Vinod
-
'ల్యాంప్' అలాంటి సినిమానే :హీరో వినోద్
ప్రస్తుతం ప్రేక్షకులు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది తేడా లేకుండా ఏ సినిమా నచ్చితే ఆ సినిమా చూస్తున్నారు. కాబట్టి చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్ అవుతున్నాయి. మా ల్యాంప్ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. ఈసినిమా అందరికి నచ్చుతుందని, పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు హీరో వినోద్. వినోద్, మధుప్రియ, కోటి కిరణ్, అవంతిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ల్యాంప్’. రాజశేఖర్ రాజ్ దర్శకుడు. ఈ నెల 14న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో తాజాగా వినోద్ మీడియాతో మాట్లాడారు.→ ల్యాంప్ సినిమా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.వరుస హత్యలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని హీరో ఎలా ఛేదించాడు అనేది కామెడీగా చూపిస్తూనే ఫైనల్ గా అసలు ఏం జరిగింది? ఎలా వాటిని ఆపాడు అనేది ఆసక్తికరంగా చూపించాం. సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే కామెడీ పండించడం నా పాత్ర హైలెట్.→ ప్రేక్షకులు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటు ఉంటారు .ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొత్త రకంగా నటించే నేను , కొత్తగా నటించాలనుకునే యువతీ యువకుల్ని ప్రోత్సహిస్తూ ఉంటాను . కొత్తగా సినిమా తీయాలనుకునే యువ దర్శకులు ,ప్రొడ్యూసర్స్ కి సహకారం అందించడం కోసం మా అకాడమీ నుంచి స్టూడెంట్స్ ని కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఆర్టిస్టులుగా ఇస్తూ ఉంటాను.→ ప్రస్తుతం నేను బార్బరీక్ అనే సినిమా రిలీజ్ రెడీగా ఉంది . అలాగే శాసనమా చట్టమా అనే సినిమాలో హీరో సుమన్ గారి కొడుకు క్యారెక్టర్ చేస్తున్నాను మెయిన్ లీడ్ అలాగే డైరెక్టర్ హర్ష గారు డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ గారి కాంబినేషన్లో రెండు సినిమాల్లో లీడ్ గా నటిస్తూ ఉన్నాను .→ నటుడుగా సినిమాలు వెబ్ సిరీస్ లు రంగస్థలంలో విభిన్నమైన పాత్రలు చేయడానికి నేనెప్పుడూ రెడీ గానే ఉంటాను చేస్తున్నను కూడా అలాగే నిర్మాతగా షార్ట్ ఫిలింలు వెబ్ సిరీస్ లు మా వినోద్ ఫిలిం అకాడమీ తరుపున చాలా చేశాం త్వరలో ఒక సినిమా కూడా మొదలుపెట్టబోతున్నాం.→ అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో మా సినిమా టికెట్ రేట్ ని 110 రూపాయలుగా నిర్ణయించాం. కాబట్టి అందరూ వచ్చి మా సినిమా చూడండి. మీరు పెట్టిన 110 రూపాయలకి రెండు వందల పది రూపాయల ఎంటర్టైన్మెంట్ మేము అందిస్తామని గ్యారెంటీ ఇస్తున్నాం -
చివరి సినిమా ఫిక్స్
తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. ‘దళపతి 69’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకుడు. కేవీఎన్ ప్రోడక్షన్స్పై ఎన్కే, వెంకట్ కె. నారాయణ ఆధ్వర్యంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ‘‘విజయ్తో మా మొదటి చిత్రం ‘దళపతి 69’. ఈ సినిమా కోసం హెచ్. వినోద్ అద్భుతమైన కథని సిద్ధం చేశారు. మూడు దశాబ్దాల సినిమా ప్రయాణంలో తిరుగులేని స్టార్డమ్తో కథానాయకుడిగా రాణించారు విజయ్. ఆయన హీరోగా రూపొందుతోన్న చివరి చిత్రం ‘దళపతి 69’ కానుండటంతో భారతీయ సినీ చరిత్రలో నిలిచేపోయేలా తెరకెక్కిస్తాం. సరికొత్త రికార్డులను సృష్టించేలా ఈ సినిమాని రూపొందించనున్నాం. ఈ చితాన్ని 2025 అక్టోబర్లో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్. -
‘రేణుకాస్వామి ఇంటికి వెళ్లింది రాజీ కోసం కాదు’
దొడ్డబళ్లాపురం: పరప్పన అగ్రహార జైలులో దర్శన్ను కలిసిన నటుడు వినోద్ రాజ్ కొన్ని రోజుల వ్యవధిలోనే రేణుకాస్వామి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడంపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ వస్తున్నాయి. దర్శన్, రేణుకాస్వామి కుటుంబం మధ్య రాజీ చేయడానికి వినోద్రాజ్ వెళ్లారని వదంతులు వినిపిస్తున్నాయి.ఇందుకు సంబంధించి వివరణ ఇచ్చిన వినోద్ రాజ్...తోటి ఆర్టిస్టు అనే అభిమానంతో, దర్శన్తో ఉన్న అనుబంధం నేపథ్యంలో దర్శన్ను జైలుకు వెళ్లి కలిశానన్నారు. మానవత్వం కోణంలో ఆలోచించి ఆ కుటుంబానికి ఏమైనా సాయం చేద్దామని రేణుకాస్వామి కుటుంబ సభ్యులను కలిశానని, రాజీ కుదిర్చే ఉద్దేశం ఆలోచన తనకు లేవన్నారు. -
'మనం జాబ్ చేయండి ఏంటి?'.. ఆసక్తిగా పేకమేడలు ట్రైలర్!
వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటిస్తోన్న సినిమా 'పేకమేడలు'. ఈ చిత్రం ద్వారా వినోద్ కిషన్ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రాకేష్ వర్రే నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్కు సినీ ప్రియుల అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. మధ్య తరగతి జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఏ పనిపాట లేకుండా భార్య సంపాదన మీద బతికే ఓ వ్యక్తి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఒక అమ్మాయి పరిచయంతో అతని లైఫ్ ఎలా మారింది? అనే కథాంశంతో రూపొందించినట్లు అర్థమవుతోంది.'వెధవ పనులు చేసేటప్పుడు పదిమందికి తెలియకుండా చేయాలన్న ఇంగిత జ్ఞానం లేదారా నీకు?' అన్న డైలాగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మొత్తానికి ట్రైలర్ చూస్తే ఫుల్ ఎమోషనల్ థ్రిల్లర్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈనెల 19న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. కాగా.. ఈ చిత్రంలో రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ ముఖ్య పాత్రలు పోషించారు. -
హీరోగా ఎంట్రీ ఇస్తోన్న వినోద్ కిషన్.. లిరికల్ సాంగ్ వచ్చేసింది!
'నా పేరు శివ', 'అంధగారం' చిత్రాలతో మెప్పించిన వినోద్ కిషన్ హీరోగా నటిస్తోన్న మూవీ 'పేక మేడలు'. ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో అనూష కృష్ణ హీరోయిన్గా కనిపించనుంది. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, సాంగ్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సింగిల్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆడపిల్ల అనే పాటకు సాకే రాజశేఖర్ పాడగా.. భార్గవ కార్తీక్ లిరిక్స్ అందించారు. ఒక మంచి కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న స్టోరీగా ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని జూలై 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీలో రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
సైనిక్ స్కూల్పై రేవంత్ అబద్ధాలు: వినోద్
సాక్షి, హైదరాబాద్: వరంగల్లో సైనిక్ స్కూల్ ఏర్పా టుపై సీఎం రేవంత్ రెడ్డి అసత్యాలు మాట్లా డుతున్నా రని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్ విమర్శించారు. ఇకపై ఆయన చెప్పే అబద్ధాలకు దీటుగా సమాధానం ఇస్తామ న్నారు. మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్తో కలిసి వినోద్ కుమార్ మంగళవారం తెలంగాణ భవన్లో విలేకరులతో మా ట్లాడారు. రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్తో భేటీ త ర్వాత రేవంత్ గోబెల్స్ తరహాలో మాట్లాడార న్నారు.వరంగల్లో సైనిక్ స్కూలు గతంలోనే మంజూరైందని, కానీ రక్షణశాఖ ఆధ్వర్యంలో నడపలే మని చెప్పినందునే సమస్య తలెత్తిందన్నారు. సైనిక్ స్కూల్ ఏర్పాటుపై గతంలో నాటి రక్షణ మంత్రులు మనోహర్ పారిక్కర్, అరుణ్ జైట్లీని అనేక మార్లు కలిశామని పేర్కొన్నారు. వరంగల్ సైనిక్ స్కూలు ఏర్పాటుపై గత ప్రభుత్వం కేంద్రంతో చేసిన ఉత్తర ప్రత్యుత్తరాలను రేవంత్ చదువుకోవాలని సూచించారు. రక్షణ శాఖ భూముల కేటాయింపునకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు రికార్డుల్లో ఉన్నాయని గుర్తు చేశారు. -
మే ఆఖరుకి సాధారణ స్థితికి కార్యకలాపాలు
న్యూఢిల్లీ: పైలట్ల ఆందోళనలతో ఫ్లయిట్ సర్విసులకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో మే నెలాఖరుకల్లా అంతా సద్దుమణుగుతుందని, పరిస్థితులు సాధారణ స్థితికి తిరిగొస్తాయని విమానయాన సంస్థ విస్తార సీఈవో వినోద్ కణ్ణన్ తెలిపారు. పైలట్లు లేవనెత్తిన సమస్యలపై దృష్టి పెట్టామని, వాటి పరిష్కార మార్గాలపై చర్చిస్తున్నామని ఆయన వివరించారు. ఫ్లయిట్ల సంఖ్య తగ్గవచ్చు గానీ ఈ వారాంతం నుంచి ఫ్లయిట్లను అప్పటికప్పుడు రద్దు చేసే పరిస్థితి ఉండబోదని కణ్ణన్ పేర్కొన్నారు. కార్యకలాపాలను కుదించుకునే క్రమంలో 20–25 రోజువారీ ఫ్లయిట్స్ను తగ్గించినట్లు ఆయన వివరించారు. విమానాలు రద్దు కావడం వల్ల ఇబ్బందిపడిన ప్రయాణికులకు తమ సిబ్బంది తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు కణ్ణన్ తెలిపారు. విస్తారాలో 6,500 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 1,000 మంది పైలట్లు, 2,500 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. -
సోదరుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు
కంటోన్మెంట్(హైదరాబాద్): ఆస్తి తగాదాలతో వరుసకు సోదరుడైన ఒక వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సికింద్రాబాద్ ప్రాంతంలోని బోయిన్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 70 శాతం గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బోయిన్పల్లి కంసారిబజార్ రామమందిరం సమీపంలో కందికొండ సత్తయ్య, ముత్తయ్యలకు నివాసస్థలం ఉంది. ముత్తయ్య కుమారుడు శ్రీనివాస్(62) ఇటీవల తన తండ్రి ద్వారా సంక్రమించిన స్థలంలో ఇంటినిర్మాణం చేపట్టి అద్దెకు ఇచ్చాడు. తాను సమీపబస్తీలో నివాసం ఉంటున్నాడు. కంసారి బజార్లో తన ఇంటి పక్కనే వరుసకు సోదరుడైన వినోద్ (సత్తయ్య కుమారుడు) మరో ఇంటిలో నివాసముంటున్నాడు. వీరిద్దరి ఇళ్ల నడుమ ఉన్న చిన్నపాటి సందు గుండానే శ్రీనివాస్ ఇంటికి దారి ఉంది. ఈ స్థలం విషయంలోనే వీరి మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఆదివారం శ్రీనివాస్ అద్దె వసూలు నిమిత్తం తన ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుండగా వినోద్ అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తన అన్నను చంపానంటూ అరుస్తూ పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్లో శ్రీనివాస్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో శ్రీనివాస్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ద్విచక్ర వాహనంపై అర్ధరాత్రి వస్తుండగా..
కరీంనగర్: మండలంలోని తుమ్మన్నపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వలస కూలీ మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం బైపాస్ రోడ్డు పనులు చేపడుతున్న డీబీఎల్ కంపెనీలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంగికలన్ మీర్జాపూర్కు చెందిన వినోద్(23) కూలీగా పనిచేస్తున్నాడు. ఓం ప్రకాశ్ అనే మరోవ్యక్తితో ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం ఖాజీపేటకు వెళ్లారు. తిరిగి తుమ్మనపల్లికి గురువారం అర్ధరాత్రి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఓంప్రకాశ్కు తీవ్రగాయాలు అయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడి కుటుంబసభ్యుడు ఆమల్ ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవి చదవండి: అర్ధరాత్రి స్వాతి వద్దకు వచ్చిన వ్యక్తి ఎవరు.. -
కారులోనే తుదిశ్వాస విడిచిన ప్రముఖ మళయాల నటుడు
కొచ్చి: పాపులర్ మళయాల నటుడు వినోద్ థామస్(45) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.కేరళలోని పంపడిలోని ఓ హోటల్లో పార్క్ చేసి ఉన్న కారులో ఆయన చనిపోయి ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. చాలా సేపటి నుంచి హోటల్ ఆవరణలో ఉన్న కారులో ఒక వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు హోటల్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు వచ్చి చూశామని పోలీసులు చెప్పారు. హోటల్కు చేరుకున్న వెంటనే కారులో పడి ఉన్న వినోద్ థామస్ను ఆస్పత్రికి తరలించామని, అయితే అతను అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని పోలీసులు తెలిపారు. వెంటనే మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించామన్నారు. అయ్యప్పనుమ్ కోష్యుమ్, నథోలి, ఒరు చెరియ మీనల్ల, ఒరు వంత్ పాతాయా, హ్యాప్పీ వెడ్డింగ్, జూన్ లాంటి పాపులర్ సినిమాల్లో వినోద్ థామస్ నటింంచారు. ఇందులో అయ్యప్పనుమ్ కోష్యుమ్ అనే చిత్రం తెలుగులో భీమ్లానాయక్ పేరుతో రీమేక్ చేశారు. ఇదీచదవండి.. ‘అమ్మా..గంగమ్మ తల్లీ.. భారత్ను గెలిపించమ్మా’ -
ప్రేమ విఫలమైందని.. యువకుడి తీవ్ర నిర్ణయం..!
మహబూబాబాద్: ప్రేమ విఫలమైందనే ఆవేదనతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం ఇల్లెందు మండలం పోలారం గ్రామానికి చెందిన వినోద్(25) మానుకోట జిల్లా కలెక్టరేట్లోని దివ్యాంగుల విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పోలారం గ్రామానికే చెందిన ఓ యువతితో ఆయన ప్రేమలోపడగా, యువతి తండ్రి వినోద్ను హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి గురైన వినోద్ ఇరవై రోజుల క్రితం పురుగుల మందు తాగగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. వినోద్ తండ్రి ప్రభాకర్ ఫిర్యాదుతో యువతి కుటుంబానికి చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఇల్లెందు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
Double-Decker Skyways: జేబీఎస్ టు శామీర్పేట డబుల్ డెక్కర్ స్కైవే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జూబ్లీ బస్టాండ్ (జేబీఎస్) నుంచి శామీర్పేట మధ్యలో డబుల్ డెక్కర్ స్కైవే నిర్మాణంతో కరీంనగర్–హైదరాబాద్ రూట్లో ప్రయాణానికి మహర్దశ పట్టినట్టే. ఇటీవల ఈ ప్రతిపాదనను కేంద్రం వద్ద ఉంచగా, సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. డబుల్ డెక్కర్ స్కైవే మూడంచెల పద్ధతి ఉంటుందని, పైభాగంలో మెట్రోరైలు, మధ్యలో ఫ్లైఓవర్, కిందిభాగంలో రోడ్డు ఉంటుందని వివరించారు. పనులు పూర్తయ్యే నాటికి రూ.ఐదువేల కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. కరీంనగర్ మార్గంలో జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు 18.5 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ స్కైవే నిర్మాణంతో సిద్దిపేట, కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు హైదరాబాద్కు సాఫీగా రాకపోకలు సాగించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్, ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, రంజిత్రెడ్డిలతో కలిసి తాను కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్నాథ్సింగ్తో జరిపిన చర్చల ఫలితంగానే ఈ ప్రతిపాదన ఓ కొలిక్కి వచ్చినట్టు తెలిపారు. -
మణిపూర్: అమిత్ షా అఖిలపక్ష భేటీ.. ఏపీ, టీఎస్ నుంచి వెళ్లింది వీరే..
సాక్షి, ఢిల్లీ: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రహోం మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. మణిపూర్ ఘర్షనల నేపథ్యంలో నేడు(శనివారం) అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు.. శుక్రవారం కూడా మరోసారి మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాల ప్రకారం.. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని, సాధారణ స్థితిని పునరుద్ధరించే మార్గాలపై ఆలోచించడమే అఖిలపక్ష సమావేశం ఉద్దేశమని అమిత్ షా చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుందని తెలిపారు. అయితే, మణిపూర్ ఘర్షణల తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ఇక, ఈ సమావేశానికి ఏపీ నుంచి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ వినోద్ హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా.. మణిపూర్లో హింసాత్మక ఘటన నేపథ్యంలో తొమ్మిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నోంగ్తోంబమ్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారని వారు విమర్శలు చేశారు. ఐదు అంశాలతో కూడిన మెమోరాండంను మోదీకి సమర్పించిన ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై, పరిపాలనపై తమకు నమ్మకం లేదన్నారు. చట్టపరంగా పరిపాలన అనుసరించడం ద్వారా సరైన పరిపాలన, ప్రభుత్వ పనితీరు కోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, తద్వారా ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందవచ్చు అని లేఖలో వివరించారు. కాగా, ఈ ఎమ్మెల్యేలంతా మైతి సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. లేఖపై సంతకాలు చేసిన ఎమ్మెల్యేలు వీరే.. - కరమ్ శ్యామ్ సింగ్, - తోక్చోమ్ రాధేశ్యామ్ సింగ్, - నిషికాంత్ సింగ్ సపం, - ఖ్వైరక్పం రఘుమణి సింగ్, - ఎస్. బ్రోజెన్ సింగ్, - టీ. రవీంద్రో సింగ్, - ఎస్, రాజేన్ సింగ్, - ఎస్. కేబీ దేవి, - వై. రాధేశ్యామ్. ఇది కూడా చదవండి: ఇండిగో విమానంలో మహిళకు గుండెపోటు.. సీపీఆర్ చేయడంతో.. -
దమ్ముంటే తమ మద్దతు లేకుండా గెలవాలంటూ గంగులకు చాలెంజ్
-
మామూలుగా తిట్టుకోవట్లే...
-
అన్నదమ్ముల అదృశ్యం..!
-
షార్ట్ కవరింగ్ లాభాలు
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు మార్చి సిరీస్కు లాభాలతో వీడ్కోలు పలికాయి. ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్ల జరగడంతో బుధవారం సూచీలు అరశాతానికి పైగా లాభపడ్డాయి. బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు కొలిక్కి వస్తుండంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఉదయం మార్కెట్ ప్రారంభమైన తర్వాత మిడ్ సెషన్ వరకు సూచీలు స్థిరంగా కదలాడాయి. ఆ తర్వాత కాస్త నెమ్మదించినా.., చివరి గంటలో కీలక రంగాల్లో కొనుగోళ్ల జోరు పెరగడంతో లాభాలు పెరిగాయి. ఉదయం సెన్సెక్స్ 41 పాయింట్ల స్వల్ప నష్టంతో 57,613 మొదలైంది. ఇంట్రాడేలో 57,524 వద్ద కనిష్టాన్ని, 58,124 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 346 పాయింట్లు ఎగసి 57,960 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25 పాయింట్లు పతనమై 16,952 వద్ద మొదలైంది. రోజంతా 16,941 – 17,126 శ్రేణిలో ట్రేడైంది. చివరికి 129 పాయింట్ల లాభంతో 17,081 వద్ద నిలిచింది. అన్ని రంగాల షేర్లకు డిమాండ్ నెలకొంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు అధికాస్తకి చూపారు. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ సూచీలు ఒకటిన్నర శాతానికి పైగా ర్యాలీ చేశాయి. ఎఫ్పీఐలు రూ.1,245 కోట్ల షేర్లను, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.823 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 15 పైసలు క్షీణించి 82.31 స్థాయి వద్ద స్థిరపడింది. శ్రీరామ నవమి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు కావడంతో ఎక్సే్చంజీలు తిరిగి శుక్రవారం ప్రారంభమవుతాయి. సూచీలు అరశాతానికి పైగా ర్యాలీ చేయడంతో బీఎస్ఈలో రూ.3.12 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఆసియా మార్కెట్లు ఒకశాతం, యూరప్ మార్కెట్లు ఒకటిన్నర శాతం పెరిగాయి. యూఎస్ స్టాక్ సూచీలు ఒకశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ‘‘ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతుందనే స్పష్టం వచ్చేంత వరకు, బ్యాంకింగ్ రంగంలో అనిశ్చితులు సంపూర్ణంగా సద్దుమణిగే దాకా ఒడిదుడుకులు తప్పవు. సాంకేతికంగా నిఫ్టీ గత 5 రోజుల్లో గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఎగువన 17,207–17,255 శ్రేణిలో నిరోధాన్ని, దిగువ స్థాయిలో 16,985 వద్ద తక్షణ మద్దతు ఏర్పాటు చేసుకుంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦కెన్ తన నివేదికలో నిరాధారమైన, సత్యదూరమైన ఆరోపణలు చేసిందంటూ అదానీ గ్రూప్ వివరణతో ఈ కంపెనీల షేర్లు ర్యాలీ చేశాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ తొమ్మిది శాతం, అదానీ పోర్ట్స్ ఏడుశాతం లాభపడ్డాయి. అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్డీటీవీ షేర్లు ఐదుశాతం ఎగసి అప్పర్ సర్క్యూట్ వద్ద లాకయ్యాయి. ♦ ఇండస్ఇండ్ బ్యాంకుతో వివాదాలను పరిష్కరించుకున్నామని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ తెలపడంతో జీ మీడియా షేరు మూడున్నర శాతం లాభపడి రూ.216 వద్ద స్థిరపడింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ 2% బలపడి రూ.1,056 వద్ద నిలిచింది. ♦ బైబ్యాక్ ఇష్యూలో పాల్గొనేందుకు అర్హత తేదీ ముగియడంతో సింఫనీ షేరు ఆరు శాతం పతనమైన రూ.1023 వద్ద ముగిసింది. -
వినోద్ అదానీ ప్రమోటర్ల గ్రూప్లో భాగమే: అదానీ గ్రూప్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ విషయంలో అదానీ గ్రూప్ స్పష్టత ఇచ్చింది. ఆయన ప్రమోటర్ గ్రూప్లో భాగంగా ఉన్నారని పేర్కొంది. తమ గ్రూప్లోని వివిధ లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్ల గ్రూప్లో వినోద్ కూడా ఒకరని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికన్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల్లో వినోద్ అదానీ (74) పేరు కూడా బైటికి వచ్చిన సంగతి తెలిసిందే. వినోద్కు అదానీ గ్రూప్లోని ఏ లిస్టెడ్ సంస్థలోనూ ఎటువంటి హోదా లేదని, కానీ మనీ లాండరింగ్ తదితర కార్యకలాపాల కోసం విదేశాల్లో డొల్ల కంపెనీల ఏర్పాటులో మాత్రం ఆయన పాత్ర ఉందని హిండెన్బర్గ్ ఆరోపించింది. వినోద్ పేరు సర్వత్రా చర్చనీయాంశంగా మారడంతో అదానీ గ్రూప్ తాజాగా వివరణ ఇచ్చింది. వివిధ సందర్భాల్లో స్టాక్ ఎక్సే్చంజీలకు సమర్పించిన వివరాల్లో వినోద్ అదానీ గురించి కూడా ప్రస్తావన ఉన్నట్లు తెలిపింది. -
అల్సర్ని తగ్గించిన అరటి! బేబీ ఫుడ్ రకాలు! 10 పిలకల ధర 4,200! సాగు చేస్తే..
Vinod Sahadevan- Banana Varieties: పండుగా, కూరగా, మరెన్నో ఉత్పత్తులుగా.. అరటి పంట మన జాతి సంస్కృతిలో అనదిగా విడదీయరాని భాగమైపోయింది. వైవిధ్యభరితమైన అరటి రకాలను అంతరించిపోకుండా సాగు చేస్తూ పరిరక్షించుకోవటం ఎంతో ముఖ్యమైన విషయం. ఈ బృహత్ కార్యాన్ని నెత్తికెత్తుకున్న కేరళకు చెందిన ఓ రైతు స్ఫూర్తికథనం ఇది. విలక్షణమైన అరటి రకాలను సేకరించి సాగు చెయ్యటమంటే కేరళకు చెందిన వినోద్(62)కు మహా ఇష్టం. ఇష్టం అనే కంటే పిచ్చి అంటే బాగా నప్పుతుందేమో. అందుకే ఆయనకు ‘వలచెట్ట’ అని పేరొచ్చింది. వలచెట్ట అంటే మళయాళంలో ‘అరటి అన్న’ అని అర్థం. తిరువనంతపురం నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన 4 ఎకరాల తోటలో 500 కంటే ఎక్కువ రకాల అరటి మొక్కల్ని నాటి ప్రాణప్రదంగా సాగు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలతో పాటు అనేక విదేశాల్లో తిరిగి మరీ అరటి రకాలను సేకరించి నాటడం పనిగా పెట్టుకున్నాడు. సుసంపన్నమైన అరటి జీవవైవిధ్యానికి నిలయంగా మారిన తన క్షేత్రాన్ని ‘అరటి గ్రామం’ (వలగ్రామం) అని పిలుచుకుంటున్నారు. శాస్త్రవేత్త ఇవ్వనన్నాడని... వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వినోద్కు చిన్నప్పటి నుంచే అరటి రకాలను సేకరించే అలవాటుంది. పదేళ్ల క్రితం ఎదురైన చేదు అనుభవం అతన్ని అరటి జీవవైవిధ్యానికి పట్టుగొమ్మగా మార్చేసింది. ఓ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తను తనకు ఇష్టమైన ఓ అరటి రకం మొక్క ఇవ్వమని అడిగితే అందుకు ఆయన నిరాకరించారు. ఆ సంఘటన వినోద్ను తీవ్రంగా బాధపెట్టింది. అరటి రకాల కోసం ఇకపై ఏ విశ్వవిద్యాలయంపై ఆధారపడకూడదని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి రకరకాల అరటి పిలకలను సేకరించి తన సొంత పొలంలో పెంచడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన పొలంలో 500 కన్నా ఎక్కువ అరటి రకాల మొక్కలున్నాయి. ఆ రకాలలో ఎంతో వైవిధ్యం ఉంది. విశేషమేమిటంటే.. తిరువనంతపురం అనే ఓ అరటి రకం ఉండేది. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. కానీ, వినోద్ పొలంలో ఉంది. పెయాన్తో.. పండుగా తినడానికి, పచ్చికాయలను కూర వండుకోవడానికి ఉపయోగపడే అరటి రకాలు మనకు తెలుసు. అంతేకాదు.. ఐస్క్రీమ్లు, షేక్స్కు ఉపయోగపడే ప్రత్యేక అరటి పండ్లు ఉన్నాయి. ‘పెయాన్’ రకం అరటి కాయలతో కేరళలో కూర చేస్తారు, తమిళనాడులో దీన్ని ఎక్కువగా పండుగా తింటారు. వేసవిలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం ఉన్న పండు ఇది. చక్క, వాయల్వజా, కుల్లరకని, బారాబెన్లో, చిరపుంచి, పంథరాజ్, ఎఫ్హెచ్ఐఏ3, సబా మొదలైన పేర్లతోనూ దీన్ని పిలుస్తుంటారు. తక్కువ నీరు, ఎరువులతో పెరగటం దీని ప్రత్యేకత. అత్యధికంగా అమ్ముడయ్యే రకం అయినప్పటికీ రైతులకు ఈ రకం అరటి పిలకలు దొరక్క సాగు తగ్గిపోయింది. ఇవన్నీ ఇప్పుడు మన అరటి వీరుడు వినోద్ దగ్గర ఉన్నాయి! అల్సర్ని తగ్గించిన అరటి! మైసూరులో నవంబర్లో జరిగిన కిసాన్ స్వరాజ్ సమ్మేళనంలో వినోద్ తన తోటలో పండిన కనీసం 30 రకాల అరటి పండ్లను ప్రదర్శనకు పెట్టారు. మీకు బాగా ఇష్టమైన అరటి రకం ఏది అని ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ‘అన్నీ ఇష్టమే. ఒక్కో రకం రుచి, వాసన, సైజు వేరుగా ఉంటాయంతే’ అన్నారు. అదిసరే గానీ.. ప్రత్యేకతలున్న అరటి రకాల గురించి చెప్పండి అనడిగితే.. ‘కన్నామంఫలం’ రకం అరటి పండ్లలో ఔషధ గుణాల గురించిన ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. ఆయన తండ్రికి కడుపులో అల్సర్ సమస్య ఉండేది. ఎవరో చెబితే ‘కన్నామంఫలం’ అరటి పండ్లు కొన్ని రోజుల పాటు తింటే అల్సర్ సమస్య తీరిపోయింది. బేబీ ఫుడ్ అరటి రకాలున్నాయి.. పెద్దలకే కాదు శిశువులు, బాలలకు కూడా ‘కన్నామంఫలం’ మంచిదని.. ‘కన్నమంఫలం’ అంటే ‘శిశువుల ఆహారం’ అని అర్థమని వినోద్ వివరించారు. ‘కన్నమంఫలం’తో ΄పాటు కారయన్నన్, పొంకల్లి, కన్నన్పాజ్మ్, అడుక్కన్, కున్నన్.. ఇవన్నీ బేబీ ఫుడ్గా పనికొస్తాయన్నారు. ఈ రకాల అరటి పండ్లను ఎండబెట్టి పొడి చేసి చంటి పిల్లలకు తినిపిస్తారు. జీర్ణకోశ సమస్యలకు ఇది ఉత్తమంగా పనిచేస్తుందన్నారు. ఏపీ, తెలంగాణలో ఏ రకాన్నయినా సాగు చేయొచ్చు! మన దేశంలో ఎక్కువ రకాల అరటిని కలిగి ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. వినియోగం కూడా ఎక్కువే. అయినా అరుదైన అరటి పండ్ల రకాల పరిరక్షణపై అధికారులు ఆసక్తి చూపడం లేదన్నది వినోద్ ఫిర్యాదు. అందుకే కేరళలోని అన్ని జిల్లాల్లో తన పొలం మాదిరిగా ’అరటి జీవవైవిధ్య క్షేత్రాలను ఏర్పాటు చేయాలన్నది తన ఆశయమని వినోద్ చెబుతున్నారు. తన దగ్గర ఉన్న అరటి రకాలన్నీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాటుకోవడానికి అనువైనవేనని వినోద్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. తాను సంరక్షిస్తున్న అరటి రకాల పిలకల(సక్కర్స్)ను విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. పది పిలకలను రూ. 4,200కు అమ్ముతున్నానని, ఆర్డర్ ఇస్తే కొరియర్లో పంపుతానన్నారు. ఫేస్బుక్లో ‘వలగ్రామం’ గ్రూప్ నిర్విహిస్తున్నారు. వల చెట్టన్ వాట్సప్: 94464 01615. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ చదవండి: సాగు చేస్తే చం'ధనమే'!.. పంటకాలం 12 ఏళ్లు.. చేతికి రూ.కోట్లలో ఆదాయం -
హిట్ చిత్రాల దర్శకుడితో కమల్ మూవీ?
