bike rally
-
పోలీసులు ఇలా.. వాహనదారులు అలా..!
ప్రయాణాల్లో హెల్మెట్ తప్పకుండా ధరించాలంటూ నెల్లూరులో (Nellore) పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేస్తుండగా.. ప్రజలు మాత్రం ఇవేమీ తమకు పట్టవంటూ ర్యాలీ పక్కనుండే హెల్మెట్ (Helmet) లేకుండా ఇలా ప్రయాణిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరుఅనంతపురంలో సూర్యోదయం (Sun Rise) వేళ ప్రకృతి తన సుందర రూపాన్ని ఆవిష్కరించింది. ఇందులో భాగంగా సర్పం ఆకారంలో ఉన్న మేఘం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ దృశ్యాన్ని పలువురు తమ సెల్ఫోన్ల్లో చిత్రీకరించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం విశాఖపట్నంలో 27వ రాష్ట్ర స్థాయి పాలిటెక్నిక్ కాలేజీల క్రీడలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతున్నారు. ఇందులో భాగంగా ఓ విద్యార్థి ఇలా హైజంప్ (High Jump) చేస్తున్నాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం కొన్నేళ్లుగా తమ కాలనీలోనే ఉంటున్న ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను తమకు దూరంలోని మోడల్ పాఠశాలకు తరలిస్తున్నారని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం చుంచులూరు ఎస్సీ కాలనీ వాసులు ధర్నా. అనంతరం ఆత్మకూరు వెళ్లి ఆర్డీవో పావనికి వినతిపత్రం సమర్పించారు.పాఠశాలలో అక్షర జ్ఞాపకాల దొంతరలతో తడవాల్సిన బాల్యం పొట్ట చేతబట్టుకుని బతుకు జీవుడా అంటూ మండే ఎండలో స్వేదంతో తడిసి ముద్దవుతోంది. ప్రభుత్వం బడి బయట ఉన్న బడి ఈడు చిన్నారులను పాఠశాల బాట పట్టించడంలో విఫలమైంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు–చినకోండ్రుపాడు, నిమ్మగడ్డవారిపాలెం మార్గాల్లో చిన్నారులు ఇలా మేకలు కాసుకుంటూ కనిపించారు.శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ బుధవారం ప్రయోగించిన వందో ప్రయోగం విజయవంతం కావడంతో చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలంలోని టేకుమంద జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు జేజేలు పలికారు. జయహో ఇస్రో, జయహో భారత్ అంటూ పాఠశాలకు చెందిన కలాం సైన్స్ క్లబ్ నినాదాలు చేసింది. ‘ఇస్రో 100’ అనే అక్షర ప్రదర్శన నిర్వహించి జేజేలు పలికారు. -
కోస్ట్గార్డ్ రైజింగ్ డే బైక్ ర్యాలీ ప్రారంభం
సింథియా: ఇండియన్ కోస్ట్గార్డ్ 49వ రైజింగ్ డే వేడుకల్లో భాగంగా మంగళవారం భారీ బైక్ ర్యాలీని కోస్ట్గార్డ్ సిబ్బంది చేపట్టారు. విశాఖపట్నం నుంచి ప్రారంభమై చెన్నై వరకు సాగనున్న ఈ ర్యాలీకి అడిషనల్ డైరెక్టర్ జనరల్ డానీ మైఖేల్, పీటీఎం, టీఎం(జీ) కోస్ట్గార్డ్ కమాండర్ జెండా ఊపి ప్రారంభించారు.49 మంది కోస్ట్గార్డ్ సిబ్బందితో ఈ బైక్ ర్యాలీ విశాఖలో ప్రారంభమై సుమారు 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఫిబ్రవరి 1న చెన్నైలోని ట్యూటికోరిన్ మెరైన్ బీచ్ వద్ద ముగుస్తుందని నేవీ వర్గాలు తెలిపాయి. ఏపీలో సుమారు 850 కిలోమీటర్ల ప్రయాణంలో కాకినాడ, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్ట్లను సందర్శించి రైజింగ్ డేపై అవగాహనతో పాటు రహదారి, సముద్ర భద్రత, రక్షణ విషయాలపై అవగాహన కలిగించనున్నారు. ఈ మోటారు బైక్ ర్యాలీని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. -
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం చలో కలెక్టరేట్ కార్యక్రమం
-
బద్వేలులో YSRCP నేతల బైక్ ర్యాలీ
-
బైక్ ర్యాలీతో సీఎం జగన్ కు ఘన స్వాగతం...
-
పుప్పాల వాసుబాబు భారీ బైక్ ర్యాలి
-
భీమిలిలో వైఎస్సార్సీపీ నాయకుల భారీ బైక్ ర్యాలీ..
-
కొడాలి నాని బైక్ ర్యాలీ.. జై బీమ్...!
-
అంబటి రాయుడు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు
-
అభిమానుల ‘ఆత్మీయ’ వరద
సాక్షి, నంద్యాల: సామాజిక సాధికార యాత్రకు ప్రజలు పోటెత్తారు. ఆత్మకూరు పట్టణం జనసంద్రాన్ని తలపించింది. కనుచూపు మేర ఎటుచూసినా, ఇసుకేస్తే రాలనంతలా జనం తరలివచ్చారు. సుమారు 500 బైక్లతో నిర్వహించిన బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ అయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గజ మాలలు, డప్పు వాయిద్యాలు, బాణసంచా పేలుళ్లతో తమ అభిమాన నాయకులకు అపూర్వ స్వాగతం పలికారు. కరోనాలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదు: డిప్యూటీ సీఎం అంజాద్బాషా కరోనా కాటేసినా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని డిప్యూటీ సీఎం అంజాద్బాషా ప్రశంసించారు. నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజమైతే.. నమ్మిన వ్యక్తిని గుండెల్లో పెట్టుకునే వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాం కాబట్టే.. తామంతా కాలర్ ఎగరేసి ఓట్లడుగుతున్నట్టు తెలిపారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని వారిని ఓట్లడుగుతారని ఎద్దేవా చేశారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించి అమలు చేశారు: మంత్రి కారుమూరి బీసీ డిక్లరేషన్ సభలో చెప్పిన ప్రతి మాటనూ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ అమలు చేశారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం యాదవులకు పదవులు ఇవ్వలేదని, కేవలం సీఎం జగన్ మాత్రమే యాదవులకు సముచిత గౌరవం ఇచ్చారని చెప్పారు. మూడుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. తన కులం వారికి కాకుండా బీసీ, ఎస్సీ, మైనార్టీలకు ఏనాడూ రాజ్యసభ టికెట్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపి బీసీల గళాన్ని దేశవ్యాప్తంగా వినిపించేలా సీఎం జగన్ కృషి చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా తాను అమెరికా వెళ్లినప్పుడు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తనతో మాట్లాడిన మాటలను కారుమూరి గుర్తు చేసుకున్నారు. ‘మా నాన్న ఓ రిక్షా కార్మికుడు.. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్మెంట్తో నేను చదువుకుని అమెరికాకు రాగలిగా.. మా కుటుంబమంతా వైఎస్సార్ కుటుంబానికి రుణపడి ఉంటుంది’.. అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నాడని చెప్పారు. దళితుల పట్ల నిబద్దతను చాటుకున్న సీఎం జగన్ : మంత్రి ఆదిమూలపు పూర్వకాలంలో దళితులు చదువుకుంటే నాలుక కోసేవారని, చెవుల్లో సీసం పోసేవారని.. కానీ, సీఎం జగన్ తన కేబినెట్లో ఓ దళితుడిని విద్యాశాఖ మంత్రిగా చేసి దళితుల పట్ల తనకున్న నిబద్ధతను నిరూపించుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 2019లో 151 కి.మీ వేగంతో ఫ్యాన్ను తిప్పారని, 2024 ఎన్నికల్లో 175 కి.మీ వేగంతో ఫ్యాన్ను తిప్పాలని పిలుపునిచ్చారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, ఇసాక్ బాషా, ఎమ్మెల్యేలు హఫీజ్ఖాన్, తొగురు ఆర్థర్, కర్నూలు మేయర్ రామయ్య పాల్గొన్నారు. -
ఫ్యామిలీ రాష్ట్ర సమితిగా మార్చుకోండి
కవాడిగూడ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరును ఫ్యామిలీ రాష్ట్ర సమితిగా మార్చుకోవాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఎద్దేవా చేశారు. గత పదేళ్లుగా కేసీఆర్ కుటుంబం తెలంగాణలోని వనరులను అడ్డగోలుగా దోచుకుందని ధ్వజమెత్తారు. ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూసరాజును గెలిపించాలని కోరుతూ మంగళవారం కవాడిగూడ డివిజన్ పరిధిలోని దోమలగూడ ఏవీ కళాశాల నుంచి భారీ బైక్ర్యాలీని నిర్వహించారు. ర్యాలీనుద్దేశించి ఫడ్నవీస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కేవలం తన కుటుంబ ఆస్తులను ఏవిధంగా పెంచుకోవాలనే ఆలోచనతోనే పాలన సాగించారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాల ప్రచారానికి చేసిన ఖర్చుతో రాష్ట్రంలోని దళిత కుటుంబాలను మొత్తం అభివృద్ధి చేయవచ్చన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలను కొనే పార్టీ బీఆర్ఎస్ అయితే, అమ్ముడుపోయే పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్కటేనని ఆరోపించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే బీఆర్ఎస్కి గొర్రెల్లా అమ్ముడు పోతారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే తెలంగాణలో బీసీల రాజ్యం వస్తుందని భరోసానిచ్చారు. ముషీరాబాద్ బాధ్యత నాదే రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి పూసరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే తప్ప బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీలేదన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పూసరాజును గెలిపిస్తే ముషీరాబాద్ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ ముషీరాబాద్ నియోజవర్గ కన్వి నర్ రమేష్ రాం, కార్పొరేటర్లు జి. రచనశ్రీ, కె.రవిచారి, సుప్రియా నవీన్గౌడ్, పావని వినయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రాజాంలో సామాజిక జైత్రయాత్ర
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సుపరిపాలనలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధిని ప్రతిబింబిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయనగరం జిల్లా రాజాంలో ఆ వర్గాల జైత్రయాత్రలా ఘనంగా సాగింది. ఈ యాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. యువత, మహిళలు యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజాం మండలం బొద్దాం గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను యాత్రలో పాల్గొన్న మంత్రులు, ఇతర నేతలు ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి మీదుగా ప్రారంభమైన యాత్ర రాజాం పట్టణ సమీపంలో కంచరాం తృప్తి రిసార్ట్ వరకూ సాగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు రాజాం పట్టణంలోకి ప్రవేశించింది. దాదాపు మూడు వేల మంది బైక్ర్యాలీగా బస్సు యాత్ర ముందు సాగారు. అంబేడ్కర్ కూడలిలో సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి మండలాలకు చెందిన వేలాది మంది తరలివచ్చారు. వెనుకబడిన వర్గాలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును నేతలు వివరిస్తుంటే చప్పట్లతో స్వాగతించారు. జై జగన్.. జై జై జగన్ అంటూ నినదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మ బంధువు సీఎం జగన్: స్పీకర్ తమ్మినేని సీతారాం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మ బంధువు అని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. దేశంలో మరే సీఎంచేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని పదవుల్లో పెద్దపీట వేసి, అనేక పథకాలతో అభివృద్ధి పథంవైపు నడిపిస్తున్నారని చెప్పారు. అందుకే ఈరోజు సామాజిక సాధికార యాత్రను ఓ జైత్రయాత్ర నిర్వహించుకోగలుగుతున్నామన్నారు. 139 బీసీ సామాజికవర్గాలను గుర్తించి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని, వాటికి చైర్మన్లతో పాటు 700 డైరెక్టర్ల పదవులను ఇచ్చి ఆత్మగౌరవాన్ని కాపాడారని వివరించారు. కులగణన జరగాలని దేశంలోనే మొట్టమొదటగా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నదీ సీఎం జగనే అని చెప్పారు. విద్య, వైద్యాన్ని బడుగు, బలహీనవర్గాలకు చేరువ చేస్తూ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని, ఇదే అసలైన అభివృద్ధి అని వివరించారు. తాండ్ర పాపారాయుడు పుట్టిన గడ్డపై ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే టీడీపీ నాయకులను తిప్పికొడతామని హెచ్చరించారు. సంతృప్తకర స్థాయిలో సంక్షేమం: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ నాలుగున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్ ఈ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అమలు చేస్తున్నారని, అన్ని రంగాలనూ అభివృద్ధి చేస్తూ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి: ఎమ్మెల్యే జోగులు రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ రాజాం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరిగిందన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఈ ప్రాంతానికి చెందిన సామాజిక వర్గానికి 70 శాతం మేర పదవులు వచ్చాయని వెల్లడించారు. నాగావళి నదిపై రుషింగి, కిమ్మి గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 25 కోట్లు మంజూరుచేస్తే, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పనులు పూర్తిచేయించారని చెప్పారు. తోటపల్లి రెగ్యులేటర్ కుడికాలువ ఆధునికీకరణకు రూ.40 కోట్లు మంజూరుచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, విశ్వాసరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, అలజంగి జోగారావు, బొత్స అప్పలనర్సయ్య, శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
