cannes film festival
-
ప్రతి నిమిషం.. సినిమా ధ్యాసే..
చిత్ర పరిశ్రమలో దర్శకత్వ విభాగంలో సక్సెస్ కావాలంటే, అందులోనూ ఓ మహిళ ఆ స్థాయిలో అవ్వాలంటే సామర్థ్యంతో పాటు సృజనాత్మకత తప్పనిసరి. సమకాలీన అంశాలను అర్థవంతంగా తెరకెక్కిస్తేనే ప్రేక్షకాదరణ పొందుతుంది. అలాంటిది హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఎంతో అంకితభావం, చిత్తశుద్ధితో పాటు ధైర్యసాహసాలు కావాలి. ఒకటి కాదు రెండు కాదు వందలాది అంతర్జాతీయ అవార్డ్లతో ఔరా అనిపిస్తోంది మన తెలుగమ్మాయి లక్ష్మీ నిమిషా గుమ్మడి. తాజాగా ఆమె ప్రొడక్షన్ డిజైనర్గా రూపొందించిన ‘డాస్ బ్రోస్ ఫోర్స్’ ఫీచర్ ఫిల్మ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీలో నిలిచింది. ఇది చాలదూ.. హాలీవుడ్లో లక్ష్మీ సత్తా ఏంటో చెప్పేందుకు!? హైదరాబాద్లోని సంఘమిత్ర స్కూల్, ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో +12 వరకూ చదివిన లక్ష్మీ.. ఆ తర్వాత కర్నాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, కాలిఫోరి్నయాలోని అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (ఏఎఫ్ఐ)లో ‘ప్రొడక్షన్ డిజైన్’లో ఎంఎస్ పూర్తి చేసింది. సమకాలీన డిజైన్స్తో సాంస్కృతిక అంశాలను మిళితం చేసే సామర్థ్యం ఈమె సొంతం. తెర వెనక పాత్రల గురించి తెలిసి.. చిన్నతనంలో సినిమాలు చూసేటప్పుడు క్యారెక్టర్స్లో లీనమై అతిగా భావోద్వేగానికి లోనయ్యేదానినని తరుచూ స్నేహితులు ఆమెను ఆటపట్టించేవారు. చిన్నతనం నుంచే తనపై సినిమాల ప్రభావం ఉండటంతో నటి కావాలని అనుకునేది. ఆ వయసులో తెరవెనక దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు, నిర్మాతల పాత్ర గురించి ఆలోచించే స్థాయిలేదు కానీ, పెద్దయ్యాక సినిమా మేకింగ్ గురించి తెలిసిన తర్వాత ఆమె ఆసక్తి నటన నుంచి ప్రొడక్షన్ వైపు మళ్లింది.ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ ‘తహనన్’.. అమెజాన్ ప్రైమ్లో ప్రసారం అవుతున్న ‘తహనాన్’ అనే ఫీచర్ ఫిల్మ్ లక్ష్మీ రూపొందించిందే. దీనికి లాస్ ఏంజిల్స్లోని కల్వర్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చలనచిత్ర అవార్డ్ వరించింది. అమెరికాలో మ్యూజిక్ వీడియోలు, వాణిజ్య ప్రకటనలు కూడా ఈమె రూపొందిస్తోంది. టేలర్ స్విఫ్ట్సŠ, ఫోర్ట్నైట్, రెడ్ క్రిస్మస్, రోబోట్, ఎలిఫెంట్ ఇన్ ది డార్క్, స్టక్ వంటి ఎన్నో మ్యూజిక్ వీడియోలకు లక్ష్మీ పనిచేసింది. అలాగే ఎల్రక్టానిక్ ఉపకరణాల సంస్థ డీఈఎక్స్ వంటి పలు బహుళ జాతి కంపెనీలకు వాణిజ్య ప్రకటనలు రూపొందించింది.తెలుగు చిత్రం రిలీజ్.. ఈజిప్ట్, ఫ్రాన్స్, పోర్చుగల్, జర్మనీ, ఇస్తాంబుల్, యూకే వంటి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 50 ఫిల్మ్ ఫెస్టివల్స్లో 15 అంతర్జాతీయ అవార్డ్లు లక్ష్మీ సొంతం. తాజాగా ‘డాస్ బ్రోస్ ఫోర్స్’ చిత్రం వచ్చే ఏడాది మేలో జరగనున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీలో నిలిచింది. అర్జున్ ది స్టూడెంట్, మీన్ గోల్స్, ది హల్కైన్ డేస్, బాడీ చెక్ వంటి ఎన్నో ఫీచర్, షార్ట్ ఫిల్మŠస్ను రూపొందించింది. ఇండియాతో పాటు కెనడా, గ్రీస్, టర్కీ, అమెరికా, ఫ్రాన్స్, యూకే వంటి దేశాల్లోని ఫిల్మ్ ఫెస్టివల్స్లో అవార్డ్లను దక్కించుకుంది. రవికుమార్ వాసు దర్శకత్వంలో శివకుమార్ రామచంద్ర వరపు కథానాయకుడిగా తెరకెక్కిన తెలుగు చలనచిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో హైదరాబాద్ ఫ్యాషన్ డిజైనర్ అరుణా గౌడ్ (ఫొటోలు)
-
కేన్స్ 2024లో తళుక్కున మెరిసిన స్టార్, ఎవరీ నాన్సీ త్యాగి (ఫొటోలు)
-
Nancy Tyagi ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. కట్ చేస్తే కేన్స్లో అదరగొట్టేసింది!
ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల మధ్యనుంచే తన భవిష్యత్తును నిర్మించుకుంది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫ్యాషన్ ప్రపంచంలో తన స్థానాన్ని పదిలపర్చుకుని ప్రశంసలను అందుకుంది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్పై అరంగేట్రంలోనే అందరిదృష్టినీ ఆకర్షించిన ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ త్యాగి కేన్స్ 2024లో ఎలా చేరింది. ఉత్తరప్రదేశ్లోని బర్నావా గ్రామనుంచి ఫ్రెంచ్ రివేరా పట్టణంలోని రెడ్ కార్పెట్ దాకా ప్రయాణం ఎలా సాగింది? తెలుసుకుందాం రండి.ఇంటర్ మంచి మార్కులతో పాసైన తరువాత 2020 ఐఏఎస్ అవ్వాలనే ఆశయంతో ఢిల్లీకి వచ్చిన నాన్సీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోలేకపోయింది. ఎందుకంటే సరిగ్గా అపుడు కోవిడ్ మహమ్మారి, లాక్డౌన్ ఆక్షల సమయంలో నాన్సీ తల్లి ఉద్యోగం కోల్పోయింది. దీంతో ఇల్లు గడపడం కష్టంగా మారింది. ఇక సివిల్స్ కోచింగ్కి డబ్బులు కష్టం అని భావించింది. డిజైన్పై ఆమెకున్న తొలి ఆసక్తి , బొమ్మలకు బట్టలు కుట్టడం ద్వారా అలవడిన ఫ్యాషన్ అభిరుచిని, భవిష్యత్ కెరీర్కు పునాది వేసింది. అలాగే కెమెరా పట్టుకొని వీడియోలు చేయడం మొదలు పెట్టింది. కొన్నిసార్లు, వీడియోల కోసం ఆమె సోదరుడు మను ఫీజును త్యాగం చేయాల్సి వచ్చేదట. వారి గ్రామంలో ట్రాన్స్పోర్ట్ సర్వీస్ నడుపుకునే తండ్రి కూడా సహాయం చేశాడు. నాలుగేళ్ల తర్వాత ఆ కష్టమంతా ఫలించింది. అలా ఉన్నచోటనే విజయాన్ని వెతుక్కుంది. ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్గా పాపులర్ అయింది. ఆమె విలక్షణమైన శైలి బ్రూట్ ఇండియా దృష్టిని ఆకర్షించింది. తమ స్క్వాడ్లో చేరమని ఆమెను ఆహ్వానించింది. అలా కేన్స్ రెడ్ కార్పెట్పై అరంగేట్రం కేవలం ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. టీంకు కూడా గర్ వకారణంగా నిలిచింది. ఆత్మవిశ్వాసం,స్థయిర్యంతోపాటు మాతృభాష (హిందీ)లో మాట్లాడి హైలైట్ అయింది.కేన్స్లో యువ డిజైనర్గా మెరిసింది. స్టన్నింగ్ లుక్స్, డిజైనర్ దుస్తుల్లో ఆమె ఇచ్చిన పోజులు వైరల్ అయ్యాయి ఫలితంగా 23 ఏళ్ల ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 7లక్షల నుండి 20 లక్షలకు పెరిగింది. అంతేనా నటి-ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ వంటివారు తమ కోసం డిజైన్ చేయమని కోరుతున్నారు. ఆమె కోసం ఒక దుస్తులను తయారు చేసేందుకు నాన్సీ సన్నద్ధమవుతోంది. ఇంకా అర్జున్ కపూర్,మసాబా గుప్తా వంటి ప్రముఖుల ప్రశంసలు దక్కించుకుంది. జీవిత ప్రయాణం చాలా కష్టంగా సాగింది. కానీ ప్రతి క్షణం విలువైనదే అంటూ తన జర్నీని గుర్తు చేసుకుంది.మే 14-మే 25 వరకు జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్, కార్సెట్, టెయిల్డ్ స్కర్ట్ , బ్యాక్లెస్ బ్లౌజ్, మ్యాచింగ్ వీల్, పొడవాటి పల్లూతో క్లిష్టమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ లావెండర్ చీర తదితర లుక్స్తో అదరగొట్టింది. అంతేకాదు తన దుస్తులను తానే స్వయంగా కుట్టుకోవడం ప్రత్యేకత. కేన్స్ కోసం, నాన్సీ నాలుగు దుస్తులను డిజైన్ చేసుకుంది. ఇందుకు ఆమెకు రెండు నెలలు పట్టింది. 30 రోజుల్లో 1,000 మీటర్ల ఫ్యాబ్రిక్తో తయారు చేసిన అందమైన 20 కిలోల గులాబీ రంగు గౌనుతో ఆమె ఫస్ట్ లుక్ని రూపొందించింది.ఆ ఆ తర్వాతి నెలలో, ఆమె మిగిలిన మూడింటిని సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా రెండవలుక్ కోసం దేశీయ చీరను ఎంచుకుంది. వెస్ట్రన్ టచ్తో ఆమె ధరించిన చీర ఆడియెన్స్తోపాటు, చాలామంది సెలబ్రిటీలకు కూడా వీపరీతంగా నచ్చేసింది.