Atlee
-
బన్నీ ఫ్యాన్స్ కి కిక్కెక్కించే న్యూస్ డ్యూయెల్ రోల్ లో బన్నీ
-
అల్లు అర్జున్.. హీరో కమ్ విలన్!?
అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీతో చేయడం దాదాపు ఖరారైపోయింది. ఎప్పుడు అధికారికంగా ప్రకటించనున్నారనేది కూడా రూమర్స్ వచ్చేస్తున్నాయి. అలానే స్టోరీ గురించి చిన్న హింట్ తో పాటు రెమ్యునరేషన్ డీటైల్స్ కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: అమ్మ చివరి కోరిక.. కొత్త ఇంట్లోకి తెలుగు యంగ్ హీరో)'పుష్ప 2' తర్వాత లెక్క ప్రకారం త్రివిక్రమ్ తో బన్నీ మూవీ చేయాలి. కానీ ఇది భారీ బడ్జెట్ తో తీసే మైథలాజికల్ కావడంతో ప్రీ ప్రొడక్షన్ కే చాలా సమయం పట్టే అవకాశముంది. దీంతో ఈ గ్యాప్ లో మరో మూవీ చేయాలని బన్నీ అనుకున్నాడట. ఈ క్రమంలోనే అట్లీ లైనులోకి వచ్చాడు. ఈ ప్రాజెక్టుని బన్నీ పుట్టినరోజు అంటే ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించనున్నారట.మరోవైపు ఈ సినిమాలో అల్లు అర్జున్.. హీరో కమ్ విలన్ గా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని తెలుస్తోంది. అంటే అటు హీరోయిక్ ఎలివేషన్లతో పాటు విలన్ గానూ రచ్చ చేస్తాడేమో. ఇకపోతే ఈ మూవీ చేస్తున్నందుకు గానూ రూ.175 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో 20 శాతం వాటా కూడా తీసుకోబోతున్నాడని అంటున్నారు. మరి వీటిలో నిజమెంతో తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'.. ఇప్పటికీ తెగని పంచాయితీ!) -
నిర్మాతలని టెన్షన్ పెడుతున్న అట్లీ రెమ్యూనరేషన్..
-
ఆరు నెలలు ఆగండి.. త్రివిక్రమ్కు బన్నీ రిక్వెస్ట్!
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్(Allu Arjun ) నటించే తదుపరి సినిమా ఏంటనేదానిపై ఇప్పుడు రకరకాల ఊహగానాలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. మొన్నటి వరకు త్రివిక్రమ్( Trivikram Srinivas)తో సినిమా ఉంటుంది.. అది కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా అని వార్తలు వినిపించాయి. ఇప్పుడేమో బన్నీ మరో తమిళ దర్శకుడితో చేతులు కలిపాడని, అదే ఇప్పుడు తెరకెక్కుతుందని అంటున్నారు. జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.బన్నీ కోసం స్టోరీ రెడీ చేసిన గురూజీగుంటూరుకారం తర్వాత తివిక్రమ్ శ్రీనివాస్ మరో సినిమా చేయలేదు. ఆ సినిమా రిలీజ్కి ముందే బన్నీతో సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బన్నీ సరికొత్త గెటప్లో కనిపించబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేశారట. పుష్ప 2 రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కేస్తుందని అంతా భావించారు. కానీ బన్నీ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తివిక్రమ్ కంటే ముందు వేరే దర్శకుడితో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడట.నా కోసం ఆరు నెలలు ఆగండితన కోసం కథ రెడీ చేసి సిద్ధంగా ఉన్న త్రివిక్రమ్ని తాజాగా బన్నీ కలిశారు. మరోసారి ఇద్దరు స్క్రిప్ట్ గురించి చర్చించుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా బన్నీ తన మనసులో మాట చెప్పేశాడట. ఈ సినిమా షూటింగ్ కంటే ముందు మరో సినిమా చేస్తానని, 2026లో అది రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తివ్రిక్రమ్కి వివరించారట. ఆ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన కొద్ది రోజులకే.. ఈ సినిమా కూడా ప్రారంభిద్దామని, తనకోసం ఓ ఆరు నెలలు వెయిట్ చేయమని రిక్వెస్ట్ చేశారట. దీనికి త్రివిక్రమ్ కూడా అంగీకరించారట.రెండు సినిమాల షూటింగ్స్లో పాల్గొనేలా ప్లాన్ చేసుకోమని బన్నీని అడిగారట. ఆ సినిమా షూటింగ్ మొత్తం అయిపోయేవరకు తాను ఆగలేనని, మధ్యలో జాయిన్ అవుతానంటే తనకు ఓకే అని చెప్పారట. బన్నీ కూడా మొదట అట్లీ సినిమా షూటింగ్ ప్రారంభించి, తర్వాత త్రివిక్రమ్ మూవీని సెట్పైకి తీసుకురావాలనుకుంటున్నాడట. త్రివిక్రమ్ మూవీ షూటింగ్కి చాలా సమయం పడుతుంది. 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే మధ్యలో అట్లీ సినిమా చేస్తే..అది వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసి గ్యాప్ లేకుండా చూసుకోవాలని బన్నీ భావిస్తున్నాడట. పుష్ప 1,2 చిత్రాల కోసం ఐదేళ్లు కేటాయించిన బన్నీ..ఇప్పుడు వరుస సినిమాలతో ఫ్యాన్స్ని అలరించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. -
బన్నీ - అట్లీ మల్టీస్టారర్ లో శివకార్తికేయన్
-
ఐదుగురు హీరోయిన్స్ తో బన్నీ రొమాన్స్..!
-
ఐదుగురు నాయికలతో..?
హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ పీరియాడికల్ మూవీ రూపొందనుందనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుందని, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారనీ ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారని, ఇందులో ముగ్గురు విదేశీ నాయికలు ఉంటారని భోగట్టా. అయితే మెయిన్ హీరోయిన్ మాత్రం జాన్వీ కపూర్ అని సమాచారం. మరి... వార్తల్లో ఉన్నట్లు అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్ మూవీలో ఐదుగురు నాయికలు ఉంటారా? అనే ప్రశ్నకు క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు వేచి చూడక తప్పదు. -
Atlee: ఐకాన్ స్టార్ కొత్త ప్రాజెక్ట్ కోసం
-
బన్నీ నెక్స్ట్ మూవీకి ఏంటి సమస్య?
'పుష్ప 2' వచ్చి మూడు నెలలు దాటేసింది. అల్లు అర్జున్ ఇప్పుడు ఏ సినిమా.. ఎవరితో చేస్తాడనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే ఇద్దరి డైరెక్టర్ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అసలింతకీ ఏంటి సమస్య? ఎవరితో ఫస్ట్ చేయొచ్చు?అల్లు అర్జున్ తో సినిమాలు చేసేందుకు చాలామంది దర్శకులు రెడీగా ఉన్నారు కానీ ఇదివరకే త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పీరియాడిక్ సెటప్ ఉన్న కథ కావడంతో ప్రీ ప్రొడక్షన్ కే చాలా టైమ్ పట్టేలా ఉంది. నిర్మాత నాగవంశీ.. రీసెంట్ గానే మాట్లాడుతూ ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రాజెక్ట్ మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. అంటే మరో ఆరేడు నెలలు బన్నీ ఖాళీగానే ఉంటాడు.(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?)మరోవైపు అల్లు అర్జున్.. తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడని ఇండస్ట్రీలో టాక్. కాకపోతే బడ్జెట్-రెమ్యునరేషన్ దగ్గరే చిక్కంతా వచ్చి పడిందని తెలుస్తోంది. రూ.600 కోట్ల బడ్జెట్ కాగా.. పారితోషికం కింద తనకే రూ.100 కోట్లు ఇవ్వాలని అట్లీ అంటున్నాడట. ఈ పాయింట్ దగ్గరే డిష్కసన్స్ నడుస్తున్నాయని, ఏదో ఒక విషయం తేలితో త్వరలో బన్నీ-అట్లీ కాంబోపై క్లారిటీ వస్తుందని టాక్.అట్లీ ప్రాజెక్ట్ ఓకే అయితే మాత్రం త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమా వచ్చే ఏడాదే మొదలవుతుంది. లేదంటే మాత్రం ఈ ఏడాది చివర్లో షురూ చేసేస్తారు. మరి బన్నీ ఏం చేస్తాడనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీకి వచ్చేసిన 'సంక్రాంతి వస్తున్నాం'.. స్ట్రీమింగ్ అందులోనే) -
Allu Arjun: అట్లీ సినిమా అప్డేట్
-
గురూ.... కొత్త కాంబినేషన్ షురూ
జానర్ మాత్రమే కాదు... ఒక్కోసారి కాంబినేషన్స్ కూడా ఆడియన్స్ను థియేటర్స్కు రప్పిస్తాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్ మూవీస్కు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. కొందరు తెలుగు స్టార్ హీరోలు ఇప్పటివరకు తమతో సినిమాలు చేయని దర్శకులతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్న కొన్ని కొత్త కాంబినేషన్స్ కథా కమామీషుపై ఓ లుక్ వేయండి.ప్రభాస్తో లోకేశ్ ‘రాజా సాబ్, ఫౌజి’ సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ రెండు సినిమాల చిత్రీకరణలు తుది దశకు చేరుకుంటున్నాయి. దీంతో త్వరలోనే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లోని ‘స్పిరిట్’ మూవీ చిత్రీకరణలో పాల్గొంటారు ప్రభాస్. ‘స్పిరిట్’ సినిమా ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. అయితే తనతో ‘సలార్’ వంటి మాస్ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలింస్తో ప్రభాస్ మూడు సినిమాలు కమిటయ్యారు. ఈ మూడు సినిమాలు వరుసగా 2026, 2027, 2028లలో విడుదల కానున్నాయి.కాగా వీటిలో ఓ చిత్రాన్ని తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే లోకేశ్ కార్తీతో ‘ఖైదీ 2’ చేయాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్ కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభాస్–లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లోని మూవీ చిత్రీకరణ కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యే చాన్సెస్ ఉన్నాయి.అలాగే ‘హనుమాన్’ తో భారీ బ్లాక్బస్టర్ హిట్ సాధించిన ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ఓ మూవీ చేయనున్నారు. ప్రస్తుతం ‘జై హనుమాన్’తో బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్తో ప్రశాంత్ వర్మ సినిమా చేసే అవకాశం ఉందని ఫిల్మ్నగర్ సమాచారం.గ్రీన్ సిగ్నల్తమిళంలో రజనీకాంత్తో ‘జైలర్’ సినిమా తీసి సూపర్హిట్ అందుకున్నారు దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్. ప్రస్తుతం రజనీకాంత్తోనే ‘జైలర్ 2’ సినిమా చేసే పనుల్లో నిమగ్నమయ్యారు నెల్సన్. అయితే ‘జైలర్’కు, ‘జైలర్ 2’కు మధ్య తనకు లభించిన గ్యాప్లో ఓ కథ రాసుకున్నారట నెల్సన్. ఈ కథను ఎన్టీఆర్కు వినిపించగా, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.అయితే ఇటీవలే హిందీలో ‘వార్ 2’ (ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరో) సినిమాను పూర్తి చేసిన ఎన్టీఆర్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో తాను కమిటైన ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీ సినిమా కోసం కావాల్సిన మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నారు. వచ్చే నెలలో ‘డ్రాగన్’ మూవీ రెగ్యులర్ షూటింగ్లో జాయిన్ అవుతారు ఎన్టీఆర్.ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాత నెల్సన్ సినిమాను ఎన్టీఆర్ సెట్స్కు తీసుకువెళతారని ఊహించవచ్చు. అలాగే ‘హాయ్ నాన్న’ వంటి ఫీల్గుడ్ మూవీ తీసిన శౌర్యువ్ కూడా ఎన్టీఆర్కుప్రాథమికంగా ఓ లైన్ చెప్పారని, స్టోరీ కుదిరితే శౌర్యువ్తోనూ ఎన్టీఆర్ మూవీ చేస్తారనే వార్త ప్రచారంలోకి వచ్చింది.అర్జున్తో అట్లీ‘పుష్ప: ది రూల్’ సినిమా సక్సెస్తో మంచి జోష్లో ఉన్నారు అల్లు అర్జున్. ఈ సక్సెస్ను ఎంజాయ్ చేసేందుకు ప్రస్తుతం స్పెయిన్లో ఉన్నారు అల్లు అర్జున్. కాగా ‘పుష్ప’ సినిమా నిర్మాణం సమయంలోనే దర్శకుడు త్రివిక్రమ్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలతో అల్లు అర్జున్ సినిమాలు చేయనున్నట్లుగా అధికారిక ప్రకటనలు వెల్లడయ్యాయి. అయితే ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీతో సందీప్ రెడ్డి వంగా బిజీగా ఉండటంతో అల్లు అర్జున్ తన నెక్ట్స్ మూవీని త్రివిక్రమ్తో చేస్తారనే టాక్ వినిపించింది.కానీ త్రివిక్రమ్తో అల్లు అర్జున్ చేయాల్సిన సినిమాకు మైథలాజికల్ బ్యాక్డ్రాప్ ఉంటుందట, చాలా గ్రాఫిక్స్ వర్క్ అవసరం అవుతుందట. ఇలా ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ ఇంకా సమయం పడుతుందట. దీంతో తన నెక్ట్స్ మూవీ కోసం తమిళ టాప్ డైరెక్టర్ అట్లీతో చర్చలు జరిపారట అల్లు అర్జున్. అట్లీ డైరెక్షన్లోనే అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ సెట్స్పైకి వెళ్లనుందని టాక్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారని, సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుందని భోగట్టా. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా రూ. 1871 కోట్ల వసూళ్లు రాబట్టింది.మరోవైపు దర్శకుడిగా షారుక్ ఖాన్తో రూ. 1000 కోట్ల ‘జవాను’ను తీశారు అట్లీ. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్పై భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ స్పెయిన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ మూవీ పై మరింత సమాచారం బయటకు రానుందని తెలిసింది. అలాగే ప్రముఖ హిందీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ఇటీవల ముంబైలో కలిశారు అల్లు అర్జున్. వీరి మధ్య ఓ సినిమాకు సంబంధించిన చర్చలు జరిగాయి. సో... భన్సాలీతో కూడా అల్లు అర్జున్ సినిమా చేసే చాన్స్ ఉందని ఊహించవచ్చు.మాస్ ప్లస్ క్లాస్ ఎక్కువగా మాస్, వీలైనప్పుడు క్లాస్ మూవీస్ చేస్తుంటారు రవితేజ. అయితే రీసెంట్ టైమ్స్లో రవితేజ మాస్ సినిమాలే ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ప్రస్తుతం రవితేజ చేస్తున్న ‘మాస్ జాతర’ మాస్ అప్పీల్ ఉన్న సినిమాయే. దీంతో ఓ క్లాస్ మూవీ చేయాలని రవితేజ అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే కిశోర్ తిరుమల రెడీ చేసిన ఓ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీకి రవితేజ పచ్చజెండా ఊపారని, త్వరలోనే ఈ వీరి కాంబినేషన్లోని మూవీపై స్పష్టత రానుందని ఫిల్మ్నగర్ సమాచారం.ఓకే చెప్పిన నానీశివ కార్తికేయన్తో తమిళంలో ‘డాన్’ (2022) వంటి క్యాంపస్ డ్రామా ఫిల్మ్ తీసి హిట్ సాధించారు తమిళ యంగ్ డైరెక్టర్ సిబీ చక్రవర్తి. అప్పట్నుంచి సిబీ చక్రవర్తితో ఓ మూవీ చేయాలని నానీ అనుకుంటున్నారట. ఆ సమయం ఇప్పడు వచ్చిందని, నానీ–సిబీ చక్రవర్తి కాంబినేషన్లోని మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయని, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ప్రస్తుతం నానీ ‘హిట్ 3’ మూవీతో బిజీగా ఉన్నారు.మే 1న ఈ చిత్రం రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ మూవీ తర్వాత తనకు ‘దసరా’ వంటి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో నానీ ‘ప్యారడైజ్’ అనే మూవీ చేస్తారు. అయితే ‘ప్యారడైజ్’ చిత్రానికి సమాంతరంగా సిబీ సినిమాను కూడా నానీ చేస్తారా? లేక ‘ప్యారడైజ్’ చిత్రాన్ని పూర్తి చేశాక సిబీ చక్రవర్తి సినిమాను స్టార్ట్ చేస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.అలాగే దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పిన ఓ కథ నానీని ఇంప్రెస్ చేసిందని, నానీ ప్రస్తుత కమిట్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత శేఖర్ కమ్ములతో చేసే మూవీపై ఓ స్పష్టత వస్తుందని సమాచారం. ఈ నెల 24న నానీ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ హీరో తదుపరి చిత్రాలపై అధికారిక అప్డేట్స్ ఏమైనా వస్తాయా? అనేది చూడాలి.కిల్ డైరెక్టర్తో..!హిందీలో ‘కిల్’ వంటి మాస్ యాక్షన్ ఫిల్మ్ తీసి, ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యారు దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్. ఈ దర్శకుడు ఇప్పుడు ఓ క్రేజీ తెలుగు హీరోతో భారీ బడ్జెట్ మూవీ తీయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్లో విజయ్ దేవరకొండను కలిశారు నిఖిల్ నగేశ్. వీరి మధ్య ఓ కొత్త సినిమా గురించిన చర్చలు జరిగాయి. ప్రస్తుతం ‘కింగ్డమ్’ మూవీ చేస్తున్నారు విజయ్ దేవరకొండ.మే 30న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత దర్శకుడు రాహుల్ సంకృత్యాన్తో రాయలసీమ నేపథ్యంలో ఓ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్, రవికిరణ్ కోలాతో ఓ విలేజ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ కమిటయ్యారు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలు పూర్తయ్యాక విజయ్ దేవరకొండ–నిఖిల్ నగేశ్ల కాంబినేషన్లోని మూవీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
అల్లు అర్జున్ అట్లీ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ కన్ఫర్మ్..?
-
అల్లు అర్జున్కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ..?
తెలుగు చిత్ర పరిశ్రమలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్ 1’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు జాన్వీ. ప్రస్తుతం రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో హీరోయిన్గా చేస్తున్నారామె. ఈ యంగ్ బ్యూటీకి మరో సూపర్ చాన్స్ దక్కిందట. అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా అట్లీ(Atlee) దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనుందనే టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.సన్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని నిర్మించనుందట. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. మరి... ఈ వార్త నిజమై అల్లు అర్జున్ సరసన జాన్వీ కనిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే... ప్రస్తుతం వెకేషన్లో భాగంగా అల్లు అర్జున్ స్పెయిన్లో ఉన్నారు. తిరిగొచ్చిన తర్వాత ఈ సినిమాకు చెందిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయని తెలిసింది. -
టాలీవుడ్ లో పాతుకపోతున్న జాన్వీ కపూర్
-
త్రివిక్రమ్ కు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్
-
అట్లీ కలర్పై కామెంట్స్.. గొర్రెలాగా అనుసరించొద్దు: నెటిజన్కు కపిల్ శర్మ కౌంటర్
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ తన షోలో ఇటీవల చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీని అభ్యంతకరమైన ప్రశ్న అడిగారు. ఇప్పుడు మీరు చాలా పెద్ద స్టార్గా ఎదిగారు.. ఎవరైనా స్టార్ను మొదటిసారి కలవడానికి వెళ్లినప్పుడు అతనికి మీరు కనిపించారా? అంటూ కలర్ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. దీనికి అట్లీ సైతం రిప్లై కూడా ఇచ్చారు. ఎవరినైనా సరే రూపాన్ని చూసి ఓ అంచనాకు రాకండి.. అతని హృదయాన్ని చూసి చెప్పాలంటూ సమాధానమిచ్చారు.అయితే ఈ షోలో అట్లీని అవమానించాడని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కపిల్ శర్మను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అట్లీ కలర్పై అలాంటి కామెంట్స్ ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అట్లీకి క్షమాపణలు చెప్పాలంటూ మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. దీంతో తనపై వస్తున్న ట్రోల్స్పై కపిల్ శర్మ స్పందించారు.తనపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్కు కపిల్ శర్మ బదులిచ్చారు. డియర్ సర్.. నేను ఈ వీడియోలో అట్లీ లుక్స్ గురించి మాట్లాడినట్లు దయచేసి నాకు వివరించగలరా? దయచేసి సోషల్ మీడియాలో విద్వేషాన్ని వ్యాప్తి చేయకండి. మీకు ధన్యవాదాలు. అంతే కాదు అబ్బాయిలు మీ నిర్ణయం మీరే తీసుకోండి.. అంతేకానీ గొర్రెలాగా ఎవరో చేసిన ట్వీట్ను అనుసరించవద్దు' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే మరికొందరేమో కపిల్ శర్మ కామెంట్స్కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. Dear sir, can you pls explain me where n when I talked about looks in this video ? pls don’t spread hate on social media 🙏 thank you. (guys watch n decide by yourself, don’t follow any body’s tweet like a sheep). https://t.co/PdsxTo8xjg— Kapil Sharma (@KapilSharmaK9) December 17, 2024 -
స్టార్ డైరెక్టర్పై కమెడియన్ దారుణ కామెంట్స్.. వాళ్లను ఆ జబ్బు వదలదేమో?
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన బేబీ జాన్ మూవీకి ఆయనే కథను అందించారు. ఈ మూవీకి కలీస్ దర్శకత్వం వహించగా.. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా బేబీ జాన్ టీమ్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి హాజరైంది.అయితే ఈ షోలో డైరెక్టర్ అట్లీని ఉద్దేశించిన కపిల్ శర్మ అడిగిన ప్రశ్న వివాదానికి దారితీసింది. అట్లీ కలర్ను ఉద్దేశిస్తూ వ్యంగ్యమైన ప్రశ్న వేశాడు కపిల్. మీరు ఎవరైనా స్టార్ని కలిసినప్పుడు.. మీరు అతనికి కనిపిస్తారా? అంటూ అట్లీ కలర్ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. దీనికి అట్లీ తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు.దీనికి అట్లీ మాట్లాడుతూ...'ఒక విధంగా మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తా. నా మొదటి సినిమాను నిర్మించిన ఏఆర్ మురుగదాస్ సర్కి నేను చాలా కృతజ్ఞతలు. అతను నా స్క్రిప్ట్, నా సామర్థ్యం మాత్రమే చూశాడు. అంతేకానీ నేను ఎలా ఉన్నానో ఆయన అడగలేదు. అక్కడ ఆయనకు నా కథ నచ్చింది. ప్రపంచం అది మాత్రమే గుర్తిస్తుంది. ఒక వ్యక్తి రూపాన్ని బట్టి మనం అంచనా వేయకూడదు. మీ హృదయంతో మాత్రమే స్పందించాలి. ' అంటూ కపిల్ శర్మకు ఇచ్చిపడేశాడు.అయితే ఈ ప్రశ్నపై సింగర్ చిన్మయి శ్రీపాద సైతం స్పందించింది. ఈ షో అట్లీ కలర్ గురించి కపిల్ శర్మ జోక్ చేశాడని విమర్శించింది. కామెడీ పేరుతో అతని చర్మం రంగు గురించి మాట్లాడే ఈ విపరీతమైన హేళనలను వాళ్లు ఎప్పటికీ ఆపలేరేమో? అంటూ మండిపడింది. కపిల్ శర్మ లాంటి ఫేమ్ ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనను నిరాశకు గురి చేసిందని చిన్మయి ట్వీట్ చేసింది. అయితే కపిల్ కామెంట్స్ తనకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదని పోస్ట్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం చిన్మయి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Will they never stop these crass and racist jibes at his skin color in the name of ‘comedy’?Someone with the amount of influence and clout like Kapil Sharma saying something like this is disappointing and unfortunately, not surprising. https://t.co/63WjcoqHzA— Chinmayi Sripaada (@Chinmayi) December 15, 2024 -
నిర్మాతగా స్టార్ డైరెక్టర్ భార్య.. ట్రైలర్ చూశారా?
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'బేబీ జాన్'. ఈ చిత్రాన్ని కలీస్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ అట్లీ భార్య ప్రియా అట్లీ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో విడుదల చేశారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ మూవీగానే బేబీ జాన్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ యాక్షన్ సీన్స్, ఫైట్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, వామికా గబ్బి రాజ్పాల్ యాదవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతమందించడం మరో విశేషం. -
'తెరి' హిందీ రీమేక్ మూవీ టీజర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో విజయ్ హిట్ సినిమాల్లో 'తెరి' ఒకటి. దీన్నే 'పోలీసోడు' పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా హిట్ అయింది. ఆల్రెడీ తెలుగు వచ్చిన మూవీ పవన్ కల్యాణ్ రీమేక్ చేస్తున్నాడు. అదే 'ఉస్తాద్ భగత్ సింగ్' అని టాక్. చాలా ఏళ్ల క్రితమే ఇది మొదలైంది కానీ ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. మరోవైపు 'తెరి'ని హిందీలోనూ రీమేక్ చేశారు. 'బేబీ జాన్' పేరుతో దీన్ని తీస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)ఒరిజినల్లో విజయ్, సమంత, అమీ జాక్సన్ చేయగా.. అదే పాత్రల్లో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్, వామికా గబ్బి నటించారు. టీజర్ చూస్తే చూచాయగా అదే కథ అని అర్థమైపోయింది. కాకపోతే అప్పట్లో ఓ మాదిరి మాస్ చూపిస్తే ఇప్పుడు ఎలివేషన్స్ కోసమా అన్నట్లు మూవీ తీసినట్లు కనిపిస్తుంది. సంగీతమందించిన తమన్ అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో హోరెత్తించాడు. టీజర్ చూస్తుంటే హిట్ కొట్టేలానే ఉంది.డిసెంబరు 25న 'బేబీ జాన్' థియేటర్లలోకి రానుంది. 'తెరి' దర్శకుడు అట్లీ దగ్గర సహాయకుడిగా చేసిన కలీస్.. ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయమవుతున్నాడు. నిర్మాతల్లో అట్లీ భార్య కూడా ఒకరు. చాలా రోజుల నుంచి బాలీవుడ్లో సరైన మాస్ మూవీ రాలేదు. మరి ఆ లోటుని 'బేబీ జాన్' తీరుస్తుందేమో చూడాలి.(ఇదీ చదవండి: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేదిక అక్కడేనా..?) -
ఎవరు ఊహించని విధంగా విజయ్ దళపతి మల్టీస్టారర్ సినిమా
-
అట్లీతో సినిమా కచ్చితంగా చేస్తా
-
కమల్–సల్మాన్–ఓ సినిమా
హిందీలో షారుక్ ఖాన్తో ‘జవాన్’ తీసి, బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నారు తమిళ దర్శకుడు అట్లీ. ‘జవాన్’ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు రూ. వెయ్యి కోట్లకు పైగా దాటాయి. ఈ క్రమంలో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న తదుపరి చిత్రం ఏంటి? అనే చర్చల్లో భాగంగా అల్లు అర్జున్తో సినిమా చేయనున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా గురించి అధికారిక సమాచారం ఏదీ రాలేదు.కాగా అట్లీ ఓ మల్టీస్టారర్ మూవీ కథను రెడీ చేశారని, ఇందులో రజనీకాంత్, సల్మాన్ ఖాన్ హీరోలుగా నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. తాజాగా ఈ సినిమాలో రజనీకాంత్ ప్లేస్లో కమల్హాసన్ నటించనున్నారని మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. సల్మాన్–కమల్ కాంబినేషన్లో అట్లీ దర్శకత్వంలోని సినిమా దాదాపు ఖరారైనట్లే అనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఈ సినిమాను దక్షిణాదిలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్ పిక్చర్స్ నిర్మించనుందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. -
బన్నీ మూవీ పక్కన పెట్టి.. సల్మాన్ వైపు అట్లీ చూపు..