రాహుల్ బైక్ ర్యాలీలో అపశ్రుతి..కొండా సురేఖకు గాయాలు
సాక్షి, భూపాలపల్లి: కాంగ్రెస్ విజయ భేరి బస్సు యాత్రలో మాజీ మంత్రి కొండా సురేఖకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. భూపాలపల్లిలో బైక్ ర్యాలీలో పాల్గొన్న సురేఖ స్కూటీ నడుపుతూ కిందపడ్డారు. ముఖానికి, చేతికి గాయాలయ్యాయి. వెంటనే ఆమె అనుచరులు హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సురేఖ చికిత్స పొందుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో కాంగ్రెస్ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. భూపాలపల్లి పట్టణంలోని బాంబుల గడ్డ వరకు నిరుద్యోగులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ ర్యాలీకి తరలివచ్చారు. చదవండి: కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ ఫోకస్ ఎందుకు లేదు: రాహుల్ ఫైర్ -
రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ
-
తెలంగాణలో సభపెట్టే నైతికత సోనియాకు లేదు
సాక్షిప్రతినిధి, వరంగల్ / రసూల్పుర: కాంగ్రెస్, బీఆర్ఎస్లు తెలంగాణ చరిత్ర, విమోచనదినం ప్రాధాన్యతను వక్రీకరిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి ధ్వజమె త్తారు. సెప్టెంబర్ 17న తెలంగాణలో మీటింగ్ పెట్టే నైతికత కాంగ్రెస్ పార్టీకి, సోనియాకు లేవని, హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకోవాలంటే భాగ్య లక్ష్మి ఆలయం వద్ద నెహ్రూ కుటుంబం రక్తం వచ్చేలా ముక్కు నేలకు రాయాలన్నారు. అధికారంలోకి రాకముందు విమోచన దినోత్సవాన్ని జరపా లన్న కేసీఆర్.. ఆ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17ను ‘విమోచన దినోత్సవం‘గా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్ నుంచి చేపట్టిన బైక్ర్యాలీ శుక్రవారం సాయంత్రం హనుమకొండ జిల్లా పరకాల అమరథామం వద్ద ముగిసింది. అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం పరకాల అంగడి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కిషన్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను దాచిపెట్టిన మొదటి ముద్దాయి కాంగ్రెస్ అని, తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ సమాధానం చెప్పాలని లేకుంటే సోనియాగాంధీ కుటుంబ అడుగుపెట్టే అర్హత లేదన్నారు. సీఎం కేసీఆర్ను మజ్లిస్ ఆత్మ ఆడిస్తుందని, ఆ పార్టీకి భయపడే నాడు కాంగ్రెస్, నేడు బీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని కిషన్రెడ్డి ఆరోపించారు. నైజాం ఓడిపోయిన దినం ఎలా సమైక్యత దినం అవుతుందో ఆ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు చెప్పాలని, తెలంగాణ విమోచన దినాన్ని సమైక్య దినంగా వక్రీకరిస్తున్న కేసీఆర్ పరకాలకు వస్తావా తేల్చుకుందాం? అని సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని, పరకాల అమరధామం వద్ద అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహిస్తామన్నారు. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ కేసీఆర్ కూడా అప్పటి నిజాంలాగా అరెస్టులు చేస్తూ నిర్బంధాలు విధిస్తున్నారని, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం బ్రిటిష్ పాలనలో, నిజాం పాలనలో ఉండేది కాదని, ఇప్పుడు ఇక్కడా అదే పరిస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రావు పద్మ, రావుల కిషన్లతోపాటు పలువురు పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్ టు పరకాల తెలంగాణ విమోచన ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి పరకాల అమరధామం వరకు బీజేపీ బైక్ర్యాలీని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాశ్ జవదేకర్ జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి స్వయంగా బైక్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందు ఆయన పరేడ్ గ్రౌండ్లో విమోచన దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. పరేడ్ మైదానం నుంచి సికింద్రాబాద్ క్లాక్ టవర్, ఓయూ. తార్నాక, ఉప్పల్, భువనగిరి, జనగాం, పరకాల వరకు 200 కిలోమీటర్లు ఏడు గంటల పాటు బైక్ర్యాలీ కొనసాగింది. కేంద్రమంత్రి కిషన్రెడ్డికి అడుగడుగునా పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. -
బైక్ ర్యాలీలో స్టార్ హీరోయిన్.. అదే కారణమా?
మిలియన్ స్టూడియో పతాకంపై ఎంఎస్ మన్సూర్ నిర్మించిన చిత్రం 'వెపన్'. సత్యరాజ్, వసంత రవి, తాన్య హోప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గుహన్ చెన్నియప్పన్ దర్శకత్వం వహించారు. యాక్షన్ కిల్లర్ నేపథ్యంలో కొత్త టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్.. కానీ?) కాగా చిత్ర నిర్మాత ఆదివారం ఉదయం ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులకు అవగాహన కలిగించే విధంగా వేర్ హెల్మెట్ పేరుతో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వసంత రవి, తాన్య హోప్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత మన్సూర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. టూ వీలర్స్ హెల్మెట్లు ధరించాల్సిన ఆవశ్యకత, సురక్షితంగా వాహనాలను నడపడం గురించి అవగాహన కలిగించే విధంగా ఈ కార్యక్రమం ఉదయం 6 గంటలకు స్థానిక ఓఎంఆర్ రోడ్లో ప్రారంభమై తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాంతం వరకు సాగింది. (ఇదీ చదవండి: కేఏ పాల్ని కలిసిన నవీన్ పొలిశెట్టి.. ఏం మాట్లాడారు?) -
పవన్పై అనకాపల్లివాసుల అసహనం
సాక్షి, విశాఖపట్నం: ‘‘జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన పర్యటనతో ఏం సాధిస్తున్నారు?. మిడిమిడి జ్ఞానంతో ప్రభుత్వంపై ఇష్టానుసారం విమర్శలు చేయడం తప్పించి!’’ అనే విమర్శే వినిపిస్తోంది ప్రత్యర్థుల నుంచి. ఈ క్రమంలో.. స్థానికులు సైతం పవన్, జనసైనికుల తీరుతో ఇబ్బందులు పడుతున్నారు. ఏదో ఒకటి మాట్లాడడం తప్పించి.. రూల్స్ ఫాలో అయ్యేది లేదు.. ఓ క్రమశిక్షణా లేదు.. జనసైనికులతో కలిసి తన పర్యటనతో పవన్ విశాఖ వాసులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా తాజాగా పవన్ కళ్యాణ్ ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి హైవేకు ఇరువైపులా బైక్ ర్యాలీతో పవన్ దూసుకుపోగా.. ఆ ట్రాఫిక్ మధ్యలోనే ఆగిపోయి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మొన్న రుషికొండ పర్యటన సందర్భంగా హడావిడి చేసిన పవన్.. ముందస్తు సమాచారం ఇచ్చి భారీగా అభిమానులు గుమిగూడేందుకు కారణం అయ్యాడు. పైగా సాయంత్రం సమయం కావడంతో జనాలు ట్రాఫిక్ రద్దీతో బాగా ఇబ్బంది పడ్డారు. ఇదీ చదవండి: గొడవలు చేయడానికే పవన్ రుషికొండ వెళ్లింది! -
ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ
-
విశాఖ తూర్పు నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ
-
Ananthapur: టవర్క్లాక్ బ్రిడ్జిపై రాకపోకలు షురూ
అనంతపురం క్రైం: జిల్లా కేంద్రం అనంతపురానికి మణిహారమైన టవర్క్లాక్ బ్రిడ్జిపై సోమవారం రాకపోకలు మొదలయ్యాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమందితో నిర్వహించిన బైక్ ర్యాలీతో బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. బళ్లారి బైపాస్లోని ఎంజీ పెట్రోల్ బంక్ నుంచి బ్రిడ్జి మీదుగా టవర్క్లాక్, సప్తగిరి సర్కిల్, ఐరన్బ్రిడ్జ్, గాంధీ బజార్, శ్రీకంఠం సర్కిల్, రైల్వే ఫీడర్ రోడ్డు, ఆర్ట్స్ కళాశాల వరకు ఉల్లాసంగా.. ఉత్సాహంగా ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే ‘అనంత’ పార్టీ జెండా పట్టుకుని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఎమ్మెల్యే అనంతను పార్టీ కార్యకర్తలు భుజాలపైకి ఎత్తుకుని ఊరేగించారు. జై జగన్.. జై అనంత అంటూ నినదించారు. నూతన బ్రిడ్జిని తిలకించేందుకు వేలాదిమంది ప్రజలు తరలిరావడంతో టవర్క్లాక్ – పీటీసీ వరకు పండుగ వాతావరణం కనిపించింది. ‘అనంత’లో రూ.650 కోట్ల అభివృద్ధి కోవిడ్తో ఏడాదిన్నర కాలం గడిచిపోయినా...మిగతా రెండున్నరేళ్లలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రూ.650 కోట్లతో రోడ్లు, డ్రెయినేజీలు తదితర అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో ఆర్అండ్బీ పరిధిలోకి తీసుకొచ్చిన ఫ్లై ఓవర్ను ఎన్హెచ్ పరిధిలోకి తీసుకొచ్చి అభివృద్ధి చేసి.. ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని ఎంపీ తలారి రంగయ్యతో కలిసి సీఎం దృష్టికి తీసుకుపోయామన్నారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి అర్బన్ లింక్ ప్రాజెక్ట్ కింద రోడ్ల విస్తరణతో పాటు టవర్క్లాక్ బ్రిడ్జిని కూల్చి.. దాని స్థానంలో కొత్తగా నాలుగు వరసలతో బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించారన్నారు. ప్రస్తుతం సప్తగిరి సర్కిల్, శాంతి థియేటర్ వద్ద పనులు, బ్రిడ్జ్ కింద అండర్ పాస్ పనులను మరో మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు.రూ.311.93 కోట్లతో నిర్మించిన టవర్క్లాక్ బ్రిడ్జ్, ఫోర్వేను సీఎం జగన్, కేంద్ర మంత్రులు త్వరలో అధికారికంగా ప్రారంభిస్తారన్నారు. అంతవరకు ఇలాగే ఉంటే ట్రాఫిక్తో ప్రజలు మరింత ఇబ్బంది పడతారని భావించి ముందస్తుగా బ్రిడ్జిపై రాకపోకలు మొదలయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. 16 నెలల్లోనే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశారని, ఎస్ఆర్సీ, ఎన్హెచ్, ఆర్అండ్బీ, నగరపాలక, రెవెన్యూ, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. -
మళ్లీ జగనన్న ప్రభుత్వమే రావాలి
తణుకు అర్బన్(ప.గో. జిల్లా): 2024 ఎన్నికల్లో మళ్లీ జగనన్న ప్రభుత్వమే విజయం సాధించాలనే లక్ష్యంతో బైక్ యాత్ర చేస్తున్నానని విజయనగరం జిల్లాకు చెందిన దివ్యాంగుడు మాడెం అప్పారావు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా కళ్లేపల్లి గ్రామానికి చెందిన అప్పారావు ఈనెల 4న ఇచ్చాపురం నుంచి విజయవాడకు బైక్ యాత్ర ప్రారంభించారు. శుక్రవారం తణుకు మంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చి పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ మంచి సంకల్పంతో ప్రారంభించిన బైక్ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆర్థికసాయం అందచేశారు. కార్యక్రమంలో కె.ఇల్లింద్రపర్రు సొసైటీ అధ్యక్షులు మల్లిరెడ్డి నాగార్జున, వైఎస్సార్సీపీ పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి పాల్గొన్నారు. -
సంగారెడ్డి: టీఆర్ఎస్ బైక్ ర్యాలీలో అపశ్రుతి
సాక్షి, సంగారెడ్డి: జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన బైక్ ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. మంగళవారం తెలంగాణలో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. సంగారెడ్డి కాలేజీ ప్రారంభోత్సవ ర్యాలీలో బాణాసంచా పేల్చారు టీఆర్ఎస్ కార్యకర్తలు. అయితే బాణాసంచా ఉన్న ఆటోకి మంటలు అంటుకుని.. భారీ శబ్ధాలతో పేలిపోయాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, మంటలు అంటుకుని ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు ప్రాణాపాయం తప్పింది. స్వల్ఫ గాయంతో ఆయన బయటపడ్డారు. ప్రస్తుతం గాయపడిన వాళ్లకు చికిత్స అందుతోంది. ఇదీ చదవండి: అలా కాదు.. ఇలా ఉంటాడు.. -