విక్రమ్ చిత్రం అందించిన విజయోత్సవంతో నటుడు కమలహాసన్ వరుస చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరో పక్క బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోకు హోస్ట్గా వ్యహరిస్తూ బిజీగా ఉన్నారు. కాగా ఇండియన్ 2 చిత్రాలు పూర్తి చేసిన తర్వాత మలయాళ దర్శకుడు మహేష్ నారాయణన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నారు. కాగా ఆ తర్వాత చేసే చిత్రానికి కూడా కమల్హాసన్ పచ్చజెండా ఊపినట్లు తాజా సమాచారం. అజిత్ కథానాయకుడిగా నేర్కొండ పార్వై, వలిమై వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు హెచ్ వినోద్ ప్రస్తుతం అదే అజిత్ హీరోగా తుణివు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తదుపరి ఈయన కమల్హాసన్ను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర కథను దర్శకుడు హెచ్.వినోద్ ఇటీవల కమల్హాసన్కు వినిపించారని, ఆయన నటించడానికి సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఒక యాక్షన్ గేమ్ నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని కోలీవుడ్ వర్గాల టాక్. కాగా తుణివు చిత్రం విడుదల తర్వాత కమలహాసన్ హీరోగా నటించే చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. -
తెలంగాణలో కూడా మూడు రాజధానులు ఉండాలి : ప్రొపెసర్ వినోద్
-
రిసెప్షనిస్ట్ హత్యోదంతం.. నిందితుడి తండ్రి సంచలన వ్యాఖ్యలు!
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్, రిషికేష్లోని వంతారా రిసార్ట్లో రిసెప్షనిస్ట్గా పని చేసే యువతి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుల్కిత్ ఆర్యను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజున నిందితుడి తండ్రి వినోద్ ఆర్య, సోదరుడు అంకిత్ ఆర్యను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను ఖండించారు బీజేపీ మాజీ నేత వినోద్ ఆర్య. పుల్కిత్ అమాయకుడని పేర్కొన్నారు. ‘అతడు ఒక సాదా సీదా అబ్బాయి. తన పనేదో తాను చూసుకుంటాడు. నా కుమారుడు పుల్కిత్, హత్యకు గురైన యువతి ఇరువురికి న్యాయం జరగాలని కోరుకుంటున్నా. పుల్కిత్ ఇలాంటి వాటిలో ఎప్పుడూ పాల్గొనలేదు. అతడు నిర్దోషి.’ అని తెలిపారు వినోద్ ఆర్య. చాలా రోజులుగా పులికిత్ తమ కుటుంబానికి దూరంగా జీవిస్తున్నాడని చెప్పారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా జరగాలనే ఉద్దేశంతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. హత్యకు గురైన రిసెప్షనిస్ట్, 19 ఏళ్ల యువతి పని చేస్తున్న రిసార్ట్ ఓనర్ పుల్కిత్ ఆర్య, మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాలను శుక్రవారమే అరెస్ట్ చేశారు పోలీసులు. దర్యాప్తులో నిందితులు తెలిపిన వివరాలు, బాధితురాలి మొబైల్ ఫోన్ ఛాటింగ్ ప్రకారం..టూరిస్టులకు ‘ప్రత్యేక సేవలు’ అందించాలని ఆమెపై ఒత్తిడి చేసినట్లు తేలిందని పోలీసు అధికారి అశోక్ కుమార్ శనివారం వెల్లడించారు. నిందితుడు పుల్కిత్ ఆర్య, హత్యకు గురైన యువతి ఇదీ చదవండి: రిసెప్షనిస్ట్ హత్య కేసులో కుమారుడు అరెస్టు.. తండ్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ -
రిచెస్ట్ ఎన్ఆర్ఐ వినోద్ అదానీ: తగ్గేదేలే అంటున్న అదానీ బ్రదర్స్
సాక్షి,ముంబై: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 10,94,400 కోట్ల సంపదతో టాప్ ప్లేస్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ కూడా తగ్గేదేలా అంటున్నారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ (సెప్టెంబర్ 22, గురువారం) తాజా లిస్ట్ ప్రకారం దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త వినోద్ అదానీ రూ.1,69,000 కోట్లతో అత్యంత ధనవంతులైన ఎన్ఆర్ఐ, ఆరో సంపన్న భారతీయుడుగా నిలిచారు. 1976లో ముంబయిలో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించి సింగపూర్దాకా విస్తరించారు. జకార్తాలో వ్యాపార వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. గత సంవత్సరంలో వినోద్ అదానీ సంపద 28 శాతం లేదా 37,400 కోట్లు పెరిగింది. అలా టాప్ 10 సంపన్న వ్యక్తుల జాబితాలో ఆరోస్థానం కోసం రెండు ర్యాంకులు ఎగబాకినట్టు నివేదించింది. గత ఐదేళ్లలో వినోద్ అదానీ సంపద ఏకంగా 850 శాతం లేదా 1,51,200 కోట్లు పెరిగింది. నివేదిక ప్రకారం, 2018లో 49వ స్థానం నుంచి ఈ ఏడాది ఆరో స్థానానికి చేరారు. వినోద్ రోజువారీ ప్రాతిపదికన రూ. 102 కోట్లు. వార్షిక ప్రాతిపదికన నాలుగో అతిపెద్ద గెయినర్.అంతేకాదు ఇద్దరు అదానీల సంపద మొత్తం రూ. 12,63,400 కోట్లుగా ఉంది. అంటే హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లోని తొలి పదిమంది వ్యక్తుల సంపదలో దాదాపు 40 శాతం అన్న మాట. ఈ ఏడాది 94 మంది ఎన్నారైలు భారతీయ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. -
కామాంధుడిని ఎన్కౌంటర్ చేయండి.. తల్లడిల్లిపోతున్న దీక్షిత తల్లిదండ్రులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ఏలూరు టౌన్: విజయవాడలో కామాంధుడు వినోద్జైన్ లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెను తలచుకొంటూ తల్లడిల్లిపోతున్నారు. దీక్షిత ఫొటోను దగ్గరపెట్టుకొని, చూసుకొంటూ కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు. సీసీ ఫుటేజీలోని దృశ్యాలను చూసి తట్టుకోలేకపోతున్నారు. దుర్మార్గుడిని నడిరోడ్డుపై ఎన్కౌంటర్ చేయండని రోదిస్తున్నారు. మరో ఆడపిల్లకి అన్యాయం జరగకుండా చూడాలని, తమకు ఎదురైన కష్టం మరొకరికి రాకూడదంటూ వేడుకొంటున్నారు. తనకు ఇష్టమైన రంగు డ్రస్ వేసుకొని, వాంకింగ్కు వెళ్లే ముందు హగ్ చేసుకొందని, కరోనా కేసులు పెరుగుతున్నాయమ్మ, వాకింగ్ వద్దని చెప్పానని, వెళ్లొస్తానమ్మా అంటూ..వెళ్లిపోయిందని బాలిక తల్లి కన్నీరుమున్నీరవుతోంది. మెట్లు, లిఫ్ట్ వద్ద ఉండి నిందితుడు విష్ చేసేవాడని, వయసు రీత్యా తమకు అనుమానం రాలేదని చెప్పారు. పరామర్శించిన ఎమ్మెల్సీ... బాలిక కుటుంబాన్ని మంగళవారం ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి పరామర్శించి ఓదార్చారు. నిందితుడిని నడిరోడ్డుపై ఎన్కౌంటర్ చేసి మరో ఆడపిల్లకు అన్యాయం జరగకుండా చూడాలని బాలిక తల్లి తనతో అన్నట్లు ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి చెప్పారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏలూరులో కొవ్వొత్తుల ప్రదర్శన కామాంధుడు వినోద్ జైన్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ మహిళా నేతలు, కార్యకర్తలు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్లో ఆందోళన చేపట్టారు. మహిళలు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి బాలికకు నివాళులర్పించారు. ఫైర్స్టేషన్ సెంటర్లోని దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, ఇడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి, మేయర్ షేక్ నూర్జహాన్, స్మార్ట్ సిటీ చైర్ పర్సన్ బొద్దాని అఖిల, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. -
వినోద్ జైన్కు రిమాండ్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నగరంలోని విద్యాధరపురానికి చెందిన పద్నాలుగేళ్ల బాలిక బలవన్మరణానికి కారకుడైన కామాంధుడు వినోద్ జైన్ (48)ను భవానీపురం పోలీసులు ఆరెస్టుచేసి, మంగళవారం సాయంత్రం విజయవాడలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సునీల్కుమార్ ముందు హాజరుపరిచారు. అపార్ట్మెంట్లోని సీసీ కెమెరా దృశ్యాలను సీజ్చేసి కోర్టుకు సమర్పించారు. తొలుత.. ఐపీసీలోని 306, 354(ఏ), (డి) 509, 506 పోక్సో చట్టంలోని 8, 10 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. విచారణ అనంతరం.. సేకరించిన సాక్ష్యాల ఆధారంగా 354, 354డి, 509, 506 ఐపీసీ సెక్షన్లను చేర్చారు. దీంతో మేజిస్ట్రేట్ నిందితుడికి ఈనెల 15 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. అనంతరం వినోద్ను మచిలీపట్నం సబ్జైలుకు తరలించారు. మరిన్ని ఆధారాల కోసం నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ను సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. బాలికకు ఏమైనా మెసేజ్లు పంపించేవాడాç? వీడియోలు ఏమైనా తీశాడా? బాలిక ఆత్మహత్య లేఖ కాకుండా గతంలో ఇంకా ఎక్కడైనా రాసుకుందా, తదితర అంశాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అపార్ట్మెంట్ వాచ్మెన్ను కూడా పోలీసులు విచారించారు. బాలిక బయటకు వెళ్లే సమయాల్లో వినోద్ జైన్ అక్కడే ఉండేవాడని అతను చెప్పాడు. రిమాండ్ రిపోర్ట్లో అంశాలివే.. ► బాలికను లైంగికంగా వేధించి ఆత్మహత్య చేసుకోవడానికి వినోద్ జైన్ కారకుడయ్యాడు. ► బాలిక ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి ఆత్మహత్యకు కారకుడయ్యాడు. ► బాలిక నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ నాలుగో అంతస్తులోని జీ–43లో నిందితుడు ఉండేవాడు. ► జనవరి 29వ తేదీ సా.5.15 గంటలకు అపార్ట్మెంట్ పైనుంచి బాలిక దూకి ఆత్మహత్య చేసుకుంది. రెండు నెలలుగా వేధిస్తున్నట్లు సూసైడ్ నోట్లో ఆమె స్పష్టంగా రాసింది. ► దీంతోపాటు ఆమె సెల్ఫోన్, ట్యాబ్లో ఆ వేధింపులను పొందుపరిచింది. ► లిఫ్ట్, మెట్ల వద్ద వెంటపడేవాడు. బాలిక తమ్ముడు విఘ్నేష్ (10)ను స్కూల్ ఆటో వద్దకు తీసుకెళ్లేటప్పుడు, సరుకుల కోసం షాపునకు వెళ్లేటప్పుడు, వాకింగ్కు వెళ్లేటప్పుడు వినోద్ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ► ఈ బాధలను భరించలేక ఆమె అపార్టుమెంట్ పైనుంచి దూకి చనిపోవాలని నిర్ణయించుకుంది. బాలిక సూసైడ్ నోట్తోపాటు, సెల్ఫోన్, ట్యా బ్ను పోలీసులు సీజ్చేశారు. 12 మంది సాక్షులను విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. -
2 నెలలుగా అసభ్యంగా ప్రవర్తించాను: నేరాన్ని ఒప్పుకున్న వినోద్ జైన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ/వన్టౌన్ (విజయవాడ పశ్చిమ)/విజయనగరం/నగరి: లైంగిక వేధింపులతో బాలికను చిదిమేసిన టీడీపీ నాయకుడు వినోద్ జైన్ తన నేరాన్ని అంగీకరించాడు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లోని లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్లో టీడీపీ నేత వినోద్ జైన్ లైంగిక వేధింపులు తాళలేక 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు జైన్ను ఆదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మృతురాలు సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లుగా తాను రెండు నెలలుగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన మాట వాస్తవమేనని చెప్పాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించానన్నాడు. బాలిక స్కూల్కు వెళ్లి వచ్చే సమయాల్లో లిఫ్ట్, మెట్ల వద్ద వేచి ఉండేవాడినని, ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆనందించేవాడినని చెప్పాడు. తాను చేసింది తప్పేనని, ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదని.. వ్యవహారం ఇంతవరకు వస్తుందని కూడా తాను ఊహించలేదని చెప్పినట్లు తెలిసింది. ప్రేమానుబంధాలకు బాలిక ప్రాధాన్యత మరోవైపు.. ఆత్మహత్యకు ముందు బాలిక రాసిన లేఖ అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. అందులో ఎక్కువగా ప్రేమానుబంధాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. రక్తసంబంధాలపై ఎంతో మమకారం పెంచుకున్నట్లు అందులోని ప్రతీ పదం ద్వారా అర్ధమవుతుంది. చిన్న వయసులోనే ప్రేమానుబంధాలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. రక్తసంబంధాలపై ఎంతో మమకారాన్ని పెంచుకుంది. కామాంధుడి దురాగతాలను తట్టుకోలేక ఈ లోకం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఆ బాలిక.. అమ్మ, నాన్న, తమ్ముడి గురించే ఎక్కువగా తన లేఖలో పరితపించింది. ఆ ఐదు పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్లో బంధాలు, బాంధవ్యాల గురించే ఎక్కువగా ప్రస్తావించింది. ‘ఐ లవ్ యు మమ్మీ.. డాడీ.. మీరంతా బాగుండాలి’ అని ఆకాంక్షించింది. తల్లిదండ్రుల పట్ల ఆమెకున్న ఎనలేని ప్రేమాభిమానాలను ఆ లేఖలో చాటుకుంది. తన తమ్ముడ్ని సైతం పదేపదే ప్రస్తావించింది. తమ్ముడి పట్ల తనకున్న అభిమానాన్ని వివరించిన తీరు అందరినీ కదిలించింది. తనను బాగా చూసుకున్నారని తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఈ లేఖలోని అంశాలు చూసిన కుటుంబీకులు, స్థానికులు ఇంత ఘోరం చేశాడా, అని కన్నీటీపర్యంతం అవుతున్నారు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావటంలేదు. ‘న్యాయం చేయండి, మా బంగారు బొమ్మను మాకు తీసుకురండి’ అంటూ వారు తల్లడిల్లుతున్న తీరు చూపరులకూ కన్నీరు తెప్పిస్తోంది. అలాంటి వాడు అనుకోలేదు.. ఇక పోలీసులు అపార్టుమెంట్ వాసులను విచారించినప్పుడు, బాలిక వచ్చీవెళ్లే సమయంలో మెట్లు, లిఫ్ట్ వద్ద వినోద్ జైన్ కనిపించేవాడని చెప్పారు. అయితే, అతని వయస్సు రీత్యా అనుమానం రాలేదన్నారు. ఇలా వికృత చేష్టలకు పాల్పడతాడని తాము ఊహించలేదని తెలిపారు. ఇంతటి నీచానికి పాల్పడిన దుర్మార్గుడికి ఉరిశిక్ష వేసినా తక్కువేనని చెప్పినట్లు తెలిసింది. ఫుటేజీలో వికృత చేష్టలు అపార్ట్మెంట్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీ ఫుటేజీలో కామాంధుని వికృత చేష్టల దృశ్యాలు ఉన్నట్లు తెలిసింది. బాలిక అపార్ట్మెంట్ నుంచి దూకే దృశ్యాలు కూడా రికార్డ్ అయినట్లు పోలీసులు తెలిపారు. అపార్టుమెంటు పిట్టగోడ చివర బాలికను గమనించిన ప్రత్యక్ష సాక్షులు.. కింద పడతావు అని అరుస్తున్నా దూకేసిందని.. అంతా నిమిషంలోపే సంఘటన జరిగిందని వారు చెబుతున్నారు. మిన్నంటిన ఆందోళనలు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వినోద్ జైన్ను కఠినంగా శిక్షించాలని కృష్ణాజిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, అందోళనలు మిన్నంటాయి. ఘటనపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. విజయవాడ సింగ్నగర్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి ర్యాలీ నిర్వహించారు. భవానీపురంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు పి. చైతన్యరెడ్డి, గుడివాడ నరేంద్రల ఆధ్వర్యంలో స్కూలు పిల్లలతో కలిసి మానవహారం, ర్యాలీ చేపట్టారు. కుమ్మరిపాలెం, లెనిన్ సెంటర్లో కూడా చేపట్టారు. పలువురు కార్పొరేటర్లు కూడా తమ తమ డివిజన్లలో శాంతియుతంగా నిరసన తెలిపారు. దోషిని కఠినంగా శిక్షించాలని విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నేతలు ఇక జిల్లాలోని జగ్గయ్యపేట, నూజివీడు, పెడన, గుడివాడలలో శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లాలోనూ సోమవారం నిరసన ర్యాలీలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి ఆధ్వర్యంలో మహిళలు పెద్దఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. చీపురుపల్లిలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. బొబ్బిలిలో ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. కీచకులను టీడీపీ పెంచి పోషిస్తోంది : రోజా టీడీపీ అధినేత చంద్రబాబు కీచకులను పెంచి పోషించడంవల్లే ఇలా రాష్ట్రంలో అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిందని నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. వినోద్ జైన్కు వేసే శిక్ష ఎంత కఠినంగా ఉండాలంటే మరొకరు ఇలాంటి ఆలోచన చేయడానికే భయపడేలా ఉండాలన్నారు. బాలిక ఆత్మశాంతి కోసం సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో ఆమె పార్టీ నేతలతో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నిందితుడు వినోద్ జైన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని చెప్పారు. పైగా నారీ సంకల్ప యాత్ర దీక్ష చేపట్టడం వారికే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఈ దీక్ష వెనుక అసలు హీరో నారా లోకేష్ అని అందరికీ తెలుసునన్నారు. లోకేష్ పీఏ టీడీపీ మహిళలనే వేధిస్తున్నాడని ఆ విషయాన్ని కప్పిపుచ్చుకొనేందుకే ఈ నారీ దీక్ష చేపట్టి తన కొడుకును కాపాడుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని రోజా ఆరోపించారు. -
ఈ ఘటన దురదృష్టకరం.. అతన్ని ఉరి తీసినా తప్పు లేదు
లబ్బీపేట (విజయవాడ తూర్పు)/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): లైంగిక వేధింపులు తాళలేక తొమ్మిదో తరగతి బాలిక ఆత్మహత్య ఘటన అత్యంత దురదృష్టకరమని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ నేత వినోద్జైన్ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన బాలిక కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మతో కలిసి పరామర్శించారు. బాలిక తండ్రి గంగాధర్కుమార్, తాతయ్య మాంచాలరావులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ బాలిక ఎంతో మనోవేదనకు గురైందని, టీడీపీ నేత వినోద్ జైన్ తనను లైంగికంగా ఇబ్బందికి గురిచేసినట్లు సూసైడ్ నోట్లో పేర్కొందని తెలిపారు. మూడు పేజీల లేఖ రాసిందంటే ఆమె ఎంతగా మానసిక వేదనకు గురైందో అర్థం చేసుకోవచ్చన్నారు. బాలిక తాతయ్య రిటైర్డ్ తహసీల్దారు అని, పిల్లల కోసం ఏలూరు నుంచి విజయవాడ వచ్చినట్లు తెలిపారన్నారు. 50 ఏళ్లకు పైగా వయసున్న వినోద్ జైన్ దారుణంగా ప్రవర్తించాడని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. వినోద్జైన్ ఎంపీ కేశినేని నాని ముఖ్య అనుచరుడని, వినోద్ తరఫున చంద్రబాబు కూడా గత కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు ఏమి సమాధానం చెపుతారని ప్రశ్నించారు. బాలిక తల్లిదండ్రుల బాధ చూడలేక పోతున్నామని, దోషిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి చెప్పారు. చంద్రబాబు ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఫ్ట్ వద్ద, మెట్ల వద్ద అసభ్యంగా ప్రవర్తించాడని, మానవత్వం లేని వ్యక్తికి సంఘంలో చోటు ఉండకూడదన్నారు. బాలిక కుటుంబ సభ్యులకు దుర్గమ్మ ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. చిత్రంలో దీక్షిత గౌరి తల్లిదండ్రులు అతన్ని ఉరి తీసినా తప్పు లేదు బాలిక ఆత్మహత్యను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులే కారణమని బాలిక తన సూసైడ్ నోట్లో రాసిందని, అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తొమ్మిదో తరగతి చదువుతున్న పద్నాలుగేళ్ల విద్యార్థిని లైంగికంగా వేధించి, ఆత్మహత్యకు పురిగొల్పిన వినోద్జైన్ను ఉరితీసినా తప్పులేదన్నారు. వినోద్జైన్ దుర్బుద్ధి కారణంగా ప్రతిభావంతురాలైన బాలిక బలైందన్నారు. కుటుంబానికి చెప్పుకోలేని స్థితిలో ఆ బాలిక భయపడి మేడ మీద నుంచి దూకిందంటే ఏ మేరకు వేధించాడో అర్థమవుతోందన్నారు. కాల్మనీ సెక్స్ రాకెట్లో టీడీపీ నేతల పేర్లు వచ్చినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే, ఇలాంటి ఘటన జరిగేది కాదన్నారు. బాలిక లేఖ చూసే వరకూ వాస్తవం బయటకు రాలేదని, రెండు నెలలుగా శరీరాన్ని తాకుతూ ఇబ్బంది పెట్టాడన్నారు. టీడీపీలో వినోద్జైన్ లాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారతకు అహరహం కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్పై విమర్శలు చేసే టీడీపీ వాళ్లు ఇప్పుడు ఏమి సమాధానం చెపుతారని ఆమె ప్రశ్నించారు. మానసిక సంఘర్షణకు నిదర్శనం! బాలిక చనిపోక ముందు తీవ్ర మానసిక వేదనకు గురైందని తెలుస్తోంది. సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వినోద్ జైన్ ఇంటిని విచారణ నిమిత్తం సీజ్ చేశారు. బాలిక సూసైడ్ చేసుకునే ముందు సుమారు 20 నిమిషాల పాటు టెర్రస్పై అటూ ఇటూ తిరిగినట్లుగా సీసీ కెమెరాలో కనిపించింది. తద్వారా ఆ బాలిక ఎంతో సంఘర్షణకు లోనైనట్లు అర్థమవుతోంది. జైన్పై భవానీపురం పోలీసులు పోక్సో చట్టం, ఐపీసీ 306, 354(ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీపీ హనుమంతరావు తెలిపారు. ఆదివారం సాయంత్రం దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, స్థానిక కార్పొరేటర్ రెహమతున్నీసా బాలిక ఇంటికి చేరుకొని మృతదేహానికి నివాళులర్పించారు. బాలిక తల్లిని ఓదార్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తాత లైంగిక వేధింపులతో దీక్షిత గౌరి (14) ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బాలిక తాత, విశ్రాంత తహసీల్దార్ గోవాడ మాంచాలరావు భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన రెండో కుమార్తె అనురాధ, అల్లుడు గంగాధర కుమార్, వారి పిల్లలు దీక్షిత గౌరి (14), నందశ్రీ విఘ్నేష్ (10) ఉంటున్న అపార్ట్మెంట్లోని జీ 25 ఫ్లాట్కు ఎదురుగా మరో ఫ్లాట్లో ఈయన ఉంటున్నారు. అనురాధ వన్టౌన్ కొత్తపేటలోని అన్నపూర్ణ మున్సిపల్ స్కూల్లో ఉపాధ్యాయినిగా, అల్లుడు గంగాధరకుమార్ ఎన్టీటీపీఎస్లో డీఈఈగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు మాంచాలరావు వాకింగ్ చేస్తుండగా ఎవరో ఒక పాప కిందకు దూకిందని అందరూ అనుకుంటుండగా ఆయనా వెళ్లి చూశారు. కిందకు దూకింది తన మనుమరాలు దీక్షిత గౌరి అని గుర్తించారు. ఆయనకు ఏం జరిగిందో అర్థంకాక కుమార్తె ఉంటున్న ఫ్లాట్లోకి వెళ్లి దీక్షిత గౌరి గదిలో చూడగా బెడ్పై నోట్ బుక్లో సూసైడ్ నోట్ కనిపించింది. విషయాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సూసైడ్ నోట్ను వారికి అందజేశారు. -
టీడీపీ నేత ఘాతుకంపై ఆగ్రహ జ్వాల
సాక్షి నెట్వర్క్: విజయవాడకు చెందిన టీడీపీ నేత వినోద్జైన్ ఘాతుకంపై రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. బాలికను లైంగిక వేధింపులకు గురిచేసి.. ఆత్మహత్యకు కారణమైన వినోద్జైన్ను కఠినంగా శిక్షించాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. టీడీపీ నేతల అకృత్యాలపై కన్నెర్ర చేశారు. టీడీపీ నేతల లైంగిక నేరాలను నిరసిస్తూ కడపలోని ఏడురోడ్ల కూడలి నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు టీపీ వెంకటసుబ్బమ్మ మాట్లాడుతూ.. విజయవాడలో వినోద్జైన్ వేధింపులను తట్టుకోలేక బాలిక లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రజలందరినీ కలచివేసిందన్నారు. వినోద్జైన్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలపై టీడీపీ నేతల అరాచకాలు కొత్త కాదని, అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి అరాచకాలు ఎన్నో చేశారన్నారు. కాల్మనీ సెక్స్ రాకెట్ ఇందుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ఖాన్, ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునిల్కుమార్, కార్పొరేటర్ షఫీ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు, అనంతపురం, కదిరి, పుట్టపర్తి, బుక్కరాయసముద్రం తదితర ప్రాంతాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. రాప్తాడులో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అనంతపురంలో జెడ్పీ కార్యాలయం నుంచి సుభాష్ రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వరకూ కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, మహిళా కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు పాల్గొన్నారు. కదిరిలోని ఇందిరాగాంధీ కూడలిలో మునిసిపల్ చైర్పర్సన్ పరికి నజీమున్నీసా, వైస్ చైర్పర్సన్ కొమ్ము గంగాదేవి తదితరులు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. పుట్టపర్తి హనుమాన్ కూడలిలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి సతీమణి దుద్దుకుంట అపర్ణారెడ్డి ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడ్డారు. అక్కడి నుంచి విద్యాగిరి ఆర్చ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బుక్కరాయసముద్రంలోని డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కర్నూలు గాంధీ విగ్రహం ఎదుట కొవ్వొత్తులు వెలిగించి మహిళలు నివాళి అర్పించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాల శ్రద్ధాంజలి టీడీపీ నేత వినోద్జైన్ వేధింపులను తాళలేక విజయవాడలో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని మహిళా సంఘాల నాయకులు పేర్కొన్నారు. బాలికకు శ్రద్ధాంజలి ఘటిస్తూ నెల్లూరు నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు, కార్పొరేటర్ మొయిళ్ల గౌరి మాట్లాడుతూ ఘటనకు కారణమైన టీడీపీ నేత వినోద్జైన్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పార్టీ రూరల్ మహిళా విభాగం ఇన్చార్జి చేజర్ల కవిత, నేతలు పద్మజా యాదవ్, రమ, లక్ష్మి, మునిలక్ష్మీదేవి పాల్గొన్నారు. నాయుడుపేట, గూడూరు, ముత్తుకూరు తదితర ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ఒంగోలు చర్చి సెంటర్లో వైఎస్సార్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి బాలికకు నివాళి అర్పించారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు పల్లా అనూరాధ, మహిళా కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ మహిళా నాయకులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వినుకొండలో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బొల్లాబ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి లక్ష్మీపురంలోని మదర్థెరిస్సా విగ్రహం వరకు మహిళలు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మద్దాళి గిరి మాట్లాడుతూ 50 ఏళ్ల వయసున్న టీడీపీ నేత వినోద్జైన్ చిన్నారి పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించాడో బాలిక లేఖను బట్టి అర్థమవుతోందన్నారు. వినోద్జైన్కు ఉరే సరి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. మామిడికుదురు మండలం నగరంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. బాలిక ఆత్మహత్యకు కారకుడైన టీడీపీ నేత వినోద్జైన్ను ఉరి తీయాలని మహిళలు నినాదాలు చేశారు. సామర్లకోటలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. మహిళలపై టీడీపీ నేతల వేధింపులు నశించాలని, వినోద్జైన్ను ఉరి తీయాలని మహిళలు నినదించారు. మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ, అయ్యెరక కార్పొరేషన్ రాష్ట్ర చైర్పర్సన్ ఆవాల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. తునిలో మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి ఆధ్వర్యాన మహిళలు, వైఎస్సార్ సీపీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ మేరుగ పద్మలత తదితరులు పాల్గొన్నారు. విశాఖలోని అక్కయ్యపాలెం హైవేపై నెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ పాల్గొన్నారు. జీవీఎంసీ 11వ వార్డు బాలాజీనగర్ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. శ్రీకాకుళం, పలాస, వీరఘట్టం, నరసన్నపేట, రణస్థలం తదితర ప్రాంతాల్లో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
కామాంధుడు! విజయవాడలో టీడీపీ నేత అకృత్యం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సుమారు మనవరాలి వయసున్న బాలికపై వినోద్ జైన్ అనే టీడీపీ నేత లైంగిక వేధింపులకు తెగబడ్డాడు. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆ బాలిక తాను ఉంటున్న అపార్టుమెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విజయవాడ నగరంలోని భవానిపురం కుమ్మరిపాలెం సెంటర్లోని లోటస్ లెజెండ్ అపార్టుమెంట్ వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. అదే అపార్టుమెంట్లో నివాసం ఉంటున్న టీడీపీ నేత వినోద్ జైన్ 9వ తరగతి చదువుతున్న దీక్షిత గౌరి (14)పై కన్నేశాడు. 2 నెలలుగా ఆమెను లైంగికంగా వేధించాడు. రోజూ బాలిక స్కూల్కు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు, లిఫ్ట్, మెట్ల మార్గంలో కాపు కాసి వెంబడించేవాడు. ఆమె శరీరంపై తాకరాని చోట్ల తాకుతూ, అసభ్య పదజాలం వాడుతూ ఇబ్బందులకు గురిచేసేవాడు. ఈ వేధింపులను తాళలేక, బాలిక తీవ్ర మనోవేదనకు గురయ్యేది. ఆ కామాంధుడు రాజకీయంగా పలుకుబడి ఉన్నవాడు కావడంతో ఏం చేస్తాడోనన్న భయంతో తల్లిదండ్రులకు, ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఉంటున్న అమమ్మ, తాతయ్యకు, స్నేహితులకు వినోద్ జైన్ అకృత్యాలను చెప్పలేక పోయింది. ఇలా రెండు నెలలుగా లైంగిక వేధింపులను పంటిబిగువున భరిస్తూ వచ్చింది. తనలో తానే కుమిలి పోయింది. రోజు రోజూకు వినోద్ జైన్ అగడాలు ఆగకపోగా, మరింత శృతిమించడంతో ఆబాలిక తనకు చావే శరణ్యం అన్న నిర్ణయానికి వచ్చింది. తను ఎందుకు చనిపోవాలనుకుందో స్పష్టంగా వివరిస్తూ ఇంగ్లిష్లో మూడు పేజీల లేఖ రాసింది. అనంతరం శనివారం సాయంత్రం అపార్ట్మెంట్ పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. టీడీపీ నేతలతో నిందితుడికి మంచి సంబంధాలు వినోద్ జైన్కు టీడీపీ ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానికి ఇతను ముఖ్య అనుచరుడు. దీంతో ఇటీవల జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికల్లో విజయవాడ 37వ డివిజన్కు టీడీపీ అభ్యర్థిగా సీటు ఇప్పించారు. వినోద్జైన్ తరఫున సాక్షాత్తు ఆ పార్టీ అధినేత చంద్రబాబే ఎన్నికల ప్రచారం చేశారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, మరికొందరి నాయకులతో కూడా ఇతనికి దగ్గర సంబంధాలున్నాయి. జైన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కావడంతో టీడీపీ నేతలు ఆయనతో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేవారు. వివిధ రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి పలువురు టీడీపీ నేతలకు తార్చేవాడని స్థానికుల సమాచారం. ఐ లవ్ యూ మమ్మీ.. తన మనవరాలు శనివారం మధ్యాహ్నం నుంచి మౌనంగా ఉందని, ఎందుకలా ఉన్నావమ్మా అంటూ తాము ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పలేదని బాలిక తాతయ్య మాణిక్యాలరావు తెలిపారు. జీజీహెచ్ మార్చురీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ సాయంత్రం తాను, తన కుమార్తె (బాలిక తల్లి) కలిసి వాకింగ్కు వెళ్లేటప్పుడు తమ దగ్గరికి వచ్చిందన్నారు. వాళ్ల అమ్మను ఐలవ్యూ మమ్మీ అంటూ కౌగిలించుకొందన్నారు. అనంతరం తాము వాకింగ్కు వెళ్లాక, బాలిక బెడ్ రూంలోకి వెళ్లి సూసైడ్ నోట్ రాసి పెట్టిందన్నారు. రెండు నెలలుగా తమ మనవరాలిని చెప్పలేని విధంగా వినోద్ జైన్ లైంగికంగా వేధించండతోనే ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు.. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి ఆమె ఆత్మహత్యకు కారకుడైన వినోద్ జైన్పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక ఇంటికి వెళ్లి ఆమె రాసిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో బాలిక పేర్కొన్న అంశాల ఆధారంగా జైన్పై పోక్సో చట్టంతో పాటు ఐపీసీ 306 సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు. అపార్ట్మెంట్లో సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. వినోద్ జైన్ ఇంటిని సీజ్ చేశారు. జైన్తోపాటు, అతని కుటుంబ సభ్యులను ఆదుపులోకి తీసుకున్నారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా చెప్పారు. ఘటనపై కలత చెందిన సీఎం విజయవాడలో టీడీపీ నేత లైంగిక వేధింపులకు బలైన బాలిక ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించారు. బాలిక ఆత్మహత్యకు కారకుడైన వినోద్ జైన్పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ఘటనపై కలత చెందిన సీఎం.. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ను బాలిక కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పాలని ఆదేశించారు. అ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. బాలిక కుటుంబాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించి, ఓదార్చారు. వీరితో పాటు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ ఆవుతు శైలజారెడ్డి, తూర్పు నియోజక వర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు కాళేశ్వరావు మార్కెట్ సెంటర్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు నేతలు పాల్గొన్నారు. దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాటలకందని విషాదమిది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన తరుణమిది. ఓ రాజకీయ పార్టీ నేత.. పది మందికి మంచి చేయాల్సిన నాయకుడు.. దాదాపు మనవరాలంత వయసున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన అమానవీయమిది. బరితెగించి రెండు నెలలుగా లైంగిక వేధింపులకు తెగబడిన అరాచకమిది. ఆ వేధింపులకు తాళలేని ఆ సరస్వతీ పుత్రిక తన బాధను ఎవరికీ చెప్పుకోలేక.. సిగ్గుతో, భయంతో ఏం చేయాలో తోచక తనువు చాలించడమే మార్గంగా భావించింది. తను మాకసిక వేదనకు అక్షర రూపమిస్తూ ఈ సమాజం నుంచి అందనంత దూరం వెళ్లిపోయింది. కన్నీళ్లకే కన్నీళ్చొచ్చే ఈ ఘటనకు కారణమైన నిందితుడు వినోద్ జైన్ ప్రతిపక్షనేత చంద్రబాబు, టీడీపీ నేతలు పలువురికి సన్నిహితుడు. ఇతగాడికి మహిళలంటే ఆటబొమ్మలట. వారిని ఆ పార్టీలోని పలువురు నేతలకు తార్చి.. తన పనులు చక్కబెట్టుకునే వాడట. అందుకే మొన్నటి స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ కార్పొరేటర్గా టికెట్ దక్కిందట. ఇలాంటి కామాంధులను టీడీపీ చేరదీయబట్టే, గతంలోనూ కాల్మనీ సెక్స్ రాకెట్ ఇదే విజయవాడలో ఎందరో మహిళల ఉసురు పోసుకుంది. ఇలాంటి కామాంధులను, వారికి వంతపాడే వారిని ఏమనాలి? ఏ శిక్ష విధించాలి? నా బాధ చెప్పుకోలేకపోతున్నా.. వినోద్ జైన్ నా బుగ్గలు గిల్లేవాడు. ఛాతీ, తొడలు, ఇతర ప్రదేశాల్లో చేతులు వేసేవాడు. నువ్వు చాలా అందంగా ఉంటావంటూ టీజ్ చేసేవాడు. జీన్ ప్యాంటు వేసుకుంటే మరింత అందంగా ఉంటావనేవాడు. అన్ని విషయాలూ మీతో షేర్ చేసుకునే నేను.. ఈ వేధింపులను మీకు చెప్పడానికి షేమ్గా ఫీల్ అవుతున్నాను. అతని చర్యల పట్ల ఎంతో భయాందోళనకు గురయ్యాను. 2 నెలలుగా అతను నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని నేను హ్యాండిల్ చేయలేక పోతున్నాను. నా జీవితంలో ఇదే అతి పెద్ద సమస్య. అందుకే చనిపోతున్నాను. తమ్ముడు, మీరంతా జాగ్రత్త. – సూసైడ్ నోట్లో బాలిక బాలిక రాసిన సూసైడ్ నోట్లోని ఓ భాగం -
మళ్లీ ఆ దర్శకుడి వైపే అజిత్ చూపు.. ముచ్చటగా మూడోసారి!