ఈ చీరను 100 శాతం ఆర్గానిక్ కాటన్, సస్టైనబుల్ ఫాబ్రిక్ నుండి తయారు చేసానని స్వయంగా చెప్పంది. అలాగే తాను ఎక్కువగా సోదరుడి సలహాలను తీసుకుంటానని కూడా వెల్లడించింది. ఈ సారి కూడా డిజైన్ల నుంచి దుస్తుల రంగు వరకు అన్నీ మా అన్నయ్య ఆలోచనలే అని తెలిపింది మురిపెంగా. ఇంత పాపులారిటీ వచ్చింది కదా నటిస్తారా అంటే.. తనకు నటన అంటే పెద్దగా తెలియదు కాబట్టిన నో అని చెప్పేసింది. కల నిజమైంది అంటూ తనకు మద్దతిచ్చి, స్ఫూర్తినిచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. తన ఫ్యాషన్తో మరింత అబ్బుర పర్చాలని భావిస్తున్నట్టు తెలిపింది. -
Cannes 2024: ఊర్వశి రౌతేలా స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
-
Cannes 2024 రూ. 105 కోట్ల విలువైన డ్రెస్లు : ఈ భామ ఎవరో గుర్తుపట్టండి!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినీ, ఫ్యాషన్ ప్రముఖులు సందడి చేస్తున్నారు. ప్రతీ ఏడాది 12-రోజుల ఈ వేడుకులో ఫ్యాషన్ స్టయిల్, బ్యూటిఫుల్ ఫ్యాషన్ గేమ్, లుక్స్తో అదరగొట్టేస్తున్నారు. 77వ కేన్స్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్పై ఐశ్వర్యారాయ్ బచ్చన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కియారా అద్వానీ, ప్రీతి జింటా, దీప్తి సాధ్వానీ, శోభితా ధూళిపాళ, అదితి రావ్ హైదరీ తళుక్కున మెరిసారు. అంతేకాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ త్యాగికూడా అందరి చూపును తన వైపు తిప్పుకుంది. అయితే వీరిలో మరింత స్పెషల్గా నిలుస్తోంది నటి, మోడల్ ఊర్వశి రౌతేలా.ఊర్వశీ రౌతేలా ఖరీదైన ఫ్యాషన్ దుస్తులతో టాక్ ఆఫ్ ది వరల్డ్గా నిలిచింది. ఈ బ్యూటీ కేన్స్ వేదికపై ధరించిన డ్రెస్ ధరలు ఏకంగా రూ.105 కోట్లు. ముఖ్యంగా ఫస్ట్ డే ధరించిన పూల పింక్ గౌన్ స్పెషల్గా నిలిచింది. దీని ధర ఏకంగా రూ.47 కోట్లు అని తెలుస్తోంది. అలాగే, కేన్స్ నాలుగవ రోజు వేసుకున్న బ్లాక్ అండ్ వైట్ కస్టమ్ మేడ్ డ్రెస్ ధర ఏకంగా రూ.58 కోట్లు. సో.. మొత్తంగా ఈ రెండు డ్రెస్సులు కలిపి రూ.105 కోట్లు వరకు ఉంటుందనేది హాట్ టాపిక్గా నిలుస్తోంది. ఐశ్వర్య, కియారా అద్వానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రీతి జింటా లాంటి తారలు ధరించిన డ్రెస్ల ధరలు లక్షల్లో ఉంటుందిట. తరువాత రోజుల్లో కూడా తనదైన స్టయిల్లో అదర గొడుతోంది ఈ భామ.👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ట్రోలర్స్కు ఇచ్చిపడేసిన ఐశ్వర్యరాయ్ బచ్చన్
అందాల ఐశ్వర్యం, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన లేటెస్ట్ లుక్తో ఇంటర్నెట్లో సంచలనం రేపుతోంది. తాజాగా కొన్ని అద్భుతమైన చిత్రాలను ఇన్స్టాలో పోస్ట్ చేసి ట్రోలర్స్కు షాకిచ్చింది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన లుక్స్పై విపరీతంగా ట్రోల్ చేసినవాళ్లకు లేటెస్ట్ ఫోటోస్తో తగిన సమాధానం చెప్పింది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb)కుమార్తె ఆరాధ్య బచ్చన్తో కలిసి ప్రతిష్టాత్మక కేన్స్ చలన చిత్రోత్సవానికి హాజరైన ఐషూ రెడ్ కార్పెట్ లుక్తో వార్తల్లో నిలిచింది. అయితే కొంతమంది నెటిజన్లు ఆమె లుక్పై దారుణంగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో కేన్స్ 2024 కోసం సిద్ధమవుతున్నప్పటి ఫోటోలతో ఫ్యాన్స్ను ఇంప్రెస్ చేసింది. తన కొత్త హెయిర్స్టైల్తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. తన అందమైన లుక్తో అందరినీ మంత్రముగ్దులను చేసింది. దీంతో ఫ్యాన్స్ కమెంట్స్ ఒక రేంజ్లో సాగాయి. "రెడ్ కార్పెట్పై ఇలా దర్శనమిచ్చి ఉండి ఉంటే ఉచకోతే’’ అని ఒకరు, "కేన్స్ సమయంలో మీరు ఈ రకమైన హెయిర్స్టైల్ ఎంచుకుంటే భలే ఉండేది’’ మరొకరు కమెంట్ చేశారు. "భూమిపై అత్యంత అందమైన మహిళ" అని మరో యూజర్ బాలీవుడ్ దియాపై తన ప్రేమను ప్రకటించాడు. -
