలను కడిగి వేసి విశ్వవిద్యాలయాలలో ఉన్నత ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. అన్ని నియామకాలను ప్రమాణాల ప్రాతిపదికనే చేయాలి. ఈ కొత్త ప్రభుత్వం ఈ గురుతర బాధ్యతను స్వీకరిస్తుందని ఆశిద్దాం. వ్యాసకర్త విశ్రాంత ఆచార్యులు, జానపద ఆదివాసీ అధ్యయనాల శాఖ, ద్రవిడ విశ్వవిద్యాలయం మొబైల్ : 94404 93604 ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి -
పద్మవతి యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ నిరసన
-
50 లక్షల ఉద్యోగాలు ఆవిరి
బెంగళూరు: దేశంలో 2011 నుంచి 2018 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో నిరుద్యోగం రెండింతలు పెరిగినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో ఉద్యోగావకాశాలు క్షీణించడంతోపాటు గడిచిన రెండేళ్ల(2016–18)లో 50 లక్షల మంది పురుషులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు జరిగిన నాటి నుంచే దేశంలో ఉద్యోగావకాశాలు తగ్గుతూ వచ్చాయని తెలిపింది. అయితే ఉద్యోగావకాశాల క్షీణతకు పెద్ద నోట్ల రద్దుకు ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేకున్నా.. పెద్ద నోట్ల రద్దు జరిగిన నవంబర్ 2016 నుంచే ఉద్యోగాలు తగ్గిపోవడం గమనార్హం అని పేర్కొంది. ది స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా(ఎస్డబ్ల్యూఐ)–2019 పేరిట బెంగళూరులోని అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఈ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను దేశంలోని ఉద్యోగాల స్థితిగతులను లెక్కించే కన్సూమర్ పిరమిడ్స్ సర్వే ఆఫ్ ది సెంటర్ ఫర్ మోనిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ(సీఎమ్ఐఈ–సీపీడీఎక్స్) సంస్థ నుంచి 2016–18 మధ్య గల సమాచారాన్ని సేకరించి రూపొందించారు. ఈ నివేదికలో కేవలం పురుషులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఒకవేళ మహిళలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కోల్పోయిన ఉద్యోగాల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. నిరుద్యోగుల్లో ముఖ్యంగా ఉన్నత చదువులు చదివిన వారితోపాటు యువకులే అధికంగా ఉన్నారని పేర్కొంది. ఇదేకాలంలో తక్కువ విద్యార్హత గల వారు కూడా ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు ఆ స్థాయిలో కూడా ఉద్యోగావకాశాలు తగ్గాయని తెలిపింది. ఈ విషయంలో మహిళల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని పేర్కొంది. ఈ నివేదిక రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించిన అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అమిత్ బాసోల్ మంగళవారం ఇక్కడ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఉద్యోగాలను సృష్టించేందుకు కొన్ని పరిష్కార మార్గాలను నివేదికలో తాము సూచించామని అన్నారు. ‘మేము సూచించిన పరిష్కార మార్గాలు ఉద్యోగాల సృష్టికి ఊతమివ్వడంతోపాటు దేశంలోని అందరికీ సమానమైన ఉద్యోగావకాశాలను కల్పిస్తాయని బలంగా నమ్ముతున్నాం’అని పేర్కొన్నారు. పరిష్కార మార్గాలు.. ► దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ తరహాలోనే అర్బన్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ తేవాలని నివేదిక సూచించింది. దీని ద్వారా చిన్న పట్టణాల్లో సుమారు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలిపింది. ► స్థూల దేశీయ ఉత్పత్తిలో విద్యపై 6 శాతం, వైద్యంపై 3 శాతం అదనంగా ఖర్చు పెట్టగలిగితే సుమారు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించవచ్చని వెల్లడించింది. అలాగే దీని ద్వారా అత్యంత నాణ్యమైన ప్రజా సేవలను అందించవచ్చని పేర్కొంది. ► భారతీయ తయారీ రంగాన్ని పునరుద్ధరించడానికి సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకురావడం అత్యవసరమని స్పష్టం చేసింది. -