Ajith AK 61 Movie: వలిమై చిత్ర కాంబో రిపీట్ కానున్నట్లు సమాచారం. తమిళ స్టార్ హీరో అజిత్ ఒకే దర్శకుడితో ఒకే నిర్మాణ సంస్థకు వరుసగా చిత్రాలు చేయడం పరిపాటిగా మారింది. ఇంతకుముందు బోనీ కపూర్ నిర్మాతగా హెచ్. వినోద్ దర్శకత్వంలో నేర్కొండ పార్వై చిత్రంలో నటించారు. ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ఆ తరువాత వెంటనే ఇదే కాంబినేషన్లో వలిమై చిత్రంలో నటించారు. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి నాయికగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సమ్మర్ స్పెషల్గా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీనిపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా మరోసారి ఈ కాంబో రిపీట్ కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయని తెలిసింది. ఇది పంచ్ డైలాగ్స్తో భారీ యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. చిత్ర షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్ర వర్గాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. -
కరోనాతో మరో మావోయిస్టు అగ్రనేత మృతి
దంతేవాడ (చత్తీస్ఘడ్) : మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కరోనా కాటుకు మావోయిస్టు అగ్రనేత వినోద్ మృతి చెందారు. ఇన్ఫెక్షన్ తీవ్రత పెరగడంతో వినోద్ మృత్యువాత పడ్డారు. మూడు దశబ్ధాల కిందటే తెలంగాణ నుంచి చత్తీస్గడ్కి వెళ్లిన మావోయిస్టుల్లో వినోద్ కూడా ఒకరు. చత్తీస్గడ్లో జనతన సర్కార్ను విస్తరించడంతో, మద్దతు సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దక్షిణ ప్రాంతీయ మావోయిస్టుల కమిటీలోనూ వినోద్ కీలకంగా వ్యవహరించారు. మోస్ట్వాంటెడ్ మావోయిస్టు చత్తీస్గడ్, ఏవోబీ కేంద్రంగా జరిగిన పలు కీలక దాడుల్లో వినోద్ ప్రమేయం ఉంది. దీనికి సంబంధించి ఆయనపై చాలా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు వినోద్ను పట్టుకునేందుకు ఎన్ఐఏ చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఎన్ఐఏకి మావోయిస్టు వినోద్ మోస్ట్ వాంటెండ్గా ఉన్నారు. ప్రస్తుతం అతనిపై పదిహేను లక్షల రివార్డ్ ఉంది. ఇందులో పది లక్షల రూపాయలు చత్తీస్గడ్ ప్రభుత్వం ప్రకటించగా రూ. 5 లక్షలు ఎన్ఐఏ ప్రకటించింది. దర్భఘటి, జీరం అంబుష్, బీజేపీ ఎమ్మెల్యే బిమా మండవి మృతి ఘటనల్లో వినోద్ కీలక పాత్ర పోషించారు. కామ్రేడ్లలో కరోనా కల్లోలం కరోనా మావోల శిబిరాల్లో అలజడి సృష్టిస్తోంది. ఇటీవల మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ చనిపోయారు. కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న ఆయన కరోనాతో అనారోగ్యంతో మరణించారు. దీంతోపాటు పలువురు సభ్యులు కూడా చనిపోయినట్లు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. హరిభూషణ్ ఘటన మరిచిపోక ముందే మరో అగ్రనేత మరణించడం మావోయిస్టులకు సవాలుగా మారింది. ఇద్దరు వినోద్లు చత్తీస్గడ్లో కీలకంగా పని చేస్తున్న మావోయిస్టు నేతల్లో ఇద్దరు వినోద్లు ఉన్నట్టు పార్టీ సానుభూతిపరులు అంటున్నారు. ఇందులో ఒకరు వరంగల్ నుంచి చత్తీస్గడ్కు వెళ్లిన మావోయిస్టు శాంసుందర్రెడ్డి కాగా మరొకరు ఆదిలాబాద్కు చెందిన కామ్రేడ్గా చెబుతున్నారు. అబుజ్మడ్ అడవుల్లో పార్టీ విస్తరణకు వీరు తీవ్రంగా పని చేశారు. అయితే ప్రస్తుతం కరోనాతో చనిపోయింది ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వినోదా ? లేక ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తినా అనే దానిపై స్పస్టత లేదు. పోలీసులు, మావోయిస్టుల్లో ఎవరైనా ప్రకటన చేస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ఆ హీరో ఇద్దరితో ప్రేమలో పడ్డాడు.. కానీ!
వినోద్ మెహ్రా.. పేరు చెప్పగానే నాటి (1970, 80ల) బాలీవుడ్ అభిమానులకు బిందియా గోస్వామి గుర్తొస్తుంది.. ఆ వెంటనే రేఖ మెరుస్తుంది. ఈ ఇద్దరితో అతను ప్రేమలో పడ్డాడు. కెరీర్లో స్టార్గా వెలిగిన వినోద్ మెహ్రా .. ప్యార్ కా సఫర్ (ప్రేమ ప్రయాణం) మాత్రం సంతోషాల మజిలీ చేరలేదు. విషాదాంతంగా ముగిసి తీరని వ్యథను మిగిల్చింది.. ఆ బాధను రేఖా అనుభవించింది. 1958లో వచ్చిన ‘రాగినీ’ అనే సినిమాలో బాలనటుడిగా నటించిన వినోద్ మెహ్రా తర్వాత ఒకట్రెండు చిత్రాల్లో కనిపించినా, చదువు మీదే శ్రద్ధ పెట్టాడు. చదువయ్యాక ‘గోల్డ్ఫీల్డ్ మర్కంటైల్’లో ఎగ్జిక్యుటివ్గా ఉద్యోగంలో ఒదిగిపోయాడు.. నటన విషయమే మరిచిపోయి. స్నేహితుల ప్రోద్బలంతో ‘ఆల్ ఇండియా టాలెంట్ కంటెస్ట్ (1965)’లో పాల్గొన్నాడు. ఫైనల్లో రాజేశ్ ఖన్నాతో పోటీపడ్డాడు. రన్నరప్ టైటిల్తోపాటు సినిమా చాన్స్లూ అతని చెంత చేరాయి. ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు. ‘ఏక్ థీ రీటా’ హీరోగా అతని మొదటి సినిమా. వినోద్ను ప్రేక్షకులు గుర్తుపట్టి.. నటుడిగా గుర్తించడంతో ఆగకుండా సాగింది అతని కెరీర్. ఆ సమయంలోనే వినోద్కు పెళ్లి సంబంధం తెచ్చింది వాళ్లమ్మ. వధువు మీనా బోక్రా. పెళ్లయింది. చేతినిండా సినిమాలు.. తోడుగా చేరిన భాగస్వామితో ఆనందంగా గడిచిపోతున్న సమయంలో అతనికి గుండెపోటు వచ్చింది. ఊహించని ఆ కుదుపుతో సినిమా ఆఫర్లు ఆగకపోయినా.. వైవాహిక జీవితంలో మాత్రం పగుళ్లు కనిపించాయి. ఆఫ్టర్ ది బ్రేక్ ఆరోగ్యం కుదుట పడ్డా మీనా వ్యవహారం వినోద్ను కలవర పెట్టింది. అప్పుడే అతని సహనటి బిందియా గోస్వామితో స్నేహం కుదిరింది. అది ప్రేమగానూ మారింది. ఇంట్లోంచి వెళ్లిపోయి ఆమెతో హోటల్లో ఉండసాగాడు. ఈ విషయం భార్య మీనా ద్వారా ఆమె తండ్రికి తెలిసింది. అల్లుడిపై విరుచుకుపడ్డాడు. ఆ జంటను వేటాడడం మొదలుపెట్టాడు. ఈ నిజానికి కల్పనలు జోడించి మీడియా పండగ చేసుకోసాగింది. ఈ వ్యవహారానికి భయపడిపోయిన బిందియా గోస్వామి– తన స్నేహితుడు జేపీ దత్తా (రచయిత, దర్శకుడు, నిర్మాత) అండ కోరుకుంది. దాంతో వినోద్కు దూరమై జేపీ దత్తాకు చేరువైంది (ఆ తర్వాత అతణ్ణి పెళ్లీ చేసుకుంది బిందియా). ఈ పరిణామానికి కుంగిపోయాడు వినోద్. ఇటు అతని భార్య మీనా విడాకుల కోసం కోర్ట్లో కేసు వేసింది. సెకండ్ లవ్.. బిందియా గోస్వామి వదిలేసి వెళ్లడం.. జీవిత భాగస్వామి విడాకులివ్వడం వినోద్ను కలత పెట్టాయి. ఆ టైమ్లో అతనికి ఊరటగా కనిపించింది రేఖ. మొదటి నుంచీ ఈ ఇద్దరూ మంచి మిత్రులు. వీళ్లు కలిసి చేసిన సినిమాలూ హిట్టే. హిట్ పెయిర్గానూ పేరు తెచ్చుకున్నారు. నిజానికి అప్పటికి రేఖ మనసూ కకావికలమై ఉంది అమితాబ్తో బ్రేకప్ వల్ల. అలా ఇద్దరూ ఒకరికొకరు ఓదార్పయ్యారు. అది ఆ జంటను ప్రేమలోకి దింపింది. ఈ ముచ్చటనూ వదంతులుగా సెలబ్రేట్ చేసుకుంది పేజ్ త్రీ. పట్టించుకోలేదు ఆ ఇద్దరూ. మరింత కుతూహలం ప్రదర్శించాయి పత్రికలు. వినోద్, రేఖలు రహస్యంగా పెళ్లి చేసుకున్నారనీ ప్రచారం చేశాయి. దానికీ స్పందించలేదు వాళ్లు. ఈలోపు రేఖను తమ ఇంటికి తీసుకెళ్లి వాళ్లమ్మకు తమ ప్రేమ విషయం చెప్పాలనుకున్నాడు వినోద్. అనుకున్నట్టుగానే ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. పత్రికల్లో వీళ్ల పెళ్లి సంగతి చదివి ఉన్న వినోద్ తల్లి.. అలా వాళ్లిద్దరినీ జంటగా చూసేసరికి ఆ వదంతి నిజమే అనుకుంది. పట్టరాని కోపంతో రేఖ పట్ల దురుసుగా ప్రవర్తించింది. ఊహించని ఆ తీరుకి బిత్తరపోయింది రేఖ. వినోద్కూ నోట మాటరాలేదు. రేఖను బయటకు తీసుకెళ్లి ‘అమ్మ కోపం తగ్గేవరకు ఓపిక పడదాం’ అని చెప్పాడు. కాని ఆ సంఘటనను జీర్ణించుకోలేని రేఖ ఆ బంధాన్ని అక్కడితో తెంచేసుకోవాలనుకుంది. స్నేహాన్ని మాత్రం నిలుపుకుంది చివరి వరకు. ఆఖరి ముడి రేఖను మరిచిపోవడం అంత తేలిక కాలేదు వినోద్కు. ఆ ఎడబాటును తట్టుకోలేకపోయాడు. వ్యాకులతతో కుమిలిపోయాడు. కొడుకు పరిస్థితిని చూసి త్వరలో అతణ్ణి ఒక ఇంటివాడిని చేయాలని నిశ్చయించుకుంది వినోద్ తల్లి. కెన్యాలో స్థిరపడ్డ పంజాబీ వ్యాపార కుంటుంబంలోని అమ్మాయి కిరణ్తో వినోద్కు వివాహం జరిపించింది. ఇద్దరు పిల్లలూ పుట్టారు. అంతా సవ్యంగా ఉంది అని వినోద్ తల్లి ఊపిరి పీల్చుకుంటూండగా వినోద్ ఊపిరి ఆగిపోయింది.. రెండోసారి వచ్చిన గుండెపోటుతో. వందకు పైగా సినిమాలతో కెరీర్ గ్రాఫ్లో ముందుకు సాగి.. నలభై అయిదేళ్లకే జీవితాన్ని చాలించాడు. ప్రేమనే కాదు పెళ్లినీ సాఫల్యం చేసుకోలేకపోయాడు. ∙ఎస్సార్ -
మామూలు కుర్రోడు.. ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ'
సాక్షి, తెనాలి: ఒకప్పుడు అందరిలానే మామూలు కుర్రోడు. రెండేళ్ల తర్వాత సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ’.. కేవలం ఒక్క రోజులోనే.. అదికూడా ఓటీటీలో విడుదలైన సినిమాతో!. తొలిసారిగా మెగా ఫోన్ పట్టుకుని సూపర్ హిట్ కొట్టాడు. అతనే గుంటూరుకు చెందిన యువ దర్శకుడు వినోద్ అనంతోజు. తొలి సినిమాతోనే దర్శకుడవ్వాలనే కలను నెరవేర్చుకోవడమే కాదు.. సక్సెస్తో తనను తాను నిరూపించుకున్నాడు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ చిత్రంతో తెలుగు ప్రేక్షక్షుల ఆకట్టుకున్నాడు. సాఫ్ట్వేర్ నుంచి డైరెక్షన్లోకి.. వినోద్ అనంతోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి, సినీదర్శకుడు కావాలన్న కలను కష్టపడి నిజం చేసుకున్నాడు. తనలాంటి మధ్యతరగతి జీవితాలను వినోదాత్మకంగా తెరకెక్కించి, వీక్షకులను మెప్పించాడు. సుప్రసిద్ధ దర్శకుల అభినందనలూ అందుకున్నాడు. గుంటూరు–కొలకలూరులోనే చిత్రీకరణ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, కన్నడ నటి వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఈ సినిమాకు గుంటూరు కుర్రోడు దర్శకుడవటమే కాదు.. దాదాపు సినిమా మొత్తం గుంటూరు, తెనాలి సమీపంలో కొలకలూరులోనే చిత్రీకరించటం, ఎక్కువశాతం క్యారెక్టర్లకు రంగస్థల నటీనటులనే తీసుకోవటం విశేషం. ఆయా పాత్రల్లో సురభి జమునారాయలు, సురభి ప్రభావతి, గోపరాజు రమణ వంటి కళాకారులు నటించారు. ఆరు నెలల్లో పూర్తి.. గతేడాది జూన్లో చిత్రీకరణ ప్రారంభించగా దాదాపు ఆరు నెలల్లో పూర్తి చేశారు. ‘పోస్ట్ప్రొడక్షన్ పనులతో సినిమా సిద్ధమయ్యేసరికి లాక్డౌన్తో థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పటికీ తెరుచుకోలేదు. కనీసం ఓటీటీలోనైనా రిలీజ్ చేద్దామని అమెజాన్ను సంప్రదించాం. వారికి నచ్చి తీసుకోవటంతో ఇప్పుడు వీక్షకుల ముందుకొచ్చింది’ అని వినోద్ చెప్పారు. ‘సినిమాకు పేరొస్తుందని అనుకున్నాగానీ మరీ ఇంతలా వస్తుందని అనుకోలేదు’అని, దర్శకుడు క్రిష్ ఫోన్ చేసి అభినందించారంటూ ఆనందంతో అనుభవాన్ని సాక్షితో పంచుకున్నారు. కళాశాలలో.. సినిమాపై ఇష్టంతో వినోద్ కాలేజీ రోజుల్లోనే షార్ట్ ఫిలిమ్స్ తీశాడు. దాదాపు ఎనిమిది లఘుచిత్రాలు తీయగా ‘శూన్యం’ అనే చిత్రానికి మంచి పేరొచ్చింది. ఒక సినిమా తీయాలనుకునేవాడు ఎలాంటి కథను ఎంచుకుంటాడు? అనే ఆలోచనతో చుట్టూ ఉన్న సమాజం నుంచి ఎలాంటి కథ తయారుచేసుకున్నాడు? అనేది ఇతివృత్తం. తన లఘుచిత్రంలోని హీరోలానే తాను కూడా మధ్యతరగతి జీవితాన్ని ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’గా దృశ్యీకరించి పండించాడు. తొలి సినిమాతోనే లక్ష్యాన్ని సాధించి హీరో అనిపించుకున్నాడు. తదుపరి ప్రాజెక్టు కోసం రెండు మూడు కథలపై వర్క్ చేస్తున్నట్టు చెప్పారు. రెండేళ్ల నిరీక్షణ.. వినోద్ అనంతోజు మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి విశాలాంధ్ర బుక్హౌస్ మేనేజరు. తల్లి గృహిణి, సోదరి ఉంది. 2011లో బీటెక్ పూర్తి చేశాక ఐటీ కంపెనీలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్కు వెళ్లిపోయారు. ఏడేళ్లు పనిచేశాక ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సినిమా దర్శకుడు కావాలనేది సంకల్పంగా తన చుట్టూ ఉండే సమాజంలో నుంచి సినిమాకు సరిపడే కథను సిద్ధం చేసుకుని, అవకాశాల కోసం ప్రయత్నించాడు. రెండేళ్లకు భవ్య క్రియేషన్స్ సంస్థ నుంచి గ్రీన్సిగ్నల్ రావటంతో షూటింగ్ పట్టాలకెక్కింది. -
నలుగురు కుర్రాళ్ల కథ
హరీష్, వినోద్, కార్తీక్, వెంకట చరణ్ హీరోలుగా, గీత్ షా, సంజన, లాస్యశ్రీ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘పంక్చర్’. చంద్రుడు క్రియేష¯Œ ్స సమర్పణలో శ్రీలక్ష్మి ప్రొడక్ష¯Œ ్స పతాకంపై శ్రీరంగం శేషశ్రీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో శ్రీరంగం శేషశ్రీ మాట్లాడుతూ– ‘‘ఇది నా మొదటి సినిమా. నలుగురు కుర్రాళ్ల మధ్య జరిగే పరిణామాల నేపథ్యంలోనే కథ ఉంటుంది. చక్కటి హాస్యంతో నిండిన కథతో రూపొందుతోంది’’ అన్నారు. ‘‘సమాజానికి ఉపయోగపడేలా మా సినిమా ఉంటుంది’’అన్నారు సమర్పకులు రాజు రాళ్లబండి. ‘‘ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయి. చిన్న చిత్రాలను ప్రోత్సహించాలి’’ అన్నారు సంగీత దర్శకుడు అర్జున్. ‘‘వినోదంతో పాటు ఆలోచింపజేసే సినిమా ఇది’’ అన్నారు రచయిత సాయినాథ్. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, ఎల్బీశ్రీరామ్, జయప్రకాష్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:ఎస్. శ్రీనివాస్. -
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి వినోద్
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి గడ్డం వినోద్కుమార్ తిరిగి కాంగ్రెస్లో చేరారు. గతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో పనిచేసిన వినోద్.. 2018 శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేశారు. ఆయన సోదరుడు, మాజీ ఎంపీ జి.వివేక్ కొంతకాలం క్రితం బీజేపీలో చేరగా.. వినోద్ మాత్రం స్వతంత్రంగానే రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శనివారం ఆయన కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అంతకుముందు ఆయన పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ను కూడా కలిశారు. వినోద్ కాంగ్రెస్లో చేరిన అనంతరం పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి వినోద్ కృషి చేస్తారని అన్నారు. కాంగ్రెస్తో బంధం..: వినోద్ వినోద్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీతో నాకు 35 ఏళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయి. వీటన్నింటినీ తిరిగి కొనసాగించాలనుకుంటున్నా. అప్పట్లో అపరిపక్వ నిర్ణయం తీసుకున్నా. కొన్ని అపార్థాల కారణంగా పార్టీని వీడాల్సి వచ్చింది. తిరిగి సొంత పార్టీకి రావడం అదృష్టంగా భావిస్తున్నా’అని వివరించారు. వినోద్కు స్వాగతం: వీహెచ్ ‘కాంగ్రెస్కు పునర్ వైభవం కల్పించాలన్నదే అందరి ఆలోచన. వినోద్ పార్టీలోకి తిరిగి రావడం, వెంకటస్వామి బాటలో నడవడం స్వాగతించదగిన పరిణామం’ అని మాజీ ఎంపీ వి.హనుమంతరావు పేర్కొన్నారు. -
మళ్లీ జంటగా..
