assassination case
-
మీర్పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం
సాక్షి, హైదరాబాద్: మీర్పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. వెంకట మాధవిని గురుమూర్తి ఒక్కడే చంపలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్తతో కలిసి మరో ముగ్గురు హత్య చేసి ఉంటారనే అనుమానాలున్నాయి. ఆ ముగ్గురిలో ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు సహకరించిన వారి వివరాలు సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. అవసరమైతే గురుమూర్తికి పాలీగ్రాఫ్ టెస్ట్లు నిర్వహించే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.ఈ కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే అతడిని రిమాండ్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మీర్పేట పోలీసులు కస్టడీ పిటిషన్ వేసి గురుమూర్తిని విచారణ నిమిత్తం శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. సరూర్నగర్లోని సీసీఎస్ లేదా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్కు విచారణ నిమిత్తం తరలించినట్లు తెలుస్తోంది. ఈ నెల 12 వరకు వరకు అతన్ని విచారణ చేయనున్నట్లు సమాచారం.ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన పుట్ట గురుమూర్తి, అదే గ్రామానికి వెంకట మాధవికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గురుమూర్తి ఆర్మీలో జవాన్గా చేరి నాయక్ సుబేదార్గా పదవీ విరమణ పొందాడు. ప్రస్తుతం కంచన్బాగ్ డీఆర్డీఏలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నారు. గురుమూర్తి కొన్నాళ్లుగా తన సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం భార్యకు తెలిసి పలుమార్లు గొడవలు జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే భార్య అడ్డు తొలగించుకోవాలనే క్రమంలోనే ఆమెను హత్య చేశాడు.మరోవైపు.. నిందితుడు చెప్పిన విషయాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మృతదేహాన్ని చెరువులో విసిరేసినట్లు చెబుతున్నా, అక్కడ ఇంకా ఆధారాలు లభించలేదు. శరీరం ఆనవాళ్లు లభ్యమైనా వెంకట మాధవి పిల్లల డీఎన్ఏతో పోల్చే అవకాశముంది. ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. క్లూస్టీం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకం కానుంది. వెంకట మాధవి అదృశ్యంపై కేసు నమోదు చేశామని, ఆమె ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు మాత్రమే లభ్యమైనట్లు పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ఉన్మాదిలా మారి.. 70 సార్లు కత్తితో పొడిచి.. -
ఎట్టకేలకు కెనెడీ ఫైల్స్ డీ క్లాసిఫై
వాషింగ్టన్: అప్పట్లో ప్రపంచమంతటా సంచలనం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనెడీ, ఆయన సోదరుడు, సెనేటర్ రాబర్ట్ ఎఫ్.కెనెడీ, పౌర హక్కుల నాయకుడు మార్టిన్ లూథర్కింగ్ జూనియర్ హత్యలకు సంబంధించి త్వరలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. వారి హత్యోదంతాలకు సంబంధించిన రహస్య ఫైళ్లన్నింటినీ బహిర్గతం చేయాల్సిందిగా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై ఆయన గురువారం సంతకం చేశారు. ‘‘ఈ హత్యల వెనక నిజానిజాలను అమెరికా ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇందుకోసం వారు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. కనుక అన్ని విషయాలనూ బయట పెట్టబోతున్నాం’’ అని విలేకరులకు స్పష్టం చేశారు. సంబధిత ఫైళ్లను డీక్లాసిఫై చేయడానికి 15 రోజుల్లోగా ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ను ఆదేశించారు. అనంతరం 45 రోజుల్లోగా ఫైళ్లన్నింటినీ ప్రజల ముందు పెట్టాలని పేర్కొన్నారు. సంబంధిత ఉత్వర్వులపై సంతకం చేసిన పెన్నును రాబర్ట్ ఎఫ్.కెనెడీ కుమారుడు, కాబోయే ఆరోగ్య మంత్రి రాబర్ట్ ఎఫ్.కెనెడీ జూనియర్కు ఇవ్వాల్సిందిగా అధికారులకు ట్రంప్ సూచించారు. కెనెడీల హత్యపై అధికారిక కథనాలపై కెనెడీ జూనియర్ చాలాకాలంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆదేశాలు ఏమేరకు కార్య రూపం దాలుస్తాయన్నది అనుమానంగా మారింది. ..నేటికీ మిస్టరీయే 1963లో కెనెడీ డాలస్లో ఓపెన్ టాప్ కారులో వెళ్తుండగా లీ హార్వే ఓస్వాల్డ్ అనే మాజీ సైనికుడు కాల్చి చంపడం సంచలనంగా మారింది. ఐదేళ్ల అనంతరం స్థానంలో అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన ఆయన సోదరుడు రాబర్ట్ కూడా కాలిఫోరి్నయాలో హత్యకు గురయ్యారు. ఇజ్రాయెల్కు అమెరికా మద్దతుపై ఆగ్రహంతో సిర్హాన్ అనే ఓ పాలస్తీనియన్ ఆయన్ను కాల్చి చంపాడు. అందుకు రెండు నెలల క్రితం లూథర్కింగ్ను కూడా టెనెసీలో జాతి విద్వేషానికి బలయ్యారు. జేమ్స్ ఎర్ల్ రే అనే జాత్యహంకారి ఆయన్ను కాల్చి చంపాడు. ఈ హత్యలకు సంబంధించి పలు డాక్యుమెంట్లు అడపాదడపా వెలుగు చూశాయి. కానీ వేలాది డాక్యుమెంట్లు గోప్యంగానే ఉండిపోయాయి. వాటి విచారణ ఫైళ్లన్నింటినీ బయట పెట్టాలంటూ 1992లో అమెరికా కాంగ్రెస్ చట్టం కూడా చేసింది. ఆ మేరకు కెనెడీ హత్యకు సంబంధించి చాలా డాక్యుమెంట్లను గత పదేళ్లలో ప్రభుత్వాలు బయటపెట్టినా లక్షలాది డాక్యుమెంట్లు ఇంకా గోప్యంగానే ఉండిపోయాయి. ట్రంప్ తన తొలి హయాంలోనే వాటన్నింటినీ బయట పెడతానని హామీ ఇచ్చినా సీఐఏ, ఎఫ్బీఐ ఒత్తిళ్ల కారణంగా మిన్నకుండిపోయారని చెబుతారు. ఓస్వాల్డ్ వ్యక్తిగత కక్షతోనే కెనెడీని పొట్టన పెట్టుకున్నట్టు విచారణ కమిషన్ తేలి్చనా అది నిజం కాదని అమెరికన్లలో అత్యధికులు నేటికీ చెబుతారు. హత్య వెనక కుట్ర కోణముందంటూ జోరుగా విశ్లేషణలు సాగాయి. ప్రభుత్వ ఏజెంట్లు, మాఫియా, తెర వెనక శక్తుల హస్తముందని ఏళ్ల తరబడి కథనాలు వెలువడ్డాయి. -
హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి క్లీన్చిట్
సాక్షి, విజయవాడ: సాయి ఈశ్వర్ హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఊరట లభించింది. ఆయనకు ప్రజా ప్రతినిధుల కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. కర్నూలు త్రిటౌన్ పోలీస్స్టేషన్లో నమోదైన హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు 9 మందిని ప్రజాప్రతినిధుల కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.నందికొట్కూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తెలుగు సాయి ఈశ్వర్ 2014లో దారుణ హత్యకు గురికావడంతో కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొదటి నిందితుడు బాషా కాగా ఐదో నిందితుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. బైరెడ్డి సిద్ధార్థతో పాటు ఆయన అనుచరులపైనా కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో వాదనలు విన్న విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. -
ఇజ్రాయెల్ వ్యూహం బ్యాక్ఫైర్!
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ ‘హమాస్’ అధినేత యాహ్యా సిన్వర్(61) హత్య విషయంలో ఇజ్రాయెల్ వ్యూహం వికటిస్తోంది. హమాస్ సభ్యులను భయకంపితులను చేసి ఆత్మస్థైర్యం దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన డ్రోన్ వీడియో దృశ్యం నిజానికి వారిలో మరింత స్ఫూర్తిని రగిలిస్తోంది. ఇజ్రాయెల్పై భీకర పోరాటానికి పురికొల్పుతోంది. ఈ వీడియోను విడుదల చేయడం ద్వారా ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. గాజాలోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ జవాన్లు చేసిన దాడిలో సిన్వర్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇజ్రాయెల్ దాడిలో తీవ్రంగా గాయపడిన సిన్వర్ చివరి క్షణాలు ఇందులో కనిపిస్తున్నాయి. సిన్వర్ కుడి చెయ్యి చాలావరకు నుజ్జునుజ్జుగా మారింది. బాంబుల దాడితో తీవ్రంగా దెబ్బతిన్న ఓ భవనంలో ఒక సోఫాలో ఆయన కూర్చొని ఉన్నారు. చుట్టూ దుమ్మూ ధూళి దట్టంగా పేరుకుపోయి ఉంది. తనపై దాడి చేస్తున్న డ్రోన్పై ఆయన ఎడమ చెయ్యితో కర్ర లాంటిది విసురుతూ కనిపించారు. ఒకవైపు ప్రాణాలు పోయే పరిస్థితి కనిపిస్తున్నా, మరోవైపు శత్రువుపై పోరాటం ఆపలేదంటూ సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిసింది. రక్షణ వలయం లేదు.. కవచం లేదు గాజా భూభాగంలోని భారీ సొరంగంలో సిన్వర్ తలదాచుకుంటున్నాడని, చుట్టూ బాడీగార్డులతో దుర్భేద్యమైన రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నాడని, అంతేకాకుండా ఇజ్రాయెల్ నుంచి బందీలుగా పట్టుకొచ్చిన వారిని రక్షణ కవచంగా వాడుకుంటున్నాడని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ పలు సందర్భాల్లో చెప్పారు. ఇజ్రాయెల్ అధికారులు సైతం ఇదే విషయం పదేపదే వెల్లడించారు. కానీ, వీడియో దృశ్యం చూస్తే సిన్వర్ సొరంగంలో లేడు. బహుళ అంతస్తుల భవనంలో ఉన్నాడు. ఆయన చుట్టూ రక్షణ వలయం గానీ, రక్షణ కవచం గానీ లేదు. ఇజ్రాయెల్ చెప్పిందంతా అబద్ధమేనని ఈ దృశ్యాలు రుజువు చేశాయి. మద్దతుదారుల కంటతడిమృత్యువుకు చేరువవుతూ కూడా సిన్వర్ సాగించిన పోరాటాన్ని చూసి పాలస్తీనావాసులు, హమాస్ మద్దతుదారులు కంటతడి పెడుతున్నారు. వారిలో పెల్లుబుకుతున్న ఆగ్రహం ఇజ్రాయెల్పై కసిగా మారుతోంది. సిన్వర్ హత్యకు ప్రతీకారం తప్పదని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. డ్రోన్ వీడియో దృశ్యం పాలస్తీనా పౌరులకు స్ఫూర్తిదాయకంగా మారడం గమనార్హం. వారంతా ఇజ్రాయెల్పై దుమ్మెత్తిపోస్తున్నారు. సిన్వర్ త్యాగాన్ని కొనియాడుతున్నారు. ఈ వీడియో ద్వారా ఇజ్రాయెల్ ఆశించింది ఒకటి కాగా, జరుగుతున్నది మరొకటి కావడం గమనార్హం – సాక్షి, నేషనల్ డెస్క్ఇదీ జరిగిందిసిన్వర్ హత్య ఆపరేషన్ గురించి ఇజ్రాయెల్ సైనికాధికారులు కొన్ని వివరాలు వెల్లడించారు. ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన 828వ బిస్లామాచ్ బ్రిగేడ్ తాల్ అల్–సుల్తాన్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. సైనికుల కంట పడకుండా సందులు గొందులు తిరుగుతూ తప్పించుకొనేందుకు ప్రయతి్నంచారు. వారిలో ఒక వ్యక్తి ఒంటరిగా ఓ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఇజ్రాయెల్ డ్రోన్లు గుర్తించాయి. దాంతో జవాన్లు ఆ ఇంటిని చుట్టుముట్టారు. యుద్ధట్యాంకుతో పేల్చివేశారు. ఈ ఘటనలో సిన్వర్ మరణించాడు. మిగిలిన ఇద్దరు వ్యక్తులను కూడా సైన్యం అంతం చేసింది. అయితే, తొలుత చనిపోయిన వ్యక్తి సిన్వర్ అని ఇజ్రాయెల్ సైన్యానికి తెలియదు. అనుమానంతో మృతదేహం వేలిని కత్తిరించి, ఇజ్రాయెల్కు పంపించి డీఎన్ఏ టెస్టు చేశారు. సిన్వర్ డీఎన్ఏతో అది సరిగ్గా సరిపోయింది. దాంతో చనిపోయింది సిన్వర్ అని తేల్చారు. -
బురహాన్పల్లి మాజీ సర్పంచ్ హత్య కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన మాజీ సర్పంచ్ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. సుఫారి గ్యాంగ్ సహాయంతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. రూ.30 లక్షల సుపారీ ఇచ్చి పథకం ప్రకారం దేవేందర్ హత్య జరిగిందని వర్ధన్నపేట ఏసీపీ నరసయ్య మీడియా సమావేశంలో వెల్లడించారు.రాయపర్తి మండలం బురహాన్పల్లిలో గతనెల 7న మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ హత్యకు గురయ్యాడు. భూ తగాదాలు, వ్యక్తిగత కక్షల కారణంగా ఈ హత్య జరిగిందని.. ఈ హత్యలో పల్లె మల్లేశం అతడి కుమారుడు మురళి కీలకంగా వ్యవహరించి హైదరాబాద్కు చెందిన సుంకర ప్రసాద్, మర్నేని రాజు అనే సుపారి గ్యాంగ్ ద్వారా హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు.ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది అరెస్ట్ కాగా, ఇందులో A1గా సుంకర ప్రసాద్ నాయుడు, A2 గా మర్నేని రాజు సహా మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు వర్ధన్నపేట ఏసీపీ తెలిపారు. -
కర్నూలు: టీడీపీ నేత హత్య కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, కర్నూలు జిల్లా: టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆధిపత్యం కోసం టీడీపీ నేతలే హత్య చేసినట్లు నిర్థారణ అయ్యింది. హత్యకు ఆధిపత్య పోరే కారణమని డీఎస్పీ శ్రీనివాసాచారి వెల్లడించారు.హత్య వెనకా రాజకీయ కోణం ఉంది. అందుకే అంత మొందించారు. టీడీపీకి చెందిన గుడిసె నరసింహులతో పాటు మరో ముగ్గురు హత్యకు కుట్ర పన్నారు. ఇద్దరు మైనర్లతో హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని డీఎస్పీ తెలిపారు. నలుగురు నిందితులను పత్తికొండ కోర్టులో రిమాండ్ చేసిన పోలీసులు.. మరో ఇద్దరిని జువైనల్ కోర్టుకు తరలించారు.శ్రీనివాసులను సొంత పార్టీ వారే దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది. టీడీపీ పార్టీకి చెందిన నలుగురు వ్యక్తులతో పాటు, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయ బయటపడింది. అయితే ఈ హత్యను మంత్రి నారా లోకేష్.. వైఎస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేశారు. హత్య వెలుగులోకి రాగానే వైఎస్సార్సీపీ చేసిందంటూ ఎల్లో మీడియా సైతం నానా హంగామా చేసింది.శ్రీనివాసులను హత్య చేసిన వారు సొంత పార్టీ నాయకులే కావడంతో స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు నోరు మెదపడం లేదు. ఈ సంఘటన ఆగస్టు 14 తేదీన జరిగింది. -
ప్రియుడి మోజులో.. భర్తనే కడతేర్చింది..
ఒంగోలు టౌన్: ప్రియుడి మోజులో పడి ఆమె ఏకంగా భర్తనే హతమార్చింది. తన వ్యవహారం బయట పడేసరికి భర్త మందలించడం.. భర్త బతికుంటే తమ ‘బంధం’ కష్ట మని భావించిన ఆ మహిళ.. కిరాయి ముఠా, ప్రియుడి సాయంతో కట్టుకున్న భర్తనే దారుణంగా కడతేర్చింది.. ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన పీఎఫ్ ఇన్స్పెక్టర్ చల్లా వెంకటనరేంద్రబాబు హత్య కేసులో మృతుడి భార్యతో సహా మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం మీడియాకు వెల్లడించారు. ఆ యువకుడికి అలా దగ్గరైంది.. ఒంగోలులోని పీఎఫ్ ఆఫీసులో ఇన్స్పెక్టర్గా పనిచేసే చల్లా వెంకటనరేంద్రబాబు పొదిలిలోని పీఎన్ఆర్ కాలనీ మూడో లైనులో నివాసముంటున్నాడు. ఆయనకు భార్య లక్ష్మీప్రియ, ఇద్దరు పిల్లలు. వారి ఇంటి ఎదురుగా అద్దె ఇంట్లో ఉంటున్న కొండ శశికుమార్ అనే యువకుడికి లక్ష్మీప్రియ దగ్గరైంది. వారి వ్యవహారం తెలిసిన నరేంద్ర.. ఇద్దరినీ తీవ్రంగా మందలిస్తూ వస్తున్నాడు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు శశితో కలిసి పథకం రచించింది. ఆమె ఇంట్లో ఉన్న బంగారు నగలను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో నెల్లూరుకు చెందిన కిరాయి హంతకులతో రూ.2 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున నరేంద్ర గాఢ నిద్రలో ఉన్న సమయంలో శశితో పాటు.. నెల్లూరు కిరాయి ముఠాకు చెందిన నలుగురు యువకులు కలిసి నరేంద్ర గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. మృతదేహాన్ని వంటగదిలోకి తీసుకెళ్లి తాడుతో వేలాడ దీశారు. భార్యభర్తల గొడవలతో విసిగివేసారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు యత్నించారు. ఇదిలా ఉండగా, కిరాయి ముఠా తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తొలుత రూ.50 వేలు మాత్రమే అడ్వాన్స్గా చెల్లించారు. మిగిలిన డబ్బు కోసం వారు ఫోన్లు చేస్తుండటంతో భయపడిపోయిన శశిపోలీసులకు లొంగిపోయాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితులు.. లక్ష్మీప్రియతో పాటుగా ఆమె ప్రియుడు కొండ శశికుమార్, నెల్లూరు కిరాయి ముఠాకు చెందిన షేక్ నహీద్, షేక్ ఫజ్లూ, సయ్యద్ సిద్దిక్, షేక్ ముబారక్లను అరెస్టు చేసినట్టు ఎస్పీ దామోదర్ వివరించారు. -
దోషికి ఉరిశిక్ష.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలో ఘాతుకానికి పాల్పడ్డ దోషికి ఉరిశిక్ష విధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. 2018 నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలిక లైంగిక దాడి, హత్యకు గురైంది. బాలికపై సెంట్రింగ్ కార్మికుడు దినేష్కుమార్ లైంగికదాడికి పాల్పడి హత్య చేశాడు.2021లో దోషి దినేష్కుమార్కు రంగారెడ్డి కోర్టు ఉరిశిక్ష విధించగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఇవాళ ఆ పిటిషన్పై విచారణ జరిగింది. రంగారెడ్డి కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. -
కూటమికి వెంటిలేటర్ తీసేసినట్లేనా?
రెండు కాళ్లూ పడిపోయి చంకల్లో కర్రలు పెట్టుకుని దేకుతూ వెళ్తున్నవాడి కర్రలు ఫాట్ మని లాగేస్తే ఏమవుతుంది? అన్ని అవయవాలూ పని చేయడం మానేస్తూ.. ఒక్కోటీ విశ్రమిస్తుంటే.. ఏదోలా ఆయువును నిలుపుతున్న వెంటిలేటర్ను ఆపేస్తే ఏమవుతుంది. ఏదోలా గౌరవ ప్రదమైన స్కోర్ చేస్తాడు అనుకున్న బ్యాట్స్ మ్యాన్ రెండో బంతికే అవుటైతే ఎలా ఉంటుంది.. గోల్డ్ మెడల్ తెస్తాడు అనుకున్నవాడు డోపింగ్ టెస్టులో దొరికిపోతే ఏమవుతుంది.. ఆ అందరి ఆశలూ గల్లంతవుతాయి. భవిష్యత్ అంధకారమవుతుంది.. కొన్ని జీవితాలు ముగిసిపోతాయి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామం కూడా అచ్చం అలాంటిదే. తెలుగుదేశం.. జనసేన.. బీజేపీ.. ఇంకా కాంగ్రెస్ నాయకులూ ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక్కటంటే ఒక్క కారణం, రాజకీయ ఆధారం కనిపించడం లేదు. గతంలో టీడీపీ- జనసేన-బీజేపీ కలిపినా ఉమ్మడి పాలనలో రాష్ట్రానికి ఏమి చేశారన్నది వాళ్లు ఒక్క ముక్కా చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిలను మిళితం చేసి రుచి చూపించిన పాలనకు ప్రజలు ఫిదా అయ్యారు. ఈసారి కూడా జగన్ మళ్లీ గెలవాలని రైతులు.. మహిళలు.. యువత.. పేదలు... దళితులూ.. మైనారిటీ గిరిజనవర్గాలు బలంగా కోరుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల జాబితా సూపర్ సిక్స్ ను ప్రజలు నమ్మడం లేదు... ఎందుకంటే బాబుకున్న ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి. అందుకే సూపర్ సిక్స్ పెద్ద అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో కూటమి నాయకులూ యావత్తు.. తాము మూడుసార్లు గెలిచాక ఏమి చేసాం.. మళ్ళీ గెలిస్తే ప్రజలకు ఏమి చేస్తాం అనేది చెప్పకుండా ఐదేళ్ల క్రితం జరిగిన వివేకానందరెడ్డి హత్యకేసును ప్రచారాంశంగా మార్చుకుని పదేపదే అదే అంశాన్ని మాట్లాడుతున్నారు. మాటిమాటికీ హూ కిల్డ్ బాబాయ్ అని చంద్రబాబు అరుస్తూ ఆ హత్యకేసును సీఎం వైయస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డికి చుట్టేయాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఇదే ఎజెండాను అటు వివేకా కుమార్తె సునీత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, పవన్ కళ్యాణ్, ఆఖరుకు బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి జగన్మోహన్రెడ్డిని దోషిగా మార్చేందుకు యాతన పడుతున్నారు. వాస్తవానికి ఈ కేసు ఇప్పటికే సీబీఐ విచారణలో ఉండగా ఈ కేసులో ఇప్పటికే పలువురిని సీబీఐ విచారించింది. కోర్టులో ఉన్న ఈ అంశాన్ని పదేపదే ప్రజల్లోకి తీసుకెళ్లడం అనైతికమని చంద్రబాబుకు తెలుసు కానీ అది మినహా వేరే అంశం తనకు లేకపోవడంతో ఎంతసేపూ వివేకా హత్య అంశమే ప్రచారాంశం అవుతోయింది. దీంతో ఇక ఈ హత్య కేసును ఆ అంశాన్ని ప్రచారంలో వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ నేత సురేష్బాబు కడప కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన పిటిషన్ను బలపర్చిన న్యాయస్థానం వైఎస్ షర్మిళ, సునీత, చంద్రబాబు, పవన్, లోకేష్.. పురందేశ్వరి ఇలా ఎవరూ ఆ హత్య కేసును ప్రచారంలో ప్రస్తావించరాదని కోర్టు ఆదేశించింది. దీంతో కూటమి నాయకులకు గొంతులో వెలక్కాయ పడినట్లు అయింది. ఇన్నేళ్ల పాలనలో తాము చేసింది కానీ.. చేయబోయేది కానీ చెప్పుకునేందుకు ఒక్కటీ లేని పరిస్థితుల్లో కేవలం ఆ హత్య కేసుని పదేపదే సభల్లో ప్రస్తావించి పబ్బం గడుపుకుందాం అనుకున్న చంద్రబాబుకు ఇది షాకింగ్ వార్త.. ఇక ఈ అంశం మాట్లాడకుండా ఎన్నికల సభలు ఎలా నిర్వహిస్తారో ఆయనకు.. లోకేష్.. పవన్.. పురందేశ్వరికి తెలియాలి. ఇక చేయడానికి ఏమీ లేని తరుణంలో చంద్రబాబు ఎలా ముందుకు వెళ్తారో.. ప్రజలను ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.. -సిమ్మాదిరప్పన్న -
బొండా బ్యాచ్ స్కెచ్.. సీఎం జగన్ను హత్య చేసేందుకే..
సాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హత్య చేయాలన్న పక్కా కుట్రతోనే ఆయనపై పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయితో దాడికి పాల్పడ్డారు. కుట్రదారులు పక్కా పన్నాగంతో నిందితుడు వేముల సతీశ్ కుమార్ను ప్రేరేపించి ముఖ్యమంత్రి జగన్పై దాడికి పాల్పడేలా పురిగొల్పారు. విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ యాత్ర సందర్భంగా వివేకానంద పాఠశాల వద్ద దాడికి పాల్పడి సీఎంను హతమార్చాలన్నది కుట్రదారుల పన్నాగం. ముఖ్యమంత్రి జగన్ తలపై సున్నిత భాగంలో పదునైన రాయితో బలంగా దాడి చేయడం ద్వారా హతమార్చాలన్నది ప్రణాళిక’ అని పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడలో జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. విజయవాడ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీశ్ కుమార్ ఈ హత్యాయత్నానికి పాల్పడినట్టు ఆధారాలతో సహా గుర్తించారు. సీఎం జగన్పై హత్యాయత్నం కేసు లో ప్రధాన నిందితుడైన వేముల సతీశ్ మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ నేత బొండా ఉమాతో సన్నిహితంగా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న దృశ్యాలు వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ కేసులో ఏ 2గా ఉన్న నిందితుడు కూడా బొండా ఉమాకు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. ముఖ్యమంత్రిని హత్య చేసేందుకు కుట్రదారుల పన్నిన పన్నాగాన్ని పోలీసులు ఆధారాలతో వెలికితీశారు. హత్యాయత్నానికి పాల్పడిన వేముల సతీష్ను ప్రధాన నిందితుడు (ఏ1)గా పేర్కొంటూ గురువారం విజయవాడ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. సీఎం జగన్పై హత్యాయత్నానికి సతీష్ను ప్రేరేపించిన మరో కీలక నిందితుడిని ఏ 2గా పేర్కొంటూ, ఈ కుట్ర కోణాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. కాగా, ఏ2 గా ఉన్న నిందితుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు ప్రధాన అనుచరుడు. సెంట్రల్ నియోజవర్గ టీడీపీ బీసీ సెల్లో కీలక నేత. అంతేగాక సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ సోషల్ మీడియా విభాగంలోనూ కీలక నేత కావడం గమనార్హం. రిమాండ్ నివేదికలోని ప్రధానాంశాలు ఇవీ.... గతంలోనూ నేర చరిత్ర.. ముఖ్యమంత్రి జగన్ను హత్య చేయాలని కుట్రదారులు పన్నాగం పన్నారు. ‘మేమంతా సిద్ధం’ యాత్రలో ఆయనపై దాడికి పాల్పడి హతమార్చాలన్నది వారి కుట్ర. ముఖ్యమంత్రి తలపై సున్నిత ప్రదేశంలో పదునైన రాయితో దాడి చేసి అంతం చేయాలని పథకం రూపొందించారు. అందుకు విజయవాడ అజిత్సింగ్నగర్లోని వివేకానంద స్కూల్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ముఖ్యమంత్రిపై దాడి చేసేందుకు వేముల సతీష్ కుమార్ను ఎంపిక చేశారు. గతంలో నేర చరిత్ర కూడా ఉన్న అతడు ఏ2కి కీలక అనుచరుడు. ముఖ్యమంత్రిపై దాడి చేసి హత్య చేయాలని సతీష్ను ఏ2 ప్రేరేపించాడు. ముందే చేరుకుని మాటు వేసి.. కుట్రదారుల పన్నాగాన్ని వేముల సతీష్ అమలు చేశాడు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ యాత్ర ఈ నెల 13న విజయవాడలోని అజిత్సింగ్నగర్లోకి ప్రవేశించక ముందే అక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయిని సేకరించి జేబులో వేసుకుని వివేకానంద స్కూల్ వద్దకు చేరుకుని మరి కొంతమందితో కలసి మాటు వేశాడు. ఆ రోజు రాత్రి 8.04 గంటలకు సీఎం జగన్ తన వాహనంపై నిలబడి యాత్ర నిర్వహిస్తూ అక్కడికి చేరుకున్న సమయంలో వేముల సతీష్ తన ఫ్యాంట్ జేబులోని పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయిని తీసి సీఎం వైఎస్ జగన్పై బలంగా విసిరి దాడికి పాల్పడ్డాడు. అదృష్టవశాత్తూ ఆ సిమెంట్ కాంక్రీట్ రాయి ముఖ్యమంత్రి తలపై సున్నిత భాగంలో కాకుండా ఎడమ కన్ను పైభాగంలో తగలడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. తెరవెనుక కుట్రదారులపై దృష్టి ఈ కుట్ర కోణంపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. మరి కొందరు సాక్షులను విచారించడంతోపాటు సాంకేతికపరమైన డేటాను మరింత విశ్లేíÙంచాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే గుర్తించిన ఏ 2తోపాటు తెరవెనుక ఉన్న ప్రధాన కుట్రదారులపై పోలీసులు దృష్టి సారించారు. కుట్రదారులు ప్రేరేపించడంతోనే వేముల సతీశ్ ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు నిర్ధారించారు. అతడిని ప్రేరేపించిన ఏ2ని కూడా గుర్తించారు. ఏ2 పాత్రకి సంబంధించి మరింత సమాచారంతోపాటు అతడి వెనుక ఉన్న కీలక కుట్రదారుల హస్తాన్ని పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తులో దూకుడు పెంచారు. ఈ కేసులో త్వరలోనే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రానున్నట్లు స్పష్టమవుతోంది. కీలక వ్యక్తుల సహకారం లేకుండా ఈ కుట్రను ఇంత పకడ్బందీగా అమలు చేయడం సాధ్యం కాదని పోలీసులు పేర్కొంటున్నారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ముఖ్యమంత్రి జగన్పై హత్యాయత్నం కేసు దర్యాప్తులో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజీలు, సీఎం బస్సు చుట్టూ ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు, స్థానికులు తమ సెల్ఫోన్లో తీసిన వీడియోలు, కాల్ డేటా తదితర ఆధారాలను విశ్లేషించారు. ఆ ఆధారాలన్నీ హత్యాయత్నం కుట్రలో ఏ1 వేముల సతీష్, ఏ 2 పాత్రను నిర్ధారించాయి. మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ దర్యాప్తు బృందాలు ఈ నెల 17 సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాన నిందితుడు వేముల సతీష్ను విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని కేజీఎఫ్ అపార్ట్మెంట్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నాయి. ఈ కేసులో ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అతడి కదలికలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్న అనంతరం మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేశారు. నిందితుడి సెల్ఫోన్ను స్వా«దీనం చేసుకున్నారు. సతీష్ ఇంట్లో సోదాలు జరిపి హత్యాయత్నానికి పాల్పడిన రోజు అతడు ధరించిన దుస్తులను స్వా«దీనం చేసుకున్నారు. అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా సతీష్ను అజిత్సింగ్నగర్ పోలీస్ స్టేషన్కు తరలించి లాకప్లో ఉంచారు. నిందితుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతోపాటు సీఆర్పీసీ 50 కింద నోటీసులు కూడా జారీ చేశారు. -
సీఎంపై హత్యాయత్నం కేసు దర్యాప్తు ముమ్మరం
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్ల సెంటర్లో జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సింగ్ నగర్లోని వివేకానంద పాఠశాల ప్రాంగణం నుంచే పదునైన రాయితో హత్యాయత్నానికి పాల్పడినట్టు వీడియో ఫుటేజీల ఆధారంగా నిర్ధారించారు. డాబా కొట్ల జంక్షన్ ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజీలు, ఆ ప్రాంతంలోని పలువురి సెల్ ఫోన్లలో వీడియో రికార్డులు, హత్యాయత్నం చేసిన సమయంలో ఆ ప్రాంతంలో కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్టు సమాచారం. దాని ఆధారంగా కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. రౌడీషి టర్లు, బ్లేడ్ బ్యాచ్లపై ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రిపై హత్యాయత్నం కేసులో విజయవాడ పోలీసులు పలువురు అనుమానితులను గుర్తించారు. పోలీసు రికార్డుల ప్రకారం నేర చరితులతోపాటు ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో వీడియో ఫుటేజీలు, కాల్ డేటా ఆధారంగా దాదాపు 60 మంది వరకు అనుమానితులను మ్యాపింగ్ చేశారు. వారిని పోలీసులు పిలిపించి అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఆ ప్రాంతంలో మాజీ ప్రజాప్రతినిధి వర్గంలో క్రియాశీలకంగా వ్యవహరించే రౌడీషిటర్లు, బ్లేడ్ బ్యాచ్ ముఠా సభ్యులు, ఇతర అసాంఘిక శక్తులపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు రెండు రోజుల ముందు నుంచి వారి కాల్ డేటాను విశ్లేíÙస్తున్నారు. అనుమానితులు ఏయే ప్రాంతాల్లో సంచరించింది.. వారి ఫోన్ల నుంచి ఎవరెవరికి కాల్స్ చేశారు.. గ్రూప్ కాల్స్ ఏమైనా మాట్లాడారా అనే కోణాల్లో సమాచారాన్ని క్రోడీకరించారు. ఆ వివరాల ఆధారంగా అనుమానితులను పలు కోణాల్లో ప్రశ్నించారు. వారు చెప్పిన సమాధానాలను కాల్ డేటా విశ్లేషణతోపాటు ఆ ప్రాంతంలోని వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చెప్పిన వివరాలతో సరిపోలుస్తున్నారు. ఆ విధంగా పిలిపించి విచారించిన దాదాపు 60మందిలో ఓ పదిమంది తీరు సందేహాస్పదంగా ఉన్నట్టు గుర్తించారు. వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. డాబా కొట్ల సెంటర్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారో.. సీఎం జగన్పై హత్యాయత్నానికి డాబా కొట్ల జంక్షన్ ప్రాంతాన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తద్వారా ఈ కేసును ఛేదించాలని భావిస్తున్నారు. వివేకానంద స్కూల్ వద్ద ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో యాత్ర సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారని ఆగంతుకుడికి ముందే తెలుసు. ఆ స్కూల్ ప్రాంగణంలో మాటు వేసి హత్యాయత్నానికి పాల్పడిన వెంటనే మాకినేని బసవపున్నయ్య స్టేడియం నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉండటం వల్లే డాబాకొట్ల ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారని ఇప్పటికే పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఆ ప్రాంతంపై ఆగంతకుడికి పూర్తి పట్టు ఉండటంతో ఆ ప్రాంతానికి లేదా ఆ సమీప ప్రాంతానికి చెందిన వ్యక్తి అయ్యుండొచ్చని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలోని తన ఇంటికి లేదా తనకు ఆశ్రయం ఇచ్చేవారి ఇంటికి సులువుగా చేరుకుని పోలీసుల కళ్లు కప్పవచ్చనే ధీమా కూడా ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే సింగ్ నగర్తోపాటు ఆ పరిసర ప్రాంతాల్లోని రౌడీషీటర్లు, బ్లేడ్ బ్యాచ్లు, ఇతర అసాంఘిక శక్తులపై పోలీసులు దృష్టి సారించారు. వారిలో రాజకీయ పారీ్టల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు, ప్రత్యర్థి పార్టీ వర్గీయులతో ఘర్షణ పడ్డ చరిత్ర ఉన్నవారు, గంజాయి తదితర వ్యసనాలకు బానిసైనవారు.. ఇలా పలు కోణాల్లో అనుమానితులను గుర్తించి విచారించే ప్రక్రియను వేగవంతం చేశారు. సమాచారమిస్తే రూ.2లక్షల బహుమతి ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి పాల్పడిన ఆగంతుకుడి సమాచారం అందిస్తే రూ.2లక్షల నగదు బహుమతి అందిస్తామని విజయవాడ పోలీసులు సోమవారం ప్రకటించారు. అగంతకుడికి సంబంధించిన సమాచారం/వీడియో, సెల్ఫోన్ ఫుటేజీ అందించినా, హత్యాయత్నాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు ముందుకు వచ్చి సమాచారమిచి్చనా ఈ బహుమతి అందిస్తామని తెలిపారు. సమాచారం ఇచి్చనవారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఆగంతకుడి సమాచారాన్ని నేరుగా లేదా ఫోన్/వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. సమాచారం అందించేందుకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు కంచి శ్రీనివాసరావు, డీసీపీ 9490619342 ఆర్. శ్రీహరిబాబు, ఏడీసీపీ, టాస్క్ ఫోర్స్: 9440627089 -
మాటు వేసి.. మట్టుబెట్టే కుట్ర
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హత్య చేసేందుకే పక్కా పన్నాగంతో ఆయనపై ఆగంతకుడు దాడికి పాల్పడినట్లు స్పష్టమైంది. ముందుగా రెక్కీ నిర్వహించి సమీపం నుంచి దాడి చేసి తప్పించుకునేందుకు అనువుగా ఉందనే విజయవాడ అజిత్సింగ్ నగర్లోని డాబా కొట్ల జంక్షన్ను ఎంపిక చేసుకున్నట్లు నిర్దారణ అయింది. క్యాటర్ బాల్ / ఎయిర్గన్ లాంటి పరికరం ద్వారా పదునైన రాయి లాంటి వస్తువుతో దాడికి పాల్పడ్డాడు. కణతపైగానీ తల వెనుక దిగువ భాగంపైగానీ తీవ్రంగా దాడి చేయడం ద్వారా ముఖ్యమంత్రిని అంతమొందించాలన్నదే దుండగుల లక్ష్యమని వెల్లడైంది. దాడిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోపాటు తీవ్రంగా గాయపడ్డ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నంగా కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్పై ఆగంతకుడు ఎక్కడ నుంచి ఏ విధంగా దాడికి పాల్పడ్డాడనే దానిపై స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. ఆ ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలు, టవర్ పరిధిలోని సెల్ ఫోన్ల డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు. అనుమానితులపై నిఘా పెట్టడంతోపాటు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు. కాగా సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్కుమార్ మీనాకు నివేదిక సమర్పించారు. హత్య చేసేందుకే పక్కాగా రెక్కీ.. ముఖ్యమంత్రి జగన్పై ఆగంతకుడి దాడి లక్ష్యం ఆయన్ని అంతం చేయడమేనని పోలీసులు నిర్ధారించారు. సీఎం జగన్ నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ యాత్ర విజయవాడలో కొనసాగే వివిధ ప్రాంతాల్లో ఆగంతకుడితోపాటు ఈ కుట్రలో ఇతర పాత్రధారులు రెక్కీ నిర్వహించారు. సమీపం నుంచి దాడి చేసి తప్పించుకునేందుకు డాబా కొట్ల జంక్షన్ను ఎంపిక చేసుకున్నారు. కాస్త ఇరుకుగా ఉండే ఆ రోడ్డులో కుడివైపు ఇళ్లు, దుకాణాలున్నాయి. అక్కడ ప్రజలు భారీగా గుమిగూడతారు. ఎడమ వైపున వివేకానంద స్కూల్ భవనం ఉంది. అటువైపు జన సంచారం ఉండదు. సీఎం జగన్ తన వాహనంపై నుంచి కుడివైపు ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ వెళతారు. ఎడమ వైపు ఎవరూ దృష్టి సారించరు. అంతేకాకుండా ఆ జంక్షన్లోనే ట్రాన్స్ఫార్మర్ ఉంది. సీఎం జగన్ ప్రయాణిస్తున్న భారీ ప్రచార వాహనం వెళ్లేందుకు వీలుగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారని గుర్తించారు. దీంతో స్కూల్ భవనం వైపు పూర్తిగా చీకటి కమ్ముకుని ఉంటుంది. ప్రహరి లోపల స్కూల్ భవనానికి, ఆ పక్కనే ఉన్న గంగానమ్మ ఆలయానికి మధ్యలో ఖాళీ స్థలంలో నిందితులు మాటు వేసి ఉండవచ్చని భావిస్తున్నారు. స్కూల్ ప్రాంగణం వెనుక వైపు నుంచి తూర్పు దిశలో ఉన్న చిన్న ఇనుప గేటు దాటి మాకినేని బసవపున్నయ్య స్టేడియంలోకి వెళ్లి సులభంగా తప్పించుకునేందుకు అవకాశం ఉంది. సీఎం జగన్ యాత్రకు సంఘీభావంగా హాజరైన భారీ జనసందోహంలో కలసిపోతే ఎవరూ గుర్తించ లేరు. ఇన్ని రకాలుగా కసరత్తు చేసిన అనంతరమే వివేకానంద స్కూల్ ప్రాంగణం నుంచి దాడి చేసేందుకు ఆగంతకుడు తెగబడ్డాడు. వీడియో ఫుటేజీ విశ్లేషణ.. ముఖ్యమంత్రి జగన్పై హత్యాయత్నం జరిగిన సమయంలో వీడియో ఫుటేజీని పోలీసులు విశ్లేషించారు. వివేకానంద స్కూల్ ప్రాంగణం నుంచి 45 డిగ్రీల కోణంలో బలమైన రాయి లాంటి వస్తువు అత్యంత వేగంగా దూసుకొచ్చి సీఎం జగన్ ఎడమ కనుబొమ్మ పైభాగంలో బలంగా తాకినట్లు ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. ఆయనకు తగిలి అనంతరం ఆ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా బలంగా తాకింది. సీఎం జగన్కు ఎడమ కనుబొమ్మ పైభాగంలో తీవ్ర గాయం కాగా ఎమ్మెల్యే వెలంపల్లి కంటికి కూడా తీవ్ర గాయమైంది. ఆ ప్రదేశంలో రోడ్డువైపు నుంచి వివేకానంద స్కూల్ ప్రహరి గోడ ఆరు అడుగుల ఎత్తు ఉంది. స్కూల్ ప్రాంగణంలో నేల ఎత్తు చేయడంతో లోపల వైపు నుంచి ప్రహరి కేవలం మూడు అడుగుల ఎత్తే ఉంది. అక్కడి నుంచి సీఎం వాహనం వచ్చే రోడ్డు కేవలం 20 అడుగుల దూరమే ఉంది. ఆ ప్రహరి లోపల ముందుగానే మాటు వేసిన ఆగంతకుడు సీఎం వాహనం అక్కడికి చేరుకోగానే బలమైన రాయిని క్యాటర్ బాల్తోగానీ ఎయిర్గన్ వంటి పరికరంతోగానీ బలంగా గురి చూసి కొట్టాడు. 45 డిగ్రీల కోణంలో బలంగా వచ్చిన రాయి సీఎం జగన్కు తగిలింది. సీఎం జగన్ రోడ్డుకు కుడివైపున ఉన్న జనసందోహాన్ని చూస్తూ అభివాదం చేస్తుండగా దుండగుడు ఈ దాడికి పాల్పడ్డాడు. ఎడమ కణతపైగానీ తల వెనుక కింద భాగంలోగానీ దాడి చేయాలన్నది ఆగంతకుడి ఉద్దేశమన్నది స్పష్టమైంది. ఎందుకంటే కణతపైగానీ తల వెనుక కింద భాగంలోగానీ బలంగా దాడి చేస్తే మెదడుకు తీవ్రగాయం /మెదడులో రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కణత ప్రాంతంలో మెత్తగా ఉండే ఎముక విరిగి మెదడుకు గుచ్చుకునే ప్రమాదం ఉంది. దాంతో మెదడులో రక్తస్రావమై ప్రాణాపాయం సంభవించవచ్చు. తల వెనుక కింద భాగంలో తగిలినా, మెదడు దెబ్బతిన్నా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ను అంతమొందించాలనే పక్కా ప్రణాళికతోనే ఆగంతకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో కుడివైపు ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ తలను కాస్త పక్కకు తిప్పడంతో ఆ బలమైన రాయి ఆయన కణతకు, తల వెనుక కింద భాగంలో కాకుండా ఎడమ కనుబొమ్మ పైభాగంలో తగిలింది. లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కీలక ఆధారాలు లభ్యం సీఎం జగన్పై హత్యాయత్నం కేసులో విజయవాడ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. శనివారం రాత్రి నుంచి అజిత్సింగ్ నగర్లోని డాబా కొట్ల జంక్షన్ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు వివేకానంద స్కూల్, గంగానమ్మ గుడి, మాకినేని బసవపున్నయ్య స్టేడియం తదితర చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహించి దాడి ఎలా జరిగిందనే అంశంపై స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో ఈ కేసు దర్యాప్తు కోసం ‘ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఆదివారం ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ శ్రీహరి నేతృత్వంలో ఏర్పాటైన సిట్లో ఆరు టాస్క్ఫోర్స్ బృందాలున్నాయి. దాడి జరిగిన ప్రదేశాన్ని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి ఆగంతకుడు ఏ మార్గాల్లో తప్పించుకునేందుకు అవకాశం ఉంది? ఎంత దూరం వెళ్లి ఉండవచ్చు? అనే కోణాల్లో విశ్లేషిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న 24 సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను సేకరించి పరిశీలిస్తున్నారు. వీటి ఆధారంగా అనుమానితుల కదలికలపై దృష్టి సారించారు. గంగానమ్మ గుడి ప్రాంతంలో ఉన్న సెల్ టవర్ పరిధిలోని మొబైల్ ఫోన్ల డేటాను విశ్లేషిస్తున్నారు. ప్రత్యేక బలగాలను మోహరించి ఆ ప్రాంతంలో విస్లృతంగా తనిఖీలు చేపట్టారు. డాబా కొట్ల జంక్షన్తోపాటు పరిసర ప్రాంతాల్లో నేర చరిత్ర ఉన్నవారి వివరాలను ఆరా తీస్తున్నారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ తరహా దాడులకు పాల్పడ్డ నేరగాళ్ల రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి గతంలో విజయవాడలో దాడులకు పాల్పడిన వారి ఆచూకీపై ఆరా తీస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలు, కాల్ డేటా రికార్డులు, ఇతర శాస్త్రీయ ఆధారాల ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి పోలీసులు ఈ కేసులో ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వారి నుంచి కీలక వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కుట్ర కోణంపై దృష్టి సీఎం జగన్పై దాడికి పాల్పడ్డ ఆగంతకుడితోపాటు నిందితుడి వెనుక ఉన్న అసలు కుట్రదారులు ఎవరనే కోణంలోనూ పోలీసులు దృష్టిసారించారు. ఈ కేసు దర్యాప్తులో విజయవాడ పోలీసులు ఇప్పటికే కీలక పురోగతి సాధించారు. ఒకటి రెండు రోజుల్లో ఈ కేసు దర్యాప్తులో స్పష్టత వస్తుందని పోలీసు అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనంతరం అసలు కుట్రదారులెవరనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేస్తామని చెబుతున్నారు. త్వరలోనే ఛేదిస్తాం సీఎం వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశాం. సీసీ టీవీ ఫుటేజీలు, కాల్ డాటా, ఇతర శాస్త్రీయ ఆధారాలను విశ్లేషిస్తూ దర్యాప్తు చేస్తున్నాం. కేసులో ఇప్పటికే కొంత పురోగతి సాధించాం. – కాంతి రాణా టాటా, విజయవాడ పోలీస్ కమిషనర్ -
హత్యాయత్నం కేసులో టీడీపీ నేతల అరెస్ట్
తిరుత్తణి/నగరి (చిత్తూరు జిల్లా): ఏపీ మంత్రి రోజా కార్యాలయ నిర్వాహకుడు ప్రతీష్పై ఈ నెల 2వ తేదీన తమిళనాడులోని తిరుత్తణిలో జరిగిన హత్యాయత్నం కేసులో ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతల్ని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దీంతో ప్రతీష్ పై హత్యాయత్నం తెలుగుదేశం కుట్రేనని స్పష్టమైంది. తెలుగుయువత నాయకులైన నిందితులు టీడీపీ నగరి ఇన్చార్జి గాలి భానుప్రకాష్ అనుచరులే. వీరిని ఆదివారం నగరి, తిరుత్తణి సరిహద్దులోని తాళవేడు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్యాయత్నం చేసింది తామేనని చెప్పడంతో నగరి మండలం మేళపట్టుకు తెలుగుయువత మండల ఉపాధ్యక్షుడు నవీన్ అలియాస్ వెట్టు నవీన్, నాయకులు నగరి మున్సిపాలిటీ కీళపట్టు బీసీ కాలనీకి చెందిన చిరంజీవి, నిండ్ర మండలం వైఎన్ కండ్రిగకు చెందిన పరశురాం అలియాస్ మధులను అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్కు తరలించారు. హత్యకు తెలుగు యువత మండల అధ్యక్షుడి కుట్ర ప్రతీష్ను హత్యచేసేందుకు తెలుగుయువత మండల అధ్యక్షుడు చిట్టిబాబు ప్రణాళిక రూపొందించినట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. ఈ కేసు వివరాలను తిరుత్తణి సీఐ మార్టిన్ ప్రేమ్రాజ్ విలేకరులకు వివరించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో భానుప్రకాష్ పై ఆర్కే రోజా గెలవడాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం వర్గీయులు ఆమెపై కక్షపెంచుకున్నారు. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం గెలవాలంటే.. రోజా తరఫున కీలకంగా వ్యవహరిస్తున్న ఆమె కార్యాలయ మేనేజర్ ప్రతీష్ను హత్యచేయాలని తెలుగుయువత నగరి మండల అధ్యక్షుడు చిట్టిబాబు కుట్రపన్నారు. అతడితో నవీన్, చిరంజీవి, పరశురాం చేతులు కలిపారు. నగరిలో హత్యచేస్తే రాజకీయరంగు పులుముకుంటుందని, అందువల్ల ప్రతీష్ను అతను ఉండే తిరుత్తణిలోనే హత్యచేయాలని నిర్ణయించుకున్నారు. అందరూ తిరుత్తణిలో బసచేశారు. ప్రతీష్ వాకింగ్ చేసే ప్రదేశాన్ని రాత్రి ఒంటిగంట సమయంలో పరిశీలించి వచ్చిన చిట్టిబాబు హత్యచేయడానికి అనువుగా ఉందని మిగిలినవారికి చెప్పారు. ఆ సమయంలో ఎవరైనా వస్తే సమాచారం అందించడానికి నిండ్రకు చెందిన ముగ్గురు కిరాయి మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున వాకింగ్కు వచ్చిన ప్రతీష్పై ఇనుపరాడ్లతో దాడిచేసి తీవ్రంగా కొట్టారు. తలపై కొట్టే సమయానికి ప్రతీష్ చెయ్యి అడ్డుపెట్టడంతో చేతికి బలమైన గాయమైంది. ఇంతలో సమీపంలో ఉన్న జనం కేకలు వేయడంతో ఇప్పుడు మిస్ అయింది.. మరోసారి వేసేస్తాం.. అని అరుస్తూ ముళ్లకంపల మధ్య దాచి ఉంచిన బైక్ మీద పరారయ్యారు. పార్టీ నాయకులకు సన్నిహితం హత్యాయత్నం కేసులో నిందితులు పార్టీ నాయకుడు గాలి భానుప్రకాష్తో పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు లోకేశ్ పాదయాత్రలో సైతం పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సెల్ఫీ తీసుకునే చనువు కూడా వారికి ఉంది. -
జగన్ పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు
సాక్షి, అమరావతి: విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టు విచారణను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మూడు వారాలు పొడిగించింది. తదుపరి విచారణకు ఇరుపక్షాలు వాదనలు వినిపించేందుకు సిద్ధమై రావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్పై జనుపల్లి శ్రీనివాసరావు హత్యాయత్నం చేయడం తెలిసిందే. పదునైన కత్తితో జగన్ మెడపై దాడికి జనుపల్లి ప్రయత్నించాడు. జగన్ అప్రమత్తంగా ఉండటంతో ఆయన ఎడమ చేయికి గాయమైంది. ఈ ఘటనపై హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఐఏ దర్యాప్తు చేసి.. చార్జిషీట్ దాఖలు చేసింది. జగన్ను చంపడమే శ్రీనివాసరావు ఉద్దేశమని, అందుకే మెడపై కత్తితో దాడికి ప్రయత్నించాడని చార్జిషీట్లో పేర్కొంది. ముందస్తు పథకంలో భాగంగానే శ్రీనివాసరావు కోడికత్తి సంపాదించాడని, అదును చూసి జగన్పై దాడిచేశాడని వివరించింది. దీనివెనుక ఉన్న కుట్ర, ప్రేరణ వ్యవహారాన్ని కూడా తదుపరి దర్యాప్తులో తేలుస్తామని ప్రత్యేక కోర్టుకు తెలిపింది. అయితే తరువాత ఎన్ఐఏ.. కుట్రకోణంపై దృష్టి సారించలేదు. ఎవరి ప్రేరణతో శ్రీనివాసరావు హత్యాయత్నానికి పాల్పడ్డాడో తేల్చలేదు. ఈ నేపథ్యంలో తనపై హత్యాయత్నం వెనుక ఉన్న కుట్రపై లోతైన దర్యాప్తు చేసేలా ఎన్ఐఏను ఆదేశించాలని కోరుతూ జగన్మోహన్రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్లో విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విజయవాడ కోర్టు కొట్టేసింది. దీన్ని సవాలు చేస్తూ సీఎం జగన్మోహన్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అక్టోబర్లో విచారించిన హైకోర్టు.. విశాఖ కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది. తాజాగా ఈ వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం మరోసారి విచారించింది. -
ఆరు హత్యల కేసులో ఐదుగురు అరెస్టు
సాక్షి కామారెడ్డి/కామారెడ్డి క్రైం: ఇంటి కోసం ఒకే కుటుంబంలోని ఆరుగురిని దారుణంగా హత్య చేసిన కేసులోని నిందితులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ మంగళవారం మీడియాకు వెల్లడించిన వివరాలిలా.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్కు చెందిన పూనే ప్రసాద్ (36)కు భార్య శాన్విక అలియాస్ రమణి (29), కవల పిల్లలు చైత్రిక (8), చైత్రిక్ (8), తల్లి సుశీల, ఇద్దరు చెల్లెళ్లు స్వప్న (26), శ్రావణి (23) ఉన్నారు. ఓ యువతి ఆత్మహత్య కేసు నేపథ్యంలో ఇటీవల బెయిల్పై బయటకు వచ్చాక ప్రసాద్ తన కుటుంబంతో కలిసి కామారెడ్డి జిల్లాలోని పాల్వంచకు మకాం మార్చాడు. ఆ కేసు నిమిత్తం డబ్బులు అవసరమై గతంలో తన స్నేహితుడు ప్రశాంత్ నుంచి రూ.3.50 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడు. ఈమధ్యన ప్రశాంత్ తనకు రావాల్సిన డబ్బులను ప్రసాద్ను అడగగా స్వగ్రామం మాక్లూర్లోని ఇంటిని తాకట్టు పెట్టి చెల్లిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో రూ.25 లక్షలు విలువ చేసే ప్రసాద్ ఇంటిని సొంతం చేసుకోవాలని ప్రశాంత్ పథకం పన్నాడు. ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రేషన్చేసిస్తే లోన్ తీసుకుని తనకివ్వాల్సిన డబ్బులు తీసుకుని మిగిలిన మొత్తం ఇస్తానని ప్రసాద్ను నమ్మించాడు. ప్రసాద్ ఇంటిని రిజిస్ట్రేషన్చేసినప్పటికీ రోజులు గడుస్తున్నా ప్రశాంత్ డబ్బులు ఇవ్వకపోగా, చివరికి హత్య చేయాలని భావించాడు. రూ.60 వేలకు సుపారీ.. ప్రసాద్ను హత్య చేసేందుకు మాక్లూర్ మండలం దుర్గానగర్ తండాకు చెందిన బానోత్ వంశీ, గుగులోత్ విష్ణులకు రూ.60 వేలు ఇచ్చేందుకు ప్రశాంత్ ఒప్పందం చేసుకున్నా డు. గత నెల 29న మాట్లాడుకుందామని నమ్మించి ప్రశాంత్, వంశీ, విష్ణులతో కలిసి ప్రసాద్ను కారులో మదనపల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. మద్యం తాగించి కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. అక్కడే గోతిని తవ్వి పాతి పెట్టారు. ఈనెల 1న పోలీసుల భయంతో ప్రసాద్ ఓ చోట దాక్కున్నాడని, అతను రమ్మన్నాడని చెప్పి భార్య శాన్విక (గర్భవతి), ప్రసాద్ చెల్లెలు శ్రావణిను వెంట తీసుకుని నిజామాబాద్ వెళ్లాడు. శ్రావణిని ఓ చోట ఉంచి శాన్వికను బాసర బ్రిడ్జి సమీపంలోకి తీసుకెళ్లి ఆమె గొంతుకు తాడు బిగించి నిందితులందరూ కలిసి చంపేశారు. ఆమె మృతదేహాన్ని నదిలో పడేశారు. ఆ వెంటనే శ్రావణి దగ్గరకు వెళ్లి ఆమె ను కారులో ఎక్కించుకుని చేగుంట మండలం వడియారం ప్రాంతంలో హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. మళ్లీ పాల్వంచకు వచ్చి ప్రసాద్ తల్లి సుశీల, మరో చెల్లెలు స్వప్న, ఇద్దరు పిల్లలను ఈనెల 4 న అదే కారులో తీసుకువెళ్లి నిజామాబాద్లోని ఓ లాడ్జిలో ఉంచారు. ఆ తర్వాత ప్రశాంత్ ఇంటికి వెళ్లి జరిగిందంతా తన తల్లి వడ్డెమ్మతో చెప్పి సహకరించాలని కోరాగా ఆమె ఒప్పుకుంది. తప్పించుకున్న తల్లి ప్రసాద్ పిల్లల్ని చూడాలని అంటున్నాడని సుశీలను, స్వప్నను నమ్మించారు. సుశీల, స్వప్నలను లాడ్జిలోనే ఉంచి ఇద్దరు పిల్లలను ప్రశాంత్, అతని తమ్ముడు తీసుకుని వెళ్లారు. నిర్మల్ వెళ్లే దారిలో ఉండే సోన్ బ్రిడ్జి వద్దకు వెళ్లేలోగా కారులోనే ఇద్దరు పిల్లలను తాడుతో ఉరి బిగించి హత్య చేసి గోనె సంచుల్లో కట్టి వాగులో పడేశారు. ఈ నెల 13న లాడ్డి నుంచి స్వప్నను కారులో తీసుకువెళ్లిన ప్రశాంత్, మై నర్ బాలుడు, వంశీ కలిసి సదాశివనగర్ మండలం భూంపల్లి సమీపంలోని ప్రధాన రహ దారి పక్కన హత్యచేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. నిందితులు ప్రసాద్ తల్లిని కూడా చంపేయాలని ప్లాన్ చేసినా చివరగా ఆమెకు అనుమానం వచ్చి లాడ్జి నుంచి బయటకు వెళ్లిపోయి తప్పించుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుల గుర్తింపు.. భూంపల్లి వద్ద గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని మరుసటి రోజు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పక్షం రోజుల వ్యవధిలోనే ఒకే తరహా హత్యలు చేగుంట, సదాశివనగర్, మెండోరా (సోన్ బ్రిడ్జి) పీఎస్ల పరిధిలో వెలుగు చూడటంతో వాటి మధ్య ఏదైనా లింక్ ఉన్నదా అనే కోణంలో విచారించారు. వందల సంఖ్యలో సీసీ కెమెరాలు పరిశీలించారు. సెల్ఫోన్ టవర్ డంప్, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని మాక్లూర్ కు చెందిన ప్రశాంత్గా గుర్తించారు. మంగళవారం నిందితులంతా కలిసి కారులో ప్రసాద్ తల్లిని వెతుకుతూ పాల్వంచకు వెళ్తుండగా పద్మాజీవాడి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. -
డబుల్ మర్డర్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. కర్ణంగూడలోని లేక్విల్లా ఆర్చిడ్స్లో నెలకొన్న భూ వివాదాలపై శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్ రెడ్డిల హత్య కేసులో ప్రధాన నిందితుడు మేరెడ్డి మట్టారెడ్డితో పాటుగా ఖాజా మొయినోద్దీన్ , భిక్షపతిలకు రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. కర్ణంగూడ గ్రామ సమీపంలో ఇద్దరు భాగస్వాములైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి రాఘవేందర్రెడ్డిలు 10 ఎకరాల భూమి కొన్నారు. కానీ అప్పటికే ఆ భూమి తనదేనంటూ మట్టారెడ్డి దాన్ని కబ్జా చేశారు. ఈ విషయంలో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీనివాస్ రెడ్డి మరో వ్యక్తితో కలిసి సైట్ వద్దకు వెళ్లగా, అక్కడే ఉన్న మట్టారెడ్డితో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో 2022 మార్చి 1, మంగళవారం ఉదయం మట్టారెడ్డి ఇతరులతో కలిసి శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్రెడ్డిపై కాల్పులు జరిపారు. శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోగా, రాఘవేందర్రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్య అనంతరం మృతుల రెండు కుటుంబాల వారు కూడా మట్టారెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు విచారణ మరింత సులువు అయ్యింది. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరపగా మట్టారెడ్డే సుపారీ గ్యాంగ్తో ఈ హత్యలు చేయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కర్ణంగూడలోని లేక్ విల్లా ఆర్చిడ్స్ లో నెలకొన్న భూ వివాదం ఈ హత్యలకు కారణమైంది. దీంతో శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్రెడ్డిలను హత్య చేయాలని సుఫారీ ఇచ్చి మట్టారెడ్డి ప్లాన్ చేశారు. వివాదంలో ఉన్న భూమి వద్దకు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలపై కాల్పులకు దిగి హత్య చేశారు నిందితులు. ఈ కేసులో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పటి ఇబ్రహీం పట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డిపై పోలీస్ శాఖ విధుల నుండి తప్పించి శాఖపరమైన చర్యలు తీసుకుంది. చదవండి: ‘మణప్పురం’లో బంగారం మాయం -
మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడేళ్ల కిత్రం జరిగిన బాలుడి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మందసాగర్కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది, కాగా 2020 అక్టోబర్18న మహబూబాబాద్కు చెందిన కుసుమ వసంత, రంజిత్ రెడ్డి దంపతుల కుమారుడు దీక్షిత్ రెడ్డిని మందసాగర్ డబ్బుల కోసం కిడ్నాప్ చేశాడు. అక్కడి నుంచి కేసముద్రం మండలం అన్నారం శివారులో ఉన్న ధానమయ్య గుట్టపై తీసుకెళ్లా.. బాలుడిని హతమార్చి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం అదే రోజు రాత్రి దీక్షిత్ తండ్రికి ఫోన్ చేసి రూ.45 లక్షలు ఇస్తే బాలుడిని వదిలేస్తానని చెప్పాడు. పోలీసులకు దొరక్కుండా ఇంటర్నెట్ కాల్స్ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఇది జరిగిన మూడురోజుల అనంతరం తాళ్లపూసపల్లి సమీపంలో ఉన్న ధానమయ్య గుట్టలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. అప్పట్లో ఈ ఘటన ఉదంతం కలకలం రేపింది. అప్పటి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి శనిగపురంకు చెందిన పంక్చర్ షాప్ నిర్వహుకుడు మంద సాగర్ నిందితుడిగా తేల్చారు పోలీసులు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేసినట్లు తేలింది. మళ్లీ దొరికిపోతామన్న భయంతోనే దీక్షిత్ను చంపినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో అరెస్టైన సాగర్ ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్షననుభవిస్తున్నాడు.. మూడేళ్లుగా సాగిన విచారణలో తాజాగా ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. చదవండి: హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. ఇద్దరు మృతి -
ట్రూడో ఆరోపణలు తీవ్రమైనవే: అమెరికా
న్యూయార్క్: ఖలిస్తానీ ఉగ్రవాది హత్యోదంతంలో భారతీయ నిఘా వర్గాల పాత్రపై అమెరికా జాతీయ భద్రతా మండలి ఉన్నతాధికారి స్పందించారు. ‘ కెనడా పౌరుడైన నిజ్జర్ హత్యతో భారతీయ నిఘా వర్గాలకు సంబంధం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేస్తున్న ఆరోపణలు నిజంగా తీవ్రమైనవి. ఈ వివాదం ముగిసిపోవాలంటే సమగ్ర, విస్తృతస్థాయి దర్యాప్తు అవససరం. కెనడా ఇప్పుడు అదే పనిలో ఉంది. ఇందుకు భారత్ సైతం పూర్తి సహాయ సహకారాలు అందించాలని మేం కూడా కోరుకుంటున్నాం’ అని అమెరికా జాతీయ భద్రతా మండలి సమన్వయ కర్త(వ్యూహాత్మక సంబంధాలు) జాన్ కిర్బీ సీఎన్ఎన్ వార్తాసంస్థ ముఖాముఖిలో వ్యాఖ్యానించారు. -
ప్రియుడితో కలసి అక్కను చంపి..