పాక్లో పండుగ సంబరాలు : వైరల్ వీడియో
ఇస్లామాబాద్ : ప్రపంచవ్యాప్తంగా మత, సాంస్కృతిక విభేదాలు లేకుండా ప్రజల్ని సమీకృతం చేసే ఏకైక సందర్భం పండుగలు. ఈ నేపథ్యంలో ఒకవైపు పాకిస్తాన్, భారత మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాసగుతుండగా మరోవైపు పాకిస్తాన్లో హోలీ సంబరాలు అత్యంత ఉత్సాహంగా నిర్వహించుకోవడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇపుడు హల్చల్ చేస్తోంది. నెటిజనుల ప్రశంసలను దక్కించుకుంటోంది. ఇస్లామాబాద్లోని క్వాయిడ్-ఐ-అజమ్ యూనివర్సిటీ విద్యార్థులు హోలీ సంబరాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. మార్చి 25వ తేదీన విశ్వవిద్యాలయ మెహ్రాన్ స్టూడెంట్స్ కౌన్సిల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో కులమతాలకతీతంగా అందరూ స్టెప్పులేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా పుల్వామా ఉగ్రదాడి దాయాది దేశాల మధ్య మళ్లీ తీవ్ర ఉద్రిక్త వాతావరణాన్ని రాజేసింది. ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకు వెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. -
‘ప్రత్యేక’ దగా..బతుకుల్లో పొగ
ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు తెలుగు జాతి ప్రయోజనాలను కేంద్రం ఎదుట చంద్రబాబు తాకట్టు పెట్టాడు. వ్యక్తిగత స్వార్థానికి ప్రత్యేక హోదా అంశాన్ని మరుగున పరిచేందుకు అనుక్షణం ప్రయత్నించాడు. హోదా ఉద్యమంలో పాల్గొన్న యువతపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేశాడు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గండికొట్టాడు. బతుకులు బుగ్గిపాలు చేశాడు. ఎన్నికలు సమీపిస్తుండగా ఓట్ల కోసం ప్రత్యేక హోదా నినాదాన్ని ఎత్తుకున్నాడు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఈ నేపథ్యంలో ‘ప్రత్యేక హోదా–ఉపాధి కల్పన’ అనే అంశంపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఎస్కేయూ వేదికగా విద్యార్థి జేఏసీ మంగళవారం చర్చావేదిక నిర్వహించింది. రాజకీయ నిర్ణయాలతో పాటు విధానపరమైన నిర్ణయాలు, విలువలు, విశ్వసనీయత ఉన్న నాయకుడికే పట్టం కట్టాలని, ఆ మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని జేఏసీ తీర్మానించింది. ప్రత్యేక హోదా సంజీవనే ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలు ఒక్కో హైదరాబాద్గా రూపొందుతాయి. పన్నురాయితీలు, ప్రోత్సాహకం వల్ల జనంలో కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఉత్పత్తి చేసే వస్తువుల మీద 100 శాతం పన్ను రాయితీ ఉండడం వల్ల ధరలు సగానికి సగం తగ్గుతాయి. కేంద్ర ప్రభుత్వ నిధులు ఇలా.. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పన్నుల్లో వాటాతో పాటు గ్రాంట్లు, రుణాల ద్వారా రాష్ట్రాలకు సొమ్ము అందుతుంది. గ్రాంట్లను తిరిగి చెల్లించనక్కర్లేదు. ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు 30 శాతం మించి ఉండవు. అంటే ఏ పథకం, ఏ కార్యక్రమం చేపట్టినా .. కేంద్ర గ్రాంట్ పోనూ తక్కిన 70శాతం మొత్తాన్ని లోనుగా చెల్లించాలి. అదే ప్రత్యేక హోదా వస్తే కేంద్రం గ్రాంట్ 90 శాతం వస్తుంది. తక్కిన 10 శాతం లోన్గా చెల్లించాలి. నీటి ప్రాజెక్టులన్నీ కేంద్రమే భరిస్తుంది యాక్సిలరేటేడ్ ఇరిగేషన్ బెనిఫిట్ స్కీం( ఏఐబీపీ) కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టులకు నిధులు ఇస్తుంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఈ పథకం కింద 90 శాతం నిధులు గ్రాంట్గా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. హోదా లేకపోతే కేవలం 20 నుండి 30 శాతం మాత్రమే ఇస్తుంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన విదేశీ రుణాలను సైతం కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రత్యేక హోదా ప్రయోజనం పొందిన రాష్ట్రాల్లో ప్రగతి ఇలా.. 2000 సంవత్సరంలో ఏర్పడ్డ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఆ రాష్ట్రంలో 30,244 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. రూ.35వేల కోట్ల పెట్టుబడులతో ఒకే దఫాలో 130 శాతం అధికంగా పరిశ్రమలు ఏర్పాటు కావడం వల్ల ఉపా«ధి అవకాశాలు 490 శాతం పెరిగి , 2,45,500 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఏపీ కన్నా బాగా వెనుకబడ్డ హిమాచల్ప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఏకంగా 10,864 కంపెనీలు పరిశ్రమలను నెలకొల్పి, 1,29,443 మందికి ఉద్యోగాలు కల్పించాయి. ప్రత్యేక హోదా వల్ల వచ్చే రాయితీలు ఇలా.. ప్రత్యేక హోదా ఉంటే పారిశ్రామిక యూనిట్లకు 100 శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఉంటుంది. ఆదాయం మీద పన్ను (ఇన్కం ట్యాక్స్)లో కూడా 100 శాతం రాయితీ లభిస్తుంది. పన్ను మినహాయింపులు, ఫ్రైట్ రీయింబర్స్మెంట్లు దక్కుతాయి. ప్రత్యేక హోదా వల్ల రాయితీలు కల్పించడం ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి. పరిశ్రమల ఏర్పాటుకు తీసుకునే వర్కింగ్ క్యాపిటల్ మీద కేవలం మూడు శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. ఇవే కాకుండా ఇన్సూరెన్స్, రవాణా వ్యయంపైనా రాయితీలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వస్తాయి. తక్కువ నైపుణ్యం ఉన్న వారికీ ఉద్యోగాలు, ఉపాధి దక్కుతుంది. హోదా అంటే జైలుకే అన్నారు ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమాలు చేస్తే జైలుకు పంపుతామంటూ సీఎం చంద్రబాబే బెదిరింపులకు దిగాడు. ఉద్యమకారులపై కేసులు నమోదు చేయించాడు. ఎన్నికలు దగ్గర పడగానే ప్రత్యేక హోదా కావాలంటూ మాట మార్చాడు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులు ఎత్తేయలేదు. దీనిని బట్టి చూస్తే ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబుకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. – డి. ప్రతాప్రెడ్డి, పీజీ విద్యార్థి ఐదున్నర కోట్ల ప్రజలకు వెన్నుపోటు ప్రత్యేక హోదా అంశంలో సీఎం చంద్రబాబు ఐదున్నర కోట్ల ఆంధ్రులకు వెన్నుపోటు పొడిచారు. 