animals
-
పాతికేళ్ల బంధం, ఒక్కసారి లే నేస్తమా : వైరల్ వీడియో
మనుషులైనా, జంతువులైనా మనసుంటుంది. అనుబంధాలు, అప్యాయతలు ఉంటాయి. అపురూపమైన ఆ అనుబంధం (Friendship) తెగిపోతే.. కలకాలం తోడునీడగా ఉన్న ఆత్మీయ నేస్తం.. అందనంత దూరం వెళ్లిపోతే.. మనుషులైతే గుండె పగిలేలా రోదిస్తారు. మరి మూగజీవి ఏం చేస్తుంది. మూగగానే రోదిస్తుంది. ఈ మాటలకు అక్షర సత్యం అనేలా ఒక వీడియో నెట్టింట పలువురి చేత కంట తడిపెట్టిస్తోంది. అసలేంటీ కథ.. తెలుసుకుందాం..పాతికేళ్ల బంధాన్ని వీడిన శాశ్వతంగా కన్నుమూసిన తన భాగస్వామిని ఒక ఏనుగు (elephant) చలించి పోయింది. ఎలాగైనా దాన్ని తట్టి లేపాలని ప్రయత్నించింది. తొండంతో గుండెలకు హత్తుకోవాలని తపించిపోయింది. కానీ తనవన్నీ వృధా ప్రయత్నాలనీ, ఇకలాభం లేదని తెలిసి కన్నీరు పెట్టుకుంది. ఈ సమయంలో పశువైద్యులను దగ్గరకు రానీయలేదు.బాజా వార్తా సంస్థ అందించిన వివరాల ప్రకారం జెన్నీ, మాగ్డా అనే ఏనుగులు రష్యాలోని ఓ సర్కస్ కంపెనీలో ఉండేవి. 25 సంవత్సరాలకు ఇవి రెండూ పార్టనర్స్గా ఉండేవి. వివిధ ఫీట్లు చేస్తూ జనాలను అలరించేవి. వయసుమీద పడటంతో సర్కస్ వర్క్నుంచి విముక్తి లభించింది. ఈ వారం జెన్నీ కన్నుమూసింది. దీంతో తన నేస్తం అలా నిర్జీవంగా పడి ఉండటం మాగ్డా తట్టుకోలేకపోయింది. దాన్ని లేపేందుకు విశ్వప్రయత్నం చేసింది. గంటల తరబడి దాని చుట్టూ తిరిగింది. కన్నీరు పెట్టుకుంది. ఆఖరికి వెటర్నరీ వైద్యులను కూడా దగ్గరికి రానివ్వలేదు. చివరికి జెన్నీకి కన్నీటి వీడ్కోలు(Mourns) పలికింది. ఇది చూసి సర్కస్ సిబ్బంది కూడా కన్నీటిపర్యంతమయ్యారు. వారు దృశ్యాలను రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు హృదయాలను తాకింది. ఏనుగు దుఃఖం చూసి నెటిజన్లు కూడా విషాదం వ్యక్తం చేస్తున్నారు.😢💔 An elephant mourns her deceased friendIn occupied Crimea, the famous elephant Jenny passed away due to illness.Her companion, Magda, refused to let people approach for hours, hugging Jenny and staying by her side for a long time. pic.twitter.com/nY5FRJueHp— Based & Viral (@ViralBased) March 14, 2025 -
నల్లమల.. వణ్యప్రాణుల ఖిల్లా
-
వీ ఆర్ వీగన్స్
కొన్ని సంవత్సరాలుగా వీగన్స్, వీగనిజంపై విస్తృతంగా అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో వీగనిజంకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, ప్రాముఖ్యత తెలిపే సదస్సులు నిర్వహిస్తున్నారు. జంతు సంరక్షణ, మూగజీవాల హక్కుల కోసం పాటు పడటం వంటి అంశాలపై వీగన్లు, వీగన్ సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా నగరం వేదికగా మెర్సీ ఫర్ యానిమల్స్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీతార దక్ష నాగర్కర్ భాగస్వామ్యంతో మొక్కల–ఆధారిత ఆహార జీవనాన్ని ప్రోత్సహించే అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు. స్వతాహ వీగన్ అయిన దక్ష నాగర్కర్ వీగనిజం ప్రాముఖ్యత, జంతువులపై హింస వద్దంటూ ఈ ప్రచారం ద్వారా తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో వీగనిజం గురించి, ప్రస్తుత తరుణంలో దాని ప్రాధాన్యత.. తదితర అంశాల గురించి ‘సాక్షి’తో పంచుకుంది. ప్రస్తుత మానవ జీవన విధానం జంతువులను అత్యంత హీనంగా హింసిస్తోంది. ముఖ్యంగా మాంసం కోసం 2, 3 నెలల జంతువులను కృత్రిమ విధానాలతో బలవంతంగా ఎక్కువ బరువు పెంచి సృష్టి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా డైరీ పామ్స్, ఫౌల్ట్రీ, పిగ్ ఫామ్స్లో కనీసం ఒక జంతువు స్వేచ్ఛగా తిరగకుండా కేజ్లలో బందించి వాటి ఉత్పత్తులను సేకరిస్తున్నారు. కొన్ని జంతువులైతే వాటి జీవిత కాలంలో సూర్యరశి్మకి కూడా చూడకుండా పెరుగుతున్నాయి. ఇది జీవవైవిధ్యానికి విరుద్దం. దేశంలో జనాభా పెరిగిపోయింది, ఇంతమందికి సరిపడా జంతు ఉత్పత్తులు అందించలేక, బ్యాలెన్స్ చేయలేక అనైతిక బ్రీడింగ్తో హింసిస్తున్నారు. ఈ సందర్భంగా ‘పవర్డ్ బై వెజ్జీస్‘ అంటూ కూరగాయలను మాత్రమే తినాలని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాక్టరీలు, వాహనాల కాలుష్యం కన్నా ఫ్యాక్టరీ ఫార్మమింగ్తో ఎక్కువ కాలుష్యం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించడం కోసం బాగా స్పందిస్తున్నారు. వారి జీవనంలో కొనసాగుతున్న ప్రాంతీయ వీగన్ వంటకాల విశిష్టతను తెలుసుకుంటున్నారు. కానీ నగరాల్లో మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా అని వాదిస్తున్నారు. కానీ మొక్కల్లో స్టిమ్యులే మాత్రమే ఉంటుంది, జంతువుల్లో వలె నొప్పిని తెలియజేసే నాడీ వ్యవస్థ ఉండదని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీగన్స్ అంటే మాంసాన్ని మాత్రమే కాదు.. పాలు, పెరుగు, గుడ్లు వంటి జంతు పదార్థాలతో పాటు జంతు ఉత్పత్తులతో తయారు చేసిన బ్యాగ్లు, దుస్తులు ఏ ఇతర వస్తువులను వినియోగించరు. జంతువులకు వాటి స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు హింసకు దూరం చేయడం అవసరం. నేను నటించిన జాంబిరెడ్డి సినిమా షూటింగ్ సమయంలో మా దర్శకులు ఒక మేకను ఎంత జాగ్రత్తగా, సురక్షితంగా చూసుకున్నారో చూసి సంతోషపడ్డాను. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జంతువుల హింసించకూడదనే అంశంపై కొత్త చట్టాలను వెలువరించారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా జంతు పెంపకాలపై దృష్టి సారిస్తూ నియమాలను పాటిస్తుంది. సినిమాల విషయానికొస్తే త్వరలో మరో 2 సినిమాలు చేస్తున్నాను. తెలుగు ప్రజలకు దగ్గరవ్వడం చాలా సంతోషంగా ఉంది. – దక్ష నాగర్కర్జంతు సంరక్షణే లక్ష్యంగా 2016లో ప్రారంభించిన మెర్సీ ఫర్ యానిమల్స్ ఇండియా ఫౌండేషన్ దేశవ్యాప్తంగా కృషి చేస్తోంది. సంస్థ పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో క్రూరంగా పందులను పెంచడం నిషేధించారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. శాఖాహారం, మాంసాహారం ఉన్నట్లుగానే వీగన్ ఫుడ్కు కూడా లేబుల్ ఉండేలా మార్పు తీసుకొచ్చాం. జాన్ అబ్రహం, సోనాక్షి సిన్హ, సాక్షి మల్లిక్ మాదిరిగానే హైదరాబాద్లో వీగనిజం కోసం దక్షా నాగర్కర్ క్యాంపెయిన్ చేయడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఒక జంతువును చంపితే రూ.50 ఫైన్ కట్టి హాయిగా తిరుగుతున్నారు. ఒక మనిషిని చంపితే ఎలాంటి చట్టం ఉంటుందో జంతు హత్యలపై కూడా కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఉన్నత న్యాయస్థానాలకు విన్నవించాం. – నికుంజ్ శర్మ, సీఈఓ, మెర్సీ ఫర్ యానిమల్స్ ఇండియా -
అంబానీ వంతారా : పులులు, సింహాలతో నరేంద్ర మోదీ (ఫోటోలు)
-
ఔరా ఇదేమి చిత్రం.. హైదరాబాద్ రోడ్లపై అబ్బురపరిచేలా జంతువులు (ఫొటోలు)
-
రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ ఆరాధ్య దేవి 'వైల్డ్' ఫోటోగ్రఫీ.. (ఫొటోలు)
-
మొసలి అస్వస్థత
వేసవికాలం.. సుందరవనం అనే అడవిలో ఒక జింక పిల్ల అమ్మకు చెప్పకుండా బయలుదేరింది. దానికి దాహమై నీరు తాగడానికి ఒక మడుగులోకి దిగింది. ఆ మడుగులో ఒక మొసలి ఉందన్న సంగతి ఆ జింకపిల్లకు తెలియదు. అది నీటిలోకి దిగిన వెంటనే ఆ మొసలి దాని కాలును గట్టిగా పట్టుకుంది. అప్పుడది అమ్మకు చెప్పకుండా వచ్చినందుకు ఎంతో బాధపడింది. తర్వాత లేని ధైర్యం తెచ్చుకొని మొసలితో ‘ఓ మొసలి మామా! నీకు అస్వస్థతగా ఉన్నట్లు తెలుస్తోంది. దానికో మందు చెబుతాను. నన్ను వదిలిపెట్టు అంది. ఆ మొసలి నిజంగానే అస్వస్థతతో బాధపడుతున్నది. అది జింకపిల్ల మాటలకు ఆశ్చర్యపోయి ‘నీకు నా అస్వస్థత సంగతి ఎలా తెలుసు?’ అని అడిగింది. ‘నువ్వు నా తల బదులు కాలు పట్టుకున్నప్పుడే తెలిసింది’ అని చెప్పిందా జింకపిల్ల తెలివిగా. అప్పుడే అక్కడికి ఒక బుజ్జి నక్క రావడాన్ని గమనించింది జింకపిల్ల. వెంటనే అది ‘అదిగో! ఆ నక్కను తింటే నీ అస్వస్థత మాయమౌతుంది. దాన్ని పట్టుకో!’అంటూ ఆ బుజ్జి నక్కను చూపించింది. సరేనంటూ ఆ జింకపిల్లను వదిలిపెట్టింది మొసలి. ఒడ్డుకు చేరిన జింక పిల్ల ‘బతుకు జీవుడా’ అనుకుంటూ ఎదురుగా ఉన్న బుజ్జి నక్క ఆగమన్నా ఆగకుండా పరుగెత్తింది. బుజ్జి నక్కకూ ఆ మడుగులో మొసలి ఉన్న సంగతి తెలియదు. అది కూడా అమ్మకు చెప్పకుండానే వచ్చింది. ఆ జింకపిల్ల వలె అదీ నీళ్లు తాగడానికి మడుగులోకి దిగింది. అప్పుడా మొసలి బుజ్జి నక్క కాలును పట్టుకొని ‘నా అస్వస్థతకు నీ మాంసమే మందని ఆ జింకపిల్ల చెప్పింది. నిన్ను తిని నా అస్వస్థతను పోగొట్టుకుంటాను’ అన్నది. వెంటనే బుజ్జి నక్క తెలివిగా ‘అయ్యో.. నేను వింత వ్యాధితో బాధపడుతున్నాను. నన్ను తిన్నవారిక్కూడా వ్యాధి సోకుతుంది. కావాలంటే అదిగో ఆ ఒడ్డు మీదున్న తోడేలు పిల్లనడుగు’ అంది. అప్పుడు మొసలి ‘ఈ నక్క చెప్పింది నిజమేనా’ అంటూ తోడేలును అడిగింది. ‘ఔను నిజమే’ అంది తోడేలు పిల్ల. అప్పుడు నక్క ‘నీ అస్వస్థతకు సరైన మందును వైద్యుడైన ఎలుగుబంటి చెబుతుంది దాన్నడుగు’ అన్నది. దాంతో బుజ్జి నక్కను వదిలేసింది మొసలి. వెంటనే తోడేలుతో కలిసి నక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంతలోకే ఎలుగుబంటి వచ్చిందక్కడికి. మొసలి తన అస్వస్థతకు దాన్ని మందు అడిగింది. మొసలి ఆ మడుగులో ఉన్న సంగతి ఎలుగుబంటికి తెలుసు గనుక అది నీటిలోకి దిగకుండానే ఒడ్డు మీదే ఉండి, కొన్ని ఆకులను దానిపై విసిరేసి వాటిని తినమని చెప్పింది. ఆ ఆకులను ఆరగించింది మొసలి. తర్వాత ‘ఎలుగు మామా! ఆ బుజ్జి నక్కకు వింత వ్యాధి ఉందట.. నిజమేనా!’అని అడిగింది అమాయకంగా. అప్పుడు ఎలుగుబంటి నవ్వి ‘దానికా వ్యాధి ఉంటే నా దగ్గరకు వచ్చేది. ఈ అడవిలో నేను తప్ప వైద్యం చేసేవారు లేరు కదా’ అంది. ‘మరి తోడేలు కూడా అది నిజమని చెప్పిందే’ అంది మొసలి. ‘దానికది ఊతపదం. ఏం మాట్లాడినా అది ఔను! నిజమే అంటుంది. ఆ జింక పిల్ల,బుజ్జి నక్క తెలివిగలవి. ఆపదలో ఎలా తప్పించుకోవాలో చేసి చూపెట్టాయి. అయినా నువ్వు జంతువుల పిల్లల మీద పడటమేంటీ? రేప్పొద్దున నీ బిడ్డను ఏ జంతువైనా మింగేస్తే నీకెలా ఉంటుంది? అలాగే మిగిలిన జంతువులు కూడా కదా! చిన్న జంతువులకు భవిష్యత్తు ఉందని, వాటి జోలికి వెళ్లొద్దని మృగరాజు సింహం జంతువులన్నిటినీ ఆదేశించింది. అది నీకు తెలీదా? వాటిని చంపుతున్నావు కనుకనే నీ ఆరోగ్యం చెడింది. ఈ సంగతి సింహానికి తెలిస్తే ఊరుకోదు. ఇకనుంచైనా వాటి జోలికి వెళ్లకు. అదిగో! ఆ చెట్టు పండ్లను తిని కడుపు నింపుకో! అవి ఆరోగ్యాన్నిస్తాయి’ అంది ఎలుగుబంటి. ‘ఈ అడవిలో ఉన్న ఈ ఒక్క మడుగు వల్ల పాపం చిన్న జంతువులన్నీ ఈ మొసలికి చిక్కుతున్నాయి. మరికొన్ని కొలనులు తవ్వించి, జంతువుల దాహార్తి తీర్చమని సింహానికి చెప్పాలి’ అనుకుంటూ అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
నిషాలో తూగడం...ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
ప్రపంచం నలుమూలలా ఉన్న మానవ నాగరిక సమాజమంతటికి ఒక విషయం సర్వ సాధారణం : మత్తుపదార్ధం. కొన్ని పదార్ధాలు పవిత్రమైనవాటివిగా పరిగణింపబడతాయి, కానీ ఎక్కువ సార్లు, మనం కేవలం వేడుకలకో లేదా నిషా కోసమో తాగుతాం.మత్తులో స్పృహ తప్పడం మానవుల హక్కేమి కాదు. చాలా జంతువులు మత్తులో తూగడానికి ఎంతో శ్రమకోడుస్తాయి. తమిళనాడులోని బానేట్ మాకాక్లు అడవిలో దాచే అక్రమ సారాయి పీపాలను కొల్లగొట్టేవయితే, కరీబియన్ వెర్వేట్ కోతులు క్రమం తప్పక తప్పతాగి తూగుతుంటాయి. ఆ దీవిలో ఏడాది పొడుగునా సెలవల సందడి ఉండడంతో అక్కడ మత్తు పానీయాలకు ఏమి కొదవలేదు.పనికిమాలినట్టుగా అనిపించినా, వెర్వేట్ కోతుల తాగుడు అలవాట్లపై చేసిన ఒక శాస్త్రీయ అధ్యయనం, అవి అచ్చం మనుషుల్లా ప్రవర్తిస్తాయని చూపడం ఆశ్చర్యకరం. వాటిలో కొన్ని అతిగా తాగేవి ఉంటాయి - అవి త్వర త్వరగా, ఎక్కువ ఎక్కువ, తరచూ తాగుతుంటాయి. కొన్ని స్థిరంగా ఉండే తాగుబోతులు ఉంటాయి - అవి సరాసరి మద్యాన్ని సోడాగానీ, నీళ్లుగానీ కలపకుండా, క్రమం తప్పకుండా కొట్టేస్తాయి. కానీ చాలామటుకు కోతులు సామాజిక జీవనంలో భాగంగా తాగుతుంటాయి. అటువంటి కోతులు కాక్టైల్స్ ఇష్టపడతాయి. మరికొన్ని మద్యాన్ని అసలు తాకవు. అక్కడితో వాటికీ మనకీ పోలికలు ఆగవు. కొన్ని కోతులు తాగినప్పుడు నిషాలో బాగా మునిగిపోయి దూకుడుగా తయారవుతాయి, కొన్ని కఠినంగా దుర్భాషలాడతాయి, మరికొన్ని దిగాలుగా, ముభావంగా తయారవుతాయి. కానీ చాలామటుకు సంతోషంగా నిషాలో మునిగిపోతాయి…. బహుశా గులాబీ రంగు ఏనుగులను చూసిన భ్రమలో ఊగుతాయి.మామూలు నలుపురంగు ఏనుగులు కూడా కాస్త మద్యం ఎక్కువైత ఒళ్లు మర్చిపోయేంతగా విజ్రుoభిస్తాయి. జార్ఖండ్లో ఆశియా ఏనుగులు పాకల లోపల కాగుతున్న మద్యాన్నిగైకొనడానికి పాకలని నాశనం చేస్తాయని విషయం తెలిసినది. కొన్ని ఏళ్ల క్రితం, ఒక మత్తెక్కిన ఏనుగులగుంపు ఊరుమీద విరుచుకుపడి, విద్యత్ స్థంభాలను పాడగొట్టి తిరిగితూ, ఆ ప్రక్రియలో అవే విద్యుత్ షాకు తగిలి కాలిపోయాయి.పశ్చిమ దేశాలలో పిల్లులు పుదీనాలా ఉండే క్యాట్నిప్ అనే మొక్క మత్తులో మునిగిపోతాయి. పిల్లులు ఆ పుదీనా వంటి మొక్క కొమ్మల మీద పడి మూలుగుతూ, చోంగకారుస్తూ, మళ్ళీ మళ్ళీ దొర్లుతాయి. నేను కొంచం ఆ మొక్కను తెచ్చి ఇవ్వగానే, ముందెన్నడూ ఆ మొక్కని చూడని మా నాన్నగారి పిల్లి కూడా మతిపోయినట్టు ప్రవర్తించింది. కానీ కొద్ది నిముషాల తరవాత అది బాగా తేరుకుని మళ్ళీ హుందాగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏళ్ల తర్వాత అమెరికా జంతు ప్రదర్శనశాలను సందర్శించే సమయంలో, మేము ఒక కౌగర్ క్యాట్నిప్తో నింపివున్న మేజోడు పట్టుకుని వెర్రివేషాలు వేయడం చూశాము. అన్ని జాతుల పిల్లులూ ఈ క్యాట్నిప్కు ఆకార్షితమవుతాయని స్పష్టంగా తెలుస్తోంది.రాకీ కొండలలో పెద్ద కొమ్ముల గొర్రెలు మత్తు కోసం, ఒక రకమైన బూజు గోకి తినడానికి, ఎంతో ప్రమాదకరమైన కొండ చరియలుఎక్కుతాయని తెలిసినది. మరి ఈమెన్లో మేకలైతే వారి కాపారులలాగే ఖట్ ఆకుల మత్తుకు బానిసలు.ఎంతో అందంగా మిఠాయిలా కనిపించి, ఎర్ర టోపీలతో, పైన కాస్త పంచదార చల్లినట్టు ఉండీ, యాక్షినిల కథలలో కనిపించే బొమ్మల్లో అమ్మాయాకంగా కనిపించే పుట్టగొగుల పేరు ఫ్లై ఆగారికస్ పుట్టగొడుగులు. నన్ను తినకండి అని హెచ్చరించే రంగులో ఉన్నాకూడా రెయిన్ డీర్లు వాటిని తిని మత్తులో గెద్దలంత ఎత్తు ఎగురుతాయి. ఎన్నో మత్తు పదార్ధాలను రెయిన్ డీర్ మూత్ర పిండాలు వడగొట్టగలవు కనుక, వాటి మూత్రం పుట్టగొడుగులు తినటం కాంటే స్పష్టంగా ఎంతో శక్తివంతమైన మత్తు పదార్థం. మరి మత్తు కోసం ప్రాకులాడే యూరోప్ మారియు ఉత్తర ఆసియాలో గొర్రెకాపరులు చేసేది అదే!ఎన్నో శాంతా క్లాస్ పుట్టుక కథలలో ఒకటైన కథ మనని సైబీరియా వైపుకు దారితీస్తుంది. ఒక సీతాకాలం మధ్యలో వచ్చే పండుగలో, ఒక నాటు వైద్యుడు, పోగాకమ్ముకున్న ఒక ముఖం ద్వారoగుండా ఫ్లై ఆగారిక్ నిండిన సంచీని మోస్తూ ఒక యూర్ట్ ( జూలుతో చేయబడ్డ గుండ్రటి డేరా) లోపలకి ప్రవేశిస్తాడు. ప్రజలు ఈ గొడుగుల నిషాలో పడ్డ వేళ, వారి ముఖము - ముఖ్యంగా వారి బుగ్గలు, ముక్కు, ఎర్రగా మారతాయి. శాంతా, అతని ఎర్ర ముక్కు రెయిన్ డీర్ రుడోల్ఫ్, ఆకాశంలో దీనిపై ఎగురుతున్నారన్న అంచనా వేసినందుకు ఏమి బహుమతులు లేవు!శతాబ్దాలా నుంచీ సమాజం ఈ పదార్ధాలను భయంకరమైన చెడుతో కూడిన వాటిగా పరిగణించి బహిష్కరించడానికి ప్రయత్నించింది. అయినా వాటిలో మునిగి తెలడం మన ఆచ్చారాలలో ఎంత బలంగా నాటుకుందో, అది అంతే బలంగా మన జన్యువులో కూడా నాటుకుని ఉండి ఉంటుంది. పిల్లలు కూడా ఆ అనుభూతి పొందడానికి కళ్ళుతిరిగి, కాలపై నిలబడడానికి తడబడేదాకా పదే పదే గుండ్రంగా తిరిగితారు. దెర్విషలు (సన్యాసులు) కూడా మనకుకి అతీతమైన ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి ఇటువంటి పద్దతే వాడతారు. పార్స్వ ఆలోచన అనే భావాన్ని పెంపొందించిన ఎడ్వర్డ్ డి బోనో ప్రస్తావన ఇక్కడే వస్తుంది. అతను మత్తుపదార్థాలు మనని పోతపోసిన ఆలోచనా విధానాలనుంచి బయటకులాగి, ఎంతో సృజనత్మాకంగా ఆలోచింపచేయగలదని అతను సూచించాడు. అదే గనక నిజమైతే, మనసుని మార్చేటువంటి ఈ మత్తు అనుభూతులతో, ఖచ్చితంగా ఈ పాటికి ప్రపంచంలో ఎన్నో కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు మారియు ప్రయత్నలు చూసుండేవాళ్ళం. రచన : జానకి లెనిన్ ఫోటోలు: సిద్దార్థ్ రావు -
బయోడైవర్సిటీ లాస్!
పక్షులు, జంతువుల సహజ ఆవాసాల తగ్గుదల... క్షీణిస్తున్న అడవులు, తగ్గుతున్న చెట్ల విస్తీర్ణం, పచ్చదనం... ఇంకా లోతుగా విశ్లేíÙస్తే ప్రపంచవ్యాప్తంగా వేగంగా సంభవిస్తున్న వాతావరణ మార్పుల ప్రభావంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. దీంతో వన్యప్రాణులు, పక్షి, జంతు, వృక్ష... ఇలా విభిన్న రకాల జాతులు క్రమంగా తగ్గిపోతున్నాయి.భారీ ప్రాజెక్టులు, అధిక విస్తీర్ణంలో వివిధరూపాల్లో పర్యావరణంపై, ఇతర రూపాల్లో ప్రభావం చూపేలా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అవసరానికి మించి సహజ వనరుల వినియోగం, గాలి, నీరు కాలుష్య బారినపడడం వంటి వాటి వల్ల జీవవైవిధ్యంపై ప్రభావం చూపడంతో పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ‘వరల్డ్ వైల్డ్లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) లివింగ్ ప్లానెట్ రిపోర్ట్– 2024’నివేదిక ప్రకారం చూస్తే... ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్లలో వన్యప్రాణుల జనాభా సగటు సైజ్ అనేది 73 శాతం మేర తగ్గిపోయింది. జూలాజిక్ సొసైటీ ఆఫ్ లండన్ (జెడ్ఎస్ఎల్) రూపొందించిన ‘ద లివింగ్ ప్లానెట్ ఇండక్స్’ నివేదికను గమనిస్తే...1970–2020 మధ్యలో వివిధ జంతు, పక్షు జాతుల్లో 85 శాతం ఫ్రెష్ వాటర్ పాపులేషన్, టెర్రస్టియల్ పాపులేషన్ 69 శాతం, మెరైన్ పాపులేషన్ 56 శాతం తగ్గినట్టుగా తేలింది. జీవవైవిధ్యమనేది భూమి, విభిన్న రకాల మొక్కలు, వృక్షజాతులు, జంతు, పక్షి జాతులు, వివిధ రకాల సూక్ష్మజీవులు (మైక్రో ఆర్గనిజమ్స్) తదితరాలతో కూడుకుని ఉంటుంది. – సాక్షి, హైదరాబాద్తెలంగాణలో చూస్తే..వివిధ రూపాల్లో వెల్లడైన వివరాలు, సమాచారం మేరకు చూస్తే తెలంగాణలో జీవవైవిధ్యా నికి వాటిల్లిన నష్టానికి ప్రధానంగా అడవులకు వాటిల్లుతున్న నష్టం, తగ్గిపోతున్న అటవీ విస్తీర్ణం, అంతర్ గ్రహ మొక్కలు (ఇన్వెసివ్ ఎలియన్ స్పీషీస్) విపరీతంగా పెరుగుదల, మత్స్య రంగ అతి వినియోగం, కాలుష్య స్థాయిల పెరుగుదల, వాతావరణ మార్పులతో చోటుచేసుకుంటున్న పరిణామాలు వంటివి కారణమవుతున్నాయి. ⇒ 2023 జూన్ గణాంకాల ప్రకారం తెలంగాణలో 2 వేల మొక్కలు, వృక్షాల రకాలు, 5,757 జంతురకాలు ఉన్నట్టుగా తేలింది. సాధారణంగా జెనిటిక్ డైవర్సిటీ, స్పీషీస్ డైవర్సిటీ, ఎకోసిస్టమ్ డైవర్సిటీల ద్వారా జీవవైవిధ్యాన్ని పరిశీలిస్తారు. ⇒ 2023లో తెలంగాణలో 646 హెక్టార్ల సహజ అటవీ ప్రాంతం కోల్పోవాల్సి వచ్చింది. ఇండియన్ పంగోలిన్, మౌస్డీర్స్, మలబార్ పైడ్ హార్న్బిల్, బ్లాక్నెక్డ్ స్టోర్క్, రుడ్డి మంగ్యూస్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, సంద్కోల్ కార్ప్ వంటి జంతు, పక్షి రకాలు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. స్లోత్బేర్, ఇండియన్ బైసన్, ఇండియన్ స్కిమ్మర్ బర్డ్ జాతులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జీవవైవిధ్యం ఏ స్థాయిలో ఉంది, ఎదురవుతున్న సమస్యలు, అందుకు కారణాలు ఏమిటి? తదితర అంశాలపై పర్యావరణ విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ అనలిస్ట్ డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల్ తమ అభిప్రాయాలు, విశ్లేషణలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే...గ్రీన్కవర్ పెంచడమే బయో డైవర్సిటీ కాదుజీవవైవిధ్యం అంటే ఏమిటనేది అందరూ అర్థం చేసుకోవాలి. కేవలం గ్రీన్కవర్ పెంచడమే బయో డైవర్సిటీ కాదు అని గుర్తించాలి. విధాన నిర్ణేతలు, ప్రజాప్రతినిధులు కూడా గడ్డిభూములు, బీడుభూములు వంటివి కూడా పర్యావరణవ్యవస్థల పరిధిలోకి వస్తాయని గుర్తించాలి. చెట్లు అనేవి జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని మనమంతా గుర్తించాలి. భారీ ప్రాజెక్టులు, అధిక విస్తీర్ణంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల వల్ల పెద్దసంఖ్యలో చెట్ల తొలగింపు, గ్రీన్కవర్ తగ్గినప్పుడు జీవవైవిధ్యానికి నష్టం జరుగుతుంది.నగరాల్లోనూ రోడ్ల విస్తరణ, నిర్మాణపరమైన ప్రాజెక్టులు మొదలుపెట్టినప్పుడు వెంటనే ట్రీకవర్ తగ్గిపోయిన ప్రభావం తప్పకుండా జీవవైవిధ్యంపై పడుతుంది. పచ్చదనం పెంచేందుకు చేపట్టే కార్యక్రమాల సందర్భంగా గడ్డి మైదానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ విషయంపై తెలంగాణలో పెద్దగా దృష్టి సారిస్తున్న పరిస్థితులు అంతగా కనిపించడం లేదు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో తగినంత స్థాయిలో గడ్డిమైదాన ప్రాంతాలున్నాయి.వాటిని యుద్ధప్రాతిపదికన సంరక్షించాలి. అమ్రాబాద్, కవ్వాల్ పులుల అభయారణ్యాల్లో మంచిస్థాయిలో జీవవైవిధ్యమనేది అలరారుతోంది. ఇదే పద్ధతిలో రాష్ట్రంలోని జాతీయపార్కులు, శాంక్చురీలలోనూ జీవవైవిధ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్లో దాదాపు పది, పన్నెండేళ్ల క్రితం నిర్వహించిన కాప్ సదస్సు తర్వాత జీవవైవిధ్యం కొంతమేర మెరుగైంది. రాష్ట్రంలో ఎంత మేర జీవవైవిధ్యాన్ని నష్టం జరిగింది, ఏ ఏ పక్షి, చెట్లు, జంతువుల రకాలు తగ్గిపోయాయనే దానిపై పూర్తిస్థాయిలో శాస్త్రీయ పరిశీలన, అధ్యయనమేదీ జరగలేదు. అందువల్ల ఎంతమేర నష్టం జరిగింది, ఏఏ జాతులు కనుమరుగు అవుతున్నాయనే దానిపై సాధికారికంగా వ్యాఖ్యానించేందుకు అవకాశం లేదు. –ఫరీదా తంపాల్, స్టేట్ డైరెక్టర్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫర్ నేచర్–ఇండియా రాష్ట్రంలో దిగజారుతున్న జీవ వైవిధ్యం కొంతకాలంగా రాష్ట్రంలో జీవవైవిధ్యం అనేది దిగజారుతోంది. అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. కొన్ని చెట్లు, మొక్కల రకాలు కూడా అంతరిస్తున్నాయి. ఊర పిచ్చుకలు, బోరుగ పిచ్చుకలు దాదాపుగా కనబడకుండాపోగా, కాకులు, ఇతర పక్షుల సంఖ్య కూడా క్షీణిస్తోంది. కప్పలు, కొన్నిరకాల చేపలు కూడా తగ్గిపోతున్నాయి. అడవుల తగ్గుదల ప్రభావం, చెట్లు, పచ్చదనం తగ్గిపోవడం వంటి కారణాల వల్ల జంతువులు, పక్షుల ఆవాసాలు, నివసించే ప్రదేశాలు కుచించుకుపోతున్నాయి. వాటికి సరైన ఆహారం దొరకడం లేదు. పక్షులు, ఇతర జంతువులు తాగేనీరే తక్కువ కాగా, అది అంతగా లభించడం లేదు. నగరం, పట్టణాల చుట్టుపక్కల పైపులైన్లతోనే ఇళ్లకు నీటి సరఫరా, ఉపరితలంపై ఉన్న నీరు కలుషితం కావడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. పక్షులు, జంతువులు వంటి వాటికి నీరు, ఆహారం దొరక్క ఆవాస ప్రాంతాలు, గుడ్లు, సంతానం పెంపొందించుకునే అవకాశం లేకపోవడంతో పక్షి, జంతుజాతులు తగ్గిపోతున్నాయి. ప్రధానంగా అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా ప్రాజెక్టులు, ఇతర రూపాల్లో నిర్మాణాలు పెరిగిపోవడం, అవసరానికి మించి సహజవనరుల అతి వినియోగం, గణనీయంగా పెరిగిన రోడ్ల విస్తరణ, వాహనాల రాకపోకలు పెరగడం, ఆన్రోడ్డు వెహికిల్సే కాకుండా ఇసుక, మైనింగ్, ఇతర అవసరాల కోసం నీరు, ఇతర ప్రదేశాల్లోకి వాహనాల ప్రవేశం నష్టం చేస్తోంది.2012లో హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ కాప్ సదస్సు తర్వాత జీవవైవిధ్య పరిరక్షణ, అటవీ సంరక్షణ చట్టాలను నీరుగార్చారు. పిచ్చుకలు, ఇతర తగ్గిపోతున్న పక్షి, జంతుజాతులను ఎలా సంరక్షించాలనే దానిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. – డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణరంగ విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ అనలిస్ట్ -
జూబ్లీహిల్స్ రోడ్నెం. 45లో బెంగాల్ టైగర్ చూసారా..? (ఫొటోలు)
-
అదుపులోకి కర్ణాటకకు చెందిన ముగ్గురు స్మగ్లర్లు
-
Ethnoveterinary medicine 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదు
పశువైద్యంలో సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నోవెటర్నరీ ప్రాక్టీసెస్ –ఈవీపీల) ద్వారా యాంటీబయాటిక్స్ వాడకాన్ని 90% తగ్గించవచ్చంటున్నారు తమిళనాడుకు చెందిన విశ్రాంత పశువైద్య ఆచార్యుడు డా. ఎన్. పుణ్యస్వామి. గత 20 ఏళ్లుగా సంప్రదాయ పశువైద్యంపై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. ఈ చికిత్సలు పొదుగువాపు సహా 42 పశువ్యాధులను 3–5 రోజుల్లో 90% ఖచ్చితత్వంతో తగ్గిస్తున్నాయని రుజువైంది. జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి) దేశవ్యాప్తంగా వీటిని పశువైద్యంలో భాగం చేసింది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్.) సమస్యను అధిగమించాలన్నా, యాంటిబయాటిక్స్ను రక్షించుకోవాలన్నా సంప్రదాయ పశువైద్యమే మేలైన మార్గమని పుణ్యస్వామి స్పష్టం చేస్తున్నారు. రైతునేస్తం ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన ‘గోసంజీవని’ ఆంగ్ల పుస్తకావిష్కరణ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన పుణ్యస్వామితో ‘సాక్షి సాగుబడి’ ముచ్చటించింది. ముఖ్యాంశాలు. అల్లోపతి పశువైద్య శాస్త్రంలో ప్రొఫెసర్ అయిన మీ దృష్టి సంప్రదాయ ఆయుర్వేద పశు వైద్య (ఈవీపీ) పద్ధతుల వైపు ఎలా మళ్లింది?పశువైద్యానికి సంబంధించి ఇప్పుడున్న వ్యవస్థ అరకొరగా ఉందని నా అభిప్రాయం. ప్రతి పశువుకు ఆరోగ్య సేవలు అందాలి. వనరులు రైతులకు తక్కువ ఖర్చుతో పరిసరాల్లోనే అందుబాటులో ఉండాలి. చికిత్సకు పొందబోయే ఫలితంపై ఖచ్చితమైన అంచనా ఉండాలి. అల్లోపతి పశువైద్య వ్యవస్థలో ఇవి లోపించాయి. ఎంత ఖచ్చితంగా ఫలితం వస్తుందో చెప్పలేం. అందువల్లే ఆయుర్వేదం, సంప్రదాయ సిద్ధ వైద్య రీతులను 2001 నుంచి అధ్యయనం చేశా. 20 ఏళ్ల నుంచి ఈవీపీ పద్ధతులపై పనిచేస్తున్నాం. 42 పశువ్యాధులకు చికిత్సా పద్ధతులను అభివృద్ధి చేశాం. మేం సూచించిన ఇంట్లోని దినుసులతో రైతులే స్వయంగా ఈ మందులను తయారు చేసుకొని పశువైద్యం చేసుకుంటున్నారు. స్వల్ప ఖర్చుతోనే 3–5 రోజుల్లోనే 80–90% పశువ్యాధులు ఖచ్చితంగా తగ్గిపోతున్నాయి. ఇది శాస్త్రీయంగా నిర్థారణ అయిన సంప్రదాయ చికిత్స పద్ధతి. అందువల్లే ఈ సంప్రదాయ చికిత్సను జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి.) అంగీకరించింది. 2016లో నన్ను సంప్రదించింది. అప్పటి నుంచి 12 రాష్ట్రాల్లో మిల్క్ యూనియన్లతో కలసి పనిచేస్తున్నాం. పశువైద్యులకు, పాడి రైతులకు శిక్షణ ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో ఈవీపి పద్ధతుల్లో పశువైద్యం జరుగుతోంది. పొదుగు వాపు నమ్మకంగా తగ్గిపోతుందా?తప్పకుండా తగ్గి΄ోతుంది. ఎన్.డి.డి.బి. పరిధిలో వేలాది రైతుల అనుభవాలే ఇందుకు నిదర్శనం. పొదుగు వాపు నుంచి గాంగ్రీన్ వరకు 10 రకాల పొదుగు సంబంధిత జబ్బులు వస్తుంటాయి. గాంగ్రీన్ మినహా మిగతా 9 రకాల పశువ్యాధులను 3–5 రోజుల్లోనే ఈవీపీ వైద్యం ద్వారా సమర్థవంతంగా 85–90% కేసుల్లో శాశ్వతంగా తగ్గించవచ్చని నిరూపితమైంది. నేషనల్ లైవ్స్టాక్ మిషన్ ఆధ్వర్యంలో సిక్కింలో డాక్టర్లకు శిక్షణ ఇచ్చాం. బీహార్లో పశు సఖిలకు శిక్షణ ఇచ్చాం. భారత ప్రభుత్వం కూడా ఎత్నో వెటరినరీ జ్ఞానాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావటం ప్రారంభించింది. పశువైద్యంలో డిగ్రీ కోర్సు (బీవీఎస్సీ) సిలబస్లోకి ప్రభుత్వం చేర్చింది.అంతర్జాతీయంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్(ఎఎంఆర్) సమస్యను పరిష్కరించేందుకు ఈవీపీ చికిత్సలు ఉపయోగ పడతాయా?ప్రపంచవ్యాప్తంగా అందరూ యాంటీబయాటిక్ ఔషధాలను పశువైద్యంలో తగ్గించా లంటున్నారు. అయితే, వీటికి ప్రత్యామ్నాయ మందుల్ని సూచించలేక΄ోతున్నారు. ఇండియాకున్న బలమైన సంప్రదాయ విజ్ఞానం పెద్ద ఆస్థి. ఈవీపీ పద్ధతుల ఉగాండా, ఇథియోపియాలో రైతులకు శిక్షణ ఇచ్చాం. అమలు చేయటం సులభం కాబట్టి ఆయా దేశాల్లో రైతులు సత్ఫలితాలు సాధించారు. నెదర్లాండ్స్ దేశంతో, వాగనింగన్ విశ్వవిద్యాలయంతో కలసి పనిచేస్తున్నాం. అక్కడి పశువైద్యులకు శిక్షణ ఇచ్చాం. ఆహార వ్యవసాయ సంస్థ (యు.ఎన్. ఎఫ్.ఎ.ఓ.) గుర్తించిందా? ఐక్యరాజ్యసమితికి చెందిన ఎఫ్.ఎ.ఓ. కేంద్ర పశుసంవర్థక శాఖతో కలసి ఇటీవలే ‘స్టాండర్డ్ వెటరినరీ ట్రీట్మెంట్ గైడ్లైన్స్’ను విడుదల చేసింది. ఇందులో కూడా ఈవీపీ సంప్రదాయ చికిత్సా పద్ధతులను చేర్చింది. అల్లోపతి పశువైద్య చికిత్సా పద్ధతి ఆధిపత్యం గురించో, మరో పద్ధతి ఆధిపత్యం నిరూపణ గురించో మనం మాట్లాడటం లేదు. ఒక జబ్బుకు చికిత్స అందించే సమయంలో పశువైద్యులకు, రైతులకు అనేక రకాల చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండేలా చూడాలంటున్నాం. ఇప్పటికే అమల్లో ఉన్న అల్లోపతి పశువైద్య చికిత్సా పద్ధతిని తీసివేసి సంప్రదాయ మూలికా వైద్య పద్ధతులను ఆచరణలోకి తేవాలని మేం అనుకోవటం లేదు. ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకండి. నేనూ అల్లోపతి పశువైద్య శాస్త్రం చదువుకున్న వాడినే. రోగ నిర్థారణకు అల్లోపతి జ్ఞానాన్ని, చికిత్సకు సంప్రదాయ పద్ధతిని వాడుతూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం.యాంటీబయాటిక్స్ వాడకం తగ్గుతుందా? పొదుగు వాపు వ్యాధి చికిత్సలో కూడా 90% కేసులలో యాంటీబయాటిక్ మందులను వాడాల్సిన అవసరం లేదు. దూరంలో ఉన్న వైద్యులు టెలిమెడిసిన్ వ్యవస్థ ద్వారా పశువులకు సత్వర చికిత్సను అందించడానికి ఈవిఎం చికిత్సా పద్ధతులు ఎంతో అనువైనవి. ఇతర వైద్య పద్ధతుల్లో ఇది వీలు కాదు. రైతులు నేర్చుకొని, అవసరం వచ్చినప్పుడు తమంతట తాము ఆచరించదగిన గొప్ప పద్ధతి ఎత్నోవెటరినరీ మెడిసిన్. పశువులకు గాలికుంటు వ్యాధి (ఎఫ్.ఎం.డి.) వంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఫోన్ ద్వారా రైతులకు సూచనలు ఇచ్చి చికిత్స చేయవచ్చు. 35–40 ఏళ్లలో ఏ ఒక్క కొత్త యాంటీ బయాటిక్ను తయారు చేసుకోలేకపోయాం. అదే సమయంలో మనుషుల చికిత్సకు వాడాల్సిన అనేక యాంటీ బయాటిక్స్ను పశు వైద్యంలో విస్తృతంగా వాడటంతో ఆ యాంటీబయాటిక్స్ రోగకారక క్రిముల నిరోధకత (మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెన్స్)ను పెంపొందించు కున్నాయి. దీంతో ఆ యాంటీబయాటిక్స్ పనిచేయక మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. యాంటీబయాటిక్ ఔషధాలను మనం రక్షించుకోవాలి. యాంటీబయాటిక్ ఔషధాల జోలికి పోకుండానే పశువుల్లో జ్వరం, విరేచనాలు వంటి సాధారణ జబ్బులకు వైద్యం చేయటానికి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులను ఆచరించాలి.దేశీ ఆవులు, సంకరజాతి ఆవులు, బర్రెలు అన్నిటికీ ఈ వైద్యం పనిచేస్తుందా?ఏ జాతి పశువులకైనా తప్పకుండా పనిచేస్తుంది. సంకరజాతి ఆవుల్లో మాదిరిగా అధిక పాలు ఇచ్చే సాహివాల్ ఆవుల్లోనూ పొదుగు సంబంధిత సమస్యలు ఎక్కువే. వీటన్నిటికీ ఈవీపీలో నమ్మదగిన పరిష్కారం ఉంది. కృష్ణా మిల్క్ యూనియన్లో పొడి రైతులు ఈవీపీల చికిత్స ద్వారా పొదుగువాపు తదితర జబ్బులతో పాటు వంధ్వత్వం వంటి సమస్యలను సైతం అధిగమించారు.కోళ్ల వ్యాధులకు కూడా..?కోళ్ల ఫారాల్లో కూడా ఈవీపీ చికిత్సలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. నేల ఉసిరి (భూమి ఆమ్ల), జిలకర్ర కలిపి నూరి, ఉండలు చేసి.. గంట గంటకు కొక్కెర సోకిన కోళ్లకు తినిపిస్తే 1–2 రోజుల్లోనే తగ్గిపోతుంది. ఇలా ఏ జాతి పశువులైనా, కోళ్లయినా, బాతులైనా.. వాటికి ఇతర ఔషధాల మాదిరిగానే ఈవిఎం మందులను కూడా తయారు చేసుకొని వాడుకోవచ్చు.అల్లోపతి పశువైద్య చికిత్సా పద్ధతిని తీసివేసి సంప్రదాయ మూలికా వైద్య పద్ధతులను ఆచరణలోకి తేవాలని మేం అనుకోవటం లేదు. ఒక జబ్బుకు చికిత్స అందించే సమయంలో పశువైద్యులకు, రైతులకు అనేక రకాల చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండేలా చూడాలంటున్నాం. సేంద్రియ పాల ఉత్పత్తికి ఈవీపీలు దోహదం చేస్తాయా?నిస్సందేహంగా. అంతర్జాతీయంగా ఇటీవల ‘మెడిసినల్ అగ్రోఎకాలజీ’ భావన బలం పుంజుకుంటున్నది. పంటలనే కాదు పశువులను కూడా రసాయనాల్లేకుండా పెంచటమే ఇందులో ముఖ్యాంశం. (నవంబర్ 18 నుంచి ‘వరల్డ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వీక్’ సందర్భంగా..)నిర్వహణ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
అడవిలో అమ్మప్రేమ!
పులి – ఆవు.. పాము – కాకి నీతి కథలుఅందరికీ తెలిసే ఉంటాయి. కథల సారాంశం ఏదైనా.. అందులో తల్లి ప్రేమ కనిపిస్తుంది. మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లో కూడా కమ్మనైన అమ్మతనం ఎంతో మధురం. తల్లి జంతువు ప్రేమ ముందు ఏ ప్రాణి అయినా, జీవి అయినా తలవంచక తప్పదు.తన కళ్లముందు తన బిడ్డకు కష్టం వస్తే తిరగబడి పోరాడుతుంది. ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా అడవుల్లో కనిపిస్తాయి. అతి చిన్న ప్రాణి అయిన గిజిగాడు మొదలు అతి క్రూరమైన జంతువులుగా చెప్పుకునే పులి, చిరుత, ఎలుగుబంటి వంటి జంతువుల వరకు వాటి పిల్లల లాలన చూస్తే ‘తల్లి ప్రేమ అడవంతా’ అని అనకమానరు.– ఆత్మకూరు రూరల్పశుపక్షాదుల్లో తల్లి ప్రేమను దగ్గరిగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. కోతి, పిల్లులు తమ పిల్లల పెంపకం అందరికీ తెలిసే ఉంటుంది. మాతృప్రేమలో మాత్రం మర్కటాలు మనుషులకే పాఠాలు చెబుతాయి. ఇక పిల్లి నిండు గర్భంతో ఉన్నపుడే తను ప్రసవించే ప్రదేశాన్ని ఎంచుకుని ప్రసవానంతరం కొంత సమయ వ్యత్యాసంతో పిల్లలను కనీసం ఏడు చోట్లకు మార్చడం దాని విశిష్ట లక్షణం. కీటకాలు, పక్షులు, జంతువుల్లో తల్లి ప్రేమ నిశితంగా పరిశీలిస్తే ఔరా.. అనాల్సిందే.నల్లమల అడవుల్లో పెద్దపులులు ప్రధాన రక్షిత జీవి. అంతరించి పోయే దశకు చేరుకుంటున్న వాటి సంతతిని పెంచి పోషించడంలో ఆడ పులులు ఒక యుద్ధ్ధమే చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఈతలోనూ రెండు నుంచి నాలుగు పిల్లలకు జన్మనిచ్చే ఆడపులి వాటిని పెంచడంతో ఎంతో క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. పులి పిల్లలకు ప్రధాన ముప్పు మగపులుల నుంచే ఉంటుంది. సాధారణంగా పులి తన పిల్లలకు మూడేళ్ల వయçస్సు దాటేంత వరకు అవి స్వయంగా తమ ఆహారం సంపాదించుకునే నైపుణ్యం పొందే వరకు తిరిగి సమాగానికి సిద్ధపడదు. అందుకే మగ పులులు ఈ పిల్లలను అడ్డు తొలగిస్తే ఆడపులితో సమాగానికి సిద్ధ పడవచ్చనే ధోరణే పులి పిల్లలకు ప్రమాదం తెచ్చి పెడుతుంది.అందుకే తన సంతానం సమీపంలోకి మగపులి రాకుండా ఆడపులి తరిమి కొడుతుంది. పులిపిల్లలకు మరో ప్రమాదం నక్క, తోడేలు, కొండ్రాసిగాడుగా పిలువబడే దొమ్మలగొండి (హైనా)వంటి స్కావెంజర్ జంతువుల నుంచి కూడా పొంచి ఉంటుంది. తల్లి పులి ఆహారం కోసం వెళ్లినప్పుడు ఈ జంతువులు పులి పిల్లలకు హాని కలిగిస్తాయి. అందుకే తల్లి పులి తన పిల్లలను గుహల్లో, చెట్టు బొరియల్లో ఉంచి వాటి ఉనికి బయటకు తెలియనంతగా జాగ్రత్త పడుతుంది. ఆహార సేకరణ కోసం పెద్దగా పిల్లలను విడిచి దూరం వెళ్లదు. పిల్లలు కాస్త తిరుగాడే వయస్సు వచ్చినపుడు వాటిని వెంట పెట్టుకునే వేటకు ఉపక్రమిస్తుంది. అప్పుడు పులి పిల్లలు మొదట తల్లి చేసే వేట పద్ధతులను పరిశీలిస్తూ మెల్లమెల్లగా వేటాడేందుకు సిద్ధమవుతాయి.ఆహారం భద్రపరిచి.. కూనల కడుపు నింపిపిల్లి కుటుంబానికే చెందిన చిరుతపులి (లెప్పర్డ్) కూడా రెండు నుంచి మూడు పిల్లలను పెడుతుంది. ఇది కూడా పెద్దపులిలాగే పిల్లల కోసం అత్యంత అప్రమత్తంగా సంచరిస్తుంది. పిల్లి జాతిలో పిల్లి తరువాత చెట్టు ఎక్కగలిగే సామర్థ్యం ఉన్న ఏకైక పులి చిరుత మాత్రమే.ఈ ప్రత్యేకతను తన పిల్లలకు ఆహారం దాచి పెట్టే విషయంలో ఉపయోగించుకుంటుంది. పిల్లలను భధ్రమైన చోట దాచి వేటకు వెళ్లి తాను చంపి తెచ్చిన వేట జంతువు కళేబరాన్ని పిల్లల ముందు ఆహారంగా వేస్తుంది. అవి తినగా మిగిలిన భాగాన్ని చెట్టు కొమ్మపై భద్రపరచి మరుసటి రోజు మళ్లీ ఆకలిగొన్న పిల్లలకు పెడుతుంది.అంతా.. ఏకాంతం..ఎత్తైన, ముదిరిన వృక్షాల కాండాలపై సహజంగా ఏర్పడ్డ తొర్రలను ఆడ హార్న్బిల్ గూడుగా ఎంపిక చేసుకుంటుంది. వయస్సు కొచ్చిన మగపక్షి తనతో జతగట్టేందుకు అంగీకరించిన ఆడపక్షితో కలసి ఇలాంటి తొర్రల్లో ప్రవేశిస్తు్తంది. ఆపై ఆడపక్షి తొర్ర ప్రవేశ మార్గాన్ని చెట్ల బెరళ్లు, కర్ర పుల్లలు, బంక మట్టితో కలిపి మూసివేస్తుంది. గాలి చొరబడేందుకు మాత్రం చిన్న రంధ్రాన్ని మాత్రం ఉంచుకుంటుంది. సమాగమనంతరం మగ పక్షి మూసిన ప్రవేశ మార్గాన్ని తిరిగి తెరుచుకుని బయటకు వస్తుంది.ఆడపక్షి మాత్రం గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను చేసే వరకు గూటిలోనే జైలు జీవితం గడుపుతుంది. మూసివేయబడిన తొర్ర ప్రవేశ మార్గానికి ఏర్పరచిన చిన్నపాటి రంధ్రం ద్వారానే ఆడపక్షికి.. మగపక్షి ఆహారాన్ని అందిస్తుంది. అనంతరం ఆడపక్షి గూటి వెలుపలికి వచ్చి పిల్లలున్న గూటిని తిరిగి మూసి వేస్తుంది. ఆ తరువాత పక్షి దంపతులు కలసి పిల్లల పోషణ భారం వహిస్తాయి. పిల్లలకు రెక్కలొచ్చి గాలిలో ఎగిరే వరకు ఈ తరహా రక్షణలోనే వాటి పోషణ సాగుతుంది.నీ ప్రేమ భల్లూకం గాను..వన్యప్రాణుల్లో తల్లులన్నింటిలోను ఎలుగుబంటి అమితమైన ప్రత్యేక శైలి కలిగినది. ఆడ ఎలుగు బంటి తన పిల్లలను వాటికి వేగంగా పరిగెత్తగల వయçస్సు వచ్చే వరకు తన మూపున మోసుకుని తిరుగుతూ ఉంటుంది. పుట్టలు తవ్వి చెదపురుగులను, చెట్టు ఎక్కి తేనె పట్టును తెచ్చి పిల్లలకు పెడుతూ ఎంతో ప్రేమ పూర్వకంగా పిల్లలను సాకుతుంది. పిల్లలున్న ఎలుగు బంటి మరింత క్రోధంతో సమీపంలోకి వచ్చే జంతువును, మనిషిని చీల్చి చెండాడుతుంది. ళీ నల్లమలలోని హనీబాడ్జర్ నేల బొరియలలో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. తమ పిల్లలు ఇతర జంతువుల బారిన పడకుండా బొరియలో ప్రత్యేక గదులు తవ్వుకుని రక్షణ కల్పిస్తాయి. గిజిగాడు పక్షి అందమైన గూళ్లను అత్యంత భధ్రమైన ప్రదేశాలలో (చిటారు కొమ్మలకు నీటి తలం అంచున) కట్టి అందులో గుడ్లను పొదిగి పిల్లలకు నిరంతరం కీటకాలను, ధాన్యం గింజలను ఆహారంగా అందించి పెంచుతుంది.కందిరీగలు వివిధ కీటకాల లార్వాలను తీసుకు వచ్చి గూడులో ఉన్న పిల్లలకు ఆహారంగా పెడతాయి.తేనె టీగలు తెట్టెలో షడ్భుజాకారంలో ఉండే గదుల్లో ఉండే పిల్ల ఈగలకు అవి సేకరించిన మకరందాన్ని ఆహారంగా అందిస్తాయి.రేచుకుక్కలు (వైల్డ్ డాగ్స్) వేట జంతువులను చంపి మాంసాన్ని కడుపులో నిల్వ చేసుకుని తమ పిల్లల వద్దకు వెళ్లి వాటి ముందు మాంస కండలను కక్కి తినిపిస్తాయి. -
మహాప్రాణులకు మళ్లీ జీవం!