డబ్బుల కోసమే నటించా.. నాలా చాలామంది ఉన్నారు: నటి
ఇటీవల జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో "ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్" చిత్రానికి గ్రాండ్ ప్రిక్స్ అవార్డు దక్కింది. పాయల్ కపాడియా ఈ చిత్రాన్ని తెరకెకక్కించారు. అయితే ఈ సినిమాలో మలయాళ నటి కని కుస్రుతి కీలక పాత్ర పోషించింది. తాను సినిమాల్లో నటించడం ప్రారంభించినప్పుడు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావించింది. కేన్స్ రెడ్ కార్పెట్పై సందడి చేసిన కని కస్రుతి పుచ్చకాయను పోలి ఉన్న హ్యండ్బ్యాగ్తో కనిపించిన అందరి దృష్టిని ఆకర్షించింది. తాజా ఇంటర్వ్యూలో తాను పడిన కష్టాలను పంచుకుంది.కని కుస్రుతి మాట్లాడుతూ..'నేను ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను. తనకు జీవనోపాధి కోసం మాత్రమే సినిమాల్లో నటించాల్సి వచ్చింది. 2020లో నేను నటించిన మలయాళ చిత్రం "బిరియాని"కి కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్, మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నా. కానీ అంతకుముందు నా జీవితమంతా కన్నీళ్లతో పోరాటమే. నా దగ్గర డబ్బు లేని సమయంలో సజిన్ (సజిన్ బాబు) నన్ను సంప్రదించాడు. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆయనతో ఓకే మాట చెప్పా. ఇందులో నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ క్యారెక్టర్ నేను చేయలేను అని చెప్పా. మరొకరిని వెతకండి సలహా ఇచ్చా. ఆ సమయంలో నాకు డబ్బు అవసరం ఉన్నప్పటికీ సినిమా చేయాలని అనిపించలేదని చెప్పింది. మూడు నెలల తర్వాత చిత్రనిర్మాత మళ్లీ నన్ను సంప్రదించారని' కుస్రుతి తెలిపింది.బిరియానీకి రూ.70,000 ఆఫర్కుస్రుతి మాట్లాడుతూ.. "నాకు ఈ సినిమా చేయడానికి ఆసక్తి లేదు. కానీ నా దగ్గర డబ్బు లేదని చెప్పా. నాకు దాదాపు రూ.70 వేల ఆఫర్ ఇచ్చారు. అది నాకు చాలా పెద్ద మొత్తం. అప్పుడు నా ఖాతాలో కేవలం రూ.3 వేలు మాత్రమే ఉంది.' తన కన్నీళ్ల బాధను పంచుకుంది. కాగా..ఒకవేళ తాను థియేటర్కే పరిమితమైన ఉంటే.. బాగా సంపాదించగలిగితే సినిమాల్లోకి రాకపోవచ్చని ఆమె అన్నారు. భవిష్యత్తులో జీవనోపాధి పొందే పరిస్థితులు లేకుంటే.. నాకు ఇష్టం లేని పనులు చేయవలసి రావొచ్చని.. అలాంటి వారు చాలా మంది ఉన్నారని' ఆమె చెప్పింది. -
Cannes 2024: సన్నజాజి తీగలా సొట్ట బుగ్గల సుందరి (ఫొటోలు)
-
ఛాయాచిత్రం
హైస్కూల్, కాలేజీ రోజుల్లో నాటకాల్లో ఛాయా కదమ్ నటప్రతిభను మెచ్చుతూ ‘నువ్వు సినిమాల్లోకి వెళితే ఇక తిరుగు లేదు’ అన్నారు చాలామంది. కట్ చేస్తే... ‘అసలు నీకు నటన వచ్చా’ అని తిట్టాడు ఒక డైరెక్టర్. ఒక డైరెక్టర్ అయితే అసహనంతో కుర్చీని నేలకేసి కొట్టాడు. ఇలా ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. అయితే ఏరోజూ వెనకడుగు వేయలేదు.కట్ చేస్తే... ‘ఒక్క సీన్ అయినా ఫరవాలేదు’ అనుకునే స్థాయి నుంచి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’లో నటించే స్థాయికి చేరింది. ఈ చిత్రం కాన్స్ ఫిల్మ్ఫెస్టివల్లో ‘గ్రాండ్ ప్రి’ అవార్డ్ గెలుచుకొని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ‘పార్వతి’ పాత్రలో నటనకు ప్రశంసలే కాదు అంతర్జాతీయ వేదికపై స్టాండింగ్ వొవేషన్ స్వీకరించింది ఛాయా కదమ్.