బిల్లా, ఏగన్, విశ్వాసం.. ఈ మూడు చిత్రాల్లోనూ జంటగా నటించారు అజిత్, నయనతార. ‘బెస్ట్ పెయిర్’ అని కూడా అనిపించుకున్నారు. ఇప్పుడు నాలుగోసారి ఈ జంట తెరపై కనిపించే అవకాశం ఉందని సమాచారం. అజిత్ 60వ సినిమా త్వరలో ఆరంభం కానుంది. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించనున్నారు. ఇందులో కథానాయికగా నయనతార అయితే బాగుంటుందని చిత్రబృందం భావించిందట. నయనతారను సంప్రదించారని కూడా సమాచారం. మరి.. అజిత్ 60లో నయనతార ఉంటారా? లేక వేరే కథానాయిక నటిస్తారా? జస్ట్ కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. -
నాపై దాడి చేసింది ఆయనే : జబర్దస్త్ వినోద్
సాక్షి, హైదరాబాద్ : ఇంటి ఓనరే తనపై దాడి చేశారని జబర్దస్త్ వినోద్ ఆరోపించారు. కావాలనే తనను ఇంటిపైకి పిలిపించి కొందరితో కలిసి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇల్లు కొనగోలు విషయంలో ఈ వివాదం తలెత్తిందని పేర్కొన్నారు. గతంలో ఇల్లు కొనగోలు కోసం ప్రమిల, బాలాజీకు రూ.10లక్షలు ఇచ్చామని, వాళ్లు ఇల్లు రిజిస్ట్రేషన్ చేయకుండా, డబ్బులు వెనక్కి ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. సెటిల్మెంట్ చేసుకుందామని రమ్మని హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో తీవ్రగాయాలపాలైన వినోద్.. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. (చదవండి : ‘జబర్దస్త్’ ఆర్టిస్ట్ వినోదినిపై దాడి.. గాయాలు) -
‘జబర్దస్త్’ ఆర్టిస్ట్ వినోదినిపై దాడి.. గాయాలు
సాక్షి, హైదరాబాద్ : జబర్దస్త్ టీవీషో ఆర్టిస్ట్ వినోద్పై నగరంలో శనివారం దాడి జరిగింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వినోద్పై ఒక వ్యక్తి దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచాడు. కాచిగూడ పరిధిలోని కుత్బిగూడలో వినోద్ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. అయితే, అతని ఇంటి ఓనర్.. వ్యక్తిగత కక్షలతో దాడి చేసినట్టు తెలుస్తోంది. దాడి ఘటనపై వినోద్ కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటి ఓనరే తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు. జబర్దస్త్ టీవీ కార్యక్రమంలో అమ్మాయి వినోదినిగా స్కిట్లు వేసి.. అతను అలరిస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రాణం తీసిన ప్రేమ.. తమ్ముడిని హతమార్చిన అన్న
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఆ యువతీ యువకులిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన తాము ప్రేమించుకుంటే ప్రాణం మీదకు వస్తుందని వారికి తెలియదు. పెద్దలను ధిక్కరించైనా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయం కాస్త పెద్దలకు తెలియడంతో ప్రేమ వ్యవహారం ప్రమాదస్థాయికి చేరుకుంది. స్వయానా అన్న చేతిలో తమ్ముడు హత్యకు గురికాగా, ప్రియురాలు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. వివరాలు. కోయంబత్తూరు మేట్టుపాళయంకు చెందిన కరుప్పుస్వామికి వినోద్ (25), కనకరాజ్ (22), కార్తిక్ (19) అనే ముగ్గురు కుమారులున్నారు. కూరగాయల మార్కెట్లో కూలీగా పనిచేస్తున్న కనకరాజ్ అదే ప్రాంతానికి చెందిన మూర్తి కుమార్తె వర్షిణిప్రియ (16) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన వారు. మూడునెలల క్రితం కనకరాజ్ ఇంటికి వచ్చిన వర్షిణిప్రియ తనను పెళ్లి చేసుకోవాలని కోరగా వినోద్ సహా కుటుంబసభ్యులంతా ఆమెపై కోపగించుకున్నారు. దీంతో మూర్తి తన కుమార్తెను మరో ప్రాంతంలోని బంధువు ఇంట్లో ఉంచాడు. అయినా వీరిద్దరి ప్రేమ కొనసాగింది. మూడురోజుల క్రితం వర్షిణి మరలా కనకరాజ్ ఇంటికి వచ్చి పెళ్లిపై ఒత్తిడి తేవడంతో వినోద్ ఇతర కుటుంబసభ్యులు మరలా గొడవపడ్డారు. దీంతో కనకరాజ్ ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అందులో వర్షిణితో కలిసి ఉండడం ప్రారంభించాడు. ఇందుకు మరింత ఆగ్రహం చెందిన వినోద్ మంగళవారం సాయంత్రం కనకరాజ్ ఇంటికి వెళ్లి వర్షిణిప్రియను పెళ్లిచేసుకోవడానికి వీల్లేదని చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుని తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ సమయంలో వినోద్ తన వెంట తెచ్చుకుని వేటకత్తితో తమ్ముడు కనకరాజ్పై దాడిచేయగా సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అడ్డుపడిన వర్షిణి తీవ్రంగా గాయపడి విషమపరిస్థితిలో ఆçస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు వినోద్ బుధవారం ఉదయం మేట్టుపాళయం పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. తమ్ముడు కనకరాజ్ వేరే సామాజికవర్గానికి చెందిన యువతిని ప్రేమించడంతో వద్దని వారించాను. అయినా వినకుండా ఒకరోజు ఇంటికి తీసుకొచ్చాడు. అంతేగాక తన మాటను ధిక్కరించి ప్రియురాలితో కలిసి జీవించడాన్ని సహించలేక ఇద్దరిని చంపేయాలని భావించానని పోలీసులకు వినోద్ వాంగ్మూలం ఇచ్చాడు. -
అజిత్ 60వ చిత్రం ఖరారు
చెన్నై : నటుడు అజిత్ను అల్టిమేట్ స్టార్ అంటారు. ఇది ఆయనకు ఇష్టం ఉన్నా, లేకపోయినా అభిమానులు ఇచ్చిన బిరుదు ఇదే. ఇక నటుడు అజిత్ వేరు. వివాదాలకు దూరంగా ఉండే నటుడు. అంతే కాదు తన చిత్రాల ప్రమోషన్కు కూడా దూరంగా ఉండే నటుడీయన. అంతే కాదు ఇతరులతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేసుకుపోయే నటుడు. ఇక ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న అజిత్ తాజా చిత్రం విశ్వాసం రజనీకాంత్ చిత్రం పేటకు పోటీగా తెరపైకి వచ్చి వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం అజిత్ నేర్కొండ పార్వై చిత్రంలో నటిస్తున్నారు. ఇది హిందీ చిత్రం పింక్కు రీమేక్ అన్నది తెలిసిందే. హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను అజిత్ చేస్తున్నారు. దీనిని దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మిస్తున్నారు. ఈయన అజిత్తో వరుసగా చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపడం విశేషం. అంతే కాదు ఈయన్ని బాలీవుడ్కు పరిచయం చేయాలని కోరుకుంటున్నారు. అజిత్ నటిస్తున్న నేర్కొండ పార్వై చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. ఆగస్టు 10న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఆయన తదుపరి చిత్రం ఏమిటన్న విషయంపై అందరికీ ఆసక్తి కలగడం సహజమే. మరో విషయం ఏమిటంటే అజిత్ ఒకే దర్శకుడితో వరుసగా చిత్రాలు చేయడం, చేసిన నిర్మాణ సంస్థకే మళ్లీ అవకాశం ఇవ్వడం ఆనవాయితీగా మారింది. ఇంతకు ముందు దర్శకుడు శివకు వరుసగా నాలుగు సార్లు అవకాశం కల్పించారు. అదే విధంగా సత్యజ్యోతి ఫిలింస్ సంస్థలో వరుసగా వివేగం, విశ్వాసం చిత్రాలు చేశారు. అలా మరోసారి రిపీట్ చేయనున్నారు. అజిత్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. దీని తరువాత అజిత్ 60వ చిత్రానికి ఆయనకే అవకాశం ఇచ్చారన్నది తాజా సమాచారం. దీన్ని నిర్మాత బోనీకపూర్నే నిర్మించబోతున్నారని సమాచారం. ఇది దర్శకుడు వినోద్ తయారు చేసుకున్న స్క్రిప్ట్తో తెరకెక్కనుందని, కమర్శియల్ అంశాలతో కూడిన ఈ చిత్రం షూటింగ్ను త్వరలో ప్రారంభించి 2020లో తెరపైకి తీసుకొచ్చే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తాజా సమాచారం. దీనికి జిబ్రాన్ సంగీతాన్ని అందించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. -
ముసుగుల వెనుక రహస్యం
‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ’ లాంటి సందేశాత్మక, కమర్షియల్ హిట్ చిత్రాలు తీసిన పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్ క్రిమినల్స్’. మనోజ్ నందన్, వినోద్, అవంతిక, దివ్య, మౌనిక ముఖ్య తారలుగా నటించారు. ఎక్కలి రవీంద్రబాబు, బి.బాపిరాజు నిర్మించిన ఈ సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చింది. బి.బాపిరాజు మాట్లాడుతూ–‘‘ముసుగుల వెనుక వున్న ముగ్గురు అమ్మాయిల రహస్యాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాం. యువతని పట్టిపీడించే వ్యసనాల ఇతివృత్తంగా ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ నేపథ్యంలో కథ సాగుతుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ’ చిత్రాల్ని మించిన వినోదంతో పాటు చక్కటి మెసేజ్ ఉంటుంది’’ అన్నారు పి.సునీల్ కుమార్ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: సుధాకర్ మారియో, సహనిర్మాతలు: వైద్యశ్రీ డాక్టర్ ఎల్ఎన్ రావు, డాక్టర్ కె.శ్రీనివాస్. -
ముసుగుల రహస్యం ఏంటి?
‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ’ లాంటి సందేశాత్మక కమర్షియల్ హిట్ చిత్రాలు తీసిన పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రొమాంటిక్ క్రిమినల్స్’. మనోజ్ నందన్, వినోద్, అవంతిక, దివ్య, మౌనిక ముఖ్య తారలుగా శ్రీ లక్ష్మి పిక్చర్స్, శ్రావ్యా ఫిలింస్ బ్యానర్లపై ఎక్కలి రవీంద్రబాబు, బి.బాపిరాజు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బి.బాపిరాజు మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్స్లో గతంలో విడుదలైన ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ’ చిత్రాలకు సీక్వెల్గా ‘రొమాంటిక్ క్రిమినల్స్’ తెరకెక్కించాం. ముసుగుల వెనుక ఉన్న ముగ్గురు అమ్మాయిల రహస్యాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాం. యువతని పట్టిపీడించే వ్యసనాల ఇతివృత్తంగా ఇంజినీరింగ్ విద్యార్థుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది’’ అన్నారు. ‘‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ’ చిత్రాలను మించిన వినోదంతో పాటు సమాజానికి మంచి మెసేజ్ ఈ చిత్రంలో ఉంటుంది. త్వరలో పాటలు విడుదల చేసి, మేలో సినిమాని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు’’ అన్నారు సునీల్ కుమార్ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: సుధాకర్ మారోయో, కెమెరా: ఎస్.వి. శివరామ్, సహనిర్మాతలు: వైద్యశ్రీ డాక్టర్ ఎల్ఎన్ రావు, డాక్టర్ కె.శ్రీనివాస్. -
కారును చూసి.. మురిసిన సారు
సాక్షి, సిరిసిల్ల: పట్టణ శివారులోని సర్ధాపూర్లో ఓ కారును చూసి కరీంనగర్ పార్లమెం ట్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ వినోద్కుమార్ మురిసిపోయారు. సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాస్రావు తన సొంత పాతకారు గులాబీ రంగు వేసి రోడ్డు పక్కన గద్దె నిర్మించి ఉంచారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం కారుగుర్తు ఓటర్ల మదిలో ఉండిపోయేలా శ్రీనివాస్రావు ఏకంగా కారును అందరికీ కనిపించేలా ఏర్పాటుచేశారు. ఎంపీ వినోద్కుమార్ ఎల్లారెడ్డిపేట వైపు వెళ్తూ రోడ్డుపక్కనే ఉన్న కారును చూసి ఆగి సందర్శించారు. ఎన్నికల్లో అందరికీ కారుగుర్తు గుర్తుండిపోయేలా సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారి పక్కనే కారును ఏర్పాటుచేయడాన్ని వినోద్కుమార్ అభినందించారు. ఆయన వెంట టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. -
అన్న రాజకీయాల కోసం.. తమ్ముడి తప్పటడుగులు!
తెలంగాణ రాష్ట తొలి సీఎంను ఓ దళితుడినే చేస్తానని కేసీఆర్ ప్రకటించిన సమయంలో.. ఆ జాబితాలో ఉన్న కీలక వ్యక్తుల్లో పెద్దపల్లి మాజీ ఎంపీ, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు గడ్డం వివేకానంద ఒకరు. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తన తండ్రి జి.వెంకటస్వామి కాలంనాటి నుంచి వారసత్వంగా వస్తున్న పెద్దపల్లి ఎంపీ సీటు కూడా టీఆర్ఎస్ పార్టీ తరపున తెచ్చుకోలేకపోయారు. అన్న వినోద్ విషయంలో తమ్ముడు వివేక్ వేసిన తప్పటడుగులే ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపించిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2013లో తెలంగాణ ఉద్యమం చివరిదశలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉంటూనే తన సోదరుడు వినోద్తో కలిసి టీఆర్ఎస్లో చేరిన ఆయన ఎన్నికలముందు తిరిగి కాంగ్రెస్లో చేరారు. అప్పట్లో వివేక్కు టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దపల్లి ఎంపీ సీటు ఖరారైనప్పటికీ.. తన సోదరుడు వినోద్కు చెన్నూరు టికెట్ ఇవ్వని కారణంగా పార్టీని వీడారు. దీంతో 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో వివేక్ టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరడంతో అనూహ్యంగా బాల్క సుమన్కు పెద్దపల్లి ఎంపీ టికెట్టు దక్కింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వివేక్పై టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన బాల్క సుమన్ ఘనవిజయం సాధించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యంతో పెద్దపల్లి టికెట్ హామీతో వివేక్ మరోసారి టీఆర్ఎస్లో చేరారు. వివేక్కు కేసీఆర్ కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. అంతేకాకుండా రానున్న సార్వత్రిక ఎన్నికల సమయంలో వివేక్కు ఎలాంటి ఆటంకం కలగకూడదని పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బాల్క సుమన్ను చెన్నూరు అసెంబ్లీ నుంచి పోటీ చేయించారు. అయితే డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్న వినోద్ విషయంలో వివేక్ వ్యవహరించిన తీరు, పెద్దపల్లి లోక్సభ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టించి చివరికి వివేక్కు సీటు దక్కకుండా చేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా వివేక్ సోదరుడు వినోద్కు టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ దక్కలేదు. దీంతో బీఎస్పీ నుంచి వినోద్ పోటీ చేశారు. అయితే అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి చిన్నయ్యకు వ్యతిరేకంగా తన సోదరుడిని గెలిపించేందుకు వివేక్ కృషి చేశారని స్థానిక నేతలు కేసీఆర్కు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో పెద్దపల్లి ఎంపీ నియోజక వర్గపరిధిలోని మిగతా ఎమ్మెల్యేలు కూడా తమను ఓడించేందుకు వివేక్ ప్రయత్నించారని కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కేటీఆర్కు వివేక్ వివరణ కూడా ఇచ్చుకున్నారు. అంతేకాకుండా వివేక్ తిరిగి టీఆర్ఎస్లో చేరిననాటి నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాల్కసుమన్ నడుమ విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. వివేక్కు కేసీఆర్, కేటీఆర్ స్థాయిలో పరిచయాలున్నా, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను కలుపుకుని పోవడంలో వైఫల్యం చెందారు. ఈ పరిణామాల నేపథ్యంలో వివేక్ను కాదని చివరి నిమిషంలో పార్టీలో చేర్చుకొని మరీ బోర్లకుంట వెంకటేశ్ నేతకానికి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ చాన్స్ ఇచ్చారు. రెండు సందర్భాల్లోనూ అన్న వినోద్ కోసం వివేక్ చేసిన తప్పిదాలే ఆయన రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయని స్థానికంగా చర్చ జరుగుతుంది. -
సమరానికి సై..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు గడువు ఉంది. ఈ మేరకు కరీంనగర్, పెద్దపల్లి కలెక్టరేట్లలో అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలిరోజైన సోమవారం కరీంనగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్కు అందజేశారు. అలాగే, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా చింతల అనిల్ కుమార్ సైతం నామినేషన్ దాఖలు చేశారు. ఇక పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి కూడా రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ శ్రీదేవసేన వ్యవహరిస్తుండగా.. ప్రజాబంధు పార్టీ నుంచి తాడెం రాజప్రకాశ్, ఇండిపెండెంట్గా కొయ్యడ స్వామి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశముండగా.. 26న నామినేషన్ పత్రాల పరిశీలన అనంతరం 27, 28వ తేదీల్లో ఉప సంహరణకు గడువు ఉంది. ఇక ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది. కరీంనగర్ అభ్యర్థులపై స్పష్టత కరీంనగర్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో స్పష్టత లభించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ను ఇప్పటికే ప్రకటించగా, మంచిరోజు చూసుకుని ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీజేపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి గట్టిపోటీ ఇచ్చిన బండి సంజయ్కే అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ఆధారంగానే అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సీటు కోసం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్కుమార్ పేర్లు కూడా ఢిల్లీ కేంద్ర కమిటీకి చేరుకున్నప్పటికీ, బండి సంజయ్ పేరును దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. అయితే గోవా ముఖ్యమంత్రి పారికర్ మరణంతో సోమవారం ప్రకటించాల్సిన అభ్యర్థుల జాబితా వాయిదా పడింది. తేలని పెద్దపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటికే మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ పేరు ఖరారైంది. టీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆచితూచి అడుగు వేస్తున్నారు. ఇక్కడ మారిన సమీకరణాల నేపథ్యంలో ఎస్సీల్లో ఏ ఉప కులానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టాలనే విషయంలో స్పష్టత రావడం లేదు. మాజీ ఎంపీ గడ్డం వివేక్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, అదే స్థాయిలో ఆయన వ్యతిరేక వర్గం కూడా తమ వంతు యత్నాల్లో మునిగిపోయి కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపుతోంది. వివేక్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నేతకాని వర్గానికి పెద్దపల్లి సీటు కేటాయించాలనే డిమాండ్ను తెరపైకి తెచ్చారు. గత ఎన్నికల్లో చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బొర్లకుంట వెంకటేష్ నేత పేరును ఆయన ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే స్థానిక మంత్రులను కలిసిన ఆయన తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావుకు విజ్ఞప్తి చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా అందుకు అభ్యంతరం పెట్టడం లేదని తెలిసింది. కాగా తాజాగా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ టికెట్ను మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్కు ఇచ్చినందుకు నిరసనగా ఆయన గులాబీ గూటికి చేరారు. ఈ మేరకు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆరెపల్లి మోహన్కు సీటిస్తే గెలుపు తథ్యమని టీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుండగా.. అభ్యర్థిపై స్పష్టత రాలేదు. టీఆర్ఎస్ ప్రకటించాకే బీజేపీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే బీజేపీ పెద్దపల్లి అభ్యర్థిని ఖరారు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా సీటు దక్కకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఒకరిద్దరు ముఖ్య నేతలు ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నిర్ణయం కోసం బీజేపీ వేచి చూస్తోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో గోదావరిఖనికి చెందిన ఎస్.కుమార్ పేరును పార్టీ దాదాపుగా ఖరారు చేసినా.. టీఆర్ఎస్ అసంతృప్త నేతల కోసం వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ కాసిపేట లింగయ్య, కొయ్యల ఏమాజీ కూడా టికెట్ ఆశిస్తుండడం గమనార్హం. కాగా పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎ.చంద్రశేఖర్ పేరును ఖరారు చేయడంతో పార్టీలో వ్యతిరేకత పెరుగుతోంది. -
హోదా సరే.. గుర్తింపు ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల గుర్తింపు విషయంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావట్లేదు. రాష్ట్రంలోని పలు రహదారులను జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) జాతీయ రహదారులుగా గుర్తించింది. వీటిని అధికారికంగా నోటిఫై చేసి, గెజిట్లో చేర్చాల్సిన కేంద్రం మాత్రం ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో రూ.17,000 కోట్ల విలువైన 32 ప్రాజెక్టులకు శంకుస్థాపన, 7 ప్రాజెక్టులకు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. విభజన హామీల ప్రకారం తమకు రావాల్సిన జాతీయ రహదారులనే అడుగుతున్నామని కొత్త డిమాండ్లేవీ లేవని రాష్ట్ర ఎంపీలు అంటున్నారు. కనీసం ఉన్న జాతీయ రహదారుల విస్తరణ కూడా చేపట్టకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగం ఖర్చు భరిస్తామంటున్నా.. విభజన చట్టం ప్రకారం.. తెలంగాణ అభివృద్ధికి జాతీయ రహదారుల అభివృద్ధి అత్యవసరం. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న 3,155 కి.మీ. పొడవైన 25 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇందులో ఇప్పటికే 1,388 కి.మీ.ల మేర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించింది. మిగిలిన 1,767 కి.మీల మేర రోడ్ల గుర్తింపును ఖరారు చేయకుండా తాత్సారం చేస్తోంది. ఈ జాతీయ రహదారుల నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ, ఇతర ఖర్చుల్లో సగం వరకు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కేంద్రం మీనమేషాలు లెక్కించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? రాష్ట్రంలోని 13 రహదారులకు కేంద్రం గతంలోనే జాతీయ రహదారుల హోదా ఇచ్చింది. వీటిని ఇంతవరకూ అధికారికంగా గెజిట్లో చేర్చలేదు. దీంతో ఇవి పేరుకు మాత్రమే జాతీయ రహదారులుగా మిగిలాయి. మొత్తం 1,767 కి.మీ.ల దూరం ఉన్న ఈ రహదారులకు అధికారిక గుర్తింపులో మోక్షం కలగకపోవడం గమనార్హం. హోదా దక్కినా గుర్తింపు రానివి ఇవే! 1. మెదక్–రుద్రూర్–బాసర–భైంసా (ఎన్హెచ్ 61, 166 కి.మీ.), 2.కరీంనగర్–సిరిసిల్ల–కామారెడ్డి–ఎల్లారెడ్డి (ఎన్హెచ్ 563, 165 కి.మీ.), 3.సరపాక–ఏటూరునాగారం–కాళేశ్వరం–చెన్నూరు–కౌతాల– సిర్పూర్ (306 కి.మీ.) 4.మిర్యాలగూడ–పిడుగురాళ్ల –నర్సంపేట (26 కి.మీ) 5.భద్రాచలం–మీలుగుజిల్లి–జంగారెడ్డిగూడెం–దేవురపల్లి (68 కి.మీ) 6. జహీరాబాద్–బీదర్–దేగీర్ (25 కి.మీ) 7. చౌటుప్పల్– ఇబ్రహీంపట్నం–ఆమనగల్–షాద్నగర్–చేవెళ్ల–శం కర్పల్లి–కంది (ఎన్హెచ్–65, 183 కి. మీ.) 8. మెద క్–సిద్దిపేట–ఎల్కతుర్తి (ఎన్హెచ్– 65, 133 కి.మీ) 9.హైదరాబాద్ ఓఆర్ఆర్ వలిగొండ–తొర్రూర్–నెల్లికుదురు–మహబూబాబాద్–ఇల్లందు–కొత్తగూడెం (ఎన్హెచ్ 30, 234 కి.మీ.), 10. తాండూరు–కొడంగల్–మహబూబ్నగర్ రోడ్ (96 కి.మీ.), 11 కొత్త కోట–గూడూరు–మంత్రాలయం (ఎన్హెచ్–167, 70 కి.మీ.), 12. రంగశాయిపేట– చింత నెక్కొండ–కేసముద్రం–మహబూబాబాద్ (71 కి.మీ.) 13.బహదూర్పల్లి–అశ్వాన్పల్లి–గోరియావీడు–నేరేడుపల్లి తండా–గర్మిలపల్లి–బుర్రాపల్లి–ఎంపేడ్–వావిలాల– జమ్మికుంట–వీణవంక– కరీం నగర్ (131 కి.మీ.). కాగా, రాష్ట్రంలోని పలు రోడ్ల విస్తరణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. కనీసం వీటి విస్తరణకైనా అనుమతించాలన్న రాష్ట్ర ప్రభుత్వ వినతిని కేంద్రం ఇంకా పట్టించుకోవట్లేదు. పార్లమెంటులో నిలదీస్తాం: వినోద్ రహదారులకు కిలోమీటరుకు రూ.4 కోట్ల చొప్పున ఖర్చు అవుతుందని అంచనా. ఈ లెక్కన 1,767 కి.మీ.లకు రూ.7,068 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. వీటికి అధికారిక గుర్తింపు, నిర్మాణానికి కావాల్సిన నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియట్లేదు. ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రి గడ్కరీని కలిశాం. తాజాగా మరోసారి లేఖ రాశాం. స్పందించకుంటే బడ్జెట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తాం. -
యువ సైనిక.. విజయ గీతిక
ఎంటెక్ పూర్తి చేశాడు. ఎన్నో ఉద్యోగ అవకాశాలు ముంగిట ఉన్నా దేశ సేవ చేయాలనుకున్నాడు. ఆర్మీలో చేరాలని కసరత్తు మొదలు పెట్టాడు. అనుకున్నట్లుగానే విజయం సాధించాడు. కఠోర శిక్షణను అధిగమించాడు. ప్రస్తుతం దేశ సరిహద్దులో లెఫ్ట్నెంట్గా దేశ రక్షణ రంగంలో సేవ లందిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచారు ఆదోనికి చెందిన వినోద్. ఇటీవల సెలవుపై పట్టణానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తాను ఆర్మీ ఉద్యోగాన్ని ఎంచుకోడానికి కారణాలు? తల్లిదండ్రుల ఆకాంక్ష, తాను ఇష్టమైన ఉద్యోగం సాధించేందుకు చేసిన కృషి, తదితర వివరాలు ఆయన మాటల్లో.. – ఆదోని ‘మా నాన్న కావలి రాజు భవన నిర్మాణ కార్మికుడు. ప్రస్తుతం మేస్త్రీగా పనులు చేయిస్తున్నారు. అమ్మ లీలావతి గృహిణి. ఇద్దరు పెద్దగా చదువుకోలేదు. నాకు తమ్ముడు విష్ణు, చెల్లలు వినీత ఉన్నారు. మా చదువంతా ప్రైవేట్ స్కూళ్లలోనే కొనసాగింది. ఇంటర్ పూర్తి కాగానే ఇంజిజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాయగా అత్యుత్తమ ర్యాంక్ రావడంతో గీతం యూనవర్సిటీలో అడ్మిషన్ లభించింది. బీటెక్తో పాటు ఎంటెక్ కూడా అక్కడే పూర్తి చేశాను. ఆ తర్వాత ఆర్మీ చేరాలనే ధ్రుడమైన కోరికతో తమిళనాడుకు చెందిన మరో ఐదుగురు స్నేహితులతో కలిసి 2015లో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ప్రవేశ పరీక్షలు రాశాను. నాకు మాత్రం ఆర్మీలో లెఫ్టెనెంట్ గ్రేడ్–1 ఆఫీసర్గా ఉద్యోగ అవకాశం లభించింది. ఉద్యోగంలో చేరగానే ఉత్తరాఖండ్లోని డెహ్రడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమిలో శిక్షణ ప్రారంభమైంది. మొత్తం 18 నెలల పాటు శిక్షణ కొనసాగింది. దేశ రక్షణకు శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం, తెగింపు, దేశభక్తి లాంటి పలు అంశాలపై జరిగే శిక్షణ కఠినంగా ఉంటుంది. రాత్రివేళల్లో అడవిలో జట్టుగా 30 నుంచి 60 కి.మీ. ఇందుకు నిర్దిష్టమైన సమయం ఇస్తారు. నిర్ణీత సమయంలో గమ్యం చేరుకోవాల్సి ఉంటోంది. వాహనాలు, హెలికాఫ్టర్, విమానం, డ్రైవింగ్తో పాటు వైద్య రంగంలో అత్యవసర వైద్య చికిత్స అంశాలు కూడా శిక్ష ణలో భాగమే. శిక్షణ విజయవంతంగా ముగించుకున్న తర్వాత లెఫ్ట్నెంట్ గ్రేడ్–1 ఆఫీసరుగా 2016 జూన్ 10వ తేదీన∙నియమిస్తూ ఆర్మీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అదే రోజు నేను లెఫ్ట్నెంట్ గ్రేడ్–1 అధికారిగా బాధ్యతలు చేపట్టాను. ప్రాణాలర్పించడం అదృష్టంగా భావిస్తారు 2017లో లెఫ్ట్నెంట్గా బాధ్యతలు స్వీకరించి దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న ఆర్మీ బృందానికి నాయకత్వం వహిస్తున్నా. ఒక్కో బృందంలో 33 మంది దాకా సైనికులు ఉన్నారు. అవసరమైనప్పుడు ఈ సంఖ్య పెరుగుతోంది. దేశ సరిహద్దుపై డేగ కన్ను ఉంటోంది. ఉగ్రవాదులు, శత్రువుల కదలికలపై డేగ కన్ను ఉంటోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నత స్థాయి అధికారులు జారీ చేసే ఆదేశాల మేరకు నా బృందంతో పని చేయిస్తున్నాను. దేశంలోని కోట్ల మంది ప్రాణాలకు రక్షణగా దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న నాతో సహా సైనికులందరూ ఎంతో గర్వ పడతారు. సైన్యంలో పనిచేయడమంటే పూర్వజన్మ సుకృతమన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సైన్యంలో ఉన్నవారికి దేశ ప్రజల కోసం ప్రాణార్పణకు వెనకాడరు. ప్రాణాలర్పించడాన్ని అదృష్టంగా భావిస్తారు. ఆనంద బాష్పాలు రాలాయి బాధ్యతలు చేపట్టిన రోజు అమ్మనాన్న లీలావతి, రాజును ఉత్తరఖండ్లోని డెహ్రడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమి కార్యాలయానికి పిలిపించారు. ర్యాంకిగ్ బ్యాడ్జ్ని అమ్మానాన్నతో నా ఆర్మీ యూనిఫాంకు తగిలించారు. ఈ సందర్భంగా హెలికాఫ్టర్ నుంచి పూలవాన కురిసింది. ఒక్క సారిగా సభికుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఉన్నతస్థాయి అధికారులు, దేశ పౌరులు, వేలాది మంది సైనికుల సమక్షంలో లభించిన గౌరవంతో అమ్మానాన్న ఆనందంతో ఉప్పొంగిపోయారు. నన్ను అలింగనం చేసుకున్న అమ్మనాన్న కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఆర్మీలో చేరుందుకు ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ సైన్యంలో రాష్ట్రానికి చెందిన వారు చాలా తక్కువగా ఉన్నారు. ఇది బాధాకరం. ఏటా ఇతర రాష్ట్రాల నుంచి 50 నుంచి 60 మంది వరకు నా స్థాయి ర్యాంకు వాళ్లు ఆర్మీలో చేరుతున్నారు. అయితే మన రాష్ట్రం నుంచి వచ్చే వారి సంఖ్య ఐదారు మందికి మించడం లేదు. దీంతో ఆర్మీపై ప్రజలలో సరైన అవగాహన లేదనిపిస్తోపంది. ఆర్మీ అంటేనే అడవుల్లో కాపలా కాయడమని, కష్టాలను ఎదుర్కోవడమనే అపవాదు ఉంది. కొంత వరకు ఇది వాస్తమే అయినా ఇందుకు నాలుగింతలు ఉద్యోగ సంతృప్తి ఉంటోంది. ప్రభుత్వం, సమాజంలో మంచి గుర్తింపు కూడా ఉంటోంది. అందుకే సెలవుల్లో వచ్చినప్పుడు యువతలో ఆర్మీ పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని భావిస్తున్నాను. ఇతర రాష్ట్రాలకు సమానంగా మన రాష్ట్రం నుంచి కూడా ఆర్మీ చేరేందుకు ప్రోత్సాహం అందిస్తాను. -
‘జాతీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు ’
సాక్షి, న్యూఢిల్లీ : రాబోయే రోజుల్లో ఏ జాతీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని, ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ జోస్యం చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే 30ఏళ్ల వరకు మళ్లీ ఒక జాతీయ పార్టీ ప్రభుత్వాన్ని పరిపాలించలేదని చెప్పారు. 1985 నుంచి 2014 వరకు భారతదేశం ఒక సంకీర్ణ ప్రభుత్వాల యుగాన్ని చూసిందని, 2019లో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలపై ఆధారపడే ప్రభుత్వం వస్తుందని స్పష్టం చేశారు.తెలంగాణలో పెండింగ్లో ఉన్న అంశాలపై వివిధ కేంద్ర మంత్రులను కలుస్తున్నట్లు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు అనుమతి కోసం కేంద్రమంత్రి హర్షవర్ధన్ను కలిశామని చెప్పారు. హైకోర్టు విభజన ప్రక్రియ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సాగుతోందని, జనవరి ఒకటి నుంచి కొత్త హైకోర్టు ఏర్పడనున్నట్లు సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేశానికి స్వాతంత్రం తెచ్చింది కూడా తానే అని చెప్పే రకమంటూ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్గఢ్ ఎన్నికల్లో చంద్రబాబు వల్లే కాంగ్రెస్ గెలిచిందని చెప్పుకోవటం విడ్డూరమన్నారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తాడో.. రాడో అన్న మీమాంస ఉందని, ఆయనకు జాతీయ రాజకీయాల్లో పాత్ర ఉండే అవకాశం లేదని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
‘టీఆర్ఎస్ గెలుస్తుందనే వారి భయం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే భయంతో కాంగ్రెస్, బీజేపీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాయని ఎంపీ వినోద్కుమార్ అన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలను అణచివేయడానికి కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. జాతీయ పార్టీల దివాళాకోరు రాజకీయాల వల్లే దేశంలో ప్రాంతీయ పార్టీలకు ఆదరణ పెరిగిందన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రజలను పక్కదారి పట్టించేం దుకే కాంగ్రెస్, బీజేపీలు టీఆర్ఎస్పై నిందలు వేస్తున్నాయి. ఈ నాలుగున్నరేళ్లలో ఆ పార్టీల ఎమ్మెల్యేల పాత్ర శూన్యం. హోం మంత్రి రాజ్నాథ్సింగ్ తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని అంటున్నారు. దేశవ్యాప్తంగా మహా రాష్ట్ర, కర్ణాటకల్లోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కు వ. తెలంగాణలో ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర హోం శాఖ చెప్పింది. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది’ అని అన్నారు. -
పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్: ఎంపీ వినోద్