-
అల్లు అర్జున్ చేయాల్సిన మూవీ సల్మాన్ చేతికి!
దక్షిణాది డైరెక్టర్లకు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా తమిళ దర్శకులు మురుగదాస్, అట్లీ లాంటోళ్లు అక్కడ హిట్స్ కొట్టారు. ఏఆర్ మురుగదాస్.. 'గజిని'తో సక్సెస్ అందుకోగా, అట్లీ 'జవాన్'తో వెయ్యి కోట్ల వసూళ్లు మూవీ తీశాడు. కాగా అట్లీ మరోసారి బాలీవుడ్పై మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నిజానికి అల్లు అర్జున్ హీరోగా ఇతడు మూవీ తీస్తాడని ప్రచారం జరిగింది. కాకపోతే ఇదే ఇప్పుడు సల్మాన్ చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?)అల్లు అర్జున్తో కథా చర్చలు జరిగాయని, అయితే రెమ్యునరేషన్ విషయంలో అట్లీ ఏకంగా రూ.80 కోట్ల వరకు డిమాండ్ చేశాడని తెలుస్తోంది. దీంతో నిర్మాతలు లైట్ తీసుకున్నారని సమాచారం. కట్ చేస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టులోకి సల్మాన్ ఎంటరయ్యాడని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఇది సెట్స్పైకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వస్తాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!) -
జవాన్ మూవీ అరుదైన రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్!
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బాద్షా కాంబోలో వచ్చిన చిత్రం జవాన్. 2023లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు.అయితే తాజాగా అట్లీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వెతికిన సినిమాల జాబితాలో జవాన్ చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని అట్లీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. వరల్డ్ వైడ్గా గూగుల్లో అత్యధిక మంది వెతికిన చిత్రాల్లో జవాన్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి, రెండు స్థానాల్లో హాలీవుడ్ చిత్రాలు బార్బీ, ఓపెన్ హైమర్ నిలిచాయి. అంతే కాకుండా బాలీవుడ్ చిత్రాలైన గదర్-2, పఠాన్ వరుసగా 8,10 స్థానాలు దక్కించుకున్నాయి. కాగా.. ఈ వివరాలను వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. ❤️❤️❤️ https://t.co/NUiGjSORLJ— atlee (@Atlee_dir) June 6, 2024 -
డైరెక్టర్ కూతురి రెండో పెళ్లి.. స్టెప్పులతో అదరగొట్టిన స్టార్స్
ప్రముఖ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఏప్రిల్ 15న జరిగిన ఈ వివాహ వేడుకకు రజనీకాంత్, సూర్య, కమల్ హాసన్ సహా దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన స్టార్స్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంగళవారం ఎంతో వైభవంగా రిసెప్షన్ నిర్వహించగా బాలీవుడ్ సెలబ్రిటీలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ముఖ్యంగా సౌత్ డైరెక్టర్ అట్లీ- బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తమ డ్యాన్సులతో స్టేజీ దద్దరిల్లేలా చేశారు. వీరితోపాటు శంకర్ రెండో కూతురు, హీరోయిన్ అదితి శంకర్ కూడా ఎంతో హుషారుగా చిందేయడం విశేషం. ఇక వీరంతా తమిళ హిట్ సాంగ్స్కు కాలు కదిపారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా ఐశ్వర్య శంకర్ గతంలో క్రికెటర్ దామోదర్ రోహిత్ను పెళ్లాడింది. ఇతడు ఓ అమ్మాయిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు రావడంతో ఐశ్వర్య తన నుంచి విడాకులు తీసుకుంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో తరుణ్ కార్తికేయన్తో నిశ్చితార్థం జరగ్గా రెండు రోజులక్రితమే ఘనంగా వివాహం జరిపించారు. #RanveerSingh & #AditiShankar dancing for ThalapathyVijay & #Trisha's Apadi Podu Song 🤩🔥pic.twitter.com/RFXuZLSZo1 — Kolly Corner (@kollycorner) April 16, 2024 చదవండి: నువ్వు వర్జినా..? ముందు నీ పెళ్లి గురించి చెప్పమన్న హీరోయిన్ తనయుడు -
అల్లు అర్జున్కి జోడీగా..?
‘పుష్ప: ది రైజ్’ వంటి బ్లాక్బస్టర్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన ‘పుష్ప: ది రూల్’ సినిమా చేస్తున్నారు. ఆ చిత్రం పూర్తయిన తర్వాత తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అందులో భాగంగానే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫైనల్ చేసే పనిలో పడ్డారట అట్లీ. కాగా ఈ మూవీలో అల్లు అర్జున్కి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో సమంత, త్రిష పేర్లు వినిపిస్తున్నాయి. తొలుత త్రిష పేరు తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్కి ఆమె జోడీగా నటించనున్నారనే వార్తలు కోలీవుడ్లో హల్చల్ చేశాయి. అయితే తాజాగా సమంత పేరు వినిపిస్తోంది. అట్లీ దర్శకత్వం వహించిన ‘తేరి’ సినిమాలో విజయ్కి జోడీగా నటించారు సమంత. అలాగే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో అల్లు అర్జున్తో జతకట్టారీ బ్యూటీ. అలాగే ‘పుష్ప: ది రైజ్’ మూవీలో ‘ఊ అంటావా...’ అంటూ ప్రత్యేక పాట చేశారు. తాజాగా వీరి జోడీ రిపీట్ కానుందనే వార్తలు నెట్టింట వైరల్గా మారాయి. మరి అల్లు అర్జున్ సరసన నటించేది సమంతా? త్రిషా? లేకుంటే ఇద్దరూ నటిస్తారా? ఈ ఇద్దరూ కాకుండా వేరే కథానాయిక నటిస్తారా? అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఈ అక్టోబర్లో అల్లు అర్జున్–అట్లీ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్. -
స్టార్ జంటను ఫాలో అవుతున్న అట్లీ దంపతులు!
కోలీవుడ్లో నయనతార, విఘ్నేశ్ శివన్లకు బ్రాండ్ ఉంది. పదేళ్ల క్రితం ప్రేమలో పడి.. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న రికార్డు వీరిది. అయితే పెళ్లికి ముందు నుంచే ఏ చిన్న అకేషన్ వచ్చినా ఈ జంట విదేశాలకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడాన్ని ఈ జంట ఆనవాయితీగా పెట్టుకున్నారనే చెప్పాలి. అలా పుట్టిన రోజు, పెళ్లి రోజులు వస్తున్నాయంటే ఈ జంట నుంచి రకరకాల ఫొటోల కోసం నెటిజన్లు ఎదురు చూసేస్థితికి వారిని తీసుకొచ్చారు. తాజాగా వీరిని స్ఫూర్తిగా తీసుకున్నట్లు ఉన్నారు దర్శకుడు అట్లీ. దర్శకుడు శంకర్ శిష్యుడు అయిన అట్లీ రాజా రాణి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రమే మంచి విజయాన్ని సాధించడంతో ఆ తరువాత విజయ్ వంటి స్టార్ హీరోకు అవకాశం కల్పించారు. ఆయనతో మెర్శల్, తెరి, బిగిల్ వంటి హిట్ చిత్రాలను చేసి హిట్ కొట్టారు. ఇక ఇటీవల బాలీవుడ్కు వెళుతూ బాద్షా షారూఖ్ఖాన్ హీరోగా జవాన్తో అట్లీ సక్సెస్ అయ్యారు. ఇదిలా ఉంటే.. నటి ప్రియనుప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నారు. కాగా తొమ్మిది ఏళ్ల తరువాత ఇటీవలే తల్లిదండ్రులు అయ్యారు. ఇక అసలు విషయం ఏమంటే నయనతార, విఘ్నేష్ శివన్ తరహాలోనే ఈ జంట ఎలాంటి అకేషన్ వచ్చినా, లేకపోయినా ప్రత్యేకంగా ఫొటోలు తీయించుకుని మరీ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ జంట దిగిన రొమాంటిక్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) -
Priya Atlee: డైరెక్టర్ అట్లీ భార్యలో ఈ యాంగిల్ కూడా ఉందా! (ఫోటోలు)
-
నమ్మించి మోసం చేశారు..నటి సంచలనం
-
మీ వల్లే ఈ ఘనత దక్కింది.. జవాన్ డైరెక్టర్ పోస్ట్ వైరల్!
ఈ ఏడాది జవాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అట్లీ. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇటీవల ఐఎండీబీ రిలీజ్ చేసిన జాబితాలో ఇండియాలో అత్యధిక ఆదరణ దక్కించుకున్న మూవీగా జవాన్ నిలిచింది. ఈ ఏడాది ప్రకటించిన థియేట్రికల్ సినిమాల్లో అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ నిలిచింది. ఈ సందర్భంగా అట్లీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అట్లీ ఇన్స్టాలో రాస్తూ.. "జవాన్ అనేది ఓ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇది సమాజంలోని అన్యాయాలను సరిదిద్దాలని నిర్ణయించుకున్న ఒక వ్యక్తి లోతైన భావోద్వేగానికి సంబంధించినగి. ఈ సినిమా మీ అందరి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమా పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ, ప్రేమ చాలా గొప్పది. ప్రపంచ సినిమా గురించి నాకున్న జ్ఞానానికి ఐఎండీబీ ప్రశంసలు పొందడంతో ఓ కల నిజమైంది. ఈ విజయం కోసం సహకారించిన షారూఖ్ ఖాన్ సార్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, నా భార్య, నా టీమ్, ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్న' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ మీరు నంబర్ వన్ డైరెక్టర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు జవాన్-2 కోసం వెయిట్ చేస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) -
జవాన్ డైరెక్టర్ భారీ స్కెచ్.. ఆ ఇద్దరు స్టార్స్తో మూవీ!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రం జవాన్. ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి సౌత్ సూపర్స్టార్స్ ఎక్కువగా నటించారు. దర్శకుడు కూడా తమిళనాడుకు చెందిన అట్లీ కావడం విశేషం. కాగా ఈ చిత్రం రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ హిట్గా నిలిచింది. (ఇది చదవండి: ఐదు భిన్నమైన గెటప్స్లో కనిపించనున్న కంగువ) ఇక కోలీవుడ్లో దళపతిగా అభిమానులు పట్టం కట్టిన నటుడు విజయ్ ఆ మధ్య నటించిన చిత్రం బిగిల్. అందులోనూ నయనతారనే హీరోయిన్ కావడం మరో విశేషం. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించగా.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇక జవాన్, బిగిల్ చిత్రాల్లో మరో కామన్ విషయం హీరోలు ద్విపాత్రాభినయం చేయడం. ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా అట్లీ నిలిచారు. కాగా ఆయన తదుపరి చిత్రం ఏంటనే విషయంపై ఫ్యాన్స్లో ఆసక్తి నెలకొంది. దీనిపై తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జవాన్ హీరో షారుక్ ఖాన్, బిగిల్ హీరో విజయ్తో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారన్నదే లేటెస్ట్ టాక్. జవాన్ చిత్రంలో షారుక్ఖాన్తో కలిసి విజయ్ అతిథి పాత్రలో మెరవనున్నారనే ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవం కాదని తెలిసిపోయింది. అయితే విజయ్తో కలిసి నటించడానికి తాను సిద్ధమని షారుక్ ఖాన్ జవాన్ చిత్రం సమయంలోనే వెల్లడించారు. అదేవిధంగా షారుక్ ఖాన్తో కలిసి నటించిన డానికి తాను సిద్ధమేనని విజయ్ కూడా అన్నారు. కాగా ఇటీవల ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ తన దర్శకత్వంలో చిత్రం చేయడానికి ముందుకు వచ్చినట్లు అట్లీనే స్వ యంగా ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. ఈ చిత్రానికి కథను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఇది షారుక్ ఖాన్, విజయ్ కలిసి నటించిన చిత్రం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాలంటే కొద్ది కాలం ఆగాల్సిందే. అదేవిధంగా ఇది బాలీవుడ్ చిత్రం అవుతుందా? లేక హాలీవుడ్ చిత్రం అవుతుందా అన్నది కూడా తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: పిల్లలు కావాలని హీరోను పెళ్లి చేసుకున్నా: స్టార్ హీరోయిన్) -
జవాన్ టీం బంపరాఫర్.. ఆ మూడు రోజులు టికెట్ ఫ్రీ!
సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, నయనతరా జంటగా నటించిన చిత్రం జవాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన తొలి రోజే రూ. 75 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బాద్ షా స్టామినా ఏంటో నిరూపించింది. అయితే తాజాగా ఫ్యాన్స్కు బిగ్ ఆఫర్ తీసుకొచ్చింది. (ఇది చదవండి: అఖిల్ ఫ్యాన్స్కు మరో షాక్.. ఓటీటీ రిలీజ్లో బిగ్ ట్విస్ట్!) ఈనెల 28,29, 30 తేదీల్లో సినిమా చూసేవారికి జవాన్ చిత్రబృందం ఓ బంపరాఫర్ తీసుకొచ్చింది. ఈ మూడు రోజుల్లో టికెట్ బుక్ చేసుకున్నవారికి మరో టికెట్ ఫ్రీగా రానుంది. దీంతో ఒక టికెట్ తీసుకుని ఇద్దరు మూవీ చూసేయొచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నవారికే వర్తిస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని షారుక్ ఖాన్ తన ట్విటర్లో షేర్ చేశారు. ఇంకేం ఈ వీకెండ్లో జవాన్ మూవీ చూడాలనుకువారు ఈ ఆఫర్ను ఎంజాయ్ చేయండి. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించారు. Bhai ko, behen ko… Dushman ko, Yaar ko… And of course, apne Pyaar ko… Kal Jawan dikhaaiyega! Chacha-Chachi, Phoopha-Phoophi, Maama-Maami… Yaani Poore Parivaar ko. Sab ke liye ek ke saath ek free ticket!!! Toh kal se… Parivaar, yaar aur pyaar… Just Buy 1 ticket and get the… pic.twitter.com/Qr9gI4ihcO — Shah Rukh Khan (@iamsrk) September 27, 2023 -
వెయ్యి కోట్ల క్లబ్లో జవాన్.. షారుక్ అరుదైన ఘనత!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ- బాలీవుడ్ షారుక్ ఖాన్ కాంబో వచ్చిన జవాన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈనెల 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం కేవలం 18 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్క్ను దాటింది. ఇండియాలో ఇప్పటి వరకు రూ.560 కోట్లు వసూలు చేసింది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అట్లీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించింది. జవాన్ మూవీ వెయ్యి కోట్లు అధిగమించడంపై అట్లీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. (ఇది చదవండి: పరిణీతి- రాఘవ్ పెళ్లి.. అందుకోసం 2500 గంటలు పట్టిందా??) 'దేవుడు మా పట్ల చాలా దయతో ఉన్నాడు' అంటూ జవాన్ మూవీ క్లిప్ను షేర్ చేశారు. ఈ మైల్ స్టోన్కు కారణమైన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఈ ఏడాదిలో రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసిన షారుక్ రెండో చిత్రమిది. ఒకే ఏడాదిలో రెండు రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ నటుడు షారుఖ్ ఖాన్ ఘనత సాధించారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఇదంతా షారుక్ హవా అని.. త్వరలోనే రూ.1500 కోట్లకు చేరుకుంటుందని కామెంట్ చేశారు. పఠాన్ బాక్సాఫీస్ రికార్డ్ బ్రేక్ అయితే ఈ ఏడాది ప్రారంభంలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం నటించిన పఠాన్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల కొల్లగొట్టింది. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం నాలుగు వారాల తర్వాత ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్కును దాటింది. పఠాన్తో పోలిస్తే.. జవాన్ కేవలం 18 రోజుల్లోనే ఈ మార్క్ని దాటింది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, రిధి డోగ్రా, లెహర్ ఖాన్, గిరిజా ఓక్ సంజీతా భట్టాచార్య కూడా నటించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, దీపికా పదుకొణె కూడా అతిథి పాత్రలో కనిపించారు. (ఇది చదవండి: నేను శరత్బాబును రెండో పెళ్లి చేసుకోలేదు.. క్లారిటీ ఇచ్చిన నటి) God is so kind to us Thank you all #jawan History in the maKING ft. Jawan! 🔥 Have you watched it yet? Go book your tickets now! https://t.co/uO9YicOXAI Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/h57GwuTTP3 — atlee (@Atlee_dir) September 25, 2023 -
Nayanathara : అట్లీపై నయనతార కోపంలో నిజమెంత?
తమిళసినిమా: నటి నయనతార దర్శకుడు అట్లీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ప్రచారం. మరి ఇందులో నిజం ఎంత? దక్షిణాదిలో లేడీ సూపర్స్టార్గా వెలిగిపోతున్న నయనతార తొలిసారిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి నటించిన చిత్రం జవాన్. షారుక్ఖాన్ కథానాయకుడిగా నటించి సొంతంగా నిర్మించిన ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ యువదర్శకుడు అట్లీ బాలీవుడ్ పరిచయం అయ్యారు. కాగా ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొనె కూడా నటించిన విషయం తెలిసిందే. చిత్రం ఈనెల 7న విడుదలై బాక్సాఫీస్ షేక్ చేస్తూ రూ.1000 కోట్ల క్లబ్ చేరువలో ఉంది. అలాంటి చిత్రంలో దర్శకుడు తన పాత్రకు సరైన న్యాయం చేయలేదనే అసంతృప్తితో నయనతార ఉన్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. Witnessing the magic of my favouritest @iamsrk last night in a packed hall amidst the cacophony of whistles & cheer was something else. #Jawan is truly an exceptional film. @Atlee_dir you are a magician who knows the pulse of the nation. @NayantharaU you were ethereal. No words… pic.twitter.com/YKdc3bsnsk — Genelia Deshmukh (@geneliad) September 8, 2023 జవాన్ చిత్రంలో నటి దీపిక పడుకొనెకు అతిథి పాత్ర అని చెప్పి ఆమెకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లు నయనతార ఆవేదన చెందుతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకే నయనతార ఆ చిత్ర ప్రచార కార్యక్రమంలోగానీ, విజయోత్సవ వేడుకల్లోగాని పాల్గొనలేదనేది నెటిజన్ల విశ్లేషణ. అయితే ఈ ప్రచారాన్ని నయనతార వర్గం తీవ్రంగా ఖండిస్తున్నారు. నిజానికి షారుఖ్ఖాన్ అంటే నయనతారకు చాలా ఇష్టమని అందుకే ఆమె ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారని వారు పేర్కొంటున్నారు. Nayanthara special message to all after #Jawan success. She loved working with @iamsrk ❤️ SRK Nayanthara ❤️❤️ @NayantharaU + @iamsrk#JawanCreatesHistory #JawanEvent pic.twitter.com/S8ZU3uD2zp — Abu Bakar (@_Abubakar03) September 15, 2023 ఇక చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన లేదన్నది ఆమె పాలసీ అని అందుకే జవాన్ చిత్ర ప్రచారంలో కూడా పాల్గొనలేదని అంటున్నారు. అదేవిధంగా ముంబైలో జరిగిన చిత్ర సక్సెస్ కార్యక్రమంలో పాల్గొనపోవడానికి కారణం, అదేరోజు నయనతార తల్లి పుట్టినరోజు కావడంతో ఆమె తన తల్లికి ప్రాముఖ్యత ఇచ్చారని చెబుతున్నారు. అయితే దర్శకుడు అట్లీపై నయనతార ఆగ్రహం అని వారు, వీరు అంటుండడమే కానీ నయన మాత్రం ఏవిధంగా స్పందించలేదన్నది గమనార్హం. Nayanthara spotted in Mumbai #Nayanthara #VigneshShivan @NayantharaU #Jawan pic.twitter.com/wcJRbypqAl — Deccan Mirror (@TheDeccanMirror) September 8, 2023 -
జవాన్ డైరెక్టర్పై నయన్ అసంతృప్తి.. కారణం అదేనా..!!
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే జవాన్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన కనిపించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం ఇండియాలోనే ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ చిత్రంలో నయన్ నటనపై ప్రశంసలు వస్తున్నాయి. ఆమె యాక్షన్ సన్నివేశాలతో సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. (ఇది చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి!) అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె సైతం కీలక పాత్రలో కనిపించింది. ఆమె పాత్ర కొద్దిసేపే అయినప్పటికీ ప్రేక్షకులను మెప్పించింది. ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం కోలీవుడ్తో పాటు బాలీవుడ్లో ఓ చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో నయనతారకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనే వార్త వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మూవీ డైరెక్టర్ అట్లీపై నయన్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకొణె అతిథి పాత్రలో కనిపించినా.. ఆమెకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని కోలీవుడ్ లేటెస్ట్ టాక్. నయనతార అసంతృప్తిగా ఉందా? తాజా బజ్ ప్రకారం జవాన్లో అతిథి పాత్ర పోషించిన దీపికా పదుకొణెకు దక్కిన ప్రాధాన్యత నయనతారకు ఇవ్వలేదని సమాచారం. ఈ విషయంలో నయనతార అట్లీ తీరు పట్ల కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భవిష్యత్తులో బాలీవుడ్ చిత్రాల్లో నయన్ నటించకూడదని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ప్రమోషన్లకు దూరం? జావాన్ సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్లలో నయన్ కనిపించక పోవడం ఇదే ప్రధాన కారణమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. షారుక్-నయనతార జవాన్ కాస్తా దీపికా- షారుక్ మూవీగా మారిపోయిందంటున్నారు. అంతే కాకుకండా గత వారం ముంబైలో జరిగిన సక్సెస్ మీట్లో విలన్గా నటించిన విజయ్ సేతుపతితో సహా అందరూ హాజరైనప్పటికీ నయన్ సక్సెస్ మీట్కు కూడా హాజరు కాలేదు. (ఇది చదవండి: 6 ఏళ్ల తర్వాత పర్సనల్ ఫోటోలు బయటకు ఎలా వచ్చాయి?: రాహుల్) దక్షిణాదిలో ఆమెనే! అయితే మరికొందరేమో దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదంతా నిజం కాదని కొట్టి పారేస్తున్నారు. గతంలోనూ నయనతార ఎప్పుడూ సినిమా ఈవెంట్లకు వెళ్లలేదంటున్నారు. గతంలో ఆమెకు ఎదురైన చేదు అనుభవాల కారణంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెబుతున్నారు. కేవలం నటించడమే తన పని నయన్ భావిస్తారని అంటున్నారు. అయితే ఈ సినిమాకు నయనతార దాదాపు రూ.10 నుంచి 11 కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది హీరోయిన్లలో ఇప్పటివరకు ఇంత భారీ పారితోషికం తీసుకోలేదని సమాచారం. -
ఆ విషయంలో అట్లీ నన్ను మోసం చేశాడు: ప్రియమణి
తమిళసినిమా: బహుభాషా నటిగా రాణిస్తున్న ప్రియమణి మొదట్లో హీరోయిన్గా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. తమిళంలో పరుత్తివీరన్ చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. కాగా వివాహానంతరం తన వయసుకు తగిన పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జవాన్ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ చిత్రంలో నటించిన గురించి ప్రియమణి ఒక భేటీలో పేర్కొంటూ జవాన్ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఏదో క్యామియో పాత్ర అయి ఉంటుందని భావించారన్నారు. అయితే షారుక్ ఖాన్ టీం లో ఒకరిగా ముఖ్యమైన పాత్ర అని తెలియగానే చాలా సంతోషించానన్నారు. అట్లీ దర్శకుడు అని చెప్పగానే నటిస్తానని చెప్పానన్నారు. అలా ఒకసారి జూమ్ కాల్లో దర్శకుడు అట్లీ, ఆర్య మాట్లాడారని చెప్పారు. అట్లీ తన మిత్రుడు అని పరిచయం చేసి ఆర్య వెళ్లిపోయారన్నారు. అలా ప్రియమణి జవాన్ చిత్రంలో నటిస్తుందన్న వార్త వెలువడగానే ఏదో ఐటమ్ సాంగ్ అయ్యింటుందనే ప్రచారం జరిగిందన్నారు. అలాంటి ప్రచారాన్ని తాను పట్టించుకోలేదన్నారు. అయితే దర్శకుడు అట్లీ తనను చాలా ఏమార్చారన్నారు.. జవాన్ చిత్రం తమిళ వర్షన్లో నటుడు విజయ్ గెస్ట్ రోల్ లో నటించనున్నారని, అదే విధంగా తెలుగు వెర్షన్ జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రను నటించనున్నారని ప్రచారం హోరెత్తిందన్నారు. విజయ్ ఇందులో నటిస్తున్నారా..? అని తాను అట్లీని అడగ్గా నటింపజేస్తే పోద్ది అన్నారన్నారు. అయితే విజయ్తో తనను ఒక్క సన్నివేశంలోనైనా నటింపజేయమని కోరగా అలాగే అన్నారని, అయితే చివరివరకూ దర్శకుడు అట్లీ తనను అలా ఏమార్చుతూనే వచ్చారని వెల్లడించారు. నిజానికి ఈ చిత్రంలో విజయ్ గానీ, జూనియర్ ఎన్టీఆర్ గానీ నటించలేదని ప్రియమణి పేర్కొన్నారు. -
అట్లీ, షారుఖ్పై నయనతార అసంతృప్తి.. నిజమెంత?