ముంబై శివారులోని కలీనాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది ఛాయ. తండ్రి ఓ మిల్లులో కార్మికుడు. స్కూలు రోజుల్లో కబడ్డీ బాగా ఆడేది. స్టేట్, నేషనల్ లెవెల్లో కూడా ఆడింది. ఆటలతో పాటు నటించడం అంటే కూడా ఇష్టం. హైస్కూల్, కాలేజీలో ఎన్నో నాటకాల్లో నటించింది. ఇంటర్మీడియెట్ ఫెయిల్ కావడంతో ‘ఫెయిల్యూర్’ అనేది తొలిసారిగా పరిచయం అయింది. ‘జయాపజయాలు జీవితంలో భాగం. ఫెయిల్యూర్ ఎదురైనా కుంగి΄ోనక్కర్లేదు. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి సెకండ్ ఛాన్స్ ఉంటుంది అనే విషయం ఎప్పుడూ మరచి΄ోవద్దు’ అనే మాట ఛాయను ముందుకు నడిపించింది.‘టెక్స్టైల్ డిజైన్’ గ్రాడ్యుయేషన్ చేసినప్పటికీ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపింది. అయితే సినిమాల్లో అవకాశం రావడం నాటకాల్లో నటించినంత వీజీ కాదనే విషయాన్ని ఆమె త్వరగానే అర్థం చేసుకుంది. స్ట్రగుల్స్ తర్వాత... రాక రాక ఒక సినిమాలో అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు! ‘సినిమాల్లో నటించాలనుకునేవారికి నటప్రతిభతో పాటు బోలెడు ఓపిక ఉండాలి’ అనే మాటను మాత్రం ఎప్పుడూ మరచి΄ోలేదు ఛాయ.తొలి రోజుల్లో ‘వన్ సీన్’ పాత్రలలోనూ నటించింది. ఆ ఒక్క సీన్ కోసం లొకేషన్లో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. అయితే ఎప్పుడూ ఓపిక కోల్పోలేదు. ‘ఒక్క సీన్ ఉంది. ఫలానా చోట షూటింగ్’ అని చెప్పేవారు. ΄÷ద్దున్నే లేచి ఆ ్రపాంతం చేరడానికి ్రపాణం మీదికి వచ్చేది. తీరా అక్కడికి వెళ్లాక... ‘ఈ రోజు షూటింగ్ క్యాన్సిల్’ అనే మాటను కూడా ఎన్నో సార్లు విన్నది. కొన్ని సినిమాల్లో మంచి పాత్రలు వచ్చినప్పటికీ డైరెక్టర్ల అహం భరించలేని స్థాయిలో ఉండేది. దుఃఖం ఆగేది కాదు. దుఃఖంలోనే ఉంటే ఆ సాగరంలో ‘నటన’ కొట్టుకు΄ోతుంది. అందుకని ఎంత బాధ అనిపించినా అప్పటికప్పుడు ఆ బాధ నుంచి బయట పడి డైరెక్టర్కు నచ్చేంత వరకూ నటిస్తూనే ఉండేది. ఆమె ఓపిక, కష్టం వృథా ΄ోలేదు. మరాఠీ, హిందీ సినిమాల్లో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. కాన్స్ రూపంలో అంతర్జాతీయ వేదికపై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.శ్రామిక వర్గ బలంశ్రామిక వర్గ నేపథ్యం నుంచి వచ్చాను. నాన్న మిల్లు కార్మికుడు. అలా అని నేను ఎప్పుడూ ఎవరి నుంచి సానుభూతి ఆశించలేదు. అయితే నా నేపథ్యం నేను చేసిన అట్టడుగు, శ్రామిక వర్గ పాత్రలకు బలాన్ని ఇచ్చింది. నా పాత్రలకు అవసరమైన మెటీరియల్ను ఇచ్చింది.– ఛాయా కదమ్ -
ఆ ముగ్గురు మహిళలకు ధన్యవాదాలు: దర్శకురాలు పాయల్ కపాడియా
కాన్స్ చిత్రోత్సవాల్లో భారతదేశం చరిత్రలో చెప్పుకునేలా సత్తా చాటింది. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘భారతీయ సినిమా’ కాన్స్లో మెరిసింది. తొలి గ్రాండ్ ప్రిక్స్ అవార్డును మన దేశ దర్శకురాలు పాయల్ కపాడియా తెచ్చారు. ప్రతిష్టాత్మక పియరీ ఏంజెనీ అవార్డును అందుకున్న తొలి ఏషియన్గా ఛాయాగ్రాహకుడు–దర్శక–నిర్మాత సంతోష్ శివన్ సగర్వంగా దేశానికి తిరిగొచ్చారు. ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో అనసూయ సేన్ గుప్తా ‘ది షేమ్లెస్’ చిత్రానికిగాను ఉత్తమ నటి అవార్డును దక్కించుకున్నారు.