హైదరాబాద్: తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ఎవరినైనా, దేనినైనా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఎంపీ వినోద్ అన్నారు. ది తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం హోటల్ ది ప్లాజాలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షనర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం తాగునీరు, విద్యుత్కు పెద్దపీట వేసిందన్నారు. తమ ప్రభుత్వం పెన్షనర్లను అన్నివిధాలా ఆదుకుంటుందని, పదో పీఆర్సీ ప్రకారం 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు అదనంగా 15 శాతం క్యాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరుకు సిఫారసు చేయాలని పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు జి.నర్సయ్య కోరారు. దేవాలయాలు, గ్రంథాలయాల సంస్థ, మార్కెట్ కమిటీ, డీసీసీబీ, వాటర్ వర్క్స్, సింగరేణి కాలరీస్లో రిటైర్డ్ అయిన వారికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలంటూ వినతిపత్రం ఇచ్చారు. సమావేశంలో సంఘం గౌరవ సలహాదారు దేవీ ప్ర సాద్, ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి, వర్కింగ్ ప్రెసిడె ంట్ టి.ప్రేమ్కుమార్, కోశాధికారి శ్రావ ణ్కుమార్, నవనీతరావు పాల్గొన్నారు. -
హీరో కారులో నగదు చోరీ
కర్ణాటక, దొడ్డబళ్లాపురం : గత సెప్టెంబరు నెల 28న నెలమంగల పట్టణంలో సినీహీరో వినోద్రాజ్ కారులో నగదు అపహరించిన కేసులో ప్రధాన నిందితుడిని నెలమంగల పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. నిందితుడు చిత్తూరు జిల్లా నగరి తాలూకా ఓజీ కుప్పం నివాసి శ్యామ్సన్గా గుర్తించారు. సెప్టెంబర్ 28న బ్యాంకు నుండి డ్రా చేసుకున్న నగదును తన కారులో పెట్టిన వినోద్రాజ్ నెలమంగల పట్టణంలోని ఒక వస్త్ర దుకాణం ముందు పంక్చర్ అయిన కారు టైర్ మారుస్తుండగా అక్కడకు వచ్చిన నలుగురు అపరిచిత వ్యక్తులు అభిమానులుగా పరిచయం చేసుకుని మాటల్లో దింపి కారులోని నగదు మాయం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నవంబర్ 7న పట్టణంలోని ఒక బ్యాంక్ ముందు శ్యామ్సన్ చోరీ చేయడానికి కాపుకాచి ఉండగా అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా వినోద్రాజ్ కారులో నగదు చోరీ చేసింది తామేనని ఒప్పుకున్నాడు. పరారీలో ఉన్న మరో ముగ్గురు చిన్న, తులసి, నరేశ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
చంద్రబాబు తీరుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది
-
బోయినపల్లి అల్లుళ్లు
బోయినపల్లి (చొప్పదండి): రాష్ట్ర రాజకీయాల్లో కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలం ప్రత్యేక గుర్తింపు సంత రించుకుంది. కేవలం 28 వేల పైచిలుకు ఓటర్లు ఉన్న ఈ చిన్న మండలం ఎన్నికల వేళ ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది. బోయినపల్లి మండలానికి ప్రముఖ నేతలతో ఉన్న బంధుత్వం, అనుబంధాలే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఈ మండలం అల్లుళ్లు కావడం.. అనేక మంది ప్రముఖుల చుట్టరికం ఉండటంతో ఈ మండలవాసులు తెగ ఫీలవుతుంటారు. ‘ఫలానోడు మా మండలం అల్లుడోయి’అని గర్వంగా చెప్పుకుంటారు. బోయినపల్లి మం డలం కొదురుపాక గ్రామానికి చెందిన జోగినిపల్లి కేశవరావు, లక్ష్మి దంపతుల కూతురు శోభను పరిణయమాడిన సీఎం కేసీఆర్ కొదురుపాకకు అల్లుడయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావు మండలంలోని కోరెం గ్రామానికి చెందిన చెన్నాడి సత్యనారాయణరావు, లచ్చమ్మ దంపతుల కూతురు వినోదను వివాహమాడారు. కార్యకర్తలు, విద్యాసాగర్రావు ఎంపీగా, ఎమ్మెల్యేగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. కరీంనగర్ ఎంపీగా పార్లమెంట్లో తన గళం వినిపిస్తున్న బోయినపల్లి వినోద్కుమార్ సైతం ఇక్కడి అల్లుడే. మండలంలోని కోరెం గ్రామానికి చెందిన చెన్నాడి మార్తాండరావు–రాజ్యలక్ష్మి కూతురు మాధవిని ఆయన వివాహమాడారు. రాజ్యసభ సభ్యుడూ ఈ మండలవాసే కేసీఆర్ తోడల్లుడు మండలంలోని కొదురుపాకకు చెందిన జోగినిపల్లి రవీందర్రావు కుమారుడు జోగినిపల్లి సంతోష్కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే దివంగత చెన్నమనేని రాజేశ్వరరావు మండలంలోని మాన్వాడలో జన్మించి ఇక్కడే బాల్యం గడిపారు. ఆయన కూతురును మండలంలోని నర్సింగాపూర్కు చెందిన జోగినిపల్లి రాజేశ్వరరావుకు ఇచ్చి వివాహం చేశారు. కరీంనగర్ చల్మెడ ఆసుపత్రి అధినేత లక్ష్మీనరసింహరావుకు కోరెం గ్రామంతో చుట్టరికం ఉంది. రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నాయకులతో బోయినపల్లి మండలానికి అనుబంధం ఉండటం ఎన్నికలప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటారు. -
రాహుల్ వాస్తవాలు తెలుసుకోవాలి: వినోద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పర్యటనకు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని, ఆయన్ను తెలంగాణ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని కరీంనగర్ ఎంపీ బి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ తన ప్రసంగంలో మన్యం వీరుడు కుమ్రంభీంను తెలంగాణ ప్రభుత్వం విస్మరించిందని చెప్పారని, కానీ కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాకు ఆయన పేరు పెట్టిందన్న విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. ప్రజల మధ్య లేని కాంగ్రెస్ నేతలు రాసిచ్చే స్క్రిప్టును రాహుల్ గాంధీ చదవడంతో తెలంగాణ ప్రజలంతా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రాణహిత– చేవెళ్ల అంబేడ్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టు పేరును తాము మార్చామని చెప్పడం విడ్డూరంగా ఉందని, ఆయన పేరుతో ఆ ప్రాజెక్టు అలాగే ఉందని దీనిపై అనుమానాలుంటే రాహుల్గాంధీ నేరుగా ఆదిలాబాద్ వెళ్లి చూసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏనాడు ప్రజల కోసం పనిచేయలేదని, ఇప్పుడు వారు తెలిసీ తెలియని స్క్రిప్టును రాహుల్కు రాసిచ్చారన్నారు. తమ ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుందని, దీనితో 42 లక్షల మంది రైతులు నేరుగా లబ్ధిపొందుతారని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర, మద్దతు ధర ఇవ్వాల్సింది, ధరలపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమన్నారు. నిరుద్యోగ భృతిపై లోతుగా కసరత్తు చేసి ప్రకటించామని, దీన్ని అమలు చేయబోతున్నామని వినోద్ చెప్పారు. -
‘హరీష్ వ్యాఖ్యలు డ్రామాలో భాగమే’
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాం గ్రెస్ పాత్ర లేదని అంటే టీఆర్ఎస్ నేతలు పురుగులు పడి చస్తారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీ వ్యాఖ్యానించారు. వినోద్ అనే పేరు పెట్టుకుని విజ్ఞత లేకుండా, సొల్లు కబుర్లు చెపుతున్న ఎంపీ వినోద్కుమార్కు దమ్ముంటే తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ఎంపీల పాత్ర గురించి చర్చించేందుకు ముందుకు రావాలని సవాల్ చేశారు. స్థలం, సమయం చెబితే చర్చ కు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. శనివారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ఆకాం క్ష, అమరవీరు ల త్యాగాలను గుర్తించి ప్రత్యేక రాష్ట్రం ఇస్తానని సోనియా 2009లో భువనగిరి సభలో చెప్పిన మేరకే తెలంగాణను ఇచ్చారన్నారు. టీఆర్ఎస్ను ప్రజలు రాజకీయంగా బొందపెట్టబోతున్నారన్నారు. పాతరోజులు మరిచిపోయారు తెలంగాణ పేరుతో ఆజాద్, జైరాం రమేశ్ల ఇళ్ల చుట్టూ టీఆర్ఎస్ నేతలు తిరిగిన పాతరోజుల్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని మధుయాష్కీ అన్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కేటీఆర్, కవిత తన ఇంటికి వచ్చి బతిమిలాడారని గుర్తుచేశారు. ఎంపీ వినోద్, తన తమ్ముడు, సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ల ఆస్తులు 2001లో ఎంతో, ఇప్పుడు ఎంతో తెలిస్తేనే వీళ్లు రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో అర్థమవుతుందన్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నాననే హరీశ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ అది మామాఅల్లుళ్ల డ్రామా అని యాష్కీ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవినీతిని బయటపెట్టి జైల్లో పెడుతుందనే భయంతోనే కూడగట్టుకుంది తీసుకుని వెళ్లిపోదామని హరీశ్ అలా మాట్లాడి ఉంటారని అభిప్రాయపడ్డారు. -
కొండంత విషాదం: వెంటీలెటర్పై మరో నలుగురు
సాక్షి, జగిత్యాల/హైదరాబాద్ : అంజన్న భక్తులకు కొండంత విషాదాన్ని మిగిల్చిన కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 60కి చేరింది. మరోవైపు హైదరాబాద్లోని సన్షైన్ ఆస్పత్రిలో తీవ్రంగా గాయపడిన పలువురు చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురు వెంటిలేటర్పై ఉన్నారు. మరో 24 గంటలు గడిస్తే కానీ.. వారి ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని సన్షైన్ ఆస్పత్రి వైద్యులు చెప్పడంతో వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హెచ్చార్సీలో ఫిర్యాదు కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్లో హైకోర్టు న్యాయవాది అరుణ్కుమార్ ఫిర్యాదు చేశారు. ప్రమాదానికి బాద్యులైన అధికారులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని ఆయన హెచ్చార్సీని కోరారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్గ్రెషియా ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలంటూ కమిషన్ను అభ్యర్థించారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమే కారణం ఆర్టీసి అధికారుల నిర్లక్ష్య కారణంగానే కొండగట్టు బస్సు ప్రమాదం జరిగిందని, ఇలాంటి రోజు మళ్లీ రాకూడదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. అధికారులు చేసిన తప్పిదాల వల్ల పేదల కుటుంబాలు బలి అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం నుంచి బయటపడిన ఇద్దరు చిన్నారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పారు. బుధవారం కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఒకరు, హైదరాబాద్లో మరొకరు మృతి చెందడంతో మరణించిన వారి సంఖ్య 60కి చేరింది. తీవ్ర గాయాలపాలైన మరో 41మంది కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ ఘాట్ రోడ్డు వద్ద మంగళవారం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 101 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో అదుపు తప్పి బస్సు లోయలో పడింది. -
టాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ మృతి
-
టాలీవుడ్ నటుడు వినోద్ మృతి
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు వినోద్(అసలు పేరు అరిసెట్టి నాగేశ్వర రావు) మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు బ్రెయిన్ స్ట్రోక్తో హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. వినోద్ 1980లో కీర్తి కాంత కనకం సినిమాతో సినీ రంగప్రవేశం చేశారు. మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. 28 తమిళ సినిమాలు, రెండు హిందీ సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలో కూడా నటించారు. తెలుగు సినిమాల్లో చంటి, నల్లత్రాచు, లారీ డ్రైవర్, ఇంద్ర, నరసింహనాయుడు, భైరవద్వీపంలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వినోద్కు భార్య వీనావతి, పిల్లలు శిరీష, సురేష్, తేజస్విలు ఉన్నారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వినోద్ మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపం తెలిపింది. -
ఇళయరాజా ఏకలవ్య శిష్యుడిని..
సినీ సంగీతంలో కొత్త కెరటం యాజమాన్య తెనాలి: సినీ సంగీత సాగరంలో కొత్త కెరటం...యాజమాన్య. మ్యూజిక్ మాస్త్రో ఇళయరాజాకు ఏకలవ్య శిష్యుడు. ఆయన పాటతో అల్లుకున్న అనుబంధం సంగీతమే ప్రపంచమైంది. సినీ నేపధ్యం లేకుండానే సినిమా రంగంలోకి కాలుమోపాడు. కీబోర్డు ప్లేయరుగా వందలాది సినిమాల్లో అనుభవాన్ని రంగరించి, పదికి పైగా సినిమాలకు వినసొంపైన బాణీలను స్వరపరచి యువతరాన్ని ముగ్ధులను చేశారు. మరో అయిదు సినిమాలు కొద్దివారాల వ్యవధిలో విడుదల కానున్నాయి. తాజాగా పెదరావూరు ఫిలిమ్ స్టూడియో ఆధ్వర్యంలో నిర్మించనున్న ‘పండుగాడి ఫోటోస్టూడియో’ సినిమా సంగీతం కోసమని తొలిసారిగా నగరాన్ని వదిలి పెదరావూరు వచ్చారాయన. ‘సాక్షి’తో కొద్దిసేపు మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... పాట సంగీతం కేసి తీసుకెళ్లింది.. చిత్తూరు జిల్లా పలమనేరు నా స్వగ్రామం. తెలుగు కుటుంబమే. నా పూర్తి పేరు యాజమాన్య వినోద్. ‘పండుగాడి ఫొటోస్టూడియో’ నుంచి ఇంటి పేరు యాజమాన్యగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నా. మా ఇంట్లో ఎలాంటి సినీ నేపధ్యం లేదు. చదువుకొనే వయసులోనే సినిమా పాటలంటే ప్రాణం. ఇళయరాజా పాటలంటే చెప్పలేనంత ఇష్టం. ఆ స్ఫూర్తితో సంగీతంపై ఆసక్తి పెరిగింది. గిటార్ పట్టేలా చేసింది. కీబోర్డు ప్లేయరయ్యాను. ఎన్నో కచేరీలు చేశాను. వందేమాతరం శ్రీనివాస్ బృందంలో చేరాను. ‘జయం మనదేరా’ సినిమా రికార్డింగ్లో గిటారిస్ట్గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టా. కొద్దిరోజుల్లోనే కీబోర్డు ప్లేయరుగా అవకాశం లభించింది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో 300 సినిమాలకు పైగా పనిచేశాను. చక్రి, మణిశర్మ, కీరవాణి, తమన్..వంటి సంగీత దర్శకుల దగ్గర పనిచేయటం నా అదృష్టం. 2014 నుంచి సంగీత దర్శకత్వం 2014 నుంచి సొంతంగా సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నా. అంతా కొత్తవారితో తీసిన ‘నువ్వే నా బంగారం’ తొలి సినిమా. ‘పోరా పోవే’, ‘నాటుకోడి’, ‘అనగనగా ఒక చిత్రమ్’, ‘టైటానిక్’ (అంతర్వేది టు అమలాపురం), ‘పెళ్లికి ముందు ప్రేమకథ’, ‘రాక్షసి’, ‘దళపతి’, ‘అనగనగా ఒక ఊరిలో’, ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ సినిమాలకు సంగీతం సమకూర్చా. మరో అయిదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పోసాని సినిమా ‘దేశముదుర్స్’, ‘ప్రేమ ఎంత పనిచేసే నారాయణ’, ‘తమిళ తంబి’, ‘సమీరం’, ‘బొమ్మ అదుర్స్’ సినిమాలు మే/జూన్లో థియేటర్లకు రానున్నాయి. టైటానిక్ సినిమాలో ‘పడిపోతున్నా నీ మాయలో’, దళపతిలో ‘నీకూ నాకూ మధ్య ఏదో ఉంది’, అంటూ శ్రేయోఘోషల్ పాడిన పాటలు, ‘రాజూ..దిల్రాజూ’ పాటల యువతరాన్ని ఆకర్షించాయి. తొలిసారి గ్రామంలో... ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్లో ఉన్న ‘పండుగాడి ఫొటోస్టూడియో’ను పాటల రికార్డింగు నుంచి సినిమా షూటింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఇక్కడే తీయాలనేది దర్శకుడు దిలీప్రాజా నిర్ణయం. నగరానికి దూరంగా పెదరావూరు గ్రామంలో పాటల కంపోజింగ్ చేస్తున్నాం. ఇదో కొత్త అనుభవం నాకు. జంధ్యాల మార్కు కామెడీతో కూడిన స్క్రిప్టుకు ఆ తరహా పాటల కంపోజింగ్ చేస్తున్నాం. బ్లాక్బస్టర్ కోసం.. సినిమా సంగీతంలో మునిగితేలుతూనే బీకాం కంప్యూటర్స్ పూర్తి చేశా. పెద్ద సినిమాలకు కీ బోర్డు ప్లేయరుగానూ సహకారం అందిస్తున్నా. నా సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలన్నీ జనాలకు వెళుతున్నాయి. ఆదరిస్తున్నారు. బ్లాక్ బస్టర్ రావాల్సి ఉంది. ఆరోజుకోసం చూస్తున్నా. మెలోడీనే కాకుండా అన్ని రకాల సినిమాలు చేయాలి. అంతర్జాతీయస్థాయిలో ఎదగాలి, అనేది నా లక్ష్యం. -
వినోద్, బజరంగ్ ‘కంచు’మోత
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్ల పతకాల వేట కొనసాగుతోంది. శనివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్లు బజరంగ్ పూనియా (60 కేజీలు), వినోద్ కుమార్ ఓంప్రకాశ్ (70 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. కాంస్య పతక బౌట్లలో బజరంగ్ 10–4తో యూనిస్ అలీఅక్బర్ (ఇరాన్)పై గెలుపొందగా... వినోద్ ఆతిథ్య దేశానికి చెందిన ఎలామన్ డాగ్డుర్బెక్ను ఓడించాడు. క్వార్టర్ ఫైనల్స్లో బజరంగ్ 5–7తో దైచి తకతాని (జపాన్) చేతిలో... వినోద్ 3–6తో నవ్రుజోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. అయితే తకతాని, నవ్రుజోవ్ ఫైనల్కు చేరడంతో బజరంగ్, వినోద్లకు కాంస్య పతకాల కోసం నిర్వహించే రెప్చేజ్ రౌండ్లలో పోటీపడే అవకాశం లభించింది. రెప్చేజ్ తొలి రౌండ్లో బజరంగ్ 12–2తో అబ్దుల్ (తజికిస్తాన్)పై నెగ్గి కాంస్యం కోసం అలీఅక్బర్తో పోటీపడ్డాడు. వినోద్కు నేరుగా కాంస్యపతక బౌట్ ఆడే అవకాశం దక్కింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్కు ఒక స్వర్ణం, రజతంతోపాటు ఆరు కాంస్యాలు లభించాయి. -
బజరంగ్, వినోద్లకు రజతాలు
న్యూఢిల్లీ: ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు బజరంగ్ పూనియా (65 కేజీలు), వినోద్ కుమార్ (70 కేజీలు) రజత పతకాలు గెలిచారు. పోలాండ్లో ఆదివారం జరిగిన ఫ్రీస్టయిల్ ఫైనల్స్లో బజరంగ్ 7–16తో నచిన్ సెర్గీవిచ్ కులర్ (రష్యా) చేతిలో... వినోద్ 1–3తో రిచర్డ్ ఆంథోనీ లూయిస్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. సెమీఫైనల్స్లో బజరంగ్ 9–4తో అలీ అక్బర్ (ఇరాన్)పై, వినోద్ 2–1తో తొకోజిమా (జపాన్)పై గెలిచారు. -
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
సాక్షి, మేడ్చల్ : రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన జిల్లాలోని ఘట్కేసర్ మండలం అవుసాపూర్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. వీబీఐటీ కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోన్న వినోద్(21) తన బైక్పై కళాశాలకు వెళ్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బీటెక్ విద్యార్థి వినోద్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువులోకి దూసుకెళ్లిన కారు
అలుగు చూసేందుకు వెళ్లగా ప్రమాదం సత్తుపల్లి రూరల్: స్నేహితుల దినోత్సవం సందర్భంగా మిత్రులతో సరదాగా గడుపుదా మని వచ్చిన ఓ స్నేహితుడు ప్రమాదం బారిన పడి ఆ కుటుంబంలో విషాదం నింపాడు. సత్తుపల్లికి చెందిన సింగరేణి ఉద్యోగి మల్లిశెట్టి కొండేశ్వరరావు తనయుడు హిమకిరణ్, కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన గోల్డ్షాపు యజమాని కొక్కొండ గిరిబాబు తనయుడు వినోద్(22) మంచి మిత్రులు. ఆదివారం బేతుపల్లి చెరువు అలుగును చూసేందుకు వెళ్లగా.. కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. అందు లోని ఇద్దరు కారు డోర్లు తీసుకొని కారుపైకి వచ్చారు. స్థానికులు రక్షించేందుకు చెరువులోకి వెళ్లి ఒడ్డుకు తీసుకొస్తుండగా.. వినోద్ చేతిలోని సెల్ఫోన్ పడిపోవడంతో దానిని తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా జారి చెరువులో పడిపోయాడు. పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నం చేసినా చిక్కలేదు. హిమకిరణ్ను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఆదివారం రాత్రి 8 గంటల వరకు గాలింపు చర్యలు కొనసాగాయి. -
సెల్ఫోన్, ల్యాప్టాప్ల దొంగ అరెస్ట్
అనంతపురం న్యూసిటీ: రైళ్లలో సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు ఎత్తుకెళ్లే దొంగను రైల్వే పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇతడి నుంచి రూ.10,22,693 విలువైన సెల్ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురం రైల్వే పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ తబ్రేజ్ వెల్లడించారు. పెనుకొండ మండలం మునిమడుగు గ్రామానికి చెందిన ఓబన్నగారి వినోద్ పుట్టిన మూడు నెలకే తన తండ్రి వెంకట్రాముడు ఫ్యాక్షన్ గొడవల్లో మృతి చెందాడు. ఈ ఘటనతో వినోద్ తల్లి మతిస్థిమితం కోల్పోయింది. పేదరికం తోడవడంతో వినోద్ క్రమంగా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలను ఎంచుకున్నాడు. 2013లో అనంతపురం రైల్వే స్టేషన్ దొంగతనం చేసి పోలీసులకు పట్టుబట్టాడు. ఏడాది తర్వాత కేసు కొట్టేశారు. పొట్టకూటి కోసం కొయంబత్తూరుకు వెళ్లాడు. పని చేతకాక తిరిగి 2016 నుంచి దొంగతనాలు మొదలు పెట్టాడు. ఈ ఏడాది జనవరిలో గుంతకల్లు రైల్వే స్టేషన్లో హరిప్రియ ఎక్స్ప్రెస్ రైలులో జర్మనీకి చెందిన ఫ్లాయిడ్ ఫిషర్ అనే వ్యక్తికి చెందిన మాక్ బుక్ ల్యాప్టాప్, బీక్యూ మొబైల్, నికాన్ అబ్జెక్టివ్ లెన్స్ కెమెరా, రెండు ఎస్డీ కార్డ్స్, హార్డ్ డ్రైవ్, ట్రావెల్ అడాప్టర్ దొంగిలించాడు. వీటి విలువ రూ 4,12,300. అలాగే వివిధ రైళ్లలో దాదాపుగా 35 సెల్ ఫోన్లు దొంగిలించాడు. రైలు స్లో అవుతున్న సమయంలో సెల్ఫోన్లు అపహరించి పారిపోయేవాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకుని రైల్వే పోలీసులు దొంగపై నిఘాపెట్టారు. ఈ క్రమంలో ధర్మవరం రైల్వేస్టేషన్లో పోలీసులను చూసి పరుగులు తీస్తున్న ఓబన్నగారి వినోద్ను పట్టుకుని, విచారించగా నేరాలు ఒప్పుకున్నాడని సీఐ తబ్రేజ్ తెలిపారు. విలేకరుల సమావేశంలో గుంతకల్లు ఎస్ఐ రమేష్బాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఓటు’ విలువ మారకుండా చూడండి
ఎమ్మెల్యేల ఓటుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ వినోద్ లేఖ సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విభజన తర్వాత తొలిసారిగా జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికలో తెలంగాణ, ఏపీలకు చెందిన ఎమ్మెల్యేల ఓటు విలువ మారకుండా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్కుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నసీం జైదీకి శుక్రవారం లేఖ రాశారు. గత రాష్ట్రపతి ఎన్నికలో ఉమ్మడి ఏపీలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 148 కాగా విభజన తర్వాత ఏపీ ఎమ్మెల్యే ఓటు 159కి పెరిగిందని, తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132కు తగ్గిందని పేర్కొన్నారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిందని, అందువల్ల 1971 జనాభా లెక్కల ఆధారంగా కొత్త రాష్ట్రాల జనాభా లెక్కకట్టడం అశాస్త్రీయమన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా కేంద్రం, ఎన్నికల సంఘం తెలంగాణకు నష్టం వాటిల్లకుండా రాజ్యాంగంలోని 55(2) అధికరణను సవరించాలని కోరారు. -
ధన ప్రభావంపై చర్చ జరగాలి
‘బ్యాలెట్ ద్వారా ఎన్నికలు’ వాదన సరికాదు: ఎంపీ వినోద్ ట్యాంపరింగ్కు తావు లేకుండా మెరుగుపర్చాలి: ఉమ్మారెడ్డి ఈవీఎంల వివాదంపై ఢిల్లీలో ఈసీ చర్చ సాక్షి, న్యూఢిల్లీ: ఈవీఎంలపై 2010లో జరిగిన చర్చలోనే ‘ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)’ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారని... అందువల్ల బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలనే వాదన సరికాదని ఎంపీ బి.వినోద్కుమార్ పేర్కొన్నారు. ఈవీఎంల వివాదంపై శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి ఏడు జాతీయ పార్టీలతో పాటు 48 ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ తరఫున వినోద్ కుమార్, వైఎస్సార్సీపీ తరఫున సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, టీడీపీ తరఫున ఎంపీ మాల్యాద్రి పాల్గొని.. అభిప్రాయం వెల్లడించారు. ఈ సందర్భంగా ఈవీఎంలను టీఆర్ఎస్ స్వాగతిస్తోందని, దేశంలో ఎన్నికల సంఘం తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తోందని వినోద్కుమార్ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సమర్థవంతమైన ఈవీఎంలను రూపొందించుకోవాలని సూచించారు. ఈవీఎంలో ఏడు సెకన్లుగా ఉన్న ఓటు సమయాన్ని కొద్దిగా పెంచాల్సిన అవసరం ఉందని.. కేవలం ఏడు సెకన్లు అంటే ఓటరు ఆందోళన చెందే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల్లో ధన ప్రభావం, నగదు పంపిణీపై చర్చ జరగాల్సి ఉందని వినోద్కుమార్ స్పష్టం చేశారు. ప్రలోభపెట్టడం అంటే ఇవ్వడం, తీసుకోవడం రెండింటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. సమస్యలు రాకుండా ఈవీఎంలను సరిదిద్దాలి: ఉమ్మారెడ్డి ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురవుతున్నాయంటూ తిరిగి బ్యాలెట్ విధానాన్ని అనుసరించాలన్న వాదన సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమావేశంలో స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, ట్యాంపరింగ్కు తావులేని విధంగా మెరుగుపర్చాలని చెప్పారు. తాము ఎవరికి ఓటు వేశామో తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తే అపోహలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం ఫిరాయింపులపై చర్యలు తీసుకునే బాధ్యతలను కూడా చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నాం: టీడీపీ ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నామని, బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ ఎంపీ శ్రీరాం మాల్యాద్రి కోరారు. ఎన్నికల సంఘం ఎంత పటిష్టంగా నిర్వహించాలనుకున్నా.. కింది స్థాయిలో సిబ్బందిని ప్రలోభాలకు గురి చేసే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. -
మిర్చికి ధర కోసం కేంద్రాన్ని కోరాం: వినోద్
సాక్షి, హైదరాబాద్: మిర్చి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించే సంప్రదాయం లేదని, అయినా, మిర్చి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఈసారి మిర్చి పంట బాగా పండిందని, దిగుబడి ఎకరాకు 24క్వింటాళ్లకు పెరిగిందని ఆయన చెప్పారు. తెలంగాణభవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పంట దిగుబడి పెరిగి రైతు ఆనందంతో ఉన్నా గిట్టుబాటు ధర లేక అసంతృప్తిగా ఉన్నాడని, గతం కంటే ఈసారి మిర్చి పంట విస్తీర్ణం కూడా బాగా పెరగడంతో సరైన ధర లేకుండా పోయిందన్నారు. మిర్చి రైతుల సమస్యలపై గత నెలాఖరులోనే కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్సింగ్తో భేటీ అయ్యానని, రైతుకు గిట్టుబాటు ధర కోసం ‘మార్కెట్ ఇన్టర్వెన్షన్’ నిధిని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని వివరించారు. టీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తి మేరకు ఈ నెల 18న రాష్ట్ర వ్యవసాయ అధికారులను కేంద్రం పిలిచిందని చెప్పారు. కాగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఎవరికి మద్దతు ఇవ్వాలన్నది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
అఆ..వినోద్..ని
చిన్ని తెర హీరో...యిన్ ఇప్పటి వరకు 100 గెటప్లు కామెడీ షోల్లో అలరిస్తున్న వినోద్ అందమైన అమ్మారుు. పెళ్లీడుకొచ్చింది. మంచి పెళ్లి సంబంధం వచ్చింది. ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. కాని వినోదిని మాత్రం చిన్నబుచ్చుకుంది. ఎందుకని? ‘‘నేను మగవాడిని పెళ్లి చేసుకోవడం ఏమిటండీ?’’ అంటూ నవ్వేస్తాడు వినోదిని అలియాస్... వినోద్కుమార్. తనను తాను అందమైన అమ్మాయిగా మలచుకుని చిన్నితెర సాక్షిగా నవ్వుల పంట పండిస్తున్న పరకాయ ప్రవేశం పేరే వినోద్కుమార్. మేకప్లో బయటకు వస్తే కొర కొర చూసే ఆకతాయిల నుంచి చిలిపి మెసేజ్లతో చిరాకు పుట్టించే ఈవ్టీజర్ల దాకా ఎదుర్కొంటూ అమ్మాయిగా నటించడం మాత్రమే కాదు జీవిస్తున్న వినోదిని... అమ్మో... నటించడం ఏమో కాని అమ్మాయిగా జీవించడం మాత్రం కష్టమే అంటున్నాడు. - బంజారాహిల్స్ బంజారాహిల్స్ : అమ్మాయిలకే అసూయ కలిగించేంత అందం.. టీవీ షో కోసం అతడు..ఆమెగా మారాడు. లేడీ గెటప్లో వినోద్ కాస్తా వినోదినిగా వినుతికెక్కాడు. హొయలొలికే వయ్యారంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు. అచ్చం అమ్మాయిలా నటిస్తూ నవ్విస్తున్న వినోద్ అలియాస్ వినోదిని అచ్చూ మన ఇళ్లల్లో ముఖ్యంగా మధ్య తరగతి ఇళ్లల్లో కనిపించే భార్య, తల్లి, ప్రియురాలు, చెల్లి ఇలా అన్ని వేషాల్లోను ఆకట్టుకుంటున్నాడు. ఓ టీవీ చానెల్లో వస్తున్న కామెడీ షోలో వినోద్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. కడపకు చెందిన అప్పాయిపల్లి వినోద్కుమార్(21) బుల్లితెర నటుడిగా ఎదిగేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. తండ్రి విజయ్కుమార్ ప్రభుత్వ ఉద్యోగి కాగా తల్లి శివమణి గృహిణి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నటుడిగా ఎదగాలన్న లక్ష్యంతో కడప నుంచి కృష్ణానగర్కు మకాం మార్చాడు. 2012లో ప్రారంభమైన వినోద్ ప్రస్థానం ఇప్పుడు బుల్లితెరపై అగ్రస్థానానికి చేర్చింది. 2012లో మూవీ ఆడిషన్సకు వచ్చిన వినోద్ ఓ చిన్న సినిమాలో చిన్న వేషానికి పరిమితమయ్యాడు. అనంతరం మాటీవీలో కెవ్వుకేక షోలో ఆడ గెటప్లో ఆకట్టుకున్నాడు. జీ తెలుగులో ఫ్యామిలీ సర్కస్, మరో చానల్లో తడాఖా షోలలోనూ లేడీ గెటప్లు వేయాల్సి వచ్చింది. ఇక అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. జబర్దస్త్ ప్రోగ్రాం వినోద్కు మంచి గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం బుల్లితెరపై లేడీ గెటప్లతో వినోద్ విశేషంగా అలరిస్తున్నాడు. మ్యారేజ్ ప్రపోజల్స్ చేస్తున్నారు... తాను పూర్తిగా లేడీ గెటప్లకే పరిమితమయ్యానని, తనను అలా చూడటానికే ఇష్టపడుతున్నారని వినోద్ తెలిపారు. తనకు వినోదిని అనే టైటిల్ను కూడా తగిలించారని తెలిపారు. ఇటీవల ఈ అందమైన అమ్మాయిని చేసుకుంటామంటూ తన తల్లిదండ్రులకు మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా పంపించారని, తీరా ‘ఆమె కాదు అతడు’ అని తెలుసుకొని నాలుక కరుచుకున్న సందర్భాలున్నాయన్నారు. వెంటపడుతున్నారు... చాలా మంది తనను బయట సాధారణ డ్రెస్లో ఉన్నప్పుడు గుర్తుపడుతున్నారని, ఆ సమయంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వినోద్ తెలిపారు. ముఖ్యంగా ఆటోల్లో వెళ్తున్నప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు 100 గెటప్లు... లేడీ గెటప్లతో ఇప్పటి వరకు 100 సీన్లు చేశానని తెలిపారు. చాలా మంది టీమ్ లీడర్లు తన హావభావాలు, యువతిగా వేషధారణలు బాగా నచ్చి భార్యగాను, ప్రియురాలిగాను నటించేందుకు పిలుస్తున్నారని చెప్పారు. ధన్రాజ్తో, చమ్మక్ చంద్రతో చేసిన కాంబినేషన్ బాగా పేరు తీసుకొచ్చాయని వెల్లడించారు. మేకప్కు గంట సమయం... షూటింగ్ ఉన్నప్పుడు లేడీ గెటప్ వేయడానికి సుమారుగా గంట సమయం పడుతున్నదని వినోద్ తెలిపారు. మేకప్మెన్లు, హెరుుర్ స్టైలిస్ట్లు ఇస్తున్న ప్రోత్సాహంతో తనకు మంచి గెటప్లు వస్తున్నాయని చెప్పారు. చీర కట్టుకోవడానికి చాలా సమయం తీసుకుంటున్నదని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మనిషిని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. చదువుకుంటున్నా.. ఇంటర్ వరకు కడపలోనే చదువుకున్నానని, ప్రస్తుతం ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎంబీఏ చదువుతున్నానని వెల్లడించారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయని పేర్కొన్నారు. మగాడిగా కనిపించడం ఇష్టం లేదు.. తాను నిజమైన రూపంలో ఎలా ఉంటానో చాలా మందికి తెలియదని, వారందరినీ అదే ఆతృతలో ఉంచాలన్నదే తన ఉద్దేశం అన్నారు. అందుకే తన ఫొటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతుంటానన్నారు. సినిమాల్లో మంచి అవకాశాలు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. తనకు నాగబాబు, రోజాలతో పాటు టీమ్లీడర్ల ప్రోత్సాహం బాగా ఉందని అందుకే రాణిస్తున్నానని తెలిపారు. -
అభిమాని కుటుంబానికి పవన్ పరామర్శ
-
బావమరిది చేతిలో బావ హతం
కరీంనగర్ : కుటుంబ కలహాల నేపథ్యంలో బావమరిది సొంత బావను హత్య చేశాడు. తన మాటకు ఎదురు చెప్పాడనే కోపంతో బావమరిది ఇత్తడి బకెట్తో దాడి చేయడంతో.. బావ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ఎల్లంబజార్లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోతారం గ్రామానికి చెందిన పిల్లి రమేష్ (33) మామ గారింట్లో జరుగుతున్న ఘర్షణను నివారించేందుకు ఎల్లంబజార్కు వచ్చాడు. ఈ క్రమంలో బావమరిది తీరు నచ్చలేదని చెప్పడంతో.. కోపోద్రిక్తుడైన బావమరిది వినోద్... ఇత్తడి బకెట్తో బావపై దాడి చేశాడు. దీంతో రమేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మీరు చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా?