కోరుట్ల/జగిత్యాల క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బంక దీప్తి (24) హత్య కేసు మిస్టరీ వీడింది. చెల్లెలు చందన ప్రేమ పెళ్లిని దీప్తి వ్యతిరేకించడంతోనే హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీప్తి హత్య కేసులో సూత్రధా రి చందన (22), ఆమె ప్రియుడు ఉమర్ షేక్ సుల్తాన్ (25), అతడి తల్లి సయ్యద్ ఆలియా (47), చెల్లెలు ఫాతిమా (22), ఉమర్ మిత్రుడు హఫీజ్ (25)ను శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ భాస్కర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇద్దరూ బీటెక్ చదివారు.. కోరుట్లకు చెందిన బంక శ్రీనివాస్రెడ్డి–మాధవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు దీప్తి, చందన, కుమారుడు సాయి ఉన్నారు. పాతికేళ్ల క్రితం శ్రీనివాస్రెడ్డి ఉపా«ధి కోసం నెల్లూరు నుంచి కోరుట్లకు వలస వచ్చారు. ఇటుక బట్టీ వ్యాపారం చేస్తున్నారు. దీప్తిని బీటెక్ చదివించగా ఆమె పుణేకు చెందిన ఓ కంపెనీలో వర్క్ఫ్రం హోమ్ పద్ధతిన పనిచేస్తోంది. చందన 2019లో హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో చేరి ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. తన సీనియర్, హైదరాబాద్కు చెందిన ఉమర్ షేక్ సుల్తాన్ ఒక ఏడాది డిటెయిన్ కావడంతో చందనకు క్లాస్మేట్ అయ్యాడు. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. చందన ఇంట్లో ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఇద్దరు కూతుళ్ల వివాహం చేసేందుకు తండ్రి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 29న మధ్యాహ్నం దీప్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం... నగదు, బంగారంతో చందన పరారు కావడం కలకలం రేపింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పెళ్లికి అభ్యంతరం చెప్పినందుకే.. చందన ప్రేమ వ్యవహారం తెలిసి కుటుంబ సభ్యులు మతాంతర వివాహానికి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని చందన తన ప్రియుడు ఉమర్ షేక్ దృష్టికి తీసుకెళ్లి ఎలాగైనా పెళ్లి చేసుకుందామని చెప్పింది. కానీ తనకు జాబ్ లేదని, డబ్బు లేదని, బతుకడం ఎలా అని ఉమర్ షేక్ బదులిచ్చాడు. దీంతో తన ఇంట్లో ఉన్న డబ్బు, నగలు తెస్తానని, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పిన చందన.. తన అమ్మానాన్న ఇంట్లో లేనిసమయంలో కోరుట్లకు రావాలని ప్రియుడికి సూచించింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్లో బంధువుల గృహప్రవేశానికి వెళ్లగా చందన తన ప్లాన్ అమలు చేసింది. సూత్రధారి చందన.. తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో సోమవారం ఉదయం 11 గంటలకు ఉమర్ షేక్ కారులో కోరుట్లకు చేరుకున్నాడు. సాయంత్రం మద్యం తాగుదామని చందన తన అక్కతో చెప్పింది. ప్రియుడితో వొడ్కా, బ్రీజర్ తెప్పించింది. మద్యం ఇచ్చి వెళ్లిన ఉమర్ షేక్ స్థానికంగానే ఉండిపోయాడు. రాత్రి చందన తన అక్క దీప్తికి వొడ్కా తాగించి, తాను బ్రీజర్ తాగింది. మత్తులో అక్క నిద్రపోయిందని నిర్ధారించుకున్న చందన.. రాత్రి 2 గంటల సమయంలో షేక్ ఉమర్కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఉమర్ షేక్ వచ్చాక నగదు, బంగారం బ్యాగుల్లో సర్దుతున్న క్రమంలో దీప్తికి మెలకువ వచ్చి.. ‘ఏం చేస్తున్నారని’ చందనను నిలదీసింది. దీంతో చందన, ఆమె ప్రియుడు కలిసి దీప్తిని చున్నీతో కట్టేసి నోరు, ముక్కుకు ప్లాస్టర్ వేసి చంపి సోఫాలో పడేశారు. అనుమానం రాకుండా ఆ తర్వాత తొలగించారు. దీప్తి అతిగా మద్యం తాగి నిద్రలో చనిపోయినట్లు నమ్మించడం కోసం సినీఫక్కీలో సీన్ క్రియేట్ చేశారు. తర్వాత ఇద్దరూ కారులో హైదరాబాద్ పరారయ్యారు. వాయిస్ మెసేజ్తో దారిమళ్లింపు.. అక్కను చంపాక పరారైన చందన.. మర్నాడు హైదరాబా ద్లోని తన ప్రియుడు ఉమర్ షేక్ కలసి అతని తల్లి అలి యా, చెల్లి ఫాతిమా వద్దకు వెళ్లింది. వారంతా కలసి నగదు, డబ్బుతో నాగ్పూర్ వెళ్లాలనుకున్నారు. ఇంతలో చందన బుధవారం తన తమ్ముడు సాయికి ఫోన్లో వాయిస్ మెసేజ్ పంపించింది. అక్కను తాను చంపలేదని.. బాయ్ఫ్రెండ్తో రాత్రివేళ ఇంటికి రావాలని అక్క చెప్పిందని, తాను వద్దన్నా నని హత్య కేసును దారిమళ్లించే ప్రయత్నం చేసింది. నాగ్పూర్ వెళ్తుండగా.. చందన, ఉమర్షేక్ సెల్ఫోన్ల డేటా ఆధారంగా వారు హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు మూడు ప్రత్యేక బృందాలతో అక్కడకు వెళ్లారు. అయితే కారులో బురఖా వేసుకొని తప్పించుకొని తిరుగుతున్న చందనతోపాటు ప్రియుడు ఉమర్ షేక్, అతడి తల్లి అలియా, చెల్లి ఫాతిమా, బంధువు హఫీజ్ను నాగ్పూర్ వైపు పరారవుతుండగా శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్–బాల్కొండ మార్గంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 1.20 లక్షల నగదు, సుమారు రూ.80 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన మెట్పల్లి డీఎస్పీ రవీందర్రెడ్డి, సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సైలు కిరణ్, చిరంజీవిని ఎస్పీ అభినందించారు. -
వివేకా హత్యతో లబ్ధి పొందింది సునీత, ఆమె భర్తే
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో లబ్ధి పొందింది ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి మాత్రమేనని వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ తరఫు న్యాయవాది టీఎల్ నయన్ కుమార్ తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. హత్య చేసే కారణం కూడా వారికే ఉందని వివరించారు. వివేకా హత్య వల్ల ఇతరులు పొందే ప్రయోజనం ఏమీ లేదన్నారు. వివేకా ఆస్తులన్నీ సునీత, ఆమె భర్త సొంతమయ్యాయని తెలిపారు. తండ్రి ఆస్తులను దక్కించుకున్న తరువాత సీబీఐ దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా సునీత వ్యవహరిస్తున్నారని వివరించారు. ప్రతి కోర్టులో, ప్రతి పిటిషన్లో ప్రతివాదిగా చేరుతూ (ఇంప్లీడ్) పిటిషన్ల మీద పిటిషన్లతో, అవాస్తవాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. ఆమె వాదనలను సీబీఐ న్యాయవాదుల ద్వారా చెప్పిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో సునీత బాధితురాలు కాదని... మృతుడు వివేకానందరెడ్డే ఆమె బాధితుడని చెప్పారు. వారి బండారం బయట పడుతుందన్న భయంతోనే ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ సైతం ఆ కోవలోకే వస్తుందన్నారు. అందువల్ల దాన్ని కొట్టేయాలని నయన్ కుమార్ కోర్టును కోరారు. సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి సహా మరికొందరిపై కడప కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు పెండింగ్లో ఉందన్నారు. 2021 ఆగస్టు 2 నుంచి జైలులో ఉన్నానని, చార్జిషీట్ కూడా దాఖలు చేసినందున, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సునీల్ యాదవ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కూనూరు లక్ష్మణ్ శుక్రవారం విచారణ జరిపారు. నయన్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘వివేకా హత్య కేసులో కీలక నిందితుడు, కిరాయి హంతకుడు షేక్ దస్తగిరి పిటిషన్ను తప్ప ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని సునీత కోర్టులను కోరుతూ వస్తున్నారు. వివేకానందరెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వాంగ్మూలం ఇచ్చి, ఆయన్ని హత్య చేసిన వారిలో తానూ ఉన్నానని చెప్పిన దస్తగిరికి ఆమె సహకరిస్తున్నారు. అతనికి కింది కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడాన్ని, అప్రూవర్గా మారేందుకు అనుమతివ్వడంపై సునీత నోరెత్తలేదు. ఆమె న్యాయం కోసం నిష్పాక్షికంగా వ్యవహరించడంలేదు. స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సమాంతరంగా కేసులను పర్యవేక్షిస్తూ దర్యాప్తులో జోక్యం చేసుకుంటున్నారు. ఒక రకంగా సీబీఐని శాసిస్తున్నారు. దీంతో సీబీఐ దర్యాప్తు సైతం పక్కదారి పట్టింది. అంతేకాకుండా కోర్టులకు నిందితులపై తీవ్ర దురభిప్రాయాన్ని కలిగిస్తూ న్యాయ విచారణ ప్రక్రియను దురి్వనియోగం చేస్తున్నారు’ అని నయన్ కుమార్ వివరించారు. ఆస్తి పోతుందన్న భయం సునీత,నర్రెడ్డి రాజశేఖర్రెడ్డిలో పెరిగిపోయింది.. ‘తన తండ్రి షేక్ షమీమ్ అనే మహిళను వివాహం చేసుకున్నారని, వారికి ఒక కొడుకు ఉన్నాడని, వారికి రూ.8 కోట్లు కూడా ఇవ్వాలని తన తండ్రి భావించారని, ఈ కారణంగానే తండ్రితో సత్సంబంధాలు లేవని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీత స్పష్టంగా చెప్పారు. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి కూడా ఇదే చెప్పారు. ఆస్తి పోతుందన్న భయం సునీత, నర్రెడ్డి రాజశేఖర్రెడ్డిలలో పెరిగిపోయింది. రాజశేఖర్రెడ్డి, అతని సోదరుడు నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి, మరికొందరు వివేకా హత్యకు కారణమంటూ మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి భార్య తులసమ్మ కడప జిల్లా కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. అది పెండింగ్లో ఉంది. తులసమ్మ, షేక్ షమీమ్ మరికొందరు సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం వివేకాను హత్య చేసే కారణం సునీతకు, ఆమె భర్తకే ఉంది. సునీల్ యాదవ్కు ఈ హత్యతో సంబంధం లేదు. కావాలనే అతన్ని ఇరికించారు.’ అని న్యాయవాది నయన్ కుమార్ నివేదించారు. న్యాయమూర్తిపైనే ఆరోపణలు చేసే స్థాయికి వెళ్లింది.. ‘నిందితులకు వ్యతిరేకంగా కోర్టులో ప్రతి విచారణకు ఆమె హాజరవుతున్నారు. న్యాయమూర్తి ముందు కూర్చొవడమే కాకుండా తన న్యాయవాదితో వెనక నుంచి చర్చిస్తూ, సూచనలిస్తూ, దర్యాప్తు వివరాలను తానే అందిస్తున్నా అనేలా వ్యవహరిస్తున్నారు. ఈ చర్యల వల్ల.. ఓ వర్గం మీడియా ఏకంగా హైకోర్టు న్యాయమూర్తిపైనే తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలు చేసే స్థాయికి వెళ్లింది. ఇదే కేసులో మరో నిందితుడి బెయిల్ పిటిషన్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. సీబీఐ తరఫున వాదించడానికి ఢిల్లీ నుంచి సీనియర్లు వస్తున్నారు. వారికి స్థానిక న్యాయవాదులు, అధికారులు సహకరిస్తున్నారు. సునీత వాదనలు అనవసరం. హత్య జరిగిన రోజున సునీల్ యాదవ్ ఎక్కడెక్కడికి వెళ్లారో చెప్పేందుకు గూగుల్ టేక్ అవుట్, దస్తగిరి వాంగ్మూలంపై సీబీఐ ఆధారపడింది. గూగుల్ టేక్ అవుట్లో పేర్కొన్న సమయాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. దీనిలో తప్పు జరిగిందని సీబీఐ కూడా ఒప్పుకుంది.’ అని నయన్కుమార్ కోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 8కి వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేయండి అజేయ కల్లం పిటిషన్పై సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన వాంగ్మూలాన్ని వక్రీకరించిందని, తాను చెప్పని విషయాలను చెప్పినట్టు చార్జిషీట్లో పేర్కొందని, వాటిని చార్జిషీట్ నుంచి తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఈ పిటిషన్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కూనూరు లక్ష్మణ్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. తాను చెప్పని విషయాలను చెప్పినట్టు సీబీఐ తన చార్జిïÙట్లో పేర్కొన్నందున వాటిని చార్జిషీట్ నుంచి తొలగించాలంటూ అజేయ కల్లం ఇటీవల తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం జస్టిస్ లక్ష్మణ్ ముందు విచారణకు వచ్చింది. అజేయ కల్లం తరఫున సీనియర్ న్యాయవాది టి.సూర్యకరణ్రెడ్డి, న్యాయవాది పి.వీర్రాజు వాదనలు వినిపించారు. -
వైజాగ్ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: కానిస్టేబుల్ రమేష్ మర్డర్ కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తెరపైకి కొత్త వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరో కాదు శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మ.. పోలీసుల విచారణలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పైడమ్మే.. రామారావుతో కలవడానికి కారణమని పోలీసులకు శివాని తెలిపింది. ఫోన్ కాల్ డేటా పరిశీలించిన ఎంవీపీ పోలీసులు.. వందల సార్లు కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. పైడమ్మ, శివాని, రామారావు ముగ్గురం కలిసే బయటకు వెళ్లే వాళ్లమని శివాని చెప్పింది. పైడమ్మాను ఏ4గా చేర్చే అవకాశం ఉంది. తనకు అసలు సంబంధం లేదంటున్నా శివాని అక్క పైడమ్మా.. కావాలనే ఇరికిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. శివాని.. రామారావు ఒక ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి పరిచయం చేసిందని పైడమ్మా తెలిపింది. కాన్ఫరెన్స్ కాల్స్లో మాట్లాడినట్లు నిర్థారించిన పోలీసులు. పైడమ్మను విచారిస్తున్నారు. ఆమె ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ పోలీసుల అదుపులోనే A1 భార్య శివాని, A2 ప్రియుడు రామారావు, A3 నీలా ఉన్నారు. వారిని రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. చదవండి: తహసీల్దార్ వేధింపులు... మహిళా ఉద్యోగి ఆత్మహత్య కాగా, వన్టౌన్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ రమేష్ మృతి విషయంలో తొలి నుంచి అనుమానిస్తున్నదే జరిగింది. శివజ్యోతి అలియాస్ శివానీయే ఆమె ప్రియుడితో కలిసి తన భర్త రమేష్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ శుక్రవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. 2009 బ్యాచ్కు చెందిన బర్రి రమేష్(35) ఆదర్శనగర్లో ఉంటూ వన్టౌన్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బెడ్పై విగతజీవిగా ఉన్న రమేష్ ను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య పోలీసులకు చెప్పింది. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది. రామారావు అనే టాక్సీ డ్రైవర్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు. నీలా రమేష్కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు. తొలి నుంచి శివానీది నేర స్వభావమే.. రమేష్ భార్య శివానీది తొలి నుంచి నేర స్వభావమే అని సీపీ తెలిపారు. తల్లిదండ్రులతో సైతం ఆమె పలుమార్లు గొడవ పడినట్లు చెప్పారు. ప్రియుడి విషయంలో భార్యను పలుమార్లు రమేష్ మందలించాడని వెల్లడించారు. ఆమె తీరు కారణంగా విసిగిపోయి ఒక దశలో ఇద్దరు కుమార్తెలను తన వద్ద వదిలేసి ప్రియుడితో వెళ్లిపొమ్మని కూడా ఆమెకు చెప్పాడన్నారు. అయితే పిల్లలు, ప్రియుడు ఇద్దరూ కావాలనే ఉద్దేశంతో శివాని రమేష్ హత్యకు కుట్ర పన్నింది. ఈ హత్యలో సహకారానికి శివానీ, ప్రియుడు రామారావు అతని స్నేహితుడు నీలాకు రూ.లక్ష సుపారి కూడా ఇచ్చినట్లు సీపీ వెల్లడించారు. -
Viveka Case: దర్యాప్తు తీరు ఆద్యంతం సందేహాస్పదం.. ‘ద వైర్’ కథనం -2
వివేకాను చివరిగా ఎవరు చూశారు? వాచ్మెన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం 2019 మార్చి 14 రాత్రి 12 గంటల సమయంలో వివేకా తన నివాసం నుంచి బయటకు వచ్చి సిగరెట్ తాగడం రంగన్న చూశాడు. నిందితులు కాకుండా వివేకా జీవించి ఉండగా చివరిసారిగా చూసిన వ్యక్తి రంగన్న. పోలీసు దర్యాప్తు నియమావళి ప్రకారం జీరో అవర్గా పిలిచే అప్పటి నుంచే దర్యాప్తు మొదలు కావాలి. అయితే 2021లో దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ వాంగ్మూలం గానీ అనంతరం రంగన్న ఇచ్చిన వాంగ్మూలంలోగానీ 11.30 గంటలకు ఎర్ర గంగిరెడ్డి వివేకా నివాసానికి వచ్చారని చెప్పడం గమనార్హం. సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తీరు ఆద్యంతం అశాస్త్రీయం, అహేతుకం, అసంబద్ధం, సందేహాస్పదంగా ఉందని ప్రముఖ జాతీయ వార్త వెబ్సైట్ ‘ద వైర్’ కుండబద్దలు కొట్టింది. రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని చెబుతున్న సీబీఐ.. కీలకమైన ఆస్తి వివాదం కోణాన్ని విస్మరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. వివేకా హత్య అనంతరం ఆయన నివాసంలో నిందితులు ఆస్తి పత్రాల కోసం వెతికారన్నది స్పష్టమవుతున్నా, ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించింది. రెండున్నరేళ్ల తర్వాత హఠాత్తుగా గుర్తుకొచ్చిందా? నార్కో ఎనాలిసిస్ పరీక్షల్లో కూడా ఏమీ చెప్పని వాచ్మెన్ రంగన్నకు రెండున్నరేళ్ల తర్వాత అంతా గుర్తుకు వచ్చినట్టు సీబీఐ వాంగ్మూలం నమోదు చేయడంపై సందేహాలు వ్యక్తం చేసింది. ఇక కీలక ఆధారంగా గొప్పగా ప్రకటించిన గూగుల్ టేక్ అవుట్ డాటా పూర్తిగా తప్పని స్వయంగా సీబీఐనే ప్రకటించడాన్ని ‘ద వైర్’ ప్రధానంగా ప్రస్తావించింది. రాజకీయ, నేర సంబంధమైన పరిశోధనాత్మక పాత్రికేయంలో 20 ఏళ్ల అనుభవం ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ సరితా రాణి రాసిన రెండు విశ్లేషణాత్మక కథనాలను ‘ద వైర్’ వెబ్సైట్ ప్రముఖంగా ప్రచురించింది. సాక్షుల వాంగ్మూలాల పేరిట కట్టు కథలా? మొదటి కథనంలో సీబీఐ దర్యాప్తులో డొల్లతనాన్ని బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రచురించిన రెండో కథనంలో మరింత లోతుగా విశ్లేషించి సీబీఐ దర్యాప్తు తీరును ఎండగట్టింది. సీబీఐ ప్రస్తావించిన ఐపీడీఆర్ డాటా కూడా హేతుబద్ధ ఆధారం కాదని తేల్చి చెప్పింది. దర్యాప్తునకు ఆధారంగా చెబుతూ సాక్షుల వాంగ్మూలాల పేరిట సీబీఐ చెబుతోంది కట్టు కథలేనని స్పష్టం చేసింది. ఏకంగా 14 మంది సాక్షులు సీబీఐ తీరును తప్పుబట్టడం.. ఏకంగా రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం సీబీఐపైనే న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ఏ కోణంలో చూసినా సరే వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దారి తప్పిందనే విషయాన్ని స్పష్టం చేసింది. వాచ్మెన్ రంగన్న అప్పుడలా.. ఇప్పుడిలా వివేకా హత్య కేసు దర్యాప్తు చేసిన మొదటి దర్యాప్తు అధికారి చెప్పిన దాని ప్రకారం.. వాచ్మెన్ రంగన్న 2019 మార్చి 14వ తేదీ రాత్రి వివేకానందరెడ్డి నివాసం వరండాలో నిద్రపోయాడు. ఎన్నికల ప్రచారం ముగించుకుని రాత్రి 11.30 గంటల సమయంలో వివేకానందరెడ్డి తన నివాసానికి చేరుకున్నారు. కారు శబ్దం వినిపించి రంగన్న నిద్ర లేచి గేటు తెరిచాడు. వివేకా ఇంటి వద్ద దిగిపోయాక.. కారు డ్రైవర్ ప్రసాద్ ఇంటికి వెళ్లిపోయాడు. ‘నేను నిద్రపోతాను.. నువ్వు నిద్రపో’ అని వివేకా రంగన్నతో చెప్పి తన నివాసంలోకి వెళ్లిపోయారు. నార్కో ఎనాలిసిస్ ఎందుకు బయటకు రాలేదు? ఆ తర్వాత వివేకాను ఆయన నివాసంలో ఆ రోజు రాత్రి హత్య చేస్తుంటే బయటే ఉన్న రంగన్న ఏం చేశాడనే దానిపై టీడీపీ ప్రభుత్వ హయాంలోని పోలీసు అధికారులు విచారించనే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కొన్ని వారాల తర్వాత రంగన్న పేరు కూడా అనుమానితుల జాబితాలో చేర్చారు. మరికొందరు అనుమానితులతోపాటు రంగన్నను కూడా అహ్మదాబాద్ తీసుకువెళ్లి నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఎలాంటి విషయాన్ని రాబట్ట లేదు. మరి రంగన్నకు ఏదైనా విషయం తెలిసి ఉంటే నార్కో ఎనాలిసిస్ పరీక్షల్లో బయటపడేది కదా! రెండున్నరేళ్ల తర్వాత అన్నీ గుర్తుకొచ్చాయా? వివేకా హత్య జరిగిన రెండున్నరేళ్ల తర్వాత సీబీఐ రంగన్నను ప్రత్యక్ష సాక్షిగా న్యాయస్థానంలో హాజరు పరిచింది. ఈ సారి రంగన్న కొన్ని కొత్త విషయాలు చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. 2019 మార్చి 14న రాత్రి వివేకాను ఇంటి వద్ద దించేసి డ్రైవర్ ప్రసాద్ వెళ్లిపోయిన తర్వాత.. 15 నిమిషాలకు అంటే 11.45 గంటలకు వివేకా స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డి అక్కడికి చేరుకున్నాడని చెప్పాడు. దర్యాప్తులో ఇదే కీలకమైన టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఈ మొత్తం ఎపిసోడ్లో దస్తగిరి, రంగన్న వాంగ్మూలాలు రెండు చోట్ల సరిపోలుతున్నాయి. వివేకా నివాసానికి ఎర్ర గంగిరెడ్డి రావడం.. వెళ్లడం అనే అంశాలు. మృతదేహాన్ని అర్ధరాత్రే చూసిన రంగన్న 2021 జూలైలో జమ్మలమడుగు న్యాయస్థానంలో రంగన్న ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. 2019 మార్చి 14 అర్ధరాత్రి వివేకా నివాసం నుంచి శబ్దాలు రావడంతో కిటికీ వద్దకు వెళ్లి లోపలికి చూశాడు. లోపల నలుగురు వ్యక్తులు హాల్, బెడ్ రూమ్లలో తిరుగుతూ దేని కోసమో వెతుకుతున్నారు. రంగన్న ఓ చెట్టు వెనుక దాక్కున్నాడు. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి బయటకు వచ్చి గోడదూకి వెళ్లిపోవడం చూశాడు. అనంతరం ఎర్ర గంగిరెడ్డి బయటకు వచ్చి విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి వెళ్లాడు. ఆ తర్వాత అంటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో రంగన్న వివేకా నివాసం లోపలికి వెళ్లాడు. బెడ్రూమ్లో మంచం పక్కన రక్తం పడి ఉంది. బాత్రూమ్లో వివేకా కింద పడిపోయి ఉన్నారు. ఆయన చుట్టూ రక్తం మడుగు కట్టి ఉంది. సాక్షులు చెప్పని విషయాలు చెప్పినట్లు.. సాక్షుల వాంగ్మూలాల పేరిటా సీబీఐ అడ్డదారులు తొక్కింది. సాక్షులు చెప్పని విషయాలు చెప్పినట్టుగా గతంలో దర్యాప్తు అధికారిగా ఉన్న రామ్సింగ్ నమోదు చేయడం వివాదాస్పదమవుతోంది. కనీసం 14 మంది సాక్షులు తాము చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ వాంగ్మూలం నమోదు చేయడాన్ని ఖండించారు. నలుగురు సాక్షులు రామ్సింగ్కు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇదే విషయాన్ని ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు రాసిన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు కూడా. వివేకా చనిపోయారనే విషయాన్ని 2019 మార్చి 15న ఉదయం 6.15 గంటలకు ఆయన పీఏ కృష్ణా రెడ్డి గుర్తించారు. చెప్పని విషయాలు ఎలా ఆపాదిస్తారు? అంతకు ముందే వివేకా మరణం గురించి ఎవరికైనా తెలుసా అనే కోణంలో సీబీఐ దృష్టి సారించింది. వివేకా హత్య గురించి గజ్జెల ఉదయ్ కుమార్ రెడ్డికి 2019 మార్చి 15 తెల్లవారు జామున 4 గంటలకే తెలుసని ఆయన తల్లి తమ పొరుగున ఉండే ప్రభావతి దేవికి చెప్పినట్టుగా సీబీఐ చార్జ్షీట్లో పేర్కొంది. ఆ మేరకు ప్రభావతి దేవి 161 వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా వెల్లడించింది. కానీ సీబీఐ వాదనను ప్రభావతి దేవి ఖండించారు. తాను చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ తన పేరిట వాంగ్మూలం నమోదు చేసుకుందని ఆవిడ స్పష్టం చేశారు. (చదవండి : Viveka Case: దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు') అజేయ కల్లం పేరిట తప్పుడు వాంగ్మూలం సాధారణ వ్యక్తులే కాదు.. ఏకంగా రాష్ట్ర రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాంగ్మూలాన్ని కూడా సీబీఐ వక్రీకరించడం వివాదాస్పదమైంది. అజేయ కల్లం చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ తప్పుడు వాంగ్మూలం నమోదు చేసి చార్జ్ïÙట్లో పేర్కొంది. దీన్ని అజేయ కల్లం తీవ్రంగా ఖండిస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం సీబీఐ తీరును ఎండగడుతోంది. అజేయ కల్లం చెప్పింది ఇది 2019 మార్చి 15 ఉదయం 5 గంటలకు పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం మొదలైంది. గంటన్నర తర్వాత అంటే 6.30 గంటల సమయంలో సహాయకుడు వచ్చి ఓఎస్డీ కృష్ణ మోహన్రెడ్డిని పిలిచారు. ఆయన బయటకు వెళ్లారు. తర్వాత కాసేపటికి కృష్ణమోహన్రెడ్డి వచ్చి వైఎస్ జగన్ చెవిలో ఏదో చెప్పారు. దాంతో నిశ్చేష్టులైన వైఎస్ జగన్ వెంటనే లేచారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డి చనిపోయారు అని మాతో చెప్పారు. వెంటనే సమావేశాన్ని ఆపేసి బయటకు వచ్చాం’ అజేయ కల్లం చెప్పారంటూ CBI మార్చిన వాంగ్మూలం ఇది ‘2019 మార్చి 15 ఉదయం 5.30 గంటలకు హైదరాబాద్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరుగుతుండగా.. ఇంట్లో సహాయకుడు వచ్చి వైఎస్ భారతి పిలుస్తున్నారని వైఎస్ జగన్కు చెప్పారు. దాంతో లోపలికి వెళ్లిన జగన్ కాసేపటి బయటకు వచ్చి తన చిన్నాన్న వివేకానందరెడ్డి మరణించినట్టు అక్కడ ఉన్న మాకు చెప్పారు’ అని అజేయ కల్లం వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సీబీఐ తెలిపింది. దీన్ని అజేయ కల్లం తీవ్రంగా ఖండించారు. అసలు వైఎస్ భారతి పేరును తాను ప్రస్తావించలేదని, అలాగే తాను 6.30 గంటలని చెప్పగా 5.30 గంటలుగా సీబీఐ పేర్కొందని ఆయన తప్పుబట్టారు. అయినా బయట నిద్రించిన రంగన్న! రక్తం మడుగులో తన యజమాని వివేకానందరెడ్డి చనిపోయి ఉండడాన్ని చూసిన తర్వాత రంగన్న ఏం చేశారంటే.. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తలుపు దగ్గరకు మూసివేసి బయటకు వచ్చి అటూ ఇటూ చూశాడు. ఎవరూ కనిపించకపోవడంతో అక్కడే బీడీ తాగాడు. కాసేపు మెట్ల మీద కూర్చున్నాడు. కాసేపట్లో సమీపంలోని మసీదు నుంచి ఉదయం ప్రార్థనలు వినిపించాయి. దాంతో అక్కడే వరండాలో నిద్రపోయాడు. సీబీఐ అధికారులు ఆ ప్రాంతంలో ఉన్న రెండు మసీదుల్లోని మత పెద్దలతో మాట్లాడారు. వారు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం రోజూ ఉదయం 5 గంటలకు మసీదులో ప్రార్థనలు మొదలవుతాయి. అప్పటికి 15 నిమిషాల ముందే మసీదు మైకుల ద్వారా ఆజాన్ వినిపించడం మొదలు పెడతారు. అంటే తెల్లవారు జామున 3.30 గంటల నుంచి 4.45 గంటల మధ్యలో రంగన్న తన యజమాని వివేకా మృతదేహాన్ని చూశాడు. కానీ తన వద్ద ఉన్న ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్న వివేకా వద్ద పని చేసే సిబ్బందికి గానీ.. అక్కడికి పది నిమిషాల్లోనే వెళ్లగలిగేంత సమీపంలో ఉన్న డ్రైవర్ ప్రసాద్ నివాసానికి గానీ.. మరెవరికైనా చెప్పాలనిగానీ అనుకోలేదు. ఉదయం 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య వివేకా పీఏ కృష్ణా రెడ్డి, వంటమనిషి లక్షి, ఆమె కుమారుడు ప్రకాశ్ వచ్చే వరకు నిద్రపోతున్నట్టు నటిస్తూ గడిపాడు. పైగా ఉదయం వివేకా నివాసం ఉత్తరం వైపు తలుపు తెరచి ఉండటాన్ని చూసిన పీఏ కృష్ణా రెడ్డి.. తనను ఇంటి లోపలికి వెళ్లి చూడమంటే రంగన్న లోపలికి వెళ్లాడు. అప్పుడు వివేకా మృతదేహాన్ని మొదటి సారి చూసినట్టుగా అందర్నీ నమ్మించాడు. ఆ విషయాన్ని 861 రోజుల తర్వాత సీబీఐ ద్వారా న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. హత్య జరిగిన రెండేళ్ల తర్వాత దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ వాంగ్మూలం, రంగన్న ఇచ్చిన వాంగ్మూలం తప్ప మరే ఆధారం లేదు. -
న్యాయస్థానం నిర్ణయంపైనా ‘పచ్చ’పాతమా రామోజీ?
దుష్ప్రచారం చేయడంలో తనను మించిన వారు లేరంటూ ఈనాడు రామోజీ మరో అడుగు ముందుకు వేశారు. చంద్రబాబు కోసం ఏం చేయడానికైనా తగ్గేదే లేదని పదే పదే చాటుకుంటున్న రామోజీ.. తుదకు పాత్రికేయ విలువలకూ తిలోదకాలు ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణను విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేయడంతో ఈయన గారికి బీపీ పెరిగిపోయింది. న్యాయస్థానమైతే ఏంటనుకుంటూ తన అక్కసు వెళ్లగక్కారు. ఈ కేసును విచారిస్తోంది ఎన్ఐఏ. బదిలీ చేస్తూ తీర్పు చెప్పింది విజయవాడలోని ఎన్ఐఏ న్యాయస్థానం. బదిలీ చేసింది విశాఖలోని ఆ కోర్టుకే. ఇందులో అభ్యంతరం ఏమిటి రామోజీ? తీర్పు ఎలా ఇవ్వాలో కూడా మీరే నిర్దేశిస్తారా? సాక్షి, అమరావతి: పచ్చ (టీడీపీ) కామెర్లు సోకిన ఈనాడు రామోజీరావు ఏనాడో పాత్రికేయ విలువలకు తిలోదకాలు ఇచ్చేశారు. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. అంతటితో ఆగక ఇప్పుడు ఏకంగా న్యాయస్థానాల నిర్ణయాలు, తీర్పులను సైతం వక్రీకరిస్తూ.. వక్రభాష్యాలు చెబుతూ.. దురుద్దేశాలు ఆపాదించేందుకూ బరితెగించారు. చంద్రబాబు కోసం ఎంతకైనా దిగజారుతామని తన దివాలాకోరుతనాన్ని మరోసారి ప్రదర్శించారు. ఇందులో భాగంగా న్యాయ వ్యవస్థ అధికార పరిధిలోకి చొరబడి మరీ న్యాయమూర్తి నిర్ణయాలకు వక్రభాష్యం చెప్పారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తున్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై 2018 అక్టోబరు 25న విశాఖపట్నంలో జరిగిన హత్యాయత్నం కేసును విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేస్తూ విజయవాడ ఎన్ఐఏ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వక్రీకరిస్తూ ‘ఈనాడు’ సొంత వ్యాఖ్యలు చేయడం న్యాయ నిపుణులను విస్మయ పరిచింది. న్యాయ వ్యవస్థను కించపరిచిన ఈనాడు ఈ కేసును విశాఖపట్నం న్యాయస్థానానికి బదిలీ చేయడంపై ఈనాడు పత్రిక బుధవారం ప్రచురించిన కథనం పూర్తిగా వక్రీకరణే. వచ్చే ఎన్నికల వరకు కేసు విచారణను సాగదీసేందుకే ఆ కేసును విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేశారని ఈనాడు తీర్మానించేయడం న్యాయ వ్యవస్థను ప్రశ్నించడమే. రాజకీయ దురుద్దేశంతో ప్రచురించిన కథనం అది. ఏకంగా న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ... న్యాయ వ్యవస్థను కించపరుస్తూ కథనాన్ని ప్రచురించింది. ఎన్ఐఏ కోరిక మేరకే విశాఖపట్నంలో ప్రత్యేక కోర్టు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణను సాగదీసేందుకే విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి కేసును బదిలీ చేశారని ఈనాడు పత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవం. ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న ఎన్నో కేసులు న్యాయస్థానాల్లో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్నాయి. మావోయిస్టు పార్టీ, వాటి అనుబంధ సంఘాల కేసులు, వివిధ తీవ్రవాద సంస్థల కేసులు పెండింగులో ఉండటం సమస్యగా మారింది. విజయవాడలో ఉన్న ఒకే ఒక ఎన్ఐఏ న్యాయస్థానం ద్వారా ఈ కేసుల విచారణకు ఎక్కువ కాలం పడుతుందని హైదరాబాద్లోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం భావించింది. అందుకే రాష్ట్రంలో అదనంగా ఎన్ఐఏ న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓ లేఖ ద్వారా కోరింది. విశాఖపట్నంలో మరో న్యాయస్థానం ఏర్పాటు చేస్తే ఎన్ఐఏ కేసుల విచారణ వేగవంతమవుతుందని చెప్పింది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన ఎన్ఐఏ, సీబీఐలకు ఇతర రాష్ట్రాల్లో కూడా వేర్వేరు చోట్ల ప్రత్యేక న్యాయస్థానాలు ఉన్నాయి. సీబీఐకి ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడతోపాటు విశాఖపట్నం, కర్నూలులో ప్రత్యేక న్యాయస్థానాలు ఉన్నాయి. అదే విధంగా ఎన్ఐఏకు విజయవాడతోపాటు విశాఖపట్నంలో కూడా ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలను విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానం పరిధిలోకి చేర్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు విశాఖపట్నంలో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ ఘటన విశాఖపట్నంలో జరిగినందున ఈ కేసు విచారణను కూడా కొత్తగా ఏర్పాటైన విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేయాలని విజయవాడ న్యాయస్థానం నిర్ణయించింది. ఈనాడు పైశాచిక ఆనందం ఎవరైనా బాధితునిపట్ల సానుకూలత, సానుభూతి చూపుతారు. దాడికి పాల్పడిన వారి పట్ల ఆగ్రహం ప్రదర్శిస్తారు. కానీ ఈనాడు పత్రిక అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఈ హత్యాయత్నం కేసులో బాధితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయనపట్ల ఈనాడు పత్రిక ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆయన్ని అవహేళన చేయడమే కాకుండా, ఆయన్ను లక్ష్యంగా చేసుకుని కొన్నేళ్లుగా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ దుష్ప్రచారం చేస్తోంది. ఇలా పైశాచిక ఆనందం పొందుతోంది. నిందితుడు ఉపయోగించిన ఆయుధం పేరును కేసుకు జోడించి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని తక్కువగా చూపేందుకు కుట్ర పన్నుతోంది. నిజాలకు పాతర.. ‘ఈనాడు’ ఎత్తుగడ! కేసులో వాస్తవాలు బయట పడకూడదనే ఈనాడు ఇలా వక్రీకరిస్తూ కథనాలు ప్రచురిస్తోందన్నది స్పష్టమవుతోంది. ఎన్ఐఏ చార్జ్షీట్లో పేర్కొన్న అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. నిందితుడు పథకం ప్రకారమే వైఎస్ జగన్పై హత్యాయత్నానికి పాల్పడ్డాడని, మెడ భాగంలో పొడిచి.. జగన్ను హత్య చేయాలన్నది అతని లక్ష్యమని స్పష్టం చేసింది. చివరికి ఎడమ భుజం భాగంలోని ముఖ్యమైన ప్రాంతంలో గాయమైందని కూడా చార్జ్షీట్లో పేర్కొంది. అంత తీవ్రమైన దాడిని తక్కువగా చేసి చూపేందుకు ఈనాడు పత్రిక దిగజారుడు కథనాలు ప్రచురిస్తోంది. కుట్ర కోణం, సూత్రధారులపై సమగ్ర దర్యాప్తు చేయాలి ఈ హత్యాయత్నం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని, వెనుక ఎవరున్నారన్నది తేల్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫు న్యాయవాదులు ఎన్ఐఏను, న్యాయస్థానాన్ని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కింది అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. ♦ విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరికి నిందితునితో ఉన్న సంబంధం ఏమిటి? ♦ నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుపై గతంలో కేసు ఉన్నా సరే విమానాశ్రయంలోని రెస్టారెంట్లో ఉద్యోగిగా ఎలా చేర్చుకున్నారు? ఈ విషయాన్ని ఎన్ఐఏ తన చార్జ్షీట్లో పేర్కొన్న విషయం వాస్తవమే కదా! ♦ వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్లో ఉన్నప్పుడు కాఫీ ఇచ్చేందుకు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావునే ఎందుకు పంపించారు? ♦ హర్షవర్ధన్ చౌదరికి విశాఖపట్నం విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కడం వెనుక ఎవరు కీలకంగా వ్యవహరించారు? ♦ హర్షవర్ధన్ చౌదరి, నారా లోకేశ్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? -
సీబీఐ ఛార్జ్షీట్ కల్పిత కథ.. ఎల్లో మీడియా, టీడీపీకి మసాలా: సజ్జల
సాక్షి, అమరావతి: కల్పితమైన కథ సీబీఐ ఛార్జ్షీట్లో కనిపిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎల్లో మీడియా, టీడీపీకి మసాలాతో అవసరమైన సరుకుగా ఛార్జ్షీట్ ఉపయోగపడుతుందని మండిపడ్డారు. సీబీఐ కూడా దర్యాప్తు పేరుతో ఎంత చెత్తగా ఛార్జ్షీట్ దాఖలు చేసిందో చూస్తున్నామన్నారు. ‘‘వివేకా కేసు దర్యాప్తు సీబీఐ చరిత్రలోనే మచ్చుతునక. బేసిక్ లాజిక్ను సీబీఐ మర్చిపోయింది. వ్యవస్థలో చంద్రబాబు వైరస్లా పాకారు. వివేకా హత్య వల్ల నష్టం ఎవరికో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. వ్యవస్థలను ప్రభావితం చేయడం వల్లే దర్యాప్తు ఇలా జరిగింది. వివేకా హత్య కేసు ఆధారాలను సీబీఐ ఏం చేసింది?. కథ ఎలా మలుపు తిరగాలో ఆ విధంగా స్టేట్మెంట్ వస్తుంది. గూగుల్ టేక్ అవుట్ నిలబడదని వారికి అర్థమైంది’’ అని సజ్జల పేర్కొన్నారు. ‘‘నాలుగేళ్ల తర్వాత కొత్త కథ అల్లారు. సునీత ఇప్పటివరకు ఆరు, ఏడు స్టేట్మెంట్లు ఇచ్చారు. కొన్ని అంశాలను మాత్రమే తీసుకుని విషం చిమ్ముతున్నారు. వివేకా పేరు మీద మచ్చ పడకూడదని అవినాష్రెడ్డి, ఆయన కుటుంబం మౌనంగా భరిస్తూ వచ్చారు. వివేకా హత్య కేసులో దోషులు బయటకు రావాలని మొదటి నుంచి కోరుతున్నాం’’ అని సజ్జల తెలిపారు. ‘‘ఏ స్టేట్మెంట్ చూసినా ఒకవైపు మాత్రమే ఉన్నాయి. చంద్రబాబుకు అనుకూలంగా స్టేట్మెంట్లు మార్చారు. అవినాష్రెడ్డి వైపు చూపేందుకు దస్తగిరిని అప్రూవర్గా మార్చారు. ఆధారాలన్నీ ఒకవైపు చూపిస్తుంటే.. దర్యాప్తు మరోవైపు సాగింది. సునీతకు వాళ్లు సలహాదారులుగా మారారు. అవినాష్రెడ్డికి ఎంపీ టికెట్ 2011లోనే ప్రకటించారు. అవినాష్రెడ్డి ఎంపీగా గెలవడం కోసం వివేకా పనిచేశారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. చదవండి: మాటలు మార్చారు.. మీకర్థమవుతోందా? ‘‘సునీత చెప్పినవన్నీ అబద్ధాలే.. భారతమ్మ, నేను కలిసి సునీత ఇంటికి వెళ్లలేదు. నా భార్యతో కలిసి ఒకసారి పరామర్శించడానికి వెళ్లా. అవినాష్ను డిఫెండ్ చేయమని సునీతకు చెప్పలేదు. సునీతను ప్రెస్మీట్ పెట్టమని కూడా నేను చెప్పలేదు. గూగుల్ టేక్ఔట్ పేరుతో ముందు అవినాష్ తండ్రిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు గూగుల్ టేక్ ఔట్ ఆధారం కాదని తేలిపోయింది. జూన్ 19న అవినాష్రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సునీతతో మళ్లీ స్టేట్మెంట్ ఇప్పించారు.’’ అని సజ్జల తెలిపారు. చదవండి: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు ఎంపీ అవినాష్రెడ్డి లేఖ -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై ‘ది వైర్’ సంచలన కథనం
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై ‘ది వైర్’ సంచలన కథనం ప్రచురించింది. వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన తుది చార్జీషీటు తప్పల తడక అంటూ విశ్లేషించింది. కేవలం ఇద్దరు వ్యక్తుల వాంగ్మూలంతో సీబీఐ వివేకా హత్యకు సంబంధించి విచారణ ముగించిందని సీబీఐ చార్జిషీటులో అసంబద్ధమైన వ్యాఖ్యానాలు తప్ప అసలు ఆధారాలు లేవని ది వైర్ కథనం స్పష్టం చేసింది. వివేకా మర్డర్ కేసును ఏళ్ల తరబడి విచారించిన సీబీఐ ఏకంగా ముగ్గురు విచారణాధికారులను నియమించింది. తొలి చార్జిషీటు దాఖలు చేసేందుకు ఏకంగా 474 రోజులు తీసుకుంది. ఇక ఈ నెల 20న వచ్చిన తుదిచార్జీ షీట్లో సీబీఐ కేవలం అసంబద్ధమైన కథనాలను వండివార్చిందని ది వైర్ ఏకిపారేసింది. వివేకా హత్యకు ప్రధాన కారణం కడప ఎంపీ సీటుపై వచ్చిన విభేదాలే అని సీబీఐ చార్జీషీటులో పేర్కొంది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా వైఎస్ వివేకా రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉన్నారని ఛార్జ్షీట్లో సీబీఐ చెప్పింది. ఇక కడప ఎంపీ టిక్కెట్ తనకు కానీ, వైఎస్ షర్మిలకు కానీ, వైఎస్ విజయమ్మకు ఇవ్వాలని వైఎస్ వివేకా కోరుకున్నారనేది సీబీఐ థియరీ. చదవండి: వివేకా కేసు దర్యాప్తులో సీబీఐ హ్యాండ్సప్! ఇంకా వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ స్థానానికి బలహీనమైన అభ్యర్థి అని వివేకా వాదించనట్లు.. అందుకే అవినాష్రెడ్డికి కడప ఎంపీ టిక్కెట్ ఇవ్వకూడదని జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపాలని వివేకా చెప్పేవారని తన చార్జిషీటులో సీబీఐ కథనం అల్లింది. అయితే ఈ కథనానికి ఎక్కడా ఆధారం చూపలేకపోయింది. పైగా సీబీఐ చార్జిషీటులోనే ఈవాదనను వ్యతిరేకిస్తూం ఎన్నో అంశాలున్నాయి. కడప సీటుకు సంబంధించి హత్య జరిగిందని సీబీఐ చెప్తున్న మాటలకు చాలా వైరుధ్యాలున్నాయి.ఇందులో వివేకా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారని సీబీఐ చెప్పిన మాటలు పూర్తి వాస్తవ విరుద్ధం. నిజానికి 2004 తర్వాత వివేకా ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. అసలు తన తండ్రి రాజకీయాల్లోకి రిటైర్ అయ్యారని వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతా రెడ్డి సీబీఐ వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పింది. 2011 లో వైఎస్ విజయమ్మ చేతిలో ఓటమి తర్వాత మా నాన్న రాజకీయాలకు దూరంగా ఉన్నారని సునీత సీబీఐకి చెప్పింది. దీనిని పూర్తిగా పక్కన పెట్టిన సీబీఐ వివేకా యాక్టివ్గా ఉన్నారని చార్జిషీట్లో రాసుకొచ్చింది. ఇక కడప ఎంపీ అభ్యర్ధి విషయంలో వచ్చిన విభేదాలే హత్యకు కారణమని సీబీఐ చెప్పిన మాటలకు ఆధారాలు లేవు. పైగా ఇది పూర్తి అబద్ధం అని నిరూపించే ఆధారాలు చార్జిషీట్లోనే ఉన్నాయి. ముఖ్యంగా 2019 మార్చి 10న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇక మార్చి 17, 2019 న ఒకేసారి అన్ని స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే రెండు రోజులు ముందుగానే అభ్యర్ధుల పేర్లు ప్రకటించాల్సి ఉన్నా.. వివేకా మరణంతో రెండు రోజులు ఆలస్యమయింది. ఇక నోటిఫికేషన్కంటే ముందు అంటే అధికారికంగా అభ్యర్ధుల పేర్లు ప్రకటించడం కన్నా ముందే కడప ఎంపీ అభ్యర్ధిగా అవినాష్రెడ్డి పేరు ఖరారైంది. ఇక కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి బలహీన అభ్యర్థి అనేది వాస్తవ విరుద్ధం. 2014 లోనే కడప నుండి లక్షా 93 వేల 323 ఓట్ల మెజారిటీతో గెలిచిన వైఎస్ అవినాష్ రెడ్డి. 2019 లో జరిగిన ఎన్నికల్లో తిరిగి 3,80,976 ఓట్లతో ఆదినారాయణ రెడ్డిపై భారీ మెజారిటీతో గెలుపొందారు. వైఎస్సార్ కాంగ్రెస్కి వైఎస్ అవినాష్ రెడ్డి అత్యంత బలమైన అభ్యర్థి అనేది కడప వారినే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనించే ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది. ఇక కడప ఎంపీ అభ్యర్థి విషయంలో ఎలాంటి గందరగోళం లేదని స్వతహాగా వివేకా కూతురు, అల్లుడు స్వయంగా సీబీఐకి చెప్పారు. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని ఎప్పుడో నిర్ణయించారని వైఎస్ వివేకానందరెడ్డి కూడా అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేశారని స్వయంగా వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐ వాంగ్మూలంలో వెల్లడించారు. వివేకా చనిపోవడానికి ఒకరోజు ముందు వైఎస్ అవినాష్ రెడ్డితో కలిసి వివేకా జమ్మలమడుగులో ప్రచారం చేసినట్టు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఒకటికి రెండుసార్లు చెప్పారు. అంతే కాదు కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి మినహా మరెవరి పేరు చర్చకు లేదని, అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎవ్వరూ ఎన్నడూ వ్యతిరేకించలేదని వైఎస్ వివేకా సోదరి విమలమ్మ పలుమార్లు స్పష్టం చేశారు. ఈ విషయాలేవి మాత్రం సీబీఐకి కనపడలేదు. పైగా కడప ఎంపీ విషయంలో జోక్యం చేసుకుని పెద్దగా ప్రభావం చూపగల శక్తిగాని అంత అధికారంగాని వివేకాకు లేదని కడప రాజకీయాలను గమనించేవారందరికి తెలుసు. వైఎస్ వివేకా కడప ఎంపీ అభ్యర్థి నిర్ధారించే విషయంలో వైఎస్ వివేకా ప్రభావం చాలా తక్కువ. 2011 లో వైఎస్ జయమ్మకు వ్యతిరేకంగా పోటీ చేసిన వివేకా అనంతరం వైఎస్సార్ కుటుంబానికి దూరమయ్యారు. వైఎస్ మరణం తర్వాత ఆయన తన కుటుంబంతో వెళ్లి సోనియా గాంధీని కలిశారు. సోనియా గాంధీ వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను వ్యతిరేకించినా అధికారం కోసం వైఎస్ వివేకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ బయటకు వస్తే మంత్రి పదవి కోసం ఏకంగా తల్లిలాంటి వదిన విజయమ్మపై పోటీ చేశారు. 2008లో అమెరికా నుండి వచ్చినవైఎస్ వివేకా అల్లుడికి రాజకీయ కాంక్ష ఎక్కువ. ఒకటి రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేద్దామని ప్రయత్నించారు. 2011లో వైఎస్ విజయమ్మకు వ్యతిరేకంగా నర్రెడ్డి కుటుంబం ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఎన్నికల్లో విజయమ్మ చేతిలో వివేకా ఘోరంగా పరాజయం పొందారు. ఇంత జరిగినా చిన్నాన్న వివేకాపై వైఎస్ జగన్ సానుభూతిగానే వ్యవహరించారు. ఆయనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని, కడప జిల్లా ఇన్ ఛార్జ్ని చేశారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నంత ప్రభావవంతంగా వివేకా లేరనేది చాలామంది కడప నాయకులకు తెలుసు. మరి అలాంటి వ్యక్తి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చగలిగే అంత ప్రభావం చూపిస్తారా ఒకవైపు తన తండ్రి రాజకీయాల్లో నుంచి రిటైర్ అయ్యారని స్వయంగా వివేకా కూతురు సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు అధికారిక ప్రకటన కంటే ముందే వైఎస్ అవినాష్ రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి అన్న విషయం అందరికీ తెలుసని.. వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐ కి వాంగ్మూలం ఇచ్చారు. అయినా సీబీఐ మాత్రం కడప ఎంపీ సీటు కోసమే వివేకా హత్య జరిగిందనిఛార్జ్ షీట్ లో కథ అల్లడం విస్మయానికి గురిచేస్తోంది. ఇక కడప ఎంపీ సీటే వివేకా హత్యకు కారణం అని కథ అల్లిన సీబీఐ ఎలాంటి ఆధారాలు చూపలేకపోయింది. ఇక ఈ కథనానికి బలం చేకూర్చేందుకు సీబీఐ మరో కథను సిద్ధం చేసింది. అదే 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి. వివేకాను అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ద్రోహం చేశారని అందుకే ఆయన ఓడిపోయారనేది సీబీఐ కథనం. ఇక ఓటమికి కారణం అయిన భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిని ఇంటికి వెళ్లి వైఎస్ వివేక తీవ్రంగా అవమానించారనేది సీబీఐ చార్జిషీటులో చెప్పిన మాట. దీంతో వైఎస్ భాస్కర్రెడ్డి కుటుంబం వివేకాను హత్య చేసిందనిం సీబీఐ కథనం అల్లింది. అయితే అసలు వాస్తవం మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. 2017 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి వైఎస్ వివేకానందరెడ్డి ఓడిపోయారు. వివేకాను ఎమ్మెల్సీ చేసేందుకు వైఎస్ జగన్ ఆయనకు బీఫాం ఇచ్చారు. అయితే అధికారంలో ఉన్న టీడీపీ ఎలాగైన గెలవడానికి స్థానిక సంస్థల సభ్యులను బెదిరించి.. ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచింది. అయితే సీబీఐ మాత్రం ఈ ఎన్నికల్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ముగ్గురు వివేకాకు వ్యతిరేకంగా పనిచేసినట్లు చెబుతోంది. అయితే దీనికి ఒక్క ఆధారం కూడా చూపలేకపోయింది. కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసిన 800 మంది ఓటర్లలో ఒక్కర్ని కూడా సీబీఐ విచారించలేకపోయింది. ఈ 800 మందిలో అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి తమకు డబ్బు ఇచ్చారని ఎక్కడా చెప్పలేదు. వీరెవరి దగ్గరు సీబీఐ స్టేట్మెంట్లు రికార్డు చేయేలేదు. అంతే కాదు కనీసం వివేకాను ఓడించిన మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిని కూడా సీబీఐ విచారించ లేదు. అయినా రాజకీయ కక్షతోనే హత్య జరిగిందని ఛార్జ్షీట్ లో కథనం అల్లేసింది. రెండేళ్ల కిందట జరిగిన గొడవకు, ఇప్పుడు జరిగిన హత్యకు సంబంధం ఎలా ఉంటుందో సీబీఐ చెప్పలేదు. ఇక సీబీఐ చార్జిషీటులో రాజకీయ కోణమే హత్యకు కారణమని తేల్చేసింది. ఎక్కడా ఆధారం లేకపోయిన కథనం అల్లేసి వండివార్చేసింది. ఇక మిగిలిన ఆధారాలను మాత్రం పక్కన పడేసింది. అందులో ముఖ్య కారణం..ఆస్తి తగాదాలు. హత్య జరిగిన సమయానికి వివేకా వయస్సు 67 సంవత్సరాలు.పులివెందులలోని తన నివాసంలో వివేకా ఒంటరిగా నివసిస్తున్నారు. వివేకాకు ఆరు నెలలకిందటే గుండె ఆపరేషన్ జరిగినా వివేకా భార్య మాత్రంం వివేకాను వదిలి తన కుమార్తె సునీత దగ్గర ఉంటున్నారు. నెలకు ఒక్కసారి మాత్రమే వివేకా దగ్గరకి ఆయన సతీమణి వచ్చి వెళ్లేవారు. వివేకా కూతురు సునీతా ఏడాదిలో ఒకటి రెండు సార్లు మాత్రమే తండ్రిని కలిసేవారు. వ్యాపార సంబంధాల కారణంగా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మాత్రం పలు మార్లు వివేకాను కలిసేవారనేది సీబీఐ సేకరించిన వాంగ్మూలాల ద్వారా స్పష్టం అవుతోంది. వివేకా గురించి ఆయన కుమార్తె సునీత సీబీఐతో చెప్పిన విషయాలతో వారి కుటుంబం మధ్య ఉన్న గొడవలు స్పష్టంగా అర్ధం అవుతాయి. తన తండ్రి వివేకాకు షమీమ్ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉన్న విషయం తెలిసాక తాను తండ్రి దగ్గరకు వెళ్లే దాన్ని కాదని ఏడాదిలో ఒకటి రెండు సార్లు వెళ్లినా కేవలం ఒకటి, రెండు రోజులు మాత్రమే అక్కడ ఉండే దాన్నని సునీతారెడ్డి సీబీఐకి చెప్పింది. వివేకా హత్య కంటే ముందు 2018 క్రిస్మస్ రోజున తాను చివరిసారిగా వివేకా ఇంచికి వెళ్లినట్లు సునీతారెడ్డి సీబీఐకి చెప్పింది. షమీమ్అనే మహిళతో వివాహేతర సంబంధం కారణంగా వివేకాకు మొదటి భార్య కుటుంబ సభ్యులతో గొడవలు ఉన్నాయనిం సీబీఐకి షమీమ్ ఇచ్చిన వాంగ్మూలం స్పష్టం చేస్తోంది. 2006లో వివేకాకు షమీమ్ అనే మహిళతో పరిచయమైంది. హైదరాబాద్లోని ఓ సంస్థలో ఉద్యోగం కోసం వివేకా సహాయం కావాలని షమీమ్ కోరింది. ఇక వివేకా షమీమ్ల మధ్య పరిచయం కాస్త వివాహానికి దారితీసింది. దీంతో తన పేరును అక్బర్గా మార్చుకుని వివేకా షమీమ్ను వివాహం చేసుకున్నారు.మరణించే సమయానికి వివేకా, షమీమ్ లకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. వివాహం గురించి తెలిసిన తర్వాత వివేక మొదటి భార్య కుటుంబ సభ్యులు తనను బెదిరించారని షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పింది. వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రసాద్ పలుమార్లు మనుషులను పంపి నన్ను బెదిరించారని.. తన కోసం వివేకా పలుమార్లు బావ మరుదులతో ఘర్షణకు దిగారని సీబీఐకి తెలిపిన షమీమ్. నెలసరి ఖర్చులతో పాటు వివేకా తనను అన్ని రకాలుగా చూసుకున్నారని షమీమ్ సీబీఐకి తెలిపారు. 2018లో గుండె ఆపరేషన్ తర్వాత తన ఆరేళ్ల కుమారుడి భవిష్యత్ కోసం వివేకా ఆందోళన చెందేవారని షమీమ్ సీబీఐ అధికారులకు తెలిపింది. తన కుమారుడిని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేర్పించడంతో పాటు తనకు హైదరాబాద్లో ఇల్లు కొనిస్తానని కొంత డబ్బు ఫిక్డ్స్ డిపాజిట్ చేయించడంతో పాటు వ్యవసాయ భూమిని కొనిస్తానని వివేకా వాగ్ధానం చేశారని సీబీఐ వాంగ్మూలంలో చెప్పిన షమీమ్. అయితే చనిపోవడానికి కొద్ది రోజుల ముందు అన్ని కంపెనీల నుండి వివేకా చెక్ పవర్ తొలగించడంతో ఆయన తీవ్రమైన ఆందోళనకు గురైనట్లు స్టేట్మెంట్లో స్పష్టం చేసిన వివేకా రెండో భార్య షమీమ్. ఇక మరణించడానికి కొద్ది రోజుల ముందు నుంచి వివేకా తీవ్రమైన వేదనలో ఉన్నట్లు కేర్టేకర్ పండింటి రాజశేఖర్ సీబీఐకి తెలిపారు. డబ్బులు లేకపోవడంతో వివేకా ఆందోళనకు గురయ్యారని.. ఫలితంగా విపరీతంగా మద్యం సేవించేవారని రాజశేఖర్ చెప్పాడు. ఒకరోజు డబ్బు విషయం మాట్లాడటం విన్నట్లు త్వరలోనే డబ్బు వస్తుందని అప్పటి వరకు ఓపిక పట్టాలని ఎర్ర గంగిరెడ్డి వివేకాతో అన్నట్లు పండింటి రాజ స్టేట్ద్వారా స్పష్టమవుతోంది. అయితే ఎర్ర గంగిరెడ్డిని బూతులు తిడుతూ వివేకానందరెడ్డి గట్టిగా అరిచేవారని అయినా ఎర్ర గంగిరెడ్డి మౌనంగా ఉంటూ తరచూ వస్తు ఉండేవాడనేది రాజా సీబీఐకి చెప్పాడు. ఇక హత్యకు కొద్ది రోజుల ముందు నుంచి వివేకా ప్రవర్తన అసాధారణంగా మారిపోయిందని.. మెట్ల మీద కూర్చుని విపరీతంగా మద్యం సేవించడం, సిగరెట్లు విపరీతంగా కాల్చేవారని రాజా సీబీఐకి పూసగుచ్చినట్లు చెప్పాడు. మెల్లమెల్లగా వివేకా ఆరోగ్యం పూర్తిగాక్షీణించడం ప్రారంభించిందని ఇది చూసి తాను ఒకరోజు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పానట్లు రాజా స్టేట్మెంట్లో స్పష్టం చేశాడు. ఇంకా ఏదో ఒకపంచాయతీ విషయంలో పెద్ద ఎత్తున డబ్బు వస్తుందని వివేకా ఎదురుచూస్తున్నట్టు రాజశేఖర్ రెడ్డికి చెప్పానని సీబీఐ ముందు రాజా ఒప్పుకున్నాడు. ఇక వివేకా డబ్బు వ్యవహారాల గురించి పండింటి రాజశేఖర్తో పాటు చాలా మందికి తెలుసు.సీబీఐ వాంగ్మూలాలను పరిశీలించినా వివేకాకు దాదాపు 5 కోట్ల అప్పు ఉందని స్పష్టమౌతోంది. ఇక ఓవైపు వివేకా అప్పులతో తీవ్రమైన వేదనలో ఉంటేం సునీత రెడ్డి మాత్రం సీబీఐ వాంగ్మూలంలో మరో చెప్పింది. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తన తండ్రి చనిపోయే సమయానికి ఆయన పేరు మీద 50 కోట్ల ఆస్తి ఉందని సునీతరెడ్డి చెప్పింది. అయితే వివేకా చెక్ పవర్ ఎందుకు తొలగించారని అడిగిన ప్రశ్నకు సునీత రెడ్డి విచిత్రమైన సమాధానం చెప్పింది. తాము వ్యాపారం కోసం అప్పు తీసుకొడానికి ప్రయత్నించినట్టు, అయితే వివేక అప్పటికే చాలా అప్పులు చేసినందున తమ కంపెనీకి అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించినట్లు సునీత వాంగ్మూలంలో చెప్పుకొచ్చింది. అందుకే బ్యాంకు అకౌంట్లకు సంబంధించి కొన్ని మార్పులు చేసి వివేకా చెక్ పవర్ను తొలగించినట్లు సునీతారెడ్డి చెప్పింది. కేవలం కంపెనీలో అప్పుతెచ్చుకోవడానికే ఈ మార్పులు చేశామని తన తండ్రి కంపెనీలలో తాను కూడా డైరెక్టర్గా ఉన్నానని సునీత ఒప్పుకుంది. ఇక వివేకా మరణం తరువాత ఆయన స్థానంలో తాను డైరెక్టర్గా చేరిన సునీత.. తండ్రి మరణం తరువాత అప్పులన్నీ కట్టేసి కంపెనీలను లాభాలలోకి తెచ్చామని చెప్పిన సునీత. అయితే వివేకా బతికి ఉన్నప్పుడు మాత్రం కనీస ఖర్చులకు డబ్బులు లేకుండా ఆయన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైఎస్ వివేకా మరణం తరువాత 2023 జనవరిలో 93 ఎకరాల భూమిని తమ పేరు మీద మార్చుకున్న కూతురు సునీత రెడ్డి, భార్య సౌభాగ్యమ్మ. వివేకా కుటుంబంలో ఈ స్థాయిలో ఆస్తి కోసం కుట్రలు జరిగినా సీబీఐ మాత్రం వీటిని పట్టించుకోలేదు. తన విచారణలో ఎక్కడా హత్యకు సంబంధించిన కారణాలలో ఆస్తి తగాదాలకు సంబంధించిన కోణంలో విచారణ జరప లేదు. కేవలం రాజకీయ కోణాన్నే హత్యకు కారణంగా చూపేందుకు సీబీఐ కావాలని ఆస్తి తగాదాలను చిన్నదిగా చెప్పే ప్రయత్నం చేసింది. వివేకా హత్యలో బయటి వ్యక్తుల ప్రమేయం పైన సీబీఐ పూర్తిగా విచారణ జరపలేదు.సీబీఐ విచారణ మొత్తం కేవలం ఇద్దరు వ్యక్తుల వాంగ్మూలం ఆధారంగానే సీబీఐ తన విచారణను ముగించింది. వివేకా హత్యకేసులో నిందితుడైన మాజీ డ్రైవర్ దస్తగిరి, వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్న చెప్పిన మాటలే సీబీఐ విచారణకు ఆధారం. కానీవీళ్లిద్దరు నిజం చెప్తున్నారా...? అనే దానికి ఎక్కడా ఆధారం లేదు అంటూ ది వైర్ కథనంలో పేర్కొంది. -
అప్సర కేసు.. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏముందంటే?
సాక్షి, హైదరాబాద్: తన కూతురు అలాంటి అమ్మాయి కాదని.. చాలా కిరాతకంగా చంపాడంటూ కాశీ నుంచి ఇంటికి చేరుకున్న అప్సర తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ.. తమకు, సాయికృష్ణ కుటుంబానికి ఎటువంటి రిలేషన్ లేదని, ఇలా అవుతుందనుకోలేదన్నారు. తెలిసిన వెంటనే ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వచ్చానన్నారు. పూజారి అయి ఉండి ఇలా చేశాడని, నిందితుడికి కఠిన శిక్ష పడాలని అప్సర తల్లిదండ్రులు కోరారు. కాగా, ఉస్మానియా మార్చురీలో అప్సర మృతదేహానికి పోస్ట్మార్టం చేసిన వైద్యులు.. ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. తలకు బలమైన గాయాలు కావడంతోనే అప్సర మృతి చెందినట్లు అప్సర ప్రిలిమినరీ పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలింది. జరిగింది ఇదే.. గుడికి వచ్చిన అప్సరతో వివాహితుడైన పూజారికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లు బాగానే గడిపారు. తీరా తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆమె నుంచి ఒత్తిడి పెరగడంతో చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం నగర శివార్లలోకి తీసుకువెళ్లి దారుణంగా హతమార్చాడు. చదవండి: అప్సర కేసు: సాయికృష్ణ అమాయకుడా? మృతదేహాన్ని సరూర్నగర్ మండల ఆఫీసు వెనుక ఉన్న పాత సెప్టిక్ ట్యాంక్లో పడేసి ఉప్పు, ఎర్రమట్టి నింపాడు. వాసన బయటకు రాకుండా దానికి ఉన్న రెండు మ్యాన్హోల్స్కు కాంక్రీట్ చేశాడు. తర్వాత ఆమె అదృశ్యమైనట్లు ఆర్జీఐఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సాంకేతిక ఆధారాలతో ముందుకు వెళ్లిన పోలీసులు ఆమె హత్యకు గురైనట్లు తేల్చారు. అప్సరను దారుణంగా హతమార్చిన నిందితుడు, పూజారి సాయికృష్ణను పోలీసులు, శుక్రవారం అర్ధరాత్రి జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఐపీసీ సెక్షన్ 201, 302 ప్రకారం అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించగా.. చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. -
సీబీఐ కోర్టులో భాస్కర్రెడ్డి బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు
హైదరాబాద్: వివేకా కేసుకు సంబంధించి భాస్కర్రెడ్డి బెయిల్ పిటిషన్పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిసాయి. భాస్కర్రెడ్డి బెయిల్ పిటిషన్పై ఈనెల9వ తేదీన తీర్పు ఇస్తామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. దీనిలో భాగంగా తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో సునీత ఇంప్లీడ్ పిటిషన్ను సీబీఐ కోర్టు అనుమతించింది. ఈ మేరకు లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని సునీతకు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని అరెస్ట్ చేశారు సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా భాస్కర్రెడ్డి తరఫున న్యాయవాది ఉమా మహేశ్వర్రావు వాదనలు వినిపించారు. ‘ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ని సిబిఐ అధికారులు ఆరెస్ట్ చేశారు. ఆరోపణలు మాత్రమే సిబిఐ పరిగణలోకి తీసుకుంది. భాస్కర్ రెడ్డి సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి. ఒక సీనియర్ సిటిజన్ను అక్రమ కేసులో సీబీఐ ఇరికించింది. ఎలాంటి నేర చరిత్ర లేనటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి నేరం చేసాడు అనడానికి ఎక్కడ సరైన సాక్ష్యాలు లేవు. ఎర్ర గంగిరెడ్డి ఎక్కడ కూడా భాస్కర్ రెడ్డి పేరు ప్రస్థావించలేదు’ అని కోర్టుకు తెలిపారు. -
ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా భాస్కర్రెడ్డి.. సీబీఐ కోర్టు సిఫార్సు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ భాస్కర్రెడ్డిని ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా పరిగణించాలని హైదరాబాద్ జిల్లా మెజిస్ట్రేట్కు సీబీఐ కోర్టు సిఫార్సు చేసింది. ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలన్న భాస్కర్ రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు అంగీకారం తెలిపింది. కాగా, వివేకా లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్షకు అనుమతించాలన్న పిటిషన్పై సీబీఐ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సీబీఐ పిటిషన్పై గంగిరెడ్డి, సునీల్ యాదవ్ కౌంటర్లు దాఖలు చేశారు. తన వైపు కౌంటరు లేదని సీబీఐ కోర్టుకు దస్తగిరి తెలిపారు. సీబీఐ వాదనలు వినడానికి విచారణను ఈ నెల 5కు కోర్టు వాయిదా వేసింది. వివేకా హత్య కేసులో సునీత పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ వివేకా హత్య కేసులో సునీత పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కోర్టు విచారణలో సీబీఐ పీపీకి సహకరించేందుకు అనుమతివ్వాలన్న సునీత కోరగా, ఆమె పిటిషన్ పై శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషన్పై భాస్కర్ రెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి తమ కౌంటర్లు దాఖలు చేయలేదు. సునీత వాదనల కోసం పిటిషన్ విచారణ ఈ నెల 5కు కోర్టు వాయిదా వేసింది. -
ఎల్లో మీడియా స్క్రిప్ట్ ప్రకారమే సీబీఐ నడుస్తోంది: సజ్జల
సాక్షి, విజయవాడ: ముందే అనుకున్న ప్రణాళిక ప్రకారం సీబీఐ వ్యవహరిస్తున్నట్లు ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ కౌంటర్పై స్పందించారు. సీబీఐ సెన్సేషన్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఉందని, ఆధారాలు లేకుండా ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీబీఐ ఏం చేయాలనుకుంటుందో ఎల్లో మీడియాకు ముందే తెలుస్తుందని.. సీబీఐ విచారణ ఏ విధంగా చేస్తోందో అర్థం కావట్లేదన్నారు. సీబీఐ వెనుక ఎవరున్నారన్నదానిపై విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘ప్రజల్లో అయోమయం సృష్టించేలా సీబీఐ తీరు ఉంది. ఎల్లో మీడియా స్క్రిప్ట్ ప్రకారం సీబీఐ నడుస్తోంది. ఆ స్క్రిప్ట్కే విచారణ అని తగిలిస్తున్నారు. కాకమ్మ కథలన్నీ ఎల్లో మీడియాలోనే తయారవుతున్నాయి. దీని వెనుక రాజకీయ కుట్ర కోణం ఉంది. సరైన దిశలో సీబీఐ విచారణ జరగడం లేదు’’ అని సజ్జల అన్నారు. చదవండి: అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై TS హైకోర్టులో విచారణ -
మలక్పేట అనురాధ హత్య కేసులో కొత్త ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: మలక్పేట అనురాధ మృతి కేసు మరో మలుపు తిరిగింది. అనురాధ మృతి కేసు రాచకొండ పోలీసులకు బదిలీ అయింది. చంద్రమోహన్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. 15 ఏళ్లుగా చంద్రమోహన్, అనురాధల సహజీవనం చేస్తున్నారు. చంద్రమోహన్తో అనురాధకు గత కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయి. విభేదాల కారణంగా పెళ్లి చేసుకోవాలని అనురాధ ప్లాన్ చేసింది. పెళ్లి కోసం మాట్రిమోనీలో ప్రకటనలు ఇచ్చింది. తాను పెళ్లి చేసుకోబోతున్నానని డబ్బు, నగలు తిరిగివ్వాలని చంద్రమోహన్ని డిమాండ్ చేసింది. రూ.17 లక్షల నగదు, 2 కిలోలకుపైగా బంగారం తిరిగివ్వాలన్న అనురాధను చంపేస్తే డబ్బులు, నగలు ఇవ్వాల్సిన అవసరముండదని హత్య చేసినట్లు తేలింది. అనురాధతో గొడవపడి 15 కత్తిపోట్లు పొడిచి చంపిన చంద్రమోహన్.. ఒక రోజు పాటు మృతదేహాన్ని బయటే పెట్టాడు.. అనురాధ గది పక్కన అద్దెకు ఉన్నవారు ఊరికెళ్లాక ముక్కలు చేశాడు. మరుసటిరోజు స్టోన్ కట్టర్ తెచ్చి మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ప్యాక్ చేసి ఫ్రిజ్లో దాచాడు. 5 రోజుల తర్వాత తలను తీసుకెళ్లి మూసీలో పడేశాడు. చదవండి: ఆరుగురు పిల్లల తల్లి ఎంతటి దారుణానికి పాల్పడిందంటే... యూట్యూబ్లో చూసి మృతదేహాన్ని ముక్కలు చేసిన చంద్రమోహన్.. మృతదేహం నుంచి వాసన రాకుండా కెమికల్స్ వాడాడు. కూతురితోపాటు బంధువులెవరితోనూ అనురాధకు సంబంధాలు లేకపోవడంతో ఆమెను చంపితే బంధువులెవరూ రారని గుర్తించిన చంద్రమోహన్.. అనురాధ చార్ధామ్ యాత్రకు వెళ్తున్నట్లు సృష్టించాడు. అనుమానం రాకుండా అనురాధ కూతురుతో చంద్రమోహన్ చాటింగ్ చేశాడు. అనురాధ సెల్ఫోన్ను చార్ధామ్కు తీసుకెళ్లి ధ్వంసం చేయాలని చంద్రమోహన్ ప్లాన్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. -
Hyderabad: మొండెం లేని మహిళ తల ఎవరిదో తెలిసింది..
సాక్షి, హైదరాబాద్: మలక్పేట్ పరిధిలో మహిళ హత్య కేసులో దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. తీగలగూడ వద్ద మొండెం లేని తల కేసులో మృతురాలు కేర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు అనురాధగా గుర్తించారు. అనురాధ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు బంధువులు వెల్లడించారు. నగదు లావాదేవీల విషయంలోనే హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలిని శరీరాన్ని ముక్కలుగా చేసిన హంతుకుడు ఫ్రిడ్జ్లో దాచాడు. చైతన్యపురిలోని హంతకుడు చంద్రమోహన్ ఇంటిలో దాచిపెట్టిన శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు. కాగా, మలక్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని తీగల గూడ మూసి పరివాహక ప్రాంతంలో ఒక నల్లటి కవర్లో గుర్తు తెలియని మహిళ తల లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు.. మలక్పేట్ పోలీసులకు సమాచారం అందించారు. తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి ఆచూకీ కోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసి, మహిళ తలతో పోస్టర్లను ముద్రించి.. వీధుల్లో తిరుగుతూ ఆచూకీ కోసం ఆరా తీశారు. చివరకు మృతురాలిని గుర్తించడంతో హత్య కేసును ఛేదించారు. చదవండి: ‘ప్రేమ పేరుతో మోసం.. జీవితంలో మర్చిపోలేని బాధనిచ్చాను’ -
రాధ హత్య కేసులో షాకింగ్ విషయాలు.. సినిమా ట్విస్టులు తలపించే రీతిలో..