విశాఖ రాజధాని కోసం నినదించిన విద్యార్థి లోకం
ఆమదాలవలస: విశాఖలో కార్యనిర్వాహక రాజధాని కోసం విద్యార్థులు ఉద్యమించారు. రియల్ ఎస్టేట్ రాజధాని తమకు వద్దని.. మూడు రాజధానులే ముద్దంటూ నినదించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో మూడు రాజధానులకు మద్దతుగా సోమవారం విద్యార్థులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది విదార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేశారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని వీడి.. అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే.. విశాఖ రాజధాని అయితేనే సాధ్యమంటూ గొంతెత్తారు. బైక్ ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశ ప్రాంగణానికి చేరుకుంది. రాజధానిని సాధించే వరకూ పోరాటం ఆగదు : స్పీకర్ తమ్మినేని సీతారాం సభలో ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేసుకునే వరకూ పోరాటం ఆపొద్దని విద్యార్థులకు పిలుపునిచ్చారు. రాజధాని సాధన అన్నది ఉత్తరాంధ్ర ప్రజలందరి బాధ్యతని చెప్పారు. భావి తరాల కోసమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని.. దీనికి అందరూ మద్దతు పలకాలని కోరారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకనుగుణంగా న్యాయమూర్తులు సహకరించి.. రాజధానుల నిర్మాణాలకు అనుమతులివ్వాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ అభివృద్ధి చెందితేనే ఉత్తరాంధ్రకు విస్తృతంగా పరిశ్రమలొస్తాయని, తద్వారా యువతకు మెండుగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిస్థాయిలో జరిగి.. వలసలు ఆగిపోతాయని స్పీకర్ వివరించారు. తొలుత వైఎస్సార్ కూడలిలోని వైఎస్సార్ విగ్రహానికి స్పీకర్ నివాళులర్పించి ర్యాలీని ప్రారంభించారు. -
నేతన్నల భారీ బైక్ ర్యాలీ
ధర్మవరం: సీఎం వైఎస్ జగన్ నాలుగో విడత ‘నేతన్న నేస్తం’ నిధులను విడుదల చేయడంపై హర్షం వ్యక్తంచేస్తూ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో శుక్రవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాది మంది చేనేత కార్మికులు తరలివచ్చారు. పట్టణంలోని కదిరిగేట్ వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ నేతన్న నేస్తం పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్లను ఖాతాల్లో జమ చేయడం గొప్ప విషయమన్నారు. జిల్లాలో 15,981 మంది కార్మికులకు రూ.38.35 కోట్ల లబ్ధి చేకూరిందని చెప్పారు. చేనేతకు పూర్వ వైభవం జగనన్నతో సాధ్యమవుతోందన్నారు. ఇదీ చదవండి: Andhra Pradesh: ప్లాస్టిక్ బ్యానర్లు బ్యాన్ -
మువ్వన్నెల స్ఫూర్తిని క్షేత్రస్థాయికి చేర్చండి: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ‘హర్ ఘర్ తిరంగా’కార్యక్రమం సందర్భంగా సమాజంలోని దురాచారాలను తరిమి వేయడంపై యువత దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మహిళలకు సరైన గౌరవం కల్పించడంతోపాటు, దివ్యాంగులు, వెనుకబడిన వర్గాలకు చేయూతనందించినపుడే అందరినీ సమాజాభివృద్ధిలో భాగస్వాములుగా చేయగలమని ఉపరాష్ట్రపతి సూచించారు.బుధవారం ఢిల్లీలో ఎర్రకోట ప్రాంగణం నుంచి తిరంగా బైక్ ర్యాలీని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి అంతకుముందు బైక్ ర్యాలీకి వచ్చిన ఎంపీలు, కేంద్రమంత్రులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. -
21 నుంచి ‘పల్లెగోస– బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రతీనెల 20 రోజులు ‘ప్రజాసంగ్రామయాత్ర’, పదిరోజులు ‘పల్లె గోస– బీజేపీ భరోసా’పేరిట బైక్ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈవిధంగా పాదయాత్ర, బైక్ర్యాలీలను ఒకదాని తర్వాత మరొకటి ఒక క్రమపద్ధతిలో కొనసాగిస్తూ అసెంబ్లీ ఎన్నికల దాకా నిరంతరం ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణను జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ఖరారు చేశాయి. ఇందులో భాగంగా ఈ నెల 21 నుంచి నిర్వహించనున్న బైక్ర్యాలీలకు సంబంధించి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 మంది సీనియర్ నేతలను ఇన్చార్జీలుగా నియమించారు. తొలివిడత బైక్ర్యాలీ ముగిసిన తర్వాత, ఆగస్టు 2 నుంచి సంజయ్ పాదయాత్ర–3 మొదలుకానుంది. ఇరవై రోజుల తర్వాత ఈ దశ పాదయాత్ర ముగియగానే రెండోవిడత బైక్ర్యాలీ... ఇలా వరసగా ఇవి సాగేటట్లు, వీటికి సమాంతరంగా పార్టీపరంగా ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించేటట్లు బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసింది. సంజయ్,æ బైక్ర్యాలీలో పాల్గొంటున్న నేతలతో శుక్రవారం రాత్రి రాష్ట్ర పార్టీ ఇన్చార్జీ తరుణ్ఛుగ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. బైక్ర్యాలీ ప్రారంభకార్యక్రమాల్లో సంజయ్, ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు. -
చిచ్చుపెట్టిన బైక్ర్యాలీ!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/కొత్తగూడెం అర్బన్: కొత్తగూడెం గులాబీ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మున్సిపాలిటీలోని రెండు వర్గాలు ఇప్పటివరకు మాటల తూటాలు, విమర్శలకే పరిమితమయ్యాయి. ద్విచక్రవాహన ర్యాలీలో చోటుచేసుకున్న ఘటనతో మరింత వివాదాస్పదంగా మారాయి. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్నేతలు శుక్రవారంనాడు ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేయడంతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మితో పాటు పాలకవర్గం, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ర్యాలీలో తన తనయుడితో కలిసి కాపు సీతాలక్ష్మి వెళ్తున్న బైక్ను, మాజీ కౌన్సిలర్ యూసుఫ్ వాహనం వెనుకనుంచి ఢీకొట్టడంతో సీతాలక్ష్మి కిందపడిపోయారు. యూసుఫ్ కావాలనే తన వాహనాన్ని ఢీకొట్టారంటూ సీతాలక్ష్మి రోడ్డుపై బైఠాయించారు. పార్టీ నాయకులు కొందరు యూసుఫ్తో వాగ్వాదానికి దిగగా.. ప్రమాదవశాత్తూ జరిగిందంటూ కొందరు యూసుఫ్కు మద్దతుగా నిలిచారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. టూటౌన్ సీఐ రాజు ఇరువర్గాలను సమదాయించి పంపించేశారు. కాగా, చైర్పర్సన్ను ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పరామర్శించారు. ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఆమెకు సంఘీభావం తెలిపారు. నేను మహిళను, దండం పెడతా అన్నా.. ‘నేను ప్రయాణిస్తున్న బైక్ను యూసుఫ్ అప్పటికే రెండుసార్లు ఢీకొట్టారు. ‘ఆగన్నా నేను మహిళను.. మీకు దండం పెడతా...’ అని చెప్పినా వినిపించుకోలేదు. అలాగే ముందుకొచ్చాడు. నా కుమారుడికి చెప్పి బండి పక్కకు ఆపి ఇంటికొచ్చేశా. మహిళనని చూడకుండా అగౌరవపరిచారు. చైర్పర్సన్కే రక్షణ లేకుంటే సాధారణ మహిళలు బయటికి ఎలా వస్తారు? యూసుఫ్పై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానంతో పాటు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లాను’ అంటూ కాపు సీతాలక్ష్మి శుక్రవారం సాయంత్రం ఓ వీడియో విడుదల చేశారు. అనంతరం కొత్తగూడెం టూటౌన్ పోలీస్స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. కాగా, ‘చైర్పర్సన్ డ్రైవర్ నాగరాజు బండి తొలుత నా వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి నా బండి చైర్పర్సన్ వాహనాన్ని ఢీకొంది. అంతే తప్ప దురుద్దేశంతో చేయలేదు’అంటూ యూసుఫ్ మరో వీడియోలో స్పందించారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తల బైక్ ర్యాలీ
-
కార్యకర్తలతో కలిసి బైక్ నడిపిన ఎమ్మెల్యే రోజా
-
Maratha Reservation: ఏక్ మరాఠా.. లాఖ్ మరాఠా
సాక్షి ముంబై: రిజర్వేషన్ కోసం మరాఠా క్రాంతి మోర్చా ఆధ్వర్యంలో ముంబైలో బైక్ ర్యాలీ జరిగింది. వందాలది బైక్లతో నిర్వహించిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో మరాఠా సమాజం ప్రజలు పాల్గొన్నారు. యువకులతోపాటు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. శాంతియుతంగా నిర్వహించిన ఈ ర్యాలీలో ప్రారంభం నుంచి చివరి వరకు ‘ఏక్ మరాఠా.. లాఖ్ మరాఠా..’, ‘జై శివాజీ... జై భవానీ’, ‘హరహర మహదేవ్’ తదితర నినాదాలతో సాగింది. దీంతో పరిసరాలన్ని మారుమ్రోగాయి. ముంబై సైన్లోని సోమయ్య మైదానం నుంచి ఆదివారం ఉదయం సుమారు 11.30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ ర్యాలీ సైన్, మాటుంగా, దాదర్, పరెల్, భైకల్లాల మీదుగా ఛత్రపతి శివాజీ మహారాజు టెర్మినస్ (సీఎస్ఎంటీ) వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న యువతి, యువకులు ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. వివిధ రకాల బైక్లపై వందలాది మంది నినాదాలు చేస్తు మందుకు సాగారు. కాషాయ జెండాలు చేతపట్టుకొని తలపై తెల్ల టోపీలు ధరించారు. ఇలా ప్రత్యేక వేషాధారణతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. మరాఠా సమాజం నిర్వహించిన ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు ఆశీష్ శెలార్, ప్రవీణ్ దరేకర్లతోపాటు పలువురు నేతలు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. ముంబైలోని ఓ ఫ్లైఓవర్పై ర్యాలీగా వెళుతున్న మరాఠాలు సహనాన్ని పరీక్షించొద్దు.. మరాఠా సమాజానికి రిజర్వేషన్ తొందరగా ఇవ్వాలని లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని మరాఠా క్రాంతి సంఘర్స్ మోర్చా కన్వీనర్ రాజన్ శివసంగ్రామ్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ వినాయక్ రావ్ మెటే హెచ్చరించారు. సీఎస్ఎంటి వద్ద ఉన్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదేవిధంగా తమ సహనాన్ని పరీక్షించ వద్దని హెచ్చరించారు. తొందర్లో ఈ అంశంపై నిర్ణయం వెలువడకపోతే ముంబైలో లక్ష మందితో కలిసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. మరాఠా క్రాంతి మోర్చా బైక్ ర్యాలీ కారణంగా సైన్– భైకళా–సీఎస్ఎంటీ ప్రధాన మార్గంపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలతో ముఖ్యంగా అంబేడ్కర్ నగర్పై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జరిగిన ర్యాలీలో సీఎస్ఎంటీ వద్ద శివాజీ ముఖచిత్రం కలిగిన జెండా ఊపుతూ వెళుతున్న ఓ మరాఠా యువకుడు ఈ ర్యాలీని పురస్కరించుకుని పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును మోహరించారు. మరోవైపు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఈ ర్యాలీలో వందలాది మంది పాల్గొన్నారు. 2018లో బీజేపీ, శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేస్తూ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ, మరాఠాలు వెనకబాటుతనంలో లేరని పలువురు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయడంతో విచారించిన కోర్టు మరాఠాలకు రిజర్వేషన్ రద్దు చేసింది. మే 5న రిజర్వేషన్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో రగడ మొదలైంది. కాగా, ఇప్పటివరకు జరిగిన ఎలాంటి నియామకాలకైనా ఈ ఉత్తర్వులు అడ్డుకోలేవని తెలిపింది. దీంతో కోటాను రద్దు చేయడానికి ముందే ఎంపీఎస్సీ పరీక్షలకు హాజరైన 2,200 మంది మరాఠా అభ్యర్థులను ఆర్థికంగా బలహీనమైన విభాగంలో లేదా ఓపెన్ కేటగిరీలో చేర్చాలని ప్రభుత్వం రాష్ట్ర ప్రజా సేవా కమిషన్ను కోరింది. కాగా, గతంలోనే ప్రస్తుతం అమలులో ఉన్న 50 శాతం రిజర్వేషన్ పరిమితి (లిమిట్)ను ఎత్తివేయాలని ప్రధానితో డిమాండ్ చేసినట్లు ఉద్ధవ్ పేర్కొన్నారు. ఇక్కడ చదవండి: మావోయిస్టులకు చెందిన రూ.5కోట్లు స్వాధీనం Devendra Fadnavis: మీ భార్యలు కొట్టినా మోదీ బాధ్యతేనా? -
స్టీల్ ప్లాంట్ కోసం ఏ త్యాగానికైనా సిద్ధం..