తమిళసినిమా: పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు అన్నది సామెత. అయితే ఇది కొందరి విషయంలో అక్షరసత్యంగా మారుతుంది. ముఖ్యంగా నటి నయనతార పరిస్థితి ఇదే. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రకథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. తాజాగా జవాన్ చిత్రంతో బాలీవుడ్లోనూ రంగప్రవేశం చేశారు. దీంతో ఇండియన్ సినిమా తారగా గుర్తింపుపొందారు. నయనతార నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటన కారణంగా ఈమైపె సంచలన నటిగా ముద్రవేశారు. నటిగా రెండు దశాబ్దాలకు దగ్గరలో ఉన్న నయనతార 75 చిత్రాల మైలురాయిని అవలీలగా అధిగమించి నాటౌట్గా వెలుగొందుతున్నారు. కాగా దీని గురించి ఇటీవల ఒక వదంతి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. జవాన్ చిత్రంలో తన పాత్రకు ప్రాముఖ్యత ఇవ్వలేదని దర్శకుడు అట్లీ, నటుడు షారుక్ఖాన్లపై అసంతృప్తిగా ఉన్నారన్నది ఆ వదంతి. అయితే జవాన్ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై అనూహ్యంగా వసూళ్లను కురిపిస్తోంది. ఇది ఇండియాలో ఒకరోజులో రూ.75 కోట్లు వసూళ్లు చేసిందని, ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు సాధించి గత రికార్డులను తిరగరాస్తున్నట్లు సమాచారం. ఇకపోతే జవాన్ చిత్రంలో నయనతారకు తగిన ప్రాధాన్యత ఉంది. ఆమెకు యాక్షన్ సన్నివేశాలు కూడా చోటుచేసుకున్నాయి. మరో విషయం ఏమిటంటే నటుడు షారుక్ఖాన్ అంటే నయనతారకు పిచ్చి అభిమానం. ఇక అట్లి దర్శకత్వం వహించిన తొలి చిత్రంలో కథానాయకి నయనతారనే ఆ తర్వాత బిగిల్ చిత్రంలో విజయ్ సరసన నయనతారనే నటింపజేశారు. ఇకపోతే జవాన్ చిత్రం సక్సెస్ను సెలబ్రేట్ చేయడానికి నయనతార తన భర్త విఘ్నేశ్ శివన్తో కలిసి ముంబై వెళ్లారు. ఈ జంటను ముంబై విమానాశ్రయంలో ఫొటో గ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాబట్టి జవాన్ చిత్ర దర్శక నిర్మాతలపై నయనతార అసంతృప్తిగా ఉన్నట్టు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేటతెల్లమవుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఆస్పత్రిలో భార్య.. షూటింగ్ ఆపేయమన్న షారుక్: అట్లీ
ప్రపంచ వ్యాప్తంగా షారుక్ ఖాన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం జవాన్. ఈ సినిమాను తమిళ హిట్ దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కించాడు. దీంతో ఈ సినిమా కోసం బాలీవుడ్తో పాటు కోలీవుడ్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. జవాన్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అని ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని లుక్లో ఈ సినిమాలో షారుక్ కనిపించనున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో కథానాయిక. విజయ్ సేతుపతి విలన్ రోల్ పోషిస్తుండగా, దీపికా పదుకొణె కూడా ఈ సినిమాలో అతిధి పాత్రలో నటిస్తోంది. (ఇదీ చదవండి: ఇన్స్టాగ్రామ్లో నయనతార ఎంట్రీ.. ఫాలో అయ్యేది ఆ ఐదుగురిని మాత్రమే) దర్శకుడు శంకర్తో కో-డైరెక్టర్గా సినీ రంగ ప్రవేశం చేసిన అట్లీకి జవాన్ ఐదవ చిత్రం కానున్నడం విశేషం. 'రాజా రాణి'తో అట్లీ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాక దళపతి విజయ్తో వరుసగా మూడు చిత్రాలు థెరి, మెర్సల్, బిగిల్ భారీ విజయాలు సాధించాయి. దీని తర్వాత అట్లీ జవాన్ను ప్రకటించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో సెప్టెంబర్ 7న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో వేదికపై అట్లీ ప్రసంగం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. నటి ప్రియను వివాహం చేసుకున్న అట్లీ సుమారు ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. జవాన్ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న సమయంలో తన భార్య గర్భం దాల్చిన విషయాన్ని షారుక్ ఖాన్కు తెలిపినప్పుడు ఆయన ఎలా స్పందించాడో తాజాగ అట్లీ గుర్తుచేసుకున్నాడు. 'జవాన్ షూటింగ్ కోసం నేను అమెరికాకు చేరుకున్నాను. ఈలోపు తాను గర్భం దాల్చినట్లు ప్రియా ఫోన్ చేసి తెలిపింది. ఎనిమిదేళ్ల తర్వాత గర్భం దాల్చినందున మూడు నెలల పాటు ప్రయాణం చేయవద్దని వైద్యులు సూచించారు. పూర్తిగా బెడ్ రెస్ట్ అన్నారు. అప్పటికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి మూడు రోజులే అయింది. దీంతో ప్రియాను అమెరికాకు రమ్మని చెప్పలేకపోయాను ఏం చేయ్యాలో తెలియక ఈ విషయాన్ని షారుఖ్ ఖాన్కి చెప్పగా, వెంటనే షూటింగ్ ఆపేయమని, కొద్దిరోజులు వెయిట్ చేస్తానని చెప్పాడు. షారుక్ చెప్పిన మాటను ప్రియతో తెలుపగా.. షూటింగ్ ఆపవద్దని చెప్పడమే కాకుండా తన పనులు తానే చూసుకుంటానని చెప్పింది. అలాంటి కష్ట సమయంలో కూడా సినిమా పనులపై దృష్టి పెట్టమని ఆమె నన్ను ప్రోత్సహించింది. ప్రియా అందించిన ఆ సహకారమే నా విజయ రహస్యం' అని వేదికపై అట్లీ అన్నారు. తన కష్ట సమయంలో షారుక్ ఏంతో ధైర్యాన్ని ఇచ్చాడని, తండ్రి స్థానంలో షారుక్ ఎప్పుడూ తనవెంటే ఉన్నారని ఆట్లీ ఎమోషనల్ అయ్యాడు. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ఆందోళన చెందనని అట్లీ తెలిపాడు. కాగా, గత జనవరిలో వీరికి మగబిడ్డ జన్మించాడు. అట్లీ, ప్రియా నవంబర్ 2014 లో వివాహం చేసుకున్నారు. ఇక అట్లీ భార్య ప్రియా కొన్ని తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రియా నటించి తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. నా పేరు శివ, యముడు లాంటి సినిమాల్లో ప్రియా నటించింది. 10years back , we were shooting near #ShahRukhKhan sir home , I stood near his gate and clicked a pic. Now his home gate opened for me and Shah Rukh sir stood at the gate to welcome me ! You are more than my father , my everything sir . #Atlee pic.twitter.com/ulmjyaSOzN — iamsrksneha (@iamsrkian000) August 30, 2023 -
'జవాన్' రెండో ట్రైలర్ విడుదల
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ 'జవాన్' సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. యూఎస్ఏలో ఈ సినిమా ప్రీ బుకింగ్స్ ఓ రేంజ్లో సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను నెలరోజుల కిందటే విడుదలైంది. అందులో భారీ యాక్షన్ సీన్స్తో షారుక్ అదరగొట్టాడు. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గపడుతుండడం వల్ల సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. అందువల్ల ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్ను కూడా మేకర్స్ తాజాగ విడుదల చేశారు. రెండో ట్రైలర్లో కూడా షారుఖ్ దుమ్ములేపాడనే చెప్పవచ్చు. ముంబయ్లోని మెట్రోను షారుఖ్ హైజాక్ చేస్తాడు.. ఈ సీన్తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుండగా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్గా కనిపించనున్నారు. ట్రైలర్లో విజయ్ సేతుపతిని ప్రత్యేకమైన లుక్లో చూపించారని చెప్పవచ్చు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై గౌరీ ఖాన్ జవాన్ను భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నరు. ఈ సినిమా సెప్టెంబర్ 7న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలోకి రానుంది .ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా(దుబాయ్)పై జవాన్ ట్రైలర్ను ప్రదర్శించేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. దీనిని నేడు రాత్రి (ఆగష్టు 31) 9 గంటలకు పదర్శించనున్నారు. బుర్జ్ ఖలీఫా బిల్డింగ్పై షారుక్ సినిమా ట్రైలర్ను ప్రదర్శించడం ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది ఆరంభంలో రిలీజైన 'పఠాన్' సినిమా ట్రైలర్ను కూడా ఇదివరకే అక్కడ ప్రదర్శించిన విషయం తెలిసిందే. -
దుమ్ము రేపుతున్న ‘జవాన్’ మేకింగ్ వీడియో
పటాన్ చిత్రంతో రికార్డులను బద్దలు కొట్టిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు జవాన్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన రెడ్ చిల్లీ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి తమిళ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించడం విశేషం. అదేవిధంగా ఈ చిత్రం ద్వారా లేడి సూపర్స్టార్ నయనతార బాలీవుడ్కు పరిచయమవుతున్నారు. ప్రతి నాయకుడుగా విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రమోషన్ చేసే పనిలో బిజీగా ఉంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో జవాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. కాగా ఇటీవల ఈ చిత్రంలోని వుంద ఎడమ్ (హిందీలో జిందా బండా, తెలుగులో దుమ్ము దులిపేలా) పల్లవి తో సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట ఇప్పుడు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ పాటలో నటుడు షారుక్ ఖాన్కు తెలుగు , తమిళ పదాల ఉచ్చరణను దర్శకుడు అట్లీ స్వయంగా నేర్పించడం విశేషం. తాజాగా ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఈ పాటలో అనేకమంది నృత్య కళాకారుల మధ్య దర్శకుడు అట్లీ నటుడు షారుక్ ఖాన్తో కలిసి స్టెప్స్ వేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో జవాన్ చిత్రంపై అంచనాలు నానాటికి పెరిగిపోతున్నాయి. -
స్టార్ హీరోకు గాయాలు.. మొదలైన రోజే ఇలా!
బాలీవుడ్ హీరోలందరూ సౌత్ డైరెక్టర్లపై మనసు పారేసుకుంటున్నారు! ప్రస్తుతం అంతటా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే యంగ్ హీరో వరుణ్ ధావన్.. దర్శకుడు అట్లీ తీస్తున్న ఓ మూవీలో నటిస్తున్నాడు. షారుక్తో 'జవాన్' తీసిన తమిళ దర్శకుడు అట్లీ.. వరుణ్ ధావన్ సినిమాని మాత్రం నిర్మిస్తున్నాడు. కలీస్ దర్శకుడు. ఇదంతా పక్కనబెడితే షూటింగ్ మొదలైన రోజే హీరో గాయపడ్డాడనే వార్త అభిమానుల్ని కంగారు పెట్టింది. (ఇదీ చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు) 'బవాల్' సినిమాతో ఈ మధ్య ప్రేక్షకుల్ని పలకరించిన వరుణ్ ధావన్.. 'VD18' వర్కింగ్ టైటిల్తో తీస్తున్న ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్స్లో కనిపించనున్నాడు. ఈ క్రమంలోనే ప్రోమో కోసం కీలక ఎపిసోడ్స్ని చిత్రీకరిస్తున్నారు. అయితే ఓ యాక్షన్ సీన్లో భాగంగా పట్టుతప్పి కిందపడిపోయిన వరుణ్ మోచేతికి గాయమైంది. ఈ విషయాన్ని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసిన ఇతడు.. 'నో పెయిన్ నో గెయిన్' (ఫలితం కావాలంటే నొప్పిని భరించాలి) అని రాసుకొచ్చాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తీస్తున్న ఈ సినిమాతో హీరోయిన్ కీర్తి సురేశ్.. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. వామిక గబ్బి మరో హీరోయిన్. ఇదిలా ఉండగా గతేడాది 'భేడియా' చిత్రంతో హిట్ కొట్టిన వరుణ్.. మొన్నీ మధ్య 'బవాల్' చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశాడు. ఇప్పుడు కలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే పెట్టుకుని, గట్టిగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: మహిళపై అత్యాచారం.. ప్రముఖ నటుడు అరెస్ట్!) -
కీర్తి సురేష్ ఉంటే ఆ సినిమా రిజల్ట్ ఇదేనా?
ఒకటి రెండు చిత్రాలు ప్లాప్ అయితే ఆ చిత్రాల్లో నటించిన హీరోయిన్లను ఐరన్లెగ్ అనీ, వారి పని అయిపోయిందని సినీ వర్గాల్లో ప్రచారం జరగడం పరిపాటిగా మారింది. అయితే అలా ఒకటి రెండు చిత్రాల ప్లాప్లతో హీరోయిన్ల కెరీర్ను అంచనా వేయడం సరికాదు. నటి కీర్తి సురేష్ విషయంలోనూ ఇదే జరిగింది. మొదట మాలీవుడ్ నుంచి కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన కీర్తీసురేశ్ అక్కడ కొన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆ తరువాత టాలీవుడ్లోకి రంగప్రవేశం చేశారు. (ఇదీ చదవండి; Jailer Review: రజినీకాంత్ 'జైలర్' ట్విటర్ రివ్యూ) ఇక్కడ మహానటి చిత్రంతో అనూహ్య విజయాన్ని అందుకోవడంతో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. అయితే ఆ తరువాత ఆమె నటించిన కొన్ని చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడంతో కీర్తీసురేశ్ చాప్టర్ క్లోజ్ అనే ప్రచారం జరిగింది. అలాంటిది ఇటీవల తెలుగులో నటించిన దసరా, తమిళంలో నటించిన మామన్నన్ చిత్రాల విజయాలు ఆమెను మళ్లీ ఫామ్లోకి తీసుకొచ్చాయి. తాజాగ భోళా శంకర్లో కూడా చిరంజీవికి చెల్లెలుగా నటించింది. దీంతో కీర్తి మళ్లీ బిజీ నాయకిగా మారారు. అంతేకాదు బాలీవుడ్లో బెర్త్ను ఖరారు కూడా చేసుకున్నారు. నిజానికి కీర్తి సురేష్కు ఇంతకు ముందే హిందీ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. అయితే ఈమె బాలీవుడ్ ఎంట్రీకి ఆసక్తి చూపలేదని ప్రచారం జరిగింది. కాగా తాజాగా ఈ బ్యూటీని తమిళ యువ దర్శకుడు అట్లీ బాలీవుడ్కు తీసుకెళుతున్నారని సమాచారం. తమిళంలో నటుడు విజయ్ హీరోగా వరుసగా మూడు హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఈయన ఇటీవల బాలీవుడ్లోకి ప్రవేశించి షారూక్ ఖాన్ హీరోగా జవాన్ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ద్వారా నటి నయనతారను బాలీవుడ్కు పరిచయం చేశారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా తాజాగా అట్లీ బాలీవుడ్లో నిర్మాతగా పరిచయం అవుతూ నటి కీర్తి సురేష్ను అక్కడకు తీసుకెళ్తున్నారు. తమిళంలో విజయ్ హీరోగా ఆయన తెరకెక్కించిన తెరి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. ఇందులో విజయ్ పాత్రను వరుణ్ ధావన్ పోషించనున్నారని, నటి సమంత పాత్రలో కీర్తి సురేష్ నటించనున్నారని సమాచారం. కాగా ఎమీజాక్సన్ పాత్రలో నటి వామిక గబ్బి నటించనున్నట్లు తెలిసింది. దీనికి కలీస్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు తమిళంలో జీవా హీరోగా కీ చిత్రానికి దర్శకత్వం వహించారు. -
Jawan: లుంగీ డాన్స్తో దుమ్ము రేపిన షారూఖ్ ఖాన్, ప్రియమణి
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన చెన్నై ఎక్స్ప్రెస్ చిత్రంలో లుంగీ డాన్స్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఆ పాటకు ప్రియమణితో కలిసి షారుఖ్ అదిరిపోయే స్టెప్పులేశాడు. తాజాగా ఈ జోడి మరోసారి లుంగీ డాన్స్తో అదరగొట్టింది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ నటిస్తోన్న చిత్రం జవాన్. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘దుమ్మే దులిపేలా..’సాంగ్ రిలీజ్ అయింది. ఇందులో దాదాపు 1000 మందితో కలిసి షారుఖ్ స్టెప్పులేశాడు. బ్యాగ్రౌండ్లో ఉండే 1000 డ్యాన్సర్స్ లుంగీ కట్టుకొని డ్యాన్స్ చేయడం ఈ పాట స్పెషల్. ఇందులో ప్రియమణి మరోసారి కింగ్ ఖాన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. 1,2,3,4 గెట్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్ అంటూ షారూక్, ప్రియమణిని మరోసారి చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయబోతున్నారు. లార్జర్ దేన్ లైఫ్ విజువల్స్, పాజిటివ్ ఎనర్జీతో ఈ పాట షారూఖ్కి మ్యూజిక్పై ఉన్న కనెక్షన్ను ఎలివేట్ చేస్తోంది. ఈ పాటకు 24 గంటల్లోనే 46 మిలియన్ వ్యూస్ రావటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌరవ్ వర్మ ఈ సినిమాకు సహ నిర్మాత. సెప్టెంబర్ 7న ‘జవాన్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. -
'జవాన్' మొదటి పాట రిలీజ్.. దీనికి పెట్టిన ఖర్చుతో సినిమానే తీయవచ్చు
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుంచి వస్తున్న తాజా చిత్రం 'జవాన్'. దీనికి దర్శకత్వం అట్లీ. నయనతార, ప్రియమణి,దీపికా పదుకొణె ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ‘జవాన్’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ 'జిందా బందా' తెలుగులో 'దుమ్ము దులిపేలా'ను మేకర్స్ విడుదల చేశారు. ఆ పాటకోసం హైదరాబాద్,చెన్నై, బెంగళూరు, ముంబయి నుంచి వెయ్యికి మందికి పైగా మహిళ డ్యాన్సర్లన రప్పించి షూట్ చేశారు. వీరందరితో పాటు సన్యా మల్హోత్రా, ప్రియమణిలతో షారుఖ్ వేసిన స్టెప్పులకు ఎవరైనా ఫిదా అవుతారు. ఇందులో ఆయన చాలా యంగ్ లుక్లో కనిపించారు. (ఇదీ చదవండి: సుమన్ జైలుకు వెళ్లడంపై బయటికొచ్చిన అసలు నిజాలు.. ఇంతమంది ప్రమేయం ఉందా?) ఈ పాటను ఐదు రోజుల పాటు చిత్రీకరించగా అందుకు అయిన ఖర్చు సుమారుగా రూ.15 కోట్లు అని సమాచారం. ఈ పాటను సంగీత దర్శకుడు అనిరుధ్ పాడితే.. నృత్య దర్శకుడు శోభి వారందరితో అదిరిపోయే స్టెప్పులు వేయించారు. ఈ పాటకు అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఒక రేంజ్లో ఉంటుంది. సెప్టెంబర్ 7న ఈ సినిమా విడుదల కానుంది. -
ఆ దర్శకుడికి కలిసొచ్చిన హీరోయిన్.. దక్షిణాదిలోనే భారీ రెమ్యునరేషన్!
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం విడుదలై చాలా రోజులైంది. కనెక్ట్ చిత్రం తర్వాత నయనతార తెరపై కనిపించలేదు. ఈ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. అదే సమయంలో పారితోషికాన్ని పెంచుకుంటూనే పోతున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక మిమ్మల్ని చూడలేనంటూ!) ఈ సంచలన భామ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి నటించిన తొలి చిత్రం జవాన్. షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఇందులో ప్రతినాయకుడిగా నటించారు. ఇక క్రేజీ బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొనే కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం. కాగా కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు అట్లీకి నటి నయనతార లక్కీ హీరోయిన్ అనే చెప్పాలి. ఈయన తొలి చిత్రం రాజారాణిలో నయనతారనే కథానాయకి. ఆ తర్వాత విజయ్ కథానాయకుడిగా రూపొందించిన బిగిల్ చిత్రంలోని ఈమెనే హీరోయిన్. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా తన తొలి హిందీ చిత్రంలోను నయనతారనే కథానాయికగా తీసుకున్నారు. ఈ చిత్రంలో ఆమెకు రూ. 8 నుంచి 10 కోట్ల వరకు పారితోషికం ముట్ట జెప్పినట్లు సమాచారం. బాలీవుడ్ హీరోయిన్లతో పోస్తే ఇది తక్కువే అయినా దక్షిణాది హీరోయిన్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. కాగా జవాన్ తన తొలి హిందీ చిత్రం కావడంతో రిజల్ట్ కోసం లేడీ సూపర్ స్టార్ నయనతార ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు ) -
ఒక్క ట్రైలర్.. మూడు సినిమాలు కనిపించాయ్!
Jawan Trailer Review: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ 'జవాన్' ట్రైలర్ విడుదలైంది. యాక్షన్ డ్రామాగా తీస్తున్న ఈ సినిమాలో షారుక్ తోపాటు నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ నటిస్తున్నారు. 'పఠాన్' లాంటి వెయ్యి కోట్ల మూవీ తర్వాత షారుక్ చేస్తున్న చిత్రమిదే. దీంతో అంచనాలు ఓ రేంజులో ఉన్నాయి. ఈ క్రమంలోనే 'జవాన్' అంతకు మించి ఉండబోతుందనేలా ట్రైలర్ ఉంది. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిన సామ్.. ఆ ఆరు నెలలు!) 'జవాన్' కథేంటి? ట్రైలర్ని చాలావరకు ఎలివేషన్స్ సీన్స్తో నింపేశారు. కాస్త స్టోరీని మాత్రం చెప్పి చెప్పనట్లు చూపించారు. మా అంచనా ప్రకారం.. జైల్లో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు(షారుక్ ఖాన్) గతంలో తల్లికి జరిగిన అన్యాయంపై పగ తీర్చుకోవడానికి సిద్ధమవుతాడు. దీంతో ఆమె బాధకి కారణమైన వాళ్లని చంపాలనుకుంటాడు. ఎంతకైనా తెగిస్తుంటాడు. మరోవైపు ఇతడిని పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్ (నయనతార), విలన్(విజయ్ సేతుపతి) వేర్వేరుగా ప్రయత్నిస్తుంటారు. చివరకు ఏమైందనేదే స్టోరీ. కాపీ షాట్స్! 'జవాన్' ట్రైలర్ అంతా బాగానే ఉంది. అయితే షారుక్ ముఖానికి సగం మాస్క్ పెట్టుకున్న సీన్ 'అపరిచితుడు'లో విక్రమ్ని.. చిన్నపిల్లాడ్ని గాల్లో ఎత్తి పట్టుకునే సీన్ 'బాహుబలి' మొదటి భాగాన్ని.. బాడీ మొత్తాన్ని క్లాత్తో కప్పేసుకున్న సీన్ 'మూన్ నైట్' వెబ్ సిరీస్ని గుర్తుచేసింది. ట్రైలర్ లో కనిపించి అమ్మాయిల గ్యాంగ్.. విజయ్ 'బిగిల్' చిత్రాన్ని జ్ఞాపకం తెచ్చింది. చివర్లో షారుక్ గుండుతో కనిపించే సీన్ చూడగానే 'శివాజీ'లో రజినీకాంతే గుర్తొచ్చాడు. అయితే ఇవన్నీ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికైతే ఓకే.. లేదంటే మొదటికే మోసపోయే అవకాశముంది. (ఇదీ చదవండి: తమన్నా మాస్ స్టెప్పులు.. అలా పోల్చిన విజయ్ వర్మ!) Your thoughts on Atlee getting inspiration from other movies for #JawanPrevue?#ShahRukhKhan pic.twitter.com/ZLyHki7OJn — Manobala Vijayabalan (@ManobalaV) July 10, 2023 -
కౌంట్ డౌన్ షురూ.. షారూక్ ఖాన్ ‘జవాన్’ క్రేజీ అప్డేట్!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ ‘జవాన్’. ఈ చిత్రం కోసం ప్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. జవాన్ ప్రివ్యూను జూలై 10న ఉదయం 10:30 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు షారూక్ తన ట్విటర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: లైవ్లో సిగరెట్ తాగిన స్టార్ హీరో.. మండిపడుతున్న నెటిజన్స్!) అయితే ఈ సినిమాను ఎలా ఉండబోతుంది? అసలు షారూక్ ఖాన్ స్టార్ డమ్ను అట్లీ ఎలా చూపించబోతున్నారు? అని అందరూ చర్చించుకుంటున్నారు. దీంతో సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాతో పాటు కౌంట్ డౌన్లో అందరూ భాగస్వామ్యం కావాలని మేకర్స్ ప్రకటించారు. కాగా.. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గౌరీ ఖాన్ నిర్మాతగా.. జవాన్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ‘జవాన్’ చిత్రం సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. (ఇది చదవండి: నా నడుము 22.. ఆ రోజులు కనుమరుగై పోయాయి: స్టార్ హీరోయిన్) मैं पुण्य हूँ या पाप हूँ?... मैं भी आप हूँ... Main punya hoon ya paap hoon?... Main bhi aap hoon…#JawanPrevueOn10July#Jawan releasing worldwide on 7th September 2023, in Hindi, Tamil & Telugu. pic.twitter.com/GI3RqgVGqr — Shah Rukh Khan (@iamsrk) July 8, 2023 -
ముగ్గురు డైరెక్టర్లు, ముగ్గురి హీరోయిన్ల కాంబో రిపీట్
కాంబినేషన్ రిపీట్ కావడం కామన్. అయితే హిట్ కాంబినేషన్రిపీట్ అయినప్పుడు ‘హిట్ రిపీట్’ కావడం ఖాయం అనే అంచనాలు ఉంటాయి. తాజాగా మూడు కాంబినేషన్ల మీద అలాంటి అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్–పూజా హెగ్డే, వెంకీ కుడుముల–రష్మికా మందన్నా, అట్లీ–నయనతార... ఈ ముగ్గురు డైరెక్టర్లు, ముగ్గురి హీరోయిన్ల కాంబో రిపీట్ అవుతోంది. ఆ విశేషాల్లోకి వెళదాం. త్రివిక్రమ్ – పూజా హెగ్డే తొలిసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా హెగ్డే కథానాయికగా నటించిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ (2018). ఈ సినిమాలో అందం, ఆత్మవిశ్వాసం, ప్రతిభ ఉన్న అరవిందపా త్ర చేశారు పూజా హెగ్డే. నటిగా తన టాలెంట్ నిరూపించుకోవడానికి ఈ క్యారెక్టర్ హెల్ప్ అయింది. దాంతోపా టు సినిమా కూడా ఘనవిజయం సాధించడంతో పూజా కెరీర్కి ప్లస్ అయింది. ఆ తర్వాత రెండేళ్లకు ‘అల.. వైకుంఠపురములో’ సినిమా ప్లాన్ చేసి, అందులోనూ పూజా హెగ్డేని తీసుకున్నారు త్రివిక్రమ్. ఈ సినిమాలో పూజా హెగ్డే చేసిన అమూల్య క్యారెక్టర్ ఆమెకు ప్లస్ అయింది. ‘అల..’తో మరో హిట్ సినిమా ఆమె ఖాతాలో పడింది. ఇప్పుడు మహేశ్బాబు హీరోగా త్రివిక్రమ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోనూ పూజానే హీరోయిన్. ఈ సినిమాలో పూజా హెగ్డేపా త్ర ఎలా ఉంటుంది? అనేది తెలియాల్సి ఉంది. వెంకీ కుడుముల – రష్మికా మందన్నా ఒక మీడియమ్ బడ్జెట్ సినిమాలో చేసిన సింపుల్, హోమ్లీ క్యారెక్టర్ ఆ తర్వాత పెద్ద బడ్జెట్ సినిమాలు, గ్లామరస్ రోల్స్ చేసే రేంజ్కి తీసుకెళుతుందని ‘ఛలో’ (2018) సినిమా ఒప్పుకున్నప్పుడు రష్మికా మందన్నా ఊహించి ఉండరు. కానీ ఆ మేజిక్ జరిగింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో చేసిన ‘ఛలో’ చిత్రం ద్వారా కన్నడ బ్యూటీ రష్మికా మందన్నా తెలుగుకి పరిచయం అయ్యారు. తొలి సినిమానే హిట్. ఆ తర్వాత పెద్ద సినిమాలు చేస్తూ వచ్చిన రష్మిక మళ్లీ రెండేళ్లకు వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ (2020) సినిమాలో మంచిపా త్ర చేశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్. ఇప్పుడు మళ్లీ వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక ఓ సినిమా చేస్తున్నారు. విశేషం ఏంటంటే.. ‘భీష్మ’లో నటించిన నితిన్ ఇందులో హీరో. ఆ విధంగా వెంకీ–నితిన్–రష్మికలకు ఇది రెండో సినిమా. ఈ హిట్ కాంబినేషన్ చేస్తున్న ఈ సినిమా ఇటీవలే ఆరంభమైంది. అట్లీ – నయనతార దర్శకుడిగా అట్లీ తొలి సినిమా ‘రాజా రాణి’ (2013) చేస్తున్నప్పటికి నయనతార స్టార్ హీరోయిన్. ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథని నమ్మి ఆమె ‘రాజా రాణి’ చేశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి చిత్రం తర్వాత అట్లీ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు. ఇక మళ్లీ నయనతారను ఆయన కథానాయికగా తీసుకున్న చిత్రం ‘బిగిల్’ (2019). ఈ సినిమా కూడా సూపర్ హిట్. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో నయనతార ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఈసారి ఈ డైరెక్టర్–హీరోయిన్ కాంబినేషన్లో రానున్నది హిందీ చిత్రం ‘జవాన్’. షారుక్ ఖాన్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ద్వారా నయనతార బాలీవుడ్కి కథానాయికగా పరిచయం అవుతున్నారు. సౌత్లో హిట్స్ ఇచ్చిన ఈ కాంబో నార్త్లోనూ ఆ ఫీట్ని రిపీట్ చేస్తుందని ఊహించవచ్చు. -
బన్నీ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. మెగా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్!
చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ట్రెండ్ నడుస్తోంది. దీంతో ఇండియా వైడ్ హీరోలందరూ తమ మార్కెట్ ను పెంచుకోవటానికి ట్రై చేస్తున్నారు. అందుకే తమ సినిమాల్లో ఇతర భాషల స్టార్ హీరోస్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోస్ సైతం తమ సినిమాల్లో సౌతిండియా యాక్టర్స్ ఉండేలా చూసుకుంటున్నారు. అంతేకాదు సౌతిండియా స్టార్ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి ఓ బంపరాఫర్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మిస్ చేసుకున్నాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ బాగా డిస్పాయింట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. సౌతిండియా డైరెక్టర్ అట్లీ షారుఖ్ ఖాన్తో ఓ బాలీవుడ్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా నయన తార నటిస్తుంది. విజయ్ సేతుపతి, రానా, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సౌతిండియా మార్కెట్ ను క్యాప్చర్ చేసేందుకు షారూఖ్... ఈ సినిమా తమిళ్ వెర్షన్ లో ఇళయ దళపతి విజయ్ ని...తెలుగు వెర్షన్ లో అల్లు అర్జున్ గెస్ట్ రోల్స్ లో కనిపించేలా ప్లాన్ చేశాడు. డైరెక్టర్ అట్లీ..బన్నీ ని అప్రోచ్ కూడా అయ్యాడు..ఈ మూవీ కథ కూడా నేరేట్ చేయడం జరిగింది. ముందు ఇంట్రెస్ట్ చూపించిన బన్నీ...ఇప్పుడు నటించటానికి నో చెప్పాడనే మాట టాలీవుడ్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంవలో పుష్ఫ 2 సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బన్నీ బిజీగా ఉన్నాడు. పుష్ప 2 కోసం గెడ్డం ఉన్న లుక్ ని మెయింటేన్ చేస్తున్నాడు. కానీ జవాన్ లో బన్నీ లుక్ మార్చాల్సి ఉంది. దీంతో జవాన్ లో తన క్యారెక్టర్ నచ్చిన కూడా...లుక్ ఛెంజ్ కావాల్సి ఉండటంతో డైరెక్టర్ అట్లీకి నో చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పుడు మేకర్స్ దృష్టి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై పడింది. ఆస్కార్ అవార్డ్స్ నుంచి చెర్రీ రాగానే అప్రోచ్ అయ్యేందుకు రెడీ ఉన్నారు. కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ కి....రామ్ చరణ్ కి మధ్య గుడ్ రిలేషన్ ఉంది. కాబట్టి జవాన్ మూవీలో గెస్ట్ రోల్ రిక్వెస్ట్ ను ..యాక్సెప్ట్ చేస్తాడనే ప్రచారం నెట్టింట బాగా సాగుతోంది. ఈ ఆఫర్ విషయంలో రామ్ చరణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్...శంకర్ దర్శకత్వంలో ఆర్సీ15లో నటిస్తున్నాడు. -
స్టార్ హీరో సినిమాకు బన్నీ నో చెప్పేశాడా?.. కారణం అదేనా..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అంతా ఇంతా కాదు. పుష్ప మూవీ భారీ హిట్ అవడంతో అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ పైనే పూర్తిగా దృష్టి సారించారు. అయితే గతంలో బన్నీ బాలీవుడ్ సినిమాలో నటించనున్నారని అప్పట్లో ఓ వార్త తెగ వైరలైంది. బాలీవుడ్తో పాటు హాలీవుడ్లోనూ హాట్ టాపిక్గా మారింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మూవీ జవాన్లో ప్రత్యేక పాత్రలో బన్నీ నటిస్తారని అందరూ భావించారు. అల్లు అర్జున్ నటిస్తే బాలీవుడ్తో పాటు సౌత్లోనూ అభిమానులకు దగ్గర కావొచ్చని అట్లీ ప్లాన్ చేశారు. కానీ తాజాగా దీనికి సంబంధించిన ఓ క్రేజీ టాక్ చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా బన్నీ జవాన్లో నటించేందుకు ఒప్పుకోలేదని ఓ వార్త వైరలవుతోంది. దీనిపై చిత్రబృందం నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. పుష్ప-2 షూటింగ్ బిజీ షెడ్యూల్ వల్లే జవాన్లో అతిథి పాత్రకు నో చెప్పారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బన్నీ పూర్తిస్థాయిలో పుష్ప-2 పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. చదవండి: జవాన్లో బన్నీ.. అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..! -
జవాన్లో బన్నీ.. అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..!
ఇటీవలే పఠాన్ మూవీ సక్సెస్ అందుకున్నారు బాలీవుడ్ బాద్షా. ఆ తర్వాత వెంటనే అట్లీ డైరెక్షన్లో జవాన్ షూటింగ్లో బిజీ అయిపోయారు. ఇటీవలే చెన్నై షెడ్యూల్లో పాల్గొన్న షారుక్ నయనతార ఇంటికి కూడా వెళ్లారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు చెందిన మరో క్రేజీ అప్ డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ హాట్ టాపిక్గా మారింది. జవాన్లో ఓ అతిథి పాత్ర కోసం బన్నీని చిత్రబృందం సంప్రదించినట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే అట్లీ ఈ సినిమాపై పెద్ద ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో కనిపిస్తే టాలీవుడ్లో సూపర్ హిట్గా నిలుస్తుందని ఆయన అభిప్రాయం. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు. దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా.. బన్నీ ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే వైజాగ్లో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా త్వరలోనే ఈ చిత్రబృందంతో కలవనుంది. -
స్టార్ హీరోకు ముద్దు పెట్టిన నయనతార..వీడియో వైరల్!
పఠాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. తన తదుపరి చిత్రం అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్ సరసన స్టార్ హీరోయిన్ నయనతార కనిపించనుంది. షూటింగ్ కోసం చెన్నై చేరుకున్న హీరో నయనతార ఇంటికి వెళ్లారు. అయితే షారుక్ ఖాన్ తిరిగి వెళ్తుండగా.. నయనతార అతనికి ముద్దు పెడుతూ వీడ్కోలు పలికింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ గుడ్ బై చెప్పేందుకు నయనతార ఇంటివద్ద అభిమానులు పెద్దఎత్తున గుమిగూడారు. ఇది చూసిన అభిమానులు సోషల్ మీడియా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. జవాన్ షూటింగ్లో పాల్గొన్న షారుక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం చివరి షెడ్యూల్లో నయనతార కూడా పాల్గొంటోంది. పఠాన్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఎస్ఆర్కే మళ్లీ షూటింగ్లో బిజీ అయిపోయారు. జవాన్లో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ స్థాయిలో తెరకెక్కిన జవాన్ జూన్ 2023లో థియేటర్లలో విడుదల కానుంది. The way Shah Rukh kissed Nayanthara goodbye @iamsrk you have my whole heart 😭❤️ #Nayanthara #Jawan pic.twitter.com/0zoBaBQGMP — Samina ✨ (@SRKsSamina_) February 11, 2023 1 more Exclusive Video: Welcome King 👑 @iamsrk in Namma #CHENNAI Nayanthara saying goodbye to SRK & King gave good bye kiss 🥹😭 Our #Chennai team reached to capture @iamsrk sir in our camera 📸 We clicked #ShahRukhKhan𓀠 while leaving at #Nayanthara’s apartment in #CHENNAI pic.twitter.com/7trHm571eW — ♡♔SRKCFC♔♡™ (@SRKCHENNAIFC) February 11, 2023 -
బిడ్డకు జన్మనిచ్చిన నటి.. తండ్రైన స్టార్ డైరెక్టర్
ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తండ్రయ్యారు. కొన్ని నెలల క్రితమే తన భార్య ప్రియా మోహన్ ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన భార్య, నటి ప్రియా మోహన్ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించారు అట్లీ. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అట్లీ ఇన్స్టాలో షేర్చేస్తూ..'అవును వారు చెప్పింది నిజమే. ప్రపంచంలో దీన్ని మించిన ఆనందం మరెక్కడా లేదు. మాకు మగబిడ్డ జన్మించారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా బిడ్డకు మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నా. ' అంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా.. కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న అట్లీ- ప్రియ దంపతులు 2014లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత బిడ్డ జన్మించడంతో వారి ఇంట్లో ఎక్కడా లేని సంతోషం నెలకొంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార, నాజ్రియా, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించిన రాజారాణి సినిమాతో స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నారు అట్లీ. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం షారుక్ ఖాన్తో 'జవాన్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. They were right 😍 There’s no feeling in the world like this ♥️ And just like tat our baby boy is here! A new exciting adventure of parenthood starts today! Grateful. Happy. Blessed. 🤗♥️🙏🏼 @priyaatlee pic.twitter.com/TzvoiFPzyc — atlee (@Atlee_dir) January 31, 2023 View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) -
పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత.. తండ్రి కాబోతున్న స్టార్ డైరెక్టర్
ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్య, నటి ప్రియ మోహన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. బేబీ బంప్తో ఉన్న ఫోటోలను షేర్చేస్తూ.. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రెగ్నెంట్. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి అంటూ ఇన్స్టాలో పోస్టును షేర్ చేసింది. ఇది చూసిన పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న అట్లీ- ప్రియలు 2014లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత అట్లీ దంపతులు పేరెంట్స్గా ప్రమోట్ కాబోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార, నాజ్రియా, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించిన రాజారాణి సినిమాతో స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నారు అట్లీ. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం షారుక్ ఖాన్తో 'జవాన్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) -
చిక్కుల్లో షారుక్ చిత్రం, డైరెక్టర్పై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు
‘కింగ్ ఖాన్’ జవాన్ మూవీ చిక్కుల్లో పడింది. ఈ మూవీ డైరెక్టర్ అట్లీపై ఓ కోలీవుడ్ నిర్మాత ఫిర్యాదు చేసినట్లు తమిళ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా బాలీవుడ్ బాద్షా షారుక్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో హిందీలో జవాన్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ను జరుపుకుంటోంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తోంది. దీంతో ఈ మూవీపై సౌత్తో పాటు బాలీవుడ్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ తనదని, డైరెక్టర్ అట్లీ దానిని కాపీ కొట్టాడని కోలీవుడ్ నిర్మాత మాణిక్యం నారాయణన్ ఆరోపించాడు. చదవండి: తండ్రి కాబోతున్న ప్రముఖ కమెడియన్, ‘అసలు పెళ్లెప్పుడు అయింది?’ అంతేకాదు డైరెక్టర్ అట్లీపై నిర్మాత మండలిలో ఫిర్యాదు చేసి జవాన్ టీంకి షాకిచ్చాడు. 2006లో తాము విజయ్ కాంత్ హీరోగా తెరకెక్కించిన ‘పేరరసు’ సినిమా కథనే అట్లీ ‘జవాన్’ పేరుతో హిందీలో నిర్మిస్తున్నాడంటూ ఆయన ఆరోపించాడు. అయితే ఈ సినిమాపై షారుక్ ఖాన్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. తమిళంలోనూ ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జవాన్ మూవీపై కాపీ రైట్ ఆరోపణలు రావడంతో బాద్షా ఫ్యాన్స్ ఆందోళన చేందుతున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు డైరెక్టర్ అట్లీ స్పందించకపోవడం గమనార్హం. మరి దీనిపై జవాన్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. చదవండి: సమంత వ్యాధి గురించి అప్పుడే తెలిసింది, అయినా తానే స్వయంగా..: యశోద నిర్మాత -
మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్
తమిళసినిమా: కోలీవుడ్ స్టార్ హీరోలు టాలీవుడ్పై మక్కువ చూపుతున్నారనడంలో ఎలాంటి సందేహమే లేదు. నటుడు విజయ్, ధనుష్, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలు ఇప్పటికే తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. కమల్హాసన్, రజనీకాంత్ వంటి సీనియర్ హీరోలు ఇప్పటికే పలు తెలుగు చిత్రాల్లో నటించారు. నటుడు కార్తీ కూడా ఆ మధ్య ఊపిరి అనే తెలుగు చిత్రంలో నాగార్జునతో కలిసి నటించారు. తాజాగా నటుడు సూర్య కూడా మహేష్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించనున్న భారీ బడ్జెట్ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించనున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నటుడు విజయ్ తెలుగులో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది తాజాగా జరుగుతున్న ప్రచారం. ఈయన ప్రస్తుతం వారీసు (తెలుగులో వారసుడు) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయం కాబోతున్నారు. దిల్రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్న ఇందులో నటి రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతికి తెరపైకి తీసుకురావడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. కాగా విజయ్ తదుపరి లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఆయన నటించే 67వ చిత్రం అవుతుంది. ఇప్పుడు విజయ్ 68వ చిత్రం గురించి ఒక ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఆయన తెలుగు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్కు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు ఆ సంస్థ నుంచి విజయ్ అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి అట్లీ దర్శకత్వం వహించనున్నట్లు, ఆయన ఇటీవల మైత్రీ మూవీస్ అధినేతలకు కథను కూడా వినిపించినట్లు సమాచారం. ఇప్పటికే విజయ్, అట్లీ కాంబినేషన్లో తెరీ, మెర్సల్ వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. అట్లీ ప్రస్తుతం షారుఖ్ఖాన్, నయనతార జంటగా హిందీలో జవాన్ చిత్రాన్ని పూర్తి చేశారు. తదుపరి విజయ్తో చేసే చిత్ర కథపై దృష్టి సారిస్తున్నట్లు కోడంబాక్కం టాక్. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. -
జవాన్కు బై బై
వెండితెర ‘జవాన్’కు రీసెంట్గా బై బై చెప్పారు హీరోయిన్ దీపికా పదుకొనె. షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘జవాన్’. విజయ్ సేతుపతి, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల చెన్నైలో ప్రారంభించిన ఈ చిత్రం కొత్త షెడ్యూల్లో షారుక్, దీపికా, విజయ్ సేతుపతిలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించింది యూనిట్. ప్రస్తుతం ‘జవాన్’ షూటింగ్ జరుగుతున్నప్పటికీ దీపిక పాత్ర చిత్రీకరణ పూర్తయింది. దీంతో యూనిట్కి బై బై చెప్పారామె. ఈ సినిమాలో షారుక్ ద్విపాత్రాభినయం చేశారనీ, అందులో ఒక షారుక్కి భార్య పాత్రలో దీపికా నటించార ని టాక్. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర ఎక్కువగా ఉండదట. ఓ అతిథి పాత్ర అని బాలీవుడ్ టాక్. కాగా ‘జవాన్’ కాకుండా ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, షారుక్ ఖాన్ ‘పఠాన్’, రణ్వీర్ సింగ్ ‘సర్కస్’, హృతిక్ రోషన్ ‘ఫైటర్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు దీపికా పదుకొనె. -
పెళ్లి అనంతరం తొలిసారి షూటింగ్ సెట్లో నయన్ సందడి!
కోలీవుడ్ లవ్బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్ ఇటీవల వైవాహిక బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నూతన దంపతులు దేవుడి ఆశీర్వాదం కోసం తిరుమల క్షేత్రానికి సైతం వెళ్లి వచ్చారు. అంతేకాదు, తమ పెళ్లి అందరికీ గుర్తుండిపోయేలా సుమారు లక్ష మందికి విందు భోజనాలు అందించారు. ఆనంతరం థాయ్లాండ్కు హానీమూన్ వెళ్లిన ఈ కొత్త దంపతులు నిన్న తిరిగి వచ్చారు. హానీమూన్ నుంచి వచ్చిరాగే నవ వధువు నయన్ షూటింగ్ సెట్లో అడుగు పెట్టిందట. నయన్ జావాన్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బాద్షా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం ముంబైలో షూటింగ్ను జరుపుకుంటోంది. ఇక హానీమూన్ నుంచి తిరిగొచ్చిన వెంటనే నయన్ షూటింగ్ కోసం ముంబైలో వాలిపోయిందట. ఈ రోజు జవాన్ షూటింగ్లో నయనతార పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా పెళ్లి అనంతరం తొలిసారి నయన్ షూటింగ్లో పాల్గొని సందడి చేసిందని తాజాగా వార్తలు వస్తున్నాయి. పెళ్లి అనంతరం షూటింగ్ కాస్తా బ్రేక్ ఇస్తుందని అంత అనుకున్నారు. అంతేకాదు ఇక సినిమాలకు కూడా బ్రేక్ ఇస్తుందని, ఒప్పుకున్న ప్రాజెక్ట్స్కు కూడా నయన్ కొత్త కండిషన్స్ పెడుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా ఆమె జవాన్ షూటింగ్లో పాల్గొనడం వార్తల్లో నిలిచింది. ఇక దీనితో పాటు నయన్ తెలుగులో చిరంజీవి సరసన గాడ్ ఫాదర్ మూవీ చేస్తోంది. -
షారుక్ యాక్షన్ మూవీ, జవాన్గా రానున్న హీరో
ఎన్నో ఆశలు పెట్టుకున్న జీరో (2018) మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ను లైన్లో పెట్టేందుకు చాలా సమయమే తీసుకున్నాడు షారుక్ ఖాన్. ఎందరో దర్శకుల దగ్గర కథలు విని ఇప్పుడిప్పుడే వరుసగా సినిమాలు పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షారుక్ సిద్దార్థ్ ఆనంద్తో పటాన్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు రాజ్కుమార్ హిరానీతో డంకీ మూవీ చేస్తున్నాడు. తాజాగా మరో కొత్త సినిమా అధికారికంగా ప్రకటించాడు హీరో. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో యాక్షన్ మూవీ చేస్తున్నట్లు వెల్లడించాడు. శుక్రవారం ఈ సినిమా టైటిల్ను వెల్లడిస్తూ మోషన్ పోస్టర్ వదిలాడు. ఇందులో గాయాలపాలైన షారుక్ ముఖానికి ఓ బట్ట కట్టుకుని చేతిలో గన్తో మాస్ లుక్లో కనిపించాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది జూన్ 2న రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. జవాన్ మూవీ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై గౌరీఖాన్ నిర్మించనున్నారు. కాగా షారుక్ మాధవన్ ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’, రణ్బీర్ కపూర్ ‘బ్రహ్మస్త్ర’ చిత్రాల్లో అతిథిగా వెండితెరపై కనిపించనున్నాడు. చదవండి: సందీప్ జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంది: మేజర్ సందీప్ తండ్రి 'విక్రమ్' మూవీపై నెటిజన్స్ టాక్ ఎలా ఉందంటే.. -
నయనతారతో షారుక్ ఖాన్ సినిమా, టైటిల్ ఫిక్స్!
మాస్ డైరెక్టర్గా అట్లీకి కోలీవుడ్లో మంచి పేరుంది. అట్లీ- విజయ్ కాంబినేషన్లో వచ్చిన తెరి, మెర్సిల్, బిగిల్ సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో మనందరికీ తెలిసిందే! తెలుగులోనూ ఈ సినిమాలు మంచి కలెక్షన్లు రాబట్టాయి. ఈ దర్శకుడు ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్తో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో నయనతార కథానాయికగా నటిస్తుండగా సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు జవాన్ అన్న టైటిల్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు జవాన్ టీజర్ కూడా రెడీ అయిందని, దీని నిడివి ఒక నిమిషం 34 సెకన్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో జవాన్ (#jawan), షారుక్ ఖాన్ (#ShahRuKhan) హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతున్నాయి. #Jawan Teaser - 1 mins 34 secs#ShahRukhKhan — Manobala Vijayabalan (@ManobalaV) June 1, 2022 #Jawan Teaser is FANTASTIC! 2023 belongs to King Khan #ShahRukhKhan ! He is back with Super Bang ! 🔥🔥🔥🔥🔥 — Umair Sandhu (@UmairSandu) June 1, 2022 Mentioned ages ago... @iamsrk 👑💞 3 releases.. 》#Pathaan with #SiddharthAnand in Jan 》#Jawan (tentative) with @Atlee_dir in Jun 》#Dunki with @RajkumarHirani in Dec .. all 3 being planned for 2023 !!! ❤️🔥💖❤️🔥💖❤️🔥💖❤️🔥💖❤️🔥💖❤️🔥💖❤️🔥💖❤️🔥💖❤️🔥💖❤️🔥💖 pic.twitter.com/ExsaaAL8QP — Girish Johar (@girishjohar) June 1, 2022 చదవండి: ‘ఛాతీలో భారంగా ఉందంటూ కుప్పకూలిన కేకే.. అలా చేసుంటే బతికేవారు’ మేనేజర్ను ఒంటరిగా కలిస్తే ఎక్కువ డబ్బులిస్తామన్నారు -
అల్లు అర్జున్కు పెరిగిన డిమాండ్.. 100 కోట్ల పారితోషికం ?
'పుష్ప: ది రైజ్' సినిమాతో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ మారిపోయింది. టాలీవుడ్తో పాటు కన్నడ, మలయాళంలో కూడా అల్లు అర్జున్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్పతో నార్త్లో కూడా బన్నీ పాపులారిటీ పెరిగిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న నటుడిగా మారాడు. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ 'ది రూల్' సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బన్నీ తర్వాతి ప్రాజెక్ట్స్ ఏంటా అని ఆసక్తి నెలకొంది. అయితే తన తర్వాతి చిత్రాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీతో ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ నిర్మించనుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నటించేందుకు అల్లు అర్జున్కు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇందుకోసం అట్లీతో కూడా చర్చలు జరుపుతున్నట్లు భోగట్టా. అయితే ఈ చర్చలు ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ లైకా ప్రొడక్షన్ బన్నీకి రూ. 100 కోట్ల పారితోషికం ఆఫర్ చేసి అల్లు అర్జున్ ఒప్పుకుంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నిలుస్తాడు. ప్రభాస్ కూడా తన సినిమాలకు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వినికిడి. ఇదంతా ఇలా ఉంటే అట్లీ ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతారలతో 'లయన్' సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నాడు. అలాగే అల్లు అర్జున్ 'పుష్ప: ది రూల్'తో పాటు వేణు శ్రీరామ్తో ఒక సినిమా, కొరటాల శివతో రివేంజ్ డ్రామా మూవీ చేస్తున్నట్లు సమాచారం. ఇంకా ఏఆర్ మురుగదాస్, ప్రశాంత్ నీల్, బోయపాటి శ్రీనులతో కూడా సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
షారుక్ ఖాన్.. ఇక చకచకా!
షారుక్ ఖాన్ ఇక స్పీడ్ పెంచనున్నారు. 2018లో విడుదలైన ‘జీరో’ చిత్రం తర్వాత ఆయన వెండితెరపై కనిపించలేదు. ‘జీరో’ ఆశించినంత సక్సెస్ను ఇవ్వలేదు. దీంతో కొంచెం గ్యాప్ తీసుకున్న షారుక్ ఆ తర్వాత ‘వార్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్, అట్లీ దర్శకత్వాల్లో సినిమాలు చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చి షూటింగ్స్ను స్టార్ట్ చేశారు. ఈ సినిమాల షూటింగ్స్ స్పీడ్గా జరుగుతున్న టైమ్లో తనయుడు అర్యన్ఖాన్ ఓ కేసులో అరెస్ట్ కావడంతో షారుక్ ఖాన్ ఆ పనుల్లో బిజీ అయిపోయారు. దీంతో ఆయన చేస్తున్న సినిమాలకు స్పీడ్ బ్రేకర్స్ పడ్డాయి. ఇటీవల ఆర్యన్ఖాన్ విడుదల కావడంతో తన సినిమాలపై షారుక్ మళ్లీ ఫోకస్ పెట్టారని బాలీవుడ్ సమాచారం. తన సినిమాల్లోని గెటప్స్కు తగ్గట్లుగా ఫిజిక్ను చేంజ్ చేసేందుకు జిమ్లో తీవ్ర కసరత్తులు చేస్తున్నారట ఆయన. ముందుగా ‘పఠాన్’ చిత్రాన్ని, ఆ తర్వాత అట్లీ సినిమాను పూర్తి చేసేసి, ఆ నెక్ట్స్ రాజ్కుమార్ హిరాణి దర్శకత్వం వహించే సినిమాకు షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారట. ‘పఠాన్’ షూటింగ్ తిరిగి ఈ నెల చివర్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ టాక్. (చదవండి: సోనూసూద్కు బీఎంసీ మరో షాక్, మాట నిలబెట్టుకోలేదంటూ హెచ్చరిక) -
‘ఆడవాళ్లు ఎప్పుడూ ఆడవాళ్లే’.. స్ట్రీట్ షాపింగ్ చేసిన నయనతార
దేవాలయాలను సందర్శించారు.. స్ట్రీట్ షాపింగ్ చేశారు... దసరా సందర్భంగా విఘ్నేష్ శివన్, నయనతార బిజీ బిజీగా గడిపారు. ఇదంతా తమిళ నటి, లేడి సూపర్ స్టార్ నయనతార గురించే. షారుక్ ఖాన్ సరసన నటిస్తున్న హిందీ చిత్రం షూటింగ్లో పాల్గొనడానికి ఇటీవల నయనతార ఇటీవలే పుణె వెళ్లారు. ఈ షూటింగ్కి కాస్త గ్యాప్ రావడంతో లవర్ విఘ్నేష్తో కలసి షిర్డీ వెళ్లారు. ఆ తర్వాత ముంబై చేరుకుని ముంబై దేవి, మహాలక్ష్మి, సిద్ధి వినాయక ఆలయాలను సందర్శించారు. అంతేకాదు.. నయన స్ట్రీట్ షాపింగ్ కూడా చేశారు. ఒక బ్యాగుని బేరం చేస్తూ కనిపించారామె. ఆమె ఇలా రోడ్ సైడ్ షాపింగ్ చేయడం ఓ హాట్ టాపిక్. పైగా ప్రచారంలో ఉన్న వీడియోలో నయన బేరమాడుతూ కనిపించారు. దాంతో ‘ఆడవాళ్లు ఎప్పుడూ ఆడవాళ్లే... ఇలా బేరమాడుతుంటే చూడ్డానికి క్యూట్గా ఉంది’ అని నెటిజన్లు పోస్ట్ చేశారు. చదవండి: నయనతారలో నచ్చేది అదే : విఘ్నేష్ శివన్ View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
షారుక్ ఖాన్ సినిమాలో విజయ్?
Thalapathy Vijay to Share Screen Space with Shah Rukh Khan: షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ‘జవాన్’ (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్లు నయనతార, ప్రియమణి, సాన్యా మల్హోత్రా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పుణేలో ఆరంభమైంది. ఇదిలా ఉంటే.. తమిళ హీరో విజయ్ ఈ సినిమాలో అతిథి పాత్ర చేయనున్నారట. గతంలో తెలుగు ‘విక్రమార్కుడు’ హిందీ రీమేక్ ‘రౌడీ రాథోడ్’ (2012)లో విజయ్ గెస్ట్గా కనిపించారు. ఇప్పుడు ‘జవాన్’ కమిట్ అయితే తొమ్మిదేళ్ల తర్వాత హిందీలో విజయ్ కనిపించే సినిమా ఇదే అవుతుంది. చదవండి : ‘సర్కారి వారి పాట’ సెట్లో ప్రత్యక్షమైన ఎంపీ శశిథరూర్ రేపు పవన్- హరీశ్శంకర్ మూవీ నుంచి అప్డేట్ -
నయనతార బాలీవుడ్ ఎంట్రీ..హీరో ఎవరంటే..
ప్రస్తుతం ‘పఠాన్’ సినిమాతో బిజీగా ఉన్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ త్వరలో దక్షిణాది దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అట్లీ చెప్పిన ఫైనల్ కథకు షారుక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో సినిమాలో ఇతర ప్రధాన తారాగణం ఎంపికపై ఫోకస్ పెట్టారని టాక్. ఈ ప్రక్రియలో భాగంగానే తన దర్శకత్వంలో వచ్చిన ‘రాజా– రాణి’ (2013), ‘బిగిల్’ (2019) చిత్రాల్లో హీరోయిన్గా నటించిన సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార పేరును పరిశీలిస్తున్నారట అట్లీ. ఆల్రెడీ నయనతారతో సంప్రదింపులు కూడా మొదలుపెట్టారనే టాక్ వినిపిస్తోంది. అయితే పదిహేనేళ్లుగా సౌత్లో అగ్ర కథనాయికగా రాణిస్తున్న నయనతార ఇంతవరకూ హిందీ సినిమా చేయలేదు. మరి.. షారుక్తో నయనతార జోడీ కడతారా? హిందీ సినిమాకు నయనతార సైన్ చేస్తారా? వేచి చూడాల్సిందే. చదవండి: నయనతారలో నచ్చేది అదే : విఘ్నేష్ శివన్ -
ఆ వార్త నిజమేనా?