2014 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ మోదీ, చంద్రబాబు, పవన్కళ్యాణ్ స్పష్టమైన వాగ్దానం చేశారు. తర్వాత చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దంటూ ప్యాకేజీ వైపు మొగ్గు చూపారు. ప్రత్యేక హోదా సాధనకు నాలుగున్న రేళ్లుగా అలుపెరగని పోరు చేస్తున్న వైఎస్ జగన్కు ప్రజలు దన్నుగా నిలిచారు. జగన్ సీఎం అయితేనే ప్రత్యేక హోదా సాధన సాధ్యమవుతుంది. – జీవీ లింగా రెడ్డి, ఎస్కేయూ విద్యార్థి జేఏసీ నాయకులు ప్రభుత్వ సొమ్ముతో ఓట్లకు గాలం ప్రజల సొమ్ముతో ఓట్లకు గాలం వేసే నూతన పథకానికి సీఎం చంద్రబాబు తెరతీశారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడినప్పుడు నిరుద్యోగభృతి చెల్లింపు పేరుతో యువతను ప్రలోభ పెట్టారు. కేవలం స్వార్థపూరిత రాజకీయాలకు ఇలాంటి అంశాలు దోహదపడ్డాయి. – అమర్నాథ్, పీజీ విద్యార్థి, ఎస్కేయూ క్యాంపస్ హామీ అమలు చేయలేదు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామన్న ఎన్నికల హామీని చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు. ఖాళీగా ఉన్న 1.60 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా అరకొరగా పోస్టులు భర్తీ చేశాడు. ఇవీ గత ప్రభుత్వంలో జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించినవే. – డి. శ్రీనివాస్రెడ్డి, ఎంఫిల్, ఎస్కేయూ నియంతలా వ్యవహరించారు ఎన్నికల హామీలను చంద్రబాబు కావాలనే నిర్లక్ష్యం చేశాడు. 15 ఏళ్లు కావాలని తిరుపతి బహిరంగసభలో చంద్రబాబు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా అని అడిగితే కేసులు పెడతామని బెదిరించాడు. – డాక్టర్ శ్రీధర్ గౌడ్, విద్యార్థి జేఏసీ నాయకుడు దగా చేశారు అధికారంలోకి వచ్చాక ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టించారు. నిరుద్యోగభృతి పేరుతో దగా చేశారు. దీనికి కూడా సవాలక్ష కొర్రీలు విధించి అర్హులను పూర్తిగా తగ్గించేశారు. ఎన్నికలకు నాలుగు నెలలు ముందు మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. – వేమన, పీజీ విద్యార్థి ఉపకార వేతనాలు అందలేదు వైఎస్సార్ హయాంలో ఎంఫిల్, పీహెచ్డీ విద్యార్థులకు ఉపకార వేతనాలను క్రమం తప్పకుండా అందజేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లుగా ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేకుండా వెబ్సైట్లో ఆప్షన్ తొలిగించారు. – జయంత్, పీజీ, ఎస్కేయూ నోటిఫికేషన్ ఇవ్వకుండా శిక్షణ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు రూ. కోట్లలో లబ్ధి పొందే విధంగా ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద పనికి మాలిన సంస్కరణలు అమలు చేశారు. ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్లు లేకుండానే ఈ పథకం కింద శిక్షణ ఇప్పించారు. – డాక్టర్ గణేష్, ఎస్కేయూ -
లోగో పెట్టండి... సత్కారం పొందండి
సాక్షి, ఒంగోలు టౌన్: ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు యూనివర్సిటీకి సంబంధించిన లోగోను ఆసక్తి కలిగిన కళాకారులు పంపించాలని యూనివర్శిటీకి చెందిన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ) జీ. సోమశేఖర ఒక ప్రకటనలో కోరారు. లోగోకు సంబంధించి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం ఆశయాలకు అనుగుణంగా ఆయా కళాకారులు, మేధావుల నుంచి వారి ఆలోచనల మేర లోగో తయారు చేయాలని సూచించారు. ప్రకాశం జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వవిద్యాలయ లక్ష్యాలను ప్రతిబింబించే విధంగా లోగో ఉండాలన్నారు. ఎంపికైన లోగోను తయారుచేసిన కళాకారులను విశ్వవిద్యాలయ అధికారులు సత్కరించడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగినవారు యూనివర్సిటీకి సంబంధించిన లోగోను ఈనెల 30వ తేదీలోపు soanuongoe@gmai.com మెయిల్కు పంపించాలని ఆయన కోరారు. -
చేయగలిగిన వాటినే లక్ష్యంగా పెట్టుకోండి...