కనిగిరి రూరల్(ప్రకాశం జిల్లా): వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు వద్ద వివాహిత దారుణ హత్యకు గురైన కేసు కీలక మలుపు తిరిగింది. కోట రాధ (35)ను ఆమె భర్త మోహన్రెడ్డి హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రాధకు ఆమె చిన్ననాటి స్నేహితుడు కాశిరెడ్డితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త మోహన్రెడ్డి పథకం ప్రకారం ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడుకు చెందిన కె.రాధకు నల్గొండ జిల్లా కోదాడకు చెందిన కోట మోహన్రెడ్డితో 2013లో వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. రాధ గృహిణి కాగా.. మోహన్రెడ్డి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఈ క్రమంలో హైదరాబాద్లోనే ఉంటున్న రాధ చిన్ననాటి స్నేహితుడు కాశయ్య అలియాస్ కాశిరెడ్డి కుటుంబ సభ్యులతో దగ్గరయ్యాడు. ఆ క్రమంలోనే కాశిరెడ్డి సాఫ్ట్వేర్ కంపెనీ పేరిట రాధ నుంచి సుమారు రూ.16 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అతనికి రాధ తన భర్త మోహన్రెడ్డి నుంచి కూడా రూ.35 లక్షల వరకు ఇప్పించింది. కొంతకాలానికి కాశిరెడ్డి అప్పులపాలై పరారయ్యాడు. అప్పు తీర్చకుండా సుమారు రెండేళ్ల నుంచి కాశిరెడ్డి తిప్పుతుండటంతో భార్యభర్తల మధ్య వివాదం ప్రారంభమైంది. ఈ క్రమంలో భార్య రాధపై మోహన్రెడ్డికి అనుమానం కలిగింది. ఒకవైపు ఆర్థికపరమైన అంశం, మరోవైపు అనుమానం రెండు మోహన్రెడ్డిలో తీవ్ర ద్వేషాన్ని పెంచాయి. దీంతో భార్యను ఎలాగైనా అంతమొందించేందుకు పథకం రచించినట్టు తెలిసింది. ఫోన్లు.. సిమ్ కార్డ్లు కొని.. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి పేరిట ఓ ఫోన్, సిమ్కార్డ్ కొనుగోలు చేసిన భర్త మోహన్రెడ్డి.. ఆ వ్యక్తి పేరు ట్రూ కాలర్లో వచ్చేలా నమోదు చేశా డు. ఆ నంబర్తో సొంత భార్యతోనే చాటింగ్ చేయగా.. మోహన్రెడ్డి అనుమానానికి మరింత బలం చేకూరిందని సమాచారం. దీంతో ఎలాగైనా భార్య ను చంపాలని మోహన్రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఈ నెల 11న జిల్లెళ్లపాడులో జాతర ఉండటంతో రాధ పుట్టింటికి భర్త మోహన్రెడ్డి, పిల్లలు వచ్చారు. భార్యాపిల్లల్ని ఇక్కడే వదిలేసి మోహన్రెడ్డి హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత 13, 14 తేదీల్లో భార్యకు వేరే వ్యక్తి పేరిట మెసేజ్ పెట్టాడు. తిరిగి 17న కనిగిరికి ఒంటరిగా వస్తే రూ.2 లక్షలు ఇస్తానని నమ్మబలికాడు. దీంతో రాధ కనిగిరి వచ్చింది. ఈ క్రమంలో వేరే వ్యక్తి మాదిరిగా ఫోన్లో మాట్లాడుతూ.. మెసేజ్, ఫోన్ చాటింగ్లు కూడా చేశాడు. పామూరు బస్టాండ్లో ఎదురుచూస్తున్న రా«ధకు నగదు ఇస్తానని చెప్పిన వ్యక్తి, అతని మనుషులకు బదులు కారులో భర్త కన్పించాడు. చదవండి: విశాఖలో షాకింగ్ ఘటన.. ప్రియురాలు వేరొకరిని ఇష్టపడుతుందని.. దీంతో ఒక్కసారిగా అవాక్కైన రాధ భర్త మోహన్రెడ్డి పిలవడంతో కారులో ఎక్కినట్టు సీసీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. ఇదే కారు పాతకూచిపుడిపల్లి సమీపంలో కొంతసేపు ఆగినట్లు సీసీ ఫుటేజీల్లో నమోదైనట్టు సమాచారం. ఆ తర్వాత కారులో టిడ్కో గృహాల సముదాయం వద్దకు రాధను తీసుకెళ్లి చున్నీతో గొంతు నులిమి కొట్టి చంపినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కారులోనే ఆమె మృతదేహాన్ని జిల్లెళ్లపాడు క్రాస్రోడ్డులో పడేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా శనివారం ఉదయం భర్త మోహన్రెడ్డిని పోలీసులు దాచేపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కొట్టి చంపేశారయ్యా! నా కూతురుని భయంకరంగా కొట్టి చంపారయ్యా. మా అల్లుడు మోహన్రెడ్డి శుక్రవారం రాత్రి ఫోన్ చేసి నీకేమైనా క్లూ దొరికిందా మామా అని అడిగాడు. ఈ కేసు గురించి ఏమనుకుంటున్నారని అడిగితే.. నాకు సమాచారం లేదని చెప్పాను. రాధ చనిపోయిందని అల్లుడికి ఫోన్ చేసినప్పుడు తాను వచ్చేదాకా ఆమె ఫోన్ తీయవద్దన్నాడు. మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చాడు. హత్య చేసింది వీడని మాకెట్లా తెలుస్తుంది. ఇప్పటివరకు గండ్లోపల్లికి చెందిన వ్యక్తిపై అనుమానం ఉండేది. అతడికి మా అమ్మాయి రూ.18 లక్షలు ఇచ్చింది. అల్లుడు రూ.33 లక్షలు ఇచ్చాడు. పెళ్లప్పుడు 38 ఎకరాల పొలం, 25 సవర్ల బంగారం, రూ.10 లక్షలు కట్నం ఇచ్చాం. నా కూతుర్ని చంపిన వాళ్లకు ఉరిశిక్ష పడాలి. – సుధాకర్రెడ్డి, రాధ తండ్రి -
తండ్రి హంతకులకు అండదండలా?.. వివాదాస్పదంగా సునీత వైఖరి
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత తీరు మరోసారి వివాదాస్పదమైంది. తండ్రిని హత్యచేసిన వారికి శిక్షలు పడేందుకు పోరాడుతున్నానని చెబుతున్న ఆమె వ్యవహారశైలి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉండటం అనేకానేక సందేహాలు లేవనెత్తుతోంది. వివేకాను హత్యచేశానని స్వయంగా ఒప్పుకున్న దస్తగిరికి ఆమె పూర్తి అండదండలు అందిస్తుండటం తెలిసిందే. మరోవైపు.. వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డిని హైదరాబాద్లోని చంచల్గూడ జైలులో కలిసేందుకు సునీత శుక్రవారం ప్రయత్నించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దస్తగిరి బెయిల్ వ్యవహారంలో సునీత వ్యవహారశైలి.. అనంతరం ఎర్ర గంగిరెడ్డిని కలిసేందుకు ఆమె యత్నించడానికి సంబంధం ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. తన తండ్రి హత్య కేసులో ప్రధాన నిందితులను ప్రభావితం చేయడం ద్వారా ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ఆమె యత్నిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. అసలు వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఆయన హత్యకు దారితీసి ఉండొచ్చన్న బలమైన ఆరోపణలకు సునీత ప్రస్తుత వ్యవహారశైలి బలం చేకూరుస్తోంది. హంతకుడు దస్తగిరికి సునీత అండదండలు.. సాధారణంగా తండ్రిని హత్యచేసిన వారిపై ఎవరికైనా ఆగ్రహం ఉంటుంది. కానీ, వైఎస్ వివేకానందరెడ్డిని స్వయంగా హత్యచేశానని ఒప్పుకున్న దస్తగిరిపై ఆయన కుమార్తె సునీత అంతులేని సానుకూలత ప్రదర్శిస్తున్నారు. సీబీఐ దస్తగిరిని అప్రూవర్గా మార్చడాన్ని ఆమె ఏమాత్రం వ్యతిరేకించలేదు. అనంతరం.. బెయిల్ కోసం దస్తగిరి పిటిషన్ వేస్తే సీబీఐ అభ్యంతరం వ్యక్తంచేయలేదు. అంతేకాదు.. సునీత కూడా అతని బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించలేదు. మరోవైపు.. అసలు హత్యచేసిన దస్తగిరిని అప్రూవర్గా మార్చడాన్ని వివేకా పీఏ కృష్ణారెడ్డి న్యాయస్థానంలో సవాల్ చేశారు. అతనికి ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కూడా కోర్టును కోరారు. కానీ, సునీత వెంటనే ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడం విస్మయపరిచింది. అలాగే, దస్తగిరి బెయిల్ను రద్దుచేయాల్సిన అవసరంలేదని ఆమె న్యాయస్థానికి తెలపడం గమనార్హం. అంతేకాదు.. ఈ కేసుకు సంబంధించి కృష్ణారెడ్డికి ఎలాంటి అర్హతలేదని.. బాధితురాలిగా తనకే అది ఉందని ఆమె వాదించారు. దస్తగిరి బెయిల్పై బయట ఉండటంపట్ల తనకేమాత్రం అభ్యంతరంలేదని చెప్పుకొచ్చారు. అసలు తన తండ్రిని హత్యచేసిన వ్యక్తి జైలులో ఉండాలని కోరుకోవాల్సిన సునీత.. అతను బయట ఉండాలని ఆశిస్తుండటం వెనుక ఏదో మతలబు ఉందన్నది స్పష్టమవుతోంది. దస్తగిరి వాంగ్మూలాన్ని బలపర్చాలనే.. నిజానికి.. దస్తగిరి అప్రూవర్గా ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలతో ఎర్ర గంగిరెడ్డి విభేదించారు. సీబీఐ నమోదు చేసిన దస్తగిరి అప్రూవర్ వాంగ్మూలంలో చెప్పినవన్నీ అవాస్తవాలని ఆయన చెప్పారు. దాంతో దస్తగిరి అప్రూవర్గా ఇచ్చిన వాంగ్మూలం అంతా కట్టుకథేనని తేలిపోయింది. ఈ నేపథ్యంలో.. ఎర్ర గంగిరెడ్డిని కలిసి దస్తగిరి అప్రూవర్గా ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలను బలపరచాలని ఒత్తిడి చేయడమే సునీత ఉద్దేశంగా తెలుస్తోంది. అందుకోసం ఎర్ర గంగిరెడ్డిని ప్రలోభాలకు గురిచేయడం.. ఆయన బెయిల్కు సీబీఐ సహకరించేట్లుగా చేస్తానని హామీ ఇవ్వడం ఆమె ప్రణాళికగా ఉంది. వివేకా హత్య అనంతరం అక్కడ ఆధారాలను ధ్వంసం చేయాలని ఎర్ర గంగిరెడ్డిని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్రెడ్డి ఆదేశించారు. ఇదే అంశం సునీత, ఆమె భర్తకు ప్రతికూలంగా మారింది. ఈ విషయంలో మాట మార్చాలని.. ఆధారాల ధ్వంసంతో తన భర్తకు సంబంధంలేదని ఎర్ర గంగిరెడ్డితో చెప్పించాలన్నది సునీత ఉద్దేశం. తాను చెప్పినట్లు చేస్తే ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ వచ్చేందుకు సహకరిస్తామని ఆమె హామీ ఇచ్చేందుకు యత్నించినట్లు తెలిసింది. ఎర్ర గంగిరెడ్డిని కలిసే ప్రయత్నం ఎందుకో!? ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డిని జైల్లో కలిసేందుకు సునీత ప్రయత్నించడం ఇప్పుడు విస్మయపరుస్తోంది. గంగిరెడ్డిని కలిసేందుకు ఆమె జైలు అధికారులను అనుమతి కోరగా వారు నిరాకరించారు. దాంతో ఆమె తన న్యాయవాది ద్వారా కొన్ని పత్రాలు ఆయన వద్దకు పంపి సంతకాలు తీసుకున్నట్లు సమాచారం. అసలు తన తండ్రి హత్యకేసులో ఏ–1గా ఉన్న గంగిరెడ్డిని సునీత కలిసేందుకు యతి్నంచడం సందేహాస్పదంగా మారింది. సుప్రీంకోర్టు బెయిల్ రద్దుచేయడంతో ఎర్ర గంగిరెడ్డి పోలీసుల ముందు లొంగిపోయి ప్రస్తుతం జైలులో ఉన్నారు. తాను చెప్పినట్లుగా చెబితే దస్తగిరికి సహకరించినట్లుగానే ఎర్ర గంగిరెడ్డికి సహకరిస్తామని ఆయనకు చెప్పేందుకే సునీత ప్రయత్నించినట్లు సమాచారం. వేళ్లన్నీ సునీత, ఆమె భర్తవైపే.. ఈ మొత్తం పరిణామాలతో వివేకా హత్యకేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు సునీత ప్రయత్నిస్తున్నారన్నది స్పష్టమైంది. ఆమె ఎందుకు హంతకులకు కొమ్ముకాస్తూ మరీ హత్య కేసు దర్యాప్తు దారి మళ్లించేందుకు యత్నిస్తున్నారన్నది కీలక ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు తలెత్తాయన్నది బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో.. వివేకా హత్యకు గురికావడంతో ఆయన సొంత కుటుంబ సభ్యులపై సందేహాలు వ్యక్తమయ్యాయి. చదవండి: ఏది నిజం?: గంతలు కట్టేందుకే కట్టుకథలు వివేకా హత్య తరువాత ఆయన రాసిన లేఖ, సెల్ఫోన్లను పోలీసులకు వెంటనే ఇవ్వకుండా గోప్యంగా ఉంచమని పీఏ కృష్ణారెడ్డితో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు. ఇదే అంశంపై సీబీఐ ఇటీవల వారిని విచారించింది కూడా. నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డి ఆదేశాలతోనే వివేకా హత్య స్థలంలో ఆధారాల ధ్వంసం చేశారన్నది వెల్లడైంది కూడా. వివేకా రాజకీయ ప్రత్యర్థులైన టీడీపీ నేత బీటెక్ రవి, అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డితో సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావగారు శివప్రకాశ్రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారన్నది కూడా బహిరంగ రహస్యంగా మారింది. వాస్తవాలు వెల్లడి కాకూడదనే.. ఈ నేపథ్యంలో.. వివేకా హత్య కేసులో సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్రెడ్డిల పాత్ర ఉందనే వాదన బలపడుతోంది. అంటే ఈ కేసులో వారిని నిందితులుగానే భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తాము బాధితులమని.. తమకే అర్హత ఉందని చెప్పేందుకు వారు నైతిక హక్కు కోల్పోయారు. మరోవైపు.. ఎర్ర గంగిరెడ్డి సీబీఐ ముందు నిజాలు వెల్లడిస్తే తమ కుటుంబానికి ఇబ్బందిగా మారుతుందని సునీత ఆందోళన చెందుతున్నారు. అందుకే వాస్తవాలు వెల్లడించకుండా కట్టడి చేసేందుకే ఎర్ర గంగిరెడ్డిని కలిసేందుకు సునీత యత్నించినట్లు స్పష్టమవుతోంది. -
అవినాశ్ అరెస్టుకు సీబీఐ అత్యుత్సాహం
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కిరాయి హంతకుడు బయట తిరిగేందుకు పూర్తిగా సహకరిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ).. ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా కడప ఎంపీ అవినాశ్రెడ్డిని అరెస్టు చేయడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని అతని తరఫు సీనియర్ న్యాయవాది టి. నిరంజన్రెడ్డి వాదించారు. అవినాశ్ను లక్ష్యంగా చేసుకుని మాత్రమే దర్యాప్తు చేస్తోంది తప్ప.. ఇతర కీలక అంశాలను పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అవినాశ్రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సురేందర్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను శుక్రవారానికి (నేటికి) వాయిదా వేశారు. ‘హియర్ సే ఎవిడెన్స్’ ఆమోదం కాదు.. నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘సీబీఐ ప్రధానంగా నాలుగు అంశాలను ప్రస్తావిస్తూ అవినాశ్ను అరెస్టుచేయాలని చూస్తోంది. కానీ, అందులో ఏ ఒక్క దానికీ ఆధారాల్లేవు. అన్నీ ఊహాజనితాలు, కల్పితాలే. ఏ–4 నిందితుడు దస్తగిరి వాంగ్మూలం, గూగుల్ టేక్అవుట్, ఎమ్మెల్సీ ఎన్నికల కారణం, సాక్ష్యాలను చెరిపివేసే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు చేస్తోంది. ఇందులో ఏ ఒక్కటీ చట్టప్రకారం సరికాదు. మన వెనుక వైఎస్ అవినాశ్, భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డి, మనోహర్రెడ్డి ఉన్నారని గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలాన్ని ఇచ్చాడు. అయితే, ఈ వ్యాఖ్యలను గంగిరెడ్డి తన వాంగ్మూలంలో ఖండించాడు. తను ఎవరి పేరు చెప్పలేదని వెల్లడించాడు. అంతేకాక.. దస్తగిరి రెండుసార్లు వాంగ్మూలం ఇచ్చాడు. మొదటిసారి చెప్పిన దాంట్లో ఎవరి పేరూలేదు. రెండోసారి చెప్పిన దాంట్లో ఈ పేర్లు చెప్పాడు. ఇలా ఎందుకు చెప్పాడని సీబీఐ దర్యాప్తు చేయడంలేదు. అతన్ని ప్రశ్నించడంలేదు. ‘హియర్ సే ఎవిడెన్స్’ అంటే.. ఎవరో చెప్పింది విని చెప్పడం. ఇది చట్టప్రకారం ఆమోదయోగ్యం కాదు. అంతేకాదు.. కేసును ఏపీ హైకోర్టు సీబీఐకి బదిలీ చేసిన తర్వాత దస్తగిరి దాదాపు రెండునెలలు ఢిల్లీలో ఉండి వచ్చాడు. తాను సీబీఐ వారిని కలిసివచ్చానని కూడా బయట చెప్పాడు. అక్కడ జరిగిన ఒప్పందంలో భాగంగానే ఈ పేర్లు ప్రస్తావించాడు. తానే హత్యచేశానని చెప్పిన కిరాయి హంతకుడికి బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ సహకరించడం గతంలో ఎప్పుడూ జరగలేదు. అలాగే, గూగుల్ టేక్అవుట్ ప్రామాణికం కాదు. ఒక వ్యక్తి తన స్నేహితుడి ఫోన్లోని గూగుల్ను అతని జీమెయిల్తో తెరిస్తే.. స్నేహితుడు ఎక్కడికి వెళ్లినా ఇతను అక్కడ ఉన్నట్లే చూపిస్తుంది. అందుకే గూగుల్ టేక్అవుట్ను గూగుల్ కూడా సర్టిఫై చేస్తూ లేఖ ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని సర్టిఫై చేయదు. దస్తగిరి చెప్పిన వాంగ్మూలానికి, గూగుల్ టేక్అవుట్ సమాచారానికి వివరాల్లో తేడా ఉంది. ఇందులో ఏదీ సరైందో సీబీఐ ఎలా నిర్ణయించుకుంది,, ఎలా చెబుతుంది?’.. అని నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల వివాదానికీ సాక్ష్యాల్లేవు.. ఇక వివేకా.. అవినాశ్కు బాబాయి. అవినాశ్ ఎంపీగా పోటీచేసినప్పుడు అతని ప్రచారంలో, గెలుపులో వివేకా కీలకపాత్ర పోషించారు. తర్వాత జరగబోయే ఎన్నికల్లో కూడా అవినాశ్ గెలుపు కోసం ప్రచారంలో పాల్గొనడానికి ఆయన సిద్ధమై ఉన్నారు. ఇదే విషయాన్ని వివేకా మృతిచెందిన దాదాపు 10 రోజుల తర్వాత ఆయన కుమార్తె సునీత కూడా మీడియాకు వెల్లడించింది. తర్వాత ఏం జరిగిందో.. మాట మార్చారు. ఇక సాక్షాలను మార్చడం విషయానికొస్తే.. మార్చి 15, 2019 ఉదయం అవినాశ్రెడ్డి జమ్మలమడుగు బయల్దేరారు. మధ్యలో ఉండగా వివేకా అల్లుడు ఫోన్చేసి, గుండెపోటుతో మృతిచెందినట్లు చెప్పారు. దీంతో ఆయన ఉ.6 తర్వాత అక్కడికి చేరుకున్నారు. కొంత సమయం అక్కడి ఉండి వెళ్లిపోయారు తప్ప.. సాక్ష్యాలను చెరిపివేసే ప్రయత్నం చేయలేదు. ఇది కూడా కల్పితమే. అవినాశ్, భాస్కర్రెడ్డిలను లక్ష్యంగా చేసుకునే సీబీఐ దర్యాప్తు సాగిస్తోంది. వివేకా రాసిన లేఖను సాయంత్రం వరకు ఎందుకు దాచాల్సి వచ్చిందో చెప్పమని అతని అల్లుడిని సీబీఐ కనీసం ప్రశ్నించలేదు. సీబీఐ దర్యాప్తు చేపట్టిన నాటి నుంచి పిలిచిన ప్రతీసారి అవినాశ్ విచారణకు హాజరవుతున్నారు. ఎప్పుడూ తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. అర్టికల్–21ను ఉల్లంఘిస్తూ.. అవినాశ్ ప్రాథమిక హక్కును కాలరాస్తున్నారు. సీబీఐ కోరిన రోజున.. ఉదయం నుంచి సాయంత్రం వరకు (కస్టడీ) విచారణకు హాజరుకావడానికి అవినాశ్ సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి’ అని నిరంజన్రెడ్డి న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. అవినాశ్పై ఎలాంటి కేసుల్లేవు అనంతరం, సునీత తరఫు న్యాయవాది సిద్దార్థ లూద్రా వాదనలు వినిపిస్తూ.. అవినాశ్పై పలు కేసులు ఉన్నాయని, ఎన్నికల అఫిడవిట్లో అతను పేర్కొన్నారని చెప్పారు. దీనిపై నిరంజన్రెడ్డి జోక్యం చేసుకుని.. అవినాశ్పై ఎలాంటి కేసుల్లేవని, తాజాగా సమాచార హక్కు చట్ట ప్రకారం తీసుకున్న డాక్యుమెంట్లను కోర్టుకు చూపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. -
‘అవినాష్ను అనుమానించదగ్గ ఆధారాలు సీబీఐ దగ్గర లేవు’
సాక్షి, హైదరాబాద్: అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. అవినాష్రెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్రెడ్డి వాదనలు వినిపించగా, సునీత తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ లూత్రా, సీబీఐ తరపున పీపీ నాగేంద్ర వాదనలు వినిపించారు. ‘‘వివేకాను దస్తగిరే హత్య చేశాడు.. అలాంటప్పుడు దస్తగిరి స్టేట్మెంట్ను ఎలా పరిగణలోకి తీసుకుంటారు.. గూగుల్ టేకౌట్ ఎలా ఆధారం అవుతుంది?. అవినాష్ను లక్ష్యంగా చేసుకొనే దర్యాప్తు జరుగుతోందని అవినాష్ తరఫు న్యాయవాది అన్నారు. వివేకా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి జమ్మలమడుగు వెళ్తున్నట్టు 5గురు సాక్షులు స్టేట్ మెంట్ ఇచ్చారు, కానీ అవినాష్ రెడ్డి తన ఇంటి నుంచి నేరుగా వివేకా ఇంటికి వచ్చాడని CBI చెబుతుంది" అని లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ‘‘ఢిల్లీలో దస్తగిరి 2 నెలల పాటు సీబీఐ కస్టడీలో ఉన్నాడు. కస్టడీ ముగియగానే దస్తగిరి బెయిల్ పిటిషన్ వేశాడు. అప్రూవర్గా సీబీఐ దస్తగిరిని మార్చింది. దస్తగిరి బెయిల్ పిటిషన్ను సీబీఐ ఎక్కడా అపోజ్ చేయలేదు. దస్తగిరిని ముందుగానే ప్లాన్ చేసి అవినాష్రెడ్డి పేరు చెప్పేలా చేసింది. సీబీఐ చెప్పిన వాటికి దస్తగిరి అంగీకరించి అప్రూవర్గా మారాడు. దస్తగిరి బెయిల్లో మెరిట్స్ పరిగణలోకి తీసుకోలేదు. హత్య కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్న నిందితుడికి బెయిల్ మంజూరు చేయడం నేనెక్కడా చూడలేదు.’’ అని అవినాష్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. చదవండి: వివేకా కేసు: వీడియో రిలీజ్ చేసిన ఎంపీ అవినాష్ ‘‘దస్తగిరి యాంటీసిపేటరి బెయిల్ను సీబీఐ వ్యతిరేకించకపోవడం న్యాయ సమ్మతం కాదు. అక్కడ ఇక్కడ విన్న మాటలను బట్టి అవినాష్పై ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ ఇక్కడ విన్న మాటలు ఎప్పుడూ ఎవిడెన్స్ కాదు. దస్తగిరి మొదటి స్టేట్మెంట్లో గంగిరెడ్డి సహా ఐదుగురు పేర్లు మాత్రమే చెప్పారు. తర్వాత ఇచ్చిన మరో స్టేట్మెంట్లో కొత్తపేర్లు తెరపైకి తెచ్చారు. అవినాష్ను అనుమానించదగ్గ ఆధారాలు సీబీఐ వద్ద లేవు.’’ అని అవినాష్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. "గూగుల్ టేకౌట్ అనేది ప్రత్యేక యాప్ ఏం కాదు, గూగుల్ టేకౌట్ అక్యూరసీ 2000 మీటర్లు ఉంటుంది. ఇక్కడ 50 మీటర్ల వ్యత్యాసం ఉంది. ఏ కోర్టులు గూగుల్ టేక్ అవుట్ ను ఆధారంగా పరిగణించవు. గూగుల్ టేక్ ఔట్ ఎప్పుడూ కచ్చితమైన ప్రదేశాన్ని చూపించదు. 15-20 మీటర్ల వ్యత్యాసం ఉంటుంది. గూగుల్ టేకౌట్ కు ఎలాంటి శాస్త్రీయత లేదు" "హత్య జరిగిన రాత్రి 1.58 కి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఏ2 సునీల్ యాదవ్ ఉన్నట్లు గూగుల్ టేక్ అవుట్ చెబుతోందని సి.బి.ఐ అంటోంది. కానీ హత్యకు ముందు రోజు రాత్రి నుంచి ఉదయం 9 గంటలవరకు దస్తగిరి, సునీల్ యాదవ్ కలిసే ఉన్నాము అని దస్తగిరి స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఒక వేళ సునీల్ యాదవ్ లొకేషన్ భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉంటే దస్తగిరి టేకౌట్ కూడా అక్కడే ఉండాలి కదా" అని అవినాష్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ‘‘అవినాష్ కోసం మా నాన్న ప్రచారం చేశారని సునీతనే చెప్పారు. ఇంకా సిబిఐ ఆరోపిస్తున్న రాజకీయ కోణంలో హత్యకు మోటివ్ ఎక్కడుంది? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సిబిఐ ఎప్పుడయినా ఇంటరాగేషన్ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు గతంలో ఇలాంటి ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఈ ఆదేశాలు ఇస్తే మేం తూచా తప్పకుండా పాటిస్తామని" అవినాష్ న్యాయవాది నివేదించారు. వాదనల అనంతరం అవినాష్ రెడ్డి పిటిషన్ను రేపు మధ్యాహ్నం 3.30గంటలకు హైకోర్టు వాయిదా వేసింది. -
సునీత అక్క స్టేట్మెంట్లో పలు అనుమానాలున్నాయి: అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వివేకా హత్య కేసులో తనను కుట్రపూరితంగా ఇరికిస్తున్నారని ఎంపీ అవినాష్రెడ్డి అన్నారు. పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘కేసును ఛేదించే దానికంటే నన్ను ఇరికించడానికే సీబీఐ విచారణ జరుపుతోంది. నాలాంటి ఎంపీ స్థాయి వ్యక్తినే ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సునీత అక్క సీబీఐకు ఇచ్చిన మొదటి స్టేట్మెంట్కు తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్కు చాలా తేడాలున్నాయి. సునీత అక్క ఇచ్చిన స్టేట్మెంట్లో పలు అనుమానాలున్నాయి.’’ అని అవినాష్రెడ్డి అన్నారు. ‘‘హత్య జరిగిన రోజు నేను జమ్మలమడుగు వెళ్లేందుకు సిద్ధమయ్యాను. పులివెందుల రింగ్రోడ్ దగ్గరికి వెళ్లే సరికి నాకు శివప్రకాష్రెడ్డి నుంచి ఫోన్ వస్తే వచ్చాను. కానీ సీబీఐ ఈ కేసులో ఇంట్లో ఉన్నట్లు ఇరికించే ప్రయత్నం చేస్తోంది. నాతో పాటు వచ్చిన వారిని విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయి’’ అని అవినాష్రెడ్డి పేర్కొన్నారు. చదవండి: వివేకా హత్య కేసు: కుట్రదారులతో కుమ్మక్కు ‘‘హత్య జరిగిన రోజు విలువైన డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లినట్లు సీబీఐకి దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. సీబీఐ వాటిపై విచారించలేదు. ఉదయం లెటర్, సెల్ఫోన్ లభిస్తే దాచిపెట్టి సాయంత్రం పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో నిజాలు బయటకు రావాలని కోరుకుంటున్నా.. నేను ఎలాంటి తప్పు చేయలేదని చాలా నమ్మకంగా ఉన్నాను. మీడియా ఈ కేసు విషయంలో వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి. రేపు, ఎల్లుండి పులివెందులలో ఉంటాను’’ అని ఎంపీ అవినాష్రెడ్డి వెల్లడించారు. -
అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. బెయిల్ పిటిషన్పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు(బుధవారం) వాదనలు వింటామని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. కాగా, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు కాల పరిమితిని సుప్రీంకోర్టు పొడిగించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీతో గడువు ముగియనుండగా తాజాగా జూన్ 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. -
వివేకా హత్య కేసు: కుట్రదారులతో కుమ్మక్కు
తండ్రిని హత్య చేసినవానిపై పగ తీర్చుకునే కథతో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. హత్యకు కుట్ర చేసినవారిని జైలుకు పంపించేవరకు చేసిన న్యాయ పోరాటాలూ చూశాం. కానీ తండ్రిని హత్య చేసిన హంతకుడిని ఆప్తుడిగా భావిస్తూ సఖ్యతగా ఉండటం ఏ సినిమా కథలోనూ లేదు. తండ్రి రాజకీయ ప్రత్యర్థులతో జట్టు కట్టడం ఎక్కడా వినలేదు. అందుకే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిది తీరు విస్మయం కలిగిస్తోంది. వివేకా రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు, ఆది నారాయణ రెడ్డి, బీటెక్ రవిలతో ఆయన కుటుంబ సభ్యులు జట్టు కట్టారు. హతుడైన వివేకా కుటుంబ సభ్యులు హంతకుడైన దస్తగిరితో చేతులు కలిపారు. ఈ కుట్ర కథలో సూత్రధారులు, పాత్రధారులూ ఒక్కటయ్యారు. ఆస్తి, రాజకీయ వారసత్వం కోసం కక్షగట్టిన కుటుంబ సభ్యులు కూడబలుక్కుని వాస్తవాలు దాచిపెడుతున్నారు. రాజకీయ ఆధిపత్యం కోసం కాచుకుని కూచున్న ప్రత్యర్థి పార్టీ నేతలు ఆడించినట్టు ఆడుతున్నారు. వెరసి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలకు పాతరేసేందుకు ఆయన సొంత కుటుంబ సభ్యులే యత్నిస్తున్నారు. ఆర్థిక, రాజకీయ వారసత్వ విభేదాలతో వివేకా హత్య దర్యాప్తును తప్పుదారి పట్టిస్తున్న ఈ ముఠా పన్నాగం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. వివేకా శత్రువులతో జట్టుకట్టిన ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డికి బయట శత్రువులు, ప్రత్యర్థులతో ఆయన కుటుంబ సభ్యులే జట్టు కట్టడం విభ్రాంతి కలిగిస్తోంది. ఆయనకు రాజకీయంగా శత్రువులు, ప్రత్యర్థులు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి కాగా... ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలతో అల్లుడు–చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి ఆయనకు ఇంట్లోనే శత్రువులుగా మారారన్నది బహిరంగ రహస్యం. అలాంటి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్ రెడ్డితో పాటు వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా ప్రస్తుతం ఆ టీడీపీ నేతలతో అత్యంత సన్నిహితంగా ఉంటుండటం విస్మయపరిచేదే. వాస్తవానికి ఒకప్పుడు వివేకా వద్ద డ్రైవర్గా ఉన్న దస్తగిరిని సునీతే పన్లోంచి తొలగించారు. అదే దస్తగిరి వివేకాను నరికి హత్య చేస్తే... అతనితో సునీత, అమె భర్త సఖ్యతగా ఉంటున్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే ఓ కీలకమైన అంశం చర్చించాల్సిన అవసరం ఏర్పడుతోంది. వివేకానందరెడ్డి మరణిస్తే ఎవరికి ప్రయోజనం అన్నది ఈ కేసులో కీలకంగా మారుతోంది. కడప జిల్లాలో కనీసం ఉనికి చాటుకోవాలంటే వివేకానందరెడ్డి ఉండకూడదన్నది టీడీపీకి రాజకీయ అవసరం. తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నందున వివేకానందరెడ్డి అడ్డుతొలగించుకోవడం అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి ప్రయోజనకరం. పులివెందులలో పట్టు సాధించడానికి వివేకానే అడ్డున్నారన్నది బీటెక్ రవి ఉద్దేశం. అందుకే 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లోఆయన్ని దొంగదెబ్బతీసిన ఈ ముఠానే 2019లో ఏకంగా భౌతికంగా అడ్డుతొలగించుకునేందుకు కుట్ర పన్నారనటానికే ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పాలి. మరి వారితో వివేకా కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిది సఖ్యతగా ఉండటం వెనుక అసలు కోణం ఏమిటన్నదే ఈ కేసులో కీలకం. అసలు టీడీపీ మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి... వివేకా పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డికి ఎలా సన్నిహితుడయ్యారు? అదీ ఆదినారాయణ రెడ్డిని ఎంపీ ఎన్నికల్లో ఓడించి సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డిని గెలిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న నేపథ్యంలో...! దీని వెనుకే అసలు గూడు పుఠాణీ ఉంది. వివేకానందరెడ్డి మరణించిన విషయాన్ని ఆయన పీఏ కృష్ణారెడ్డి చెబితే శివ ప్రకాశ్ రెడ్డి వెంటనే ఎవరికి సమాచారం ఇవ్వాలి... సాధారణంగా సమీప బంధువులకు ముందు చెప్పాలి. కానీ వివేకానందరెడ్డి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న అప్పటి టీడీపీ మంత్రి ఆది నారాయణ రెడ్డికి మొదట ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయనేమీ వివేకాకు బంధువు కాదు... మిత్రుడు అంతకన్నా కాదు. పైపెచ్చు రాజకీయ ప్రత్యర్థి. ఏదో విషయాన్ని గోప్యంగా ఉంచాలన్న ఉద్దేశంతోనో... విషయాన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడతోనో వారిద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగి ఉంటుందన్నది తేలిగ్గానే అర్థమవుతుంది. వివేకా ఇంట్లో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు వివేకానందరెడ్డి రెండో వివాహం అనంతరం ఆయన కుటుంబంలో తలెత్తిన పరిణామాలు ఈ కేసులో అత్యంత కీలకం. తన రెండో భార్య షమీమ్కు ఆస్తిలో వాటా ఇస్తానని... ఆమెతో తనకు పుట్టిన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని వివేకా చెప్పడమే ఆ కుటుంబంలో విభేదాలకు ఆజ్యం పోసింది. ఎందుకంటే ఆయన ఆస్తికి ఏకైక వారసుడిని కావాలని అల్లుడు–చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పట్టుదలతో ఉన్నారు. అందుకే ఆస్తిలో షమీమ్కు వాటా ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఇక రాజకీయంగా వివేకా వారసత్వాన్ని అందుకోవాలని పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి భావిస్తున్నారు. అందుకు వివేకా సమ్మతించకపోవడంతో పాటు తన రెండో భార్య కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటిస్తాననేసరికి కక్ష గట్టారు. అందుకే వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె, అల్లుడు ఆయన్ని విడిచిపెట్టి హైదరాబాద్లో ఉంటుండగా... షమీమ్తో సునీత ఘర్షణ పడ్డారు. జుగుప్సాకరమైన భాషలో వాట్సప్ మెసేజుల ద్వారా దూషించుకున్నారు. షమీమ్ను వివేకా బావమరుదులిద్దరూ తీవ్రంగా బెదిరించారు. 2012లో రోడ్డు ప్రమాదానికి గురైన వివేకాను చూసేందుకు వెళ్లిన షమీమ్ను శివప్రకాశ్ రెడ్డి ఇంట్లోకి రానివ్వలేదు. ఆయన హెచ్చరించడంతో... ప్రాణభయంతో షమీమ్ అన్నయ్య, వదిన కుటుంబం పులివెందుల విడిచిపెట్టి వెళ్లిపోయింది. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్ రెడ్డిలతో ముప్పు ఉన్నందునే షమీమ్ హైదరాబాద్లో తన చిరునామా కూడా గోప్యంగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. షమీమ్కు ఓ ఇల్లు ఇవ్వాలని... ఆమె కుమారుడిని హైదరాబాద్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించాలని అనుకుంటున్నా గానీ తన కుటుంబ సభ్యులు అడ్డుపడుతుండటంతో సాధ్యం కావడం లేదని వివేకా సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఎందుకంటే అప్పటికే కుటుంబ వ్యాపార సంస్థలకు సంబంధించి ఆయనకు ఉన్న చెక్ పవర్ను ఆయన కుటుంబ సభ్యులు తొలగించారు. వివేకా ఇద్దరు బావమరుదులు తనను తీవ్రంగా బెదిరించారని వారితో తనకు తన కుమారుడికి ముప్పు ఉందని షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోనూ స్పష్టం చేశారు. వివేకాకు కూడా ఆయన ఇద్దరు బావమరుదుల నుంచే ముప్పు ఉండేదని చెప్పారామె. ఈ నేపథ్యంలో కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు ఆయన హత్య వెనక ఎంత బలంగా ఉండవచ్చో తెలియకమానదు. రక్తపు మరకల లేఖపై గప్చుప్..!! వివేకానందరెడ్డికి ఇంటా, బయటా ఉన్న శత్రువులందరూ అన్ని విషయాలపైనా మాట్లాడుతున్నారు కానీ... రక్తపు మరకలతో ఉన్న లేఖపై మాత్రం మౌనం వహిస్తున్నారు. అదే వివేకా రాసిన లేఖ. వివేకా రక్తపు మరకలతో తడిసిన లేఖపై... అంతా కూడబలుక్కుని నిర్ణయించుకున్నట్టు ఒక్క మాటా మాట్లాడటం లేదు. ఎందుకంటే ఈ హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు, ఆయన బృందం పన్నిన వ్యూహంలో భాగమే ఆ లేఖపై మౌనం!!. విచిత్రమేంటంటే తరచూ టీడీపీ వేదికల మీద ఈ కేసు గురించి మాట్లాడే చంద్రబాబు ఒక్క రోజు కూడా వివేకా రాసిన లేఖ గురించి ప్రస్తావించ లేదు. సునీత, ఆమె భర్త కూడా అసలు అలాంటి లేఖ ఒకటి ఉన్నట్టుగా కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే వివేకా గుండె పోటుతో మరణించారనే కట్టు కథను ప్రచారంలోకి తెచ్చేందుకే ఆ లేఖను ఆ ముఠా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసింది. వివేకాపై తీవ్రంగా దాడిచేసిన తరువాత హంతకులు ఆయన చేత బలవంతంగా లేఖ రాయించారు. వాళ్లు బెదిరించడంతో... డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరచినట్టు ఆ లేఖలో వివేకా రాశారు. ఆ లేఖను మొదట.. అంటే 2019, మార్చి 15న ఉదయం 6.10 గంటలలోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి... ఆ విషయాన్ని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. తాము వచ్చే వరకు ఆ లేఖను, సెల్ఫోన్ను ఎవరికి ఇవ్వకుండా దాచి ఉంచాలని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పీఏ కృష్ణారెడ్డితో చెప్పారు. వారు అలా చెప్పకపోయి ఉంటే కృష్ణారెడ్డి ఆ లేఖ విషయాన్ని వెంటనే బయటపెట్టేవారు. దాంతో వివేకాది హత్యేనని అందరికీ వెంటనే స్పష్టత వచ్చేది. గుండెపోటో మరొకటో కాదని వెంటనే తెలిసిపోయేది. అలా తెలిసి ఉంటే... ఎవ్వరూ మృతదేహాన్ని తాకే ప్రయత్నం చేసి ఉండేవారు కాదు. అప్పుడసలు ‘‘రక్తపు మరకలు కడిగిందెవరు? గాయాలకు కట్లు కట్టిందెవరు?’’ అని పదేపదే ప్రశ్నించే అవకాశం చంద్రబాబు నాయుడికి వచ్చి ఉండేదే కాదు. కానీ వారు అలా చేయలేదు. వివేకా గుండెపోటుతో మరణించారని ప్రచారం చేయాలన్న ఉద్దేశంతోనే ఆ లేఖను బయటపెట్టకూడదని సునీత, ఆమెభర్త రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్ రెడ్డి నిర్ణయించినట్టు స్పష్టమవుతోంది. అనంతరం టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ద్వారా గుండె పోటు కథను ప్రచారంలోకి తెచ్చారు. గుండె పోటు కథ ప్రచారంలోకి రావడంతో తమ లక్ష్యం నెరవేరిందని వారు భావించారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పులివెందుల చేరుకోవటంతో ఆ లేఖతోపాటు వివేకా సెల్ఫోన్ను కృష్ణారెడ్డి వారికి ఇచ్చారు. ఆ లేఖను చదివాక కూడా వెంటనే దాన్ని పోలీసులకు అప్పగించనే లేదు. ఆ సెల్ఫోన్లోని మెస్సేజులు, డేటాను డిలీట్ చేశారు. అనంతరం సునీత ఆదేశాలతో సాయంత్రం 5గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్ఫోన్ను పోలీసులకు ఇచ్చారు. ఆ లేఖను సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నది ఈ హత్య కేసులో కీలకాంశం. ముందస్తు పన్నాగం ప్రకారమే ఆ లేఖపై మాత్రం ఇటు సునీత, ఆమె భర్త గానీ అటు చంద్రబాబు, టీడీపీ నేతలుగానీ మాట్లాడటం లేదు. అవినాశ్ను వివేకా ఇంటికి వెళ్లమని చెప్పింది శివప్రకాశ్రెడ్డే వివేకా హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు టీమ్ పక్కా పన్నాగంతో వ్యవహరించింది. వాస్తవాలు వెలుగులోకి రాకుండా...కేవలం ఊహాగానాలు, అభూతకల్పనల చుట్టూనే దర్యాప్తు కేంద్రీకృతం అయ్యేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే టీడీపీ అనుకూల పచ్చ మీడియాలో రోజుకో కట్టుకథను ప్రచారంలోకి తీసుకువస్తూ అటు సీబీఐ దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తూ... ఇటు ప్రజలనూ తప్పుదారి పట్టిస్తోంది. ఎంపీ అవినాశ్ రెడ్డినే లక్ష్యంగా చేసుకుని విషం చిమ్ముతోంది. ఎంపీ అవినాశ్ రెడ్డి వివేకా నివాసానికి ఏ సమయానికి వెళ్లారు... అక్కడ ఏం చూశారు అన్నదే ప్రధానాంశంగా చేసుకుని... వివేకా మృతదేహానికి కుట్లు వేశారని, కట్లు కట్టారనే అవాస్తవాలను ప్రచారంలోకి తీసుకువస్తోంది. వివేకానందరెడ్డి పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి 2019 మార్చి 15న ఉదయం 6.20 గంటల సమయంలో ఫోన్ చేసి చెబితేనే ఎంపీ అవినాశ్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు. అప్పటికే ఎన్నికల ప్రచారం కోసం తన అనుచరులతో జమ్మలమడుగు వెళుతున్న ఆయనకు శివ ప్రకాశ్రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రాకపోయి ఉంటే ఆయన జమ్మలమడుగు వెళ్లి ఉండేవారు. వివేకా మరణించారని చెప్పి... వెంటనే వెళ్లమంటేనే అవినాశ్ అక్కడికి వెళ్లారు. ఆయన అక్కడకు వెళ్లినా పీఏ కృష్ణా రెడ్డి మాత్రం వివేకా రాసిన లేఖ గురించి చెప్పలేదు. ఎందుకంటే ఆ లేఖ విషయం గోప్యంగా ఉంచమని సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆయన్ని ఆదేశించారు. ఆ లేఖ విషయాన్ని శివ ప్రకాశ్ రెడ్డి ఎంపీ అవినాశ్కు ఫోన్ చేసినప్పుడు చెప్పినా... లేక ఆయన వివేకా ఇంటికి రాగానే పీఏ కృష్ణా రెడ్డి చెప్పినా ఎవ్వరూ భౌతిక కాయాన్ని తాకే ఉండేవారే కాదు. ఆ లేఖ విషయాన్ని అవినాశ్ వెంటనే పోలీసులకు చెప్పి ఉండేవారు. వివేకా హత్యకు గురయ్యారని అందరికీ వెంటనే తెలిసిపోయేది. అప్పటికే భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు, సాధారణ ప్రజల్ని ఆ మృతదేహం దగ్గరకు ఎవరూ వెళ్లకుండా అవినాశే కట్టడి చేసేవారు. దాంతో ఈ కేసులో కీలక ఆధారాలు పోలీసులకు దొరికేవి. కానీ అలా జరగడం నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదని వాళ్లు పన్నిన వ్యూహమే చెబుతోంది. అందుకే ఆయన లేఖ విషయాన్ని ఎంపీ అవినాశ్కు చెప్పలేదు. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించి వివేకా హత్య కేసును తప్పుదారి పట్టించారని చెప్పటానికి ఇంతకన్నా ఆధారాలేం కావాలి? ‘కట్టు’కథలో ఇరికించడానికేనా? వివేకానందరెడ్డిని హత్య చేసి.. గుండెపోటుతో మరణించారన్న కట్టు కథను తెరపైకి తేవడానికే శివప్రకాశ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఫోన్లో మాట్లాడుకుని ఉంటారన్నది కాస్త లోతుగా పరిశీలిస్తే అర్థమయ్యే విషయం. వారిద్దరి ఫోన్ సంభాషణ అనంతరమే గుండె పోటు కథ తెరపైకి వచ్చింది. వివేకా గుండె పోటుతో మరణించారని శివప్రకాశ్ రెడ్డి తనతో చెప్పారని ఆది నారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఎక్కువగా సిగరెట్లు తాగడంతోనే అలా అయ్యి ఉంటుందని తాను ఆయనతో చెప్పినట్లు కూడా వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ఎంత కుట్రపూరితంగా గుండె పోటు కథను తెరపైకి తెచ్చారో తెలియటం లేదా? మరోవైపు వివేకాను కుట్రపూరితంగా ఓడించిన బీటెక్ రవి, వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి సన్నిహితుడయ్యారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురిచేసి తాను ఎమ్మెల్సీగా గెలిచానని బీటెక్ రవి తాజాగా పచ్చ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం అంగీకరించారు. అదే ఇంటర్వ్యూలో వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, తాను ఇప్పటికీ అత్యంత సన్నిహితులమని కూడా చెప్పడం గమనార్హం. అంటే వివేకా మరణంతో రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందుతామని భావిస్తున్న వారంతా అప్పుడు ఇప్పుడూ ఒకే జట్టుగా ఉంటున్నారన్నది అర్థం కావటం లేదా? అమరావతి నుంచి కథ నడిపిన బాబు.. వైఎస్ వివేకా హత్యకు గురైన రోజు అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతి నుంచి పెద్ద కథే నడిపారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కడప ఎస్పీతోనూ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డితోను, అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవితోను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ కేసు దర్యాప్తును ప్రభావితం చేశారు. వివరాలు ఎప్పటికప్పుడు చంద్రబాబుకు అప్డేట్ చేశారు. కడప ఎస్పీకి సైతం ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేందుకు ఏబీవీ ఎందుకు అంతగా తాపత్రయ పడ్డారన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ... తాను జరిపిన దర్యాప్తులో అసలు లేఖ విషయమే పట్టించుకోలేదు. -
ఎర్ర గంగిరెడ్డిదే కీలక పాత్ర.. తెలంగాణ హైకోర్టులో సీబీఐ వాదనలు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుట్ర పన్నింది ఎర్ర గంగిరెడ్డేనని, దాన్ని అమలు చేయడంలోనూ అతనిది కీలక పాత్ర అని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించింది. సాక్ష్యాలు తారుమారు చేయడంలోనూ అతను కీలకంగా వ్యవహరించాడని పేర్కొంది. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు (ఏ–1) ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ చిల్లకూర్ సుమలత గురువారం విచారణ జరిపారు. సీబీఐ తరఫున పీపీ నాగేంద్రన్ వాదనలు వినిపిస్తూ.. ‘గంగిరెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు. వివేకా వద్ద డ్రైవర్గా పనిచేస్తానని, హత్య చేయలేనని చెప్పినా గంగిరెడ్డి రూ.40 కోట్లు ఇస్తానని ఆశ చూపాడని దస్తగిరి (ఏ–2) వాంగ్మూలంలో వెల్లడించాడు. పథకం ప్రకారం ముందుగా వివేకా ఇంటికి వెళ్లిన గంగిరెడ్డి.. ఆ తర్వాత ముగ్గురు నిందితులు లోపలికి వచ్చేందుకు సహకరించాడు. గంగిరెడ్డి ఆదేశాలతోనే హత్యను వేరేవాళ్లపై నెట్టేలా చావుబతుకుల్లో ఉన్న వివేకా లేఖ రాశారు. అతని విచారణ తప్పనిసరి. వివేకా హత్య జరిగిన రోజు వాచ్మెన్ రంగన్న ఇతర నిందితులతో పాటు గంగిరెడ్డిని కూడా గుర్తించాడు. హత్య తర్వాత గంగిరెడ్డి, శివశంకర్రెడ్డి సాక్ష్యాలను చెరిపివేశారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలి’ అని వాదించారు. చదవండి: ఏది నిజం?: వివేకా హంతకుల్ని నడిపిస్తున్నదెవరు? డీఫాల్ట్ బెయిల్ను మెరిట్ ఆధారంగా పరిశీలించి రద్దు చేయవచ్చని వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్ వాదనలు వినిపించారు. గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్ను రద్దు చేయించాలని సీబీఐ పలుమార్లు ప్రయత్నించి విఫలమైందని గంగిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు వెల్లడించారు. సీబీఐ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్లను కడప కోర్టు, ఏపీ హైకోర్టు కొట్టివేశాయని చెప్పారు. బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు కూడా చెప్పలేదన్నారు. ఈ హత్యతో గంగిరెడ్డికి సంబంధం లేదని, బెయిల్ను రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేశారు. దస్తగిరికి తెలంగాణ హైకోర్టు నోటీసులు హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు (ఏ–4) షేక్ దస్తగిరికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దస్తగిరిని అప్రూవర్గా పేర్కొంటూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడాన్ని కొట్టివేయాలంటూ ఎంవీ కృష్ణారెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి తెలంగాణ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.సురేందర్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. భాస్కర్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిస్తూ.. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న కిరాయి హంతకుడు దస్తగిరికి క్షమాబిక్ష చెల్లదని అన్నారు. ఈ పిటిషన్లలో ప్రతివాది అయిన దస్తగిరికి ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసులో నిందితుడు దస్తగిరికి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను జూన్కు వాయిదా వేశారు. -
ఏది నిజం?: వివేకా హంతకుల్ని నడిపిస్తున్నదెవరు?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డికి వైఎస్సార్ సీపీ తరఫున టిక్కెట్టిచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గెలిచేంత మెజారిటీ ఉన్నా సరే... కుట్రపూరితంగా ఆయన్ని ఓడించి.. టీడీపీ తరఫున బీటెక్ రవిని గెలిపించింది చంద్రబాబు నాయుడు. ఆయన ఉంటే జిల్లాలో తాము రాజకీయంగా ఏమాత్రం ఎదగలేమని భావించింది టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి. ఆయన్ని ఏకంగా గొడ్డలితో నరికి నేను హత్య చేశాను అని దర్యాప్తు సంస్థల ఎదుటే సాక్ష్యం ఇచ్చిన దస్తగిరి. వీళ్లంతా ఎవరు? వివేకానందరెడ్డిని వ్యక్తిగతంగా, రాజకీయంగా అంతం చేసిన ముఠా సభ్యులు. మరి వీళ్లంటే వివేకానందరెడ్డి కుటుంబానికి సహజంగానే తీవ్ర ఆగ్రహం ఉండాలి కదా? కానీ ఏం జరుగుతోంది? చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, దస్తగిరి... బాబు కోసం పనిచేసే ‘ఈనాడు’.. దాని తోకలు.. వీళ్లంతా ఇపుడు వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు–చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితులైపోయారు. అంతా కలిసే కోర్టులకెళుతున్నారు. ‘నేనే నరికి చంపా’ అన్న దస్తగిరి బెయిలుకోసం దరఖాస్తు చేస్తే వ్యతిరేకించ లేదు. దర్జాగా బయటే తిరుగుతున్నాడతను. ఎల్లో మీడియాకు పతాక స్థాయి ఇంటర్వ్యూలిస్తున్నాడు. వంకర మాటల ఓపెన్హార్టులో బీటెక్ రవి ప్రవచనాలు చెప్తున్నాడు. వీళ్లంతా కలిసి హంతకుడిని కూడా వదిలేసి తమ రాజకీయ ప్రత్యర్థుల్ని దీంట్లో ఇరికించడానికి వెంటాడుతున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. ఎవరికి అర్థం కానిది ఈ నాటకం? వివేకానందరెడ్డి హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన ఈ ఎల్లో మాఫియాను ఛేదిస్తే తప్ప హత్య వెనక ఉన్న వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదు. 2017లో వివేకాపై చంద్రబాబు రాజకీయ కుట్ర.. మెజార్టీ సభ్యులు ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి వైఎస్ వివేకానందరెడ్డిని రాజకీయంగా అంతం చేయడమే కాదు భౌతికంగానూ లేకుండా చేయాల్సిన అవసరం కచ్చితంగా టీడీపీకే ఉందన్నది బహిరంగ రహస్యం. వైఎస్సార్ జిల్లాలో టీడీపీ బలోపేతానికి ఆయనే అడ్డంకిగా నిలబడ్డారు. అందుకే 2017లో వైఎస్సార్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వివేకాను కుట్రపూరితంగా ఓడించారు చంద్రబాబు. స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ వివేకానందరెడ్డిని అభ్యర్థిగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంపిక చేశారు. జిల్లాలో మెజార్టీ ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీకి చెందినవారే ఉండటంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని అంతా భావించారు. వివేకాను ఓడిస్తే.. నాటి విపక్ష నేత జగన్ను ఓడించినట్లేనని చంద్రబాబు భావించారు. అందుకే వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలు పెట్టి తమ వైపు లాక్కున్నారు. దీనికి నాటి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి పూర్తిగా సహకరించారు. ఎందుకంటే వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నీతిబాహ్యంగా టీడీపీకి అమ్ముడుపోయి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి అయిన వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేశ్ భారీగా డబ్బులు వెదజల్లి వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభపెట్టి దొడ్డిదారిలో వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించారు. 2019... వివేకా భౌతికంగా అంతం 2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబులో మళ్లీ గుబులు మొదలైంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యే సీటును గెలిచిన టీడీపీకి ఈ సారి అది కూడా కష్టమేనని అర్థమైంది. కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ లోక్సభ స్థానానికి పార్టీ ఎన్నికల ఇన్చార్జ్గా అప్పటికే వైఎస్ వివేకానందరెడ్డిని నియమించారు. పార్టీ గెలుపు కోసం ఎన్నికల వ్యూహాలు పన్నుతూ...అందర్నీ కలుపుకుంటూ వెళ్లారు వివేకా. దాంతో చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి బెంబేలెత్తారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు ఖరారు చేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ను కూడా ఆదినారాయణ రెడ్డి కొడుక్కి ఇచ్చారు. వివేకా ఉంటే ఎప్పటికీ తాము రాజకీయంగా పైచేయి సాధించలేమన్నది బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే వివేకా హత్యకు గురయ్యారు. మరి ఇది టీడీపీ కుట్ర కాదా? వివేకా హత్యకు ముందు టీడీపీ నేతలతో కొందరి రహస్య సమావేశాలు... ఆయన హత్య తరువాత టీడీపీ నేతలు వ్యవహరించిన తీరే దీనికి ఊతమిస్తోంది. హత్య అనంతరం... అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పదేపదే కడప ఎస్పీకి ఫోన్ చెయ్యడం... బీటెక్ రవితో కూడా నేరుగా సంభాషించటం... ఎప్పటికప్పుడు జరుగుతున్న వ్యవహారాలను నాటి సీఎం చంద్రబాబుకు అప్డేట్ చెయ్యటం.. ఇవన్నీ కాదనలేని వాస్తవాలు. అంటే... అంతా తాము అనుకున్నట్లే జరుగుతోందా? లేదా.. అన్నది బాబుకు ఏబీ అప్డేట్ చేశారన్నది నిపుణుల మాట. హత్యకు ముందు... వివేకా అనుచరుడితో బీటెక్ రవి భేటీ ఎందుకో...! తనకు దీర్ఘకాలంగా అనుచరుడిగా ఉన్న కొమ్మారెడ్డి పరమేశ్వరరెడ్డితో వివేకాకు ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు వచ్చాయి. దాంతో పరమేశ్వరరెడ్డి కక్ష పెంచుకుని పులివెందుల నియోజకవర్గంలో వివేకా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ నేత బీటెక్ రవితో చేతులు కలిపాడు. వివేకా హత్యకు అప్పటికే పన్నాగం సిద్ధం కావడంతో... ముందుగా పరమేశ్వరరెడ్డి ఎలిబీ సృష్టించుకోవడానికి వివేకా హత్యకు కేవలం రెండు రోజుల ముందే అంటే 2019 మార్చి 13న అనారోగ్యం సాకుతో కడపలోని సన్రైజ్ ఆస్పత్రి ఐసీయూలో చేరాడు. కానీ ఎవరికీ తెలియకుండా 2019 మార్చి 14 సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో హరిత హోటల్లో రెండుసార్లు సమావేశమయ్యాడు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి... ఆ తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం గమనార్హం. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినా పరమేశ్వరరెడ్డి తిరస్కరించడం సందేహాలకు తావిస్తోంది. ‘గుండె పోటు’ కథకుడు శివప్రకాశ్ రెడ్డి... వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయటమే కాదు. ఆ హత్యలో ఇతరుల్ని ఇరికించడానికి కూడా ఎల్లో గ్యాంగ్ పకడ్బందీ కుట్ర పన్నిందని చెప్పొచ్చు. ఎందుకంటే వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారనే తప్పుడు ప్రచారం వెనుక ఆయన పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్రెడ్డి, టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. శివప్రకాశ్రెడ్డి మొదట ఆదినారాయణ రెడ్డికి ఫోన్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పారు. ‘‘సిగరెట్లు ఎక్కువుగా తాగుతారు కదా! అందుకే ఇలా జరిగి ఉండొచ్చు’’ అని ఆదినారాయణరెడ్డి ఆయనతో చెప్పారు. ఈ విషయాన్ని ఆదినారాయణ రెడ్డి స్వయంగా టీవీ ఛానెళ్ల ఎదుట వెల్లడించారు. అంతేకాదు. ఆదినారాయణరెడ్డికి చెప్పిన శివప్రకాశ్ రెడ్డే... ఎన్నికల ప్రచారం నిమిత్తం ఉదయాన్నే జమ్మలమడుగు వెళుతున్న ఎంపీ అవినాశ్రెడ్డికి కూడా వివేకా గుండెపోటు విషయం చెప్పారు. దాంతో అక్కడి నుంచే వెనుదిరిగి... అవినాశ్ రెడ్డి వివేకా ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ వివేకా పీఏ కృష్ణారెడ్డితో పాటు పలువురు ఉన్నారు. ఇలా శివప్రకాశ్ రెడ్డి చెప్పిన గుండెపోటు విషయమే... టీవీల్లో బ్రేకింగ్ న్యూస్గా వచ్చింది. ఆయన హత్యకు గురయ్యారనే నిజం బయటపడేలోపే ఈ తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చారు. మరి శివప్రకాశ్రెడ్డి, ఆది నారాయణరెడ్డి ఈ తప్పుడు ప్రచారాన్ని ఎందుకు చేశారు? దీన్ని ఛేదిస్తే హత్య కేసులో అసలు కుట్ర బయటపడుతుంది. రక్తపు మరకల లేఖ.. గోప్యంగా ఉంచమన్న కుమార్తె, అల్లుడు.. వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేసేందుకుగాను ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్రెడ్డి పక్కా ప్లాన్తోనే వ్యవహరించారు. అదెలాగంటే... వైఎస్ వివేకాపై తీవ్రంగా దాడిచేసిన తరువాత హంతకులు ఆయన చేత బలవంతంగా లేఖ రాయించారు. వాళ్లు బెదిరించడంతో... డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని ఆ లేఖలో వివేకా రాశారు. ఆ లేఖను మొదటగా అంటే ఆ రోజు ఉదయం 6.10లోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి... ఆ విషయాన్ని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. రక్తపు మరకలున్న ఆ లేఖ చూసినవారెవరికైనా... వివేకాది హత్యేనని తెలిసిపోతుంది. కానీ లేఖ విషయాన్ని కృష్ణారెడ్డి చెప్పగానే... తాము వచ్చే వరకు ఆ లేఖను, వివేకా సెల్ఫోన్ను ఎవ్వరికీ ఇవ్వవద్దని, దాచి ఉంచాలని కృష్ణారెడ్డితో నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు. ఆ తరవాతే అసలు పన్నాగానికి తెరలేచింది. శివ ప్రకాశ్ రెడ్డి ద్వారా అవినాశ్రెడ్డికి చెప్పించారు. అవినాశ్ రెడ్డి కాల్ డేటా చూస్తే ఈ విషయం నిర్ధారణ అవుతుంది కూడా. అవినాశ్ అక్కడకు చేరాక కూడా ఆయనకు లేఖ చూపించలేదు. లేఖ ఉందన్న విషయం కూడా చెప్పలేదు. అంటే... అన్నీ పథకం ప్రకారమే చేశారు. వాస్తవానికి వారు గనక ఆ లేఖను వెంటనే పోలీసులకు ఇవ్వాలని చెప్పి ఉంటే వివేకా హత్యకు గురయ్యారన్నది వెంటనే అందరికీ తెలిసిపోయేది. కనీసం అక్కడకు చేరుకున్న అవినాశ్కు చూపించినా హత్య సంగతి అర్థమయ్యేది. హత్య జరిగిందని తెలిస్తే ఎవ్వరూ మృతదేహాన్ని తాకేవారే కాదు. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. బహుశా! అంతా తామనుకున్నట్టే జరిగిందనో ఏమో!! ఆ రోజు నుంచీ ఇప్పటివరకూ చంద్రబాబు నాయుడు ఈ హత్య గురించి ఎక్కడ మాట్లాడినా... మృతదేహానికి బ్యాండేజీ ఎవరు కట్టారు? రక్తపు మరకలు ఎవరు తుడిచారు? అనే ప్రశ్నలే వేస్తున్నారు. మొత్తం టీడీపీ, ఎల్లో మీడియా.. అందరూ ఇదే విషయమై దుష్ప్రచారం చేస్తున్నారు. అంతే తప్ప అసలు గుండెపోటు అని చెప్పిందెవరు? వారికెలా తెలిసింది? అసలు లేఖను ఎందుకు గోప్యంగా ఉంచారు? అలా ఎందుకు ఉంచమన్నారు? అనే విషయాలను మాత్రం ప్రచారంలోకి రానివ్వటం లేదు. ఇదీ.. కుట్ర వెనక అసలు కథ. ఆ రోజు మధ్యాహ్నం 1గంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఆ లేఖతోపాటు వివేకా సెల్ఫోన్ను కృష్ణారెడ్డి ఇచ్చారు. ఆ లేఖను చదివారు కానీ... వెంటనే పోలీసులకు ఇవ్వలేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్ఫోన్ను పోలీసులకు అప్పగించారు. ఆ లేఖను సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నదే ఈ హత్య కేసులో కీలకం. చంద్రబాబు మంత్రాంగం... వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన రోజు అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతి నుంచి పెద్ద కథే నడిపారు. అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కడప ఎస్పీతోనూ టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డితోను, బీటెక్ రవితోను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ కేసు దర్యాప్తును ప్రభావితం చేశారు. కేసు దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేందుకు ఏబీవీ ఎందుకు అంతగా తాపత్రయ పడ్డారన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ... తాను జరిపిన దర్యాప్తులో అసలు లేఖ విషయమే పట్టించుకోకపోవటం గమనార్హం. వివేకా మరణిస్తే ఎవరికి ప్రయోజనం... ! ఆయన రెండో వివాహంతో ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు వివేకానందరెడ్డి మరణిస్తే ఎవరికి లాభం అన్నది ఈ కేసులో కీలకం. దాంతో అన్ని వేళ్లూ వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన విభేదాలపైకే వెళ్తున్నాయి. తాను రెండో వివాహం చేసుకున్న షమీమ్ అనే మహిళకు పుట్టిన కుమారుడికి ఆస్తిలో భాగం ఇవ్వాలని ఆయన భావించారు. తన రాజకీయ వారసుడిగా చేస్తానన్నది ఆ జిల్లాలో అందరికీ తెలుసు. అందుకే ఆ కుటుంబంలో ఆస్తి వివాదాలు, రాజకీయ వారసత్వ వివాదాలు తీవ్రస్థాయికి చేరాయి. వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్రంగా గొడవపడి ఆయన్ని విడిచిపెట్టి హైదరాబాద్లో ఉంటున్నారు. సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, బావగారు శివ ప్రకాశ్రెడ్డి షమీమ్ ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డారు. వివేకానందరెడ్డి అప్పటికే ఆమెకు ఇచ్చిన ఓ ఇంటి పత్రాలను బలవంతంగా తీసుకున్నారు. షమీమ్, వైఎస్ సునీత పరస్పరం దూషించుకుంటూ చేసుకున్న వాట్సాప్ చాటింగ్ను కూడా అప్పట్లోనే సిట్ బృందం వెలికితీసింది. షమీమ్కు ఓ ఇల్లు ఇవ్వాలని... ఆమె కుమారుడిని హైదరాబాద్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించాలని అనుకుంటున్నా...అవ్వడం లేదని వివేకా సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి జీవించి లేకపోతే ఆయన కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిదికే ఎక్కువ లాభమన్నది గమనించాల్సిన అంశం. ఆస్తితో పాటు రాజకీయ వారసత్వం కూడా తమకే వస్తుందన్నది వారి ఉద్దేశంగా తెలుస్తుంది. హంతకుడు దస్తగిరిని అప్రూవర్గా మార్చింది ఎవరు...!? వైఎస్ వివేకాను గొడ్డలితో స్వయంగా నరికాను అని చెప్పిన దస్తగిరి అప్రూవర్గా మారడంతోనే ఈ కేసు దర్యాప్తు దారితప్పింది. అతన్ని అప్రూవర్గా మార్చింది ఎవరనే అంశమూ ఇక్కడ కీలకం. దస్తగిరి తరచు వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డితో భేటీ అవుతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవితో సన్నిహితంగా ఉంటున్నారు. ఎల్లో మీడియాకు ఇంటర్వ్యూలిస్తున్నాడు. అంటే వివేకా కుటుంబం, టీడీపీ నేతల పన్నాగంలో భాగంగానే దస్తగిరి అప్రూవర్గా మార్చినట్టు స్పష్టమవుతోంది. అప్పటివరకు పేదరికంలో కొట్టుమిట్టాడిన దస్తగిరి.. అప్రూవర్గా మారిపోగానే ఒక్కసారిగా ధనవంతుడైపోయాడు. కారు, బంగ్లా, డ్రైవర్... అన్నీ వచ్చేశాయి. మరి వీటిని ఇస్తున్నదెవరు? ఎందుకు ఇస్తున్నారు? సీబీఐ అధికారులు దస్తగిరిని ఢిల్లీకి తీసుకువెళ్లి మరీ అప్రూవర్గా మార్చి వాంగ్మూలం నమోదు చేశారు. అందులో వాస్తవం ఎంతన్నది పట్టించుకోకుండా ఆ వాంగ్మూలం ఆధారంగానే ఏకపక్షంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. హంతకుడు ఎల్లో గ్యాంగ్ హీరోనా...! వివేకాను హత్య చేసిన దస్తగిరిని అటు టీడీపీ ఇటు టీడీపీ అనుకూల పచ్చ మీడియా హీరోగా చూపించేందుకు బరితెగించి వ్యవహరిస్తున్నాయి. ఈనాడు,ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ 5 చానళ్లు దస్తగిరిని ఇంటర్వ్యూలు చేస్తూ అతన్ని ఓ సెలబ్రిటీగా చూపిస్తున్నాయి. వైఎస్సార్ కుటుంబంపై అక్కసుతో పాత్రికేయ విలువలను దిగజారుస్తూ ఓ హంతకుడిని హీరోగా చూపించేందుకు పడరానిపాట్లు పడుతున్నాయి. తన తండ్రి హంతకుడిని ఓ సంఘ సంస్కర్తగా టీడీపీ, ఎల్లో మీడియా చూపిస్తూ ఉంటే సునీత కనీసం అభ్యంతరం వ్యక్తం చేయకపోవటమే ఇక్కడ దారుణం. ఇదే బాబు మార్కు పన్నాగం... చంద్రబాబు ఎవరినైనా అడ్డుతొలగించుకోవాలంటే తనదైన శైలిలో పన్నాగం పన్నుతారు. లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి సొంతం కుటుంబంలోనే చిచ్చుపెట్టి సొంతవారితోనే కథ నడిపిస్తారని ఎన్టీఆర్ విషయంలో రుజువైంది. ఎన్టీ రామారావును ఆయన సొంత పిల్లలతోనే ఛీకొట్టించి మరీ పదవి నుంచి దించేసి తాను అడ్డదారిలో సీఎం అయ్యారు. అదే రీతిలో వివేకానందరెడ్డికి ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డిలతోనే పొగ పెట్టించారు. టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిల సహకారంతో కుటుంబ సభ్యులే పాత్రధారులుగా గుట్టుచప్పుడు కాకుండా కథ ముగించారు. కీలక అంశాలను విస్మరిస్తున్న సీబీఐ సున్నితమైన వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ ఆది నుంచీ దారి తప్పింది. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు...ఆయన లైంగిక అక్రమ సంబంధాలతో ఆయనపై కక్ష పెంచుకున్నవారు... వివేకాను సెటిల్మెంట్లకు వాడుకున్న స్నేహితులు, అనుచరులు...వివేకాను అడ్డుతొలగించుకుంటేనే రాజకీయంగా మనుగడ అని భావించిన చంద్రబాబు, ఆది నారాయణ రెడ్డి, బీటెక్ రవి... ఇలా ఈ కేసులో పచ్చ కుట్రను స్పష్టం చేస్తున్న అనేక కోణాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. కానీ సీబీఐ మాత్రం హంతకుడిని ఎవరో వ్యూహాత్మకంగా అప్రూవర్గా మారిస్తే... ఆ వాంగ్మూలం పట్టుకునే ఈ కేసు దర్యాప్తు గోదారిని ఈదేందుకు యత్నిస్తుండటం సీబీఐ తీరునే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. -
వివేకా హత్య కేసు.. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తప్పక పాటించాలి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: వివేకా హత్య కేసులో అరెస్టయిన భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సీబీఐ విచారణ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కస్టడీలో సీబీఐ సుప్రీం గైడ్లైన్స్ పాటించకపోవడంపై అభ్యంతరం తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తప్పకుండా పాటించాలని పేర్కొంది. విచారణ సమయంలో న్యాయవాది ఉండాలన్న హైకోర్టు.. వీడియో, ఆడియో రికార్డ్ చేయాలని ఆదేశించింది. భాస్కర్రెడ్డి అనారోగ్యం దృష్ట్యా వైద్య పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. ఇదిలా ఉంచితే, దస్తగిరిని అప్రూవర్గా పరిగణించడాన్ని భాస్కర్రెడ్డి సవాల్ చేయగా, దాని సంబంధించిన తదుపరి విచారణ జూన్ మూడో వారానికి వాయిదా పడింది. చదవండి: టీడీపీ నేత బండారం బట్టబయలు.. సింగర్తో సహజీవనం చేసి.. -
దస్తగిరితో డ్రామా! అప్రూవర్ వాంగ్మూలం ఉత్త కథే
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఎంత బోగస్ అనేది బట్టబయలైంది. ఆ చార్జ్షీట్ ఎంత కల్పితాల కట్టుకథో స్పష్టమైంది. వివేకాను హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్గా మార్చి ఇప్పించిన అవాస్తవ వాంగ్మూలం బండారం బహిర్గతమైంది. వాంగ్మూలంలో దస్తగిరి పేర్కొన్న బెంగళూరు భూ సెటిల్మెంట్ వ్యవహారం పూర్తిగా ఫేక్ అని సీబీఐ దర్యాప్తులోనే నిర్ధారణ కావడం గమనార్హం. వివేకాతో ఆయన స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డికి వివాదాలున్నాయని ఓ కట్టుకథను కేంద్ర బిందువుగా చేసుకుని దాన్ని వైఎస్ భాస్కర్రెడ్డి, అవినాశ్రెడ్డితో అంటగడుతూ దస్తగిరి ద్వారా సీబీఐ నడిపించిన డ్రామా గుట్టు వీడింది. కొత్త బృందం.. పాత పాటే! ‘బెంగళూరు భూసెటిల్మెంట్ వ్యవహారంలో ఎర్ర గంగిరెడ్డికి వాటా ఇవ్వకుండా వైఎస్ వివేకా ఎగ్గొట్టారు. దీంతో ఎర్ర గంగిరెడ్డి కక్ష పెంచుకుని వివేకాను హత్య చేయాలని నాతో చెప్పారు..!’ ఇదీ వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో కీలక అంశం. ‘వివేకాను హత్య చేసిన తరువాత ఆ ఇంట్లో భూమి పత్రాల కోసం ఎర్రగంగిరెడ్డి గాలించారు..’ అని కూడా అందులో పేర్కొన్నారు. 2019 మార్చి 14న అర్ధరాత్రి దాటిన తరువాత వైఎస్ వివేకాను హత్య చేశామని దస్తగిరి చెప్పినట్టు వాంగ్మూలంలో ఉంది. దస్తగిరిని ఢిల్లీకి తరలించి కొద్ది వారాలపాటు చిత్రహింసలు పెట్టి మరీ ఇప్పించిన ఈ వాంగ్మూలం మినహా సీబీఐ వద్ద ఎలాంటి ఆధారం లేదు. పాత బృందంతోపాటు తాజాగా నియమించిన సీబీఐ కొత్త బృందం కూడా ఈ ఒక్క వాంగ్మూలం ఆధారంగానే దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే ఆ వాంగ్మూలం కట్టుకథేనని స్పష్టమైంది. డాక్యుమెంట్లు ఫేక్... సెటిల్మెంట్ ఫేక్ బెంగళూరు యలహంక ప్రాంతంలోని 8.6 ఎకరాల భూమి విషయంపై వై.రాధాకృష్ణ మూర్తి, హిమాచలపతి అనే వ్యక్తుల మధ్య విభేదాలున్నాయి. ఈ విషయం తెలిసి వైఎస్ వివేకానందరెడ్డి తన స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డితోపాటు లక్ష్మీకర్, మరికొందరితోపాటు వై.రాధాకృష్ణమూర్తిని కలసి తాము ఆ వివాదాన్ని పరిష్కరిస్తామన్నారు. భూమి వివాదం పరిష్కరిస్తే రూ.8 కోట్లు ఇస్తానని రాధాకృష్ణమూర్తి చెప్పారు. యలహంక ఎమ్మెల్యేగా ఉన్న అప్పటి కర్ణాటక హోంమంత్రి ద్వారా ఆ భూ వివాదాన్ని పరిష్కరించేందుకు వైఎస్ వివేకా ప్రయత్నించారు. ఈ క్రమంలో హోంమంత్రి పోలీసు అధికారులను పిలిచి ఆ భూ వివాదంపై చర్చించడంతో రాధాకృష్ణమూర్తి ఇచ్చిన భూమి పత్రాలు ఫోర్జరీవని తేలింది. బెడిసికొట్టిన బ్యాంకు రుణం భూమి పత్రాలు ఫోర్జరీవని తెలిసినప్పటికీ వైఎస్ వివేకా వాటి ఆధారంగా సొమ్ము చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ పీటర్ క్యాండీని సంప్రదించారు. ఫోర్జరీ పత్రాలను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం ఇప్పించాలని కోరారు. బ్యాంకు రుణం వస్తే అందులో 60 శాతం వివేకా, రాధాకృష్ణమూర్తి పంచుకోగా మిగిలిన 40 శాతాన్ని బ్రోకర్ పీటర్ క్యాండీ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. లీగల్ ఖర్చుల కోసం పీటర్ క్యాండీకి మల్లిశెట్టి వెంకటరమణ అనే వ్యక్తి ద్వారా వైఎస్ వివేకా రూ.24 లక్షలు ఇప్పించారు. అయితే ఏడాది దాటినా రుణం ఇచ్చేందుకు ఏ బ్యాంకు కూడా సమ్మతించలేదు. దీంతో తాను ఇచ్చిన రూ.24 లక్షలు తిరిగి ఇవ్వాలని వివేకా, పీటర్ క్యాండీని మల్లిశెట్టి వెంకటరమణ ఒత్తిడి చేశారు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో 2019 ఫిబ్రవరి, మార్చిలో నాలుగు డిమాండ్ డ్రాఫ్ట్ల రూపంలో రూ.24 లక్షలు తిరిగి చెల్లించారు. చివరి డిమాండ్ డ్రాఫ్ట్ను 2019 మార్చి 12న అంటే వివేకా హత్యకు రెండు రోజుల ముందే చెల్లించారు. పీటర్ క్యాండీ తన వద్ద ఉన్న ఫోర్జరీ పత్రాలను సైతం రాధాకృష్ణమూర్తి కుమారుడు వెంకట ప్రసాద్కు తిరిగి ఇచ్చేశారు. ఇక ఆ భూమి సెటిల్మెంట్ చేయడం, బ్యాంకు రుణం తీసుకోవడం సాధ్యం కాదని తేలడంతో ఆ వ్యవహారాన్ని వదిలేశారు. ఈ సెటిల్మెంట్ చేసేందుకు యత్నించిన వైఎస్ వివేకా స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డికి మొత్తం వ్యవహారం తెలుసు. అంటే బెంగళూరు భూ సెటిల్మెంట్ అన్నదే లేదని, భూమి పత్రాలు సైతం వివేకా వద్ద లేవని ఎర్ర గంగిరెడ్డికి స్పష్టంగా తెలుసు. ఇదంతా సీబీఐ దర్యాప్తులోనే వెల్లడైంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న రాధాకృష్ణమూర్తి, హిమాచలపతి, వెంకట ప్రసాద్, పీటర్ క్యాండీలను సీబీఐ అధికారులు విచారించి మరీ దీన్ని నిర్ధారించుకున్నారు. జరగని సెటిల్మెంట్.. లేని పత్రాల కోసం హత్య ఏమిటి? అసలు బెంగళూరు భూసెటిల్మెంట్ అనేది జరగలేదని ఎర్ర గంగిరెడ్డికి తెలుసు. అటువంటప్పుడు వైఎస్ వివేకా తనకు వాటా ఇవ్వలేదని కక్ష ఎందుకు పెంచుకుంటారు? అంటే ఈ కారణంతో వివేకాను హత్య చేయాలని ఎర్ర గంగిరెడ్డి తనకు చెప్పినట్లు దస్తగిరి పేర్కొనడం పూర్తిగా అవాస్తవం అని తేటతెల్లమవుతోంది. వైఎస్ వివేకాను హత్య చేసిన తరువాత ఆయన ఇంట్లో బెంగళూరు భూమి పత్రాల కోసం ఎర్ర గంగిరెడ్డి, తాము గాలించినట్లు దస్తగిరి చెప్పాడు. కానీ ఆ భూమి పత్రాలను అప్పటికే రాధాకృష్ణమూర్తి కుమారుడికి తిరిగి ఇచ్చిన విషయం ఎర్ర గంగిరెడ్డికి తెలుసు. దీన్నిబట్టి దస్తగిరి చెప్పింది అవాస్తవమే అని స్పష్టమవుతోంది. ఇక బెంగళూరు భూ సెటిల్మెంట్ అన్నదే లేదని ఎర్ర గంగిరెడ్డికి తెలిసినప్పుడు ఆ కారణంతో వైఎస్ వివేకాను హత్య చేయమని చెప్పడంగానీ, తనకు అవినాశ్రెడ్డి, భాస్కర్రెడ్డి సహకారం ఉందనడం కూడా అవాస్తవం అని నిర్ధారణ అవుతోంది. అంటే అప్రూవర్ దస్తగిరి వాంగ్మూలం పేరిట సీబీఐ పూర్తిగా కల్పిత కథనాలను అల్లినట్లు తేలిపోతోంది. అసలు ఆ వాంగ్మూలమే అవాస్తవం అయినప్పుడు దాని ఆధారంగా భాస్కర్రెడ్డి, అవినాశ్రెడ్డిని విచారణ పేరిట సీబీఐ వేధించడం దురుద్దేశపూరితమేని స్పష్టమవుతోంది. -
తూటాలతో తక్షణ న్యాయం?