కాంగ్రెస్పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు నాడు మా 26 మంది ఎమ్మెల్యేల్లో 10 మందిని చేర్చుకోలేదా? రాష్ట్రం వ చ్చాక కూడా కాంగ్రెస్, టీడీపీ కుట్రలు చేశాయి బెర్లిన్ గోడ బద్దలైనట్టు మళ్లీ రెండు రాష్ట్రాలు కలుస్తాయన్నాడు చంద్రబాబు.. ఈ ప్రభుత్వం ఎల్లుండే పడిపోతుందన్నడు భట్టి తెలంగాణకు నీళ్లు వద్దన్న తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ జతకట్టడం ఏం నీతో జానారెడ్డి చెప్పాలి రాష్ట్రం రాజకీ య, ఆర్థిక సుస్థిరత సాధించాలి.. తెలంగాణకు టీఆర్ఎస్సే రక్షణ కవచం మేం పిలవడం లేదు.. అభివృద్ధిని చూసి వారే వస్తున్నారు టీఆర్ఎస్లో చేరిన ఎంపీ గుత్తా, ఎమ్మెల్యేలు భాస్కర్రావు, రవీంద్రకుమార్, కాంగ్రెస్ నేతలు వివేక్, వినోద్ సాక్షి, హైదరాబాద్: ‘‘నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమం కోసం గెలిచిన 26 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 10 మందిని చేర్చుకున్నారు. ఆనాడు లేని నీతి ఇప్పుడెలా గుర్తుకొచ్చింది? సరిగ్గా ఎన్నికల ముందు మా ఎంపీ విజయశాంతిని, ఎమ్మెల్యే అరవిందరెడ్డిని చేర్చుకోలేదా..? మీరు చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా..?’’ అని సీఎం కేసీఆర్ కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. రాష్ట్రం రాజకీయ, ఆర్థిక సుస్థిరత సాధించాలని, తెలంగాణకు రక్షణ కవచం టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టంచేశారు. బుధవారం కాంగ్రెస్కు చెందిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు, దేవరకొండ నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, కాంగ్రెస్ మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ మంత్రి జి.వినోద్, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ నేతలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ గుత్తా మాత్రం టీఆర్ఎస్ కండువా కప్పుకోలేదు. కాంగ్రెస్ నుంచి ఒక జెడ్పీ వైస్ చైర్మన్, ముగ్గురు ఎంపీపీలు, ఆరుగురు జెడ్పీటీసీ సభ్యులు, ఒక మున్సిపల్ చైర్పర్సన్, ఐదుగురు కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ నేతల తీరును తూర్పారబట్టారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. నేను బతికా.. ప్రజలు ఆనందపడ్డరు.. రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో 14ఎఫ్ మార్పిడికి నిరసనగా ఆమరణ దీక్షకు దిగా. కేంద్రం దిగి వచ్చింది. తెలంగాణ ఇచ్చింది. దీక్ష సమయంలో నేను చావాల్సింది.. కానీ చావలేదు. ప్రజలు ఆనందపడ్డరు. అంతకుముందు ఎన్నోసార్లు తెలంగాణ కోసం మేం మూకుమ్మడి రాజీనామాలు చేసి పోటీకి వెళ్తే మాపై పోటీకి వచ్చారు. కానీ ప్రజలు మమ్ముల్నే గెలిపించారు. రాష్ట్రం వచ్చాక కూడా అనేక చర్యలకు పాల్పడ్డరు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే 63 సీట్లలో గెలిచినం. మరో 14 సీట్లలో వెయ్యిలోపు ఓట్ల తేడాతో ఓడిపోయినం. బాబు మామూలు కుట్రలు చేయలే.. తెలంగాణ ప్రకటించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు మామూలు కుట్రలు చేయలేదు. బెర్లిన్ గోడ బద్దలై జర్మనీ ప్రజలు కలసిపోయినట్లు ఏపీ, తెలంగాణ మళ్లీ కలసిపోతయని మాట్లాడిండు. కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అయితే.. ఎల్లుండే ప్రభుత్వం పడిపోతదన్నడు. నేను సీఎంగా బాధ్యతలు తీసుకోక ముందే కుట్రలు చేసిండ్రు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ నాకు ఫోన్ చేసి ఇంటికొచ్చిండు. టీడీపీ, కాంగ్రెస్ ఏకమై టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకుండా కుట్రలు చేస్తున్నయని చెప్పిండు. రాష్ట్రపతి పాలన తెచ్చే కుట్రలు చేస్తున్నరని చెప్పిండు. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇదేందన్నడు. టీఆర్ఎస్కు మద్దతిస్తామని తెల్లారే ప్రకటించిండు. కాంగ్రెస్, టీడీపీ నేతల లక్ష్యం ఒక్కటే.. తెలంగాణ రాష్ర్టం ఏర్పడొద్దు. ఏర్పడితే బతకొద్దు. జానారెడ్డి రాష్ట్రం భ్రష్టు పడుతోందని అంటున్నడు. కాదు కాదు.. కాంగ్రెస్ భ్రష్టు పడుతోంది. కేసీఆర్కు ఒక్కటే నీతి.. తెలంగాణ రాష్ట్రం తన శక్తి మీద తాను నిలబడాలి. రాజకీయ సుస్థిరత, ఆర్థిక సుస్థిరత సాధించాలి. సమైక్యవాదుల కుట్రలకు బలికావొద్దు. బలంగా ఉండాలి. తెలంగాణకు రక్షణ కవచం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. 2019 కంటే ముందే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు అంటడు. చంద్రబాబూ.. ప్రభుత్వం కూలిపోతుందని అనడం ఏం నీతి? అది సక్రమమైన ఆలోచనా? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఉండగానే అట్లెట్ల అంటడు? తెలంగాణకు నీళ్లు వద్దంటడు. పాలేరు ఉప ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ జతకట్టడం ఏ రకమైన నీతో జానారెడ్డి చెప్పాలి. అచ్చంపేట ఎన్నికల్లో అందరూ కలసి కూటమి కడతరు. ఇదేం నీతి? మీరు చేస్తే నీతి.. మేం చేస్తే అవినీతా? అభివృద్ధిని చూసే వస్తున్నారు.. టీఆర్ఎస్లోకి వలస వస్తున్న వారిని మేం పిలవడం లేదు. జరుగుతున్న అభివృద్ధిని చూసి వస్తున్నరు. ఇవి చిల్లర మల్లర రాజకీయ చేరికలు కావు. వీటిని అలా చూడటం లేదు. చాలా మందికి అనుమానాలు, అపోహలు ఉన్నాయి. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సొంత నిర్ణయంతో వచ్చారు. మేం రమ్మన లేదు. ఎమ్మెల్యే భాస్కర్రావు కూడా ఏడాదిన్నరగా మాతో టచ్లో ఉన్నారు. అమ్ముడుపోయారని, కేసీఆర్ కొన్నాడని అంటున్నారు. మాజీ ఎంపీ వివేక్ కేవలం తన తండ్రి కోరిక మేరకే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లారు. వెళ్లే ముందు నాకు చెప్పి వెళ్లారు. మీ పాలనలో మంచి పనులు జరుగుతున్నాయి. కలసి పనిచేస్తానని, మళ్లీ పార్టీలోకి వస్తానన్నారు. సుఖేందర్రెడ్డి, నేనూ ఆప్త మిత్రులం. 1996లోనే శ్రీరాంసాగర్ డ్యామ్పై కూర్చుని తెలంగాణ గురించి ఇద్దరం మాట్లాడుకున్నాం. ఆంధ్రా ప్రాంతానికి నీళ్లు తీసుకుపోయే నాగార్జున సాగర్ వైష్ణవాలయంలా ఉంటే.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు శివాలయంలా ఉందన్న. ఏపీలో ఉన్నన్ని రోజులు తెలంగాణకు న్యాయం జరగద ని ఆ రోజే చెప్పిన. 2001లో నేనే ఉద్యమం మొదలు పెట్టా. తెలంగాణది వందేళ్ల దుఃఖం. సమైక్య రాష్ట్రంలో చేరి కష్టాలు పడ్డాం. ఇప్పుడు ప్రతి పేద కుటుంబానికి మేలు చేస్తాం. పేదరికాన్ని రూపుమాపుతం. 2019లోగానే కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తం. సాదా బైనామాల రిజిస్ట్రేషన్కు గడువు పొడిగింపు ఈ సమావేశానికి వచ్చే ముందే సీసీఎల్ఎతో మాట్లాడా. సాదా బైనామాల రిజిస్ట్రేషన్లకు డిమాండ్ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సాదా బైనామాలకు సంబంధించి 6 లక్షల మంది ఆర్వోఆర్ పట్టాలు పొందారు. మరో వారం రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగిస్తున్నాం. చరిత్రలో ఎవరూ ఈ ఆలోచన చేయలేదు. దీంతోపాటు హైదరాబాద్లో పేదలకు ఇప్పటికే లక్ష మందికి పట్టాలిచ్చాం. తెలంగాణ సమాజాన్ని సుస్థిరం చేయడమే మా లక్ష్యం. నేను మళ్లీ చెబుతున్నా.. టీఆర్ఎస్కు ప్రజలే బాసులు. సొల్లు కబుర్లు వద్దు. నిర్మాణాత్మక సలహాలివ్వండి. కేసీఆర్ను తిడితే ఏం జరగదు. 2019లోనూ గెలిచేది కూడా టీఆర్ఎస్సే. -
‘ఎన్ఆర్ఐలు తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలి’
వర్జీనియా: అమెరికాలోని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐలు తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్ అన్నారు. వర్జినియాలోని అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్తో పాటు ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యరు. ఈ సందర్భంగా ఎంపీ వినోద్కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్నారని, ముఖ్యంగా అమెరికాలోని వివిధ స్టేట్స్లో ఉంటున్న ఎన్ఆర్ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెడితే రాయితీలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికా తెలంగాణ సంఘం అధ్యక్షుడు రాంమోహన్, ప్రధాన కార్యదర్శి రవి, కోశాధికారి శ్రీనివాస్, బోర్డు సభ్యులు అరవింద్, చందు, మాదవరావు, ప్రకాశ్, నరేందర్రెడ్డి, రఘువీర్, శంకర్, శ్రీధర్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
కశ్మీర్ కథాంశంగా విధు వినోద్ చోప్రా సినిమా
ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ హిట్ను సాధించి.. ఎంతో ప్రేక్షకాదరణ పొందిన 'త్రీ ఇడియట్స్', 'పీకే' వంటి ప్రముఖ సినిమాల నిర్మాత.. విధు వినోద్ చోప్రా మరో ప్రత్యేక కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తన కొత్త చిత్రానికి కశ్మీర్ను కథాంశంగా ఎంచుకున్నఆయన... నూతన తన ప్రాజెక్టుపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్తో చర్చించారు. నిజానికి తన జీవితంలో ఎక్కువ భాగాన్ని జమ్మూ కశ్మీర్లోనే గడిపానని, పాఠశాల, కళాశాల విద్యను శ్రీనగర్లోనే పూర్తి చేశానని చోప్రా తెలిపారు. అందుకే ముఖ్యంగా కశ్మీరీ పండిట్ కమ్యూనిటీ దురవస్థ నేపథ్యాన్ని వర్ణిస్తూ చోప్రా చలనచిత్ర నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంలో చోప్రా, అతని సభ్యులు చెప్పిన విషయాలను ఎంతో ఓపిగ్గా విన్న మంత్రి జితేంద్ర సింగ్.. ప్రాజెక్టులోని ప్రధానాంశాలను క్లుప్తంగా ఓ నోట్ రూపంలో అందజేయాలని కోరారు. అంతేకాక ప్రభుత్వం నుంచి వారు కచ్చితంగా ఏం కావాలని కోరుకుంటున్నారో కూడా వివరంగా తెలపాలని సూచించారు. -
బంగారం వ్యాపారి మ్రుతి
-
విచారిస్తుండగా భవనంపై నుంచి దూకేశాడు!
-
విచారిస్తుండగా భవనంపై నుంచి కిందికి దూకేశాడు!
విజయవాడ: పోలీసుల అదుపులో ఉన్న ఓ వ్యక్తి మూడో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. విజయవాడలోని వన్టౌన్లో మూడో అంతస్తులో విచారిస్తుండగా వినోద్ అనే అనుమానితుడు భవనంపై నుంచి కిందికి దూకేశాడు. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం నిందితుడు వినోద్ మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఓ చోరీ కేసులో రెండు రోజుల కింద అనుమానంతో వినోద్ను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
‘త్రీ రోజెస్’ ఆదరణ పొందుతుంది
సీనియర్ నటుడు వినోద్ గజపతినగరం: జెడ్పీటీసీ మాజీ సభ్యులు గార తవుడు నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘త్రీ రోజెస్’ ప్రేక్షకాదరణ పొందుతుందని సీనియర్ నటులు ఆరిశెట్టి వినోద్ తెలిపారు. ఈ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన కాసేపు విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... నేను 1981లో కీర్తి, కాంత, కనకం సినిమాతో సినీ రంగప్రవేశం చేశా. మొదటి సినిమాకే మూడు నేషనల్ అవార్డులు దక్కాయి. ఇంత వరకు తాను మూడు వందల తెలుగు సినిమాలు, 30 తమిళ సినిమాలు, నాలుగు హిందీ సినిమాలు చేశాను. ముప్పై టీవీ సీరియళ్లలో కూడా నటించాను. అన్ని పాత్రలు వేయడం వల్ల జనాదరణ లభించింది. తెలుగు సినిమాల్లో చంటి, నల్లత్రాచు, లారీ డ్రైవర్, ఇంద్ర, నరసింహనాయుడు, భైరవద్వీపం నాకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ప్రస్తుతం మహేష్బాబు నటిస్తున్న బ్రహ్మోత్సవం చిత్రంలో నటిస్తున్నాను. సీవీ రెడ్డి డెరైక్షన్లో దివంగత నేత వైఎస్ఆర్ పాత్ర పోషించడం ఎన్నటికీ మరిచిపోలేను. -
ఆ యువకుడు ఏమయ్యాడో ?
రేణిగుంట : రేణిగుంటలో ఓ ఎలక్ట్రికల్ దుకాణం యజమాని వినోద్(24) రోడ్డు ప్రమాదానికి గురై ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. ఏర్పేడులో నివాసముంటున్న అతను రేణిగుంటలో మంగళవారం రాత్రి దుకాణం మూసి ఏర్పేడుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యంలోని గురవరాజపల్లె సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అయితే అతను ఏమయ్యాడో అంతుచిక్కలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
చైన్ స్నాచర్ అనుకుని దేహశుద్ధి..
పంజగుట్ట: మద్యం మత్తులో ఓ యువకుడు మహిళపై చెయ్యి వేయడంతో అక్కడి స్థానికులు చైన్స్నాచర్ అని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాలివీ.. వరంగల్ జిల్లా జనగామకు చెందిన వినోద్ అనే యువకుడు అతిగా మద్యం సేవించి శనివారం రాత్రి సుమారు 8:15 ప్రాంతంలో అమీర్పేట బిగ్ సీ వద్ద వాహనం ఆపుకుని నిలబడ్డాడు. రోడ్డుపై అటుగా వెళుతున్న ఓ యువతిని చేయిపట్టుకునేందుకు యత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అక్కడే ఉన్న కొందరు స్థానికులు చైన్స్నాచింగ్ చేసేందుకు యత్నించాడనుకుని, అతడిని చితకబాదారు. అనంతరం పంజగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వినోద్ను అదుపులోకి తీసుకుని మద్యం లెవల్ తెలుసుకునేందుకు ఆసుపత్రికి తరలించారు. ఇదిలాఉండగా, వినోద్పై బాధిత యువతి ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకుండానే వెళ్లిపోయింది. -
అవినీతి ఆరోపణల్లోమహారాష్ట్రసర్కార్
-
రెండో పెళ్లి తప్పింది.. తొలి పెళ్లి అయ్యింది
తాండూరు (రంగారెడ్డి): భార్య ఉండగానే ఓ ప్రబుద్ధుడు రెండో పెళ్లికి సిద్ధమవటం.. తీరా తాళి కట్టే సమయానికి మొదటి భార్య రావటం.. పెళ్లి ఆగిపోవటం.. ఏం చేయాలో తోచక వేరే వ్యక్తికి వధువునిచ్చి పెళ్లి చేయటం.. చూస్తే ఏదో సినిమా జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేస్తుందిగా.. ఈ పెళ్లి. సరిగ్గా ఓ పెళ్లిలో ఇదే జరిగింది. శుక్రవారం తాండూరు పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ మండలం రాంపల్లికి చెందిన మంజులకు 1989లో వినోద్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. రెండేళ్ల తరువాత ఇద్దరూ విడిపోయారు. తరువాత 2004 సంవత్సరంలో లంగర్హౌస్కు చెందిన తన మేనమామ కొడుకు గాజర్ల కిరణ్వర్మను పెళ్లి చేసుకున్నారు. తరువాత సేల్స్ రి్రపజెంటేట్గా పనిచేసే కిరణ్వర్మ, మంజుల ఇద్దరు కొంతకాలం విశాఖపట్నంలో నివసించారు. రెండేళ్ల క్రితం ఇద్దరు హైదరాబాద్కు వచ్చారు. తాజాగా తాండూరు పట్టణానికి చెందిన ఓ అమ్మాయితో తెలిసిన వారి ద్వారా కిరణ్వర్మ పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. తనకు ఇదివరకే పెళ్లి జరిగిన విషయాన్ని దాచిపెట్టాడు. శుక్రవారం ఉదయం 11.15 గంటలకు మంచి ముహూర్తం ఉందని, అదే ముహూర్తానికి పెళ్లి చేయాలని ఒత్తిడి తెచ్చాడు. వరకట్నం కింద రూ.లక్ష నగదు, నాలుగు తులాల బంగారం ఇతర కానుకలు మాట్లాడుకున్నారు. వధువు తరఫున కుటుంబ సభ్యులు స్థానిక దేవాలయంలో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్న సమాచారం తెలుసుకున్న మంజుల గురువారం రాత్రే కీసర పోలీసుస్టేషన్కు వెళ్లి వివరాలు తెలిపింది. మంజుల తన తండ్రి రాజేశ్వరరావు, సోదరుడు బాల్రాజ్లతో కలిసి తాండూరుకు రాత్రి చేరుకున్నారు. శుక్రవారం ఉదయమే మంజుల పోలీసుస్టేషన్కు వెళ్లి తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని, ఆధార్కార్డు, ఫొటోలు తదితర ఆధారాలు పోలీసులకు చూపించింది. పోలీసులు వధువు తరఫు వారికి జరిగిన విషయం తెలపడంతో మొదట షాక్ తిన్నారు. పోలీసులు రంగం ప్రవేశం చేసి, కిరణ్వర్మను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్కు తరలించారు. వరుడి తరఫున వచ్చిన కొందరు దగ్గర బంధువులు మినహా అందరూ అక్కడి నుంచి ఫలాయనం చిత్తగించారు. ఈ మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్టు సీఐ చెప్పారు. అనంతరం రెండో పెళ్లి తప్పిపోవడంతో వధువు కుటుంబ సభ్యులు సంతోషపడ్డారు. కూతురు పెళ్లి ఆగిపోవద్దని భావించి కొన్ని గంటల వ్యవధిలో గతంలో అనుకున్న బంధువుల అబ్బాయికిచ్చి పెళ్లి జరిపించారు. మంజులను పెళ్లి చేసుకోలేదు: కిరణ్వర్మ తన భార్యగా చెప్పుకుంటున్న మంజులను నేను పెళ్లి చేసుకోలేదు. ఆమెతో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాను. సేల్స్ రిప్రజంటేటీవ్గా పని చేస్తూ విశాఖపట్నంలో ఇద్దరు కలిసి నివసించాం. సుమారు రెండేళ్ల క్రితమే హైదరాబాద్కు వచ్చాం. -
ఆంధ్రావాళ్లపై దాడులు జరగలేదు: ఎంపీ వినోద్
న్యూఢిల్లీ: తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్లపై ఎలాంటి దాడులు జరగలేదని ఎంపీ వినోద్ అన్నారు. గురువారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో ఎవరిపైనా అక్రమ దాడులు కానీ.. ఉద్దేశపూరిత దాడులు కానీ జరగలేదని వినోద్ అన్నారు. అదే విధంగా సెక్షన్ - 8ను అమలు చేయాల్సిన అవసరం లేదని ఎంపీ వినోద్ చెప్పారు. -
'పునర్వ్యవస్థీకరణ సమగ్ర బిల్లును లోక్ సభలో పెట్టాలి'
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఖమ్మంలోని ఏడు మండలాల ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని టీఆర్ ఎస్ ఎంపీ వినోద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి గడిచిన ఏడాది వ్యవధిలో రెండు సవరణలు చేశారని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన లోక్ సభలో మాట్లాడుతూ...చీటికీ మాటికీ చట్టంలో సవరణలు చేయకుండా లోపాలను సవరించి సమగ్ర బిల్లును సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఖమ్మంలోని ఏడు మండలాల ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత పునర్విభజన బిల్లుకు టీఆర్ ఎస్ పార్టీ పూర్తిగా మద్దతిస్తోందన్నారు. -
ఉద్యోగాల పేరిట ఘరానా మోసం
హైదరాబాద్ : ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేసి, మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని గురువారం ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు...ఒంగోలు జిల్లాకు చెందిన వినోద్ కుమార్ అనే వ్యక్తి దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి నిరుద్యోగుల నుంచి సుమారు రూ.15 లక్షలు వసూలు చేశాడు. ఎన్ని రోజులైనా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు నిలదీయగా నిందుతుడు తప్పించుకు తిరిగాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వినోద్ కుమార్ పై నిఘా వేసిన సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతని నుంచి కంప్యూటర్, ప్రింటర్, నకిలీ నియామక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. -
'33 శాతం రిజర్వేషన్ కల్పించినప్పుడే మహిళా సాధికారత'
కరీంనగర్: రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అవుతుందని టీఆర్ ఎస్ ఎంపీ వినోద్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మాట్లాడుతూ..చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. పురుషులతో సమానంగా మహిళలకు టీఆర్ఎస్ లో సభ్యత్వం కల్పిస్తామని తెలంగాణ టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు తుల ఉమ పేర్కొన్నారు. -
పెళ్లి రద్దు.. అమ్మాయి కిడ్నాప్
*యువతి అపహరణకు దుండగుల యత్నం *సకాలంలో స్పందించిన పోలీసులు *వాహనాల్లో వెంబడించి పట్టుకున్న వైనం * సుమారు రెండు గంటల పాటు హైడ్రామా హైదరాబాద్ : కొంపల్లి సమీపంలోని ఉమామహేశ్వర కాలనీ. శుక్రవారం ఉదయం ఓ యువతి (19) ఇంట్లో టైలరింగ్ చేస్తోంది. ఇంతలో ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. ఆమెను బలవంతంగా ఇండికా కారులో ఎక్కించుకొని బయలుదేరారు. ఈ హఠాత్పరిణామంతో ఆందోళన చెందిన యువతి 'కాపాడండి' అంటూ కేకలు వేసింది. ఈ కేకలు విని స్థానికంగా ఉన్న రవీందర్, ప్రవీణ్, శ్రీను ద్విచక్ర వాహనాలతో కారును వెంబడించారు. కొంపల్లి సినీ ప్లానెట్ వరకు వీరు కారును అనుసరించారు. కారు దూలపల్లి మీదుగా మళ్లింది. ఇంతలో మల్లారెడ్డి కాలేజీ వద్ద పేట్ బషీరాబాద్ పెట్రోల్ మొబైల్-2 టీమ్ పోలీసులు ఎదురవడంతో యువకులు వారికి విషయాన్ని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సీఐ అల్లం సుభాష్చంద్ర బోస్కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కారును వెంబడించారు. కారు వెళ్లే దారిలోని పోలీసు స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో జిన్నారం వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేసి... కారును ఆపే ప్రయత్నం చేశారు. దుండగులు దాన్ని వాహనంతో ఢీ కొట్టి వెళ్లిపోయారు. నర్సాపూర్ సీఐ రాంరెడ్డి అనేక చోట్ల రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేయించినా ఫలితం కనిపించలేదు. పోలీసులు తమను వెంబడిస్తున్నారని తెలుసుకున్న నిందితుడు వినోద్ నర్సాపూర్ సమీపంలో యువతిని తీసుకుని కారు నుంచి దిగిపోయాడు. షేరింగ్ ఆటోలో వెళ్లి పోలీసుల దృష్టి మరల్చాడు. ఇలా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టారు. కారులోని నిందితులకు తోడుగా స్కార్పియో (ఏపీ 27 బి 9900) వాహనంలో వెళుతున్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి ద్వారా నిందితుల సమాచారాన్ని సేకరిస్తూ.. ముందుకు సాగారు. ఈ క్రమంలో సంగారెడ్డి మీదుగా పటాన్చెరువు చేరుకున్న నిందితులు యువతిని వదిలి పరారయ్యారు. ఎట్టకేలకు మధ్యాహ్నం రెండు గంటలకు యువతిని తీసుకొని పోలీసులు తిరుగుముఖం పట్టారు. దీంతో కథ సుఖాంతమైంది. యువతి తల్లి విద్యావతి బోరున విలపిస్తూ కుమార్తెను హత్తుకుంది. అంతవరకూ ఉత్కంఠతో గడిపిన యువతి తల్లిదండ్రులు... బంధువులు... స్థానికులు...ఊపిరి పీల్చుకున్నారు. అసలేమైందంటే... ఈ సంఘటన కు కారణాలపై పేట్బషీరాబాద్ ఏసీపీ అశోక్కుమార్, సీఐ అల్లం సుభాష్ చంద్రబోస్ల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా నారాయణఖేడ్ కంగిటి మండలం తుర్కపాడ్గవ్ గ్రామానికి చెందిన అడిక రమేష్, విద్యావతి దంపతులు కొంపల్లి సమీపంలోని ఉమా మహేశ్వర కాలనీలో ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె (19)కు బీదర్ సమీపంలో ఉన్న మార్చాపూర్ గ్రామానికి చెందిన దూరపు బంధువు వినోద్(27)తో పెళ్లి చేయాలని ఏడాది క్రితం నిశ్చయించారు. ఇంతలో తాగుడుకు అలవాటు పడిన వినోద్ వ్యవహర శైలి యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. దీపావళి పండుగ రోజు యువతి తల్లిదండ్రులు వినోద్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి 'పెళ్లి సంబంధం వద్దు.. వేరే అబ్బాయితో తమ కుమార్తె వివాహం చేస్తామ' ని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు రమేష్, విద్యావతి పనులకు... వారి కుమారుడు కళాశాలకు వెళ్లిపోయాడు. యువతి మాత్రమే ఇంట్లో ఉంది. దీన్ని గుర్తించిన దుండగులు పథకం ప్రకారం ఆమెను అపహరించేందుకు యత్నించారు. తాగుబోతు అని వద్దనుకున్నాం.. 'స్వయానా ఆడబిడ్డ కోడలి తమ్ముడే వినోద్. ఏడాది క్రితం పెళ్లి కోసం మాట్లాడుకున్నాం. తాగుబోతు అని తెలిసి వద్దనుకున్నాం. ఇంతకు తెగిస్తాడని అనుకోలేదు. మళ్లీ వాళ్లు ఏమైనా చేస్తారేమోనని భయమేస్తో'దంటూ యువతితల్లి విద్యావతి ఏసీపీ అశోక్కుమార్ వద్ద వాపోయింది. కొనసాగుతున్న గాలింపు మొత్తం రెండు కార్లలో వచ్చిన వారిలో నలుగురు పోలీసులకు చిక్కగా.... ప్రధాన నిందితుడు వినోద్తో పాటు మరో ముగ్గురు పరారయ్యారు. వీరి కోసం పోలీసులు రెండు బృందాలుగా గాలిస్తున్నట్లు సీఐ అల్లం సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సకాలంలో స్పందించిన ఎస్ఐలు అశోక్, కోటేశ్వరరావుతో పాటు మొబైల్ టీమ్ సిబ్బందిని ఏసీపీ అశోక్కుమార్ అభినందించారు. -
కవితకు పోచారం, వినోద్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ కవిత నగరంలోని యశోదా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆమె మంగళవారం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. జలుబు, దగ్గుకు తోడు బుధవారం జ్వరం కూడా రావడంతో రక్తనమూనాలను పరీక్షల కోసం పంపారు. మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, కరీంనగర్ ఎంపీ బి.వినోద్కుమార్ ఆమెను పరామర్శించారు. కవిత ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమెకు వైద్యసేవలందిస్తున్న డాక్టర్ ఎం.వి.రావు తెలిపారు. -
చెవిలో గుయ్ఁ మని ఒకటే హోరు..?