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్లో పెట్టుబడుల ఉపసంహరణపై నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం.. జీవీఎంసీ ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ నుంచి గాజువాక ఎన్ఏడీ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బైక్ ర్యాలీ సాగింది. నిరసనల్లో ఆల్ ట్రేడ్ యూనియన్లు పాల్గొన్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు వైఎస్సార్సీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి మద్దతు పలికారు. విశాఖ ఉక్కును సాధించుకుంటామని స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ర్యాలీలో అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు రామారావు, ఆదినారాయణరావు, వెంకట్రావు, అయోధ్యరామ్, తదితరులు పాల్గొన్నారు.(చదవండి: ‘హక్కు’ కోసం.. ‘ఉక్కు’ సంకల్పం) సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎంవీవీ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని, స్టీల్ ప్లాంట్ కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణత్యాగాలు చేశారని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్లో రూ.4900 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారన్నారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణనను లోక్సభలో అడ్డుకుంటామని ఆయన చెప్పారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేటు వద్ద ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఎంవీవీ అన్నారు.(చదవండి: ప్రైవేటు చేతుల్లోకి విశాఖ స్టీల్ ప్లాంట్) లోక్సభలో పోరాడతాం: ఎంపీ సత్యవతి విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు లోక్సభలో పోరాడతామని ఎంపీ సత్యవతి అన్నారు. స్టీల్ ప్లాంట్ను పోరాటాలతో సాధించుకున్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పయనించిందని, వేల కోట్లను కేంద్ర,రాష్ట్రాలకు పన్నుల రూపంలో ఆర్జించి పెట్టిందన్నారు.ప్రైడ్ ఆఫ్ ఏపీగా విశాఖ స్టీల్ ప్లాంట్ నిలిచిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయడాన్ని అడ్డుకుంటామని ఎంపీ సత్యవతి స్పష్టం చేశారు. -
విశాఖ ఘటన అమానుషం: వాసిరెడ్డి పద్మ
సాక్షి, విజయవాడ: విశాఖ ఘటన అమానుషమని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రేమ పేరుతో దాడులు చేయడం సమంజసం కాదన్నారు. బాధితులకు మహిళా కమిషన్ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడానని, వారికి అండగా ఉంటామని హామీ ఇస్తున్నామన్నారు. (చదవండి: నేను బ్రతికున్నంత వరకు జగనే సీఎం: రాపాక) మహిళా మార్చ్లో భాగంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఆమె చెప్పారు. రానున్న వంద రోజుల్లో ఇరవై అంశాలపైన మహిళా కమిషన్ సమావేశాలు జరగనున్నాయని వెల్లడించారు. వంద రోజుల్లో జిల్లా, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ‘దిశ’ సెక్షన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నామని పేర్కొన్నారు. ఈ నెల 8న విజయవాడలో రెండు వేల మంది మహిళలతో బైక్ ర్యాలీ నిర్వహించనునట్లు తెలిపారు. దిశ బిల్లును అమలులోకి తీసుకువచ్చి.. పది రోజుల్లోనే శిక్ష పడే విధంగా చర్యలు చేపడతామని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. (చదవండి: విశాఖ ప్రేమోన్మాది కేసులో 'మిస్టరీ') -
జేసీ దివాకర్రెడ్డి తనయుడు ఓవరాక్షన్..
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి తనయుడు జేసీ పవన్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘30 యాక్ట్’ అమల్లో ఉన్నా.. జేసీ పవన్ బైక్ ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జేసీ వర్గీయులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసు జీపులపై ఎక్కి జేసీ వర్గీయుల హంగామా సృష్టించారు. నిబంధనలను పాటించని జేసీ పవన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. (చదవండి: టీడీపీలో ‘చిచ్చు’ బుడ్డి) శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు.. 30 యాక్ట్ అమలులో ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన కానీ జేసీ పవన్ పెడ చెవిన పెట్టారు. గతంలో కూడా కడపలో ఆయనపై నిబంధనలు ఉల్లంఘన కేసు నమోదయిన విషయం తెలిసిందే. తాడిపత్రి పోలీస్స్టేషన్ల పరిధిలో కూడా పలు కేసులు గతంలో ఆయనపై నమోదయ్యాయి. (చదవండి: ఏపీ అప్రమత్తం: దూసుకొస్తున్న నివార్..) చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించం: డీఎస్పీ డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి సహా 15 మందిని అరెస్ట్ చేశామని అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి వెల్లడించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని, కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఆయన హెచ్చరించారు. -
కార్మికుల ఆధ్వర్యంలో..ఈనెల 15న బైక్ ర్యాలీ
సాక్షి, వైజాగ్ : ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఎక్కువ శాతం కార్మిక వర్గాలు మేలు పొందాయని వైయస్సార్ టియుసీ రాష్ట్ర్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి అన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 18 వేలు వేతనం ఇస్తామని అమలు చేసిన నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసి అనూహ్య మేలు చేశారని తెలిపారు. ఈనెల 15న రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు గౌతంరెడ్డి పేర్కొన్నారు. (నంద్యాల: ఆత్మహత్యకు ప్రేరేపించిన ఏ ఒక్కరినీ వదలం) విజయవాడ కేంద్రంగా ఓ మాఫియా జగన్ మోహన్రెడ్డిపై విషం చిమ్ముతున్నారని, కార్మికులకు జరిగిన మేలుపై చర్చకు రండి అంటూ టిడిపి నాయకులకు గౌతమ్ రెడ్డి సవాలు విసిరారు. ఐటి హబ్ పేరిట విశాఖలో నిధులు దోచుకున్న ఘనుడు చంద్రబాబు నాయుడు అంటూ ఫైర్ అయ్యారు. ఈ నెల 24న హాకర్స్ కు పదివేలు ఇవ్వడం కూడా పాదయాత్ర ఫలితమేనన్నారు. ఇప్పుడు కార్మికలు జయహో జగన్ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని కొనియాడారు. ప్రధాని మోదీ కూడా సీఎం జగన్ మోహన్రెడ్డి పాలనను అభినందించడం నిజాయితీ పాలనకు నిదర్శనం అని పేర్కొన్నారు. (‘ప్రజా సంకల్ప యాత్ర’పై దేవిశ్రీ పాట) -
ఆ ఘనత సీఎం జగన్దే: సుచరిత
-
ఆ ఘనత సీఎం జగన్దే: సుచరిత
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు పాలక మండలిలో 50 శాతానికి పైగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించినందుకు ధన్యవాదాలు చెబుతూ మహిళలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి, సాధికారతకు కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించారని పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, సున్నా వడ్డీ, వైఎస్సార్ ఆసరా లాంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘బీసీ కార్పొరేషన్లో 50 శాతం పైగా చైర్మన్లు, డైరెక్టర్లగా మహిళలకే అవకాశం కల్పించారు. ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మహిళలందరూ సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అందిపుచ్చుకుని అభివృద్ధి కావాలని సుచరిత పిలుపునిచ్చారు. (చదవండి: మహిళలపై మమకారం) ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు.. ‘ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు’ కార్యక్రమంలో భాగంగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో చెరుకుపల్లి మండలం కనగాలలో పాదయాత్ర నిర్వహించారు. దుర్గిలో ‘ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు’ కార్యక్రమంలో భాగంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. పెదకూరపాడు మండలం కొర్రపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు.. యడ్లపాడు మండలం మైదవోలులో ఎమ్మెల్యే విడదల రజిని.. ఫిరంగిపురంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి.. ఈపూరు మండలం కొండ్రముట్లలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాదయాత్రలు నిర్వహించారు. -
మూడు రాజధానులే ముద్దు
-
శాసనమండలి రద్దును స్వాగతిస్తున్నాం!
సాక్షి, విజయవాడ: పెద్దల సభలో పెద్ద మనసుతో సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వారు చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తూ ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. చంద్రబాబు పైశాచిక ఆనందం, వికృత చేష్టలతో రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. శాసన సభ, శాసన మండలి సాక్షిగా టీడీపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్సార్సీపీ సిటీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. భవానీపురం స్వాతి థియేటర్ నుంచి సితార్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. చంద్రబాబు రియల్ ఎస్టేట్ విధానాన్ని, తన బినామీలను కాపాడుకునేందుకు తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఆర్డీఏను చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏజెన్సీగా మార్చేశారని విమర్శించారు. బాబు విధానాలతో టీడీపీ తర్వాతి ఎన్నికల్లో 23 సీట్ల నుంచి సింగిల్ డిజిట్కు పరిమితం అవుతుందని జోస్యం పలికారు. సామాన్యుడికి వాటితో పనిలేదు సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని, హైదరాబాద్ తరహాలో పొరపాటు జరగకూడదనే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారన్నారు. సామాన్యుడికి ఐకానిక్ టవర్స్తో, రాజధానితో పనిలేదని, సంక్షేమ ఫలాలు అందాలని మాత్రమే కోరుకుంటారని పేర్కొన్నారు. అమరావతిలోనే లక్ష కోట్ల పెట్టుబడి పెడితే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇక సీఎం జగన్ శాసనమండలి రద్దు దిశగా అడుగులు వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చదవండి: అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్ -
సీఎం నాయకత్వం వర్థిల్లాలి
-
అనంతపురంలో భారీ బైక్ ర్యాలీ
సాక్షి, అనంతపురం: మూడు రాజధానులు ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా అనంతపురంలో యువకులు సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ బైక్ ర్యాలీని అనంతపురం ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి సోదరుడు ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అనంతచంద్రారెడ్డి ప్రారంభించారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వం వర్థిల్లాలి అంటూ యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. -
ఎగ్జిక్యూటివ్ రాజధానిపై ఉద్యోగ సంఘాల హర్షం
సాక్షి, విశాఖపట్నం: అసెంబ్లీలో సోమవారం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ కాపిటల్గా ప్రకటించడంపై పలు ఉద్యోగసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉద్యోగసంఘాల నేతలు స్వీట్లు పంచుకొని బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు ఈశ్వరరావు, జీవీఎంసీ సంఘం నేత ఆనందరావు, ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రవిశంకర్తోపాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. కృష్ణా: అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును సోమవారం ప్రవేశపెట్టడంతో మద్దతుగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జిల్లాలోని కైకలూరు తాలూకా సెంటర్ దగ్గర బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చదవండి: రాజధాని రైతులకు వరాలు శ్రీకాకుళం: పాలన వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా జిల్లాలోని నరసన్నపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ధర్మన పద్మప్రియ ఆధ్వరంలో సోమవారం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. తూర్పు గోదావరి: మూడు రాజధానుల బిల్లుకు సోమవారం ఆమోదముద్ర వేసిన సందర్భంగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట, అయినవిల్లి, మామిడికుదురులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పేరి కామేశ్వరరావు, నాగవరపు నాగరాజు, కొర్లపాటి కోటబాబు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ నేతల భారీ ర్యాలీ
-
కుప్పంలో వైఎస్సార్సీపీ భారీ బైక్ ర్యాలీ
-
‘కుప్పంలో ఈసారి వైఎస్సార్సీపీ జెండానే’
కుప్పం: రాష్ట్రంలో నెలకొన్న దుర్మార్గపు పాలనతో విసిగిపోయి కుప్పం ప్రజలు సైతం మార్పును కోరుతున్నారని.. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చంద్రమౌళి అన్నారు. బుధవారం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ భారీఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లె మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు ర్యాలీగా బయల్దేరి కుప్పానికి చేరుకున్నారు. బైపాస్ రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి బయల్దేరిన ర్యాలీ పట్టణ పురవీధుల్లో సాగింది. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి ప్రసంగించారు. చరిత్రలో ఊహించని విధంగా కుప్పంలో జరిగిన ర్యాలీకి వైఎస్సార్సీపీ శ్రేణులు తరలిరావడం హర్షణీయమన్నారు. పట్టణంలో బయల్దేరిన ర్యాలీ వంద పడకల ఆస్పత్రి నుంచి కుప్పం బస్టాండు వరకు వాహనచోదకులతో నిండిపోయిందని ఆయ న తెలిపారు. స్థానికులు మార్పును ఎంత బలంగా ఆకాంక్షిస్తున్నారో.. ఈ ర్యాలీ ద్వారా స్పష్టంగా తెలుస్తోందన్నారు. కుప్పంలో ఈ సారి వైఎస్సార్సీపీ జెండా ఎగురుతుందన్నారు. మండల కేంద్రంలో జరిగే పార్టీ సమావేశాల్లో ప్రతి ఒక్కరికీ తన మనసులో మాటను తెలియజేస్తానని, ప్రస్తుతం ర్యాలీకి తరలివచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కుప్పం నుంచే మరో చరిత్రను సృష్టించేందుకు వైఎస్సార్సీపీ బలంగా సిద్ధం అవుతోందని స్పష్టం చేశారు. -
ఎన్నికల ర్యాలీకి ఏకంగా ఆర్మీ డ్రెస్లో..!