కంటికి కన్ను... పంటికి పన్ను లాంటి డైలాగులు, వెంటాడి వేటాడడాలు తెరపై చూస్తాం. నిజ జీవితంలో పదులకొద్దీ సాయుధ పోలీసుల కళ్ళెదుట, టీవీ కెమెరాల ముంగిట అలా జరగడం ఒళ్ళు జల దరించే అనుభవం. రాజకీయాల్లోకొచ్చిన నేరసామ్రాజ్యనేత అతీక్ అహ్మద్, ఆయన తమ్ముడు ఖాలిద్ అజీమ్ అలియాస్ అష్రాఫ్లు యూపీలో పోలీస్ కస్టడీలో ఉండగా, మీడియా ముసుగులో వచ్చి ముగ్గురు కుర్రాళ్ళు చంపిన తీరు అలాంటిదే. హత్యలు, అపహరణలకు పాల్పడి నూటికిపైగా కేసులున్న నేరగాడిగా పేరుమోసిన అతీక్ జీవితంలో హింసను నమ్మి, చివరకు హింసలోనే చనిపోవడం కవితాత్మక న్యాయంగా కనిపించవచ్చు. కానీ కరడుగట్టిన నేరస్థుణ్ణి సైతం చట్టబద్ధంగా విచారించి కోర్ట్లో కఠినశిక్ష విధించాలి. తక్షణశిక్షలతో సత్వరన్యాయం జరపాలనిచూస్తే అన్యాయమే. ‘మాఫియా కో మిట్టీ మే మిలా దూంగా’ (మాఫియాను మట్టిలో కలిపేస్తాను) అని అసెంబ్లీ సాక్షిగా గర్జించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ నెలలోనే కనీసం 3 ఎన్కౌంటర్లకు మౌనసాక్షి. విషాదం ఏమిటంటే, ఈ సర్కారీ ప్రేరేపిత హింసను పౌర సమాజం సైతం అభ్యంతర పెట్టకుండా, ఆమోదిస్తూ ఉండడం. పరారీలో ఉన్న అతీక్ కుమారుడు ‘ఆత్మరక్షణకు పోలీసుల ఎదురుకాల్పుల్లో’ గురువారం ఝాన్సీలో చనిపోతే, శనివారం రాత్రి ప్రయాగరాజ్లో పోలీసుల ఎదుటే కాల్పుల్లో అతీక్ ప్రాణాలు విడిచాడు. రాజకీయ ప్రత్యర్థి ఉమేశ్పాల్ హత్యలో తండ్రీ కొడుకులిద్దరూ నింది తులు. అతీక్ హత్యపై రిటైర్డ్ జడ్జీ సారథ్యంలో కమిషన్ వేశారు యోగి. తీరా మంత్రులే ఈ మర ణాలు ‘కర్మ ఫలిత’మనీ, ‘దేవుడి న్యాయ’మనీ వ్యాఖ్యానిస్తుంటే ఇక విచారణలో ఏం తేలుతుంది! అతీక్ను ఎవరో చంపారనీ, వ్యవస్థ ప్రమేయం లేదనీ నమ్మలేం. చట్టప్రకారం ఏప్రిల్ 13న కస్టడీకి కోర్టు అప్పగించిన వెంటనే వైద్యపరీక్షలు జరపాల్సిన పోలీసులు 15వ తేదీ రాత్రి దాకా ఎందుకు ఆలస్యం చేశారు? సాధారణ పరీక్షలకు అసాధారణంగా ఆ రాత్రివేళను ఎందుకు ఎంచు కున్నారు? సంకెళ్ళు వేయరాదని కోర్టు తీర్పులున్నా సరే ఎందుకు వేశారు? కాలిస్తే ఒకరికొకరు దూరం జరిగే వీలైనా లేకుండా హతులిద్దరికీ కలిపి ఒకే పొడవాటి సంకెల ఎందుకేశారు? ప్రాణహాని ఉన్న నేరస్థులని తెలిసినా బందోబస్తులో ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఆ సమయానికి వారు అక్కడికలా నడుచుకుంటూ వస్తారని కాల్పులు జరిపిన కుర్రాళ్ళకెలా తెలిసింది? ఘోర నేర చరిత్రలేమీ లేని వారి చేతికి ఆధునిక విదేశీ తుపాకీలెలా వచ్చాయి? ఇలా ఎన్నో ప్రశ్నలు. వెరసి, యూపీలో శాంతిభద్రతలకు టీవీ ప్రత్యక్షప్రసారాలకు చిక్కిన ఈ హత్యలే ప్రతీక. కస్టడీలోని వారికైనా కనీస భద్రత కల్పించలేని పోలీసు వ్యవస్థ ఘనతకు ఉదాహరణ. ఇంతకీ నకిలీ ఎన్కౌంటర్లు, సర్కారీ ప్రేరేపిత హత్యల ద్వారా యూపీ సర్కార్ ఏ సంకేతాలు పంపాలని చూస్తోంది? పట్టుమని 17 ఏళ్ళకే కేసులకెక్కి, 60 ఏళ్ళ వయసులో ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్న అతీక్ ఇన్నేళ్ళుగా రాజకీయపార్టీల్లో కొనసాగుతూ, ఇష్టారాజ్యంగా దంధా కొనసాగించడం 1990ల నుంచి మన రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థల పుణ్యమే. జైలుకెళ్ళినా చక్రం తిప్పిన అతీక్ను 2019లో గుజరాత్లో జైలుకు మార్చారు. ఇటీవలే యూపీకి పట్టుకొచ్చారు. తాజా ఘటనతో ఈ డాన్ కథ ముగిసింది. కానీ, చేసిన నేరాలూఘోరాలూ ఎన్నయినా, ఎంత పెద్దవైనా కావచ్చు. విచారణ లేకుండా తక్షణన్యాయమే పరిష్కారమనే ప్రభుత్వాల ధోరణి రాజ్యాంగ విహిత న్యాయసూత్రాలకే విరుద్ధం. సమదృష్టితో సాగాల్సిన వ్యవస్థలపై విశ్వాసానికి విఘాతం. యూపీలో యథేచ్ఛగా సాగుతున్న ఎన్కౌంటర్లపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం నాలుగేళ్ళ క్రితమే 2019 జనవరిలో ఆందోళన వ్యక్తం చేసింది. 2017 మార్చిలో యోగి సర్కార్ ఏర్పాటైనప్పటి నుంచి అలాంటి 15 కేసుల పూర్తి సమాచారాన్ని అప్పట్లోనే భారత ప్రభుత్వానికి పంపింది. ఆ కేసుల్లో బాధితులందరూ నిరుపేద మైనారిటీలే. తాజా డేటా ప్రకారం గత ఆరేళ్ళ యోగి పాలనలో 10,900కు పైగా పోలీస్ ఎన్కౌంటర్లు జరిగాయి. నిందితులు 183 మంది పోలీసు తూటాలకు ప్రాణాలు కోల్పోయారు. నిజానికి, నకిలీ ఎన్కౌంటర్లపై ఆందోళనతో జాతీయ మానవ హక్కుల సంఘం ఎప్పుడో మార్గదర్శకాలిచ్చింది. కానీ గద్దె మీది పెద్దలు తలుచు కున్నప్పుడల్లా అవి గాలికి పోతున్నాయి. వెరసి నేర న్యాయవ్యవస్థ కుప్పకూలి, పోలీస్, న్యాయ వ్యవస్థల్లో సంస్కరణలు అవసరమని గుర్తు చేస్తున్నాయి. ఇక, గత నవంబర్లో అమృత్సర్లో ఓ హిందూ రాజకీయ నేత ఇలాగే మీడియా ముందు కాల్పులకు గురై చనిపోయినప్పుడు సోకాల్డ్ మేధావులు ఇంత రచ్చ చేయలేదేమిటన్నది ఓ వాదన. జరిగిన దారుణాన్ని బట్టి కాక, మతాన్ని బట్టి గగ్గోలు పెడుతున్నారనీ వారి ఆరోపణ. చిత్రంగా మారణకాండలో సైతం మతం చొచ్చుకొచ్చిన రోజులివి. అతీక్ కుమారుడు ఎన్కౌంటరైనప్పుడు అధికార పార్టీ యువజన విభాగం టపాసులు కాల్చి, సంబరాలు చేసుకుంది. అది ఆందోళన రేపే ధోరణి. అది మరవక ముందే ప్రాణహాని ఉందంటూ అతీక్ సుప్రీం కోర్ట్లో భయపడినట్టే జరిగింది. అంతకన్నా భయపడాల్సిందేమిటంటే – హతులు ముస్లిమ్లైనప్పుడల్లా హంతకులు జైశ్రీరామ్ నినాదాలు చేయడం. ప్రజలను వర్గాలుగా చీల్చే ఈ ప్రయత్నాలు, దేవుడి పేరు అడ్డంపెట్టి దారుణా లకు ఒడిగట్టే తీరు సమాజానికి క్యాన్సర్ కన్నా ప్రమాదకరం. ఏ వర్గం ఇలాంటి దుశ్చర్యలకు దిగినా గర్హనీయమే. ‘డబుల్ ఇంజన్’, ‘బుల్డోజర్’ లాంటి మాటలతో మళ్ళీ కేంద్రంలో గద్దెనెక్కదలచిన పార్టీలూ, కాబోయే ప్రధానిగా ప్రచారమవుతున్న యూపీ నేతలూ అది గమనించాలి. -
డిగ్రీ విద్యార్థిని అనూష హత్య కేసు.. ప్రేమోన్మాదికి జీవితఖైదు
నరసరావుపేట టౌన్: తన ప్రేమను నిరాకరించిందని యువతిని దారుణంగా హత్య చేసిన ప్రేమోన్మాదికి జీవితఖైదు, రూ.2,500 జరిమానా విధిస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఒంగోలు వెంకటనాగేశ్వరరావు గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన కోటా అనూష నరసరావుపేట రామిరెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదివేది. అదే కళాశాలలో చదువుతున్న బొల్లాపల్లి మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన మేడం విష్ణువర్ధన్రెడ్డి తనను ప్రేమించాలని అనూషను వేధింపులకు గురిచేశాడు. ఆమె నిరాకరించడంతో 2021, ఫిబ్రవరి 24న కళాశాలకు వెళుతున్న అనూషను మాట్లాడాలని విష్ణువర్ధన్రెడ్డి బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని పట్టణ శివారులోని పాలపాడు రోడ్డు గోవిందపురం మైనర్ కాలువ వద్దకు తీసుకువెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేసి పరారయ్యాడు. మృతురాలి తల్లి వనజాక్షి ఫిర్యాదు మేరకు నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవడంతోపాటు రూ.10 లక్షల పరిహారం అందించింది. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును పల్నాడు జిల్లా దిశ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. ప్రత్యేక విచారణ అధికారిగా డీఎస్పీ రవిచంద్రను నియమించారు. హత్యపై సమగ్ర వివరాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేసి సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. దీంతో విచారణ చేసిన న్యాయమూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడికి జీవతఖైదు, రూ.2,500 జరిమానా విధించారు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా కృషి చేసిన పోలీసులను ఎస్పీ రవిశంకర్రెడ్డి అ«భినందించారు. దిశ డీఎస్పీ రవిచంద్రను అనూష తల్లిదండ్రులు సన్మానించారు. పోలీసుల సహకారంతోనే త్వరగా శిక్ష ప్రేమించలేదన్న అక్కసుతో మా అమ్మాయిని దుండగుడు విష్ణువర్ధన్రెడ్డి కిరాతకంగా గొంతునులిమి హత్య చేశాడు. పోలీసుల సహకారంతో త్వరితగతిన నిందితుడికి శిక్ష పడింది. ప్రభుత్వం, పోలీసులు మా కేసు పట్ల చూపించిన శ్రద్ధ మరువలేం. నిందితుడికి యావజ్జీవ శిక్ష పడినప్పటికీ... ఉరిశిక్ష వేసి ఉంటే బాగుండేది. – కోటా వనజాక్షి, అనూష తల్లి ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టాం. నిందితుడ్ని 24 గంటల్లో అరెస్ట్ చేసి 48 గంటల వ్యవధిలో ప్రాథమిక చార్జిషీట్, వారం రోజుల్లో సమగ్ర విచారణ జరిపి తుది చార్జిషీట్ను దాఖలు చేశాం. దిశ ద్వారా సత్వర న్యాయం అందుతుందన్న భావన ఈ కేసుతో రుజువైంది. – రవిచంద్ర, దిశ డీఎస్పీ, నరసరావుపేట -
వైఎస్ వివేకా హత్య కేసుపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: వివేకా హత్య కేసుకు సంబంధించి ఈరోజు(సోమవారం) తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వైఎస్ భాస్కర్రెడ్డి, వివేకా పీఏ కృష్ణార్డెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది హైకోర్టు. దీనిలో భాగంగా వివేకా హత్య కేసులో బెయిల్పై బయట ఉన్న దస్తగిర పాత్ర కీలకమని, అతని బెయిల్ రద్దు చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రకాశ్రెడ్డి.. హైకోర్టును కోరారు. అప్రూవర్ దస్తగిరి స్టేట్మెంట్ను మాత్రమే పరిగణలోకి తీసుకుని సీబీఐ దర్యాప్తు చేపట్టిందని, ప్రత్యక్ష సాక్షి రంగన్న స్టేట్మెంట్ను మాత్రం పరిగణలోకి తీసుకోలేదని న్యాయవాది ప్రకాశ్రెడ్డి కోర్టుకు తెలియజేశారు. కనీసం సీసీ ఫుటేజ్ను కూడా సీబీఐ పరిశీలించలేదని హైకోర్టుకు తెలిపారు. దీనిపై రేపు(మంగళవారం) హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. -
అప్రూవర్గా దస్తగిరి చట్టవిరుద్ధం.. హైకోర్టులో వివేకా పీఏ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ‘మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని తామే హత్య చేశామని ఒప్పుకున్న నిందితుడు (ఏ–4) దస్తగిరిని అప్రూవర్గా పేర్కొంటూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం చట్టవిరుద్ధం. ఆ ఉత్తర్వులను కొట్టివేయాలి’ అని వివేకా వ్యక్తిగత కార్యదర్శి, ఏపీలోని వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎంవీ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్వయంగా హత్యలో పాల్గొన్న దస్తగిరికి బెయిల్ ఇవ్వడం కూడా సరికాదన్నారు. ‘దస్తగిరి విషయంలో వివేకా కుమార్తె సునీత వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉంది. అతనికి బెయిల్ ఇవ్వడం, అప్రూవర్గా మార్చడంపై ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ అంశాన్ని ఏ కోర్టులోనూ సవాల్ చేయడం లేదు. ప్రశ్నించడం లేదు. అతన్ని కాపాడేందుకు ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం కావడం లేదు. వివేకాను హత్య చేయడానికి నగదు తీసుకున్నానని, చంపడం కోసం గొడ్డలి కూడా కొనుగోలు చేశానని అతను ఒప్పుకున్నాడు. అలాంటి హంతకుడైన దస్తగిరిని క్షమించడం చట్టవిరుద్ధం. వివేకాతో అతనే బలవంతంగా లేఖ రాయించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. తద్వారా డ్రైవర్ను ఇరికించాలని పథకం వేశాడు’ అని పిటిషన్లో పేర్కొన్నారు. ‘షమీమ్ అనే ముస్లిం మహిళను వివేకా వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఆ కోపంతో సునీత.. వివేకాను దూరం పెట్టారు. వివేకా మృతి చెందే వరకు ఆమె మాట్లాడ లేదు’ అని కృష్ణారెడ్డి తెలిపారు. వివేకా తన ఆస్తులను కుమారుడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారని, బెంగళూరులోని ఓ భూమి సెటిల్మెంట్లో వచ్చే రూ.8 కోట్లను షమీమ్, కుమారుడికి ఇవ్వాలని భావించారని చెప్పారు. ‘ఇదంతా సునీతకు, అల్లుడు రాజశేఖర్రెడ్డికి తెలుసు. వివేకాను కట్టడి చేయాలని వారు ప్రయత్నించారు. అయినా వివేకా వినక పోవడంతో ఆస్తులను కాపాడుకునేందుకు దస్తగిరి, ఇతర నిందితులకు వారే డబ్బిచ్చి ఉండవచ్చు. చాలా కాలంగా నేను వివేకా వద్ద పనిచేస్తున్నా. వారి కుటుంబ వివాదాలు బాగా తెలుసు. వివేకాను హత్యచేయాల్సిన అవసరం ఆయన కుటుంబ సభ్యులకే ఎక్కువగా ఉంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని దస్తగిరి అప్రూవర్ ఉత్తర్వులను కొట్టివేయాలి’ అని కృష్ణారెడ్డి పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిన్ కె.సురేందర్ గురువారం విచారణ చేపట్టారు. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. కాగా, ఈ పిటిషన్లో కూడా సునీత ఇంప్లీడ్ అయ్యారు. -
కన్నీరు పెట్టిస్తున్న ఘటన.. ‘మాయమైపోతున్నడమ్మా’
రాయవరం(కోనసీమ జిల్లా): ‘‘మాయమైపోతున్నడమ్మా...మనిషన్న వాడు...మచ్చుకైనా లేదు చూడు మానవత్వం ఉన్నవాడు’’.. అంటూ తెలంగాణ ప్రజాకవి అందెశ్రీ రాసిన గేయం రాయవరం మండలం మాచవరం సమీపంలో జరిగిన హత్యోదంతాన్ని గుర్తుకు తెస్తోంది. గత నెల 24న కొవ్వూరి సత్యవేణి (54) హత్యకు గురైన విషయం విదితమే. మాచవరం శివారు దేవుడు కాలనీకి చెందిన ఇద్దరు అవివాహిత సోదరులు ఆమెపై తొలుత అత్యాచారం చేసి, ఆనక హత్య చేశారు. ఈ ఘటన హతురాలి కుటుంబాన్నే కాదు హత్యకు పాల్పడిన వారి కుటుంబాన్ని కూడా చిన్నాభిన్నం చేసింది. గతంలో దేవుడు కాలనీకే చెందిన అన్నదమ్ములు నల్లమిల్లి ఉమామహేశ్వరరెడ్డి, నల్లమిల్లి వెంకట సత్యనారాయణరెడ్డిలు సత్యవేణిపై అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని ఆమె బయట పెట్టడంతో అన్నదమ్ములు ఆమెపై కక్ష పెంచుకుని, ఈ దురాఘతానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఆ సోదరుల తల్లి నల్లమిల్లి పద్మ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల విచారణలో వాస్తవాలు బయట పడడంతో అన్నదమ్ములు కటకటాల పాలయ్యారు. దాంతో వారి కుటుంబం రోడ్డున పడింది. హతురాలి కుమారుడి మూగ వే(రో)దన.. హతురాలు సత్యవేణి భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఇరువురు కుమారులు. పెద్ద కుమారుడు కిరణ్కుమార్రెడ్డి దుబాయ్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. మూగ, చెవిటి వాడైన చిన్న కుమారుడు ఉమామహేశ్వరరెడ్డిని తల్లి సత్యవేణి కంటికిరెప్పలా కాపాడుకుంటోంది. తల్లి సత్యవేణి హత్యకు గురైన విషయం ఉమామహేశ్వరరెడ్డికి తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. 15 రోజులుగా తల్లి కనిపించకపోవడంతో అతడు ఆహారం తీసుకోవడం లేదు. అమ్మ వస్తుందని చెప్పినా వినకుండా ఒంటరిగా గదిలోనే గడుపుతున్నాడు. ఉమామహేశ్వరరెడ్డిని ఎలా ఊరడించాలో తెలియక తాతయ్య ద్వారంపూడి గంగరాజు మదనపడుతున్నాడు. చదవండి: ‘నాన్న.. అమ్మను కొట్టకు బాగా చూసుకో.. నేనింక బ్రతకను..’ కఠినంగా శిక్షించాలి కొవ్వూరు సత్యవేణిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పీడీఎస్యూ పూర్వపు జిల్లా అధ్యక్షుడు బి.సిద్ధు డిమాండ్ చేశారు. మానవత్వం మరచి అత్యాచారం చేసి మహిళలను హతమార్చిన నిందితులను దిశ చట్టం ప్రకారం ప్రభుత్వం 21 రోజుల్లో శిక్షించాలని అన్నారు. కొవ్వూరి సత్యవేణి కుటుంబసభ్యులను సిద్ధు పరామర్శించారు. -
వివేకాది ఆస్తి కోసం జరిగిన హత్య: ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : వైఎస్ వివేకానందరెడ్డిది మర్డర్ ఫర్ గెయిన్ (ఆస్తి, సొమ్ము కోసం జరిగిన హత్య) అని కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి స్పష్టం చేశారు. సీబీఐ విచారణ తప్పుదోవలో వెళ్తోందని తాను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నానని, అది గూగుల్ టేకౌట్ కాదు టీడీపీ టేకౌట్ అని అన్నారు. తప్పుడు సాక్ష్యాలతో అన్యాయంగా అమాయకులను ఇరికించేలా కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దర్యాప్తులో చాలా కీలక అంశాలను పక్కన పెట్టి, సిల్లీ అంశాలను తెరపైకి తెచ్చి తనకు అంటగట్టే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. సీబీఐ విచారణకు మూడోసారి శుక్రవారం హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. వివేకాకు రెండో పెళ్లి.. వారికి ఓ కుమారుడు.. ♦ వివేకం సార్కు 2006 నుంచి ఒక యువతితో సంబంధం ఉంది. 2011లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. దానికి ఇస్లాం లా ప్రకారం తన పేరు షేక్ మహ్మద్ అక్బర్గా మార్చుకున్నారు. పెళ్లి తర్వాత వారికి షేక్ షెహన్షా అనే అబ్బాయి కూడా పుట్టాడు. ఆ అబ్బాయినే వారసుడిగా ప్రకటించాలనే తపన, ఆలోచన ఆయనలో ఉండింది. ♦ హత్య జరగడానికి ముందు ఇల్లంతా డాక్యుమెంట్ల కోసం వెతికారని అప్రూవర్ స్టేట్మెంట్లోనే ఉంది. హత్య తర్వాత కూడా డాక్యుమెంట్లు వెరిఫై చేసుకుని వెళ్లారని చెప్పారు. నా అనుమానం ఏమిటంటే.. నోటరైజ్డ్ విల్లు అది. ఆమె (వివేకా రెండో భార్య) పేరుతోనో, వారి అబ్బాయి పేరుతోనో ఆస్తిని ఇవ్వాలనుకోవడం.. దీన్ని అడ్డుకోవాలనుకోవడం.. ఇందులో ఆసక్తి ఎవరికి ఉందో తెలియాలి. ♦ నా అనుమానం ప్రకారం ఇది మర్డర్ ఫర్ గెయిన్. అందులో భాగంగానే వాళ్లు వివేకానంద రెడ్డి గారిని ఇలా చేశారు. రాబోయే రోజుల్లోనూ న్యాయ పోరాటం చేస్తా. ఆ లేఖ ఎందుకు దాచారు? ♦ నేను గాలి మాటలు మాట్లాడట్లేదు. సొంత కవిత్వాలు చెప్పట్లేదు. రికార్డుల్లో ఉన్నవి, వాటి ద్వారా తెలిసినవే మాట్లాడుతున్నా. నేను వెళ్లే లోపలే సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న లేఖను సునీతమ్మ భర్త రాజశేఖర్ దాచి పెట్టారు. పీఏ కృష్ణారెడ్డికి ఆ లెటర్ విషయం కానీ, అందులో ఉన్న అంశాలు కానీ ఎవరికీ చెప్పద్దని చెప్పారు. దీంతో పాటు సెల్ఫోన్ను దాచిపెట్టడం తప్పు కాదా? ♦ నన్ను వెళ్లమని చెప్తేనే అక్కడకు వెళ్లాను. లెటర్ ఉన్న విషయం నాకు కూడా చెప్పలేదు. ఆ లెటర్ చాలా కీలక ఆధారం. సరైన సమయానికి దాని విషయం బయటకు చెప్పకపోవడం ఈ కేసులో పెద్ద తప్పు. ♦ నేను ఏ ఒక్కరికీ గుండెపోటని (వివేకా మరణానికి కారణం) చెప్పలేదు. కావాలంటే ఆ రోజు మార్చురీ దగ్గర, మార్చ్ 17న మాట్లాడిన మాటలు చూడండి. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం నేను అలా చెప్పినట్లు చిత్రీకరించింది. ♦ నేను చూసి బయటకు వచ్చి పోలీసులు, కుటుంబీకులు, దగ్గర బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పా. ఇవన్నీ చేయకుంటే తప్పంటారనుకున్నా. చేస్తే తప్పంటారని ఊహించలేదు. ముమ్మాటికీ అది కట్టుకథే ♦ అప్రూవర్ థీయరీనే ఓ కట్టుకథ. ప్రారంభంలోనే గొడవ ప్రస్తావన. రూ.8 కోట్ల డబ్బు రావాల్సి ఉందో, వచ్చిందో వాటి గురించి గొడవ మొదలైందని చెప్తారు. ఆ షేర్ల పంపకం మీద వివేకం సారేమో మొత్తం నాకే కావాలని అన్నట్లు, వీళ్లేమో నువ్వు సగం తీసుకో, నేను సగం తీసుకుంటా అన్నట్లు గొడవ మొదలై ఉండొచ్చంటారు. ♦ ఇదే సీబీఐ విచారణలో ఆ బెంగళూరు సెటిల్మెంట్కు సంబంధించి ఎనిమిది మంది సాక్షులు (ఎల్డబ్ల్యూ 10 నుంచి మొదలై) చాలా స్పష్టంగా చెప్పారు. ఆ సెటిల్మెంట్ ఫెయిల్ అయింది.. ఒక్క రూపాయి డబ్బు కూడా వచ్చే అవకాశం లేదు.. ఆ డాక్యుమెంట్లు అన్నీ ఫోర్జరీ అని చెప్తారు. అంటే రాని, వచ్చే అవకాశమే లేని డబ్బు కోసం ఎవరైనా గొడవ పెట్టుకుని కొట్టి చంపుకుంటారా? ఇది కట్టు కథ అనడానికి ఇది చాలదా? ఇది కుమ్మక్కు కాదా? ♦ సుప్రీంకోర్టులో మా సోదరి (సునీత) వైల్డ్ అలిగేషన్స్తో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను సమర్థిస్తూ సీబీఐ వాళ్లు కౌంటర్ అఫిడవిట్ వేస్తారు. గురువారం లంచ్ మోషన్ మూవ్ చేస్తూ రెస్పాండెంట్స్గా సీబీఐ డైరెక్టర్, దర్యాప్తు అధికారిని పెట్టాం. మధ్యాహ్నం 2 గంటల కల్లా సీబీఐ వారి కంటే ముందు మా సోదరి తరఫు అడ్వకేట్లు వచ్చారు. అంటే వారికి ఎవరు సమాచారం ఇచ్చారు? ♦ సీబీఐ వాళ్లకు నోటీసు వచ్చిన వెంటనే చిటికలో సమాచారం ఇస్తున్నారు. ఆ రోజు సుప్రీంకోర్టులో కుమ్మక్కై పిటిషనర్కు అనుకూలంగా కౌంటర్ వేసి కోర్టులను తప్పుదోవ పట్టించారు. లంచ్ మోషన్లోనూ ఆమెకు సమాచారం ఇచ్చి ఇంప్లీడ్ చేయిస్తున్నారు. ఇది కుమ్మక్కు కాదా? దీని వెనుక పెద్ద కుట్రలు ఉన్నాయి. ఈ రాజకీయ కుట్రలను తప్పకుండా చేదిస్తాం. న్యాయ పోరాటం చేస్తాం. కంచే చేను మేస్తే.. సీబీఐ ఈ రకంగా కుమ్మక్కై విచారణ చేస్తే మాకు ఎవరు దిక్కు?. అందుకే నోరు విప్పాల్సి వస్తోంది.. ♦ కేవలం కుట్రలకు ఉపయోగపడే వాంగ్మూలాలు తప్ప నిజాలను వెల్లడించే వాంగ్మూలాలు తీసుకోవట్లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను సరిగ్గా మద్దతు ఇవ్వలేదని ప్రచారం చేశారు. అభియోగాలు మోపారు. దాదాపు 800 పైచిలుకు ఎమ్మెల్సీ ఓటర్లు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు ఉన్నారు. వారిని పిలిచి అడగండి. అదీ చేయరు. అప్రూవర్ థియరీ.. కట్టుకథను అడ్డం పెట్టుకుని విచారణను ఓ వ్యక్తి టార్గెట్గా ముందుకు తీసుకువెళ్తున్నారు. ♦ దీన్ని ఎవరూ హర్షించరు. దీంతో గళమెత్తడం మొదలుపెట్టాం. ఇప్పటి వరకు ఎన్ని విమర్శలు వచ్చినా, మీడియా ఎన్ని విమర్శలు చేసినా, మా సోదరి సునీతమ్మ సుప్రీంకోర్టులో, ఆంధ్ర హైకోర్టులో నాపై ఎన్ని ఆరోపణలు చేసినా మౌనంగానే ఉన్నా. ఎందుకంటే వివేకం సార్ చనిపోయారు.. ఈమె ఆయన కూతురు అని.. విచారణ జరుగుతున్నప్పుడు విచారణ సంస్థపై నమ్మకం ఉండాలని మౌనంగా ఉన్నాను. అయితే విచారణ తప్పుడుదోవలో వెళ్తోందని స్పష్టం కావడంతో నోరు విప్పుతున్నాను. నేను ఎటువంటి తప్పు చేయలేదని ప్రతి ఒక్కరికీ గట్టిగా చెబుతున్నా. చదవండి: వివేకా హత్య కేసులో ఈ విషయాలు ఎందుకు పరిశీలించలేదు? తప్పుదోవలో విచారణ ♦ ఉదయం 10.40–10.45 గంటల మధ్య ఇక్కడికి వచ్చాను. 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విచారించారు. ఆ తర్వాత కోర్టు నుంచి పిలుపు వచ్చిందని దర్యాప్తు అధికారి వెళ్లారు. అయినప్పటికీ 3.30 గంటల వరకు అక్కడే కూర్చోమన్నారు. ఆపై సీబీఐ వాళ్లు వచ్చి మీరు వెళ్లండి.. మళ్లీ మేము పిలిచినప్పుడు రండని చెప్పారు. ♦ విచారణ మొత్తం ఆడియో, వీడియో రికార్డింగ్ కావాలని దర్యాప్తు అధికారిని మొదటి నుంచీ అడుగుతూనే ఉన్నాం. రెండోసారి ఇదే అంశాన్ని సీబీఐ డైరెక్టర్నే అడిగాం. ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో మూడోసారి హైకోర్టును ఆశ్రయించాం. విచారణ తప్పుదోవలో వెళ్తుండటంతో ఇలా చేయక తప్పలేదు. ♦ ఎంపీ టిక్కెట్టే ఈ హత్యకు కారణం అంటే మా జిల్లా వాళ్లు నవ్వుతారు. వివేకం సర్ చనిపోయే రోజు కూడా మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు మండలంలో దాదాపు 300 ఇళ్లు డోర్ టు డోర్ ప్రచారం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామిరెడ్డికి.. ఎంపీ అభ్యర్థిగా అవినాశ్కు ఓటెయ్యండని ప్రచారం చేశారు. కావాలంటే ఆ ఇళ్లకు వెళ్లి అడగచ్చు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని అడగచ్చు.. వాంగ్మూలం తీసుకోవచ్చు. కానీ వీళ్లు (సీబీఐ) అలా అడగరు. వాంగ్మూలం తీసుకోరు. -
వివేకా హత్య కేసులో ఈ విషయాలు ఎందుకు పరిశీలించలేదు?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కొన్ని కీలక అంశాలు విస్మరిస్తున్నారని చాలా రోజులుగా ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి ఓ కేసు కూడా నమోదయింది. గత ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల న్యాయస్థానంలో దేవిరెడ్డి శివశంకర్రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై స్పందించిన న్యాయస్థానం ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసింది. ఇన్నాళ్లూ సీబీఐ కప్పిపుచ్చేందుకు యత్నించిన కొన్ని కీలక వాస్తవాలు న్యాయస్థానంతో పాటు ప్రజల దృష్టికి వచ్చాయి. ఆ వివరాలు, సమాధానాలు లేని ప్రశ్నలు ఓ సారి చూద్దాం. 1. లేఖ విషయం ఎందుకు దాచి పెట్టారు? మార్చి 15, 2019న వివేకానందరెడ్డి హత్యకేసు వెలుగులోకి వచ్చింది. వివేకానందరెడ్డి చనిపోయిన విషయాన్ని పీఏ కృష్ణారెడ్డి మొదట ఆయన కుటుంబ సభ్యులకే తెలిపారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం, ఆ ప్రదేశాన్ని వివేకా అనుచరుడు ఇనయతుల్లా తన సెల్ఫోన్ ద్వారా ఫొటోలు, వీడియోలు తీసి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డిలకు వాట్సాప్ చేశారు. వాటిని చూసిన తర్వాత కూడా శివప్రకాశ్రెడ్డి.. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి తనకు ఫోన్ చేస్తే వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు కూడా. ఇక్కడ అత్యంత కీలకమైన అంశం వివేకా స్వదస్తూరితో రాసిన లేఖ, ఆయన వాడుతున్న సెల్ఫోన్. వీటి విషయంలో సొంత కుటుంబ సభ్యులు పాటించిన గోప్యత అనుమానస్పదంగా ఉంది. వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ, సెల్ఫోన్ను తాము వచ్చే వరకు పోలీసులకు అప్పగించవద్దని పీఏ కృష్ణారెడ్డికి రాజశేఖరరెడ్డి ఆదేశించారు. వారు పులివెందుల చేరుకున్న తర్వాత సెల్ఫోన్లోని మెసేజ్లు, ఇతర వివరాలను డిలీట్ చేసిన తర్వాతే వాటిని పోలీసులకు అప్పగించారని అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని దేవిరెడ్డి శివశంకర్రెడ్డి భార్య తులసమ్మ కూడా కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వం ఆశిస్తున్న అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావమరిది శివ ప్రకాశ్రెడ్డి ఆయనపై కక్ష పెంచుకుని హత్యకు కుట్రపన్ని ఉండొచ్చు. వివేకా హత్య అనంతరం ఆయన కుటుంబ సభ్యుల పాత్ర సందేహాస్పదంగా ఉందని ఆమె కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. 2. హత్యకు, వివేకానందరెడ్డి రెండో పెళ్లి, కుటుంబానికి ఉన్న లింకేంటీ? షమీమ్ అనే మహిళను కొన్నాళ్ల కింద వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారు. ఇది కుటుంబ సభ్యులకు ఏ మాత్రం నచ్చలేదు. ముఖ్యంగా ఈ పెళ్లి కారణంగా వివేకానందరెడ్డికి, ఆయన కుమార్తె, అల్లుడు, పెద్దబావమరిదితో బాగా అంతరం పెరిగినట్టు పులివెందులలో చెబుతారు. ఇదే విషయాన్ని కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో శివశంకర్రెడ్డి భార్య తులసమ్మ పేర్కొన్నారు. ‘వైఎస్ వివేకానందరెడ్డి షమీమ్ అనే మహిళను రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలే ఈ హత్యకు దారి తీశాయి. బెంగళూరులో భూ సెటిల్మెంట్ ద్వారా వచ్చే రూ.4 కోట్లను తన రెండో భార్య షమీమ్కు ఇస్తాననడంతోపాటు ఆమె ద్వారా తనకు కలిగిన కుమారుడిని తన వారసుడిగా ప్రకటిస్తానని వివేకానందరెడ్డి చెప్పారు. ఇది మొదటి భార్య, కుటుంబానికి నచ్చలేదు.‘ రెండు కుటుంబాల మధ్య తలెత్తిన ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలే ఈ హత్యకు కారణమని ఈ కేసులో అరెస్టయిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల మెజిస్ట్రేట్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. 3. వివేకాకు ఉన్న వివాదాలేంటీ? వివేకానందరెడ్డికి ఆయన అనుచరుడిగా ఉన్న కొమ్మా పరమేశ్వరరెడ్డికి మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తాయి. దాంతో కక్ష పెంచుకున్న పరమేశ్వరరెడ్డి... వివేకా రాజకీయ ప్రత్యర్థి బీటెక్ రవికి సన్నిహితుడిగా మారారు. ఈ విషయాన్ని దేవిరెడ్డి శివశంకర్రెడ్డి భార్య తులసమ్మ కూడా కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ‘ వివేకా హత్యకు ముందు ఎలిబీ సృష్టించుకునేందుకు పరమేశ్వరరెడ్డి 2019 మార్చి 13న అనారోగ్యం నెపంతో కడపలోని సన్రైజ్ ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరారు. కానీ ఎవరికీ తెలియకుండా 2019 మార్చి 14 సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో హరిత హోటల్లో రెండుసార్లు సమావేశమయ్యాడు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం గమనార్హం. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్షకు అతను తిరస్కరించడం సందేహాలకు తావిస్తోందని‘ తులసమ్మ కోర్టుకు విన్నవించారు. అలాగే వైఎస్సార్ కడప జిల్లాకే చెందిన వైజీ రాజేశ్వరరెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో స్థిరపడ్డాడు. ఆయన రాజకీయ ప్రత్యర్థి నారాయణరెడ్డిని వైఎస్సార్సీపీలోకి తీసుకురావాలని వివేకా భావించడంతో కక్ష పెంచుకున్నాడని, వైఎస్ వివేకాపై అప్పటికే కక్షగట్టిన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్రెడ్డి హైదరాబాద్లో వైజీ రాజేశ్వరరెడ్డితో పలుమార్లు భేటీ అయ్యారని కూడా తులసమ్మ తెలిపారు. 2019 మార్చి 14న పులివెందులకు చెందిన నీరుగుట్టు ప్రసాద్ ఉద్దేశ పూర్వకంగానే వివేకా ఇంటికి ఉత్తరం వైపు తలుపు గడియ పెట్టకుండా వెళ్లిపోయారని, హంతకులు ఆ రోజు వివేకా ఇంటిలోకి ప్రవేశించి హత్య చేసేందుకు వీలుగా ఈ పని జరిగిందని ఆరోపించారు. సీబీఐ ఈ కేసు విషయంలో అనుసరిస్తున్న తీరుపట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యలో స్వయంగా పాల్గొన్న దస్తగిరిని అప్రూవర్గా మార్చడంతోపాటు అతని ముందస్తు బెయిల్ను వ్యతిరేకించక పోవడం సీబీఐ దురుద్దేశాలను వెల్లడిస్తోంది. ఈ హత్యలో అసలు కుట్రదారులుగా భావిస్తున్న నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్రెడ్డి, కొమ్మా పరమేశ్వరరెడ్డి, బీటెక్ రవి, వైజీ రాజేశ్వరరెడ్డి, నీరుగుట్టు ప్రసాద్లను సీబీఐ విచారించనే లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు -
వివేకా హత్య కేసు.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ అవినాష్రెడ్డిపై సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు విచారించిన ఆడియో, వీడియో రికార్డులను హార్డ్ డిస్క్ రూపంలో మంగళవారం కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, ఎంపీ అవినాష్రెడ్డి రిట్ పిటిషన్పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. గతంలో రెండు సార్లు విచారణలో ఆడియో, వీడియో రికార్డులు చేశారా అని హైకోర్టు.. సీబీఐని ప్రశ్నించింది. ఏ 4గా ఉన్న దస్తగిరి బెయిల్పై సీబీఐ అభ్యంతరం తెలపలేదని హైకోర్టుకు అవినాష్ తరఫు న్యాయవాది తెలిపారు. విచారణాధికారి పారదర్శకంగా వ్యవహరించడం లేదని అభియోగాలు ఉన్నాయన్న తెలంగాణ హైకోర్టు.. ఆడియో, వీడియో రికార్డులకు సంబంధించి ఏ విషయమైనా తెలపాలని సీబీఐకి కోర్టు సూచించింది. చదవండి: Political Fact Check: వివేకా హత్య కేసులో పుకార్లేంటీ? నిజాలేంటీ? -
తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు
-
విచారణ రికార్డ్ చేయాలని ఆదేశించండి: ఎంపీ అవినాశ్రెడ్డి పిటిషన్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తనను శుక్రవారం విచారణకు హాజరు కావాలనడంపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి గురువారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు తాను సహకరిస్తున్నప్పటికీ విచారణ అధికారి సరైన విధానాలు అనుసరించడం లేదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని హైకోర్టును కోరారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ‘నన్ను మొదటిసారి విచారించినప్పటి నుంచి సీబీఐ అధికారులు అడిగినవి, అడగనివి కూడా చిలువలు పలువులు చేస్తూ దుష్ప్రచారం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ముకాసే పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్ మీడియా వేదికలు ప్రజల్లో అపోహలు కలిగించేలా అవాస్తవాలను వ్యాప్తిలోకి తీసుకొచ్చాయి. ప్రజల్లో అపోహలు తొలగించేందుకే సీబీఐ విచారణను రికార్డు చేయాలని విచారణ అధికారిని లిఖితపూర్వకంగా కోరాను. రెండోసారి విచారణకు పిలిచినప్పుడు కూడా రికార్డు చేయాలని సీబీఐ డైరెక్టర్ను, విచారణ అధికారి రామ్సింగ్ను లిఖితపూర్వకంగా కోరాను. అయినా పట్టించుకోలేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించాను’ అని పిటిషన్లో పేర్కొన్నారు. నేడు విచారణ అవినాశ్ రెడ్డి పిటిషన్ను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ విజయ్సేన్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన కేసులు విచారించే బెంచ్కు పంపారు. ఈ పిటిషన్ను జస్టిస్. కె.లక్ష్మణ్ బెంచ్ శుక్రవారం విచారించనుంది. చదవండి: జగనన్న విద్యా కానుకపై ‘ఈనాడు’ ఏడుపు -
నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. ఏ2గా హరిహరకృష్ణ ప్రియురాలు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు హరిహర కృష్ణ ప్రియురాలు, స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య అనంతరం హరిహరకృష్ణకు ప్రియురాలు డబ్బులు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రియురాలు నిహారికారెడ్డిని ఏ2గా, స్నేహితుడు హసన్ను ఏ3గా పోలీసులు చేర్చారు. గత నెల 17న జరిగిన నవీన్ హత్య కేసు వివరాలను ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. ‘‘నవీన్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం. నవీన్ హత్య గురించి నిహారికకు తెలిసినా పోలీసులకు చెప్పలేదు. హసన్కు కూడా హత్య విషయం తెలుసు. నిహారికతో పాటు హసన్ను రిమాండ్కు తరలించాం’’ అని డీసీపీ వెల్లడించారు. ‘‘హత్య జరిగిన తర్వాత హరిహరకు నిహారిక రూ.1500 ట్రాన్స్ఫర్ చేసింది. నవీన్ను హత్య చేసిన తర్వాత ఘటనాస్థలికి హరిహర, నిహారిక, హసన్ ముగ్గురు వెళ్లారు. నిహారిక ఫోన్ డేటాను డిలీట్ చేసి, ఎవిడెన్స్ ట్యాంపరింగ్కు పాల్పడింది. నవీన్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది’’ అని డీసీపీ సాయిశ్రీ పేర్కొన్నారు. చదవండి: నవీన్ను ఎలా చంపావ్? హత్య కేసు సీన్ రీ కన్స్ట్రక్షన్ -
చెలరేగిన దొంగలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు నగరంలో మంగళవారం రాత్రి ఇద్దరు దొంగలు చెలరేగిపోయారు. రెండు గంటలపాటు స్కూటీపై నగరమంతా తిరుగుతూ కనపడిన వారిపై ఇనుప రాడ్తో దాడి చేశారు. ఇద్దరు వాచ్మెన్లను హత్య చేసి, పలువురిని గాయపరిచారు. సుమారు పది షాపుల షట్టర్లు పగులగొట్టారు. కొన్ని షాపుల షట్టర్లు తెరుచుకోలేదు. హంతకుల్ని పోలీసులు 12 గంటల్లోనే పట్టుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరూ మైనర్లే. పోలీసులు వారిద్దరినీ జువైనల్ హోమ్కు తరలిస్తున్నారు. రాత్రి రెండున్నర గంటల సమయంలో గుంటూరు నగరం అమరావతిరోడ్డులోని జ్వరాల ఆసుపత్రి ఎదురుగా మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న యమహా షోరూం వద్దకు స్కూటీపై ఇద్దరు మైనర్లు వచ్చారు. అందులో ఒకడు బండి వద్ద ఉండగా మరొకడు షోరూం వద్ద కుర్చీలో నిద్రపోతున్న కాపలాదారు కృపానిధి (66)పై ఇనుపరాడ్తో దాడి చేసి చంపేశాడు. అనంతరం షోరూం షట్టర్లు పగులగొట్టి లోపలికి వెళ్లారు. క్యాష్ కౌంటర్లో నగదు లేకపోవడంతో అక్కడ ఉన్న ఒక హెల్మెట్ను తీసుకుని మళ్లీ ద్విచక్ర వాహనంపై నగరంలోకి వచ్చారు. అరండల్పేట 11/1 రోడ్డులోని మీసేవ కేంద్రం షట్టర్ తెరిచే ప్రయత్నం చేశారు. అది తెరుచుకోకపోవడంతో పదో రోడ్డులోకి వెళ్లారు. అక్కడ ప్రభుత్వ వైన్మార్ట్ వద్ద ఉన్న వాచ్మెన్ బత్తుల సాంబశివరావు (63)పై దాడి చేసి చంపేశారు. అనంతరం వైన్మార్ట్ తలుపు తెరిచే ప్రయత్నం చేయగా అది తెరుచుకోలేదు. దీంతో చుట్టుపక్కల నాలుగు షాపుల్లో చోరీకి ప్రయత్నం చేశారు. ఒక సెల్ఫోన్ షాపులో రెండు ట్యాబ్లు, స్మార్ట్వాచ్లు దొంగతనం చేశారు. అలికిడికి పక్కనే ఉన్న స్వగృహా స్వీట్షాప్ వాచ్మెన్ బయటకు వచ్చి కేకలు పెట్టడంతో అతనిపై దాడి చేశారు. అతను తప్పించుకుని సమీపంలోని అరండల్పేట పోలీసు స్టేషన్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి పోలీసులకు విషయం చెప్పాడు. డ్యూటీలో ఉన్న సెంట్రీ రక్షక్ వాహనంలో వారిని వెంబడించినా తప్పించుకుపోయారు. అనంతరం అరండల్పేట రెండో లైన్లోనే కూర్చుని మద్యం సేవించిన దుండగులు అక్కడి నుంచి పాత గుంటూరు ఆంధ్రా బ్యాంకు వద్ద పేపర్లు కట్టలు కడుతున్న పత్రిక ఏజెంట్పై పేపర్ ధర ఎంత అని అడుగుతూనే రాడ్తో దాడి చేశారు. ఆయన సెల్ఫోన్ లాక్కుని పరారయ్యారు. అనంతరం సుద్దపల్లి డొంక సమీపంలోని పాలబూత్ యజమాని ఎండ్లూరి రవికుమార్ అలియాస్ ఏసుబాబుపై దాడి చేశారు. అతని నడుముకు గాయమైంది. అక్కడి నుంచి యాదవ హైస్కూల్ వద్ద మరో వ్యక్తిపై దాడి చేశారు. అనంతరం నందివెలుగు రోడ్డులోని శ్మశానాల రోడ్డులో రెండు ఆటో ఫైనాన్స్, రెండు స్టిక్కరింగ్, ఒక కూల్డ్రింక్ షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు. రెండు గంటల్లోనే నగరమంతా తిరుగుతూ విధ్వంసం సృష్టించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలాల్లో ఆనవాళ్లు సేకరించాయి. ఐజీ త్రివిక్రమ వర్మ, జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్, ఇతర అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితులను పట్టుకోవడానికి 8 బృందాలను రంగంలోకి దింపారు. సీసీ టీవీ ఫుటేజిల్లో నిందితుల్లో ఒకడు పాత నేరస్తుడేనని గుర్తించారు. వెంటనే అతని కుటుంబ సభ్యుల నుంచి సెల్ఫోన్ నంబర్ తీసుకొని, సిగ్నల్స్ ఆధారంగా అతడిని పట్టుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో రెండో నిందితుడిని కూడా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి చోరీ సొత్తు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరూ మైనర్లేనని పోలీసులు తెలిపారు. గంజాయి మత్తులో వారు ఈ విధంగా ప్రవర్తించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరినీ జువైనల్ హోంకు పంపుతున్నట్లు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. -
సత్ఫలితాలనిస్తున్న కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థ
సాక్షి, కాకినాడ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలతో ఏర్పాటు చేసిన కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థ సత్ఫలితాలను ఇస్తుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రేమించిన మహిళను దారి కాచి అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితుడికి కాకినాడ 3వ అదనపు సెషన్స్ జడ్జి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈ ఘటనపై దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన కేవలం 144 రోజులు, (నాలుగున్నర నెలలలోనే)విచారణ జరిపి శిక్ష విధించిన కోర్టు. మహిళల భద్రత విషయంలో నిరంతర అప్రమత్తతతో వ్యవహరిస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగం పనితీరుకు ఈ కేసు నిదర్శనం. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఇది చెంపపెట్టుగా నిలిచింది. అసలేం జరిగిందంటే.. తనను ప్రేమించకుండా దూరం పెడుతుందనే అక్కసుతో కాకినాడ కరప మండలం కూరాడ గ్రామానికి చెందిన కాదా దేవిక(21) అనే యువతిని వెంకట సూర్యనారాయణ అనే యువకుడు కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్యచేశాడు. గతేడాది అక్టోబర్ 8న పెదపూడి మండలం కాండ్రేగుల వద్ద ఈ ఘోరం జరిగింది. జరిగిన ఘటనపై మృతురాలి చిన్నాన్న గుత్తుల బాలాజి ఇచ్చిన ఫిర్యాదుపై పెదపూడి పోలీసు స్టేషన్లో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. 24 గంటల్లో అరెస్ఠ్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా పూర్తిస్థాయి ఆధారాలు సేకరించి 7 పని దినాలలోపే ఛార్జిషీట్ను కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో నేరం జరిగిన నాటి నుండి జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ప్రత్యేక శ్రద్ధ వహించి, విచారణలో భాగంగా దర్యాప్తు అధికారికి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. నిర్ణీత సమయంలో రిపోర్టులు (పోస్టుమార్టం, రసాయనిక పరీక్షల రిపోర్టులు) రావడానికి సంబంధిత అధికారులను సంప్రదించి, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయించారు. దీంతో కాకినాడలోని గౌరవ 3వ అదనపు సెషన్స్ జడ్జ్ పి కమలాదేవి ఈ కేసు విచారణను జనవరి 9న ప్రారంభించారు. కోర్టు విచారణ సమయంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. ఆదిత్య కుమార్ ప్రాసిక్యూషన్ తరపున బలమైన వాదనలు వినిపించారు. సాక్షుల విచారణ, వాద ప్రతివాదనలు విన్న అనంతరం నిందితుడుపై నేరం రుజువైనందున ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధిస్తూ మంగళవారం తేదీన తీర్పునిచ్చారు. -
అంతా ఆమె కోసమే చేశాడా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసులో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హత్య చేసిన తర్వాత నిందితుడు హరిహర కృష్ణ బ్రాహ్మణపల్లిలోని స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లి, ఆ రోజు రాత్రి అక్కడే గడిపినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు హసన్ను విచారించారు. హత్యకు ముందు పెద్ద అంబర్పేటలో మద్యం తాగి.. అబ్దుల్లాపూర్మెట్ శివారు ప్రాంతాలకు వచ్చిన తర్వాత హరి యువతితో సహజీవనం విషయాన్ని నవీన్కు తెలిపాడని, ఈ విషయమై ఇద్దరి మధ్య తగాదా జరిగిందని హరే తనతో చెప్పాడని హసన్ పోలీసులకు వివరించినట్లు తెలిసింది. ‘‘దీంతో ఇద్దరి మధ్య తగువులాట జరిగింది, గొడవ పెద్దది కావటం, అప్పటికే నవీన్ను హతమార్చాలని నిర్ణయించుకున్న హరి మద్యం మత్తులో నవీన్ గొంతు నులుమి హత్య చేశాడు. నవీన్ మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత హరి పైశాచికత్వంతో శరీర భాగాలను వేరు చేయాలని భావించాడు.. నవీన్ మృతదేహాన్ని ఎవరూ గుర్తించకూడదనే ఉద్దేశంతోనే చేతి వేళ్లు, పెదాలు, గుండె, మర్మాంగాలను కత్తితో కోసి, ధ్వంసం చేసినట్లు హరి తనతో వివరించాడని’’హసన్ పోలీసులకు తెలిపాడు. యువతి సెల్ఫోన్లో కీలక ఆధారాలు.. ఈ కిరాతక హత్య కేసులో యువతి పాత్రపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. యువతి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పలు కీలక ఆధారాలను గుర్తించినట్లు సమాచారం. హత్య అనంతరం హరి.. నవీన్ శరీర భాగాలను వేరు చేసే వీడియో, ఫొటోలను యువతికి పంపించినట్లు పోలీసులు గుర్తించారు. ఆయా భయానక దృశ్యాలను చూసిన యువతి అస్వస్థతతకు గురైనట్లు సమాచారం. ఆయా వివరాలను తల్లిదండ్రులతో కూడా పంచుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. తొలుత నవీన్తో ప్రేమ వ్యవహారాన్ని నడిపిన యువతి.. కొన్నేళ్ల తర్వాత నవీన్ను దూరం పెట్టింది. ఆ తర్వాత నిందితుడు హరిహర కృష్ణతో రిలేషన్షిప్ కొనసాగించింది. అయితే ఈ వ్యవహారం నవీన్కు తెలియకపోవటంతో.. తరుచూ యువతికి ఫోన్ చేయడం, సందేశాలు పంపించేవాడని పోలీసుల విచారణలో బయటపడింది. నవీన్ వ్యవహారాన్ని హరితో యువతి చెప్పకుండా గోప్యంగా ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఎందుకు గోప్యత పాటించింది? దురుద్దేశం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే హరి, నవీన్లు అప్పటికే స్నేహితులు. యువతితో హరి కలిసి ఉన్న క్రమంలో అమ్మాయికి నవీన్ పదే పదే ఫోన్ చేస్తుండటాన్ని గమనించిన హరి.. నవీన్ బతికి ఉంటే ఎప్పటికైనా ఇబ్బందేనని, ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందనే అక్కసుతోనే ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉంటాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. హరిని కస్టడీకి కోరిన పోలీసులు రంగారెడ్డి కోర్టులు: కేసును లోతుగా విచారించేందుకు నిందితుడు హరిని ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి కోరుతూ మంగళవారం రంగారెడ్డి జిల్లా ఎస్సీఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కేసుని బుధవారానికి వాయిదా వేసిందని ఏసీపీ శేరి ప్రతాప్ రెడ్డి తెలిపారు. నిందితుడితో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయవలసి ఉందని, హత్యకు సంబంధించి నిందితుడికి మరెవరైనా సహకరించారా అనే కోణంలో విచారణ జరపాల్సి ఉందని ఏసీపీ చెప్పారు. మృతుడి సెల్ ఫోన్ ఆచూకీ తెలుసుకోవడంతో పాటు నిందితుడి సెల్ ఫోన్ని కూడా స్వాధీనపర్చుకోవాల్సి ఉందని తెలిపారు. -
కాకినాడ: ప్రేమోన్మాదికి జీవిత ఖైదు
సాక్షి, కాకినాడ జిల్లా: యువతిని దారుణంగా హత్య చేసిన ప్రేమోన్మాదికి కాకినాడ కోర్టు.. జీవిత ఖైదు, జరినామా విధించింది. కాకినాడ రూరల్ కూరాడ గ్రామానికి చెందిన కాదా దేవిక(21)ను గుబ్బల వెంకట సూర్యనారాయణ కత్తితో నరికి చంపిన సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ 8న బైక్పై వస్తున్న దేవికను వెంబడించి కాండ్రేగుల-కూరాడ మార్గ మధ్యలో కత్తితో దాడి చేసి అతి కిరాతంగా హత్యకు పాల్పడ్డాడు. సీఎం జగన్ ఆదేశాలతో విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేసి చార్జ్షీట్ దాఖలు చేశారు. 138 రోజుల్లో విచారణ పూర్తి చేశారు. దేవికా మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం.. ఆమె కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించారు. -
నవీన్ హత్యకేసు నిందితుడు హరిహర ఫోన్ కాల్ వైరల్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవీన్ హత్యకేసులో ఫోన్ కాల్ రికార్డ్ కలకలం రేపుతోంది. నవీన్ను హత్యచేసిన అనంతరం హరిహర తన ఫ్రెండ్తో ఫోన్తో మాట్లాడిన ఆడియో వైరల్గా మారింది. నవీన్ను హత్య చేసి ఏమి తెలియనట్లుగా హరి మాట్లాడిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. తన ప్రేయసి విషయంలో తగాదా వచ్చిందని డ్రగ్స్ తాగుతానని నవీన్ అన్నట్లు.. నవీన్ ఫ్రెండ్తో హరిహర సంభాషించాడు. నవీన్పై మిస్సింగ్ కేసు పెడతామంటూ నవీన్ ఫ్రెండ్కు హరిహర సలహా కూడా ఇచ్చాడు. కాగా, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో శనివారం దారుణ ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తాను ప్రేమించిన యువతికి స్నేహితుడు దగ్గర అవడాన్ని హరిహర జీర్ణించుకోలేకపోయాడు.. మనసులో కక్ష పెంచుకున్నాడు.. ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ ఉంది రమ్మని పిలిచాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపేశాడు.. తర్వాత గుండె, తల, మొండెం, కాళ్లు చేతులను వేరుచేసి.. వాటి ఫొటోలను వాట్సాప్ ద్వారా ప్రియురాలికి పంపి పైశాచికానందం పొందాడు. హతుడు, నిందితుడు ఇద్దరూ స్నేహితులు, ఇంజనీరింగ్ విద్యార్థులు కావడం, ప్రేమ విషయం హత్యకు దారితీయడం కలకలం రేపింది. చదవండి: స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి.. -
ఎల్లో మీడియాది అసత్య ప్రచారం
పులివెందుల రూరల్: 2019 మార్చి 14వ తేదీ రాత్రి సునీల్ యాదవ్ వైఎస్ భాస్కర్రెడ్డి ఇంట్లో ఉన్నాడండూ ఎల్లో మీడియా చేస్తున్నది అసత్య ప్రచారమని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారించిన స్థానిక విలేకరి భరత్ యాదవ్ చెప్పారు. ఆ రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు తాను, సునీల్ యాదవ్ పులివెందులలో కడప రోడ్డు సమీపంలోని నందిక ఆసుపత్రి దగ్గర ఉన్నామని స్పష్టంచేశారు. తనను సీబీఐ అధికారులు విచారించిన సందర్భంలో ఈ విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పానని తెలిపారు. సీబీఐ అధికారులు వైఎస్ వివేకా హత్య కేసులో ఎందుకు ఇంతలా అవాస్తవాలు వెలుగులోకి తెస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న సునీల్ యాదవ్ తనకు బంధువని చెప్పారు. ఆయన వివాహాన్ని బంధువుల అమ్మాయితో తానే జరిపించానన్నారు. చిన్న స్థలం పంచాయితీ విషయంలో సునీల్ యాదవ్ వివేకానందరెడ్డి దగ్గర ఉండటంవల్ల తాను కూడా ఆయనకు దగ్గరయ్యానన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు తననూ విచారించారని, వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని అన్నారు. సీఐ ర్యాంకు అధికారిణి ఆ విషయాలను అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ధారించారన్నారు. వాస్తవాలు దాచి సీబీఐ అధికారులు ఎవరి కోసమో ఏదో తప్పు చేస్తున్నారని అన్నారు. అసలు తప్పు చేసిన వారిని వదిలేస్తున్నారని చెప్పారు. ఒకే కోణంలో కాకుండా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. తాను పేర్లతో సహా సీబీఐ డైరెక్టర్లకు లేఖ రాశానని, అందులో నిజాలు లేవా అని ప్రశ్నించారు. వారికి అవసరం వచ్చినప్పుడు తన దగ్గర నుంచి సమాధానాలు తీసుకుని కేసును ముందుకు తీసుకెళుతున్నారని, తనను మాత్రం మైనస్ చేసి చూపిస్తున్నారన్నారు. తాను ఎవరికీ అమ్ముడుపోలేదని, తనను ఎవరూ పోషించలేదని చెప్పారు. సీబీఐపై ప్రజలకు గౌరవం ఉందని, దానిని వారు కాపాడుకోవాలన్నారు. -
సీబీఐ దర్యాప్తుపై సందేహాలు: ఎంపీ అవినాశ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ.. నిజాన్ని వెలికితీసే కోణంలో కాకుండా, వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని సాగుతోందన్న భావన కలుగుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి అన్నారు. సీబీఐ విచారణ సరైన దిశలో వెళ్లాలని చెబుతున్నానే తప్ప అనుమానించడం లేదని స్పష్టం చేశారు. మీడియా సైతం ఈ విషయంలో నిజాలను నిజాలుగా చూపాలని కోరారు. తనకు తెలిసిన అన్ని నిజాలను పొందుపరుస్తూ సీబీఐ అధికారులకు వినతిపత్రం ఇచ్చానని, అందులోని అంశాలపైనా విచారణ జరగాలని కోరినట్టు తెలిపారు. అబద్ధాన్ని నిజంగా.. నిజాన్ని అబద్ధంగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కోఠిలోని సీబీఐ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యారు. అనంతరం సాయంత్రం బయటికి వచ్చాక మీడియాతో మాట్లాడారు. జనవరి 28న విచారణకు కొనసాగింపుగా శుక్రవారం రెండోసారి సీబీఐ అధికారుల విచారణకు హాజరైనట్లు తెలిపారు. గతంలో విచారణప్పుడు మరోమారు పిలుస్తామని చెప్పారని, ఈసారి మాత్రం మళ్లీ విచారణకు రావాలని చెప్పలేదన్నారు. ఎంపీ ఇంకా ఏమన్నారంటే.. మీడియా బాధ్యతగా వ్యవహరించాలి మీడియా బాధ్యతగా వార్తలు ప్రసారం చేయాలని మనవి చేస్తున్నా. గతంలోనూ ఇదే విషయం చెప్పాను. మళ్లీ అదే చెబుతున్నా. నేను విజయమ్మ గారి దగ్గరికి వెళ్లి వస్తే.. బెదిరించి వచ్చానని చర్చలు పెట్టి, ప్రచారం చేస్తున్నారు. అది ఎంత వరకు సబబు? నేను దుబాయ్కి వెళ్లిపోయానని వక్రీకరించే వార్తలు వేస్తున్నారు. ► తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్లు చేశానని వక్రీకరించే వార్తలు వేయడమే కాకుండా దానిపై గంటల తరబడి, రోజులపాటు చర్చలు పెడుతున్నారు. విచారణ జరుగుతున్నప్పుడు మీడియా బాధ్యతగా మెలగాలి. మీడియానే ట్రయల్ పూర్తి చేసి..దోషులెవరో, నిర్దోషులెవరో మీడియానే నిర్ణయిస్తోంది. ఇది విచారణపై ఎంత ప్రభావం పడుతుందో ఒకసారి మీరే ఆలోచించండి. ఒక అబద్ధాన్ని సున్నా నుంచి వందకు పెంచే ప్రయత్నం జరుగుతోంది. అదేవిధంగా ఒక నిజాన్ని వంద నుంచి సున్నా చేసే ప్రయత్నం జరుగుతోంది. ► ముందు నుంచి కూడా ఫ్యాక్ట్ టార్గెట్గా కంటే పర్సన్ టార్గెట్గా విచారణ జరగడం సరికాదు. గూగుల్ టేకౌట్ అన్నది నిజమైన గూగుల్ టేకౌటా.. టీడీపీ టేకౌటా అన్నది భవిష్యత్తులో కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే.. సీబీఐ సమర్పించిన కౌంటర్లోని విషయాలన్నీ ఏడాది క్రితం టీడీపీ వాళ్లు చేసిన విమర్శలే. అందువల్ల ఎవరికైనా సందేహాలు రావడం సహజం. ఈ పరిస్థితిలో విచారణ సరైన కోణంలో వెళ్లాలని చెబుతున్నాను తప్ప.. నేను అనుమానించడం లేదు. ఆ రోజు చెప్పిందే ఈ రోజూ చెబుతున్నా ► వివేకం సార్ చనిపోయిన రోజు నేను మార్చురీ దగ్గర మీడియాతో మాట్లాడాను. మళ్లీ రెండు రోజుల తర్వాత కూడా మీడియాతో మాట్లాడాను. ఆ రోజు ఏం మాట్లాడానో.. ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నా. సీబీఐ వాళ్లకు అదే చెబుతున్నా. ఎవరెన్నిసార్లు పిలిచి అడిగినా అదే చెబుతా. ఎందుకంటే నాకు తెలిసిన నిజం అదే కాబట్టి. ► ఆ రోజు ఆ విషయం గురించి మీడియాతో మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి నేనే. అందుకే నేను ఆ రోజు చెప్పిందే ఈ రోజూ చెబుతున్నా. సీబీఐ వారి ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్పాను. ► వివేకం సార్ చనిపోయిన రోజు సీన్ ఆఫ్ క్రైంకి నేను వెళ్లేటప్పటికే అక్కడ ఒక లెటర్ ఉంది. కానీ, ఆ లెటర్ను దాచిపెట్టారు. ఆ లెటర్లో అది హత్య అని స్పష్టంగా ఉంది. అందులో అనేక అంశాలు ఉన్నాయి. ఆ విషయాల గురించి నేను చెప్పడం కంటే భవిష్యత్తులో అవన్నీ బయటికి వస్తాయి. ► ఇంతకు ముందు అడిగినట్టే అడ్వొకేట్ సమక్షంలో ప్రశ్నించాలని, అన్ని విషయాలు ఆడియో.. వీడియో రికార్డింగ్ చేయాలని ఇప్పుడు కూడా కోరాం. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ కూడా లెటర్ పెట్టాం. కానీ అది జరగలేదు. అయితే ఒక ల్యాప్టాప్ను మాత్రం నా ముందు ఉంచారు. అది ఎందుకోసం అన్నది నాకు తెలియదు. -
వివేకా హత్య కేసులో స్క్రీన్ప్లే, డైరెక్షన్ చంద్రబాబుదే: సజ్జల
సాక్షి, అమరావతి: వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డికి సంబంధం లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అవినాష్రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎన్నికల ముందు వివేకా హత్య కేసు ద్వారా మా నాయకుడిని నైతికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారన్నారు. బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డికి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలున్నాయని సజ్జల పేర్కొన్నారు. ‘‘వివేకాను కోల్పోవడం వైఎస్సార్సీపీకి, జగన్కు నష్టమే. వివేకా తిరిగి పార్టీలోకి వస్తానంటే ఆహ్వానించింది జగనే. వివేకా హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదు. కొందరిని టార్గెట్ చేస్తూ విచారణ చేస్తున్నారు. వివేకా బావమరిది శివప్రకాష్రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాష్రెడ్డి వెళ్లారు. శివప్రకాష్రెడ్డి ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో చనిపోయారని తనకు చెప్పినట్లు ఆదినారాయణరెడ్డే చెప్పాడు. వివేకా ఫోన్లోని రికార్డులను ఎందుకు డిలీట్ చేశారు?’’ అని సజ్జల ప్రశ్నించారు. ‘‘వివేకా హత్యకు, రెండో పెళ్లికి సంబంధం ఉందని ఆంధ్రజ్యోతిలో వేశారు. కుటుంబసభ్యులంతా కలిసి వివేకా చెక్ పవర్ తీసేశారని ఆంధ్రజ్యోతి చెప్పింది. చంద్రబాబు హయాంలోనే వివేకా హత్య జరిగింది. బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి, వివేకా అల్లుడు రాజశేఖర్రెడ్డి ఫోన్ రికార్డులు ఎందుకు చూడలేదు?. శివశంకర్రెడ్డి మా పార్టీ నాయకుడు.. వైఎస్, వివేకాతో కలిసి పనిచేశారు. శివశంకర్రెడ్డి తప్పు చేయలేదని మేం భావిస్తున్నాం. వివేకా హత్య కేసులో స్క్రీన్ప్లే, డైరెక్షన్ మొత్తం చంద్రబాబుదే. సీబీఐ వెనుక రాజకీయ ప్రమేయం కచ్చితంగా ఉంది’’ అని ఆయన అన్నారు. చదవండి: ఏది నిజం?: పచ్చ పైత్యం ముదిరిపోయింది! ‘‘బీజేపీలో తన కోవర్టుల ద్వారా సీబీఐ విచారణను ప్రభావితం చేస్తున్నారు. చంద్రబాబు గతంలో వైఎస్పై ఫ్యాక్షనిస్ట్ ముద్ర వేసి కుట్రలు చేశారు. ఇప్పుడు వైఎస్ జగన్పై కూడా కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు పకడ్బందీగా కథనం తయారు చేస్తారు. ఆ కథనాన్ని అనుకూల మీడియాలో ప్రచారం చేయిస్తారు. ఇదే అంశాన్ని టీడీపీ నాయకులు పదేపదే ప్రస్తావిస్తారు’’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. -
ఏది నిజం ?: బాబూ.. జవాబుందా ?