ఇదే విభాగంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరి దర్శకత్వంలో రూపొందిన ‘సంతోష్’ ప్రదర్శితమైంది. కానీ అవార్డు దక్కించుకోలేకపోయింది. ఇక చిదానంద ఎస్. నాయక్ దర్శకత్వం వహించిన కన్నడ లఘు చిత్రం ‘సన్ఫ్లవర్స్ వేర్ ది ఫస్ట్ వన్స్ టు నో’ ‘లా సినిఫ్’ విభాగంలో మొదటి బహుమతి పొందింది. అలాగే ‘బన్నీ హుడ్’ అనే మరో భారతీయ యానిమేటెడ్ మూవీ మూడో బహుమతి సాధించింది. ఇలా ఈసారి 77వ కాన్స్ చిత్రోత్సవాల్లో భారతదేశం హవా కనిపించింది. మే 14న ఆరంభమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగిసింది. దర్శకురాలు పాయల్ కపాడియా అందుకున్న అవార్డు విశేషాలతో పాటు మరిన్ని విషయాలు ఈ విధంగా... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ చిత్రం ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ సినిమా సత్తా చాటింది.గ్రాండ్ ప్రిక్ విభాగంలో అవార్డు సాధించింది. కాన్స్ చిత్రోత్సవాల్లోని ఈ ప్రధాన విభాగంలో అవార్డు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చరిత్ర సృష్టించింది. కాగా ఈ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మక విభాగమైన పామ్ డి ఓర్ అవార్డుకు కూడా ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రం పోటీలో నిలిచినప్పటికీ, అవార్డును అందుకోలేకపోయింది. అయితే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ విభాగంలో ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ రూపంలో ఓ భారతీయ చిత్రం పోటీలో నిలవడం ప్రశంసించదగ్గ విషయం. ఇక పామ్ డి ఓర్ విభాగంలో దాదాపు ఇరవై సినిమాలను వెనక్కి నెట్టి, సీన్ బేకర్ దర్శకత్వం వహించిన కామెడీ డ్రామా ‘అనోరా’ అవార్డును ఎగరేసుకుపోయింది.‘గ్రాండ్ టూర్’ సినిమాకు గాను మిగ్యుల్ గోమ్స్ ఉత్తమ దర్శకుడిగా, ‘కైండ్స్ ఆఫ్ కైండ్నెస్’ సినిమాలోని నటనకు గాను జెస్సీ ప్లేమోన్స్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘ఎమిలియా పరేజ్’లో నటించిన అడ్రియానా పాజ్, కర్లా సోఫియా, సెలెనా గోమేజ్, జో సల్దానాలు ఉత్తమ నటీమణులుగా నిలిచారు. జాక్వెస్ డియార్డ్ నటించిన ఈ సినిమాకే జ్యూరీ ప్రైజ్ దక్కడం విశేషం. చిత్రోత్సవాల తొలి రోజు హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్, ఆ తర్వాత జపాన్కు చెందిన యానిమేషన్ స్టూడియో ‘స్టూడియో ఘిబ్లి’ ప్రతిష్టాత్మక పామ్ డి ఓర్ అవార్డు అందుకోగా చివరి రోజు హాలీవుడ్ దర్శక–నిర్మాత జార్జ్ లూకాస్ స్వీకరించారు.‘‘నిజానికి స్క్రిప్ట్ రాసేటప్పుడు కంగారుపడ్డాను. ఆ కంగారులో ఏదో రాశాను (నవ్వుతూ). మా సినిమాని ఇక్కడ వరకూ తీసుకొచ్చిన ‘కాన్స్’కి థ్యాంక్స్. దయచేసి మరో భారతీయ చిత్రం కోసం 30 ఏళ్లు వేచి ఉండొద్దు’’ అని అవార్డు అందుకున్న అనంతరం పాయల్ కపాడియా అన్నారు. వేదిక మీద ఉన్న ఈ మూవీలో నటించిన కనీ కస్రుతి, దివ్య ప్రభ, చాయా కదమ్లను ఆత్మీయంగా హత్తుకుని, ‘‘తమ సొంత సినిమాలా భావించి చేసిన ఈ ముగ్గురు మహిళలకు ధన్యవాదాలు’’ అన్నారు.ఇంకా ఈ చిత్ర నిర్మాతలు, భాగస్వాములు, ఇతర యూనిట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అది మాత్రమే కాదు... ఈ ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తొలి రోజు ఫెస్టివల్ వర్కర్లు మెరుగైన వేతనాలు డిమాండ్ చేస్తూ చేసిన నిరసనకు మద్దతు తెలిపారు. పాయల్ మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ – ‘‘నేను తీసిన ఈ సినిమా ముగ్గురి మహిళల స్నేహం నేపథ్యంలో ఉంటుంది. అయితే మహిళలు ఎక్కువగా ఒకరికొకరు గోతులు తీసుకుంటారు.