డైనోసార్లు, మామత్లు వంటి ప్రాణులను ఇప్పటి వరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనూ, టీవీ సిరీస్లలోను మాత్రమే చూశాం. ఇలాంటి ప్రాణుల్లో కొన్ని త్వరలోనే మన కళ్ల ముందు సజీవంగా కనిపించనున్నాయి. సహస్రాబ్దాల కిందట అంతరించిపోయిన ప్రాణులు మొదలుకొని, మన కళ్ల ముందే కనుమరుగైపోయిన చాలా ప్రాణులు తిరిగి ప్రాణం పోసుకోనున్నాయి. అంతరించిపోయిన ప్రాణుల పునరుత్థానానికి ఇప్పటి శాస్త్రవేత్తలు సాగిస్తున్న ప్రయత్నాలపై ఒక విహంగ వీక్షణమే ఈ కథనం.పన్యాల జగన్నాథదాసుఈ భూమ్మీద తొలి జీవకణం ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలీదు. భూమ్మీద మనుషులు పుట్టక ముందే ఎన్నో జీవజాతులు ప్రాణం పోసుకున్నాయి. వాటిలో కొన్ని జీవజాతులు ఆదిమానవుల కాలంలోనే అంతరించిపోయాయి. మన కాలంలోనూ మరికొన్ని జీవజాతులు అంతరించిపోయాయి. ఇంకొన్ని జీవజాతులు ప్రమాదం అంచుల్లో అంతరించిపోయే దశకు చేరువగా ఉన్నాయి. ఒకప్పుడు భూమ్మీద సంచరించిన డైనోసార్లు, మామత్లు వంటి వాటి గురించి పుస్తకాల ద్వారా, సైన్స్ఫిక్షన్ సినిమాల ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతున్నామే తప్ప వాటిని ఈ భూమ్మీద సజీవంగా చూసిన మనుషులెవరూ ఇప్పుడు లేరు. శతాబ్దాల కిందటే అంతరించిన కొన్ని జీవజాతులు సమీప భవితవ్యంలోనే తిరిగి మన కళ్ల ముందు కనిపించనున్నాయి. అంతరించిపోయిన ప్రాణుల పునరుజ్జీవానికి శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా కొనసాగిస్తున్న ప్రయోగాల్లో కొన్ని ఒక కొలిక్కి వచ్చాయి. మరో నాలుగేళ్లలోనే మామత్కు మళ్లీ ప్రాణం పోయనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే రీతిలో మరిన్ని జీవులకూ పునర్జీవం కల్పించనున్నట్లు చెబుతున్నారు. అంతరించిపోయిన జీవులకు తిరిగి ప్రాణం పోసే ప్రక్రియను ‘జైవ పునరుత్థానం’గా (బయో రిసరెక్షన్) అభివర్ణిస్తున్నారు.మరో నాలుగేళ్లలోనే మామత్ పునరుత్థానంఎప్పుడో మంచుయుగంలో అంతరించిపోయిన ప్రాణి మామత్. ఏనుగులాంటి భారీ జంతువు ఇది. దీనికి ఏనుగులాగానే తొండం, దంతాలతో పాటు ఒంటి నిండా దట్టంగా రోమాలు ఉండేవి. భూమ్మీద మంచు యుగం 26 లక్షల ఏళ్ల కిందటి నుంచి 11 వేల ఏళ్ల కిందటి వరకు కొనసాగింది. ఆ కాలంలోనే మామత్ భూమ్మీద సంచరించేది. మంచుయుగం ముగిసిన తర్వాత మామత్ జనాభా క్రమంగా క్షీణించింది. నాలుగు వేల ఏళ్ల కిందట ఇది పూర్తిగా అంతరించిపోయింది. సహస్రాబ్దాల కిందటే అంతరించిపోయిన మామత్కు పునర్జీవం కల్పించేందుకు శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మామత్ 2028 నాటికల్లా పునరుత్థానం చెందుతుందని, అప్పటికల్లా దీనికి మళ్లీ ప్రాణం పోయనున్నామని అమెరికన్ స్టార్టప్ కంపెనీ ‘కలోసల్ బయోసైన్సెస్’కు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల ప్రకటించారు.‘కలోసల్ బయోసైన్సెస్’ అమెరికాలోని తొలి డీ–ఎక్స్టింక్షన్ కంపెనీ. మామత్ పునరుత్థానం కోసం దీనికి చెందిన అత్యంత కీలకమైన జన్యువులను సేకరించామని ఈ కంపెనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రాణుల పునరుత్థానం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కంపెనీకి ‘పేపాల్’ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్, సెలబ్రిటీ మోటివేషనల్ స్పీకర్ టోనీ రాబిన్స్ వంటి ప్రముఖులే కాకుండా, అమెరికన్ గూఢచర్య సంస్థ సీఐఏ కూడా భారీ స్థాయిలో నిధులు సమకూరుస్తున్నట్లు అమెరికన్ వార్తా సంస్థ ‘ది ఇంటర్సెప్ట్’ వెల్లడించింది. ‘తొలి మామత్కు 2028 ద్వితీయార్ధం నాటికల్లా ప్రాణం పోయాలని లక్ష్యం నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం అదే పనిలో పురోగతిలో కొనసాగుతున్నాం.అంతరించిపోయిన జీవుల్లో మొదటిగా పునరుత్థానం పొందే ప్రాణి మామత్ మాత్రమే కాగలదు. దీని గర్భధారణ వ్యవధి ఇరవైరెండు నెలలు. మామత్ జన్యువుల్లో 99.5 శాతం జన్యువులు ఆసియన్ ఏనుగుల్లో ఉన్నాయి. జన్యు సవరణ, మూలకణాల అనుసంధానం ప్రక్రియల ద్వారా ఆడ ఆసియన్ ఏనుగు అండానికి ఫలదీకరణ జరిపి మామత్కు పునరుత్థానం కల్పించనున్నాం’ అని కలోసల్ బయోసైన్సెస్ సీఈవో బెన్ లామ్ తెలిపారు.‘జురాసిక్ పార్క్’ మాదిరిగా కాదు స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలోని సైన్స్ ఫిక్షన్ సినిమా ‘జురాసిక్ పార్క్’ చాలామంది చూసే ఉంటారు. ఇదే పేరుతో మైకేల్ క్రైటన్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో ఒక పారిశ్రామికవేత్త క్లోనింగ్ ద్వారా పునర్జీవం కల్పించిన డైనోసార్లతో ఒక థీమ్ పార్కు ఏర్పాటు చేస్తాడు. డైనోసార్ల బాగోగులను చూసుకునే ఒక వ్యక్తిని వెలాసిరేప్టర్ జాతికి చెందిన డైనోసార్ చంపేస్తుంది. ఇందులో క్లోనింగ్ కోసం అంతరించిన డైనోసార్ల డీఎన్ఏ ఉపయోగించినట్లుగా ఉంది. కలోసల్ బయోసైన్సెస్ జరుపుతున్న ప్రయోగాల్లో మాత్రం డీఎన్ఏను నేరుగా ఉపయోగించడం లేదు. ‘ జురాసిక్ పార్క్లో మాదిరిగా మేము మామత్ డీఎన్ఏను తీసుకుని, దాంతో ఆసియన్ ఏనుగు జన్యువుల రంధ్రాలను పూడ్చే పని చేయడం లేదు. సవరించిన మామత్ జన్యువులను, మూలకణాలను ఆరోగ్యకరమైన ఆడ ఆసియన్ ఏనుగు అండంలోకి ప్రవేశపెట్టి ఫలదీకరణ జరపనున్నాం’ అని బెన్ లామ్ వివరించారు.దశాబ్ద కాలంగా సంఘటిత కృషి అంతరించిపోయిన ప్రాణుల పునరుత్థానికి దాదాపు దశాబ్ద కాలంగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సంఘటితంగా కృషి చేస్తున్నారు. ప్రాణుల పునరుత్థాన ప్రయోగాల కోసం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్కు (ఐయూసీఎన్) చెందిన స్పీసీస్ సర్వైవల్ కమిషన్ 2014లో డీ ఎక్స్టింక్షన్ టాస్క్ఫోర్స్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇందులో వివిధ దేశాలకు చెందిన తొమ్మిదివేల మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఈ టాస్క్ఫోర్స్లోని శాస్త్రవేత్తలు అంతరించిపోయిన ప్రాణుల్లో వేటికి పునరుత్థానం కల్పిస్తే, పర్యావరణానికి ఎక్కువగా మేలు కలుగుతుందో గుర్తించడంతో పాటు ప్రాణుల పునరుత్థాన ప్రయోగాల కోసం ఎంపిక చేసుకున్న ప్రక్రియల సాధ్యాసాధ్యాలపై తమ విశ్లేషణలను అందిస్తారు. మామత్తో పాటు మరికొన్ని అంతరించిపోయిన ప్రాణులకు కూడా తిరిగి ప్రాణం పోయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అంతరించిన ప్రాణులకు చెందిన జన్యుపదార్థాలను సేకరించి, వివిధ దశల్లో ప్రయోగాలు చేస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.క్వాగాఇది జీబ్రా జాతికి చెందిన జంతువు. జీబ్రాలా క్వాగాకు ఒంటి నిండా చారలు ఉండవు. తల నుంచి ఛాతీ భాగం వరకు చారలు ఉంటాయి. ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. తల నుంచి ముదురు రంగులో ఉండే ఛారలు ఛాతీ భాగం వద్దకు వచ్చే సరికి మసకబారుతాయి. క్వాగాలు ఒకప్పుడు దక్షిణాఫ్రికాలో విరివిగా కనిపించేవి. చిట్టచివరి క్వాగా 1878లో మరణించినట్లుగా రికార్డులు ఉన్నాయి. అంతరించిపోయిన క్వాగాకు తిరిగి ప్రాణం పోసేందుకు 1987లో ‘క్వాగా ప్రాజెక్టు’ ప్రారంభమైంది. జీబ్రా జాతుల్లోని బర్షెల్స్ జీబ్రాలో క్వాగా జన్యువులు అధిక శాతం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. బర్షెల్స్ జీబ్రా ద్వారా క్వాగా పునరుత్థానానికి వారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.ఎలిఫంట్ బర్డ్ఎగరలేని భారీ పక్షుల్లో ఎలిఫంట్ బర్డ్ ఒకటి. మడగాస్కర్లో ఈ పక్షులు విరివిగా ఉండేవి. స్థానికులు ఇష్టానుసారం వీటిని వేటాడి తినేయడంతో దాదాపు వెయ్యేళ్ల కిందటే ఇవి అంతరించిపోయాయి. మడగాస్కర్లో పరిశోధనలు సాగిస్తున్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు ఎలిఫంట్ బర్డ్ గుడ్ల శిలాజాలు దొరికాయి. వాటి నుంచి వారు ఎలిఫంట్ బర్డ్ జన్యు పదార్థాలను సేకరించగలిగారు. ఎలిఫంట్ బర్డ్ పక్షుల్లో ఎనిమిది జాతులు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. డోడో మాదిరిగానే ఎలిఫంట్ బర్డ్కు కూడా తిరిగి ప్రాణం పోసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.స్టెల్లర్స్ సీ కౌఇది తిమింగలంలాంటి భారీ జలచరం. ఒకప్పుడు అలాస్కా, రష్యాల మధ్య బేరింగ్ సముద్రంలో కమాండర్ దీవుల చుట్టూ కనిపించేది. పర్యావరణ మార్పులు, విచ్చలవిడిగా సాగిన వేట ఫలితంగా స్టెల్లర్స్ సీ కౌ జాతి పద్దెనిమిదో శతాబ్దిలో అంతరించిపోయింది. చివరిసారిగా ఇది 1768లో కనిపించినట్లుగా రికార్డులు ఉన్నాయి. జర్మన్ ప్రకృతి శాస్త్రవేత్త జార్జ్ విల్హెల్మ్ స్టెల్లర్ 1741లో ఈ జలచరం గురించి తన రచనల్లో విపులంగా వర్ణించాడు. అందువల్ల దీనికి అతడి పేరు మీదుగా ‘స్టెల్లర్స్ సీ కౌ’ అనే పేరు వచ్చింది. బేరింగ్ దీవి తీరంలో స్టెల్లర్స్ సీ కౌ పూర్తి అస్థిపంజరం 1987లో శాస్త్రవేత్తలకు దొరికింది. దీని ఆధారంగా జన్యు పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు స్టెల్లర్స్ సీ కౌకు పునరుత్థానం కల్పించడం సాధ్యమేనని, ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నామని చెబుతున్నారు.ఐరిష్ ఎల్క్జింక జాతుల్లో అతిపెద్ద జంతువు ఇది. సహస్రాబ్దాల కిందట భూమ్మీద సంచరించేది. ఐర్లండ్ నుంచి సైబీరియాలోని బైకాల్ సరస్సు వరకు గల ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఉండేది. పర్యావరణ కారణాల వల్ల, మనుగడకు సంబంధించిన పరిమితుల వల్ల ఐరిష్ ఎల్క్ జాతి ఏడువేల ఏళ్ల కిందటే అంతరించింది. ప్రస్తుతం భూమ్మీద మనుగడ సాగిస్తున్న జింక జాతుల్లో ఐరిష్ ఎల్క్ జన్యువుల్లో ఎక్కువ శాతం జన్యువులు ఉన్న జాతి ఫ్యాలో డీర్ అని శాస్త్రవేత్తలు గుర్తించారు. పంతొమ్మిదో శతాబ్ది నుంచి సాగిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలకు ఐర్లండ్లో ఐరిష్ ఎల్క్ అస్థిపంజరాలు విరివిగా దొరికాయి. వీటి ఆధారంగా ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఫ్యాలో డీర్ ద్వారా ఐరిష్ ఎల్క్కు పునర్జీవం కల్పించవచ్చనే అంచనాతో ఆ దిశగా ప్రయోగాలు చేస్తున్నారు.వూలీ రైనోసరస్ఇది ఖడ్గమృగం జాతికి చెందిన భారీ జంతువు. ఖడ్గమృగం శరీరం నున్నగా ఉంటే, దీనికి మాత్రం ఒంటి నిండా దట్టంగా రోమాలు ఉంటాయి. ఈ జంతువు సహస్రాబ్దాల కిందటే అంతరించిపోయింది. పర్యావరణ మార్పుల ఫలితంగా దాదాపు 8,700 ఏళ్ల కింద వూలీ రైనోసరస్ అంతరించిపోయినట్లు శాస్త్రవేత్తల అంచనా. మామత్కు ఏనుగు ద్వారా పునర్జీవం కల్పించే ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగానే, వూలీ రైనోసరస్కు ఖడ్గమృగం ద్వారా పునర్జీవం కల్పించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్నారు.ఆరోక్స్ఇది గోజాతికి చెందిన పురాతన జంతువు. ఇవి మిగిలిన జాతుల ఎద్దులు, ఆవుల కంటే భారీగా ఉంటాయి. నాలుగేళ్ల కిందటి వరకు ఆసియా, యూరోప్, ఉత్తరాఫ్రికా ప్రాంతాల్లో ఇవి విరివిగా ఉండేవి. ఆ తర్వాత పదిహేడో శతాబ్దం ప్రారంభం నాటికి ఇవి పూర్తిగా అంతరించిపోయాయి. ఆరోక్స్ జాతికి తిరిగి ప్రాణం పోయడానికి శాస్త్రవేత్తలు 2009 నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికీ మనుగడలో ఉన్న పురాతన గోజాతుల్లో ఆరోక్స్ డీఎన్ఏ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆరోక్స్ డీఎన్ఏ ఎక్కువ శాతం ఉన్న గోజాతులను ప్రత్యేకంగా ఎంపిక చేసి, వాటి ద్వారా ఆరోక్స్ జాతికి పునరుత్థానం కల్పించడానికి ప్రయోగాలు చేస్తున్నారు.టాస్మానియన్ టైగర్పెద్దపులి మాదిరిగానే దీని ఒంటి మీద చారలు ఉంటాయి గాని, ఇది తోడేలు జాతికి చెందిన జంతువు. ఒకప్పుడు టాస్మానియా ప్రాంతంలో విరివిగా సంచరించిన ఈ జంతువుకు ఒంటి మీద చారల కారణంగా ‘టాస్మానియన్ టైగర్’ అనే పేరు వచ్చింది. కొందరు దీనిని ‘టాస్మానియన్ వూల్ఫ్’ అని కూడా అంటారు. ఈ జంతువు దాదాపు శతాబ్దం కిందట అంతరించిపోయింది. దాదాపు 110 ఏళ్ల కిందట చనిపోయిన టాస్మానియన్ టైగర్ అస్థిపంజరం నుంచి శాస్త్రవేత్తలు దీని ఆర్ఎన్ఏను సేకరించారు. ఈ ఆర్ఎన్ఏను ఇథనాల్లో భద్రపరచారు. దీని ద్వారా టాస్మానియన్ టైగర్కు తిరిగి ప్రాణం పోయడానికి కలోసల్ బయోసైన్సెస్ కంపెనీ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సిటీకి చెందిన ‘థైలాసైన్ ఇంటిగ్రేటెడ్ జెనెటిక్ రిస్టరేషన్ రీసెర్చ్ లాబ్ శాస్త్రవేత్తల సహకారంతో ప్రయోగాలు సాగిస్తోంది.వూలీ రైనోసరస్ఇది ఖడ్గమృగం జాతికి చెందిన భారీ జంతువు. ఖడ్గమృగం శరీరం నున్నగా ఉంటే, దీనికి మాత్రం ఒంటి నిండా దట్టంగా రోమాలు ఉంటాయి. ఈ జంతువు సహస్రాబ్దాల కిందటే అంతరించిపోయింది. పర్యావరణ మార్పుల ఫలితంగా దాదాపు 8,700 ఏళ్ల కింద వూలీ రైనోసరస్ అంతరించిపోయినట్లు శాస్త్రవేత్తల అంచనా. మామత్కు ఏనుగు ద్వారా పునర్జీవం కల్పించే ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగానే, వూలీ రైనోసరస్కు ఖడ్గమృగం ద్వారా పునర్జీవం కల్పించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్నారు.ది గ్రేట్ ఆక్ఇది చూడటానికి పెంగ్విన్లా కనిపించే ఎగరలేని పక్షి. వేటగాళ్ల తాకిడి వల్ల ది గ్రేట్ ఆక్ పక్షిజాతి పంతొమ్మిదో శతాబ్దిలో అంతరించిపోయింది. చిట్టచివరి ది గ్రేట్ ఆక్ పక్షిని 1844 జూలైలో వేటగాళ్లు చేజిక్కించుకుని, చంపి తినేసినట్లు రికార్డులు ఉన్నాయి. స్పెయిన్ ఉత్తర తీరం నుంచి కెనడా వరకు అట్లాంటిక్ తీర ప్రాంతమంతటా ఈ పక్షులు ఒకప్పుడు విరివిగా ఉండేవి. ధ్రువపు ఎలుగుబంట్లు ఈ పక్షులను తినేవి. వాటి కంటే ఎక్కువగా మనుషులు వేటాడి తినేవారు. ది గ్రేట్ ఆక్ పునరుత్థానం కోసం శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. టెక్సస్లోని ఏ అండ్ ఎం యూనివర్సిటీ, ఆస్ట్రేలియన్ యానిమల్ హెల్త్ లేబొరేటరీ వంటి సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ దిశగా ప్రయోగాలు కొనసాగిస్తున్నారు.శాస్త్రవేత్తల ప్రయోగాలు ఫలించినట్లయితే, అంతరించిపోయిన జీవరాశుల్లో కనీసం కొన్ని అయినా తిరిగి ప్రాణం పోసుకోగలవు. వాటి వల్ల భూమ్మీద జీవవైవిధ్యం మాత్రమే కాకుండా, ప్రకృతి సమతుల్యత కూడా మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరించిపోయిన జీవుల పునరుత్థానం కోసం సూక్షా్మతి సూక్ష్మస్థాయిలో సాగిస్తున్న జన్యు ప్రయోగాలు, మూలకణాల ప్రయోగాల వల్ల మానవాళిని పట్టి పీడించే ఎన్నో వ్యాధులకు చికిత్స మార్గాలను కూడా కనుగొనే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. -
సలాం రామయ్య అంకుల్..! కంట తడి పెట్టించే వీడియో!
సోషల్ మీడియాలో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. పెద్ద మనసుతో చేసే మంచి పని ఏదైనా నెటిజన్లును ఆకట్టుకుంటుంది. బెంగళూరులో రామయ్య మామయ్య స్టోరీ నెట్టింట చక్కర్లు కొడుతోంది. చెప్పులు కుట్టుకొని పొట్టపోసుకునే రామయ్య చేసిన పని లక్షలాది మంది హృదయాలను హత్తుకుంది. తన చిన్న ప్రపంచంలో మూగజీవులకు చోటిచ్చిన అపురూప మనిషిగా ప్రశంసలు దక్కించుకున్నాడు. View this post on Instagram A post shared by 𝕃𝔼𝕀𝔸 ♡ The Golden Indie (@leia_the_golden_indie) బెంగుళూరులోని వైట్ఫీల్డ్లోని డెకాథ్లాన్ షాప్ బైట ఒక చెప్పులు కుట్టుకునే వృత్తిలోఉన్నాడురామయ్య. ఆయన పనిచేసే చిన్న బడ్డీకొట్టులోనే తనతోపాటు మరికొన్నిమూగ జీవాలను ఆశ్రయం ఇచ్చి వాటికి పెద్ద దిక్కయ్యాడు. ఒకటీ రెండూ, కాదు దాదాపు 15 జంతువులు ఆయన చేరదీశాడు. వీటిల్లో రెండు వీధి కుక్కలు, పిల్లి కూన అతని పక్కనే ఆడుకుంటూ ఉంటాయి. వాటి కడుపు నింపడం మాత్రమే కాదు, దెబ్బలు తగిలితే ఆసుపత్రికి కూడా తీసుకెళ్లేంత దయాయుడు. ఈ రామయ్య. అందుకే అతణ్ని అందరూ రామయ్య మామయ్య అని పిలుచుకుంటారట. లియా ది గోల్డెన్ ఇండీ' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 2023, డిసెంబరులో అతనికి బంధించిన స్టోరీ పోస్ట్ చేశారు. “మీరు ఎప్పుడైనా అక్కడికి వెళితే, ఒక్క క్షణం ఆగండి, నిజమైన ప్రేమ, దయ , దాతృత్వం ఎలా ఉంటుందో కళ్లారా చూడండి.. పాత బూట్లను రిపేర్ చేయడానికి పని చేసే ఆ చిన్న స్థలంలోనే, కనీసం 3 కుక్కలు వెచ్చగా నిద్రపోతూ ఉంటుంది. ఒక బుజ్జి పిల్లి కూన ఆడుకుంటూ ఉంటుంది’’ అని తెలిపారు. అతని కోసం విరాళాలు సేకరణ కూడా చేపట్టారు.దీంతో రామయ్యంకుల్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. మంచి మనసుతో రామయ్య చేస్తున్న పనికి ముగ్దులై అతని సాయం చేయడానికి ముందుకొచ్చారు.రామయ్య అంకుల్ ఫండ్ రైజర్ పేజీ ప్రకారం దేశం నలుమూలలనుండి విరాళాలొచ్చాయి. ‘నీకేమైనా కావాలా అంటే... నాకేమీ అవసరం లేదు..వాటికి అన్నం పెడితే చాలు’ అని చెప్పేవాడట ప్రేమతో. మొత్తం వసూలు చేసిన తర్వాత, చందాదారులందరి పేర్లతో ఒక కార్డు తయారు చేసి గత వారం రామయ్య అంకుల్కి అందించారు. ఇందులో సగం వీధిజంతువుల సంక్షేమం కోసం మిగతాసగం ఆయన ఖాతాలోను జమచేశారు. దీంతో సంతోషంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు రామయ్య. దాతలందరికి కృతజ్ఞతలు తెలిపాడు. నాలుగు నెలల క్రితమే తన భార్య చనిపోయిందని, తన కూతురిని పెంచే బాధ్యత తనపైనే ఉందంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. దాతలు ఇచ్చిన కార్డును తన దుకాణంలో వేలాడ దీసుకున్నాడు సగర్వంగా. “ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, మనస్ఫూర్తిగా ఇవ్వడం అంటే అంటే ఏమిటో మాకు చూపించినందుకు రామయ్య రామయ్యకు ధన్యవాదాలు. తమ వద్ద ఉన్న సమృద్ధిగా ఉన్నదాంట్లోంచి ఏదో కొద్దిగా ఇవ్వడం గొప్ప కాదు, తనకున్న చిన్నమొత్తంలోంచే ఘనంగా ఇవ్వడంలోనే ఉంది అసలు మానవత్వం అంటూ లియా ది గోల్డెన్ ఇండీ' అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ రాసుకొచ్చారు. -
అనంత్ ప్రేమంతా : అందమైన రాధిక వెడ్డింగ్ లెహెంగా పైనే
ఫ్యాషన్, ఫైన్ ఆర్ట్ అద్భుతమైన కలయికతో రూపుదిద్దుకున్న వెడ్డింగ్ లెహంగా డ్రెస్ ఇది. అనంత్ అంబానీతో రాధికా మర్చంట్ వివాహం కోసం ఆర్టిస్ట్ జయశ్రీ బర్మన్ డిజైనర్ ద్వయం అబు జానీ సందీప్ ఖోస్లాతో కలిసి ఈ చిత్రకళ లెహంగాను రూపొందించారు.రోజుకు 16 గంటలు, నెలరోజుల పాటు జయశ్రీ బర్మన్ ఢిల్లీలోని తన స్టూడియోలో ఒక నెల మొత్తం ఈ లెహంగా ఫ్యాబ్రిక్పై పెయింటింగ్ చేయడానికి వెచ్చించింది.‘అనంత్–రాధికల కలయికకు ప్రతీకగా ఖగోళ మానవ బొమ్మలు, జంతుజాలం, ముఖ్యంగా ఏనుగులపై అనంత్కు ఉన్న ప్రేమను చూపేలా ఈ సృజనాత్మక కళ రూపుదిద్దుకుంది’ అని వివరించే బర్మన్ రోజుకు 15–16 గంటల సమయాన్ని ఈ ఆర్ట్వర్క్కు కేటాయించినట్టుగా వివరించింది. కోల్కతాలో జన్మించిన జయశ్రీ బర్మన్ ఇండియన్ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందారు. పెయింటింగ్లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ,ప్యారిస్ లో ప్రింట్ మేకింగ్ కోర్సు చేసిన బర్మన్ తన పెయింటింగ్ ద్వారా పౌరాణిక కథలను కళ్లకు కడతారు. ఆర్టిస్ట్గానే కాదు, రచయిత్రిగానూ జాతీయ అవార్డులు అందుకున్న ఘనత బర్మన్ది. -
జంతు ప్రేమికా.. జాగ్రత్త సుమా!
రాజమహేంద్రవరం రూరల్ /రాయవరం/ కాకినాడ సిటీ: మూగజీవాల పెంపకంపై ఎంతో మంది శ్రద్ధ చూపుతున్నారు. అందుకే ప్రస్తుతం అవి మానవ జీవితంతో ముడిపడ్డాయి.. నిన్న మొన్నటి వరకూ సరదాకు, ఇంటి కాపలాకు పరిమితమైన కుక్కల పెంపకం ప్రస్తుతం స్టేటస్ సింబల్గా మారింది. అలాగే గుర్రాలు, కుందేళ్లు, పిల్లులతో పాటు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోతులు వంటి వాటినీ పెంచుకుంటున్నారు. ఎంతో ఇష్టంగా సాకుతున్న జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. పరిశోధనల ప్రకారం జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు 190 రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. శనివారం ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా వాటి గురించి తెలుసుకుందాం రండి.ఆ పేరు ఎలా వచ్చిందంటే..పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల్లో రేబిస్ అత్యంత ప్రమాదకరమైంది. పిచ్చికుక్క కరిచిన ఓ బాలుడికి 1885 జూలై 6న లూయీ పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొదటి సారిగా వ్యాధి నిరోధక టీకా ఇచ్చారు. ఇది విజయవంతమై అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ రేబిస్ టీకాను జూలై 6న కనిపెట్టడం వల్ల ప్రతి ఏటా ప్రపంచ జునోసిస్ దినోత్సవం జరుపుకొంటున్నారు.ఉమ్మడి జిల్లాలో ఇలా..తూర్పుగోదావరి జిల్లాలో వీధికుక్కలు 1,15,771, పెంపుడు కుక్కలు 26,562, ఆవులు 74,778, గేదెలు 1,93,847, గొర్రెలు 1,71,263, మేకలు 69,265, పందులు 2,080 ఉన్నాయి. కోనసీమ జిల్లాలో మొత్తం పెంపుడు జంతువులు 63,953 ఉన్నాయి. ఇందులో కుక్కలు 22,570 ఉండగా, పిల్లులు, గుర్రాలు, కుందేళ్లు, పక్షులు, ఇతర పెంపుడు జంతువులు 41,383 ఉన్నాయి. కాకినాడ జిల్లాలో పశువైద్య శాలలు, ప్రాంతీయ, వెటర్నటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో జూనోటిక్ వ్యాధుల నివారణకు శనివారం ఉచితంగా టీకాలు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం జిల్లాకు 32 వేల యాంటీ రేబిస్ టీకాలు సిద్ధం చేశారు. ఏ వ్యాధులు వస్తాయంటే..పాడి పశువుల నుంచి ఆంత్రాక్స్, బ్రూసిల్లోసిస్, లిస్టిరియోసిస్, రింగ్వార్మ్ వ్యాధులు వస్తాయి. గొర్రెలు, మేకల నుంచి ఆంత్రాక్స్, బ్రూసిల్లోసిస్, లిస్టిరియా, హైడాటిడోసిస్, సార్కోసిస్టిస్, సోల్మోనెల్లోసిస్, క్యూ–ఫీవర్, మేంజ్ వ్యాధులు సంక్రమిస్తాయి. కుక్కల నుంచి రేబిస్, లీష్మీనియా, బద్దెపురుగుల వ్యాధి, రింగ్ వార్మ్, హైడాటిడోసిస్, మీసిల్స్, మంప్స్, మేంజ్ వ్యాధులు వస్తాయి. అలాగే పందులు, పిల్లులు, గుర్రాలు, కోళ్లు రామచిలుకలు, కుందేళ్ల నుంచీ వివిధ వ్యాధులు సోకుతాయి. వైద్యుల సలహాలు తప్పనిసరిజంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునాటిక్ డిసీజస్ అంటారు. ఇవి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా పశు వైద్యుల సలహాలు తీసుకోవాలి. సరైన వ్యాక్సిన్ వేయకుండా పెంపుడు జంతువులు, కుక్కలతో సన్నిహితంగా ఉండొద్దు. జునోసిస్ డే సందర్భంగా శనివారం రాజమహేంద్రవరం ఏరియా పశు వైద్యశాలలో పెంపుడు జంతువులకు, వాటి యజమానులకు, పశుసంవర్ధక శాఖ సిబ్బందికి, మున్సిపల్ వర్కర్లకు, జంతువధ శాఖ సిబ్బందికి, జంతు ప్రేమికులకు ఉచితంగా యాంటీ రాబీస్ టీకాలు వేస్తాం. –టి.శ్రీనివాసరావు, జిల్లా పశు వైద్యాధికారి, తూర్పుగోదావరిసకాలంలో టీకాలు వేయించాలి వ్యాధులు రాకుండా పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించాలి. వ్యాధులు సోకిన వాటిని మంద నుంచి వేరు చేసి చికిత్స అందించాలి. అవి ఉండే ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలి. వాటికి సన్నిహితంగా ఉండే వారు వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఇంట్లో కుక్కల పెంపకం చేపట్టిన యజమానులు చర్మ సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఆరోగ్య, పశుసంవర్ధక అధికారుల సూచనలు, సలహాలను తప్పనిసరిగా పాటించాలి. –డాక్టర్ కర్నీడి మూర్తి, డిప్యూటీ డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ, అమలాపురం వ్యాధులుసంక్రమించకుండా టీకాలుజంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునాటిక్ డిసీజస్ అంటారు. ఇవి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా పశు వైద్యుల సలహాలు తీసుకోవాలి. ఏటా జునోసిస్ దినోత్సవాన్ని జూలై 6న జరుపుకోవడం ఆనవాయితీ. పశువుల వ్యాధుల పట్ల మరిన్ని సలహాల కోసం ప్రభుత్వం 1962 టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా రేబిస్ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ తమ పెంపుడు జంతువులైన కుక్కలకు టీకాలు వేయించాలి.–ఎస్.సూర్యప్రకాశరావు, జిల్లా పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు, కాకినాడశుభ్రత.. భద్రతముఖ్యంగా పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులు, పక్షులను పెంచుకోవడం బాగా పెరిగింది. పెంపుడు జంతువులతో ఆటలాడిన తర్వాత శుభ్రత పాటించకుంటే వ్యాధులకు గురవుతుంటారు. జంతువులను పెంచుకునే వారు తగిన జాగ్రత్తలు పాటించకుంటే వాటి నుంచి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ఇందులో రేబిస్, ఆంత్రాక్స్ వంటివి భయాందోళనకు గురిచేస్తున్నాయి. అందువల్ల తమ పెంపుడు కుక్కలు బయట తిరిగే సమయంలో ఇతరులపై దాడి చేయకుండా యజమానులూ జాగ్రత్త పడాలి.వ్యాక్సిన్ తప్పనిసరిపెంపుడు జంతువులకు వేసే వ్యాక్సినేషన్పై చాలా మందికి అవగాహన ఉండదు. కొందరు ఖర్చుతో కూడినదని పట్టించుకోరు. కుక్కులకు మామూలుగా కరిచే గుణం ఉంటుంది. కాబట్టి వ్యాక్సినేషన్ తప్పనిసరి. మనిషి, జంతువుకు ఉండే కాంటాక్ట్లో అది కరవడం, గీరడం వంటివి సాధారణంగా జరుగుతుంటాయి. దానివల్ల ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు. కుక్కలు, పిల్లులు పెంచుతున్న వారు కూడా వ్యాక్సినేషన్ అవసరాన్ని గుర్తించాలి. -
పచ్చందనమే పచ్చదనమే.. పచ్చిక నవ్వుల డిజైన్స్ (ఫోటోలు)
-
అనంత్ అంబానీ మనసు బంగారమే.. వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులే తమకు స్ఫూర్తి అని వెల్లడించారు. తండ్రి నుంచి టాటా నుంచి ఎంతో నేర్చుకున్నానని ఇప్పటికి కూడా వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నానని స్పష్టం చేశారు. కంపెనీల విషయంలో లేదా వ్యాపారాల విషయంలో తన తండ్రి ముఖేష్ అంబానీ ప్రజలకు ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తూ ఉంటారని. ప్రతి రోజూ వారి దగ్గర నుంచి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉన్నానని అన్నారు. బిజినెస్ మాత్రమే కాకుండా తమ కుటుంబమంతా వన్య ప్రాణుల పట్ల ధరతో ఉంటామని వెల్లడిస్తూ.. గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ కంపెనీ ఒక 'జూ' ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జూ అభివృద్ధిలో కూడా తన తల్లినద్రులే స్ఫూర్తి అని చెప్పారు. ఏనుగుల కోసం ఓ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు, అందులో 200 కంటే ఎక్కువ ఏనుగులు ఉన్నాయని చెప్పారు. ఏనుగులు మాత్రమే కాకుండా జూలో మొత్తం 100 జాతుల కంటే ఎక్కువ జీవులు ఉన్నాయని, అరుదైన లేదా అంతరించిపోతున్న జంతువులను సంరక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి జంతువులోనూ దేవుణ్ణి చూస్తున్నట్లు అనంత్ అంబానీ వివరించారు. ఇదీ చదవండి: కోట్లు సంపాదిస్తున్న సానియా మీర్జా చెల్లెలు.. ఆస్తి ఎంతంటే? జూలో సంరక్షులు సుమారు 3000 నుంచి 400 మంది ఉన్నారని, వారందరూ ప్రత్యేకంగా శిక్షణ పొందినట్లు.. జూలో సౌరశక్తిని మాత్రం ఉపయోగిస్తున్నట్లు అనంత్ అంబానీ పేర్కొన్నారు. మొత్తం మీద అంబానీ ఫ్యామిలీ జీవులను రక్షించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. #WATCH | Reliance Foundation announces Vantara - a comprehensive Animal Rescue, Care, Conservation and Rehabilitation programme, the first of its kind in India. Anant Ambani says "We started the wildlife rescue center building in the peak of COVID...We've created a jungle of 600… pic.twitter.com/OoWh9HWsU8 — ANI (@ANI) February 26, 2024 -
ఈ విషయాలు మీకు తెలుసా? (ఫోటోలు)
-
హైదరాబాద్ : నెహ్రూ జూ పార్క్కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)
-
అత్యంత ఖరీదైన పెట్ డాగ్స్ (ఫోటోలు)
-
World Best Photos Of 2023: ప్రపంచ వ్యాప్తంగా 2023లో తీసిన బెస్ట్ ఫోటోలు ఇవే.. ఓ లుక్కేయండి
-
కలవరపెడుతున్న 'జాంబీ డీర్ వ్యాధి'! మనుషులకు కూడా వస్తుందా?
మానవ తప్పిదాలతో పర్యావరణాన్ని చేజేతులారా కలుషితం చేశాం. దానికి ప్రతిగా రోజుకో కొత్త వింత వ్యాధులు ప్రకృతి ప్రకోపానికి ఫలితమా! అన్నట్టుగా పుట్టుకొస్తున్నాయి. ఆ వ్యాధులు జంతువులను నుంచి మొదలు పెట్టి మానవులకు సంక్రమిస్తున్నాయి. వాటికి చికిత్స విధానం ఉందో లేదో తెలియని స్థితి. పోనీ రాకుండా నివారించేలా ఏం చేయాలో ఎలా సంక్రమించకుండా చెయ్యాలనేది కూడా చిక్కు ప్రశ్నే. అలాంటి మరో వింత వ్యాధి అగ్రరాజ్యాన్ని ఓ కుదుపు కుదుపేస్తుంది. అక్కడ ఏటా వందలాది జంతువులు ఈ వ్యాధి బారినపడటంతో ఎక్కడ మానవులకు సంక్రమిస్తుందో అని భయాందోళన చెందుతున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ ఏంటా వ్యాధి? మానువులకు సంక్రమించే అవకాశం ఉందా? అగ్రరాజ్యం అమెరికాలో 'జాంబీ డీర్ వ్యాధి' కలకలం సృష్టిస్తోంది. అక్కడ వందలాది జంతువులు ఈ వ్యాధి బారిన పడి మరణిస్తున్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్లోని జంతువుల్లో తొలిసారిగా ఈ వ్యాధిని కనుగొన్నారు. ఆ తర్వాత నుంచి వందల కొద్ది జంతువులు ఈ వ్యాధి బారినే పడటం శాస్త్రవేత్తలను ఒకింత భయాందోళనలకు గురి చేసింది. ఈ వ్యాధి ప్రముఖంగా ఉత్తర అమెరికా, కెనడా, నార్వే, దక్షిణ కొరియా వంటి ప్రాంతాల్లోని జింక, లేళ్లు, దుప్పి వంటి జంతువుల్లో ప్రబలంగా ఉన్నట్లు తెలిపారు. దీని కారణంగా బద్ధకం, ఉన్నటుండి తూలిపోవడం, ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం వంటి నాడీ సంబంధిత లక్షణాలు బహిర్గతమవుతాయి. ప్రధానంగా జంతువులకే సంక్రమించినప్పటికీ అది చివరికి మానవులకు కూడా సంక్రమించే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ 'జాంబీ డీర్ డిసీజ్'ని వైద్య పరిభాషలో (క్రానిక్ వేస్టింగ్ డిసీజ్(సీడబ్ల్యూడీ) అంటారు. అంటే ప్రోటీన్ ముడతల్లో తేడాలతో వచ్చే అరుదైన వ్యాధి. దీన్ని చాలా నెమ్మదిగా చుట్టుముట్టే ప్రమాదకర వ్యాధిగా నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు మానవులకు సోకిన దాఖలాలు లేకపోయినా భవిష్యత్తులో మానవులకు సంక్రమించదన్న గ్యారంటీ లేదని ఎపిడెమియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు బ్రిటన్లో వచ్చిన 'మ్యాడ్ కౌ వ్యాధి(పిచ్చి ఆవు వ్యాధి)' గుర్తు చేసుకున్నారు. వందలకొద్ది ఆవులను వధించడంతో వచ్చిన పిచ్చి ఆవు వ్యాధి ఎలా మానువులకు సంక్రమించిందో ఉదహరిస్తూ వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. It starts. You watch: be walking down the street one day, happy about how things are finally going right, and CHOMP!! zombie deer bites ya in the ass. pic.twitter.com/HOgQuQ5lEp — Ryan (@Ryno_Charger) December 24, 2023 ఈ మేరకు సీడబ్ల్యూడీ పరిశోధకుడు డాక్టర్ కోరి ఆండర్సన్ మాట్లాడుతూ..మానువులకు వస్తుందా? రాదా? అని నిర్థారించి చెప్పకలేకపోయినప్పటికీ.. సంసిద్ధగా ఉండటం మాత్రం ముఖ్యమని నొక్కిచెప్పారు. ఇది ఒక ప్రాంతంలో విజృంభిస్తే..పూర్తి స్థాయిలో తొలగించడం అసాధ్యం అని అన్నారు. ఇది ఆయా భూభాగంలోని మట్టి లేదా ఉపరితలాల్లో ఏళ్లుగా ఆ వ్యాధి కొనసాగుతుందని చెబుతున్నారు. ఇది ఒక రకమైన ప్రోటీయోపతి లేదా నిర్మాణపరంగా అసాధారణమైన ప్రోటీన్ల వ్యాధి. Scientists confirm this is the best approach to combating the zombie deer disease pic.twitter.com/HmQKCF8STO — Hot White Hennessy (@Phillystunna221) December 25, 2023 ఇది సోకిన జంతువులు గానీ మనుషులు గానీ చనిపోతే అక్కడ భూమిలోనే డికంపోజ్ అయితే అలానే ఆ వ్యాధి తాలుకా గ్రాహకాలు ఉండిపోతాయి. దీంతో కొన్నేళ్ల పాటు ఆయా ప్రాంతాల్లో ఆ వ్యాధి కొనసాగుతుంది. ఎలాంటి క్రిమి సంహరకాలు, ఫార్మాల్డిహైడ్, రేడియేషన్ల, అధిక ఉష్ణోగ్రతలకు ఆ వ్యాధి లొంగదని మరింతగా నిరోధకతను చూపిస్తుందని అన్నారు. ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) 1997 నుంచే సీడబ్ల్యూడీకి సంబంధించిన వ్యాధులు మానవులకు సంక్రమించకుండా నిరోధించే ప్రాముఖ్యత గూర్చి నొక్కి చెబుతుండటం గమనార్హం. Damn, Rudolph caught the zombie deer disease 💀 pic.twitter.com/vdEZr9aHyh — Creepy.org (@CreepyOrg) December 25, 2023 (చదవండి: అనుకోని ప్రమాదంలో చిద్రమైన వ్యక్తి ముఖాన్ని పునర్నిర్మించిన శాస్త్రవేత్తలు!) -
మీకు తెలుసా..?
-
ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా? (ఫోటోలు)
-
మీకు తెలియని నిజాలు తెలుగులో (ఫోటోలు)
-
ఈ విషయాలు మీకు తెలుసా?
-
జంతువులను, పక్షులను ఫోటోలను తీయడం అంత ఈజీ కాదు (ఫోటోలు)
-
ఈ సంగతులు మీకు తెలుసా?
-
ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?
-
ఇది మీకు తెలుసా? (ఫోటోలు)
-
ఈ విషయాలు మీకు తెలుసా?
-
జంతువుల గురించి మీకు తెలియని పది అద్భుతమైన విషయాలు
-
పశువ్యాధులకు హోమియోపతి చికిత్సతో ప్రయోజనం
పాడి పశువులు రోగాల బారిన పడినప్పుడు రైతులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర ఖర్చుల కన్నా చికిత్స ఖర్చులు భారంగా మారుతుండటంతో పాడి రైతుల ఆదాయం తగ్గిపోతోంది. ఈ సమస్యకు సరైన పరిష్కారం హోమియో చికిత్సా విధానం. ఇది తక్కువ ఖర్చుతో వెంటనే ఫలితాన్ని ఇచ్చేదే కాకుండా సహజమైన, మానవీయమైన, సమర్థవంతమైన చికిత్సా పద్ధతి కూడా అంటున్నారు పశువైద్యాధికారి డాక్టర్.జి.రాంబాబు. కడపలోని పశువ్యాది నిర్ధారణ ప్రయోగశాలలో సేవలందిస్తున్న ఆయన హోమియో పశువైద్యంలో తన అనుభవాలను ‘సాక్షి సాగుబడి’తో పంచుకున్నారు.. సహజ రోగ నిరోధక శక్తికి ప్రేరణ కలిగించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడమే హోమియో వైద్య విధానం లక్షణం. హోమియో విధానంలో వాడే ఔషధాలన్నీ కూడా సహజమైన మొక్కలు, లవణాలతో తయారు చేసినవే. ఈ వైద్య విధానానికి 200 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా యూరోపియన్, ఆసియా దేశాల్లో పశువ్యాధుల చికిత్సలో హోమియోపతి మందులు వాడుతున్నారు. మన దేశంలోనూ అక్కడక్కడా ఈ ప్రయత్నాలు జరుగుతుండటం ఆహ్వానించదగిన విషయం. పశువులకు హోమియో ప్రయోజనాలేమిటి? ►ఖర్చు తక్కువ. ఒక మందు ఖరీదు కేవలం రూ. 10 లోపే. అల్లోపతిలో ఈ ధరకు ఏ మందూ రాదు. ► సైడ్ ఎఫెక్ట్స్ /దుష్ప్రభావాలు ఉండవు. పరీక్షలు చేసి రోగ నిర్థారణ చేసే వరకు మందులు వాడకుండా ఉండాల్సిన పని లేదు. రోగ లక్షణాన్ని బట్టి చికిత్స చేస్తే చాలు. ► ఒకసారి పశువులకు, దూడలకు, ముఖ్యంగా శునకాలకు హోమియో (తీపి) మాత్రలు ఒకసారి ఇస్తే మళ్లీ అవే వచ్చి మందు అడుగుతాయి. ► హోమియో మందులు త్వరితగతిన పనిచేస్తాయి. ఇవి నెమ్మదిగా పనిచేస్తాయని చాలామంది అనుకుంటారు. అది అపోహ మాత్రమే. ► ఇతర వైద్య పద్ధతుల్లో మందుల మాదిరిగా భరించలేని వాసన ఈ మందులకు ఉండదు. ► డోసు కొద్దిగా ఎక్కువయినా ఇబ్బంది లేదు. అది మిగతా వైద్య పద్ధతుల్లో ఇది సాధ్యం కాదు. కాబట్టి, అవగాహన పెంచుకున్న రైతులు పశువులకు ఇంటి దగ్గరే ఈ వైద్యం చేసుకోవచ్చు. ► కొన్ని వ్యాధులకు అల్లోపతిలో లేని వైద్యం కూడా హామియోపతిలో ఉండటం విశేషం. ► ఈ మందుల వల్ల పర్యావరణం కలుషితం కాదు. హోమియో మందులతో పొదుగువాపు మాయం! రాథి ఆవు ఇది. రాజస్తాన్కు చెందిన జాతి. స్థానిక రైతు అక్కడి నుంచి కడప జిల్లాకు చూడి ఆవును తీసుకువచ్చారు. వారం తరువాత ఈనిన ఆవు కోడె దూడకు జన్మనిచ్చింది. పాలు ఇచ్చిన 5వ రోజు నుంచి రెండు చన్నుల నుంచి పాలతో పాటు రక్తం వచ్చింది. పశువైద్యునిగా పొదుగువాపును గుర్తించి యాంటి బయోటిక్ మందులతో చికిత్స ఇచ్చాను. 5 రోజులకు తగ్గింది. 7వ రోజు నుంచి మళ్లీ పొదుగువాపు వచ్చింది. ఆవు నుంచి తీసిన రక్తంతో కూడిన పాలను యాంటి బయోటిక్ సెన్సిటివిటి పరీక్షకు ప్రయోగశాలకు పంపించాం. పరీక్ష ఫలితాలు 3వ రోజున వస్తాయి. ఈ లోపు మళ్లీ కొత్త అల్లోపతి మందులు ఇవ్వడం కన్నా ఆయుర్వేద లేదా హామియో మందులు వాడుతుంటాం. ఈ ఆవుకు హోమియో మందులు వాడితే.. రెండు విధాలుగా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. మొదటిది: పాల పరీక్ష ఫలితాల్లో మొత్తం 13 యాంటీ బయోటిక్ మందులకు నిరోధకత వచ్చింది. అంటే, ఆ ఆవుపై ఇక ఏ యాంటి బయోటిక్ మందూ పనిచేయదని అర్థం. రెండోది: ఈ లోగా హోమియో మందులు వాడటం వల్ల 3 రోజుల్లోనే ΄పొదుగువాపు తగ్గిపోయింది. అల్లోపతి మందులకు దాదాపుగా రూ. 2,200 ఖర్చు చేశాం. హోమియో మందుల ఖర్చు కేవలం రూ. 50 మాత్రమే. పొదుగువాపు తగ్గించడానికి ఫైటో లక్క, కొనియం, బెల్లడోన, ఫెర్రం ఫాస్ అనే హామియో మందులను వినియోగించాం. రెండు వారాలైనాతగ్గనిది.. హోమియోతో 2 రోజుల్లో తగ్గింది! ఒక హోటల్ యజమాని ఒంగోలు ఆవును కొన్నారు. మంచిదని హోటల్ దగ్గరే ఆవును కట్టేస్తున్నారు. గడ్డి తక్కువ వేస్తూ ఎక్కువ మొత్తంలో కూరగాయలు మేపేవారట. కొద్ది రోజులకే ఆవుకు సుస్తీ చేసింది. మేత తినటం దాదాపుగా ఆపేసింది. ఆకలి పెంచేందుకు పౌడర్లు, బీకాంప్లెక్స్ ఇంజక్షన్లు, లివర్ టానిక్లు, కసురు తాగించినా ఫలితం లేకపోవటంతో కడప పశువుల ఆసుపత్రికి తీసుకువచ్చారు. అల్లోపతి మందులతో దాదాపు 2 వారాల పాటు వైద్యం అందించినా, కొద్దిగా కూడా ఫలితం కనిపించ లేదు. ఆ దశలో నక్స్ వామిక, రుస్ టాక్స్ అనే హోమియో మందులు రెండు రోజులు ఇచ్చాం. 3వ రోజుకు సమస్య పూర్తిగా తగ్గిపోయింది. (పశువైద్యులు డాక్టర్ జి. రాంబాబును 94945 88885 నంబరులో సంప్రదించవచ్చు) -
భూమిపై అత్యంత విషపూరిత జంతువులు ఫోటో గ్యాలరీ
-
అడవిలో ఉండాల్సినవి.. ఇంట్లో పెంచుకుంటున్నారు
-
ఈ బుజ్జి పక్షులు ఎంత ప్రమాదకరమో తెలుసా..?
-
ఏ జంతువులు అంతరిక్షాన్ని చూశాయి? తాబేళ్లు, ఈగలు ఏం చేశాయి?
మనుషులే కాదు ఎన్నో జంతువులను కూడా అంతరిక్షంలోకి పంపారు. ఈగలు, కుక్కలు, ఎలుకలు, చేపలు, కోతులు, చింపాంజీలను వివిధ ప్రయోజనాల కోసం అంతరిక్షంలోకి పంపారు. జంతువులను అంతరిక్షంలోకి పంపే ప్రక్రియ 21వ శతాబ్దంలోనూ కొనసాగింది. దీని సాయంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అనేక ప్రయోగాలు నిర్వహించారు. అంతరిక్ష రంగంలో నూతన విజయాలు సాధించినప్పుడల్లా మనం శాస్త్రవేత్తల కృషిని మెచ్చుకుంటాం. అయితే పలు జంతువులు కూడా ఈ విజయంలో భాగస్వామయ్యమయ్యాయనే సంగతిని మరచిపోతుంటాం. మనుషులు అంతరిక్షంలోకి వెళ్లకముందు పలు జంతువులను అక్కడికి పంపించారు. ఆ తర్వాతే మనుషులను అక్కడికి సురక్షితంగా పంపించవచ్చని శాస్త్రవేత్తలు గ్రహించారు. ఏఏ జంతువులు అంతరిక్షంలోకి పంపారో ఇప్పుడు తెలుసుకుందాం. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జీవులు ఈగలు, వీటిని 1947లో అమెరికా శాస్త్రవేత్తలు పంపారు. నాడు శాస్త్రవేత్తలు.. వ్యోమగాములపై ఖగోళ రేడియేషన్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలనుకున్నారు. V-2 బాలిస్టిక్ క్షిపణిని ఉపయోగించి, 109 కిలోమీటర్ల ఎత్తుకు ఈగలను అంతరిక్షంలోకి పంపారు. పారాచూట్ ద్వారా వాటిని న్యూ మెక్సికోలో దింపారు. క్యాప్సూల్స్ తెరిచినప్పుడు ఈగలు సజీవంగా కనిపించాయి. అంతరిక్షంలోకి పంపబడిన జంతువులలో కోతుల జాతులు ఉన్నాయి. వీటిలో రీసస్ మకాక్స్, పిగ్-టెయిల్డ్ కోతులు, స్క్విరెల్-టెయిల్డ్ కోతులు, చింపాంజీలు కూడా ఉన్నాయి. ఆల్బర్ట్- II అనే పేరుగల రీసస్ మకాక్ 1949లో 134 కిలోమీటర్ల వరకూ చేరుకుంది. అయితే అది తిరిగి వస్తుండగా మృతి చెందింది. దీని తరువాత 1961 లో కోతి జాతికి చెందిన హామ్ అనే చింపాంజీని నాసా అంతరిక్షంలోకి పంపింది, అది సురక్షితంగా తిరిగి వచ్చింది. మానవ ఆరోగ్యం, ఔషధాల తయారీ మొదలైన పరిశోధనలలో ఎలుకలను ఎక్కువగా ఉపయోగిస్తారు. మానవులపై అంతరిక్ష వాతావరణం ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఎలుకలను అంతరిక్షంలోకి పంపారు. ఎలుకల అంతరిక్ష అనుభవాల గురించి నాసా ఒక వివరణాత్మక అధ్యయనాన్ని కూడా నిర్వహించింది. 1950లో 137 కిలోమీటర్ల వరకు అంతరిక్షంలోకి తొలి ఎలుకను పంపారు. అయితే అది పారాచూట్ ఫెయిల్యూర్తో మృతి చెందింది. సోవియట్ యూనియన్ గరిష్ట సంఖ్యలో కుక్కలను అంతరిక్షంలోకి పంపింది. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది 1957లో లైకా అనే శునకం. అయితే అది భూమికి తిరిగి రాలేకపోయింది. ఇది అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జంతువుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే దీనికి ముందు కూడా కొన్ని కుక్కలను అంతరిక్షంలోకి పంపారు. ఆశ్చర్యంగా అనిపించినా అంతరిక్షంలోకి తాబేలును కూడా పంపిన మాట మాత్రం నిజం. 1968లో అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య చంద్రుడిపైకి వెళ్లేందుకు పోటీ నెలకొన్న నేపధ్యంలో రష్యా రెండు తాబేళ్లను జోండ్ 5 అనే అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి పంపింది. అవి చంద్రుని చుట్టూ ఆరు రోజులు తిరిగిన తర్వాత భూమికి తిరిగి వచ్చాయి. అయితే అవి ప్రణాళిక ప్రకారం కజకిస్తాన్లో ల్యాండ్ కాకుండా హిందూ మహాసముద్రంలో పడిపోయాయి. అయితే వాటిని రక్షించారు. నాసా ఈ జంతువులనే కాకుండా, కప్పలు, సాలెపురుగులు (1973), చేపలు (1973), టార్డిగ్రేడ్ (2007), పిల్లి (1963) ని అంతరిక్షంలోకి పంపింది. 2012లో జపాన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపలను పంపింది. ఇంతేకాకుండా అనేక మొక్కలపై, ముఖ్యంగా ఆహారం తయారీపై అంతరిక్షంలో పలు ప్రయోగాలు జరిగాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మజీవుల పెరుగుదలపై కూడా అనేక ప్రయోగాలు జరిగాయి. ఇది కూడా చదవండి: పుతిన్ రష్యా అధ్యక్షుడెలా అయ్యారు? -
'ఇప్పటికైనా తినడం ఆపేయండి'.. వైరలవుతున్న బాలయ్య హీరోయిన్ పోస్ట్!
విజయదశమి చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన ముంబయి భామ వేదిక. ఆ తర్వాత తెలుగులో బాణం, దగ్గరగా దూరంగా, కాంచన-3, రూలర్, బంగార్రాజు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్తో పాటు కోలీవుడ్, మలయాళం, కన్నడ సినిమాల్లోనూ చేసింది. కన్నడలో నటించిన శివలింగ మూవీ ఆమె కెరీర్లో సూపర్హిట్గా నిలిచింది. 2019లో ది బాడీ చిత్రం ద్వారా బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రజాకార్, జంగిల్ సినిమాల్లో నటిస్తోన్న ముద్దుగుమ్మ ఎప్పుటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పోస్టులు పెడుతూ ఉంటోంది. అయితే మూగజీవాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించేలా పోస్టులు పెడుతోంది వేదిక. మాంసాహారం కోసం మూగజీవాలను ఎంతలా హింస పెడుతున్నారంటూ పోరాటం చేస్తోంది. జంతు హింసకు వ్యతిరేకంగా వేదిక పోరాటం చేస్తోంది. ఇటీవల జీ-20 సమ్మిట్ కోసం వీధి కుక్కులను అత్యంగా క్రూరంగా హింసించారంటూ పోస్ట్ పెట్టిన వేదిక.. తాజాగా మరో వీడియోను ఇన్స్టాలో షేర్ చేస్తూ ఓ నోట్ రాసుకొచ్చింది. వేదిక తన ఇన్స్టాలో రాస్తూ..' కోళ్లు, ఆవులు, మేకలు, పందులు మాంసం వెనక ఉన్న భయంకరమైన ఫ్యాక్టరీ ఫారమ్ల వెనుక ఉన్న నిజం ఇదే. ప్రపంచవ్యాప్తంగా (భారతదేశంలో కూడా) మాంసం, డైరీ ఫ్యాక్టరీ ఫారాల వెనుక ఉన్న భయంకరమైన వాస్తవికత ఇదే. మీరు ఇప్పటికైనా ఈ జంతువులను కాపాడేందుకు భాగం కావాలనుకుంటున్నారా?? జంతువులను చంపేందుకు నిధులు ఇవ్వడం ఆపివేయండి. వెగాన్గా(వెజిటేరియన్) మారిపోండి. ఇప్పుడే జంతువులను తినడం మానేయండి. ప్లీజ్ రెస్పెక్ట్ యానిమల్స్' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఆమెకు జంతు ప్రేమికులు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ మరికొందరేమో మీరు వేజిటెరియన్గా మారితే.. అందరూ అలాగే ఉండాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా జంతువుల హింస పట్ల ఆమె చేస్తున్న ప్రయత్నం కొద్ది మందిలోనైనా మార్పు వస్తుందేమో వేచి చూద్దాం. View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) -
నూతన పార్లమెంట్: ఆరు దర్వాజలకు ఆరు జంతువులు కాపలా..
ఢిల్లీ: దేశంలో నేడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలయ్యాయి. రేపు కొత్త పార్లమెంట్లో చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే.. కొత్త పార్లమెంట్లోకి ఎంట్రీ ఇచ్చే గుమ్మాలు చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. పార్లమెంట్ భవనంలో ఆరు దర్వాజలకు ఆరు పౌరాణిక ప్రాణుల పేర్లను పెట్టారు. ఈ ఆరు ప్రాణులు 140 కోట్ల భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ ప్రత్యేకతలను సూచిస్తున్నాయి. అవేంటంటే.. నూతన పార్లమెంట్లో ఆరు ద్వారాలు ఉన్నాయి. అవి.. గజ ద్వారం, అశ్వ ద్వారం, గరుడ ద్వారం, మకర ద్వారం, శార్దూల ద్వారం, హంస ద్వారం. ప్రతి ద్వారం దాని పేరుపై ఉన్న ప్రాణి శిల్పాన్ని కలిగి ఉంది. గజ ద్వారం.. బుద్ధి, జ్ఞాపకశక్తి, సంపద, జ్ఞానాన్ని సూచించేది ఏనుగు. దీని పేరు మీదుగా గజ ద్వారంగా ఓ గుమ్మానికి పేరు పెట్టారు. ఈ ద్వారం భవనానికి ఉత్తరం వైపు ఉంది. ఉత్తరం, వాస్తు శాస్త్రం ప్రకారం, బుధగ్రహంతో సంబంధం కలిగి ఉంది. ఇది తెలివికి మూలం అని విశ్వసిస్తారు. అశ్వ ద్వారం.. రెండవది అశ్వ ద్వారం. గుర్రం పేరు మీదుగా గుమ్మానికి ఈ పేరు పెట్టారు. గుర్రం శక్తి, బలం, ధైర్యాన్ని సూచిస్తుంది. పాలనలో కావాల్సిన లక్షణాలను ఈ గుమ్మం గుర్తుచేస్తుంది. గరుడ ద్వారం.. మూడవ ద్వారానికి గరుడ అనే పేరు పెట్టారు. పక్షుల రాజు గరుడ.. విష్ణువు వాహనంగా నమ్ముతారు. హిందూ త్రిమూర్తులలో సంరక్షకుడు అయిన విష్ణువుతో దానికి అనుబంధం ఉంది. గరుడను శక్తి, ధర్మం (కర్తవ్యం)నికి చిహ్నంగా భావిస్తారు. ఇది అనేక దేశాల చిహ్నాలపై ఎందుకు ఉపయోగించారో కూడా వివరణ ఉంటుంది. గరుడ ద్వారం కొత్త పార్లమెంటు భవనానికి తూర్పు ద్వారం. మకర ద్వారం.. నాలుగో ద్వారం మకర ద్వారం. మకరాన్ని సముద్ర చేపగా పిలుస్తారు. వివిధ జంతువుల కలయికగా దీన్ని గుర్తిస్తారు. దక్షిణ, ఆగ్నేయాసియాలో విస్తరించి ఉన్న హిందూ, బౌద్ధ స్మారక కట్టడాలలో మకరం సాధారణంగా కనిపిస్తాయి. మకరం వివిధ జీవుల కలయికగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. గుమ్మాల వద్ద మకర శిల్పాలు రక్షకులుగా కనిపిస్తాయి. మకర ద్వారం పాత పార్లమెంట్ భవనం ప్రవేశ ద్వారం వైపు ఉంది. శార్దూల ద్వారం.. ఐదవ ద్వారం శార్దూలం. ఇది సింహం శరీరం, కానీ గుర్రం, ఏనుగు లేదా చిలుక తల. కొత్త పార్లమెంట్ భవనం గేటుపై శార్దూల ఉండటం దేశ ప్రజల శక్తిని సూచిస్తుందని ప్రభుత్వ నోట్ పేర్కొంది. హంస ద్వారం పార్లమెంటు ఆరవ ద్వారానికి హంస ద్వారం అని పేరు పెట్టారు. హంస అనేది హిందూ జ్ఞాన దేవత అయిన సరస్వతి వాహనం. హంస మోక్షాన్ని సూచిస్తుంది. జనన, మరణ చక్రం నుంచి ఆత్మ విముక్తిని సూచిస్తుంది. పార్లమెంటు గేటుపై ఉన్న హంస శిల్పం స్వీయ-సాక్షాత్కారానికి, జ్ఞానానికి చిహ్నం. ఇదీ చదవండి: ఇండియా కూటమిని గొర్రెలు, మేకలతో పోల్చిన ఏక్నాథ్ షిండే -
తొలినాళ్లలో మనిషి ఏనుగులను తినేవాడా? పరిణామ క్రమంలో ఏం జరిగింది?
భూమి చరిత్ర- మానవ పరిణామ ప్రకియ అనేవి దగ్గరి సంబంధం కలిగిన అంశాలు. మానవ పరిణామ క్రమంలో, ప్రకృతిలో మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. పెద్ద జంతువులను అంతం చేయడం ద్వారా తొలి మానవుల పరిణామ ప్రక్రియ ముందుకు సాగిందని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడయ్యింది. తొలుత మానవులు తమ పోషణ కోసం పెద్ద జంతువులపై ఆధారపడేవారు. ఈ నేపధ్యంలో అవి అంతరించిపోవడంతో చిన్న జంతువులను వేటాడేందుకు ఆయుధాలు, సాధనాలను తయారు చేయవలసి వచ్చిందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు నాటి మానవులు వేట కోసం వినియోగించిన ఆయుధాలను పరిశీలించారు. ఆహారం పరిమాణం, మానవ సాంస్కృతిక, భౌతిక అభివృద్ధికి మధ్య విడదీయరాని సంబంధం ఉందని కనుగొన్నారు. రెండు సంవత్సరాల క్రితం పరిశోధకుల పరికల్పనను పరీక్షించడానికి ఈ అధ్యయనం చేపట్టారు. చిన్న, చురుకైన జంతువులను వేటాడాల్సి రావడం అనేది తొలి మానవుల తెలివితేటల అభివృద్ధికి సహాయపడింది. ఈ అధ్యయనంలో కీలకంగా వ్యవహరించిన టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ పురావస్తు శాస్త్రవేత్త మిక్కీ బెన్-డోర్ మాట్లాడుతూ ఏనుగుల వంటి పెద్ద జంతువులను వేటాడేందుకు చెక్క ఈటెలు సరిపోతాయని అన్నారు. అయితే జింక వంటి చిన్న జంతువులు పట్టుకోవడం చాలా కష్టమని, వాటిని చేజిక్కించుకునేందుకు చెక్క ఈటెలు సరిపోవని, ఈ నేపధ్యంలో నాటి మానవులు రాతి ఆయుధాలు ఆవిష్కరించారని పరిశోధకులు కనుగొన్నారు. తొలి మానవుల్లో ఒకరైన హోమో ఎరెక్టస్ చెక్క ఈటెలను ఉపయోగించారు. నియాండర్తల్లు,హోమో సేపియన్లు సుమారు మూడు లక్షల సంవత్సరాల క్రితం రాతితో కూడిన ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించారు. 50 వేల సంవత్సరాల క్రితం హోమో సేపియన్లు విల్లు, బాణం, ఈటె లాంటి విసిరే ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించారు. అలాగే 25 వేల సంవత్సరాల క్రితం, వేట కోసం వలలతో పాటు శునకాల సహకారం తీసుకోవడం ప్రారంభమైంది. ఈ తరహా ఆయుధాల అభివృద్ధితో మానవ వికాసం కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. గత పదేళ్లుగా పలువురు పరిశోధకులు చరిత్రపూర్వ మానవ వికాసానికి సంబంధించిన అంశాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో తొలినాళ్లలో ఏనుగులు చాలా కాలం పాటు మానవులకు ఆహారంగా ఉండేవని వారు కనుగొన్నారు. మూడు లక్షల సంవత్సరాల క్రితం అవి అంతరించడంతో నాటి మానవులు చిన్న జంతువులను వేటాడవలసి వచ్చింది. కాలానంతరంలో వేట సాధ్యం కానప్పుడు నాటి మానవులు పశుపోషణ, వ్యవసాయం ప్రారంభించారు. 2021లో, పరిశోధకులు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీనిలో తగ్గుతున్న ఆహార పరిమాణానికి వేటాడేందుకు వినియోగించే ఆయుధాల అభివృద్ధికి మధ్య సంబంధం ఉందని తేల్చిచెప్పారు. ఇటీవల జరిగిన పరిశోధన కూడా ఈ సిద్ధాంతానికి మద్దతు నిచ్చింది. దీనిలో 1.5 లక్షల నుండి 20 వేల సంవత్సరాల క్రితం నాటి డేటాను అనుసంధానించారు. ఇది కూడా చదవండి: వినోబా భావే హిమాలయ బాట ఎందుకు పట్టారు? గాంధీజీ సాంగత్యంతో ఏం జరిగింది? -
‘నాలుగు కాళ్ల’ వింత కుటుంబం.. పశువుల తరహాలో నడక!
ప్రపంచంలో రకరకాల మనుషులు కనిపిస్తారు. అలాగే చిత్రమైన కుటుంబాలను కూడా మనం చూస్తుంటాం. విచిత్రమైన అలవాట్లు లేదా భిన్న ధోరణి కారణంగా ఆయా కుటుంబాల వారు ప్రత్యేకంగా కనిపిస్తారు. అయితే వీటన్నింటికీ భిన్నంగా ఒక కుటుంబంలోని సభ్యులు జంతువుల మాదిరిగా నాలుగు కాళ్లతో నడుస్తుంటారు. వీరు తమ రెండు చేతులను రెండు కాళ్లుగా ఉపయోగిస్తుంటారు. ఈ విచ్రితమైన కుటుంబం టర్కీలోని ఒక శివారు గ్రామంలో ఉంటోంది. ఈ కుటుంబంలోని ఐదురుగురు సభ్యుల గురించి 2000లో ఒక వార్తాపత్రికలో ప్రచురితమయ్యింది. ఈ నేపధ్యంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్(ఎల్ఎస్ఈ)కి చెందిన మానసిక శాస్త్రవేత్త నికోలస్ హంఫ్రే ఈ విచిత్ర కుటుంబాన్ని కలుసుకునేందుకు టర్కీ వెళ్లారు. ఈ విచిత్ర కుటుంబంలో తల్లిదండ్రులకు 18 మంది పిల్లలు. అయితే వీరిలోని ఆరుగురు జంతువుల తరహాలో నడిచేందుకు ఇష్టపడతారు. ఆస్ట్రేలియాకు చెందిన ఒక క్రియేటర్ ఈ విచిత్ర కుటుంబంపై 60 నిముషాల డాక్యుమెంటరీ రూపొందించారు. దానిలో శాస్త్రవేత్త హంఫ్రే మాట్లాడుతూ ఇలాంటి మనుషులను తాను ఎన్నడూ చూడలేదని, ఈ ఆధునిక యుగంలో వీరు పశుఅవస్థకు తిరిగి వెళుతున్నట్లున్నదని అన్నారు. కొందరు శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ కుటుంబసభ్యులు అనువంశిక సమస్యల కారణంగా ఇలా ప్రవర్తిస్తుండవచ్చని అన్నారు. కాగా ఈ ఆరుగురు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లలో ప్రస్తుతం ఐదుగురు మాత్రమే జీవించివున్నారు. వీరు 22 ఏళ్ల నుంచి 38 ఏళ్ల మధ్య వయసు కలిగినవారు. వీరి మెదడులో ఒక భాగం కుంచించుకుపోయిందని, దీనిని సెరెబెలర్ వర్మిస్ అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. సెరెబెలర్ వర్మిస్ కలిగినవారు తమ రెండు చేతులను కాళ్ల మాదిరిగా వినియోగించేందుకు ఇష్టపడతారన్నారు. ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన పిండిమర.. ఒకరిని కాపాడబోయి.. వరుసగా నలుగురు! -
వనం నుంచి జనం మధ్యకు వస్తున్న మృగాలు
-
చిన్నవే కానీ..ప్రాణాలు తీసేస్తాయ్!
-
రతన్ టాటా ఎమోషనల్ పోస్ట్! మొదటి సారి ఇలా రిక్వెస్ట్ చేస్తూ..
రతన్ టాటా గురించి భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలకు బాగా తెలుసు. కేవలం దిగ్గజ పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా.. దేశం కోసం తనదైన రీతిలో సేవ చేస్తూ.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తిగా కూడా. ఈయన ఇటీవల ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రతన్ టాటా పోస్ట్.. వర్షాకాలం మొదలైంది, వర్షాలు భారీగా కురుస్తున్న వేళ వాహనదారులు హడావిడిగా వాహనాలు నడుపుతూ ఉంటారు. అయితే కొంత మంది చేసే చిన్న తప్పిదాలు చాలా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. వర్షం పడే సమయంలో మూగజీవాలు వాహనాల కింద ఉండే అవకాశం ఉంటుంది. కావున వాహనాలను తీసేటప్పుడు తప్పకుండా కింద ఏమైనా ఉన్నాయా అని గమనించండి, లేకుంటే అవి తీవ్రంగా గాయపడి అవకాశం ఉంటుందని, కావున వాటికి ఆశ్రయం కల్పిస్తే చాలా గొప్పగా ఉంటుందని సోషల్ మీడియా వేదికగా రతన్ టాటా విజ్ఞప్తి చేశారు. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) Now that the monsoons are here, a lot of stray cats and dogs take shelter under our cars. It is important to check under our car before we turn it on and accelerate to avoid injuries to stray animals taking shelter. They can be seriously injured, handicapped and even killed if we… pic.twitter.com/BH4iHJJyhp — Ratan N. Tata (@RNTata2000) July 4, 2023 ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. నిజానికి రతన్ టాటా ఇలాంటి అభ్యర్థన చేయడం ఇదే మొదటిసారి. మూగ జీవులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈయనకు మూగ జీవాల పట్ల ఎంత ప్రేమ ఉందొ మనకు ఇట్టె అర్థమైపోతుంది. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) రతన్ టాటా పెంపుడు శునకాల్లో ఒకటైన టిటోకి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల 2018 లండన్లోని బకింగ్హామ్ ప్యాలస్లో అప్పటి ప్రిన్స్ చార్లెస్ నుంచి అందుకునే పురస్కారానికి కూడా వెళ్ళలేదు. జంతువులంటే ఆయనకు ఎంత ప్రేమ ఉందో ఈ ఒక్క ఉదాహరణ చాలు. -
ఏళ్లపాటు గర్భాన్ని మోసే జంతువులివే..