నా వయసు 30 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా చెవిలో విపరీతమైన శబ్దం వస్తోంది. ఏ పనీ చేయలేకపోతున్నాను. రాత్రి సమయాల్లో హోరు ఎక్కువగా ఉంటోంది. వైద్యులను సంప్రదిస్తే నరాల బలహీనత ఉంది అని కొన్ని మందులు ఇచ్చారు. కానీ అంతగా ఫలితం లేదు. ఈ సమస్యతో ఉద్యోగం సరిగా చేయలేకపోతున్నాను. నాకు హైబి.పి కూడా ఉంది. ఏమవుతుందోనని భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం తెలియచేయగలరు. - ఎస్. వినోద్, హైదరాబాద్ మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీ సమస్యను‘టినైటస్’ అంటారు. ఇలా చెవిలో శబ్దాలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. టినైటస్ చాలా వరకు వినికిడికి సంబంధించిన వ్యవస్థలోని లోపాల వల్ల వస్తుంది. చెవిలో ఇన్ఫెక్షన్లు ఒటోస్ల్కెరోసిస్ వంటి కారణాల వల్ల కూడా వస్తుంది. వీటితోపాటుగా వినికిడి వ్యవస్థలోని లోపలి భాగమైన కాక్లియా సంబంధిత భాగాలకు రక్తసరఫరా సరిగా జరగకపోవడం, వినికిడి నరంలో లోపం, కాక్లియాకు సంబంధించిన ఇతర లోపాల వలన కూడా టినైటస్ రావచ్చు. మీకు అధిక రక్తపోటు ఉందంటున్నారు కాబట్టి వాస్కులర్ సిస్టమ్లో లోపాల వలన కూడా మీకు ఈ సమస్య వచ్చి ఉండవచ్చు. మీరు వెంటనే నిపుణులైన ఇ.ఎన్.టి వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు ఆడియాలజిస్టునూ, న్యూరాలజిస్టునూ సంప్రదించి వారి సలహా మేరకు వినికిడి పరీక్షలు చేయించుకోండి. సాధారణంగా మీకు టినైటస్ ప్రశ్నావళి, లిపిడ్ ప్రొఫైల్, ఎం.ఆర్ఐ (బ్రెయిన్, ఐఎసి) మొదలైన పరీక్షలు (అన్నీ కాని లేదా వీటిలో కొన్ని) అవసరం కావచ్చు. స్వయంగా పరీక్షించిన డాక్టరు సూచన మేరకు చేయించుకున్న పరీక్షల నివేదిక ఆధారంగా మీ సమస్య పట్ల కచ్చితంగా ఒక నిర్ధారణకు రావచ్చు. ఆ తర్వాత మీకు చికిత్స పట్ల ఒక అవగాహన కలుగుతుంది. ఈ సమస్య మందులతో నయమవుతుంది. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. చాలామందికి టినైటస్ రీ ట్రైనింగ్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా ఉపయోగం ఉంటుంది. వినికిడి లోపం ఉన్న వారికి వినికిడి మిషన్ల ద్వారా ఉపశమనం కలుగుతుంది. - డాక్టర్ ఇ.సి. వినయ్కుమార్, ఇ.ఎన్.టి. నిపుణులు -
అయూబ్దే పైచేయి
హెచ్సీఏ అధ్యక్ష ఎన్నికల్లో వినోద్పై విజయం కార్యదర్శిగా జాన్ మనోజ్ ఎన్నిక సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఎన్నికల్లో మాజీ క్రికెటర్ అర్షద్ అయూబ్ ప్యానెల్ జయభేరి మోగించింది. ఏకపక్షంగా సాగిన ఎన్నికల్లో అయూబ్ వర్గం... జి. వినోద్ టీమ్ను చిత్తు చేసింది. అయూబ్ 58 ఓట్ల తేడాతో వినోద్ను ఓడించి రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయూబ్కు 133 ఓట్లు రాగా, వినోద్కు 75 ఓట్లు మాత్రమే పడ్డాయి. కార్యదర్శిగా అయూబ్ వర్గానికే చెందిన జాన్ మనోజ్ ఎన్నికయ్యారు. జాన్ మనోజ్ (119) 30 ఓట్ల తేడాతో ఎస్. వెంకటేశ్వరన్ (89)పై గెలుపొందారు. మొత్తం ఆఫీస్ బేరర్ పదవులన్నింటినీ అయూబ్ వర్గమే గెలుచుకోవడం విశేషం. ఉపాధ్యక్షుడిగా పోటీ చేసిన బీసీసీఐ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎంవీ శ్రీధర్ కూడా పరాజయం పాలయ్యారు. -
మూత్ర విసర్జన చేశాడని కొట్టి చంపాడు....
-
మూత్ర విసర్జన చేశాడని కొట్టి చంపాడు....
కర్నూలు : కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్ద హోతూరులో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిని ఇంటి యజమాని కొట్టి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తమ ఇంటి ఆవరణలో మూత్ర విసర్జన చేశాడనే కోపంతో ఇంటి యజమాని చిన్న తిప్పన్న ఈ ఘతుకానికి పాల్పడ్డాడు. బాలుడి తల్లిదండ్రుల ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే చిన్న తిప్పన్న, గంగాధర్ కుటుంబాలు పక్క పక్కనే నివాసం ఉంటున్నాయి. అయితే వీరి ఇరు కుటుంబాల మధ్య వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గంగాధర్ కుమారుడు వినోద్ ....చిన్నకుట్టి ఇంటి ఆవరణలో మూత్ర విసర్జన చేశాడు. ఈ విషయాన్ని గమనించిన అతడు ఆగ్రహంతో వినోద్ చెంపమీద బలంగా కొట్టడంతో చిన్నారి అక్కడికక్కడే పడిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో తల్లిదండ్రులు వినోద్ మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. చిన్న పిల్లాడు తెలియక చేసిన పొరపాటు చేశాడని, దీనిపై ప్రాణాలు తీయటం సరికాదని, మృతుని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హెచ్సీఏ ఎన్నికల్లో రాజుకున్న వేడి
హెచ్సీఏ ఎన్నికల్లో రాజుకున్న వేడి అధ్యక్ష బరిలో వినోద్, అర్షద్ ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రారంభమైన ప్రచారం అప్పుడే మొదలైన ప్రలోభాల పర్వం సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో హెచ్సీఏ మాజీ అధ్యక్షులు గడ్డం వినోద్, అర్షద్ అయూబ్ల ప్యానెళ్లు ఎన్నికల సంగ్రామంలో నిలిచాయి. ఈ రెండు ప్యానెళ్ల వారు సమరానికి సై అంటున్నారు. అప్పుడే ప్రచారాన్ని మొదలు పెట్టడమే కాదు ప్రలోభాల పర్వానికి తెరలేపాయి. అంతకుముందు పలువురు సభ్యులు శిబిరాలను మారడంతో ఆయా ప్యానెళ్లను ఉత్కంఠకు గురిచేశాయి. ఓటరు జాబితాలోనూ గందరగోళం నెలకొనడంతో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. 2014-16 కాలానికి గాను హెచ్సీఏ ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 7న జరిగే పోలింగ్లో గుర్తింపు పొందిన క్లబ్బుల సభ్యులు, అసోసియేషన్ల ప్రతినిధులు ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నిక ల్లో అధ్యక్ష పదవి మొదలుకుని కోశాధికారి వరకు ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున పోటీ పడుతున్నారు. కార్యవర్గ సభ్యుల పోస్టులు పన్నెండుకు గాను మొత్తం 25 మంది తలపడుతున్నారు. ఆదివారం అభ్యర్థుల తుది జాబితాలు ప్రకటించటంతో ఆ రెండు ప్యానెళ్ల వారు అమీతుమీకి దిగారు. కాగా నామినేషన్ల ఉపసంహరణకు ముందు అర్షద్ శిబిరంలోని వారు వినోద్ వైపు, వినోద్ శిబిరంలోని వారు అర్షద్ శిబిరాల వైపు మారిపోవడంతో చివరి వరకు హైడ్రామా నెలకొంది. ఈ ఎన్నికలకు హెచ్సీఏ మాజీ కార్యదర్శి శివలాల్ దూరంగా ఉన్నారు. శిబిరాలుగా విడిపోయిన క్లబ్బులు.. ఓటు హక్కు కలిగిన క్లబ్బులు రెండు విడిపోయాయి. హెచ్సీఏలో బల్క్ క్లబ్బు (ఒక్కరి చేతిలో ఎక్కువ క్లబ్బులు)లకు చెందిన వారు అత్యధికంగా అర్షద్ అయూబ్ ప్యానెల్లో వివిధ పదవులకు పోటీ పడుతుండగా, ప్రభుత్వ రంగ సంస్థలు, స్కూళ్లు, బ్యాంకులు(ఇన్స్టిట్యూషన్స్)తో పాటు స్వతంత్రంగా వ్యవహరిస్తున్న క్లబ్బుల ప్రతినిధులు వినోద్ ప్యానెల్ తరఫున వివిధ పదవుల కోసం బరిలోకి దిగారు. మొత్తం 216 క్లబ్లు ఉన్నాయి. ఒక్కో క్లబ్కు ఒక ఓటు ఉంటుంది. ఇందులో 55 మంది ఓటర్లు బల్క్గా, మరో 55 మంది వివిధ సంస్థలకు చెందిన వారు ఉన్నారు. కాగా మిగిలిన వారంతా వ్యక్తిగతంగా వ్యవహరించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా వ్యవహరించే ఓటర్లు ఎటువైపు మొగ్గితే వారు ఎన్నికల్లో గెలిచే అవకాశాలున్నాయి. ఆదివారం నుంచి స్వయంగా రంగంలోకి దిగిన ఇరు ప్యానెళ్ల ప్రతినిధులు.. ‘మీకేం కావాలన్నా సమకూరుస్తాం’ అంటూ ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో మునిగిపోయారు. ఫతేమైదాన్ క్లబ్ ఓటుపై అభ్యంతరం.. మాజీ మంత్రి వినోద్ శిబిరం నుంచి హెచ్సీఏ ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న శేష్నారాయణ ప్రాతినిధ్యంపై ఫతేమైదాన్ క్లబ్ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పలు కారణాలతో శేష్నారాయణ సభ్యత్వాన్ని సస్పెండ్ చేశామని చెబుతున్నారు. ఫతేమైదాన్ క్లబ్ నుంచి ఆయన స్థానంలో మరొకరిని ఓటరుగా అనుమతించాలని ఆ క్లబ్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. ఓటరు జాబితాలో వింతలెన్నో... హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఓటర్ల జాబితాలో ఎన్నో వింతలు వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో క్రికెట్ కోసం కృషి చేస్తున్న క్లబ్లకు ఇప్పటివరకు గుర్తింపు ఇవ్వకుండా కేవలం పదిమంది చేతుల్లోనే నగరంలో మెజారిటీ క్లబ్లు చేరిపోయాయన్న ఫిర్యాదులున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి మినహా తెలంగాణలోని మిగతా ఎనిమిది జిల్లాల నుంచి కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది. పలు జిల్లాలకు ఓటు హక్కు ఉన్నట్టు ఓటరు జాబితా చూపుతున్నా, వాటి ప్రతినిధులుగా రాజధానికి చెందిన వారే కావడం గమనార్హం. హెచ్సీఏ గుర్తింపు పొందిన క్లబ్బులు,అసోసియేషన్లే సెప్టెంబర్ 7న జరిగే ఎన్నికల్లో నూతన కమిటీ (2014-16)ని ఎన్నుకోనున్నాయి. కలకలం రేపిన ఏసీబీ నోటీసులు హెచ్సీఏ ఎన్నికలు ఓ వైపు రసవత్తరంగా మారగా మరో వైపు అవినీతి నిరోధక శాఖ సైతం తమ విచారణను ముమ్మరం చేసింది. వారం రోజుల క్రితం హెచ్సీఏ మాజీ అధ్యక్షులు అర్షద్ అయూబ్, మాజీ కార్యదర్శి శివలాల్తోపాటు అప్పటి కార్యవర్గంలో ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేసింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్మాణాల్లో అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలపై నోటీసులు జారీ అయ్యాయి. స్టేడియం నిర్మాణ వ్యయం పెంపు, స్టేడియం రూఫ్(కనోపీ) నిర్మాణంలో నాణ్యత లేమి, మహబూబ్నగర్లో స్టేడియం కోసం అధిక ధరకు భూమిని కొనుగోలు, కార్పొరేట్ బాక్స్ల అమ్మకంలో కమీషన్ వ్యవహారం, కమర్షియల్ ట్యాక్స్ ఎగవేత, టెండర్లు లేకుండా పనుల అప్పగింత తదితర మొత్తం పది అంశాలపై ఏసీబీ కేసు నమోదు చేసి దాదాపు విచారణను సైతం పూర్తి చేసింది. అప్పట్లో హెచ్సీఏ బాధ్యతల్లో ఉన్న అర్షద్ అయూబ్, శివలాల్, చలపతితోపాటు మొత్తం కార్యవర్గం వారం రోజుల్లో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు వారం రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు. ఆయా స్థానాలకు బరిలో మిగిలింది వీరే... అధ్యక్షుడు (పదవి-1): జి.వినోద్, అర్షద్ అయూబ్ ఉపాధ్యక్షులు (పదవులు-5): ఎంవీ శ్రీధర్, జి. వివేకానంద్, కిషన్ రావు, ఇ. వెంకట్రామ్రెడ్డి, నరేందర్గౌడ్, యాదగిరి, ప్రకాశ్చంద్ జైన్, సురేందర్ అగర్వాల్, మొయిజుద్దీన్, శేష్ నారాయణ్. కార్యదర్శి (1): ఎస్. వెంకటేశ్వరన్, జాన్మనోజ్ సంయుక్త కార్యదర్శులు (2): పురుషోత్తం అగర్వాల్, జెరార్డ్ కార్, విజయానంద్, బస్వరాజు కోశాధికారి (1): నరేశ్ శర్మ, దేవరాజ్ ఈసీ సభ్యులు (12): ఛాతిరి బాబూరావు, అద్నాన్ మెహమూద్, ఫారూఖ్, అరుణ్ కుమార్, నర్సింహారెడ్డి, జగ్గూలాల్, చిట్టి శ్రీధర్, మహేంద్ర, శ్రీనివాసరావు, పి.శ్రీధర్, వాల్టర్స్, సూర్యప్రకాశ్, దల్జీత్ సింగ్, భాస్కర్, అనిల్ కుమార్, రాజన్ సింగ్, రమణ, శ్రీనివాస చక్రవర్తి, లక్ష్మీకాంత్ రాథోడ్, వంకా మహేందర్, మనోహర్రెడ్డి, విక్టర్ అమల్ రాజ్, జి. శ్రీనివాస రావు, విక్రమ్ మాన్సింగ్, శ్రీనివాస్రెడ్డి. -
ఫీజు రీయింబర్స్మెంట్పై అఖిలపక్షం
-
ఫీజు రీయింబర్స్మెంట్పై అఖిలపక్షం
నేడు పార్టీల ఫ్లోర్లీడర్లతో సీఎం కేసీఆర్ సమావేశం హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు విధివిధానాలు చర్చించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం ఆరుగంటలకు అసెంబ్లీ సీబ్లాక్లోని కాన్ఫరెన్స్హాల్లో జరిగే ఈ సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన ఫ్లోర్లీడర్లకు ఆహ్వానం పంపారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ఉన్నత విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్నా.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్పై స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ తొలి శాసనసభ సమావేశాల్లో విపక్షాలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. ‘ఇక్కడ చదువుకునే ఆంధ్ర విద్యార్థులకు మన మెందుకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయా’లని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో పేర్కొన్నారు. ఉమ్మడి ప్రవేశాలు జరిగే సంస్థల్లో తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయడం, అందుకు అవసరమైన సాంకేతిక కసరత్తు.. ప్రాథమిక సమాచార సేకరణ తదితర అంశాలు సోమవారం నాటి అఖిల పక్ష సమావేశంలో చర్యకు రానున్నాయి. గత సంవత్సరానికి సంబంధించి కూడా కళాశాలలకు వెయ్యి కోట్ల రూపాయల మేరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఈ బకాయిల పరిస్థితిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సమీక్షలతో కేసీఆర్ బిజీబిజీ సీఎం కేసీఆర్ అదివారం బిజిబిజీగా గడిపారు. ఉదయం నుంచే వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీ వినోద్లతో పలు అంశాలపై చర్చించారు. మధ్యాహ్నం అపోలో ఆసుపత్రి అధినేత ప్రతాప్ సి రెడ్డి ఇంటికి భోజనానికి వెళ్లారు. పండుగలకు పకడ్బందీ బందోబస్తు: ముఖ్యమంత్రితో డీజీపీ హైదరాబాద్: వచ్చే రంజాన్, బోనాల పండుగల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతాచర్యలు, పోలీసు బందోబస్తుపై వుుఖ్యవుంత్రి కేసీఆర్ ఆదివారం డీజీపీ అనురాగ్శర్మ, నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్రెడ్డిలతో చర్చించారు. సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో జూలై 1 నుంచి నెల రోజుల పాటు రంజాన్ పర్వదినం ఉపవాసదీక్షలు, అదే నెలలో ప్రారంభవుయ్యే బోనాల ఉత్సవాల కోసం బందోబస్తు ఏర్పాట్లను వుుఖ్యవుంత్రికి వివరించారు. పాతబస్తీతోపాటు కీలకమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నావుని, సంఘవిద్రోహ శక్తులు, అవాంఛనీయ శక్తులపై ఇప్పటినుంచే కన్నేసి ఉంచావుని అధికారులు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీలు, గూండాలు, కమ్యూనల్ గూండాలపై కఠినచర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా, బందోబస్తు కోసం ఎంతవుందినైనా వినియోగించాలని, నగరంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని వుుఖ్యవుంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా అధికారులను అదేశించారు. హైదరాబాద్ నగరాన్ని ప్రశాంతంగా ఉంచాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని, దానిని గమనంలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీ, నగర సీపీలకు సూచించారు. రంజాన్, బోనాల పండుగలకు సంబంధించి సోవువారం జరిగే కో-ఆర్డినేషన్ కమిటీ సవూవేశంలో శాంతిభద్రతల పరంగా చర్చించాల్సిన అంశాలను కూడా డీజీపీ, సీపీలు వుుఖ్యవుంత్రికి వివరించినట్టు సవూచారం. కాగా రంజాన్, బోనాల పండుగల సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాట్లను ముఖ్యమంత్రి సోమవారం మద్యాహ్నం సమీక్షించనున్నారు. మంత్రులు, శాసనసభ్యులు, మేయర్, ఎంపీలు, అధికారులు పాల్గొంటారు. -
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేకే
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేశవరావు ఎంపిక అయ్యారు. లోక్సభలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా జితేందర్ రెడ్డి, ఉప నాయకుడిగా వినోద్, విప్గా కడియం శ్రీహరిని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మంగళవారం నియమించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేశవరావు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక మహబూబ్నగర్ నుంచి గెలిచిన జితేందర్రెడ్డి లోక్సభలో టిఆర్ఎస్ నాయకుడిగాగా, కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి విజయం సాధించిన వినోద్కు ఉప నాయకుడిగా, వరంగల్ ఎంపీగా గెలుపొందిన కడియం శ్రీహరికి విప్ పదవి లభించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కెసిఆర్.. అటు కాంగ్రెస్, ఇటు బిజెపితో సయోధ్యకు చొరవ చూపుతున్నారు. అందుకే రెండు పార్టీలతో మంచి సంబంధాలు ఉన్న నాయకులకు ఈ బాధ్యతలు అప్పగించారు. -
మా ఓటు ఎక్కడంటే..!