అధికారం కోసం ఎంతకైనా తెగించడం... ఎవరితోనైనా చేతులు కలపటం చంద్రబాబు నైజం. సొంత మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినపుడు గానీ... ఆగర్భ శత్రువైన కాంగ్రెస్తో గత ఎన్నికల్లో జతకట్టడం కానీ ఈ నైజానికి ఓ రెండు మేలిమి ఉదాహరణలు మాత్రమే.వంగవీటి రంగాను పట్టపగలు నడిరోడ్డుపై హతమార్చిన నారాసుర రక్త చరిత్ర ఎవరికి తెలియదని? టీడీపీలో ఈయనకు పోటీగా ఎదిగిన ప్రతి నాయకుడూ... రోడ్డు ప్రమాదంలోనో, నక్సల్స్ చేతుల్లోనో ప్రాణాలు కోల్పోయారంటే ఆ రక్తపు మరకలకు కారకులెవరో తెలియదా? అలాంటి చంద్రబాబు... మాటకు కట్టుబడే... మనుషులకు అత్యంత విలువిచ్చే ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సైతం తన రక్తపు చేతులు అంటించే ప్రయత్నం చేస్తున్నారు. వివేకా హత్యకేసుకు సంబంధించి ‘జగనాసుర రక్త చరిత్ర’ అంటూ తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన పుస్తకం ఈ కోవలోనిదే!!. మొదటి నుంచీ సీబీఐ దర్యాప్తు ఎలా సాగాలోతన రాతలతో చెబుతున్న ఎల్లో మీడియా... షరా మామూలుగా ఈ టీడీపీ కరపత్రాన్ని కూడా పతాక శీర్షికల్లో అచ్చేసింది. కానీ ఈ కేసులో చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. మరి ఆయన గానీ... ఆయన తరఫున రామోజీరావు గానీ వాటికి సమాధానం చెబుతారా? ► వివేకా పీఏ కృష్ణారెడ్డికి అక్కడో లేఖ దొరికింది. డ్రైవర్ తనను తీవ్రంగా కొట్టాడంటూ వివేకా రాసిన లేఖను, ఆయన ఫోన్ను... కృష్ణారెడ్డి ఎవ్వరికీ ఇవ్వలేదు. వివేక కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆదేశాలతోనే లేఖను దాచిపెట్టారు. ముందే లేఖ ఇస్తే అది సహజ మరణం కాదని తెలిసి ఎవ్వరూ మృత దేహాన్ని తాకేవారే కాదు. ఆ లేఖ తన తండ్రి రాసిందేనని సాక్షాత్తూ డీఐజీకి సునీత చెప్పారు. ఆ లేఖను ముందే ఇవ్వకపోవటంపై గానీ... వాట్సాప్ మెసేజీలతో సహా ఫోన్లో సగం డేటాను డిలీట్ చేయటంపై గానీ ఎందుకు ప్రశ్నించటం లేదు? ఆ లేఖను దాచిపేట్టిన కృష్టారెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. కానీ ఆ లేఖ దాచిపేట్టమన్న వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ► వైఎస్ వివేకాను గొడ్డలితో నరికి హత్య చేశానని నిందితుడు దస్తగిరి అంగీకరించాడు. కానీ తనను ఈ కేసులో అప్రూవర్గా చేసుకుని... తనచేత వేరేవాళ్ల పేర్లు చెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారెందుకు? దస్తగిరి బెయిల్ పిటిషన్ను సీబీఐ వ్యతిరేకించకపోవడమేంటి? హత్య చేసిన వ్యక్తి జైల్లో కాకుండా... దర్జాగా బయట తిరుగుతున్నాడెందుకు? హత్య జరిగిన రోజు నిరంతరం స్థానిక పోలీసులతో నాటి ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఏం మాట్లాడారు? నిమిష నిమిషానికీ చంద్రబాబుతో ఏం చెప్పారు? ఈ కోణంలో చంద్రబాబును విచారించలేదెందుకు? ఈ కేసులో దర్యాప్తును మొదటి నుంచీ నడిపిస్తున్నది ఎల్లో మీడియానే. పోలీసులు, సీబీఐ ఏం చేయాలో కూడా ఎల్లో మీడియానే చెబుతోంది. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి... వివేకా అనుచరులే డబ్బు లావాదేవీల్లో భాగంగా ఆయన్ను హతమార్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేసింది ‘ఈనాడు’. ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ప్లేటు ఫిరాయించింది. బాబుకు లబ్ధి కలిగేలా ఎంపీ అవినాశ్ను టార్గెట్ చేస్తూ కథనాలు వండి వారుస్తోంది. వీరి వల్ల ఈ కేసులో దర్యాప్తు ఎలా పక్కదోవ పడుతోందో వివరించే కొన్ని అంశాలివిగో... ► అవినాశ్ రెడ్డికి వివేకా మృతి గురించి తెలిసిందెప్పుడు? ఉదయం 6.30 ప్రాంతంలో... అది కూడా వివేకానందరెడ్డి బావమరిది శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి చెబితేనే!!. దీంతో జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారానికి వెళుతూ అవినాశ్ తిరిగి వెనక్కొచ్చారు. అప్పటికే అక్కడ జనం పోగయి ఉన్నారు. వచ్చాక విషయం తెలుసుకుని ఆయన తొలుత సీఐ శంకరయ్యకి, తరవాత కొందరు బంధువులకు ఫోన్లు చేశారు. ఏ ఫోన్ అయినా 6.30 తరవాతే. కానీ అర్ధరాత్రే ఫోన్ చేసినట్లు నిరాధార ఆరోపణలెందుకు చేస్తున్నారు? జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్ సీపీ ఇన్చార్జిగా ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి... మార్చి 10నే ఎన్నికల షెడ్యూలు రావటంతో హత్యకు ముందురోజు రాత్రి కూడా (మార్చి 15) ఎంపీ అవినాశ్ కోసం ప్రచారం చేశారు కదా? ఇందులో అవినాశ్–వివేకా మధ్య రాజకీయ వైరుధ్యాలకు అవకాశమెక్కడుంది? మృతి గురించి శివప్రకాశ్రెడ్డే్డ తనకూ చెప్పారన్నది జమ్మలమడుగు టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డి మాట. గుండెపోటుతో మృతి చెందారని, సిగరెట్లు ఎక్కువ తాగటం వల్ల కావచ్చునని చెప్పినట్లు ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. మరి అందరికీ శివప్రకాశ్ రెడ్డే చెప్పినపుడు అవినాశ్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు? చంద్రబాబూ నిరాధార ఆరోపణలు కట్టిపెట్టు... ఇవిగో నిజాలు... అవాస్తవ ఆరోపణలతో టీడీపీ విడుదల చేసిన పుస్తకం పూర్తిగా కట్టుకథల పుట్టని ఇట్టే తేలిపోయింది. ఆ పుస్తకంలో టీడీపీ చేసిన నిరాధార ఆరోపణలకు సమాధానాలు ఇవిగో... వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తోంది సీబీఐనా...!? చంద్రబాబా..!? వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రాత్రి 3గంటలకు ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి వైఎస్ భారతి పీఏ నవీన్కు ఎందుకు ఫోన్ చేశారని టీడీపీ ఓ అవాస్తవ విషయాన్ని ప్రచారంలోకి తేవడం విడ్డూరంగా ఉంది. అసలు ఆ రోజు రాత్రి 3గంటలకు ఎంపీ అవినాశ్ రెడ్డి నవీన్కు ఫోన్ చేశారని ఎవరు చెప్పారు చంద్రబాబూ...? ఎంపీ అవినాశ్ రెడ్డి కాల్ డేటా మీ దగ్గర ఉందా... ఉంటే మీ పుస్తకంలో ఎందుకు ప్రచురించలేదు? ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన అర్ధ రాత్రి 3గంటల సమయంలో వైఎస్ అవినాశ్రెడ్డి ఎవరికీ ఫోన్ చేయనే లేదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీడీపీ ప్రభుత్వం. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, అప్పటి రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావే ఈ కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించారు. మరి అప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు ఆ కేసు రికార్డులన్నీ కూడా కరకట్ట మీదున్న చంద్రబాబు నివాసానికి తరలించారా...?ఈ కేసులో టీడీపీ నేతల పాత్రను కప్పిపుచ్చేందుకే అలా చేశారా? మతి భ్రమించిందా చంద్రబాబూ...! అధికారం కోల్పోవడంతో చంద్రబాబుకు మతిభ్రమించినట్టు ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి ముందు రోజు రాత్రే తెలిసినా వైఎస్ జగన్ పులివెందులకు సాయంత్రం వరకు ఎందుకు వెళ్లలేదంటూ టీడీపీ ప్రశ్నించడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం. 2019 మార్చి 15 ఉదయం 6.10గంటలు అయినా సరే వివేకానందరెడ్డి నిద్ర లేవకపోవడంతో పీఏ కృష్ణారెడ్డి చాలాసేపు బయటే వేచి ఉన్నారు. ఆ తరువాత వాచ్మ్యాన్ రంగన్న, వంటమనిషి కుమారుడు ప్రకాశ్లతో కలసి వెనక ద్వారం నుంచి వెళ్లి చూడగా బాత్రూమ్లో వివేకానందరెడ్డి మృతిచెంది ఉండడాన్ని గుర్తించారు. ఆ వెంటనే హైదరాబాద్లో ఉన్న వివేకానందరెడ్డి భార్య, కుమార్తె, అల్లుడికి సమాచారం అందించారు. వారు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వచ్చే సరికి మధ్యాహ్నం 1గంట అయ్యింది. హైదరాబాద్లో ఉన్న అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన భద్రతా సిబ్బంది అనుమతించిన తరువాత రోడ్డు మార్గంలో బయలుదేరి సాయంత్రంలోపు పులివెందుల చేరుకున్నారు. కానీ ఈ అంశానికి కూడా మసిపూసి మారేడు కాయ చేయాలని చూడటం చంద్రబాబు రాజకీయ నైచ్యమే.. సీబీఐ అధికారులపై కేసు పేరిట మరో అబద్ధం అంతఃపుర ఆదేశాలతోనే అంటే ముఖ్యమంత్రి నివాసం నుంచి వచ్చిన ఆదేశాలతోనే సీబీఐ అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారని టీడీపీ మరో నిరాధారణ ఆరోపణ చేసింది. సీబీఐ అధికారులపై పోలీసులు తమకు తాముగా కేసు నమోదు చేయలేదు. ఉదయ్కుమార్ అనే వ్యక్తిని సీబీఐ అధికారులు విచారణ పేరిట పదే పదే పిలిచి తీవ్రంగా కొడుతుండడంతో ఫిర్యాదుచేసినా పోలీసులు స్పందించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీబీఐ అధికారులను ఒక్క రోజు కూడా విచారణకు పిలవనే లేదు. సీబీఐ అధికారులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ కేసులో స్టే మంజూరైంది. ఇక ఈ కేసు విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం ఎక్కడ ఉంది?.. సీబీఐ విచారణకు సహకరిస్తున్న ప్రభుత్వం ప్రతిపక్ష నేతగా సీబీఐ విచారణ కోరిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను సీఎం అయ్యాక ఎందుకు వద్దనుకున్నారని టీడీపీ ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. ఆనాడు చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం లేకే వైఎస్ జగన్ సీబీఐ విచారణను కోరారు. తాను ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వాధినేతగా తమ పోలీసు శాఖపై ముఖ్యమంత్రి నమ్మకం ఉంచారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ నిచ్చి కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చాక రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా పూర్తి సహకారం అందిస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో సీబీఐని నిషేధించారు.అలాంటి చంద్రబాబు అధికారం కోల్పోగానే మళ్లీ సీబీఐపై నమ్మకం ప్రదర్శిస్తుండటం రాజకీయ అవకాశవాదమే. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టకూడదని వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించి ఉంటే ఆయన కూడా సీబీఐకి రాష్ట్రంలో నిషేధించి ఉండేవారు కదా. ఆయన అలా చేయలేదు. అంటే వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేసినా తనకు అభ్యంతరంలేదని చెప్పినట్టే కదా. ఎంపీ టికెట్ అవినాశ్కే ఖరారు చేశారు బాబూ వైఎస్ అవినాశ్ రెడ్డి ఎంపీ టికెట్ కోసమే వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించినట్టు సీబీఐ సందేహం వ్యక్తం చేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిందని ఆరోపించడం టీడీపీ కుతంత్రాలకు పరాకాష్ట. సీబీఐ అఫిడవిట్ మీరు చూశారా చంద్రబాబు..! అసలు 2019 ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుగానే ఖరారు చేశారు. కడప లోక్సభ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్గా వైఎస్ వివేకానందరెడ్డిని నియమించారు. అవినాశ్ రెడ్డి గెలుపు కోసం వివేకానందరెడ్డి అప్పటికే ప్రచారం ప్రారంభించారు కూడా. వివేకాందరెడ్డి హత్య తరువాత కూడా ఆయన కుమార్తె వైఎస్ సునీత అదే విషయాన్ని మీడియా సమావేశంలో చెప్పారు కూడా. చార్జ్షీట్కు సీబీఐ 17 నెలల సమయం ఎందుకు తీసుకుంది? ఈ కేసులో ఏ–1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ ఎందుకు వచ్చింది... పోలీసులు ఆయనపై చార్జ్షీట్ ఎందుకు వేయలేదని టీడీపీ సంధించిన ప్రశ్న హాస్యాస్పదంగా ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పటి నుంచి 75రోజులపాటు చంద్రబాబే అధికారంలో ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు చార్జ్షీట్వేయలేదు? వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సిట్ను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది. నిందితులను గుజరాత్లోని న్రార్కో అనాలిసిస్ ల్యాబరేటరీకి తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహించింది. కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతుండగానే న్యాయస్థానం ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తును 2020, జూలై 9న సీబీఐకి అప్పగించింది. సీబీఐ 2021, అక్టోబరు 26న తొలి చార్జ్షీట్ దాఖలు చేసింది. తొలి చార్జ్షీట్ దాఖలు చేసేందుకు సీబీఐ 17 నెలల సమయం తీసుకుంది. చార్జ్షీట్ దాఖలకు 17 నెలల సమయం తీసుకున్న సీబీఐనిగానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీనిగానీ టీడీపీ ఎందుకు ప్రశ్నించడం లేదు? వ్యక్తిగత కారణాలతోనే డిప్యుటేషన్పై వెళ్లిన అభిషేక్ మహంతి చంద్రబాబు గాలిపోగేసి చేసిన మరో ఆరోపణ... ఈ కేసులో గజ్జల ఉదయ్కుమార్రెడ్డిని అప్పటి కడప ఎస్పీ అభిషేక్ మహంతి విచారణకు తీసుకువెళ్తుంటే హఠాత్తుగా నవీన్ నుంచి ఫోన్ వచ్చింది...దాంతో ఆయన్ని విచారించకుండా విడిచిపెట్టారని అవాస్తవ ఆరోపణలు చేశారు. పైగా అభిషేక్ మహంతి సుదీర్ఘ సెలవుపై ఎందుకు వెళ్లారని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. ఏమయ్యా చంద్రబాబూ... ఎస్పీ అభిషేక్ మహంతికి నవీన్ నుంచి ఫోన్ రావడం నువ్వు చూశావా...? పోనీ ఆయన కాల్ డేటా నీ దగ్గర ఉందా? ఇక అభిషేక్ మహంతి తన కుటుంబపరమైన కారణాలతోనే ఆయన తెలంగాణకు డిప్యుటేషన్ కోరుకునివెళ్లారు. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదన్నది రెండు రాష్ట్రాల్లోని పోలీసు శాఖలకు తెలుసు. రెండేళ్ల ఐదు నెలలు సస్పెన్షన్లోనే సీఐ శంకరయ్య సీఐ శంకరయ్య వాంగ్మూలం ఇచ్చి వెనక్కితగ్గారని ... వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసిందని టీడీపీ ఆరోపించడం విడ్డూరంగా ఉంది. తాను చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ వాంగ్మూలం నమోదు చేయడాన్ని శంకరయ్య తప్పుబట్టారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన మర్నాడే శంకరయ్య సస్పెండ్ అయ్యారు. 2019 మేలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత కూడా రెండేళ్ల ఐదు నెలలపాటు శంకరయ్య సస్పెన్షన్లోనే ఉన్నారు. కుటుంబ పోషణ కోసం తనకు పోస్టింగ్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శంకరయ్యపై అభియోగాలు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగానే ఆయనపై సస్పెన్షన్ను ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చారు. ఆయనకు ఏమీ ప్రాధాన్యమున్న పోస్టింగ్ ఇవ్వ లేదు. దాంతో కేసు దర్యాప్తు ప్రభావితమయ్యేది ఏముంది? టీడీపీ తప్పుబట్టాల్సింది ఏముంది...? ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ అంశంపై టీడీపీ అసత్య ఆరోపణలు చేసింది. ఎర్రగంగిరెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితుడు. ఎర్ర గంగిరెడ్డి జైలులో ఉన్నప్పుడు కూడా వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తరచూ ఆయన్ని కలిసేవారు. ఎర్ర గంగిరెడ్డికి న్యాయవాదులను కూడా సునీతే ఏర్పాటు చేశారు. ఆయనకు బెయిల్ రావాలని సునీత, ఆమె భర్త ఎన్.రాజశేఖరరెడ్డి కోరుకున్నారు. తీరా ఇప్పుడు ఆయనకు బెయిల్ రావడం వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హస్తముందని టీడీపీ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని గంగాధర్రెడ్డిపై టీడీపీ నేతల ఒత్తిడి వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు కె.శ్రీనివాసరెడ్డి, గంగాధర్ రెడ్డి అనుమానాస్పదంగా మృతిచెందారంటూ వక్రీకరిస్తూ టీడీపీ ఆరోపణలు చేయడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఈ కేసులో కె.శ్రీనివాసరెడ్డి అసలు సాక్షి కాదు. ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టడానికి ముందే శ్రీనివాసరెడ్డి మృతి చెందారు. ఆయన సోదరుడు పరమేశ్వరరెడ్డి ఈ కేసులో అనుమానితుడు. అతను టీడీపీ నేత బీటెక్ రవికి సన్నిహితుడు కూడా. వివేకానందరెడ్డి హత్యకు ముందు పరమేశ్వరరెడ్డి తనకు ఎలాంటి అనారోగ్యం లేనప్పటికీ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో ఉన్న అతను బయటకు వచ్చి టీడీపీ నేత బీటెక్ రవితో సమావేశమయ్యారు. వివేకానందరెడ్డి ఉన్నంతవరకు తాను పులివెందులలో పట్టు సాధించలేనని బీటెక్ రవికి తెలుసు. తాను ఎంపీగా గెలవలేనని ఆదినారాయణ రెడ్డికి తెలుసు. ఇక పరమేశ్వరెడ్డికి వివేకానందరెడ్డితో ఆర్థిక వివాదాలు ఉన్నాయి. అందుకు బీ.టెక్ రవి, ఆదినారాయణరెడ్డి, పరమేశ్వరరెడ్డి కలసి వివేకానందరెడ్డి హత్యకు కుట్రపన్ని ఉండొచ్చని వైఎస్సార్సీపీ మొదటి నుంచి చెబుతోంది. ఈ విషయాలన్నీ శ్రీనివాసరెడ్డికి తెలుసు. అతను జీవించి ఉంటే బీ.టెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలకే ముప్పు. అందుకే అతన్ని అంతం చేసే అవకాశం వారికే ఉంది. ఇప్పటికైనా సీబీఐ వారిని విచారించాలి. అలానే గంగాధర్ రెడ్డి మృతి విషయంలోనూ టీడీపీ అసత్య ఆరోపణలతో కేసును తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోంది. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్రెడ్డికి వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని వైఎస్ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, టీడీపీ నేతలు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారని గంగాధర్రెడ్డి ఆరోపించారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదుచేశారు కూడా. ఆ తరువాత అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందారు. గంగాధర్రెడ్డి వైఎస్ అవినాశ్రెడ్డికి అనుకూలంగా ఉన్నారు. ఆయన వాంగ్మూలం టీడీపీ నేతలకు వ్యతిరేకంగా ఉంది. మరి ఆయన అనుమాస్పదంగా మృతిచెందితే...అందుకు టీడీపీ నేతలనే శంకించాల్సి ఉంటుంది కదా. నారాసుర రక్తచరిత్రలో ప్రతిపేజీ హత్యలు,కుట్రలే... 1 వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడే కదా? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేసినా చంద్రబాబు నో చెప్పారెందుకు? ‘సిట్’తో సరిపెట్టారెందుకు? 2 ముఖ్యమంత్రి కుటుంబానికి ఎంపీ అవినాశ్ నుంచి అర్ధరాత్రే ఫోన్ వెళ్లినట్లు తెలుగుదేశం ఓ అభూత కల్పనను సృష్టించింది. ఎవరు చెప్పారిది సీబీఐ కూడా చెప్పలేదుగా? పోనీ... అప్పుడు అధికారంలో ఉన్నది మీరే కదా? దీన్ని నిరూపించే కాల్ డేటాను చూపించగలరా? ఉదయం 6.10కి వివేకా పనిమనిషి ఇంటి తలుపు తీసేదాకా ఆయన మృతి గురించి ఎవ్వరికీ తెలియదన్నది పచ్చి నిజం కాదా? ఆమె చెప్పాకే బంధువులకు, బయటి ప్రపంచానికి తెలిసిందన్నది వాస్తవం కాదా? 3 అవినాశ్రెడ్డి అప్పటికే ఎంపీ. కడప లోక్సభ ఇన్చార్జి కూడా. వివేకానందరెడ్డిని జమ్మలమడుగు అసెంబ్లీ ఇన్చార్జిగా ప్రకటించారు జగన్. ఎన్నికల షెడ్యూలు వెలువడటంతో అవినాశ్ గెలుపు కోసం వివేకా ప్రచారాన్ని ప్రారంభించారు. ముందురోజు రాత్రి జమ్మలమడుగులో ప్రచారం చేశారు కూడా. అలాంటిది ఎంపీ సీటు కోసం ఆయనపై కుట్ర పన్నాల్సిన అవసరం అవినాశ్కు ఎందుకుంటుంది? 4 మార్చి 15, 2019న ఉదయాన్నేజమ్మలమడుగు ప్రచారానికి వెళుతుండగా అవినాశ్కు వివేకా బావమరిది శివప్రకాశ్రెడ్డి ఫోన్ చేసి వివేకా మరణించినట్లు చెప్పటంతో ఆయన హడావుడిగా అక్కడకు చేరుకున్నారు. ఆ ఫోన్ రాకపోయి ఉంటే ఆయన వచ్చి ఉండేవారే కాదు. వచ్చిన వెంటనే ఆయన విషయం తెలుసుకుని మొదట సీఐకి ఫోన్ చేశారు. అప్పుడున్నది తెలుగుదేశం సర్కారు. సీఐ కూడా టీడీపీ నేతలు కోరి తెచ్చుకున్న వ్యక్తి. అలాంటిది సీఐకి ఫోన్ చేశాక.. బంధువులకు ఫోన్లు చేశారు అవినాశ్రెడ్డి. ఇందులో ఆయన చేసిన తప్పేంటి? -
ఏది నిజం ?: సీబీఐ నుంచి రామోజీ ‘లై’వ్ రిపోర్టింగ్
అప్పుడు హోటల్లో పట్టుమని పదిమంది ఎమ్మెల్యేలు కూడా లేరు. కానీ... ‘‘ఇదిగో యాభై మంది వచ్చేశారు... అదిగో ఆ సంఖ్య 100కు పెరిగింది. ఇంకేముంది... అంతా ఇక్కడికే చేరారు... అందరూ చంద్రబాబుకే మద్దతు పలుకుతున్నారు’’ అంటూ 1995 ఆగస్టులో పచ్చి అబద్ధాలతో ‘లైవ్’ రిపోర్టింగ్ చేశారు రామోజీరావు గారు. ఫలితంగా ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోయింది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఇది జరిగి 26 ఏళ్లు గడిచిపోయినా ‘ఈనాడు’ మారలేదు. ఆ తరహా ‘లైవ్’ రిపోర్టింగ్ మానలేదు!!. ‘ఈనాడు’ మారకపోయినా కాలం మారింది. మీడియా మారింది. రామోజీ చెప్పిందే నిజమనే భ్రమలు పోయి.. ఆయన అబద్ధాలు తప్ప ఏమీ చెప్పలేరనే నిజం బయటపడింది. వైఎస్ వివేకా హత్యకేసులో కొద్దిరోజులుగా సీబీఐ పేరు చెబుతూ ‘ఈనాడు’ వండి వారుస్తున్న కథనాల వెనక ఉద్దేశాలు సుస్పష్టం. ఎన్ని అబద్ధాలు చెప్పయినా కడప ఎంపీ అవినాశ్ రెడ్డిపై బురదజల్లాలి. అలా చేస్తే.. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్కు ఆయన బంధువు కనక సీఎం కుటుంబానికి కూడా కాస్త బురద అంటించొచ్చు. తద్వారా పూర్తిగా గ్రాఫ్ పడిపోయి... ఉత్త పుత్రుడిని, దత్తపుత్రుడిని కలిపి మరీ జనం మీదికి పంపిన తన చంద్రబాబుకు కాస్తయినా మేలు జరగొచ్చు. ఇదే రామోజీ ఏకసూత్ర అజెండా!!. తాజా కథనాలన్నీ ఈ అజెండాలో భాగమే. ఇక్కడ ప్రధాన ప్రశ్న ఒక్కటే!. ఒక వ్యక్తిని సీబీఐ విచారించిందనుకుందాం. సీబీఐ ప్రశ్నలకు తను సమాధానాలు చెబుతాడు. అది వాళ్లిద్దరికే తెలుస్తుంది. మరి రామోజీరావుకు, ఆయన తోక పత్రికకు, టీవీ5కు ఎలా తెలుస్తోంది? వాళ్లు మాత్రమే ‘లైవ్’ రిపోర్టింగ్ ఎందుకు చేస్తున్నారు? ఎలా చేయగలుగుతున్నారు? సీబీఐ ఎవరికి నోటీసులిచ్చిందో... ఎవరికి ఇవ్వబోతోందో వారికి మాత్రమే ఎలా తెలుస్తోంది? రామోజీకి అతీంద్రీయ శక్తులున్నాయా? లేక సీబీఐ ఆఫీసులో పొంచి వింటున్నారా? ఇదంతా కావాలనే చేస్తున్నారని... ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రలో ఇదంతా భాగమేనని తెలియటం లేదా? వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని ఆయన బావమరిది శివప్రకాష్రెడ్డి విజయవాడలో ఉన్న తనకు ఫోన్ చేసి చెప్పాడని టీడీపీ నాయకుడు, ఆదినారాయణరెడ్డి సిట్ విచారణ సందర్భంగా చెబుతున్న దృశ్యం.. ఇందుకు సంబంధించిన వీడియో లింక్ https://www.youtube.com/watch?v=uGiQpc&ANqw అటెండరుకు, పీఏకు తేడా తెలీదా? బురద జల్లటానికి, జనంలో అపోహలు సృష్టించడానికి ‘ఈనాడు’ తనకు ఏది అనుకూలంగా ఉంటే అది రాసేస్తుందన్నది పచ్చినిజం. ఇంటికి వచ్చిన వారికి కాఫీ–టీ అందిస్తూ అటెండరుగా ఉన్న వ్యక్తిని ‘పీఏ’గా ‘ఈనాడు’ రాస్తుండటం కూడా ఇలాంటిదే. ముఖ్యమంత్రి ఇంట్లో ఇలాంటి పనిచేసే నవీన్ను భారతమ్మ పీఏ అంటూ రామోజీ రాసిన రాతలు... దిగజారుడుకు పరాకాష్ట. చంద్రబాబు గ్రాఫ్ పెంచడానికి ‘ఈనాడు’ ఈ స్థాయికి పతనమైపోతుందని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు. సహజంగా ఇంట్లోవాళ్లకు ఫోన్ చేసినపుడు వాళ్లు గనక అందుబాటులో లేకుంటే అక్కడ పనిచేసే వాచ్మెన్, తోటమాలి, డ్రైవర్... ఇలా తెలిసిన వారికి ఫోన్ చేస్తారు. అలా నవీన్ ఫోన్కు కాల్స్ వచ్చాయంటూ భారతమ్మను టార్గెట్ చేశారంటే వీళ్లు ఎంత నీచంగా ఆలోచిస్తున్నారన్నది అర్థం కావటం లేదా? మరణించిన వై.ఎస్.వివేకానందరెడ్డి ఎంపీ అవినాశ్ రెడ్డికి చిన్నాయన. అవినాశ్ రెడ్డి అప్పటికే సిటింగ్ ఎంపీ. ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడటంతో మళ్లీ టికెట్ను ఆయనకే కన్ఫర్మ్ చేశారు. దీంతో అవినాశ్కు మద్దతుగా వైఎస్ వివేకా ప్రచారం కూడా మొదలెట్టారు. హత్య గురించి తనకు తెలియటంతో అది చెప్పటానికి ఆయన కొందరు బంధువులకు ఫోన్ చేసి ఉండొచ్చు. అందులో తప్పేమయినా ఉందా? ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సభలు... అక్కడ మాట్లాడాల్సిన ప్రసంగాలు... తదితరాలపై అంతా బిజీగా ఉన్న సమయంలో ఓఎస్డీకి ఫోన్ చేసి... ఆయన దొరక్కపోతే అటెండర్కో, డ్రైవర్కో ఫోన్ చేసి సమాచారాన్ని చెప్పమని కోరితే తప్పా? అదేమైనా ఘోరమా? దానికి చిలవలు పలవలు జోడించి ఇంత దుష్ప్రచారం చేయాలా? ఫిలిం సిటీ కోటలో రామోజీరావుకు ఇలాంటి అటెండర్లు లేరా? ఎందుకీ దిగజారుడు రాతలు? ఇవన్నీ వాస్తవాలు కాదా? మొదటి నుంచీ స్థానిక పోలీసులు చెబుతున్నదాని ప్రకారం ఎంపీ అవినాశ్ రెడ్డి అక్కడకు చేరేసరికే జనం పోగై ఉన్నారు. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని, సిగరెట్లు ఎక్కువ తాగటం వల్లే ఇలా జరిగిందని తనతో వివేకా బావమరిది శివప్రకాశ్ రెడ్డి చెప్పినట్లు స్వయంగా నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డి వీడియో సహితంగా చెప్పారు. అదే శివప్రకాశ్ రెడ్డి తనకూ చెప్పినట్లు అవినాశ్ రెడ్డి చెబుతున్నారు. ఎన్నికల ప్రచారానికని బయలుదేరిన తాను... వివేకా మృతి గురించి శివప్రకాశ్ రెడ్డి చెబితే తిరిగి వెనక్కి వచ్చానని చెప్పారాయన. మరి అందరికీ చెప్పింది శివప్రకాశ్ రెడ్డే అయినపుడు... అవినాశ్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డికి ఉదయం 5 లేదా 5.30 గంటలకు అక్కడొక లేఖ దొరికింది. ఆ లేఖ రాసింది వివేకానందరెడ్డేనని, అందులోని రాత ఆయనదేనని వివేకా కుమార్తె స్వయంగా డీఐజీ ఎదుట అంగీకరించారు. ఆ విషయాన్ని నాటి కడప ఎస్పీ రాహుల్ దేవ్ వెల్లడించారు కూడా. ఆ లేఖనెవరు చూసినా... అది సహజ మరణం కాదని అర్థమయ్యేది. పోలీసులకో, అక్కడికి వచ్చిన వారికో వెంటనే ఆ లేఖను ఇచ్చి ఉంటే... అక్కడి వ్యవహారం మరోలా ఉండేది. కానీ పీఏకు ఆ లేఖను, వివేకా ఫోన్ను ఎవ్వరికీ ఇవ్వవద్దని తాము వచ్చేవరకూ అలాగే ఉంచుకోవాలని కృష్ణారెడ్డికి వివేకా కుమార్తె, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని కూడా కుమార్తె సునీత పోలీసుల దగ్గర అంగీకరించారు. అలా ఎందుకు చెప్పారని అడిగితే... డ్రైవర్ ప్రసాద్కు ప్రాణభయం ఉంటుందనే ఉద్దేశంతోనే అలా చెప్పామన్నారు. మరి ఆ దిశగా ఎందుకు దర్యాప్తు సాగలేదు? రామోజీరావుకు ఇది తెలీదా? ఎందుకీ దుర్మార్గపు రాతలు? లేఖ గురించి వైఎస్వివేకా కుమార్తె సునీత చెప్పిన అంశాలను విలేకరులకు వెల్లడించిన డీఐజీ (నాటి ఈనాడు క్లిప్పింగ్) కుమార్తెకు–రెండో భార్యకు విభేదాలు లేవా? వైఎస్ వివేకా కుమార్తెకు, ఆయన రెండో భార్యకు మధ్య విభేదాలున్నాయనేది బహిరంగ రహస్యం. వాళ్లిద్దరి మధ్య సామాజిక మాధ్యమాల్లో నడిచిన దారుణమైన మెసేజీలే ఇందుకు సాక్ష్యం. వివేకా కుమార్తె, అల్లుడికి బీటెక్ రవితో ఇప్పటికీ మంచి సంబంధాలున్నాయి. బీటెక్ రవిని అప్పట్లో పోలీసులు విచారించినా కూడా ఆ వివరాలెందుకు వెల్లడించలేదు? రామోజీకి ఇవన్నీ తెలిసినా... ఒక బీటెక్ రవిని కాపాడటానికో, ఒక చంద్రబాబు గ్రాఫ్ పెంచటానికో మరీ ఇంత దారుణంగా పతనమైపోయి రాయటం న్యాయమేనా? సీబీఐ అంటే చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు కదా? మరి రామోజీకి అన్ని విషయాలూ ఎలా తెలుస్తున్నాయి? హత్య జరిగిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. అప్పుడే ఆ లెటర్ కూడా దొరికింది. దాని ఆధారంగా అప్పటి నుంచీ ఇన్వెస్టిగేషన్ ఎందుకు సాగలేదు? రకరకాలుగా తిప్పి... ఇప్పుడు ముఖ్యమంత్రి సన్నిహిత కుటుంబీకులకు అంటగట్టడానికి ప్రయత్నిస్తుండటంలో కుట్ర స్పష్టంగా కనిపించటం లేదా? ఇంకెప్పుడు మారతారు రామోజీరావు గారూ? విచారించింది సాక్షిగానే అని తెలిసీ బురదజల్లడం... వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇప్పటివరకు 200మందికిపైగా సాక్షులను విచారించింది. అదే రీతిలో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఈ కేసులో సాక్షిగానే విచారించింది. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, ఆయన నివాసంలో పని చేసే నవీన్లను సాక్షులుగానే విచారణకు పిలిచింది. బాధ్యతాయుతమైన పౌరులుగా సాక్షులుగానే సీబీఐ విచారణకు హాజరై సహకరించారు. కానీ దీనికి రాజకీయ రంగు పులిమి ముఖ్యమంత్రి వైఎస్జగన్ మోహన్రెడ్డి కుటుంబం పై బురదజల్లేందుకు ప్రయత్నించడం ఈనాడు మార్కు దిగజారుడు జర్నలిజం. ఈ కేసులో గతంలో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డిలను గతంలో సీబీఐ సాక్షులుగా విచారించింది. అప్పుడు మాత్రం ఈనాడు కళ్లకు గంతలు కట్టుకుని కూర్చుందా.? అప్పుడులేని హడావుడి ఇప్పుడు ఎందుకంటే...కేవలం చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కల్పించడానికే అన్నది సుస్పష్టమవుతోంది. మరీ ఇంత దిగజారుడా రామోజీ...! సాక్షిగా సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరైన అనంతరం ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో తనంతట తాను వెనుదిరిగారు. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి వచ్చి ఆయన్ని తన వాహనంలో ఎక్కించుకుని తీసుకువెళ్లారని ఈనాడు రాయడం కంటే అవాస్తవం మరొకటి ఉండదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి రావడం హైదరాబాద్లోని ఫిల్మ్సిటీలోని కొండపై అక్రమంగా నిర్మించుకున్న రాజప్రాసాదం నుంచి శాటిలైట్ ద్వారా రామోజీరావు చూశారా..! అసలు ఆయన అక్కడకు రానే లేదు. కానీ కేఎస్ జవహర్రెడ్డి వచ్చి కృష్ణ్ణమోహన్రెడ్డిని తీసుకువెళ్లినట్టుగా రాయడం ఏ పాత్రికేయ నీతో రామోజీరావుకే తెలియాలి మరి. ప్రభుత్వంపై దుష్ప్రచారం కోసం మరీ ఇంత బరితెగించాలా రామోజీ...! హంతకుడే అప్రూవరా..! కళ్లుమూసుకున్నావా రామోజీ వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి హత్య చేశాను అని ఈ కేసులో నిందితుడు దస్తగిరి అంగీకరించారు. అటువంటి అతన్ని సీబీఐ ఈ కేసులో అప్రూవర్గా పేర్కొనడం విస్మయపరుస్తోంది. పైగా దస్తగిరి బెయిల్ పిటిషన్ను సీబీఐ వ్యతిరేకించకపోవడంపై న్యాయ నిపుణులే అవాక్కయ్యారు. హత్య చేసిన వ్యక్తి జైలులో ఉండాలి. కానీ అతను దర్జాగా బయట తిరుగుతున్నాడు. ఇవేవీ ఈనాడు రామోజీ రావు కంటికి కనిపించడం లేదా... మరెందుకు ప్రశ్నించ లేదు...!? ఇక హంతకుడు అయిన దస్తగిరి చెప్పిన కల్పితాలను ఆధారంగా చేసుకుని సీబీఐ దర్యాప్తు చేస్తుండటం వెనుక ఉన్న మర్మమేమిటీ... ఎవరు ప్రభావితం చేశారన్నది నిపుణులు లేవనెత్తుతున్న సందేహం. దీనిపై కూడా ఈనాడు దృష్టిసారించలేదు. ఎందుకంటే చంద్రబాబు పలుకులు పలుకుతున్న చిలక దస్తగిరి. అందుకే దస్తగిరి చెబుతున్న కట్టుకథలకు వంత పాడుతున్నావా రామోజీ...! ఎంపీ టికెట్ అవినాశ్రెడ్డికి అని నిర్ధారించాకా రాద్ధాంతం ఏమిటో... 2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ పై సందిగ్దత ఉందనే అభూత కల్పనలతో ఈనాడు రామోజీరావు ప్రజలను పక్కదారి పట్టించేందుకు నానా పాట్లూ పడుతున్నారు. కానీ వాస్తవం ఏమిటన్నదీ అందరికీ తెలుసు. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుగానే ఖరారు చేశారు. కడప లోక్సభ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్గా వైఎస్ వివేకానందరెడ్డిని నియమించారు. అవినాశ్ రెడ్డి గెలుపు కోసం వివేకానందరెడ్డి అప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. వివేకానందరెడ్డి హత్య తరువాత కూడా ఆయన కుమార్తె వైఎస్ సునీత అదే విషయాన్ని మీడియా సమావేశంలోనూ చెప్పారు ఎంపీ టికెట్పై ఇంత స్పష్టత ఉన్న తరువాత కూడా అదేదో ఎంపీ టికెట్ కోసం వైఎస్ కుటుంబంలో పోటీ నెలకొందని అవాస్తవాలను ఈనాడు ప్రముఖంగా ప్రచురిస్తుండటం కేవలం ఎల్లో జర్నలిజమే. వైఎస్ వివేకాను కుట్ర పూరితంగా ఓడించింది చంద్రబాబే వైఎస్ వివేకానందరెడ్డి హత్యను రాజకీయంగా వాడుకోవాలని చంద్రబాబు, రామోజీరావు కుయుక్తులు పన్నుతున్నారు. అందుకే వైఎస్ వివేకానందరెడ్డిపై ఎక్కడలేని ఆపేక్ష చూపిస్తున్నట్టు డ్రామాకు తెరతీశారు. కానీ కడప జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్వివేకానందరెడ్డిని కుట్రపూరితంగా ఓడించింది చంద్రబాబే కదా. వైఎస్సార్ మరణానంతరం భార్య, కుమార్తె ఒత్తిడితో వైఎస్వివేకానందరెడ్డి కాంగ్రెస్పార్టీలో ఉండిపోయారు. వైఎస్విజయమ్మపై పులివెందులలో పోటీ చేశారు కూడా. అయినా సరే అనంతర పరిణామాల్లో పార్టీలోకి వస్తానంటే చిన్నాన్న మీద గౌరవ, అభిమానాలు ఉన్న వైఎస్ జగన్ ఆయన్ని సాదరంగా స్వాగతం పలికారు. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. ఎందుకంటే కడప జిల్లాలో స్థానిక సంస్థల్లో వైఎస్సార్సీపీకే మెజార్టీ ఉంది. కానీ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుట్రపూరితంగా వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసి వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించారు. అందుకు ఈనాడు, ఎల్లో మీడియా వత్తాసు పలికింది నిజం కాదా రామోజీ...! అధికారంలో ఉంటే సీబీఐని నిషేధించింది బాబే కదా... ప్రస్తుతం సీబీఐ దర్యాప్తును వక్రీకరిస్తూ కథనాలు రాస్తున్న ఈనాడు రామోజీరావు టీడీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం నిద్రపోయారనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో తమ అవినీతిని ఎక్కడ బయటపెడుతుందో అని చంద్రబాబు ఆనాడు రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశించకుండా నిషేధించారు. కేంద్ర దర్యాప్తు సంస్థపై నిషేధం విధిస్తే ఈనాడు కనీసం ప్రశ్నించలేదు. సరి కదా స్వాగతించింది. అంటే అప్పట్లో సీబీఐ అంటే ఓ పనికిమాలిన సంస్థగా చంద్రబాబు, ఈనాడు రామోజీరావు భావించారు. అటువంటి వారిద్దరూ ప్రస్తుతం సీబీఐ ని ఆకాశానికెత్తుతుండటం గమనార్హం. టీడీపీ అధికారంలో ఉంటే ఓ రీతి... ప్రతిపక్షంలో ఉంటే మరో రీతా ...! చంద్రబాబు సీబీఐ పై విధించిన నిషేధాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎత్తివేశారు. సీబీఐ అంటే భయముంటే ఆ పని ఎందుకు చేస్తారు. కానీ ఈ విషయాన్ని మాత్రం ఈనాడు ప్రస్తావించదు. తులసమ్మ లేవనెత్తిన సందేహాలపై దర్యాప్తు ఏదీ...? ఈ కేసులో అరెస్టు అయిన శివశంకర్రెడ్డి భార్య తులసమ్మ సీబీఐ దర్యాప్తు తీరును తప్పుబడుతూ న్యాయస్థానంలో ఓ పిటిషన్ వేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఎవరు చేసి ఉంటారనే సహేతుక ఆధారాలతో ఆమే నివేదించారు. వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన విభేదాలు... రెండో భార్య కుమారునికి ఆస్తిలో వాటా ఇస్తానని ఆయన చెప్పడంతో విభేదించిన మొదటి భార్య, కుమార్తె సునీత. అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డిలు పాల్పడిన కుట్రలు... పులివెందులలో రాజకీయ ఆధిపత్యంపై కన్నేసిన టీడీపీ నేత బీటెక్ రవి అందుకు అడ్డుగా ఉన్న వివేకానందరెడ్డిపై కక్ష పెంచుకోవడం... ఆర్థిక విభేదాలతో వైఎస్ వివేకానందరెడ్డిపై కక్ష పెంచుకున్న అనుచరుడు కొమ్మారెడ్డి పరమేశ్వరరెడ్డి... ఆయనతో రాజకీయంగా విభేదిస్తున్న తాడిపత్రి నేత రాజేశ్వరరెడ్డి, సహకరించిన నీరుగట్టు ప్రసాద్ ... ఇలా వీరందరి పాత్రపై దర్యాప్తు జరపాలని కోరుతూ తులసమ్మ ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయస్థానం నమోదు చేసింది. ఇంతటి కీలక అంశాలు మాత్రం ఈనాడు కంటికి కనిపించలేదు. ఆమె ఆవేదనను ప్రచురించాలని భావించనూ లేదు. కేసు దర్యాప్తు సక్రమంగా జరగాలని కోరుకోనూ లేదు. కేవలం చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కలిగించేందుకు కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తూ... వైఎస్ కుటుంబంపై దుష్ప్రచారం చేయడమే ఈనాడు రామోజీ రావు పనిగా పెట్టుకున్నారు... కానీ చంద్రబాబు గానీ రామోజీరావుగానీ గుర్తించని నిజం ఏమిటంటే... ఇవి 1995నాటి రోజులు కావు...చంద్రబాబు చెప్పే అవాస్తవాలు... ఈనాడు వండి వార్చే అభూతకల్పనలను ప్రజలు నమ్మే రోజులు పోయాయి. వారి కుట్రలు, దుష్ప్రచారాన్ని తాము నమ్మడం లేదని 2019 ఎన్నికల్లో ప్రజలు ఘంటాపథంగా తేల్చి చెప్పారు. ఇప్పటికీ ప్రజల ఏకకంఠంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినే బలపరుస్తున్నారన్నది సుస్పష్టం. ఆ నిజాన్ని గుర్తించి కూడా గుర్తించనట్టు వ్యవహరిస్తుండటం చంద్రబాబు, ఈనాడు అజ్ఞానం. -
స్థలం వివాదం పరిష్కరిస్తానని.. వివాహేతర సంబంధం పెట్టుకుని..