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారి మిలిటరీ దుస్తులు ధరించి ఎన్నికల ర్యాలీలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈశాన్య ఢిల్లీలోని యమునా విహార్లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని మిలిటరీ దుస్తుల్లో వచ్చిన మనోజ్ తీవారి జెండా ఊపి ప్రారంభించారు. తీవారి తీరుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఓట్లు అడుక్కోవడానికి ఆర్మీ దుస్తులు వాడుకోవడం సిగ్గుచేటు అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ ట్విటర్లో మండిపడ్డారు. ‘సిగ్గుచేటు. ఓట్లు అడగడానికి మనోజ్ తీవారి సాయుధ దళాల యూనిఫామ్ను వేసుకసున్నారు. బీజేపీ, మోదీ, అమిత్ షా మన జవాన్లను రాజకీయంగా వాడుకొని అవమానిస్తున్నారు. అంతేకాకుండా దేశభక్తి గురించి లెక్చర్లు దంచుతున్నారు‘ అని డెరెక్ ట్వీట్ చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో తీవారి వివరణ ఇచ్చారు. ‘మన దేశ ఆర్మీ అంటే ఎంతో గర్వంగా ఉంది. అందుకే ఆర్మీ దుస్తులు ధరించాను. నేను ఇండియన్ ఆర్మీలో లేకపోయినా.. ఈవిధంగా నా సంఘీభావం తెలియజేశాను. ఇలా చేయడం అవమానించడం ఎలా అవుతుంది? నెహ్రూ జాకెట్ వేసుకుంటే.. జవహర్లాల్ నెహ్రూను అవమానించినట్టేనా’ అని తివారీ ట్విటర్లో ఎదురుప్రశ్నించారు. -
ఉరవకొండలో పోలీసులు ఓవరాక్షన్..
సాక్షి, అనంతపురం: ఉరవకొండలో పోలీసులు ఓవరాక్షన్కు దిగారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ఉరవకొండలో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే, ఈ బైక్ ర్యాలీకి అనుమతిలేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తమ విధులను అడ్డుకున్నారంటూ.. అనుమతి లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించారంటూ.. విశ్వేశ్వర్రెడ్డి తనయుడు ప్రణయ్రెడ్డి సహా 10మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న పక్షపాతపూరితమైన తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు అక్రమ కేసులను బనాయించడాన్ని ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి ఖండించారు. -
కడుపు కాలి రోడ్డున పడ్డాం
కడప రూరల్ : తమకు ఉద్యోగ భద్రత లభించే వర కు ఉద్యమం ఆగదని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధ వెలుగు ఉద్యోగుల జేఏసీ సభ్యులు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం వారు చేపట్టిన సమ్మె బుధవారానికి 8వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆ జేఏసీ ఆధ్వర్యంలో ఏడు రోడ్ల కూడలి నుంచి దాదాపు 200 మంది సిబ్బంది కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా యాని మేటర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభుదాస్, ఆ జేఏసీ సభ్యులు గూగూడు, నరసింహులు, నీలకంఠారెడ్డి, సత్యనారాయణ మాట్లాడుతూ వెలుగు సంస్ధలో కష్టించి పనిచేస్తున్నా తమకు ఇంతవరకు ఉద్యోగ భద్రత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. తమ కడుపులు కాలి రోడ్డు మీదకు వచ్చామన్నారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ డిమాండ్స్ను నెరవేరుస్తామని చెప్పి, మోసగించారని ఆరోపించారు. తమకు ఉద్యోగ భద్రత లభించే వరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. సుబ్బనాయుడు, అనంతయ్య, రామాంజనేయులు, అపర్ణ, సురేష్, రెడ్డెయ్య, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం రాష్ట్ర ప్రభుత్వం వెలుగు ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర సభ్యులతో బుధవారం విజయవాడలో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ముందు మీరు సమ్మె ను విరమించండి, మీ సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని వేస్తామని సెర్ఫ్ సీఈఓ తెలిపారు. అందుకు ఆ జేఏసీ సభ్యులు తమకు ఉద్యోగ భధ్రత లభించే వరకు సమ్మెను విరమించమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను విరమించమని ఉద్యోగులను బెదిరిస్తోంది, ఆ మేరకు దిగువస్థాయి కేడర్ను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆ జేఏసీ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె మరింతకాలం కొనసాగనుంది. ఫలి తంగా జిల్లా గ్రామీ ణాభివృద్ధి సంస్ధలో అమలవుతున్న దాదాపు 17కు పైగా పథకాల అమలుపై తీవ్ర ప్రభావం పడనుంది. -
నా బిడ్డను పవన్ కల్యాణ్ పట్టించుకోలేదు
సాక్షి, రాజమహేంద్రవరం: అభిమానులు నిర్వహించిన బైక్ ర్యాలీలో గాయపడి కిడ్నీని కోల్పోయిన తన కుమారుడిని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏ మాత్రం పట్టించుకోలేదని బాధితుడి తండ్రి మొళ్ల వీరబాబు వాపోయారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మాది పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం హుకుంపేట. గత నెల 9న దేవరపల్లిలో పవన్ అభిమానుల బైక్ ర్యాలీలో పాల్గొన్న నా కుమారుడు రాజ మనోహర్ను బైక్ ఢీ కొట్టింది. మరో బైక్ అతనిపై నుంచి వెళ్లింది. తీవ్ర గాయాలపాలైన రాజ మనోహర్ను స్నేహితులు రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా కిడ్నీని తొలగించి ప్రాణాలు కాపాడగలిగారు. నా కుమారుడి స్నేహితులు కొవ్వూరు సభలో పవన్కు నా కుమారుడి ప్రమాద ఫొటోలు చూపించారు. అయితే ఆయన మనోహర్ ఎలా ఉన్నాడని కూడా అడగలేదు. దీంతో రూ.5 లక్షలు అప్పు చేసి బిడ్డను కాపాడుకున్నా. తాజాగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. గత పది రోజులుగా రాజమహేంద్రవరంలోని ఆస్పత్రిలోనే ఉంటున్నాం. నా బిడ్డను కాపాడుకోవడానికి దాతలు ఎవరైనా సహాయం చేస్తే వారికి రుణపడి ఉంటా. దాతలు.. ‘మొల్ల వీరబాబు, పశ్చిమ గోదావరి జిల్లా దొండపూడి, ఆంధ్రా బ్యాంక్ ఖాతా నంబర్ 078910100059571, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఏఎన్డీబీ0000789’ ద్వారా సహాయం చేయొచ్చు. -
ధైర్యం చెబుతూ.. స్ఫూర్తి నింపుతూ...
సాక్షి సిటీ బ్యూరో: హైదరాబాద్ బైకర్నీ గ్రూప్.. 2013లో ప్రారంభమైన ఈ గ్రూప్ ఎన్నో సాహసోపేతమైన బైక్ యాత్రలు నిర్వహిస్తోంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన కర్దుంగ్లా యాత్రతో పాటు, 56 రోజుల పాటు 17వేల కిలోమీటర్ల మీకాంగ్ యాత్ర ఇలా అనేక సాహస బైక్ యాత్రలు ఈ గ్రూప్ తన ఖాతాలో జమ చేసుకుంది. తమ బైక్ యాత్రల ద్వారా అనేక మంది స్త్రీలలో ధైర్యం, స్ఫూర్తి నింపుతున్న ఈ గ్రూప్ ఈ బతుకమ్మ పండుగకు ఒక వినూత్న రైడ్ చేపట్టనుంది. జయభారతి నేతృత్వంలో 9 మందితో కూడిన బైకర్నీల బృందం 9వ తేదీన హైదరాబాద్ నుంచి తమ యాత్ర ప్రారంభించనుంది. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది జిల్లాల్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొననుంది. సంబరాల్లో పాల్గొనటమే కాకుండా స్త్రీల భద్రత, సాధికారికతపై రోడ్ షోలు చేపట్టి వారితో ముచ్చటించనుంది. ఈ రైడ్లో మరింత ఆసక్తికర అంశం, వీరంతా తెలంగాణా చేనేత దుస్తులను ధరించి ఈ రైడ్ నిర్వహిస్తున్నారు. షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో నిర్వహించే ఈవెంట్లలో బైకర్నీలు పాల్గొంటారు. చైతన్యపరుస్తాం నాతో పాటు ఈ రైడ్లో శాంతి, సురేఖ, కాత్యాయినీ, సత్యవేణి, హంస, కవిత, సుష్మ, పూర్ణిమ ఉంటారు.సాయంత్రానికి మేం చేరుకున్న జిల్లాల్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంకోచం లేకుండా షీ టీమ్స్ని సంప్రదించ వచ్చని వారి సేవలు ఎలా పొందవచ్చనే విషయాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లె ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రోడ్, బైక్ ద్వారా ట్రావెల్ చెయ్యడానికి సురక్షితమైంది అందుకు మా యాత్రలే ఉదాహరణ. అలాగే చేనేత వస్త్రాలు రోజువారిగా వాడుకలో భాగం చెయ్యాలని చెప్తాం. చివరి రోజు హైదరాబాద్లో ఫ్యాషన్ షో నిర్వహిస్తాం. – జయభారతి -
విజయనగరంలో పాదయాత్రకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ
-
బైక్ ర్యాలీలో అపశ్రుతి.. హరీష్కు తప్పిన ప్రమాదం
సాక్షి, సంగారెడ్డి : టీఆర్ఎస్ ప్రచార కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. పార్టీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి హరీష్ రావుకి తృటిలో ప్రమాదం తప్పింది. ఓ కూడలి వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అతి సమీపంలో బాణసంచా కాల్చడంతో పలు టపాసులు పేలి కార్యకర్తలపై పడ్డాయి. దీంతో కార్యకర్తలు భయంతో బైక్లను వదిలి ఒక్కసారిగా పరుగులు పెట్టారు. బాణసంచా పొగల్లో హరీష్ రావు చిక్కుకున్నారు. వెంటనే అప్రమత్తమైన ముగ్గురు గన్మెన్లు ఆయనకు రక్షణగా నిలిచారు. అనంతరం మంత్రిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. -
ఆ బాట.. జనం భావి భాగ్యరేఖ..