తన మనుగడను కొనసాగించేందుకు ప్రతీ జీవి సంతానోత్పత్తి చేస్తుంది. మనిషి జన్మించక మునుపు 9 నెలలు తల్లి గర్భంలో ఉంటాడు. అయితే కొన్ని జంతువులు ఏళ్ల తరబడి గర్భాన్ని మోసి పిల్లలకు జన్మనిస్తాయి. అటువంటి జంతువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గాడిదను చాకిరీకి గుర్తుగా చెబుతారు. పూర్వం రోజుల్లో గాడిదను రవాణాకు, బరువులు మోసేందుకు విరివిగా వినియోగించేవారు. ఇది 12 నెలల పాటు గర్భాన్ని మోసి, పిల్లకు జన్మనిస్తుంది. ఎడారి ఓడగా పేరుగాంచిన ఒంటె చాలాకాలం పాటు నీటిని తాగకపోయినా బతుకుతుంది. ఇది 13 నుంచి 15 నెలల పాటు గర్భం మోస్తుంది. సుమారు 410 రోజుల తరువాత పిల్లకు జన్మనిస్తుంది. పొడవైన మెడ కలిగిన జిరాఫీ చూపరులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. ఇది 13 నుంచి 16 నెలల పాటు గర్భాన్ని మోస్తుంది. అనంతరం పిల్లకు జన్మనిస్తుంది. పుట్టినప్పుడు దాని పిల్ల కూడా పొడవుగా ఉండటం విశేషం. ఖడ్గమృగం చూడటానికి ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఇది 15 నుంచి 16 నెలల పాటు గర్భాన్ని మోస్తుంది. తెల్ల ఖడ్గమృగాలు 16 నుంచి 18 నెలల పాటు గర్భాన్ని మోస్తాయి. ఏనుగు దీర్ఘకాలం పాటు గర్భధారణ కలిగివుంటుంది. ఇది గర్భాన్ని ధరించిన 680 రోజులకు పిల్లకు జన్మనిస్తుంది. దీర్ఘకాలం పాటు గర్భధారణ కలిగివుండే జంతువులలో ఏనుగు ముందు వరుసలో నిలుస్తుంది. ఇది కూడా చదవండి: పొరుగింటిలో 34 పెంపుడు కుక్కలు వీరంగమాడుతున్నాయని.. -
ప్రపంచంలో టాప్10 విచిత్రమైన డైనోసార్స్
-
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 10 సముద్ర జీవులు
-
వరుసగా మృతి చెందుతున్న పులులు... విషయం తెలిసిన గ్రామస్తులు ఏం చేస్తున్నారంటే...
మధ్యప్రదేశ్లోని శ్యోపూర్లోగల కూనో నేషనల్ పార్క్లో గడచిన రెండు నెలలలో మూడు చిరుతలు, వాటి పిల్లలు మూడు మృతిచెందాయి. స్థానికంగా ఇది సంచలనంగా మారింది. దీనికితోడు ఇదే ఈ జూర్కులో ఉన్న 17 చిరుతలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాయి. ఒక చిరుత కూన కూడా వ్యాధులతో బాధపడుతోంది. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు వాటి ఆరోగ్యం మెరుపడాలని కోరుతూ పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కర్హల్ తహసీల్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో పులల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. వాటి ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ హోమాలు కూడా నిర్వహిస్తున్నారు. మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ, సుందరాకాండ పారాయణ, హనుమాన్ చాలీసా కూడా చేస్తున్నారు. గ్రామస్తులతో పాటు జంతు ప్రేమికులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా 2022 సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ కూనో పార్క్కు నమీబియా నుంచి తెచ్చిన 8 చిరుతలను అప్పగించారు. వాటిలో ఐదు మగ చిరుతలు, 3 ఆడ చిరుతలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో వాటి సంరక్షణకు చీతా ప్రాజెక్టు ప్రారంభించారు. ఇదేవిధంగా 2023 ఫిబ్రవరి 18 ఇక్కడకు ఆఫ్రికా నుంచి మరో 12 చిరుతలను తీసుకువచ్చారు. వీటిలో 7 ఆడ చిరుతలు, 5 మగ చిరుతలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది మార్చి 26న నమీబియా నుంచి తెచ్చిన ఒక చిరుత అనారోగ్యంతో మృతి చెందింది. అలాగే ఏప్రిల్ 23న సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చిన ఒక చిరుత మృతి చెందింది. మే 9న మరో చిరుత మరణించింది. మే 23న ఒక చిరుత కూన మృతి చెందింది. తరువాత కొన్ని చిరుతలు అనారోగ్యం పాలయ్యాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులు వాటి ఆరోగ్యం మెరుగుపడాలని కాంక్షిస్తూ పూజలు చేస్తున్నారు. -
ప్రపంచంలోని టాప్ 10 జూలాజికల్ పార్కులు ఇవే!
-
ప్రపంచంలోని టాప్ 10 నెమ్మదైన జంతువులు
-
జల్లికట్టుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్.. కీలక వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: తమిళనాడులో నిర్వహించే జల్లికట్టుపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో జల్లికట్టును అనుమతించే తమిళనాడు ప్రభుత్వ చట్టాన్ని రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. జల్లికట్టు తమిళనాడు సాంస్కృతిక వారసత్వంలో భాగమని శాసనసభ ప్రకటించినప్పుడు, న్యాయవ్యవస్థ అందుకు భిన్నమైన అభిప్రాయాన్ని తెలపదని వ్యాఖ్యానించింది. ఇది క్రీడ సాంస్కృతిక వారసత్వంలో భాగమని, సాంప్రదాయక క్రీడ కాదని చెప్పడానికి ఎలాంటి రుజువు లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో జట్టికట్టు పోటీలపై ఎలాంటి నిషేధం లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. జంతువులతో కూడిన క్రీడలను అనుమతించేందుకు మహారాష్ట్ర & కర్ణాటక ప్రభుత్వాలు రూపొందించిన ఇలాంటి చట్టాలను అత్యన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. కాగా జల్లికట్టు వంటి క్రీడలను సుప్రీంకోర్టు 2014లో నిషేధించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు నిర్ణయం అనంతరం ఈ రాష్ట్రాలు ఇటువంటి క్రీడలకు అనుమతి ఇచ్చేందుకు వీలుగా చట్టాలను సవరించాయి. ఇవి వారసత్వ క్రీడలని పేర్కొన్నాయి. 2017లో జల్లికట్టును అనుమతిస్తూ కొన్ని సవరణలు చేసి తమిళనాడు ప్రభుత్వం చట్టం చేసింది. ఈ సవరణల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేస్తూ జంతు హింస చట్టం ఈ ఆటకు వర్తించదని తెలిపింది. ఈ మేరకు 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం సవరించింది. చదవండి: ఆర్బీఐ కంటైనర్లో రూ.1000 కోట్ల నగదు.. భారీ భద్రత, హఠాత్తుగా ఆగిపోయిన వాహనం -
పాల దిగుబడిపై వడ‘దెబ్బ’
నరసాపురం రూరల్: వేసవిలో పాడిపశువుల సంరక్షణపై రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. వేసవిలో పశువులకు వడదెబ్బ తగిలితే పాల దిగుబడి తగ్గడమే కాక పశువులు ఎదకు వచ్చే పరిస్థితులు కనిపించవని, అంతేకాక పశువు చూడుకట్టే అవకాశం ఉండదని పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వై.సుధాకర్ చెబుతున్నారు. వేసవిలో పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పశువుల్లో సోకే వ్యాధులను ఆయన వివరించారు. వేసవిలో గేదెలు, ఆవులపై సరైన శ్రద్ధ తీసుకోనట్లయితే వడదెబ్బకు గురై ఒక్కొక్కసారి పశువు ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు ఇవే వేసవిలో పశువులు తాగే నీరు స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచాలి. వేసవిలో సహజంగానే నీటి వనరులు తగ్గి నిల్వ ఉండే నీరు మురికిగా, ఆకుపచ్చగా మారతాయి. పశువులు ఈ కలుషితమైన నీరు తాగితే వ్యాధికారక క్రిములు శరీరంలోకి చేరి పారుడు వ్యాధులు కలుగుతాయి. కాబట్టి పశువులు తాగేందుకు స్వచ్ఛమైన నీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. లేదంటే రోజులో కనీసం మూడుసార్లు నీటిని అందించడం అవసరం, ఆరుబయట తొట్టెల్లో పగలు నిల్వ ఉన్న నీరు వెచ్చగా మారతాయి. నీడ ప్రాంతంలో నిల్వ ఉంచిన చల్లటి నీటినే పశువులకు తాగించాలి. ఆవులతో పోలిస్తే గేదెలు ఎక్కువ నీటిని తాగుతాయి. వాతావరణ ఉష్ణోగ్రత, గాలిలో తేమ, పశువు వయస్సు తదితరాలనుబట్టి రోజుకు సుమారుగా 28 లీటర్ల నీరు అవసరమవుతాయి. పాలిచ్చే పశువులు అదనంగా ప్రతి లీటరు పాల దిగుబడికి నాలుగు లీటర్ల చొప్పున నీటిని తాగుతాయి. ఇది కాకుండా పశువులను శుభ్రపరిచేందుకు, షెడ్లలో నేలను శుభ్రపరిచేందుకు ప్రతి పశువుకు 110 లీటర్ల నీరు అవసరం పడుతుంది. వడదెబ్బ తగలకుండా.. పశువులకు వడదెబ్బ తగలకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుల పాక చుట్టూ పాత గోనెలు కట్టి వాటిని అప్పుడప్పుడు తడుపుతూ ఉండాలి. పైకప్పును కొబ్బరి ఆకులతో గానీ, ఎండి వరిగడ్డితో గాని కప్పాలి. మంచినీరు ఎల్లప్పుడు అందుబాటులో ఉండేట్లు చూడాలి. పశువులను ఉదయం, సాయంత్రం మాత్రమే అంటే చల్లని వాతావరణంలోనే మేత మేసేందుకు విప్పాలి. పశువులు ఎక్కువగా ఎండలో తిరగకుండా చూడాలి. వీలైనంత పచ్చని మేతను ఇవ్వాలి. సంకర జాతి ఆవులైతే పంకాలు ఏర్పాటు చేయాలి. వడదెబ్బకు గురైతే లక్షణాలు ఇలా.. వడదెబ్బకు గురైన పశువు లక్షణాలను పరిశీలిస్తే శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల నుంచి 108 డిగ్రీల వరకు పెరుగుతుంది. పశువులు నడిచేటప్పుడు తూలుతాయి. శ్వాసక్రియ ఎక్కువగా ఉంటుంది. పశువు చాలా నీరసంగా కనబడుతుంది. ఒక్కొక్కసారి కింద పడి కొట్టుకుని స్పృహకోల్పోతాయి. పశువు నీటి కొరకు చూస్తుంటుంది. పశువు చర్మం ఎండిపోయినట్లు ఉంటుంది. పశువులో పాల ఉత్పత్తి కొల్పోతుంది. ఇటువంటి లక్షణాలు ఉంటే వడదెబ్బ తగిలిందని రైతు గ్రహించాలి. చేయాల్సిన చికిత్స ఇదే వడదెబ్బ తగిలిన పశువును రైతులు గుర్తించిన వెంటనే చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. గుడ్డతో ఐస్ చుట్టి పశువు నుదుటిపై నొత్తాలి. కొద్ది ఊరట కలిగిన తరువాత దగ్గరలోని పశు వైద్యుడిని సంప్రదించి సైలెన్లు పెట్టాలి. ఒక్క సారి వడదెబ్బ తగిలిన పశువుకు బతికినంత కా లం పాలదిగుబడి గతంలో మాదిరిగా ఉండదు. జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ వై సుధాకర్, పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు -
వేసవి నేపథ్యంలో నెహ్రు జూపార్కులో ప్రత్యేక ఏర్పాట్లు
-
ప్రపంచంలో నీరు లేకుండా జీవించే టాప్ 10 జంతువులు (ఫోటోలు)
-
పర్యావరణంలో మీ పాత్ర?
పర్యావరణం బాగుంటే మనం బాగుంటాం. మనం బాగుండాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకోసం మీరు ఏమి చేస్తున్నారో మీకు మీరుగా ప్రశ్నలు వేసుకోండి. ఒకవేళ మీకు సరైన సమాధానం రాకపోతే ఈ కింద చెప్పుకున్న పనులు చేసేందుకు ప్రయత్నం చేయండి. ♦ ఈ పర్యావరణంలో జంతువులు, పక్షులు కూడా భాగమే కాబట్టి వాటికోసం ఆవాసాలు, చెట్ల మీద గూళ్లు ఏర్పాటు చేయడం. ♦ జల, మృత్తికా కాలుష్యాలను అరికట్టేందుకు ప్లాస్టిక్ సంచుల వినియోగం తగ్గించాలని ప్రచారం చేయడం. ♦ పాతవస్తువుల పునర్వినియోగం గురించి పిల్లలకు తెలియజేయటం. ♦ వీధులు,పార్కులు, ఇతర ప్రదేశాల్లో వ్యర్థాలను తీసిపారేయటం. ♦ వీలైతే పర్యావరణ భద్రత గురించిపాటలు, నాటికలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, వీలైనన్ని మొక్కలను నాటటం, నాటించటం. ♦ భూమిని, సహజవనరులను కాపాడుకోవటం ఎంతో అవసరం కాబట్టి ప్రతిరోజూ పర్యావరణ దినోత్సవంగానే భావించడం, అలా భావించాల్సిందిగా మన చుట్టుపక్కల వారికి కూడా చెప్పడం. ♦ మన భూమి భవిష్యత్తు రేపటి పౌరులైన పిల్లల చేతిలో ఉంది కాబట్టి పర్యావరణాన్ని, సహజవనరులను కాపాడాల్సిన బాధ్యతను గురించి వారికి తెలియజేసేందుకుపాఠశాలలో వివిధ రకాల ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి. ♦ స్వచ్ఛత, కాలుష్యనివారణ, పర్యావరణం తదితర అంశాలకు సంబం ధించి కృషి చేస్తున్నవారిని, వాటికోసం ఎంతగానోపాటుపడుతున్నవారిని సత్కరించడం వల్ల ఇతరులు సైతం స్ఫూర్తిపొందే అవకాశముంది. ♦ పర్యావరణ హితం కోసం మన చుట్టుపక్కల చేపడుతున్న, జరుగుతున్న కార్యక్రమాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం. వీటి గురించి మీ మీ చుట్టూ ఉన్నవారు తెలుసుకునేందుకు మీరే సమాచార సారథిగా మారడం. ఇతరులకు ప్రేరణ అందించడం. -
పిల్లలూ.. మనం జంతువులను పుస్తకాల్లోనే చూడాలేమో..!
హెచ్ఎం: పిల్లలూ... మీరెప్పుడైనా పులిని చూశారా... విద్యార్థులు: ఊహు.. చూడలేదు సార్... హెచ్ఎం: పోనీ.. ఏనుగునీ.. విద్యార్థులు: (లేదన్నట్టుగా తెల్ల మొహం) హెచ్ఎం: భవిష్యత్తులో మీరు వీటిని జూలో, పుస్తకాల్లోనే చూడాల్సిన పరిస్థితి రావొచ్చేమో.. విద్యార్థులు: ఎందుకు సార్? హెచ్ఎం: ఎందుకంటే... అడవులు నశించిపోవడంతో జంతు సంపద కూడా అంతరించిపోతోంది.. అంటూ అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం కొత్తపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోసూరు రాము బోధించారు. విద్యార్థులతో జంతు మాస్క్లు ధరింపజేసి, ఆయన కూడా మాస్క్ వేసుకొని బోధన చేశారు. దేశంలో వేలల్లో ఉన్న జంతు సంపద వందల్లోకి చేరిందని.. ప్రస్తుత పరిస్థితులను విద్యార్థులకు వివరించారు. వినూత్న రీతిలో బోధిస్తే విద్యార్థులు ఆసక్తిగా విషయాన్ని అర్థం చేసుకుంటారనే ఇలా చేశానని ఆయన చెప్పారు. (క్లిక్ చేయండి: కురమయ్య.. నీ ఆలోచన బాగుందయ్యా!) -
వైరల్ వీడియో: ఖెర్సన్ జూలో జంతువులను ఎత్తుకుపోతున్న రష్యా సేనలు
-
ప్చ్! పోరాడలేకపోయాం...కనీసం కొట్టేద్దాం: రష్యా బలగాలు
ఖెర్సన్ నుంచి రష్యా బలగాలు వైదొలగడంతో ఉక్రెయిన్లో పండగ వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నగరమంతా రష్యా బలగాలను తరిమికొట్టేశాం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఆనందంగా ప్రకటించారు. ఈ మేరకు వెనక్కు మళ్లుతున్న రష్యా సేనాలు ఎలాగో పోరాడలేకపోయం కదా పోతూపోతూ... ఖెర్సన్ ప్రాంతంలో జూలోని జంతువులను పట్టుకుపోతున్నారు. బహుశా ఎలాగో పోతున్నాం కదా అని దొంగతనం చేస్తున్నారు కాబోలు. ఈ క్రమంలో ఖెర్సన్ జూలోని ఏడు రకూన్లు అనే అమెరికన్ ఎలుగుబంటి జాతులను, లామా అనే ఒంటె, నెమళ్లు, రెండు ఆడ తోడేళ్లు, గాడిద వంటి జంతువులను బలవంతంగా పట్టుకుని వాహనంలో ఎక్కించారు. కేవలం జంతువులే కాదు అక్కడ ఆస్పత్రుల్లో ఉన్న వివిధ కళాఖండాలు, వైద్య పరికరాలు వంటివి పట్టుకుపోయారు. ఈ మేరకు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ జంతు ప్రదర్శనశాల నుంచి రష్యా బలగాలు జంతువులను పట్టుకుపోవడాన్ని తప్పపట్టారు. ఆర్ట్ గ్యాలరీ నుంచి పెయింటింగ్లు,మ్యూజియంల నుంచి పురాత వస్తువులు తదితరాలన్నింటిని దొంగలించినట్లు తెలిపింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు రష్యా బలగాలు ఉక్రెయిన్ని ఏమీ చేయలేక ఈ దొంగతనానికి ఒడిగట్టారంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: చర్చల ప్రసక్తే లేదు...తెగేసి చెప్పిన జెలెన్స్కీ) -
జంతువులు అడవికే పరిమితం!
సాక్షి, అమరావతి: ఏనుగులు, పులులు వంటి జంతువులు జనావాసాలు, పొలాల వద్దకు వచ్చి బీభత్సం సృష్టించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయించింది. జంతువులను అడవికే పరిమితం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు మనుషులు, జంతువులకు మధ్య సంఘర్షణను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఒడిశా, తమిళనాడు అటవీ శాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలని కూడా నిర్ణయించింది. ఈ విషయంపై ఇటీవల నిర్వహించిన అటవీ శాఖాధికారుల సదస్సులో విస్తృతంగా చర్చించారు. ఎనిమిదేళ్లలో 38 మంది మృత్యువాత ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో ఏనుగులు గ్రామాల్లోకి వస్తున్నాయి. ఇటీవల రెండు పులులు దారి తప్పి తూర్పుగోదావరి, అనకాపల్లి ప్రాంతాల్లోకి రావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కృష్ణజింకలు రోడ్లపైకి, పొలాల్లోకి వస్తున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎలుగుబంట్లు, అడవి పందులు తరచూ గ్రామాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో జంతువులు, మనుషులకు మధ్య సంఘర్షణలో 2014 నుంచి ఇప్పటివరకు 38 మంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలపై 15,198 కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో మృతి చెందిన, గాయపడిన కుటుంబాలు, పంట, ఇతర నష్టాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లకుపైగా పరిహారం చెల్లించింది. పటిష్ట భద్రత ఏర్పాట్లు.. అవగాహన కార్యక్రమాలు.. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో ఏనుగులు ఎక్కువగా ఆవాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. వాటిని అడ్డుకునేందుకు ఏనుగులు వచ్చే మార్గాల్లో కందకాలు తవ్వడం (ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచ్లు), ఆర్సీసీ పిల్లర్లతో స్ట్రీమ్ బారికేడ్లు, రోడ్లపైకి వచ్చే మార్గాల్లో గేట్లు, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో 24గంటలు తిరుగుతూ వాటిని గ్రామాల్లోకి రాకుండా చూసేందుకు ప్రత్యేక బృందాలను, ఎలిఫెంట్ ట్రాకర్లను నియమించనున్నారు. అదేవిధంగా ఏనుగులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు మిరపకాయ పొగ వేయడం, ఆముదం స్ప్రే చేయడం, తేనెటీగల సౌండ్ చేయడం ద్వారా వాటిని తిరిగి అడవి వైపు మళ్లించే అంశాలపై స్థానికులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏనుగులు బయటకు రాకుండా అడవుల్లోనే వాటి కోసం నీటి గుంటలు ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరాంధ్రలో ఎలిఫెంట్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేసే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల అధికారులతో సమన్వయం పెంచుకుని ఏనుగుల కదలికలపై సమాచారాన్ని వేగంగా మార్పిడి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. పులులను ట్రాప్ చేసేలా... తమ ఆవాసాల్లోకి వేరే పులులు రావడంతో అక్కడక్కడా పులులు దారి తప్పి అడవి నుంచి బయటకు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలా బయటకొచ్చిన పులులు ఆహారం కోసం గ్రామాల్లోకి వచ్చి ఆవులు, మేకలు వంటి జంతువులను చంపుతున్నాయి. ఇలాంటి ఘటనల నివారణ కోసం వాటిని ట్రాప్ చేసే కేజ్లు సమకూర్చుకోవడంతోపాటు కెమెరాల ట్రాప్లను పెంచడానికి చర్యలు తీసుకోనున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కృష్ణజింకలు రోడ్లపైకి వచ్చి మృత్యువాత పడుతున్నాయి. పొలాల్లోకి వచ్చి పంటను ధ్వంసం చేస్తున్నాయి. అవి అడవి దాటి రాకుండా చర్యలు చేపడుతున్నారు. -
మూగ జీవుల కోసం ‘వైఎస్సార్ వెటర్నరీ ల్యాబ్స్’.. సత్వర చికిత్స
సాక్షి, అమరావతి: మూగజీవాలు.. సన్నజీవాలు.. పెంపుడు జంతువుల్లో బయటకు కనిపించే గాయాలను బట్టి వైద్యం చేయించడం పెద్ద సమస్య కాదు. కానీ.. కడుపు నొప్పి, చెవిపోటు, గుండెల్లో మంట వంటి సమస్యలతో బాధపడుతుంటే పసిగట్టడం కష్టమే. గుర్తించిన తర్వాత వాటిని మండల కేంద్రాలకు తీసుకెళ్లి వైద్యుల సలహా మేరకు మందులను వాడేవారు. వాటినుంచి నమూనాలు సేకరించి చిన్నచితకా పరీక్షలను ఆస్పత్రుల్లోనూ.. పెద్దపెద్ద పరీక్షలను జిల్లా స్థాయి ల్యాబ్లకు పంపి పరీక్షించేవారు. సిబ్బంది కొరత, సామర్థ్యం లోపాల వల్ల పరీక్షలు చేయాలంటే.. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి, మరికొన్ని సందర్భాల్లో నెలల తరబడి సమయం పట్టేది. ఈలోగా వ్యాధి తీవ్రత పెరిగి పశువులు మరణించడం వల్ల పోషకుల ఆర్థిక పరిస్థితి తల్లకిందులయ్యేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నియోజకవర్గ స్థాయిలో అందుబాటులోకి వచ్చిన వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ ల్యాబ్స్ ద్వారా క్షణాల్లో వ్యాధి నిర్ధారణ చేయడంతో పాటు సత్వర పశువైద్యసేవలు అందిస్తున్నారు. గతంలో జిల్లాకు ఒకటే ల్యాబ్ రాష్ట్రంలో 2019 లెక్కల ప్రకారం.. 46 లక్షల ఆవులు, 62 లక్షల గేదెలు, 1.76 లక్షల గొర్రెలు, 55 లక్షల మేకలు, 10.78 కోట్ల కోళ్లు ఉండేవి. వీటి పోషకుల్లో నూటికి 95 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేయడంతో పశుపోషణ రైతులకు లాభదాయకంగా మారింది. ఆర్బీకేల్లో 4,652 మంది పశు సంవర్ధక సహాయకులు సేవలందిస్తుండగా, మరో 5,160 సహాయకుల నియామకానికి కసరత్తు జరుగుతోంది. నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరోవైపు పశువుల్లో వచ్చే రోగాలను గుర్తించేందుకు గతంలో జిల్లాకు ఒకటి చొప్పున మాత్రమే వెటర్నరీ ల్యాబ్స్ ఉండేవి. పశువులకు నాణ్యమైన వైద్యసేవలు, సర్టిఫైడ్ ఇన్పుట్స్ అందించడమే లక్ష్యంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్కు అనుబంధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో 154 వైఎస్సార్ పశుసంవర్ధక ల్యాబ్స్ను తీసుకొచ్చారు. వీటితోపాటు జిల్లా స్థాయిలో 10, ప్రాంతీయంగా 4, రాష్ట్ర స్థాయిలో స్టేట్ రిఫరల్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. వీటిలో రాష్ట్ర, జిల్లా, ప్రాంతీయ స్థాయి ల్యాబ్లతో పాటు నియోజకవర్గ స్థాయిలో 60 ల్యాబ్స్ సేవలు అందుబాటులోకి రాగా.. 52 ల్యాబ్స్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 42 ల్యాబ్స్ ఈ నెలాఖరుకి అందుబాటులోకి రానున్నాయి. గతంలో ఏటా 15 వేల నుంచి 20 వేల శాంపిల్స్ను మించి పరీక్షించే సామర్థ్యం ఉండేది కాదు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున వైఎస్సార్ వెటర్నరీ ల్యాబ్స్ అందుబాటులోకి వచ్చాక.. ఈ ఏడాది 20 రకాల వ్యాధులకు సంబంధించి 1.86 లక్షలకు పైగా శాంపిల్స్ను పరీక్షించి.. వ్యాధి సోకిన పశువులకు సకాలంలో తగిన చికిత్స అందించగలిగారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా.. సీఎం వైఎస్ జగన్ ఆలోచన విప్లవాత్మకం. మూగజీవాల కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా నియోజకవర్గ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాబ్స్ ఏర్పాటు చేయడం గొప్ప విషయం. వీటితో నాణ్యమైన వైద్య సేవలందించడమే కాదు.. సర్టిఫై చేసిన ఇన్పుట్స్ను సైతం సరఫరా చేయగలుగుతున్నాం. –ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ 24 గంటల్లో ఫలితం ఇచ్చారు నాకు 10 మేకలు, గొర్రెలు ఉన్నాయి. మేకలు ఐదు రోజులుగా పారుడు వ్యాధితో బాధపడుతూ మేత తినడం మానేశాయి. ఆర్బీకే సిబ్బంది సూచన మేరకు పరీక్ష కోసం మంగళగిరి ల్యాబ్కి నమూనా తీసుకెళ్లా. 24 గంటల్లోనే పరీక్షించి అంతర పరాన్న జీవులున్నాయని చెప్పగా, వైద్యుని సలహాతో తగిన వైద్యం చేయించాను. జీవాలన్నీ కోలుకున్నాయి. – టి.నాగరాజు, యర్రబాలెం, గుంటూరు జిల్లా వెంటనే రిపోర్ట్ ఇచ్చారు నేను 10 గేదెలు, 10 దూడల్ని మేపుతునా. రెండు గేదెలు 10 రోజులుగా పారుడు సమస్యతో తిండితినక కదల్లేని స్థితిలోకి చేరుకున్నాయి. పేడ నమూనాను జగ్గయ్యపేట ల్యాబ్కు తీసుకెళ్లా. పరీక్షిస్తే ‘బాలంటిడియం కోలి’ అనే జీవులు కడుపులో ఉన్నాయని రిపోర్టు ఇచ్చారు. వెంటనే వైద్యుడిని సంప్రదించి మందులు వాడాను. ఇప్పుడు పశువులన్నీ చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. పరీక్షలకు పైసా కూడా తీసుకోలేదు. – డి.నాగరాజు, జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా -
నల్లమల వన్యప్రాణులకు ప్లాస్టిక్ ముప్పు
సాక్షి, అమరావతి: నల్లమల అడవుల్లోని వన్యప్రాణులు ప్లాస్టిక్ ప్రభావానికి గురవుతున్నాయి. ప్లాస్టిక్ కారణంగా ఈ అటవీ ప్రాంతంలోని జంతువుల ప్రవర్తనలో మార్పులు వస్తున్నట్లు అటవీ శాఖ అధ్యయనంలో తేలింది. వాటి శరీరాల్లోను మార్పులు వస్తున్నట్లు స్పష్టమైంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో శ్రీశైలంలో ఉన్న బయోడైవర్సిటీ రీసెర్చి సెంటర్ నల్లమల అడవుల్లో పర్యావరణం, జీవావరణానికి సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తోంది. విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతం (నల్లమల అడవులు) పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు వంటి అనేక జంతువులకు ఆలవాలం. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలానికి వెళ్లే మార్గం ఈ అడవిలోంచే ఉంది. లక్షలమంది యాత్రికులు వచ్చే ప్రాంతం కావడంతో ఇక్కడ ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కొందరు యాత్రికులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ప్లాస్టిక్ పెట్ బాటిళ్లు, పాలిథిన్ కవర్లు వంటి వాటిని అటవీ ప్రాంతంలో రోడ్డు వెంబడి పడేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఆకర్షిస్తుండడంంతో వన్యప్రాణులు రోడ్డుపైకి వచ్చి ప్రమాదాల పాలవుతున్నాయి. తెలియకుండా ప్లాస్టిక్ను తింటున్న అడవి జంతువులకు అనారోగ్యాలు వస్తున్నాయి. వన్యప్రాణుల శరీరంలో బయో–అక్యుమ్యులేషన్, బయో–మాగ్నిఫికేషన్ జరిగి ప్లాస్టిక్ కెమికల్స్ ఎక్కువగా పోగుపడుతున్నాయి. దీంతో అడవి జంతువుల సహజ ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి. వాటి శరీర హార్మోన్లలో మార్పులు వచ్చి అనారోగ్యాలకు గురవుతున్నాయి. ఆకలి తగ్గిపోవడంతో తినడం తగ్గి శక్తిహీనం అవుతున్నాయి. వాటి ఆహారపు అలవాట్లలోను తేడాలు కనిపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నం ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు (ఎన్ఎస్టీఆర్)కు చెందిన అటవీ బృందం సాంకేతిక, శాస్త్రీయ పద్ధతుల ద్వారా నల్లమలలోని విభిన్నమైన పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. నల్లమల పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడమే అత్యంత కీలకమైన అంశం కావడంతో అక్కడి పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ‘మన ఎన్ఎస్టీఆర్–క్లీన్ అండ్ గ్రీన్ ఎన్ఎస్టీఆర్’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. స్థానికంగా ఉండే చెంచు గిరిజనులను ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేయడానికి స్వచ్ఛ సేవక్లుగా నియమించింది. తద్వారా వారికి ఉపాధి కల్పించడంతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థంగా నిర్వహిస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వేరు చేయించడంతోపాటు ప్రామాణిక పద్ధతుల్లో వాటిని రీసైక్లింగ్ చేస్తోంది. ప్రతి స్వచ్ఛ సేవక్కు అడవిలో జనసంచారం ఉండేచోట కొంత ప్రాంతాన్ని కేటాయించి ఆ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేసే బాధ్యతను అప్పగించింది. ఘాట్రోడ్డు పక్కన చెత్తకుండీలు ఏర్పాటు చేసి యాత్రికులు ప్లాస్టిక్ వ్యర్థాలను వాటిలో వేసేలా సూచికలు పెట్టింది. ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న నష్టాలను తెలిపేలా పలుచోట్ల హోర్డింగ్లు ఏర్పాటు చేసింది. ఈ చర్యల ద్వారా అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వల్ల సమస్యలు రాకుండా చేసేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నల్లమలను ప్లాస్టిక్ ఫ్రీ చేద్దాం నల్లమలను ప్లాస్టిక్ ఫ్రీ ప్రాంతంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. స్వచ్ఛ సేవక్ల ద్వారా ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లను ఏరివేయించి రీసైక్లింగ్కు పంపుతున్నాం. ప్లాస్టిక్ అడవి జంతువులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్లాíస్టిక్ను శ్రీశైలం ప్రాంతానికి తీసుకురాకూడదు. యాత్రికులు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంచుకోవాలి. – వై.శ్రీనివాసరెడ్డి, ఫీల్డ్ డైరెక్టర్, ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్, శ్రీశైలం -
అన్నీ బాగుండాలి.. అందులో మనముండాలి!
మలేరియా, చికెన్ గున్యా, డెంగీ వ్యాధుల వ్యాప్తికి దోమలు కారణం! ఇది అందరికీ తెలిసిన విషయమే.. మరి వీధి కుక్కల వెంట్రుకల్లో ఉండే పేనుతో మనకు ప్రమాదం లేదా? పాడి పశువులకు వచ్చే రోగాలు మనకు అంటవా? పోనీ మనల్ని ఇబ్బంది పెట్టే బ్యాక్టీరియా, వైరస్లతో జంతువులకు జబ్బులు రావా? అంతెందుకు నిన్న మొన్నటివరకు ప్రపంచాన్ని వణికించిన కరోనా మూలాలు జంతువులే! ఒక్కమాటలో చెప్పాలంటే మనకొచ్చే వ్యాధుల వ్యాప్తికి సగం కారణం జంతువులే! ఈ విషయాన్ని గుర్తించడంలో ఆలస్యమైతే జరిగిందిగానీ.. పరిష్కారం కోసం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడుస్తున్న ‘వన్ హెల్త్’ కార్యక్రమం మాత్రం వేగంగా అడుగులేస్తోంది (కంచర్ల యాదగిరిరెడ్డి) ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అయితే కాలం గడుస్తున్న కొద్దీ మనుషులకు కొత్త కొత్త రోగాలు, ఆరోగ్య సమస్యలు పరిచయమవుతున్నాయి. దశాబ్దం క్రితం మనకు చికెన్ గున్యా అంటే ఏమిటో తెలియదు. డెంగీ మాట కూడా చాలా మంది విని ఉండరు. హెచ్1ఎన్1, హెచ్1ఎన్5 వంటివి కనీవినీ ఎరుగం. కానీ ఇప్పుడివన్నీ ఏటా పలకరించే చుట్టాల్లా మారిపోయాయి. ఎందుకిలా అంటే కారణాలు బోలెడు. ముఖ్యమైనది మాత్రం పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడమే. అందుకే ఐదేళ్ల క్రితం ఐక్యరాజ్యసమితి (యూఎన్) ‘వన్ హెల్త్’ కార్యక్రమాన్ని రూపొందించి ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తోంది. ‘సర్వే సంతు నిరామయ’ వేదాల్లోని శాంతి మంత్రంలో ఓ చిన్న భాగమిది. భూమ్మీద ఉన్న వారెవరికీ వ్యాధుల బాధ లేకుండా ఉండు గాక అని అర్థం. అంటే మనుషులతోపాటు జీవజాలం మొత్తం కూడా ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండటం. యూఎన్ ‘వన్ హెల్త్’ లక్ష్యం కూడా ఇదే. మానవుల ఆరోగ్యం బాగుండేందుకు.. కరోనా, ఎబోలా, వెస్ట్ నైల్ వంటి భయంకర వ్యాధులు ప్రబలకుండా, కొత్త కొత్త వ్యాధులు అంటకుండా చూసుకునేందుకు.. మన చుట్టూ ఉన్న జంతువులు, ప్రకృతిని కూడా కాపాడుకోవాలని చెబుతుంది ‘వన్ హెల్త్’. నిజానికి ఇదేమీ కొత్త విషయం కాదు. కాకపోతే ఇటీవలికాలంలో పెచ్చుమీరుతున్న జంతు వ్యాధుల నేపథ్యంలో మరింత ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడింది. విస్తరిస్తూ పోతున్న కొద్దీ.. భూమ్మీద జనాభా పెరుగుతోంది. మనిషి కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాడు. ఈ క్రమంలో మనుషులకు, అడవి జంతువులకు మధ్య ఉన్న దూరం తగ్గిపోతోంది. ఇలా ఆ జంతువులకు దగ్గరవుతున్న కొద్దీ వాటిలో ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న వ్యాధికారక సూక్ష్మజీవులు మనలోకి ప్రవేశించే అవకాశాలు పెరుగుతున్నాయి. అడవుల నరికివేత, వ్యవసాయ పద్ధతులు మారిపోవడం, పర్యావరణం దెబ్బతినడం దానికి ఊతమిస్తోంది. వ్యాపార, వాణిజాల్లో వృద్ధి కారణంగా వ్యాధులు ఒకచోటి నుంచి ఇంకో చోటకు ప్రయాణించడం సులువైపోయింది. అందుకే ఇటీవలికాలంలో జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకడం ఎక్కువైందన్నమాట. కుక్కల నుంచి వచ్చే రేబిస్ మొదలుకొని సాల్మోనెల్లా, వెస్ట్నైల్ ఇన్ఫెక్షన్లు, క్యూ ఫీవర్, ఆంథ్రాక్స్, బ్రుసెల్లోసిస్, లైమ్, రింగ్వర్మ్, ఎబోలా వంటివి మనం ఎదుర్కొంటున్న జునోటిక్ (జంతువుల నుంచి సోకేవి) వ్యాధుల్లో కొన్ని మాత్రమే. మారిన పరిస్థితులు జంతువులకూ మరిన్ని వ్యాధులు సోకేలా చేస్తూండటం ఆసక్తికరమైన అంశం. ఏయే అంశాలపై ‘వన్ హెల్త్’ దృష్టి ‘వన్ హెల్త్’ కార్యక్రమం కేవలం జంతువులు, మనుషులకు వచ్చే వ్యాధులపై మాత్రమే దృష్టిపెట్టడం లేదు. ఈ వ్యాధులకు కారణమైన ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటోంది. యాంటీ బయాటిక్లకు లొంగని సూక్ష్మజీవులు వీటిలో ఒకటి. ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించని పక్షంలో వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదముంది. ఆస్పత్రులు, ఆహారం, మట్టి, నీరు వంటి పలు మార్గాల ద్వారా మందులకు లొంగని వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు వ్యాప్తి చెందుతాయి. అలాగే వ్యాధికారక సూక్ష్మజీవులను మోసుకెళ్లే క్రిమికీటకాలు (దోమలు, పశువులు, జంతువులపై ఆధారపడి బతికే పేన్లు, ఇతర కీటకాలు)లను నియంత్రించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆహారంగా ఉపయోగించుకునే జంతువుల (కోళ్లు, గొర్రెలు, మేకలు, పందుల్లాంటివి) సంరక్షణ, ఆరోగ్యం కూడా ‘వన్హెల్త్’ కార్యక్రమంలో భాగమే. వన్ హెల్త్ కింద ఏం చేస్తున్నారు? వన్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నడుస్తున్నాయి. మానవ, జంతు వ్యాధుల నిపుణులు, పర్యావరణవేత్తలు కలిసికట్టుగా రకరకాల వ్యాధుల వ్యాప్తి ఎలా జరుగుతోందో తెలుసుకుంటున్నారు. పశువులతోపాటు మనుషుల్లోనూ యాంటీ బయాటిక్ల విచ్చలవిడి వాడకానికి చెక్ పెట్టేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెంపుడు జంతువుల యజమానులు, రైతుల్లోనూ వన్హెల్త్ కార్యక్రమం ఉద్దేశాలు, లక్ష్యాలు, జరుగుతున్న నష్టాలను వివరిస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో తగిన చర్యలు చేపడుతున్నారు. కంబోడియాలో రేబిస్, ఏవియన్ ఇన్ఫ్లుయెంజాల నివారణ కోసం వ్యవసాయ, మత్స్య, అటవీ శాఖల అధికారులతో కూడిన ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. అమెరికాలోని అట్లాంటా అక్వేరియంలోని జలచరాలు కొన్నింటికి కరోనా సోకింది. వాటికెలా సోకిందో తెలుసుకునేందుకు వన్హెల్త్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా ఇది ఇతర జంతువులకు మనుషులకు మళ్లీ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నవంబర్ మూడు.. వన్హెల్త్ డే! 1964లో కాల్విన్ ష్వాబ్ అనే పశువైద్యుడు తొలిసారి ‘వన్ మెడిసిన్’ పేరుతో రాసిన ఒక పరిశోధన వ్యాసంలో జంతువులు, మనుషులకు వచ్చే వ్యాధుల్లోని సారూప్యతలను ప్రస్తావించారు. పశు, మానవ వైద్యులు కలిసికట్టుగా పనిచేస్తే అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించవచ్చని సూచించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో ష్వాబ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ఈ అంశంపై కృషి చేయడం మొదలుపెట్టింది. 2004లో వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ, రాక్ఫెల్లర్ యూనివర్సిటీలు ‘వన్ వరల్డ్.. వన్హెల్త్’ పేరుతో కార్యక్రమం చేపట్టాలని సూచించాయి. సాంక్రమిక వ్యాధులను అరికట్టేందుకు జంతువులు, పర్యావరణం రెండింటిపైనా దృష్టి కేంద్రీకరించాలని, ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ప్రభుత్వాలు తగిన విధానాలను రూపొందించాలని ప్రతిపాదించాయి. అమెరికన్ హెల్త్ అసోసియేషన్ 2007లో మానవ, జంతు వైద్య పరిశోధన సంస్థల మధ్య సహకారానికి తీర్మానం చేయగా.. తర్వాతి కాలంలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్), ప్రపంచబ్యాంకు తదితర అంతర్జాతీయ సంస్థలు ‘వన్ హెల్త్’ కార్యక్రమం కోసం ఓ ప్రణాళికను రూపొందించడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత కూడా పలు అంతర్జాతీయ స్థాయి సదస్సులు, చర్చలు, విధానాల రూపకల్పనతో 2016లో ‘వన్ హెల్త్ కమిషన్, వన్ హెల్త్ ప్లాట్ఫామ్, వన్ హెల్త్ ఇనిషియేటివ్’ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయి. నవంబరు మూడో తేదీని ‘వన్ హెల్త్ డే’గా ప్రకటించాయి. నైజీరియాలో సీసంతో.. 2010లో నైజీరియాలో అకస్మాత్తుగా డజన్ల కొద్దీ బాతులు చచ్చిపోయాయి. కారణాలేవీ తెలియలేదు. బాతులే కదా అని ప్రజలూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొన్ని నెలల తర్వాత అదే ప్రాంతంలో వందలాది మంది పిల్లలు జబ్బు పడటం మొదలైంది. సమస్య ఎక్కడుందో వెతికేందుకు జరిగిన ప్రయత్నంలో.. ఆ ప్రాంతంలోని వారు ఎక్కువమంది ముతక పద్ధతుల్లో బంగారాన్ని అన్వేషిస్తున్నారని.. ఈ క్రమంలో విడుదలైన సీసం నీళ్లలో చేరి పిల్లల అనారోగ్యానికి కారణమైందని తేలింది. నమీబియా చీతాలతో లాభం నమీబియా చీతాలు ఇటీవలే ఇండియాకు వచ్చాయి. దశాబ్దాలపాటు భారత్లో కనుమరుగైపోయిన చీతాలు మళ్లీ కనిపించడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు కూడా. అయితే దీనివల్ల ఇంకో ప్రయోజనమూ ఉంది. వేటాడి బతికే చీతాలు క్షీణించిపోతున్న గడ్డి మైదానాలను పరిరక్షించుకునేందుకు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. వేటాడే జంతువులు లేకపోవడం వల్ల గడ్డి తిని బతికే జంతువులు ఎక్కువై మైదానాలు లేకుండా చేస్తున్నాయని, చీతాల ప్రవేశంతో సమతౌల్యత ఏర్పడి గడ్డి మైదానాలు మళ్లీ పుంజుకుంటాయని అంటున్నారు. కాలిఫోర్నియాలో ఓ మిస్టరీ 2007లో కాలిఫోర్నియాలో ఓ మిస్టరీ చోటు చేసుకుంది. మోంటెరీబే ప్రాంతంలో సీఒట్టర్స్ (సీల్ల తరహాలో ఉంటాయి) అని పిలిచే జలచరాలు కొన్ని జబ్బుపడ్డాయి. మరికొన్ని ప్రాణాలు కోల్పోయాయి. వాటి చిగుళ్లు పసుపుపచ్చ రంగులోకి మారిపోయాయి. కాలేయం ఉబ్బి ఉంది. మామూలు జబ్బులేవీ ఈ లక్షణాలకు కారణం కాదు. వన్హెల్త్ కార్యక్రమం కింద సముద్ర, మత్స్య శాఖల అధికారులు పరిశోధన మొదలుపెడితే.. పజారో నది నుంచి పింటో సరస్సుకు అక్కడి నుంచి సముద్రంలోకి కలుస్తున్న నీళ్లలో కొట్టుకొస్తున్న నాచులోని ఓ రసాయనం సీఒట్టర్స్ల మరణానికి కారణమని తెలిసింది. పింటో సరస్సులో విపరీతంగా పెరిగిన నాచులోని నత్తగుల్లలు తినడం సీఒట్టర్స్ ప్రాణాలమీదకు తెచ్చిందని స్పష్టమైంది. -
చావు నుంచి మళ్లీ పుట్టుకకు..
భూమ్మీద మనుషుల విస్తృతి పెరుగుతున్న కొద్దీ అడవులు తరిగిపోతున్నాయి. దీనికి ఇతర కారణాలూ తోడై పలు రకాల జీవరాశులు అంతరిస్తున్నాయి. ఒకప్పుడు తమకే ప్రత్యేకమంటూ గొప్పగా చెప్పుకున్న జీవజాతులూ కనిపించకుండా పోతున్నాయి. అలా విలుప్తమైన జీవులను తిరిగి సృష్టించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. మన దేశంలోనూ అంతరించిపోయిన చీతాలను మళ్లీ పుట్టించేందుకు ప్రయత్నిస్తున్న విషయమూ తెలిసిందే. ఈ క్రమంలో ఆయా జాతులకు చెందిన ఒక్క జీవి కూడా బతికిలేకున్నా తిరిగి పుట్టించడం ఎలా సాధ్యమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదెలా, ఏం చేస్తారనే వివరాలు తెలుసుకుందామా.. సాక్షి సెంట్రల్ డెస్క్ పులి కాని పులి.. ►ఆస్ట్రేలియాలో పరిశోధకులు ఇటీవలే కోట్ల రూపాయలతో టాస్మానియన్ టైగర్లను తిరిగి పుట్టించే ఓ ప్రాజెక్టు చేపట్టారు. ఆస్ట్రేలియాకే ప్రత్యేకమైన వీటిని థైలసిన్లుగా కూడా పిలుస్తారు. కొంచెం శునకంలా, మరికొంచెం పులిలా చారలతో ఉండే టాస్మానియన్ టైగర్లు.. వేట, అడవుల విధ్వంసం కారణంగా 1930లోనే అంతరించిపోయాయి. అతి భారీ ఏనుగు ►వేల ఏళ్ల కింద భూమ్మీద తిరుగాడిన అతి భారీ ఏనుగుల (వూలీ మమ్మోత్)ను తిరిగి పుట్టించేందుకు అమెరికాకు చెందిన కలోస్సల్ బయో సైన్సెస్ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. వూలీ మమ్మోత్లు నాలుగు వేల ఏళ్ల కిందే అంతరించిపోయాయి. 3 విధానాల్లో పునరుత్థానం ఎప్పుడో అంతరించిపోయిన, ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్న జీవజాతులను తిరిగి పునరుత్థానం చెందించేందుకు మూడు రకాల పద్ధతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్లోనింగ్, బ్యాక్ బ్రీడింగ్, జీనోమ్ ఎడిటింగ్ ద్వారా ఆయా జీవులను పుట్టించవచ్చని అంటున్నారు. ► క్లోనింగ్ ద్వారా జీవులను పుట్టించడం చాలా మందికి తెలిసినదే. ఏదైనా జీవి కణాలను సేకరించి, వాటి నుంచి పిండాన్ని రూపొందించడం ద్వారా.. అచ్చం అదే జీవిని పుట్టించగలుగుతారు. అయితే ఈ విధానంలో ఆ జాతికి చెందిన జీవులు కొన్ని అయినా ఉండాల్సి ఉంటుంది. పూర్తిగా అంతరించిపోయిన వాటి విషయంలో ఈ విధానం పనికిరాదు. ► అంతరించిపోయిన జీవులకు అత్యంత దగ్గరి జాతి జీవులేవైనా ఉంటే.. వాటి ఆధారంగా పూర్వపు జాతిని పుట్టించడమే ‘బ్యాక్ బ్రీడింగ్’. ఉదాహరణకు.. జీబ్రాలకు బాగా దగ్గరి జాతి అయిన ‘క్వాగ్గాస్’ రకం జంతువులు 1883లోనే అంతరించిపోయాయి. దీనితో శాస్త్రవేత్తలు జీబ్రాల డీఎన్ఏ, బ్యాక్ బ్రీడింగ్ పద్ధతి సాయంతో దాదాపు ‘క్వాగ్గా’తో సరిపోలిన జంతువును పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ► ఎప్పుడో అంతరించిపోయిన జాతితో సరిపోలిన ఇప్పటి జంతువుల డీఎన్ఏను సేకరించి.. దాన్ని మార్చి నాటి జాతిని సృష్టించడం మూడో పద్ధతి. ప్రస్తుతం సేకరించిన డీఎన్ఏలో విలుప్తమైన జాతి లక్షణాలకు సంబంధించిన జన్యువులను చేర్చడం, అవసరం లేని వాటిని తొలగించడం, రీప్లేస్ చేయడం వంటివి చేస్తారు. ఉదాహరణకు ప్రస్తుతమున్న ఏనుగుల డీఎన్ఏలో మార్పులు చేసి ఒకనాటి ‘మమ్మోత్’లను తిరిగి పుట్టించేందుకు హార్వార్డ్ మెడికల్ స్కూల్కు చెందిన ప్రొఫెసర్ జార్జ్ చర్చ్ ప్రయత్నిస్తున్నారు. మరి డైనోసార్లనూ పుట్టించొచ్చా? అంతరించిపోయిన జీవులను తిరిగి పుట్టించాలంటే వాటికి సంబంధించి కనీస స్థాయిలో డీఎన్ఏ లభించడం తప్పనిసరి. సాధారణంగా ఎంత అనుకూల పరిస్థితులున్నా కూడా డీఎన్ఏ 521 సంవత్సరాల్లో పూర్తిగా దెబ్బతింటుంది. మరి డైనోసార్లు ఎప్పుడో ఆరున్నర కోట్ల ఏళ్ల కిందే విలుప్తమైపోయాయి. వాటికి అతి సమీప జీవులేవీ కూడా ప్రస్తుతం మనుగడలో లేవు. కాబట్టి వాటిని తిరిగి పుట్టించడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నా.. ఇప్పటివరకు అంతరించిపోయిన ఒక్కజీవిని కూడా తిరిగి పుట్టించలేదు. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఆ దిశగా ముందడుగు వేస్తున్నట్టు చెబుతున్నారు. -
జీబ్రాలు నిలబడే నిద్రపోతాయి.. ఎందుకో తెలుసా?
ఆరిలోవ(విశాఖపట్నం): జంతువులు అన్ని రంగులను ఆసక్తిగా చూస్తుంటాయి. వాటి చూపును బట్టి ఆయా రంగులను గుర్తిస్తున్నాయని మనం భావిస్తాం. జీబ్రాలు మాత్రం పచ్చని రంగును గుర్తించలేవట. కానీ ఒకేసారి వాటి కంటితో రెండు దృశ్యాలను చూడగలవట. ఈ విషయం వన్యప్రాణుల సంరక్షణ చేసేవారికి మాత్రమే తెలుస్తుంటుంది. ఇంకా వాటి గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తిగల విషయాలు ఉన్నాయండోయ్.. చదవండి: నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు.. బాగున్నారా.. జీబ్రాలు అడవుల్లో సుమారు 1,000 వరకు గంపులుగా తిరుగుతాయి. అవి గంటకు 40 కిలోమీటర్లు వేగంతో పరుగెత్తుతాయి. ఇవి తిన్నగా కాకుండా అడ్డదిడ్డంగా పరుగెడుతాయట. అందుకే వేటగాళ్లకు ఇవి దొరకవట. ఒకవేళ వేటగాళ్లుగానీ, హైనా, సింహం తదితర క్రూర మృగాలుగానీ వాటిని వేటాడినప్పుడు వెనుక కాళ్లతో తన్ని వాటిని అవే రక్షించుకుంటాయి. పిల్ల జీబ్రా కూడా పుట్టిన గంటకు పరుగెడుతుందట. వీటిలో మరో విశేషమేమంటే ఇవి నిలబడే నిద్రపోతాయి. ఏ రెండు జీబ్రాలకు వాటి శరీరంపై ఉన్న చారలు ఒకేలా ఉండవు. ఇవి వాటిపై దాడిచేసే క్రూర మృగాలను తికమకపెడతాయట. -
పెట్స్.. అదో స్టేటస్!
సాక్షి, హైదరాబాద్: నగరవాసుల స్టేటస్ సింబల్ మారింది. లగ్జరీ వాహనాలు, హై ఎండ్ గృహాలు, విదేశీ ఫర్నీచర్, లైఫ్ స్టయిల్ జాబితాలో విదేశీ పెంపుడు జంతువులు కూడా చేరిపోయాయి. సినీ ప్రముఖులు, బడా వ్యాపారులు తమ వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్ హౌస్లు, లగ్జరీ విల్లాలలో విదేశీ పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు. తాజాగా క్యాసినోవాలా చికోటి ప్రవీణ్ వ్యవసాయ క్షేత్రంలో ఎగ్జోటిక్ పెట్స్ను అటవీ శాఖ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. విదేశాల్లోని అడవి జాతి పెంపుడు జంతువులను ఎగ్జోటిక్ పెట్స్ అంటారు. మన దేశంలో వీటి రవాణా వైల్డ్లైఫ్ యాక్ట్–1972 ప్రకారం చట్ట వ్యతిరేకం. అమెరికా, ఆ్రస్టేలియా, మెక్సికో వంటి విదేశాల నుంచి అక్రమ మార్గంలో దిగుమతి చేసుకొని, విక్రయిస్తుంటారు. ఇటీవల కోల్కత్తా నుంచి హైదరాబాద్కు కంగారులను అక్రమ రవాణా చేస్తున్న ఓ ముఠాను వెస్ట్ బెంగాల్లోని కుమార్గ్రామ్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లో అధిక డిమాండే అక్రమ రవాణాకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఇండియన్ బ్రీడ్ ఎగ్జోటిక్ పెట్స్ పెంపకానికి మన దేశంలో అనుమతి ఉంది. కానీ, ఆయా జంతువులను అటవీ శాఖ వద్ద నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరంలో ఈ తరహా వన్యప్రాణులు 150–200 రకాలుంటాయని అంచనా. నగరంలో 50కి పైగా ప్రైవేట్ జూలు.. ప్రస్తుతం నగరంలో 50కి పైగా ప్రైవేట్ జూలు ఉంటాయని బహుదూర్పల్లిలోని జూ అధికారి ఒకరు తెలిపారు. చేవెళ్ల, శంకర్పల్లి, కందుకూరు, శామీర్పేట, భువనగిరి వంటి పలు ప్రాంతాలలోని విశాలమైన ఫామ్ హౌస్లు, వ్యవసాయ క్షేత్రాలలో చిన్న పాటి జూలను ఏర్పాటు చేసి, వీటిని పెంచుతున్నారు. అలాగే పలువురు బడా డెవలపర్లు లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలలో పెట్ పార్క్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. క్యాసినో వాలాగా పేరొందిన చికోటి ప్రవీణ్కు కందుకూరు మండలం సాయిరెడ్డిగూడలో 12 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇందులో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొండచిలువలు, ఊసరవెల్లి, మకావ్ చిలుకల వంటి వన్యప్రాణులున్నట్లు అధికారులు గుర్తించారు. అధ్యయనం చేశాకే పెంపకం.. ఎగ్జోటిక్ పెట్స్ జీవన విధానంపై అవగాహన ఉంటేనే పెంచుకోవాలి. లేకపోతే స్వల్పకాలంలోనే అనారోగ్యం పాలై చనిపోతాయని కూకట్పల్లిలోని ఎగ్జోటిక్ పెట్ విక్రయదారుడు, వెటర్నరీ స్టూడెంట్ యుగేష్ తెలిపారు. అవి ఏ జాతికి చెందినవి, ఎలాంటి వాతావరణంలో పెరుగుతాయి, వాటి ఆహారం, వాటికి వచ్చే రోగాలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని సూచించారు. సల్కాటా, ఆల్డాబ్రా టార్టాయిస్: ప్రారంభ ధర రూ.2.5 లక్షలు. ఇగ్వానా: ఆకుపచ్చ, నీలం, పసుపు రంగుల ఇగ్వానాల ప్రారంభ ధర రూ.15 వేలు. స్నో, థానోస్ రంగులవైతే రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల మధ్య ఉంటాయి. బాల్ పైథాన్: వీటిని రాయల్ పైథాన్స్ అని కూడా పిలుస్తారు. ధర రూ.35–40 వేలు. డెడ్ బియర్డ్ డ్రాగన్: తెల్ల గడ్డంలాగా ఉంటాయి. వీటిని వెనక్కి తిప్పినా ఎలాంటి చలనం ఉండదు. వీటి స్పర్శ చల్లగా, గట్టిగా ఉంటుంది. తెలుపు, గోధుమ, ఎరుపు రంగుల్లోని డ్రాగన్స్ ప్రారంభ ధర రూ.80 వేలు. కార్న్ స్నేక్: నార్త్ అమెరికాకు చెందిన ఈ కార్న్ స్నేక్స్ విషపూరితం కావు. జన్యురకం, రంగులను బట్టి వీటి ధరలు రూ.25–35 వేల మధ్య ఉంటాయి. మార్మోసెట్ కోతులు: సౌత్ అమెరికా, బ్రెజిల్, కొలంబియా దేశాలకు చెందిన ఈ కోతులు ఆలివ్ గ్రీన్, గోధుమ రంగుల్లో ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ.5 లక్షలు.. మీర్కట్: దక్షిణాఫ్రికాకు చెందిన మీర్కట్స్ గోధుమ, తెలుపు రంగులో ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ.1.5 లక్షలు. రామచిలుకలు: బ్లాక్పామ్ కాకాటూ, విక్టోరియా క్రౌన్, గోల్డెన్ కోనూర్, అమెరికన్ క్రౌ వంటి రంగురంగుల రామచిలుకలు ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ. 30 వేలు. యార్కి టెర్రియర్ డాగ్: అచ్చం బొమ్మలాగా నలుపు, గోధుమ రంగులలో ఈ కుక్క వీటి ప్రారంభ ధర రూ.85 వేలు. జోలో అనే రకం కుక్కలకు శరీరంపై వెంట్రుకలు ఉండకపోవటం వీటి స్పెషాలిటీ. గ్రే కలర్లో వీటి ధర రూ.లక్ష. (చదవండి: ‘ఫీజు’ లేట్.. మారని ఫేట్!) -
ఈ జేజమ్మ మళ్లీ పుడుతుందట!
ఇదేంటి ఈ ఏనుగులకు జూలు ఉంది.. భలే విచిత్రంగా ఉన్నాయే అనుకుంటున్నారా? కానీ ఇవి ఏనుగులు కాదు.. వాటి జేజమ్మలు.. అంటే ఏనుగుల పూర్వీకులన్నమాట. వీటిని వూలీ మామత్లు అంటారు. చూసేందుకు ఆఫ్రికా ఏనుగుల తరహాలో బలిష్టంగా కనిపిస్తూ ఒంటినిండా జూలుతో మంచు యుగంలో భూమిపై సంచరించిన జీవులివి. యూరప్, ఉత్తర అమెరికాతోపాటు ఆసియాలోని మంచు ప్రాంతాల్లో 3 లక్షల ఏళ్ల కిందట తిరిగిన ఈ జీవులు దాదాపు 10 వేల ఏళ్ల కిందటే అంతరించిపోయాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే.. ప్రఖ్యాత హాలీవుడ్ చిత్రం జురాసిక్ పార్క్లో జన్యు శాస్త్రవేత్తలు ఎలాగైతే అంతరించిన డైనోసార్లను ప్రతిసృష్టి చేస్తారో అదే తరహాలో వూలీ మామత్లను తిరిగి భూమ్మీదకు తీసుకొచ్చేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ కొలోస్సల్ బయోసైన్సెస్ గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఏకంగా 15 లక్షల డాలర్లను కూడా సమీకరించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆ కంపెనీ బయటకు వెల్లడించనప్పటికీ డీఎన్ఏ ఎడిటింగ్ పద్ధతి ద్వారా వూలీ మామత్లను సృష్టించాలనుకుంటోంది. దీన్నే మరోలా చెప్పాలంటే వూలీ మామత్లకు అత్యంత దగ్గరి పోలికలుగల, 99% డీఎన్ఏను పోలిన ఇప్పటి ఏనుగుల డీఎన్ఏను క్రమంగా వూలీ మామత్ల తరహాలోకి మార్చుకుంటూ వెళ్లాలని భావిస్తోంది. వచ్చే 10–15 ఏళ్లపాటు ఈ ప్రక్రియపైనే పనిచేయనున్నట్లు సంస్థ చెబుతోంది. ఈ ప్రక్రియ విజయవంతమైతే అప్పుడు వూలీ మామత్ లేదా మామత్ను పోలిన అండాలను ల్యాబ్లలో తయారు చేసి వాటిని ఆసియా ఏనుగుల గర్భంలో ప్రవేశపెట్టాలనేది కొలోస్సల్ బయోసైన్సెస్ లక్ష్యం. ఎందుకీ ప్రయోగం? ఆర్కిటిక్ ప్రాంతంలో మట్టి, ఇసుక, మంచుతో ఘనీభవించిన నేల (పర్మాఫ్రాస్ట్) పొరల నుంచి భూతాపం వల్ల క్రమంగా మంచు కరిగిపోతోంది. భూమిపై అత్యధికంగా కార్బన్, మీథేన్లను పట్టి ఉంచిన పర్మాఫ్రాస్ట్ బలహీనపడితే అది భూ వాతావరణంలోకి భారీ స్థాయిలో కార్బన్ డై ఆౖð్సడ్, మీథేన్ వాయువులను విడుదల చేస్తుంది. ఈ పరిణామం మానవాళి ఉనికికే ప్రమాదం కానుంది. ఈ నేపథ్యంలో కొలోస్సల్ బయోసైన్సెస్తోపాటు మరికొన్ని బయోటెక్నాలజీ సంస్థలు వూలీ మామత్లు సహా అంతరించిపోయిన ఆర్కిటిక్ ప్రాంతాల జంతువులను భారీ స్థాయిలో ప్రతిసృష్టి చేసి వాటిని సహజ ఆవాస ప్రాంతానికి తరలించాలని భావిస్తున్నాయి. ఈ జీవులు ఆర్కిటిక్లో సంచరిస్తే వాటి బరువు వల్ల మంచుపొరలు లోపలకు తిరిగి గట్టిపడటంతోపాటు ఆ పొరల మధ్య చిక్కుకుపోయిన ఉష్ణం వెళ్లిపోతుందని శాస్త్రవేత్తల అంచనా. ఫలితంగా పర్మాఫ్రాస్ట్లో చల్లదనం శాశ్వతంగా ఉండిపోతుందని.. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
ఆ షాట్ను ఎక్కడ చూడలేదని విదేశీయులు ఫిదా..