అసాధ్యమైన లక్ష్యాలను పెట్టుకుని సాధించలేకపోయామని బాధపడేకంటే జీవితంలో వాస్తవికతకు దగ్గరగా ఉండే లక్ష్యాలను ఏర్పర్చుకోవడమే చీకూ చింతాలేని, ఆరోగ్యకరమైన ఆనందమయమైన జీవితాన్ని ఇస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలా ఆచరణయోగ్యమైన లక్ష్యాలను ఏర్పర్చుకున్న వారే ఆనందంగా ఉండగలుగుతున్నారని యూనివర్సిటీ ఆఫ్ బేసెల్ మానసిక శాస్త్రవేత్తలు చేసిన ఓ అధ్యయనం వెల్లడించింది. సంపద, ఆరోగ్యం, అర్థవంతమైన పని, కమ్యూనిటీ, జీవిత లక్ష్యాలు, ఆవ్యక్తిని నడిపించేవారిని బట్టి ఆ వ్యక్తి స్వభావం ఆధారపడి ఉంటుందని స్విట్జర్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ బేసెల్ శాస్త్రవేత్తల అధ్యయనం తేల్చి చెప్పింది. ప్రజలు ఎంత సంతృప్తికరంగా ఉన్నారు? లేదా అనుకున్నవి సాధించలేనప్పుడు ఎంత అసంతృప్తితో ఉన్నారు అనే విషయాలు వారు పెట్టుకున్న లక్ష్యాలపై ఆధారపడి ఉంటుందని ఈ సర్వే వెల్లడించింది. స్విట్జర్లాండ్లోని జెర్మన్ భాష మాట్లాడే ప్రాంతాల్లోని 18 ఏళ్ళ నుంచి 92 ఏళ్ళ మధ్య వయస్సులో ఉన్న 973 మందిపై చేసిన ఈ సర్వే వివరాలను యూరోపియన్ జర్నల్ ఆఫ్ పర్సనాలిటీ లో ప్రచురించారు. అధ్యయనంలో పాల్గొన్న సగానికిపైగా మందిని రెండు, మూడేళ్ళ తరువాత కూడా మళ్ళీ సర్వే చేసారు. ఆరోగ్యం, కమ్యూనిటీ, వ్యక్తిగత అభివృద్ధి, సామాజిక సంబంధాలూ, సంపద, కీర్తి ప్రతిష్ట, కుటుంబమూ, భవిష్యత్ తరాల పట్ల బాధ్యత, అర్థవంతమైన పని తదితర పది అంశాలపై ఈ అధ్యయనం జరిపారు. ఒక వ్యక్తి ఏర్పర్చుకున్న సాధించగలిగే వ్యక్తిగత లక్ష్యాలు ఆ వ్యక్తి శ్రేయస్సుపైనా, భవిష్యత్ ఆరోగ్యంపైన ఆధారపడి ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది. మనుషులు దేనిమీదైనా నియంత్రణ కలిగి ఉన్నప్పుడు, దేన్నైనా సాధించినప్పుడు ఎక్కువ సంతృప్తికరంగా ఉన్నట్టు, వాళ్ళు ఊహించిన దానికన్నా మంచి జీవితాన్ని అనుభవించినట్టు తేలింది. సామాజిక సంబంధాలకు సంబంధించిన లక్ష్యాలూ, ఆరోగ్యానికి సంబంధించిన లక్ష్యాలు నిర్దేశించుకున్న వారు వారి వ్యక్తిగత ఆరోగ్యం విషయంలోనూ, సామాజిక సంబంధాల విషయంలోనూ సంతృప్తికరంగా ఉన్నట్టు తెలుస్తోంది. జీవిత లక్ష్యాలూ, వ్యక్తి శ్రేయస్సూ వారి వారి వయస్సుని బట్టి ఆధారపడి ఉంటాయని ఈ అధ్యయనం వెల్లడించింది. ఆయా సందర్భాన్నీ, పరిస్థితిని బట్టీ ప్రజలు తాము సాధించాలనుకునే లక్ష్యాలు ఆధారపడి ఉంటాయి. యువతరం తమ వ్యక్తిగత అభివృద్ధీ, హోదా, ఉద్యోగం, సామాజిక సంబంధాలను ప్రథమ లక్ష్యాలుగా భావిస్తుంటే, వయోజనులు మాత్రం సామాజిక సంబంధాలూ, ఆరోగ్యం తమకు ప్రథమ ప్రాధాన్యత అని అభిప్రాయపడుతున్నారు.