అచ్చం అలనాడు.. పెద్దాయన వైఎస్సార్పై కురిపించినట్టే.. ఇప్పుడు ఆయన తనయుడిపైనా మమతాభిమానాల జడివాన కురిపిస్తున్నారు జనం. అప్పుడాయన అడుగుల్లో తమ రేపటి అభ్యుదయం జాడను చూసుకున్నట్టే ఇప్పుడు జననేత నడిచిన బాటలో తమ భావిభాగ్యాన్ని చూసుకుంటున్నారు. ఆ జనం చూపే ప్రేమాదరాలతో.. వేల కిలోమీటర్ల దూరాన్ని అలవోకగా నడుస్తున్నారు జగన్. జనం బతుకులోని వెతలు, గతుకులను అధ్యయనం చేస్తూ, కమ్ముకున్న చీకటిలో పొడిచిన పొద్దులా వారి కళ్లలో కొత్త వెలుగులు నింపుతూ ఆయన సాగిస్తున్న ప్రజా సంకల్పయాత్ర సోమవారం విజయగనరం జిల్లా కొత్తవలసలో 3,000 కిలోమీటర్ల మజిలీని చేరుకుంది. ఈ చారిత్రక సందర్భంలో జిల్లాలో పలుచోట్ల పార్టీ శ్రేణులు వేడుక జరిపాయి. తూర్పుగోదావరి, కాకినాడ: ప్రజాసంకల్ప యాత్ర మూడువేల కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు మిన్నంటాయి. అనేక నియోజకవర్గాల్లో పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు కేకులు కట్ చేసి సందడి చేశారు. దేశంలో మునుపెన్నడూ ఏ నాయకుడూ చేయని రీతిలో సుదీర్ఘ యాత్రలో అలుపెరగని పథికునిగా ప్రజలతో మమేకమవుతూ జననేత జగన్ సాగిస్తున్న పాదయాత్ర మూడువేల కిలోమీటర్లకు చేరిన సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలకు స్వీట్లు పంచి ఆనందం పంచుకున్నారు. తమ అభిమాన నేత యాత్ర మరింత జయప్రదంగా సాగాలని ఆకాంక్షిస్తూ సంబరాలు జరుపుకొన్నారు. దేశంలోనే చారిత్రక ఘట్టం : బోస్ ∙రాజోలు నియోజకవర్గం మలికిపురంలో కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్ కేక్ కట్ చేశారు. పార్టీ శ్రేణులు, ప్రజలకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ జగన్ పాదయాత్ర మూడువేల కిలోమీటర్లు పూర్తి కావడం దేశ చరిత్రలోనే చారిత్రక ఘట్టమన్నారు. అమలాపురంలో పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్ కేక్ కట్ చేశారు. కాకినాడ సిటీలో కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక 44వ డివిజన్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్కట్ చేశారు. నగరాధ్యక్షుడు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం అన్నవరంలో కో ఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య కేకు కట్ చేశారు. అన్నవరంలో జరిగిన వేడుకల్లో తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రాజీవ్శర్మగుప్త సత్యదేవునికి ప్రత్యేక పూజలు చేసి విద్యార్థులకు జగన్ ఫొటోతో, వైఎస్సార్ గుర్తులతో ఉన్న నోట్బుక్స్ పంపిణీ చేశారు. పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం బి.దొడ్డవరంలో కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు కేక్ కట్ చేశారు. పెద్దాపురం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానుల మధ్య నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు భారీ కట్ చేశారు. శివాలయంలో పూజలు చేశారు. సామర్లకోటలో పార్టీ నాయకుడు దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. సిరిమానసిక వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. జగ్గంపేట పార్టీ కార్యాలయంలో కో ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు కేక్ కట్ చేశారు. స్థానికులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంచారు. రాజమహేంద్రవరం రూరల్లో సర్వమత ప్రార్థనలు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరంలో కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలుత వెంకటేశ్వరస్వామి ఆలయంలో, అనంతరం చర్చి, మసీదుల్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజవోలులో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు ఆధ్వర్యంలో ఆకుల వీర్రాజు కేక్కట్ చేశారు. పిఠాపురం పార్టీ కార్యాలయంలో పట్టణాధ్యక్షుడు బొజ్జా రామయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం కోలంకలో కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు స్వీట్లు పంచారు. తుని నియోజకవర్గంలోని తుని, తొండంగి, కోటనందూరు మండలాలు, పట్టణంలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకొన్నారు. ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు వేడుకల్లో పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం చిన్నదొడ్డిగుంటలో కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్త ల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం కార్యకర్తలకు, ప్రజలకు స్వీట్లు పంచారు. -
హరితహారానికి మద్దతుగా బైక్ ర్యాలీ
-
బైక్పై నుంచి పడిపోయిన తెలంగాణ స్పీకర్
శాయంపేట: బైక్ అదుపుతప్పి స్పీకర్ మధుసూదనాచారి కిందపడి పోయారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రం శివారులో మంగళవారం జరిగింది. ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. పల్లె ప్రగతి నిద్ర కార్యక్రమంలో భాగంగా స్పీకర్ సోమవారం రాత్రి శాయంపేట మండల కేంద్రంలో నిద్రించారు. మంగళవారం ఆరెపల్లి గ్రామానికి బైక్ ర్యాలీ నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో శాయంపేట శివారుకు చేరుకోగానే మూలమలుపు వద్ద ఎదురుగా ఎడ్లబండి రావడంతో బైక్ను రోడ్డు కిందికి దించారు. మళ్లీ రోడ్డెక్కే క్రమంలో టైర్ స్కిడ్ అయి అదుపుతప్పి బైక్ పై నుంచి కిందపడిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది స్పీకర్ను పైకి లేపారు. మళ్లీ యథావిధిగా స్పీకర్ బైక్పై ర్యాలీ కొనసాగించారు. -
రేపు ఏపీ బంద్కు మద్ధతుగా వైఎస్సార్సీపీ నేతలు బైక్ ర్యాలీ
-
ప్రజలతో మమేకమై...
సాక్షి, అగనంపూడి (గాజువాక) : జీవీఎంసీ 55వ వార్డు పెదగంట్యాడ మండల శివారు గ్రామాల్లో రాజ్య సభ సభ్యులు, వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా బైక్ర్యాలీగా వెళ్లి గ్రా మాల్లోని పెద్దలు, మహిళలు, గ్రామ నాయకులతో చర్చించి సమస్యలు తెలుసుకున్నారు. వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి హా మీ ఇచ్చారు. మెడ్టెక్ మెయిన్ గేటు వద్ద నుంచి ప్రారంభమైన పర్యటన మదీనాబాగ్, ఇస్లామ్పే ట, పెదపాలెం, చినపాలెం, పిట్టవానిపాలెం, మరడదాసుడుపేట, దేవాడ, ఒనుముదొడ్డి, యల మంచిలిదొడ్డి, నమ్మిదొడ్డి, ఈసరవానిపాలెం, గొరుసువాని పాలెం, భూసదొడ్డి, పాలవలస, మురిభాయి, చేపలపాలెం (అప్పికొండ) సోమేశ్వరస్వామి గుడి, అప్పికొండ దాసరిపేట, మద్దివానిపాలెంలో వరకు సాగింది. ముందుగా మెడ్టెక్ భూ సమస్య, ఉపాధిపై విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎండీ దావూద్, పెదపాలెం, చినపాలెం గ్రామపెద్దలు మదీనా వ ల్లీ, బాదుల్, సన్నా, అన్వర్, ఆదిల్, బాబాలు వినతిపత్రాలు అందించారు. ఇస్లామ్పేటకు చెందిన 162 మంది ఎక్స్సర్వీస్ మెన్లకు చెందిన భూములను మెడ్టెక్ కోసం సేకరించి కనీసం నష్ట పరి హారం కూడా చెల్లించకపోడంపై స్థానికులు ఆవేదన చెందారు. సర్దార్ మాస్టర్, మహమ్మద్ ముస్తాఫాల సారధ్యంలో వీరు వినతిపత్రాన్ని అందించారు. మసీదుకు ట్రాన్స్ఫార్మర్, జనరేటర్లు కావాలని కోరడంతో విజయసాయిరెడ్డి స్పందించి జనరేటర్ను తన సొంత నిధులతో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఇస్లామ్పేట, పెదపాలెం, చినపాలెంకు చెంది న 5380 ఎకరాల వక్ఫ్బోర్డు భూములకు ఈనా మ్ చట్టం ప్రకారం పట్టాలిచ్చి రద్దుచేశారు. పాత రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. పిట్టవానిపాలెంలో ఎన్టీపీసీ ఫ్లయాస్ వల్ల పడుతున్న ఇబ్బందులను గ్రామస్తులు విజయసాయి రెడ్డికి పిట్టా సింహాచలం, బొట్ట అప్పలరెడ్డి, బట్టు వెంకటరెడ్డి, సావిత్రి విజయసాయిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. హిందూజా రైలు పట్టాల కోసం సేకరించిన భూములకు సంబంధించి నష్ట పరిహారం చెల్లించలేదని పి.నాగేశ్వరరావు, వి.వెంకటరావు, సోంబాబు, నౌషద్ తదితరులు విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. హుద్హుద్ తుఫాన్ వల్ల ఈసరపువానిపాలెంలో సామాజిక భవనం దెబ్బతిందని, నేటికీ వాటిని పునర్నించమంటే ఎవరూ పట్టించుకోవడం లేదని ఈసరపు వెంకటరావు, దాకారపు అప్పారావు, జగ్గారావు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. గొరుసువానిపాలెంలో మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యలపై మద్ది అప్పారావు, రమణ, అప్పలనాయుడు, కనకరెడ్డి, బసా రమణరెడ్డి తదితరులు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరంఎంపీ విజయసాయిరెడ్డిని గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. భూసదొడ్డిలోని అమ్మవారి ఆలయంలో విజయసాయిరెడ్డి పూజలు చేసిన అనంతరం పాలవలసలో పర్యటించారు. ఈ సందర్భంగా హిందూజా పవర్ప్లాంట్ డ్రైనేజీ తవ్వడంతో వర్షాలకు ఇబ్బందులు పడుతున్నామని మద్ది పైడిరెడ్డి, రావాడ అప్పలరెడ్డి, వెంపాడ పైడిరెడ్డి తదితరులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మురుభాయి గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామంలో భూములన్నీ స్టీల్ప్లాంట్ ఆధీనంలో ఉన్నాయి. గ్రామం అడుగుపెట్టాలాన్నా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించాలని నాయకులు దేముడు, గౌరేష్, తాతారావు వేడుకున్నారు. అప్పికొండ (చేపలపాలెం)లోని సోమేశ్వరస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. స్టీల్ప్లాంట్ కలుషిత జలాలను సముద్రంలోకి వదిలేస్తుందని, శుద్ధి చేసి నీటిని వదలాల్సి ఉండగా, వ్యర్థ నీటినే వదులుతుండంతో స్థానికులు ¿¶ఆందోళన చెందుతున్నామని నాయకులు పంది అప్పారావు, దాసరి తాతారావు చెప్పారు. తరువాత అప్పికొండ దాసరిపేట, మద్దివానిపాలెంలో గ్రామాల్లో పర్యటించారు. వైఎస్సార్సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, 55వ వార్డు సమన్వయకర్త బట్టు సన్యాసిరావు సార«ధ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం సమన్వయకర్త మళ్ల విజయ్ప్రసాద్, అనకాపల్లి పార్లమెంటరీ సమన్వయకర్త వరుదు కళ్యాణి, జిల్లా నాయకులు బర్కత్ ఆలీ, పక్కి దివాకర్, రవిరెడ్డి, సీఈసీ సభ్యులు పైలా శ్రీనివాసరావు, బీసీ సెల్ అధ్యక్షుడు రాము నాయుడు, 56, 57, 60 వార్డుల అధ్యక్షుడు పూర్ణానందశర్మ, దాడి నూకరాజు, దాసరి రాజు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి గెడ్డం ఉమ పాల్గొన్నారు. -