Jr NTR Truck Scene In RRR: జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ మల్టీస్టారర్గా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించింది ఈ మూవీ. అలాగే అనేక మంది హాలీవుడ్ సెలబ్రిటీలను పొగిడేలా చేసింది ఈ చిత్రం. ప్రస్తుతం ఓటీటీలో కూడా రచ్చ చేస్తున్న ఈ మూవీ గురించి ఎంత చెప్పిన తక్కువే. అయితే తాజాగా 'ఆర్ఆర్ఆర్' మరోసారి నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటర్వెల్ ఎంట్రీ సీన్ ఎంత అద్భుతంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక ట్రక్కులో పులులు, ఎలుగుబంట్లు, జింకలు, నక్కలతో తారక్ ఇచ్చే వైల్డ్ ఎంట్రీ మాములుగా ఉండదు. థియేటర్లో చూసిన ప్రతీ ప్రేక్షకుడు నోరు వెళ్లబెట్టేలా చేసింది ఈ సీన్. ఇప్పుడు ఈ ఎంట్రీ సీన్ నెట్టింట్లో సందడి చేస్తుంది. ఓ విదేశీ యూజర్ ఈ సీన్ వీడియోను ట్విటర్లో షేర్ చేయగా అతి తక్కువ సమయంలోనే 12 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ సీన్ను షేర్ చేస్తూ ఆ యూజర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ ఇండస్ట్రీ గర్వపడేలా ఉన్నాయి. చదవండి: అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి.. I’ve watched 29 MCU movies. I’ve never seen a shot as ridiculous and incredible as this truck/animal shot in RRR (on Netflix) pic.twitter.com/JTheyZIYB7 — Nate Offord (@NateOfford) July 17, 2022 'నేను ఇప్పటివరకు 29 ఎమ్సీయూ (మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్) చిత్రాలను వీక్షించాను. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ ట్రక్ లాంటి అత్యద్భుతమైన షాట్ను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు' అని ఆ యూజర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. దీంతో ఇటు తారక్ ఫ్యాన్స్, అటు సినీ లవర్స్ తెలుగు సినిమా గొప్పతనం గురించి ఎంతో సంతోషిస్తున్నారు. చదవండి: ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు బాయ్ఫ్రెండ్ నుంచి కాల్.. తర్వాత మోడల్ ఆత్మహత్య NTR is the clear winner in RRR multi-starrer with domestic as well as Global accolades. First Indian movie video with 10 Million+ Views!#NTRGoesGlobal @tarak9999 https://t.co/FZgkZG4BvW — BingedHelp (@BingedHelps) July 19, 2022 First Ever Indian Video to Cross 10M Views on Twitter & still going strong (nearing 12M now) 🔥@tarak9999 #NTRGoesGlobal #NTR #RRRMovie https://t.co/SV08izQCIK — Kaushik LM (@LMKMovieManiac) July 19, 2022 -
వీటికి ‘డబ్బు’ చేసింది.. ప్రపంచంలో టాప్ ధనిక జంతువులు ఇవేనండి!
డాలర్లైనా, రష్యన్ రూబుళ్లైనా... డబ్బుంటేనే ఖానా పీనా! అన్నాడో సినీ కవి. మనవాళ్లు ఈ విషయం ఎప్పుడో కనిపెట్టి ధనం మూలం ఇదం జగత్ అన్నారు. మానవ చరిత్రలో కుబేరులుగా ఖ్యాతికెక్కినవాళ్లు అనేకమంది ఉన్నారు. అయితే మనుషులు కాకుండా ప్రపంచంలో ధనిక జీవులుగా కొన్ని జంతువులు పేరుగాంచాయి. జంతువులేంటి.. వాటికి సంపదేంటి అనుకుంటున్నారా! అవేమీ కంపెనీలు పెట్టి ధనం కూడబెట్టలేదండీ! వాటి యజమానులు ప్రేమతో ఇచ్చిన సంపదతో ఈ పెంపుడు జంతువులకు డబ్బు చేసింది. అయితే వీటిలో కొన్ని స్వయంకృషి జంతువులు కూడా ఉన్నాయి. అంటే సినిమాల్లో, టీవీల్లో నటించడం ద్వారా ఇవి బోలెడు సంపద ఆర్జించాయన్నమాట! ఇలా ఈ జాబితాలో చేరిన జంతువుల ఆస్తుల వివరాల్లో కొన్ని అతిశయోక్తులున్నాయని తర్వాత తెలిసింది. ప్రస్తుతం ► జిగో అనే కోడి పెట్టను టెక్ట్స్ బుక్ రచయిత మైల్స్ బ్లాక్వెల్ పెంచుకున్నారు. తన తదనంతరం సదరు పెట్టగారికి బ్లాక్వెల్ 1.5 కోట్ల డాలర్లు రాసిచ్చారు. ► ఇటలీకి చెందిన రియల్టీ వ్యాపారి మారియా అసుంటా బజార్లో ఒక పిల్లిని చూసి జాలిపడి తెచ్చుకొని టొమసో అని పేరు పెట్టి పెంచుకున్నారు. 94ఏళ్ల వయసులో ఆమె మరణించారు. ఆమె విల్లు ప్రకారం టొమసోకు 1.3 కోట్ల డాలర్ల ఆస్తి దక్కింది. ► 2018 వరకు బ్లాకీ అనే పిల్లి 1.25 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలోనే సంపన్న పిల్లిగా పేరుగాంచింది. ► గైల్ పోస్నర్ అనే ఆమె తన పెంపుడు కుక్క కొంచిటాకు 30 లక్షల డాలర్ల ధనంతో పాటు దా దాపు 80 లక్షల విలువైన భవంతిని ఇచ్చేసింది. ► లియోనా హెల్మ్స్లే అనే ఆమె తన మనవళ్లపై కోపంతో తనకున్న 1.2 కోట్ల డాలర్లను ట్రబుల్ అనే కుక్కకు రాసింది. అయితే తర్వాత కోర్టులో జడ్జిగారు కుక్కకు 20 లక్షలు చాలని తీర్పిచ్చారు. ► అగ్ని ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి తమను రక్షించిందన్న కృతజ్ఞతతో ఫ్లాసీ అనే పెంపుడు కుక్కకు డ్రీ బారీమోర్ దంపతులు 13లక్షల డాలర్ల ఇంటిని ముద్దుగా ఇచ్చేసింది. ► టింకర్ అనే పిల్లికి దాని యజమాని ద్వారా దాదాపు 8లక్షల డాలర్ల ఇల్లు, 2.26 లక్షల డాలర్ల సంపద ముట్టాయి. ► ఫాషన్ మేనేజర్ కార్ల్ పెంచుకునే చుపెట్టే అనే పిల్లికి 20 కోట్ల డాలర్ల ఆస్తి దక్కినట్లు వార్తలు వచ్చాయి, కానీ నిర్ధారణ జరగలేదు. ► ఇక పిల్లుల్లో మహారాజా పిల్లి అంటే గ్రుంపీ క్యాట్నే చెప్పుకోవాలి. అనేక షోలు, సినిమాల్లో నటించి ఈ పిల్లి దాదాపు 10 కోట్ల డాలర్లు సంపాదించింది. ► ఒలివియా బెన్సన్ అనే పిల్లి సుమారు 9.7 కోట్ల డాలర్లను వివిధ కార్యక్రమాల ద్వారా సంపాదించింది. ► గుంతర్6 అనే కుక్కకు కోట్ల డాలర్ల ఆస్తి దక్కిందని అనేక వార్తలు వచ్చినా అదంతా ప్రాంక్ అని తర్వాత తెలిసింది. డబ్బున్నవారు ఏక్షణం ఏం చేస్తారో తెలియదు కాబట్టి, ఈ జాబితా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. చట్టబద్దత ఉందా? జంతువులు న్యాయ పరిభాషలో లీగల్ పర్సన్స్ కావు కనుక వీటి పేరుమీద సొంత ఆస్తులు, ధనం ఉండదు. పెంపుడు జంతువంటేనే ఒక ఆస్తి, అందువల్ల మరో ఆస్తిని ఈ ఆస్తికి కట్టబెట్టేందుకు చట్టాలు అంగీకరించవు. అందుకే ఆయా జంతువుల యజమానులు ఏర్పాటు చేసిన ట్రస్టులు ఈ జంతువుల ఆస్తుల నిర్వహణ చేస్తుంటాయి. ఈ సొమ్మును కేవలం సదరు జీవి బాగోగులు చూసుకోవడానికి మాత్రమే ఉపయోగించాల్సిఉంటుంది. సదరు జంతువు మరణిస్తే ట్రస్టు నిబంధనల ప్రకారం మిగిలిన సొత్తును వినియోగిస్తారు. – నేషనల్ డెస్క్, సాక్షి. -
ఔను.. అక్కడ సంచరిస్తోంది పెద్ద పులే!
ప్రత్తిపాడు రూరల్, పిఠాపురం: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరు, ఒమ్మంగి, ధర్మవరం, శరభవరం, కొడవలి గ్రామాల శివారు ప్రాంతాల్లో గేదెలను పెద్ద పులి చంపి తింటున్నట్లు అధికారులు నిర్థారించారు. పోతులూరు, కొడవలి గ్రామాల సరిహద్దుల్లో పోలవరం పంప్హౌస్ వద్ద అధికారులు ఏర్పాటు చేసిన యానిమల్ ట్రాకింగ్ కెమెరాల్లో పెద్ద పులి కనిపించింది. దీంతో సమీప గ్రామ ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఐదు గ్రామాల సరిహద్దుల్లోను 120 మందితో గస్తీ ఏర్పాటు చేశారు. అడవి దున్నలను పోలి ఉన్న గేదెలపై పులి దాడి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పశువులను ఇళ్ల వద్దే కట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు అధికారులు సూచించారు. రాత్రి సమయాల్లో పొలాల్లోకి ఎవరూ వెళ్లరాదని హెచ్చరించారు. అటవీశాఖ సీసీఎఫ్ శరవణన్, డీఎఫ్వో ఐకేవీ రాజు, వైల్డ్ లైఫ్ డీఎఫ్వో సెల్వం, ఐఎఫ్వో ట్రైనీ భరణి, సౌజన్య తదితరులు ఘటనాస్థలాన్ని శనివారం పరిశీలించారు. ప్రస్తుతం ప్రత్తిపాడు శివారు జువ్వల వారి మెట్ట ప్రాంతంలో పులి ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. బోన్లు ఏర్పాటు చేస్తే ఇతర జంతువులు పడే అవకాశం ఉండటంతో ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. -
హైదరాబాద్: వరల్డ్ బుక్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన చిన్నారి
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ బుక్ రికార్డ్స్లో స్థానం సంపాదించి ఆ చిన్నారి అబ్బుర పరిచింది.. వచ్చీ రాని మాటలతో సరిగా పదాలే పలకలేని చిన్నారి ఏకంగా ప్రీహిస్టారికల్ అనిమల్స్ పేర్లను చకా చకా చెబుతూ ఆశ్యర్య చకితులను చేస్తోంది.. నిజాంపేట్ సిరిబాలాజీ టవర్స్లో నివాసముండే మధు కుమార్తె నాలుగేళ్ల గొట్టుముక్కుల నితీషా కేవలం 30 సెండ్ల వ్యవధిలోనే అత్యధిక ప్రీహిస్టారిక్ యానిమల్స్ను గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. చిన్నారి జ్ఞాపక శక్తిని గమనించిన తల్లి మధు ఆమెకు ప్రీహిస్టారిక్ యానిమల్స్కు సంబంధించిన వీడియోలను చూపించారు. వీడియో చూసే క్రమంలో ఠక్కున సదరు జంతువుల పేర్లను చెప్పడం ప్రారంభించింది. దీంతో చిన్నారి తల్లి మధు ప్రీహిస్టారికల్ యానిమల్స్ పేర్లు చెబుతున్న క్రమంలో వీడియోలు తీసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు పంపించారు. చిన్నారి ఘనతను గుర్తిస్తూ ఈ నెల 23న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి, 21న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి కన్షర్మేషన్ లెటర్లు అందాయని చిన్నారి తల్లి మధు ‘సాక్షి’ కి తెలిపారు. -
ప్లీజ్... మమ్మల్ని వదిలేయండి, మాకు బతకాలని ఉంది
సాక్షి,ఆత్మకూరు(నెల్లూరు): జిల్లాలోని సీతారామపురం నుంచి రాపూరు వరకు విస్తరించిన నల్లమల, వెలగొండ, పెంచలనరసింహ అభయారణ్యాలు ఉన్నాయి. 28 శాతానికిపైగా అడవులు, దక్షిణ, పడమర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఇటు నెల్లూరు, అటు వైఎస్సార్ జిల్లా సరిహద్దులుగా పెంచల నరసింహ అభయారణ్యం విస్తరించి ఉంది. మర్రిపాడు, అనంతసాగరం, సోమశిల ప్రాంతాలు ఈ అభయారణ్యం పరిధిలోకి వస్తాయి. ఈ అటవీ ప్రాంతాల్లో అనేక రకాల వన్యప్రాణులు ఉన్నాయి. అయితే గుట్టుచప్పుడు కాకుండా కొన్ని ప్రాణులు వేటగాళ్లకు బలవుతుంటే.. మరికొన్ని జనారణ్యంలోకి వచ్చి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. అరుదైన వన్యప్రాణులు అంతరించి పోయే ప్రమాదం ఏర్పడనుంది. జిల్లాలో ఈ అటవీ ప్రాంతాల మధ్య ఉండే నెల్లూరు– ముంబయి, నకిరేకల్– ఏర్పేడు జాతీయ రహదారితో పాటు ఇతర ప్రధాన రహదారులు ఉన్నాయి. ఆయా రోడ్లపై రాత్రి పూట కూడా వాహనాలు తిరుగుతున్నాయి. కొన్ని వన్యప్రాణులు దారి తప్పి.. మరికొన్ని దాహార్తిని తీర్చుకునేందుకు జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆత్మకూరు అటవీ రేంజ్ పరిధిలోని మర్రిపాడు, అనంతసాగరం, చేజర్ల, ఏఎస్పేట తదితర మండలాల పరిధిలో జింకలు, దుప్పిలు రోడ్డుపైకి వచ్చి వాహనాల ప్రమాదంలో గాయపడిన ఘటనలు ఎన్నో జరిగాయి. ఇటీవల రెండు జింకలు తీవ్రంగా గాయపడడంతో ప్రయాణికుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది సంరక్షించేందుకు చికిత్స చేసినా ఫలితం దక్కలేదు. గతేడాది గుర్తుతెలియని వాహనం ఢీకొని బూదవాడ వద్ద మృతి చెందిన చిరుత (ఫైల్) కొరవడిన భద్రత ఆత్మకూరులోని ఇంజినీరింగ్ కళాశాల, చేజర్ల మండలం చిత్తలూరు వద్ద ఏడాది వ్యవధిలో రెండు చిరుతలతో పాటు ఓ అడవి పంది, జింక, దుప్పులు కలిపి 9 మృతి చెందాయి. గతేడాది ప్రారంభంలో బూదవాడ సమీపంలో కృష్ణాపురం మార్గంలో ఓ చిరుత పులి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందింది. అది జరిగిన మరో రెండు నెలలకే ఓ చిరుతపులి పులి పిల్ల వాహనం ఢీకొనడంతో మత్యువాత పడింది. సంగం మండలంలోని ఓ గ్రామంలో జింక దాహార్తి తీర్చుకొనేందుకు ఓ ఇంట్లోకి రావడంతో స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. నందవరం, చుంచులూరు పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారి దాటుతూ గుర్తుతెలియని వాహనాలు ఢీకొనడంతో రెండు జింకలు మృతి చెందాయి. 15 రోజుల క్రితం సోమశిల జలాశయం వద్దకు నీరు తాగేందుకు వచ్చి ఓ జింక నీటిలో పడి మృతి చెందింది. ఇలా పలు వన్య ప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి. ఈ చర్యలు చేపడితే... జాతీయ రహదారులు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణ కోసం సరైన చర్యలు చేపడితే వాటిని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. అడవి నుంచి రహదారిపైకి వచ్చే మార్గాలను గుర్తించి వాటిని వెంటనే రహదారిపైకి రాకుండా ఆ ప్రాంతాల్లో ఫెన్సింగ్ లేదా కంప వేసి వాటిని అడవులకే పరిమితం చేయొచ్చు. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో తిరిగే సమయంలో దాహార్తి తీర్చుకునేందుకు జంతువులు వచ్చే ప్రాంతాలను గుర్తించి అక్కడ తాగునీరు లభ్యమయ్యేలా గట్టి చర్యలు చేపట్టాలి. ఉపాధి హామీ పథకం ద్వారా అటవీ ప్రాంతం నుంచి రహదారులపైకి వచ్చే చిన్నపాటి దారులను మూసివేసేలా మొక్కలు పెంచాలి. దీనికి తోడు వేటగాళ్ల బారిన పడకుండా అటవీశాఖ వాచర్లు తరచూ ఈ ప్రాంతాల్లో తిరుగుతుంటే అనుమానాస్పద వ్యక్తులను వారు ఏర్పాటు చేసిన ఉచ్చులను గుర్తించి తొలగించేలా చూడాలి. తద్వారా వన్యప్రాణాలను కాపాడుకోవచ్చు. సిబ్బందికి గట్టి సూచనలు ఇటీవల కొన్ని వన్యప్రాణులు గుర్తుతెలియని వాహనాలు ఢీకొని మృతి చెందిన విషయం వాస్తవమే. ఒకటి, రెండు జింకలను గాయపడిన సమయంలో గుర్తించి చికిత్స చేసి అటవీ ప్రాంతంలో వదిలేశాం. అయితే కొన్ని దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సిబ్బందికి గట్టి సూచనలు ఇచ్చి అటవీ ప్రాంతంలో పలు చోట్ల తాగునీరు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల వర్షాలు కురవడం కొంత మేలైంది. దీంతో వన్యప్రాణులు రహదారులపై రావడం తగ్గుతుంది. – హరిబాబు, రేంజర్, ఆత్మకూరు అరణ్యంలో స్వేచ్ఛగా సంచరించే వన్యప్రాణులు దారి తప్పో.. దాహార్తి తీర్చుకునేందుకు జనారణ్యంలోకి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాయి. రాత్రి పూట రహదారులపైకి రావడంతో వాహనాలు ఢీకొని మృత్యువు పాలవుతున్నాయి. జిల్లా అటవీ ప్రాంతంలో అరుదుగా కనిపించే చిరుతలు సైతం ఇటీవల ప్రాణాలు కోల్పోయాయి. దుప్పిలు, జింకలు, అడవి పందులు అయితే లెక్కలేనన్ని మృత్యువాత పడుతున్నాయి. చదవండి: వింత అచారం: వరుడు వధువుగా.. వధువు వరుడిగా.. -
‘కవ్వాల్’లో పెరిగిన జంతువైవిధ్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) అటవీ ప్రాంతంలో వివిధ రకాల జంతువుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీని పరిధిలోని చిరుతలు, అడవి దున్నలు, అడవి కుక్కలు, నక్కలు, జింకలు, దుప్పులు తదితర రకాల వన్యప్రాణులు సందడి చేస్తూ కనువిందు చేస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కెమెరాల్లో వీటి కదలికలు తాజాగా రికార్డ్ కావడం, వీటి సంఖ్య పెరిగిన ఆనవాళ్లు కనిపించడం పట్ల అటవీశాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జీవవైవిధ్యం, అన్నివిధాలా అనుకూల పరిస్థితులు, మెరుగైన సౌకర్యాలతో కవ్వాల్ వన్యప్రాణుల వైవిధ్య కేంద్రంగా నిలుస్తోంది. కవ్వాల్లో వివిధ జంతువులు సందడి చేస్తున్న దృశ్యాలను గురువారం తెలంగాణ అటవీ శాఖ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. పులుల కోసం ఎదురుచూపులే... పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి పులుల సంచారం పెరిగినా, అనుకూల పరిస్థితులు ఉన్నా అవి ఇంకా కవ్వాల్లో స్థిరనివాసం ఏర్పరచుకోకపోవడం అటవీ శాఖకు, అధికారులకు సవాల్గా మారింది. అయినా ఇక్కడ పెద్దపులుల సంఖ్యే అధికం. ‘కోర్ టైగర్ ఏరియా’లోని 40 గ్రామాలను బయటి ప్రాంతాలకు తరలించకపోవడం కూడా పులులు స్థిరనివాసం ఏర్పరచుకోకపోవడానికి ఒక కారణమని అధికారులు అంటున్నారు. ఈ అడవి పరిధిలోని కొన్ని గ్రామాల ప్రజలు, వారి పెంపుడు జంతువుల కదలికలు ఉండటంతో పులులు ఇబ్బంది పడుతున్నాయని అంటున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) నిబంధనలు, నియమావళిని బట్టి పులుల అభయారణ్యం నుంచి మొత్తం గ్రామాలను బయటి ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. మహారాష్ట్ర తడోబా నుంచి నేరుగా పులులు వచ్చేందుకు జాతీయ రహదారితోపాటు రైల్వే కారిడార్, ఇతర ఆక్రమణలతో కొంత అంతరాయం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అండర్పాస్ల నిర్మాణం చేపడుతున్నందున త్వరలోనే అనుకూల మార్పులు చోటుచేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఫలితాలు ఇస్తున్న నియంత్రణ చర్యలు మూడేళ్లుగా చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలిచ్చాయి. విరివిగా గడ్డిభూముల పెంపకం, మా డివిజన్లో 200కుపైగా పర్క్యులేషన్ ట్యాంక్ల ఏర్పాటు, వాటర్షెడ్ పద్ధతుల ప్రకారం శాశ్వత నీటివనరుల కల్పన వంటివి ఎంతో దోహదపడ్డాయి. బయటి నుంచి మనుషులు, పశువులు ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టకుండా గట్టి నియంత్రణ చేపట్టాం. అడవిలో గందరగోళం, కలకలం వంటివి ఉంటే జంతువుల పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. పశువులు తిరిగితే గడ్డి ఉండదు. సహజసిద్ధమైన పరిస్థితులకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. –మాధవరావు, ఎఫ్డీవో, జన్నారం -
జీవాలకు సంజీవని.. పశువుల చెంతకే వైద్యం
108.. ఆపదలో ఉన్న వారికి సంజీవని.. ఒక్క ఫోన్ కాల్తో రెక్కలు కట్టుకుని నిమిషాల్లో వచ్చి వాలిపోతుంది. ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆపద్బాంధవుడిలా ఆదుకుంటుంది. రోజూ ఎంతోమంది ప్రాణాలు నిలుపుతోంది. ఇదే తరహాలో ఇప్పుడు పశువులకు కూడా సేవలందించడానికి ప్రత్యేక వాహనం అందుబాటులోకి రానుంది. మొబైల్ అంబులేటరీ క్లినిక్(సంచార పశువైద్యశాలలు) పేరిట పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం వీటిని తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేసింది. సాక్షి, అమరావతి బ్యూరో: పశువుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలందించడానికి మొబైల్ అంబులేటరీ క్లినిక్(సంచార పశువైద్యశాలలు)లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొబైల్ వాహనాన్ని కేటాయించింది. ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 వాహనాలను మంజూరు చేసింది. జిల్లాల పునర్విభజనతో కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో విలీనం కావడంతో 14 వాహనాలు సమకూరాయి. వివిధ రోగాలు, ప్రమాదాల్లో గాయాల పాలైన ఈ మూగజీవాలకు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ సంచార శాలల్లో పశువైద్యులు, వైద్య పరీక్షల కోసం ల్యాబ్ ఉంటుంది. ఒక్కో వాహనంలో ఒక పశు వైద్యుడు, పారా వెట్ సిబ్బంది ఒకరు, డ్రైవరు ఉంటారు. సేవలు పొందడం ఇలా.. సంచార పశువైద్య సేవలు పొందడానికి 1962 టోల్ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకురానున్నారు. తమ పశువుకు వైద్య చేయించాలనుకున్న వారు ఈ నంబరుకు ఫోన్ చేస్తే సమీపంలో ఉన్న సంచార పశువైద్య వాహన సిబ్బందికి సమాచారం ఇస్తారు. సత్వరమే ఆ వాహనంలో ఉన్న పశువైద్యుడు, సిబ్బంది పశువున్న చోటకు (గరిష్టంగా 90 నిమిషాల లోపు) వెళ్లి వైద్యం అందిస్తారు. ఈ మొబైల్ వాహనంలోనే ల్యాబ్ కూడా ఉంటుంది. అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారు. మరింత మెరుగైన వైద్యం అవసరమైతే టెలి మెడిసిన్ ద్వారా నిపుణులైన వైద్యులతో సంప్రదించి చికిత్స చేస్తారు. పశువును మరో ఆస్పత్రికి తరలించడానికి వీలుగా హైడ్రాలిక్ క్రేన్ (2 వేల కిలోల బరువును ఎత్తే సామర్థ్యం) కూడా వ్యాన్లో ఉంటుంది. మూడు రోజుల పాటు ఆ ఆస్పత్రిలో పశువుకు వైద్యం అందే ఏర్పాట్లు చేస్తారు. పశువులకు వైద్యంతో పాటు మందులనూ ప్రభుత్వం ఉచితంగానే సమకూరుస్తుంది. కాగా మొబైల్ అంబులేటరీలో వైద్య సేవలందించడానికి జీవీకే సంస్థ పశువైద్యులను నియమించింది. ఇప్పటికే మొదలైన కాల్స్.. ప్రభుత్వం సంచార పశు వైద్యశాలలను అందుబాటులోకి తెస్తున్న విషయాన్ని పశువైద్యాధికారులు వివిధ గ్రామాల్లో తెలియజేస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల రైతులు అప్పుడే పశు వైద్యం కోసం ఫోన్ల ద్వారా వాకబు చేస్తున్నారు. త్వరలోనే వీటి సేవలు ప్రారంభమవుతాయని వారికి సమాధానం చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ వాహనాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అవగాహన కల్పిస్తున్నాం.. ఇన్నాళ్లూ పశు వైద్యం కోసం ఇతర గ్రామాలకు పశువులను తీసుకెళ్లడానికి రైతులకు కష్టతరమవుతోంది. అన్ని పనులు మానుకుని వెళ్లడం ఇబ్బందికరంగా ఉంటోంది. ఇకపై ఆ ఇబ్బందులుండవు. 1962 టోల్ఫ్రీకి ఫోన్ చేస్తే సంచార వాహనంలో వైద్యులే అక్కడకు వెళ్లి ఉచిత వైద్యమందిస్తారు. ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న సంచార పశువైద్య సేవల గురించి కొన్నాళ్లుగా గ్రామాల్లో రైతులకు వివరిస్తున్నాం. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. – కె.విద్యాసాగర్, జేడీ, పశుసంవర్ధకశాఖ -
ఈ వేడి ఏమార్చేస్తోంది..!
కొద్దిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని దశాబ్దాల ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలవుతున్నాయి. ఒక్క మనదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ‘వేడి’ మంటెక్కిస్తోంది. మనుషులపై మాత్రమేకాదు.. జంతువులు, చెట్లు, ఇతర జీవజాలం మొత్తంపై ప్రభావం చూపుతోంది. చల్లగా యాపిల్స్ పండేచోట మండే ఎండల్లో వచ్చే మామిడి పళ్లు కాస్తున్నాయి.. జంతువులే కాదు చెట్లూ తమ ప్రాంతాలు వదిలి ‘వలస’పోతున్నాయి.. ఇదేదో కొద్దిరోజులకో, కొన్ని ప్రాంతాలకో పరిమితమైంది కాదు.. భూమిపై జీవం మొత్తం అసాధారణ మార్పులకు లోనవుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, జీవజాలంపై ప్రభావం ఏమిటో తెలుసుకుందామా? సాక్షి సెంట్రల్ డెస్క్ జంతుజాలం ‘వలస మారె!’ మారుతున్న వాతావరణంలో జంతువులు ఇమడలేకపోతున్నాయి. ఆయా జంతువులకు తగిన ఆహారం దొరకడం లేదు. దీనితో ఇతర ప్రాంతాలకు వలస పోతున్నాయి. సంతానోత్పత్తి తగ్గిపోతోంది. కొత్త కొత్త అలవాట్లు సంతరించుకుంటున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. ♦అమెజాన్ అడవుల్లో పక్షులపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా వాటి పరిమాణం తగ్గిపోతోందని తేల్చారు. పక్షులు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు ఓ వైపు శరీర పరిమాణాన్ని తగ్గించుకుంటున్నాయని గుర్తించారు. మరోవైపు శరీరాన్ని చల్లబర్చుకోవడం, బయటి ఉష్ణోగ్రతల నుంచి రక్షించుకోవడం కోసం ముక్కు, రెక్కలు, ఈకలు, తోకల పరిమాణాన్ని పెంచుకుంటున్నాయని గుర్తించారు. ♦ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్రాంతాల్లో మాంసం, పాల కోసం పెంచుతున్న పశువుల నుంచి ఉత్పత్తి తగ్గిపోతోందని ఇటీవల లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ♦మంచు ప్రాంతాల్లో బతికే ఎలుగుబంట్లు, పెంగ్విన్లు, ఇతర జీవజాతుల సంతతి తగ్గిపోతోందని అమెరికన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ♦ఏటా శీతాకాలం, ఎండాకాలంలో పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ తమకు అనువైన ప్రాంతాలకు వలస వెళ్తుంటాయి. కానీ ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ మార్పులతో.. ఈ వలసలు మారిపోతున్నాయి. మన దేశానికి వలస వచ్చే సైబీరియన్ కొంగల సంఖ్య కొన్నేళ్లుగా బాగా తగ్గిపోయింది. అందులోనూ కొద్దిరోజులకే అవి తిరిగి వెళ్లిపోతుండటం గమనార్హం. ♦సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో కొన్నిరకాల చేపలు, ఇతర జలచరాలు అంతరించిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. చెట్టూచేమ.. వరుస మారె.. ప్రతి చెట్టు, మొక్క కూడా ఆయా ప్రాంతాల్లోని చల్లదనం, వేడి వంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎదిగే, మనగలిగే లక్షణాలను అలవర్చుకుంటాయి. కానీ ఉష్ణోగ్రతలు అడ్డగోలుగా పెరిగిపోవడంతో చల్లటి ప్రాంతాల్లోని పలు రకాల చెట్లు, మొక్కలు బతకలేకపోతున్నాయి. మరోవైపు అదేచోట ఉష్ణమండల చెట్లు (వేడి వాతావరణంలో మాత్రమే పెరిగే చెట్లు/ మొక్కలు) కొత్తగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ♦ఉదాహరణకు కాఫీ, తేయాకు, యాపిల్స్ వంటివి చల్లగా ఉండే హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాల్లో, పశ్చిమ కనుమలు వంటి ప్రాంతాల్లో పండుతాయి. కానీ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో.. అవి దెబ్బతిని దిగుబడులు తగ్గుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వేడిని తట్టుకునే పంటలు/ చెట్లు/మొక్కలు కొత్తగా పెరుగుతున్నాయి. ♦ఇక వేడిగా ఉండేచోట్ల మరింత వేడి పెరిగి చెట్లు, మొక్కలు ఎండిపోయి బీళ్లుగా మారుతున్నాయి. ♦వేడి వాతావరణంలో చెట్లు బలహీనపడుతుండటంతో.. ఫంగస్లు విజృంభించి వాటిని నిర్వీర్యం చేస్తున్నాయి. ఇటీవలే మన దేశంలో మూడు రకాల ఫంగస్లు వ్యాపించి పెద్ద సంఖ్యలో వేప చెట్లు దెబ్బతినడం దీనికి ఉదాహరణ అని నిపుణులు చెప్తున్నారు. అడవి రూపు మారె... వాతావరణ మార్పులతో తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు, వర్షాభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అడవులపై తీవ్ర ప్రభావం పడుతోంది. మన దేశంలోనూ భారీగా అడవులు ఎండిపోతున్నాయి. బ్రిటన్కు చెందిన రీడింగ్ యూనివర్సిటీ ఇటీవలే భారతదేశంలో వర్షపాతం, ఉష్ణోగ్రతల తీరు, వాటివల్ల అడవుల క్షీణతపై శాస్త్రీయ అధ్యయనం చేసింది. దేశంలోని పశ్చిమ తీర ప్రాంతాలు, తెలంగాణ, చత్తీస్గఢ్, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో అడవుల క్షీణత ఎక్కువగా ఉందని పేర్కొంది. దేశంలోని వృక్షాలు, జీవజాతుల్లో పదిశాతం మేర అంతరించిపోయే దశలో ఉన్నాయని తెలిపింది. ♦ 2001 – 2018 మధ్య దేశంలో 20,472 చదరపు కిలోమీటర్ల అడవులు తగ్గిపోయినట్టు పేర్కొంది. ఇది దేశంలోని మొత్తం అడవుల్లో 7.34 శాతం కావడం గమనార్హం. ♦ఇక ఒక్క 2017లోనే 2,503 చ. కిలోమీటర్ల అడవి అంతరించిపోయినట్టు పరిశోధన వెల్లడించింది. ♦‘‘ఇండియాలో కొన్నేళ్లుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అతి ఎక్కువ వేడి, వడగాడ్పులు వీచే రోజుల సంఖ్య పెరిగింది. ఈ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఇండియాలో మరింత ఎక్కువగా అడవులకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది అటవీ సంపద, వన్యప్రాణులపైనా ప్రభావం చూపుతుంది’’అని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త అలైస్ హఫన్ పేర్కొన్నారు. రోగాల తీరు మారె.. ఉష్ణోగ్రతలు పెరిగిపోయి ఆయా ప్రాంతాల్లో వాతావరణ మార్పులు జరగడంతో.. కొత్త కొత్త బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మజీవులు విజృంభిస్తున్నాయి. వేడి వాతావరణం కారణంగా దోమలు, ఈగలు, ఇతర కీటకాలు పెరిగి అంటు రోగాలు విజృంభిస్తున్నాయని.. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వ్యాధులు, రోగాలు ఇతర ప్రాంతాలను కమ్ముకుంటున్నాయని గతేడాది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. ♦అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం వల్ల ఊపిరితిత్తులు, గుండె నాళాల సమస్యలు, చర్మ సంబంధిత రుగ్మతలు పెరుగుతున్నాయని అమెరికన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇటీవలే హెచ్చరించింది. ♦వేల ఏళ్ల కిందట మంచు అడుగున కూరుకుపోయిన నాటి సూక్ష్మజీవులు బయటికి వచ్చి కొత్త వ్యాధులు కమ్ముకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూడా. కాలం అదను మారె.. ♦ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల చాలా ప్రాంతాల్లో వానాకాలం, చలికాలం తగ్గిపోతున్నాయి. ఎండాకాలం పెరిగిపోతోంది. భవిష్యత్తులో ఆరు నెలలు ఎండాకాలమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ♦అధిక ఉష్ణోగ్రతలు వల్ల ఆరుబయట పనిచేసుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ది లాన్సెట్ జర్నల్ కథనం ప్రకారం.. ఇలా ఒక్క 2019 ఏడాదిలోనే 30వేల కోట్ల పని గంటలకు నష్టం జరిగింది. ♦వాతావరణ మార్పుల వల్ల రుతువుల సమయాల్లోనూ మార్పులు వస్తున్నాయి. బ్రిటన్, ఇతర యూరప్ దేశాల్లో మార్చి నెల మధ్యలో వసంతకాలం మొదలవుతుంది. కానీ కొన్నేళ్లుగా ఫిబ్రవరి నెల మొదట్లోనే ఇది మొదలవుతోంది. ♦ హిమాలయాల ప్రాంతంలో ఉండే రోడోడెండ్రాన్ చెట్లు సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో అంటే ఎండాకాలం మొదట్లో పూలు పూస్తాయి. కానీ కొన్నేళ్లుగా జనవరిలోనే పూస్తున్నాయి. ♦మామిడి చెట్లకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలే అనుకూలం. చలి, మంచు ప్రదేశాల్లో చెట్లు పెరిగినా పళ్లు కాయవు. కానీ శీతల ప్రాంతమైన అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలో కొన్నేళ్లుగా మామిడి పండ్లు కాస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమే దీనికి కారణం. -
తొట్లు అమర్చి.. దాహార్తి తీర్చి
రాజంపేట: ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. వేసవిలోప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. అడవిలో నీటి వనరులు ఎండిపోయి దాహంతో అలమటించే మూగజీవాలు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి, అందుకే వాటి దాహార్తి తీ ర్చేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. డివిజన్ పరిధిలో శేషాచలం 1.23లక్షల హెక్టార్లలో,పెనుశిల లక్ష్మీనరసింహ అభయారణ్యం 23వేలహెక్టార్లలో విస్తరించి ఉంది. అరుదైన జంతు జాలానికి నెలవు.. శేషాచలం అటవీ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం జీవ వైవిధ్య అటవీ ప్రాంతం(బయోస్పెయిర్)గా గుర్తించింది. ఇక్కడ ఎక్కడాలేని విధంగా అనేక రకాలైన వన్యప్రాణులు, జంతువులు ఉన్నాయి. వీటిని సంరక్షించాల్సిన బాధ్యత అటవీశాఖపై ఉంది. ఇందులో భాగంగా చిత్తూరు, తిరుమల, వైఎస్సార్ జిల్లా అడవుల్లోని జంతువుల సంరక్షణపై దృష్టి సారించారు. కాగా జిల్లాలో శేషాచలం, పెనుశిల, లంకమల్ల అభయారణ్యాలు ఉన్నాయి. అరుదైన జంతువులకు నిలయం శేషాచలం.. శేషాచలం విస్తీర్ణం 82,500 ఎకరాలు. 2010లో జీవ వైవిధ్య నెలవుగా గుర్తించారు. దేశంలో ఉన్న బయోస్పెయిర్ జాబితాలో శేషాచలం అడవి చేరింది. ఈ అటవీ ప్రాంతం చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలో విస్తరించింది. శేషాచలం అడవిలో పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, వివిధ రకాల పునుగుపిల్లలు, పక్షులు, ఎలుగుబంట్లు, జింకలు, తోడేళ్లు ఉన్నాయి. ఇవి ఆ యా ప్రాంతాల్లోని రోడ్లపైకి నీటి కోసం వస్తున్నాయి. 8 శేషాచలంలో సహజ వనరులు శేషాచలంలో సహజ వనరులు ఉన్నాయి. వర్షాకాలంలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ, వేసవిలో అరకొరగా అయినా నీటి వనరులు అందుబాటులో ఉంటాయి. పెనుశిల అభయారణ్యంలో కూడా సహజవనరులు ఉన్నట్లుగా అటవీ వర్గాలు భావిస్తున్నాయి. పది కుంటలు ఉన్నాయి. ఆరు చెక్డ్యాంలున్నాయి. నీటి ఎద్దడి నివారణలో భాగంగా ఇవి దోహదపడతాయి. నిరంతర పర్యవేక్షణ రాజంపేట, సానిపాయి, చిట్వేలి, రైల్వేకోడూరు రేంజ్లు ఉన్నాయి. బేస్క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 80 మంది ప్రొటెక్షన్ వాచర్లను నియమించారు. ఇక్కడ 25 కెమెరాలు అమర్చారు. వేసవిలో వన్యప్రాణులు దాహార్తికి అల్లాడిపోకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. మూగజీవాల తాగునీటికి ప్రత్యేక ఏర్పాట్లు అడవిలోని వివిధ ప్రాంతాల్లో 12 మొబైల్ సాసర్పిట్లు ఏర్పాటు చేశారు. చెట్లకు ఉప్పుముద్దలు కట్టారు. దాహార్తి ఉన్న జంతువులు ఉప్పుముద్దలను నాకితే ఉపశమనం కలుగుతుంది. 2వేల నుంచి 3వేల లీటర్ల కెపాసిటీతో నీటి వనరులను వన్యప్రాణులకు అందుబాటులో ఉంచారు. ప్రత్యేక రక్షణ చర్యలు శేషాచలం అటవీ ప్రాంతంలో జంతువుల సంరక్షణకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. వేసవిలో వన్యప్రాణులు నీటి కోసం జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు 12 సాసర్పిట్లు, 12 మొబైల్ సాసర్పిట్లను ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నాం. జంతువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. –నరసింహారావు, ఇన్చార్జి డీఎఫ్ఓ, రాజంపేట -
అత్యంత ప్రత్యేకం.. ప్రళయమొచ్చినా.. లైట్ తీసుకుంటాయ్!
జీవులేవైనా నీరు, ఆహారం వంటివి లేకుండా కొద్దిరోజులు కూడా బతకలేవు. గాలి లేకుంటే కొద్ది నిమిషాలైనా ప్రాణంతో ఉండలేవు. కానీ కంటికి సరిగా కనిపించని ఓ రకం జీవులు మాత్రం.. నీళ్లు, ఆహారం లేకున్నా ఏళ్లకేళ్లు బతికేస్తాయి. అవే టార్డిగ్రేడ్లు. చూడటానికి ఎలుగుబంట్లలా ఉంటాయి కాబట్టి ‘వాటర్ బేర్’ అని కూడా పిలుస్తుంటారు. మరి ఏమిటీ జీవులు, వాటి ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ అటు తాబేళ్లు.. ఇటు ఎలుగుబంట్లు భూమ్మీది జీవులన్నింటిలో అత్యంత కఠిన పరిస్థితులను తట్టుకుని బతకగలిగేవి ‘వాటర్ బేర్’లు. నీటిలో ఉండే వీటిని 1777లో జర్మన్ శాస్త్రవేత్త జోహాన్ ఎఫ్రేమ్ గోజ్ గుర్తించారు. తాబేళ్ల (టార్టాయిస్)లా నిదానంగా కదులుతాయి కాబట్టి ‘టార్డిగ్రేడ్స్’ అని పేరుపెట్టారు. ఇక శరీరం ఎలుగుబంటిని పోలి ఉండటంతో ‘వాటర్ బేర్స్’ అని పిలుస్తారు. వీటికి జంతువుల్లా ఎటంటే అటు కదలగలిగే తల, దానిపై గుండ్రని నోరు, ఎనిమిది కాళ్లు ఉంటాయి. సైజు సగటున ఒక మిల్లీమీటర్ మాత్రమే. కానీ 40వేలకుపైగా కణాలు ఉంటాయట. భూమిపై సుమారు 1,300 జాతుల వాటర్ బేర్లు ఉన్నాయని అంచనా. నీళ్లు లేకుండా 30 ఏళ్లు.. సాధారణంగా నీళ్లు లేకుండా.. మనుషులు మూడు రోజుల పాటు మాత్రమే బతకగలరు. ఒంటెలు 15 రోజుల దాకా జీవిస్తాయి. కానీ ‘వాటర్ బేర్’లు ఏకంగా 30 ఏళ్లపాటు నీళ్లు లేకుండా బతుకుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ♦నీళ్లు లేకపోవడం, అత్యంత వేడి పరిస్థితుల్లో టార్డిగ్రేడ్లు ‘యాన్హైడ్రోబయోసిస్’ స్థితిలోకి మారిపోతాయి. అంటే వాటి శరీరాన్ని గుండ్రంగా చుట్టేసుకుని ఒక బంతి రూపంలోకి వస్తాయి. పైన గట్టి కవచం ఏర్పడుతుంది. ఇదే సమయంలో లోపల కణాల్లోని నీటి స్థానంలో గాజు వంటి ఒక ప్రత్యేకమైన ప్రొటీన్ (గ్లాన్ మ్యాట్రిక్స్) చేరుతుంది. కణాల్లోని భాగాలు, డీఎన్ఏ, ఇతర ప్రొటీన్లు, మెంబ్రేన్ వంటివేవీ ఏమాత్రం దెబ్బతినకుండా గ్లాస్ మ్యాట్రిక్స్ చూసుకుంటుంది. ఈ మొత్తం ప్రక్రియను ‘టన్ స్టేట్’గా పిలుస్తారు. పరిస్థితి అనుకూలంగా మారగానే.. టార్డిగ్రేడ్లు తిరిగి మామూలు స్థితికి వచ్చేస్తాయి. ఆ కేటగిరీయే.. సెపరేటు! భూమ్మీది జీవజాలంలో అత్యంత ప్రత్యేకమైన ‘ఎక్స్ట్రీమోఫైల్స్’ కేటగిరీలో టార్డిగ్రేడ్స్ను చేర్చారు. అంటే.. ఎప్పటికీ మంచుతో నిండి ఉండే శీతల పరిస్థితులు, అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన రేడియేషన్, అధిక పీడనం, అంతరిక్షంలోని శూన్యం.. వంటి అత్యంత కఠిన పరిస్థితులను తట్టుకుని జీవించగలవని అర్థం. బుల్లెట్నూ తట్టుకుంటాయి టార్డిగ్రేడ్లను గన్తో కాల్చినా బతకగలవని కెంట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. వారు టార్డిగ్రేడ్లను అతి చల్లదనానికి గురిచేసి, అవి ‘టన్’ పరిస్థితికి చేరాక.. బుల్లెట్ల ముందుభాగాన అంటించి వేర్వేరు దూరాల్లోని లక్ష్యాలను కాల్చారు. అందులో కొన్ని బుల్లెట్లపై టార్డిగ్రేడ్లు బతికి ఉండటంతో.. ఎంత ఒత్తిడిని తట్టుకోగలిగాయన్నది తేల్చారు. గంటకు 3వేల కిలోమీటర్ల వేగంతో దూ సుకొచ్చేవాటిని టార్డిగ్రేడ్లు తట్టుకోగలిగినట్టు గుర్తించారు. ప్రళయం వచ్చినా.. ♦టార్డిగ్రేడ్లు భూమ్మీద సుమారు 60 కోట్ల ఏళ్ల కిందటి నుంచే ఉన్నట్టు శాస్త్రవేత్తల అంచనా. అంటే అప్పటికి డైనోసార్లు కూడా పుట్టలేదు. ♦టార్డిగ్రేడ్లు 150 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలనూ తట్టుకోగలవు. 100 సెంటీగ్రేడ్ల వేడికే నీళ్లు మరుగుతాయి. అంటే మరిగే నీటిలోనూ ఇవి బతికగలవు. ♦మనం కాస్త చలికే వణికిపోతాం. అదే టార్డిగ్రేడ్లు మైనస్ 200 డిగ్రీల శీతల పరిస్థితినీ తట్టుకుని.. 30 ఏళ్లకుపైగా జీవంతో ఉండగలవు. ♦ఆక్సిజన్ లేకుండా ‘టన్ స్టేట్’లో ఏళ్లపాటు బతక గలవు. అంతరిక్షంలో శూన్యాన్ని, తీవ్రస్థాయి రేడియేషన్ను తట్టుకోగలవు.అందుకే వీటిని ఇటీ వలే అంతరిక్షంలోకి పంపి ప్రయోగం చేశారు. ♦ఇంత ‘గట్టి’ జీవి కావడంతోనే.. ఒకవేళ భూమిపై ప్రళయం వచ్చినా అవి బతికేయగలవని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. ఓ వీక్నెస్సూ ఉంది! చిత్రమేమిటంటే ఎన్నో కఠిన పరిస్థితులను తట్టుకునే టార్డిగ్రేడ్లు.. నత్తలు విడుదల చేసే జిగురువంటి పదార్థం (స్లైమ్)లో మాత్రం బతకలేవట. ఇటీవల దీనిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. స్లైమ్లో ముంచిన టార్డిగ్రేడ్లలో 34 శాతమే బతికినట్టు గుర్తించారు. -
ఇది నారాయణుడి సేవ
వేసవి మండుతోంది. ప్రధాని మొన్న తన ‘మన్ కీ బాత్’లో నారాయణన్ని దేశానికి గుర్తు చేశారు. పక్షులకు గుప్పెడు గింజలు వేయకపోయినా అవి ఎలాగో బతికేస్తాయి. కాని ఈ వేసవిలో నీళ్లు లేకపోతే విలవిలలాడతాయి. సొంత ఖర్చుతో ఇంటింటికి మట్టి పాత్రలు పంచి పిట్టలకు నీరు పెట్టమని కోరిన శ్రీరామ్ నారాయణన్ అంత కాకపోయినా కొంతైనా మనం చేయొచ్చు. నరుడి సేవ నారాయణుడి సేవ. అలాగే పక్షులకు నీటి సేవ కూడా. ఈ వేసవిలో ఆత్మసంతృప్తినిచ్చే ఈ పని చేద్దామా? మనుషులు వేసవి వస్తే తమ కోసం చలివేంద్రాలు పెట్టుకుంటారు. చల్లటి నీటి కుండల దగ్గర ఆగి కోరినంత నీళ్లు తాగుతారు. వీలైన వాళ్లు తమ వెంట ఎప్పుడూ నీళ్ల బాటిల్ పెట్టుకుంటారు. మరి జంతువులు, పక్షులు ఏం చేయాలి? వేసవి వస్తే అడవుల్లో కుంటలు ఎండిపోతాయి. వాగులు వంకలు మాడిపోతాయి. ఊళ్లల్లో, రోడ్ల మీద ఎక్కడా నీటి చుక్క కనిపించదు. అడవుల్లోని జంతువుల కోసం అటవీ శాఖ ట్యాంకర్లతో నీళ్లు నింపుతుంది. కాని మనిషితో కలిసి సహజీవనం చేసే పట్టణ విహంగాలు... కాకులు, పావురాలు, పిచ్చుకలు, గోరువంకలు, గువ్వలు... ఇంకా లెక్కలేనన్ని పిట్టలు దప్పిక తీర్చుకోవాలి కదా. వాటి దాహం సంగతి? పాతకాలానికి ఇప్పటి కాలానికి తేడా పాత కాలంలో బావులు ఆరుబయట ఉండేవి. వాటి పక్కనే నీటి తొట్టెలు నింపి ఉండేవి. లేదా ఇంటి పనులన్నీ పెరళ్లల్లో సాగేవి. అందుకోసమని వాడుకునేందుకు నీళ్లు కుండల్లోనో గంగాళాల్లోనో ఉండేవి లేదా పశువులున్న ఇళ్లలో కుడితి తొట్టెలు కాకుండా వేసవిలో ఒక తొట్టెనిండా నీళ్లు నింపి ఉండేవి. కాని ఇప్పుడు పల్లెల్లో తప్ప ఈ కార్యకలాపాలన్నీ టౌన్లలో నగరాల్లో నాలుగు గోడల లోపలికి మారాయి. మట్టి, నీళ్ల తడి కనిపించే పెరళ్లు లేవు. ఇక నగరాల్లో అయితే బాల్కనీల్లోని వాష్ ఏరియా దగ్గరకు కూడా రాకుండా తెరలు కట్టిన గ్రిల్స్ ఉంటాయి. మరి ఎండకు పక్షులు నీళ్లు ఎలా తాగాలి? అడుగున నీళ్లున్న కుండ అంచుపై వాలి రాళ్లు జార విడిచి నీళ్లు పైకి రాగా తెలివిగా తాగి వెళ్లిన కథలోని కాకి ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలి? నారాయణన్ ఏం చేశాడు? కేరళ ఎర్నాకుళం జిల్లాలో కలంశెర్రి ఊరికి దగ్గరగా ఉండే మూపతాడంలో ఉండే శ్రీరామ్ నారాయణన్కు పదేళ్ల క్రితం ఈ సందేహం వచ్చింది. వేసవిలో అల్లాడుతున్న పక్షులకు నీళ్లు ఎవరు ఇవ్వాలి? ఎవరో ఎందుకు నేనే ఇవ్వాలి అనుకున్నాడు. వెంటనే సొంత డబ్బుతో మట్టి పాత్రలు తయారు చేసి ఇంటింటికి పంచసాగాడు. ‘ఇవి మీ ఇంటి బయట పెట్టి నీళ్లు నింపండి. పక్షులు తాగుతాయి’ అని అభ్యర్థించాడు. సాధారణంగా మనుషులు మంచివాళ్లే. ఎవరైనా మంచి మాట చెప్తే చేయడానికి వెనుకాడరు. నారాయణన్ ఐడియా అందరికీ నచ్చింది. అతనిచ్చిన మట్టి పాత్రల్లో నీళ్లు నింపి బాల్కనీ గోడల మీద, బయటి గోడల మీద, టెర్రస్ల మీద పెట్టసాగారు. పిట్టలు వాలి వాటిలో తమ ముక్కుల్ని ముంచి తాగడం సంతోషంతో చూశారు. నీళ్లు ఉన్న చోట పిట్టలు నిస్సంకోచంగా వాలి మీటింగ్ పెట్టుకునేవి. కొన్ని జలకాలాడేవి. ఈ మనోహర దృశ్యాలన్నీ నారాయణన్ పెట్టిన భిక్షే. ఇప్పటికి దాదాపు లక్ష పాత్రలు తొమ్మిదేళ్లుగా ఈ మట్టి పాత్రలు పంచుతున్న నారాయణన్ గాంధీజీని ఆదర్శంగా తీసుకుని ఈ పని చేస్తున్నాడు. తన ఊరిలో ఎప్పటి నుంచో ఆయన తన సొంత ఖర్చులతో గాంధీజీ ఆత్మకథ ‘సత్యశోధన’ పంచుతూ ఉన్నాడు. అతను రచయిత కూడా. పిల్లల కోసం కవితలు రాశాడు. అతడున్న ప్రాంతంలో పారిశ్రామిక కేంద్రాలున్నాయి. దాంతో అక్కడ ప్రవహించే పెరియార్ నది కాలుష్యం అవుతూ ఉంటుంది. ఆ కాలుష్యానికి వ్యతిరేకంగా పుస్తకం రాశాడు. అదే దారిలో పక్షులకు నీళ్లు పెట్టే పాత్రల పంపిణీ మొదలెట్టాడు. ఇప్పటికి పది లక్షల సొంత డబ్బు ఇందుకు ఖర్చు పెట్టాడు. నారాయణన్కు హోల్సేల్ లాటరీ ఏజెన్సీ ఉంది. ఊళ్లో చిన్న హోటల్ ఉంది. వాటి మీద వచ్చే ఆదాయం ఇందుకు ఖర్చు పెడతాడు. ‘నాకు ముగ్గురు కూతుళ్లు. నా భార్య చనిపోతే పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశాను. వాళ్లంతా జీవితాల్లో హ్యాపీగా ఉన్నారు. వర్తమానం ధ్వంసం అవుతుంటే భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవడం నాకు నచ్చలేదు. అందుకే ఇలాంటి పనులకు ఖర్చు పెడుతున్నాను’ అంటాడు. ఈ నారాయణనే సొంత డబ్బుతో మొక్కలు పంచి ప్రతి ఇంట్లో ఒక చెట్టుకు కాసే పండ్లను పక్షులకు వదిలేయమని రిక్వెస్ట్ చేస్తుంటాడు. నారాయణన్ చేస్తున్న పనులు అందరూ చేయదగ్గవే. అందరూ చేయకపోవడం వల్లే చేసిన అతని గురించి ఇలా రాయాల్సి వస్తోంది. పక్షులకు నీళ్లు పెట్టడం వార్త. ఒక మొక్క పెంచడం వార్త అవుతున్నాయి. మనం నివసించే ఈ నేలకు మనకు తోడైన జీవరాశిని కాపాడుకోవడం మన విధి. ఈ వేసవి పక్షులకు చల్లగా గడిచేలా చూద్దాం. శ్రీరామ్ నారాయణన్ పంచిన మట్టిపాత్రలతో కాలనీవాసులు -
విశాఖ జూకు కొత్త జంతువులు వచ్చాయోచ్.. అవేమిటంటే..?
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు గురువారం మరికొన్ని వన్యప్రాణులు వచ్చాయి. జంతు మార్పిడి పద్ధతిపై ఇతర జూ పార్కుల నుంచి ఇక్కడకు కొత్త వన్య ప్రాణులను అధికారులు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతిలోని వేంకటేశ్వర జూ పార్కు నుంచి గురువారం మూడు గ్రే జంగిల్ ఫౌల్(మగ–1, ఆడ–2), జత వైల్డ్ డాగ్స్, అడవి దున్న, జత చౌసింగా తీసుకొచ్చారు. చదవండి: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్ విషయాలు వీటికి బదులుగా విశాఖ జూ నుంచి జత హైనాలు, మగ అడవి దున్న, రెండు ఆడ నక్కలు పంపించినట్లు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. ఈ నెల 13న చండీగఢ్లోని ఛత్బీర్ జూ పార్కు నుంచి మొసలి జాతికి చెందిన ఘరియల్స్(2 మగవి), రెడ్ జంగిల్ ఫౌల్స్(మగవి–2, ఆడవి–4), లెసర్ విజ్లింగ్ టీల్స్(మగది–1, ఆడవి–2), బార్న్ ఔల్స్(మగ–1, ఆడవి–2), హైనా( మగది–1) ఇక్కడకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. -
అంతరించిపోయేలా ఉన్నాం.. మమ్మల్ని కాపాడండయ్యా!
World Wildlife Day Special: ‘‘మా బతుకు మేం బతుకుతున్నాం. మా సరిహద్దుల్లోకి వచ్చేది మీరు. అనవసరంగా మమ్మల్ని బలిగొనేదీ మీరే. మా కుటుంబం ప్రకోపాన్ని చూపిస్తే తట్టుకోగలరా మీరు?. కానీ, అలా చేయం. ఎందుకంటే.. మాకంటూ అడవి ధర్మం ఉంది. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. అంతరించిపోతున్న మా జాతుల్ని వీలైతే పరిరక్షించి పుణ్యం మూటగట్టుకోండి’’ మూగ జీవాలకు మాటొస్తే.. కచ్చితంగా మనుషులతో ఇలాగే మొరపెట్టుకుంటాయేమో. భూమ్మీద వృక్షజాలం, జంతుజాలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనుషులదే. ఆ బాధ్యతను గుర్తు చేసేందుకే ఒక రోజు ఉంది. ఇవాళ(మార్చి 3వ తేదీ) వరల్డ్ వైల్డ్లైఫ్ డే. వైల్డ్లైఫ్ పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా అవగాహన కల్పించే రోజు. అంతేకాదు అందమైన వాటి ప్రపంచం గురించి ప్రస్తావించుకునే రోజు కూడా. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా వనజీవుల సంరక్షణ కోసం చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో కొత్తగా అర్టిషిషియల్ టెక్నాలజీ (AI) ద్వారా అంతరించిపోతున్న దశలో ఉన్న జంతువుల్ని గుర్తించడం, తద్వారా వాటి పరిరక్షణకు అవసరమైన చర్యల్ని తీసుకోవాలని భావిస్తున్నారు. 1973లో సైట్స్ (Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora) ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఆ తేదీని World Wildlife Dayగా పరిగణించాలని డిసెంబర్ 20, 2013లో ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ తీర్మానించింది. వైల్డ్లైఫ్ డే సందర్భంలో మన గడ్డ మీద ఉండి.. అంతరించిపోయే దశకు చేరుకున్న ఆరు జాతుల గురించి చర్చించుకుందాం. ఏషియాటిక్ లయన్ ప్రపంచంలోనే అతిపెద్ద రెండో జాతి ఇది. రాజసం ఉట్టిపడే సింహాలకు.. గుజరాత్ ‘గిర్’ శాంక్చురీ దీనికి అడ్డా. కానీ, చాలా ఏళ్ల కిందట భారత్లోని ఉత్తర, మధ్య తూర్పు ప్రాంతాల్లోనూ వీటి సంఖ్య ఎక్కువగా ఉం డేది. అంతరించిపోతున్న క్రమంలో వీటి పరిరక్షణకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నీలగిరి మార్టెన్ దక్షిణ భారత దేశంలో.. అందునా నీలగిరి కొండల్లో కనిపించే అరుదైన మార్టెన్ జాతి ఇది. తమిళనాడు, అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది. కేరళ నెయ్యర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోనూ వీటి పరిరక్షణకు కృషి చేస్తున్నారు. వీటి సంఖ్య వెయ్యి లోపే ఉంది. అందుకే ఐయూసీఎన్ (International Union for Conservation of Nature) ఈ జాతిని రెడ్ లిస్ట్లో చేర్చింది. మంచు చిరుత ఔన్స్ అని ముద్దుగా పిల్చుకునే ఈ జాతి.. అరుదైన జీవుల్లో ఒకటి. అరుణాచల్ ప్రదేశ్ దిబాంగ్ వైల్డ్లైఫ్ శాంక్చురీలో, హిమాచల్ ప్రదేశ్ హిమాలయన్ నేషనల్ పార్క్లో, ఉత్తరాఖండ్ నందా దేవి నేషనల్ పార్క్లో ఇవి కనిపిస్తాయి. శరవేగంగా వీటి జనాభా క్షీణించి పోగా.. ప్రస్తుతం మొత్తంగా పది వేల లోపే మంచు చిరుతలు ఉంటాయని అధికారులు లెక్కలు వేశారు. సంగై అనిమిలీయా కుటుంబంలోని దుప్పి జాతి సంగై (Brow-antlered Deer). మణిపూర్ లోక్టక్ సరస్సును ఆనుకుని ఉన్న కెయిబుల్ లామ్జావో నేషనల్ పార్క్లో ఇవి కనిపిస్తాయి. ఇక్కడో ప్రత్యేకత ఏంటంటే.. సంగై ఆ రాష్ట్ర జంతువు. డ్యాన్సింగ్ డీర్ పేరుతో వీటి మీద జానపద కథలు సైతం ప్రచారంలో ఉన్నాయి. సింహపు తోక మకాక్ వాండెరూ.. సింహపు తోక మకాక్(కోతులు). ప్రపంచంలోనే అతి పురాతనమైన, అరుదైన జాతిగా వీటిని చెప్తుంటారు రీసెర్చర్లు. కేరళ షెండూర్నీ వైల్డ్లైఫ్ శాంక్చురీలో ఇవి కనిపిస్తాయి. ఒంటికొమ్ము రైనో వేట, కొమ్ముల అక్రమ రవాణాతో క్షీణించే దశకు చేరుకున్న జాతి ఇది. కజిరంగ నేషనల్ పార్క్ (అస్సాం), దుద్వా టైగర్ రిజర్వ్(యూపీ), పోబిటోరా వైల్డ్లైఫ్ శాంక్చురీ(అస్సాం)లో మాత్రమే ఇవి కనిపిస్తాయి. పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం కీలక జాతులను రక్షించడం అనే థీమ్తో ఈ ఏడాది వరల్డ్ వైల్డ్లైఫ్ డేని నిర్వహిస్తున్నారు. There are over 22,000 endangered & critically endangered species on the IUCN Red List. Continued species loss is a threat to people and planet. For #WWD2022, let us all support conservation of vulnerable plants and animals. Learn more: https://t.co/hW7VtdeXHK #RecoverKeySpecies pic.twitter.com/AtjMmtVCio — World Wildlife Day (@WildlifeDay) February 22, 2022 పరుగు, పుట్రా, మొక్కలే కాదు.. పరిమాణంలో పెద్ద జంతువులు సైతం మనిషి నిర్లక్ష్యానికి బలై అంతరించే దశకు చేరుకోగా.. ఇప్పటికే కొన్ని అంతరించిపోయాయి కూడా. -సాక్షి, వెబ్ స్పెషల్ -
అక్కడి వైద్యం..ఓ ధైర్యం
సాక్షి హైదరాబాద్(ఏజీవర్సిటీ): ఇంట్లో ఇష్టంగా పెంచుకుంటున్న పప్పీకి గానీ..పిల్లికి గానీ అనారోగ్యం సోకితే.. మనం కనిపిస్తే చాలు కళ్లల్లో ఆనందం నింపుకొని గెంతులేస్తూ వచ్చి ఒళ్లో వాలిపోయే నోరు లేని ఆ జీవులు కదలకుండా కూర్చుంటే..మనసు కీడు శంకిస్తుంది..వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని పోరుపెడుతుంది. అప్పుడే మనకు అసలు సమస్య ఎదురవుతుంది. చికిత్సకోసం ఎక్కడికి తీసుకెళ్లాలని? అటువంటి వారికోసమే సేవలందిస్తోంది రాజేంద్రనగర్లోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రి. కుక్క..కోడి..పిల్లి..మేక..ఏదైనా సరే మేం వైద్యమందిస్తామని గర్వంగా చెబుతున్నారు అక్కడి వైద్యులు. మేకలు, పిల్లులకు ఉచితమే... వెటర్నరీ ఆసుపత్రిలో మేకలు, పిల్లులు, గెదే, గొర్రె, ఆవు తదితర వాటన్నిటికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ల బృందం ఆసుపత్రికి వచ్చిన ప్రతి జంతువుకు మొదట దాని జాతి, బరువు, జ్వరం తదితరాలు నమోదు చేస్తారు. అనంతరం వ్యాధికి సంబంధించిన డాక్టర్ వద్దకు పంపించి పరిశీలించి అనంతరం సూదులు, మందులు ఉచితంగా అందజేస్తారు. కుక్కలు, కుందేలు, గుర్రాలు, చిన్న జీవులు తదితర వాటిని రూ. 20 ఫీజులు వసూలు చేస్తున్నారు. అధునాతన పరికరాలు ఎలాంటి అనారోగ్యాలపాలైన బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మా ఆసుపత్రికి ప్రతి రోజు 200 వరకు రకరకాల జంతువులను చికిత్స కోసం తీసుకువస్తారు. ఆసుపత్రిలో అధునాతనమైన పరికరాలు ఉన్నాయి. అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఎక్స్రే తదితర పరికరాలు ఉన్నాయి. మాతో పాటు మా సిబ్బంది, పీజీ విద్యార్థులు ఎల్లవేళల అందుబాటులో ఉంటాం. – అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రామ్సింగ్ 30 కిలోమీటర్ల దూరం నుంచి వస్తాం.. మా తాతముత్తాతల నుంచి రకరకాల మేకలను మేము పెంచుతున్నాం. ఈ మేకలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇక్కడికే వచ్చి వైద్యం చేయిస్తాం. ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోలేదు. ఉచితంగానే వైద్యంతో పాటు మందులు కూడా ఇస్తారు. మా ఇంటి ఆసుపత్రికి రావడానికి సుమారు 30 కిలోమీటర్లు అవుతుంది. అయినా మంచి వైద్యం అందుతుంది కాబట్టి ఇక్కడికే వస్తున్నాం. – మహ్మద్ ఇబ్రహీం, మొఘల్పురా త్వరలో నూతన భవనం ప్రారంభం ఇక్కడ 55 సంవత్సరాలనుంచి సేవలందిస్తున్నాం. కొన్ని మూగ జీవాలకు తక్కువ ఫీజు తీసుకుంటాం. చాలావాటికి ఉచితంగా సేవలందిస్తాం. ఇప్పటికి లక్షలాది జీవులకు ప్రాణం పోశాం. ఆసుపత్రి భవనం సరిపోవడం లేదని ప్రభుత్వానికి సూచించడంతో రూ. 11 కోట్ల తో అధునాతన హంగులతో నూతన భవనం నిర్మించాం. త్వరలో ప్రారంభిస్తాం. జరుగుతుంది. – రవీందర్రెడ్డి, వైస్ ఛాన్సలర్ -
తోలు తీసి.. నదిని దాటేసి.. ఏ కాలం నుంచి మొదలు?