చింతలపూడి(ఏలూరు జిల్లా): చింతలపూడిలో మహిళ మిస్సింగ్ కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. మహిళను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ రాహుల్దేవ్ శర్మ కేసు వివరాలు వెల్లడించారు. చింతలపూడి ఎస్బీఐ నగర్కు చెందిన పొట్ల నాగమణి(37) భర్త చనిపోవడంతో ఇద్దరు కుమార్తెలతో పాటు అత్త , మామలతో కలిసి ఉంటుంది. ఖమ్మం జిల్లా గంగారం గ్రామంలో స్థలం విషయంలో వైరాకు చెందిన నంబూరి శ్రీనివాసరావుతో ఆమెకు పాత గొడవలు ఉన్నాయి. మృతురాలు 2016లో ఇదే స్థల వివాదంలో సివిల్ కోర్టులో పిటిషన్ వేసింది. మూడు సంవత్సరాల క్రితం చింతలపూడి మండలం, ఎండపల్లి గ్రామానికి చెందిన బర్రె రాంబాబు నాగమణికి పరిచయమయ్యాడు. తనకు తెలిసిన పెద్దలతో మాట్లాడి స్థలం వివాదం పరిష్కరిస్తానని నమ్మబలికాడు. అనంతరం నాగమణితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. స్థల వివాదం పరిష్కరించాలని నాగమణి పట్టుబట్టడంతో రాంబాబు శ్రీనివాసరావును కలిశాడు. నాగమణిని అడ్డు తప్పిస్తే ఉన్న స్థలంలో 6 కుంట్లతో పాటు రెండు లక్షల నగదు ఇస్తానని శ్రీనివాసరావు చెప్పడంతో రాంబాబు అంగీకరించాడు. దీంతో ఇద్దరూ పథకం ప్రకారం నాగమణిని అడ్డు తప్పించాలనుకున్నారు. గత నెల 19న రాంబాబు కారులో కాకినాడ సర్పవరం జంక్షన్లో ఉన్న శ్రీనివాస లాడ్జికి నాగమణిని తీసుకెళ్ళాడు. అదే రోజు రాత్రి కారు జాకీ రాడ్తో తలపై కొట్టి చీర చెంగుతో మెడకి గట్టిగా బిగించి హత్య చేశాడు. చదవండి: షాకింగ్.. ప్రియుడి మోజులో పడి.. భార్య ఎంతపని చేసిందంటే.. అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలు చేతికి ఉన్న బ్రాస్లెట్లు తీసుకున్నాడు. లాడ్జికి దగ్గరలో ఉన్న ఎరువుల దుకాణంలో పెట్రోలు డబ్బా, ఎరువుల సంచి కొని మృతదేహాన్ని మూటకట్టి కారులో వేసి 21వ తేదీ తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం దమ్మపేట మండలం ఆర్లపెంట గ్రామ శివారులోని డంపింగ్ యార్డు వద్ద పెట్రోల్ పోసి నాగమణి మృతదేహాన్ని తగలబెట్టాడు. అనంతరం మృతురాలి సోదరుడితో కలిసి చింతలపూడి పోలీసులకు నాగమణి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. రాంబాబుపై అనుమానం వచ్చి విచారించగా పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నారు. సీఐ ఎంవీఎస్ మల్లేశ్వరరావు తన సిబ్బందితో రాంబాబుతో పాటు నంబూరి శ్రీనివాసరావును పట్టుకుని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. -
ఫొటోగ్రాఫర్ హత్య వెనుక ‘టీడీపీ’ నేత హస్తం?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన మండపేటలో ఫొటోగ్రాఫర్ను పీక నులిమి చంపేశారు. నూతన సంవత్సర వేడుకల వేళ మండపేట బైపాస్ రోడ్డులోని ఒక లే అవుట్లో ఆ ఫొటోగ్రాఫర్ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తీరా తీగ లాగితే డొంక కదిలింది. అనుమానితులను పోలీసులు తమదైన శైలిలో విచారించారు. పోస్టుమార్టం నివేదికలో ఫొటోగ్రాఫర్ను హత్య చేసినట్టుగా నిర్ధారించారు. ఈ హత్య వెనుక పట్టణంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసులో కీలక నిందితునిగా ఉన్న అతడి అనుచరుడు పరారీలో ఉండటం ఇందుకు బలం చేకూరుస్తోంది. అసలు ఈ హత్యకు, ఆ మాజీ ప్రజాప్రతినిధికి మధ్య సంబంధం ఏమిటి, హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో పోలీసు దర్యాప్తు సాగుతోంది. మండపేటకు చెందిన ఫొటోగ్రాఫర్ కొనిజాల సురేష్ (28) డిసెంబర్ 31వ తేదీ రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు స్నేహితులతో కలిసి వెళ్లి శవమై తేలాడు. తొలుత పట్టణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహంపై ఉన్న గాయాల ఆధారంగా నాలుగు రోజులుగా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మండపేట బైపాస్ రోడ్డులోని ఓ లే అవుట్లో ఆ రోజు నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఇందులో పట్టణ టీడీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి కారు డ్రైవర్తో కలిసి సురేష్ పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ డ్రైవర్తో పాటు మరికొందరిని తమదైన శైలిలో విచారించి, సురేష్ హత్యకు గురైనట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ హత్యతో సంబంధం ఉన్న మరికొందరు అనుమానితుల పేర్లను సేకరించారు. వారిలో సదరు మాజీ ప్రజాప్రతినిధి ప్రధాన అనురుడు కూడా ఉన్నాడని నిర్ధారించుకున్నారు. అతడితో పాటు మరికొందరు పరారీలో ఉండటంతో వారి కోసం రెండు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. హతుడు సురేష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి కుటుంబ సభ్యులు ఆ మాజీ ప్రజాప్రతినిధి ఇంట్లో పని చేసేవారనే విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. మాజీ ప్రజాప్రతినిధితో పాటు మరికొందరు అనుమానితుల పేర్లు విచారణలో పోలీసులకు చెప్పినట్టుగా హతుని సోదరుడు ఫోన్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం సంచలనమైంది. విచారణలో వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలు, అనుమానితుల కాల్డేటా వివరాలు సేకరించి పరిశీలిస్తున్నారు. హత్య విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచీ రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి మండపేట వచ్చి అనుమానితులను విచారిస్తున్నారు. జిల్లా ఎస్పీ సు«దీర్కుమార్రెడ్డి కేసు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. శుక్రవారం వచ్చిన పోస్టుమార్టం నివేదికలో సురేష్ మెడ భాగంలో ఎముకలు విరిగి ఉన్నట్టు నిర్ధారణ అయింది. చదవండి: కానిస్టేబుల్ నిర్వాకం.. యువతితో 4 ఏళ్ల ప్రేమ.. బర్త్డే పేరుతో! దీంతో అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. పరారీలో ఉన్న అనుమానితులు దొరికితే మాజీ ప్రజాప్రతినిధి పాత్రపై స్పష్టత వస్తుందని పోలీసులు అంటున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ సమగ్రంగా విచారణ చేస్తున్నామని మండపేట టౌన్ సీఐ పి. శివగణేష్ చెప్పారు. కేసులోని ప్రధాన నిందితులను ఆధారాలతో సహా పట్టుకుంటామని అన్నారు. -
యువకుణ్ణి హతమార్చి.. ఆనక నిప్పంటించారు
కర్నూలు: గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన గాడిబండ ఆమోస్(26) దారుణ హత్యకు గురయ్యాడు. కల్లూరు మండలం శరీన్ నగర్ శివారులోని హంద్రీ నది ఒడ్డున గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి.. ఆ తరువాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆమోస్ ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకోగా.. పరువు హత్య కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. డిగ్రీ వరకు చదువుకున్న ఆమోస్ ఏడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన కుమ్మరి గోపాల్ కుమార్తె అరుణను కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. వారి వివాహం అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేక మొదట్లో ఘర్షణలు జరిగాయి. దీంతో ఆమోస్ దంపతులు ఊరు వదిలి వచ్చేసి కొన్నాళ్లు ఆదోని, మరికొన్నాళ్లు ఎమ్మిగనూరులో కాపురం చేశారు. రెండేళ్ల క్రితం కర్నూలుకు వచ్చి కల్లూరు ఎస్టేట్లో నివాసముంటూ సిటీ స్క్యేర్ మాల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అదృశ్యమైన రెండు రోజులకే.. ఆమోస్ రెండు రోజుల క్రితం అదృశ్యం కాగా.. శనివారం ఉదయం శరీన్నగర్ శివారులోని హంద్రీనది ఒడ్డున శవమై కనిపించాడు. జనసంచారం లేని ముళ్లపొదల చాటున మృతదేహం పడివుండగా.. బహిర్భూమికి వెళ్లినవారు సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ కేవీ మహేష్, సీఐ శంకరయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
ఇద్దరు భార్యలు.. మరొకరితో వివాహేతర సంబంధం.. మొదటి భార్య షాకింగ్ ట్విస్ట్
కాజీపేట(హన్మకొండ జిల్లా): మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని తనను హింసిచడాన్ని జీర్ణించుకోలేకపోయిన భార్య రూ.4లక్షల సుఫారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది. ఈ ఘటనకు సంబంధించిన భార్యతో పాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సౌత్ జోన్ డీసీపీ అశోక్కుమార్ తెలిపారు. కాజీపేట పోలీస్స్టేషన్లో ఏసీపీ శ్రీనివాస్తో కలిసి ఆదివారం వివరాలు వెల్లడించారు. కాజీపేట డీజిల్ కాలనీలో నివాసం ఉండే జిన్నారపు వేణుకుమార్ (34) గిరిగిరి చిట్టిల వ్యాపారం చేసేవాడు. అతడికి ఇద్దరు భార్యలు ఉండగా మొదటి భార్య సుశ్మిత రైల్వేలో ఉద్యోగం చేస్తుంది. భార్యలిద్దరినీ ఒకే ఇంటిలో ఉంచి కాపురం చేస్తున్న వేణుకుమార్ మహబూబాబాద్కు చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఇద్దరు భార్యలకు చూపిస్తూ మానసికంగా వేధింపులకు గురి చేశాడు. దీన్ని తట్టుకోలేకపోయిన మొదటి భార్య సుశ్మిత తనకు దగ్గరి బంధువైన భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సీపేట గ్రామానికి చెందిన గడ్డం రత్నాకర్ అనే రౌడీషీటర్కు రూ.4లక్షల సుఫారీ ఇచ్చి తన భర్తను హత్య చేయాలని చెప్పింది. ఈ క్రమంలో రత్నాకర్ వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ కొంగర అనిల్, ఇస్సీపేటకు చెందిన కటిక అనిల్కు సుపారీ విషయం చెప్పి వేణుకుమార్ను హత్య చేసేందుకు ఒప్పించాడు. పథకం ప్రకారం సెప్టెంబర్ 30న సుశ్మిత తన భర్తకు పాయసంలో నిద్రమాత్రలు కలిపి తాగించింది. వేణుకుమార్ నిద్రలోకి జారుకున్న తర్వాత అప్పటికే వేచి ఉన్న నిందితుల సహకారంతో కారులో పెద్దపల్లి జిల్లా మంథని వద్ద ఉన్న మానేరు వాగు సమీపంలో వేణుకుమార్ను గొంతు నులిమి హత్య చేసి పడేసి హనుమకొండకు వచ్చారు. అనంతరం ఏమి తెలియనట్లు అక్టోబర్ 2న భర్త వేణుకుమార్ కనిపించడం లేదంటూ సుశ్మిత కాజీపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మంథని పోలీసులు వాగులో కనిపించిన మృతదేహాన్ని గుర్తు తెలియని శవంగా ప్రకటించారు. అయితే, సుశ్మిత ప్రతిరోజు పోలీస్స్టేషన్కు వచ్చి ఎక్కడాలేని ప్రేమ ఒలకబోస్తూ ఏడుస్తుండడంతో అనుమానం వచ్చిన ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్రెడ్డి విషయాన్ని ఏసీపీ శ్రీనివాస్, డీసీపీలకు వివరించి కాల్ లిస్ట్ బయటకు తీశారు. ఆమె నిత్యం నిందితులతో మాట్లాడుతున్నట్లు వెల్లడైంది. దీంతో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి సుశ్మితను అదుపులోకి తీసుకుని విచారించగా వేణుకుమార్ను సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లుగా ఒప్పుకుంది. మంథని పోలీసుల సమకారంతో మృతదేహాన్ని వెలికితీసి రీ పోస్టుమార్టం చేయించిన పోలీసులు శనివారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులతో పాటు కారు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ మహేందర్రెడ్డి, ఎస్సైలు వెంకటేశ్వర్లు, ప్రమోద్కుమార్, రవికుమార్, సిబ్బందిని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ అభినందించారు. చదవండి: మహిళ గలీజ్ పని.. యువకులతో పరిచయం పెంచుకుని.. నగ్న చిత్రాలు పంపి.. -
మద్యం మత్తులో కన్నబిడ్డ హత్య
విజయనగరం క్రైమ్: మద్యం మత్తులో కన్నబిడ్డను చంపేసుకున్నారు ఆ కసాయి తల్లిదండ్రులు. ఈ ఘటన స్థానిక మయూరీ కూడలి వద్ద శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. వన్టౌన్ సీఐ బి.వెంకటరావు ఆదివారం వివరాలు వెల్లడించారు. స్థానిక మయూరి కూడలి వద్ద భిక్షాటన చేస్తూ ఐదేళ్లుగా సహజీవనం సాగిస్తున్న గాయత్రీదాస్, అలోక్ దాస్కు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దపాపకు రెండేళ్లు, చిన్నపాపకు నెలన్నర రోజులు. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని భార్యాభర్తలు గొడవపడేవారు. ఎప్పటిలాగే శనివారం అర్ధరాత్రి తరువాత మద్యం మత్తులో గొడవ పడ్డారు. ఆ తగాదాలోనే తల్లి చేతిలో ఉన్న చిన్న పాపను లాగడంతో గట్టిగా దెబ్బలు తగిలాయి. ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రభుత్వాస్పత్రికి పాపను తీసుకువెళ్లగా.. అక్కడ వైద్యులు పాప మృతి చెందిందని చెప్పారు. దీంతో పాప మృతదేహాన్ని రైల్వేస్టేషన్ రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో కంకరపిక్క, క్రషర్ బుగ్గిలో రెండు అడుగుల లోతు గొయ్యి తీసి కప్పేశాడు. అనంతరం మయూరీ కూడలి వద్ద బిడ్డను నువ్వే చంపేశావంటే నువ్వే చంపేశావని ట్రాఫిక్ కానిస్టేబుల్ వద్ద వాదులాడుకున్నారు. వెంటనే ఆయన వన్టౌన్ పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన వన్టౌన్ సీఐ వెంకటరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
అత్త హత్య కేసులో అల్లునికి జీవితఖైదు
సాక్షి, తుమకూరు: పిల్లనిచ్చిన పాపానికి అత్తను హత్య చేసిన కేసులో ఘరానా అల్లునికి కోర్టు జీవితఖైదుని విధించింది. వివరాలు.. శిర తాలూకాలోని హులికుంటె వద్దనున్న యలపేనహళ్లివాసి ఎస్.ప్రదీప్ కుమార్ ఈ కేసులో దోషి. కుటుంబ కలహాల వల్ల అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను వెంట పంపాలని ప్రదీప్ 2019 సెప్టెంబర్ 20వ తేదీన మధుగిరి తాలూకాలోని బడవనహళ్లి ప్రభుత్వ ఆస్పత్రి వెనుక అద్దె ఇంట్లో ఉండే అత్త ప్రేమలత (55) ఇంటికి వెళ్లాడు. ఈ సమయంలో ఘర్షణ జరిగింది. అతడు చాకు తీసుకుని ప్రేమలతను, ఆమె తండ్రి దొడ్డన్న, కుమారుడు వెంకటేష్పైన దాడి చేయడంతో తీవ్ర గాయాలతో ప్రేమలత మరణించింది. బడవనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి ప్రదీప్ను అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో తుమకూరు సెషన్స్ కోర్టు జడ్జి యాదవ కరికెరె జీవితఖైదుతో పాటు రూ.11 లక్షల జరిమానాను విధిస్తూ తీర్పు వెలువరించారు. (చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో లివ్ ఇన్ రిలేషన్.. పెళ్లి చేసుకోమని అడిగితే దారుణంగా..) -
కెన్నెడీ హత్య.. మరిన్ని డాక్యుమెంట్లు బహిర్గతం
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నెడీ హత్యకు సంబంధించి 13 వేల పై చిలుకు డాక్యుమెంట్లను వైట్హౌస్ తాజాగా బయట పెట్టింది. దీంతో ఆ ఉదంతానికి సంబంధించి 97 శాతానికి పైగా సమాచారం జనానికి ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చినట్టేనని ప్రకటించింది. అయితే మరో 515 డాక్యుమెంట్లను పూర్తిగా, 2,545 డాక్యుమెంట్లను పాక్షికంగా గోప్యంగానే ఉంచనుంది! వాటిని 2023 జూన్ దాకా విడుదల చేయబోమని ప్రకటించింది. హత్యకు సంబంధించిన అతి కీలకమైన విషయాలు వాటిలోనే ఉండొచ్చని భావిస్తున్నారు. హార్వే ఓస్వాల్డ్ అనే వ్యక్తి 1963 నవంబర్ 22న కెన్నెడీని డాలస్లో కాల్చి చంపడం తెలిసిందే. దీని వెనక పెద్ద కుట్ర ఉందంటారు. హార్వే కొన్నేళ్లపాటు సోవియట్ యూనియన్లో ఉండొచ్చిన వ్యక్తి కావడం పలు అనుమానాలకు తావిచ్చింది. అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ కెన్నెడీని చంపించి ఉంటుందని, రహస్యాన్ని శాశ్వతంగా సమాధి చేసేందుకు హార్వేను పోలీసులు కాల్చి చంపారని ఊహాగానాలున్నాయి. -
భార్యతో సఖ్యతగా మెలుగుతున్నాడనే ఘాతుకం
స్నేహ బంధానికి ద్రోహం చేసి తన భార్యతో సఖ్యతగా మెలుగుతున్నాడని అనుమానం పెంచుకున్నాడు.. మానసిక క్షోభకు కారణమయ్యాడని మిత్రుడినే బద్ధ శత్రువుగా భావించి అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అదును చూసి మరో మిత్రుడి సహకారంతో దారుణంగా హత్య చేసి.. ఆపై ప్రమాదంగా చిత్రీకరించాడు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడడంతో చివరకు కటకటాలపాలయ్యాడు. ఇదీ.. సూర్యాపేట జిల్లా మోతె మండలం అన్నారిగూడెం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన హత్యోందంతం వెనుక ఉన్న ప్రధాన కారణం. నల్గొండ: మోతె మండలం అన్నారిగూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నరేశ్ మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అతడి మరణం ప్రమాదవశాత్తు జరిగిందని కాదని.. హత్యేనని తేల్చారు. ఘాతుకానికి ఒడిగట్టిన సూత్రధారితో పాటు మరో ఇద్దరు పాత్రధారులను అరెస్ట్ చేశారు. మునగాల పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన పంది నరేశ్ (28), పడిశాల శంకర్ది ఒకే సామాజిక వర్గం. ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. వివాహాలు చేసుకుని నరేశ్ ఆటో డ్రైవర్గా, శంకర్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అనుమానం పెంచుకుని.. నరేశ్, శంకర్ ఇద్దరూ స్నేహితులు కావడంతో ఒకరింటికి ఒకరు వచ్చి పోతుండేవారు. శంకర్ లేని సమయంలో కూడా నరేశ్ ఇంటికి వచ్చి వెళ్తూ తన భార్యతో సఖ్యతగా మెలుగుతున్నాడని అనుమానం పెంచుకున్నాడు. ఆ విషయంలో తాను ఎక్కడా భయటపడకుండా నరేశ్తో స్నేహంగా ఉంటూనే అతడిపై కక్ష పెంచుకున్నాడు. అదును చూసి హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. మరో మిత్రుడి సహకారం తీసుకుని.. నరేశ్ని హత్య చేయడం తన ఒక్కడితో కాదని కారుడ్రైవర్గా పనిచేస్తున్న ఖమ్మం జిల్లా తిరుమాలయపాలెం మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన తన మిత్రుడు గుండెపంగు మధుసూదన్ సహకారం తీసుకుని పథకం రూపొందించి అమలు కోసం వేచి చూస్తున్నాడు. అందుకు అతడికి రూ.30వేలు ఇచ్చాడు. అందులో భాగంగా నవంబర్ 26న నరేశ్ తన అత్తగారి గ్రామం మునగాలలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. అప్పటికే స్నేహితుడు మధుసూదన్ను రప్పించుకున్న శంకర్ మద్యం సేవిద్దామని నరేశ్కు కబురు పెట్టాడు. దీంతో నరేశ్ అదేరోజు రాత్రి మోతె మండలం విభళాపురం గ్రామ శివారులో గల స్టీలు ప్లాంటు వద్దకు ఆటోలో చేరుకొని వారిద్దరితో కలిసి పూటుగా మద్యం సేవించాడు. నరేశ్ పూర్తిగా మత్తులోకి వెళ్లాక ఆటోలోనే మెడకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం ఆటోను పక్కనే ఉన్న ఎస్ఆర్ఎస్పీ కాల్వలోకి తోసేసి ప్రమాదంగా చిత్రీకరించారు. అనంతరం అన్నారిగూడెం గ్రామానికి చెందిన మరో మిత్రుడు దున్నపోతుల వెంకటేశ్వర్లుకు హత్యోదంతాన్ని వివరించారు. మధుసూదన్ను బైక్పై అతడి స్వగ్రామంలో విడిచిపెట్టి శంకర్, వెంకటేశ్వర్లు అన్నారిగూడెం చేరుకున్నారు. అనుమానంతో అదుపులోకి తీసుకుని.. ఇటీవల ఎస్ఆర్ఎస్పీ కాల్వలో నరేశ్ విగతజీవుడిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు అతడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా నరేశ్ స్నేహితుడు శంకర్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. కేసులో భాగస్వాములైన మధుసూదన్ను ఖమ్మం జిల్లా నాయకన్గూడెం టోల్ప్లాజా వద్ద, వెంకటేశ్వర్లును అతడి స్వగ్రామంలో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివరించారు. కేసును ఛేదించిన మునగాల సీఐ ఆంజనేయులు, మోతె ఎస్ఐ ప్రవీణ్కుమార్, సిబ్బందిని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. సమావేశంలో మునగాల, నడిగూడెం ఎస్ఐలు లోకేశ్, నాగభూషణ్రావు తదితరులు ఉన్నారు. -
ఎమ్మెల్సీ అనంతబాబుకు మధ్యంతర బెయిల్
ఢిల్లీ:డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ మంజూరైంది. అనంతబాబుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు.. మే నెలాఖరు నుంచి రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. -
ఎంత చెప్పినా ఆమె వినలేదు.. ఆ సమయంలో ఆఫ్తాబ్ని కలిశా: శ్రద్ధా తండ్రి
న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్యోదంతం ఎన్నో మలుపులు తిరుగుతూ పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రద్ధా వాకర్ హత్య తర్వాత తొలిసారి ఆమె తండ్రి వికాస్ వాకర్ శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఆయన నోరు విప్పారు. తన కూతుర్ని ఎలాగైతే చంపాడో అలాగే అఫ్తాబ్కీ పనిష్మెంట్ ఇవ్వాలని వికాస్ వాకర్ డిమాండ్ చేశారు. సరైన పద్ధతిలో విచారణ చేసి అఫ్తాబ్ని ఉరితీయాలని డిమాండ్ చేశారు. అఫ్తాబ్ కుటుంబ సభ్యులు, ఈ హత్యతో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే శ్రద్ధా వాకర్ బతికి ఉండేదని అభిప్రాయపడ్డారు ఆమె తండ్రి వికాస్ వాకర్. పోలీసుల దర్యాప్తు విషయంలో తాను సంతృప్తిగానే ఉన్నానని చెప్పారు. కూతురు మరణం తనను కుంగిపోయేలా చేసిందని, దీంతో అనారోగ్యానికి గురయ్యానని వెల్లడించారు. అందువల్లే మీడియాతో మాట్లాడలేకపోయానని తెలిపారు. సమాజంలో ఇబ్బందులు సృష్టిస్తున్న పలు మొబైల్ అప్లికేషన్లపై కూడా చర్యలు తీసుకోవాలని శ్రద్ధా తండ్రి డిమాండ్ చేశారు. డేటింగ్ యాప్స్పై నిషేధం విధించాలన్నారు. 18 ఏళ్లు నిండిన పిల్లలపై తప్పనిసరిగా కౌన్సిలింగ్ నియంత్రణ ఉండాలన్నారు. రెండేళ్లుగా శ్రద్ధాను సంప్రదించేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించానని, కానీ తాను పెద్దగా స్పందించలేదని తెలిపారు. శ్రద్ధా శరీర భాగాలు ఆ హంతకుడి ఇంట్లో ఉన్న సమయంలో అఫ్తాబ్ని కలిశానని ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్తాబ్తో వెళ్లిన తర్వాత కూతుర్ని ఇంటికి రాకుండా అన్ని దారులు మూసేశారా? అని మీడియా ప్రశ్నించగా.. కూతురు హత్య అనంతరం తమపై అందరూ అనేక నిందలు వేశారని శ్రద్ధా తండ్రి వాపోయారు. కొందరు గొడవ పడి మరీ ఇంట్లోంచి వెళ్లింది మళ్లీ ఎలా రానిస్తారంటూ ప్రశ్నలు వేశారని తెలిపారు. అయితే తన కూతురు ఇంట్లోంచి వెళ్లే ముందు ఎన్నో రకాలుగా ప్రశ్నించినా ఆమె దేనికి సమాధానమివ్వకుండా వెళ్లిపోయిందని కన్నీటిపర్యంతమయ్యారు. తమకు ఈ కేసులో న్యాయం చేస్తామని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ పోలీసు అధికారులు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారని శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్ చెప్పారు. కాగా, అఫ్తాబ్ అమీన్ పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని 14 రోజులు పొడిగించినట్లు పోలీసుల వర్గాలు తెలిపాయి. చదవండి: 15 ఏళ్ల నుంచి పరారీలో నిందితుడు.. హోటల్లో మేనేజర్గా అవతారం ఎత్తి.. -
కొడుకు హత్యకు తండ్రి సుపారీ
సాక్షి, హుబ్లీ: నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారి భరత్ జైన్ కుమారుడు అఖిల్జైన్ మిస్సింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. సాక్షాత్తూ తండ్రే కిరాయి హంతకులతో ఒప్పందం చేసుకొని కుమారున్ని హత్య చేయాలని సుపారీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 1న మిస్సింగ్ అని ఫిర్యాదు వివరాలు.. అఖిల్ జైన్ ఈ నెల 1 నుంచి కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు కేశ్వాపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అఖిల్ గురించి ఆరా తీశారు. రకరకాల దురలవాట్లకు బానిసైన అఖిల్ గురించి ఇంట్లో వారు ఎంతో మనోవేదనకు గురైనట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ క్రమంలో అఖిల్తో పాటు కుటుంబ సభ్యల ఫోన్ కాల్స్ను పరిశీలించగా కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. అఖిల్ తండ్రి భరత్ కొందరు ప్రముఖ రౌడీలకు అందుబాటులో ఉన్నట్లు తెలిసింది. అఖిల్ మిస్సింగ్ ముందు అతని తండ్రి రౌడీలతో తరచూ మాట్లాడాడు. భరత్ జైన్ను పిలిచి విచారించగా అసలు విషయం తెలిసింది. కుమారుడిని తానే రౌడీలకు చెప్పి హత్య చేయించానని భరత్ జైన్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు. మృతదేహం దొరకనందున పోలీసులు ఇంకా ధ్రువీకరించడం లేదు. అఖిల్ హతమై ఉంటాడని అనుమానంతో దేవరగుడిహళిలోని భరత్జైన్ ఫాంహౌస్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో శవం కోసం పోలీసులు గాలిస్తున్నారు. కిరాయి హంతకులు దొరికితే మిస్టరీ వీడనుంది. (చదవండి: కాళ్లు పట్టుకున్నా.. అన్నని వదల్లేదు.. భార్యతో సంబంధం పెట్టుకున్నాడంటూ..) -
రాజస్తాన్ గ్యాంగ్స్టర్ హత్య.. వెలుగులోకి మరో దారుణం
రాజస్తాన్ గ్యాంగ్ వార్లో పేరుమోసిన గ్యాంగ్స్టర్ రాజు థెట్తో సహా ఇద్దరు వ్యక్తులు కాల్పుల్లో చనిపోగా, మరోకరు గాయపడిన సంగతి తెలిసిందే. పోలీసుల నివేదిక ప్రకారం శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో గ్యాంగ్స్టర్ రాజు ఇంటివద్దే నలుగురు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపినట్లు తేలింది. ఐతే ఈ ఘటనలో గ్యాంగ్స్టర్ రాజు తోపాటు మృతి చెందిన మరో వ్యక్తి తారాచంద్ కద్వాసర్గా పోలీసులు గుర్తించారు. అతడు తన కుమార్తెను కోచింగ్ సెంటర్లో చేర్చేందుకు ఆ ప్రాంతానికి వచ్చినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో అతని బంధవు కూడా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో అనేక హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. మృతి చెందిన గ్యాంగ్స్టర్ థెట్ సోదరుడు కూడా ఇక్కడే హాస్టల్ నడుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్యాంగ్స్టర్ రాజుతేత్కు రాష్ట్రంలో షెఖావతి ప్రాంతంలో మరో మఠాతో వైరం ఉంది. ఈ హత్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో నిందితుడు థెట్పై కాల్పులు జరిపి.. బాటసారులను, సాక్ష్యులను భయపెట్టడానికి గాల్లో కాల్పులు జరుపుకుంటూ వెళ్లిపోతున్నట్లు కనిపించింది. ఇదిలా ఉండగా హత్య జరిగిన వెంటనే... లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా పరిచయం చేసుకున్న రోహిత్ గోదారా అనే వ్యక్తి ఫేస్బుక్లో ఈ హత్యకు తానే బాధ్యుడునంటు ప్రకటించుకున్నాడు. అంతేగాక ఆనంద్పాల్ సింగ్, బల్బీర్ బానుదా హత్యలకు ప్రతీకారంగా గ్యాంగ్స్టర్ రాజుని హతమార్చినట్లు తెలిపాడు. (చదవండి: వీడియో: గ్యాంగ్వార్.. పట్టపగలు బుల్లెట్ల వర్షం.. గ్యాంగ్స్టర్ రాజు దారుణ హత్య) -
వివేకాను హత్య చేయించింది అల్లుడు, పెద్ద బావమరిదే
సాక్షి, అమరావతి/కడప అర్బన్: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్న కోణాలు తొలిసారిగా న్యాయస్థానం దృష్టికి వచ్చాయి. షమీమ్ అనే మహిళను వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుమార్తె, అల్లుడు, పెద్దబావమరిదితో తలెత్తిన ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలే ఈ హత్యకు కారణమని ఈ కేసులో అరెస్టయిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల మెజిస్ట్రేట్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్రెడ్డే హత్యకు కుట్ర పన్నారని చెప్పారు. పులివెందులలో రాజకీయ ఆధిపత్యం కోసం టీడీపీ నేత బీటెక్ రవి, ఆర్థిక, రాజకీయ విభేదాలతో కొమ్మారెడ్డి పరమేశ్వరరెడ్డి, వైజీ రాజేశ్వరరెడ్డి, నీరుగట్టు ప్రసాద్లు ఈ హత్య కుట్రలో భాగస్వాములయ్యారని తెలిపారు. వారిని విచారిస్తే ఈ హత్య కేసును ఛేదించవచ్చన్నారు. సీబీఐ ఉద్దేశ పూర్వకంగానే వాస్తవాలను విస్మరిస్తూ నిరపరాధులను అరెస్టులతో వేధిస్తోందని ఆమె వివరించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కుట్ర కోణాన్ని వివరించడంతోపాటు.. సాగాల్సిన రీతిలో సీబీఐ దర్యాప్తు సాగడం లేదని తులసమ్మ ఈ ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై స్పందించిన న్యాయస్థానం ఆమె వాంగ్మూలాన్ని శనివారం నమోదు చేసింది. దాంతో ఇన్నాళ్లూ సీబీఐ కప్పిపుచ్చేందుకు యత్నించిన కీలక వాస్తవాలు న్యాయస్థానంతోపాటు యావత్ ప్రజల దృష్టికి వచ్చాయి. పులివెందుల న్యాయస్థానం నమోదు చేసిన తులసమ్మ వాంగ్మూలంలోని వివరాలను ఆమె న్యాయవాదులు రవీంద్రారెడ్డి, కోదండరామిరెడ్డిలు కడపలో మీడియాకు వెల్లడించారు. తదుపరి విచారణను డిసెంబర్ 24కు వాయిదా వేశారని తెలిపారు. న్యాయవాదులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. హత్య చేయించింది వారిద్దరే.. ► వైఎస్ వివేకానందరెడ్డి షమీమ్ అనే మహిళను రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలే ఈ హత్యకు దారి తీశాయి. బెంగళూరులో భూ సెటిల్మెంట్ ద్వారా వచ్చే రూ.4 కోట్లను తన రెండో భార్య షమీమ్కు ఇస్తాననడంతోపాటు ఆమె ద్వారా తనకు కలిగిన కుమారుడిని తన వారసుడిగా ప్రకటిస్తానని వివేకానందరెడ్డి చెప్పారు. ► వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వం ఆశిస్తున్న అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావమరిది శివ ప్రకాశ్రెడ్డి ఆయనపై కక్ష పెంచుకుని హత్యకు కుట్రపన్ని ఉండొచ్చు. వివేకా హత్య అనంతరం ఆయన కుటుంబ సభ్యుల పాత్ర సందేహాస్పదంగా ఉంది. ► వివేకానందరెడ్డి చనిపోయిన విషయాన్ని పీఏ కృష్ణారెడ్డి మొదట ఆయన కుటుంబ సభ్యులకే తెలిపారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం, ఆ ప్రదేశాన్ని వివేకా అనుచరుడు ఇనయతుల్లా తన సెల్ఫోన్ ద్వారా ఫొటోలు, వీడియోలు తీసి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డిలకు వాట్సాప్ చేశారు. వాటిని చూసిన తర్వాత కూడా శివప్రకాశ్రెడ్డి.. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి తనకు ఫోన్ చేస్తే వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు కూడా. ► వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ, సెల్ఫోన్ను తాము వచ్చే వరకు పోలీసులకు అప్పగించవద్దని పీఏ కృష్ణారెడ్డికి రాజశేఖరరెడ్డి ఆదేశించారు. వారు పులివెందుల చేరుకున్న తర్వాత సెల్ఫోన్లోని మెసేజ్లు, ఇతర వివరాలను డిలీట్ చేసిన తర్వాతే వాటిని పోలీసులకు అప్పగించారని అనుకుంటున్నారు. కాబట్టి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్రెడ్డిలే కుట్ర పన్ని వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించారని స్పష్టమవుతోంది. ఆధిపత్యం కోసం బీటెక్ రవి కుట్ర ► టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి వివేకాతో రాజకీయ విభేదాలున్నాయి. వివేకా ఉన్నంత కాలం తాను ఆధిపత్యం సాధించలేనని ఆయనకు తెలుసు. అందుకే అడ్డు తొలగించుకునేందుకు వివేకా హత్యకు సహకరించారు. ► వివేకానందరెడ్డికి ఆయన అనుచరుడిగా ఉన్న కొమ్మా పరమేశ్వరరెడ్డికి మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తాయి. దాంతో పరమేశ్వరరెడ్డి కక్ష పెంచుకుని వివేకా రాజకీయ ప్రత్యర్థి బీటెక్ రవికి సన్నిహితుడిగా మారారు. వివేకా హత్యకు ముందు ఎలిబీ సృష్టించుకునేందుకు పరమేశ్వరరెడ్డి 2019 మార్చి 13న అనారోగ్యం నెపంతో కడపలోని సన్రైజ్ ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరారు. కానీ ఎవరికీ తెలియకుండా 2019 మార్చి 14 సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో హరిత హోటల్లో రెండుసార్లు సమావేశమయ్యాడు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం గమనార్హం. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్షకు అతను తిరస్కరించడం సందేహాలకు తావిస్తోంది. కక్షగట్టిన వైజీఆర్.. సహకరించిన నీరుగట్టు ► వైఎస్సార్ కడప జిల్లాకే చెందిన వైజీ రాజేశ్వరరెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో స్థిరపడ్డాడు. ఆయన రాజకీయ ప్రత్యర్థి నారాయణరెడ్డిని వైఎస్సార్సీపీలోకి తీసుకురావాలని వివేకా భావించడంతో కక్ష పెంచుకున్నాడు. వైఎస్ వివేకాపై అప్పటికే కక్షగట్టిన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్రెడ్డి హైదరాబాద్లో వైజీ రాజేశ్వరరెడ్డితో పలుమార్లు భేటీ అయ్యారు. ► మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో టచ్లో ఉంటూ వచ్చారు. 2019 మార్చి 14న పులివెందులకు చెందిన నీరుగుట్టు ప్రసాద్ ఉద్దేశ పూర్వకంగానే వివేకా ఇంటికి ఉత్తరం వైపు తలుపు గడియ పెట్టకుండా వెళ్లిపోయారు. దీంతో హంతకులు ఆ రోజు వివేకా ఇంటిలోకి ప్రవేశించి హత్య చేశారు. దర్యాప్తును తప్పుదారి పట్టిస్తున్న సీబీఐ ► సీబీఐ ఉద్దేశ పూర్వకంగానే ఈ కేసు దర్యాప్తును తప్పుదారి పట్టిస్తోంది. హత్యలో స్వయంగా పాల్గొన్న దస్తగిరిని అప్రూవర్గా మార్చడంతోపాటు అతని ముందస్తు బెయిల్ను వ్యతిరేకించక పోవడం సీబీఐ దురుద్దేశాలను వెల్లడిస్తోంది. ఈ హత్యలో అసలు కుట్రదారులుగా భావిస్తున్న నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్రెడ్డి, కొమ్మా పరమేశ్వరరెడ్డి, బీటెక్ రవి, వైజీ రాజేశ్వరరెడ్డి, నీరుగుట్టు ప్రసాద్లను సీబీఐ ఇప్పటి వరకు విచారించనే లేదు. విచారణ, అరెస్టుల పేరిట నిరపరాధులను వేధిస్తోంది. ► వివేకా హత్య కేసులో పలువురి కాల్ డేటాలు, సీసీ టీవీ ఫుటేజీలు, ఇతర శాస్త్రీయ ఆధారాలను సిట్ బృందాలు సేకరించాయి. కేసును దాదాపు ఓ కొలిక్కి తెచ్చేందుకు సిద్ధమైన తరుణంలో సిట్ దర్యాప్తును అడ్డుకుంటూ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హత్య వెనుక తన కుటుంబ సభ్యుల పాత్ర బయట పడుతుందనే ఆమె సిట్ దర్యాప్తును అడ్డుకున్నారు. గతంలో ఈ కేసును దర్యాప్తు చేసిన సిట్ బృందం సేకరించిన శాస్త్రీయ ఆధారాలు, కీలక అంశాలను సీబీఐ అధికారులు కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకపోవడం సందేహాలకు తావిస్తోంది. ► సిట్ బృందాలు గతంలో నమోదు చేసిన కేస్ డైరీలు రెండింటినీ న్యాయస్థానం తెప్పించుకుని పరిశీలించాలి. నిజాయితీగా దర్యాప్తు చేయాలి. ఆ ఆరుగురినీ విచారించాలి. అప్పుడే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కుట్రను ఛేదించవచ్చు. దోషులను గుర్తించి శిక్షించవచ్చు. ఈ ప్రశ్నలకు బదులేదీ? ► వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ, సెల్ఫోన్ను ఎందుకు వెంటనే పోలీసులకు అప్పగించలేదు? ► నర్రెడ్డి రాజశేఖరరెడ్డి వచ్చాక సెల్ఫోన్లోని డేటాను డిలీట్ చేయడం నిజం కాదా? ► ఆ లేఖను వెంటనే పోలీసులకు ఇచ్చి ఉంటే అది హత్యేనని అప్పుడే తెలిసుండేది కదా? ► రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం ఫొటోలు చూసి కూడా అది హత్య అని శివప్రకాష్రెడ్డికి తెలియలేదా? ► అయినా గుండెపోటుతో మృతి చెందాడని అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డికి ఎందుకు చెప్పినట్లు? ► వివేకా రెండవ భార్య షమీమ్, వివేకా కూతురు సునీతల మధ్య వాట్సాప్ చాటింగ్లు సాగలేదా? ► వారి మధ్య జరిగిన చాటింగ్ వివరాలు ఎందుకు బయటకు వెల్లడించలేదు? ► నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్రెడ్డిలు షమీమ్తో గొడవ పడలేదా? ► వివేకా.. షమీమ్కు ఇవ్వాలనుకున్న ఇంటిని వీరు లాక్కోవడం నిజం కాదా? -
పెళ్లైన 5 నెలలకే ఘోరం.. నర్సుతో లవ్ ఎఫైర్.. భార్యకు ఇంజెక్షన్లు ఇచ్చి..
ముంబై: ఆ జంటకు పెళ్లై అయిదు నెలలు. భవిష్యత్తుపై ఎన్నో ఊహలు, ఆశలతో వైవాహిక బంధంలోకి అడ్డుగుపెట్టిన ఆ ఇల్లాలి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లై ఏడాది గడవకముందే భర్త పరాయి స్త్రీ మోజులో పడ్డాడు. జీవితంలో తోడూ నీడై తనకు అండగా ఉండాల్సిన వ్యక్తే ఆమె పాలిట యముడయ్యాడు. వాహేతర సంబంధానికి అడ్డొస్తుందనే కారణంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఆపై ఆమె ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించేందుకు ఓ పెద్ద కథను కూడా అల్లాడు. కానీ అదికాస్తా బెడిసి కొట్టడంతో చివరకు తప్పను ఒప్పుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. స్వప్నిల్ సావంత్(23) అనే యువకుడు పుణెలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నాడు. అయిదు నెలల క్రితం ప్రింయాంక క్షేత్రేని వివాహం చేసుకొని అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. కొంతకాలంగా అక్కడే నర్సుగా చేస్తున్న సహోద్యోగితో సావంత్ ఎఫైర్ నడుపుతున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పెళ్లికి తన భార్య అడ్డుగా ఉందని భావించి ఆమెను అంతమొందించాలనుకున్నాడు. నవంబర్ 14న భార్యకు ప్రాణాంతక ఇంజెక్షన్లు ఇచ్చి చనిపోయేలా చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వివాహితను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. భార్య హత్యను ఆత్మహత్యగా నమ్మించేందుకు కుట్ర పన్నాడు. ప్రియాంక రాసినట్లు ఓ సుసైడ్ లేఖ కూడా రాశాడు. అయితే పోలీసులకు భర్త ప్రవర్తనపై అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. దర్యాప్తులో చేసిన నేరాన్ని అంగీకరించాడు. పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి వెకురోనియం బ్రోమైడ్, నైట్రోగ్లిజరిన్ ఇంజెక్షన్లు,లోక్స్ 2% సహా కొన్ని మందులు ఇంజెక్షన్లను దొంగిలించాడని తేలింది. వాటిని భార్యకు ఇచ్చి హత్య చేసిన్టలు ఒప్పుకున్నాడు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని.. పూర్తి దర్యాప్తు జరుగుతోందని ఇన్స్పెక్టర్ మనోజ్ యాదవ్ వెల్లడించారు. చదవండి: కోవిడ్లోనూ రెచ్చిపోయిన నాగేంద్ర బాబు.. వలలో ఎందరో సినీ ప్రముఖులు -
మాజీ ఎంపీపీపై హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్
తుని: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ పోల్నాటి శేషగిరిరావుపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు అగ్రహారపు చంద్రశేఖర్ను అరెస్ట్ చేసినట్లు అదనపు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. తునిలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. విశాఖపట్నం ఆరిలోవ పెద్దగదుల ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్.. అదే ప్రాంతానికి చెందిన అభిరామ్కు శిష్యుడు. ఇతర ప్రాంతాలకు వెళ్లి పూజలు చేసే వీరు కొంతకాలంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం నామవరంలో రిటైర్ట్ ఉద్యోగి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పోల్నాటి శేషగిరిరావు తనను ఇబ్బందిపెట్టాడని, అతడిని గాయపరిస్తే సొమ్ము ఇస్తానని వారికి గురువు అభిరామ్ చెప్పాడు. దీంతో చంద్రశేఖర్ తన స్నేహితులతో కలిసి శేషగిరిరావు కదలికలపై నిఘాపెట్టాడు. ఈ నెల 17న ఉదయం చంద్రశేఖర్ భవానీమాల ధరించి, ముఖానికి మాస్క్ పెట్టుకుని తుని సమితి ఆఫీసు వీధిలో నివాసం ఉంటున్న శేషగిరిరావు ఇంటికి మోటారు సైకిల్ మీద వెళ్లాడు. భిక్షం అడిగాడు. బియ్యం వేస్తుండగా శేషగిరిరావుపై కత్తితో దాడిచేసి పారిపోయాడు. శేషగిరిరావు అక్కడే పడిపోయిన కత్తిని తీసుకుని వెంటపడి చంద్రశేఖర్ వీపుపై దాడిచేయడంతో గాయమైంది. శేషగిరిరావు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ రవీంద్రనాథ్బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో వచ్చిన ఊహాచిత్రం ఆధారంగా విస్తృతస్థాయిలో గాలించారు. పోలీసులు గాలిస్తున్నట్లు తెలుసుకున్న చంద్రశేఖర్ బుధవారం తుని పట్టణ పోలీస్స్టేషన్కు వచ్చి దర్యాప్తు అధికారి డీఎస్పీ మురళీమోహన్కు లొంగిపోయాడు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చంద్రశేఖర్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ మురళీమోహన్, తుని, ప్రత్తిపాడు సీఐలు నాగదుర్గారావు, కిశోర్బాబు పాల్గొన్నారు. -
15 మంది బాయ్ఫ్రెండ్స్.. భర్త హత్య కేసులో భార్య లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి..
బనశంకరి(కర్ణాటక): యలహంకలో నేత కార్మికుని దారుణ హత్య కేసులో భార్య శ్వేత లీలలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏది తప్పో ఏది ఒప్పో తెలిసినప్పటికీ పట్టించుకోకుండా అడుగులేసింది. ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది. ఈ నెల 22వ తేదీన యలహంక కొండప్పలేఔట్లో మేడపై హత్యకు గురైన సత్యసాయి జిల్లా హిందూపురం వాసి చంద్రశేఖర్ (35) కేసులో భార్య శ్వేత, ఆమె ప్రియుడు సురేశ్లను పోలీసులు బుధవారం అరెస్టు చేసి విచారణ చేపట్టారు. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడు సురేశ్ను పిలిపించి హత్య చేయించినట్లు విచారణలో తెలిపింది. కాలేజీలో ఇష్టానుసారం స్నేహాలు బెంగళూరులో ఎంఎస్సీ చదివిన శ్వేత కాలేజీలో పలువురు స్నేహితులతో డేటింగ్ చేసింది. టీవీలు, సినిమాలు చూసి అదే లోకం అనుకుంది. ఎక్కువ మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండడం గొప్ప అనుకుని అలాగే చేసేది. కనీసం 15 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారని, కొన్నిరోజులు షికార్లు చేసిన తరువాత వారిని బ్లాక్ లిస్టులో పెట్టేదని తెలిసింది. ఇంటి యజమాని కుమారునితోనూ చనువుగా మెలిగింది. అతనితో బైక్పై కాలేజీకి వెళ్లేది. ప్రియుడు సురేశ్తో సంబంధం కొనసాగిస్తోంది. ఇవి భర్త చంద్రశేఖర్కు తెలియడంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఇక ప్రియుడు సురేశ్తో మాట్లాడానికి కొత్త సిమ్కార్డును కొని అందులో హత్య కుట్ర గురించి మాట్లాడింది. భర్తను పైకి పంపింది ఇలా ఈ నెల 22 తేదీన సురేశ్ను ఇంటికి పిలిపించింది. భర్త చంద్రశేఖర్ పని నుంచి ఇంటికి రాగానే నీరు రావడం లేదు, పైకి ట్యాంకు వద్దకు వెళ్లి చూడాలని శ్వేత చెప్పింది. అతడు వెళ్లగానే అక్కడ దాగి ఉన్న సురేశ్ రాడ్తో తలపై కొట్టి, మర్మాంగం కత్తిరించి హత్య చేసి ఉడాయించాడు. తరువాత తనకేమి తెలియనట్లు శ్వేత నాటకమాడింది. భర్త శవంపై పడి వెక్కివెక్కి విలపించింది. ఆమెపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా విషయమంతా వివరించింది. చదవండి: భర్త కంటే 16 ఏళ్లు చిన్న.. వివాహేతర సంబంధం మోజుతో -
టపాసులు కాల్చొద్దు అన్నందుకు హత్య
ముంబై: ఒక వ్యక్తి టపాసుల కాల్చొద్దని చెప్పినందుకు ముగ్గురు మైనర్ల చేతిలో హతమయ్యాడు. ఈఘటన శివాజి నగర్లోని గోవాండిలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... ముగ్గురు మైనర్లు బహిరంగంగా సీసాలో టపాసులు పెట్టి కాలుస్తున్నారు. దీంతో 21 ఏళ్ల వ్యక్తి వారిని అలా టపాసులు కాల్చొద్దు అని వారించాడు. ఆ తర్వాత ఇరువైపులా మాటా మాటా పెరిగి వాగ్వాదం తలెత్తింది. అంతే కోపంతో ఒక మైనర్ సదరు వ్యక్తిని దారుణంగా కొట్టి చాకుతో మెడపై పొడిచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ సదరు వ్యక్తీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఎందుకలా చూస్తున్నారు అని ప్రశ్నించాడని...కొట్టి చంపేశారు) -
దొంగతనం కోసం వచ్చి ఆత్మహత్య..
కృష్ణరాజపురం: ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి చోరీ చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇందిరానగర పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు... ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంటిలోకి చొరబడిన దిలీప్ బహదూరు ఇంటి మొత్తాన్ని గాలించి అనంతరం అదే ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు ఇంటికి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేడ మీద దాడి చేసి హత్య బనశంకరి: ఓ వ్యక్తిని అతని ఇంటి మేడపైనే తీవ్రంగా కొట్టి హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన యలహంక పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏపీలో సత్యసాయి జిల్లాలోని హిందూపురం నివాసి చంద్రశేఖర్ (33) హతుడు. యలహంక కొండప్ప లేఔట్లో గత 8 ఏళ్లుగా ఇక్కడ మూడంతస్తుల భవనంలో ఒక ఇంట్లో చంద్రశేఖర్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇతను చేనేత కార్మికునిగా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి 8.45 సమయంలో ఇంటి మేడపైన గుర్తుతెలియని దుండగులు చంద్రశేఖర్ తల, మర్మాంగంపై దాడిచేసి ఉడాయించారు. కుటుంబసభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి మృతి చెందాడని ధృవీకరించారు. యలహంక పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి హంతకుల కోసం గాలింపు చేపట్టారు. ఆర్థిక వివాదాలు, లేదా వివాహేతర సంబంధం హత్యకు కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. బంధువు, భార్యపై అనుమానాలు.. పోలీసుల ప్రాథమిక విచారణలో హతుని బావమరిది లోకేశ్పై అనుమానం వ్యక్తమైంది. లోకేశ్ హతుని భార్యకు బంధువు అవుతాడు. గతంలో ప్రేమించాలని ఆమె వెంటపడ్డాడు. ఇతని వేధింపులు తాళలేక హిందూపురం పట్టణ పోలీస్స్టేషన్లో చంద్రశేఖర్ దంపతులు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో పోలీస్స్టేషన్ వద్ద లోకేశ్ను చంద్రశేఖర్ భార్య చెప్పుతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో హత్య లోకేశ్ చేశాడా అనే అనుమానం వ్యకమైందని ఆగ్నేయ విభాగ డీసీపీ అనూప్శెట్టి తెలిపారు. మరోవైపు హతుని భార్యకు ఈ హత్యతో సంబంధం ఉందా? అని కూడా అనుమానం వ్యక్తమైంది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. (చదవండి: వర్సిటీ మెస్ల నిర్వాకం.... చిప్పతో చట్నీ పోసెయ్) -
తండ్రి కొడుకుల హత్య కేసు: మరణాంతరం నేత్ర దానం
ఉప్పల్: ఉప్పల్లో ఇటీవల దారుణ హత్యకు గురైన తండ్రీ కొడుకులు నర్సింహ శర్మ, శ్రీనివాస్ల నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పతికి దానం చేసినట్లు మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. సమాజానికి ఉపయోగపడేలా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నరసింహ శర్మ కుమారుడు, కూతుళ్లు పేర్కొన్నారు. (చదవండి: తండ్రి కొడుకుల జంట హత్య కేసు దర్యాప్తు ముమ్మరం) -
పురం’పై వైఎస్సార్ సీపీ జెండా ఎగరాలి
హిందూపురం: ‘చౌళూరు రామకృష్ణారెడ్డికి వైఎస్ రాజశేఖర్రెడ్డి అంటే ఎనలేని గౌరవం. జగనన్న అంటే అపార అభిమానం. అందుకే కెనడాలో చదువుకున్న ఆయన, మంచి ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. హిందూపురంలో వైఎస్సార్ సీపీ జెండా కట్టి పార్టీకి పునాదులు వేశారు. పురంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేయాలన్నదే ఆయన ఆశయం. అందువల్ల కార్యకర్తలంతా కలిసి 2024లో హిందూపురంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసి ఆయనకు ఆత్మకుశాంతి కలిగించాలి’ అని చౌళూరు సతీమణి జ్యోత్స్న, సోదరి మధుమతి, బావ నాగభూషణంరెడ్డి, ఇతర కుటుంబసభ్యులు పిలుపునిచ్చారు. శుక్రవారం హిందూపురంలోని ఈడిగ ఫంక్షన్హాలులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రామకృష్ణారెడ్డి సంతాపసభ జరిగింది. ముందుగా రామకృష్ణారెడ్డి చిత్రపటానికి కుటుంబీకులతో పాటు ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్రెడ్డి పార్టీ ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులరి్పంచి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం రామకృష్ణారెడ్డి సతీమణి, సోదరి, ఇతర కుటుంబీకులు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని, తప్పకుండా న్యాయం జరుగుతుందన్న దృఢ విశ్వాసం ఉందన్నారు. దోషులు ఎంతటివారైనా వారికి శిక్షపడాలన్నారు. ఐక్యంగా పోరాడదాం.. చౌళూరు హత్య కేసులో అనుమానాలు ఉన్నాయని ఏపీ అగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ అన్నారు. ఆయన ఇంటి ముందే చౌళూరును దారుణంగా హత్య చేశారంటే, హంతకుల వెనుక ఎవరో పెద్దలున్నారనిపిస్తోందన్నారు. హత్య కేసులోని అనుమానితుల్లో కొందరిని ఎందుకు అరెస్టు చేయడం లేదన్నారు. రామకృష్ణారెడ్డి ఏ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారో, ఎందుకోసం కష్టపడ్డారో దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇకపై పిడికిలి బిగించి అందరం ఒక్కటై రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించినప్పుడే రామకృష్ణారెడ్డి ఆత్మకుశాంతి, నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బలరామిరెడ్డి, ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, రత్నమ్మ, మార్కెట్ యార్డు చైర్మన్ కొండూరు మల్లికార్జున, కౌన్సిలర్లు ఆసీఫ్వుల్లా, రామచంద్రా, షాజియా, డైరెక్టర్లు లక్ష్మీనారాయణ, జనార్దన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కొటిపి హనుమంతరెడ్డి, నాగరాజు, హబీబ్, చంద్ర, మహేశ్, దాదు, నక్కలపల్లి శ్రీరాములు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (చదవండి: చౌళూరు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది ) -
చౌళూరు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది
హిందూపురం: చౌళూరు రామకృష్ణారెడ్డి హత్యకేసు దర్యాప్తులో ఎలాంటి ఒత్తిళ్లకూ తావుండదని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఎవరైనా అలాచేస్తే ముఖ్యమంత్రి, తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. పోలీసులను మభ్యపెట్టి చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని, ఈ కేసు పురోగతిని స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. రామకృష్ణారెడ్డి కుటుంబానికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. హిందూపురం నియోజకవర్గం చౌళూరులో ఇటీవల హత్యకు గురైన నియోజకవర్గ వైఎస్సార్ సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులను మంగళవారం ఆయన పరామర్శించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. తనకు, తన కుమారుడు మిథున్రెడ్డికి వ్యక్తిగతంగా కూడా కావాల్సిన వ్యక్తి రామకృష్ణారెడ్డి అని చెప్పారు. రామకృష్ణారెడ్డిని కోల్పోవడం పార్టీకి నష్టమని చెప్పారు. దోషులు ఎవరైనా వదిలేది లేదని, అందుకు తాను హామీ అని వారికి మంత్రి భరోసా ఇచ్చారు. రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శంకర్నారాయణ, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, సిద్ధారెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ నవీన్నిశ్చల్ ఉన్నారు. -
చౌళూరు హత్యకేసు దర్యాప్తు ముమ్మరం
హిందూపురం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి హత్యకేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటికే నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు హంతకుల కోసం వేట సాగిస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటకలోను గాలిస్తున్నాయి. హత్య జరిగిన ప్రదేశంలో అనుమానమున్న వస్తువులు, వేలిముద్రలను క్లూస్ టీం సేకరించింది. తనిఖీల్లో వేటకొడవలి పిడి కూడా దొరికింది. సంఘటన జరిగిన వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. చౌళూరు గ్రామానికే చెందిన నేరచరిత్ర కలిగిన వరుణ్ అలియాస్ మంజు పాత్ర ఉందేమోనన్న కోణంలోను దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రామకృష్ణారెడ్డి హత్య జరిగినప్పటి నుంచి వరుణ్ అజ్ఞ్తాంలోకి వెళ్లిపోయాడు. రామకృష్ణారెడ్డి వ్యాపార, ఆర్థిక లావాదేవీలు, రాజకీయ విభేదాలు, ధాబా పునరుద్ధరణ విషయంలో తలెత్తిన సమస్యలు తదితర అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇది సుపారీ హత్యనా అనే కోణంలోను దర్యాప్తు సాగిస్తున్నారు. ఇటీవల రామకృష్ణారెడ్డి రాజకీయంగానే కాకుండా బెంగళూరులో వ్యాపారపరంగాను కొంత బిజీగా ఉంటూ వచ్చారు. తన ధాబా వద్ద బార్ ఏర్పాటు చేసేందుకు పనులు చేపడుతున్నారు. ఈ విషయంలో ఆయనకు వరుణ్తో గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బార్ కూడా ప్రారంభిస్తే రామకృష్ణారెడ్డి ఆర్థికంగా మరింత బలంగా తయారవుతారన్న కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే విషయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులు మాత్రం రాజకీయంగా వ్యతిరేకులే హత్యకు కారణమని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైతే స్పష్టమైన కారణాలేవీ తెలియడంలేదు. సమగ్ర దర్యాప్తు కొనసాగించి నిజాలు తేలుస్తామని పోలీసులు చెబుతున్నారు. రూరల్ సీఐ, ఎస్ఐలపై శాఖాపరమైన చర్యలు హిందూపురం అప్గ్రేడ్ రూరల్ పోలీసుస్టేషన్ సీఐ జి.టి.నాయుడు, ఎస్ఐ కరీంలను వీఆర్కు పంపుతూ ఎస్పీ రాహుల్దేవ్ సింగ్ ఉత్తర్వులిచ్చారు. చౌళూరు రామకృష్ణారెడ్డి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు తెలిపినా రక్షణ కల్పించలేదన్న కారణంతో వీరిపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. విచారణాధికారిగా టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లును నియమించారు. ఆయన రూరల్ స్టేషన్ ఇన్చార్జ్గాను వ్యవహరిస్తారు. -
అనుమానంతో భార్యను హత్య చేసి.. అత్తమామ ఇంటికి తీసుకెళ్లి
సాక్షి, బెంగళూరు: అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్యను అనుమానించి చివరికి హత్య చేసిన ఘటన సోమవారం రాత్రి హగరిబొమ్మనహళ్లి తాలూకా బ్యాసగదేరి గ్రామంలో జరిగింది. విజయనగర జిల్లా ఎస్పీ డాక్టర్ అరుణ్ తెలిపిన మేరకు వివరాలు..బ్యాసగదేరి నివాసి రవికుమార్(32) తన బంధువు దీపా(21)తో దాదాపు ఏడాదిన్నర క్రితం పెళ్లయింది. అప్పటి నుంచి భార్యపై అనుమానపడుతూ నిత్యం గొడవ పడుతుండేవాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి గొంతు నులిమి హత్య చేశాడని తెలిపారు. హత్య చేసిన అనంతరం అదే గ్రామంలో నివాసముంటున్న తన అత్తమామ ఇంటికి వద్దకు తీసుకెళ్లి మృతదేహాన్ని అక్కడ వదిలేసి వెళ్లాడని తెలిపారు. మృతురాలి తల్లి గౌరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని రవికుమార్తో పాటు అతని తండ్రి షణ్ముఖప్ప, తల్లి జయమ్మ, అక్క శిల్ప, చెల్లెలు సుజాతలను బంధించి కస్టడీకి అప్పగించినట్లు తెలిపారు. చదవండి: నల్లగా ఉన్నావంటూ భార్యతో గొడవ.. గొడ్డలితో భర్తను నరికింది -
మా అమ్మను నాన్నే చంపాడు.. మూడున్నరేళ్ల చిన్నారి చెప్పిన షాకింగ్ నిజాలు
కాకినాడ క్రైం: తన తల్లిని తండ్రే హతమార్చాడని మూడున్నరేళ్ల చిన్నారి చెప్పిన సాక్ష్యం ఆధారంగా చేపట్టిన విచారణలో కీలక వాస్తవం వెలుగు చూసింది. పసిబిడ్డ చెప్పినట్లు నిందితుడు మృతురాలి భర్తేనని తమ దర్యాప్తులో నిర్ధారణ కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను కాకినాడ టూ టౌన్ సీఐ రామచంద్రరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కాకినాడ రామకృష్ణారావుపేట జెండా వీధిలో ఒడిశాకు చెందిన మానిక్ ఘోష్ తన భార్య లిపికా మండల్, మూడున్నరేళ్ల కుమార్తె కృషికా ఘోష్తో కలిసి నివసిస్తున్నాడు. నగరంలోని మెయిన్రోడ్డులోని స్టార్ హోటల్లో మానిక్ సర్వీసు కెప్టెన్గా పనిచేస్తున్నాడు. చదవండి: చివరి సారిగా నిన్ను చూడాలి.. భార్య వాట్సాప్ కాల్.. ఇంతలోనే.. ఈ నెల 21వ తేదీ తెల్లవారుఝామున తన భార్య లిపికా ఛాతి నొప్పితో మరణించిందని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. వారు వచ్చాక దహన సంస్కారాలు పూర్తి చేశాడు. ఈ లోపు మానిక్ మూడున్నరేళ్ల కుమార్తె కృషికా తన తాతయ్యకు గడచిన రోజు రాత్రి తన తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవను వచ్చీ రాని మాటలతో చెప్పింది. తన తండ్రి తల్లిని కొట్టాడని.. సైగలతో వివరించింది. దీంతో అనుమానించిన లిపికా కుటుంబ సభ్యులు కాకినాడ టూ టౌన్ పోలీసుల్ని ఆశ్రయించారు. పసిబిడ్డ పోలీసులకు జరిగిన ఘోరాన్ని పూసగుచ్చినట్లు వివరించింది. పెద్ద మెదళ్లకు అర్థం కాదనుకుందో ఏమో తన మెడను తానే నొక్కుకుంటూ మా... మా... అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో పోలీసులకు పసిబిడ్డ ఆవేదన అర్థమైంది. అప్పటికే వీఆర్వో సమాచారం ఆధారంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులకు చిన్నారి సాక్ష్యం కీలకమైంది. అనుమానంతో వేధింపులు హత్య కోణంలోనే దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులకు మానిక్ గత మే నెలలో భార్యను అదనపు కట్నం, అనుమానంతో వేధింపులకు గురి చేయడం వల్ల స్వస్థలం ఒడిశా రాష్ట్రంలో అతడిపై కేసు నమోదైందన్న విషయం తెలిసింది. అంతేకాక మనమిద్దరం తెల్లగా ఉంటే బిడ్డ ఎందుకు నల్లగా పుట్టిందని అనుమానిస్తూ లిపికాను హింసించేవాడని విచారణలో వెల్లడైంది. లిపికా మృతి చెందిన ఇంటిలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగా మానిక్ హత్య చేశాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆధారాలన్నీ సేకరించి మానిక్ను విచారించడం మొదలు పెట్టారు. తానేమీ ఎరుగనని, అమాయకుడినని చెబుతూ వచ్చిన మానిక్ పోలీసులు తమదైన శైలిలో విచారించే సరికి స్వరం మార్చాడు. నోరు తెరిచాడు. చేసిన ఘోరాన్ని వివరించి చెప్పాడు. భార్యను హతమార్చింది తానేనని అంగీకరించాడు. దీంతో అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును హత్య కేసుగా మార్చారు. హంతకుడు మానిక్ను ఆదివారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. రిమాండ్కు తరలించనున్నామన్నారు. నిందితుడిని శనివారమే అరెస్టు చేశారన్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. -
స్టేషన్లో గొడవతో హత్యకు సుపారీ
తుమకూరు: హుళియారు పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ సుధా హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఆమెను హత్య చేయడానికి సహచర కానిస్టేబుల్ రాణినే సుపారీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే మంజునాథ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా అతనికి సహకరించిన వ్యక్తి పట్టుబడ్డాడు. కానిస్టేబుల్ రాణితో పాటు నిఖేశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రాణం తీసిన గొడవ హుళియారు పీఎస్లో సుధాతో పాటు రాణి అనే మహిళా కానిస్టేబుల్ కూడా పనిచేస్తోంది. అయితే డ్యూటీ విషయాలతో పాటు సుధా, రాణి ఇద్దరు తరచూ డబ్బుల గురించి గొడవ పడేవారు. ఇద్దరు మూడు నాలుగు సార్లు స్టేషన్లోనే తీవ్రంగా రగడ పడినట్లు సమాచారం. దీంతో ఎలాగైనా సుధను అడ్డుతొలగించుకోవాలని రాణి పథకం వేసింది. ఏకంగా సుధకు వరుసకు సోదరుడైన మంజునాథ్కు సుపారీ ఇచ్చింది. దీంతో రాణి వద్ద సుపారీ తీసుకున్న మంజునాథ్ (23), తన స్నేహితుడు నిఖేశ్ (30) సాయంతో సుధను కారులో తీసుకుని పోయి హాసన్ వద్ద హత్య చేసి పొదల్లో పడేసి వెళ్లిపోయాడు. తరువాత భయాందోళనకు గురైన మంజునాథ్ శివమొగ్గకు చేరుకుని అక్కడ ఓ లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో ముగ్గురిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ కేవీ మూర్తి తెలిపారు. (చదవండి: ఫోటోలు లీక్, ప్రియుడు ఖతం) -
అనంతబాబు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
సాక్షి, అమరావతి: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులు 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయనందున డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటూ అనంతబాబు దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై జస్టిస్ రవి బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కలిగినీడి చిదంబరం వాదనలు వినిపిస్తూ.. 90 రోజులకు రెండు రోజుల ముందు పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారని, సాంకేతిక కారణాలతో కోర్టు దానిని తిరస్కరించిందని తెలిపారు. ఇది అసంపూర్ణ చార్జిషీట్ కిందకే వస్తుందని, అందువల్ల డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చార్జిషీట్లో లోపాలున్నాయని కోర్టు తిరస్కరించిందని, వాటిని సవరించి తిరిగి దాఖలు చేశామన్నారు. గడువులోపు దాఖలు చేసిన చార్జిషీట్ను సాంకేతిక కారణాలతో కోర్టు తిరస్కరిస్తే, దానిని సకాలంలో దాఖలు చేసినట్లుగానే భావించాలన్నారు. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదికలు అందాల్సి ఉందన్నారు. ఈ కేసులో తాను ఎవరినీ సమర్థిస్తూ వాదనలు చెప్పడంలేదని, కోర్టుకు సహాయకారిగా వ్యవహరిస్తున్నానని న్యాయమూర్తి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నేరచరిత్రను పరిగణనలోకి తీసుకోండి అనంతబాబు బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయగా, ఆమె తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. అనంతబాబుకు నేర చరిత్ర ఉందన్నారు. పోలీసులు గడువు లోపే చార్జిషీట్ దాఖలు చేశారని తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ అనంతబాబు దాఖలు చేసిన మరో పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు. -
పైసా లేదు.. రూ.30 లక్షలు ఉన్నాయని గొప్పలు.. చివరికి బిగ్ ట్విస్ట్
దొండపర్తి (విశాఖ దక్షిణ): తన వద్ద పైసా లేనప్పటికీ... రూ.30 లక్షలు ఉన్నాయని గౌరమ్మ అందరికీ గొప్పలు చెప్పుకుంది. బంగారాన్ని ఓ ఫైనాన్స్ సంస్థ లో పెట్టినట్లు హెచ్చులకు పోయింది. దీంతో ఆ డబ్బులపై కన్నేసిన ఇద్దరు స్నేహితులు ఆమెతోపాటు కుమారుడు పోలారెడ్డిని సైతం హత్య చేశారు. అనంతరం ఆమె ఇళ్లంతా వెతకగా కేవలం రూ.2 వేలు మాత్రమే దొరకడంతో వారు చెన్నైకు పారిపోయారు. చదవండి: టాలీవుడ్ నటిపై అత్యాచారం! దువ్వాడలో జరిగిన తల్లీకొడుకు మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. అయిదు రోజులపాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి హంతకులను చెన్నైలో పట్టుకున్నారు. వ్యాపారంలో నష్టపోయిన పెదగంట్యాడకు చెందిన సలివెందుల చైతన్య(32), అతని స్నేహితుడు గుంటూరు నివాసి మంద కిశోర్బాబు(32)ను అరెస్ట్ చేశారు ఈ కేసు∙వివరాలను మంగళవారం పోలీస్ కమిషనరేట్లో మీడియా సమావేశంలో కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. మంగి గౌరమ్మ (52) తన కుటుంబంతో కలిసి పెదగంట్యాడ సమీప మదీనాబాగ్ ప్రాంతంలోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ బ్లాక్ నంబర్– 3లో నివాసముంటోంది. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె మస్కట్లో ఉండగా.. మిగిలిన వారందరూ అదే బ్లాక్లో వేర్వేరు ఫ్లాట్లలో నివాసముంటున్నారు. గౌరమ్మ, ఆమె ఎదురు ఫ్లాట్లో ఉంటున్న ఒక కుమారుడు మంగి పోలారెడ్డి(36) మదీనాబాగ్లో ఉన్న గవర్నమెంట్ వైన్షాప్ పక్కన చికెన్ కబాబ్, ఫిష్ ఫ్రై అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. రూ.30 లక్షలు ఉన్నట్లు గొప్పలు గౌరమ్మ తన వద్ద డబ్బులు లేకపోయినప్పటికీ రూ.30 లక్షలు ఉన్నాయని, భూమిని కూడా కొనుగోలు చేయడానికి చూస్తున్నానని అందరికీ చెప్పుకుంటూ ఉండేది. అలాగే తన వద్ద భారీగా బంగారం ఉందని, వాటిని ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టినట్లు ప్రచారం చేసుకునేది. ఇదేవిధంగా ఆ వైన్షాప్నకు వచ్చిన సలివెందుల చైతన్య, మందకిషోర్బాబుకు కూడా చెప్పింది. క్యాంటీన్ నిర్వహణకు డబ్బుల కోసం... సలివెందుల చైతన్య ఏడాది క్రితం ఎస్టీబీఎల్లో రాయలసీమ రుచులు అనే రెస్టారెంట్ పెట్టి రూ.16 లక్షలు నష్టపోయాడు. అనంతరం ఇంట్లో గొడవలు జరగడంతో రెండు నెలల క్రితమే మదీనాబాగ్కు మకాం మార్చాడు. గౌరమ్మ దుకాణం పక్కన ఉన్న వైన్షాప్నకు వచ్చి మద్యం కొనుగోలు చేసేవాడు. ఇదే క్రమంలో గౌరమ్మ, అతడి కుమారుడు పోలారెడ్డితోపాటు మస్కట్లో ఉంటున్న గౌరమ్మ కుమార్తె సంతోషితో కూడా పరిచయం ఏర్పడింది. ఇదిలా ఉంటే చైతన్య స్టీల్ప్లాంట్ క్యాంటీన్ కాంట్రాక్ట్ను రూ.12 లక్షలకు పాడగా రూ.6 లక్షలు వెంటనే కట్టాల్సి వచ్చింది. దీంతో అంతకు ముందే గౌరమ్మ తన వద్ద రూ.30 లక్షలు ఉన్నాయని చెప్పడంతో వాటిని చేబదులుగా ఇవ్వాలని ఆమెను కోరాడు. దానికి ఆమె అంగీకరించలేదు. చైతన్య తనకు పరవాడలో కొంత స్థలం ఉందని, దానిని కొనుగోలు చేసి డబ్బు ఇవ్వమని అడిగాడు. దానికి కూడా ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమె వద్ద ఉన్న డబ్బులు ఎలాగైనా కాజేయాలని స్నేహితుడు కిషోర్బాబుతో కలిసి పథకం వేశాడు. క్లోరోఫామ్ పెట్టి చంపాలనుకొని.. గౌరమ్మను హత్య చేసి డబ్బు కాజేయాలని చైతన్య, కిషోర్బాబు అనేక రకాలుగా ప్లాన్లు వేసుకున్నారు. ముందుగా క్లోరోఫామ్ పెట్టి చంపాలని భావించారు. అయితే అది డాక్టర్ ప్రి్రస్కిప్షన్ లేకుండా దొరకదని తెలుసుకున్నారు. అదే సమయంలో ఈ నెల 7న రాత్రి పోలారెడ్డి తన అక్క సంతోషితో వీడియో కాల్ మాట్లాడుతుండగా ఫోన్ మధ్యలో కట్ అయింది. దీంతో అక్కడే ఉన్న చైతన్య తన మొబైల్ నుంచి వీడియో కాల్ చేసి అందరూ మాట్లాడారు. అనంతరం మద్యం తాగడానికి వెళ్దామని చెప్పి పోలారెడ్డిని చైతన్య, కిషోర్బాబు తీసుకెళ్లారు. వైన్షోప్లో మద్యం కొనుగోలు చేసి కొంత తాగాక... పథకం ప్రకారం మిగిలినది ఇంట్లో తాగుదామని చెప్పారు. దీంతో దుకాణం మూసి వేసిన తర్వాత చైతన్య, కిశోర్బాబు తమ బైక్ల మీద గౌరమ్మ, పోలిరెడ్డిలను ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఇంట్లోకి వెళ్లిన వెంటనే ఇద్దరూ పోలిరెడ్డి చేతులను టవల్తో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కారు. కూరగాయల కత్తితో అతడితోపాటు గౌరమ్మను కూడా హత్య చేశారు. అనంతరం ఇళ్లంతా వెతకగా కేవలం రూ.2 వేలు మాత్రమే దొరికింది. అలాగే బీరువాలో ఉన్న నగలను కూడా తీసుకొని ఇంట్లో కారం చల్లి తమ బైక్లపై వెళ్తూ మధ్యలో ఆగి వస్తువులను తనిఖీ చేయగా అవి రోల్డ్గోల్డ్గా గ్రహించారు. వాటితోపాటు హత్యకు ఉపయోగించిన కత్తి, వారు తాగిన మందుబాటిల్, గ్లాసులు, కారం డబ్బాను ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి తుప్పల్లో పడేసి యలమంచిలి వైపుగా వెళ్లిపోయారు. కుమార్తె ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో.. మస్కట్లో ఉన్న సంతోషి తన తల్లి గౌరమ్మకు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆ విషయాన్ని తన సోదరుడి కుమారుడు కల్యాణ్ రెడ్డికి చెప్పింది. దీంతో కల్యాణ్ ఇంటికి వెళ్లి చూడగా.. లోపల వస్తువులు చిందరవందరగా పడి ఉండడాన్ని గమనించారు. బెడ్రూమ్లో గౌరమ్మ, పోలిరెడ్డి రక్తపు మడుగులో ఉండడాన్ని గమనించాడు. దీంతో అతడు 8వ తేదీన దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులను తప్పుదోవ పట్టించిన కోడలు ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారించారు. గౌరమ్మ కుటుంబ సభ్యులు ఆమె కోడలు దేవిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు విచారించగా తానే హత్య చేసినట్లు చెప్పింది. హత్యకు గల కారణాలపై ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. మరోసారి తన భర్త హత్య చేశాడని, ఇంకోసారి అదే ప్రాంతంలో ఉన్న మరో నలుగురు హత్యచేశారని చెప్పింది. దీంతో పోలీసులు వారందరినీ విచారించగా ఈ హత్యలతో వారికి సంబంధం లేనట్లు నిర్ధారణైంది. ఒక్కోసారి ఒక్కో విధంగా ఆమె చెబుతుండడంతో కేసు ముందుకు సాగలేదు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేనట్లు గ్రహించిన పోలీసులు సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా ఆయా ప్రాంతాల్లో తిరిగిన వారిని గుర్తించారు. చెన్నైలో హంతకుల అరెస్ట్ తల్లీ కొడుకులను హత్య చేసిన అనంతరం చైతన్య తన భార్యకు ఫోన్ చేసి గుంటూరులో పని ఉందని, అర్జెంట్గా రెడీ అవ్వాలని చెప్పాడు. గుంటూరులో ఆమెను పుట్టింట్లో వదిలేసిన చైతన్య, స్నేహితుడు కిషోర్బాబుతో కలిసి చెన్నైకు పారిపోయాడు. పోలీసులు సీసీ కెమెరాలు, వారి ఫోన్ నంబర్లు ఆధారంగా వారు తమిళనాడులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడకు వెళ్లి వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.500 నగదు, రెండు బుల్లెట్ వాహనాలు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో అవాంతరాలు ఎదురైనా చాకచక్యంగా హంతకులను పట్టుకున్న ఏసీపీ(క్రైమ్) సీహెచ్.పెంటారావు, సౌత్ డివిజన్ క్రైమ్ సీఐ పి.సూర్యనారాయణ, సీసీఎస్ సీఐ బి.ఎం.డి.ప్రసాద్, హార్బర్ సీఐ ఎం.అవతారం, దువ్వాడ క్రైమ్ ఎస్ఐ కె.నరసింగరావు, టెక్ సెల్ ఎస్ఐ ఆర్.సోమేశ్వరరావు, గాజువాక క్రైమ్ ఎస్ఐ ఇ.మహేశ్వరరావు, స్టీల్ప్లాంట్ క్రైమ్ ఎస్ఐ ఎల్.శ్రీనివాసరావు, సీసీఎస్ హెచ్సీ సీహెచ్.మధు, గాజువాక క్రైమ్ పీసీ ఎన్.ఘాటిల్లను సీపీ అభినందించారు. సమావేశంలో డీసీపీ (క్రైమ్) నాగన్న, ఏడీసీపీ గంగాధరం, ఏసీపీ(క్రైమ్) పెంటారావు, సౌత్ డివిజన్ క్రైమ్ సీఐ పి.సూర్యనారాయణ, సీసీఎస్ సీఐ బి.ఎం.డి.ప్రసాద్, హార్బర్ సీఐ ఎం.అవతారం పాల్గొన్నారు. -
ఇద్దరితో వివాహేతర సంబంధం.. చివరికి షాకింగ్ ట్విస్ట్.. వీడిన మిస్టరీ
బాపట్ల టౌన్: దంపతుల హత్య కేసు మిస్టరీని పది నెలల అనంతరం పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడు గ్రామానికి చెందిన హనుమంతరావు, రామతులశమ్మ దంపతులు. వీరి కుమార్తె అనితకు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామానికి చెందిన సాంబశివరావుతో వివాహమైంది. పొన్నూరు మండలం మునిపల్లె గ్రామానికి చెందిన కూచిపూడి రాజ్కుమార్తో అనిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. చదవండి: ఆర్ఎంపీతో వివాహం.. పక్కింటి యువకుడితో వివాహేతర సంబంధం.. ఆయనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే మరో వ్యక్తితో అన్యోన్యంగా ఉండటం ప్రారంభించింది. ఈ విషయాన్ని గమనించిన ప్రియుడు ఆమెను నిలదీశాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె తన స్వగ్రామం పూసపాడు వెళ్లింది. రాజ్కుమార్ కూడా ఆ గ్రామానికి వెళ్లాడు. అక్కడ అనిత తల్లి రామతులశమ్మ నిందితుడితో గొడవపడింది. ఆమె కూడా అనితను సపోర్ట్ చేస్తున్నట్లు అనుమానించాడు. తనకు అనిత దూరం కావడానికి వేరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటానికి రామతులశమ్మ కారణమని కక్షపెంచుకున్నాడు. ఆమెను చంపితే అనిత తనకు దక్కుతుందని భావించి హత్యకు పథకం పన్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు అమర్తలూరు మండలం ఇంటూరు గ్రామానికి చెందిన కంచర్ల ప్రవీణ్కుమార్ అలియాస్ ప్రవీణ్, అలియాస్ కుమార్తో చర్చించాడు. ఇరువురు మద్యం తాగి 2021 నవంబర్ 19న అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై పూసపాడు చేరుకున్నారు. కొబ్బరిబొండాలు నరికే కత్తి వెంట తీసుకెళ్లారు. రామతులశమ్మతోపాటు ఆమె భర్త హనుమంతరావు కూడా పక్కనే ఉన్నాడు. ఒకరిని చంపితే మరొకరు కేకలు వేస్తారని భావించి ఇరువురిని కత్తితో నరికి హత్య చేశారు. మృతురాలి చెవికి బంగారు కమ్మలు ఉండటంతో కత్తితో చెవులు కోసి వాటిని తీసుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పది నెలల తర్వాత శుక్రవారం పొన్నూరు వద్ద నిందితులను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు నగదు ప్రోత్సాహకం దంపతుల హత్య కేసు మిస్టరీను ఛేదించిన పోలీసులను శుక్రవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలు, నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ప్రశంసలు పొందిన వారిలో చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్, ఇంకొల్లు స్టేషన్ సీఐ డి.రంగనాథ్, ఎస్ఐ నాయబ్రసూల్, హెడ్కానిస్టేబుల్ జి.పూర్ణచంద్రరావు, కానిస్టేబుళ్లు బి.బాలచంద్ర, కె.హరిచంద్రనాయక్, చినగంజాం కానిస్టేబుళ్లు డి.శ్రీనివాసరావు, కె.అనిల్కుమార్, ఉమెన్ పీసీ జి.సంధ్యారాణి, హోంగార్డు ఎం.ప్రభాకరరావు ఉన్నారు. -
అనంతబాబుపై కేసుల వివరాలివ్వండి: హైకోర్టు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ అనంతబాబుపై ఉన్న కేసులు, కింది కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్, మృతుడు సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం నివేదికను తమ ముందుంచాలని హైకోర్టు శుక్రవారం పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఉత్తర్వులు జారీచేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ అనంతబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనితోపాటు 90 రోజుల్లో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయనందుకు తనకు డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటూ మరో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం జస్టిస్ రవి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కలిగినీడి చిదంబరం వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ స్వయంగా చెప్పిన వివరాలు తప్ప హత్య విషయంలో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో లోపాలున్నాయన్న కారణంతో కింది కోర్టు దానిని తిరస్కరించిందన్నారు. బెయిల్ మంజూరు చేస్తూ ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదన్నారు. మరోవైపు.. ఈ వ్యాజ్యాల్లో మృతుడు తల్లి నూకరత్నం ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, అనంతబాబుకు నేరచరిత్ర ఉందని.. ఆయనపై పోలీసులు రౌడీషీట్ కూడా తెరిచారని తెలిపారు. దీంతో న్యాయమూర్తి, పిటిషనర్పై ఉన్న కేసులు, అతనిపై దాఖలు చేసిన చార్జిషీట్ వివరాలతో పాటు మృతుడు సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం నివేదికను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించారు. లొంగిపోయిన అనంతబాబు కంబాలచెరువు(రాజమహేంద్రవరం): తాత్కాలిక బెయిల్ గడువు ముగియడంతో ఎమ్మెల్సీ అనంతబాబు శుక్రవారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో లొంగిపోయారు. గత నెలలో అనంతబాబు తల్లి చనిపోవడంతో కోర్టు ఆయనకు ఈ నెల 9 వరకు బెయిల్ ఇచ్చింది. గడువు ముగియడంతో ఆయన జైలు అధికారుల ముందు హాజరయ్యారు. ఇదీ చదవండి: ఐవోబీ మాజీ ఉద్యోగులకు ఐదేళ్ల జైలు -
భార్య వేధింపులు తాళలేక...