కొన్ని నెలల క్రితం చెన్నై కోడంబాక్కమ్లో హల్చల్ చేసిన ఓ వార్త నిజం అయ్యేట్లు ఉంది. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో హిందీ నటుడు షారుక్ ఖాన్ హీరోగా ఓ సినిమా రూపొందనుందన్నది ఆ వార్త సారాంశం. ఇక అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం అట. ఈ సినిమాను పట్టాలెక్కించడానికి అన్ని సన్నాహాలు పూర్తయ్యాయని తెలిసింది. ఏప్రిల్ నుంచి ఈ చిత్రం షూటింగ్ని మొదలుపెట్టాలనుకుంటున్నారట. 2018లో చేసిన ‘జీరో’ తర్వాత షారుక్ ఇప్పటివరకూ సినిమా కమిట్ కాలేదు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా ఫ్లాప్తో షారుక్ కథల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నారు. అట్లీ చెప్పిన కథ బాగా నచ్చిందట. తమిళంలో తేరి, మెర్సల్, బిగిల్ వంటి బ్లాక్బస్టర్స్ ఇచ్చి, మంచి మాస్ డైరెక్టర్ అనిపించుకున్న అట్లీకి హిందీలో ఇది తొలి సినిమా. -
విజిల్ మూవీ రివ్యూ
టైటిల్: విజిల్ (తమిళంలో బిగిల్) జానర్: మాస్ యాక్షన్-స్పోర్ట్స్ డ్రామా నటీనటులు : విజయ్, నయనతార, జాకీష్రాఫ్, కదీర్, యోగిబాబు సంగీతం : ఏఆర్ రహమాన్ దర్శకత్వం : అట్లీ నిర్మాతలు: కల్పాతి ఎస్ అఘోరం, కల్పాతి ఎస్ గణేశ్, కల్పాతి ఎస్ సురేశ్ వరుస విజయాలతో తిరుగులేని ఫామ్లో ఉన్న తమిళ స్టార్ హీరో విజయ్. మెర్శల్, సర్కార్ వంటి భారీ సూపర్హిట్స్ ఊపుమీదున్న ఆయన.. మరోసారి దర్శకుడు అట్లీతో జతకట్టి ‘విజిల్’ అనే స్పోర్ట్స్ డ్రామాతో తెరమీదకు వచ్చారు. ఇంతకుమునుపు విజయ్-అట్లీ కాంబినేషన్లో తేరి, మెర్శల్ వంటి బాక్ల్బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా వస్తుండటం, ఈ సినిమాలో విజయ్ డ్యుయల్ రోల్ చేస్తుండటంతో.. హ్యాట్రిక్ సూపర్హిట్ ఖాయమని ధీమాతో ఉన్నారు ఫ్యాన్స్. విజయ్ సరసన నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ‘విజిల్’ ఎలా ఉంది? ప్రేక్షకులతో ఈల వేయించిందా? ఓసారి తెలుసుకుందాం పదండి. కథ: మైఖేల్ రాజప్ప (విజయ్) స్థానికంగా మంచి రౌడీ. తన మురికివాడలోని వాళ్లను ప్రత్యర్థుల నుంచి కాపాడుకుంటూ ఉంటాడు. స్థానికంగా మంత్రి కాలేజీ మూయించాలని చూస్తే దానిని అడ్డుకుంటాడు. ప్రత్యర్థులు చెడు చేయకుండా అడ్డుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో అమ్మాయిల ఫుట్బాల్ టీమ్ కోచ్ అయిన మైఖేల్ స్నేహితుడు కిరణ్ తన టీమ్ను తీసుకొని అతను ఉండే చోటుకి వస్తాడు. కిరణ్తో కలిసి కారులో వెళుతుండగా ప్రత్యర్థులు మైఖేల్పై అటాక్ చేస్తారు. ఈ దాడిలో మైఖేల్ రౌడీలను చితగ్గొట్టినప్పటికీ.. అతని విరోధి మాత్రం కిరణ్ను గొంతులో కత్తితో పొడుస్తాడు. దీంతో చికిత్స పొందుతూ.. ఆస్పత్రి బెడ్కు పరిమితమైన కిరణ్.. తనస్థానంలో మైఖేల్ను అమ్మాయిల టీమ్కు కోచ్గా వెళ్లమని కోరుతాడు. ప్లాష్బ్యాక్లో బిగిల్గా పేరొందిన మైఖేల్ గొప్ప ఫుట్బాల్ ఆటగాడు. అతని తండ్రి రాజప్ప (విజయ్) స్థానికంగా పేరుమోసిన రౌడీ. అయినా తన కొడుకు కత్తి పట్టకుండా ఆటలతో పైకి రావాలని కోరుకుంటాడు. ఈక్రమంలో అతను, అతని స్నేహితులు కలిసి నేషనల్ గేమ్స్ ఆడేందుకు వెళ్తుండగా రైల్వే స్టేషన్లో ప్రత్యర్థులు అటాక్ చేసి.. మైఖేల్ కళ్లముందే రాజప్పను చంపేస్తారు. దీంతో జాతీయ కప్ కొట్టాలన్న తన తండ్రి కల రైల్వే స్టేషన్లో ఆగిపోతుంది. పుట్బాల్ ప్లేయర్ కావాలనుకున్న మైఖేల్ తండ్రి స్థానంలోకి రౌడీగా మారిపోతాడు. ఈ క్రమంలో కిరణ్ కోరిక మేరకు అమ్మాయిల జట్టుకు కోచ్గా మారిన మైఖేల్.. బిగిల్ కప్పు ముఖ్యంరా అన్న తండ్రి కలను నెరవేర్చాడా? కోచ్గా ఎలా నిలదొక్కుకున్నాడు? నేషనల్ గేమ్స్లో అతనికి ఎదురైన అవాంతరాలు ఏమిటి? అమ్మాయిలు సమాజంలోని ప్రతికూలతలను ఎదుర్కొని ఎలా పోరాడారు? అన్నది తర్వాతి కథ. విశ్లేషణ: స్పోర్ట్స్ డ్రామాకు బలమైన భావోద్వేగాలు ముఖ్యం. తెరమీద కనిపిస్తున్న ఆట నిజంగా జరుగుతున్నట్టే అనిపిస్తూ.. అందులో ప్రేక్షకుడిని మమేకం చేయాలి. అప్పుడే తెరమీద భావోద్వేగాలు పండుతాయి. షారుఖ్ ఖాన్ ‘చక్ దే ఇండియా’, సల్మాన్ ఖాన్ ’సుల్తాన్’,, ఆమీర్ ఖాన్ ‘దంగల్’, మాధవన్ ‘గురు’ సినిమాలు ఈవిధంగా తెరమీద భావోద్వేగాలను అద్భుతంగా పండించి.. ప్రేక్షకులతో శెభాష్ అనిపించుకున్నాయి. బిగిల్ పేరుకు స్పోర్ట్స్ డ్రామా అయినా అందులో ఫక్తు మాస్ యాక్షన్ సీన్లు బోలెడు ఉన్నాయి. విజయ్లాంటి స్టార్ హీరోతో పూర్తిస్థాయి స్పోర్ట్స్ డ్రామా చేయడం బాగుండదనుకున్నాడేమో డైరెక్టర్.. కథ కంటే కూడా ప్రతి 20, 30 నిమిషాలకు ఒక ఫైట్ సీన్..హీరోను ఎలివేట్ చేసే సీన్లతో విసిగించాడు. అంతేకాకుండా సినిమా నిడిమి చాలా ఎక్కువైపోవడంతో కథ మీద దర్శకుడికి పట్టు తప్పినట్టు కనిపిస్తుంది. చాలా సీన్లు సాగదీతతో ఉండి.. తమిళ వాసనలతో బోర్ కొట్టిస్తాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ భరించడం చాలా కష్టమే. ఫస్టాఫ్లో తండ్రీ-కొడుకుగా డ్యుయల్ రోల్స్లో విజయ్ పండించిన వేరియేషన్స్, వారి మధ్య అనుబంధం కొంచెం ఆకట్టుకుంటుంది. ఇక, ఫస్టాఫ్లో కనిపించే తండ్రి పాత్రకు పూర్తిస్థాయి న్యాయం జరిగినట్టు కనిపించదు. రాజప్ప నేపథ్యమేమిటో పూర్తిగా చూపించకుండానే దర్శకుడు అర్ధంతరంగా ముగించేసిన భావన కలుగుతుంది. ఇక, ఫస్టాఫ్లో సాఫ్ట్రోల్లో కనిపించిన ఫుట్బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు జేకే శర్మ (జాకీష్రాఫ్) సెకండాఫ్లో విలన్గా అవతారమెత్తుతాడు. ప్లాష్బ్యాక్లో రాజప్ప తనను చితకబాదినందుకు.. ఇప్పుడు కోచ్ మైఖేల్, అతని టీమ్ను ఓడించి.. ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు. ఇలా మైదానంలో క్రీడాపరమైన ఉద్వేగాల కంటే.. హీరో-విలన్ మధ్య పోటాపోటీ సీన్లు.. కేవలం హీరోయిజాన్ని ఎలివేట్ చేసినందుకు పెట్టినట్టు అనిపిస్తుంది. అయితే, మన దేశంలో క్రీడల్లోకి వచ్చేందుకు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దర్శకుడు అట్లీ కొంత నిజాయితీగా చూపించడం ఆకట్టుకుంటుంది. తనకు ప్రేమ కన్నా ఫుట్బాలే ముఖ్యమన్నందుకు ఓ ఉన్మాది చేతిలో యాసిడ్ దాడికి గురైన అమ్మాయి.. కోచ్ ఇచ్చిన మనోస్థైర్యంతో తిరిగి జట్టులోకి వచ్చి రాణించడం, పెళ్లయి.. సంప్రదాయ కుటంబంలో గృహిణిగా సెటిలైన యువతి తిరిగి జట్టులోకి రావడం వంటి చక్కని అంశాలు సినిమాలో ఆకట్టుకుంటాయి. ఇక, ఫుట్బాల్ గేమ్లోనూ భావోద్వేగాల కంటే.. ప్రేక్షకులను కట్టిపడేసి విన్యాసాలను చూపించడానికే ప్రాధాన్యమిచ్చినట్టు కనిపిస్తోంది. ఏఆర్ రహమాన్ సంగీతం అంతగా ఆకట్టుకోకపోయినా.. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన అస్సెట్గా నిలిచింది. ముఖ్యంగా శివంగివే పాట స్ఫూర్తిదాయకంగా ఉంది. జీకే విష్ణు నీట్ సినిమాటోగ్రఫి, ఆర్ట్ డైరెక్టర్ ముథురాజు పనితనం సినిమాలో కనిపిస్తోంది. చిత్రస్థాయికి తగ్గట్టు నిర్మాణ విలువలు ఉన్నాయి. సినిమాకు బాగా కత్తెరవేసి.. ట్రిమ్ చేసి.. కథను క్రిస్ప్గా తెరకెక్కించి ఉంటే బాగుండేది. ఎప్పటిలాగే విజయ్ తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోగా.. అతన్ని ప్రేమించే ఏంజిల్ ఆశ్విరాదంగా ఓ మోస్తరు పాత్రకు నయనతార పరిమితమైంది. బలాలు విజయ్ యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిర్మాణ విలువలు బలహీనతలు ఫస్టాఫ్ సాగదీత సీన్లు సినిమా నిడివి రోటిన్ హీరోయిజం, ఫైట్లు - శ్రీకాంత్ కాంటేకర్ -
‘విజిల్’ ప్రీ రిలీజ్ వేడుక
-
మహిళలకు విజిల్ అంకితం
‘‘తమిళంలో ‘బిగిల్’ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో తెలుగులో ‘విజిల్’కి కూడా అంతే క్రేజ్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. ఇదేదో తమిళ సినిమా అనో.. దక్షిణాది సినిమా అనో చెప్పడం కంటే ఇండియన్ సినిమా అని చెప్పడానికి సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో కంటెంటే కింగ్’’ అని నిర్మాత మహేష్ కోనేరు అన్నారు. ‘పోలీస్, అదిరింది’ వంటి చిత్రాల తర్వాత హీరో విజయ్–డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘బిగిల్’. నయనతార హీరోయిన్. ఏజీయస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కల్పాతి ఎస్.అఘోరాం, కల్పాతి ఎస్.గణేశ్, కల్పాతి ఎస్.సురేశ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ‘విజిల్’ పేరుతో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మహేశ్ కోనేరు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రేపు ఈ సినిమా విడుదలవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘అట్లీగారి సినిమాలకు పెద్ద ఫ్యాన్ని. విజయ్గారితో ఆయన చేసిన సినిమాలకు తెలుగులో పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. ‘విజిల్’ బెస్ట్ మూవీగా నిలుస్తుంది’’ అన్నారు. అట్లీ మాట్లాడుతూ– ‘‘నేను తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలని చాలా కాలంగా కల కంటున్నాను.. త్వరలోనే ఆ కల నేరవేరనుంది. ఎన్టీఆర్గారు మంచి వ్యక్తి. నా ప్రతి సినిమాకు ఫోన్ చేసి అభినందిస్తుంటారు. ‘విజిల్’ కేవలం ఫుట్బాల్ ఆట నేపథ్యంలోనే ఉండదు.. చాలా భావోద్వేగాలుంటాయి. స్త్రీ సాధికారతను తెలియజే సే ఈ సినిమాను మహిళలకు అంకితమిస్తున్నా’’ అన్నారు. -
విజయ్ ‘బిగిల్’ ట్రైలర్ వచ్చేసింది!
-
విజయ్ ‘బిగిల్’ ట్రైలర్ వచ్చేసింది!
తమిళ బడా స్టార్ విజయ్ తాజా సినిమా ‘బిగిల్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ‘బిగిల్’ సినిమా దీపావళి సందర్భంగా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ ఫుట్బాల్ కోచ్గా కనిపిస్తుండగా ఆయన సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్.. ఈ సినిమాలో ఫుట్బాల్ ప్లేయర్గా, కోచ్గా విభిన్నమైన షేడ్స్తో విజయ్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. పూర్తి మాస్ యాక్షన్ థ్రిలర్గా విజయ్ ఫ్యాన్స్కు పండుగ బొనాంజాలా సినిమా ట్రైలర్ ఉంది. అట్లీ దర్శకత్వంలో బిగిల్ తెరకెక్కింది. విజయ్ - అట్లీ కాంబినేషన్లో గతంలో వచ్చిన తెరీ, మెర్సల్ సినిమాలు భారీ విజయం సాధించాయి. -
‘మెర్శల్’ డైరెక్షన్లో ఎన్టీఆర్ కొత్త సినిమా!
చెన్నై : కోలీవుడ్లో అపజయమెరుగని దర్శకుడిగా రాణిస్తున్న యువ దర్శకుడు అట్లీ. రాజారాణి చిత్రంలో దర్శకుడిగా తన పయనాన్ని ప్రారంభించిన ఈయన దర్శకుడు శంకర్ శిష్యుడన్న విషయం తెలిసిందే. తొలి చిత్రంతో శభాష్ అనిపించుకున్న అట్లీ ఆ తరువాత నటుడు విజయ్తో వరుసగా తెరి, మెర్శల్, తాజాగా బిగిల్ చిత్రాలను చేశారు. తెరి హిట్ చిత్రం అయితే మెర్శల్ చిత్రం సూపర్హిట్ అయ్యింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బిగిల్ చిత్రం అంతకు మించి హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రం దీపావళికి తెరపైకి రానుంది. ఇకపోతే దర్శకుడు అట్లీ ఒక చిత్రం పూర్తి చేయగానే నెక్ట్సేంటి? అనే ఆసక్తి రేకెత్తుతుంటుంది. అలా మెర్శల్ తరువాత అట్లీ టాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వనున్నాడు. అక్కడ ఒక స్టార్ హీరోతో చిత్రం చేయనున్నారనే ప్రచారం సాగింది. అయితే అది ప్రచారానికే పరిమితమైంది. ఇప్పుడు బిగిల్ చిత్రం పూర్తి కావచ్చింది. ఇప్పుడు నెక్ట్సేంటి? అన్న ప్రశ్నకు మళ్లీ తెలుగులో చిత్రం చేయనున్నాడు అనే ప్రచారం మొదలైంది. అవును ఈయన టాలీవుడ్ యంగ్టైగర్ ఎన్టీఆర్ హీరోగా చిత్రం చేయనున్నారనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. అయితే జూనియర్ ఎన్టీఆర్కు తమిళంలో నటించాలన్న ఆశ చాలా కాలంగా ఉంది. త్వరలో అది నెరవేరనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాంటిది తాజాగా ఆయనతో దర్శకుడు అట్లీ చిత్రం చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్చరణ్తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత అట్లీ దర్శకత్వంలో నటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అట్లీ బిగిల్ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం విడుదల తరువాతనే ఆయన తన తాజా చిత్రం వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. -
నెక్ట్స్ సూపర్స్టార్ నువ్వే!
‘ఎంకే త్యాగరాజ భాగవతార్, ఎంజీ రామచంద్రన్, రజనీకాంత్ తర్వాత సూపర్స్టార్గా నీరాజనాలు అందుకునే వ్యక్తివి నువ్వే. అయ్యో అసలు నేను నీ తల్లిననే విషయాన్నే మర్చిపోయాను. ఎందుకంటే నీకున్న లక్షలాది మంది అభిమానుల్లో ఒకదాన్నైన నేను కూడా ఓ విజిల్ వేసి నిన్ను ప్రశంసిస్తాను కదా’ అంటూ దర్శకురాలు, నేపథ్య గాయని, నిర్మాత శోభా చంద్రశేఖర్ తన తనయుడు ఇళయ దళపతి విజయ్కు లేఖ రాశారు. విజయ్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ లేఖ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా శోభా చంద్రశేఖర్ బహుముఖ ప్రఙ్ఞాశాలిగా పేరొందారు. క్లాసికల్ సింగర్గా గుర్తింపు పొందిన ఆమె నంబర్గల్, ఇన్నిసాయి మలాయ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘బిగిల్’.. తెరి, మెర్సల్ వంటి హిట్ సినిమాల తర్వాత యువ డైరెక్టర్ అట్లీ- విజయ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో బిగిల్పై భారీ అంచనాలే నెలకొన్నాయి. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో ఇళయదళపతి.. ‘బిగిల్’ యూనిట్ సభ్యులకు 400 ఉంగరాలు ఇచ్చి సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. #ShobaChandrasekhar Abut #ThalapathyVijay 😍😍 pic.twitter.com/vpnkEqsegc — Jegan ebi (@jeganebenezar1) August 27, 2019 -
కేరింగ్
విజయ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బిగిల్’ (విజిల్ అని అర్థం). ఫీమేల్ ఫుట్బాల్ ప్లేయర్స్ కథాంశంతో అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడీ చిత్రబృందం విజయ్ అన్నకు విజిల్ కొట్టు అంటున్నారు. విజిల్ కొట్టే పని ఏం చేశారు? అంటే.. ఈ సినిమా పూర్తి కావస్తున్న సందర్భంగా పని చేసిన చిత్రబృందానికి గోల్డ్ రింగ్స్ను బహుమతిగా అందించారట. ప్రతి సినిమా పూర్తయ్యే సందర్భంలో తన టీమ్లో అందరికీ బహుమతులు అందించడం విజయ్ అలవాటు. అలా ఈసారి బిగిల్ టీమ్ అందరికీ ‘బిగిల్’ అని రాసి ఉన్న ఉంగరాలను అందించారు విజయ్. కొందరికి ఆటోగ్రాఫ్ చేసిన ఫుట్బాల్ను కూడా బహూకరించారు. తమ హీరో తమ పట్ల చూపించిన కే–రింగ్ చూసి విజయ్ని ‘గోల్డెన్ స్టార్’ అంటున్నారు ‘బిగిల్’ యూనిట్. -
400 మందికి గోల్డ్ రింగ్స్ ఇచ్చిన హీరో!
తమిళ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘బిగిల్’. తెరి, మెర్సల్ వంటి హిట్ సినిమాల తర్వాత యువ డైరెక్టర్ అట్లీ- విజయ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో బిగిల్పై భారీ అంచనాలే నెలకొన్నాయి. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇళయదళపతి.. ‘బిగిల్’ యూనిట్ సభ్యులను సర్ప్రైజ్ చేశాడు. సినిమా కోసం వివిధ శాఖల్లో పనిచేసిన దాదాపు 400 మందికి బంగారు ఉంగరాలు బహుమతిగా ఇచ్చాడు. ‘బిగిల్’ నిర్మాణ సంస్థకు చెందిన అర్చనా కలపతి సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ‘ బిగిల్ కోసం పనిచేస్తున్న 400 మంది సభ్యులకు ఈ సినిమాను చాలా ప్రత్యేకంగా చేశారు దళపతి. ఆయన మాపై కురిపించిన ఆప్యాయత ఈరోజును ఎంతో ప్రత్యేకంగా నిలిపింది’ అని ఆమె ట్వీట్ చేశారు. ఇక బిగిల్లో నటిస్తున్న వర్ష బొల్లమ్మ కూడా..విజయ్ ఇచ్చిన రింగ్ చూపుతూ ఫొటో దిగి ట్విటర్లో షేర్ చేశారు. కాగా బిగిల్ అంటే విజిల్ అని అర్థం. ఇంతవరకు విడుదల చేసిన పోస్టర్లలో విజయ్ లుక్స్ చూస్తుంటే అతడి క్యారెక్టర్లో మూడు నాలుగు షేడ్స్ ఉంటాయని అర్థం అవుతోంది. వాటి ప్రకారం విజయ్ ఒక గెటప్లో యంగ్ ఫుట్బాల్ ప్లేయర్గా కనిపిస్తుండగా, ఇంకో లుక్లో కత్తి పట్టుకుని మాస్ లుక్లో కనిపించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమా దీపావళికి విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. When #thalapathy Vijay gives you the best gift EVER!!!!!!! #Bigil #Thalapathy63 pic.twitter.com/73WeS6Wdge — Varsha Bollamma (@VarshaBollamma) August 13, 2019 -
కియారా కమిట్ అవుతుందా?
సినిమా: కోలీవుడ్ ఆఫర్ల కోసం బాలీవుడ్ బ్యూటీస్ సహా పలు భాషలకు చెందిన వారు ఆసక్తి చూపుతారన్నది వాస్తవం. ఇప్పటికే పలువురు బాలీవుడ్ భామలు కోలీవుడ్లో ఒక వెలుగు వెలిగారు. తాజాగా నటి కియారాను కోలీవుడ్కు దిగుమతి చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ అమ్మడు ఇప్పటికే టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి భరత్ అనే నేను చిత్రంతో సక్సెస్ను తన ఖాతాలో వేసుకుంది. కాగా తాజాగా తమిళంలో విజయ్ సరసన నటింపజేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో బిగిల్ చిత్రంలో నటిస్తున్నారు. ఏజీఎస్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో నటి నయనతార నాయకిగా నటిస్తోంది. చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించారు. విజయ్ హీరోగా తెరకెక్కించనున్న చిత్ర ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. పీవీ.ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రాన్ని అక్టోబర్లో ప్రారంభించి వచ్చే ఏడాది జనవరి కల్లా పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. కాగా ఇందులో విజయ్తో రొమాన్స్ చేసే నాయకి ఎవరన్న విషయం గురించి పలు రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. నటి త్రిష, క్రేజీ నటి రష్మిక పేర్లు కూడా ప్రచారంలో నానుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కొత్తగా బాలీవుడ్ బ్యూటీ కియారా పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె కాల్షీట్స్ సెట్ అయితే, మరే చిత్రంలోనూ నటించకపోతే విజయ్తో రొమాన్స్ చేయడానికి కమిట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. -
స్క్రీన్పై తొలిసారి
ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సిల్వర్ స్క్రీన్ వెనక చాలా ఏళ్లుగా సందడి చేస్తూనే ఉంది. ఆయన మ్యూజిక్ని ఇన్నాళ్లూ వింటూనే ఉన్నాం. త్వరలోనే ఆయన్ను సిల్వర్ స్కీన్ మీద కూడా చూడబోతున్నాం. అయితే పూర్తి స్థాయి పాత్రలో కాదు అతిథి పాత్రలో అని తెలిసింది. అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘బిగిల్’. అంటే విజిల్ అని అర్థం. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో మొదటి పాట ‘సింగపెన్నే..’ రిలీజై మంచి విజయం సాధించింది. ఈ పాటలో విజయ్తో కలసి రెహమాన్ స్క్రీన్ మీద కనిపిస్తారట. మ్యూజిక్ ఆల్బమ్స్లో ఇదివరకు రెహమాన్ చాలాసార్లు నటించారు. కానీ సినిమాలో కనిపించడం ఇదే తొలిసారి కావడం విశేషం. -
మిస్ ఫిజియో
ఫిజియోథెరపీ క్లాసులకు రెగ్యులర్గా వెళ్తున్నారు నయనతార. షూటింగ్లో స్టంట్స్ చేస్తూ గాయపడి ఫిజియో వద్దకు వెళ్తున్నారని ఊహించేసుకోవద్దు. ఫిజియో క్లాసులకు వెళ్లేది పేషెంట్గా కాదట.. స్టూడెంట్గా అని సమాచారం. నయనతార హీరోయిన్గా విజయ్తో కలసి నటిస్తున్న చిత్రం ‘బిగిల్’. (విజిల్ అని అర్థం) అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయన ఫిజియోథెరపీ స్టూడెంట్లా కనిపిస్తారట. విజయ్ ఫుట్బాల్ కోచ్లా నటిస్తున్నారు. స్పోర్ట్స్ ఆడే సమయంలో ఆటగాళ్లతోనే ఫిజియోథెరపిస్ట్లు ఉండే సంగతి తెలిసింది. ఈ విధంగా మిస్టర్ కోచ్కి, మిస్ ఫిజియోకి లవ్ ట్రాక్ని దర్శకుడు కలిపారని ఊహించవచ్చు. ఈ చిత్రాన్ని దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
బిగిల్ కొట్టు
ఫుట్బాల్ గ్రౌండ్లో ప్రత్యర్థులను హడలెత్తించేలా ఆడారు తమిళ నటుడు విజయ్. ఈ ఆట ఈ ఏడాది దీపావళికి వెండితెరపైకి వస్తుంది. అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందుతున్న సినిమాకు ‘బిగిల్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. అలాగే శనివారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ను విడుదల చేశారు. ఈ లుక్స్ చూస్తుంటే విజయ్ క్యారెక్టర్లో మూడు నాలుగు షేడ్స్ ఉంటాయని అర్థం అవుతోంది. ఇక్కడున్న ఫస్ట్ లుక్ పోస్టర్లో ఒక గెటప్లో యంగ్ ఫుట్బాల్ ప్లేయర్గా కనిపిస్తున్న విజయ్, ఇంకో లుక్లో కత్తి పట్టుకుని మాస్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి సినిమా విడుదల కానుంది. అన్నట్లు.. ‘బిగిల్’ అంటే విజిల్ అని అర్థం. -
విజయ్ బర్త్డే స్పెషల్.. ఫ్యాన్స్కు ట్రీట్
తమిళసినిమా: నటుడు విజయ్ నటిస్తున్న తాజా చిత్రం గురించి ఇప్పటికే చాలా వివరాలు వెలుగుచూశాయి. ఇది ఆయన 63వ చిత్రం అనీ, లేడీ సూపర్స్టార్ నయనతార కథానాయకిగా నటిస్తోందని, ఏజీఎస్ సంస్థ నిర్మిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అని, ఆస్కార్ అవార్డుగ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారని, దర్శకుడు అట్లీ విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్న మూడవ చిత్రం ఇదని లాంటి వివరాలు తెలిసినవే. కాగా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు గానీ, విడుదల తేదీని మాత్రం ఫిక్స్ చేశారు. అవును చిత్రాన్ని దీపావళికి తెరపైకి తీసుకురానున్నట్లు వర్గాలు ఇప్పటికే వెల్లడించారు. కాగా కొత్త విషయాలేమిటంటే ఇందలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్నది, అది తండ్రి కొడుకులుగా తొలిసారిగా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు తాజా సమాచారం. మరో విషయం ఏమిటంటే విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర టైటిల్ను, ఫస్ట్లుక్ పోస్టర్ను ఈ నెల 22న విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇకపోతే బాలీవుడ్ స్టార్ నటుడు జాకీష్రాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇందులో నటుడు కదిర్, యోగిబాబు, డేనియల్ బాలాజి, రెబామోనికాజాన్, ఇదుజా, వర్ష బొల్లమ్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం కాబట్టి అంచనాలు భారీ స్టాయిలోనే నెలకొన్నాయి. పైగా సర్కార్ వంటి సంచలన చిత్రం తరువాత తెరపైకి రానున్న చిత్రం కావడంతో సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇక విజయ్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో హ్యాట్రిక్ గ్యారెంటీ అని చిత్ర యూనిట్ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అగ్రనటి నయనతార అదనపు ఆకర్షణగా ఉండనే ఉంది. అదే విధంగా చాలా కాలం తరువాత విజయ్ ద్విపాత్రాభినయం చేయడంతో ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
ఆటోడ్రైవర్లకు భోజనాలు పెట్టించిన హీరో!