పేరు హోదా... చేసింది బల ప్రదర్శన
పోరుమామిళ్ల: పోరుమామిళ్లలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వర్గం ప్రత్యేకహోదా పేరుతో నిర్వహించిన బైక్ ర్యాలీ బలప్రదర్శనను తలపించింది. పార్టీలోని ప్రత్యర్థి వర్గాన్ని సవాల్ చేస్తూ చేసిన ర్యాలీగా కనిపించిందే తప్ప హోదా కోసం చేసినట్లు లేదని స్థానికంగా చర్చ నడుస్తోంది. బద్వేలు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి విజయమ్మ వర్గీయుడు రంతుకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కమ్మవారిపల్లెకు చెందిన టీడీపీ నాయకులు రెండ్రోజుల క్రితం పట్టణంలో ర్యాలీ నిర్వహించి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాసు (శ్రీనివాసులరెడ్డి) దిష్టిబొమ్మ దహనం చేయడం, విజయమ్మ పార్టీ నుంచి బయటకుపోతేనే బద్వేలులో పార్టీ బతుకుతుందని నినదించడం, మంత్రులు ఆది, సోమిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన నేపథ్యంలో విజయమ్మ వర్గం హోదా పేరుతో ర్యాలీ నిర్వహించి తమ బలం చూపింది. శుక్రవారం జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే జయరాములు, పార్టీ బద్వేలు ఇన్చార్జి విజయజ్యోతి పాల్గొనలేదు. ఎమ్మెల్యే పోరుమామిళ్లలోనే ఉన్నా ఆయనకు సమాచారం లేదు. జ్యోతికి కూడా సమాచారం లేదని తెలిసింది. క్రమశిక్షణ తప్పితే ఊరుకోం ఆర్టీసీ బస్టాండు వద్ద జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ తప్పి వ్యవహరిస్తే తోక కట్ చేస్తామని పరోక్షంగా కమ్మవారిపల్లె టీడీపీ వర్గీయులకు హెచ్చరిక చేశారు. పదవి రాలేదనే అక్కసుతో ఇష్టారాజ్యంగా మాట్లాడటం, పార్టీకి వ్యతిరేకంగా ర్యాలీలు చేయడాన్ని సహించబోమన్నారు. మంత్రి ఆది మాట్లాడుతూ విజయమ్మ ఎవరికి బొట్టుపెడితే వారికే ఎమ్మెల్యే టికెట్ వస్తుందన్నారు. విజయజ్యోతి కూడా విజయమ్మ వద్దకు వస్తేనే టికెట్ వస్తుందని, లేకపోతే రాదన్నారు. విజయమ్మ నాయకత్వంలోనే బద్వేలులో పార్టీ నడుస్తుందన్నారు. విజయజ్యోతి గోడ పక్క నుంచి పుల్లలు పెడుతుందన్నారు. ఎమ్మెల్యేకు విజయమ్మతో కలసిపోవాలని చెప్పామని, ఈ ర్యాలీకి ఆహ్వానించినా రాలేదన్నారు. వాసు, ఆది ఇద్దరూ అసలు ప్రత్యేకహోదా అంశాన్ని పక్కనపెట్టి పార్టీలో అసమ్మతి వర్గీయులపై, వైఎస్సార్సీపీపై అక్కసు వెళ్లగక్కారు. ఆఖరుకు విజయమ్మ కూడా బద్వేలులో పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నానని, అందరినీ కలుపుకొని పోతున్నానని, ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదని పేర్కొన్నారు తప్పితే హోదా విషయం పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. శుక్రవారం ర్యాలీలో విజయమ్మ వర్గీయులు మాత్రమే భారీగా బైకులపై కనిపించారు. -
పల్లె రఘునాథరెడ్డికు స్వల్ప గాయాలు
-
టీడీపీ బైక్ ర్యాలీలో అపశ్రుతి
సాక్షి, అనంతపురం: టీడీపీ బైక్ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ర్యాలీలో ఏపీ మాజీ మంత్రి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి నడుపుతున్న బైక్ను మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పల్లె రఘునాథరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించినట్లు సమాచారం. జిల్లాలోని నల్లమడ మండలం దొన్నికోట వద్ద ఈ ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేపట్టిన సైకిల్ ర్యాలీలోనూ అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాలోని యలమందల వద్ద సైకిల్ తొక్కుతూ కోడెల కిందపడిపోగా.. ఆయన తలకు స్పల్పగాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన సైకిల్ యాత్రను పూర్తిచేశారు. -
వైఎస్సార్సీపీ నేతల బైక్ర్యాలీ
వెల్దుర్తి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ పార్టీ నాయకులు మంగళవారం వెల్దుర్తిలో బైక్ ర్యాలీ చేపట్టారు. పార్టీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వెల్దుర్తి నుంచి రామళ్లకోట మీదుగా గురువారం పాదయాత్ర సాగే సర్పరాజాపురం వరకు, అక్కడి నుంచి నర్సాపురం, బోయనపల్లె మీదుగా వెల్దుర్తి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ జగనన్న పాదయాత్ర ప్రజా సంకల్పమేనని, ఈ యాత్ర సందర్భంగా ప్రజలు ఆయన దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లాలని సూచించారు. ర్యాలీలో పార్టీ మండల కన్వీనర్ బొమ్మన రవిరెడ్డి, నాయకులు చెరుకులపాడు ప్రదీప్ కుమార్ రెడ్డి, శ్రీరాంరెడ్డి, పట్టణ కన్వీనర్ వెంకట్నాయుడు, గోవర్ధనగిరి ఎంపీటీసీ సభ్యులు గోపాల్, ఆరిఫ్, నాగిరెడ్డి, సుమన్, వివిధ గ్రామాల యువకులు పాల్గొన్నారు. -
ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం చేయండి
కోవెలకుంట్ల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను బనగానపల్లె నియోజకవర్గంలో విజయవంతం చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా సంకల్పయాత్ర నియోజకవర్గంలో శనివారం నుంచి ప్రారంభం కానుండటంతో శుక్రవారం పట్టణంలోని జీసీఆర్ పెట్రోల్ బంకు నుంచి బైక్ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ పాదయాత్ర కోవెలకుంట్ల మండలం కంపమల్ల మెట్ట వద్ద నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందన్నారు. అక్కడి నుంచి మొదటి రోజు మండలంలోని భీమునిపాడు మీదుగా కోవెలకుంట్ల పట్టణానికి చేరుకుంటుందన్నారు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రా హర్షవర్దన్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సిద్ధంరెడ్డి రాంమోహన్రెడ్డి, మండల ఇన్చార్జ్ శింగిరెడ్డి రామేశ్వరరెడ్డి, వెలగటూరు, కలుగొట్ల సర్పంచ్లు ఎల్వీ సుధాకర్రెడ్డి, లక్ష్మీనారాయణ, బిజనవేముల, కోవెలకుంట్ల ఎంపీటీసీలు భీంరెడ్డి ప్రతాప్రెడ్డి, దిల్క్బాషా, కలుగొట్ల, లింగాల, చిన్నకొప్పెర్ల, వెలగటూరు, పెద్దకొప్పెర్ల మాజీ సర్పంచ్లు ప్రభాకర్రెడ్డి, శేషిరెడ్డి, రఘునాథరెడ్డి, మాధవరెడ్డి, సూర్యశేఖర్రెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు అమడాల భాస్కర్రెడ్డి, జోళదరాశి రాంమోహన్రెడ్డి, చిక్కేపల్లి రామకృష్ణారెడ్డి నాయకులు ఎల్ఐసీ రామసుబ్బారెడ్డి, చిన్నకొప్పెర్ల మోహన్రెడ్డి, నాగార్జునరెడ్డి, మధుసుధాకర్, శేషిరెడ్డి, మహేశ్వరరెడ్డి, ఉసేనయ్య, ఎర్రం ఈశ్వరరెడ్డి, రేవనూరు తులసిరెడ్డి పాల్గొన్నారు. -
అల్లర్లకు బీజేపీ యత్నాలు
♦ నిరసనల తీరు ఇది కాదు ♦ సీఎం సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు: బైక్ ర్యాలీ ద్వారా బీజేపీ నేతలు సమాజంలో శాంతి, సామరస్యాలను చెడగొట్టి అల్లర్లు రేపే ప్రయత్నం చేస్తున్నారని సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. గురువారమిక్కడి సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణాలో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘మంగళూరులో పాదయాత్ర నిర్వహిస్తామని బీజేపీ నేతలు ముందుగా చెప్పి ఉంటే అప్పుడే ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చి ఉండేవాళ్లం. అయితే వాళ్లు ప్రజాజీవనాన్ని ఇబ్బంది పెట్టే విధంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. అందువల్లే మేం అనుమతులు ఇవ్వలేదు. అంతేకాదు వారికి నిరసన తెలిపేందుకు, సమావేవం ఏర్పాటు చేసుకునేందుకు మేము ఎక్కడైతే అనుమతి ఇచ్చామో ఆ ప్రదేశాన్ని వదిలేసి, రాష్ట్రమంతటా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసే ఎలాంటి కార్యక్రమాలకు అవకాశం ఇవ్వబోము’ అని తెలిపారు. గౌరీ కేసు సీబీఐకి ఇచ్చేందుకు సిద్ధం ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కేసును సీబీఐకి అప్పగించబోమని తామేనాడూ చెప్పలేదని అన్నారు. గౌరి లంకేష్ కుటుంబ సభ్యులు కోరితే ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తన పత్రికలో సంఘ్ పరివార్ గురించి హేళనగా కథనాలు రాయకపోయి ఉంటే ఈ రోజు గౌరి లంకేష్ చనిపోయి ఉండేవారు కాదు కదా? అన్న బీజేపీ ఎమ్మెల్యే జీవరాజ్ వ్యాఖ్యలపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ‘ఈ వ్యాఖ్యల అర్థమేంటి? గౌరి లంకేష్ హత్య వెనక ఎవరి హస్తం ఉందో ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది కదా?’ అని సీఎం అన్నారు. -
చిత్తూరులో బైక్ ర్యాలీతో వైఎస్ఆర్కు నివాళి
-
నంద్యాలలో వైఎస్సార్సీపీ భారీ బైక్ ర్యాలీ
-
మత్తును తరిమేద్దాం
-
కర్నూలు జిల్లాలో YSRCP నేతల బైక్ ర్యాలీ
-
ఒంగోలులో YSRCP బైక్ ర్యాలీ
-
కార్మిక సమస్యలు మంత్రికి పట్టవా!