యశవంతపుర: భార్య వేధింపులను తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకా జయపుర గ్రామంలో జరిగింది. అరవింద్ (42) తన తోటలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు డెత్నోట్ రాసి తన మరణానికి భార్య, ఆమె బంధువులు, పోలీసుల పేర్లు రాశాడు. 12 ఏళ్ల క్రితం అరవింద్తో రేఖనిచ్చి వివాహం చేశారు. రోజు ఏదో విషయంపై గొడవ పడేవారు. ఇద్దరి మధ్య గొడవలు జరగటంతో రేఖ బంధువులు ఇటీవల జయపుర స్టేషన్కు పిలిపించి విచారించారు. దీంతో విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్నాడు. జయపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త చేతిలో భార్య హతం : కుటుంబ కలహాలతో భర్త భార్యను హత్య చేసిన ఘటన హాసన జిల్లా బేలూరు తాలూకా చీకనహళ్లి గ్రామంలో మంగళవారం జరిగింది. ఇంద్రమ్మ (48)ను ఆమె భర్త చంద్రేగౌడ నలుగురితో కలిసి హత్య చేసి పరారయ్యాడు. అడ్డుపడిన మహిళలపై కూడా నిందితులు దాడి చేశాడు. ఆరు నెలల క్రితం చంద్రమ్మను హత్య చేయటానికి పథకం వేయగా ఆమె తప్పించుకుంది. పుట్టినిల్లు చీకనహళ్లిలో ఉంటూ కూలీ పనులకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: హెలికాప్టర్ సర్వీస్ రూ. 17 వేలు టోపి) -
అల్లరి చేస్తున్నాడని బాలుడి దారుణ హత్య
కడప అర్బన్: అల్లరి చేస్తున్నాడని ఓ బాలుడిని మేనత్త, మామలు చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా కడపలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. మృతుడి నానమ్మ ఇందిరమ్మ, తాత జానయ్య, పోలీసుల కథనం మేరకు..అన్నమయ్య జిల్లా కోనాపురం హరిజనవాడకు చెందిన వెలగచెర్ల శివకుమార్, భాగ్యలక్ష్మి దంపతులు కువైట్లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరు నానమ్మ, తాతయ్యల దగ్గర ఉంటున్నారు. పెద్ద కుమారుడు ఆశ్రిత్కుమార్ (8)ను బాగా చదివించాలని శివకుమార్, భాగ్యలక్ష్మిల అనుమతితో కడప ఓంశాంతి నగర్లో ఉంటున్న మేనత్త ఇంద్రజ వద్ద పది రోజుల క్రితం నానమ్మ, తాతయ్యలు వదిలిపెట్టారు. ఇంద్రజ, ఆమె భర్త అంజన్కుమార్ వై–జంక్షన్ సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయులు. ఆశ్రిత్ను తమ బిడ్డలాగా చూసుకుంటామని చెప్పిన వీరు..బాగా అల్లరి చేస్తున్నాడనే నెపంతో చిత్రహింసలు పెట్టేవారు. ఈ నెల 3న రాత్రి రోజూ మాదిరిగానే మేనత్త,మామలు బాలుడిని బాగా కొట్టారు. బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు గుర్తించి రిమ్స్కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. దీంతో ఇంద్రజ దంపతులు వారి కుమార్తెతో కలిసి పరారయ్యారు. రిమ్స్ మార్చురీలోని బాలుడి మృతదేహాన్ని కడప డీఎస్పీ శివారెడ్డి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్రెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, అంజన్కుమార్ను ఇంద్రజ ప్రేమించి మూడేళ్ల క్రితం వివాహం చేసుకుంది. ఈ వివాహం ఇంద్రజ అమ్మా, నాన్న, అన్నా, వదినకు ఇష్టం లేదు. దీంతో వారి మధ్య రాకపోకలు లేవు. ఇంద్రజ కుమార్తె పుట్టిన రోజును ఇటీవల ఘనంగా నిర్వహించారు. దీంతో వీరి మధ్య మళ్లీ రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత ఈ ఘోరం జరిగింది. అన్నయ్యా..మమ్మల్ని క్షమించు! తాము చేయరాని తప్పు చేశామని, ఆశ్రిత్ చనిపోయాడని ఇంద్రజ, కువైట్లో ఉన్న తన అన్న శివకుమార్కు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టింది. తరువాత సెల్ఫోన్ను స్విచ్ఛాఫ్ చేసి భర్త, కుమార్తెతో కలిసి పరారైంది. మెసేజ్ చూసిన శివకుమార్ ఇంద్రజకు ఫోన్ చేయగా..స్విచ్ఛాఫ్ రావడంతో తన తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులకు సమాచారమిచ్చాడు. వారు కడప రిమ్స్కు హుటాహుటిన చేరుకుని బాలుడి మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. -
అప్పు తీర్చమన్నందుకు హత్య, ఇద్దరికి జీవితఖైదు
మైసూరు: అప్పు చెల్లించాలని అడగడంతో హత్య చేసిన హంతకులకు జిల్లా 7వ అదనపు కోర్టు జీవితఖైదు విధించింది. మైసూరు నగరంలోని కేటి. స్ట్రీట్కు చెందిన అనిల్ కుమార్, మేగళ కొప్పళగ్రామవాసి మహే‹Ùలు దోషులు. వివరాలు.. మైసూరు తాలూకాలోని బెళవాడికి చెందిన జయరామ్ (34) వద్ద అనిల్కుమార్ 20 వేల రూపాయలను అప్పు తీసుకున్నాడు. ఎంతకూ తిరిగి ఇవ్వకపోవడంతో జయరామ్ గట్టిగా నిలదీశాడు. దీంతో పగ పెంచుకున్న అనిల్కుమార్ మహేష్తో కలిసి 2017 మే నెల 27న సాయంత్రం జయరామ్ను బైకుపై తీసుకెళ్లి విజయనగర 4వ స్టేజ్లో చాకుతో పొడిచి చంపాడు. ఈ కేసులో పై ఇద్దరితో పాటు సతీష్ అనే మరో యువకున్ని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అనిల్, మహేష్ల నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి కే.దొడ్డెగౌడ ఈ మేరకు తీర్పు చెప్పారు. సతీష్కు సంబంధం లేదని తేలడంతో వదిలిపెట్టారు. (చదవండి: లాడ్జిలో రిమాండ్ ఖైదీ సరసాలు) -
వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడిపై టీడీపీ కార్యకర్తల హత్యాయత్నం
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడికి చెందిన వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పోలిమెట్ల శివను హత్య చేసేందుకు అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. గాయపడిన శివను స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. రూరల్ ఎస్ఐ ఎం.లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పోలిమెట్ల శివకు, మరికొందరికి పొలాల వద్ద గతంలో గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆరుగంటల సమయంలో కొందరు వ్యక్తులు శివపై దాడిచేసి హత్యచేసేందుకు ఆయన ఇంటివద్దకు కత్తులు, ఇనుపరాడ్లు తీసుకుని వెళ్లారు. అక్కడే ఉన్న పలువురు వారిని అడ్డగించి పంపించేశారు. తరువాత ఇంటిబయట మళ్లీ గొడవపడి శివ మీద దాడిచేశారు. గాయపడిన శివ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామానికి చెందిన అట్లూరి హనుమంతరావు, అట్లూరి బ్రహ్మంచౌదరి, కొక్కెరపాటి వెంకటేశ్వరరావు, మరో ఐదుగురు తనపై హత్యాయత్నం చేశారని బాధితుడు శివ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ చెప్పారు. -
ఫూలన్దేవి హత్య 25 జూలై 2001
పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో అక్కడి సమీపంలోని తన నివాసానికి వెళ్లిన మీర్జాపూర్ లోక్సభ ఎంపీ పూలన్దేవిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ముసుగులు ధరించి వచ్చిన ఆ ఆంగతకుల కాల్పుల్లో ఫూలన్దేవి అక్కడిక్కడే మరణించారు. 1981లో ఉత్తరప్రదేశ్లోని బెహ్మాయ్ గ్రామంలో 22 మంది ఠాకూర్లను ప్రతీకార దాడి చేసి చంపినందుకు ఫూలన్ దేవి హత్య జరిగి ఉండవచ్చునని భావించారు. ఫూలన్దేవికి ‘బందిపోటు రాణి’ అని పేరు. బాల్యం నుంచీ ఆమె అనేకసార్లు అన్యాయానికి, దౌర్జన్యానికి, అత్యాచారాలకు గురయ్యారు. పదకొండేళ్లకే ఆమెకు నిర్బంధ వివాహం జరిగింది. ఆ అనుభవాలు ఆమెను చంబల్లోయ బందిపోటుగా మార్చాయి. అగ్రవర్ణాల వారికి, పోలీసులకు ఆమె సింహస్వప్నం అయ్యారు. చివరికి ప్రభుత్వ మధ్యవర్తిత్వంతో చట్టానికి లొంగిపోయారు. 1998లో తన 34 ఏళ్ల వయసులో పూలన్ దేవి సమాజ్వాదీ పార్టీ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు అధికారికంగా కోల్కతా అయిన కలకత్తా ఢిల్లీలోని అమెరికా దౌత్యకార్యాలయాన్ని పేల్చేయడానికి ఒసాబా బిన్ లాడెన్ పన్నిన పథకాన్ని భగ్నం చేసిన పోలీసులు. విమాన ప్రమాదంలో కాంగ్రెస్ నేత మాధవరావ్ సింధియా దుర్మరణం. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ. (చదవండి: సైనికులు కావలెను.. వేతనం : మృత్యువు, వెల : ఆత్మార్పణం) -
భార్య పుట్టింటికి వెళ్లిందనే..
మణికొండ: మద్యం తాగొద్దన్నందుకు భార్యను తిట్టడంతో, ఆమె పుట్టింటికి వెళ్లిందని మనస్తాపానికిలోనై నార్సింగి ఫ్లై ఓవర్పై నుంచి ఔటర్రింగ్ రోడ్డుపైకి దూకి భీమప్ప(25) మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. నారాయణపేట జిల్లా, మద్దురు మండలం, చింతల్దిన్నె గ్రామానికి చెందిన బీమప్ప, సత్తమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారిరువురు నార్సింగిలో ఉంటూ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భీమప్ప రోజు మద్యం తాగి వచ్చి భార్యను వేదిస్తున్నాడు. దాంతో విసిగిపోయిన ఆమె సోమవారం రాత్రి నార్సింగిలోనే ఉంటున్న తన సోదరుడి ఇంటికి వెళ్లింది. మర్నాడు అక్కడి నుంచి కిషన్నగర్లోని తల్లి ఇంటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికిలోనైన భీమప్ప మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య సత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: ప్లైఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య ) -
బంధువుతో వివాహేతర సంబంధం.. వేరే వాళ్లతో కూడా సన్నిహితంగా ఉండటంతో..
తిరువొత్తియూరు(తమిళనాడు): ప్రియురాలిని హతమార్చిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. కారైక్కాల్ సమీపం అక్కరైవట్టం గ్రామానికి చెందిన కందకుమార్ భార్య వసంతి (42). వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పదేళ్ల క్రితం గొడవ పడి దంపతులు విడిపోయారు. కందకుమార్తో పెద్ద కుమార్తె, రెండో కుమార్తె ఉన్నారు. చిన్న కుమార్తెతో వసంతి నిట్టేస్వరంలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో అక్కరై వట్టంలో ఉన్న బంధువు సుందరమూర్తి (42)తో వసంతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే వసంతి ఇతరులతో సన్నిహితంగా ఉండడంతో సుందరమూర్తి ఖండించాడు. చదవండి: మనోడి రూటే సెపరేటు.. దొంగతనానికి వెళ్లే ముందు అది కంపల్సరీ! ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం కారైకాల్ గోల్డెన్ నగర్లో ఇంటి పని చేస్తున్న వసంతి వద్దకు వచ్చిన సుందరమూర్తి దీనిపై గొడవ చేశాడు. చీరతోనే ఆమె గొంతు బిగించి హత్య చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న కారైక్కాల్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వసంతి మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని శవ పరీక్ష నిమిత్తం కారైక్కాల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి శుక్రవారం సుందరమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. -
11ఏళ్ల అనంతరం వీడిన మర్డర్ మిస్టరీ!
పెద్దదోర్నాల: పదకొండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన యువతి మర్డర్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. వివాహేతర సంబంధం నెరుపుతుందనే కారణం చూపి సోదరుడితో కలిసి కట్టుకున్న ఇల్లాలు ప్రియాంకను (19)ను దారుణంగా హతమార్చాడు కర్ణాటకకు చెందిన ఉపాధ్యాయుడు హుచ్చప్ప. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం విజయపూర్ జిల్లా వాదావేన్ తాలూకా ముధుదేహాల్కు చెందిన హుచ్చప్ప, ప్రియాంక భార్యాభర్తలు. కొన్నాళ్లపాటు అన్యోన్యంగానే కాపురం కొనసాగించారు. ఈ నేపథ్యంలో ప్రియాంక ఓ దళిత యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని గమనించిన భర్త హుచ్చప్ప పద్ధతి మార్చుకోవాలని భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయితే భర్త మాటలను పెడచెవిన పెట్టిన ప్రియాంక.. వివాహేతర సంబంధం కొనసాగించేది. దీంతో ఎలాగైనా భార్యను చంపేయాలని భావించిన హుచ్చప్ప పక్కాగా ప్లాను వేశాడు. దైవదర్శనం కోసం శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళదామంటూ తన సోదరుడు, భార్యతో కలిసి బయలు దేరాడు. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో దర్శనం పూర్తి చేసుకున్న వీరు 2011వ సంవత్సరం జూలై 25 తేదీ అర్ధరాత్రి ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని కొర్రప్రోలు సమీపంలోకి రాగానే ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సోదరుడి సహాయంతో నైలాన్ తాడును ప్రియాంక గొంతుకు బిగించి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు .. ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి లోదుస్తులతో ఉన్న మృతదేహాన్ని రోడ్డు పక్కనే ఉన్న చప్టాలో పడేసి కర్ణాటకకు చేరుకున్నారు. ఈ హత్య విషయం మృతురాలి తల్లిదండ్రులకు తెలిసినా, కుమార్తె ప్రవర్తనతో విసిగిపోయిన వారు కూడా మౌనంగానే ఉన్నారు. ఈ క్రమంలో పరిచయం ఉన్న వారు నీ భార్య ఏదంటూ అడగగా, ఆమె ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుని వెళ్లిపోయిందంటూ అందరినీ నమ్మించాడు. అప్పట్లో కేసు నమోదు చేసుకున్న దోర్నాల పోలీసులు దీనిపై చాలా కాలం విచారణ చేపట్టి విసిగి పోయారు. ప్రియాంక హత్య విషయం బయట పడిందిలా.. ప్రియాంకను భర్తే హతమార్చిన విషయం బంధువులందరికీ తెలిసినా ప్రియాంక ప్రవర్తన, నడవడిక కారణంగా ఎవరూ ఆ విషయాన్ని బయట పెట్టకుండా మనస్సులోనే దాచుకున్నారు. హుచ్చప్పకు, అతని దాయాదులకు ఆస్తి పంపకాల్లో నెలకొన్న విభేదాల కారణంగా మనస్పర్థలు వచ్చాయి. దీంతో వారు ప్రియాంక హత్యకు గురైన విషయాన్ని కర్ణాటకకు చెందిన పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. గతేడాది జూన్ 1వ తేదీన మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసులు విచారణ చేపట్టి నిందితులు చెప్పిన ఆధారాల మేరకు పెద్దదోర్నాల పోలీసు స్టేషన్కు చేరుకోవడంతో అసలు విషయం బయట పడింది. దీంతో భర్త, అతని సోదరుడిపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. -
తలుపులు ఆలస్యంగా తెరిచిందని...భార్యను చంపి సూట్ కేసులో పెట్టి...
యశవంతపుర: ఇంటి తలుపులను ఆలస్యంగా తెరిచి, అన్నం పెట్టలేదనే కోపంతో భర్త భార్యను హత్య చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. కొప్పళ జిల్లా గంగావతికి చెందిన మంజుళ మొదటి భర్తను వదిలి, రాము అనే వ్యక్తిని పెళ్లాడి కామాక్షిపాళ్యలో నివాసం ఉంటూ పీణ్యా పారిశ్రామికవాడలో కూలీ పనులు చేసేది. వారికి ఇద్దరు పిల్లలు. ఇటీవల రాము ఇంటికి రాగా మంజుళ ఆలస్యంగా తలుపు తీసిందని, అన్నం పెట్టలేదనే కారణంతో గొడవ పడ్డాడు. ఆమెను చంపి శవాన్ని సూట్కేసులో పెట్టుకొని తుమకూరు మార్గంలోని దాబస్పేట వద్ద పడేసి రాము చెన్నైకి పారిపోయాడు. కేసును విచారించిన బెంగళూరు గ్రామీణ పోలీసులు నిందితున్ని అరెస్ట్ రిమాండ్కు పంపినట్లు ఏఎస్పీ లక్ష్మీ గణేశ్ తెలిపారు. (చదవండి: రక్షకుడే భక్షకుడై దారుణకాండ) -
చదువులో ఒత్తిడికి గురై విద్యార్థిని ఆత్మహత్య
భాగ్యనగర్కాలనీ: చదువులో త్రీవ ఒత్తిడికి గురై ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వైజాగ్కు చెందిన విశ్వనాథం కుమార్తె హర్షిత (19) ఆరు నెలల క్రితం నగరానికి వచ్చి కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నది. హర్షితతో పాటు అనన్య అనే మరో విద్యార్థినికి కాలేజీ హాస్టల్లో 206 నెంబర్ రూమ్ కేటాయించారు. ఆదివారం జేఈఈ మెయిన్స్ పరీక్ష ఉండటంతో అనన్యను తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్లారు. హర్షిత తండ్రి విశ్వనాథం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కళాశాలకు ఫోన్ చేసి కూతురితో మాట్లాడారు. అనంతరం హర్షిత రూమ్కి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత విద్యార్థులందరినీ యూనిట్ పరీక్షకు పిలుస్తున్నారని వార్డెన్ స్వరూప హర్షిత గదికి వెళ్లి పిలువగా గడియ వేసి ఉంది ఎంతకూ తలుపు తీయలేదు. దీంతో కళాశాలలో పనిచేస్తున్న హరి, దేవదాస్ల సహాయంలో తలుపులు పగులగొట్టి తెరిచి చూడగా నల్ల చున్నీతో సీలింగ్ ఫ్యాన్కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలపై ఆరాతీశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: వివాహేతర సంబంధం: ఏం జరిగిందో కానీ చివరకు..) -
మహిళతో వివాహేతర సంబంధం.. నీ భర్తకు చెప్పేస్తా.. చివరికి షాకింగ్ ట్విస్ట్
సబ్బవరం (పెందుర్తి): సబ్బవరం శివారు గొల్లలపాలెంలో జరిగిన యువకుడి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల కోసం వేధించడంతోపాటు తమ మధ్య గతంలో ఉన్న వివాహేతర సంబంధాన్ని తన భర్తకు చెప్పేస్తానని బెదిరిస్తున్న యువకుడిని... ప్రస్తుతం తనతో సన్నిహితంగా ఉంటున్న మరో వ్యక్తితో హత్య చేయించింది ఓ మహిళ. ఇందుకు సంబంధించిన వివరాలను సబ్బవరం పోలీస్ స్టేషన్లో అనకాపల్లి డీఎస్పీ సునీల్ మీడియాకు శనివారం వెల్లడించారు. సబ్బవరం ప్రాంతానికి చెందిన సింహాచలం ఆరేళ్ల కిందట నగరంలోని ఎన్ఏడీ కొత్త రోడ్డు ప్రాంతంలో ఓ కేబుల్ ఆపరేటర్ వద్ద పని చేసేవాడు. చదవండి: నమ్మి ఆ ఫోటోలు, వీడియోలు పంపిన యువతి.. చివరికి ఏం జరిగిందంటే? ఆ సమయంలో అక్కడ ఓ మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్ల తర్వాత అక్కడ పని మానేసి స్వస్థలానికి వచ్చేసిన సింహాచలం... వివాహితతో ఉన్న సాన్నిహిత్యంతో ఆమె బంగారు ఆభరణాలు తీసుకొచ్చి తాకట్టు పెట్టాడు. కొద్ది రోజుల తర్వాత ఆమె బంగారు ఆభరణాలు అడగడంతో తాకట్టులో ఉన్నాయని... డబ్బులు ఇస్తే విడిపించి తీసుకొస్తానని నమ్మించాడు. అలా పలుమార్లు డబ్బులు తీసుకున్నాడు. పేకాట, బెట్టింగ్లకు పాల్పడే సింహాచలం తనకు డబ్బులు అవసరమైనప్పుడల్లా ఆమెను బెదిరించి తీసుకునేవాడు. డబ్బులు ఇవ్వకుంటే తమ మధ్య ఉన్న సంబంధాన్ని ఆమె భర్తకు చెప్పేస్తానని బెదిరించేవాడు. సింహాచలం తీరుతో విసిగిపోయిన సదరు మహిళ అడ్డు తొలగించుకోవాలని భావించింది. తనతో సన్నిహితంగా ఉంటున్న నగరంలోని అల్లిపురం ప్రాంతానికి చెందిన గుడివాడ గోవింద్కు జరిగిన విషయం అంతా చెప్పింది. డబ్బుల కోసం వేధిస్తున్నాడని, వివాహేతర సంబంధం విషయాన్ని తన భర్తకు చెబుతానని బెదిరిస్తున్నాడని, ఎలాగైనా సింహాచలాన్ని హతమార్చేయాలని కోరింది. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పరిచయం చేసుకుని... సదరు వివాహితకు ఇచ్చిన మాట ప్రకారం సింహాచలాన్ని హతమార్చేందుకు గోవింద్ సిద్ధమయ్యాడు. ప్రణాళికలో భాగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా సింహాచలానికి పరిచయం చేసుకున్నాడు. కొద్ది రోజులు గడిచాక ఈ నెల 19న రాత్రి 8 గంటల సమయంలో నగరం నుంచి గోవింద్ కారులో సబ్బవరం వచ్చాడు. సింహాచలాన్ని పిలిపించుకుని గొల్లలపాలెం శివారుకు తీసుకెళ్లి ఇద్దరూ మద్యం తాగారు. ప్రణాళికలో భాగంగా తనతో తీసుకొచ్చిన కత్తితో సింహాచలం గొంతుపై గోవింద్ కోసేశాడు. వెంటనే భయంతో సింహాచలం పరుగు తీయగా వెనుక నుంచి ఇనుప వస్తువుతో తలపై బలంగా కొట్టాడు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి నగరంలోకి గోవింద్ వెళ్లిపోయాడు. మరుసటి రోజు 20న ఉదయం సింహాచలం మృతదేహం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భిన్న కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టారు. మృతునికి పేకాట, బెట్టింగ్ ముఠాలతో సంబంధాలు ఉండడంతో ఆ దిశగా ముందుగా కేసు దర్యాప్తు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, సీసీ కెమెరా పుటేజీ సాయంతో విచారణ చేపట్టి నిందితులను గుర్తించారు. అల్లిపురం ప్రాంతానికి చెందిన గోవింద్ విజయవాడ నుంచి విశాఖకు వస్తుండగా చిన్నయ్యపాలెం వద్ద శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ హత్యకు ప్రోత్సహించిన సదరు మహిళను కూడా అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మృతుడు సింహాచలం సదరు మహిళతోపాటు ఆమె చెల్లెలు, మరికొంత మంది మహిళలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వారి వద్ద కూడా డబ్బులు తీసుకున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. ఐదు రోజులపాటు తీవ్రంగా శ్రమించి నిందితులను పట్టుకున్న సీఐ చంద్రశేఖరరావుతోపాటు ఎస్ఐ ఎల్.సురేష్ను డీఎస్పీ అభినందించారు. మరోవైపు హత్యకు పాల్పడిన వ్యక్తిని తమకు చూపించలేదని మృతుని కుటుంబ సభ్యులు కొంత సేపు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. మృతుని భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు స్టేషన్ ఎదుట బైఠాయించారు. పోలీస్ అధికారులు సర్దిచెప్పడంతో శాంతించారు. -
మహిళ హత్య కేసు మిస్టరీ.. అనుమానం నిజమైంది..
చిత్తూరు రూరల్: మండలంలోని బీఎన్ఆర్ పేట వద్ద వారం క్రితం వెలుగుచూసిన మహిళ హత్య కేసులో భర్తే నిందితుడని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు శుక్రవారం చిత్తూరు తాలూకా పోలీస్స్టేషన్లో సీఐ బాలయ్య, ఎస్ఐ రామకృష్ణ వివరాలు వెల్లడించారు. జీడీనెల్లూరు మండలం నల్లరాళ్లపల్లెకు చెందిన చిన్నబ్బ మందడి కుమార్తె మోహన అలియాస్ రోజా(23)కు చిత్తూరు మండలం కుర్చివేడు పంచాయతీ వీఎన్పురం గ్రామానికి చెందిన ప్రకాష్తో రెండేళ్ల క్రితం వివాహమైంది. చదవండి: సంతోషంగా వధూవరులు డ్యాన్స్.. పెళ్లయిన కొద్దిసేపటికే విషాదం.. కొంత కాలానికే భార్యాభర్తల మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. ప్రకాష్ రోజూ తాగి వచ్చి రోజాను వేధించేవాడు. దీంతో అప్పుడప్పుడు ఆమె మనస్తాపంతో పుట్టింటికి వెళ్లిపోయి కొన్నిరోజులు ఉండి వచ్చేది. ఈక్రమంలో ఇటీవల మళ్లీ భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన తండ్రి వద్దని వారించినా వినకుండా ప్రకాష్ ఇంటికి వెళ్లింది. అదే రోజు సాయంత్రం ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రోజా ఇక్కడ తాను ఉండలేనని తండ్రి వద్దకు వెళ్లిపోతానంటూ కాలినడకనే బయలుదేరింది. బైక్పై ఆమె వెనుకే వచ్చిన ప్రకాష్ మార్గం మధ్యలో అడ్డుకున్నాడు. మాటామాటా పెరగడంతో దగ్గరలోని బండరాయి తీసుకుని రోజా తలపై మోదాడు. ప్రాణాలు పోకపోవడంతో చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేశాడు. 18వ తేదీ సాయంత్రం అటు వైపు వెళ్లిన స్థానికులు తేలుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మూడు రోజుల తర్వాత ‘సాక్షి’ పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా రోజా తల్లిదండ్రులు పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ పోలీసులు చూపించిన రోజా తాళిబొట్టు, ఇతర ఆధారాలను చూసి తమ కూతురే అని నిర్ధారించారు. రోజాను ఆమె భర్తే చంపేసుంటాడని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ప్రకాష్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. రోజా భర్త ప్రకాషే నిందితుడని తేలడంతో మిగిలిని ఇద్దరినీ విడిచిపెట్టేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
యువకుడి దారుణహత్య
పరిగి: యువకుడు దారుణహత్యకు గురైన ఘటన మండలంలోని బీచిగానిపల్లిలో చోటుచేసుకుంది. హిందూపురం అప్గ్రేడ్ సీఐ జీటీ నాయుడు, ఇన్చార్జ్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన మేరకు.. బీచిగానిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన శివప్ప కుమారుడు యుగేంద్ర (19) పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఓ ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన యుగేంద్ర.. ఆదివారం ఉదయం కాలనీకి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో శవమై కనిపించాడు. సీఐ జీటీ నాయుడు, ఇన్చార్జ్ ఎస్ఐ శ్రీనివాసులు మృతదేహాన్ని పరిశీలించారు. గొంతు కోసి హత్య చేయడమే కాకుండా అతడి మర్మాంగాన్ని సైతం కోసినట్లు గుర్తించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. యుగేంద్ర మృతదేహం వద్ద కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. అన్యాయంగా తన కుమారుడిని చంపేశారంటూ శివప్ప విలపించిన తీరు గ్రామస్తులను కన్నీరు పెట్టించింది. శివప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని సీఐ తెలిపారు. (చదవండి: రుణ ఎగవేత కేసులో కేశినేనికి డీఆర్టీ సమన్లు) -
భోజనం వడ్డించలేదని భార్యని కడతేర్చిన వ్యక్తి... ఐతే ఆమె చనిపోలేదని...
ఇటీవల చిన్నచిన్న కారణాలకే హత్యలు చేస్తున్నారు. కారణాలు కూడా వినేందుకు హస్యస్పదంగా ఉంటాయే తప్ప సీరియస్ విషయమంటూ ఏం ఉండదు. ప్రస్తుతం అరచేతిలో ప్రపంచ ఇమిడిపోయేలా స్మార్ట్ ఫోన్లు వచ్చాక ప్రతీది సులభంగా తెలిసిపోడంతో మనుషుల్లో సహనం అనేదే లేకుండాపోయింది. ప్రతీది క్షణాల్లో అనుకున్న వెంటనే అయిపోవాలనే వికృత మనస్తత్వం జనాల్లో రావడం వల్లనో ఏమో గానీ పిచిపిచ్చి కారణాలకే ప్రాణాలు తీసేంతవరకు వెళ్లిపోతున్నారు. అచ్చం అలానే ఇక్కడో వ్యక్తి చిన్న కారణానికి భార్యని కడతేర్చాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఢిల్లీలోని సుల్తాన్పూర్లో నివశిస్తున్న భార్యభర్తలిద్దరూ కలిసి ఫుల్గా మద్యం తాగారు. ఆ తర్వాత భర్త భోజనం చేద్దాం రా.. అంటే ఆమె తినేందుకు ఆసక్తి చూపలేదు. పైగా తనకు భోజంనం పెట్టమని భర్త కోరిన ఆమె వడ్డించకపోవడంతో ఆగ్రహంతో సదరు వ్యక్తి ఆమెను కొట్టి, హత్య చేశాడు. ఆ తర్వాత అతను మద్యం మత్తులో ఆమె చనిపోయిందన్న విషయం మరిచిపోయి ఆ శవం పక్కనే పడుకున్నాడు. కాసేపటి తర్వాత మేలుకున్నాక తన భార్య చనిపోయిందని గ్రహించాడు. అంతే ఆ వ్యక్తి రూ.40 వేలు నగదు తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఐతే పోలీసులు నిందుతుడు వినోద్ కుమార్ దూబేగా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: కీటికిలో నుంచి గుట్టుగా మహిళ ఫొటోలు తీసి..) -
‘రాప్తాడు’లో పరువు హత్య
రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరువు హత్య జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని భార్య తరఫువారు గొంతుకోసి చంపేశారు. బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి ప్రాణాలు తీశారు. తన తల్లి ఈ హత్య చేయించిందని హతుడు చిట్రా మురళి (27) భార్య వీణ ఆరోపిస్తోంది. పోలీసులు, వీణ కథనం మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లికి చెందిన కురుబ చిట్రా నాగన్న, ముత్యాలమ్మ దంపతుల ఏకైక కుమారుడు చిట్రా మురళి, అదే గ్రామానికి చెందిన ములుగూరు రామానాయుడు (లేట్), యశోదమ్మల ఏకైక కుమారై వీణ పదోతరగతి వరకు కలిసి చదువుకున్నారు. మురళి డిగ్రీ, వీణ బీటెక్ పూర్తిచేశారు. ప్రస్తుతం మురళి పెనుకొండ సమీపంలోని కియా కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, వీణ కనగానపల్లి మండలం ఎలక్కుంట్ల గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్గా పనిచేస్తున్నారు. పదో తరగతి నుంచి ప్రేమించుకుంటున్న వీరి పెళ్లికి కులాలు వేరుకావడంతో ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి గతేడాది జూన్ 23న ఉరవకొండ మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. 4 నెలలు అనంతపురంలో తలదాచుకున్నారు. తర్వాత రాప్తాడు ఎస్సీ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. అక్కడి నుంచే విధులకు వెళ్లసాగారు. కిడ్నాప్ చేసి హత్య మురళి ఉద్యోగానికి వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటినుంచి ద్విచక్ర వాహనం మీద బయలుదేరాడు. ఆ వాహనాన్ని రాప్తాడులోని 44వ నంబరు జాతీయ రహదారి పక్కనున్న పెట్రోలు బంకులో పార్కుచేసి, కంపెనీ బస్సు కోసం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో వేచి ఉన్నాడు. అంతలోనే ఆటోలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు అతడిని బలవంతంగా ఎక్కించుకున్నారు. రాప్తాడు నుంచి లింగనపల్లి రోడ్డు మీదుగా బొమ్మేపర్తి పొలాల్లోకి తీసుకెళ్లి గొంతుకొసి హత్యచేశారు. శుక్రవారం ఉదయం ఆ పొలాల్లోకి క్రికెట్ ఆడేందుకు వెళ్లిన యువకులు మృతదేహాన్ని చూసి 100కు డయల్ చేసి సమాచారమిచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, వీణ తల్లి యశోదమ్మను, పెదనాన్న, పెద్దమ్మ, ఇద్దరు బాబాయిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మా అమ్మే చంపించింది మా పెళ్లికి మా అమ్మ యశోదమ్మ ఒప్పుకోలేదు. పెళ్లయిన తర్వాత కూడా మమ్మల్ని పలుమార్లు బెదిరించింది. ‘నాకు మొగుడు లేడు.. నీకూ లేకుండా చేస్తా’ అనేది. అన్నట్లుగానే నా భర్తను హత్య చేయించింది. – వీణ, హతుడి భార్య యశోదమ్మే హత్య చేయించింది నా కొడుకును యశోదమ్మే హత్య చేయించింది. నా బిడ్డను వదిలి పెట్టకపోతే నీ కొడుకును హత్య చేయిస్తానని పలుమార్లు మా ఇంటి దగ్గరకు వచ్చి బెదిరించింది. ఇప్పుడు అనుకున్నట్టే చేసింది. ఒక్కగానొక్క కొడుకును పొట్టనబెట్టుకుంది. ఇక మేమెలా బతకాలి? – ముత్యాలమ్మ, హతుడి తల్లి -
భార్య వివాహేతర సంబంధం.. కువైట్ నుంచి వచ్చిన భర్తకు తెలియడంతో
సాక్షి, నిజామాబాద్: వివాహేతర సంబంధంతో ఓ మహిళ కట్టుకున్న భర్తను చంపి, తర్వాత ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం చేసినట్లు సీపీ నాగరాజు వెల్లడించారు. బుధవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశంలో సీపీ మాట్లాడుతూ ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన మైలారమ్ సదానంద్కు కవితతో 2007లో వివాహం కాగా వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. సదానంద్ బతుకు దెరువుకు కోసం కువైట్కు వెళ్లేవారన్నారు. 2008లో కవితకు అదే గ్రామానికి చెందిన మైలారం శేఖర్తో పరిచయమై తర్వాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. మే 5న కువైట్ నుంచి వచ్చిన సదానంద్కు భార్య మధ్య డబ్బుల విషయంలో తగాదా రావడంతో పాటు భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసింది. దీంతో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో కవిత పుట్టింటికి వెళ్లిపోయింది. సదానంద్కు నవీపేట్ మండలం నాడాపూర్ గ్రామానికి చెందిన తోకల విజయతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో సదానంద్ను చంపేందుకు విజయతో కలిసి కవిత పథకం రచించింది. పథకం ప్రకారం సదానందంను విజయ నిర్మా నుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మత్తులోకి వెళ్లేవరకు మద్యం తాగించింది. అనంతరం కవితకు ఫోన్ చేసింది. కవితతో పాటు శేఖర్, మరో వ్యక్తి రాజశేఖర్ వచ్చారు. తర్వాత అందరూ కలిసి సందానందం గొంతుకు స్కార్ఫ్ బిగించి చంపివేశారని సీపీ వివ రించారు. హత్యను నిందితులు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానంతో కేసును చేధించి కవిత, వి జయ, శేఖర్, రాజశేఖర్ లను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించినట్లు సీపీ తెలిపారు. వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనంతో పాటు నాలుగు సెల్ఫోన్లు, బంగారు చైన్ తదితర వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. స మావేశంలో అదనపు డీసీపీ నరేందర్, సీఐ జగడం నరేష్, ఎస్సై రాజారెడ్డి పాల్గొన్నారు. -
సిప్పీ సిద్ధూ హత్య కేసు.. ఏడేళ్లకు ప్రొఫెసర్ కళ్యాణి అరెస్ట్
చండీగఢ్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షూటర్ సిప్పీ సిద్ధూ కేసులో.. ఏడేళ్ల తర్వాత ఎట్టకేలకు సీబీఐ తొలి అరెస్ట్ చేసింది. హిమాచల్ ప్రదేశ్ తాత్కాలిక న్యాయమూర్తి సబీనా కూతురు, ప్రొఫెసర్ కళ్యాణిని బుధవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్ధూ గర్ల్ఫ్రెండ్గా ఉన్న కళ్యాణిపైనే తొలినాటి నుంచి అందరికీ అనుమానం ఉంది. నేషనల్ లెవల్ షూటర్ సుఖ్మన్ప్రీత్ సింగ్ అలియాస్ సిప్పీ సిద్ధూ(35) 2015, సెప్టెంబర్ 15వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. సిద్ధూ షూటర్ మాత్రమే కాదు.. కార్పొరేట్ లాయర్ కూడా. పైగా ఛండీగఢ్ మాజీ సీజే ఎస్ఎస్ సిద్ధూ మనవడు. రిలేషన్షిప్ బెడిసి కొట్టడంతోనే ఆమె సిప్పీని హత్య చేయించిందని సమాచారం. ఛండీగఢ్ సెక్టార్ 27లో బుల్లెట్లు దిగబడిని అతని మృతదేహాన్ని అప్పట్లో పోలీసులు గుర్తించారు. జాతీయ షూటర్, పైగా హైఫ్రొఫైల్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావడంతో.. సిప్పీ సిద్ధూ కేసు సంచలనం సృష్టించింది. చివరకు.. పంజాబ్ గవర్నర్ జోక్యంతో.. 2016లో కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో క్లూ అందించిన వాళ్లకు ఐదు లక్షల రూపాయలు నజరానా ప్రకటించింది సీబీఐ. అంతేకాదు.. సిప్పీ హత్య జరిగిన సమయంలో ఓ యువతి అతనితో ఉందని, ఆమె ఎవరో ముందుకు వస్తే.. ఆమెను నిరపరాధిగా భావించాల్సి ఉంటుందని, లేకుంటే.. ఆమెకు కూడా హత్యలో భాగం ఉందని భావించాల్సి ఉంటుందని ఏకంగా సీబీఐ ఒక పేపర్ ప్రకటన ఇచ్చింది కూడా. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే.. ఇది అతని ప్రేయసి కళ్యాణి చేయించిన హత్యేనని, ఆమెను అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న చర్చే నడిచింది. మరోవైపు 2021లో ఈ కేసులో నజరానాను ఏకంగా పది లక్షల రూపాయలకు పెంచింది సీబీఐ. ఇక 2020లో సిప్పీతో ఉన్న మహిళను గుర్తించలేకపోయామని కోర్టు తెలిపి.. కేసులో దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపింది. కళ్యాణి సింగ్ను కూలంకశంగా ప్రశ్నించిన తర్వాతే.. అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. ఆపై ప్రత్యేక న్యాయమూర్తి సుఖ్దేవ్ సింగ్ ఎదుట ఆమెను హాజరుపరిచి.. నాలుగు రోజుల కస్టడీకి తీసుకుంది సీబీఐ. (చదవండి: స్కూల్స్లో కరోనా కలకలం.. 31 మంది విద్యార్థులకు పాజిటివ్.. టెన్షన్లో అధికారులు) -
తప్పుడు వాంగ్మూలం ఇవ్వలేదనే?.. గంగాధర్రెడ్డి అనుమానాస్పద మృతిపై సందేహాలు
సాక్షి, అమరావతి: తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని వైఎస్ వివేకా అల్లుడు, కుమార్తె తనను వేధిస్తున్నారని, వారి నుంచి ప్రాణభయం కూడా ఉందని పోలీసులను, న్యాయస్థానాన్ని వేడుకున్న కల్లూరి గంగాధర్రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడంటే ఎవరి మీద సందేహం కలగాలి? ఆయన అంతకుముందు ఫిర్యాదులో పేర్కొన్న వారిపైనే కదా? టీడీపీ, దాని అనుకూల మీడియా మాత్రం నిస్సిగ్గుగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. చదవండి: ఈ పాపం బాబుది కాదా? రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దీన్ని సాధనంగా వాడుకునే కుట్రకు బరి తెగించాయి. గంగాధరరెడ్డి గురువారం అనంతపురం జిల్లా యాడికిలో అనారోగ్యంతో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే తనకు ప్రాణభయం పొంచి ఉందని, తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ బెదిరింపులు వచ్చాయని గతంలో గంగాధరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి కుట్రకు గంగాధరే అడ్డంకి.. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే కుట్రలను సమర్థంగా అడ్డుకుంది గంగాధర్రెడ్డి అని పలు ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. 2019లో చంద్రబాబు సర్కారు, అనంతరం సీబీఐ అధికారులు, వివేకా కుమార్తె, అల్లుడు ఎంత వేధించినా గంగాధరరెడ్డి ఒప్పుకోకపోవడంతో వారి ఎత్తుగడలు ఫలించలేదు. అతడు జీవించి ఉండటం వారికి ప్రతికూలంగా పరిణమించే అంశం అన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలో గంగాధర్రెడ్డి అనుమానస్పద మృతి వెనుక వారి పాత్ర ఉండొచ్చన్న వాదనకు బలం చేకూరుతోంది. ఒప్పుకోవాలంటూ చిత్రహింసలు టీడీపీ అధికారంలో ఉండగా 2019 ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చంద్రబాబు పథకం వేశారు. అందులో భాగంగానే నాడు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ సాగింది. సిట్ బృందంలో సభ్యుడిగా ఉన్న సీఐ శ్రీరామ్ విచారణ పేరిట గంగాధర్రెడ్డిని వేధించారు. వివేకా హత్యకు వైఎస్ అవినాశ్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ఒత్తిడి తెచ్చినట్లు ఒప్పుకోవాలని గంగాధరరెడ్డిని వేధించారు. చిత్రహింసలకు గురి చేసినా ఆ ప్రయత్నం ఫలించలేదు. రాంసింగ్ వేధింపులు అనంతరం సీబీఐ దర్యాప్తు చేపట్టిన తరువాత కూడా అదే కుట్ర కొనసాగడం గమనార్హం. సీబీఐ అధికారి రాంసింగ్ 2021 అక్టోబరు 3, 4వ తేదీల్లో గంగాధర్రెడ్డికి వాట్సాప్ కాల్ చేసి వివేకా హత్యకు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ప్రేరేపించినట్లు చెప్పాలని ఒత్తిడి చేశారు. సీబీఐ అధికారులు అనంతపురం జిల్లా యాడికిలో ఉన్న గంగాధర్రెడ్డి నివాసానికి వెళ్లి అదే రీతిలో ఒత్తిడి తెచ్చారు. విచారణ పేరిట 2021 అక్టోబరు 4న కడప తీసుకొచ్చారు. వివేకా ఇంట్లో దొంగతనానికి వెళ్లినప్పుడు ఆయన నిద్రలేవడంతో హత్య చేసినట్లు అంగీకరించాలని శివశంకర్రెడ్డి ఒత్తిడి తెచ్చారని, అలా చెబితే రూ.10 కోట్లు ఇస్తామన్నారని వాంగ్మూలం ఇవ్వాలని రాంసింగ్ ఒత్తిడి చేశారు. సీబీఐ అధికారులే ఓ వాంగ్మూలం రాసుకొచ్చి దానిపై సంతకం చేయాలని, న్యాయస్థానంలో అదే విషయం చెప్పాలని వేధించారు. కానీ తనకు తెలియని విషయాలను తెలిసినట్లు చెప్పనని గంగాధర్రెడ్డి స్పష్టం చేశాడు. ఆ విషయంపై సీబీఐ అధికారులతో ఘర్షణకు పడ్డారు. తాము అనుకున్నట్లు గంగాధర్రెడ్డి సాక్ష్యం ఇవ్వడం లేదని సీబీఐ అధికారులు న్యాయస్థానానికి సైతం నివేదించడం గమనార్హం. వివేకా కుమార్తె, అల్లుడి బెదిరింపులు.. మరోవైపు వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కూడా గంగాధర్రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సమీప బంధువులైన నర్రెడ్డి జగదీశ్వరరెడ్డి, భువనాల బాబురెడ్డి యాడికి వెళ్లి గంగాధర్రెడ్డిని కలిశారు. సీబీఐ అధికారులు చెప్పినట్లుగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. వైఎస్ అవినాశ్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డిలే వైఎస్ వివేకాను హత్య చేయించినట్లు చెబితే రూ.10 లక్షలు ఇవ్వడంతోపాటు కిడ్నీ చికిత్సకు వైద్య ఖర్చులు కూడా భరిస్తామన్నారు. రూ.15 వేలు అడ్వాన్సు కూడా ఇచ్చారు. వారి బెదిరింపులు భరించలేక గంగాధర్రెడ్డి 2021 నవంబరు 25న పులివెందుల రింగ్ రోడ్డు వద్ద వైఎస్ సునీతను కలిశారు. సీబీఐ అధికారులు సూచించినట్లుగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని ఆమె చెప్పారు. అయితే అందుకు గంగాధర్రెడ్డి తిరస్కరించాడు. పోలీసులకు ఫిర్యాదు... కోర్టులో కేసు తప్పుడు వాంగ్మూలం ఇచ్చేందుకు గంగాధర్రెడ్డి తిరస్కరించడంతో ఆయనకు బెదిరింపులు తీవ్రమయ్యాయి. నర్రెడ్డి జగదీశ్వర్రెడ్డి, భువనాల బాబురెడ్డితోపాటు గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి పలు బెదిరింపు కాల్స్ రావడంతో అనంతపురం పోలీసులకు 2021 నవంబరు 29న ఫిర్యాదు చేసి తనకు రక్షణ కల్పించాలని కోరాడు. అప్పటికీ బెదిరింపు కాల్స్ ఆగకపోవడంతో తాడిపత్రి న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేశాడు. వైఎస్ సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి జగదీశ్వర్రెడ్డి, భువనాల బాబురెడ్డిల నుంచి తనకు ప్రాణ హాని ఉందని... సీబీఐ అధికారులు వేధిస్తున్నారని... గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఆ కేసు విచారణలో ఉండగానే గంగాధరరెడ్డి తీవ్ర అనారోగ్యం బారిన పడి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. తనకు ఎవరి నుంచి ముప్పు ఉందో వెల్లడిస్తూ గంగాధరరెడ్డి పోలీసులు, న్యాయస్థానాన్ని ఆశ్రయించారో అనుమానాస్పద మృతి వెనుక కూడా వారి ప్రమేయం ఉందని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. తమ కుట్రకు అడ్డంకి అనే తప్పించారా? వివేకా హత్య కేసును పక్కదారి పట్టించేందుకు గంగాధర్రెడ్డి సహకరించకపోవడం ‘కొందరికి’ తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వైఎస్ అవినాశ్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డిలకు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇచ్చేందుకు గంగాధర్రెడ్డి సమ్మతించకపోవడంతో వారి కుట్ర ముందుకు సాగలేదు. దీంతో గంగాధర్రెడ్డిని అడ్డు తప్పించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బెదిరింపులకు లొంగకుండా, తప్పుడు వాంగ్మూలం ఇవ్వకుండా గంగాధరరెడ్డి నిలబడటం కచ్చితంగా వైఎస్ అవినాశ్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డిలకు అనుకూల అంశం. కాబట్టి వారు గంగాధర్రెడ్డి క్షేమాన్ని కోరుకుంటారు. తమ కుట్రకు గంగాధరరెడ్డి సహకరించ లేదని భావిస్తున్న వారే అతడిని అడ్డు తొలగించా లని ప్రయత్నిస్తారు. దీన్నిబట్టి గంగాధర్రెడ్డి తనకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసిన నర్రెడ్డి జగదీశ్వర్రెడ్డి, బాబురెడ్డి పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారు వివేకా కుమార్తె, ఆమె భర్తకు సమీప బంధువులు కావడం గమనార్హం. బాబు.. బెంబేలు శవ రాజకీయాలపై పేటెంట్ హక్కులున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి తన నైజాన్ని చాటుకున్నారు. గంగాధర్రెడ్డి అనుమానస్పద మృతిపై ఆయన స్పందన మరిన్ని సందేహాలకు తావిస్తోంది. టీడీపీ సర్కారు హయాంలో వేధింపులపై ఫిర్యాదు చేసిన గంగాధర్రెడ్డి మృతి చెందడంతో ఆందోళనకు గురైన చంద్రబాబు, లోకేశ్ దీనికి రాజకీయ రంగు పులిమేందుకు అవాస్తవ ఆరోపణలతో ఎదురుదాడికి దిగారు. గంగాధర్రెడ్డి మృతిపై ఆయన కుటుంబ సభ్యులు దర్యాప్తు కోరితే తమ బండారం బట్టబయలవుతుందనే ఆందోళన వారిలో కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ‘పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలమేరకు... తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణానికి తానే బాధ్యుడిని అని ఎమ్మెల్సీ అనంతబాబు తమకు వాంగ్మూలం ఇచ్చినట్టు పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమైనది’ అని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా డ్రైవర్ హత్య కేసులో అనంతబాబును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు అతనికి రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు. -
ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య వెనుక మహిళా ప్రజాప్రతినిధి: పీతల సుజాత
సాక్షి, అమరావతి: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య వెనక ఉన్న అదృశ్య శక్తిగా ఒక మహిళా ప్రజాప్రతినిధి ఉన్నారని టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు పీతల సుజాత ఆరోపించారు. ఆమె ఎవరో, ఆమెకు అనంతబాబుకి ఉన్న సంబంధమేమిటో, ఎందుకు హత్య జరిగిందనే వివరాలను త్వరలోనే బయటపెడతామని చెప్పారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలు, అతన్ని కాపాడటానికి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. -
ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్
సాక్షి, కాకినాడ: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో అనంతబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. అనంత బాబు అరెస్ట్ అనంతరం డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు వివరాలను కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్బాబు మీడియాకు వెల్లడించారు. అనంతబాబుకు సుబ్రహ్మణ్యం రూ.25 వేలు ఇవాల్సి ఉందని.. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవ జరిగిందన్నారు. కోపంతో అనంతబాబు.. సుబ్రహ్మణ్యాన్ని వెనక్కి నెట్టడంతో గ్రిల్ వల్ల అతని తలకు గాయం కావడంతో మృతి చెందినట్లు ఎస్పీ పేర్కొన్నారు. -
చట్టం తనపని తాను చేసుకుపోతుంది: మంత్రి బొత్స
సాక్షి, విజయనగరం: ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని.. 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనంతబాబు వ్యవహారంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు. కాగా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును పోలీసులు విచారిస్తున్నారు. విచారణ పూర్తికాగానే అనంతబాబును రిమాండ్కు తరలిస్తామని ఏఎస్పీ పేర్కొన్నారు. 19వ తేదీ రాత్రి సుబ్రహ్మణ్యం వెంట ఉన్న స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: కొండెక్కిన కోడి.. కిలో చికెన్ అంత ధరా? -
ఎమ్మెల్సీ అనంతబాబును అదుపులోకి తీసుకున్నాం: ఏఎస్పీ
సాక్షి, కాకినాడ: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ హత్య కేసు విచారణ జరుగుతోందని ఏఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అనంతబాబు పోలీస్ కస్టడీలో ఉన్నారని తెలిపారు. ఈ రోజు అనంతబాబును అరెస్ట్ చేస్తామని ఏఎస్పీ వెల్లడించారు. ఘటన జరిగిన రోజు ఎక్కడున్నారనే దానిపై గన్మెన్లకు సంజాయిషీ నోటీసులను పోలీసులు జారీ చేశారు. చదవండి: నూరేళ్ల ఆశలు సమాధి...భర్త, పిల్లలు కళ్లెదుటే.. -
ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్య కేసు
సాక్షి, అమరావతి/సాక్షి, కాకినాడ/కాకినాడ సిటీ: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును ప్రధాన నిందితుడిగా భావిస్తున్నామని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్బాబు తెలిపారు. అనుమానాస్పద మృతి కింద నమోదు చేసిన కేసును హత్య కేసుగా మార్పు చేస్తున్నామని, అనంతబాబును వెంటనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. విచారణ తర్వాత అరెస్టు చేయాల్సి వస్తే చేస్తామని స్పష్టం చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు సహకరించక పోవడం వల్లే పూర్తి వివరాలు సేకరించడం ఆలస్యమైందని చెప్పారు. కాకినాడలో శనివారం రాత్రి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏం చెప్పారంటే.. ► ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర సుబ్రహ్మణ్యం ఐదారు సంవత్సరాలుగా డ్రైవర్గా పని చేస్తున్నాడు. 3 నెలల క్రితం అతన్ని విధుల నుంచి తొలగించారు. సుబ్రహ్మణ్యం 20వ తేదీన అనుమానాస్పదంగా చనిపోయినట్లు అతని తల్లి రత్నం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశాం. ► ఫిర్యాదు ప్రకారం.. సుబ్రహ్మణ్యం ఇంటి దగ్గర నుంచి సాయంత్రం 7.30 – 8 గంటల మధ్య మణికంఠ అనే కుర్రాడు వస్తే అతనితో కలిసి బయటకు వెళ్లాడు. రాత్రి 9 గంటలకు వాళ్ల తల్లి ఫోన్ చేస్తే త్వరగానే ఇంటికి వస్తానని చెప్పాడు. ఆ తర్వాత అదేరోజు అర్ధరాత్రి 12.30 గంటలకు అనంతబాబు దగ్గర నుంచి వారి తండ్రికి ఫోన్ వచ్చింది. ► సుబ్రహ్మణ్యం ప్రమాదానికి గురై స్పృహ తప్పి పడిపోయాడని, తాను అక్కడికి వెళుతున్నానని ఆయన చెప్పాడు. మళ్లీ 1.30 గంటలకు వాళ్ల రెండో అబ్బాయి నవీన్కు ఫోన్ చేశాడు. సుబ్రహ్మణ్యం స్పృహ తప్పి పడిపోయి ఉంటే భానుగుడి జంక్షన్లో ఉన్న అమృత హాస్పిటల్కి తీసుకు వస్తున్నానని, మీరు కూడా రావాలని వాళ్లకి చెప్పాడు. ► దీంతో నవీన్, అతని స్నేహితులు ఆస్పత్రికి వెళ్లినప్పుడు వాళ్ల సమక్షంలోనే డాక్టర్లు సుబ్రహ్మణ్యంను పరిశీలించి చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం మృతదేహంతోపాటు అతని సోదరుడు, స్నేహితుల్ని అనంతబాబు తన వాహనంలో కొండాయపాలెంలోని వాళ్ల తల్లితండ్రులు ఉండే ఆపార్టుమెంట్ (అతని తండ్రి సత్యనారాయణ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు) దగ్గరకు తీసుకెళ్లారు. ► మృతదేహంతోపాటు ఎమ్మెల్సీ తెల్లవారుజామున 4 గంటల వరకు అక్కడే ఉండి.. వారు నిలదీయడంతో కారు, మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లారు. ఈ మరణం ఎలా జరిగిందనే దానిపై అనుమానాలున్నాయి కాబట్టి ఫిర్యాదును బట్టి కేసు రిజిస్టర్ చేశాం. ► ఈ కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వాస్తవాలు, ఆధారాలను బట్టి పారదర్శకంగా సీనియర్ అధికారులతో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. డీజీపీ ప్రతి గంటకు కేసును సమీక్షించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదైంది కాబట్టి మృతదేహాన్ని శవపంచనామా చేస్తున్నప్పుడు రక్త సంబంధీకుల వాంగ్మూలాలు తీసుకోవాలి. వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ► శవ పంచనామా అయిన వెంటనే పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పంపాలి. కానీ బంధువులకు ఉన్న అనుమానాల నేపథ్యంలో సహకరించలేదు. శవ పంచనామాకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని కోరినా రాలేదు. చివరికి వారిని ఒప్పించి మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకువచ్చి శవ పంచనామా మొదలుపెట్టాం. సుబ్రహ్మణ్యం తల్లితండ్రులు, అతని భార్య, ఇతరులను విచారించాం. పోస్టుమార్టం తర్వాతే స్పష్టత ► అనంతబాబుపై తమకు అనుమానం ఉందని, ఆయనే ప్రధాన నిందితుడని వాళ్ల కుటుంబ సభ్యులు చెప్పారు. వాళ్లు ఇచ్చిన ఆధారాల ప్రకారం ప్రస్తుతానికి అనంతబాబును ప్రధాన నిందితుడుగా భావిస్తున్నాం. మరణానికి కారణం పోస్టుమార్టం తర్వాత తెలుస్తుంది. ► శవ పంచనామా తర్వాత పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేస్తాం. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. సుబ్రహ్మణ్యం తల్లితండ్రులు, అతనితో మద్యం సేవించిన మిత్రులు, పరిశీలించిన వైద్యులు, మిగిలిన సాక్షులను యుద్ధ ప్రాతిపదికన విచారిస్తాం. కేసును 302 సెక్షన్గా మార్చబోతున్నాం. ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అదుపులోకి తీసుకుంటాం. విచారణ జరిపి చట్ట పరంగా అరెస్టు చేయాల్సి వస్తే చేస్తాం. -
పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
పెదకాకాని(గుంటూరు జిల్లా): చెల్లెలు వరుస అయిన యువతిని మాయమాటలతో మోసం చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన న్యాయవాదిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం చిలకలూరిపేట తూర్పు మాలపల్లికి చెందిన జంగా ప్రతాప్ 2019 నుండి గడ్డిపాడులోని తన చిన్నమ్మ దీనకుమారి ఇంటిలో ఉంటూ లా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రతాప్ తల్లి, దీనకుమారిలు స్వయానా అక్కచెల్లెళ్ల పిల్లలు. గడ్డిపాడులోని దీనకుమారి కుమార్తె దొడ్డా రమాదేవి సిమ్స్ కళాశాలలో బిఫార్మసీ చదువుతుంది. చదవండి: పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టిన మామిడికాయ పచ్చడి.. వరుసకు అక్కచెల్లెళ్ల పిల్లలు అయినప్పటికీ వారిద్దరి మధ్య పెరిగిన సాన్నిత్యం అక్రమ సంబంధానికి దారి తీసింది. జంగా ప్రతాప్ రమాదేవికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించాడు. 2021 ఆగస్టు నెలలో మరొక మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన రోజు కూడా రమాదేవితో ఫోన్లో మెసేజ్ల రూపంలో సంభాషించాడు. పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంపై రమాదేవి నిలదీసింది. వరుసకు సోదరుడైన ప్రతాప్ చేసిన మోసానికి మనస్థాపానికి గురై 2021 సెప్టెంబరు నెలలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఫోన్ సంభాషణలు, మెసేజ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆశ్చర్యపోయే నిజాలు వెలుగుచూశాయి. జంగా ప్రతాప్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజాన్ని అంగీకరించాడు. నిందితుడు ప్రతాప్ను అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరు పరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు పెదకాకాని సీఐ బండారు సురేష్బాబు తెలిపారు. -
గోవా: ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని.. బీచ్కు తీసుకెళ్లి..
ప్రేమలో పడటం, ఏదో ఒక కారణంతో విడిపోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ఇక బ్రేకప్ చెప్పిందని ప్రియురాలిపై కక్షసాధింపు చర్చలకు పాల్పడటం కూడా అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం. తనకు కాదని వెళ్లిపోయిందనే భాధ, కోపం తట్టుకోలేక కొందరు ప్రాణాలను తీసేస్తున్నారు. ప్రేమలో పడితే లోకాన్నే మరిచిపోయే జంటలు.. అదే ప్రేమ వద్దని చెబితే ఏకంగా ఈ లోకంలోనే లేకుండా చేస్తున్నారు. తాజాగా తనకు బ్రేకప్ చెప్పిందని ప్రియురాలిని కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన గోవాలో చోటుచేసుకుంది. కిషన్ కలంట్కర్(26) అనే యువకుడు కలేజీలో చదువుతున్న19 ఏళ్ల యువతిని ప్రేమించాడు. కొనాళ్లపాటు వీరి లవ్ ట్రాక్ బాగానే సాగింది. అయితే మనస్పర్థల కారణంగా రిలేషన్షిప్ కొనసాగించడం ఇష్టం లేదని, విడిపోదామని యువతి చెప్పింది. దీంతో యువకుడు మనస్తానికి గుయ్యాడు. బ్రేకప్ను తట్టుకోలేక యువతితో కలిసి బుధవారం సౌత్గోవాలోని వెల్సాన్ బీచ్కు వెళ్లాడు. అక్కడ కూడా తనను విడిచి వెళ్లొద్దంటూ ప్రాదేయపడ్డాడు. ఎంతకూ యువతీ ఒప్పుకోకపోవడంతో కోపోద్రిక్తుడై అప్పటికే తనవెంట తెచ్చుకున్న కత్తితో యువతిని పొడిచి చంపాడు. యువతి చనిపోవడంతో మృతదేహాన్ని బీచ్ పక్కనే ఉన్న పొదల్లో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే బీచ్ సమీపంలోని పొదల్లో యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన 24 గంటల్లోపే నిందితుడిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. చదవండి: లాలూ ప్రసాద్ యాదవ్కు ఊహించని షాక్ -
దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ఎప్పటిలోపు పూర్తవుతుందో చెప్పడం కష్టమని సీబీఐ గురువారం హైకోర్టుకు నివేదించింది. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదికలు రావాల్సి ఉందని, అందువల్ల దర్యాప్తును ముగింపునకు తీసుకు రాలేకపోతున్నామని వివరించింది. జూన్ 13కల్లా ఢిల్లీ, గాంధీనగర్ ఫోరెన్సిక్ ల్యాబ్ల నుంచి నివేదికలు తెప్పించుకోవాలని హైకోర్టు సీబీఐకి స్పష్టంచేసింది. లేని పక్షంలో వాస్తవాల ఆధారంగా నిర్ణయం వెలు వరిస్తామని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను జూన్ 13కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఉత్తర్వులు జారీ చేశారు. వివేకా హత్య కేసులో నిందితులు గజ్జెల ఉమాశంకర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, వై.సునీల్ యాదవ్లు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యాలపై జస్టిస్ రవి గురువారం మరోసారి విచారణ జరిపారు. సీబీఐ తరఫు న్యాయవాది పి.చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో తగిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశామన్నారు. దర్యాప్తు ఎప్పుడు పూర్తి చేస్తారని, అది మాత్రమే తమకు కావాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుంది అన్న సింపుల్ ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పాలన్నారు. నిర్దిష్టంగా ఏ తేదీన పూర్తిచేస్తారో అడగడంలేదని, ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉందని అడుగుతున్నామని అన్నారు. టైమ్లైన్ చెప్పలేమని చెన్నకేశవులు చెప్పారు. వివేకా రాసి నట్లు చెబుతున్న లేఖను ఢిల్లీలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని, అక్కడి నుంచి నివేదిక అందాల్సి ఉందన్నారు. ఈ కేసులో నిందితులు దర్యాప్తునకు పలు రకాలుగా ఆటంకాలు కలిగిస్తున్నారని తెలిపారు. సీబీఐ డ్రైవర్ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని తెలిపారు. న్యాయమూర్తి స్పందిస్తూ, ఈ పిటిషన్లపై వేసవి సెలవులు ముగిసిన వెంటనే జూన్ 13న విచారణ జరుపుతామన్నారు. దీనికి శివశంకర్రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ స్పందిస్తూ, పిటిషనర్ ఆరు నెలలుగా జైలులో ఉన్నారని తెలిపారు. పిటిషనర్ వ్యక్తిగత స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. విచారణను వాయిదా వేయకుండా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఉత్తర్వులు తమకు అనుకూలంగా ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా ఇబ్బంది లేదన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, పిటిషనర్ వ్యక్తిగత స్వేచ్ఛే కాదని, సీబీఐ ఆందోళనను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరో మూడు వారాలు వేచి చూద్దామని, ఈ లోపు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు రావొచ్చునన్నారు. -
పక్కా ప్రణాళికతోనే ప్రాణాలు తీశాడు..