వాగులు, వంకలు దాటేందుకు ఇప్పుడంటే పడవలు, బోట్లు ఉన్నాయి. సముద్రాలను కూడా అలవోకగా దాటేస్తున్నాం. ఇవన్నీ ఎందుకనుకుంటే పెద్ద పెద్ద వంతెనలే కట్టుకుంటున్నాం. మరి ఇలాంటి సౌకర్యాలేవీ లేని పూర్వకాలంలో కొన్ని ప్రాంతాల్లో వాగులు, నదులను ఎలా దాటే వాళ్లో తెలుసా? చనిపోయిన జంతువుల కళేబరాలను ఒలిచి, వాటిలో గాలిని ఊది బెలూన్లలా చేసుకొని వాడేవారు. వినడానికి విచిత్రంగా ఉన్నా అప్పట్లో ఇలాగే చేసేవారు. అసలు రంధ్రాలు పడకుండా జంతువుల కళేబరాలను పక్కాగా ఎలా ఒలిచేవాళ్లు, వాటి నుంచి గాలి పోకుండా ఏం చేసేవాళ్లు, కదిలే నీటిలో వాటితో ఎలా ప్రయాణించే వాళ్లు, ఇలాంటి పద్ధతులు ఏ ప్రాంతాల్లో వాడేవారో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ఏ కాలం నుంచి మొదలు? ఆదిమ కాలం నాటి ఈ నదులు దాటే పద్ధతి మెసపటోమియా కాలం నుంచి కనిపిస్తోంది. క్రీస్తుపూర్వం 880ల కాలంలో నిర్ముడ్ ప్రాంతంలోని (ప్రస్తుతం ఇరాక్లో ఉంది) ఓ శిల్పంలో ఈ విధానం గురించి చెక్కారు. అప్పటి ఆ ప్రాంతపు అస్సీరియన్ సైనికులు గాలి నింపిన మేక ఆకారంలోని జంతు చర్మాల సాయంతో వాగును దాటుతున్నట్టు ఆ శిల్పంలో ఉంది. అప్పట్లో గ్రీకు రాజు సైరస్ కూడా ఇలాంటి జంతు చర్మాల సాయంతో బాబిలోనియన్ నదిని దాటాడని నాటి తత్వవేత్త జెనోఫోన్ చెప్పాడు. పర్షియా రాజు డేరియస్, మంగోలియన్ సైనికులు, రోమన్లు, అరబ్బులు కూడా ఈ పద్ధతి వాడారు. చర్మాలను ఎలా ఒలిచేవాళ్లు? ఓ ప్రత్యేక పద్ధతిలో జంతువుల చర్మాలను ఒలిచేవారు. ఆ తర్వాత చర్మాన్ని కొన్నిరోజులు పాతి పెట్టేవారు. తర్వాత దానిని తీసి పదును లేని కత్తితో రాసి వెంట్రుకలను తొలిగించేవారు. ఆ తర్వాత చర్మాన్ని తిప్పి లోపలి భాగంవైపు ముక్కు, మూతి, కళ్లు, చెవులు లాంటి ఇతర రంధ్రాలుండే ప్రాంతాలను కుట్టేసేవారు.4 కాళ్లలో మూడింటిని కట్టేసేవారు. నాలుగో కాలును గాలి ఊదేందుకు, తీసేందుకు వాడేవారు. చర్మంలోపల తారు లాంటి పదార్థాన్ని పోసి పూర్తిగా అంటుకునేవరకు ఊపేవారు. వాడనప్పుడు తోలును ఎండబెట్టి ఉంచేవారు. వాడాలనుకున్నప్పుడు తోలుకు సున్నితత్వాన్ని పెంచడానికి నీళ్లలో నానబెట్టేవారు. నదులను ఎలా దాటేవాళ్లు? చర్మం బెలూన్లో గాలి ఊదాక తమకు తాముగా ఆ బెలూన్తో పాటు నదిలో దూకేవారు. ఒకవైపు కాలుతో, మరోవైపు చిన్న తెడ్డుతో నీటిని వెనక్కి తోస్తూ ముందుకెళ్లేవారు. జంతు చర్మం బెలూన్ మాములూగానే గుండ్రంగా ఉంటుంది. దూకగానే పడిపోయే అవకాశం ఉంటుంది. అయితే సాధన చేస్తూ చేస్తూ ఆ చర్మం బెలూన్ సాయంతో ఈదడం నేర్చుకునేవారు. వీటిపైన ఇతర ప్రయాణికులను, చిన్న చిన్న వస్తువులు, సరుకును కూడా రవాణా చేసేవారు. ప్రయాణికులను తీసుకెళ్లేటప్పుడు రెండు, మూడు చర్మం బెలూన్లను ఒక చిన్న సైజు తెప్పలా చేసి వాడేవారు. మనదేశంలో వాడేవాళ్లా? మనదేశంలోనూ పంజాబ్, కశ్మీర్, సిమ్లాల్లో ఇలాంటి వాటిని వాడేవారు. 1900వ సంవత్సరం తొలినాళ్లలో అమెరికా స్కూల్ టీచర్ జేమ్స్ రికాల్టన్ మన దేశాన్ని చూసేందుకు వచ్చినప్పుడు పంజాబ్లోని కొండ ప్రాంత గ్రామాల్లో జంతు చర్మాల సాయంతో సట్లెజ్ నదిని గ్రామస్తులు దాటడం గమనించాడు. ఆ దృశ్యాలను తన స్టీరియోస్కోపిక్ కెమెరాలో బంధించాడు. సరుకులనూ నది దాటించేవాళ్లా? సరుకు రవాణాకూ ఈ జంతు చర్మాల బెలూన్లను వాడేవారు. ఇంగ్లిష్ అన్వేషకుడు విలియం మూర్క్రాఫ్ట్ మన దేశానికి వచ్చినప్పుడు తనకు సంబంధించిన వ్యక్తులు 300 మంది, 16 గుర్రాలు, కంచర గాడిదలు, దాదాపు 7,400 కిలోల వివిధ రకాల బ్యాగులను 31 మంది తమ జంతు చర్మాల సాయంతో సట్లెజ్ నదిని దాటించారని చెప్పాడు. ఈ పనినంతా వాళ్లు కేవలం గంటన్నరలోనే పూర్తి చేశారన్నాడు. చైనా వాళ్లు కూడా ఇలాంటి జంతు చర్మాలతో చేసిన తెప్పలపై రకరకాల సరుకులను రవాణా చేసేవారు. -
వారంతా ఉద్యోగులు, విద్యార్థులు.. ఓపిక, సహనంతో పోరాటం.. ఇంతకీ ఏం చేస్తారో తెలుసా?
సాక్షి, రాయదుర్గం: వారంతా ఉద్యోగులు..విద్యార్థులు. ఓపిక, సహనం, ఓర్పుతో పర్యావరణ పరిరక్షణకు ఎంతో ముఖ్యమైన జంతువులు, పక్షులను రక్షించాలనే తపనతోనే “యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ’(ఏడబ్ల్యూసీఎస్)ని స్థాపించారు. ఏడాదిలో 365 రోజులు ఎలాంటి సెలవు, పండగ అనే విరామమే లేకుండా పశుపక్ష్యాదుల రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఐటీ కారిడార్, శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలోని గోపన్పల్లి, కొండాపూర్, హైటెక్సిటీ, నానక్రాంగూడ, మాదాపూర్, చందానగర్ వంటి ప్రాంతాల్లో ఆపదలో ఉన్న పక్షులను రక్షించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా బావి, చెరువు, సంపులో పడిపోయిన జంతువులు, పక్షులను రక్షించడం, కాళ్లు, రెక్కలకు పతంగుల మాంజా చిక్కి చెట్లకు వేలాడం, టెర్రస్లోకి పెంపుడు జంతువులు వెళ్లి అక్కడి నుంచి రాలేకపోవడం వంటి వాటిని రక్షించి, వాటికి సపర్యలు చేసి ఎగిరి వెళ్లగలిగే స్థితికి తెచ్చి పంపించి వేసే విధంగా ఈ బృందం పనిచేస్తోంది. బావిలో పడ్డ కుక్కను రక్షించేందుకు యత్నిస్తున్న ఏడబ్ల్యూసీఎస్ బృంద సభ్యుడు 2019లో ఏడబ్ల్యూసీఎస్ ఏర్పాటు ► సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి ప్రదీప్నాయర్, అమర్, సంజీవ్వర్మ, సంతోషి కలిసి ఈ యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీని 2019 జనవరిలో ఎన్జీఓగా ఏర్పాటు చేశారు. ► మొదట్లో 12 మంది సభ్యులుండగా, ప్రస్తుతం మనీష్, అనిరుద్, రాఘవ, గణేష్, ప్రభు, రాహుల్, శశిధర్తో పాటు 18 మంది సభ్యులుగా చేరారు. ► వీరంతా పక్షి, జంతువు ఆపదలో ఉందని ఫోన్ రాగానే వెంటనే ఘటనా స్థలానికి వెళ్లడం, ఆ తర్వాత దాన్ని రక్షించడంపైనే దృష్టి సారిస్తారు. ► ఇప్పటి వరకు 330 పక్షులు, 44 ఉడుతలు, 50 పాములు, 306 కుక్కలు, 139 పిల్లులు, 19 పశువులు, 14 కోళ్లు, ఇతరత్రా వాటిని ఈ ఏడాది రక్షించారు. ► పర్యావరణ పరిరక్షణలో భాగంగా 1200 కిలోల ప్లాస్టిక్ నెట్లు, ఇతరత్రా సామగ్రి, 455 కేజీల ప్లాస్టిక్ సీసాలు సేకరించారు. ఐటీ కారిడార్లో ఏటా మాంజాతోనే 250–300 పక్షులకు ఆపద ► ఐటీకారిడార్లో సంక్రాంతి పర్వదినం సందర్భంగా పతంగులు ఎగురవేయడానికి వినియోగించే నిషేధిత మాంజాతో ఏటా వందలాది పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ► 250 నుంచి 300 వరకు పక్షులను డిసెంబర్ నుంచి జనవరి చివరి వరకు రక్షించిన దాఖలాలు ఉన్నాయి. ► ప్రధానంగా గాలిపటాలు ఎగురవేసిన తర్వాత అవి కాస్తా దారంతో వెళ్లి చెరువు, ఇతరత్రా ఖాళీ స్థలాలలోని చెట్లపై పడిపోతాయి. ► ఈ మధ్యలో రకరకాల పక్షులు చెరువులో నీరే తాగేందుకు వచ్చి చెట్టుపై సేద తీరే సమయంలో రెక్కలు, కాళ్లకు పతంగి మాంజా చుట్టుకొని గాయాల పాలు కావడం జరుగుతోంది. ఇది ఎవరైనా చూస్తే సమాచారం ఇస్తారు. ► చెట్లకు వేలాడుతూ అలాగే కొన్ని రోజులపాటు గాయాల బారిన పడి అక్కడే మృత్యువాత పడిన ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. హెచ్సీయూతో పనిచేసిన ఏడబ్ల్యూసీఏ బృందం.. ► హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో కూడా ఏడబ్ల్యూసీఏ బృందం కలిసి పనిచేసింది. ► గత ఏడాది లాక్డౌన్ సమయంలో హెచ్సీయూ క్యాంపస్ పరిధిలోని పశు,పక్ష్యాదుల కోసం విద్యార్థులు, అధికార యంత్రాంగంతో కలిసి వాటికి ఆహారం, ఇతరత్రా సేవలందించడంలో తమవంతు పాత్ర పోషించారు. ► హెచ్సీయూలో పర్యావరణ పరిరక్షణకు పశు,పక్ష్యాదుల రక్షణ కోసం విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కూడా ఈ బృందం యత్నిస్తోంది. సంస్థ కోరే సాయం ► సంస్థ నిర్వహణకు ప్రత్యేక స్థలం కేటాయించాలి. ► పశు,పక్ష్యాదులకు తీవ్ర గాయాలైతే రక్షించేందుకు డాక్టర్లు, ఇతర సిబ్బంది సేవలు అందించాలి. గోపన్పల్లిలో వరుసగా మూడోసారి ► ఈ ఏడాది గోపన్పల్లిలో ఇటీవలే వరుసగా మూడోసారి చెరువు మధ్యలో ఉన్న కంపచెట్టుకు ఉన్న మాంజా కొంగ కాళ్లకు చుట్టుకొవడంతో వేలాడుతూ ప్రాణాపాయస్థితికి చేరింది. ► ఇలాంటి ఘటనలు ఈ నెలరోజుల్లో 3సార్లు చోటు చేసుకోగా ఈ బృందం భారీ తాడు, కర్రల సహాయంతో పక్షి దగ్గరకు ఛాతీ వరకున్న చెరువునీటిలో సాయంత్రం వేళల్లో వెళ్లి కొంగను రక్షించారు. అగ్నిమాపక శాఖ సాయంతో పావురాన్ని రక్షించిన ఏడబ్ల్యూసీఎస్ బృందం ఐటీ కారిడార్లో ఏటా మాంజాతోనే పక్షులకు ప్రమాదం సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగురవేసేందుకు వినియోగించే మాంజాతో పక్షులకు ప్రమాదం చోటు చేసుకుంటోంది. ఐటీ కారిడార్ హైటెక్సిటీ, కొండాపూర్, గోపన్పల్లి పరిసరాల్లో చెరువులు, ఇతరత్రా ఖాళీ స్థలాల్లో చెట్లకు మాంజా తగులుకోవడంతో ఇది పక్షుల కాళ్లు, రెక్కలకు చుట్టుకోవడంతో ప్రాణాపాయస్థితికి చేరుకుంటున్నాయి. చూసిన వాళ్లు సమాచారం ఇస్తే వాటిని రక్షిస్తున్నాం. లేకపోతే అవి మృతి చెందుతున్నాయి. – మనీష్, జాయింట్ సెక్రటరీ, ఏడబ్ల్యూసీఎస్ ఉచితంగానే సేవలు ఆపదలో ఉన్న పశు,పక్ష్యాదులను ఉచితంగానే రక్షిస్తాం. సమాచారం ఇచ్చిన వారి నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండానే వాటిని రక్షిస్తున్నాం. ఒక్కో రెస్క్యూకు వాహనాల వ్యయం రూ.2,500 నుంచి మూడువేల వరకు అవుతుంది. అగ్నిమాపక శాఖ, డీఆర్ఎఫ్ బృందాల సహకారం కూడా తీసుకుంటాం. ప్రభుత్వ సహాయం అందిస్తే మేలు చేకూరుతుంది. ప్రదీప్ నాయర్, ఇతర సభ్యులు, అమర్ వంటి వారితో అవగాహన, శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇవ్వడం చేస్తున్నాం. పశు,పక్ష్యాదులు ఆపదలో ఉంటే 9697887888కు ఫోన్ చేయండి. – సంజీవ్వర్మ,ప్రధాన కార్యదర్శి, ఏడబ్ల్యూసీఎస్ -
వేట.. పేలుతున్న తూటా
రుద్రవరం: అధికారుల కన్నుకప్పి కొందరు నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల వేట సాగిస్తున్నారు. వన్యప్రాణుల మాంసానికి, చర్మానికి మంచి డిమాండు ఉండటంతో రహస్యంగా వేట కొనసాగిస్తున్నారు. కొందరు నాటు తుపాకులతో వేటాడుతుండగా, ఇంకొందరు ఉచ్చులు బిగించి వాటిలో చిక్కిన వన్యప్రాణులను హతమార్చి.. వాటి మాంసాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలోని రుద్రవరం, చెలిమ రేంజి పరిధిల్లో ఈ తతంగం సాగుతోంది. నేల రాలుతున్న జింకలు నంద్యాల డివిజన్లో రుద్రవరం, చెలిమ రేంజిలలో వేలాది హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల, చాగలమర్రి మండలాల్లోని పలు గ్రామాలు అటవీ ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్నాయి. ఆయా గ్రామాల వారంతా అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆత్మరక్షణ నిమిత్తం కొందరు నాటు తుపాకులు, వేట కొడవళ్లు కలిగి ఉన్నారు. కాలక్రమేణా వాటిని జంతువులను వేటాడేందుకు వినియోగిస్తున్నారు. వీరు ఆయుధాలతో రహస్యంగా అడివిలోకి వెళ్లి వన్య ప్రాణులను ప్రధానంగా జింకలను హతమార్చుతున్నారు. మాంసాన్ని బయటకు తరలించి కిలో రూ.500 ప్రకారం విక్రయిస్తున్నా రని సమాచారం. నామమాత్రపు దాడులు వేటగాళ్ల చేతుల్లో జింకలు మృత్యువాత పడుతున్నా అటవీ అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరైనా సమాచారం అందిస్తే నామమాత్రపు దాడులు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రుద్రవరం మండలం హరినగరం వద్ద బహిరంగంగా వన్యప్రాణి మాంసాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడిచేసి నిందితులను వదిలిపెట్టి కేవలం మాంసాన్ని స్వాధీనం చేసుకొని ఆపై అగ్నిలో కాల్చివేశారు. అదే గ్రామంలో ఓ నాటు తుపాకీ కూడా లభించింది. అయినప్పటికీ నిందితుడికి సరైన శిక్ష వేయించలేక పోయారు. అటవీ ప్రాంతంలో మరో నాటు తుపాకీ దొరికినట్లు చూపించారు. అలాగే ఇటీవలే గోస్పాడు మండలం దీబగుంట్ల వద్ద ఇరువురు నిందితులు జింక మాంసంతో పట్టుబడ్డారు. వారిని విచారించగా ఆళ్లగడ్డ మండలం పెద్దకందుకూరు మెట్ట ఆల్ఫా కళాశాల సమీపంలో జింకను వేటాడినట్లు చెప్పారు. కొరవడిన సంరక్షణ వన్య ప్రాణులు అటవీ ప్రాంతంలో జీవించలేక బయటకు వచ్చి మృత్యువాత పడుతున్నాయి. ప్రధానంగా రుద్రవరం మండలంలోని ఆర్.నాగులవరం, చందలూరు, తువ్వపల్లె, టీ.లింగందిన్నె, పేరూరు, శ్రీరంగాపురం, పెద్దకంబలూరు, అప్పనపల్లె, ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లె, నల్లగట్ల, కందుకూరు, చింతకొమ్మదిన్నె, మిట్టపల్లె, చాగలమర్రి మండలం ముత్యాలపాడు, బోదనం తదితర ప్రాంతాలలో జింకల సంచారం అధికంగా ఉంటోంది. అటువంటి ప్రదేశాల్లో అధికారుల నిఘా కొరవడటంతో వేట యథేచ్ఛగా సాగుతోంది. మిట్టపల్లె సమీపంలోని ఎర్రచెరువు వద్ద తెలుగు గంగ 28వ బ్లాక్ ఉప ప్రధాన కాల్వలో ఒకే ప్రదేశంలో వరుసగా రెండు పెద్ద పులులు మృతి చెందాయి. వాటి మృతికి కారణాలు ఇంత వరకు కనుగొన లేకపోయారు. మిట్టపల్లె, నల్లగట్ల ప్రాంతాల్లో జింకల కళేబరాలు లభించాయి. ఇలా విచ్చలవిడిగా వేట సాగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వన్య ప్రాణులు, అడవి జంతువుల సంరక్షణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అందుబాటులో ఉండని సిబ్బంది నల్లమల అటవీ ప్రాంతాన్ని సంరక్షిస్తామని బాధ్యతలు చేపట్టిన అటవీ అధికారులు అడవికి 20, 40 కిలోమీటర్ల దూరంలోని ఆళ్లగడ్డ, నంద్యాల వంటి పట్టణాల్లో నివాసాలు ఉంటున్నారు. పగటిపూట మాత్రం కార్యాలయాలు, ఠాణాల వద్ద అటుఇటు కలియతిరిగి వెళ్తున్నారు. రాత్రి సమయాల్లో అటవీ సంరక్షణ గాలికి వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వన్యప్రాణులను వేటాడితే జైలే వేట కారణంగా నేలకొరుగుతున్న వన్య ప్రాణులపై రుద్రవరం రేంజి అధికారి శ్రీపతి నాయుడును వివరణ కోరగా వన్య ప్రాణులను వేటాడితే జైలుశిక్ష ఖాయమని హెచ్చరించారు. ఇటీవల జరిగిన పలు సంఘటనలతో అటవీ శాఖ అప్రమత్త మయ్యిందన్నారు. ఇందులో భాగంగానే నల్లమల అటవీ ప్రాంతంలో రహస్యంగా ట్రాప్ కెమెరాలు అమర్చామన్నారు. అలాగే వేట సాగే పలు ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. అలాగే గ్రామాల్లో వన్య ప్రాణులను వేటాడితే కేసులు, పడే శిక్షలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఫారెస్టు గదులు సక్రమంగా లేకçపోవడం వల్లే సమీప పట్టణాల్లో సిబ్బంది నివాసముంటున్నారని తెలిపారు. -శ్రీపతి నాయుడు, రుద్రవరం రేంజి అధికారి -
వండలూరు జంతు ప్రదర్శనశాలలో ‘వైరస్’ కలకలం..
సాక్షి, చెన్నై(తమిళనాడు): వండలూరు జంతు ప్రదర్శనశాలలో వైరస్ కలకలం రేపుతోంది. రెండురోజుల వ్యవధిలో తొమ్మిది నిప్పు కోళ్లు, ఒక ఆడ సింహం మరణించినట్టు గురువారం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యబృందాలు పరిశీలన ప్రారంభించాయి. కరోనా లాక్డౌన్ సమయంలో వండలూరులోని అన్నా జంతు ప్రదర్శనశాలలో వన్యప్రాణులపై కరోనా ప్రభావం పడిన విషయం తెలిసిందే. రెండు సింహాలు మరణించడం, మరికొన్ని కరోనా బారిన పడడం వెలుగు చూశాయి. దీంతో ఆ ప్రదర్శనశాల కొంతకాలం మూత పడింది. మళ్లీ ప్రస్తుతం సందర్శకులకు అనుమతి ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం హఠాత్తుగా రెండు నిప్పు కోళ్ల మరణించాయి. వీటికి పోస్టుమార్టం నిర్వహించి..సేకరించిన నమూనాల్ని పరిశోధనకు పంపించారు. నివేదిక వచ్చేలోపు బుధవారం సాయంత్రం మరో ఏడు నిప్పు కోళ్లు మరణించడంతో వైరస్ కలవరం ఏర్పడింది. అలాగే, గతంలో కరోనా బారిన పడికోలుకున్న కవిత(22) అనే ఆడ సింహం అనారోగ్యంతో మరణించడంతో ఈ భయం మరింత పెరిగింది. అధికారులు ఇతర వన్య ప్రాణులు అనారోగ్యం బారిన పడకుండాముందు జాగ్రత్తలు చేపట్టారు. పరిశీలనలో టీకా ఉత్పత్తి కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని రాష్ట్రంలోని చెంగల్పట్టు, కున్నూరు కేంద్రాల్లో చేపట్టేందుకు కేంద్ర చర్యలు చేపడుతోందని ఆరోగ్యమంత్రి సుబ్రమణియన్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 18 ఏళ్లు లోపువారికి టీకా డ్రైవ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసిందన్నారు. కాగా చెన్నైలో మాస్క్లు ధరించని 47 వేల మందిని గుర్తించి, వారి నుంచి రూ. 94 లక్షల మేరకు జరిమానాను రెండు రోజుల్లో వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు. చదవండి: చిన్నారిని కిడ్నాప్ చేయించిన మేనమామ -
ఫోటో ఫీచర్: చిన్న మంచు ఫలకంపై ఎలుగుబంటి..
వెయ్యి పదాలలో చెప్పలేని భావం.. ఒక్క ఫొటోతో చెప్పవచ్చట.. ఇది కూడా అలాంటిదే.. చిన్న మంచు ఫలకంపై ఎలుగుబంటి ముడుచుకుని పడుకున్న ఈ చిత్రం.. చూడ్డానికి మామూలుగా కనిపిస్తోంది కదూ.. అయితే నిశితంగా పరిశీలిస్తే.. ప్రకృతికి మనిషి చేస్తున్న కీడును ఈ చిత్రం తెలియజెప్పుతోంది.. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్.. దాని వల్ల మంచు ఖండాలు కరుగుతున్న తీరుకు ఇది అద్దం పడుతోంది.. అందుకే ఈ చిత్రానికి పర్యావరణంలో జంతువుల కేటగిరీలో ఇంటర్నేషనల్ గోల్డెన్ టర్టిల్ ప్రథమ పురస్కారం లభించింది. మరెక్ జకోవ్స్కి ఈ చిత్రాన్ని తీశారు. మనిషి ప్రకృతికి చేస్తున్న మరో నష్టం.. ప్లాస్టిక్ కాలుష్యం.. అందుకు సముద్రాలనూ మనం వదిలిపెట్టడం లేదు.. అందుకు నిదర్శనమే ఈ చిత్రం. ఇది మాల్స్లో ఇచ్చే ప్లాస్టిక్ నెట్. ఇప్పుడు ఈ చేపకు మృత్యుపాశంగా మారింది.. అలాంటి నెట్లో చిక్కుకుని బయటపడటానికి ఇబ్బందులు పడుతున్న ఈ మత్స్యం చిత్రాన్ని పాస్క్వేల్ వాజెల్లో అనే ఫొటోగ్రాఫర్ తీశారు. హ్యూమన్స్ అండ్ నేచర్ కేటగిరీలో ద్వితీయ బహుమతిని గెలుచుకుంది ఈ చిత్రం. ఒకరిది ఆకలి ఆరాటం, మరొకరిది బతుకు పోరాటం. పర్వతపు మేకపిల్లను వేటాడుతున్న తోడేలు చిత్రాన్ని తీసిన ఫొటోగ్రాఫర్ హయువాన్ టాంగ్. జంతువుల ప్రవర్తన కేటగిరీలోప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. -
మరో 23 జీవులు అంతరించిపోయాయి
మనుషుల విధ్వంసక చర్యల కారణంగా ఎన్నో జీవులు అంతరించి పోతున్నాయి. ఆ జాబితాలోకి తాజాగా మరో 23 జీవులు చేరాయి. ఈ విషయాన్ని అమెరికా అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత డిసెంబర్ 29న తుది ప్రకటన చేయనుంది. అంతరించిపోయిన జాబితాలో పండ్లను తిని జీవించే ఓ రకం గబ్బిలం, పదకొండు రకాల పక్షులు, మంచినీటి ఆల్చిప్పలు, రెండు రకాల చేపలు, పుదీనా జాతికి చెందిన ఓ మొక్క ఉన్నాయని అమెరికా ఇంటీరియర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఇన్ని జీవులను ఒకేసారి అంతరించిపోయిన జాబితాలో ప్రకటించడం ఇదే మొదటిసారి అని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. మనుషులు సృష్టిస్తున్న కాలుష్యం మూలంగా ఏర్పడిన పర్యావరణ మార్పులు, ఆవాసాల ధ్వంసం కారణంగా ఆ జీవులు మనుగడ కోల్పోవడం వంటి కారణాలతో ఆ జీవులు ఇక కనపడకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనుషుల చర్యలు మరిన్ని జీవుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయని, వన్యజీవులను కాపాడటానికి మరింత ఉత్సాహంగా, కలసికట్టుగా పనిచేయాలని అమెరికా ఇంటీరియర్ సెక్రటరీ డెబ్ హాలాండ్ అభిప్రాయపడ్డారు. 1970 నుంచి చూస్తే ఉత్తర అమెరికాలోని పక్షుల సంఖ్య 3 బిలియన్ల మేర తగ్గిపోయిందని తెలిపారు. చట్టంతో కాస్త మెరుగు.. అమెరికా అంతరించిపోతున్న జీవుల చట్టం (ఈఎస్ఏ) తీసుకొచ్చిన తర్వాత ఇతర జీవుల మనుగడలో కాస్త మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రక్షించాల్సిన జాబితాలో ఉన్న 54 జీవుల సంతతి సమృద్ధిగా ఉండటంతో వాటిని ఆ జాబితా నుంచి ఇటీవల తొలగించారు. వాటిలో అమెరికన్ పెరిగ్రిన్ ఫాల్కన్, బాల్డ్ ఈగిల్ ఉన్నాయి. మరో 56 జీవులను అంతరించిపోతున్న జాబితా నుంచి ‘ప్రమాదకర’ జాబితాకు తగ్గించారు. అమెరికా వ్యాప్తంగా ఈ జాబితాల్లో ప్రస్తుతం 1,600లకు పైగా జీవులు ఉన్నాయి. ఇక కానరాని.. దేవుడు పక్షి అంతరించిన పోయిన జాబితాలో ఉన్న పక్షుల్లో ఐవరీ బిల్ల్డ్ వడ్రంగి పిట్ట, వీనుల విందైన గొంతు కలిగిన ఓ రకం పిచ్చుక ఉన్నాయి. వడ్రంగి పిట్టను అమెరికా ప్రజలు దేవుడు పక్షిగా పిలుచుకునేవారు. ఆదేశంలోని వడ్రంగి పిట్ట జాతుల్లో ఇది పెద్దది. ఆ దేశ దక్షిణ ప్రాంతంలోని భారీ వృక్షాలు వీటి ఆవాసం. కలప కోసం, ఇతర అవసరాల కోసం ఆ వృక్షాలను నరికివేయడంతో వడ్రంగి పిట్టలు ఆవాసాలను కోల్పోయాయి. 1944 ప్రాంతంలో ఈశాన్య లూసియానా ప్రాంతంలో చివరిసారిగా ఇది కనిపించింది. ఇక శ్రావ్యమైన గొంతు కలిగిన పక్షుల్లో ఒకటిగా, అత్యంత అరుదైన దానిగా పేరుగాంచిన బాచ్మన్స్ వార్బ్లెర్ పిచ్చుక అమెరికాలో 1962లో చివరిసారిగా కనిపించింది. ఈ వలస పిచ్చుక 1981లో క్యూబాలో చివరిసారిగా కనిపించిన తర్వాత మళ్లీ దాని జాడ లేకుండా పోయింది. ఈ రెండింటిని 1967లో తొలిసారిగా అంతరించిపోయే జాబితాలో చేర్చగా.. ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయిన వాటిగా ప్రకటించారు. -
మానవ తప్పిదం: వడ్రంగి పిట్టలు ఇక కనుమరుగైనట్టే!
వడ్రంగి పిట్టలంటే తెలియని వారుండరు. ముఖ్యంగా పల్లెల్లో స్వేచ్ఛగా విహరిస్తూ సందడి చేస్తుంటాయి. అవి రాత్రి పూట తమ పొడవాటి ముక్కును పదును చేసుకోవటం కోసం చెట్టు బెరడను గీకుతూ ఒక రకమైన శబ్ధం చేస్తుంటాయి. పైగా ఇవి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా చూపరులను కట్టిపడేసేలా ఉంటాయి. అలాంటి ఈ వడ్రంగి పక్షులు ఇక లేవని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అసలేం జరిగిందో ఏమిటో తెలుసుకుందామా! న్యూయార్క్: వడ్రంగి పిట్టలాంటి కొన్ని అరుదైన ప్రసిద్ధ పక్షి జాతులు, కొన్ని రకాలైన చేపలతో సహా దాదాపు 23 రకాల జాతులు అంతరించిపోయినట్లు యూఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఈ 23 జాతులు అంతరించిపోయినట్లు మాత్రమే కనుగొన్నట్లు పేర్కొంది. కానీ క్రమంగా మొక్కలు, జంతువులు కూడా అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని వన్య ప్రాణి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు అవి అంతరించిపోవడానికి ఓ కారణంగా తెలిపారు. భవిష్యత్లో ఇలా అంతరించిపోయేది మనకు ఇక సాధారణం కావచ్చని చెబుతున్నారు. (చదవండి: ‘విమాన సేవలను తిరిగి పునరుద్ధరించండి’) ఇటీవల దశాబ్దాలుగా అర్కాన్సాస్, లూసియానా, మిసిపిప్పి, ఫ్లోరిడా వంటి ప్రాంతాలతోపాటు ఆఖరికి చిత్తడి నేలలు ఉండే ప్రాంతాల్లో కూడా చేసిన పరిశోధనల్లో వడ్రంగి పిట్టల ఆచూకీ లభించలేదని యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్లైఫ్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ యూఎస్లోని మొలస్క్లు (నత్తలు, పీతలు) ఉండే తాగునీటి సరస్సుల్లో ఎక్కువగా ఈ వడ్రంగి పిట్టలు ఉంటాయని తెలిపారు. చివరిసారిగా ఆ ప్రాంతంలోనే చూసినట్లు యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్లైఫ్ సర్వీస్ జీవ శాస్త్రవేత్త ఆంటోనీ ఆండి ఫోర్డ్ పేర్కొన్నారు. నీటి కాలుష్యం, పక్షుల ఈకల కోసం వాటిని చంపడం, అడవుల నరికివేత తదితర కారణాలతోపాటు మానవ తప్పిదాలే అవి అంతరించిపోవడానికి ప్రధాన కారణమని వెల్లడించారు. (చదవండి: పాకిస్తాన్ వైపుగా వెళ్తున్న గులాబ్ తుపాన్) -
కరోనా ఎఫెక్ట్: ఆ రంగంపై ఆదరణ, ప్రాధాన్యత పెరుగుతోంది
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వన్యప్రాణి, ప్రకృతి–పర్యావరణహిత పర్యాటకానికి (వైల్డ్లైఫ్, ఎకో టూరిజం) ఆదరణ, ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి కారణంగా యావత్ మానవాళి ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో భారీ కుదుపునకు లోనైంది. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సురక్షిత, పర్యావరణహిత, జీవవైవిధ్యానికి ఆలవాలమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనే కుతూహలం పర్యాటకుల్లో అధికమైంది. ఈ నేపథ్యంలో విశాల భారత్లోని వైవిధ్యత, సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం, అడవులను దేశ, విదేశాల్లోని టూరిస్టులకు పరిచయం చేసి పర్యాటకాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వీటిలో భాగంగా వైల్డ్లైఫ్, ఎకో టూరిజంకు అధిక ప్రాధాన్యతనిచ్చి కొత్త ఊపును ఇచ్చేందుకు అవసరమైన కార్యాచరణను అమలుచేస్తోంది. భారత్లోని అడవులు, వివిధ రకాల వన్యప్రాణులు, జంతుజాలం, ప్రత్యేకమైన వృక్షాలు, జలపాతాలు, సెలయేళ్లు, సరస్సులు, ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన వివిధ ప్రాంతాలను పర్యాటకానికి ఉపయోగించుకునేందుకు నడుం బిగించింది. దేశంలోని మొత్తం 981 రక్షిత ప్రాంతాలు, 566 వైల్డ్లైఫ్ శాంక్చురీలు, 104 నేషనల్ పార్కులు, 214 కమ్యూనిటీ రిజర్వ్లు, 97 కన్జర్వేషన్ రిజర్వ్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో తమదైన ప్రత్యేకతలతో కూడుకున్న ప్రదేశాలు, ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి ఆయా రాష్ట్రాలు, పర్యాటకంతో ముడిపడి ఉన్న శాఖలు, రంగాలు, ఏజెన్సీలు, టూర్ ఆపరేటర్లతో కలిసి కేంద్ర పర్యాటకశాఖ వినూత్న చర్యలు చేపడుతున్నట్టు ఆ శాఖ డైరెక్టర్ జనరల్, ఐటీడీసీ సీఎండీ గంజి కమలవర్ధన్రావు సాక్షి ఇంటర్వ్యూలో వెల్లడించారు. వివిధ రాష్ట్రాలు, ఏజెన్సీలతో కేంద్రం సమన్వయం.. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు, వాటిలోని పర్యాటక శాఖలు, టూరిజంతో మమేకమైన సంస్థలు, ఏజెన్సీలు, ఆపరేటర్లు, ఇతర భాగసామ్యపక్షాలను భాగంచేసి పర్యాటకాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కమలవర్ధన్రావు వెల్లడించారు. కేంద్రస్థాయిలో టూరిజం శాఖలోనే వివిధ కమిటీల భాగస్వామ్యం, వివిధ మంత్రిత్వశాఖల కమిటీల్లో అటవీ, పర్యావరణ, విమానయాన, రోడ్లు, రైల్వే తదితర శాఖలు కలిసి వైల్డ్లైఫ్ టూరిజానికి ఊతమిచ్చే చర్యలపై దృష్టి నిలుపుతున్నామని, టూరిస్ట్లకు స్పెషల్ ప్యాకేజీలు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో అటవీశాఖల పరంగా సఫారీలు, శాంక్చురీల్లో డీఎఫ్వోల సహకారం, రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాములను చేయడం ద్వారా వైల్డ్లైఫ్, ఎకో, అడ్వెంచర్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఇటీవల 8 ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక, సాంస్కృతికరంగాల అభివృద్ధి ప్రత్యేక సదస్సును నిర్వహించామని, అదేవిధంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పర్యాటకాభివృద్ధికి సంబంధించి ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, అటవీ–పర్యావరణశాఖలు తమ త మ టూరిస్ట్ ప్యాకేజీలు సిద్ధం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని, ఈ విషయంలో రాష్ట్రాలతో, అటవీ, సంబంధిత శాఖలను సమన్వయపరిచే చర్యలు తీసుకుంటున్నామని కమలవర్ధన్రావు తెలిపారు. అటవీ అనుభవానికి భారత్ను మించింది లేదు.. ‘ప్రపంచ వైల్డ్లైఫ్ టూరిజం అనగానే మసైమారా, సౌతాఫ్రికా, కెన్యా తదితర దేశాలు గుర్తుకు వస్తున్నాయి. ఎక్కువ జంతువులను దగ్గర నుంచి చూసే అవకాశం, మౌలిక వసతులు, ప్యాకేజీల కారణంగా ఆ ప్రదేశాలు ఎంచుకుంటామని టూరిస్ట్లు చెబుతుంటారు. మనదేశం విషయానికొస్తే గుజరాత్లోని గిర్ ఫారెస్ట్ సింహాలకు పెట్టింది పేరు. రంతంబోర్ ఫారెస్ట్, కన్హా నేషనల్ పార్కు, తదితరాలు ప్రపంచ స్థాయిలోనూ బాగా గుర్తింపు పొందాయి. విదేశాల్లో కేవలం జంతువులు చూసి వెనక్కు తిరగాల్సి ఉంటుంది. మనదగ్గర మాత్రం అద్భుతమైన అడవి, జీవవైవిధ్యం, రకరకాల జంతువులు, పచ్చదనం, జలపాతాలు, తదితరాలను చూసే అవకాశం కలుగుతుంది. ఈ విధంగా అడవిలోకి వెళ్లిన ఒక అరుదైన అనుభవం పొందే వీలు, ప్రత్యేకత మనదగ్గరే ఉంది. వీటన్నింటిని ఉపయోగించుకుని పర్యాటకానికి ఊపునిచ్చే దిశలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నాం. కేవలం జంతువులు చూడాలంటే జూకు వెళితే సరిపోతుంది. అడవిని చూశామన్న అనుభూతి లభించాలంటే భారత్కు మించిన ప్రదేశం లేదని మేము గట్టిగా నమ్ముతున్నాం’అని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా కాలంలోనూ సానుకూలంశాలివే ‘కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతుండడంతో మనదేశంలోని వన్యప్రాణులు, వైవిధ్యభరితమైన అటవీ అందాలు, జీవవైవిధ్యం, సహజసిద్ధ ఆవాసాల్లో సింహాలు, పులులు, ఇతర రకరకాల జంతువులు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విదేశాలకు స్వేచ్ఛగా వెళ్లి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో దేశీయంగానూ టూరిస్ట్లు, ముఖ్యంగా మనదేశంలోని యువత వైల్డ్లైఫ్, ఎకో, అడ్వెంచర్ టూరిజం పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఎక్కువగా జనాలతో కిక్కిరిసిన ప్రాంతాలకు కాకుండా ప్రకృతి ఒడిలో సహజసిద్ధంగా ఉన్న ప్రదేశాలు, అడవుల్లోని జంతువులను చూసేందుకు పర్యాటకులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. అందువల్ల ఇప్పుడు లేహ్, లడాఖ్, శ్రీనగర్, గోవా, ఈశాన్య రాష్ట్రాలు తదితరాల్లో వైల్డ్లైఫ్ శాంక్చురీల సందర్శనకు ప్రాధాన్యతనిస్తున్నారు. కరోనా తర్వాత పర్యాటకానికి సంబంధించి ఇదొక సానుకూలాంశం’అని కమలవర్ధన్రావు వెల్లడించారు. చదవండి: Sumukhi Suresh: 30 వేల జీతం.. జీవితం బాగానే సాగేది.. కానీ నవ్వించడంలో.. -
ప్రపంచంలోనే ఖరీదైన పెంపుడు జంతువులు ఇవే
జంతువులను పెంచుకోవడం చాలా మందికి ఇష్టం. కొందరు శునకాల్ని, మరి కొందరు మార్జాలాలను, ఇంకొందరు పక్షులను.. ఇలా రకరకాల ప్రాణులను తమ ఇండ్లలో పెంచుకుంటారు. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటికి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. వాటి కోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా సిద్ధ పడతారు. ప్రపంచంలోనే ఖరీదైన కొన్ని పెంపుడు జంతువులను ఇక్కడ చూద్దాం.. – ఏపీ సెంట్రల్ డెస్క్ గ్రీన్ మంకీ – థ్రోగ్బ్రెడ్ రేస్ హార్స్.. రూ.117 కోట్లు అత్యంత ఖరీదైన పెంపుడు జంతువుగా అమెరికాకు చెందిన మగ రేసు గుర్రం గ్రీన్ మంకీ నిలుస్తుంది. తొలి రేసులోనే అత్యంత వేగంగా పరుగుపెట్టి ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక మైలు దూరాన్ని కేవలం 10 సెకండ్లలోనే అధిగమించింది. కాబట్టి దీనికి అంత రేటు. దీని వీర్యం కూడా ఖరీదైనది కావడంతో ఈక్వెస్ట్రియన్ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని పొందింది. అందువల్ల దీనిని పోటీ పడి కొన్నారు. సర్ లాన్స్లాట్ ఎన్కోర్ – లాబ్రడార్..117 కోట్లు లాబ్రడార్ శునకానికి అంత ఖరీదు ఎందుకు అనిపించవచ్చు. అయితే ఇదొక అద్భుతమైన కుక్క. అందుకే దీనికి అంత రేటు. ఏంటా అద్భుతం అంటే.. ఇది పూర్తిగా క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ప్రపంచంలోనే విజయవంతంగా జన్మించిన శునకం. అందువల్లే దీనికి అంత రేటు అన్నమాట. మిస్ మిసీ – ఆవు రూ. 8.82 కోట్లు ఆవు ఇంత ఖరీదా... అని మనం నోరెళ్లబెట్టవచ్చు. అయినా.. ఈ హోలిస్టీన్ ఆవు ప్రత్యేకతలు అలాంటివి మరి. ఆవుల పోటీల్లో పలు అవార్డులు పొందడంతో దీనికి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అంతేగాక సాధారణ ఆవుల కంటే కనీసం 50 శాతం ఎక్కువగా పాలిస్తుంది. రెడ్ ప్యూర్ బ్రీడ్ టిబెటిన్ మాస్టిఫ్... 4.28 కోట్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జాతి శునకం ఇది. ఈ జాతి అత్యంత అరుదైనది కావడంతోనే దీనికి ఆ రేటు. ముందు నుంచి చూస్తే అచ్చం సింహం ఆకారంలో ఉంటుంది. మనుషులతో స్నేహ పూర్వకంగా మెలుగుతాయి. ఇప్పుడు వీటిని ఇతర శునకాలతో క్రాస్ బ్రీడ్ చేస్తున్నారు. ఒరిజినల్ బ్రీడ్ మాత్రం అత్యంత ఖరీదైనదే. తెల్ల సింహం కూన రూ. 1.03 కోట్లు ఈ తెల్ల సింహం పిల్లలను చూస్తే భలే ముద్దొస్తున్నాయి కదా! వీటిని పెంచుకుందామని అనుకుంటే మాత్రం చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక్క కూనను విడిగా అమ్మరు కాబట్టి.. రెండు కూనలను కొన్నాల్సి వస్తుంది. అంటే రూ. 2.06 కోట్లు పెట్టాల్సిందే. సింహాల్లో అత్యంత అరుదైన రంగు కాబట్టి వీటికి ఆ రేటు. కొన్ని దేశాల్లో వీటిని పెంచుకోవడానికి అనుమతి ఉంది. అరేబియన్ గుర్రం రూ. 70 లక్షలు గుర్రాల్లో అరేబియన్ జాతికి ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా పురాతనమైన జాతిగా దీనికి పేరుంది. సుదీర్ఘమైన ప్రయాణాలకు, ఈక్వెస్ట్రియన్ క్రీడలకు అనువైనవి. మనుషులతో ఎంతో ప్రేమగా, అప్యాయతగా ఉంటాయి. కొంచెం ఖర్చు ఎక్కువైనా.. మంచి పెట్టుబడిగా దీనిని పెంచుకునే వాళ్లు భావిస్తారు. చింపాంజీ రూ. 44.14 లక్షలు మనుషుల తర్వాత తెలివైన జీవులుగా చింపాంజీలకు పేరుంది. ఈ తెలివైన జీవులు మనుషులకు బాగా మచ్చిక అవుతాయి. యజమానులతో ఆటలు ఆడతాయి. నవ్విస్తాయి. కవ్విస్తాయి. వీటిలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. ఒకటి బొనోబో, రెండోది సాధారణ చింపాజీ. చాలా దేశాల్లో వీటిని పెంచుకోవడానికి అనుమతి ఉంది. అయితే వీటి రోజు వారీ ఖర్చు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. లావెండర్ అల్బినో బాల్ పైథాన్ రూ. 30 లక్షలు పామును పెంచుకోవడం అంటే అయ్యబాబాయ్ అంటాం. అలాంటిది ఓ కొండచిలువ (పైథాన్)ను పెంచుకోవడమా.. అని అనిపిస్తుంది. కొంతమందికి పాముల్ని పెంచడం కూడా ఓ హాబీ. లావెండర్ అల్బినో బాల్ పైథాన్ ఆఫ్రికా ఖండానికి చెందిన చిన్న సైజు కొండచిలువ. ఈ కొండచిలువ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అందుకే పెంచుకుంటారు. సవానా పిల్లి రూ. 15 లక్షలు సాధారణ పెంపుడు పిల్లికి, ఆఫ్రికా సెర్వల్ జాతి పిల్లికి పుట్టినది ఈ పిల్లి. సాధారణ పెంపుడు పిల్లి కన్నా కొంచెం ఎత్తుగా, నాజూగ్గా ఉంటుంది. మనుషులతో చాలా స్నేహపూర్వకంగా మెలుగుతాయి. సరదాగా ఉంటాయి. ఇతర పిల్లుల్లా కాకుండా నీటిలో ఆడుకోవడం అంటే వీటికి భలే సరదా. ఎవరూ తోడు లేకపోయినా స్వతంత్రంగా ఆడుకోవడం ఈ పెంపుడు పిల్లులకు అలవాటు. గుర్రాల్లో అరేబియన్ జాతికి ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా పురాతనమైన జాతిగా దీనికి పేరుంది. సుదీర్ఘమైన ప్రయాణాలకు, ఈక్వెస్ట్రియన్ క్రీడలకు అనువైనవి. మనుషులతో ఎంతో ప్రేమగా, అప్యాయతగా ఉంటాయి. కొంచెం ఖర్చు ఎక్కువైనా.. మంచి పెట్టుబడిగా దీనిని పెంచుకునే వాళ్లు భావిస్తారు. హ్యాసింత్ మకావ్ రూ. 10 లక్షలు రామచిలుక జాతుల్లో ఇదో పెద్ద జాతి. నీలం రంగుతో భలే చూడ ముచ్చటగా ఉంటుంది. దీనిని కొనడమే కాదు.. పెంచడం కూడా ఖర్చుతో కూడుకున్నదే. ఈ తెలివైన పక్షులకు మంచి నాణ్యమైన ఆహారం అందించాల్సి ఉంటుంది. దీనికి సౌకర్యవంతమైన గూడు ఏర్పాటు చేయాలి. ఖర్చును తట్టుకుంటే ఇదో మంచి పెంపుడు పక్షిలా ఉంటుంది. సులువుగా దీనికి తర్ఫీదు ఇవ్వవచ్చు. యజమానులతో చాలా ప్రేమగా ఉంటుంది. -
పాలగుమ్మిలో అరుదైన నీటికుక్కల సందడి
అమలాపురం రూరల్: గోదావరిలో ఎంతో అరుదుగా కనిపించే నీటికుక్కలు శుక్రవారం మధ్యాహ్నం పాలగుమ్మి పంట కాలువలో జలకాలాడుతూ వాహనచోదకుల కంట పడ్డాయి. తొలుత అటుగా వెళ్తున్న గ్రామస్తులు, వాహనచోదకులు వాటిని పెద్ద పాములుగా భావించారు. కొందరు నీటికుక్కలని చెప్పారు. ఇటీవల గోదావరి వరదల్లో వచ్చిన నీటికుక్కలు కాలువలోకి కొట్టుకొచ్చినట్లు అమలాపురం పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు ఎల్.విజయ్రెడ్డి చెప్పారు. ఇవి ఇక్కడ సంచరించడం చాలా అరుదని, ఎక్కువగా నదీ ప్రాంతాల్లో కనిపిస్తాయని అన్నారు. ఇవీ చదవండి: చిల్లర వేషాలు, చీకటి లీలలు.. అబ్బో మనోడు మామూలోడు కాదుగా అధికారులపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు నోటి దురుసు -
ఇండియాలో ఈ జంతువుల్ని పెంచుకోవటం నేరం
న్యూఢిల్లీ : వన్య ప్రాణి సంరక్షణా చట్టం అమల్లోకి వచ్చి నేటితో 49 ఏళ్లు. ఆగస్టు 21, 1972న ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అడవి మొక్కలు, జంతువులు, పక్షులను వేటాడటం, హింసించటం, గాయపరచటం, నాశనం చేయటం, వాటి శరీరభాగాలను తీసుకోవటం ఈ చట్ట ప్రకారం నేరం. సరిసృపాలు, పక్షుల గూళ్లను కదల్చటం, నాశనం చేయటం శిక్షార్హం. ఈ చట్టం ప్రకారం ఏ రాష్ట్రమైనా వన్యప్రాణి సంస్థ అనుమతి లేకుండా పార్కులు, వన్యప్రాణి కేంద్రాలకు సంబంధించి హద్దులను మార్చకూడదు. ఈ చట్టం ప్రకారం పులులు, సింహాల వంటి క్రూరమైన జంతువులే కాక మరికొన్ని సాధు జంతువులను పెంచుకోవటం కూడా చట్టవిరుద్ధం.. 1) కొన్ని రకాల తాబేళ్లు : మామూలుగా తాబేళ్లను పెంచుకోవటం నేరంకాదు. కానీ, ఇండియన్ స్టార్, రెడ్ ఇయర్ స్లైడర్ వంటి తాబేలు రకాలను కలిగి ఉండటం చట్ట విరుద్ధం. 2) సముద్రపు జంతువులు : సముద్రపు జంతువులను వాటి నివాస స్థావరాలనుంచి బయటకు తేవటం, అక్వేరియం, నీటి పాత్రలో పెంచటం నిషిద్ధం. 3) పక్షులు : వన్య ప్రాణి సంరక్షణా చట్టం 1972 ప్రకారం ప్యారకీట్స్(చిలుకల్లో ఓరకం), నెమళ్లు, కోయిలలు, మునియా వంటి వాటిని పెంచటం చట్ట విరుద్ధం. 4) కోతులు : వినోదం కోసం కోతులను పెంచుకోవటం, వాటికి శిక్షణ ఇవ్వటం వన్య ప్రాణి సంరక్షణా చట్టం 1972 ప్రకారం నేరం. చదవండి : చిరుత నోట్లో బాబి కాలు.. బసంతి షాక్.. -
తాలిబన్ల పైశాచికత్వం: ఇకపై పశు వ్యభిచారం
ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకుండానే అఫ్గనిస్థాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. అధికారం చేపట్టకున్నా దమనకాండను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో మహిళల హక్కులకు భంగం కలిగించమంటూ ప్రకటిస్తూనే.. అణచివేత ధోరణిని మొదలుపెట్టారు. తాజాగా కాబూల్లోని డజన్లకొద్దీ వేశ్య గృహాలను దగ్గరుండి మరీ ఖాళీ చేయించిన తాలిబన్లు.. ఆ స్థానంలో జంతువుల్ని ఉంచారు. దీంతో జంతు పరిరక్షణ సంఘాలు మండిపడుతున్నాయి. ఒంటెలు, గొర్రెలు, కుక్కలు.. ప్రస్తుతం కాబూల్లోని పాతిక వేశ్యగృహాల్లో ఇవే కనిపిస్తున్నాయి. 1990 సమయంలో తమ పాలనలో వేశ్య వృత్తిని తాలిబన్లు అణిచివేశారు. బదులుగా లైంగిక వాంఛల్ని తీర్చుకోవడానికి జంతువుల్ని వేశ్య గృహాల్లో ఉంచేవాళ్లు. వాళ్ల దృష్టిలో వేశ్య వృత్తిలో మహిళలు కొనసాగడానికి వీల్లేదు. జంతువులతో శృంగారంలో పాల్గొనేందుకు మాత్రం తాలిబన్లు అనుమతి ఇస్తారు. చదవండి: అఫ్గన్ సంక్షోభం-హెల్ప్లైన్ నంబర్లు ప్రకటించిన భారత ప్రభుత్వం అఫ్గన్లో అమెరికా సైన్యాల మోహరింపు, ప్రభుత్వ పాలన సమయంలో మహిళలు స్వేచ్ఛగా జీవించారు. చట్టవిరుద్ధం-కఠిన శిక్షలు అమలులో ఉన్నప్పటికీ.. వేలమంది అఫ్గన్లు వేశ్య వృత్తిలో కొనసాగారు. కాబూల్, మజర్ ఏ షరీఫ్, హెరత్, జలాలాబాద్, జోవ్జాన్ ప్రావిన్స్లో కార్యకలాపాలు ఇంతకాలం యదేఛ్చగా సాగాయి. కొన్ని చోట్ల పిల్లలను సెక్స్ బానిసలుగా మార్చేశారు కూడా. అయితే తాలిబన్లు మాత్రం వేశ్య వృత్తిని.. ఇస్లాం వ్యతిరేక వ్యాపారాల్లో ఒకటిగా భావిస్తుంటారు. బదులుగా జంతువులతో పాల్గొని ఒత్తిడి తీర్చుకోవాలంటూ తమ గ్రూపులకు సలహా ఇస్తుంటారు కూడా. చదవండి: పదేళ్లు మగాడి వేషంలో.. ఇదిలా ఉంటే ఈ పరిణామాలపై మానవ హక్కుల సంఘం రీజినల్ డైరెక్టర్ మార్గరేట్ స్మిత్ తీవ్రంగా స్పందించారు. ‘‘కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు ఉంది తాలిబన్ల తీరు. జంతువుల కంటే హీనంగా ఆడవాళ్లను అణిచివేస్తున్నారంటూ తాలిబన్లపై ఆమె మండిపడ్డారు. ‘‘వాళ్ల(తాలిబన్ల) దృష్టిలో ఆడవాళ్లంటే పిల్లలు కనే యంత్రాలు. మూగజీవాల్ని లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటారు. చూస్తుంటే.. ఆడవాళ్ల కంటే మూగ జీవాలకే వాళ్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఉంది’’ అంటూ సెటైర్లు పేల్చారు ఆమె. చదవండి: షరియా.. ఉల్లంఘిస్తే ఉరే! -
త్వరలో పశువుల కోసం అంబులెన్స్లు: కేంద్రం
న్యూఢిల్లీ: త్వరలో పశువుల కోసం అంబులెన్స్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆయుష్ మిషన్ కార్యకలాపాలు 2025 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంటు వాటి కోసం రూ.4,607 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించింది. ఈ క్రమంలో ఆరు ఆయుష్ కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు ఆయుష్ డిస్పెన్సరీలను అప్గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం పశుసంవర్థక, పాడి పథకాలకు రూ.54,618 కోట్లు కేటాయించింది. -
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న పులులు, సింహాలు..
వాషింగ్టన్ : నేడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా వైరస్నుంచి రక్షణ పొందటానికి వ్యాక్సిన్ వేయించుకోవటం తప్పని సరైంది. దేశాలు, రాష్ట్రాలు ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లను అందిస్తున్నాయి. అయితే ప్రజలకు వ్యాక్సిన్ వేసే పక్రియ చాలా దేశాల్లో ఇంకా పూర్తికాలేదు. కొన్ని దేశాల్లో నత్తనడకన సాగుతోంది. ఇందుకు ప్రభుత్వాల వైఫల్యం ఓ కారణమైతే.. ప్రజల భయం మరో కారణం. కొంతమంది వ్యాక్సిన్ వేయించుకోవటానికి భయపడుతున్నారు. కానీ, అమెరికాలోని ఓ జూలోని జంతువులు వాలంటీర్గా వ్యాక్సిన్ వేయించుకుంటున్నాయి. వ్యాక్సిన్ వేసే వాళ్లకు ఇబ్బంది కలిగించకుండా సహకరిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. అమెరికా.. కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా జూలోని జంతువులకు ఈ మధ్యే ఓ ప్రయోగాత్మక వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. గత వారం జూలోని జింజర్, మోలీ అనే పులులకు వ్యాక్సిన్ వేశారు. జూ అధికారి అలెక్స్ హెర్మన్ దీనిపై మాట్లాడుతూ.. ‘‘ జూలోని ఏ జంతువుకు కరోనా సోకలేదు. కానీ, వాటికి రక్షణ కల్పించటం ముఖ్యం. పులులు, ఎలుగు బంట్లు, పర్వత సింహాలు, ఫెర్రెట్స్కు మొదటి డోస్ వేశాము. ఆ తర్వాత కోతులకు, పందులకు మొదటి డోస్ వేస్తాము. ఈ వ్యాక్సిన్ను న్యూజెర్సీలోని వెటర్నరీ ఫార్మాసూటికల్స్ కంపెనీ ‘జొయోటిస్’ తయారు చేసి ఇచ్చింది’’అని పేర్కొన్నాడు. -
మూగజీవాలకు పెళ్లి విందు, రూ.65వేలతో ఏర్పాటు
నెల్లూరు:మనదేశంలో పెళ్లిళ్లు భారీ ఎత్తున, హంగు ఆర్భాటాలతో అంగరంగ వైభవంగా జరుగుతాయి.కానీ కరోనా కారణంగా కాబోయే నూతన వధువరులు పెళ్లి ఖర్చులు తగ్గించుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో బాధితులకు, మూగ జీవాలకు అండగా నిలుస్తున్నారు. అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా మానవాళి మనుగడ ప్రశ్నర్థకంగా మార్చింది. ఈ సమయంలో పలువురు దాతలు... పేదలు, కార్మికులు, నిర్వాసితులకు పెద్ద ఎత్తున సహాయం అందిస్తున్నారు.ఈ క్లిష్ట సమయంలో మూగ జీవాల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. ఆహారం కోసం అల్లాడిపోతున్నాయి. సరైన తిండి, తాగునీరు దొరక్క అలమటించిపోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో నూతన వధువరులు తమ పెళ్లి సందర్భంగా మూగ జీవాలకు పెళ్లి విందును ఏర్పాటు చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నార్త్ ఇండియాకు చెందిన ఓ కుటుంబం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో నివాసం ఉంటుంది. అయితే కుటుంబంలో నిఖిల్ - రక్షల వివాహం జరిగింది. ఈ సందర్భంగా నూతన వధువరులు జిల్లాకు చెందిన జంతు సంరక్షణ శాలలో మూగ జీవాలకు రూ.60వేలతో పెళ్లి విందును ఏర్పాటు చేశారు. జంతు సంరక్షణశాలలో ఉన్న గోవులు, వానరం, కోళ్లు, కుందేళ్లు ఇలా అన్నీ మూగ జీవాలకు ఆహారాన్ని అందించారు. మూగజీవాలపై ప్రేమను చాటుకున్నారు. A marriage held at a GOSHALA in Nellore, Andhra by a North Indian fmly at a total cost of just Rs. 65,000 feeding only animals n inmates pic.twitter.com/O2B7cYhzoN — S K Raman 🇮🇳 (@S_K_Raman) June 5, 2021 -
ప్రపంచంలోనే తొలిసారి: జంతువులకు వ్యాక్సిన్
మాస్కో: మహమ్మారి కరోనా వైరస్ రాకుండా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రపంచ దేశాల్లో ముమ్మరంగా సాగుతోంది. అయితే ఇన్నాళ్లు మానవులకు వేస్తుండగా ఇప్పుడు జంతువులకు వేయడం ప్రారంభించారు. ప్రపంచంలోనే తొలిసారి రష్యాలో జంతువులకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ గురువారం రష్యా ప్రారంభించింది. రష్యా వెటర్నరీ విభాగం 17 వేల డోసులతో జంతువులకు వ్యాక్సిన్ వేయడం మొదలుపెట్టింది. జంతువుల కోసం రూపొందించిన వ్యాక్సిన్ ‘కార్నివాక్ కోవ్’. ఈ టీకా జంతువులకు ఆరు నెలల వరకు రక్షణ ఉంటుందని ఆ దేశ వెటర్నరీ విభాగం తెలిపింది. పై వ్యాక్సిన్ కుక్కలు, పిల్లులు, నక్కలపై ప్రయోగించగా సత్ఫలితాలు వచ్చాయి. దీంతో జంతువులకు వ్యాక్సిన్ను రష్యా ప్రారంభించింది. ప్రస్తుతం జంతువుల వ్యాక్సిన్కు కూడా భారీగా డిమాండ్ ఉంది. అయితే ఆ దేశంలో ఉత్పత్తి సామర్థ్యం 30 లక్షలు ఉండగా 50 లక్షలకు పెంచుతామని ఆ వెటర్నరీ అధికారులు వెల్లడించారు. పిల్లికి వ్యాక్సిన్ వేస్తున్న వైద్య సిబ్బంది -
సెకండ్ వేవ్ ముగిసిందనుకోవద్దు..
సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ ముగింపు దశకు వచ్చిందా? గత 4 రోజులుగా కేసుల్లో తగ్గుదల నమోదవుతుండటాన్ని చూస్తే.. అలాగే అనిపించవచ్చు కానీ.. ఈ విషయంలో అంత తొందర వద్దంటున్నారు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) గౌరవ సలహాదారు డాక్టర్ రాకేశ్ మిశ్రా. వారం రోజుల సగటులో కేసుల తగ్గుదల ఉంటేనే వ్యా ధి తగ్గుముఖం పడుతున్నట్లు భావించాలని ఆ యన ‘సాక్షి’తో మాట్లాడుతూ వివరించారు. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4 రోజులుగా తగ్గు తూ వస్తోంది. రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్న దశ నుంచి 2.6 లక్షల స్థాయికి కేసులు తగ్గాయి. కానీ దీని ఆధారంగా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిందన్న అంచనాకు రావడం సరికా దని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తం గా కరోనా నిర్ధారణ పరీక్షలు గరిష్ట స్థాయిలో జరుగుతున్నా అత్యధికం నగర ప్రాంతాలకే పరిమితమయ్యాయన్నా రు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో తప్పులు, మరికొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసు కుంటే సెకండ్ వేవ్ తగ్గిందా.. లేదా అన్నది తెలిసేందుకు ఇంకో వారం పట్టొచ్చన్నారు. గ్రామా ల్లో పరీక్షలు, నిఘా మరింత పెంచాలని, తద్వా రా వ్యాధి మరోసారి ప్రమాదకరంగా మారకుం డా చూడొచ్చని సూచించారు. జన్యుక్రమ నమోదు కొనసాగుతోంది.. దేశంలో వైరస్ రూపాంతరితాలను గుర్తించేందు కు వాటి జన్యుక్రమాలను గుర్తించే ప్రక్రియ కొన సాగుతోందని రాకేశ్ మిశ్రా తెలిపారు. ‘ఈ ఏడా ది జనవరిలో దాదాపు 6 వేల వైరస్ జన్యుక్రమాలను విశ్లేషించాం. ఇప్పటివరకు దేశంలో దాదా పు 7,500 రూపాంతరితాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలకు ఇప్పటికే తెలుసు’ అని వివరించారు. ‘ఈ రూపాంతరితాల్లో కొన్నింటితో మాత్రమే ప్రమా ద తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి యూకే వేరియంట్ దేశంలో ఎక్కువగా వ్యాపిస్తోంది. కొత్తగా గుర్తించిన రూపాంతరితాల్లో ఆందోళన కలిగించేవి ఏవీ లేవు’ అని తెలిపారు. వ్యాక్సిన్లు పని చేస్తాయి: ‘కరోనా వైరస్ జన్యుమార్పులకు గురవుతున్నా ఇప్పటివరకు అభివృ ద్ధి చేసిన టీకాలు వాటిని సమర్థంగా అడ్డుకుంటున్నాయి. యాంటీబాడీలు తక్కువున్నంత మా త్రాన టీకా పనిచేయట్లేదని కాదు. వైరస్ను అడ్డుకునేందుకు కావాల్సినన్ని యాంటీబాడీలు ఉత్ప త్తి అయితే చాల’ని రాకేశ్మిశ్రా వివరించారు. జంతుజాలంపై నిఘా: కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకిన నేపథ్యంలో భ విష్యత్తులో ఇలాంటి విపత్తులను నివారించేందు కు జంతుజాలంపై నిఘా కొనసాగాలని రాకేశ్ మిశ్రా తెలిపారు. కరోనా కుటుంబంలో 32 వైరస్లున్నా.. మనిషికి ఏడింటి గురించే తెలుసని, ఎప్పుడు ఏ వైరస్ మనుషులకు ప్రబలుతుందో తెలుసుకునేందుకు అటవీ జంతువులను పరిశీలిస్తూనే ఉండాలని ఆయన పేర్కొన్నారు. 2–డీజీతో మేలే.. కరోనా చికిత్స కోసం భారత రక్షణ ప రిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) త యారు చేసిన 2–డీజీపై సీసీఎంబీలో పరీక్ష లు జరిగాయని, ఇది సమర్థంగా పనిచేస్తుం దని స్పష్టమైందని రాకేశ్ మిశ్రా తెలిపారు. డీఆర్డీవో అనుబంధ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఇన్మాస్) అభివృద్ధి చేసిన ఈ మందుతో ఆక్సిజన్ అవసరం తగ్గిపోవడ మే కాకుండా.. ఆస్పత్రిలో ఉండాల్సిన స మయం తగ్గుతుందని చెప్పారు. ఈ మం దును ఇప్పటికే పలు ప్రాంతాల్లో వినియోగి స్తున్నారని.. ఫలితాలేమిటన్నది మరికొన్ని రోజుల్లో స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. -
మూగజీవాలను హింసిస్తున్న వ్యక్తి
-
ఈ టాగ్తో నోరులేని జీవాలు సేఫ్!
ప్రస్తుతమున్న బిజీ లైఫ్లో ముందుకు దూసుకుపోవడమేగానీ.. పక్కవారిని పట్టించుకునే తీరికలేదు. రోడ్డుమీద డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు వెనకాముందు చూసుకోకుండా ఎదురుగా వస్తున్న వాహనాలు, నోరులేని జంతువులనూ గుద్దేస్తున్నారు. రోడ్డెక్కిన మనిషికే సేఫ్టిలేని ఈరోజుల్లో.. మూగ జీవాల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రమంగా అడవులు కనుమరుగవుతుండడంతో కాంక్రీట్ జంగిల్ల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న మూగ జీవాల పరిస్థితిని అర్థం చేసుకున్న.. చైతన్య గుండ్లూరి.. వినూత్న ఐడియాతో వాటికి రక్షణ కల్పిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన చైతన్య మూగజీవాల పరిరక్షణకు ఏకంగా ఓ ఎన్జీవోని స్థాపించారు. వేగంగా దూసుకుపోయే వాహనాల మధ్య నలిగి ప్రాణాలు కోల్పోతున్న కుక్కలకు ఫ్లోరోసెంట్ ట్యాగ్లు, బెల్టులు అమర్చి కాపాడుతున్నారు. చైతన్య మాట్లాడుతూ..‘‘ నా పనిలో భాగంగా నేను ఎక్కువ సమయం ప్రయాణాలు చేస్తూ ఉంటాను. ఆ సమయంలో పలుమార్లు వేగంగా దూసుకుపోతున్న వాహనాల కింద పడి జంతువులు చనిపోవడం చూసేవాడిని. అంతేగాకుండా నాకెంతో ఇష్టమైన నా బెస్ట్ ఫ్రెండ్ ఒక కుక్కను తప్పించబోయి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈ సంఘటన నన్ను ఎంతో కలిచి వేసింది. దీంతో రోడ్డు మీద తిరిగే కుక్కలు వాహనాలకు అడ్డుపడకుండా, ఇంకా అవి బిక్కుబిక్కుమంటూ తిరగకుండా ఉండేందుకు ఏదైనా చేయాలనుకున్నాను. ఇందులో భాగంగానే గతేడాది నవంబర్లో ప్లోరోసెంట్ ట్యాగ్లను కుక్కలు, ఆవులు, గేదెల మెడలో వేయడం ప్రారంభించాం. రాత్రి సమయంల్లో అవి రోడ్ల మీదకు వచ్చినా డ్రైవింగ్ చేసేవారికి క్లియర్గా కనిపిస్తాయి. దీంతో యాక్సిడెంట్లు అవ్వవు. ఫ్లోరోసెంట్ పదార్థంతో తయారైన ఈ ట్యాగ్లపై లైట్ పడగానే మెరుస్తాయి. దీంతో దూరం నుంచే ఎదురుగా జంతువు ఉన్నట్లు గుర్తించి వాహనం స్పీడు తగ్గించి పక్క నుంచి వెళ్లిపోతారు. దీని వల్ల ఇటు మూగజీవాలకు, అటు వాహనదారులకు ఏ ఇబ్బంది ఉండదు’’ అని చైతన్య చెప్పాడు. ప్రస్తుతం చైతన్య ఎన్జీవో ఆరు రాష్ట్రాలో చురుకుగా పనిచేస్తోంది. 36 నగరాల్లో 270 మంది వలంటీర్లు మూగజీవాలను రక్షిస్తున్నారు. రోజుకి దాదాపు 200 కుక్కలకు ట్యాగ్లు వేస్తున్నారు. ఇలా రోజూ జంతువులకు ట్యాగ్లు, ఫ్లోరోసెంట్ బెల్టులు వేయాలంటే భారీసంఖ్యలో అవి అవసరమవుతాయి. అందుకే గ్రామాల్లోని స్మాల్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ గ్రూపులతో వీటిని తయారు చేయిస్తూ.. వారికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. -
నెహ్రూ జూ: చల్లందనమే..చల్లదనమే..!
బహదూర్పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో వేసవి తాపం నుంచి వన్యప్రాణులకు ఉపశమనం కలిగించేందుకు జూ అధికారులు చర్యలు చేపట్టారు. జంతువులు, పక్షులు ఇబ్బంది పడకుండా చల్లదనం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జూపార్కు క్యూరేటర్ వీవీఎల్ సుభద్రా దేవి తెలిపారు. వన్యప్రాణుల ఎన్క్లోజర్ల పైభాగంలో గ్రీన్ పరదాలు, ఎండుగడ్డి, కొబ్బరి పీచును ఏర్పాటు చేసి నీటితో తడిపి చల్లదనాన్ని కల్పిస్తున్నామన్నారు. అన్ని జంతువుల ఆవరణలో స్ప్రింక్లర్లు, చిన్న రెయిన్ గన్స్ ఏర్పాటు చేశారు. తుంగగడ్డిని కొన్ని ఆవరణల పైకప్పుపై ఉంచారు. కోతులు, పులులు, లయన్స్, జాగ్వార్స్, చిరుత పులి జంతువుల ఆవరణలలో 50కి ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారు. రాత్రివేళ యానిమల్ హౌస్లో ఎయిర్ కండిషనర్లు ఏర్పాటు చేశారు. కోతులు, పక్షులు, ఎలుగుబంట్లకు పండ్లను అందజేస్తున్నారు. గ్లూకోన్–డీ, ఎలక్ట్రోరల్ పౌడర్, విటమిన్–సి, సప్లిమెంట్స్, బి–కాంప్లెక్స్ సప్లిమెంట్స్, థర్మోకేర్ లిక్విడ్ నీటిలో కరిగి వేసవి ఒత్తిడిని నివారించడానికి జంతువులు, పక్షులకు ఇస్తారు. -
ఒకరిది ఆకలి వేట..మరొకరిది బతుకు బాట!
జన్నారం: ఈ చిత్రంలో కనిపిస్తున్న రెండు జీవులదీ ఒకటే లక్ష్యం. ఓ జీవిది బతుకుబాట అయితే.. మరో జీవిది ఆకలివేట. జన్నారం అటవీ డివిజన్లో కనిపించిన ఈ దృశ్యాన్ని ఎఫ్డీవో తన కెమెరాలో బంధించారు. దుప్పిని వేటాడేందుకు అడవికుక్క కాచుకుని ఉండగా.. కుక్క నుంచి తప్పించుకు పరుగుతీసేందుకు దుప్పి సిద్ధంగా ఉంది. కాగా, ఒకప్పుడు అటవీలో పచ్చదనంగా ఉంటూ అనేక జంతువులు ఉండేవి. అదే ఇప్పుడు పచ్చదన కరువైంది. దాంతో శాఖాహర జంతువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇక వాటిపైనే ఆధారపడే మాంసాహర జంతువులు కూడా ఈమధ జనావాసాల్లోకి ప్రవేశించి ప్రమాదాల బారిన పడుతొన్నాయి. ఇక, వేసవీ సమీపిస్తొన్న కొలది నీటిజాడ కరువైంది. అందుకే జంతువులన్ని ఆహరం కోసం, నీటి అన్వేషనలో ఒక చోటు నుంచి మరొ చోటుకు వలన పోతున్నాయి. కరీనంనగర్, జన్నారం, అడవీ, జంతువులు, వలసలు చదవండి: అంతా సినీ ఫక్కీ: 20 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు.. -
వినూ... ఇది మా మెనూ
సాక్షి, హైదరాబాద్: మనలో ఒకరికి పిజ్జా ఇష్టం.. మరొకరికి సమోసా ఇష్టం.. ఇంకొకరికి బిరియానీ అంటే ప్రాణం.. ఒక్కొక్కరిదీ ఒక్కో టేస్ట్.. మరి జంతువుల టేస్ట్ ఏంటో మీకు తెలుసా? మన నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోనే బోలెడన్ని జంతువులు ఉంటాయి కదా.. వాటి ఇష్టాయిష్టాలు ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఆలోచిద్దాం.. వాటి టేస్ట్లు ఏమిటో తెలుసుకుందాం? రోజూ ఏం తింటున్నాయో చూసి వద్దాం.. సో చలో జూ... అక్కడా, ఇక్కడా.. ఇలా తేడా! అడవుల్లో స్వేచ్ఛగా పెరిగే జంతువులు, పక్షులకు, ఇక్కడి వాటికి తేడా ఉంటుంది. అక్కడ వాటికి సహజసిద్ధమైన ఆహారం దొరుకుతుంది. అయితే అక్కడ వయస్సు పెరిగి ఒంట్లో సత్తువ తగ్గినప్పుడు ఆకలితో చచ్చిపోతుంటాయి. కానీ, ఇక్కడ బలవర్ధకమైన ఆహారం, అవసరం అయినప్పుడు మందులు ఇవ్వడం వల్ల బయటి జంతువుల కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి. కొన్ని డైలీ.. మరికొన్ని వీక్లీ.. కొన్ని జంతువులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తింటూనే ఉంటాయి. మరికొన్ని ఒక పూట మాత్రమే తింటాయి. ఇక సరీసృపాలు వారానికి ఒక్కసారి మాత్రమే తింటాయి. నిద్ర కూడా ఒక్కో వన్యప్రాణిది ఒక్కో స్టైల్. కొన్ని రాత్రి మెలకువతో ఉంటాయి. పొద్దంతా నిద్రపోతాయి. ఆయా ప్రాణుల ఆహార అవసరాలు, జీవనశైలికి అనుగుణంగా జూ పార్క్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. వన్యప్రాణుల ఆహారం కోసం ప్రత్యేక ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేశారు. పులులు, సింహాలు ఇలా.. పులులు, సింహాలకు ప్రతిరోజు ఏడు కిలోల నుంచి 12 కిలోల వరకు పశువు మాంసం, కాలేయం ఇస్తారు. పులులు, సింహాలు పసందుగా కాలేయం తింటాయి. పశువుల కిడ్నీలు, బ్రెయిన్ కూడా ఇస్తారు. ఇంతేకాదు మరిగించిన అర లీటర్ పాలు కూడా ఇస్తారు. చిరుతకు మూడు కిలోల పశువుల మాంసం, అరలీటరు పాలు ఇస్తారు. రోజుకు ఒకే పరిమాణంలో కాకుండా ఆహారం పెంచుతూ, తగ్గిస్తూ ఉంటారు. ఎలుగుబంటి జూ పార్కులో హిమాలయన్ బ్లాక్, స్లాత్ బేర్ ఎలుగుబంట్లు ఉన్నాయి. వీటికి రకరకాల పండ్లు, చెరకు ముక్కలు, రెండు వందల గ్రాముల తేనె, రెండు కిలోల మైదా జావా, రెండు కిలోల రొట్టెలు, లీటర్ పాలు ఇస్తారు. నీటి ఏనుగు ఒక్కో నీటి ఏనుగుకు 150 కిలోలకుపైగా రోజువారీ ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. 70 కిలోల పచ్చగడ్డి, పశుదాణా 20 కిలోలతోపాటు రకరకాల కూరగాయలను ఆహారంగా ఇస్తారు. దీనికి 3 పూటలా ఆహారం ఇస్తారు. పక్షి జాతులకు పక్షులకు ఇచ్చే ఆహారం పరిమాణం తక్కువగానే ఉంటుంది. విదేశీ పక్షులైన పెలికాన్ పక్షులకు రోజుకు కిలో చేపలు ఇస్తారు. చాలా రకాల పక్షులకు రోజుకు 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు పప్పులు, గింజలు, ధాన్యాలు ఇస్తారు. ఏనుగులు అన్ని జంతువుల్లోకెల్లా భారీగా ఆహారం తినే జంతువు ఏనుగు. దీనికి రోజుకు 250 కిలోలకు తక్కువ కాకుండా ఆహారం అందించాల్సి ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తింటూనే ఉంటుంది. ప్రతిరోజు 150 కిలోల పచ్చగడ్డి, 50 కిలోల పశుదాణా, రాగి జావ, బెల్లం, ఉప్పు, అరటిపళ్ళు, 50 కిలోల చెరకు, కొబ్బరి ఆకులు అందించాల్సి ఉంటుంది. తాబేలు తాబేళ్ల ఆహారం తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. సుమారు 300 ఏళ్ల సుదీర్ఘ జీవితం గడిపే తాబేళ్లు రోజువారీ ఆహారం కేవలం 250 గ్రాములే. క్యాబేజి, క్యారెట్, పాలకూర వంటివి అన్నీ కలుపుకొని కేవలం 250 గ్రాములు మాత్రమే తింటాయి. ఇక నీటి తాబేలు రోజూ 200 గ్రాముల చేపను మాత్రమే తింటుంది. ఇతర జంతువులకు.. తోడేలుకు రెండు కిలోలపశువుల మాంసం ఇవ్వాల్సి ఉంటుంది. నక్కకు కిలో పశువు మాంసం మొసలికి 5 కిలోల చొప్పున పశువు మాంసంతోపాటు పుచ్చకాయలు, పండ్లు, చేపలు ఇస్తారు. దుప్పులు, ఇతర జింక జాతులకు కిలో పశుదాణాతోపాటు పచ్చగడ్డి అవసరాన్ని బట్టి, రెండు కట్టెల తోటకూర, పావుకిలో క్యారెట్, 100 గ్రాముల క్యాబేజీ, కొద్ది మోతాదులో కీరదోస, గుమ్మడి వంటివి పెడతారు. కొండచిలువకు వారానికి ఒక కోడి, ఒక ఎలుక సరిపోతుంది. ఇతర పాములకు వారానికి ఆరు నుంచి ఎనిమిది కప్పలు, ఒకటి లేదా రెండు ఎలుకలు ఒక ఆహారంగా ఇస్తారు. బర్డ్ఫ్లూ నివారణ చర్యల్లో భాగంగా జూలో చికెన్ వినియోగించడం లేదు. దీంతోపాటు పక్షులు సంచరించే ప్రాంతంలో అధికారులు నిఘా పెంచారు. -
నల్లమలలో గుర్తించిన కొత్త జీవరాశులివే..
సాక్షి, పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యంలో జీవ వైవిధ్యంపై శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. సున్నిపెంటలోని బయోడైవర్సిటీ డివిజన్ కార్యాలయం కేంద్రంగా సాగుతున్న జీవవైవిధ్య పరిశోధనలు సత్ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా అంతరించిపోతున్న పులుల సంతతిపై శాస్త్రవేత్తలు దృష్టిసారించడంతోపాటు అరుదైన కొత్త జీవులను సైతం గుర్తిస్తున్నారు. నాగర్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాజెక్టు వేలాది జీవరాశులకు నిలయంగా ఉంది. అటవీశాఖ చేపడుతున్న విప్లవాత్మక చర్యలతో నల్లమలలో గత పదేళ్లుగా వన్యప్రాణుల సంతతి పెరగడమేకాదు దట్టమైన అడవులు విస్తరిస్తున్నాయి. నల్లమలలో ఉన్న జీవజాతులు మరో చోట కనిపించడం అరుదు. నల్లమలలో 55 జాతుల క్షీరదాలు, 200 రకాల పక్షులు, 18 రకాల ఉభయచరాలు, 54 రకాల సరీసృపాలు, 55 జాతుల చేపలు ఉన్నాయి. ఇక వీటికి అదనంగా వివిధ జాతుల కీటకాలెన్నో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ పరిధిలో బయోడైవర్సిటీ ఏర్పాటయ్యాక నల్లమల అటవీ ప్రాంతంలో కొన్ని కొత్తరకం జీవరాశులను కనుగొన్నారు. ఎస్టీఆర్ పరిధిలో ఉండే ల్యాబ్లో వన్యప్రాణులు, సరీసృపాలు, క్షీరదాలు, కీటకాలు, వృక్షజాతుల ఫొటో లైబ్రరినీ ఏర్పాటు చేశారు. 2001 డిసెంబర్లో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీలో ఆయా జాతులకు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరిచారు. నల్లమల అభయారణ్యంలో శాస్త్రవేత్తలు కనుగొన్న గద్ద 2014–15లో నల్లమల అభయారణ్యంలో కనుగొన్న జీవరాసులను పరిశీలిస్తే.. మెటోక్రొమాస్టిస్ నైగ్రోఫి యొరేటో, మారస్ శ్రీశైల యెన్సిస్(సాలీడు), నాగార్జునసాగర్ రేజర్(పాము), స్లెండర్ కోరల్ స్నేక్ (పాము), ఫ్రీనికస్ ఆంధ్రాయెన్సిస్(సాలీడు), పోయిసిలోథీరియా నల్లమలైయెన్సిస్(సాలీడు), సిరాప్టిరస్ లాటిప్స్(కీటకాలు), డారిస్తీన్స్ రోస్ట్రాటస్(గొల్లభామ), శ్రీలంకన్ ఫ్లైయింగ్ స్నేక్, స్యాండ్ స్నేక్, వీటితో పాటు కృష్ణానది జలాల్లో టు స్పాటెడ్బార్బ్ అనే అరుదైన చేపను కూడా కనుగొన్నారు. వర్షాకాలంలోనూ, వరదలు వచ్చే సమయాన మాత్రమే కృష్ణా జలాల్లో కనిపించే నీటిì æపిల్లులపై కూడా పరిశోధన చేస్తున్నారు. ఆ సమయం వాటి సంతానోత్పత్తికి సంబంధించినదిగా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. జింకలకు ప్రసిద్ధి నల్లమలలో వివిధ రకాల జింకలు ఉన్నాయి. జింకల్లో అతి చిన్నది మూషిక జింక. దీనిని బుర్ర జింకగా, మౌస్ డీర్గా అభివరి్ణస్తారు. నల్లమలలో అతి పెద్ద జింక కణితి. దీనిని సాంబార్ డీర్గా పిలుస్తారు. కొమ్మలుగా విస్తరించిన భారీ కొమ్ములతో ఉండే కణితులు సుమారు 150 కేజీల బరువు తూగుతాయి. పొడ దుప్పులు.. అందానికి ఇవి ప్రతి రూపాలు. బంగారు వర్ణంలో ఉన్న చర్మంపై నల్లమచ్చలతో ఉండే ఈ జింకలు నల్లమలలో విస్తారంగా ఉన్నాయి. పెద్ద పులి ఆహార మెనూలో ఇవి ప్రధానమైనవి. నిటారు కొమ్ములు కలిగిన జింకల్లో మనిమేగం(నీల్గాయ్) భారీ జంతువు. శ్రీలంకన్ ఫ్లైయింగ్ స్నేక్ పురి తిరిగిన కొమ్ములతో కాల్లలో స్ప్రింగ్లున్నాయా అన్నట్లుగా గెంతుతూ స్వేచ్ఛకు ప్రతిరూపంగా కనిపించే కృష్ణజింకలకూ నల్లమలలో కొదవలేదు. ఉత్తర భారతదేశంలో చౌసింగా పేరుతో పిలుచుకునే కొండ గొర్రె(బార్కింగ్ డీర్) అడవి సాంద్రతను కొలిచే జింకగా చెప్పుకుంటారు. కొండ గొర్రె ఏ అటవీ ప్రాంతంలో కనిపించిందంటే ఆ ప్రాంతంలో అడవి దట్టంగా ఉందని అర్థం. నల్లమల అడవుల్లో లోతట్టు అటవీ ప్రాంతంలో కనిపించే కొండ గొర్రె ఈ మధ్య కాలంలో అటవీ ప్రాంత సరిహద్దుల్లో కూడా దర్శనమివ్వడం విశేషం. జీవ వైవిధ్యంతోనే మానవుల మనుగడ జీవ వైవిధ్యంతోనే మానవుల మనుగడ కొనసాగుతోంది. మనిషి తన ప్రతి అవసరానికి ప్రకృతి మీద ఆధారపడుతున్నాడు. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ప్రకృతిలో ప్రతి జీవరాశి ఒక దాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. వీటిలో ఎక్కడ లోపం కనిపించినా జీవ వైవిధ్యం దెబ్బతిని మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలి. – మందా రమేశ్, సీనియర్ రీసెర్చి అసిస్టెంట్, బయోడైవర్సిటీ సెంటర్ -
తూర్పుగోదావరిలో వింత జంతువు కలకలం..
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని జొన్నాడలో వింత జంతువు కలకలం రేపింది. కొద్దిరోజులుగా ఆ జంతువు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు స్థానికులు సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆ వింత జంతువు పశువులపై దాడిచేసి చంపుతున్నట్లు వారు చెప్తున్నారు. ఆలమూరు మండలం పెనికేరులోని ఓ పాడుబడ్డ బావిలో ఆ వింత జంతువు ఉన్నట్లు రైతులు గుర్తించారు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చదవండి: (షాకిచ్చిన కరెంటు బిల్లు.. నోటమాట రాలేదు..) -
కరోనా.. జంతువులతోనా?
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ సంక్రమణ భవిష్యత్తులో పెను ప్రమాదంగా పరిణమించకుండా నియంత్రించే చర్యలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పూనుకుంటోంది. గత 10 నెలలుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ వ్యాప్తికి మానవాళి ద్వారా కూడా అడ్డుకట్ట వేయలేకపోతున్న పరిస్థితుల్లో జంతువుల ద్వారా భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకారి కాకుండా ఉండేందుకు అధ్యయనాలు ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని జంతుజాతులు కరోనా సంక్రమణకు కారణమవుతున్నాయని పరిశోధనల్లో వెల్లడైన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 500 రకాల జంతుజాతులపై పరిశీలన జరపాలని నిర్ణయించిన డబ్ల్యూహెచ్వో.. ఇందుకోసం రెండు దశల ప్రణాళికలను తయారుచేసింది. ఈ పరిశోధనల్లో 194 సభ్య దేశా లు భాగస్వాములు కావాలని పిలుపునిచి్చంది. చదవండి:(కరోనాపై కథనాలు.. ఐదేళ్ల జైలు) మానవులకు ఎంత ముప్పు? ఇప్పటికే గబ్బిలాలు, పిల్లులు, కుక్కలు, సింహాలు, పులులు, ప్యాంగోలిన్ (అలుగు)లలో కరోనా సారూప్య వైరస్లను అనేక పరిశోధనలు గుర్తించాయి. ముఖ్యంగా గబ్బిలాల్లో మార్చిలో గుర్తించిన ఆర్ ఏటీజీ13, ఆర్ ఎంవై?ఎన్02 జీనోమ్లలో సార్స్ కరోనా వైరస్తో 96.2, 93.3 శాతం సారూప్యత ఉందని నిర్ధారించారు. చైనా, హాంకాంగ్, బెల్జియం దేశాల్లో కుక్కలు, పిల్లుల్లో, అమెరికాలోని ఓ జూలో పులులు, సింహాలకు కూడా ఈ వైరస్ సోకినట్టు తేలింది. అలాగే నెదర్లాండ్స్, డెన్మార్క్, స్పెయిన్ దేశాల్లోని ముంగీస జాతిలో కూడా గుర్తించారు. దీంతో మానవులతో నిత్య సంబంధాలుండే అన్ని రకాల జంతుజాతులపై అధ్యయనానికి రెండు దశల ప్రణాళికను డబ్ల్యూహెచ్వో సిద్ధం చేసింది. ఇప్పటికే వైరస్ను గుర్తించిన వాటితో పాటు చిట్టెలుకలు, పందులు, ముంగీస, చుంచు తదితర జాతులకు చెందిన 500 రకాల జంతువులపై పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆయా జంతుజాతులపై సీరో ప్రివలెన్స్ అధ్యయనాలకు ప్రయత్నాలు ప్రారంభించనుంది. భవిష్యత్ కోసమే.. ఈ జంతువుల ద్వారా ఇతర జంతువులకు సోకడంతో పాటు వైరస్ రిజర్వ్లుగా మారే ప్రమాదముందనే అంచనాతో పాటు, వీటి ద్వారా మనుషులకు వైరస్ సోకే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి.. ఏ జంతువు ఏ స్థాయిలో వైరస్ వ్యాప్తి చేయగలదు.. మానవుల విషయంలో ఈ జంతువుల ద్వారా, భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే కోణంలో స్వల్ప, దీర్ఘకాలిక పరిశోధనలు, సమగ్ర పరిశీలన జరపనుంది. అయితే కోడి, సీమకోడి, బాతుల ద్వారా కరోనా వైరస్ సంక్రమించబోదని మరోసారి డబ్ల్యూహెచ్వో స్పష్టం చేయడం గమనార్హం. -
‘మూగ’నేస్తాలు
సాక్షి, హైదరాబాద్ : 2018 కేరళలో వరదల విల యం.. జనాన్ని కాపాడటంలో అధికార యంత్రాంగం నిమగ్నం.. మరి మూగజీవాల సంగతో?.. అవి వరదలో చిక్కి విలవిల్లాడుతున్నాయని తెలిసి హైదరాబాద్ నుంచి పదిమంది బయల్దేరారు. జేబులు తడుముకుంటే ఓ 90 వేలు పోగయ్యాయి. మరో రూ.30 వేలు విరాళాలుగా పట్టుకుని.. పది హేను రోజులు అక్కడే మకాం వేసి చెట్టూపుట్టా తిరిగి వెయ్యి జంతువులను కాపాడారు. మొన్న..: హైదరాబాద్ను ముంచిన వరదలు.. మళ్లీ ఆ పది మందే రెండ్రోజులపాటు రాత్రింబవళ్లు మోకాల్లోతు నీళ్లలో నగరమంతా తిరిగి వందలాది జంతువులకు ఊపిరిలూదారు. ఇటీవల..: చందానగర్లో 70 అడుగుల లోతైన బోరుబావిలో పిల్లికూన పడిపోయింది. ఈ పదిమందీ 34 గంటలు శ్రమించి బయటకుతీశారు.ఇలా ఈ పది మంది యువకులు ఇప్పటివరకు కాపాడిన జంతువులు, పక్షుల సంఖ్య 70 వేలపైమాటే. యువతలో జీవకారుణ్యాన్ని నయా ట్రెండ్గా మార్చే ప్రయత్నంలో ఉన్న వీరంతా ఉన్నత విద్యావంతులే. మూగజీవాలకు నేస్తాలయ్యేందుకు బంగారంలాంటి జాబ్లనూ వదిలేసుకున్నారు. బోరుబావులు, వ్యవసాయబావులు, నాలాలు, కాలువల్లో పడ్డ వేలసంఖ్యలో జంతువులను రక్షించారు. మాంజా దారాలు, చెట్టు సందులు, కిటికీల్లో ఇరుక్కున్న, కుక్కల దాడిలో గాయపడిన పక్షులను కాపాడారు. ఒక్కరితో మొదలై హైదరాబాద్ కేంద్రంగా ‘యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ’గా రూపాంతరం చెందింది. ప్రమాదంలో ఉన్న మూగజీవాలను కాపాడటంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న ప్రదీప్నాయర్.. తనలాంటి ఆలోచనలే కలిగిన మరికొందరితో కలిసి దీన్ని ఏర్పాటుచేశారు. ప్రతి నెలా రూ.లక్షపైనే ఖర్చు కొద్దిరోజుల కిందట నగరానికి 250 కి.మీ. దూరంలోని నిజామాబాద్ జిల్లా నుంచి రాత్రి ఫోన్కాల్.. పెద్దబావిలో కుక్క పడిందని. అప్పటికే మూడ్రోజులు కావటంతో దాని ఆరోగ్యం క్షీణించింది. ఈ బృందం కారు అద్దెకు తీసుకుని వెళ్లి కుక్కను రక్షించింది. రూ.6 వేలు ఖర్చయ్యాయి. దగ్గరైతే టూవీలర్లు, దూరమైతే అద్దె కార్లు.. ప్రతి టూర్లో ఖర్చే. వీరిలో ఒక్కరికే సొంత కారుంది. సొంత డబ్బులతోనే జంతువులను కాపాడేందుకు అవసరమైన పరికరాలు కొన్నారు. ట్రాలీతో కూడిన జీపులాంటిది జంతువుల రెస్క్యూ ఆపరేషన్కు బాగా ఉపయోగడుతుంది. కానీ, సాయం చేసేవారు లేక సమకూర్చుకోలేదు. రెస్క్యూల ఖర్చు ప్రతినెలా కాస్త అటూఇటూగా రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు వస్తుంది. ఇదంతా జేబు నుంచే పెట్టుకుంటున్నారు. కేరళ వరదలతో పెరిగిన పట్టుదల కేరళ వరదల్లో చిక్కుకున్న మూగజీవాలను రక్షించటంలో కీలకంగా వ్యవహరించి అక్కడి ప్రభుత్వ ప్రశంసలందుకుందీ బృందం. 15 రోజులు అక్కడే మకాంవేసి రోజుకు ఐదారువేల చొప్పున పడవ ఖర్చులు భరించి మరీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. 1,200 మూగజీవాలను రక్షించారు. వీటన్నింటికీ అన్ని రోజులూ ఆహారం అందించారు. తల్లి నుంచి దూరమై వరదల్లో కొట్టుకుపోతున్న ఓ ఏనుగునూ కాపాడారు. అలప్పీ ప్రాంతంలోని 20 గ్రామాల్లో వరదల్లో కొట్టుకొచ్చి ఇళ్లలో నక్కిన పాములను పట్టి అటు వాటిని, వాటి నుంచి జనాన్ని కాపాడారు. మూగజీవాల రక్షణ..విద్యార్థులకు శిక్షణ నగరం చుట్టూ ఉన్న చెరువుల్లో చేరిన కాలుష్య వ్యర్థాలను తొలగించే బాధ్యతనూ ఈ బృందం భుజాన వేసుకుంది. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్, అమీన్పూర్ లేక్, ఫాక్స్సాగర్ సహా పలు చెరువుల వద్ద ప్లాస్టిక్, ఇతర రసాయన వ్యర్థాలు, గుర్రపుడెక్క తొలగించి అటు జలచరాలకు ఇటు అక్కడకు వచ్చే పక్షులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. వలస పక్షులకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి వాటిని సంరక్షిస్తున్నారు. విద్యార్థులను సమీకరించి జంతు సంరక్షణపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వారిలో జీవకారుణ్యాన్ని పెంచుతున్నారు. ఖాళీ సమయాల్లో వృథాగా తిరగకుండా వారిని జంతువులను కాపాడే పనిలో బిజీగా మారుస్తున్నారు. ఏటా వేసవిలో దాహంతో అల్లాడే జంతువుల కోసం నీటి సాసర్లు, ఊరపిచ్చుకలను తిరిగి రప్పించేందుకు వందల సంఖ్యలో గూళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. జనంలో జీవకారుణ్యం పెంచేందుకే.. బీటెక్ కాగానే మరో ఇద్దరితో కలిసి సొంత సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టా. మంచి ఆర్డర్స్, భారీ ఆదాయం. కానీ ప్రమాదంలో ఉన్న జంతువులను కాపాడాలనే నా ఆశయం పక్కదారి పడుతోందనిపించింది. వెంటనే సంస్థను వదిలేసి నాకు నచ్చిన రూట్లోకి వచ్చా. నాతో కలిసి యానిమల్ కన్జర్వేషన్ యాక్టివిటీలో ఉన్న సంతోషిని పెళ్లి చేసుకున్నా. సంజీవ్శర్మ, అమర్ కూడా మంచి ఉద్యోగాలను వదులుకుని మూగజీవాల రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నారు. నేటి యువతలో జంతువులపై ప్రేమను పెంచాలన్నదే మా సంకల్పం. అనిరుధ్ సహదేవ్, ప్రభు, మెస్సీ, రాఘవ్, బాలాజీ, మనీష్ చాలాకాలంగా మాతో సాగుతున్నారు. – ప్రదీప్నాయర్, యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ అధ్యక్షుడు ఆ పదిమంది.. మూగజీవాలంటే అమితమైన ప్రేమ గల ప్రదీప్నాయర్.. వాటి కోసం సమయం కేటాయించలేకపోతున్నాననే భావనతో సొంత సాఫ్ట్వేర్ కంపెనీనే మూసేశారు. ఇంటి వద్దే వెబ్ డిజైన్ చేస్తూ ఇప్పుడు మరింత ఎక్కువ సమయాన్ని మూగజీవాల రక్షణకు కేటాయిస్తున్నారు. తనలాంటి అభిరుచే కలిగిన సంతోషిని పెళ్లి చేసుకున్నారు. ఈమె కూడా ‘వర్క్ ఫ్రమ్ హోం’చేస్తూనే మిగతా సమయంలో భర్తకు చేదోడుగా ఉంటారు. బహుళజాతి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే బడా ఎమ్మెన్సీలో కీలక ఉద్యోగి అయిన సంజీవ్వర్మ.. జంతువులపై ప్రేమతో ఉద్యోగాన్ని వదులుకున్నారు. ఇంట్లోనే కన్సల్టెన్సీ తరహా సేవలందిస్తూ, ఎప్పుడంటే అప్పుడు మూగజీవాల రక్షణకు పనిచేస్తున్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్లో భారీ ఐటీ ప్రాజెక్టులు చేపట్టే అమర్ సైతం జంతువులపై ప్రేమతో ఉద్యోగాన్ని వదిలి సొంతంగా ఐటీ కన్సల్టెన్సీ పెట్టుకున్నారు. వీరంతా పక్షులు, జంతువులపై ప్రేమతో పెద్ద కొలువులు వదిలి.. చిన్నగా ఉపాధి పొందుతూ.. అలా వచ్చిన డబ్బులనే వాటి సంరక్షణకు వెచ్చిస్తున్నారు. ఇంకా.. అనిరుధ్ సహదేవ్, మనీష్, ప్రభు, మెస్సీ, రాఘవ్, బాలాజీ.. వీరంతా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూనే జంతురక్షణకు సమయం కేటాయిస్తుంటారు. వీరి ధ్యాసంతా మూగజీవాలపైనే. ఫోన్ మోగితే చాలు అర్ధరాత్రయినా లేచి పరుగుపెట్టడమే. డబ్బులకు కటకట ఉన్నా, కుటుంబసభ్యుల నుంచి వ్యతిరేకత వచ్చినా ముందుకే సాగుతున్నారు. -
జంతువులు నేర్పిన పాఠం ..వీడియో వైరల్
మనిషి అంటేనే స్వార్థానికి పర్యాయపదంగా మారిన రోజులు ఇవి. ఏదైనా నాది, మాది అకుంటాడే తప్ప మనది అనే మాట రానేరాదు. అత్యాశతో కావాల్సిన దానికంటే ఎక్కువగా కూడబెట్టుకుంటాడు. అవరానికి మించిన వనరులను సమకూర్చుకుంటాడు. ఆపద వస్తే ఆదుకునేందుకు కూడా ముందుకు రాడు. ఎదుటి వారికి సాయం చేసే గుణం ఎప్పుడో పోయింది. కోటికి ఒక్కరో ఇద్దరో నిస్వార్థంగా పొరుగువారికి సాయం చేస్తున్నారు తప్ప దాదాపు అంతా స్వార్థపరులే. కానీ జంతువులు అలా కాదు. అవి తమకు కావాల్సినదాన్నే తీసుకుంటాయి తప్ప.. అత్యాశతో ఎక్కువగా తీసుకుపోదు. తనకు హాని లేనంత వరకు ఇతర జంతువుల జోలికి పోదు. పగ, ప్రతీకారాలు ఉండవు. అత్యాశా అసలే ఉండదు. కులం, మతం అనే భేదాలు ఉండవు. కొన్ని కొన్ని సార్లు జంతువులు మనకు గుణపాఠాన్ని నేర్పుతాయి. అవి యాధృచ్చికంగా చేసిన పనులే మనకు ఓ మంచి మర్గాన్ని చూచిస్తాయి. దానికి నిదర్శనం తాజా వీడియోనే. (చదవండి : వార్ని.. కోపంతో కోట్ల విలువైన కారునే కాల్చేశాడుగా..) ఓ చిన్న వాటర్ హోల్ వద్ద ఉన్న నీటిని వివిధ రకాల జంతువులు, పక్షులు చక్కగా వినియోగించుకుంటున్నాయి. ఒకదాని తర్వాత ఒక్కటి వచ్చి దాహాన్ని తీర్చుకొని వెళ్లిపోతున్నాయి. ఇతర జంతువులను అడ్డుకోవడం కానీ, లేదంటే అక్కడి ప్రదేశాన్ని నాశనం చేయడం కానీ చేయలేదు. ఆ చిన్నవాటర్ హోల్ దగ్గరికి కొన్ని గంటల వ్యవధిల్లోనే తోడేళ్లు, పాములు, కుందేళ్లు, కోడిపిల్లలు, ఎలుగు బంటులు వచ్చి దాహం తీర్చుకొని వెళ్లాయి. 57 సెంకడ్ల నిడివి గల ఈ వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..‘తక్కువ వినియోగించి ఎక్కువ షేర్ చేయండి. అడవి జంతువు దీంట్లో ముందుంటాయి. ఒక సింగిల్ వాటర్ హోల్ని గంటల వ్యవధిల్లోనే ఎన్ని జంతువులు వినియోగించుకున్నాయో చూడండి. ఒక్క సోర్స్ని ఎన్ని రకాల జంతువులు వినియోగించుకున్నాయో లెక్కించండి. వీటి ద్వారా మనం చాలా నేర్చుకోవాలి’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రంశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘జంతువులను చూసి మనం చాలా నేర్చుకోవాలి’. ‘దురదృష్టవశాత్తు మనిషి ఇతరుకు పంచడం(షేరింగ్), జాగ్రత్తగా చూసుకోవడం (కేరింగ్) లాంటి వాటిని ఎప్పుడో మర్చిపోయాడు’, *నీటి ప్రాధాన్యత తెలియజేసే వీడియో ఇది’,‘అవి కులం, మతం అనే వాటికి దూరంగా ఉన్నాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
జాతీయ మృగం జాడేది?
సాక్షి, పాల్వంచ: ఉమ్మడి జిల్లాలోని అటవీప్రాంతంలో పులుల జాడ కరువైంది. చిరుతల సంచారం కూడా లేదు. దట్టమైన అటవీప్రాంతం తగ్గిపోతుండటంతో అలికిడిలేని ప్రాంతంలో నివసించే మాంసాహార జంతువులు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నాయి. ఇతర వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. కిన్నెరసాని అభయారణ్యంలోనే 20 వేల హెక్టార్లకు పైగా అటవీ ప్రాంతం ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. నేడు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం. ఈ సందర్భంగా జిల్లాలో ఏయే రకాల అటవీ జంతువులు, ఎన్నెన్ని ఉన్నాయో తెలుసుకుందాం. భద్రాద్రి జిల్లాలో అటవీ ప్రాంతం 4,27,725 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఖమ్మం జిల్లాలో 62,000 హెక్టార్లలో విస్తరించి ఉంది. 2017లో జాతీయ పులుల గణన జరిగింది. ఉభయ జిల్లాలో ఒక్క పులి ఆనవాళ్లు కూడా లభించలేదు. కాగా 2015లో మాత్రం కిన్నెరసాని అభయారణ్యంలోని పడిగాపురం బీట్లో పులి సంచారాన్ని గుర్తించారు. మూడేళ్ల క్రితం ఉమ్మడి జిల్లాలో జంతువుల గణన జరిగింది. భద్రాద్రి జిల్లాలోని 6 డివిజన్లు, 24 రేంజ్లు, 492 బీట్లు, ఖమ్మం జిల్లాలోని రెండు డివిజన్లు, 81 బీట్ల పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టారు. పులులు, చిరుతల జాడ కన్పించలేదు. గతేడాది కూడా హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ, వైల్డ్లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్జీఓ బృందం వన్యప్రాణుల ఆక్యూపెన్సీ సర్వే నిర్వహించారు. అప్పుడు కూడా పులులు, చిరుతల జాడ కన్పించలేదు. అడవి దున్నలు, ఎలుగుబంట్లు, చుక్కల దుప్పులు, కణుజులు, నెమళ్లు, కుందేళ్లు, కొండముచ్చులు తదితర జంతువులు, పక్షులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. కిన్నెరసాని రిజర్వాయర్లో వందల సంఖ్యలో మోరేజాతి మొసళ్లు ఉన్నాయి. జంతువుల సంరక్షణకు వైల్డ్లైఫ్–1972 వంటి చట్టాలు ఉన్నా వేటగాళ్లు మాత్రం భయపడటంలేదు. నిత్యం వేటాడి వధిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో అటవీ జంతువులను వధించిన కేసులు 25 నమోదయ్యాయి. ఆరు డివిజన్ల పరిధిలో 35 జంతువులు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డాయి. సామాజిక బాధ్యతగా గుర్తించాలి జిల్లాలో అటవీ జంతువుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యత ఒక్క అటవీశాఖది మాత్రమేకాదు. ప్రజలు కూడా సామాజిక బాధ్యతగా గుర్తించాలి. –లక్ష్మణ్ రంజిత్ నాయక్, భద్రాద్రి జిల్లా అటవీశాఖాధికారి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం 2017లో అభయారణ్యంలో జాతీయ పులుల గణన జరిగింది. పులులు, చిరుతల జాడ కన్పించలేదు. వన్యప్రాణులకు వేసవిలో కృత్రిమ తాగునీటి సౌకర్యాలను కల్పిస్తున్నాం. ఇతర సంరక్షణ చర్యలు కూడా తీసుకుంటున్నాం. –కె.దామోదర్రెడ్డి, వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ, పాల్వంచ -
ప్రాణుల మనసు వీరికి తెలుసు..
వన్యప్రాణులకు గాయమైతే వీరి గుండె చలిస్తుంది. అవి హుషారుగా ఎన్క్లోజర్లలో తిరిగితే వీరు పట్టరాని సంతోషంతో ఉంటారు. వాటి ఆకలి, కోపం, బాధ అన్నీ వీరికి తెలిసిపోతాయి. పగలంతా వాటితో గడిపే వీరికి ఇంటికెళ్లినా.. వాటి ధ్యాసే. ప్రాణాలతో చెలగాటమని తెలిసినా.. వన్య ప్రాణులను తమ కన్న బిడ్డల్లా సాకుతూ.. వాటి సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వారే జూ కీపర్లు. జంతువుల మనసెరిగి.. వాటి ఆలనాపాలన చూసుకుంటున్న యానిమల్ కీపర్ల దినోత్సవం ఈ రోజు.. ఆరిలోవ(విశాఖతూర్పు): జాతీయ రహదారి పక్కన 625 ఎకరాల విస్తీర్ణంలో 1972లో ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాల ఏర్పాటు చేశారు. మొదట్లో ఇక్కడ 25 ఎన్క్లోజర్లు ఉండేవి. వాటిలో 100 వన్యప్రాణులు సందర్శకులను అలరించేవి. ఇప్పుడు జంతువుల సంఖ్య 880కు పైగా చేరింది. వాటి ఎన్క్లోజర్లు 65 ఉన్నాయి. పులులు, ఏనుగులు, సింహాలు, చిరుతలు, చింపాంజీలు, నీటి ఏనుగులు, జింకలు, జిరాఫీలు, ఖడ్గమృగం, కణుజులు, పాములు, మొసళ్లు, తాబేళ్లు, నెమళ్లు, ఆస్ట్రిచ్లు, హంసలు, వివిధ రకాల పక్షులున్నాయి. వాటి సంరక్షణకు సిబ్బంది, వైద్య సేవలందించడానికి ఆస్పత్రి, వైద్య సిబ్బంది, ఆహారశాల అన్నీ అందుబాటులో ఉన్నాయి. కన్న బిడ్డల్లా సాకుతూ.. జూ ఏర్పడిన తర్వాత జంతువులను సంరక్షించడానికి 25 మంది యానిమల్ కీపర్లుగా ఎన్.ఎం.ఆర్ విధానంలో ఉద్యోగాల్లో చేరారు. తర్వాత వారు శాశ్వత ఉద్యోగులుగా మారారు. వీరిలో 19 మంది ఉద్యోగ విరమణ చేయగా.. ప్రస్తుతం ఆరుగురు ఉన్నారు. వీరికి సహాయకులుగా మరో ఏడుగురు ఉన్నారు. వీరంతా ఇక్కడ జంతువులు, పక్షులు, పాములకు స్నేహితులయ్యారు. దళపతి అని ఓ కీపర్ పిలవగానే నీటి ఏనుగు నోరు చాపుకుంటూ వస్తుంది. కృష్ణ అనగానే తొండం పైకెత్తి ఆశగా ఏనుగు చూస్తుంది. చీపా అంటే గెంతులేస్తూ చింపాంజీ అతని దగ్గరకు చేరుకుంటుంది. ఇలా జంతు సంరక్షకుల గొంతు వినగానే దగ్గరకు చేరిపోతుంటాయి. క్రూర మృగాలు కూడా వీరికి నేస్తాలుగా మారిపోయాయి. సమయానికి ఆహారం అందించడం, నైట్క్రాల్స్లో ఉన్న వాటికి ఉదయం స్నానం చేయించడం, ఆ తర్వాత వాటిని సందర్శకుల కోసం ఎన్క్లోజర్లలోకి విడిచిపెట్టడం, ఆ సమయంలో వాటి నైట్క్రాల్స్ను శుభ్రం చేయడం, అందులోని జంతువుల మలమూత్రాలను తొలగించడం వీరి విధులు. రోజంతా వన్యప్రాణులతో గడిపే వీరు.. ఇంటికి వెళ్లినా వీటి ధ్యాసలోనే ఉంటారంట. కన్న పిల్లల కంటే ప్రేమగా వీటిని చూసుకుంటామని వారు చెబుతున్నారు. ఇంటికెళ్లినా వాటి ధ్యాసే.. నేను 1993లో జూలో ఎన్.ఎం.ఆర్గా చేరాను. ప్రస్తుతం ప్రస్తుతం చింపాంజీలతో సావాసం చేస్తున్నాను. చింపాంజీలతో నేను మాట్లాడతాను. నా మాటలు వాటికి అర్థమవుతాయి. చీకో, చీపా అని పేర్లతో పిలవగానే అవి వస్తాయి. అయితే చింపాంజీలు మనిషి కంటే చాలా తెలివైనవి. ఎక్కువగా మారాం చేస్తాయి. వేళకు ఆహారం ఇవ్వకపోతే తలుపులు బద్దలు గొట్టేస్తాయి. గేట్లు విరగ్గొంటేందుకు చూస్తాయి. ఆ సమయంలో నేను ఏమి పెట్టినా తినవు. అందుకే సమయానికి భోజనం పెడతాను. వాటితో ఉన్న అనుబంధం వల్ల నేను ఇంటికి వెళ్లినా అవే గుర్తొస్తాయి. మొదట నేను అడవి కోళ్లు, కొంగలు, జింకలు, పులులు, చిరుతలు, ఎలుగుబంట్ల ఎన్క్లోజర్ల వద్ద పనిచేశాను. – వై.అప్పారావు, యానిమల్ కీపర్ జూలో పులులకు పైపుతో స్నానం చేయిస్తున్న యానిమల్ కీపర్ (ఫైల్).. మన ప్రవర్తన బట్టే.. నేను 1980లో ఎన్.ఎం.ఆర్గా చేరాను. 1991లో పర్మినెంట్ అయింది. ఐదేళ్లుగా తెల్ల పులుల ఎన్క్లోజర్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాను. మన ప్రవర్తనను బట్టి జంతువులు మనతో సరదాగా ఉంటాయి. మనం కోపం, చిరాకుతో ఉంటే అవి గ్రహిస్తాయి. అలాంటప్పుడు అవి కూడా మన మీదకు దూకడానికి ప్రయతి్నస్తాయి. చిరుతలు, పెద్ద పులులు కూడా అలాగే ప్రవర్తిస్తాయి. గతంలో రేచు కుక్కలు, పాంథర్, పెద్ద పులులు, ఆఫ్రికన్ పక్షులు, సింహాల ఎన్క్లోజర్ల వద్ద పనిచేశాను. రేచుకుక్కలు మాత్రం వాటి ఎన్క్లోజర్ను చెత్త చేస్తాయి. అన్ని వైపులా మూత్ర విసర్జన చేస్తాయి. – వై.రాంబాబు, యానిమల్ కీపర్ జూలో వేధిస్తున్న సిబ్బంది కొరత జూలో సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా ఉంది. వన్యప్రాణుల బాగోగులను చూసుకునే సంరక్షలు సరిపడినంతగా లేరు. జూలో ఉన్న జంతువులు, పక్షుల సంరక్షణ కోసం యానిమల్ కీపర్లను కొన్ని దశాబ్దాలుగా నియమించకపోవడంపై విమర్శలు ఉన్నాయి. జూ ప్రారంభంలో 25 ఎన్క్లోజర్లలో సుమారు 100 వన్యప్రాణులను సంరక్షించడానికి 25 మంది సంరక్షకులను నియమించారు. ఇప్పుడు వాటి సంఖ్య తొమ్మిది రెట్లు పెరిగింది. కానీ వాటి సంరక్షకుల సంఖ్య మాత్రం అదే స్థాయిలో తగ్గిపోయింది. ప్రస్తుతం ఆరుగురు కీపర్లు, మరో 7 మంది వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు(కీపర్లకు సహాయకులు), మరో 35 మంది ఎన్ఎంఆర్లు ఉన్నారు. నిజానికి జూలో ఎన్క్లోజర్లు, వాటిలో ఉన్న సంఖ్య ప్రకారం సుమారు 212 మంది యానిమల్ కీపర్లు ఉండాలి. వీరిని శాశ్వత ప్రాతిపదికన నియమిస్తే.. వన్యప్రాణులకు మరింత సంరక్షణ ఉంటుందని జంతు ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. -
రాకాసి దోమల గుంపు: జంతువులు మటాష్!
లూసియానా : రాకాసి దోమల గుంపు వందల సంఖ్యలో పాడి జంతువుల్ని, అడవి వన్య ప్రాణుల్ని బలితీసుకుంది. ఈ సంఘటన అమెరికాలోని లూసియానాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గత నెల ఆగస్టు 27న హరికేన్ లారా కారణంగా పెద్ద సంఖ్యలో రాకాసి దోమలు లూసియానాలోకి వచ్చిపడ్డాయి. అక్కడి గేదెలు, ఆవులు, గుర్రాలు, జింకలపై దాడి చేశాయి. వాటి రక్తం పీల్చి చంపేశాయి. దాదాపు లక్ష డాలర్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కొంతమంది హెలికాఫ్టర్ల సహాయంతో దోమల మందు పిచికారీ చేశారు. ఎద్దు పొట్ట చుట్టూ చేరిన భారీ దోమల గుంపు దీంతో దోమల ఉధృతి కొద్దిగా తగ్గింది. ఈ దోమల దాడిలో దాదాపు 400 పాడి జంతువులు, 30 వరకు జింకలు మృత్యువాత పడ్డాయి. సెప్టెంబర్ 2న ఓ వ్యక్తి తీసిన ఫొటో ఒకటి రాకాసి దోమల రక్త పిపాసకు అద్దం పడుతోంది. చనిపోయిన ఎద్దు పొట్ట చుట్టూ చేరిన భారీ దోమల గుంపు దాని రక్తం పీలుస్తున్న ఫొటో అది. -
జంతువులపై కోవాగ్జిన్ సత్ఫలితాలు
న్యూఢిల్లీ/లండన్: కరోనా వైరస్కు వ్యతిరేకంగా తయారు చేస్తున్న కోవాగ్జిన్ టీకా జంతువులపై జరిపిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు చూపిందని భారత్ బయోటెక్ వెల్లడించింది. కోతులపై జరిపిన ప్రయోగాల్లో వాటి శరీరాల్లో బలమైన వ్యాధినిరోధకత కనిపించినట్లు తెలిపింది. దీనివల్ల ప్రైమేట్ జీవుల్లో వ్యాధి నిరోధకత పెంచే విషయంలో అంచనాలు మరింత మెరుగయ్యాయని తెలిపింది. ప్రయోగాల కోసం 20 రీసస్ కోతులను నాలుగు గ్రూపులుగా విభజించామని, వీటిలో ఒక గ్రూప్ కోతులకు ప్లాసిబో(ఎటువంటి ఔషధం లేని డోసు)ను ఇచ్చామని, మిగిలిన గ్రూపుల్లో కోతులకు మూడు రకాల వ్యాక్సిన్స్ను ఇచ్చామని వివరించింది. 14 రోజుల అనంతరం అన్ని కోతులను వైరస్కు గురిచేశామని, అనంతరం వ్యాక్సిన్ తీసుకున్న కోతుల్లో ఐజీ–జి యాంటీబాడీలు పెరిగి, గొంతు, ముక్కు, ఊపిరితిత్తుల్లో వైరస్ పెరుగుదలను తగ్గించినట్లు తెలిసిందని తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న కోతుల్లో న్యుమోనియా లక్షణాలు కనిపించలేదంది. టీకా ఇచ్చిన కోతుల్లో భారీ సైడ్ఎఫెక్ట్లు కానరాలేదని తెలిపింది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలు మళ్లీ షురూ ఇటీవల కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలను ఆపేసిన అతిపెద్ద ఔషధ కంపెనీ ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బ్రిటన్లో మళ్లీ ట్రయల్స్ను మొదలుపెట్టాయి. ఈ ట్రయల్స్ సురక్షితమని మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (ఎంహెచ్ఆర్ఏ) నిర్థారించడంతో ప్రయోగాలను పునఃప్రారంభించినట్లు ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చెప్పాయి. భారత్లో ఆస్ట్రాజెనెకా క్లీనికల్ ట్రయల్స్ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి పొందాక పునఃప్రారంభిస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ శనివారం తెలిపింది. ట్రయల్స్ పూర్తిగా ముగిసేవరకు ఒక నిర్ధారణకు రాకూడదని కంపెనీ సీఈఓ పూనావాలా చెప్పారు. -
జంతువులతో జాగ్రత్త.. విస్తుగొలిపే విషయాలు
ప్రాచీన కాలం నుంచి జంతువులతో మానవుని సహచర్యం కొనసాగుతూనే ఉంది. ప్రతి మనిషి పశు పక్షాదుల నుంచి ఉత్పత్తి అయ్యే పాలు, గుడ్లు, మాంసంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్నాడు. అంతే కాదు.. పెంపుడు కుక్కను మించిన విశ్వాసపాత్రమైన జంతువు మరొకటి ఉండదని పలువురు చెబుతుంటారు. ఈ సహచర్యంలో కొన్ని వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు తెలియకనే సంక్రమిస్తున్నాయి. ఆధునిక వైద్య పరిజ్ఞానం ఎంత పెరిగినప్పటికీ కొన్ని వ్యాధులకు ఇప్పటికీ వైద్యం లేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం సంక్రమిస్తున్న స్వైన్ఫ్లూ, బర్డ్ఫ్లూ, రేబిస్, హెచ్ఐవీ, ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్–19) కూడా జంతువుల నుంచే మానవులకు సంక్రమించింది. మనుషులకు వచ్చే ప్రతి మూడు జబ్బుల్లో రెండు జంతువుల నుంచే సంక్రమిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల(జూనోటిక్ వ్యాధులు)పై ప్రత్యేక కథనం. సాక్షి, ఖమ్మం : జంతువుల నుంచి మనుషులకు, వారి నుంచి జంతువులకు 190 రకాల వ్యాధులు సోకుతాయని నిపుణులు చెబుతున్నారు. బర్డ్ఫ్లూ, స్వైన్ప్లూ వంటి వ్యాధులతో పాటు రేబిస్, టీబీ, జపనీస్ ఎన్సఫలైజేషన్ వంటి వ్యాధులు సంక్రమించే ప్రమా దం ఉంది. కుక్కకాటు ద్వారా రేబిస్, పందుల ద్వారా జపనీస్ ఎన్సఫలైజేషన్ (మొదడువాపు), పశువులు, గొర్రెలు వంటి ద్వారా టీబీ సోకుతున్నాయి. జంతువుల నుంచి సంక్రమించే వ్యాధు లను జూనోటిక్ వ్యాధులు అంటారు. రేబిస్కు సంబంధించి వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తలు మినహా, వ్యాధి సోకిన తర్వాత వైద్యం లేదు. మూడేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రపదేశలో జబ్బు చేసిన మేకను తినడం వల్ల ఆంత్రాక్స్ ప్రబలిన విషయం తెలిసిందే. బర్డ్ఫ్లూ సైతం దేశంలో పలు ప్రాంతాల వ్యక్తులను వణికించిన విషయం కూడా తెలిసిందే. అడవి గబ్బిలం ద్వారా సోకే నిఫా వైరస్ కేరళలో 10 జూన్ 2018లో బయటపడి ఆ రాష్ట్రాన్ని వణికించింది. బర్డ్ప్లూ వ్యాధి: బర్డ్ప్లూ లేదా ఇన్ప్లూయెంజా వ్యాధి కోళ్లను, ఇతర పక్షులను ఆశిస్తుంది. ఇది వైరస్ వల్ల కలిగే వ్యాధి. ఈ వైరస్లో 144 ఉప రకాలున్నాయి. ఇది కోళ్లు, పక్షుల నుంచి మానవాళికి సంక్రమిస్తు్తంది. 1997లో ఖండాతర వ్యాధిగా రూపొంది చాలా దేశాల్లో కోట్ల కొలది కోళ్లు మరణించాయి. ప్రధానంగా వీటి పెంకందారులు, షెడ్లలో పనిచేసే వారికి త్వరితగతిన ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకిన కోళ్లు, పక్షులు అకస్మాత్తుగా మరణిస్తాయి. వ్యాధి సోకిన మనుషుల్లో జలుబు, గొంతునొప్పి, దగ్గు, కండ్లకలకతో మొదలై ఊపిరితిత్తుల్లో రక్తం చేరి మరణానికి దారి తీస్తుంది. ఈ వ్యాధి నివారణకు కచ్చితమైన టీకా మందును ఇంతవరకు కనుగొన లేదు. టామిప్లూ వంటి వైరస్ నిరోధక మందులు వ్యాధి తీవ్రతను, వ్యాధి వ్యాప్తిని అదుపులో ఉంచేందుకు కొంత మేరకు ఉపయోగపడుతాయి. ఆంత్రాక్స్ వ్యాధి: ఈ వ్యాధి బాసిల్లస్ ఆంత్రాసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. జంతువులు, మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో ఇది చాలా ప్రమాదకరమైనది. వ్యాధి సోకిన పశువుల పొట్ట ఉబ్బి అకస్మాత్తుగా చనిపోతాయి. వ్యాధి సోకిన మనుషుల్లో జ్వరం, న్యూమోనియా వస్తుంది. బ్రూసెల్లోసిస్: ఈ వ్యాధి పశువుల్లో బ్రూసెల్లా అబార్టస్ బ్రూసెల్లా మెలిటెన్సిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి అన్ని జాతుల పశువులకు, మనుషులకు సోకుతుంది. వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వచ్చి ఈసుకుపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మగ పశువుల్లో తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వంధ్యత్వం ఏర్పడుతుంది. ఇవిగాక మైకో బ్యాక్టీరియా బ్యుటర్క్యులోసిస్ బ్యాక్టీరియా వల్ల క్షయ లేదా టీబీ, లెప్టాస్పైరా ఇక్టిరోహియో రేజికా బ్యాక్టీరియా వల్ల లెప్టోస్పైరోసిస్ వ్యాధులు వ్యాపిస్తాయి. కుక్కకాటుకు గురైతే ఏం చేయాలి.. కుక్కకాటుకు గురైనప్పుడు తక్షణమే ఆ గాయాన్ని సబ్బు నీటితో కానీ, మంచి నీటితో కానీ నిరంతరాయంగా పది నిమిషాల పాటు కడగాలి. కుక్క కరిచిన గాయానికి కట్టు కట్టడం, కుట్లు వేయడం, అయింట్మెంట్లు రాయడం కానీ చేయకూడదు. వీలైనంత త్వరగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. గాయాలు పెద్దవిగా ఉన్నా, తలకు దగ్గరకు కరిచినా ఏఆర్వీతో పాటు ఇమ్యునోగ్లోబ్యులిన్స్ ఇంజెక్షన్లు తీసుకుంటే రేబిస్ సోకకుండా 95 శాతం రక్షణ ఉంటుంది. ప్రస్తుతం దీనిని ప్రభుత్వాస్పత్రిలో ఉచితంగా వేస్తున్నారు. కుక్క కరవడమే కాకుండా కాళ్లతో గీరినప్పుడు రక్తం వచ్చినా, శరీరంపై ఉన్న గాయాలపై కుక్క నాలుకతో నాకినా రేబిస్ వ్యాధి వచ్చే ఆవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో వెంటనే ఏఆర్వీ వేయించుకోవాలి. రేబిస్ సోకిన వ్యక్తి ద్వారా కూడా ఇతరులకు వ్యాధి సోకే ఆవకాశం ఉంది. రేబిస్ వ్యాధి.. రేబిస్ వ్యాధి సోకితే చికిత్స లేదనేది వాస్తవమే కానీ అన్ని కుక్కల వల్ల రేబిస్ వస్తుందనేది అపోహ మాత్రమే. అవగాహన లోపం కారణంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రేబిస్ వ్యాధి రాబ్డో అనే వైరస్ వల్ల సోకుతుంది. ఈ వైరస్ ఎక్కువగా అడవుల్లో ఉండే క్రూర జంతువులు, గబ్బిలాల్లో ఎటువంటి లక్షణాలు చూపించకుండా ఉంటుంది. ఈ వైరస్ గాలి, నీటి ద్వారా మార్పు చెందుతుంది. మృగాలు, గబ్బిలాలు చనిపోవడం, వాటిని కుక్కలు తినడం వల్ల వాటిలో ఉన్న వైరస్ కుక్కలకు వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ ఉన్న కుక్కలు మనుషులను, పశువులను కరవడం వలన లాలాజలం ద్వారా సంక్రమిస్తుంది. రేబిస్ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా 35 వేల మంది మరణిస్తున్నారు. ఈ మరణాలు 60 శాతం భారతదేశంలోనే సంభవిస్తున్నాయి. ఈ వైరస్ మనుషులకు, పశువులకు వ్యాప్తి చెందడంలో కుక్కలు వారధిగా పనిచేస్తుంటాయి. చనిపోయిన రేబిస్ వ్యాధి సోకిన పశువులను, గబ్బిలాల కళేబరాలను కుక్కలు తినడం వలన ఈ వైరస్ కుక్కలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధితో కుక్కలు మానసిక స్థితిని కోల్పోయి, విచిత్రంగా ప్రవర్తిస్తాయి. వ్యాధిని గుర్తించకపోవడంతో కొన్ని రోజుల్లో జీవులు మరణిస్తాయి. పెంపుడు కుక్కలతో పాటు వాటిని పెంచేవారికి, డాక్టర్లు కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. జూనోటిక్ వ్యాధి కారకాలు 7 రకాలు ∙ బ్యాక్టీరియా: ఆంత్రాక్స్, బ్రూసెల్లోసిస్ లెప్టోస్పైరోసిస్, క్షయ ∙ వైరస్: రేబిస్, బర్డ్ఫ్లూ, మెదడు వాపు, సార్స్, మేడ్కౌడిసీజ్ ∙ ప్రొటోజువా: టాక్సోప్లాస్మోడియా, లైష్మెనియాసిస్ ∙ రెకెట్షియా: టిక్, టైఫస్, క్యూఫీవర్ ∙ హెల్మెంథ్స్: ఎకైనోకోకోసిస్, టీనియాసిస్ ∙ ఎక్టోపారాసైట్స్: స్కేజిస్ పశువుల్లో రేబిస్ లక్షణాలు రేబిస్ వ్యాధి సోకడం వల్ల పశువుల ప్రవర్తనలో తేడా వస్తుంది. మూలగడం, ఒంటరిగా ఉండడం లాంటివి కనిపిస్తాయి. శరీరంపై దురద, కోపం, ఉలికిపాటుకు గురవడం. అరుపులు ఆవలింతలా వస్తాయి. నీటిని తీసుకోవు. పక్షవాతంలా వచ్చి మరణిస్తాయి. ఇవన్నీ 11 రోజుల్లో జరిగిపోతాయి. మనుషుల్లో.. జ్వరం రావడం, కాళ్లు పట్టుకుపోవడం, చూపులో మార్పు రావడం, భయపడిపోవడం, పక్షవాతం వచ్చి శరీరం పనిచేయకుండా పోయి మరణిస్తారు. నివారణ చర్యలు.. ఈ వైరస్ సోకకుండా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలి. అలానే కుక్కల్లో పునరుత్పత్తి జరగకుండా ఇంజక్షన్లు చేయాలి. కుక్కలతో తీసుకోల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు కుక్కల వల్ల కలిగే వ్యాధుల గురించి వివరించాలి. రేబిస్ వ్యాధి సోకి కుక్క, పశువులు మరణిస్తే వాటి కళేబరాలను పూడ్చకుండా దహనం చేయాలి. జూనోసిస్ డే.. లూయిస్పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా 1885 జూలై 6న పిచ్చికుక్క కాటుకు గురైన బాలుడికి నిరోధక టీకా ఇవ్వడం ద్వారా రేబిస్ వ్యాధి రాకుండా కాపాడగలిగాడు. దీంతో అప్పటి నుంచి ఏటా జూలై 6న జూనోసిస్ దినోత్సవంగా జరుపుతున్నాం. ఈ సందర్భంగా వ్యాధులు, సంక్రమణ విధానం, వాటి పట్ల అవగాహన కలిగించడంతో పాటు, నివారణపై ప్రజలకు అవగాహన కలిగించాలి. -
అవి ఆరోగ్యంగా ఉంటే.. మనమూ ఉన్నట్టే!
జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను నివారించేందుకు మనకున్న మేలైన మార్గం పాడి పశువుల ఆరోగ్యాన్ని కాపాడటమేనని హెల్త్ ఫర్ యానిమల్స్ అనే సంస్థ చెబుతోంది. ఎందుకంటే కనీసం 13 వ్యాధులు మనుషుల నుంచి జంతువులకు కూడా సోకే అవకాశం ఉంది కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాడిపశువుల రంగానికి ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తుంది. పాడి పశువులు, పౌల్ట్రీ, మాంసం కోసం పెంచే మేక, గొర్రె వంటి జంతువులపై ఈ సంస్థ పరిశోధనలు చేస్తోంది. జంతువులకు అవసరమైన మందులు, వ్యాక్సిన్లను తయారు చేసే కంపెనీలు కూడా ఈ సంస్థలో భాగమే. ఏటా కొత్తగా బయటపడుతున్న ఐదు వ్యాధుల్లో మూడు జంతువుల నుంచి సంక్రమించేవే. వ్యాధుల కారణంగా ఏటా కనీసం 20 శాతం పాడిపశువులు మరణిస్తుంటాయని, దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనీసం వందకోట్ల మందిపై ఉంటుందని ఈ సంస్థ చెబుతోంది. (చదవండి: భవిష్యత్ మహమ్మారి జీ4..!) గత 12 ఏళ్లలో వ్యాధుల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఆరుసార్లు పెద్దసంఖ్యలో పాడిపశువులు మరణించాయని, గాలికుంటు వ్యాధి, స్వైన్ఫ్లూ, ఏవియన్ బర్డ్ ఫ్లూ వంటి వాటి కారణంగా జరిగిన ఆర్థిక నష్టం దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు ఉందని ఈ సంస్థ అంచనా. ఈ వ్యాధుల నియంత్రణకు, మనుషుల ప్రాణాలను రక్షించేందుకు 1995 నుంచి 2008 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు పది లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చయ్యాయి. యాంటీబయాటిక్లను అందివ్వడం ద్వారా జంతువ్యాధుల్ని చాలా వరకూ నివారించవచ్చునని తద్వారా వాటిని సంరక్షించుకోవడమే కాకుండా.. వాటిపై ఆధారపడ్డవారి నష్టాలను కూడా తగ్గించవచ్చునని ఈ సంస్థ చెబుతోంది. (జూనోసిస్ డే...) -
నువ్వక్కడ, నేనిక్కడ! ఎంచక్కా!!
సాక్షి, న్యూఢిల్లీ : రాఘవ్ చాబ్రా, 28 ఏళ్ల యువకుడు. ఢిల్లీలో చార్టెట్ అకౌంటెంట్గా పని చేస్తున్నారు. ఇంకా పెళ్లి కాలేదు. ఒంటరి వాడు. ఇంటి నుంచే ఆఫీసు పని చేస్తున్నారు. ఇంట్లో వంట పనులు, లాండ్రీ పనులు తానే చూసుకుంటున్నారు. కరోనా భయం కారణంగా బయటి నుంచి తెచ్చిన సరకుల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాంతో పాటు సాయంత్రం ఏడయ్యే సరికి ఆయన శరీరం అలసిపోతోంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దాన్ని తగ్గించుకుని ఉల్లాసంగా ఉండేందుకు ఆయన ప్రతి రోజు ఏడు గంటలకు ఓ గంట కాలాన్ని ఆనంద కాలక్షేపానికి కేటాయిస్తారు. ఆ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో మిగిలి పనులు చక్క బెట్టుకొని నిద్రకు ఉపక్రమిస్తాడు. అయితే, ఆనందం కోసం గంట కాలాన్ని ఎలా వెచ్చిస్తున్నాడన్న అనుమానం రావొచ్చు. మద్యం సేవిస్తూ ఆయన గంటపాటు అనందంగా కాలక్షేపం చేస్తారనుకుంటే పొరపాటు. ఆ ఆనంద సమయంలో చాబ్రా తన దత్తత తీసుకున్న కుక్క పిల్లతో ఆడుకుంటారు. ముచ్చట్లు పెడతారు. అలా అని ఆ కుక్క పిల్ల ఆయనతోని ఆయన ఇంట్లో ఉంటుందనుకుంటే కూడా పొరపాటే. అది ఢిల్లీకి శివారులోని ఉత్తర్ప్రదేశ్ ప్రాంతంలోని జంతు సంరక్షణ కేంద్రం ఆవరణలో ఉంటోంది. దానితోని చాబ్రా తన ల్యాప్టాప్లో స్కైప్ ద్వారా ఆడుకుంటారు. మాటల ద్వారా, సైగల ద్వారా ఆ కుక్కతో ఆత్మీయ అనుబంధాన్ని ఆస్వాదిస్తారు. చాబ్రా అదష్టవశాత్తు దేశంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చిన మార్చి 25వ తేదీకి కొన్ని రోజుల ముందే ఆ కుక్క పిల్లను దత్తత తీసుకున్నారు. దానికి ఫ్రన్నీ అని పేరు కూడా పెట్టుకున్నారు. అక్కడ సంరక్షణ కేంద్రంలో దాని పోషణకు అయ్యే ఖర్చును చాబ్రానే భరిస్తారు. నెలకు లేదా రెండు నెలలకోసారి ఆ ఖర్చును డిజిటల్ పేపెంట్ ద్వారా చెల్లిస్తారు. లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేశాక పెంపుడు కుక్కల సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ‘ఉమ్మీద్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ’ కార్యాలయానికి వెళ్లి దాన్ని ప్రత్యక్షంగా చూద్దామని, ఓ వారం రోజులపాటు దాన్ని తీసుకొని ఊళ్లు తిరుగుదామని చాబ్రా అనుకుంటున్నారు. పెంపుడు జంతువులతో మానసిక ఉల్లాసం కరోనా కష్ట కాలంలో చాబ్రా లాంటి జంతు ప్రేమికులకు, ఒంటరి వాళ్లకు పెంపుడు కుక్కలను దత్తత తీసుకోవడం అనే కొత్త ట్రెండ్ ఇప్పుడు పెరిగిపోయింది. సొంతిళ్లు లేని జంతు ప్రేమికులు కుక్కల్ని పెంచుకునేందుకు భయపడతారు. సొంతిళ్లు ఉన్న వాళ్లలో కూడా ఇంట్లోని పెద్ద వాళ్లకు భయపడి పెంచుకోరు. ఇక ఒంటిరి వాళ్లయితే ఆఫీసుకు, ఇంటికి మధ్యలో దాని ఆలనాపాలనా చూసుకోలేమని భయపడతారు. ఇక అలాంటి భయాలు లేకుండా కుక్కలను దత్తత తీసుకునే పద్ధతి ఆచరణలోకి రావడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దానితో ఆడుకునే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా జంతు ప్రేమికులు భావిస్తున్నారు. ఒంటరితనంతో బాధ పడే యువతీ, యువకులు లేదా పెద్ద వారికి పెంపుడు కుక్కలతోని ఎంతో మానసిక ఉపశమనం లభిస్తుందని గురుగ్రామ్లోని ‘మెంటల్ హెల్త్ అండ్ బిహేవియరల్ సైన్సెస్’ అధిపతి డాక్టర్ కామ్నా చిబ్బర్ తెలియజేస్తున్నారు. ఓ పెంపుడు కుక్క పోషణకు నెలకు కనీసం మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుందని ‘పీపుల్ ఫర్ ఎనిమల్’ సభ్యులు విక్రమ్ కొచ్చార్ తెలిపారు. దేశంలోని జంతు సంక్షేమ సంఘాల్లో ఈ సంస్థ అతి పెద్దదనే విషయం తెల్సిందే. కరోనా సందర్భంగా ఊర కుక్కల వల్లనే ‘దత్తత’ అనే కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చిందని ఆయన తెలిపారు. లాక్డౌన్ వల్ల ఊర కుక్కలకు తిండి దొరక్క పోవడం, వైరస్ సోకుతుందనే భయంతో కొందరు పెంపుడు కుక్కలను వీధుల్లో వదిలేశారని, వాటన్నింటిని వివిధ సంరక్షణ కేంద్రాలకు తరలించి, దత్తత ద్వారా వాటిని పోషిస్తున్నట్లు ఆయన వివరించారు. గురుగావ్లో మనోజ్ మీనన్ అనే జంతు ప్రేమికులు రెండు ఎకరాల గార్డెన్లో ఈ కుక్కలను పోషిస్తున్నారు. వాటి కోసం స్మిమ్మింగ్ పూల్ను కూడా నిర్వహిస్తున్నారు. ల్యాప్టాప్, సెల్ఫోన్ల ద్వారా వాటి దత్తత యజమానులతో కాలక్షేపం చేసేలా శిక్షణ కూడా ఇస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్ కొంత కాలంలోనే దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని విక్రమ్ కొచ్చార్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
కరోనా: మింక్లను చంపేందుకు నిర్ణయం..
ఆమ్స్టర్డామ్: కరోనా మనుషులు, మూగజీవాల మధ్య బంధాన్ని దూరం చేసిందా? దగ్గర చేసిందా? అనే ప్రశ్నకు బహుశా సరైన సమాధానం దొరక్కపోవచ్చు. ఎందుకంటే కరోనా బయటపడ్డ తొలినాళ్లలో చైనా సహా పలు దేశాల ప్రజలు పెంపుడు జంతువులే ఈ మహమ్మారి వ్యాప్తికి కారణమవుతున్నాయన్న అపోహతో జనం వాటిని నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీదకు విసిరేశారు. అయితే పెంపుడు జంతువుల వల్ల కరోనా వ్యాపిస్తుందనడానికి సరైన ఆధారాలు లేవని వైద్యులు వెల్లడించడంతో మూగజీవాలపై వివక్ష మానుకున్నారు. అటు జూలో ఉన్న జంతువులకూ మనుషుల ద్వారా వైరస్ వ్యాపించడం అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. (ఇటలీని దాటేసిన భారత్) ఇదిలా వుండగా కరోనా భయంతో నెదర్లాండ్ ప్రభుత్వం మింక్లను చంపేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మింక్ల ద్వారా ఇద్దరు వ్యక్తులకు కరోనా వ్యాప్తి చెందినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో వాటివల్ల మానవులకు వైరస్ ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడిన ప్రభుత్వం మింక్లను హతమార్చాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మింక్ ఫార్మ్లను అన్నింటినీ నేలమట్టం చేయాలని స్పష్టం చేసింది. దీంతో 10వేల మింక్లు మృత్యువాత పడనున్నాయి. కాగా చైనా, డెన్మార్క్, పోలాండ్ దేశాలు మింక్ల సంఖ్య ఎక్కువగా ఉండగా ప్రతి ఏడాది 60 మిలియన్ల మింక్లను హతమారుస్తున్నారు. (మరింత తగ్గిన మరణాల రేటు) -
పశువులపైనా వైరస్ పడగ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రజానీకంపై ఒకపక్క కరోనా వైరస్ పంజా విసురుతోంటే, మరోపక్క మూగజీవాలపై పాక్స్ వైరస్ కుటుంబానికి చెందిన వైరస్ పడగ విప్పుతోంది. ఈ వైరస్తో సోకుతున్న ‘లంపీస్స్కిన్ వ్యాధి’కారణంగా ఆవులు, దూడల చర్మంపై బొడిపెలు వస్తున్నాయి. ఈ వైరస్ గతేడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసి, ఈ ఏడాది మార్చి నాటికి మన రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించినట్టు పశువైద్య వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మంతో పాటు ప్రస్తుతం కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లోని ఆవులు, దూడల్లో దీన్ని గుర్తించామని, గేదెల్లో మాత్రం లక్షణాలు కనిపించలేదని అంటున్నాయి. ఈ వైరస్ తీవ్రత ఈసారి కొంచెం ఎక్కువే ఉందని, పశుసంవర్థక శాఖ అప్రమత్తంగానే ఉందని, ఇప్పటికే దీని నివారణకు వ్యాక్సినేషన్ పూర్తి చేశామని, పాడి రైతులు ఈ వైరస్ను గుర్తిస్తే ఆందోళన చెందకుండా తమను సంప్రదించాలని ఆ శాఖ అధికారులు సూచిస్తున్నారు. (సీఎం ఆఫీసులో కరోనా కలకలం) అమ్మతల్లి తరహాలో.. మనుషులకు అమ్మతల్లి (మశూచి) సోకినట్టే ఆవులకూ ఈ వైరస్ సోకుతుందని తెలుస్తోంది. ఈ వైరస్ వల్ల వచ్చే వ్యాధి కారణంగా పశువుల ఒంటి నిండా పెద్దపెద్ద బొడిపెలు వస్తున్నాయి. ఒడిశా రాష్ట్రం నుంచి ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాల మీదుగా అటవీ ప్రాంతాల నుంచి ఈ వైరస్ ఖమ్మం జిల్లాలోకి వచ్చిందని అధికారులు అంటున్నారు. వైరస్ను గుర్తించిన వెంటనే రింగ్ వ్యాక్సినేషన్ పూర్తి చేశామని చెబుతున్నారు. ఎక్కడైనా ఒక ఆవులో ఈ వైరస్ లక్షణాలు గుర్తిస్తే ఆ ఆవు ఉన్న గ్రామానికి 5 కిలోమీటర్ల చుట్టూ ఉన్న అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ చేశామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అంటున్నారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒక్క కొత్తగూడెం జిల్లాలోనే 6వేలకు పైగా ఆవులకు ఈ వ్యాధి సోకగా 23 చనిపోయినట్టు సమాచారం. ఈ జిల్లాలోనే 17వేలకు పైగా ఆవులకు వ్యాక్సినేషన్ చేశారు. మిగిలిన జిల్లాల్లోనూ దీని ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది. పెద్దగా భయపడాల్సిన పని లేదని అధికారులు అంటున్నా రైతులు ఈ వైరస్పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. (ఒక్కరోజే 206 కేసులు..) ఆందోళన అవసరం లేదు వైరస్ పూర్తి నియంత్రణలో ఉంది. దీన్ని గుర్తించగానే మా శాఖ అప్రమత్తమైంది. వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో చేశాం. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ వ్యాధి లక్షణాలు గుర్తిస్తే వెంటనే పశువైద్యులను సంప్రదిస్తే తగిన చికిత్స అందిస్తారు.– రాంచందర్, అడిషనల్ డైరెక్టర్, పశుసంవర్థక శాఖ మనుషులకు సోకే అవకాశం లేదు.. పశువుల్లో కనిపిస్తున్న ఈ వైరస్ కారణంగా మనుషులకు ఎలాంటి ఇబ్బంది లేదని పశువైద్య వర్గాలు తెలిపాయి. ఈ వైరస్కి జూనోటిక్ లక్షణం లేదని, మనుషులకు ఎట్టి పరిస్థితుల్లో సోకే అవకాశం లేదని అంటున్నారు. ఈ వైరస్ సోకిన పశువులకు కూడా సకాలంలో వైద్యం అందిస్తే ప్రాణహాని ఉండదని, మరణాల రేటు చాలా తక్కువని చెబుతున్నారు. గతంలో కూడా ఈ వైరస్ మన రాష్ట్రంలో కొన్నేళ్ల పాటు ఉందని, అయితే ఇప్పుడు కొంత తీవ్రంగా ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
2022లో అటవీ జంతువుల గణన చేస్తాం
సాక్షి, హైదరాబాద్: నల్గొండ జిల్లాలో గురువారం ఓ చిరుతకు మత్తు మందు ఇచ్చి పట్టుకున్నామని అటవిశాఖ ఓఎస్డీ శంకరన్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అటవీ జంతవులు జానావాసాలు, పంట పొలాల్లోకి వస్తున్నాయని తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు అధికంగా ఉండటంతో తాగటానికి జంతువులకు నీరు లేక జనావాసాల్లోకి చేరుతున్నాయని చెప్పారు. అభయ అరణ్యాల్లో అటవీ శాఖ తరఫున నీటి వసతి ఏర్పాటు చేశామని తెలిపారు. చిరుతల సంఖ్య ఎంత అనేది ఇప్పడు కచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నారు. అడవి జంతువులను ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి లెక్కిస్తారని చెప్పారు. 2018లో అడవి జంతవులలను లెక్కించామని మళ్లీ 2022లో జంతుల గణన చేస్తామని ఓఎస్డీ శంకరన్ తెలిపారు. -
మూగప్రేమ.. నిత్య సేవ
లాక్డౌన్లో ప్రజలతో పాటు మూగజీవాలకూ ఇబ్బందులు తప్పలేదు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో ఆకలికిఅలమటించాయి. నిత్యం వాటి సమాచారం తెలుసుకొని ఉదయాన్నే వాటికోసం ఆహారం సిద్ధం చేసి అందిస్తున్నారు సర్వజీవా సొసైటీ సభ్యులు. సేవలను ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించారు. సంస్థకు చెందిన వలంటీర్లు నిత్యం వాటికి ఆహారం పెడుతూ సేవలు అందిస్తున్నారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు మరింత విస్తృతంగా సేవలు కొనసాగుతాయని సంస్థ నిర్వాహకులు తెలిపారు. జూబ్లీహిల్స్: ఇంజినీర్ శివప్రకాష్ నేరేడ్మెట్లో ఆటోమొబైల్ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. చిన్ననాటి నుంచే మూగజీవాలపై ప్రేమతో వాటికి సేవలు అందిస్తున్నారు. మూగజీవాలపై కరుణ చూపే నగరానికి చెందిన వ్యాపారవేత్త లక్ష్మిభూపాల్తో కలిసి చాలాకాలంగా మూగజీవాలకు ఆహారం అందించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న తన షెడ్ను జీవాలకు ఆహారం అందించే కేంద్రంగా మార్చివేశారు. మార్చి 28వ తేదీన సైనిక్పురి ప్రాంతంలో 100 వీధి కుక్కలకు ఆహారం అందించడంతో లాక్డౌన్ సమయంలో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. క్రమంగా విస్తరించుకుంటూ నగరవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు. మూగజీవాలపై ప్రేమతో నగరం నలుమూలలా దాదాపు 250మంది వలంటీర్లు సంస్థకు తమవంతు సేవలు అందిస్తున్నారు. కీసరగుట్ట ఆలయం వద్ద కుక్కలకు, కోతులకు, గోశాలలోని ఆవులకు ఆహారం అందిస్తున్నారు. ఉప్పల్ మున్సిపాలిటీ వెటర్నటీ విభాగంతో కలిసి పనిచేస్తున్నారు. ఉదయం నుంచే సేవలు ప్రారంభం నిత్యం ఉదయం 4.30 గంటలకే కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మార్కెట్లలో ధాన్యాలు, పండ్లు, కూరగాయలు కొనుగోలు చేయడం, వండించడం, ఆహారాన్ని వలంటీర్లకు అందించడం వారి ద్వారా పంపిణీ చేయించడం చేస్తున్నాం. వ్యాధులకు గురవుతున్న ఆవులు, గేదెలకు వైద్యం చేయిస్తున్నాం. ప్రస్తుతం అందిస్తున్న సేవలకు నిత్యం రూ.15 వేల వరకు ఖర్చు అవుతోంది. దాతలు, స్నేహితుల సహకారంతో లాక్డౌన్ ముగిసి సాధారణ పరిస్థితులు వచ్చేవరకు ఆహార సరఫరా కొనసాగించేందుకు కృషి చేస్తున్నాం.– శివప్రకాష్, నిర్వాహకులు, సర్వజీవా సొసైటీ సేవా సంస్థ. -
జలముంటేనే జంగల్కు కళ
సాక్షి, హైదరాబాద్: అడవుల్లోని జంతువుల కోసం ఏర్పాటు చేసిన సోలార్ పంపుసెట్లు, సాసర్ పిట్ల వద్ద నిత్యం నీటి నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను పీసీసీఎఫ్ ఆర్.శోభ ఆదేశించారు. వివిధ జిల్లాల్లో అటవీ ప్రాంతాలను గ్రిడ్లుగా విభజించి, సహజ నీటి వనరులు లేని చోట కృత్రిమ వసతి ఏర్పాటుకు ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నచోట వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తున్నట్టు అటవీశాఖ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్లు, సీసీటీవీ కెమెరాలకు చిక్కినట్టు తెలిపారు. వేసవిలో వన్యప్రాణుల వేట కోసం వేటగాళ్లు ఉచ్చులు ఏర్పాటు చేసే అవకాశాలున్నందున, ఆయా ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్ చేయాలని, నీటి వసతుల వద్ద ప్రతిరోజూ ఈ తరహా చెకింగ్ ఉండాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో చేపట్టాల్సిన సమ్మర్ యాక్షన్ ప్లాన్పై శుక్రవారం అరణ్య భవన్ నుంచి జిల్లా అధికారులతో పీసీసీఎఫ్ ఆర్.శోభ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎండాకాలంలో టైగర్ రిజర్వ్లతో పాటు అన్ని అటవీ ప్రాంతాల్లో జంతువుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, నీటి వసతి ఏర్పాటు అంశాలను సమీక్షించారు. క్షీణించిన అటవీ ప్రాంతాలు, బోడి గుట్టలపై ఉపాధి హామీ పనుల అనుసంధానంతో వేసవిలో కందకాల తవ్వకం చేపట్టాలని, వానాకాలంలో నీటి నిల్వలకు అవి తోడ్పడతాయన్నారు. విధులు, అభివృద్ధి్ద పనుల నిర్వహణలో అధికారులు, సిబ్బంది అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని పీసీసీఎఫ్ హెచ్చరించారు. క్షేత్రస్థాయి సిబ్బంది, బీట్ ఆఫీసర్లు తమకు కేటాయించిన అటవీ బీట్లకు రెగ్యులర్గా వెళ్తున్నారా లేదా అన్న దాన్ని నోట్కామ్ యాప్ ఫొటోల ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో అదనపు పీసీసీఎఫ్లు లోకేష్ జైస్వాల్, డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, ఎంసీ పర్గెయిన్, సిధానంత్ కుక్రేటీ, ఓఎస్డీ ఎ.శంకరన్, చంద్రశేఖర్రెడ్డి, సునీతా భగవత్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
లాక్డౌన్ : తిండిలేక 200 కుక్కలు మృతి
ముంబై : కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు విధించిన లాక్డౌన్ కారణంగా తాగడానికి నీరు, సరైన తిండి లేక ముంబై, థానే, నవీ ముంబైలలో దాదాపు 200 కుక్కలు మృత్యువాత పడ్డాయని ‘సేవ్ ది పాస్’ అనే ఎన్జీఓ సంస్థ తెలిపింది. అరకొరగా దొరుకుతున్న ఆహారం కోసం కుక్కలు విపరీతంగా కలబడుతున్నాయని, ఈ కొట్లాటల కారణంగా కుక్కపిల్లలు చనిపోతున్నాయని పేర్కొంది. గత వారం ఆహారం తింటున్న తొమ్మిది కుక్కపిల్లలను ఓ పెద్ద కుక్క కొరికి చంపి, ఆహారం ఎత్తుకెళ్లిందని తెలిపింది. సేవ్ ది పాస్ ఫౌండర్ పూనమ్ గిద్వాని మాట్లాడుతూ.. ‘‘ వీధి జంతువులపై లాక్డౌన్ ప్రభావం ఎక్కువగా ఉంది. సరిపడా ఆహారం వాటికి దొరకటం లేదు. లక్షల వీధి జంతువులు మార్కెట్లు, రెస్టారెంట్లు, సరుకుల దుకాణాల వ్యర్థాలపై ఆధారపడి బ్రతుకుతున్నాయి. ( అత్యధిక కరోనా మరణాల రేటు ఆ రాష్ట్రంలోనే ) జనాలు ఇళ్లకు పరిమితం కావటంతో వీధి జంతువులకు గడ్డుకాలం ఏర్పడింది. మిల్క్ కాలనీ, ఫిల్మ్ సిటీలలో ఆకలి బాధతో పిల్లులు, కుక్కలు ఎక్కువగా చనిపోతున్నాయి. కుక్కలకు ఆహారం పెట్టేవాళ్లకు ఆదాయ మార్గాలు లేక ఇబ్బందులు పడుతున్నార’’ని వెల్లడించారు. కాగా, బాలీవుడ్ ప్రముఖులు రోహిత్ శెట్టి, ఫరాఖాన్, ప్రీతి సిమోఎస్లు ‘సేవ్ ది పాస్’ ద్వారా వీధి జంతువుల ఆకలి తీరుస్తున్న సంగతి తెలిసిందే. -
మర్కటాలకు మహాకష్టం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలోనే అత్యధిక అటవీ ప్రాంతం కలిగి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లాక్డౌన్ కారణంగా జనసంచారం తగ్గి వివిధ రకాల వన్యప్రాణుల పరిస్థితి మెరుగుపడగా, కోతులు మాత్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. చిరుతలు, ఎలుగుబంట్లు, దుప్పులు, జింకలు, అడవి దున్నలు, అడవి పందులు, కుందేళ్లు ప్రధాన రహదారుల సమీపంలో సైతం స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. వీటి పరిస్థితి ఇలా ఉంటే.. కోతు లు ఆహారం దొరక్క విలవిల్లాడుతున్నాయి. జిల్లాలో కోతులు అత్యధికంగా కొత్తగూడెం–మణుగూరు ప్రధాన రహదారి పక్కన మొండికుంట అటవీ ప్రాంతంలో, కొత్తగూడెం–ఇల్లెందు ప్రధాన రహదారి పక్కన, సారపాక అటవీ ప్రాంతంలో, పాల్వంచ–దమ్మపేట రహదారి పక్కన ములకలపల్లి అటవీ ప్రాంతంలో, కిన్నెరసాని డ్యామ్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణించేవారిలో అధికశాతం మంది కోతులకు నిత్యం ఆహార పదార్థాలను పెట్టేవారు. ఇలా జిల్లాలో సుమారు 20 వేల వరకు కోతులు వాహనదారులు అందించే పండ్లు, ఇతర ఆహార పదార్థాలపై ఆధారపడేవి. లాక్డౌన్తో జన సంచారం లేక కోతులు ఆహారం కోసం అలమటిస్తున్నాయి. కాగా.. ఈ ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడవుల్లో అడవి మామిడి, ఇతర ఫలాలు ఆశించిన రీతిలో కాయలేదు. వాతావరణం అనుకూలించకపోవడంతో రైతుల మామిడి తోటల్లోనూ కాయలు అనుకున్నంతగా కాయలేదు. తునికి కాయలు కూడా అంతంతమాత్రంగానే లభిస్తున్నాయి. దీంతో ఆహారం కోసం కోతులు వివిధ రహదారులపై రోజూ ఎదురుచూస్తున్నాయి. కొన్ని చోట్ల జనావాసాల్లోకి వచ్చి అందిన తిండి ఎత్తుకెళుతున్నాయి. అడపాదడపా కొందరు జంతుప్రేమికులు ఆహారం అందిస్తున్నప్పటికీ అది పరిమితమే కావడంతో రోడ్లవెంబడి మర్కటాలు దీనంగా తిరుగుతున్నాయి. ఎవరైనా వస్తారేమో.. ఏదైనా ఇస్తారేమో అని ఆశగా చూస్తున్నాయి. వేసవి వల్ల అటవీ ప్రాంతాల్లో చిన్న చిన్న కుంటలు సైతం ఎండిపోవడంతో దాహార్తి తీర్చుకునేందుకు కూడా వీలులేకుండా పోయింది. ఆదుకుంటున్న జంతు ప్రేమికులు ఆహారం దొరక్క అవస్థలు పడుతున్న వానరాలను అడపాదడపా జంతు ప్రేమికులు ఆదుకుంటున్నారు. జంతువులను ఆదుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా పలువురు పిలుపునిస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉండే కొందరు అప్పుడప్పుడు కోతులకు కూరగాయలు, తినుబండారాలు, పండ్ల వంటి ఆహార పదార్థాలను అందిస్తున్నారు. కాగా.. కోతులు వేల సంఖ్యలో ఉండడం వల్ల జంతు ప్రేమికులు అందించే ఆహారం వాటికి ఏమాత్రం సరిపోవడంలేదు. దీంతో అర్ధాకలితోనే వానరాలు అలమటిస్తున్నాయి. అడవుల్లో తిండి దొరక్క కోతుల గుంపులు సమీపంలోని జనావాసాల్లోకి వచ్చి తినే పదార్థాలు ఎత్తుకుపోవడం, స్థానికులపై దాడి చేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో వానరాలకు ఆహారాన్ని అందించి ఆదుకోవాలని పలువురు జంతు ప్రేమికులు కోరుతున్నారు. -
కరోనాతో వాటికి మంచి జరిగింది!
న్యూయార్క్ : మనం చెడు అనుకున్నది ఇంకొకరికి మంచి అనిపించవచ్చు. కొందరికి నష్టం కలిగించేది.. మరికొందరికి లాభం చేకూర్చవచ్చు. కరోనా వైరస్ విషయంలో ఈ రెండు వాఖ్యాలు చెల్లుబాటవుతాయి. వైరస్ కారణంగా అమెరికా మొత్తం అతలాకుతలం అవుతోంది. ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు ఒంటరిగా తమను పెంచుకునే వారు లేక ఇబ్బందిపడ్డ కొన్ని జంతువులు మాత్రం ఓ ఇంటివవుతున్నాయి. దేశంలోని జంతు సంరక్షణ కేంద్రాలు ఖాళీ అవుతున్నాయి. వివరాలు.. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇంటికి పరిమితమైన చాలామంది సంరక్షణ కేంద్రాల్లోని జంతువులను దత్తత తీసుకోవటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో అమెరికాలోని చాలా మటుకు జంతు సంరక్షణ కేంద్రాలు ఖాళీ అవటం మొదలుపెట్టాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, గెనిపిగ్స్, కోళ్లను దత్తత తీసుకుంటున్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో అమెరికన్లు ఇష్టమైన జంతువుల్ని దత్తత తీసుకుని సంతోషపడుతున్నారు. ( థూ.. నువ్వసలు మనిషివేనా? : వైరల్ ) -
లాక్డౌన్ మూగజీవాలకు అందని పశుగ్రాసం
-
కరోనా: జంతువుల కోసం కుంచె పట్టి..
-
వినూత్నంగా విరాళాలు సేకరించిన చిన్నారి
లాక్డౌన్ వల్ల పేద ప్రజలకు పూట గడవడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఎంతోమంది పెద్ద మనసుతో ముందుకు వచ్చి వారికి నిత్యావసర సరుకులు అందిస్తూ, నిర్భాగ్యులకు భోజనం పెడుతున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా తమకు తోచిన విధంగా సాయం చేస్తూ కష్టకాలంలో మీకు అండగా మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ పన్నెండేళ్ల కూతురు అన్యా జంతువుల కోసం ఆలోచించింది. వాటికి భోజనం ఎలా దొరుకుతుందని తనలో తానే మధనపడింది. మండుటెండలో తిండీ, నీళ్లు దొరక్క అవి చనిపోకూడదని నిశ్చయించుకుంది. అందుకోసం మూగజీవాల చిత్రాలను గీసి వాటిని అమ్మకానికి పెట్టింది. ఒక్కో చిత్రాన్ని రూ.1000 చొప్పున అమ్మింది. అలా ఇప్పటివరకు రూ.70 వేల వరకు విరాళాలను సేకరించింది. (కరోనా కుయ్యో మొర్రో) ఈ విషయాన్ని డైరెక్టర్ ఫరాఖాన్ ట్విటర్లో స్వయంగా వెల్లడించారు. తన కూతురు అన్య డ్రాయింగ్ ద్వారా ఐదురోజుల్లో 70 వేల రూపాయలను సేకరించిందని తెలిపింది. వీటిని వీధి జంతువులకు ఆహారాన్నందించేందుకు వినియోగించనున్నట్లు పేర్కొంది. పెంపుడు జంతువుల చిత్రాలను గీయమని ఆర్డర్లు ఇచ్చినవారితోపాటు, విరాళాలిచ్చినవారికి కతజ్ఞతలు తెలిపింది. కాగా చిన్నాపెద్ద, సామాన్యుడు సెలబ్రిటీ తేడా లేకుండా అందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నేను సైతం అంటూ ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. (‘హ్యాపీ బర్త్డే మమ్మీ.. లవ్ యూ ఎవర్’) -
జంతువులు కూడా ‘సామాజిక దూరం’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడకుండా తప్పించుకునేందుకు మనమంతా లాక్డౌన్ పేరిట సామాజిక దూరం పాటిస్తున్నాం. వైరస్ లాంటి మహమ్మారిలు దాడి చేసినప్పుడు మనుషులే కాదు, కొన్ని యుగాలుగా జంతువులు కూడా సామాజిక దూరం పాటిస్తున్నాయి. కోతులు, సముద్ర పీతలు, క్రిములు , చీమలు, పక్షులు ఇలా సామాజిక దూరాన్ని పాటిస్తాయని వర్జీనియాలో బయోలాజికల్ ప్రొఫెసర్గా పని చేస్తోన్న దానా హావ్లీ తెలిపారు. అయితే మనుషులు పాటించే సామాజిక దూరానికి జంతువులు, పక్షులు పాటించే సామాజిక దూరం కాస్తా భిన్నంగా ఉంటుందని, అవి ఎక్కువగా తమ ప్రవర్తన ద్వారా సామాజిక దూరాన్ని పాటిస్తాయని చెప్పారు. ('వ్యాక్సిన్ తయారీకి ప్రయోగాలు కొనసాగుతున్నాయి') గుంపులుగా జీవనం సాగించే చీమలు, కోతులు కూడా సామాజిక దూరాన్ని పాటిస్తాయంటే మనకు ఆశ్చర్యం కలగక మానదు. పలు రకాల చీమలు చిన్న చిన్న గదుల్లో వందలు, వేలు కలసి జీవిస్తాయి. చీమల్లో జబ్బు పడిన చీమ తనంతట తానే స్వచ్ఛందంగా ఏకాంతంలోకి వెళుతుంది. మిగతా చీమలు కూడా తమ తోటి చీమలతో సంబంధాలను వీలైన మేరకు తగ్గించుకుంటాయి. ‘మాండ్రిల్స్’ లాంటి కోతి జాతిలో జబ్బు పడిన కుటుంబ సభ్యులకు మాత్రమే కోతులు సేవ చేస్తాయి. ఇతర కుటుంబ సభ్యులకు సేవ చేయవు. పైగా ఆ సమయంలో ఇతర కోతులతో అవి సామాజిక దూరాన్ని పాటిస్తాయి. (కరోనా: ‘మర్కజ్, నిజాముద్దీన్ అని చెప్పొద్దు’) ఇక పిశాచ గబ్బిలాలు తమలో జబ్బు పడిన గబ్బిలాలకు తమ, పర అన్న తేడా లేకుండా ఆహారాన్ని అందిస్తాయి. అయితే వాటికి సమీపంలో మసలడం, చుట్టూ తిరగడం, పక్కనే వేలాడడం చేయవు. సముద్ర జలాల్లో ఉండే ‘పనులిరస్ ఆర్గస్ వైరస్ (పీఏవీ1)’ భౌతిక కలయిక ద్వారా ఒక సముద్ర పీత నుంచి మరో పీతకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన పీతల్లో 60 శాతం పీతలు 80 రోజుల్లో మరణిస్తాయి. ఆ సమయంలో జబ్బు పడిన పీతల వద్దకు ఇతర పీతలు వెళ్లకుండా సామాజిక దూరాన్ని పాటిస్తాయి. (‘కోవిడ్ ప్రొటెక్షన్ రైళ్ల’లో..) మనుషులకు కూడా సామాజిక దూరం పాటించడం మన పూర్వుల నుంచి అబ్బిందని వైద్యులు చెబుతుండగా, మానవ అవతార పరిణామా క్రమంలో జంతువుల నుంచే సంక్రమించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గబ్బిలాల వలనే జబ్బు పడిన వారిని లేదా ఆకలితో అలమటిస్తున్న ఇతరులను ఆదుకునే నైజం మానవుడికి కూడా అబ్బింది. అందరిని ఆదుకోలేక పోయినా చాలా మంది ఇరుగు, పొరుగు వారినో, స్నేహితులతో ఆదుకుంటారు. భౌతిక స్మర్శ లేకుండా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంతోపాటు అనుబంధాలను కొనసాగించే అవకాశం జంతువులకు లేదు, మనుషులకు మాత్రమే ఉంది. అలాంటప్పుడు వైరస్లు విజృంభించినప్పుడు మానవుడే చిత్తశుద్ధితో సామాజిక దూరాన్ని పాటించే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మానవుడు సంఘజీవి. ఎక్కువ కాలం సామాజిక దూరం పాటించలేరనే వాదన కూడా ఉంది. అయితే నేడు ఎంతమంది సంఘం స్ఫూర్తితో బతుకుతున్నారో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. (కరోనా కాలం: చెట్టుపైనే మకాం!) -
జూలో జంతువులు సేఫ్
సాక్షి, హైదరాబాద్: అమెరికా న్యూయార్క్లోని బ్రాంక్స్ జూలో నాలుగేళ్ల పెద్దపులి (నాదియా)కి కరోనా వైరస్ సోకడం ప్రపం చవ్యాప్తంగా కలకలం సృష్టించింది. నాదియాతోపాటు మరో మూడు పులులు, మూడు ఆఫ్రికా సింహాల్లోనూ పొడి దగ్గు పెరగడం, ఆకలి మందగించడం వంటి కోవిడ్ లక్షణాలు కనిపించడంతో అక్కడి జూ అధికారులు అలర్టయి ఆ జూతోపాటు న్యూయార్క్లోని మరో మూడు జూలు, ఆక్వేరియంను నిరవధికంగా మూసేశారు. పులుల ఆలనాపాలనా చూసే వారి ద్వారా నాదియాకు కరోనా వచ్చిందని భావించినా అది నిరూపితం కాలేదని... ప్రస్తుతమైతే అన్ని పులులు కోలుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్లోని జూలు, అభయారణ్యాలు, నేషనల్ పార్కులు, జింకల పార్కుల్లోని జంతువులకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వాటి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటూ రాష్ట్రాల అటవీశాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో హై అలర్ట్... రాష్ట్రంలోని జూలు, పులుల అభయారణ్యాలు, జూపార్కులు, నేషనల్ పార్కుల్లోనూ హైఅలర్ట్ జారీ చేశారు. జంతువులను 24 గంటలపాటు సీసీ టీవీల్లో పరిశీలించాలని, వాటి ప్రవర్త న, ఆరోగ్యంలో మార్పులను గమనించి అనారోగ్య సూచనలు కనిపిస్తే వెంటనే చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని జూపార్క్లో పులులు, ఇతర జంతువుల సంరక్షణకు చేపడుతున్న చర్యలకు సంబంధించి నెహ్రూ జూలాజికల్ పార్కు క్యూరేటర్ క్షితిజ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివిధ అంశాలు వెల్లడించారు. మార్చి మొదటివారం నుంచే సిబ్బందికి శానిటైజర్లు అందజేయడంతోపాటు ముందుజాగ్రత్త చర్యలను ముమ్మరం చేసినట్లు ఆమె చెప్పారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు క్యూరేటర్ మాటల్లోనే... జంతువులన్నీ ఆరోగ్యంగానే.. జూలోని జంతువులన్నీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాయి. ప్రస్తుతం జూలోని పరిస్థితులన్నీ బాగున్నాయి. ఎలాంటి పరిస్థితి వచ్చినా దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ›జూలోని పులులు, ఇతర జంతువులకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, ఆకలి మందగించడం వంటి లక్షణాలుంటే వాటి శాంపిళ్లను పరీక్షల కోసం పంపించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. జూలో ప్రత్యేక చర్యలు... జూలో ఎప్పటికప్పుడు చేపట్టే చర్యలతోపాటు ప్రత్యేకంగా సోడియం హైపోక్లోరిన్, యాంటీ వైరల్, ఇతర ద్రావకాలను స్ప్రే చేస్తున్నాం. స్టాండర్డ్ ప్రొటోకాల్ ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి, ప్రతినెలా ఒకసారి వివిధ రూపాల్లో ప్రత్యేక పరిశుభ్రæతా చర్యలు పాటిస్తాం. దీనికి అదనంగా చర్యలు చేపడుతున్నాం. సిబ్బందికి పరీక్షలు... జూలో పనిచేసే సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యానిమల్ హ్యాండ్లర్ల నుంచి జంతువులకు వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. సఫారీల్లోపలే జంతువులు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 15 నుంచి జూకి సందర్శకులను అనుమతించడం లేదు. సఫారీలు నిలిచిపోయాయి. వాటిలోని జంతువులను బయటకు రానివ్వడం లేదు. సఫారీ ప్రాంతాల్లోనే వాటికి ఎండ, గాలి తగిలేలా వదిలేస్తున్నాం. నిత్యం పరిశీలన... డిప్యూటీ, అసిస్టెంట్ డైరెక్టర్లు, వెటర్నరీ డాక్ట ర్లు, సిబ్బందితో కూడిన బృందాలు ప్రతి రోజూ అన్ని జంతువులను నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. ఏ జంతువు ప్రవర్తనలోనైనా మార్పును గుర్తిస్తే వాటి శాంపిళ్లను పరీక్షల కోసం పంపిస్తాం. పులులు సహా ఏ జంతువైనా అనారోగ్యానికి గురైతే ఐసోలేషన్లో పెట్టాలని ఆదేశాలున్నాయి. ప్రస్తుతమైతే అన్ని జంతువులను వాటి ఎంక్లోజర్లలోనే ఉంచుతున్నాం. – క్షితిజ -
మనుషులు ఇళ్లకు, జంతువులు బయటకు
సాక్షి, న్యూఢిల్లీ : మనుషులు తమ తోటి మనుషులను ప్రేమించినా, ప్రేమించక పోయినా అప్పుడప్పుడు అడవుల్లోకి వేళ్లో, జంతు ప్రదర్శనశాలలకు వెళ్లో జంతువులను చూసి ఆనంద పడి పోతుంటారు. జంతువుల ఏకాంతాన్ని లేదా ప్రశాంతతను భంగం కలిగించినప్పుడు వాటికి మనుషుల మీద కోపం వస్తుంది. ఆహారం దొరక్కపోతే తప్పా జంతువులు మనుషులు విహరించే ప్రాంతాల్లోకి రావు. కోరలు సాచిన కరోనా కారణంగా మనుషులు ప్రస్తుతం ఇంటికే పరిమితం అవడంతో జనం సంచరించే ప్రాంతాల్లోకి వన్య ప్రాణులు, ఇతర జంతువులు వచ్చి అల్లరి పిల్లల్లాగా ఆనందిస్తున్నాయి. (మూడోదశకు కరోనా: ఎయిమ్స్) లండన్లోని లాంకషైర్లోని ఓ ప్రాథమిక పాఠశాలలోకి ఇటీవల ఓ గొర్రెల మంద జొరపడి స్కూలు పిల్లలు గుడ్రంగా తిరిగే చట్రంపైకి ఎక్కి కాళ్లతో చక్రం తిప్పుతూ తెగ ఆనందించాయి. ఆ సుందర దశ్యాన్ని yð బ్బీ అలీస్ అనే యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. మరెక్కడో సముద్రం ఒడ్డున నర పురుగులేని చోట ఓ జింక, అలల కెరటాలతో పోటీ పడి గెంతులు వేసింది. లేచి పడుతున్న అలల తీవ్రతకు, సంగీతం లాంటి వాటి ఘోషకు అనుగుణంగా చిందులు వేస్తున్న జింకను చూస్తుంటే మనుషులు కూడా మైమరచి పోతాం. ఎవరో వీడియో గ్రాఫర్ తీసి పోస్ట్ చేసిన ఈ వీడియో కూడా ఆన్లైన్లో వైరల్ అవుతోంది. -
జంతు సంరక్షణకు చర్యలేవీ..?
నాగార్జునసాగర్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ఫారెస్ట్లో భాగమైన నాగార్జునసాగర్ రిజర్వ్ఫారెస్ట్ కోర్ ఏరియాలో జంతువుల సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత అనివార్యంగా మారింది. గతంలో పోలిస్తే జంతువుల సంఖ్య పెరిగినట్లుగా అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఫిబ్రవరి మాసంలోనే ఎండలు మండిపోతుండడంతో తాగునీటికి మూగజీవాలు ఇబ్బందులు పడకుండా ఇప్పటినుంచే తగు చర్యలు తీసుకోవాలని జంతుప్రేమికులు కోరుతున్నారు. కానరాని పులుల జాడ పలురకాల జంతువులు అటవీ ప్రాంతంలో తిరుగాడుతున్నప్పటికీ పులుల జాడ మాత్రం కనిపించడం లేదు. గతంలో ఇక్కడ పులులు తిరగడంతో టైగర్వ్యాలి అనే పేరున్న లోయ కూడా ఉంది. నాగార్జునసాగర్ ఫారెస్ట్ డివిజన్లో దేవరకొండ, నాగార్జునసాగర్ కంబాలపల్లి రేంజ్లలో కలిపి 41వేలహెక్టార్లలో అటవీప్రాంతం ఉంది. అభయారణ్యమంతా సాగర్ జలాశయంతీరం వెంట ఉంది. దేవరకొండ రేంజ్లో 26,785హెక్టార్లలో అటవీప్రాంతం ఉండగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన 30కెమెరాల ద్వారా 20కి పైగా చిరుతలు ఉన్నట్లు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. పెరిగిన జంతువుల సంఖ్య అడవిలో మనుబోతులు, దుప్పులు, కణితులు, ఎలుగుబంట్లు చౌసింగ, సింకార, రేస్కుక్కలు, హైనాలు, మూసిక జింకలు, నెమల్లు తదితర జంతువుల సంఖ్య ఊహించని రీతిలో పెరిగినట్లుగా అటవీశాఖ అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా.. గతంలో అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. అయితే సంబంధిత అధికారులు ముందస్తుగానే మేల్కొ ని వాటిని అరికట్టాల్సిన అవసరం ఉంది. గతంలో అటవీ ప్రాంతంలోకి జీవాలు రాకుండా కందకాలు తవ్వడంతో పాటు పలు చోట్ల మొక్కలు నాటారు. ప్రస్తుత వేసవి దృష్ట్యా ఆ కందకాల్లో చెత్తా చెదారం పేరుకుపోయింది. అటవిని ఆనుకుని ఉన్న తండాల ప్రజలు ఎవరైన సిగరెట్, బీడీ పీకలు పడేసిన అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ముందుగా అధికారులు సమీప తండాల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నీటి వసతికి చర్యలు చేపడుతున్నాం అటవీ ప్రాంతంలోని జంతువుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నాం. మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు గతంలో అడవిలో శాసర్పీట్స్ను నిర్మించాం. వాటిలో నీటిని నింపేందుకు సిబ్బందిని ఆదేశించాం. అదే విధంగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా సమీప తండాల్లో దండోరా వేయించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.– డీఎఫ్ఓ గోపి రవి -
జంతు మార్కెట్లవుతున్న ల్యాబ్లు
సార్స్, ఎబోలా, మెర్స్, చికెన్ గున్యా, జికా, ఇప్పుడు కరోనా వైరస్ ముందుగా జంతువులకు వచ్చి అటు నుంచి మనుషులకు సోకినట్లు వైద్యులు భావిస్తున్న విషయం తెలిసిందే. చైనా, వుహాన్లోని ‘హువానన్ సీఫుడ్ మార్కెట్’ నుంచి కరోనా వైరస్ వ్యాపించిందని చైనా వైద్యులు నిర్ధారించారు. ఆ మార్కెట్లో చేపలు, రొయ్యలు,పీతలలాంటి జలచరాలతో పాటు కోళ్లు, కొంగలు,సజీవ కుందేళ్లు,ఎలుకలు, గబ్బిళాలు, ఇతర వన్యప్రాణులను విక్రయిస్తుండం వల్ల కొత్తరకం కరోనా వైరస్ ఆవిర్భవించిందని వైద్యులు అనుమానిస్తున్నారు.(కోవిడ్-19 : 18 నెలల్లో తొలి వ్యాక్సిన్ ) భిన్న రకాల జంతువులు, ప్రాణులు ఒక చోట ఉండడం వల్ల వైరస్లు ఎలా పుడుతున్నాయో తెలుసుకోవడం ద్వారా, వాటి నివారణ వ్యాక్సిన్ను కనుగొనేందుకు ప్రపంచంలోని పలు దేశాల్లో వైద్యులు పరిశోధనలు సాగిస్తున్నారని అమెరికాలోని కొలరాడో స్టేట్ యూనివర్శిటీ బయోమెడికల్ సైన్స్ ప్రొఫెసర్ రిచర్డ్ బోవెన్ తెలిపారు. ఇందుకోసం అమెరికా, ఇండోనేసియా సహా పలు దేశాల ల్యాబుల్లో పలు రకాల జంతువులను నిర్బంధించి అధ్యయనం చేస్తున్నారు. కరోనా వైరస్పై జరగుతున్న పరిశోధనలు కూడా త్వరలోనే ఫలించే అవకాశం ఉందని బోవెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. బర్డ్ ఫ్లూ కోసం మందు కనుక్కోవడం కోసం వైద్యులు కోళ్లు, కొంగలు, పావురాలు, ఎలుకలను ఒక చోట ఉంచి పరిశోధనలు జరిపి విజయం సాధించారట.(‘కరోనా’ను అడ్డుకునే మాస్క్లేమిటి?) -
కార్డన్ సెర్చ్లో దుప్పి కొమ్ములు గుర్తింపు
కొమరోలు(గిద్దలూరు): కార్డన్ సెర్చ్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అక్కడి ఇళ్లలో గుర్తించిన అడవి జంతువుల కొమ్ములు, ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాటు సారా అరికట్టేందుకు శుక్రవారం మండలంలోని ఎర్రగుంట్ల గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వేకువజామునే గ్రామానికి చేరుకున్న గిద్దలూరు సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది గ్రామంలో అణువణువూ పరిశీలించారు. రాకపోకలు సాగిస్తున్న వాహనాలను ఆపి పత్రాలను, డ్రైవింగ్ లైసెన్స్లను పరిశీలించారు. పత్రాలు సక్రమంగా లేని 10 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. అదేవిధంగా గ్రామంలోని పలు గృహాల్లో తనిఖీలు నిర్వహించగా 11 దుప్పి కొమ్ములు, మూడు చిన్నపాటి ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు వివిధ అవసరాల కోసం ఉపయోగించే కత్తులు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. దుప్పికొమ్ములు, ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులకు అప్పగించామని సీఐ యు.సుధాకర్రావు చెప్పారు. ఇలాంటి వాటిని కలిగి ఉండటం చట్ట విరుద్దమన్నారు. కార్యక్రమంలో కొమరోలు, గిద్దలూరు, రాచర్ల, బేస్తవారిపేట ఎస్ఐలు ఎస్.మల్లికార్జునరావు, షేక్ సమందర్వలి, త్యాగరాజు, రవీంద్రారెడ్డి, ఎక్సైజ్ ఎస్సై రాజేంద్రప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే ఇక్కడి ప్రజలు ఎర్రచందనం దుంగలతో రోకళ్లు, పచ్చడి బండలు తయారు చేసుకుని ఉపయోగిస్తారని, దుప్పి కొమ్ములను శుభ సూచకంగా ఇళ్లలో అలంకరిస్తారని స్థానికులు తెలిపారు. -
విమానాశ్రయంలో ఊసరవెల్లి, కోతులు స్వాధీనం
చెన్నై,అన్నానగర్: థాయ్ల్యాండ్ నుంచి చెన్నైకి బుధవారం విమానంలో అక్రమంగా తీసుకొచ్చిన కోతులు, ఉడత, తొండలను విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని థాయ్ల్యాండ్ దేశానికి తిరిగి పంపించడానికి అధికారులు చర్యలు తీస్తున్నారు. చెన్నై మీనమ్బాక్కమ్ విమానాశ్రయానికి బుధవారం థాయ్ల్యాండ్ నుంచి వచ్చిన విమానంలో ప్రయాణం చేసిన చెన్నైకి చెందిన సురేష్ (28) మీద అనుమానం చెందిన విమానాశ్రయ అధికారులు విచారణ చేపట్టారు. అతను పొంతనలేని సమాధానం చెప్పడంతో అతని లగేజ్ని పరిశీలించారు. అందులో ఉన్న నాలుగు ప్లాస్టిక్ పెట్టెలను విప్పి చూడగా అమెరికా దేశాలలో నివసించే 12 ఊసరవెల్లులు, తొండలు, రెండు చిన్న కోతులు, థాయ్ల్యాండ్, మలేషియా దేశాలలో నివసించే రెండు జాతుల ఉడతలు ఉన్నాయి. అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని థాయ్ల్యాండ్ దేశానికి తిరిగి పంపించడానికి చర్యలు తీసున్నారు. . -
మూగజీవాల అమ్మ
మనిషికి ఏదైనా అపాయం జరిగినా కన్నెత్తి చూడని, నోరెత్తి పలకరించిన ఈ సమాజంలో మూగజీవాల గాయాలకు మందు రాసి, బలికాబోయే జీవాలను రక్షించి ప్రేమగా అక్కున చేర్చుకుంటున్నారు ఢిల్లీ వాసి అంజలి గోపాలన్. ‘ఆల్ క్రియేచర్స్ గ్రేట్ అండ్ స్మాల్’ అనే పేరుతో మూగజీవాలకు ఆశ్రమం ఏర్పాటు చేసిన అంజలి ప్రతీ మూగజీవి ఆరోగ్యం, పోషణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఒక గేదె కాలి వెనుక భాగంలో గాయమై ఎటూ కదలక ఉండటం గమనించింది అంజలి గోపాల్. దాని కాలికి కట్టుకట్టి, మేత వేసింది. ఎంతకాలం ఎదురు చూసినా దాని సంబం«ధీకులు ఎవరూ రాలేదు. దాంతో తను స్థాపించిన షెల్టర్కి చేర్చింది అంజలి. దానికి భీమ్ అని పేరు పెట్టింది. భీమ్ 700 మూగజీవాల్లో ఒకటిగా చేరింది. అన్ని జీవాలకు ఒక్కో పేరు పెట్టి, తాను పెట్టిన పేరుతో వాటిని పిలుస్తూ బిడ్డల్లా సాకుతుంది అంజలి గోపాలన్. ఈ ఆశ్రమంలో వందకు పైగా కన్ను, చెవులు పోయిన జీవాలున్నాయి. ఈ మూగజీవాల గురించి అంజలి మాట్లాడుతూ ‘మానవ ప్రపంచంలో ఎందుకూ పనికి రావనుకున్న జీవాలను ఏదో విధంగా చంపేస్తుంటారు. అలాంటి దృశ్యాలను చూసి, మనసు చెదిరి ఈ షెల్టర్ను ఏర్పాటు చేశాను’ అని చెబుతారు. గాయాలకు మందు ఢిల్లీ కుతుబ్ మినార్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరీదాబాద్ జిల్లాలోని సిలఖారీ గ్రామంలో అంజలి గోపాలన్ ఈ మూగజీవాల ఆశ్రమం నడుపుతోంది. 1994లో ఢిల్లీలో హెచ్ఐవి బాధితుల కోసం ఆశ్రమాన్ని స్థాపించిన సామాజిక కార్యకర్త ఆమె. ఇప్పుడు ఈ ప్రాంతానికి సందర్శకులూ వచ్చి చూస్తుంటారు. ‘2012లో ఈ షెల్టర్ను ప్రారంభించినప్పుడు చుట్టుపక్కల అంతా ఇదో ‘పిచ్చి’ ప్రయోగం అన్నారు. రాజధానిలో అంజలి ఒక జంతువుల ఆశ్రమాన్ని చూసినప్పుడు అక్కడ ఉంచిన జంతువుల స్థితిని చూసి భయపడ్డారు. జంతువులకు నరకంగా ఉన్న ఆ పరిస్థితులను చూసి మానవులుగా మనం మరింత పాపం చేస్తున్నట్టు భావించారు. కానీ, సరైన స్థలం ఎక్కడా దొరకలేదు. హెచ్ఐవి సోకిన వ్యక్తుల కోసం ఏర్పాటు చేసిన ఆశ్రమం అప్పటికే బాధితులతో నిండి ఉంది. అప్పుడే అంజలి ఫరీదాబాద్లో రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసి, షెల్టర్ ఏర్పాటు చేశారు.. వృద్ధాప్యం, అనారోగ్యం, గాయాల కారణంగా బయట జీవించలేని కుక్కలను ఈ షెల్టర్లో ఉంచాలనుకుంది. ముందు 55 శునకాలతో ప్రారంభమైంది. ఇప్పుడు ఈ షెల్టర్లో 460 జీవాలు సేదతీరుతున్నాయి. రక్షణ కేంద్రం మెల్ల మెల్లగా కొన్నాళ్లకు పెద్ద జంతువులు రావడం మొదలైంది. దీంతో ఒక్కోరకం జంతువులకు ఒక్కో తరహా స్థలం కేటాయించారు. ఈ షెల్టర్కి వచ్చిన ప్రతి జీవి వైద్యచికిత్స పూర్తయ్యాక గాని ఇక్కడ నుంచి బయటకు రాదు. 23 మంది సిబ్బంది వీటిని పర్యవేక్షిస్తుంటారు. ‘ఈ జీవాలను చూస్తే మానవ క్రూరత్వం ఎంతటిదో అర్థమవుతుంది’ అంటుంది అంజలి. ‘జైపూర్ నుంచి ఒక యువకుడు ఒంటెను తీసుకొచ్చాడు. దానికి ఎలాంటి పోషణ లేదు. పైగా దాని తలమీద సుత్తితో తీవ్రంగా బాదిన గాయం. ఆ గాయం నయం కావడానికి ఐదేళ్లు పట్టింది. అలాగే కత్తికి బలికాబోయే సమయంలో రక్షించిన 20 మేకలు ఇక్కడ ఉన్నాయి. పొడవాటి జుట్టు, గడ్డం అంత పొడవుగా వేలాడే చెవులు ఉన్న ఓ పర్వత మేక, వైద్య పరిశోధన కోసం తీసుకెళ్లి కోయాలనుకున్న మేక.. ఇలా ఒక్కోటి రక్షింపబడి ఇక్కడకు చేరుకున్నవాటిలో ఉన్నాయి. కుక్కలను, ఆవులను ప్రేమగా నిమిరి, గేదెలు, దూడలు సమూహంతో కాసేపు గడిపి ఈమూ పక్షులతో సంభాషించడంతో అంజలి గోపాలన్ రోజు గడుస్తుంది. – ఆరెన్నార -
మన జూకు విదేశీ వన్యప్రాణులు!