► అసోసియేషన్ దీక్షకు సంఘీభావం తెలిపిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ►డీఎంఎఫ్ను రద్దు చేయాలంటూ బైక్ ర్యాలీ ►ఐదో రోజుకు చేరుకున్న దీక్షలు టెక్కలి : వెనుక బడిన జిల్లాకు తగిన గుర్తింపు తీసుకువచ్చిన గ్రానైట్ పరిశ్రమలపై ప్రభుత్వం అదనపు చార్జీలు విధించి ఆయా పరిశ్రమలు పూర్తిగా నిర్వీర్యం చేసి కార్మికులంతా రోడ్డున పడుతుంటే కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు స్పందించకపోవడం శోచనీయమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. గ్రానైట్ పరిశ్రమలు పూర్తిగా నష్టపోయే విధంగా ప్రభుత్వం అమలు చేసిన జీవో నంబర్ 100, 36లను రద్దు చేసి అదనపు చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ టెక్కలి మైన్స కార్యాలయం వద్ద గ్రానైట్ అసోషియేషన్ ప్రతినిధులు, కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరుకున్నారుు. దీక్షలకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, నియోజకవర్గ అదనపు సమన్వయకర్త పేరాడ తిలక్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ జిల్లాలో ఎంతో మంది వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్న గ్రానైట్ పరిశ్రమలపై అదనపు చార్జీల విధించడం సమంజసం కాదన్నారు. ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలను ఆదుకోకుండా వాటిపై అధిక చార్జీలు విధించి పరిశ్రమలు మూతపడే విధంగా కుట్రలు చేయడం దారుణమన్నారు. కొద్ది రోజులుగా గ్రానైట్ పరిశ్రమల యజమానులు సీఎంతో సహా సంబంధిత మంత్రుల వద్దకు కాళ్లరిగేలా తిరుగుతుంటే జిల్లాకు చెందిన కార్మిక మంత్రి కనీసం దృష్టి సారించకపోవడం అన్యాయమన్నారు. గ్రానైట్ యజమానులు, కార్మికులు చేస్తున్న ఈ ఉద్యమాలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని, వీరి సమస్యలను తమ అధినేత జగన్ దృష్టికి తీసుకు వెళ్తామని రెడ్డి శాంతి భరోసా ఇచ్చారు. తిలక్ మాట్లాడుతూ పరిశ్రమలు మూతపడే విధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవోలు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీకి చెందిన గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధి చింతాడ గణపతి మాట్లాడుతూ పరిశ్రమలను బతికించుకోవాలంటే ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలన్నారు. అంతకు ముందు గ్రానైట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఉత్తరాంధ్ర అధ్యక్షుడు కోత మురళీధర్, ప్రతినిధులు శ్రీనివాస్, రామకృష్ణ, సి.హెచ్.రావ్, వెంకటాచలపతి, పార్థు తదితరుల ఆధ్వర్యంలో కార్మికులంతా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. డీఎంఎఫ్ చార్జీలను తక్షణమే ఉపసంహరించాలని నినదించారు. -
ఘనంగా ప్రభాస్ జన్మదిన వేడుకలు
రావులపాలెంలో అభిమానుల భారీ బైక్ ర్యాలీ రావులపాలెం: బాహుబలి సినిమాతో సినీ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సినీ హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలను ఆదివారం వైఎస్సార్ సీపీ జిల్లా ఇండస్ట్రీయల్ విభాగం కన్వీనర్ మంతెన రవిరాజు ఆధ్వర్యంలో రావులపాలెంలో ఆయన అభిమానులు పండుగలా నిర్వహించారు. కొత్తపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి భారీగా రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి తరలివచ్చి మోటరు బైకులపై చక్కర్లు కొడుతూ తీ¯ŒSమార్ డప్పులు బాణసంచా కాల్పులతో హోరెత్తించారు. అనంతరం వందలాది బైకులపై ప్రభాస్ చిత్రాలు ఉన్న టీ షర్టులు ధరించి జెండాలతో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని స్థానిక జాతీయ రహదారిపై రవిరాజు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీ మండలంలోని రావులపాలెం, ఈతకోట, వెదిరేశ్వరం, కొమరాజులంక, ఊబలంకల మీదుగా ఆత్రేయపురం మండలం వైపు సాగింది. ఈ ర్యాలీలో బాహుబలి–2 సినిమాకు సంబంధించి విడుదలైన చిత్రాలతో అభిమానులు సందడి చేశారు. డార్లింగ్ ప్రభాస్ అని ముద్రించిన పతాకాలు ఆకట్టుకున్నాయి. -
నేడు ములుగు బంద్
ములుగు : ములుగు కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా సాధన సమితి బంద్కు పిలుపునిచ్చింది. ఈమేరకు సోమవారం టీడీపీ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల బిక్షపతి, నాయకులు మాట్లాడారు. ములుగు జిల్లా కాకుంటే మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్ పూర్తి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బంద్కు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. ఆయా పార్టీల నాయకులు వేముల భిక్షపతి, చింతలపూడి నరేందర్రెడ్డి, వెంకట్రెడ్డి, స్వామి, నూనె శ్రీనివాస్, మహేందర్, పైడిమల్ల శత్రజ్ఞుడు, చెట్టబోయిన సారంగం, వెంకట్, గుగులోతు సమ్మయ్య, కనకం దేవదాసు, హరి, లియాఖత్అలీ పాల్గొన్నారు. కాగా మంగళవారం జరిగే ములుగు బంద్కు టీడీపీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే సీతక్క ఓ ప్రకటనలో తెలిపారు. -
నర్సింహులపేటలో కొనసాగించాలని బైక్ ర్యాలీ
నర్సింహులపేట : మండలంలోని పెద్దనాగారం గ్రామస్తులు నర్సింహులపేట మండలంలోనే కొనసాగుతామని మంగళవారం హైవేపై ఉప సర్పంచ్ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. కొత్తగా ఏర్పడే ఎల్లంపేట మండలంలో చేర్చొద్దని డిమాండ్ చేశారు. అధికారులు, నాయకులు స్పందించి నర్సింహులపేట మండలంలోనే కొనసాగించాలని కోరారు. గ్రామస్తులు వెంకన్న, మల్లయ్య, నర్సయ్య, పుల్లయ్య, నరేందర్ పాల్గొన్నారు. -
బైక్ ర్యాలీ ప్రారంభం
ఆలేరు : రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకు తలొగ్గి పాలన కొనసాగిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు అన్నారు. కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా ప్రజల స్వాభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతిస్తున్నారని విమర్శించారు. స్వరాష్ట్రంలో రాష్ట్ర అవతరణ వేడుకలను వైభవంగా జరుపుకోవాలన్న తెలంగాణ ప్రజల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు. చరిత్రను మరిపించేందుకు కుట్ర చేస్తుందన్నారు. విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారింగా నిర్వహించే వరకు తాము రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తునికి దశర«థ, పులిపలుపుల మహేష్, కావటి సిద్దిలింగం, చిరిగె శ్రీనివాస్, ఐడియా శ్రీనివాస్, జంపాల శ్రీనివాస్, వడ్డెమాన్ కిషన్, ఎనగందుల సురేష్, దయ్యాల సంపత్, భోగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సమ్మెతో ప్రభుత్వాలకు గుణపాఠం
బైక్ ర్యాలీలో కేంద్ర కార్మికసంఘాల పిలుపు కాకినాడ సిటీ : కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న 2వ తేదీ దేశవ్యాప్త సమ్మెను కార్మికవర్గం జయప్రదం చేయడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బుధవారం సాయంత్రం సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, ఏఐసీసీటీయూ తదితర కేంద్ర కార్మిక సంఘాలు జేఎన్టీయూ నుంచి బైక్ర్యాలీ చేపట్టి సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని కోరాయి. కనీస వేతనం 18,000 ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి కార్మిక చట్టాలు అమలు చేయాలనే డిమాండ్లతో సమ్మె జరుగుతోందన్నారు. జిల్లా జేఏసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం జెండా ఊపి ర్యాలీ ప్రారంభించగా జేఏసీ మాజీ చైర్మన్ ఆచంటరామారాయుడు, కేంద్ర కార్మిక సంఘాల నాయకులు సీహెచ్.అజయ్కుమార్, తోకల ప్రసాద్ పాల్గొన్నారు. ఏఐటీయూసీ ప్రచారం వివిధ పరిశ్రమల గేట్ల ముందు కార్మికుల కూడలిలో ఏఐటీయుసీ సమ్మె విజయవంతం కోరుతూ ప్రచారం నిర్వహించింది. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యదర్శి జుత్తుక కుమార్, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి నక్క కిషోర్ పాల్గొన్నారు. -
జనగామ జిల్లా కోరుతూ ర్యాలీ
జనగామ: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన 27 జిల్లాల జాబితాలో జనగామ పేరు లేకపోవడంతో.. ఆగ్రహించిన స్థానికులు ఆందోళనల బాటపట్టారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో పలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం అఖిలపక్షం ఆధ్యర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి జనగామను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ.. ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. ఈ ర్యాలీలో అన్ని పార్టీల నాయకులతో పాటు న్యాయవాదులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
కార్మికుల చట్టాలను కాలరాయొద్దు
సమ్మెను జయప్రదం చేయాలంటూ బైక్ ర్యాలీ శంషాబాద్ : కార్మికుల చట్టాలను కేంద్ర ప్రభుత్వం కాలరాసే యత్నం చేస్తోందని టీఆర్ఎస్ కార్మిక విభాగం రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జీ పానుగంటి ఆనంద్ ఆరోపించారు. కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం సెప్టెంబరు 2 దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలంటూ మంగళవారం సీఐటీయూతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల శ్రేయస్సుకు సంబంధించిన 12 డిమాండ్లను కేంద్ర సర్కారు వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రతి కార్మికుడికి ఉద్యోగ భద్రతను కల్పించడంతో పాటు కనీస వేతనాన్ని రూ. 18 వేలకు పెంచాలని కోరారు. ఈఎస్ఐ, బోనస్లు ప్రకటించాలన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల సవరణతో కార్పొరేట్ సంస్థలు లాభపడుతున్నాయన్నారు. సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ విధిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల చట్టాలను ప్రభుత్వాలు విస్మరిస్తుండడంతో పరిశ్రమల యజమానులు, కార్పొరేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని సీఐటీయూ రాజేంద్రనగర్ జోన్ నాయకులు నీరటి మల్లేష్ ఆరోపించారు. శంషాబాద్లో మొదలైన బైక్ ర్యాలీ సాతంరాయి, గగపహాడ్ పారిశ్రామిక వాడల మీదుగా కాటేదాన్ చేరుకుంది. ర్యాలీలో టీఆర్ఎస్కేవీ జిల్లా ఉపాధ్యక్షుడు దామోదర్రెడ్డి, మండల అధ్యక్షుడు మల్లేష్, శ్రీధర్, అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో సిపిఎం బైక్ ర్యాలీ
-
బంద్ విజయవంతానికి బైక్ ర్యాలీ
-
సీఐటీయూ బైక్ ర్యాలీలు
కానూరు(పెనమలూరు)ః కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తామని, దీనికి అందరి మద్దతు కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.సి.హెచ్.శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో నిర్వహించనున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభలు విజయవంతం కావాలని కాంక్షిస్తూ కానూరు ఇండస్ట్రీయల్ ప్రాంతంలో గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల్లో మార్పులు చేసి కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి ఎ.వెంకటేశ్వరరావు, నాయకులు షేక్ కాశీం, యు.త్రిమూర్తి, వై.శ్రీనివాసరావు, పి.రామకోటేశ్వరరావు, ఆర్.సత్యనారాయణ, జి.రాజ్కుమార్ పాల్గొన్నారు. ఉయ్యూరు : సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం పెనమలూరు డివిజన్ అధ్యక్షుడు కోసూరి శివనాగేంద్రం కోరారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సభల విజయవంతం కోరుతూ ఉయ్యూరులో గురువారం కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. నాయకులు రత్నం భాస్కరరావు, రాజేష్, కొండలు తదితరులు పాల్గొన్నారు. కంకిపాడు : ఈనెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ విజయవాడలో నిర్వహించనున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి నర్సింహారావు కోరారు. మైక్ ప్రచార జాతాను సంఘం కంకిపాడు డివిజన్ కార్యదర్శి ఎ.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. సీఐటీయూ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పీ.రంగారావు, నరేష్, బీ.శివశంకర్, నార్ని వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిపక్షాల వైఖరికి నిరసనగా భారీ బైక్ ర్యాలీ
బీర్కూర్ : నిజామాబాద్ జిల్లా మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ విషయంలో ప్రతిపక్షాల వైఖరికి నిరసనగా అధికారపక్షం నాయకులు ఆందోళన బాటపట్టారు. తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో బొమ్మన్దేవ్పల్లి చౌరస్తా నుంచి నాచుపల్లి మీదుగా బీర్కూర్ వరకు భారీ ర్యాలీ తీశారు. అనంతరం ప్రతిపక్షాల దిష్టిబొమ్మను దహనం చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును అడ్డుకుంటే ప్రతిపక్షాలకు పుట్టుగతులు ఉండవని అధికార పక్ష నాయకులు విమర్శించారు. -
బీజేవైఎం బైక్ ర్యాలీ
నెల్లూరు: ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వికాస్ పర్వ్లో భాగంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మినీబైపాస్లోని ఆ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద ర్యాలీని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి మాట్లాడారు. నరేంద్రమోడీ రెండేళ్ల పాలనలో దేశంలో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. వికాస్ పర్వ్ పేరుతో దేశంలో జరిగిన అభివృద్ధి, జరపాల్సిన అభివృద్ధిపై ప్రజలకు తెలియచేసేందుకు రాష్ట్రాల్లో సభలు నిర్వహిస్తున్నారన్నారు. ఈక్రమంలో ఈనెల 16వ తేదీన నగరంలోని నర్తకి సెంటర్లో బహిరంగా సభ నిర్వహిస్తామన్నారు. సభకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ముఖ్య అతి«థిగా హాజరు కానున్నట్లు చెప్పారు. జిల్లా కార్యాలయం నుంచి బయలు దేరి నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ కనకమహాల్ సెంటర్, నర్తకి సెంటర్, ఏసీ సెంటర్, ట్రంకురోడ్డు మీదుగా వీఆర్సీ, మద్రాసుబస్టాండ్, ఆర్టీసీ సెంటర్ వరకు కొనసాగింది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మొగరాల సురేష్, ఉపాధ్యక్షుడు గుంజి కృష్ణ, ప్రధాన కార్యదర్శి దాసరి ప్రసాద్, నాయకులు ఉదయ్, మధుసూదన్, మల్లి, సతీష్, రవి, శ్రీను, పెంచలయ్య పాల్గొన్నారు.