మంచిర్యాల సిటీ, న్యూస్లైన్ : రిజర్వుడు స్థానాలకు వలస వచ్చిన నేతలు.. సొంత నియోజకవర్గం వదిలి సురక్షిత స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు.. పునర్విభజనతో పాత స్థానాలు చెల్లాచెదురైన నాయకులకు సొంత ఓటు దూరమవుతోంది. వారి ఓటు ఒక చోట ఉండటం, పోటీ మరొక చోట చేయడంతో ఓటుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. ఇలా జిల్లాలోని రెండు లోక్సభ, పది అసెంబ్లీ స్థానాల్లో కొందరు అభ్యర్థులు ఓటు వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న బాల్క సుమన్ కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో ఓటు హక్కు ఉంది. బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి తులసీదాస్ తన నియోజకవర్గంలో కాకుండా ఆదిలాబాద్లో ఓటు ఉంది. అదేవిధంగా చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినోద్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కాకుండా హైదరాబాద్లో ఓటు వేయనున్నారు. పార్లమెంట్ స్థానాలు.. ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి రాథోడ్ రమేష్ ఉట్నూర్లో, టీఆర్ఎస్ అభ్యర్థి గెడం నగేష్ బజర్హత్నూర్ మండలం జాతర్లలో, కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ జాదవ్ గుడిహత్నూర్ మండలం తోషంలో ఓటు వేయనున్నారు. పెద్దపల్లి : పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేకానంద, టీడీపీ అభ్యర్థి శరత్బాబు మంచిర్యాలలో, టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కాకుండా కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో ఓటు వేయనున్నారు. శాసనసభ స్థానాలు.. ఆదిలాబాద్ : ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బెజ్జంకి అనిల్కుమార్, బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్, కాంగ్రెస్ అభ్యర్థి బార్గవ్ దేశ్పాండే ఆదిలాబాద్లో, టీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న జైనథ్ మండలం దీపాయిగూడలో ఓటు వేయనున్నారు. నిర్మల్ : నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి అల్లూరి మల్లారెడ్డి నిర్మల్ మండలం మాధాపూర్లో, టీడీపీ అభ్యర్థి మిర్జాయాసిన్ బేగం, కాంగ్రెస్ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్రెడ్డి, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి ఐకే రెడ్డి నిర్మల్లో.. టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీహరిరావు మామడ మండలం దిమ్మతుర్తిలో ఓటు వేయనున్నారు. ఖానాపూర్ : ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి రేఖా నాయక్ ఖానాపూర్లో, కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా హరినాయక్ జన్నారంలో, టీడీపీ అభ్యర్థి రితీష్ రాథోడ్ ఉట్నూర్లో ఓటు వేయనున్నారు. బోథ్ : బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సా ర్ సీపీ అభ్యర్థి గెడం తులసీదాస్ తాను పోటీ చేస్తున్న స్థానంలో కాకుండా ఆదిలాబాద్లో ఓటు వేయనున్నా రు. అదేవిధంగా టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురా వు ఇచ్చోడలో, కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ జాదవ్ నేరడిగొండ మండలం రాజూరలో, టీడీపీ సోయం బాపురా వు బోథ్ మండలం నాగోగులలో ఓటువేయనున్నారు. ముథోల్ : ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విఠల్రెడ్డి భైంసా మండలం దేగాంలో, టీఆర్ఎస్ అభ్యర్థి వేణుగోపాలాచారి భైంసాలో, బీజేపీ అభ్యర్థి రమాదేవి కుంటాల మండలం అందపూర్లో ఓటు వేయనున్నారు. మంచిర్యాల : మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి సయ్యద్ అఫ్జలుద్దీన్, టీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్రావు, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం అరవిందరెడ్డి, బీజేపీ అభ్యర్థి మల్లారెడ్డిలు మంచిర్యాలలో ఓటు వేయనున్నారు. చెన్నూర్ : చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ మేకల ప్రమీల , బీజేపీ అభ్యర్థి రాం వే ణు, టీఆర్ఎస్ అభ్యర్థి నల్లాల ఓదెలు మందమర్రిలో, గడ్డం వినోద్ పోటీ చేస్తున్న స్థానంలో కాకుండా హైదరాబాద్లో ఓటు వేయనున్నారు. బెల్లంపల్లి : బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి రాజ్కిరణ్, సీపీఐ అభ్యర్థి గుం డా మల్లేష్, టీడీపీ అభ్యర్థి పాటి సుభద్రలు బెల్లంపల్లి లో, టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య నెన్నల మండ లం జెండా వెంకటాపూర్లో ఓటు వేయనున్నారు. ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అత్రం సక్కు తిర్యాణి మండలం లక్ష్మీపూర్లో, టీఆర్ఎస్ అభ్యర్థి కొవ లక్ష్మీ, టీడీపీ అభ్యర్థి మర్సుకోల సరస్వతీలు ఆసిఫాబాద్లో ఓటు వేయనున్నారు. సిర్పర్ కాగజ్నగర్ : సిర్పూర్ కాగజ్నగర్ నుంచి వైఎస్సార్ సీపీ షబ్బీర్ హుస్సేన్, కాంగ్రెస్ అభ్యర్థి ప్రేంసాగర్రావు, టీఆర్ఎస్ అభ్యర్థి సమ్మయ్య, టీడీపీ అభ్యర్థి రావి శ్రీనివాస్, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి కోనేరు కోనప్పలు కాగ జ్నగర్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. -
సొంత గూటికి వివేక్ బ్రదర్స్
* సోనియాతో చర్చించిన నేతలు * తిరిగి రావడంపై సానుకూలత * కోరిన స్థానాలు ఇచ్చేందుకూ ఓకే * తెలంగాణ ఇస్తే తిరిగొస్తామన్న మాట మేరకే చేరుతున్నాం: ఎంపీ వివేక్, వినోద్ * కాంగ్రెస్లో చేరిన మాజీ ఎంపీ ఇంద్రకరణ్రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి ఊహించినట్లుగానే.. ఎంపీ వివేక్, ఆయన సోదరుడు వినోద్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్లోకి తిరిగొస్తామని మాటిచ్చామని, ఆ మాట మేరకే తిరిగి ఆ పార్టీలో చేరుతున్నామని వారు సోమవారం ఢిల్లీలో ప్రకటించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్తోనే ఆ ప్రాంత అభివృద్ధి సాధ్యమని.. ఇక తాము సోనియా నేతృత్వంలో కాంగ్రెస్కు సేవలు అందిస్తామని పేర్కొన్నారు. వివేక్కు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్, వినోద్కు చెన్నూరు అసెంబ్లీ టికెట్ ఖాయమయ్యాయని, దీనిని అధికారికంగా ప్రకటించడమే తరువాయని కాంగ్రెస్ వర్గాల సమాచారం. సోమవారం వివేక్, వినోద్ అధినేత్రి సోనియాగాంధీని ఆమె నివాసం లో కలిసి, తిరిగి పార్టీలో చేరే విషయమై చర్చించారు. దీనిపై ఆమె సానుకూలత వ్యక్తం చేయడం, వారు కోరుతున్న స్థానాలను ఇచ్చేందుకు ఓకే చెప్పడంతో.. కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. సోనియాతో భేటీ అనంతరం మాజీ ఎంపీ ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో కలసి వివేక్, వినోద్ విలేకరులతో మాట్లాడారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకల జనుల సమ్మెలో పాల్గొన్నాం. 14 ఎఫ్ రద్దు పోరాటంలో అరెస్టయ్యాం. పార్లమెంట్లో సస్పెన్షన్కుగురయ్యాం.. దీక్షలు చేశాం.. తెలంగాణ సాధన కోసం చేయని ప్రయత్నం లేదు. ఆ సమయంలో అప్పటి సీఎం కిరణ్ కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపి తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలాంటి తరుణంలో తెలంగాణ కాంక్షను బలంగా చాటేందుకు, ఉద్యమంలో చేరేందుకు పార్టీని వీడాం. మేం పార్టీని వీడాకే అధిష్టానంలో కదలిక వచ్చింది. జూన్ 2న మేం పార్టీని వీడితే.. జూన్ 30న సీడబ్ల్యూసీలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు’’’ అని వెల్లడించారు. తెలంగాణపై బీజేపీ సహా అనేక జాతీయ పార్టీలు వ్యతిరేకించినా సోనియా మాటపై నిలబడి ప్రక్రియను పూర్తి చేశారని వివేక్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ నుంచి ఇంద్రకర ణ్రెడ్డి.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేత, మాజీ ఎంపీ ఇంద్రకరణ్రెడ్డి సోమవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కాంగ్రెస్లో చేరనున్నట్లు ఇంద్రకరణ్రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇంద్రకరణ్రెడ్డికి ఆదిలాబాద్ అసెంబ్లీ టికెట్, కోనేరు కోనప్పకు సిర్పూర్ కాగజ్నగర్ అసెంబ్లీ టికెట్ ఖరారైనట్లు సమాచారం. ఈ మేరకు దిగ్విజయ్ నుంచి హామీ లభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోనప్ప కూడా త్వరలోనే కాంగ్రెస్లో చేరనున్నారు. ఎందుకు వీడారో.. ఎందుకొచ్చారో!: శ్రీధర్బాబు సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ కాంగ్రెస్లో చేరడంపట్ల తెలంగాణ పీసీసీ మేనిఫెస్టో ఛైర్మన్ డి.శ్రీధర్బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం గాంధీభవన్లో ప్రచార కమిటీ కో-చైర్మన్ షబ్బీర్అలీతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. వివేక్ కాంగ్రెస్ను ఏ సందర్భంలో ఎందుకు వీడారో, మళ్లీ ఎందుకు వచ్చారో ఆయన్నే అడగాలన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఈ ఏడాది పార్టీ కార్యకర్తలు పడిన కష్టాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. తెలంగాణ కోసం తాము ఎన్నో ఇబ్బందులు, అవమానాలు భరించామని,పార్టీపై నమ్మకంతో కొనసాగినవారే అసలు సిసలైన కాంగ్రెస్వాదులన్నారు. -
ఎన్నికల వేళ టీఆర్ఎస్కు షాక్
శ్రీరాంపూర్, న్యూస్లైన్ : ఎన్నికల వేళ టీఆర్ఎస్ పార్టీకి గట్టిషాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ వివేక్ ఆయన సోదరుడు వినోద్లు సోమవారం టీఆర్ఎస్ విడిచి సొంత గూటికి చేరారు. డిల్లీలో దిగ్విజయ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో నియోజకర్గంలో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. పార్టీకి ఎదురుదెబ్బ త గలడమే కాకుండా ఆయనతోపాటు గతంలో కాంగ్రెస్ విడిచి టీఆర్ఎస్లోకి వచ్చిన నేతలకు ఇప్పడు ఎన్నికల వేళ ఎటూ వెళ్లాలనే సందిగ్ధం నెలకొంది. వివేక్ వర్గీయులు చాలా మంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బరిలో నిలిచారు. మంచిర్యాల మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొందరు ఆయనను నమ్మి పోటీలో ఉన్నారు. ఇప్పుడు వారి పరిస్థితి గందరగోళంగా మారింది. ఎన్నికల వేళ ఏం చేయాలో అర్థం కాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. వివేక్ వెంట వెళ్లాలనుకున్న ఇప్పడికిప్పుడు సాధ్యం కాదు. కారణం టీఆర్ఎస్ బీ-ఫామ్లతో పోటీలో ఉండి పార్టీ మారితే గెలుపు గల్లంతే. ఎన్నికల వేళ వివేక్ తమను విడిచిపోవడం బాధగా ఉందని ఆయన వర్గీయ నేత ఒకరు న్యూస్లైన్కు వాపోయారు. గడ్డు పరిస్థితులే.. వివే క్ పార్టీ మారడంతో రాచకొండ కుటుంబం గడ్డు పరిస్థితులను ఎదుర్కొవలసి వస్తున్నది. మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ కృష్ణారావు కుటుంబం కాంగ్రెస్లో ఎన్నో ఏళ్ల పని చేసింది. వివేక్ తండ్రి వెంకటస్వామి నుంచి వివేక్ వరకు వారిని అంటిపెట్టుకొని రాజకీయంగా ఎదుగు తూ వచ్చారు. ఇంతకు ముందు కాంగ్రెస్లో ది వాకర్రావు, ఎంపీ వివేక్, ప్రేంసాగర్రావు మూ డు గ్రూపులు ఉన్నప్పుడు వారు వివేక్ బలంలో రాణించారు. కొద్దికాలం క్రితం వివేక్ కాంగ్రెస్ ను విడిచి టీఆర్ఎస్లో చేరడంతో ఆయనతోపాటు టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు మళ్లీ కాం గ్రెస్లోకి వివేక్ చేరడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కృష్ణారావు భార్య మంజుల మం చిర్యాల 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ లో ఉంది. ఆమె గెలిచి, టీఆర్ఎస్ ఎక్కువ స్థా నాలను కైవసం చేసుకొంటే మున్సిపల్ చైర్మన్ పదవి ఆమెకే ఇస్తానని ముందే వివేక్ వారికి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి వారు ఇప్పటికే ప్యానల్ సిద్ధం చేసి పెట్టుకున్నారు. కృష్ణారావు తమ్ముడు వెంకటేశ్వర్రావు కూడా ఆయన భార్య ఆశలతను మంచిర్యాల జెడ్పీటీసీగా బరి లో ఉంది. ఈ టిక్కెట్ పార్టీలో చాలా కాలంగా పని చేస్తున్న మండల అధ్యక్షుడు వంగ తిరుప తి, యువజన విభాగం తూర్పు జిల్లా అధ్యక్షు డు బేర సత్యనారాయణను కాదని ఎంపీ వివేక్ ఒత్తిడితో ఆశలతకే టిక్కెట్ ఇచ్చారు. ఆశలత గెలిస్తే ఆమెకు జెడ్పీ చైర్మన్ ఇప్పించడానికి సన్నాహాలు చేశారు. కొన్ని ఎంపీటీసీ స్థానాలు వివేక్ ఒత్తిడితో ఇవ్వడం జరిగింది. నేడు ఆ అభ్యర్థులతో పాటు పార్టీ నాయకత్వం కూడా ఆందోళన చెందుతుంది. వివేక్ మనుషులుగా ముద్ర పడ్డ అభ్యర్థులు ఇప్పడు వివేక్ వెంట పోయే పరిస్థితి లేకుండా చట్రంలో ఇరుక్కున్నారు. పోటీలో లేని కొందరు నాయకులు ఆయన వెంట నడిస్తే ఎన్నికల్లో అభ్యర్థులకు ఎదురీత తప్పదని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైన వివేక్ పార్టీ మారడంతో టీఆర్ ఎస్ పార్టీకి నష్టం చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చైర్మన్ పదవులు దక్కేనా.. ఇదిలా ఉంటే ఎంపీ ఆశీస్సులతో మున్సిపల్, జెడ్పీ చైర్మన్ పదవులు అలంకరించవచ్చనుకు న్న వారికి ఇప్పుడు ఒక్క సారిగా సీన్ మారింది. వివేక్ వర్గీయులుగా ఉన్న వీరు గెలిచిన తరువాత చైర్మన్ పదవులకు దివాకర్రావు సహకరిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
సొంత గూటికి వలస పక్షులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ఆయన సోమవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిశాక, కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్లో కొనసాగుతున్న వెంకటస్వామి(కాకా) తనయులు ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తనతోపాటే సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కాంగ్రెస్లో చేరుతారని ఇంద్రకరణ్రెడ్డి ప్రకటించారు. ఐకే రెడ్డి గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఇన్నాళ్లు తటస్థంగా ఉన్న ఆయ న టీఆర్ఎస్లో చేరుతారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తెరదించుతూ ఎట్టకేలకు సోమవారం కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటస్వామి తనయులు పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ కూడా సొంత గూటికి చేరుకోవడంతో ఆయన వర్గీయులు కూడా కాంగ్రెస్ వైపు వెళుతున్నారు. మాజీ మంత్రి జి.వినోద్ టీఆర్ఎస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల్లో ఉన్నారు. కొంత కాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన కాం గ్రెస్ తరఫున చెన్నూరు నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కొంత కాలంగా తటస్థంగా ఉన్నారు. ఐకే రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో కోనప్ప కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. హస్తంలో ఇక టిక్కెట్ల రాజకీయం ఈ నలుగురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో కాంగ్రెస్లో టిక్కెట్ల రాజకీయాలు కొత్త మలుపులు తిరుగనున్నాయి. ఇంద్రకరణ్రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో ఏదో ఒకస్థానంలో పోటీ చేయాలని భావిస్తుండటంతో అక్కడ టిక్కెట్ ఆశిస్తున్న వారి ఆశలకు గండిపడే అవకాశం ఉంది. సిర్పూర్లో కోనేరు కోనప్ప తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనుండటంతో అక్కడి టిక్కెట్ ఆశిస్తున్న వారితో ఉత్కంఠ మొదలైంది. టిక్కెట్ విషయంలో అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వచ్చాకే ఐకే రెడ్డి ఢిల్లీలో సోమవారం ఉగాది రోజున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఏ స్థానం నుంచి బరిలో దిగుతారనే అంశంపై ఒకటీ రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. నిర్మల్ ‘సిట్టింగ్’ పదిలమేనా? సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు ఖాయమని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ పంపిన జాబితాలో సిట్టింగ్ స్థానాల్లో ఎమ్మెల్యే ఒక్కరి పేరే ప్రతిపాదించింది. కొత్తగా పనితీరు అంశం తెరపైకి రావడంతో ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఒకింత ఆందోళనలో పడ్డారు. పనితీరు బాగాలేని చోట్ల ప్రత్యామ్నాయ అభ్యర్థిని బరిలోకి దించుతామని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే సంకేతాలిచ్చింది. కాగా మహేశ్వర్రెడ్డి పనితీరుపై నిర్మల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు ఆయన ఎదుర్కొంటున్నారు. మహేశ్వర్రెడ్డిని నిర్మల్ నుంచి కాకుండా, ప్రత్యామ్నాయ స్థానం నుంచి బరిలోకి దించితే ఈ అసంతృప్తిని అధిగమించ వచ్చనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ఉహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సిర్పూర్ ‘సీటు’కు తీవ్ర పోటీ సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప కూడా కాంగ్రెస్లో చేరుతారని ఇంద్రకరణ్రెడ్డి ప్రకటించారు. కోనప్ప ఐకే రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఇప్పుడు సిర్పూర్ తెరపైకి కోనప్ప రాకతో ఇక్కడి టిక్కెట్ ఆశిస్తున్న వారిలో పోటీ మరింత పెరగనుంది. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు, ఏఐసీసీ సభ్యులు సుల్తాన్ అహ్మద్, ఏపీపీఎస్పీ సభ్యుడు పి.రవీందర్రావు తదితరులు టిక్కెట్ రేసులో ఉన్నారు. ఇప్పుడు కోనప్ప రాకతో టికెట్ కోసం గట్టిగా పోటీ పడుతున్న వారి సంఖ్య మరింత పెరిగినట్లయింది. చెన్నూర్ ఆశావహులపై వినోద్ నీళ్లు టీఆర్ఎస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి జి.వినోద్ కూడా కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు ఆయన చెన్నూరు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం నెలకొంది. మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన చెన్నూరు నుంచే ప్రాతినిధ్యం వహించారు. వినోద్ టీఆర్ఎస్లోకి వెళ్లడంతో చెన్నూరులో బలమైన నేతలెవరూ తెరపైకి రాలేదు. సొత్కు సంజీవరావు, డి.శ్రీనివాస్, ఎం.సంపత్, వినయ్ తదితరులు కాంగ్రెస్ టిక్కెట్ ఆశించారు. ఇప్పుడు వినోద్ రాకతో వీరి ఆశలపై నీళ్లు చల్లినట్లే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్లో కొనసాగిన ఎంపీ వివేక్ ఇప్పుడు మళ్లీ పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కాంగ్రెస్లో చేరిన కాకా తనయులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ కురువృద్ధుడు జి.వెంకటస్వామి(కాకా) తనయులు వివేక్, వినోద్లు టీఆర్ఎస్ను వీడి తిరిగి సొంతగూటికిచేరారు. సోమవారం వీరిద్దరూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్లో చేరినట్టు ప్రకటించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని వివేక్ అన్నారు. కాగా తెలంగాణపై బీజేపీ వెనక్కి తగ్గిందని విమర్శించారు. గతంలో తెలంగాణ కోసమే కాంగ్రెస్ను వీడామని, తెలంగాణ ఇచ్చినందున మళ్లీ కాంగ్రెస్లో చేరుతున్నామని చెప్పారు. వివేక్ బ్రదర్స్ కోరిన స్థానాల టికెట్లు ఇచ్చేందుకు సైతం హైకమాండ్ సుముఖత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్లో చేరేందుకు గ త మూడు రోజులుగా ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో మంతనాలు నెరిపిన ఈ ఇద్దరు సోదరులు.. ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్తో సుమారు గంట పాటు చర్చలు జరిపారు. తాము పార్టీని వీడినా ఏనాడూ కాంగ్రెస్పైగానీ, అధినేత్రి సోనియాగాంధీపైగానీ వ్యతిరేకంగా మాట్లాడలేదని, కేవలం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకోవాలని మాత్రమే కోరుతూ వచ్చామని చెప్పారు. వివేక్ సిట్టింగ్ స్థానమైన పెద్దపల్లి ఎంపీతో పాటు, వినోద్కు చెన్నూరు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు దిగ్విజయ్ నుంచి హామీ లభించినట్లు సమాచారం. ఎంపీ వివేక్, రాజ్యసభ మాజీ సభ్యుడు కె కేశవరావు, నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథంలు కాంగ్రెస్ పార్టీని వీడి గతేడాది జూన్ 2 న టీఆర్ఎస్ లో చేరారు. అయితే అప్పట్నుంచే వివేక్ పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టు ఉంటూ వస్తున్నారు. -
సోనియా గాంధీని ఢిల్లీలో కలిసిన వివేక్-వినోద్
-
సోనియాతో కాకా తనయుల భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ కురువృద్ధుడు జి.వెంకటస్వామి(కాకా) తనయులు వివేక్, వినోద్లు టీఆర్ఎస్ను వీడి తిరిగి సొంతగూటికిచేరేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం వీరిద్దరూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. కాంగ్రెస్లో చేరే విషయంపై సోనియా, వివేక్ బ్రదర్స్ మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. సోనియా వీరిద్దరినీ పార్టీలోకి ఆహ్వనించారని, ఇదే రోజు వీరిద్దరూ కాంగ్రెస్ కండువా కప్పుకోవచ్చని తెలుస్తోంది. కాసేపట్లో కాకా తనయులు మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశముంది. వివేక్ బ్రదర్స్ కోరిన స్థానాల టికెట్లు ఇచ్చేందుకు సైతం హైకమాండ్ సుముఖత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్లో చేరేందుకు గ త మూడు రోజులుగా ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో మంతనాలు నెరిపిన ఈ ఇద్దరు సోదరులు.. ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్తో సుమారు గంట పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ను వీడాల్సి వచ్చిందో దిగ్విజయ్కు వివేక్ వివరణ ఇస్తూ.. తెలంగాణపై మొదటి నుంచి గట్టిగా పోరాడుతున్న తాము హైకమాండ్పై ఒత్తిడి పెంచేందుకే పార్టీని వీడామని వివరించారు. తాము పార్టీని వీడినా ఏనాడూ కాంగ్రెస్పైగానీ, అధినేత్రి సోనియాగాంధీపైగానీ వ్యతిరేకంగా మాట్లాడలేదని, కేవలం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకోవాలని మాత్రమే కోరుతూ వచ్చామని చెప్పారు.వివేక్ సిట్టింగ్ స్థానమైన పెద్దపల్లి ఎంపీతో పాటు, వినోద్కు చెన్నూరు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు దిగ్విజయ్ నుంచి హామీ లభించినట్లు సమాచారం. ఎంపీ వివేక్, రాజ్యసభ మాజీ సభ్యుడు కె కేశవరావు, నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథంలు కాంగ్రెస్ పార్టీని వీడి గతేడాది జూన్ 2 న టీఆర్ఎస్ లో చేరారు. అయితే అప్పట్నుంచే వివేక్ పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టు ఉంటూ వస్తున్నారు. -
సొంతగూటికి నేడు వివేక్ బ్రదర్స్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ కురువృద్ధుడు జి.వెంకటస్వామి(కాకా) తనయులు వివేక్, వినోద్లు తిరిగి సొంతగూటికిచేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, ఇక వారి చేరిక లాంఛనమే అని సమాచారం. వివేక్ బ్రదర్స్ కోరిన స్థానాల టికెట్లు ఇచ్చేందుకు సైతం హైకమాండ్ సుముఖత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అన్నీ అనుకూలిస్తే సోమవారం వీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొంటారని తెలిసింది. కాంగ్రెస్లో చేరేందుకు గ త మూడు రోజులుగా ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో మంతనాలు నెరిపిన ఈ ఇద్దరు సోదరులు.. ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్తో సుమారు గంట పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ను వీడాల్సి వచ్చిందో దిగ్విజయ్కు వివేక్ వివరణ ఇస్తూ.. తెలంగాణపై మొదటి నుంచి గట్టిగా పోరాడుతున్న తాము హైకమాండ్పై ఒత్తిడి పెంచేందుకే పార్టీని వీడామని వివరించారు. తాము పార్టీని వీడినా ఏనాడూ కాంగ్రెస్పైగానీ, అధినేత్రి సోనియాగాంధీపైగానీ వ్యతిరేకంగా మాట్లాడలేదని, కేవలం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకోవాలని మాత్రమే కోరుతూ వచ్చామని చెప్పారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షిస్తూ తిరిగి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన దిగ్విజయ్, పార్టీలో చేరేందుకు సుముఖుత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో వివేక్ సిట్టింగ్ స్థానమైన పెద్దపల్లి ఎంపీతో పాటు, వినోద్కు చెన్నూరు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు దిగ్విజయ్ నుంచి హామీ లభించినట్లు సమాచారం. స్పష్టమైన హామీ లభించడంతో ఇద్దరు నేతలు పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్లో చేరతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇదే సమయంలో వివేక్ సోదరులు టీఆర్ఎస్తో పొత్తులపై జరిపిన చర్చలు మాత్రం విఫలమయ్యాయని తెలుస్తోంది. దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతున్న సమయంలో ఇంకా చర్చలకు తావులేదని దిగ్విజయ్ స్పష్టం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్లో చేరే విషయమైనా, మరే నిర్ణయమైనా సోమవారం వెల్లడిస్తానని ఎంపీ వివేక్ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. కాంగ్రెస్లో తిరిగి చేరాలని తనపై కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఒత్తిడి ఉందన్నారు. -
కాంగ్రెస్ గూటికి కాకా తనయులు!
-
కాంగ్రెస్ గూటికి కాకా తనయులు!
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి తనయులు వివేక్, వినోద్ టీఆర్ఎస్ను వీడనున్నారా? మళ్లీ సొంత గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారా? జోరందుకుంటున్న ఈ ఊహాగానాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదివారం వీరిద్దరూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ను ఆయన ఇంటికెళ్లి కలవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా మామూలు కారులో దిగ్విజయ్ ఇంటికెళ్లడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై వివేక్, వినోద్లు డిగ్గీ రాజాతో చర్చించినట్టు సమాచారం. గంటకు పైగా సమావేశమయ్యారు. వీరిద్దరూ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వివేక్, వినోద్ టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా ఖండించకపోవటం విశేషం. వివేక్ తాజా ఎంపీ కాగా, వినోద్ మాజీ మంత్రి. ఎంపీ వివేక్, రాజ్యసభ మాజీ సభ్యుడు కె కేశవరావు, నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథంలు కాంగ్రెస్ పార్టీని వీడి గతేడాది జూన్ 2 న టీఆర్ఎస్ లో చేరారు. అయితే అప్పట్నుంచే వివేక్ పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టు ఉంటూ వస్తున్నారు. -
వినోదన్నా గిట్లయిందేందే?
-
మోడీతో చర్చ.. నిరాశ
హైదరాబాదీకి దక్కని అవకాశం సమయంలేనందుకు చింతిస్తున్నా: మోడీ గోల్నాక, న్యూస్లైన్: బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తన ప్రచార వ్యూహంలో భాగంగా బుధవారం ప్రారంభించిన ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమంలో హైదరాబాద్వాసికి ఆన్లైన్లో మోడీతో మాట్లాడే అవకాశం వచ్చినట్లే వచ్చి దక్కకుండా పోయింది. అంబర్పేట నియోజకవ ర్గంలోని ఉస్మానియా యూనివర్శిటీ చౌరస్తా వద్ద చాయ్ బండి నిర్వహిస్తున్న వినోద్ అనే యువకుడితో మోడీతో ముఖాముఖి మాట్లాడే అవకాశం దక్కింది. బుధవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్యలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వగా వినోద్తో పాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు, మోడీ అభిమానులు ఎదురుచూశారు. కానీ చివరకు సమయం మించి పోవటంతో నరేంద్రమోడీ.. వినోద్తో మాట్లాడేందుకు ఆన్లైన్లోకి రాకపోవటం కొంత నిరాశకు గురి చేసింది. అయినప్పటికీ చివరి క్షణంలో మోడీ ఆన్లైన్లో మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో తాను చేపట్టిన ముఖాముఖి కార్యక్రమంలో అందరితో మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేకపోతున్నానని, రాబోయే రోజుల్లో చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తానన్నారు. వినోద్ మాట్లాడుతూ.. మోడీ చివరగా చెప్పిన మాటలు తనకు సంతోషాన్ని కలిగించాయన్నారు. తనతో మాట్లాడకున్నా మిగతా చాయ్వాలాలతో మాట్లాడటం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనేక ప్రాంతీయ, జాతీయ ఛానెళ్లు దాదాపు మూడు గంటల పాటు ఎన్సీసీ చౌరస్తాలో నిరీక్షించి హడావుడి చేశాయి. కాగా,మోడీ చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని తిలకించేందుకు అంబర్పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఓయూ గేటు వద్దకు తరలివచ్చారు. -
రూ.20 వేల కోసం మేనల్లుడి హత్య
హైదరాబాద్: నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఐదేళ్ల బాలుడు యాశ్ రాజ్కుమార్ హత్య కేసులో అత్తాపూర్కు చెందిన వినోద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 20 వేల రూపాయల కోసం హత్య చేసినట్లు రాజ్కుమార్ మేనమామ వినోద్ పోలీసులకు చెప్పాడు. మంగళ్హాట్ ధూల్పేట్ ప్రాంతానికి చెందిన అనిల్ కుమార్, పప్పి దంపతుల కుమారుడు యశ్రాజ్ కుమార్ నార్సింగ్లోని పిరంచెరువు సమీపంలో గత నెలలో దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. నాంపల్లి ఝాన్సీ చౌరాహీలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఎల్కెజి చదువుతున్న యాశ్ రాజ్కుమార్ సొంత మేనమామ వినోద్ ఇరవై వేల రూపాయల కోసం కిడ్నాప్ చేసి, హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి గొంతుకు ఉరి బిగించి హత్య చేసి, ఆ తర్వాత బండరాయితో ముఖంపై మోదారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి శవాన్ని తగులబెట్టారని పోలీసులు తెలిపారు. -
నిప్పులు చెరిగిన వినోద్
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ జట్టు బౌలర్ వినోద్ (6/40) నిప్పులు చెరగడంతో రంగారెడ్డి జిల్లా జట్టు పరాజయం చవిచూసింది. ఎ12-డివిజన్ వన్డే లీగ్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో గోల్కొండ జట్టు 5 వికెట్ల తేడాతో రంగారెడ్డిపై గెలుపొందింది. మొదట రంగారెడ్డి జట్టు 135 పరుగులకే ఆలౌటైంది. కిరిటీ 33, అఖిలేశ్ 26 పరుగులు చేశారు. గోల్కొండ బౌలర్ హరికుమార్ 4 వికెట్లు తీశాడు. తర్వాత గోల్కొండ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సాయిరాజ్ (67) అర్ధసెంచరీ సాధించగా, రంగారెడ్డి బౌలర్ నిర్భయ్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్ల స్కోర్లు అక్షిత్ సీసీ: 134 (శ్రీకల్ 30; సలీమ్ ఆరిఫ్ 5/20), సీకే ఆక్రిలిక్: 135/3 (ఆరిఫ్ 54). నోబుల్ సీసీ: 194/9 (అనదీప్ 37, ప్రణమ్ 31; కపిల్ వ్యాస్ 5/46, నైరుత్ 2/27), డబ్ల్యూఎంసీసీ: 195/4 (నినాంత్ రెడ్డి 100). ఎంపీ బ్లూస్: 305/5 (రాజు 111, వరుణ్ 100, సతీశ్ 45), నవజీవన్ ఫ్రెండ్స్: 89 (సతీశ్ 5/23, హరినారాయణ 3/5) ఎలెవన్ మాస్టర్స్: 175 ( అమిత్ 3/51, ప్రవీణ్ 4/41), సూపర్ స్టార్: 176/7. -
మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి గుండెపోటు
-
విభజన గురించి సీఎంకు ముందే తెలుసు: వివేక్
హైదరాబాద్: అసెంబ్లీలో మెజార్టీ ఉంటే తెలంగాణ రాదనే వాదన సరికాదని టీఆర్ఎస్ నాయకుడు కె. కేశవరావు అన్నారు. రాజ్యంగాన్ని తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. కొంతమంది పిచ్చివాళ్లలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజ్యంగం ప్రకారమే రాష్ట్రపతి వ్యవరిస్తున్నారని అన్నారు. 371(D) పై ఎలాంటి అపోహలు వద్దని చెప్పారు. సీఎం కిరణ్ అబద్ధాలకోరని పెద్దపల్లి ఎంపీ వివేక్ విమర్శించారు. రాష్ట్ర విభజన జరుగుతుందని సీఎంకు ముందే తెలుసని, అయినా ప్రజలను మభ్యపెడుతున్నారని తప్పుబట్టారు. కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీన అంశం ఉత్పన్నం కాదని, అలాంటి ప్రతిపాదన లేనేలేదని మాజీ ఎంపీ వినోద్ అన్నారు. తెలంగాణపై మాకున్న అవగాహన కాంగ్రెస్కు లేదన్నారు. పార్టీ బలోపేతం, ఇతర అంశాలపై ఈ నెల 25న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపారు. -
చంద్రబాబు ఢిల్లీ యాత్ర ఎందుకు?: వినోద్