తమిళనాట హీరోలకు, అభిమానులకు మధ్య ఉండే సంబంధం ఎప్పడూ ప్రత్యేకంగానే ఉంటుంది. తమ అభిమానులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ.. వారికి ఆతిథ్యమిస్తూ ఉంటారు హీరోలు. రజినీ ఏడాదికొకసారి అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమవుతుంటారు. ఇళయ దళపతి విజయ్ ఏటా మేడేన కొంతమంది కార్మికులకు భోజనాలు పెట్టిస్తుంటారు. ఈ ఏడాది కూడా విజయ్ ఈ కార్యక్రమాన్ని మే ఒకటో తేదీన చేపట్టాలని అనుకున్నారట కానీ ఎన్నికలు జరగుతుండటంతో కుదరలేదని సమాచారం. అయితే ఎలక్షన్స్ ముగిసి ఎన్నికల కోడ్ను ఎత్తేసిన సందర్భంలో.. విజయ్ అధికారిక బృంధం ఆటోడ్రైవర్స్కు భోజనాలు పెట్టించి, బహుమతులు అందజేసింది. ప్రస్తుతం విజయ్-అట్లీ కాంబినేషన్లో రాబోతోన్న మూవీ షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని సమాచారం. -
ఖైదీ డైరెక్టర్తో విజయ్
వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్. ప్రతీ సినిమాకు తన మార్కెట్ను విస్తరించుకుంటూ పోతున్న విజయ్, సీనియర్ దర్శకులతో పాటు యువ దర్శకులకు కూడా అవకాశం ఇస్తున్నాడు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న విజయ్ తదుపరి చిత్రాన్ని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. మానగరం, అవియల్ లాంటి సినిమాలను తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు విజయ్ ఓకె చెప్పాడట. లోకేష్ ప్రస్తుతం కార్తీ హీరోగా ఖైదీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. కేవలం 50 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరన్న విషయం తెలియాల్సి ఉంది. -
వాటిని పట్టించుకోకండి.. అభిమానులు ప్రశాంతంగా ఉండండి
రాజా రాణి సినిమాతో సెన్సేషన్ సృష్టించిన యువ దర్శకుడు అట్లీ.. తేరి, మెర్సెల్ లాంటి చిత్రాలతో ఘన విజయాలు నమోదు చేశాడు. సినిమా సినిమాకు సక్సెస్ రేట్తో పాటు బాక్సాఫీస్ కలెక్షన్లను పెంచుకుంటూ పోతూ ఉన్న ఈ దర్శకుడు ముచ్చటగా మూడో సారి విజయ్తో ఓ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. విజయ్ 63వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మూవీ షూటింగ్లో మహిళను వేధించాడని డైరెక్టర్ అట్లీపై వార్తలు వినిపించాయి. అయితే ఇలాంటి వార్తలను పట్టించుకోకండంటూ.. మీరు థియేటర్స్లో పండుగ చేసుకునేలా సినిమా రావాలని ఎంతో కష్టపడి 70 రోజుల నుంచి నిరంతరాయంగా షూట్ చేస్తున్నామని చిత్రయూనిట్లోని ఓ సభ్యుడు తెలిపారు. ప్రస్తుతం నాలుగో షెడ్యూల్లోకి ఎంటరవుతున్నామని అన్నారు. సినిమాకు సంబంధించి అప్డేట్స్ను సరైన సమయంలో చెబుతామని అంత వరకు అభిమానులంతా ప్రశాంతంగా ఉండాలని, రూమర్స్ను పట్టించుకోవద్దని కోరారు. 70 days of continuous shoot, entering into the 4th schedule. And all the hard work are for the fans to celebrate in theatres. Updates & Announcements will be on right time and request fans to stay cool & avoid the rumours till then #IgnoreNegativity #Thalapathy63 pic.twitter.com/wtFKqeuEy0 — Jagadish (@Jagadishbliss) May 3, 2019 -
విజయ్ సినిమా షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం
అన్నానగర్: చెన్నైలో గురువారం నటుడు విజయ్ సినిమా షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం ఏర్పడింది. వివరాలు.. విజయ్ నటిస్తున్న 63వ సినిమాను డైరెక్టర్ అట్లి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్గా నయనతార నటిస్తోంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నై మీనంబాక్కంలోని బిన్నిమిల్లు ప్రాంతంలో ఆలయం, ఆస్పత్రి, మెడికల్ దుకాణాలు, పాఠశాల సెట్ వేశారు. కొన్ని రోజులుగా షూటింగ్ జరుగుతూ వచ్చింది. ఈ స్థితిలో గురువారం మధ్యాహ్నం సమయంలో షూటింగ్ కోసం కొత్తగా సెట్ వేసే పనిలో కార్మికులు నిమగ్నమయ్యారు. ఇనుప కమ్మీలను వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు అక్కడున్న ఎండిన ఆకులపై పడి మంటలు వ్యాపించాయి. క్రమంగా మంటలు సెట్ అంతటా వ్యాపించాయి. వెంటనే కార్మికులు అక్కడినుంచి పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగమండలంగా మారింది. దీనిపై సమాచారం అందుకున్న గిండి, తాంబరం, శానిటోరియం ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి సుమారు నాలుగు గంటల సేపు పోరాడి మంటలను అదుపుచేశారు. గురువారం సినిమా షూటింగ్ లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది. అగ్నిప్రమాదంలో రూ. లక్షల విలువైన సామగ్రి, సినిమా సెట్ కాలి బూడిదయ్యాయి. దీనిపై మీనంబాక్కం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
విజయ్ను వెంటాడుతున్న చోరీ కేసులు
పెరంబూరు: ఇళయదళపతి విజయ్ను విజయాలు వరిస్తున్నా, కథల చోరీ కేసులు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన నటించిన కత్తి చిత్రం నుంచి నిన్నటి సర్కార్ వరకూ కథల చోరీ కేసులు, కోర్టులు, పంచాయితీలు జరుగుతూనే ఉన్నాయి. సర్కార్ చిత్ర కథ విషయంలో చోరీ జరిగిందని కథా రచయితల సంఘం అధ్యక్షుడు వెల్లడించడం పెద్ద వివాదానికే దారి తీసింది. అంతే కాదు ఆ చిత్ర దర్శకుడు మురుగదాస్ పిటీషన్దారుడికి కొంత మొత్తాన్ని చెల్లించుకోక తప్పలేదని కోలీవుడ్లో ప్రచారం జరిగింది. అంతకు ముందు కత్తి చిత్రం విషయంలోనూ కథ చోరీ ఆరోపణలు ఎదురయ్యాయి. తాజాగా విజయ్ నటిస్తున్న చిత్రం కూడా కథ చోరీ ఆరోపణలను ఎదుర్కొంటోంది. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తన 63వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయకి. ఏజీఎస్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ను నిర్విరామంగా జరుపుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో సెల్వ అనే లఘు చిత్రాల దర్శకుడు విజయ్ నటిస్తున్న 63వ చిత్ర కథ తనదంటూ చెన్నై హైకోర్టుకెక్కారు. అందులో మహిళా ఫుట్బాల్ క్రీడ ఇతి వృత్తంతో కూడిన కథను తాను 265 పేజీలు రాసుకున్నానని తెలిపారు. ఆ కథను పలువురు నిర్మాతలకు వినిపించానని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు అట్లీ ఈ కథను నటుడు విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్నారన్న వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. చిత్ర షూటింగ్పై నిషేధం విధించాలని పిటీషన్లో కోరారు. ఈ కథ చోరీ కేసుపై ఈనెల 23వ తేదీన కోర్టులో విచారణ జరగనుంది. కాగా పిటీషన్దారుడు దర్శకుడు అట్లీని, నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థను, కథా రచయితల సంఘాన్ని ప్రతివాదులుగా పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఈ పిటీషన్పై తగిన వివరణ ఇవ్వాల్సిందిగా ఏజీఎస్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. -
అట్లీకి ఓకే చెప్పిన షారుఖ్!
కోలీవుడ్లో వరుస విజయాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖరారైంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్తో కలిసి అట్లీ సినిమా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. తమిళంలో బ్లాక్బస్టర్గా నిలిచిన మెర్సల్ రీమేక్పై షారుఖ్ ఆసక్తి చూపడంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అట్లీ సన్నిహితులు తెలిపారు. ఈ రీమేక్తో పాటుగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కన్ను మరో సినిమాలో నటించేందుకు కూడా షారుఖ్ సుముఖత వ్యక్తం చేయడంతో ఇరువురి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఐపీఎల్ సీజన్12లో భాగంగా చెన్నై- కోల్కతా మధ్య జరిగిన మ్యాచ్లో వీరిద్దరు కలిసి కనిపించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం అట్లీ ఆఫీసుకు వెళ్లిన షారుఖ్ రెండు స్క్రిప్టులను ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కాగా ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అట్లీ.. రాజా-రాణి సినిమాతో దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్టార్ హీరో విజయ్తో తెరి, మెర్సల్ వంటి హిట్ సినిమాలు రూపొందించి పలు అవార్డులు కూడా పొందాడు. ప్రస్తుతం విజయ్తో దళపతి63 సినిమా తెరకెక్కిస్తున్న అట్లీ.. షారుఖ్ సినిమాతో బాలీవుడ్కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇక జీరో సినిమా డిజాస్టర్ కావడంతో నిరాశ చెందిన షారుఖ్ ఇంతవరకు ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. అయితే అట్లీ మీద ఉన్న నమ్మకంతో అతడికి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. -
మ్యాచ్ కుదిరిందా?
షారుక్ ఖాన్ తమిళ సినిమాలో కనిపించబోతున్నారా? కొన్ని రోజులుగా తమిళ ఇండస్ట్రీ సర్కిల్లో ఇదే చర్చ. విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో షారుక్ కనిపిస్తారని టాక్. మరోవైపు తమిళ బ్లాక్బస్టర్ ‘మెర్సల్’ను హిందీ రీమేక్ చేసే ఆలోచనలో షారుక్ ఉన్నారని టాక్. మంగళవారం చెన్నై – కోల్కత్తా ఐపీఎల్ మ్యాచ్లో షారుక్తో పాటు దర్శకుడు అట్లీ కూడా స్టేడియంలో కనిపించడంతో అట్లీ నెక్ట్స్ సినిమాలో షారుక్ కనిపిస్తారనే వాదనకు బలం చేకూరింది. మ్యాచ్ అనంతరం అట్లీ ఆఫీస్కి షారుక్ ఖాన్ వెళ్లారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. మరి ఈ చర్చలు విజయ్ సినిమాలో షారుక్ గెస్ట్ రోల్లో కనిపించడానికా? లేక ‘మెర్సల్’ రీమేక్ కోసమా? తెలియాల్సి ఉంది. -
ఒక్క సెట్కు ఆరు కోట్లు!
వరుస విజయాలతో కోలీవుడ్ బాక్సాఫీస్ను దున్నేస్తున్న విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్ 63వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. కీలకమైన మూడో షెడ్యూల్ కోసం చెన్నైలోని ఈవీపీ స్టూడియోస్లో భారీ సెట్ను రెడీ చేస్తున్నారు. గతంలో విజయ్, అట్లీ కాంబినేషన్లో రూపొందిన తేరి, మెర్సల్ సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ మూవీపై భారీగా ఖర్చు పెడుతున్నారు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ ఫుట్బాల్ కోచ్గా కనిపించనున్నాడు. తదుపరి షెడ్యూల్లో గేమ్కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 50 రోజుల పాటు షూటింగ్ నిర్వహించాల్సి ఉండటంతో ఫుట్బాల్ స్టేడియం సెట్ను రెడీ చేస్తున్నారు. కేవలం ఈ సెట్ కోసం 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. ఏజీయస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. -
‘అట్లీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’
ఐపీఎల్ సీజన్12లో భాగంగా చెన్నై- కోల్కతా మధ్య జరిగిన మ్యాచ్లో కోలీవుడ్ హిట్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్తో కలిసి మ్యాచ్ను వీక్షించాడు. చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా కోల్కతా సహ యజమానితో కలిసి కేకేఆర్ గ్యాలరీలో అట్లీ దర్శనమివ్వడంతో సీఎస్కే ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో.. షారుఖ్తో సినిమా చేసేందుకో లేదా ఇలయదళపతి63 సినిమాలో గెస్ట్ రోల్లో నటింపజేసేందుకు అట్లీ చర్చలు జరుపుతున్నాడేమోలేనని సరిపెట్టుకున్నారు. అయితే మరికొంత మంది మాత్రం షారుక్తో అట్లీ ఉండటాన్ని జీర్ణించుకోలేక అతడి శరీర రంగు గురించి అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అట్లీ ఫ్యాన్స్... ‘తన రంగు గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. నిజానికి ఎన్నో కష్టనష్టాలకు, కఠిన శ్రమకు ఓర్చి అట్లీ ఈ స్థాయికి వచ్చాడు. ప్రస్తుతం షారుఖ్ పక్కన కూర్చున్నాడు. మరి మీరేం చేశారు ఇంట్లో కూర్చుని ఓ ప్రతిభావంతుడైన డైరెక్టర్ గురించి కామెంట్లు చేసేందుకు మాత్రమే మీరు పనికివస్తారు. వీరిద్దరి కలయిక ఓ బ్లాక్బస్టర్ సినిమాకు దారి తీస్తుంది. ప్రస్తుతం తమిళనాడులోని ప్రముఖ స్టార్లలో అట్లీది ప్రత్యేక స్థానం. అందమైన భార్య చక్కని కుటుంబం, మంచి సంపాదనతో అతడు ఆనందంగా ఉన్నాడు. ఎందుకు ఇలాంటి చెత్త కామెంట్లు చేసి సమయం వృథా చేసుకుంటారు’ అంటూ ట్రోల్స్కు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. కాగా ఫ్యాన్స్ ఊహించినట్లుగానే.. షారుఖ్- అట్లీల కాంబోలో మూవీ ఉంటుందని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ప్రకటించారు. మెర్సెల్ సినిమా రీమేక్ లేదా మరో కొత్త సినిమాతో వీళ్లిద్దరు ప్రేక్షకుల ముందుకు వస్తారని ఆయన ట్వీట్ చేశారు. ఇక ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అట్లీ..రాజా రాణి సినిమాతో దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత స్టార్ హీరో విజయ్తో తెరి, మెర్సల్ వంటి హిట్ సినిమాలు రూపొందించి పలు అవార్డులు పొందాడు. 2014లో నటి క్రిష్ణ ప్రియను పెళ్లి చేసుకున్నాడు. Y’all making fun of Atlee’s skin colour well at least he got to sit beside SRK by his own hardwork. What have you achieved other than sitting at your home commenting about his skin colour? #Atlee #CSKvKKR — Yaaro 🤔 (@lostsoulheree) April 9, 2019 . @iamsrk and @Atlee_dir are certainly doing a Movie together.. Whether it's #Mersal Hindi remake or fresh script is to be decided.. — Ramesh Bala (@rameshlaus) April 9, 2019 -
విజయ్తో రొమాన్స్
వర్దమాన నటి రెబా మోనికా సూపర్ ఛాన్స్ను దక్కించుకుందన్నది తాజా సమాచారం. శాండిల్వుడ్కు చెందిన ఈ బ్యూటీ మొదట మాలీవుడ్లో కథానాయకిగా పరిచయమైంది. అటు నుంచి కోలీవుడ్, ఆ తరువాత మాతృభాషలో అంటూ మొదట్లోనే బహుభాషా నటిగా పేరు సంపాందించుకుంది. ఆ మధ్య విడుదలైన జరుగండి చిత్రంతో నటుడు జయ్కు జంటగా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మరో తమిళ చిత్రంలోనూ నటిస్తోంది. దీనికి దావు అనే టైటిల్ను నిర్ణయించారు. సంతానం హీరోగా దిల్లుకు దుడ్డు, దానికి సీక్వెల్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన రాంబాలా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చంద్రమౌళికి జంటగా రెబా మోనిక నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావస్తోంది. ఇలాంటి సందర్భంగా రెబాను మరో లక్కీఛాన్స్ వరించిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదే ఇళయదళపతితో రొమాన్స్తో చేయబోంతోందన్నదే ఆ సమాచారం. విజయ్ ప్రస్తుతం తన 63వ చిత్రంలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఏజీఎస్ సంస్థ నిర్మిస్తోంది.ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో అగ్రనటి నయనతార కథానాయకిగా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇందులో మరో హీరోయిన్ ఉంటుందనే ప్రచారం చాలా కాలంగానే జరుగుతోంది. అంతే కాదు ఆ పాత్రలో నటి కీర్తీసురేశ్ నటించనుందనే టాక్ వినిపించింది. తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రకు ఇప్పుడు రెబా మోనికను ఎంపిక చేశారట. విజయ్ చిత్రంలో మరో విశేషం ఏమిటంటే బాలీవుడ్ స్టార్ నటుడు జాకీష్రాఫ్ ప్రధాన పాత్రను పోషించడం. శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దీపావళికి తెరపైకి తీసుకురావడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో రాజకీయాలు ఉండవని, ఇది పూర్తిగా వినోదభరితంగా ఉంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు. అయితే ఇందులో రాజకీయాలు ఉంటాయిగానీ, అవి వేరే విధంగా ఉంటాయన్నది తాజా సమాచారం. మొత్తం మీద విజయ్ 63వ చిత్రం ఇప్పటి నుంచే సంచలనం సృష్టిస్తోంది. -
నన్ను ఫాలో అవ్వకండి : స్టార్ హీరో
తమిళనాడులో రజనీ తరువాత అంతటి అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న హీరో విజయ్. ఇళయ దళపతిగా ఈ హీరోను ఫ్యాన్స్ ఆరాధిస్తుంటారు. ప్రస్తుతం తమిళ బాక్సాఫీస్ కింగ్గా దూసుకుపోతున్నారు. తన సినిమాలతో ఈజీగా వంద కోట్లను కలెక్ట్ చేసేస్తూ.. రికార్డులు సృష్టిస్తున్నారు. తేరి, మెర్సెల్, సర్కార్ లాంటి చిత్రాలతో దూకుడు మీదున్న ఈ హీరో ప్రస్తుతం తన తదుపరి చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. విజయ్ తన మూవీ షూటింగ్ కోసం వెళ్తుండగా.. ఓ ఇద్దరు అభిమానులు వెంబడించారు. తన డ్రైవర్కారు వేగాన్ని పెంచినా.. అభిమానులు మాత్రం వదలకుండా వారు కూడా అంతే వేగంతో వెనకే వస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన విజయ్.. కారు వేగాన్ని తగ్గించమని చెప్పి.. తన అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. ‘ఇంత వేగంగా వెళ్లడం, ఇలా ఫాలో అవ్వడం అంత మంచి కాదు. ప్రమాదం జరగే అవకాశం ఉంటుంది. నన్ను ఇలా ఫాలో కావొద్దంటూ’ వారికి సూచించాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు , వీడియోలు వైరల్ అవుతున్నాయి. తేరి, మెర్సెల్ లాంటి బ్లాక్ బస్టర్స్ తరువాత హ్యాట్రిక్ కొట్టేందుకు అట్లీ దర్శకత్వంలో విజయ్ తన ప్రాజెక్ట్ను చకాచకా పూర్తి చేసేస్తున్నారు. -
దీపావళికి పక్కా
తమిళ నటుడు విజయ్ హీరోగా నటించిన ‘మెర్సెల్, సర్కార్’ చిత్రాలు వరుసగా 2017, 2018 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే లభించింది. తాజాగా విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాను కూడా దీపావళికే విడుదల చేయనున్నట్లు తొలుత చిత్రబృందం ప్రకటించింది. కానీ షూటింగ్ స్లోగా జరుగుతోందని, దీపావళికి బొమ్మ థియేటర్స్లోకి రాదనే వార్తలు వినిపించాయి. ‘‘ఈ దీపావళికి పక్కా వస్తాం. అవాస్తవమైన వార్తలను నమ్మొద్దు’’ అని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ స్పష్టం చేసింది. ‘తేరీ, మెర్సెల్’ తర్వాత విజయ్–అట్లీ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి. -
విజయ్ సినిమా కథ లీకైందా!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న విజయ్ నెక్ట్స్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే విజయ్ ఫుట్ బాల్ నటిస్తున్న ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. విజయ్ కోచింగ్ ఇస్తున్న టీంలోని ప్రధాన సభ్యులు ఒక్కొక్కరుగా హత్యకు గురి కావటం. ఆ హత్యలకు విజయ్ కారణమని పోలీసులు అరెస్ట్ చేయటం. ఆ కేసు నుంచి విజయ్ ఎలా బయటపడ్డాడన్నదే ఈ సినిమా కథ అన్న టాక్ వినిపిస్తోంది. థ్రిల్లర్ జానర్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ క్యారెక్టర్, పర్పామెన్స్ హైలెట్గా నిలుస్తుందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో విజయ్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కిన తేరి, మెర్సల్ సినిమాలు మంచి విజయాలు సాధించటంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా ఏర్పడ్డాయి. విజయ్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. -
పిల్లలతో ఆటాపాటా
కమర్షియల్ సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. వీలున్నంతగా హీరోను ఆకాశానికి ఎత్తేసేలా, ఫ్యాన్స్ విజిల్స్తో థియేటర్స్ దద్దరిల్లేట్టు ఉండేలా ప్లాన్ చేస్తుంటారు దర్శకులు. తాజాగా విజయ్ కొత్తచిత్రంలో ఎంట్రీసాంగ్ను వందమంది పిల్లలతో షూట్ చేస్తున్నారట. తమిళంలో హీరో విజయ్–దర్శకుడు అట్లీది హిట్ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘తేరీ, మెర్సల్’ సూపర్ హిట్స్గా నిలిచాయి. మూడోసారి కలసిన ఈ హిట్ కాంబినేషన్ ఫస్ట్ రెండు సినిమాలకంటే భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టుంది. ఈ సినిమాలో విజయ్ పరిచయ గీతాన్ని సుమారు వందమంది పిల్లలతో షూట్ చేస్తున్నారట. దీనికోసం చెన్నైలో ఓ భారీ సెట్ను కూడా నిర్మించారట. స్పోర్ట్స్ బ్యాడ్రాప్లో సాగనున్న ఈ చిత్రంలో విజయ్ ఫుట్బాల్ కోచ్గా కనిపిస్తారు. ఈ ఏడాది దీపావళికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. -
మైఖేల్గా ఇళయదళపతి?
ఇళయదళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి మైఖేల్ టైటిల్ను చిత్ర వర్గాలు పరిశీలిస్తున్నట్లు తాజా సమాచారం. విజయ్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తెరి, మెర్శల్ చిత్రాలు సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ రెండు చిత్రాలకు పూర్తి భిన్నమైన కథాంశంతో తాజాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇది విజయ్కు 63వ చిత్రం. నయనతార నాయకిగా నటిస్తోంది. విల్లు చిత్రం ఈ జంట హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఇదే. కదిర్, వివేక్, యోగి బాబు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్. రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఏజీఎస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫుట్బాల్ క్రీడ నేపథ్యంలో రూపొందుతోందని సమాచారం. ఇందులో విజయ్ ఫుట్బాల్ క్రీడ శిక్షకుడిగా నటిస్తున్నట్లు తెలిసింది. చిత్రంలో ఆయన పేరు మైఖేల్ అని సమాచారం. హీరో పేర్లతో ఇంతకు ముందు చాలా చిత్రాలు వచ్చాయి. దీంతో విజయ్ 63వ చిత్రానికి కూడా మైఖేల్ పేరును చిత్ర వర్గాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. చిత్రాన్ని దీపావళికి తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. -
ప్రారంభంకానున్న అట్లీ-విజయ్ చిత్రం!
తేరీ, మెర్సల్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన అట్లీ, విజయ్ల కాంబినేషన్లో మరో చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ముచ్చటగా మూడోసారి రికార్డులను క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్న ఈ కాంబో.. త్వరలోనే షూటింగ్ను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు రేపు జరుగబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. విజయ్ నటిస్తున్న ఈ 63వ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రీడానేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్.. స్పోర్ట్స్ కోచ్గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్నారు. -
స్మార్ట్ అండ్ స్ట్రాంగ్
ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు పూర్తవుతున్నా కథానాయిక నయనతార జోరు ఏమాత్రం తగ్గడంలేదు. లేడీ సూపర్స్టార్గా ఆమెకున్న క్రేజ్ కూడా పెరుగుతూనే ఉంది. ఇటీవలే అజిత్ ‘విశ్వాసం’ సినిమా షూటింగ్ను కంప్లీట్ చేసి, ‘సైరా: నరసింహారెడ్డి, ఐరా, లవ్ యాక్షన్ డ్రామా’ సినిమాలతో బిజీగా ఉన్న నయనతార తాజాగా మరో సినిమాకు సై అన్నారు. తమిళ నటుడు విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో నయనతారను కథానాయికగా తీసుకున్నారు. ‘‘కథలో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉంది. ఈ స్మార్ట్ అండ్ స్ట్రాంగ్ రోల్ కోసం నయనతారను కథానాయికగా ఎంపిక చేసుకున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ జనవరిలో స్టార్ట్ కానుందని సమాచారం. విజయ్– అట్లీ కాంబినేషన్లో వచ్చిన ‘తేరీ, మెర్సెల్’ చిత్రాలు హిట్ సాధించడంతో తాజా చిత్రంపై అంచనాలున్నాయి. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. -
విజయ్కు జోడిగా నయన్!