నెల్లూరు(క్రైమ్): తనతో పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో కావ్యశ్రీని చంపడమే లక్ష్యంగా సురేష్రెడ్డి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు.. బిహార్లో తుపాకీ కొనుగోలు చేసి నెల్లూరు వచ్చాడు.. అదును కోసం వేచి చూసి ఈ నెల 9న ఆమెను తుపాకీతో కాల్చి చంపి.. ఆపై తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాకీని ఎక్కడ, ఎవరి వద్ద కొనుగోలు చేశాడు.. తదితర వివరాలను సేకరించిన పోలీసులు బిహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ వివరాలను గురువారం నెల్లూరు క్రైమ్స్ ఏఎస్పీ చౌడేశ్వరి మీడియాకు వివరించారు. పొదలకూరు మండలం తాటిపర్తికి చెందిన కావ్యశ్రీ.. అదే ప్రాంతానికి చెందిన సురేష్రెడ్డితో పెళ్లికి నిరాకరించడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని గతేడాది ఆగస్టులో ఆమెకు సురేష్రెడ్డి మెసేజ్ పంపాడు. దానికి ఆమె స్పందించకపోవడంతో ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. యాసిడ్తో దాడి, హత్యచేయడంపై ఇంటర్నెట్లో వీడియోలు చూశాడు. చివరకు తుపాకీతో కాల్చి చంపాలని నిర్ణయించుకుని, ఆ సమాచారం కోసం నెలల తరబడి డార్క్ నెట్లో శోధించాడు. బిహార్లో తుపాకులు దొరుకుతాయని తెలుసుకుని గతేడాది డిసెంబర్లో పాట్నాకు వెళ్లాడు. ఈ క్రమంలోనే పాట్నా పున్పున్ పోస్టు కందాప్ గ్రామానికి చెందిన కారు డ్రైవర్ రమేష్కుమార్ అలియాస్ రోహిత్, అతని అన్న ఉమేష్ల నుంచి తుపాకీని కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి అదును కోసం వేచి చూసి చివరికి కావ్యశ్రీని కాల్చి చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కోణంలో దర్యాప్తు ఘటనపై శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. అసలు సురేష్ రెడ్డికి తుపాకీ ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరి వద్ద కొనుగోలు చేశాడు? అన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సురేష్రెడ్డి సెల్ఫోను మెసేజ్లు, కాల్ డేటా, ట్రావెల్ హిస్టరీని సేకరించారు. మృతుడు గతేడాది డిసెంబర్లో బిహార్లోని ఓ బ్యాంకు ఏటీఎం నుంచి రూ.89,500 విత్డ్రా చేసినట్టు గుర్తించారు. తుపాకీ పైనున్న( స్టార్) గుర్తుల ఆధారంగా దానిని బిహార్లోనే కొనుగోలు చేసినట్టు నిర్ధారణకొచ్చారు. ప్రత్యేక బృందాలు పాట్నాకు వెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో.. తుపాకీని విక్రయించిన అన్నదమ్ముల్లో ఒకడైన రోహిత్కు నెల్లూరు వచ్చి విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారు. దీంతో రమేష్ ఈ నెల 17న నెల్లూరు వచ్చి సీసీఎస్ పోలీస్స్టేషన్లో విచారణకు హాజరయ్యాడు. రెండు రోజుల పాటు విచారించిన పోలీసులు గురువారం అతడిని అరెస్ట్ చేశారు. అతడిచ్చిన సమాచారం మేరకు అతడి అన్న ఉమేష్ కోసం గాలిస్తున్నట్టు క్రైమ్స్ ఏఎస్పీ చౌడేశ్వరి వివరించారు. -
Rajiv Gandhi Assassination Case: పేరరివాళన్ పెళ్లి ఏర్పాట్లు షురూ
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న పేరరివాళన్కు సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం సుప్రీంకోర్టు తీర్పుతో బుధవారం లభించిన విముక్తి.. మిగిలిన ఆరుగురినీ ఆశలపల్లకి ఎక్కించింది. సీఎం స్టాలిన్ సైతం ఈ అంశంపై న్యాయనిపుణులతో చర్చిస్తామని ప్రకటించడం వారి విడుదలపై కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. పెళ్లి ఏర్పాట్లు చేస్తాం: అర్బుదమ్మాళ్ 1991 మే 21వ తేదీ మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్యకు గురికాగా, జూన్లో పేరరివాలన్ను అరెస్ట్ చేసినప్పటి నుంచి విడుదల కోసం తల్లి అర్బుదమ్మాల్ పోరాటం చేస్తున్నారు. తన కుమారుడు నిరపరాది అంటూ ఆనాటి నుంచి వరుసగా అందరు సీఎంలకు, అన్నిపార్టీల నేతలకు ఆమె వినతిపత్రాలు సమర్పించారు. పేరరివాలన్ విడుదలైన వెంటనే వివాహం చేసి పెట్టాలని ఆమె ఆశపడింది. ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. చదవండి: (బిడ్డకోసం అమ్మ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, తీవ్ర భావోద్వేగం) నేపథ్యం ఇదీ.. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1991 మే 21వ తేదీన శ్రీపెరంబుదూరులో మాజీ ప్రధాని రాజీవ్గాంధీ బహిరంగసభకు హాజరైనప్పుడు ఎల్టీటీఈ మానవబాంబు చేతిలో హతమయ్యారు. ఈ కేసుకు సంబంధించి 1999లో తొమ్మిది మంది విడుదల కాగా, పేరరివాళన్, నళిని, మురుగన్, శాంతన్కు ఉరిశిక్ష, రవిచంద్రన్, జయకుమార్, రాబర్ట్ పయస్కు యావజ్జీవశిక్ష పడింది. 2014లో పేరరివాళన్ సహా అందరూ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి వినతిపత్రం పంపగా పరిశీలనలోకి తీసుకోలేదు. ఈ విషయాన్ని కారణంగా చూపుతూ సుప్రీంకోర్టు వారందరి మరణశిక్షను రద్దు చేసి యావజ్జీవశిక్షకు తగ్గించింది. ఆనాటి నుంచీ వారంతా తమిళనాడు రాష్ట్రం వేలూరు సెంట్రల్ జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. మానవబాంబుకు బ్యాటరీ కొనుగోలు చేసి ఇచ్చిన నేరంపై పేరరివాళన్కు శిక్ష పడగా విడుదల చేయాలని కోరుతూ అతని న్యాయవాది 2016లో సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. మరో పిటిషన్ ఆధారంగా పేరరివాళన్కు సుప్రీంకోర్టు జామీను మంజూరు చేసింది. ఇదిలా ఉండగా, మొత్తం ఏడుగురినీ విడుదల చేయాలని 2018లో తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయగా, గవర్నర్ ద్వారా రాష్ట్రపతి పరిశీలనకు చేరింది. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి మాత్రమే నిర్ణయం తీసుకోగలరని కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనను సుప్రీంకోర్టు బెంచ్ తోసిపుచ్చింది. -
డిప్యూటీ తహసీల్దార్పై టీడీపీ నేతల హత్యాయత్నం
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరులో రేషన్ షాపును తనిఖీ చేయడానికి వెళ్లిన డిప్యూటీ తహసీల్దారుపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బోడే ప్రసాద్, ఆయన అనుచరులు హత్యాయత్నానికి ఒడిగట్టారు. అక్కడే ఉన్న వీఆర్వోపైనా దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పెనమలూరులో డీలర్ లుక్కా అరుణ్బాబు నిర్వహిస్తున్న రేషన్ దుకాణం (నం.27)లో స్టాకు తనిఖీకి డిప్యూటీ తహసీల్దార్ (పీడీఎస్) గుమ్మడి విజయ్కుమార్, వీఆర్వో మంగరాజు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో వెళ్లారు. తనిఖీల్లో 330 కిలోల బియ్యం, 152 ప్యాకెట్ల పంచదార తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఈ అధికారులు డీలర్ స్టేట్మెంట్ తీసుకుని రిపోర్టు రాస్తున్న సమయంలో బోడే ప్రసాద్ రాత్రి 10 గంటలకు రేషన్షాపు వద్దకు వచ్చి.. తన వెంట వచ్చిన అనుచరులతో అధికారులపై దాడి చేయించారు. వారు డిప్యూటీ తహసీల్దార్ గొంతు నులిమి చంపే యత్నం చేశారు. రిపోర్టును బలవంతంగా తీసుకెళ్లారు. ఈ ఘటనలో డిప్యూటీ తహసీల్దార్ కంటికి తీవ్ర గాయమైంది. ఆయనకు కంటికి వైద్యం కోసం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో వీఆర్వో మంగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. పరారీలో బోడే ప్రసాద్.. దాడి తర్వాత బోడే ప్రసాద్ పరారీలో ఉన్నట్టు పెనమలూరు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు. దాడిలో పాల్గొన్న వారిపై ఐపీసీ 353, 332, 323, 506, 392, 307 రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఎ1గా బోడే ప్రసాద్, ఎ2గా వంగూరు పవన్, ఎ3గా కంఠమనేని పార్థు, ఎ4గా దొంతగాని పుల్లేశ్వరరావు, ఎ5గా కొల్లిపర ప్రమోద్కుమార్, ఎ6గా కిలారు ప్రవీణ్కుమార్, ఎ7గా బోడె మనోజ్, ఎ8గా కాపరౌతు వాసు, ఎ9గా కిలారు కిరణ్కుమార్, ఎ10గా చిగురుపాటి శ్రీనివాసరావులతో పాటు మరికొందరు ఉన్నారని చెప్పారు. వీరిలో ఎ1, ఎ3 మినహా మిగతా వారిని బుధవారం అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు బోడే ప్రసాద్ కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు. రేషన్ షాపు సీజ్ చేశాం ప్రతి నెలా అన్ని రేషన్ షాపుల్లో స్టాకు తనిఖీలు చేస్తాం. ఇందులో భాగంగానే పెనమలూరులో రేషన్షాపును తనిఖీ చేసి రిపోర్టు రాస్తుండగా దాడి చేశారు. ఈ ఘటనతో రేషన్షాపు సీజ్ చేశాం. తనిఖీకి వచ్చిన అధికారులపై దాడి చేయటం దారుణం. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. డీలర్ను సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. – జి.భద్రు, తహసీల్దార్, పెనమలూరు -
ఇది అమ్మ విజయం, పెరారివాలన్ భావోద్వేగం
-
బిడ్డకోసం అమ్మ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, తీవ్ర భావోద్వేగం
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఏడుగురు దోషుల్లో ఒకరు, యావజ్జీవ ఖైదీ.. ఏజీ పెరారివాలన్ అలియాస్ అరివును విడుదల చేయాలని సుప్రీం మే 18న ఆదేశించింది. 19 ఏళ్ల వయసులో అరెస్టయ్యి, గత మూడు దశాబ్దాలుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న 50 ఏళ్ల వయసులో పెరారివాలన్ కు ఎట్టకేలకు విముక్తి లభించింది. దీంతో ఆయన తల్లి అర్పుతం అమ్మాళ్ ఆనంధానికి అవధుల్లేవు. తన బిడ్డ అమాయకుడు అని వాదిస్తూ, ఏళ్ల తరబడి ఆమె చేసిన పోరాటం అంత తేలికైనదేమీ కాదు. ఎన్ని అవమానాలు, అడ్డంకులు ఎదురైనా పట్టువదలకుండా, న్యాయవ్యవస్థమీద విశ్వాసాన్ని కోల్పోకుండా పోరాడి విజయం సాధించిన గొప్ప తల్లి ఆమె. అందుకే 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన ఆ మహాతల్లికి స్వర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ట్విటర్లో ఆమెకు ఏకంగా 21.3 వేల ఫాలోవర్స్ ఉండటం గమనార్హం. ఆపదలో ఉన్న బిడ్డను కాపాడుకునేందుకు కన్నతల్లి ఎంతటి త్యాగానికైనా, సాహసానికైనా వెరువదు అనేందుకు పెరారివాలన్ తల్లి నిలువెత్తు నిదర్శనం. అవమానాలు, అవహేళనలు ఎదురైనా, ఎన్నిసార్లు కోర్టులో నిరాశ ఎదురైనా వెన్ను చూపలేదు. ఆశ కోల్పోలేదు. ఆమెది ఒకటే లక్ష్యం. అన్యాయంగా జైల్లో మగ్గుతున్న తన కుమారుడికి విముక్తి లభించాలి. అందుకోసం ఏకంగా మూడు దశాబ్దాలుగా అంతులేని పోరాటం చేసేంది. అప్పటి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నాయకులకు పలుసార్లు అభ్యర్థనలు పెట్టింది. ఈ సుదీర్ఘ పోరులో తనతో కలిసి వచ్చిన వారందరినీ కలుపుకుపోయారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పెట్టు కున్నారు. కుటుంబ సభ్యులు, తమిళ సోదరులు, ఇతర మిత్రుల సహకారంతో చివరికి అపూర్వ విజయం సాధించారు. అందుకే కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆనందంతో ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. ఉత్సాహంగా మిత్రులకు, బంధువులకు స్వీట్లు పంచిపెట్టారు. మరణశిక్షనుంచి యావజ్జీవ శిక్షగా, ఇపుడు జైలునుంచి విడుదలయ్యే దాకా అర్పుతం అమ్మాళ్ చేసిన పోరాటం అభినందనీయంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా పెరారివాలన్ తల్లి అమ్మాళ్ మీడియాతో మాట్లాడారు. “మీ అందరినీ వెయిట్ చేయించినందుకు క్షమాపణలు కోరుతున్నాను, కానీ నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు. మీ అందరికీ ధన్యవాదాలు. మా పోరాటం 30 ఏళ్లు సాగింది. ఇంతకాలం మమ్మల్ని ఆదరించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఇతర ముఖ్యులు అందరికీ కృతజ్ఞతలు. అసలు నేను ఎవరో తెలియని వారుకూడా అండగా నిలిచారు’’ అంటూ అందరికీ నీరు నిండిన కళ్లతో ధన్యవాదాలు తెలిపారు. అలాగే 30 ఏళ్లు జైలులో గడపడం ఎలా ఉంటుందో అందరూ ఒక్క నిమిషం ఆలోచించాలని అర్పుతం అమ్మాళ్ కోరారు. సుప్రీం తీర్పు తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన పెరారివాలన్, ‘‘తన సొంత కుటుంబ సభ్యుడిగా భావించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు నాకు సంఘీభావంగా నిలిచారు. తన కోసం 30 సంవత్సరాలు పోరాడింది అమ్మ. ఈ ఘనత అమ్మదే. ముఖ్యంగా ప్రారంభంలో అక్కలు నాన్న, బావమరిది ప్రేమే నన్ను ముందుకు నడిపించాయి’’. ఈ పోరాట క్రమంలో ఓడిపోయిన ప్రతీసారి, అమ్మ శక్తిని హరించి వేస్తున్నంత బాధ కలిగేదని గుర్తుచేసుకున్నారు. అసలు తన మొఖం చూడాలంటేనే భయపడేవాడినని చెప్పారు కానీ వాళ్లంతా బతికి ఉండగానే తనకు విముక్తి లభిస్తుందని మాత్రం ఎప్పుడూ ఆశించానంటూ భావోద్వేగానికి లోనయ్యారు పెరారి. కాగా జైలులో ఉన్న సమయంలో పెరారి అనేక విద్యా అర్హతలను సంపాదిండమే కాదు ఒక పుస్తకాన్ని రాశారు. ఈ సుదీర్ఘ పయనంలో తన పెద్ద అక్కతో సహా, తన కోసం కష్టపడిన ప్రతి ఒక్కిరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మరణశిక్షను నిరసిస్తూ కాంచీపురానికి చెందిన 20 ఏళ్ల మహిళ సెంకోడి త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధానమంత్రులకు తన కోసం రాసిన అనేక లేఖలు , మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ సిబిఐ అధికారి విత్యాగరాజన్, జస్టిస్ కృష్ణయ్యర్, రిటైర్డ్ జస్టిస్ కెటి థామస్, ఫీజు కూడా ఆశించకుండా అడ్వకేట్ గోపాల్ శంకరనారాయణన్, ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వం, జైలు అధికారులు ఇలా ఎందరో తనకు అండగా నిలిచారని పేర్కొన్నారు. మీడియా సపోర్ట్ కూడా చాలా ఉందన్నారు. తాను మరణ శిక్షలకు వ్యతిరేకమని పెరారివాలన్ మీడియాతో చెప్పారు. మరోవైపు స్వయంగా తమిళనాడు సీఎం స్టాలిన్ అర్పుతం అమ్మాళ్కు ఫోన్ చేసి మరీ ప్రత్యేకంగా అభినందించారు. కోర్టు తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కాగా భారతమాజీ ప్రధాని, రాజీవ్ గాంధీ మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో, అప్పటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జికె మూపనార్తో కలిసి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఉండగా, ఆత్మాహుతి బాంబర్ ధను అలియాస్ తేన్మొళి రాజారత్నం చేసిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. రాజీవ్ను హత్య చేసేందుకు వినియోగించిన బెల్ట్ బాంబు బ్యాటరీని కొనుగోలు చేసినట్లు పెరారివారన్పై ప్రధాన ఆరోపణలు. ఈ హత్యకు సూత్రధారి అయిన ఎల్టీటీఈకి చెందిన శివరాసన్ కోసం పెరారివాలన్ రెండు 9-వోల్ట్ బ్యాటరీలను కొనుగోలు చేశాడనేది అభియోగం. ఆ సమయంలో పెరారి వాలన్ వయసు 19 సంవత్సరాలు. ఈ కేసుకు సంబంధించి 1998లో పెరారివాలన్కు టాడా కోర్టు మరణశిక్ష విధించింది. మరుసటి సంవత్సరం, సుప్రీంకోర్టు ఆ శిక్షతో ఏకీభవించింది. ఆ తరువాత 2014లో పెరారివాలన్, మురుగన్, సంతన్ క్షమాభిక్ష పిటిషన్లు సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న కారణంగా దోషుల మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 ప్రకారం విడుదల చేయాలని కోరుతూ డిసెంబర్ 31, 2015న, పెరారివాలన్ 47 పేజీలు, సీడీలతో కూడిన క్షమాభిక్ష పిటిషన్ను తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యకు అందించారు. అనంతరం పెరారివాలన్, ఇతర దోషులకు క్షమాపణ ఇవ్వాలని పళనిస్వామి నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం 2018లో గవర్నర్ను కోరింది. గవర్నర్ ఈ విషయాన్ని భారత రాష్ట్రపతికి నివేదించారు. ఫలితంగా పెరారివాలన్కు ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తాజాగా పెరారివాలన్ను విడుదల చేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. బ్యాటరీలను కొనుగోలు చేసిన ఉద్దేశ్యం, రాజీవ్ హత్యకుట్ర కోణం తనకు తెలియదని పెరారి వాదన. అలాగే అక్టోబరు 27, 2017 నాటి అఫిడవిట్లో పెరారివాలన్ చేసిన ప్రకటనను తాను రికార్డ్ చేయలేదని మాజీ సీబీఐ అధికారి త్యాగరాజన్ అంగీకరించారు. అంతేకాదు రెండు దశాబ్దాల తన జీవితంలో జరిగిన నష్టానికి తాను పశ్చాత్తాప పడుతున్నానని కూడా అని త్యాగరాజన్ చెప్పారు. మరోవైపు రాజీవ్ గాంధీ 31వ వర్ధంతికి కేవలం మూడు రోజుల ముందు (మే 18, బుధవారం) పెరారివాలన్కు విముక్తి లభించడం విశేషం. తాజా తీర్పుతో ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న నళిని, ఆమె భర్త మురుగన్ సహా ఇతర దోషుల విడుదలకు కూడా మార్గం సుగమం కానుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం బాధించింది : కాంగ్రెస్ పెరారివాలన్ విడుదలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు నిర్ణయంపై విచారాన్ని వ్యక్తం చేసింది. టెర్రరిస్టును టెర్రరిస్టుగానే పరిగణించాలి, సుప్రీం ఆదేశాలు తీవ్ర బాధను కలిగించాయని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. మరోవైపు రాజీవ్ భార్య, కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, కాంగ్రెస్ నేతలు, రాజీవ్ కుమార్తె ప్రియాంక గాంధీ, కుమారుడు రాహుల్ గాంధీ దీనిపై ఇంకా స్పందించాల్సి ఉంది. -
మధ్యాహ్నం హత్య.. భర్తను పట్టించిన చేతి గోళ్లు
ముంబై: భార్యభర్తల గొడవలనేవి సహజం. కలహాలు లేని కాపురమే ఉండదు. కానీ ఆ మనస్పర్థలు సద్దుమణిగి కలిసిపోతే అసలు సమస్యే ఉండదు. చిలికి చిలికి గాలివానలా మారితేనే కష్టం. పోనీ ఎవరిమానాన వారు బతికినా పర్వాలేదు గానీ కక్ష పెంచుకుని దారుణమైన నేరాలకు పాల్పడితే ఇరు జీవితాలు నాశనమవుతాయి. అచ్చం అలాంటి సంఘటనే ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ముంబైలో సకినాకాలోని ఖైరానీ రోడ్ ప్రాంతంలో మనోజ్ ప్రజాపతి, అతని భార్య రీమా భోలా యాదవ్ నివశిస్తున్నారు. ఐతే వారు గత రెండు రోజులుగా విడివిడిగా నివశించడం మొదలు పెట్టారు. అనుకోకుండా ఒక రోజు రీమా స్నేహితురాలు ఇంటికి వచ్చి చూసేటప్పటికీ ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో పోలీసులు రీమా స్నేహితురాలు ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో రీమా భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు. ఐతే అతను తొలుత కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ నిందితుడి గోళ్లపై ఉన్న రక్తపు మరకలే అతన్ని పట్టుబడేలా చేశాయని పోలీసులు తెలిపారు. రీమా తన మొబైల్లో చివరిసారిగా తన భర్తతోనే సంభాషించినట్లు వెల్లడించారు. దీంతో పోలీసులు రీమా భర్తను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: ‘నారాయణ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకే పేపర్ లీక్’) -
ఆస్తి కోసమే నా భర్తను చంపేశారు
అనంతపురం క్రైం: చనిపోయిన ఓ ఆటోడ్రైవర్ మృతదేహానికి 15 రోజుల తర్వాత పోస్టుమార్టం నిర్వహించాలని త్రీటౌన్ పోలీసులు నిర్ణయించారు. త్రీటౌన్ సీఐ హరినాథ్ వివరాల మేరకు ... స్థానిక ఇందిరానగర్కు చెందిన మహబూబ్పీరా (46) ఆటోడ్రైవర్గా విధులు నిర్వర్తించేవాడు. అతనికి భార్య ఆశా, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మహబూబ్పీరా పదేళ్లుగా భార్యకు దూరంగా ఉంటూ అతని చెల్లెళ్ల వద్ద ఉంటున్నాడు. గత నెల 22న మహబూబ్పీరా వాంతి కాగా, ఈనో ప్యాకెట్ తెచ్చుకుని సేవించాడు. కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబీకులు జీజీహెచ్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఇందిరానగర్ సమీపంలోని ముస్లిం శ్మశాన వాటికలో ఖననం చేశారు. భర్త మృతిపై ఆమె భార్య ఆశా అనుమానం వ్యక్తం చేసింది. తన భర్త వద్ద రూ.30 లక్షల నగదు, ఆటోలు, ఇతర ఆస్తులు ఉన్నాయని వాటి కోసమే భర్తింటి వారు ఆయన్ను చంపేశారని ఇటీవల త్రీటౌన్ పీఎస్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే మహబూబ్పీరా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వ వైద్య కళాశాల ఫోరెన్సిక్ విభాగానికి త్రీటౌన్ పోలీసులు లిఖిత పూర్వకంగా విన్నవించారు. రెండ్రోజుల్లో మహబూబ్పీరా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. (చదవండి: న్యూడ్ ఫొటోలు పంపుతామని బెదిరించారు.. తెల్లారి అన్నంత పనీ చేసేశారు) -
ఆధిపత్య పోరుతోనే ప్రసాద్ హత్య
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైఎస్సార్సీపీ నాయకుడు గంజి నాగప్రసాద్ హత్యకేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడు బజారయ్యతోపాటు మరో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఏలూరులో బుధవారం జిల్లా ఎస్పీ రాహుల్దేవ్శర్మ ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన మేరకు.. ఈ హత్యకేసులో అదేరోజు ముగ్గురు నిందితులు పోలీస్స్టేషన్లో లొంగిపోగా, విచారణ అనంతరం మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. జి.కొత్తపల్లి ఎంపీటీసీ సభ్యుడు బిరుదుగడ్డ బజారయ్య, అదే గ్రామానికి చెందిన మండవల్లి సురేష్, ఉండ్రాజవరపు మోహన్కుమార్ అలియాస్ మోహన్, శానం హేమంత్, గంజి నాగార్జున, రెడ్డి సత్యనారాయణ అలియాస్ ఆర్ఎస్ఎన్ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. మూడు కత్తులు, ఒక కారు, రాయల్ ఎన్ఫీల్డ్ మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉందనే కోణంలోను విచారిస్తున్నారు. హత్యకు పక్కా ప్రణాళిక జి.కొత్తపల్లిలో గంజి నాగప్రసాద్, బజారయ్య వర్గాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి. ప్రసాద్ను హత్య చేయాలనే ఉద్దేశంతో బజారయ్య తన వర్గాన్ని పెంచుకుంటూ వెళ్లాడు. రెడ్డి సత్యనారాయణ, మండవల్లి సురేష్, శానం హేమంత్, గంజి నాగార్జున, మరికొందరితో గతనెల 20న సమావేశమయ్యాడు. గతనెల 30న ఉదయం సుమారు 7.40 గంటల సమయంలో ఇంటి నుంచి మోటారు సైకిల్పై నాగప్రసాద్ బయలుదేరుతుండగా నాగార్జున వారికి సమాచారం అందించాడు. మోహన్కుమార్ మోటారు సైకిల్ నడుపుతుండగా కత్తులను తువ్వాలులో చుట్టుకుని సురేష్ మధ్యలోను, హేమంత్ వెనుక కూర్చున్నారు. మోహన్కుమార్ మోటారు సైకిల్తో ఎదురుగా వెళ్లి నాగప్రసాద్ మోటారు సైకిల్ను ఢీకొట్టాడు. కిందపడిపోయిన నాగప్రసాద్ను సురేష్, హేమంత్, మోహన్ కత్తులతో నరికి హత్యచేశారు. నాగార్జున అక్కడికి వచ్చి వారిని ప్రోత్సహించాడు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని స్నేహితుడినే..
శివమొగ్గ: సొరబకు చెందిన లేఖప్ప (28) అనే వ్యక్తిని కృష్ణప్ప (30) హత్య చేశాడు. మన్మనే గ్రామానికి చెందిన లేఖప్ప సొరబకు వచ్చి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లేఖప్ప ఫోన్ కాల్స్ ఆధారంగా అతని స్నేహితుడు అయిన కృష్ణప్పను అదుపులోకి తీసుకొని విచారించగా తానే చంపినట్లు చెప్పాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని పట్టణానికి పిలిపించి హత్య చేసి శవాన్ని పొలాల్లో పడేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా, శివమొగ్గ దగ్గర గురుపురలో గౌడప్ప (35) అనే ప్రైవేటు ఉద్యోగి బైక్పై వెళ్తుండగా గూడ్స్ వ్యాన్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడే మృతి చెందాడు. వరకట్న వేధింపులు, మరో అబల బలి మైసూరు: వరకట్న వేధింపులకు మరో అబల బలైన సంఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హిమ్మావు గ్రామంలో చోటు చేçసుకుంది. గ్రామానికి చెందిన ఉమేష్, బేబి (29)కి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. అప్పుడప్పుడు దంపతుల మధ్య కట్నం విషయంగా గొడవలు జరిగేవి. ఇదిలా ఉంటే మంగళవారం తెల్లవారుజామున బేబి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. డబ్బు కోసం వేధించడం వల్లనే బేబి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త అలా చేస్తున్నాడని వందన..) -
Crime News: నగ్నంగా మృతదేహాలు, వివాహేతర సంబంధమే కారణమా?
అబ్దుల్లాపూర్మెట్ : హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జంట హత్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్లోని వారాసిగూడ ప్రాంతానికి చెందిన యెడ్ల యశ్వంత్(22) క్యాబ్ డ్రైవర్గా పని చేసేవాడు. అతడికి అదే ప్రాంతానికి చెందిన జ్యోతి(28)అనే మహిళతో పరిచయం ఉంది. కొత్తగూడెం గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి వచ్చిన వీరు హత్యకు గురై ఉంటారని భావించిన పోలీసులు క్లూస్టీంతో పలు ఆధారాలను సేకరించారు. మృతదేహాలు నగ్నంగా ఉండటం, యశ్వంత్ తలపై బలమైన గాయాలు ఉన్నాయి. జ్యోతి తలపై బండరాయితో కొట్టి చంపినట్లు గుర్తించారు. సంఘటన స్థలంలో చార్జింగ్లైట్లు.. సంఘటన స్థలంలో బ్యాగు, చార్జింగ్ లైట్లు, ప్లాస్టిక్పూలు, మొబైల్ చార్జర్తో పాటు కూల్డ్రింక్ సీసాలు లభ్యమయ్యాయి. సంఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే బైక్ పార్కింగ్ చేసి ఉంది. వివాహేతర సంబంధమే వీరి హత్యకు కారణమై ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. సంఘటనా స్థలాన్ని ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ సీఐ వాసంస్వామి పరిశీలించారు. వివాహేతర సంబంధమే కారణమా? హత్యకు వివాహేతర సంబంధమే కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యశ్వంత్, జ్యోతి ఏకాంతంగా ఉన్న సమయంలోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. తెలిసిన వారే వీరిని వెంబడిస్తూ వచ్చి హత్య చేశారా? అనే కోణంలో దర్యా ప్తు చేస్తున్నారు. జ్యోతి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మిస్సింగ్ కేసు నమోదు కాలేదు అబ్ధుల్లాపూర్మెట్ ఠాణా పరిధిలో దారుణహత్యకు గురైన ఎడ్ల యశ్వంత్ సంబంధించి ఎటువంటి మిస్సింగ్ కేసు నమోదు కాలేదని చిలకలగూడ సీఐ నరేష్ తెలిపారు. వారాసిగూడలోని మృతుడి తల్లితండ్రులు ఎడ్ల సురేష్, మంజుల మీడియాతో మాట్లాడుతూ క్యాబ్ డ్రైవర్గా పనిచేసే యశ్వంత్ ఆదివారం ఇంటినుంచి బయటికి వెళ్లినట్లు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం పోలీసులు సమాచారం అందించడంతో యశ్వంత్ సోదరుడు ఘటనా స్థలానికి వెళ్లినట్లు తెలిపారు. ఆదివారం ఇంటి నుంచి వచ్చాడు ఈనెల 1 న సాయంత్రం నా బైక్ తీసుకుని మా అన్న యశ్వంత్ బయటికి వచ్చాడు. ఒక్కోసారి రెండు మూడు రోజుల వరకూ ఇంటికి రాడు. అలాగే ఎక్కడికైనా వెళ్లాడనుకున్నాం. పోలీసుల ద్వారా సమాచారం తెలిసి ఇక్కడికి వచ్చాం. మా అన్నకు ఎవరితో విభేదాలు లేవు. హత్యకు గురైన మహిళతో పరిచయం ఉన్న విషయం తెలియదు. – మృతుడి సోదరుడు అనిరుద్ -
కారు పల్టీ, 8 మందికి గాయాలు
శివమొగ్గ: కారు అదుపు తప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న సుమారు 20 అడుగుల లోతైన గుంతలోకి పల్టీ కొట్టింది. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది గాయపడ్డారు. హోసనగర తాలూకాలోని నిట్టూరు వద్ద ఈ ఘటన జరిగింది. బెంగళూరు శ్రీనగర లేఔట్కు చెందిన కుటుంబం కారులో సిగందూరుకు వెళుతున్న సమయంలో అతి వేగం వల్ల ప్రమాదం జరిగింది. స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. బెంగళూరువాసి ఆత్మహత్య శివమొగ్గలోని ఒక లాడ్జితో బెంగళూరు రాజాజినగరకు చెందిన నరేంద్రబాబు (45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం ఇక్కడికి వచ్చి లాడ్జ్లో గది అద్దెకు తీసుకున్నాడు. సోమవారం గది నుంచి దుర్వాసన వస్తుండటంతో సిబ్బంది కోటె పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా బ్లేడుతో చేతులు కోసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు వెల్లడైంది. కేసు నమోదు చేశారు. (చదవండి: విజయ్ బాబు షాకింగ్ నిర్ణయం, కమిటి నుంచి తొలగింపు) -
పడవతో గస్తీ..లేక్ పోలీసింగ్ వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల 17 ఏళ్ల ఓ ఇంటర్ విద్యార్థి కేబుల్ బ్రిడ్జి మీద నుంచి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జిలపై లేక్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలిసారిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో దుర్గం చెరువులో పడవతో పెట్రోలింగ్ను ఏర్పాటు చేశారు. కేబుల్ బ్రిడ్జి కింద వాచ్ టవర్ను ఏర్పాటు చేశారు. త్వరలోనే అధికారికంగా ప్రారంభించేందుకు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాలపై దృష్టి.. కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఇంటికే పరిమితమైన పర్యాటకులు క్రమంగా బయటకు వస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే బదులు స్థానికంగా ఉన్న టూరిస్ట్ ప్లేస్లపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీంతో దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జిలపై సందర్శకుల తాకిడి పెరిగింది. వారాంతాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటోంది. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో మద్యం తాగడం, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం వంటివి పోలీసుల దృష్టికి వచ్చాయి. దీంతో సందర్శకులకు భద్రతతో పాటూ అసాంఘిక కార్యకలాపాలకు జరగకుండా ఉండేందుకు పోలీసుల గస్తీని ఏర్పాటు చేశామని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. బ్రిడ్జిపై వాచ్ టవర్.. ఇప్పటికే దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జి పరిసరాల్లో సైబరాబాద్ పోలీసులు 67 కెమెరాలను ఏర్పాటు చేశారు. తాజాగా బ్రిడ్జి కింద పోలీసు వాచ్టవర్ను ఏర్పాటు చేశారు. దీనికి అన్ని సీసీ కెమెరాలు అనుసంధానమై ఉంటాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఏ మూలన ఏ సంఘటన కెమెరాల్లో నిక్షిప్తమవుతుంది. అనుమానిత వ్యక్తులు సంచరించినా, ట్రాఫిక్జాం, ఇతరత్రా ఇబ్బందులు జరిగినా వెంటనే వాచ్ టవర్లోని పోలీసులకు తెలిసిపోతుంది. వెంటనే క్షేత్ర స్థాయిలోని పోలీసులకు సమాచారం అందించి, ఘటన స్థలానికి వెళ్లి తగిన చర్యలు చేపడతారు. వాచ్ టవర్లో పోలీసులు 24 గంటలు విధుల్లో ఉంటారు. లేక్ పోలీసులకు ఈవీ వాహనాలు.. దుర్గం చెరువు పరిసరాలలో ఆర్టిఫీషియల్ వాటర్ ఫాల్స్, రాక్ గార్డెన్, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, వాకింగ్ ట్రాక్ల వంటివి ఉన్నాయి. దీంతో పిల్లలు, యువకులతో ఎల్లప్పుడూ సందడిగా ఉంటుంది. కేబుల్ బ్రిడ్జి రోడ్డు మధ్యలో నిలబడి సెల్ఫీలు తీసుకోవటం, వాహనాలకు అంతరాయం కలిగిస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని నియంత్రించేందుకు లేక్ పోలీసులు 24 గంటలు గస్తీ చేస్తుంటారు. ఎలక్ట్రిక్ వాహనాలతో లేక్ పోలీసులు పెట్రోలింగ్ విధులను నిర్వహిస్తుంటారు. ఆయా ప్రాంతాలలో మహిళలతో అసభ్యంకరంగా ప్రవర్తించే పోకిరీలను షీ టీమ్ పోలీసులు అక్కడిక్కడే అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. పలుమార్లు ఇలాంటి ప్రవర్తనే కనిపిస్తే జైలుకు పంపిస్తున్నారు. (చదవండి: నైట్ బజార్.. ఫుల్ హుషార్.) -
ఉన్మాదికి ఉరి.. సరైన తీర్పు
వారంతా లోకం తెలియని పసి పిల్లలు. నైర్మల్యానికి ప్రతీకలు. అందరిలా వయసుతోపాటు వచ్చే శారీరక మార్పులే తమపై జరుగుతున్న అరాచకాలకు కారణమని వాళ్లకు తెలియదు. ఆలోచించేంత లోకజ్ఞానం కూడా లేదు. కానీ కంటికి రెప్పలా కాపాడుకునే తమ బిడ్డలపై కసాయిల చూపులు పడుతున్నాయి. లైంగిక దాడులు పెరుగుతున్నాయి. తమ కంటిపాపలను పాపాలభైరవులు గాయపరుస్తున్నారు. కళ్లు మూసుకుపోయి కామవాంఛ తీర్చుకుంటున్నారు. గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువడిన రోజే విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మూడు లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. పీఎంపాలెంలో టీడీపీ నేత నరేంద్ర బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లా కుమ్మరాపల్లి గ్రామంలో బాలికపై ఇదే గ్రామానికి చెందిన వృద్ధుడు శారీరక వేధింపులకు పాల్పడి అసభ్యకరంగా ప్రవర్తించడంపై పోక్సో కేసు నమోదు చేశారు. మరో ఘటనలో.. తనకు కాబోయే భార్య (మైనర్)ను గర్భవతిని చేసి మొహం చాటేశాడో ప్రబుద్ధుడు. అతనిపై కూడా పెందుర్తి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇలా అభం శుభం తెలియని పసిమనసులను గాయం చేస్తున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కామాంధులకు ఉరే సరైన శిక్ష అని బాధితులు స్పష్టం చేస్తున్నారు. సాక్షి విశాఖపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష పడడం చారిత్రకమైన తీర్పు అని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఫాస్ట్ట్రాక్ కోర్డు తీర్పును స్వాగతిస్తున్నామని...ఈ హత్య కేసులో పోలీసుల పనితీరు బావుందని పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గతేడాది ఆగస్టు 15వ తేదీన గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్యని కత్తితో పొడిచి అతికిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈకేసులో పోలీసులు కేవలం హత్య జరిగిన 10 గంటల వ్యవధిలోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారన్నారు. సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డ్ అయ్యాయని, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపితే కేవలం రెండు రోజుల్లోనే నివేదిక ఇచ్చారన్నారు. అంతేకాకుండా హత్య జరిగిన 24 గంటల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశామన్నారు. కేవలంలో ఏడాదిలోపే ప్రత్యేక న్యాయస్థానం నింధితుడికి సరైన శిక్ష విధించిందన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే మృగాలకు ఈశిక్షతో వణుకుపుట్టాలన్నారు. దిశ చట్టం స్ఫూర్తితో కేసు దర్యాప్తు మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ చట్టాన్ని రూపొందించి, కేంద్రానికి పంపామమన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో దిశ పొలీస్ స్టేషన్లు, ఫోరెన్సిక్ ల్యాబ్లు, ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు, అన్ని చోట్లా తగిన సిబ్బందిని కూడా నియమించామన్నారు. ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పించే విధంగా ఈచర్యలన్నీ సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్నారన్నారు. ఒక దిశ యాప్ ద్వారానే ఆపద సమయంలో దాదాపు 900 మంది అమ్మాయిలను రక్షించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.24 కోట్ల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. రమ్య కేసు పూర్తిగా దిశ చట్టం స్ఫూర్తితోనే జరిగిందన్నారు. ఈ తీర్పు ఇప్పుడు దిశ చట్టం అవసరాన్ని మరింత గుర్తు చేస్తోందన్నారు. గతంలో దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో, సుదీర్ఘంగా ఏడేళ్ల పాటు విచారణ తర్వాత కానీ నిందితుడికి శిక్ష పడలేదన్నారు. కానీ ఇక్కడ దిశ చట్టం స్పూర్తితో ఫాస్ట్ట్రాక్ కోర్డులో చాలా వేగంగా విచారణ పూర్తయిందన్నారు. కేవలం 8 గంటల్లోనే హంతకుడికి శిక్ష పడిందన్నారు. రమ్య కుటుంబాన్ని అండగా సీఎం ఇదేస్ఫూర్తితో ఇక ముందు కూడా కేసుల విచారణ జరుగుతోందన్నారు. రమ్యకుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుందని హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. వారికి రూ.1.60 కోట్లతో భూమి(దాదాపు ఐదెకరాలు) కొని ఇవ్వడంతో పాటు, రూ.10 లక్షల ఇచ్చామని తెలిపారు. అంతేకాకుండా రమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చి సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి అన్నలా అండగా నిలిచారన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర, సీపీ సీహెచ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా డ్రగ్స్ ప్రభావం మన రాష్ట్రంలో లేదని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. ముందస్తుగా డ్రగ్స్ మూలాలను తెలుసుకునేందుకు పోలీసులంతా నిఘా పెడుతున్నారు. గంజాయి సాగు లేకుండా ఎస్ఈబీ పోలీసులు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి సాగు చేసే గిరిజన ప్రజలు ప్రభుత్వం ఇప్పటికే ఆల్ట్రర్నేటివ్ పంటలను పండించేందుకు ప్రోత్సాహం అందిస్తుంది. పోలీసులకు వారంతపు సెలవులు సిబ్బంది ఉన్నచోట అమలు చేస్తున్నాం. సిబ్బంది కొరత ఉన్న దగ్గర కొంత సమస్యగా ఉంది. త్వరలో స్టాఫ్ కొరత లేకుండా నియమాకాలు చేస్తామన్నారు. ఘన స్వాగతం అంతకుముందు ఎయిర్పోర్టులో హోంమంత్రి తానేటి వనితకు ఘనస్వాగతం లభించింది. పోలీస్, రెవెన్యూ అధికారులు, వైఎస్సార్ సీపీ నగర మహిళా నాయకురాలు పేడాడ రమణి కుమారి, డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్, రజక కార్పొరేషన్ డైరెక్టర్ యువశ్రీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చుక్క వరలక్ష్మి తదితరులు ఆమెకు స్వాగతం పలికారు. (చదవండి: దివ్యాంగురాలిని పెళ్లాడిన యువకుడు) -
సీఐతో శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు నిందితుడి సెల్ఫీ
కుత్బుల్లాపూర్: మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్య కుట్ర కేసులో నిందితుడిగా ఉన్న మున్నూరు రవి బుధవారం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రత్యక్షం కావడం కలకలం రేపగా... తాజాగా పేట్బషీరాబాద్ సీఐ రమేష్తో సెల్ఫీ మరో వివాదం అయింది. కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్లీనరీలో రవి పాల్గొనడం.. పోలీసు అధికారులతో సెల్ఫీ దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ప్రజాప్రతినిధులకే ఆహ్వానం ఉండగా మున్నూరు రవి హాజరు కావడంపై ఇప్పటికే ఇంటిలిజెన్స్ దృష్టి పెట్టింది. ఇదే ప్లీనరీలో మంత్రి శ్రీనివాస్గౌడ్ సైతం ఉండడం అనుకోని సంఘటన జరిగితే ఎవరు బాధ్యులు అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. బందో బస్తులో ఉన్న తాను మున్నూరు రవిని గుర్తించి దగ్గరికి వెళ్లి ఎలా వచ్చావు ..అని అడిగే లోపే సెల్ఫీ తీశాడని.. రవి వచ్చిన విషయాన్ని బాలానగర్ డీసీపీ సందీప్ దృష్టికి తీసుకెళ్లానని సీఐ రమేష్ వివరణ ఇచ్చారు. (చదవండి: అప్పిచ్చి.. ఆందోళన చేసి.. ప్రాణాలు పోగొట్టుకుని..) -
బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసు తీర్పు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరులో గత ఏడాది ఆగస్టు 15న జరిగిన బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్య కేసు తీర్పు శుక్రవారం వెలువడనుంది. తనను ప్రేమించడంలేదని వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన కుంచాల శశికృష్ణ (19) ఉదయం 9.40కి టిఫిన్ తీసుకురావడం కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన రమ్యతో గొడవపడి కత్తితో ఎనిమిదిసార్లు పొడిచాడు. ప్రభుత్వాస్పత్రికి తరలించేలోగా రమ్య చనిపోయింది. ఈ హత్యను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. నిందితుడు శశికృష్ణను అదేరోజు రాత్రి నరసరావుపేట సమీపంలోని మొలకలూరులో అరెస్టు చేసిన పోలీసులు ఆరురోజుల్లో చార్జ్షీట్ దాఖలు చేశారు. గుంటూరు ప్రత్యేక న్యాయస్థానంలో గత ఏడాది డిసెంబర్ ఏడు నుంచి సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. ఈ నెల రెండున మొదలైన వాదనలు మంగళవారం ముగిశాయి. శుక్రవారం తీర్పు చెప్పనున్నట్లు న్యాయాధికారి రామ్గోపాల్ ప్రకటించారు. రమ్య కుటుంబాన్ని ఆదుకున్న ప్రభుత్వం హత్య జరిగిన రెండోరోజే సీఎం ప్రకటించిన ఎక్స్గ్రేషియా రూ.పది లక్షల్ని రమ్య తల్లి జ్యోతికి అప్పటి హోంమంత్రి సుచరిత అందించారు. ఆ కుటుంబానికి మూడునెలలపాటు నిత్యావసరాలకు నగదు ఇచ్చారు. అదేనెల 20వ తేదీకల్లా రమ్య తల్లికి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద గుంటూరులో ఇంటిస్థలం పట్టా ఇచ్చారు. అనంతరం ప్రభుత్వం మరో రూ.8,25,000 అందజేసింది. ఇంటి నిర్మాణానికి రూ.1.8 లక్షలు ఇచ్చింది. రమ్య సోదరి మౌనికకు సెప్టెంబర్ 16న రెవెన్యూ విభాగంలో ఉద్యోగం ఇచ్చింది. ఆమె ఐదేళ్లలోగా డిగ్రీ పూర్తిచేసుకునే అవకాశం కల్పించారు. వారు కోరిన విధంగా వారి సొంత గ్రామమైన అమృతలూరు మండలం యలవర్రులో రూ.1,61,25,300తో ఐదెకరాల పట్టా భూమి కొనుగోలు చేసి రమ్య తల్లి పేరున రిజిస్టర్ చేసింది. రమ్య హత్యకేసు విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరు బావుందని జాతీయ ఎస్సీ కమిషన్ వైస్చైర్మన్ అరుణ్హల్దార్ కొనియాడారు. హత్య అనంతరం గుంటూరు వచ్చిన కమిషన్ బృందం.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీ ప్రభుత్వం చాలా పాజిటివ్గా స్పందించిందని కొనియాడింది. -
ఫిర్యాదు తీసుకోలేదని ఆత్మహత్యాయత్నం
పీఎంపాలెం(భీమిలి): పోలీసులు తమ ఫిర్యాదును తీసుకోకుండా ప్రత్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అపోహతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. జీవీఎంఎసీ 7వ వార్డు వాంబే కాలనీలో నివసిస్తున్న శ్రీహరి అనే వ్యక్తి స్థానికంగా మీసేవ కేంద్రం నిర్వహిస్తున్నాడు. అతను ఓ పత్రికకు విలేకరి కూడా. స్థానికంగా ఓ బాలిక నిశ్చితార్థం ఈ నెల 22న జరుగుతుండగా.. అది వివాహం అనుకుని పోలీసులకు ఎవరో సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా శ్రీహరి, మరో వ్యక్తే ఈ నిశ్చితార్థం ఆగిపోవడానికి కారణమని భావించిన బాలిక బంధువులు.. శ్రీహరితో గొడవకు దిగారు. దీనిపై శ్రీహరి పోలీసులకు తెలియజేయగా.. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ పట్ల అమానుషంగా ప్రవర్తించారని బాలిక బంధువులు శ్రీహరి కుటుంబంపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ప్రత్యర్థుల ఫిర్యాదుకు ప్రాధాన్యం ఇచ్చి తమ ఫిర్యాదును పక్కన పెట్టేశారని ఆరోపిస్తూ శ్రీహరి, అతని భార్య బుధవారం ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో సకాలంలో గుర్తించి వారిని వెంటనే స్థానిక ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. విషయం తెలుసుకున్న విశాఖ నార్త్ ఏసీపీ సీహెచ్.శ్రీనివాసరావు బాధితులను పరామర్శించారు. పోలీసులు చట్ట నిబంధనల మేరకే కేసులు నమోదు చేస్తారని, దర్యాప్తు చేసి నిందితులపై తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇదే విషయంపై పీఎంపాలెం పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ వద్ద ప్రస్తావించగా కేసు దర్యాపులో ఉందని, పోలీసులు ఫిర్యాదుదారులు చెప్పినట్టు చేయరని, నిబంధనల ప్రకారం మాత్రమే చేస్తారని పేర్కొన్నారు. రెండు ఫిరాదులు స్వీకరించానని, ఫిర్యాదులో అరోపించినంత మాత్రాన దోషులు కారన్న విషయం తెలసుకోవాలన్నారు. (చదవండి: అనకాపల్లి స్వాతి కేసులో కొత్త ట్విస్ట్) -
పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
అల్లిపురం (విశాఖ దక్షిణ): తనకు న్యాయం చేయాలని, తనపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక మహిళ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తాటిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన ప్రశాంతి అనే మహిళ, అల్లిపురం చెరువుగట్టు ప్రాంతంలో నివసిస్తున్న శ్రీను, అతని భార్య, మరో ఇద్దరు జ్యోతి, రాణి, మాధవి తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాను శనివారం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో స్టేషన్ ముందు తనతో తెచ్చుకున్న పెట్రోలు శరీరంపై పోసుకుంది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న మహారాణిపేట పోలీసులు అడ్డుకుని, టూ టౌన్ పోలీసులకు అప్పగించడంతో వారు ఆమెకు సపర్యలు చేసి కేజీహెచ్కు తరలించి చికిత్స అందజేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వెంకటరావు తెలిపారు. (చదవండి: విశాఖ పోర్టుకు రికార్డు స్థాయిలో క్రూడాయిల్) -
సీఐ, ఎస్ఐకి రూ.15 లక్షల లంచం?
బనశంకరి: గోకాక్ సీఐ గోపాల్ రాథోడ్, ఎస్ఐ ఒక హత్యకేసులో అమాయకులను అరెస్ట్చేసి రూ.15 లక్షలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. 2021 జూలై 17 గోకాక్లోని మహంతేశ్ నగర లేఔట్లో మంజునాథ మురకిబావి అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సిద్దప్ప బబలి పిల్లలైన కృష్ణ, అర్జున్ అనే ఇద్దరిని అరెస్ట్చేశారు. నిందితుల అక్క కుమార్తెను మంజునాథ ప్రేమించేవాడని, అదే హత్యకు కారణమని ఎవరో చెప్పడంతో తమవారిని సీఐ అరెస్టు చేశాడని నిందితుల బంధువులు ఆరోపించారు. అంతేగాక భారీగా డబ్బు ఇవ్వకపోతే కుటుంబసభ్యులపై కూడా కేసు పెడతామని బెదిరింపులకు దిగారని, ఇలా అప్పటి గోకాక్ సీఐ గోపాల్ రాథోడ్, ఎస్ఐ రూ.15 లక్షలు లంచం తీసుకున్నారని సిద్దప్పబబలి కుటుంబసభ్యులు ఆరోపించారు. భూమి కుదవపెట్టి డబ్బు ఇచ్చామని, తమకు న్యాయం చేయాలని వారు ఆదివారం మీడియా ముందు కన్నీరు పెట్టారు. ఈ విషయమై దర్యాప్తు చేయాలని ఏఎస్పీని ఎస్పీ లక్ష్మణ నింబరగి ఆదేశించారు. (చదవండి: అన్నను దారుణంగా చంపిన తమ్మడు) -
కోపంగా చూశాడని కత్తులతో పొడిచి చంపేశారు
యశవంతపుర: ఐటీ సిటీ బెంగళూరులో చిన్న చిన్న కారణాలకే హత్యలు జరగడం మామూలు విషయమైంది. బైకు తగలడంతో కోపంగా చూశాడని కెంగేరి వద్ద యువకున్ని కత్తులతో పొడిచి హత్య చేశారు. శనివారం రాత్రి కెంగేరిలో కరగ ఉత్సవం జరిగింది. భరత్ అనే యువకుడు చూడడానికి వచ్చాడు. అర్ధరాత్రి సమయంలో బైకుపై వెళ్తుండగా అతని బైక్కు మరొక బైక్ తగిలింది. దీంతో భరత్ కోపంగా చూశాడు. నన్నే గుర్రుగా చూస్తావా అని మరో బైకిస్టు స్నేహితులతో కలిసి భరత్ను కత్తులతో పొడిచి చంపారు. శవాన్ని ఈడ్చుకొంటూ వెళ్తుండగా కెంగేరి రైల్వే పోలీసులు రావడంతో హంతకులు పారిపోయారు. రైల్వే పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అన్నను దారుణంగా చంపిన తమ్మడు) -
పరీక్షలపై బెంగతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
జియాగూడ: ఆరోగ్యం సరిగా లేక పరీక్షలు సరిగా రాయలేనేమోననే బెంగతో పదో తరగతి విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడ ఇక్బాల్గంజ్లో కమల, బాషా గౌడ్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు. బాషా గౌడ్ ప్రైవేటు ఉద్యోగి. వీరి పెద్ద కూతురు వివాహం జరిగింది. రెండో కూతురు ప్రియాశక్తి 21 డిగ్రీ మొద టి సంవత్సరం చదువుతోంది. 15 ఏళ్ల చిన్నకూతురు జియాగూడ శ్రీనివాస హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. 15 రోజులుగా ఆమె ఆరోగ్యం సరిగా ఉండడం లేదు. 10వ తరగతి పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. ఈ క్రమంలో సరిగా చదవలేకపోతున్నానని మానసిక ఆందోళనకు గురైంది. శనివారం సాయంత్రం తల్లితో బాగానే ఉంది. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంట్లోని పూజగదిలోని థమ్సప్ బాటిల్లో ఉన్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా మంటలు చెలరేగడంతో వేరే గదిలో ఉన్న తల్లి కమల, అక్క ప్రియాశక్తి వెంటనే వచ్చి రగ్గులతో మంటలు ఆర్పివేసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డ్యూటీలో ఉన్న ఎస్.ఐ.మురళీ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితురాలు 67 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పిల్లలను తుపాకితో బెదిరిస్తున్న దుండగుడి వీడియోలు వైరల్) -
భయంకరమైన వాట్సాప్ సందేశం!..నా చావు నీ పెళ్లి కానుక..
My death is your wedding gift: కొంతమంది తమకు నచ్చినట్లు జీవితం లేదనో లేక తమకు కావల్సింది దక్కలేదనో డిప్రెషన్తో ఆత్మహత్యయత్నానికి పాల్పడుతుంటారు. అంతేకాదు నచ్చిన వ్యక్తి దొరక్కపోతే ఇక జీవితం అయిపోయిందనుకుని మూర్ఖంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. మరికొంతమంది వాళ్లు ఆత్మహత్య చేసుకోవడమే కాక దానికి కారణం వీళ్తే అంటూ బతికి ఉన్నవాళ్లని జీవచ్ఛవాలుగా చేస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడోక యువకుడు దారుణమైన అఘాయిత్యానికి ఒడిగట్టాడు. వివరాల్లోకెళ్తే... ఛత్తీస్గఢ్లో బలోద్ జిల్లాకి చెందిన ఒక యువకుడు తను ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం నిశ్చయం అయ్యిందని తెలుసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆత్మహత్యయత్నానికి ముందు.. అతను ఉరి వేసుకున్న వీడియోని వాట్సాప్ స్టేటస్ పెట్టి మరీ.. నా చావే నీ పెళ్లి కానుక అంటూ ఒక భయంకరమైన సందేశాన్ని కూడా తను ప్రేమించిన అమ్మాయికి పంపాడు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఆ యువకుడు తన ప్రేమించిన యువతికి పెళ్లి నిశ్చయమైందని తెలుసుకుని తట్టుకోలేక ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ ప్రతీక్ చతుర్వేది తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com (చదవండి: పోలీసుల దాష్టీకానికి యువకుడు బలి!) -
మల్కాజ్గిరి మహిళ హత్య కేసులో ట్విస్ట్.. గర్భగుడిలోనే చంపేశాడు
సాక్షి, మల్కాజిగిరి:అదృశ్యమై..ఆపై శవంగా మారిన ఉమాదేవి హత్య కేసులో ఆలయ పూజారితో పాటు, నగల దుకాణం యజమానిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. దేవుడి దర్శనానికి వచ్చిన ఆమెను గుడి పూజారి గర్భగుడిలో రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని అక్కడే ఉన్న ఓ ప్లాస్టిక్డ్రమ్ములో కుక్కేశాడు. శుక్రవారం పోలీసులు తెలిపిన మేరకు.. విష్ణుపురి ఎక్స్టెన్షన్ ప్రాంతానికి చెందిన ఉమాదేవి (56) ఈ నెల 18న ఇంటి సమీపంలోని స్వయంభూ సిద్ధి వినాయక దేవాలయానికి రోజూలాగానే వెళ్లింది. అయితే తిరిగి రాలేదు. అదే రోజు ఆమె భర్త మూర్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మూడు రోజుల తర్వాత అదే ఆలయం వెనుక ఉన్న నిర్జన ప్రదేశంలో ఉమాదేవి మృతదేహాన్ని గుర్తించారు. స్థానికంగా ఉన్న కాలనీవాసులు, కుటుంబసభ్యుల నుంచి సేకరించిన సమాచారంతో ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న అనుముల మురళీకృష్ణ (42) పై దృష్టి సారించారు. సాంకేతిక ఆధారాలతో ఈ నెల 22న మురళీకృష్ణతో పాటు విష్ణుపురికాలనీలో మా భవానీ జువెలర్స్ దుకాణం యజమాని జోషి నంద కిషోర్(45)ను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఉమాదేవి హత్య బయటపడింది. మురళీకృష్ణ నుంచి రెండు బంగారు గాజులు, లక్ష నగదు, నగల దుకాణ యజమాని ఇచ్చిన కెడ్రిట్ కార్డ్స్, జోషి నం చదవండి: వరంగల్లో ప్రేమోన్మాది ఘాతుకం.. చున్నీతో చేతులు కట్టేసి.. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే... పూజారిగా పనిచేస్తున్న మురళీకష్ణ కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల తరచూ నగలు ధరించి వస్తున్న ఉమాదేవిని మురళీకృష్ణ గమనించాడు. ఈ నెల 18న గర్భగుడిలోనే ఆమె తలమీద రాడ్తో బలంగా కొట్టి హత్య చేసి అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా నీళ్ల డ్రమ్ములో శవాన్ని దాచి ఉంచాడని పోలీసులు తెలిపారు. మరుసటి రోజు సంకటహరచతుర్థ్ది ఉండడంతో ఎవ్వరికీ అనుమానం రాకుండా హోమం నిర్వహించాడని నిఘా ఉండడంతో రెండు రోజుల తర్వాత 21 వ తేదీ మృతదేహాన్ని ఆలయం వెనుక పడేశాడని పోలీసులు తెలిపారు. -
వివాహేతర సంబంధం.. తల్లీ కూతుళ్లతో..!
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఇటీవల జరిగిన తల్లీకూతుళ్ల హత్య కేసును విచారణ చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. దానికి సంబంధించిన వివరాలను మెదక్ జిల్లా పోలీసులు మీడియాకు తెలిపారు. వివరాలు: జిల్లాలోని చేగుంట మండలం వల్లూరు గ్రామానికి చెందిన శంభుని యాదమ్మ, తన కూతురు సంతోష కలిసి ఏప్రిల్ 10న చేగుంటకు వెళ్లారు. కానీ వారు తిరిగి ఇంటికి రాలేదు. సన్నిహితులు, బంధువులను సంప్రదించినా వారి ఆచూకీ మాత్రం తెలియలేదు. దీంతో యాదమ్మ భర్త దగ్గరలోని పోలీస్స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. కాగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే వడియారం అటవీ ప్రాంతంలో రెండు గుర్తు తెలియని డెడ్ బాడీలు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారం వచ్చింది. ఇక దాంతో పోలీసులు వెంటనే స్పాట్కు చేరుకునారు. ఆ డెడ్ బాడీలను యాదమ్మ, సంతోషగా గుర్తించారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా వడియారం గ్రామానికే చెందిన నగేశ్పై పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో నగేశ్ను అదుపులోకి తీసుకొని పోలీసులు తమ శైలిలో విచారించగా ఆ ఇద్దరు తల్లీకూతుళ్లను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్యకు గల కారణాలు: కొన్నాళ్ల క్రితం నగేశ్కు తల్లీ కూతుళ్లతో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇక ఈ క్రమంలో వారు నగేశ్ను తరచూ డబ్బులు ఇవ్వాలని వేధించసాగారు. తాము అడిగినంత ఇవ్వకపోతే తనపై కేసు కూడా పెడతామని బెదిరించారు. అయితే నగేశ్ మాత్రం ఎలాగైనా వారి పీడ తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన ప్లాన్ ప్రకారం యాదమ్మతో పాటు తన కుమార్తె సంతోషను వడియారం అటవీ ప్రాంతానికి రావాల్సిందిగా కోరాడు. తల్లీ కూతుళ్లు అక్కడికి వెల్లి నిందితుడితో కలిసి మద్యం సేవించారు. ఇక ఆ మత్తులోనే నగేశ్ తల్లీ కూతుళ్లను గొంతు నులిమి హత్య చేశాడు. విచారణ అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
కన్నకొడుకును నరికి చంపిన తండ్రి
వీరులపాడు (నందిగామ): నిద్రిస్తున్న కుమారుడిని గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు ఓ తండ్రి. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలంలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి కథనం మేరకు.. మండల కేంద్రమైన వీరులపాడు గ్రామానికి చెందిన బొల్లెద్దు గాబ్రియేలు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గాబ్రియేల్కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలకు వివాహాలయ్యాయి. గాబ్రియేల్ భార్య మృతి చెందటంతో 2007లో తిరుపతమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇంటర్ పూర్తి చేసి పెయింటింగ్ పనులు చేస్తున్న కుమారుడు కిరణ్తో కలిసి గాబ్రియేల్ దంపతులు ఉంటున్నారు. అయితే తిరుపతమ్మ, కిరణ్ మధ్య తరచూ వాగ్వాదాలు, ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వారం రోజులుగా కిరణ్ను ఇంట్లో నుంచి పంపించాలని గాబ్రియేల్ను తిరుపతమ్మ వత్తిడి చేస్తోంది. ఈ విషయమై తిరుపతమ్మ, కిరణ్ మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. కిరణ్ ఉన్న ఇంట్లో తాను ఉండనని భర్తకు చెప్పి ఆమె పుట్టింటికి వెళ్లింది. అదే రోజు రాత్రి గాబ్రియేలు కూడా ఇంటి నుంచి వెళ్లిపోవాలని చెప్పగా, ఇల్లు తనదని, తాను వెళ్లాల్సినవసరం లేదని కిరణ్ గట్టిగా చెప్పాడు. ఇది మనసులో పెట్టుకున్న గాబ్రియేలు శనివారం తెల్లవారుఝామున 5.30 గంటల సమయంలో నిద్రపోతున్న కిరణ్ మెడపై గొడ్డలితో కిరాతంగా నరికాడు. తీవ్రంగా గాయపడిన కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు వీరులపాడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని నందిగామ రూరల్ సీఐ ఐ.వి.నాగేంద్రకుమార్తో కలిసి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. (చదవండి: వీడియో కాల్తో వివాహితకు వేధింపులు) -
ఒకరితో పెళ్లి.. ఇద్దరితో వివాహేతర సంబంధం.. వీడిన హత్యకేసు మిస్టరీ
తెనాలి రూరల్(గుంటూరు జిల్లా): నూతక్కి రవికిరణ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి సోమవారం అర్ధరాత్రి కోర్టులో హాజరుపరిచారు. చుండూరు సీఐ బత్తుల కల్యాణ్రాజు అందించిన వివరాలు.. మూల్పూరుకు చెందిన రవికిరణ్ గత నెల 20వ తేదీ నుంచి కనబడకుండా పోవడంతో కుటుంబసభ్యులు అమృతలూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హత్యకు గురై ఉంటాడన్న అనుమానం రావడంతో విచారణాధికారి సీఐ కల్యాణ్రాజు కేసుపై మరింత శ్రద్ధ పెట్టారు. తెనాలికి చెందిన రౌడీ షీటర్ సముద్రాల పవన్కుమార్ అలియాస్ లడ్డూ, మరి కొందరు హత్య చేసి ఉంటారని కొన్ని ఆధారాల ద్వా రా గుర్తించారు. చదవండి: మగతనం లేదని హేళన.. కాస్త శ్రుతిమించడంతో చివరికి ఏం జరిగిందంటే? దర్యాప్తు కొనసాగుతూ ఉండగా రవికిరణ్ ప్రియురాలే అతడి హత్యకు కారకురాలైందని గుర్తించారు. వేమూరు మండలం చదలవాడకు చెందిన అత్తోట దీప్తి, పవన్కుమార్ సుమారు 12 ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు. వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆమె వేరే వివాహం చేసుకుంది. అయినా లడ్డూతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఉంది. మూడేళ్ల క్రితం ఆమెకు మూల్పూరుకు చెందిన రవికిరణ్ పరిచయమయ్యాడు. అతడితోనూ వివాహేతర బంధం ఏర్పడింది. ఈ విషయం లడ్డూకు తెలిస్తే తనను చంపుతాడని భయపడిన ఆమె, కొన్నాళ్లుగా రవికిరణ్ను దూరం పెడుతూ వచ్చింది. రవికిరణ్ ఆమెకు తరచూ ఫోన్లు చేస్తూ ఉండడంతో తనను అతను వేధిస్తున్నాడని మొదటి ప్రియుడు లడ్డూకు చెప్పింది. అతడు రవికిరణ్కు ఫోన్ చేసి పిలిపించాడు. లడ్డూ మరి కొందరు కలసి కర్రలతో దాడి చేయడంతో రవికిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని సంగం జాగర్లమూడి కాలువలో పడేశామని నిందితులు అంగీకరించారు. హత్య జరిగిన ప్రదేశంలో కర్రలు, రక్తం మరకలను గుర్తించారు. దీప్తి, లడ్డు, మక్కెన వంశీ, నన్నపనేని కృష్ణ, పిల్లి రవికుమార్, తూమాటి ప్రశాంత్ హత్యకు కారకులని గుర్తించారు. వీరిలో ప్రశాంత్ పరారీలో ఉండగా, మిగిలిన ఐదుగురు నిందితులను సోమవారం రాత్రి పొద్దుపోయాక కోర్టు లో హాజరుపరిచినట్లు సీఐ కల్యాణ్రాజు తెలిపారు. -
మగతనం లేదని హేళన.. కాస్త శ్రుతిమించడంతో చివరికి ఏం జరిగిందంటే?
యాదమరి(తిరుపతి): వ్యక్తిగత విషయాలపై హేళన చేయడంతోనే మురళీకళ్యాణ్(22)ను నగేష్ అంతమొందించినట్లు చిత్తూరు వెస్ట్ సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన యాదమరి పోలీసుస్టేషన్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. దళవాయిపల్లెకు చెందిన చిన్నబ్బ కుమారుడు నగేష్(32), అదే గ్రామానికి చెందిన చంద్రబాబు కుమారుడు మురళీకళ్యాణ్(22), కృష్ణమందడి కుమారుడు జయరాం ముగ్గురూ స్నేహితులు. చిత్తూరులో భవన నిర్మాణ పనులకు వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చే ముందు మద్యం సేవించేవారు. చదవండి: వివాహిత అదృశ్యం.. భర్త ఇంట్లోలేని సమయంలో.. మద్యం మత్తులో నగేష్కు మగతనం లేదని మరళీకళ్యాణ్ తరచూ హేళన చేసేవాడు. ఇది కాస్త శ్రుతిమించడంతో నగేష్ కక్ష పెంచుకున్నాడు. ఈనెల 3వ తేదీ ఆదివారం రాత్రి గ్రామంలోని గంగమ్మ ఆలయం వెనుక ఉన్న మామిడి తోటలో మురళీకళ్యాణ్కు మద్యం తాపించి చాక్తో గోంతుకోసి హత్యచేసి అక్కడే పూడ్చిపెట్టాడు. స్థానికుల సమాచారం మేరకు మృతుడు అన్న పవనకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో తామే హత్య చేశామని ఒప్పుకోవడంతో నగేష్, జయరాంపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఆయన వెల్లడించారు. -
చెట్టుకింద గొయ్యిలో ఏదో పూడ్చిపెట్టినట్లు కనపడడంతో.. పశువుల కాపర్లు..
సాక్షి, చిత్తూరు: మామిడి తోటలో యువకుడి తల, మొండెం వేరు చేసి, శవాన్ని గుంతలో పాతిపెట్టిన ఘటన చిత్తూరు జిల్లా యాదమరి మండలం దళవాయిపల్లెలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. చిత్తూరు వెస్ట్ సీఐ శ్రీనివాసుల రెడ్డి, యాదమరి ఇన్చార్జి ఎస్ఐ ప్రసాద్ కథనం మేరకు, మామిడితోటలో చెట్టుకింద గొయ్యిలో ఏదో పూడ్చిపెట్టినట్లు కనపడడంతో పశువుల కాపర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సీఐ, ఎస్ఐ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. గొయ్యి పూడ్చిన ప్రాంతంలో మట్టి తవ్వి తీశారు. చెయ్యి కనపడడంతో మరింత లోతుగా మట్టిని తొలగించారు. చివరకు తల, మొండెం వేరుచేసి ఉన్న శవాన్ని బయటకు తీశారు. అదే గ్రామానికి చెందిన మురళీ కల్యాణ్(19) అలియాస్ గుంతోడు అని స్థానికులు గుర్తించారు. దీనిపై ఇన్చార్జ్ ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేయగా సీఐ శ్రీనివాసుల రెడ్డి విచారణ చేపట్టారు. శవాన్ని పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానితులను అదుపులోకి తీసు కొని విచారిస్తున్నామని, వీలైనంత త్వరగా నిందితులను అరెస్టు చేస్తామని సీఐ వివరించారు. మృతుడు అనాథ దళవాయిపల్లెకు చెందిన కల్పన, చంద్రబాబు దంపతుల కుమారుడు మురళీ కల్యాణ్. చిన్నప్పుడే తల్లిదండ్రులు మృతి చెందడంతో అనాథగా మారాడు. దీంతో అదే గ్రామంలోని అవ్వా, తాతల వద్ద ఉంటున్నాడు. చదువులేకపోవడంతో భవన నిర్మాణ పనులు చేసుకుంటున్నాడు. ఇంతవరకు పెళ్లి కాలేదు. స్నేహితులతో కలసి ఆదివారం రాత్రి మద్యం తాగిన కల్యాణ్, అనంతరం హత్యకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. -
ఏం కష్టం వచ్చిందో పాపం...ఒకే కుటుంబంలోని ఐదుగురు ఏడవ అంతస్తు నుంచి దూకి...
A Family Of 5 Mysteriously Jumped: ఇంతవరకు చాలా మంది ఏవేవో కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోవడం గురించి విన్నాం. ఆర్థిక సమస్యల వల్లనో లేక భయంకరమైన సమస్యలకు తాళలేక చనిపోయిన ఘటనలు చూశాం. ఇక్కడ ఒక కుటుంబంలోని సభ్యులు ఏ కారణం లేకుండా అది కూడా ఉన్నత కుటుంబ నేపథ్యం ఉండి ఒకేసారి ఐదుగురు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఈఘటన స్విట్జర్లాండ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...స్విట్జర్లాండ్లోని మాంట్రిక్స్లో ఫ్రెంచ్ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఏడవ అంతస్తు బాల్కనీ నుంచి దూకేశారు. అయితే వారు తమ కొడుకుని పాఠశాలకు పంపిచంకుండా ఇంటి వద్ద చదివించడానికి గల కారణాలు విచారంచేందుకు పాఠశాల అధికారులు ఇంటికి వచ్చారు. అయితే వారు ఎంత తలుపు కొట్టిన ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో వాళ్లు వెళ్లిపోయారు. అయితే కాసేపటికి ఒక ఇంటిలోని సభ్యులు బాల్కని నుంచి దూకేశారంటూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి రాగానే కుటుంబ సభ్యులలోని నలుగురు చనిపోయారు ఆ బాలుడు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కుటుంబం మొత్తం ఫ్రెంచ్ పౌరులని, వారు స్విట్జర్లాండ్లో చాలా ఏళ్లుగా నివసిస్తున్నారని పోలీసులు చెప్పారు. ఈ కుటుంబం చాలా రిజర్వ్డ్ ఉంటుందని పెద్దగా ఎవరితో కలవరని స్థానికులు చెబుతున్నారని అన్నారు. అయితే బాలుడిని పాఠశాలకు పంపిచంకుండా హోం స్కూల్లో చదవించడానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధికారులు రావడంతోనే ఈ ఘటన వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మెదటు పెట్టారు. (చదవండి: రక్త ప్రవాహంలో మైక్రోప్లాస్టిక్ కణాలు...నిత్యం వాడే ప్లాస్టిక్కే) -
సజీవ దహనం ఘటనలో కొత్త మలుపు.. ఆమెది హత్యే..
తెర్లాం(విజయనగరం జిల్లా): మండలంలోని రాజయ్యపేట గ్రామంలో ఈ ఏడాది జనవరి 10వ తేదీ అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో వృద్ధురాలు గాడి గౌరమ్మ సజీవదహనమైన సంగతి తెలిసిందే. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం సంభవించిందని అంతా భావించారు. గౌరమ్మను హత్యచేసి కాల్చేసినట్టు నిందితుడు ఒప్పుకోవడంతో అందరూ అవాక్కవుతున్నారు. తెర్లాం పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొబ్బిలి రూరల్ సీఐ శోభన్బాబు, తెర్లాం ఎస్ఐ సురేంద్రనాయు కేసు వివరాలను వెల్లడించారు. చదవండి: లొంగకపోతే అంతు చూస్తా.. యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లి.. గాడి గౌరమ్మకు చేతబడి ఉందన్నది అనుమానం. నాలుగేళ్ల కిందట నిందితుడు రెడ్డి సింహాచలం, ఆయన భార్య, పిల్లలకు గౌరమ్మ చేతబడి చేసిందని, అందుకే అనారోగ్యానికి గురైనట్టు భావించారు. ఆమె చేతబడి చేయడం వల్లే గత ఏడాది అక్టోబర్ నెలలో తండ్రికూడా మరణించినట్టు సింహాచలం మనసులో బలంగా నాటుకుపోయింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని హతమార్చాలన్న నిర్ణయానికి వచ్చాడు. ముందురోజే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిదగ్గర వేరే పని ఉందని గొడ్డలిని తీసుకున్నా డు. గౌరమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా జనవరి 10 అర్ధరాత్రి ఇంటిలోకి వెళ్లి హతమర్చాడు. సీసాలో తీసుకెళ్లిన పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. ప్రమా దంలో గౌరమ్మ సజీవదహనమైంది. పక్కనే ఉన్న మరో రెండు ఇళ్లు సైతం కాలిపోయాయి. అందరూ విద్యుత్ షార్ట్సర్కూట్ వల్లే ప్రమాదం జరిగినట్టు భావించారు. వృద్ధురాలిని హత్యచేసి పెట్రోల్పోసి కాల్చివేసినట్టు సింహాచలం ఒప్పుకోవడంతో కేసు నమోదు చేశారు. హత్య వెలుగుచూసిందిలా... ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రాజయ్యపేటలో పాతినవలస కనకరాజు అనే వ్యక్తి పశువులశాల కాలిపోయింది. ఆ సమయంలో పశువులశాలలో ఉన్న ఎద్దు, ఆవు, దూడను విప్పేందుకు వెళ్లిన బాధితునికి రెడ్డి సింహాచలం తారసపడ్డాడు. అతనిపై అనుమానంతో స్థానిక పోలీసులకు కనకరాజు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ శోభన్బాబు, ఎస్ఐ సురేంద్రనాయుడు సింహాచలాన్ని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. కనకరాజు పశువుల శాలను ఎందుకు కాల్చావని తమదైన శైలిలో ప్రశ్నించారు. పశువుల శాలను కాల్చలేదని, జనవరి 10వ తేదీ అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన గాడిగౌరమ్మ అనే వృద్ధురాలిని మాత్రం తనే గొడ్డలితో నరికి చంపేశానని, అనంతరం పెట్రోల్ పోసి కాల్చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. పథకం ప్రకారమే హత్య చేశా... గాడి గౌరమ్మను పథకం ప్రకారంగానే హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య, పిల్లలను అత్తవారింటికి పంపించేశానని తెలిపాడు. నాలుగేళ్లుగా ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తున్నానని, ఆ రోజుకు సమ యం అనుకూలించిందన్నాడు. హత్యా నేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి బొబ్బిలి కోర్టులో నిందితుడిని హాజరుపరిచారు. -
ఆ వివరాలన్నీ మా ముందుంచండి
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి కింది కోర్టు ఎప్పుడు బెయిల్ ఇచ్చింది? దాన్ని రద్దు చేయాలని సీబీఐ ఎప్పుడు పిటిషన్ వేసింది? ఆ పిటిషన్ను కింది కోర్టు ఎప్పుడు కొట్టేసింది? గంగిరెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు ఇచ్చిన వాంగ్మూలాలు తదితర వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు జారీచేశారు. గంగిరెడ్డికి కింది కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ రాయ్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీబీఐ న్యాయవాది ఎ.చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ.. బెయిల్పై బయట ఉన్న గంగిరెడ్డి సాక్షులను బెదిరిస్తున్నారని, ప్రలోభాలకు గురిచేస్తున్నారని చెప్పారు. వివేకా హత్య వెనుక రాజకీయ పెద్దల ప్రమేయం ఉందన్నారు. నిందితుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి వాంగ్మూలం సైతం ఇచ్చారని తెలిపారు. సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలం ఇస్తానని మొదట చెప్పిన సీఐ శంకరయ్య, గంగాధర్రెడ్డి, కృష్ణారెడ్డిలు గంగిరెడ్డి, అతడి అనుచరులు బెదిరించడంతో 164 వాంగ్మూలం ఇవ్వలేదని చెప్పారు. గంగిరెడ్డి బయట ఉంటే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. ఈ వాదనలను గంగిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు తోసిపుచ్చారు. సీబీఐవి కేవలం ఆరోపణలు మాత్రమేనన్నారు. గంగిరెడ్డి సాక్షులను బెదిరించినట్లు ఆధారాలు లేవన్నారు. శంరయ్య తదితరులు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరిస్తే దానికీ గంగిరెడ్డికి ఏం సంబంధమని ప్రశ్నించారు. బెయిల్ రద్దుకోసం సీబీఐ దాఖలు చేసిన ఈ పిటిషన్ను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పూర్తివివరాలు తమముందు ఉంచాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
హత్యాయత్నం కేసులో ఐదుగురికి పదేళ్ల జైలు
విజయవాడ లీగల్: భార్యాభర్తలను హత్య చేయాలనే ఉద్దేశంతో పెట్రోల్ పోసి తగులబెట్టినట్లుగా దాఖలైన కేసులో ఐదుగురు నిందితులపై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికీ పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ మహిళా సెషన్స్ జడ్జి జి.ప్రతిభాదేవి బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన జూలూరి రమాదేవితో జూలూరి హనుమంతరావుకు రెండో వివాహం జరిగింది. ఈ వివాహం హనుమంతరావు మొదటి భార్య పిల్లలకు ఇష్టం లేదు. ఆస్తి వ్యవహారాల్లో వారికి తండ్రి హనుమంతరావుతో విభేదాలున్నాయి. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడికి చెందిన హనుమంతరావు కుమార్తె కొడుకు గూడూరు సత్యనారాయణ అలియాస్ మణికంఠ హనుమంతరావు వద్ద ఉండేవాడు. రమాదేవితో రెండో వివాహం తర్వాత సత్యనారాయణతో పాటు తమ పిల్లలను కూడా హనుమంతరావు దూరం పెట్టాడు. దీంతో మొదటి భార్య కుమారులయిన జూలూరి సుబ్బారావు, మాధవరావు తమ మేనల్లుడు సత్యనారాయణతో కలసి హనుమంతరావు, రమాదేవి హత్యకు కుట్ర పన్నారు. సత్యనారాయణ తమ స్వగ్రామమైన దుగ్గిరాల మండలం చింతలపూడికి చెందిన తన స్నేహితులు తెనాలికి చెందిన గూడూరు వినయ్కుమార్, వీణను 2014 అక్టోబర్ 28వ తేదీ మధ్యాహ్నం ముందుగా ఇబ్రహీంపట్నం తీసుకొచ్చాడు. పథకంలో భాగంగా గూడూరు వినయ్కుమార్, వీణ కలసి రమాదేవి ఇంటికి వెళ్లి మంచినీళ్లు అడిగారు. అనంతరం తాము తెచ్చుకున్న ప్లాస్టిక్ సంచిలో నుంచి పెట్రోల్ బాటిల్ను తీసి రమాదేవి, హనుమంతరావుపై పోసి నిప్పంటించి పారిపోయారు. కాలిన గాయాలతో దంపతులిద్దరూ కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి గొల్లపూడిలోని ఆంధ్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులైన సుబ్బారావు, మాధవరావు, సత్యనారాయణ, వినయ్ కుమార్, వీణపై 307, 326, 452, 436, 120బి ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రాసిక్యూషన్ తరఫున సీఎంఎస్ పోలీసులు 24 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ఏపీపీ జి.దైవప్రసాద్ విచారించారు. కోర్టు విచారణలో నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.