బహదూర్పురా: నెహ్రూ జూలాజికల్ పార్కుకు కొత్త జీవులు రానున్నాయి. ఇక్కడి అధికారులు ఇతర దేశాల నుంచి వన్యప్రాణులను తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. జూపార్కు ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా జపాన్ జూ నుంచి రెండు జతల కంగారూలను, ఒక జత మిర్కట్స్ (ముంగీసలు)ను తీసుకురానున్నామని జూ అధికారులు పేర్కొన్నారు. సౌతాఫ్రికా నుంచి జీబ్రాలను తీసుకొస్తామని గతంలో పేర్కొన్నారు. జూపార్కులో లేని వన్యప్రాణులన్నింటినీ తీసుకొచ్చేందుకు విదేశాల్లోని జూ పార్కుల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అందుకనుగుణంగా తాజాగా జపాన్ నుంచి రెండు జతల కంగారూలు, జత ముంగీసలను జంతువు మార్పిడిలో భాగంగా తీసుకొచ్చేందుకు ప్రణాళికలను రూపొందించారు. జూ అధికారుల ప్రణాళికలు సఫలమైతే విదేశీ వన్యప్రాణులై కంగారూలు, ముంగీసలు, జీబ్రాలు సందర్శకులను అలరించే అవకాశముంది. జూ పార్కుకు ఇవి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సౌతాఫ్రికా నుంచి జిబ్రాలను తీసుకొస్తామని పేర్కొన్న జూ అధికారులు సంవత్సరాలు గడుస్తున్నా సఫలీకృతులు కాలేకపోయారు. ఈసారి అలా కాకుండా జపాన్, సౌతాఫిక్రాల నుంచి కొత్త వన్యప్రాణులను తీసుకొచ్చి జూకు మరింత శోభ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
హృదయ కాలేయం@వరాహం
గుండె సమస్య వచ్చిందా.. కొత్త గుండె కావాలా.. నో ఫికర్.. రంధి ఎందుకు పంది ఉందిగా.. మూత్ర పిండాలు చెడిపోయాయి.. కొత్తవి కావాలా.. అలా పందుల ఫాం దాకా వెళ్లొస్తే సరి.. కాలేయం కరాబ్ అయిందా.. అరే బాయ్.. వరాహం ఉందిగా.. అదే వెయ్యి వరహాలు లెక్క! అసలేంటి? పంది ఉంటే.. ప్రాబ్లెమ్ లేకపోవడమేంటి? పందికి మనకు ఉన్న ఆ లంకె ఏంటి? అన్నీ అనుకున్నట్లు జరిగితే.. సమీప భవిష్యత్తులో పంది మనపాలిట వరాహావతారమే కానుంది. ఎందుకంటే.. మనకు ఏ అవయవం కావాలన్నా.. పంది శరీరం నుంచి తీసుకోవచ్చంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. మన అవయవాలను పందిలో పెంచుకో వచ్చని వారు చెబుతున్నారు. మన మూల కణాలను (స్టెమ్సెల్స్) వేరే జంతువులోకి చొప్పించి.. మన అవయవాలను పెంచే అవకాశాలపై ప్రొఫెసర్ హిరోమిట్సు నకౌచీ అనే శాస్త్రవేత్త తన బృందం తో కలసి పదేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా మానవుల అవయవాలను ఏదైనా క్షీరదంలో ప్రవేశపెట్టి.. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా జపాన్ ప్రభుత్వం వీరికి అనుమతిచ్చింది. ఇలా పెంచుతారట.. ఇప్పటికే మూల కణాలను ఉపయోగించి అవయవాలను వృద్ధి చేసే ప్రయోగాలు చాలానే జరిగాయి. - ఏ అవయవాన్ని పెంచాలనుకుంటున్నామో ముందు శాస్త్రవేత్తలు నిర్ణయించుకుంటారు. - మన మూల కణాలను క్షీరదం (జంతువు) పిండంలోకి ఎక్కించి.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డీఎన్ఏలో మార్పులు చేస్తారు. - డీఎన్ఏ మార్పులు చేయడం ద్వారా మనకు కావాల్సిన అవయవం మళ్లీ పెరగకుండా ఉండేందుకు దోహదపడుతుంది. - దీనివల్ల పిండం ఎదుగుతున్న కొద్దీ దాని శరీరం లో వేరే (మానవుడి) అవయవం పెరిగినా ఇబ్బందులు రాకుండా ఉంటుంది. - ఆ తర్వాత ఆ పిండాన్ని తల్లి క్షీరదం గర్భంలోకి ఎక్కిస్తారు. - గర్భంలో సాధారణ జంతువు మాదిరిగానే పెరుగుతుంది. - అయితే పుట్టబోయే జంతువులో మనకు కావాల్సిన అవయవం సాధారణంగా పెరుగు తుంటుంది. కానీ అందులోని ప్రతి కణం మాత్రం మానవుడిదే. - ఆ జంతువు ఎదిగిన తర్వాత మనకు కావాల్సిన అవయవాన్ని ఆ జంతువును చంపేసి తీసుకుని రోగి శరీరంలోకి మార్పిడి చేసుకోవచ్చు. సాధ్యమయ్యే పనేనా.. మన మూల కణాలను జంతువు తన శరీరంలో ఎలా వాడుకుంటుందనే విషయంపై ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. ఉదాహరణకు మూల కణాలు మనం అనుకున్న అవయవం కాకుండా వేరే భాగాల్లో ముఖ్యంగా జంతువు మెదడులోకి వెళ్లి.. మనలాగే తెలివి మీరితే ఏం చేస్తారన్న దానికి పరిశోధకుల దగ్గర సమాధానం లేదు. ఎంతవరకు మానవుల లాగా వాటి శరీరాలు మారిపోతాయన్నది కూడా సమాధానం లేని ప్రశ్నే. తొలుత ఎలుకలపై ఇలాంటి పరిశోధనలు చేసి, ఆ తర్వాత పందుల పిండాల్లోకి మన మూలకణాలను ఎక్కించి పెంచుతానని ప్రొఫెసర్ హిరోమిట్సు చెబుతున్నాడు. ఇలా మన మూలకణాలున్న పిండాలు పూర్తిగా గర్భంలో ఎదిగి ఆ జంతువు ప్రసవం అయ్యే వరకు ఉంచేలా అనుమతినిస్తూ జపాన్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. బ్రిటన్, ఫ్రాన్స్ ఇలాంటి ప్రయోగాలకు వారి దేశాల్లో అనుమతివ్వలేదు. అయితే ఈ వివాదాస్పదమైన ప్రయోగం వల్ల భవిష్యత్తులో మానవ విలువల విషయంలో సమస్యలు వస్తాయని, ఇలాంటివి ఇప్పటివరకు ప్రయోగ దశలోనే ఆగిపోయాయని, మరి ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూద్దామని చాలా మంది పెదవి విరుస్తున్నారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
అదంతే..అనాదిగా ఇంతే!
బొమ్మలతో ఆడుకోవడమంటే చిన్న పిల్లలకు సరదా.. వాటిని చూడగానే ఎంత మారాం చేసే వారైనా నిమిషంలో అట్టే సైలెంట్ అయిపోతారు. సంవత్సరం లోపు వయసున్న పిల్లలకు దాదాపు గిలక్కాయ వంటి చప్పుడు చేసే వస్తువులు ఇస్తుంటాం. ఆ వస్తువుల్లో పెద్ద తేడా ఉండదు. కానీ వాళ్లు పెరుగుతున్న కొద్దీ వారు ఆడుకునే బొమ్మల్లో తేడా వస్తుంటుంది. ఆడ పిల్లలైతే బార్బీ బొమ్మలు, టెడ్డీ బేర్, కిచెన్ సెట్లు, పెళ్లి కూతురు బొమ్మలను ‘ఇస్తుంటాం’. అదే మగ పిల్లలయితే కార్లు, బైకులు, ట్రక్కులను ‘ఇస్తుంటాం’.. అంతేనా..? మనమే ఇస్తుంటామా.. లేదా వారే అలా కోరుకుంటారా..? ఇలా బొమ్మలను ఎంచుకోవడం, ఆడ, మగ పిల్లలు వేర్వేరుగా పెరగడంలో సమాజం పాత్ర ఏమైనా ఉందా.. లేదా సహజంగానే ఆ ఎంపిక జరుగుతోందా..? ఇదే విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని జంతువులపై బీబీసీ ప్రయోగం జరిపింది. ఎంపికలో తేడా అనాదిగానే ఉందని, మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా ఇలాంటి ప్రవర్తనే ఉంటుందని ఈ పరిశోధనల్లో తేలింది. జెండర్ న్యూట్రల్ బొమ్మలు లింగ వివక్ష చూపుతూ బొమ్మలు తయారు చేస్తున్నారంటూ ప్రపంచవ్యాప్తంగా అభ్యంతరాలు వస్తున్నాయి. ‘కిండర్ జాయ్’కూడా మగ పిల్లలకు, ఆడ పిల్లలకు వేర్వేరు బొమ్మలు తయారు చేస్తుండటంపై ఈ మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. లింగ వివక్షచూపే బొమ్మలు ఉండొద్దని.. అందరు పిల్లలకూ ఒకే రకమైన బొమ్మలు తయారు చేయాలని (జెండర్ న్యూట్రల్ టాయ్స్) ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆటలోనూ ఆడ, మగ జంతువులు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో బార్బీ బొమ్మలు, టెడ్డీ బేర్స్, కార్లు, బైకులు, ట్రక్కులు ఇలా చాలా బొమ్మలను పరిశోధకులు ఉంచారు. బబూన్ కోతి పిల్లలను పరిశీలించినప్పుడు ఆడ కోతి పిల్లలేమో టెడ్డీబేర్ వంటి బొమ్మలతో ఆడుకున్నట్లు, మగ కోతి పిల్ల లేమో కార్లు, ట్రక్కులతో ఆడుకున్నట్లు గమనించారు. మిగతా జంతువుల్లో కూడా దాదాపు ఇలాంటి ప్రవర్తనే గుర్తించారు. ‘జంతువులు ఇలా చేస్తున్నాయంటే వాటికి ఎవరైనా నేర్పుతున్నారా? కాదుకదా సహజంగానే అవి ఎంచుకుంటున్నాయి. ఇలాంటి ప్రవర్తనే మానవు ల్లో కూడా అనాదిగా ఉంది. ఎవరూ నేర్పించట్లేదు. ఇది సహజమైన ప్రక్రియే’అని జీవ పరిణామ శాస్త్రవేత్త ప్రొ.బెన్ గారడ్ పేర్కొన్నారు. -
మా దారి.. రహదారి!
సాక్షి, టెక్కలి: ‘నా దారి.. రహదారి.. నా దారికి అడ్డు రాకండి.’ 1990 దశకంలో ఓ సూపర్ హిట్ సినిమాలోని ప్రాచుర్యం పొందిన డైలాగ్. ప్రస్తుతం ఇదే డైలాగ్ టెక్కలి పట్టణంలో హల్చల్ చేస్తుంది. కాకపోతే మనుషులు కాదు.. మూగజీవాల విషయంలో. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని పలువీధుల్లో పశువులు ఇష్టారాజ్యంగా సంచరిస్తుండటంతో వాహనదారులు తరచూ అనేక రకాల ప్రమాదాలకు గురవుతున్నారు. టెక్కలిలో ఆవుల యజమానులు రెండు పూటలా పాలు సేకరించి, రోడ్లపైనే వాటిని వదిలేస్తున్నారు. దీంతో పశువులు ఆహారం కోసం రోడ్లపై హల్చల్ చేస్తున్నాయి. రోడ్డుపై వ్యాపారం చేసుకోనే వారి దుకాణాల్లో ప్రవేశించి, అక్కడి పండ్లు, వితర పదార్థాలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో వ్యాపారులు తమకు నష్టం కలిగిస్తున్నాయని మూగ జీవాలను సైతం కొట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గతంలో రహదారులపై సంచరిస్తున్న ఆవులను బంధించి, వాటి యజమానులకు జరిమానాలు విధిస్తామని పలుమార్లు పంచాయతీ అధికారులు హెచ్చరించారు. అయితే అది పూర్తిస్థాయిలో ఆచరణలోకి రాకపోవడంతో పశువుల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా రహదారులపై అడ్డంగా నిద్రపోవడం, పరుగులు తీయడం వంటి వాటి వల్ల వాహనదారులు బెంబేలెత్తి పోతున్నారు. పట్టణంలో అధికంగా ట్రాఫిక్ ఉండే వైఎస్సార్ జంక్షన్, అంబేడ్కర్ జంక్షన్, పెట్రోల్ బంక్ ప్రాంతం, చిన్నబజార్ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో ఆవుల సంచారం అధికంగా ఉందని ప్రయాణికులు, వాహనదారులు వాపోతున్నారు. జీవాలన్నీ రహదారిపైనే ఇటీవల టెక్కలిలోని పలు వీధుల్లో శునకాలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. వీధుల్లో అధిక సంఖ్యలో తీరుగులు తీస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనదారులను వెంబడిస్తుండటంతో తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రధానంగా అంబేడ్కర్ జంక్షన్ నుంచి ఇందిరాగాంధీ జంక్షన్ వరకు రాత్రి సమయంలో తిరిగాలంటేనే భయపడుతున్నారు. అదేవిధంగా గతంలో వీధులకు శివారు ప్రాంతాల్లో సంచరించే పందులు సైతం ప్రస్తుతం వీధి మధ్యలో తీరుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండే ప్రదేశంలో గుంపులుగా అనేక వ్యాధులకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పదుల పెంపంకందార్లు వాటిని గ్రామాలకు దూరంగా ఉంచేవారని, ఇటీవల ఆవులు, కుక్కల తరహాలో రోడ్లపైనే వదిలేస్తుండటంతో.. అవి పరుగులు పెడుతూ ప్రమాదాలకు హేతువులుగా మారుతున్నాయన్నారు. దీనిపై పంచాయతీ, పోలీసు అధికారులు సంయుక్తంగా దృష్టి సారించి, సంబంధిత యజమానులతో సమావేశం నిర్వహించడంతో పాటు పశువులు రహదారుల పైకి రాకుండా వారితో మాట్లాడి, చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. చర్యలు తప్పవు దీనిపై ఇది వరకే చర్యలు చేపట్టాం. చాలా వరకు రోడ్లపై తిరుగుతున్న జీవాలను పంచాయతీ కార్యాలయాలకు తరలించి, యజమానులకు అపరాధ రుసుం విధించాం. మళ్లీ ఇదే విధంగా జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాం. అయినప్పటికీ వారిలో మార్పు రాకపోవడంతో మరోసారి సమస్యపై దృష్టి సారించాం. ఇప్పటికైనా జీవాల యజమానులు స్పందిస్తే మేలు. – శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి, టెక్కలి -
తొలకరి లేత గడ్డితో జాగ్రత్త!
వర్షాకాలంలో పశువులకు సోకే వ్యాధుల్లో బ్యాక్టీరియా వ్యాధి గొంతు వాపు / గురక వ్యాధి (హిమరేజిక్ సెప్టిసీమియా) ముఖ్యమైనది. పాస్టురెల్లా మల్టొసై అనే బ్యాక్టీరియా వల్ల ఇది సోకుతుంది. తొలకరి వర్షాల తర్వాత మొలకెత్తిన లేత గడ్డి మీద పేరుకుపోయిన ఈ బ్యాక్టీరియా, మేత ద్వారా పశువు శరీరంలోకి ప్రవేశిస్తుంది. దాదాపుగా అన్ని పశువులు ఈ వ్యాధి బారిన పడతాయి. ఈ దిగువ తెలిపిన కారణాల వల్ల వ్యాధి తీవ్రమవుతుంది. ♦ పశువులకు పరాన్న జీవుల / వైరస్ / బ్యాక్టీరియా వ్యాధులు ముందుగానే ఉన్నట్లయితే.. ♦ దున్నపోతులు ఎక్కువగా పనిచేసి అలసిపోయినప్పుడు.. ♦ పశులు రవాణా సమయంలో.. ఉన్నట్లుండి మేత మార్పిడి వలన.. ♦ వాతావరణ మార్పులు – ఎక్కువగా వేడి, గాలిలో తేమ.. ♦ నీరసంగా ఉన్న పశువులు.. ♦ వ్యాధి సోకిన పశువులను వేరుగా ఉంచడం / ఉంచకపోవడం.. వ్యాధి లక్షణాలు ♦ వ్యాధి త్వరగా సంక్రమించడం ♦ ఎక్కువగా జ్వరం ♦ నోటిలో చొంగ కార్చడం ♦ కళ్ల కలక, కంటి వెంబడి నీరు కారడం ♦ నెమరు నిలిచిపోవడం ♦ రొప్పడం, వైద్యం అందకపోతే చనిపోవడం ఎక్యూట్ కేసులలో అయితే, ఆయాసపడడం, నొప్పిగా అరవడం, ఊపిరికి కష్టపడడం, మెడ క్రింద భాగాన, గంగడోలు ప్రాంతాల్లో నీరు చేరి ఉబ్బరింపుగా ఉండడం (బ్రిస్కట్ ఎడిమా) ముందర కాళ్లు కూడా నీరు పట్టినట్లు కనబడడం లాంటి లక్షణాలను కనబరుస్తుంది. పశువు గొంతులో ఈ సూక్ష్మక్రిములు ఒక్కోసారి తిష్ట వేసుకుంటాయి. పశువు నీరసించి పోయినప్పుడు లేదా పశువులో వైరల్ వ్యాధులు ఇతర పరాన్నజీవులు దాడి చేసినప్పుడు, ఈ గొంతులోని సూక్ష్మక్రిములు విజృంభిస్తాయి. బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన 30 గంటలకు వ్యాధి లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 6 నెలలు – 3 సంవత్సరాల పెయ్య / పడ్డలకు సోకుతుంది. నివారణ ♦ పరిశుభ్రమైన పాకలు, మంచి యాజమాన్యపు పద్ధతులు, ముందుగా వ్యాధి నిరోధక టీకా వేయించడం, ఆరోగ్యవంతమైన పశువులను వ్యాధి ప్రబలిన ప్రాంతాలకు వెళ్లకుండా కట్టడి చేయడం, చనిపోయిన పశువులను సక్రమంగా పాతిపెట్టడం చేయాలి. రైతులకు అవగాహన కలగజేయాలి. ♦ వ్యాధి సోకిన పశువులకు వైద్యం కోసం సల్పాడిమిడైన్ 50 కేజీల బరువుకు 30 మిల్లీ లీటర్లు చొప్పున కండకు ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. పెన్సిలిన్, టెట్రాసైక్లిన్లు ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. 2 లేదా 3 రూపాయలతో నివారణ టీకా వేయించుకోవడం మేలు. ♦ ఏ టీకా అయినా పూర్తి స్థాయిలో పశువుకు పనిచేయాలంటే కనీసం 2 వారాల సమయం పడుతుంది. కాబట్టి రైతు సోదరులారా త్వరపడడండి. – డా. ఎం.వి.ఎ.ఎన్.సూర్యనారాయణ ,(99485 90506), ప్రొఫెసర్ అండ్ హెడ్, పశుగణ క్షేత్ర సముదాయం, పశువైద్య కళాశాల, తిరుపతి -
జంగల్లో జల సవ్వడి
సాక్షి, హైదరాబాద్: మండుతున్న ఎండలకు నోరులేని మూగజీవాలు, అరణ్యాల్లో బతుకుతున్న జంతుజాలం, పక్షిజాతులు, వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. నీటి జాడ కోసం వెతుక్కుంటూ జనాల మధ్యకు వస్తుండటంతో మానవులకు, మృగాలకు మధ్య సంఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అటవీ శాఖ చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తోంది. అడవుల్లో జంతువులకు నీరు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నీటి తొట్ల నిర్మాణం, వాటిల్లో నిత్యం నీరుండేలా ట్యాంకర్ల ద్వారా సరఫరా, అవసరమైన చోట సోలార్ బోర్వెల్స్ ఏర్పాటు చేసి వన్య ప్రాణుల దాహార్తి తీరుస్తోంది. వాగులు, వంకల పరిసరాల్లో చెలిమెలు తీయగా, సహజ నీటివనరులు లేనిచోట సిమెంట్ తొట్టెలు, సోలార్ ప్యానెళ్లు, బోర్పంపుల్ని అటవీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. కీకారణ్యాల్లో చెరువులు, కుంటల్లో పూడిక తీత, ఇసుక నేలలు తోడడం వంటి చర్యలు చేపట్టారు. ఇక రోడ్డు మార్గాలున్న చోట సాసర్పిట్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. నీరు త్వరగా ఇంకిపోకుండా అడుగుభాగాన టార్పిలిన్ ఉంచుతున్నారు. గ్రిడ్ల ద్వారా కొత్త వ్యూహం.. అటవీ ప్రాంతాల్లోని అడవుల్లోపల, రక్షిత ప్రాంతాల వెలుపల అందుబాటులో ఉన్న నీటి వనరుల పర్యవేక్షణకు గ్రిడ్ వ్యవస్థను అమలుచేస్తోంది. రక్షిత ప్రాంతాల వెలుపల ఉన్న చోట్లలో 9 చదరపు కి.మీ. పరిధిలో గ్రిడ్లు ఏర్పాటు చేసింది. 4,576 గ్రిడ్లను ఏర్పాటు చేసింది. వీటిలో 2,290 గ్రిడ్లలో నీటి లభ్యత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నీరు అందుబాటులో లేని గ్రిడ్స్లలో 584ను అత్యంత ప్రాధాన్యత గలవిగా గుర్తించి వాటి పరిధిలో నీటి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఫలించిన క్షేత్రస్థాయి పరిశీలన.. అడవుల్లో జంతువుల కోసం తాము ఏర్పాటు చేసిన నీటివనరులతో పాటు, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితి సమీక్షకు ఈ నెల 11, 12 తేదీల్లో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్, డెక్కన్ బర్డర్స్, హైటికోస్, ఎఫ్డబ్ల్యూపీఎస్ స్వచ్ఛంద సంస్థలకు చెందిన 110 వాలంటీర్లు అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్లు, ఏటూరునాగరం వన్యప్రాణి అభయారణ్యాల పరిధిలో ‘వాటర్హోల్’ సెన్సెస్ నిర్వహించారు. వీరందరిని 43 బృందాలుగా విభజించి అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ అడవుల్లోని 241 నీటి వనరులను పరిశీలించారు. ఈ అడవుల్లో అందుబాటులో ఉన్న నీటివనరులతో పాటు, ఇవి లేనిచోట అటవీశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అవి ఏ మేరకు జంతువులకు ఉపయోగపడుతున్నాయన్న తీరును పరిశీలించారు. మంచి ఫలితాలు వచ్చాయి.. గతంతో పోలిస్తే వేసవిలో నీటిజాడను వెతుక్కుంటూ వ్యవసాయ భూముల్లోకి వస్తున్న వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా తగ్గిందని అడ్మిన్, వైల్డ్లైఫ్ ఇన్చార్జి అడిషనల్ పీసీసీఎఫ్ మునీంద్ర ‘సాక్షి’కి తెలిపారు. కొన్నిచోట్ల అడవి దున్నలు, జింకలు, ఇతర జంతువులు తమ సంతతితో కనిపించడాన్ని బట్టి ఆయా జంతు జాతులు ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందడానికి సంకేతంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చేపడుతున్న చర్యలతో రాష్ట్రంలోని అడవుల్లో 70–75 శాతం గ్రిడ్లలో నీరు అందుబాటులోకి వచ్చిందని ఫారెస్ట్ ఓఎస్డీ శంకరన్ చెప్పారు. -
ఆకలి.. చలి : అరుదైన జంతుజాతి బలి
ఒక పక్క కండరాలను నలిపేసే గడ్డకట్టించే చలి.. మరోవైపు పేగులు మెలిపెట్టే ఆకలి అరుదైన మూగ జీవుల పాలిట అశని పాతంలా తగిలింది. దీంతో ఈశాన్య రాష్ట్రం సిక్కిం పర్వత ప్రాంతాల్లో అరుదైన జంతు జాలి బలైపోయింది. కనీసం 300 అరుదైన హిమాలయన్ జడల బర్రెలు ప్రాణాలొదిలాయి. తాజాగా మంచు కరుగుతుండటంతో వీటి కళేబరాలు బయపడుతున్నాయి. ప్రభుత్వ అధికారి రాజ్ యాదవ్ అందించిన సమాచారం గత ఏడాది డిసెంబర్నుంచి సుదీర్ఘ కాలంగా కురుస్తు మంచు ఈ విషాదానికి దారితీసింది. ఉత్తర సిక్కింలోని ముగుతాంగ్, యమ్తంగ్ పర్వతాలను సందర్శించే స్థానిక నిర్వాహకులు, పశువైద్యులు బృందం వీటి కళేబరాలను శుక్రవారం కనుగొన్నారని ఉత్తర సిక్కిం జిల్లా మేజిస్ట్రేట్ రాజ్ యాదవ్ చెప్పారు. ముగాతాంగ్ , యమ్తంగ్ లోయ ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వాకరా ఆహారం జార విడవడానికి అధికారులు పలుసార్లు ప్రయత్నించినా, వాతావరణ అననుకూల పరిస్థితుల కారణంగా విఫలమయ్యారని యాదవ్ చెప్పారు. వీపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా వాటికి ఆహారాన్ని సరఫరా చేయాల్సింది స్థానికులను కోరినట్టు తెలిపారు. 500 జడల బర్రెలు చనిపోయినట్టుగా స్థానికుల ద్వారా తెలుస్తోందని, ఈ సంఖ్యని ధృవీకరించడానికి ప్రయత్నిస్తున్నాయని యాదవ్ తెలిపారు. మరికొన్నింటికి తక్షణ వైద్య సహాయం అందిస్తున్నట్టు వెల్లడించారు. అలాగే పశు సంరక్షణ శాఖ వైద్య బృందం ముకుతాంగ్కు ఇప్పటికే చేరుకున్నట్టు తెలిపారు. మరోవైపు చనిపోయిన పశువులను పాతిపెట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మూగరోదన
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : కరువుజిల్లాలో పశువులు రోదిస్తున్నాయి. పచ్చగడ్డిని అటుంచితే మండుతున్న ఎండలకు ఎండిన గడ్డికూడా దొరక్క అల్లాడుతున్నాయి. ఆకలితో అలమటిస్తున్న జీవాలు కడుపు నింపుకోవడానికి కంటికి కనిపించినవన్నీ తింటున్నాయి. రోడ్లపై చెత్తబుట్టల్లో పడేసిన పాలిథిన్ కవర్లు తిని ఆకలి తీర్చుకుంటున్నాయి. అవి జీర్ణంకాక చివరకు తనువు చాలిస్తున్నాయి. ఆకలితో పశువులను చంపుకోవడం ఇష్టం లేక చాలా చోట్ల యజమానులుజీవాలను కబేళాలకు తరలిస్తున్నారు. క్షేత్రస్ధాయిలో మూగజీవాలకు పశుగ్రాసం అందుబాటులో ఉంచాల్సిన అధికారులు దానిపై దృష్టిసారించక పోవడంతో ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తగ్గిపోతున్న పశు సంపద జిల్లాలో 2,45,043 దావులు, 1,34,259 గేదెలు, 17,83,759 గొర్రెలు, 2,43,819 మేకలు ఉన్నాయి. అయితే వీటికి అవసరమైన మోతాదులో పశుగ్రాసాన్ని సమకూర్చడంలో అ«ధికారులు విఫలమయ్యారు. పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేయడం కోసం 2018–19 సంవత్సరానికి గాను 390 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు (పీసీ23 జొన్న రకం) 75 శాతం సబ్సిడీపై పశుసంవర్థశాఖ అ«ధికారులు సుమారు 72వేల మంది రైతులకు పంపిణీ చేశారు. గడ్డి విత్తనాలను పంపిణీ చేసినా సాగు చేసునేందుకు తగినంత సాగునీరు లభించక పోవడంతో పశుగ్రాసం ఉత్పత్తి చేయలేకపోయారు. వీటిలో రెండున్నర మెట్రిక్ టన్నుకు మించి పశుగ్రాసం ఉత్పత్తి కాలేదు. దీంతో కొందరు పాడి రైతులు మేతను బయట కొనుగోలు చేసి పశువులకు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో ట్రాక్టర్కు రూ.10వేల పైనే వెచ్చిస్తున్నారు. ఇక అంత ఆర్థిక స్థోమత లేని కొందరు రైతులు ఆకలితో అలమటిస్తున్న పశువులను కబేళాలకు తరలిస్తున్నారు. ప్రత్నామ్యాయ మార్గాలు ద్వారానైనా పశుగ్రాసాన్ని సమకూర్చి పశుసంపదను కాపాడవల్సిన సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. తమ ముందే పశువులు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యంకావడం లేదు. అందువల్ల గతంలో మాదిరిగా లభ్యత గల ప్రాంతాల్లో పశుగ్రాసాన్ని కొనుగోలు చేసి జిల్లాలో పశువులకు అవసరమైన మేర సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 92 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం కొరత జిల్లాలో ఉన్న పశువులకు మొత్తం 6.57 లక్షల మెట్రిక్ టన్నుల మేత అవసరం ఉంది. ఇందులో ప్రస్తుతం 5.65 లక్షల మెట్రిక్ టన్నుల మేత లభ్యత ఉందనీ 92వేల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం కొరత ఉన్నట్లు పశుసంవర్థకశాఖ అధికారులే చెబుతున్నారు. అనధికారింకంగా పశుగ్రాసం కొరతగా ఇంకా ఎక్కువే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో అవసరం మేరకు పశుగ్రాసం అందుబాటులో ఉండేలా అధికారులు 75శాతం సబ్సిడీపై పీసీ23 జొన్నరకం గడ్డి విత్తనాలను 390 మెట్రిక్ టన్నులు రైతులకు పంపిణీ చేశారు. దీంతో పాటు పశుగ్రాసం వృథాను అరికట్టేందుకు 325 మంది రైతులకు 50 శాతం సబ్సిడీపై గడ్డి కత్తరించే యంత్రాలనూ ఇచ్చారు. కానీ ఎండలకు పశుగ్రాసం ఎదగక మేత అందని పరిస్థితి నెలకొంది. -
వన్యప్రాణుల దాహార్తికి.. వనాల్లో చర్యలు
సాక్షి, హైదరాబాద్: వేసవిలో వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అటవీశాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అడవులు, అభయారణ్యాల్లో జంతువులు తాగునీటికి ఇబ్బందులు పడకుండా ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టింది. నీటి ఎద్దడి కారణంగా ఏ ఒక్క జంతువూ మరణించకుండా.. తాగునీటి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటికే 50 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. ఈ వేసవి ముగిసే లోగా అటవీ జంతువుల తాగునీటి వసతికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అడవుల్లో 75 శాతం ఏర్పాట్లు పూర్తిచేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే ఏడాదికి 100 శాతం తాగునీటిని ఏర్పాటు చేయాలని తెలంగాణ అటవీశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో... ఈసారి కూడా ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటిదాకా గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అటవీ పరిసరాల్లోని వాగులు, వంకలు, కాలువలు ఎండిపోతున్నాయి. దీంతో వాటి పరిసరాల్లో చెలిమెలు తీసేపనిలో ఉన్నారు అటవీ శాఖ అధికారులు. ఇక సహజంగా నీటి వనరులు లేనిచోట సోలార్ బోర్పంపుల్ని ఏర్పాటు చేస్తున్నారు. వీటిద్వారా అందుబాటులో ఉన్న కుంటల్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణవ్యాప్తంగా మొత్తం 153 సోలార్ బోరు బావులను వేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటిదాకా 100 సోలార్ బావులను పూర్తి చేశారు. కీకారణ్యాల్లో చెరువులు, కుంటల్లో పూడిక తీత, ఇసుక నేలలు తోడడం వంటి చర్యలు చేపట్టారు. ఇక మనిషి చేరుకునేందుకు వీలుగా రోడ్డు మార్గాలున్న చోట సాసర్పిట్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. 800 నుంచి 1000 లీటర్ల సామర్థ్యంతో వీటిని నిర్మిస్తున్నారు. ఇందులో నీరు త్వరగా ఇంకిపోకుండా అడుగుభాగాన టార్పిలిన్ ఉంచుతున్నారు. వీటిలో ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నీటిని నింపుతున్నారు. ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో జంతువుల పరిశీలన.. వేసవిలో జంతువులు అడవి మొత్తంలో నీటి వనరుల వద్దకు తప్పకుండా వస్తాయి. అందుకే, జంతువులు నీళ్లు తాగే చోట ఇన్ఫ్రారెడ్ కెమెరాలు అమర్చారు. జంతువుల శరీర ఉష్ణోగ్రత కారణంగా.. అవి సమీపంలోకి రాగానే.. యాక్టివ్ అయి వీడియోరికార్డింగ్ మొదలు పెడతాయి. వీటి ద్వారా రోజుకు ఎన్ని జంతువులు నీరు తాగేందుకు వస్తున్నాయి? వాటి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? సంఖ్యలో పెరుగుదల– తగ్గుదల ఉందా? అన్న విషయాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. వేటగాళ్లపై నిఘా .. ఇవే నీటి వనరుల వద్ద వేటగాళ్ల సంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. అడవిలో అధి కంగా సంచరించే.. అడవి పందులు, దుప్పులు, జింకలు, ఎలుగుబంట్లు, నెమళ్లకు ఉచ్చులు బిగించి వేటగాళ్లు చంపుతున్నారు. వీటితోపాటు అప్పుడప్పుడూ.. పులులు, జాగ్వార్లు కూడా వేటగాళ్ల బారిన పడుతున్నాయి. వీరిపై నిఘా పెంచే చర్యలు చేపడుతున్నారు. -
మూగవేదన
అచ్చంపేట: పెద్ద పులుల సంరక్షణ ప్రాంతమైన నల్లమలలో వన్యప్రాణులు తాగునీటికి అల్లాడుతున్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టులో నీటి వనరులు వట్టిపోయాయి. ఐదేళ్లుగా నల్లమలలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో నీటివసతి ఉన్న ప్రాంతాలకు వన్యప్రాణులు వస్తున్నాయి. పంట పొలాలు, బోరు బావులు, చెరువుల వద్దకు వస్తున్నాయి. ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండేది. ఈసారి నెల రోజుల ముందే ఎండలు ఎక్కువగా ఉండడంతో సమస్య మరింత ఉత్పనమైంది. అభయారణ్య ప్రాంతంలోని వన్యప్రాణులకు ఎండకాలంలో తాగునీటి సమస్య తీర్చేందుకు అటవీశాఖ ప్రతి ఏటా రూ.లక్షల నిధులు ఖర్చు చేస్తోంది. ఈ నిధులతో వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్నామని బాహాటంగా చెబుతున్నా.. వాటికి నీరు అందడం లేదు. అటవీశాఖ పూర్తిస్థాయిలో వన్యప్రాణులకు నీటి వసతి కల్పిస్తే నీటి కోసం గ్రామాల వైపు జంతువులు ఎందుకు వస్తాయన్న భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జంతువులు సాధారణంగా ఆహార అన్వేషణలో భాగంగా 4కి.మీ. పరిధిలో తిరుగుతాయి. నల్లమలను అనుసరించి 140 కి.మీ. పరిధిలో కృష్ణానది ప్రవహిస్తుంది. అటవీ ప్రాంతంలో నిరంతరం నీళ్లు ఉండే సహజ జల వనరుల దగ్గర ఎక్కువగా ఉంటాయి. అటవీ సరిహద్దు గ్రామాలైన మన్ననూర్, మద్దిమడుగు, బాణాల, బిల్లకల్లు, లక్ష్మిపల్లి, అప్పాయిపల్లి, ఎర్రపెంట, చెన్నంపల్లి, వట్టువర్లపల్లి, సార్లపల్లి, కుడి చింతలబైలు, ఉడిమిళ్ల, తిర్మలాపూర్(బీకే) తదితర గ్రామాల్లో వ్యవసాయ పొ లాల్లో ఉండే బోర్ల వద్దకు దుప్పులు, ఎలుగుబంట్లు వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపా రు. బల్మూర్ మండలం బిల్లకల్లు అటవీ ప్రాంతంలోని రుసుల చెరువులో మాత్ర మే కొద్దిగా నీరు ఉంది. అత్యధికం గా వన్యప్రాణులు అక్కడి వస్తుంటాయి. వేసవిలో వన్యప్రాణులకు తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ఆర్భాటంగా ప్రకటించుకోవడమే తప్ప ఎక్కడ కూడా అమలు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అటవీశాఖ చెబుతున్న ఏర్పాట్లు ఇవే.. వన్యప్రాణుల తాగునీటి సమస్య అధిగమించడానికి గతంలో అటవీశాఖ నల్లమ ల ప్రాంతంలో 36 సాసర్లు ఏర్పాటు చేశా రు. వన్యప్రాణులు, జీవరాశులు సంచరించే ప్రాంతాల్లో గతేడాది 428 సాసర్లు నిర్మించడంతో పాటు పాతవాటికి కూడా మరమ్మతులు చేపట్టారు. వీటిని అత్యధికంగా రోడ్డు, వాహనాలు వెళ్లగలిగే ప్రాం తాల్లో నిర్మించారే గానీ లోతట్టు ప్రాం తంలో ఏర్పాటు చేయడం లేదు. వీటితో చాలా వరకు ప్రయోజనం తక్కువగా ఉం టుంది. అత్యధికంగా ఇవి పర్హాబాద్ నుం చి వ్యూపాయింట్, అప్పాపూర్, మల్లాపూ ర్, భౌరాపూర్, రాంపూర్, మేడిమల్కల రోడ్డు మార్గంలో ఉన్నాయి. పర్హాబాద్ వ ద్ద ఏర్పాటు చేసిన సోలార్ డిఫ్వెల్ పం పింగ్ సిస్టమ్తో ట్యాంకర్కు నీటిని నింపి వన్యప్రాణులకు తాగునీటి వసతి కల్పిం చాలి. రోజుకు ఒక ట్యాంకరు ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం అని అటవీ శాఖ అ«ధికారులకు చెబుతున్నా.. రెండు, మూడు రోజులకు ఒకసారి కూడా వెళ్లడం లేదు. ట్యాంకర్ల ద్వారా అటవీ జంతులవుల దాహార్తి తీరుస్తున్నామని అటవీ శాఖ లెక్కలు చెబుతున్నాయి గానీ అదీ ఆచరణంలో సక్రమంగా అమలు కావడం లేదు. అత్యధికంగా వన్యప్రాణులు తిరిగే ప్రదేశమైన పిచ్చకుంట్ల చెరువు, రాళ్లవాగు, గుడేశ్వరం, తాళ్లచెరువు నీళ్లులేక ఎండిపోయాయి. లోతట్టు అటవీ ప్రాంతంలో సాసర్ల ఏర్పాటు లేకపోవడంతో అక్కడ తాగునీరు లేక వన్యప్రాణులు బయటికి వస్తున్నాయి. సాసర్లలో నీటిని పోయిస్తున్నాం.. జంతువులకు నీటికి ఇబ్బంది లేదు. నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఉన్న అడవుల్లో 71 సాసర్లు, నాలుగు సోలార్ పంపులు ఏర్పాటు చేశాం. ట్రాక్టర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలోని అభయారణ్య ప్రాంతంలో అటవీశాఖ తరుఫున జంతువుల కోసం సాసర్లలో నీటిని పోయిస్తున్నాం. – గంగారెడ్డి, డీఎఫ్ఓ, మహబూబ్నగర్ -
గ్రాసం కరువై..పోషణ బరువై
చిత్తూరు అగ్రికల్చర్: జిల్లాలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. చివరికి పశువులకూ గ్రాసం కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు గ్రాసం కోసం సమీప రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలను ఆశ్రయిస్తున్నారు. అయితే అక్కడి నుంచి గడ్డిని కొనుగోలు చేసి తీసుకురావాలంటే ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం గ్రాసం కొరతను అధిగమించేందుకు కనీస చర్యలు చేపట్టడం లేదు. కొందరు రైతులు విధిలేని పరిస్థితిలోపశువులను కబేళాలకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా పాడి పరిశ్రమకు పెట్టింది పేరు. ఇక్కడి రైతులకు పంటల తర్వాత ప్రధాన జీవనాధారం పాడి పరిశ్రమే. మొత్తం 6.48 లక్షల రైతు కుటుంబాలు ఉంటే, వాటిలో దాదాపు 5.60 లక్షల రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా మొత్తం ఆవులు 10.20 లక్షలు, గేదెలు 84,605, మేకలు 4,29,014, గొర్రెలు 12,49,460 మేరకు ఉన్నాయి. రోజుకు ఒక ఆవుకు 5 కిలోల మేరకు వరిగడ్డి అవసరం ఉంటుంది. ఈ లెక్కన మొత్తం పశువులకు రోజుకు 5,500 టన్నుల మేరకు వరిగడ్డి అవసరం ఉంటుంది. అయితే జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం రైతుల వద్ద మరో రెండు వారాలకు మాత్రం సరిపడే గడ్డి మాత్రమే నిల్వ ఉంది. దీంతో పాడి రైతులు పశువులను కాపాడుకునేందుకు గడ్డి కోసం పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది. సాధారణంగా ఏటా తూర్పు మండలాల్లో రబీ సీజనులో కొంతమేర వర్షాలు కురిసి రైతులు పంటలు సాగు చేస్తారు. అందులో అధికంగా దాదాపు 42 వేల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో వరి పంటను ప్రధానంగా సాగులోకి తీసుకువస్తారు. దీంతో ఆ ప్రాంతాల్లోని పశువులకు వరిగడ్డి సమస్య తలెత్తేది కాదు. జిల్లాలోని పడమటి మండలాల్లో వరిగడ్డి సమస్య ఉత్పన్నమైనా పాడి రైతులు తూర్పు మండలాలకు వెళ్లి కొనుగోలు చేసుకుని తెచ్చుకునేవారు. అయితే ఈ ఏడాది నెలకొన్న తీవ్ర వర్షాభావం కారణంగా తూర్పు మండలాల్లో కనీసం మేరకు కూడా వర్షపాతం నమోదు కాలేదు. దీంతో అక్కడి రైతులు పంటలు సాగు చేయలేకపోయారు. ఫలితంగా ఆ ప్రాంతాల్లో కూడా వరిగడ్డి సమస్య ఉత్పన్నమైంది. కొనలేని స్థితి.. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది తీవ్ర వర్షాభావం నెలకొనడంతో పాడి రైతులు తమిళనాడు, కర్ణాటకలను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ట్రాక్టర్ గడ్డిని రూ.15 వేల నుంచి రూ.17 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈవిధంగా కొనుగోలు చేసిన గడ్డిని ట్రాక్టర్లకు లోడ్ చేసేందుకు కూలీలకు రూ.5 వేలు, అక్కడి నుంచి గ్రామాలకు తీసుకొచ్చేందుకు ట్రాక్టర్కు రూ.5 వేలు చొప్పున ఖర్చవుతోంది. దీంతో ట్రాక్టర్ వరిగడ్డిని తీసుకురావాలంటే మొత్తం రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకు రైతులు వెచ్చించాల్సి వస్తోంది. ట్రాక్టర్కు రెండు టన్నుల మేరకు మాత్రమే గడ్డిని నిపంపడం సాధ్యమవుతుంది. ఈ లెక్కన కిలో గడ్డి రూ.10 నుంచి రూ.11 వరకు ఖర్చవుతోంది. ఒకరోజుకు ఒక ఆవుకు 5 కిలోల చొప్పున వరిగడ్డి అవసరం ఉంటుంది. దీంతో ఒకరోజు ఒక ఆవును పోషించాలంటే కేవలం గడ్డికి మాత్రమే రూ.50 నుంచి రూ.60 వరకు వెచ్చించాల్సి ఉంది. ఇలాంటి అధిక ఖర్చులను వెచ్చించి గడ్డిని కొనలేక పశువులను పోషిం చుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక వడ్డీకి అప్పులు చేసి పశువులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఖర్చులను భరించలేని రైతులు ఆవులు, గేదెలను సంతల్లో అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. కానరాని పశుగ్రాస క్షేత్రాలు.. జిల్లాను పాల కేంద్రంగా మార్చాలన్నదే ధ్యేయమంటూ ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు గుప్పించింది. అయితే కరువు పరిస్థితుల్లో పశువులకు అవసరమైన గడ్డిని ఏర్పాటు చేయడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు అంటూ ఊదరగొట్టినా ఆచరణలో కానరావడం లేదు. కనీసం పశుగ్రాసం విత్తనాల పంపిణీ కూడా చేయడం లేదు. తగ్గిన పాల ఉత్పత్తి.. జిల్లాలో మొత్తం పాడి ఆవులు 10.20 లక్షలు ఉండగా, గేదెలు 84 వేల వరకు ఉన్నాయి. అందులో ప్రస్తుతం 3.75 లక్షల ఆవులు, 35 వేల గెదేలు పాలిస్తున్నాయి. వీటి ద్వారా ఈ ఏడాది జనవరిలో రోజుకు 32 లక్షల లీటర్ల మేరకు పాల దిగుబడి అయ్యేది. అయితే ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా గడ్డి కొరత తీవ్రరూపం దాల్చింది. దీంతో దీనికి తోడు వేసవి తాపం తోడైంది. ఫలితంగా పశువుల పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. దాదాపు 4 లక్షల లీటర్ల మేరకు పాల ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో పాడి రైతులకు ఆదాయం రోజురోజుకు తగ్గుముఖం పట్టింది. ఇలాంటి దుర్భర స్థితిలో పశువులను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అధిక వడ్డీలకు అప్పులు చేసి పశువులను కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మాది బైరెడ్డిపల్లె మండలం, నాపేరు వేణుగోపాల్రెడ్డి. నాకు నాలుగు పశువులు ఉన్నాయి. వాటిని పోషించుకునేందుకు గడ్డి లేకపోవడంతో శ్రీకాళహస్తి మండలం నుంచి ట్రాక్టర్ గడ్డి రూ.16 వేలకు కొనుగోలు చేశాం. గడ్డిని ట్రాక్టర్కు లోడ్ చేసేందుకు కూలీలకు రూ.5 వేలు, ట్రాక్టర్ బాడుగ మరో రూ.5 వేలు ఖర్చవుతోంది. ఇలాంటి పరిస్థితి ప్రతి పాడి రైతుకూ ఉంది. ప్రభుత్వం స్పందించాలి. -
పశువృద్ధి
ఆదిలాబాద్టౌన్: జిల్లాలోని పశువుల గణన ఎట్టకేలకు లెక్కతెలింది. పశుసంవర్థశాఖ అధికారులు రైతుల ఇంటింటికి వెళ్లి జిల్లాలో ని పశువుల వివరాలను వివరాలను సేకరించారు. జనాభా లెక్కల మాదిరిగానే ప్రతీ ఐదేళ్లకోసారి గణన చేపడతారు. కిందటిసారి 2012లో గణన చేపట్టారు. అనంతరం 2017లో ని ర్వహించాల్సి ఉండగా.. కేంద్రం ఒక సంవత్సరం ఆలస్యంగా ఈ ప్రక్రియను చేపట్టింది. జిల్లాలో గతేడాది అక్టోబర్లో పశుగణనను ప్రారంభించారు. 48 మంది సిబ్బందికి ఎన్యుమరేటర్లుగా విధులు కేటాయించారు. వీరు ఈనెలలో గణను పూర్తి చేశారు. ఈ పశుగణన వివరాలను అధికారులు ఆన్లైన్లో పొందుపర్చుతున్నారు. అయితే జిల్లాలో గతం కంటే ఈసారి పశు సంపద పెరగడం గమనార్హం. ఐదేళ్లకోసారీ.. దేశంలో తొలిసారి 1919 సంవత్సరంలో పశుగణన చేపట్టారు. అప్పటి నుంచి ఈ ప్రక్రియ ఐదేళ్ల కోసారి ప్ర క్రియ కొనసాగుతూ వస్తుంది. ప్ర స్తుతం చేపట్టింది ఇరవయ్యోది. గతంలో మాన్యువల్ గణన చేపట్టేవారు. అయితే నూతన సాంకేతికి పరిజ్ఞానంతో ఈసారి ట్యాబ్ ద్వారా పశువులను గణించారు. ఇందు కోసం ప్రత్యేక యాప్ను రూపొందించి ఎన్యుమరేటర్లు రోజువారీగా సేకరించిన పశువుల వివరాలను ఎప్పటికప్పుడుఆన్లైన్లో పొందుపర్చారు. ఓ రైతుకు ఎన్ని పశువులున్నాయి. రైతు ఆధార్ నంబర్తోపాటు పశువులను ఫొటోలు తీసి జియో ట్యాగింగ్ చేశారు. అలాగే రైతులకు సంబంధించిన సాంకేతిక వ్యవసాయ పరికరాలు, మత్స్యకారుల వలలు, తెప్పలు ఇతర పరికలను అడిగి తెలుసుకుని ప్రొఫార్మాలో నమోదు చేశారు. ఆ తర్వాత పశుగణన వివరాలతోపాటు వ్యవసాయ సాంకేతిక పరికారాలను అన్లైన్లోకి ఎక్కిస్తున్నారు. త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశుగణనవివరాలను అధికారికంగా ప్రకటించనున్నాయి. పెరిగిన పశు సంపద.. 2012లో చేపట్టిన పశుగణనలో కంటే ప్రస్తుతం నిర్వహించిన సర్వేలో పశుసంపద పెరిగినట్లు గణంకాలు చెబుతున్నాయి. 2012లో 84 వేల 497 కుటుంబాల సర్వే చేయగా, ఈసారి లక్షా 66వేల 987 కుటుంబాల్లో సర్వే చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం పశు పెంపకాన్ని ప్రోత్సహించడం వల్లనే జిల్లాలో పశుసంపద పెరిగిందని తెలుస్తోంది. ఇందుకు ఉదాహరణగా గతంలో 22,112 గొర్రెలుండగా, ఇప్పుడు ప్రభుత్వ ఇస్తున్న సబ్సిడీ కారణంగా వాటి సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగి 1,46,009కి చేరుకుందని భావిస్తున్నారు. కానీ, గత సర్వేలో ఒంటెలు 9 ఉండగా, ప్రస్తుతం ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం! పశుగణన సర్వే పూర్తయింది.. జిల్లాలో పశుగణన గతేడాది అక్టోబర్లో ప్రారంభించాం. ఈనెలలో ఆ సర్వే పూర్తయింది. పశువుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చుతున్నాం. ఈ గణనతో జిల్లాలో ఎన్ని పశువులున్నాయో తేలడంతో వాటికి అనుగుణంగా వాక్సినేషన్, మందులు అందుబాటులో ఉంచనున్నాం. – సురేష్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి -
వనమంత మానవత్వం
‘మన మధ్యే పెరగినా వాడికీ జీవితం ఉండాలి. మనుషుల మధ్య జీవించాలి’ అని అడవిలోని జంతువులన్నీ అనుకున్నాయి.‘మీలోనే మనుషులు కనపడుతున్నారు. నాకు మీరే జీవితం’ అని అడవిలోనే ఉండిపోయాడు మోగ్లీ.వనమంత మానవత్వాన్ని మన కళ్లకు కట్టింది ‘ది జంగిల్ బుక్’. మీరు 90ల కాలం నాటి పిల్లలా? అయితే, జంగల్ బుక్ అని పేరు వినగానే మీ చెవుల్లో ఓ పాట సందడి చేస్తుండాలి. ‘జంగిల్ జంగిల్ బాత్ చలీ హై పతా చలా హై... అరె చడ్డీ పెహన్కే ఫూల్ కిలాహై..’ అంటూ ఓ కుర్రాడు అటవీ జంతువులతో కలిసి చేసే విన్యాసాలూ కళ్ల ముందు మెదులుతూ ఉండాలి. ఆ విన్యాసాలను అప్పటి పిల్లలందరూ కళ్లప్పగించి చూశారు. ఇప్పటికీ కిడ్స్ చానెల్స్లో నాటి జంగిల్బుక్ వీరుడు మోగ్లీ అల్లరి చేస్తూనే ఉన్నాడు. 90 ల కాలంలో దూరదర్శన్లో ఏడాది పాటు వచ్చిన ఈ సీరియల్ అప్పటి పిల్లలకు ఓ మంచి ఫ్రెండ్ అయ్యింది. వన్యమృగాలున్న అడవిలో ఒంటరిగా ఒక పిల్లవాడు, ఆ పిల్లవాడు అక్కడి జంతువుల్లో ఒకడిగా పెరగడం.. అబ్బురంగా చూశారు. ఆ అటవీ ప్రపంచంలో తామూ తిరిగారు. వన్యప్రాణులతో దోస్తీ కట్టారు. ఆటలు ఆడారు. పాటలు పాడారు. నాటి–నేటి పిల్లల ప్రియనేస్తం మోగ్లీని మరో మారు పరిచయం చేసుకుందాం. మొట్టమొదటి యానిమేషన్ సీరియల్ అప్పట్లో పిల్లల కోసం ప్రత్యేక ఛానళ్లేవీ లేవు. పిల్లల కోసం ప్రత్యేకించి ప్రోగ్రాములూ లేవు. అప్పుడొచ్చింది జంగిల్బుక్. దూరదర్శన్లో సోప్ సీరియల్స్ స్టార్ట్ అయిన తొమ్మిదేళ్లకు ఎంటర్ అయ్యింది ఈ యానిమేషన్ సీరియల్. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు పిల్లలతో పాటు పెద్దలనూ తన ముందు కూచోబెట్టింది. మూలం రడ్ యార్డ్ ఆంగ్ల రచయిత్ రడ్ యార్డ్ కిప్లింగ్ జంగిల్బుక్ సృష్టికర్త. రడ్యార్డ్ ఇండియాలో పుట్టి, ఇంగ్లండ్లో పెరిగిన వ్యక్తి. 1894లో ‘ది జంగిల్ బుక్’ రాశాడు. ఈ పుస్తకం ఆధారంగా మోగ్లీ స్టోరీస్ను వాల్ట్ yì స్నీ అంతర్జాతీయంగా అన్ని దేశాలకూ పరిచయం చేసింది. 1989లో జపాన్లో మొదటిసారి వచ్చిన ఈ యానిమేషన్ సీరియల్ అదే సంవత్సరం హిందీ డబ్బింగ్తో మన దేశంలో ప్రసారమై ఎంతగానో ప్రాచుర్యం పొందింది. 52 ఎపిసోడ్లతో ఏడాది పాటు పెద్దలనూ, పిల్లలను అలరించింది ఈ సీరియల్. మోగ్లీ అనే పిల్లవాడి కథ చాలా చిన్నగా ఉన్నప్పుడు తల్లితండ్రి నుంచి తప్పిపోయి దట్టమైన అడవికి చేరుకుంటాడు మోగ్లీ. ఒకచోట పడి ఉన్న మోగ్లీని బగీరా అనే నల్ల పులి కనిపెడుతుంది. మోగ్లీని అకెలా, అలెగ్జాండర్ అనే తోడేళ్ల దగ్గరికి తీసుకెళ్తుంది బగీరా. అకేలాకి చిన్న చిన్నపిల్లలు ఉంటారు. తన పిల్లలతో పాటు మోగ్లీని కూడా పెంచుతుంటుంది. రోజూ తోడేలు పిల్లలతో ఆడుకుంటూ పెరుగుతుంటాడు మోగ్లీ. బగీరా అనే నల్ల పులి, బాలూ అనే ఎలుగుబంటి, కా అనే పైథాన్..లు మోగ్లీ స్నేహితులు. జంతువులతో ఆడుకుంటూ, జంతువుల మధ్య ఉండటంతో త్వరగానే అడవి జీవులతో కలిసిపోతాడు మోగ్లీ. ‘కా’ టీచర్గా మోగ్లీకి కొండలు, చెట్లు ఎక్కడం, ఊడలు పట్టుకొని ఊగడం.. వంటి ఎన్నో విషయాల్లో తర్ఫీదు ఇస్తుంది. ఒక రోజు అర్ధరాత్రి అడవిలోని జంతువులన్నీ గాఢనిద్రలోకి జారుకుంటాయి. రాత్రిపూట మనుషుల్ని తినే షేర్ఖాన్ అనే పులి అడవిలోకి చొరపడుతుంది. ముందుగానే పసిగట్టిన బగీరా మోగ్లీ గురించి ఆలోచిస్తుంది. అడవిలో ఉంచడం మంచిది కాదని, మనుషులున్న చోటుకు చేర్చాలని మోగ్లీని తీసుకొని బయల్దేరుతుంది. మోగ్లీని తినాలనే ప్రయత్నం చేస్తున్న షేర్ఖాన్ నుంచి బగీరా కాపాడుతుంది. ఒకానొక సమయంలో మోగ్లీకి అడవిలో గుర్తింపు సమస్య ఎదురవుతుంది. విలన్లయిన జంతువుల నుంచి ప్రమాదం ఉంటుందని, మనుషులు ఉన్న చోటుకి చేరుస్తామని మోగ్లీ స్నేహితులు చెబుతారు. ఎవరు ఎంత నచ్చజెప్పినా అడవిలోనే ఉంటానంటాడు మోగ్లీ. అడవి జంతువులతోనే జీవిస్తుంటాడు. ఆ తరం నుంచి ఈ తరం వరకు, హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూనే ఉంటుంది ది జంగిల్బుక్. మోగ్లీ వయసు సుమారు 6 నుంచి 10 ఏళ్ల మధ్యన ఉంటుంది. అడవిలో ఎన్నో సాహసవిన్యాసాలు చేస్తుంటాడు. మోగ్లీ పనులు ఒక్కోసారి ఆలోచించేలా, మరోసారి నవ్వు తెప్పించేలా ఉంటాయి. జంతువుల పట్ల ప్రేమగా ఉంటాడు. ఇవన్నీ ఆ వయసు పిల్లలను బాగా కట్టిపడేశాయి. పెద్దలను కూడా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. కల్మషం లేని ప్రేమకు ముగ్దులవనిది ఎవరు. ఒక్క మన దేశంలోనే కాదు, ‘ది జంగిల్ బుక్’ ప్రపంచ దేశాల్లోని పిల్లలందరికీ పరిచయమే. -
తప్పించారా?.. తప్పించుకున్నాడా?
సాక్షి,మంచిర్యాలక్రైం: మేకలు, పశువుల దొంగతనం కేసులో సీసీసీ నస్పూర్కు చెందిన ఓ యువకుడిని జైపూర్ పోలీసులు వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రిమాండ్కు తరలించేందుకు వైద్యపరీక్షల నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడంతో అక్కడి నుంచి తప్పించుకొని పారి పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీసీసీ నస్పూర్ కాలనీకి చెందిన సయ్యద్ ఇమ్రాన్ను జైపూర్ పోలీసులు మేకలు, పశువుల దొంగతనం కేసులో వారంరోజుల క్రితం కాగజ్నగర్లో బంధువుల ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ నెల 23న కోర్టులో రిమాండ్కు తరలించేందుకు వైద్యపరీక్షల నిమిత్తం పోలీసులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్క డి నుంచి ఇమ్రాన్ పారిపోవడంలో పోలీసుల పాత్ర ఉందన్న ఆరోపనలు వినిపిస్తున్నాయి. నేటికి నేటికి నాలుగు రోజులు కావస్తున్నా పోలీసులు అతనికోసం గాలించడంలో అలసత్వం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో సైతం మంచిర్యాల, కిష్టంపేట, సీసీసీ ప్రాంతాలకు చెందిన కొందరిని జైపూర్ పోలీసులు పశువులు, మేకల దొంగతనాలకు పాల్పడుతున్నారని విచారణ పేరుతో అదుపులోకి తీసుకోవడం.. వారం రోజుల తర్వాత వదిలిపెట్టడం పరిపాటిగా మారిందని ప్రచారంలో ఉంది. కాగా సయ్యద్ ఇమ్రాన్పై జగిత్యాల, బెజ్జంకి, మల్లాపూర్, మంచిర్యాల, శ్రీరాంపూర్, సీసీసీ, పోలీస్స్టేషన్లలో పశువుల దొంగతనాల కేసులు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో దొంగల ముఠా? మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ పశువుల దొంగల ముఠా సంచరిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా ఇక్కడి నుంచే తమ పనిని యధేచ్ఛగా సాగిస్తోంది. వీరికోసం కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు చెందిన పోలీసులు గాలిస్తుంటారు. ఇతర జిల్లాలో ఎక్కడ పశువులు, మేకల దొంగతనం జరిగినా అక్కడి పోలీసులు ముందుగా వారిని పట్టుకునేందుకు మంచిర్యాలలోనే మకాం వేస్తుంటారు. గతంలో ఓసారి జమ్మికుంటకు చెందిన పోలీసులు మంచిర్యాలలో పశువుల దొంగల ముఠా నాయకున్ని పట్టుకునే ప్రయత్నంలో ఎస్పైని తోసేసి పారిపోయిన సంఘటన చోటు చేసుకుంది. కరీంనగర్కు చెందిన ఓ పాత చోరి కేసులో పశు దొంగల ముఠా నాయకునికి సంబంధం ఉన్నట్లు తేలింది. మంచిర్యాల సీసీఎస్ పోలీసులకు సమాచారం రావడంతో పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆప్రయత్నంలో తెల్లవారుజామున మంచిర్యాలకు చెందిన సీసీఎస్ కానిస్టేబుల్ను తోసేసి పారిపోవడం గమనార్హం. వెంటనే సీసీఎస్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ నుంచి సంబందిత కానిస్టేబుల్కు ఫోన్కాల్ రావడం, ఇక్కడ జరిగిన విషయం ఆయన ఫోన్లో చెప్పడంపై పశువుల దొంగలకు పోలీసులే సహకరిస్తున్నట్లు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అంటే ఎంత ఖరుడు గట్టిన ముఠా ఉందో తెలుస్తోంది. ఇమ్రాన్ను తల్లిదండ్రులకు అప్పగించాం సయ్యద్ ఇమ్రాన్ పోలీçస్ కస్టడీ నుంచి తప్పించుకోలేదు. పశువులు, మేకల దొంగతనం కేసులో అతన్ని పట్టుకొచ్చింది వాస్తవమే. కానీ అతను మైనర్ అయినందువల్ల విచారణ జరిపి తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేసి అతన్ని అప్పగించాం. కేసుల్లో ఎండీ తాజ్, సల్మాన్ ప్రధాన పాత్రదారులు. తాజ్ను ఇటీవల రిమాండ్కు తరలించాం. సల్మాన్పై పీటీ వారెంట్ వేసి పట్టుకువచ్చాం. అతన్ని జైలుకు పంపిస్తాం. ఇమ్రాన్పై సీసీసీ పోలీస్స్టేషన్లో కేసు ఉంది. అతను పారిపోయాడనేది ఆవాస్తవం. – విజేందర్, ఎస్సై, జైపూర్ మాకు అప్పగించలేదు మేకలు దొంగతనం చేశాడని మాకుమారుడిని జైపూర్ పోలీసులు వారంరోజుల క్రితం కాగజ్నగర్లోని బంధువుల ఇంటి నుంచి పట్టుకువచ్చారు. వైద్యపరీక్షల నిమిత్తం ఈ నెల 23న మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి నన్ను అక్కడికి రమ్మన్నారు. నేను వెళ్లే సరికి నా కొడుకు ఇమ్రాన్ అక్కడలేడు. నా కొడుకు ఎక్కడ సారు? అని అడిగితే సంతకం పెట్టుమన్నారు. సంతకం పెట్టిన తర్వాత పోలీసులు వెళ్లిపోయారు. అప్పటి నుంచి నా కొడుకు కనిపించడం లేదు.– నయిమా బేగం, ఇమ్రాన్ తల్లి -
సర్దుకుపోతే సంతోషమే!
ఒక అడవిలో ఆ సంవత్సరం ఎన్నడూ లేనంత భయంకరమైన చలి వ్యాపించి అనేక జంతువులు, జీవాలు చనిపోయాయి. నాయకుడికి తమ జాతిని రక్షించాల్సిన బాధ్యత ఏర్పడింది. ‘‘చలి అధికంగా వుండే రాత్రివేళల్లో మీరంతా ఒకరికొకరు వెచ్చగా ఉండేలా మూకుమ్మడిగా గడిపితే గాలి దూరే సందు లేక చలి ఉండదని, తెల్లారే వరకు ప్రాణాలు నిలుపుకుంటే, సూర్యుడి వెలుగుతో వేడి జనించి సౌకర్యంగా ఉండొచ్చని’’ చెప్పింది తమ వాళ్ళకి. ముళ్ళ పందులన్నీ ఆ సూచన పాటించాయి. సందు లేకపోవడంతో రాత్రంతా వేడి పుట్టి ప్రాణం నిలబెట్టుకున్నాయి పందులు. కొన్ని ముళ్ళపందులు తోటి పందుల ముళ్ళు తగిలి ఇబ్బంది కలిగినట్టు నాయకుడికి ఫిర్యాదు చేసాయి. ‘‘చలి తట్టుకుని ప్రాణం నిలుపుకోవడం ముఖ్యం కాబట్టి ఇబ్బందిని మరచిపోయి సర్దుబాటు చేసుకుంటే మీ ప్రాణాలు నిలబడతాయి. ఇబ్బంది భరించలేమని అనుకుంటే మీ ఇష్టం’’ అంది నాయక పంది. ముళ్ళ పందులు సర్దుకుపోయి ప్రాణాలు నిలుపుకున్నాయి. సమాజంలో బతకాలంటే ఇరుగు పొరుగుల వేధింపులు, సాధింపులు, వెక్కిరింపులు, అవమానాలు, అనుమానాల ముళ్ళు గుచ్చుకుంటూనే వుంటాయి. సర్దుకుపోతే సమస్యలన్నీ తీరిపోతాయి. సమాజంలో జీవించడం సులభమౌతుంది. – నారంశెట్టి ఉమామహేశ్వరరావు