సర్కార్ సినిమాతో బాక్సాఫీస్పై దండెత్తిన ఇళయ దళపతి విజయ్.. తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. మెర్సెల్, సర్కార్ లాంటి బిగ్గెస్ట్ హిట్స్ తరువాత విజయ్ చేయబోయే ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇప్పటికీ సర్కార్ హవా కొనసాగుతూనే ఉంది. వివాదాల మధ్య ఈ సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ.. మెర్సెస్ రికార్డులను బద్దలుకొట్టింది. విజయ్ తన 63వ చిత్రాన్ని అట్లీ డైరెక్షన్లో చేయబోతున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన ‘తేరి’, ‘మెర్సెల్’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరు హ్యాట్రిక్ కొట్టడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో లేడీ సూపర్స్టార్ నయనతార హీరోయిన్గా నటించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు, సినిమా టైటిల్ తదితర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. A heroine needs to be Strong, Smart and add Strength to the Story AGS is super happy to announce that our very own #Nayan has come on board #Thalapathy63 Like all fans I am super excited to see our #Thalapathy #Nayan combo on screen after a longtime @Atlee_dir #Ags pic.twitter.com/krrla9cBuU — Archana Kalpathi (@archanakalpathi) 25 November 2018 -
హ్యాట్రిక్ సాధిస్తారా?
ఇటీవల ‘సర్కార్’ సినిమాతో మరో సక్సెస్ను ఖాతాలో వేసుకున్నారు తమిళ నటుడు విజయ్. ఆయన నెక్ట్స్ అట్లీ దర్శకత్వంలో హీరోగా నటించనున్నారు. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. ఎజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఏఆర్. రెహమాన్ సంగీతం అందించనున్నారు. అట్లీ–విజయ్ కాంబినేషన్లో ఇది వరకు వచ్చిన ‘తేరి (తెలుగులో ‘పోలీసోడు’), ‘మెర్సెల్’ (తెలుగులో ‘అదిరింది’) సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించాయి. ఇప్పుడు ఈ ఇద్దరు హ్యాట్రిక్ హిట్పై కన్నేశారు. వచ్చే ఏడాది దీపావళికే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో కథానాయిక చాన్స్ కోసం సమంత, కాజల్, సాయేషా, కీర్తీ సురేశ్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో విజయ్ బాక్సింగ్ కోచ్ పాత్రలో నటించబోతున్నారన్న ప్రచారం కోలీవుడ్లో జరుగుతోంది. -
విజయ్ @ 63
సినిమా: సర్కార్ వివాదాలు, సంచలనాలు, సక్సెస్ను అనుభవిస్తున్న నటుడు విజయ్ 63వ చిత్రానికి రెడీ అయిపోతున్నారు. దీనికి యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించనున్నారు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్లో తెరి, మెర్శల్ వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా హ్యాట్రిక్కు రెడీ అవుతున్నారు. దీన్ని ఏజీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై కల్పాత్తి ఎస్.అఘోరం, కల్పాత్తి ఎస్.గణేశ్, కల్పాత్తి ఎస్.సురేశ్ నిర్మిస్తున్నారు. దీనికి సంగీత మాంత్రికుడు ఏఆర్.రహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల మెర్శల్, సర్కార్ చిత్రాల తరువాత విజయ్, ఏఆర్.రెహ్మాన్ల కలయికలో సంగీతప్రియులను అలరించడానికి తయారవుతున్న చిత్రం ఇది. ఈ చిత్ర వివరాలు ఏజీఎస్ సంస్థ అధినేతలు బుధవారం అధికారిక పూర్వకంగా వెల్లడించారు. విజయ్ హీరోగా మరోసారి చిత్రం చేయడం సంతోషంగా ఉందని, ఇది తమ సంస్థలోనే అత్యంత భారీ చిత్రంగా నిలుస్తుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ఇందులో విజయ్తో రొమాన్స్ చేసే బ్యూటీస్ ఎవరన్న ఆసక్తి నెలకొంది. అయితే ఇందులో అగ్రనటి నయనతార, క్రేజీ బ్యూటీ సమంతలో ఒకరిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో సమంతనే నటించే అవకాశం ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ భామ ఇంతకు ముందు తెరి, మెర్శల్ చిత్రాల్లో విజయ్తో నటించిందన్నది గమనార్హం. ఈ చిత్రం టైటిల్ ఏమై ఉంటుందనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. కారణం దర్శకుడు అట్లీ ఇప్పటికే ఆళపోరాన్ తమిళన్ అనే టైటిల్ను రిజిస్టర్ చేయించారు. ఆళపోరాన్ తమిళన్ అంటే పాలించడానికి తమిళుడు వస్తున్నాడు అని అర్థం. ఈ టైటిల్ విజయ్ చిత్రానికి ఖరారైతే మరోసారి ఆయన రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రంలో నటిస్తున్నట్లే భావించాలి. -
విజయ్ కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్
పాలించే తమిళుడి కోసం జనవరిలో ముహూర్తం జరుగుతోందన్నది తాజా సమాచారం. అంటే చాలా మందికి అర్థం అయిపోయి ఉంటుంది. అలాంటి టైటిల్స్కు ఇప్పుడు సరైన హీరో విజయ్నే అని చెప్పవచ్చు. ఈ స్టార్ హీరో తాజాగా నటించిన చిత్రం సర్కార్. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పలు వివాదాల మధ్య దీపావళికి సందడి చేయడానికి సిద్ధం అవుతోంది. కీర్తీసురేశ్ నాయకిగా నటించిన ఈ సినిమాలో సంచలన నటి వరలక్ష్మీశరత్కుమార్ రాజకీయనాయకురాలిగా ముఖ్యపాత్రలో నటించింది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకుంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే విజయ్ తదుపరి చిత్రానికి రెడీ అయిపోతున్నారు. తదుపరి ఆయన్ని దర్శకత్వం చేసే అవకాశం ఎవరికి లభిస్తుంది. ఏ చిత్ర నిర్మాణ సంస్థకు కాల్షీట్స్ ఇవ్వనున్నారు అనే ఆసక్తి చిత్ర పరిశ్రమలో నెలకొంది. విజయ్ తదుపరి చిత్రం గురించి కొన్ని వివరాలు అనధికారికంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా విజయ్ తదుపరి అట్లీ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారన్నది. వారిది హిట్ కాంబినేషన్ అన్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు తేరి, మెర్సల్ చిత్రాలు వచ్చి సంచలన విజయాన్ని సాధించాయి. తాజాగా విజయ్, అట్లీల కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రాన్ని ఏజీఎస్ సంస్థ నిర్మించనున్నట్లు తెలిసింది. అంతేకాదు ఈ చిత్ర ప్రారంభానికి వచ్చే ఏడాది జనవరిలో ముహూర్తం పెట్టినట్లు సమాచారం. ఇక అన్నింటికంటే ముఖ్యం దీనికి ఆళపోరాన్ తమిళన్ అనే టైటిల్ను అనుకుంటున్నట్లు తెలిసింది. ఈ టైటిల్ను దర్శకుడు అట్లీ చాలా కాలం క్రితమే రిజిస్టర్ చేశారు. -
లక్కీయారా
బాలీవుడ్ భామ కియారా అద్వానీ కెరీర్ గ్రాఫ్ చూస్తే మూడు పువ్వులు ఆరు కాయలు అన్నంత బ్రహ్మాండంగా ఉంది. ‘యం.యస్. ధోని’ బయోపిక్లో బాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగులో మహేశ్బాబు ‘భరత్ అనే నేను’ సినిమా ద్వారా టాలీవుడ్కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే రామ్ చరణ్, బోయపాటి చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేశారు. ఇటీవలే నెట్ఫ్లిక్స్లో ‘లస్ట్ స్టోరీస్’తో డిజిటల్ ఆడియన్స్కు కూడా దగ్గరయ్యారు. కియారా నటన చూసి వావ్ అనకుండా ఉండలేకపోయారు. ప్రస్తుతం హిందీలో కరణ్ జోహర్ ప్రొడక్షన్లో అక్షయ్ కుమార్, కరీనా కపూర్ నటిస్తున్న ‘గుడ్ న్యూస్’లో కీలక పాత్ర పోషిస్తున్నారామె. వీటితో పాటు లేటెస్ట్గా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే తమిళ హీరో విజయ్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో హీరోయిన్గా కియారా పేరును పరిశీలిస్తున్నారట చిత్రబృందం. తేరి, మెర్సల్ వంటి రెండు అద్భుత విజయాలను హీరో విజయ్కి ఇచ్చిన దర్శకుడు అట్లీ. మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఫుల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా తమిళంలోకి ఎంటర్ అయ్యే అవకాశం అంటే కియారాకి మంచి అవకాశమే. సో.. కియారా.. లక్కీయారా అనొచ్చేమో. -
మరో హ్యాట్రిక్పై గురి!
నటుడు విజయ్ మరో హ్యాట్రిక్పై కన్నేశారని కోలీవుడ్ సమాచారం. ‘తేరీ, మెర్సెల్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దర్శకుడు అట్లీ–హీరో విజయ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉంటుందట. ‘సర్కార్’ షూటింగ్ను కంప్లీట్ చేసిన తర్వాత విజయ్ ఈ సినిమా షూట్లో జాయిన్ అవుతారని టాక్. ఇక ‘సర్కార్’ విషయానికొస్తే..‘కత్తి, తుపాకి’ వంటి సక్సెస్ఫుల్ సినిమాల తర్వాత దర్శకుడు మురుగదాస్–విజయ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘సర్కార్’. కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. ఇటు మురుగదాస్, అటు అట్లీ.. ఇలా వరుసగా హ్యాట్రిక్ చిత్రాలపై విజయ్ గురిపెట్టడం కోలీవుడ్లో ప్రజెంట్ హాట్ టాపిక్గా మారారు. -
మహాద్భుతం
‘‘సావిత్రిగారి గురించి రాసే అర్హత తెచ్చుకున్నాకే ఆమె కథ రాస్తా’... ‘మహానటి’లో జర్నలిస్ట్ మధురవాణి ఇలానే అంటుంది. కానీ సావిత్రి లైఫ్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాక, ఇన్స్పైర్ అయ్యి అనుభవం పెరిగే వరకూ ఆగకుండా రాస్తుంది. ఆ మాటకొస్తే.. ‘మహానటి’ తీయడానికి దర్శకుడు నాగ్ అశ్విన్ వయసు, అనుభవం ఎంత? చాలా చాలా తక్కువ. అయినా కన్విక్షన్, ప్యాషన్ ఉంటే వయసు, అనుభవంతో పనేంటి? పైగా సావిత్రి లైఫ్ హిస్టరీ తెలుసుకున్నాక నాగ్ అశ్విన్కి ఆమె అంటే విపరీతమైన అభిమానం ఏర్పడింది. అదే ‘మహానటి’ జీవితాన్ని సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించేలా చేసింది. టైటిల్ రోల్లో కీర్తీ సురేష్, జెమినీ గణేశన్గా దుల్కర్ సల్మాన్ తదితర తారలతో వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం బుధవారం విడుదలైంది. సినిమా చూసినవాళ్లు ‘నాగ్ అశ్విన్ బ్రహ్మాండంగా తీశాడు.. కీర్తీ నటన అద్భుతం’ అంటు న్నారు. ట్వీటర్ ద్వారా కొందరు ప్రముఖులు తమ అనుభూతిని పంచుకున్నారు. 28 ఏళ్ల క్రితం ఇదే రోజున (మే, 9) భారీ వర్షం. చాలా పెద్ద సినిమా (జగదేక వీరుడు అతిలోక సుందరి) తీశామనే ఆనందం. ఎలా ఆడుతుందో అనే భయం. ఎప్పుడు వరద ఆగుతుందో అనే ఎదురుచూపు.. ఎట్టకేలకు సాయంత్రం నుంచి సినిమా హాళ్ల వైపు జనాలు కదిలారు. మరుసటిరోజు నుంచి వరద థియేటర్లలో అభిమానుల రూపంలో రావడం మొదలైంది. మా అశ్వనీదత్గారికి ఆ రోజు ఎంత ఆనందం వేసిందో ఇప్పటికీ మర్చిపోలేదు. సరిగ్గా అదే రోజున ‘మహానటి’ విడుదలైంది. ఆ రోజున ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ నిర్మించడానికి ఎంత ధైర్యం కావాలో ఈ రోజు ‘మహానటి’ నిర్మించడానికీ అంతే ధైర్యం కావాలి. సావిత్రిగారి చరిత్రను తరతరాలకు అందించిన స్వప్న సినిమా, వైజయంతీ మూవీస్కి ధన్యవాదాలు. సావిత్రి పాత్రలో కీర్తీ జీవించింది. జెమినీ గణేశన్గా దుల్కర్ నటన అద్భుతం. నాగ్ అశ్విన్, చిత్ర యూనిట్కు నా అభినందనలు. – దర్శకుడు కె. రాఘవేంద్ర రావు మహానటి క్లాసిక్, ఇన్స్పిరేషనల్ బయోపిక్. కీర్తీ సురేశ్ ‘మాయాబజార్’ డ్యాన్స్లతో సావిత్రిగారిని తిరిగి తీసుకువచ్చింది. సమంతా అదరగొట్టింది. టీమ్ అందరికీ కంగ్రాట్స్. ఇలాంటి క్లాసిక్ మాకు అందించినందుకు వైజయంతీ మూవీస్కు స్పెషల్ థ్యాంక్స్. – ‘మెర్సల్’ ఫేమ్ దర్శకుడు అట్లీ సావిత్రిగారిలా కీర్తీ సురేశ్ పెర్ఫార్మెన్స్ నేను చూసిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ల్లో ఒకటి. కేవలం ఇమిటేటింగ్ కాదు, సావిత్రి గారి పాత్రకు ప్రాణం పోసింది. దుల్కర్ ఈజ్ ఫెంటాస్టిక్. నేను అతని ఫ్యాన్ అయిపోయా. కంగ్రాట్స్ నాగ్ అశ్విన్, స్వప్నా. మీ నమ్మకం, డిటర్మినేషన్ అద్భుతం. – దర్శకుడు రాజమౌళి థ్యాంక్యూ నాగ్ అశ్విన్.. ఈ సినిమా తీసినందుకు. సావిత్రిగారు అమరులు. నీ రైటింగ్, నీ రీసెర్చ్, నీ స్క్రీన్ప్లే గురించి మాట్లాడటానికి నా దగ్గర మాటలు లేవు. నాగీ ఆలోచనను, అతని కన్విక్షన్ను నమ్మి ఈ సినిమాను నిర్మించినందుకు స్వప్నా, ప్రియాంకకు కంగ్రాట్స్. టేక్ ఏ బౌ గర్ల్స్. సమంతా.. ఇలాంటి పాత్ర ఎంచుకోవడం గ్రేట్. నీ రోల్ను కమాండబుల్గా చేశావు. క్లైమాక్స్లో నీ నటన చాలా రోజులు గుర్తుండిపోతుంది. – దర్శకుడు వంశీ పైడిపల్లి నాగ్ అశ్విన్ నన్ను సావిత్రిగారి ఎరాలోకి తీసుకువెళ్లిపోయారు. ఏం సినిమా... ఇలాంటి పాత్ర చేసే అవకాశం కీర్తీ సురేశ్కి రావడం నిజంగా బ్లెస్డ్. అక్కినేని నాగేశ్వరరావుగారిలా చైతన్య సూపర్బ్. స్వప్నా అండ్ టీమ్కు కంగ్రాట్స్. – దర్శకుడు మారుతి నాగ్ అశ్విన్, స్వప్నా, వైజయంతి మూవీస్ బోల్డ్ ఆలోచన ఇది. అద్భుతమైన నటీనటులతో సినిమా ఎగ్జిక్యూట్ చేశారు. నాకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నా. ప్రతి ఒక్కరి నటన నచ్చింది. ‘కీర్తీ యూ కిల్డ్ ఇట్’. సమంతా.. నన్ను ఏడిపించేశావ్. దుల్కర్.. నువ్వు సూపర్. మోహన్బాబుగారు, విజయ్, క్రిష్, ప్రకాశ్ రాజ్ అందరూ కన్విన్సింగ్గా చేశారు. తాత రోల్లో చైతన్యను చూడటం హ్యాపీగా ఉంది. హార్ట్ ఈజ్ హ్యాపీ. – సుశాంత్ -
‘తెలుగు సినిమా చేయట్లేదు’
కోలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అట్లీ. రాజా రాణీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అట్లీ, తరువాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో తేరి, మెర్సల్ సినిమాలను తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు ఘన విజయం సాధించటంతో అట్లీ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. అయితే కొద్ది రోజులుగా అట్లీ తదుపరి చిత్రాన్ని తెలుగులో రూపొదించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్పందించిన అట్లీ అవన్నీ పుకార్లంటూ కొట్టిపారేశారు. ప్రస్తుతానికి తెలుగు సినిమా చేసే ఆలోచన లేదని తెలిపారు. గలాటా నక్షత్ర అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొన్న అట్లీ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి తెలుగు సినిమా చేయటం లేదన్న అట్లీ భవిష్యత్తులో టాలీవుడ్ ఎంట్రీపై ఆలోచిస్తానన్నారు. మెర్సల్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ యంగ్ డైరెక్టర్ తన తదుపరి ప్రాజెక్ట్ను ఇంతవరకు ప్రకటించలేదు. -
టాలీవుడ్ లో కోలీవుడ్ హిట్ డైరెక్టర్
రాజా రాణీ, తేరి, మెర్సల్ సినిమాలతో వరుస విజయాలు సాధించిన కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ. వరుసగా రెండు సినిమాలు స్టార్ హీరో విజయ్తో కలిసి చేసిన అట్లీ ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఈ యువ దర్శకుడు తెరకెక్కించిన తేరి.. పోలీస్ పేరుతో మెర్సల్ అదిరింది పేరుతో తెలుగులో రిలీజ్ అయినా ఆశించిన స్థాయిలో విజయం సాదించలేకపోయాయి. దీంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకునేందుకు తెలుగు హీరోతో సినిమా చేయాలని భావిస్తున్నారు అట్లీ. త్వరలో ఓ తెలుగు సినియా చేయబోతున్నట్టుగా అట్లీ స్వయంగా ప్రకటించారు. తెలుగులోనూ ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించాడు అట్లీ. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. -
ఇద్దరు భామలతో ఉదయ్ రొమాన్స్
తమిళసినిమా: సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. గ్లామర్ అంటే హీరోయిన్లే ముందుగా గుర్తుకొస్తారు. అలాంటి హీరోయిన్లు చిత్రంలో ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే కచ్చితంగా ఆ సినిమా కలర్ఫుల్గా ఉంటుంది. అందుకే యువ హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ సాధ్యమైనంత వరకూ ఒకరికి మించిన హీరోయిన్లు తమ చిత్రాల్లో ఉండేలా చూసుకుంటున్నారనిపిస్తోంది. అలాంటి కథలపైనే అభిమానులూ ఆసక్తి చూపుతున్నారని చెప్పవచ్చు. తాజాగా యువ నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ కూడా ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి ఇష్టపడుతున్నారనిపిస్తోంది. ఈయన నటించిన నిమిర్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. తాజాగా శీనురామస్వామి దర్శకత్వంలో కన్నే కలైమానే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా నాయకి. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయిన్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దీంతో ఉదయనిధి స్టాలిన్ తాజా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దర్శకుడు అట్లీ శిష్యుడు ఈనక్ చెప్పిన కథ నచ్చేయడంతో ఆయన దర్శకత్వంలో నటించడానికి రెడీ అయిపోతున్నారని సమాచారం. ఇందులో ఆయనకు జంటగా ఇద్దరు బ్యూటీలు నటించనున్నారని తెలిసింది. అందులో ఒకరు మేయాదమాన్ చిత్రం ఫేమ్ ప్రియా భవానీశంకర్ కాగా మరొకరు నటి ఇందుజా అని సమాచారం. ఈ చిత్రం తమిళ ఉగాది రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
రజనీ కోసం ఆ ముగ్గురు..
తమిళసినిమా: దక్షిణాది సినిమానే కాదు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు కమలహాసన్, రజనీకాంత్ చుట్టూనే తిరుగుతున్నాయన్నది వాస్తవం. వీరిలో కమలహాసన్ సినిమాలకు గుడ్బై చెప్పేశారు. నిర్మాణంలో ఉన్న విశ్వరూపం–2, శభాష్నాయుడు చేయనున్నట్లు ప్రకటించినా ఇండియన్ 2 చిత్రాలనే ఆయన నుంచి ఆశించవచ్చు. ఇక రజనీకాంత్ రాజకీయరంగప్రవేశం కార్యక్రమాలు ముమ్మరంగా జరగుతున్నాయి. ఆయన త్వరలోనే పార్టీ జండా, అజెండాలను వెల్లడించే సమయం ఆసన్నమైంది. రజనీకాంత్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 2.ఓ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న విషయం తెలిసిందే. శంకర్ ఈ చిత్రాన్ని నభూతోనభవిష్యత్ అనే విధంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. కబాలి చిత్రం ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో తన అల్లుడు, నటుడు ధనుష్ నిర్మాణంలో రజనీకాంత్ మరోసారి దాదాగా నటించిన కాలా చిత్రం ఏప్రిల్ 27న తెరపైకి రావడానికి ముస్తాబుతోంది. ఇక రజనీకాంత్ మరో చిత్రం చేస్తారా, 2.ఓ చివరి చిత్రం అవుతుందా? అన్న చర్చ జరుగుతున్న సమయంలో ఆయన కోసం ముగ్గురు దర్శకులు కథలు సిద్ధం చేశారు. సూపర్స్టార్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం తమ చిత్రాలను పట్టాలెక్కించడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారనే ప్రచారం కోలీవుడ్లో వైరల్ అవుతోంది. యువ దర్శకుడు అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజారాణి, తెరి, మెర్శల్ చిత్రాలతో తానేమిటో నిరూపించుకున్నారు. ఇక మరో వర్థమాన దర్శకుడు మణికంఠన్ కాక్కాముట్టై చిత్రంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ ఇద్దరూ రజనీకాంత్ కోసం కథలను సిద్ధం చేసి ఆయనకు వినిపించారు కూడా. మరో ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు కేవీ.ఆనంద్ కూడా సూపర్స్టార్ కోసం బ్రహ్మాండమైన కథను సిద్ధం చేశారట. అట్లి, కేవీ.ఆనంద్ రాజకీయ ఇతివృత్తంతో కథలను తయారు చేయగా కాక్కాముట్టై చిత్రం ఫేమ్ మణకంఠన్ వ్యవసాయం నేపథ్యంలో కథను రెడీ చేశారట. ఈ మూడు కథలు రజనీకాంత్ను ఇంప్రెస్ చేశాయని, వీరిలో ఏవరికి ఆయన పచ్చజెండా ఊపుతారన్నది ఆసక్తికరంగా మారిందనేది కోలీవుడ్ వర్గాల సమాచారం. -
అట్లీకి సూపర్చాన్స్?
తమిళసినిమా: సూపర్స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా యువ దర్శకుడు అట్లీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారా? అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాధానం కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. స్టార్ దర్శకుడు శంకర్ శిష్యులలో ఒకరు అట్లీ అన్న విషయం తెలిసిందే. ఈయన రజనీ నటించిన ఎందిరన్ చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశారు. రాజా రాణి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన అట్లీ, ఆ తరువాత విజయ్ హీరోగా వరుసగా తెరి, మెర్శల్ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించారు. తదుపరి చిత్రాన్ని విజయ్తోనే చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అట్లీ ఆ చిత్రానికి ఆళపోరాన్ అనే టైటిల్కు కూడా రిజిస్టర్ చేయించారనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో అట్లీ రజనీకాంత్ను కలిసి కథ వినిపించినట్లూ, ఆ కథ రజనీకాంత్ను ఇంప్రెస్ చేసినట్లు సమాచారం. ఈ భారీ చిత్రాన్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించడానికి ఆసక్తి చూపుతున్నట్లు టాక్. రజనీకాంత్ నటించిన కాలా చిత్రం సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్ 14న విడుదలకు, ఆ తరువాత 2.ఓ చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నట్లు ప్రచారంలో ఉంది. రాజకీయరంగ ప్రవేశానికి అస్త్ర శస్త్రాలను కూడగట్టుకుంటున్న రజనీ మంచి రాజకీయ నేపథ్యంతో కూడిన కథ కోసం ఎదురు చూస్తున్నట్లు ఇంతకు ముందే ప్రచారం జరిగింది. కాగా ఆళపోరాన్ టైటిల్ చూస్తుంటేనే ఇది పూర్తిగా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో సాగే కథ అని తెలుస్తోంది. ఆ టైటిల్ ఇప్పుడు రజనీకాంత్కు సరిగ్గా సరిపోతుంది. అందుకే అట్లీ దర్శకత్వంలో రజనీకాంత్ నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల భావన. -
'అదిరింది' మూవీ రివ్యూ
టైటిల్ : అదిరింది జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : విజయ్, సమంత, కాజల్, నిత్యామీనన్, ఎస్జే సూర్య, వడివేలు సంగీతం : ఏఆర్ రెహమాన్ దర్శకత్వం : అట్లీ నిర్మాత : శ్రీ తేండాల్ ఫిలింస్ ఇటీవల కాలంలో దక్షిణాదిలో అత్యంత వివాదాస్పదమైన సినిమా మెర్సల్. విజయ్ హీరోగా తెరకకెక్కిన ఈ సినిమాలో కేంద్రప్రభుత్వాన్ని, వైద్య వృత్తిని అవమానించేలా డైలాగ్స్ ఉన్నాయంటూ పెద్ద దుమారమే చెలరేగింది. అయితే ఇన్ని వివాదాల మధ్య రిలీజ్ అయిన మెర్సల్ ఘనవిజయం సాధించి సత్తా చాటింది. కానీ తెలుగు వర్షన్ రిలీజ్ విషయంలో మాత్రం చిత్రయూనిట్ కు ఇబ్బందులు తప్పలేదు. తమిళ వర్షన్తో తెలుగులో కూడా రిలీజ్ చేయాలని భావించినా సెన్సార్ సమస్యల కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలంగా తెలుగు మార్కెట్ లో పట్టు కోసం ప్రయత్నిస్తున్న దళపతి విజయ్ ఈ సినిమాతో అయిన విజయం సాధించాడా..? ఎన్నో ఇబ్బందుల తరువాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అదిరింది ఆశించిన స్థాయిలో ఆకట్టుకుందా..? కథ : డాక్టర్ భార్గవ్ (విజయ్) కేవలం 5 రూపాయల ఫీజు తీసుకొని వైద్యం చేస్తుంటాడు. ప్రతీ పేదవాడికి మంచి వైద్యం అందాలన్న ఆశయంతో పనిచేస్తున్న భార్గవ్కు అంతర్జాతీయ హ్యుమానిటేరియన్ అవార్డ్ దక్కుతుంది. ఆ అవార్డ్ అందుకునేందుకు విదేశాలకు వెళతాడు భార్గవ్. అక్కడ ఓ తెలుగు డాక్టర్ అర్జున్ చేతుల మీదుగా అవార్డును అందుకుంటాడు. అర్జున్ దగ్గర పనిచేసే డాక్టర్ అను పల్లవికి మేజీషియన్ గా దగ్గరైన భార్గవ్, తన మ్యాజిక్ షోకు అర్జున్ ను కూడా తీసుకురమ్మంటాడు. షోలో అందరి ముందే డాక్టర్ అర్జున్ని పొడిచి చంపేస్తాడు భార్గవ్. తరువాత ఇండియాలోనూ వైద్యాన్ని వ్యాపారంగా మార్చుకోని మోసాలు చేస్తున్న కొంత మందిని కిడ్నాప్ చేస్తాడు. ఈ కేసు డీల్ చేయడానికి వచ్చిన డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్, భార్గవ్ ను అరెస్ట్ చేస్తాడు. కమిషనర్ అరెస్ట్ చేసింది భార్గవ్ నేనా..? చనిపోయిన అర్జున్కి భార్గవ్ కి ఉన్న సంబంధం ఏంటి..? ఈ కథతో యూనివర్సల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డానియోల్ ఆరోగ్యరాజ్కు సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు : మూడు విభిన్న పాత్రల్లో కనిపించిన విజయ్, ప్రతీ పాత్రలోనూ వేరియేషన్ చూపిస్తూ ఆకట్టుకున్నాడు. స్టైల్, యాక్షన్ తో మాస్ ఆడియన్స్ను అలరించటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే సన్నివేశాల్లో విజయ్ నటన కంటతడి పెటిస్తుంది. హీరోయిన్లుగా కాజల్, సమంత నిత్యామీనన్లు కనిపించినా.. చెప్పుకోదగ్గ పాత్ర దక్కింది మాత్రం ఒక్క నిత్యామీనన్కే. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే నిత్యా పాత్ర సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్లో ఒకటి. విలన్ ఎస్జే సూర్య సూపర్బ్ అనిపించాడు. తన బిజినెస్ కోసం ఎలాంటి అన్యాయమైనే చేసే క్రూరుడిగా అద్భుతంగా నటించాడు. ఇతర పాత్రల్లో సత్యరాజ్, వడివేలు, కోవే సరళ తమ పాత్రలకు న్యాయం చేశారు. విశ్లేషణ : ఓ సామాజిక సమస్యను కమర్షియల్ హంగులతో తెరకెక్కించిన చిత్రాలు గతంలోనూ చాలానే వచ్చాయి. ముఖ్యంగా మెడికల్ వ్యవస్థలోని అన్యాయాలను చూపిస్తూ చాలా సినిమాల్లో సీన్స్ ఉన్నాయి. అదే పూర్తి స్థాయి కథాంశంగా రూపొందించిన దర్శకుడు అట్లీ మంచి పేరు తెచ్చుకున్నాడు. విజయ్ లాంటి మాస్ హీరోతో సందేశాన్ని కమర్శియల్ మసాలాలు జోడించి తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. అయితే కేవలం తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన అదిరిందిని తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకోవటం కాస్త కష్టమే. ముఖ్యంగా సినిమాకు ఇంతటి హైప్ రావడానికి కారణమైన డైలాగ్లను మ్యూట్ చేయటం కూడా ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తుంది. తొలి భాగం ఎంటర్టైన్మెంట్తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న దర్శకుడు సెంకడ్హాఫ్లో మాత్రం స్లోగా కథ నడిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు తెలుగు ఆడియన్స్ ను పెద్దగా అలరించకపోయినా.. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా వెంటాడుతుంది. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెడితే బాగుండనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : విజయ్ నటన కథ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ పాటలు నేటివిటీ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
అదిరింది... అసలు రిలీజ్ అవుతుందా..!
ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా మెర్సల్. ఇళయ దళపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగ్లు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అదే సమయంలో డాక్టర్లను కూడా అవమానకరంగా చూపించారంటూ నిరసనలకు దిగటంతో మెర్సల్ సినిమాపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ వివాదాలతో భారీ పబ్లిసిటీ పొందిన మెర్సల్ రికార్డ్ కలెక్షన్లు సాధించి సత్తా చాటింది. అయితే తమిళ సినిమాతో పాటు తెలుగు డబ్బింగ్ వర్షన్ అదిరిందిని కూడా రిలీజ్ చేయాలని భావించారు చిత్రయూనిట్. కాని అనుకున్న సమయానికి తెలుగు వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. తెలుగు నిర్మాతలు రెండు మూడు సార్లు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసినా సినిమా రిలీజ్ కాలేదు. తాజాగా అదిరింది రిలీజ్ను తమిల నిర్మాతలు పూర్తిగా పక్కన పెట్టేశారన్న ప్రచారం జరుగుతోంది. సెన్సార్ సభ్యులు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ప్రకటించినా నిర్మాతలు తెలుగు రిలీజ్పై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ శుక్రవారం అయినా అదిరింది థియేటర్లలోకి వస్తుందని ఎదురుచూసిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. దీంతో ఇక నిర్మాతలు అదిరింది రిలీజ్ను పూర్తిగా పక్కన పెట్టేసినట్టే అని భావిస్తున్నారు ఫ్యాన్స్. -
వాట్ టు డూ... వాట్ నాట్ టు డూ!
‘‘వాట్ టు డూ... ఏం చేయాలి? వాట్ నాట్ టు డూ... ఏం చేయకూడదు? ఈ రెండూ తెలిస్తే... దర్శకుడి వర్క్ చాలా సింపుల్. మాస్ పల్స్ పట్టుకోవడమే సక్సెస్ మంత్ర’’ అంటున్నారు దర్శకుడు అట్లీ. 30 ఏళ్ల ఈ యువకుడు ఇప్పటివరకు తీసింది మూడు సినిమాలే. అందులో రెండు తెలుగులోనూ విడుదలై, అట్లీకి మంచి పేరు తెచ్చాయి. ముచ్చటగా మూడోది... తమిళనాట పలు వివాదాలు, సంచలనాలకు నెలవైన ‘మెర్సల్’ ఈ వారమే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అదిరింది’గా తీసుకొస్తున్నాయి తేనాండాళ్ స్టూడియోస్, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన అట్లీతో ‘సాక్షి సినిమా’ ఇంటర్వ్యూ... ► మీ వైఫ్ తెలుగమ్మాయే! అత్తారింటికి వచ్చినట్టుందా? (నవ్వుతూ...) నిజమే! ప్రియ (అట్లీ వైఫ్) తెలుగమ్మాయే. బట్, సెటిల్డ్ ఇన్ చెన్నై. మా అత్తగారి ఫ్యామిలీ చెన్నైలోనే ఉంటోంది. వాళ్లందరూ ఇంట్లో తెలుగులో మాట్లాడుకుంటారు. తెలుగు అర్థమవుతుంది కానీ... తిరిగి తెలుగులో రిప్లై ఇవ్వలేను. ► మీ చిత్రాలు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. సో, మీ వైఫ్ హ్యాపీయేనా! షి ఈజ్ వెరీ హ్యాపీ! ‘రాజా రాణి’, ‘పోలీస్’ చిత్రాలకు తెలుగులో మంచి స్పందన వచ్చినప్పుడు నాకంటే తనే ఎక్కువ సంతోషపడింది. ‘అదిరింది’ తమిళ్ వెర్షన్ (‘మెర్సల్’) ఆల్మోస్ట్ 150 ప్లస్ క్రోర్స్ కలెక్ట్ చేసింది. సో, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు సినిమా చూస్తారా? అని ఎదురు చూస్తోంది. ► విజయ్తో వరుసగా రెండు సినిమాలు చేశారు. మీ ఇద్దరి వేవ్ లెంగ్త్ బాగా కుదిరినట్లుంది? శంకర్ సార్ దగ్గర ‘ఎందిరన్’ (తెలుగులో ‘రోబో’), ‘నన్బన్’ (తెలుగులో ‘స్నేహితుడు’) చిత్రాలకు రచన, దర్శకత్వ విభాగాల్లో పనిచేశా. ‘నన్బన్’కి చేసేటప్పుడు విజయ్ అన్నతో మంచి రిలేషన్షిప్ ఏర్పడింది. నేను ఆయనకు పెద్ద అభిమానిని కూడా! ‘రాజా రాణి’ తర్వాత విజయ్ అన్నను కలసి ‘తెరి’ (తెలుగులో ‘పోలీస్’) కథ చెప్పా. ఆయనకు కథ నచ్చడంతో వెంటనే షూటింగ్ స్టార్ట్ చేశా. ‘తెరి’ చిత్రీకరణ చివరిదశలో ఉండగానే ‘లెట్స్ డూ వన్ మోర్ ఫిల్మ్’ అని విజయ్ అన్న అన్నారు. ► బేసిగ్గా మీరు రైటర్! విజయేంద్ర ప్రసాద్గారి హెల్ప్ తీసుకోవడానికి కారణమేంటి? యాక్చువల్లీ... విజయేంద్ర ప్రసాద్గారి కథతో సినిమా చేయాలనేది మా ప్లాన్! ఎన్నో డిస్కషన్స్ జరిగాయి. కానీ, కథ కుదరలేదు. అప్పుడు నా దగ్గరున్న రెండు కథలను ఆయనకు చెప్పా. ఓ కథ ఫైనలైజ్ చేశాం. 40 రోజులు డిస్కషన్లూ, స్క్రిప్ట్ వర్కూ జరిగాయి. అప్పుడు సడన్గా నాకో ఐడియా వచ్చింది. విజయేంద్ర ప్రసాద్గారికి చెప్పగా... ‘ఫెంటాస్టిక్ అట్లీ! లెట్స్ డూ దిస్’ అన్నారు. అదే ‘అదిరింది’. అప్పటివరకూ 40 రోజులు వర్క్ చేసిన కథను పక్కనపెట్టేశాం. ► అదేంటో (ఐడియా) మాకూ చెబుతారా? ఓ కవర్లో ప్యాక్ చేసిన ఇన్ఫాంట్ బేబీని నదిలో పడేస్తారు. ఇట్ ఈజ్ ఎ డెడ్ బేబీ. కొందరు ఆ బేబీ దగ్గరకు వెళితే... చెయ్యి కవర్లోంచి బయటకు వచ్చి పైకి లేస్తుంది. రైజింగ్ హ్యాండ్స్ అన్నమాట! అక్కడ రివల్యూషన్ మొదలైందనేది ఐడియా. ► రాజా రాణి, పోలీస్... లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్స్. ఇప్పుడీ సినిమాలో పెద్ద బరువు (మెడికల్ మాఫియా)ను భుజాలపై పెట్టుకునట్టు అన్పించలేదా? ప్రతి సినిమాకూ నేనో మెట్టు ఎదగాలనుకుంటా! ‘రాజా రాణి’ 60 కోట్లు కలెక్ట్ చేసింది. ‘తెరి’ 120 కోట్లు. నెక్ట్స్ నేను తీయబోయేది అంత కంటే కలెక్ట్ చేయాలనుకున్నా. తమిళ్లో రిజల్ట్ చూసిన తర్వాత నేనూ, మా టీమ్ హ్యాపీ. నెక్ట్స్ తీయబోయేది ఇంతకంటే పెద్ద హిట్ కావాలనేది నా టార్గెట్. ► మీపై శంకర్ ఇన్ఫ్లూయెన్స్ ఉందా? యస్! స్ట్రాంగ్ మెసేజ్, కమర్షియల్ ఎలిమెంట్స్... కంప్లీట్గా శంకర్ సార్ స్కూల్ నుంచి వచ్చిన సిన్మాగానే ‘అదిరింది’ ఉంటుంది. ఐ లవ్ శంకర్ సార్ రైటింగ్. ఆరేళ్లు ఆయన దగ్గర పనిచేశా. సో, ఆ ఇన్ఫ్లూయెన్స్ తప్పకుండా ఉంటుంది. ‘మాస్ మసాలా విత్ మెసేజ్’ కథలు ఎలా రాయాలో నాకు తెలుసు. ► హీరోకి దర్శకుడు అభిమాని అయితే అడ్వాంటేజ్ ఏమైనా ఉంటుందా? ‘వాట్ టు డూ... వాట్ నాట్ టు డూ’ అనేది తెలుస్తుంది. అభిమానులు ఏం ఆశిస్తారో దర్శకుడికి అర్థమవుతుంది. ► ఫైనల్లీ... మీ వైఫ్ తెలుగు సినిమాలు చేయమని అడగడం లేదా? అయ్యో! ఎప్పట్నుంచో తెలుగు సినిమా చేయమని అడుగుతోంది. గతేడాది మహేశ్బాబు సార్తో, అల్లు అర్జున్ సార్తో మీటింగ్స్ జరిగాయి. డిస్కషన్స్ జరిగాయి. రైట్ టైమ్, రైట్ స్క్రిప్ట్ కుదిరినప్పుడు తెలుగులో తప్పకుండా సినిమా చేస్తా. చిరంజీవి, పవన్కల్యాణ్, మహేశ్బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్... హీరోలందరూ నా ఫేవరెట్సే. సమంత ఈజ్ మై బ్రదర్! సమంత నాకు మంచి ఫ్రెండ్. తనను నేను ‘తంబి’ (బ్రదర్) అని పిలుస్తా. నన్నూ తను అలానే పిలుస్తుంది. మేమిద్దరం మాట్లాడుకుంటే... ఇద్దరు బ్రదర్స్ మాట్లాడుకున్నట్టే ఉంటుంది. నేను లవ్ సీన్స్ రాసే విధానం (లైక్ ‘రాజా రాణి’) సమంతకు బాగా ఇష్టం. ‘అదిరింది’లో క్యూట్ అండ్ బబ్లీ క్యారెక్టర్ చేసింది. బార్బీ డాల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో కాజల్ అగర్వాల్ కనిపిస్తుంది. షి ఈజ్ వెరీ మెచ్యూర్డ్ అండ్ క్లాసీ హీరోయిన్. సినిమాకు పిల్లర్ వంటి ఎమోషనల్ రోల్లో నిత్యా మీనన్ నటించారు. -
కట్టలు తెంచుకున్న అభిమానం.. థియేటర్లు బంద్!
బెంగళూరు : అభిమానం కట్టలు తెంచుకునే పరిస్థితి ఎలా ఉంటుందంటే హీరోలు, దర్శకనిర్మాతలకు చిక్కులు తెచ్చి పెడుతుంటాయి. అసలే వివాదాలు, ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని మరి చివరి సమయంలో విడుదలైన సినిమా మెర్శల్. అయితే బుధవారం ఈ మూవీ తమిళనాడు, కర్ణాటకలలో విడుదలకాగా.. అభిమానుల అత్యుత్సాహం కారణంగా బెంగళూరులో కొన్ని థియేటర్లలో షోలు నడవలేదని తెలుస్తోంది. బెంగళూరులో ఓ థియేటర్ ముందు నిల్చున్న స్థానికుడిపై విజయ్ అభిమానులు దాడి చేశారు. బాధితుడు కన్నడ మద్ధతుదారులతో అక్కడికి వచ్చి గొడవకుదిగగా, విజయ్ అభిమానులు(తమిళనాడు) కూడా తామేం తక్కువ తినలేదంటూ రెచ్చిపోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విజయ్ అభిమానులు, బెంగళూరు వాసులకు మధ్య గొడవ పెద్దది కావడంతో కొన్ని షో ప్రదర్శనను రద్దు చేసి థియేటర్లను మూసివేసినట్లు సమాచారం. అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్, సమంత, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ లు నాయికలుగా నటించారు. చిత్రటైటిల్ వ్యవహారంలో సీఎం ఎడపాటి పళనిస్వామిని విజయ్ కలవడంతో జంతు సంక్షేమ శాఖాధికారులు ఎన్ఓసీ(నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) ఇచ్చిన విషయం తెలిసిందే. -
అడ్డంకులను ఎదురొడ్డి వస్తున్న స్టార్ హీరో సినిమా
షరామామూలుగానే అడ్డంకులను ఎదురొడ్డి ఇళయదళపతి విజయ్ నటించిన మెర్శల్ చిత్రం వెండితరపైకి వచ్చేస్తోంది. శ్రీతేనాండాళ్ ఫిలింస్ నిర్మించ్డిన ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలను అందించారు. సమంత, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ లు నాయికలుగా నటించిన ఈ భారీ చిత్రాన్ని దీపావళికి విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ముందుగానే వెల్లడించారు. అయితే ఆ మధ్య చిత్రటైటిల్ వ్యవహారంలో కోర్టుకెళ్లి సాధించుకున్న మెర్శల్కు విడుదల దగ్గర పడుతున్న సమయంలో జంతు సంక్షేమ శాఖాధికారులు ఎన్ఓసీ(నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్)ను ఇవ్వడానికి నిరాకరించడంతో అటు చిత్ర వర్గాల్లోనూ, ఇటు విజయ్ అభిమానుల్లోనూ టెన్షన్ మొదలైంది. రాజకీయ హస్తం ఉందా? మెర్శల్ చిత్రానికి జంతు సంక్షేమ శాఖ నుంచి ఎన్ ఓసీ రాకపోవడంపై చిత్రవర్గాల్లో రకరకాల ప్రసారం జోరందుకుంది. దీనికి వెనుక రాజకీయ హస్తం ఉందంటూ కొందరు ఆరోపించడం కలకలానికి తెరలేపినట్లయ్యింది. ఈ సమయాల్లో విజయ్ ముఖ్యమంత్రులను కలవడం పరిపాటిగా మారింది. ఇంతకు ముందు కూడా తలైవా చిత్ర విడుదల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జయలలితను కలిశారు. ఇప్పుడు ఎడపాటి పళనిస్వామిని కూడా కలిశారు. ఇలా ముఖ్యమంత్రులను కలిసి విజ్ఞప్తి చేసుకోవలసిన పరిస్థితి విజయ్కు నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. కాగా చిత్రం బుధవారం విడుదల కావలసి ఉంది. సోమవారం మధ్యాహ్నం వరకూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ చర్చల్లో జంతు సంక్షేమ శాఖ ప్రత్యేక అధికారి ముంబై నుంచి వచ్చి పాల్గొన్నట్లు సమాచారం. మెర్శల్ చిత్రంలో జంతువులకు సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయని, అందుకు తగిన ఆధారాలను చిత్ర వర్గాలు సమర్పించని కారణంగానే ఎ¯ŒSఓసీ ఇవ్వలేదనీ తెలిసింది. ఎట్టకేలకు సోమవారం సాయంత్రం మెర్శల్ చిత్రానికి జంతు సంక్షేమ శాఖ ఎ¯ŒSఓసీని అందించింది. మొత్తం మీద మెర్శల్ అన్ని అడ్డంకులను ఎదుర్కొని బుధవారం విడుదల కాబోతోందన్న విషయం విజయ్ అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. -
కబాలి, బాహుబలి 2 తరువాత ‘అదిరింది’
సౌత్ సినిమాలకు ఓవర్ సీస్ మార్కెట్ కీలకంగా మారింది. సొంత రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఓపెనింగ్ వసూళ్లు ఎలాగూ వస్తాయి. అదే సమయంలో ఓవర్ సీస్ మీద కాస్త ఎక్కువ దృష్టి పెడితే భారీ రికార్డ్ లు ఖాయం అని ఫీల్ అవుతున్నారు సినీ ప్రముఖులు. అందుకే మన సినిమాలను ఇతర దేశాల్లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలకు విదేశాల్లో మరింత ప్రచారం కల్పించేందుకు అక్కడి ప్రముఖ థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. పారిస్ లోని 'లె గ్రాండ్ రెక్స్' థియేటర్ అంతర్జాతీయ స్థాయిలో ఫేమస్. దాదాపు రెండు వేల మంది ప్రేక్షకులు ఒకేసారి సినిమా చూసేందుకు అవకాశం ఉన్న ఈ థియేటర్లో ప్రదర్శనకు అర్హత సాధించటం భారతీయ చిత్రాలకు అరుదైన ఘనతే. ఇప్పటి వరకు మన దేశం నుంచి కబాలి, బాహుబలి 2 చిత్రాలను మాత్రమే ఈ థియేటర్లో ప్రదర్శించారు. తాజా విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా మెర్సల్ ను పారిస్ 'లె గ్రాండ్ రెక్స్' థియేటర్ లో ప్రదర్శించనున్నారట. ఈ నెల 18న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను అదే రోజు రెక్స్ థియేటర్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో అదిరింది పేరుతో అదే రోజు రిలీజ్ అవుతోంది. -
విజయ్ కొత్త సినిమా 'అదిరింది'
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా మెర్సల్. యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాను తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలంగా తెలుగులో మార్కెట్ కోసం కష్టపడుతున్న విజయ్ మెర్సల్ డబ్బింగ్ వర్షన్ తో టాలీవుడ్ లోనూ జెండా పాతేయాలని ప్లాన్ చేస్తున్నాడు. బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయ్ మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. గతంలో అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన తేరి తమిళనాట ఘనవిజయం సాధించటంతో మెర్సల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను తెలుగు అదిరింది పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కాజల్, నిత్యామీనన్, సమంతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ తేండాల్ ఫిలింస్ సంస్థ తమ బ్యానర్ లో 100 సినిమాగా చిత్రాన్ని నిర్మిస్తోంది. -
కాజల్ ఫుల్ జోష్
కాజల్ అగర్వాల్ ఫుల్ జోష్గా ఉన్నారు. షూటింగ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ జాలీ మూడ్లో సెల్ఫీల మీద సెల్ఫీలు దిగారు. వాటిని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. ఒకటి దర్శకుడు అట్లీతో కాజల్ దిగిన ఫొటో. ‘విత్ మై సూపర్ కూల్ డైరెక్టర్’ అంటూ దర్శకుడితో ఉన్న ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారామె.విజయ్ సరసన కాజల్ కథానాయికగా నటిస్తోన్న తమిళ చిత్రానికి దర్శకుడు అట్లీనే. ఈయనగారి సినిమాల్లో కథానాయికల పాత్రలకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఉదాహరణకు ‘రాజా రాణి’లో నయనతార పాత్ర. ఇప్పుడు తాజా సినిమాలో కూడా కాజల్ది మంచి పాత్రేనట. బహుశా కాజల్ జోష్కి అది కూడా ఓ కారణం అయ్యుండొచ్చు.ఈ సినిమా ఫస్ట్ లుక్ను జూన్ 22న, ఆగస్టులో పాటలను, అక్టోబర్లో దీపావళికి చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు అట్లీ ప్రకటించారు. గత ఏడాది అట్లీ, విజయ్ కాంబినేషన్లో వచ్చిన ‘తేరి’ చిత్రం తమిళనాట ఘనవిజయం సాధించింది. దాంతో తాజా సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రవిజయంపై కాజల్ కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. -
టైటిల్ కష్టాల్లో మరో స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు సూపర్ ఫాంలో ఉన్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ ప్రస్తుతం తన కెరీర్ లోనే తొలి సారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ తెనండల్ ఫిలింస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. విజయ్ సరసన కాజల్, సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు దళపతి అనే టైటిల్ నిర్ణయించారు. అయితే రజనీకాంత్ హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన దళపతి సినిమాను నిర్మించిన జీవీ ఫిలింస్ ను టైటిల్ విషయమై విజయ్ టీం సంప్రదించగా.. జీవీ టీం నో చెప్పిందట. దీంతో మరో దారి లేక వేరే టైటిల్ ను నిర్ణయించే పనిలో పడ్డారు చిత్రయూనిట్. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ లోగోను రిలీజ్ చేయనున్నారు. -
అమితాబ్ నిర్మాణంలో సౌత్ సినిమా
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమా పై ఆసక్తికరమైన వార్త ఒకటి కోలివుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అజిత్ హీరోగా తేరి ఫేం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన సొంత నిర్మాన సంస్థ అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్ బ్యానర్ పై నిర్మించనున్నాడట. ప్రస్తుతానికి అఫీషియల్ గా కన్ఫామ్ చేయకపోయినా ఈ కాంబినేషన్ పై వార్తలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. గతంలో కూడా అజిత్ హీరోగా ఓ సినిమా తమిళ సినిమాను నిర్మించాడు బిగ్ బి. అజిత్, విక్రమ్, మహేశ్వరిలు ప్రదాన పాత్రల్లో తెరకెక్కిన ఉల్లాసం సినిమాను నిర్మించాడు బిగ్ బి. ఈ సినిమా విజయం సాధించకపోవటంతో తరువాత సౌత్ సినిమాను నిర్మించే ప్రయత్నం చేయలేదు. దాదాపు 19 ఏళ్ల తరువాత మరోసారి అమితాబ్ సౌత్ లో సినిమాలో సినిమాను నిర్మించనుండటంతో ఈ సినిమా కోసం బాలీవుడ్ మీడియా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. -
ఆ దర్శకులతో సూపర్ స్టార్
ఇన్నాళ్లు తెలుగు సినిమా, తెలుగు టెక్నిషియన్లు అంటూ ఇక్కడే కాలం గడిపేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు రూట్ మార్చాడు. మార్కెట్ను విస్తరించుకునేందుకు పరభాషా దర్శకుల మీద దృష్టిపెడుతున్నాడు. ఇప్పటికే శ్రీమంతుడు సినిమాను తమిళ్లో కూడా రిలీజ్ చేసిన మహేష్. తన నెక్ట్స్ సినిమాను బైలింగ్యువల్గా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న మహేష్, ఆ సినిమా పూర్తవ్వగానే తమిళ స్టార్ డైరెక్టర్ మురుగుదాస్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తరువాత కూడా తమిళ దర్శకులతోనే పనిచేసే ఆలోచనలో ఉన్నాడు ప్రిన్స్. విజయ్ హీరోగా తెరకెక్కిన తేరి సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న అట్లీ దర్వకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న టాక్ వినిపిస్తోంది. వీళ్లేకాదు తమిళ నాట మాస్ డైరెక్టర్గా పేరున్న లింగుసామి, మహేష్ హీరోగా ఓ యాక్షన్ డ్రామా తెరకెక్కించాలని చాలారోజులుగా ప్రయత్నిస్తున్నాడు. తనీఒరువన్ సినిమాతో నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న జయం రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానంటూ మహేష్ స్వయంగా మాట ఇచ్చాడు. ఇలా వరుసగా తమిళ దర్శకులతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్న మహేష్, మన దర్శకులకు టైం ఎప్పుడిస్తాడో మరి. -
సమంత కూడా మైక్ ముందుకు వచ్చింది
ఈ జనరేషన్ హీరోలు హీరోయిన్లు ఏకంగా పాటలు పాడేస్తుంటే తాను వెనకపడిపోతానని ఫీల్ అయ్యినట్టుంది అందాల భామ సమంత. అందుకే మరీ పాటలు పాడేంత టాలెంట్ లేకపోయినా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని డిసైడ్ అయ్యింది. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సమంత తొలి సినిమా నుంచి తన పాత్రకు చిన్మయితోనే డబ్బింగ్ చెప్పించుకుంటుంది. ప్రస్తుతం తమిళ్లో విజయ్ సరసన హీరోయిన్గా నటిస్తున్న తేరి సినిమాతో తొలిసారిగా సొంతం గొంతు వినిపించనుంది ఈ బ్యూటి. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు ఇప్పటికే డబ్బింగ్ కూడా పూర్తి చేసింది జెస్సీ. తొలిసారిగా డబ్బింగ్ చెప్పడంతో యమా హ్యాపిగా ఉన్న సామ్ తన ఆనందాన్ని ట్విట్టర్లో వెల్లడించింది. సమంత తేరితో పాటు తెలుగులో అ..ఆ.., బ్రహ్మోత్సవం సినిమాల్లోనూ హీరోయిన్గా నటిస్తోంది. Dubbing over #Theri .Thankyou my amazing director @Atlee_dir for a role close to my heart.So much love@Jagadishbliss pic.twitter.com/UtHUDcCB0A — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) February 27, 2016 -
విజయ్ అభిమానులకు దీపావళి గిఫ్ట్
పులి సినిమాతో అభిమానులను నిరాశపరిచిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, వీలైనంత త్వరగా తన అభిమానులకు సక్సెస్ ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాడు. తన తదుపరి సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావటం కోసం శరవేగంగా షూటింగ్ చేస్తున్నాడు. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. పులి డిజాస్టర్తో నిరాశలో ఉన్న ఇలయ దళపతి అభిమానులకు దీపావళికి భారీ కానుక ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు విజయ్. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన నెక్ట్స్ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్తో పాటు టీజర్ను కూడా రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు విజయ్ 59గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా టైటిల్ను కూడా అదే రోజు ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. విజయ్ సరసన సమంత, అమీజాక్సన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. సీనియర్ డైరెక్టర్ మహేంద్రన్తో పాటు, సత్యారాజ్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ వరకు షూటింగ్ పూర్తి చేసి 2016 సమ్మర్లో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.