సమాజం అలానే చిత్రీకరించింది. అది దురదృష్టకరం. కానీ స్నేహం అనేది నాకు ముఖ్యమైన బంధం. ఎందుకంటే అది గొప్పతనానికి దారి తీస్తుంది. కలుపుగోలుతనాన్ని పెంచుతుంది. ఈ విలువలను కాపాడుకోవడానికి మనం ప్రయత్నిస్తుండాలి’’ అన్నారు. ఆమె అవార్డు తీసుకురావడం పట్ల భారత ప్రధాని మోదీ, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు.పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’. కని కస్రుతి, దివ్య ప్రభ, చాయా కదమ్ లీడ్ రోల్స్లో ఈ సినిమాను థామస్ హకీమ్, జూలియన్ గ్రాఫ్ నిర్మించారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ నెల 23న ఈ చిత్రం ప్రదర్శితమైంది. కాగా పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్కే కాన్స్లోని ఓ ప్రధాన విభాగమైన గ్రాండ్ ప్రిక్ అవార్డు రావడం విశేషం.అయితే కాన్స్లో పాయల్ ప్రతిభ మెరవడం ఇదే తొలిసారి కాదు. 2021లో జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ బెస్ట్ డాక్యుమెంటరీగా నిలిచింది. ఆ ఏడాది గోల్డెన్ ఐ అవార్డు పాయల్కు దక్కింది. అలాగే 2017లో జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ ‘ఆఫ్టర్ నూన్ క్లౌడ్’ ప్రదర్శితమైంది. ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ కథ ఏంటంటే... కేరళ నుంచి ముంబైకి వెళ్లి నర్సులుగా పని చేస్తుంటారు ప్రభ (కని కస్రుతి), అను (దివ్య ప్రభ). భర్తతో విడిపోయిన ప్రభకు ఓ గిఫ్ట్ వస్తుంది. ఆ గిఫ్ట్ను ఆమె భర్త పంపిస్తాడు. దీంతో ప్రభకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు అను తన రిలేషన్షిప్లో ఇబ్బందులకు లోనవుతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరూ రోడ్ ట్రిప్కు వెళితే ఏం జరిగింది? అన్నదే కథ. -
బ్యాన్ చేసిన వారే ఆమె టాలెంట్కు నివ్వెరపోయారు
డైరెక్టర్ పాయల్ కపాడియా... భారతీయ సినిమా గొప్పతనాన్ని కేన్స్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటులందరూ అక్కడ అడుగుపెడితే చాలు అనుకుంటే భారత్కు చెందిన పాయల్ కపాడియా తన ప్రతిభతో అత్యుత్తమ అవార్డును సొంతం చేసుకుంది. 77వ కేన్స్ చలన చిత్రోత్సవంలో పాయల్ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ద్వారా అత్యున్నత పురస్కారమైన 'గ్రాండ్ ప్రిక్స్'ను తాజాగా ఆమె సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా ఈ అవార్డును దక్కించుకోలేదు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాంపిటీషన్లో నిలిచి అవార్డ్ దక్కించుకోవడంతో ఒక్కసారిగా చప్పట్లతో పాయల్ కపాడియాను అభినందించారు.విద్యాభ్యాసంముంబైలో జన్మించిన పాయల్ కపాడియా ఆంధ్రప్రదేశ్లోని రిషి వ్యాలీ స్కూల్లో ఇంటర్ వరకు చదివింది. ఆమె ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ నుంచి ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. ఆమె సోఫియా కాలేజీలో ఒక సంవత్సరం మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆ తర్వాత, ఆమె ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)లో ఫిల్మ్ డైరెక్షన్ కోర్సుని అభ్యసించిందిబ్యాన్ చేసిన వారే తన టాలెంట్కు ఫిదా అయ్యారుపాయల్ కపాడియాకు చదువుతో పాటు సినిమాలంటే చాలా ఆసక్తి. దీంతో ఆమె డైరెక్టర్గా అడుగుపెట్టాలని తపించింది. తన అభిమాన దర్శకులెందరో పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)లో చదువుకున్నారని తెలిసి అక్కడే చేరాలని ఎంతో కష్టపడి 2015లో సీటు సాధించింది. అయితే ఆమెకు అక్కడ పలు సవాళ్లు ఎదురయ్యాయి. కళాశాల ఛైర్మన్గా ఉన్న ఒక నటుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం తనకు నచ్చలేదు. దీంతో వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు తరగతులను కూడా బహిష్కరించింది. పాయల్ చేసిన పనికి ఆగ్రహించిన FTII ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెకు వచ్చే స్కాలర్షిప్ను కూడా రద్దు చేసింది. వారు ఎన్ని చేసినా ఆమె బెదరలేదు. చివరకు పాయల్పై ఎఫ్టీఐఐ కేసు కూడా పెట్టింది. నమ్మిన సిద్ధాంతాల కోసం ధైర్యంగా నిలబడింది. వాటిపై పోరాడుతూనే మరోపక్క చిత్ర నిర్మాణ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది.పాయల్ను FTII బ్యాన్ చేసినా కూడా తన పోరాటం ఆగలేదు. 2017లో ఆమె డైరెక్ట్ చేసి షార్ట్ఫిల్మ్ 'ఆఫ్టర్నూన్ క్లౌడ్స్' కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఎంపికైంది. అప్పుడు భారత్ నుంచి ఎంపికైన ఏకైక చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా ప్రపంచానకి తెలిసింది. తర్వాత అదే కళాశాల యాజమాన్యం ఆమె వద్దకు వచ్చింది. ఆమెపై ఉన్న ఆంక్షలను ఎత్తేసింది. ఆ సమయంలో విమాన టికెట్లు సహా ఖర్చులన్నీ విద్యాసంస్థే భరించి కేన్స్కు పంపింది.ఆ తర్వాత 2021లో 'ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్' పేరుతో తీసిన డాక్యుమెంటరీ కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అడుగు పెట్టింది. అప్పుడు 'గోల్డెన్ ఐ' అవార్డుని సొంతం చేసుకున్న పాయల్.. దేశం దృష్టినీ మరోసారి తనవైపు తిప్పుకొంది. ఇప్పటి వరకు ఆమె తీసిన ప్రతి సినిమా కూడా పలు అంతర్జాతీయ వేదికల మీదా అవార్డులను కొల్లగొట్టాయి. తాజాగా 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్ఠాత్మక పామ్ డి ఓర్ స్క్రీనింగ్ కాంపిటీషన్లో 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' చిత్రం ద్వారా 'గ్రాండ్ ప్రిక్స్' అవార్డును సొంతం చేసుకుంది. 30 ఏళ్ల క్రితం 'స్వహం' అనే సినిమా పామ్ డి ఓర్ స్క్రీనింగ్కి ఎంపికైంది. ఆ తర్వాత ఈ పోటీలో నిలిచిన భారతీయ సినిమా ఇదొక్కటే కావడం విశేషం. 34 ఏళ్ల పాయల్ జీవితం ఈతరం యువతకు ఆదర్శం. ఆమె డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాలో కూడా కథకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈతరం అమ్మాయిల కలలు, ఆశయాలను ఆమె ఎంతో సున్నితంగా తెరకెక్కిస్తారు. తాజాగా అవార్డు అందుకున్న 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' చిత్రం కూడా కేరళకు చెందిన ఇద్దరు నర్సులు గురించి చెబుతుంది. -
కాన్స్లో అనసూయకు ఉత్తమ నటి అవార్డు
భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా కాన్స్ చిత్రోత్సవాల్లో చరిత్ర సృష్టించారు. 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోని ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో ‘ది షేమ్లెస్’ (2024) చిత్రంలోని నటనకు గాను ఆమె ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఈ విభాగంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్న తొలి భారతీయ నటిగా అనసూయ సేన్ గుప్తా చరిత్రలో నిలిచిపోయారు. ఈ విభాగంలో దాదాపు పదిహేను మంది నటీమణులతో పోటీ పడి ఆమె అవార్డు దక్కించుకోవడం విశేషం.బల్గేరియన్ దర్శకుడు కాన్ట్సాంటిన్ బోజనవ్ ‘ది షేమ్లెస్’ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలోనే ‘ది స్టోరీ ఆఫ్ సోలమన్’ చిత్రంలోని నటనకుగాను బ్రూనో నాహోన్ ఉత్తమ నటుడిగా నిలిచారు. ఉత్తమ చిత్రంగా ‘బ్లాక్ డాగ్’ ఎంపికైంది. ఉత్తమ దర్శకులుగా రాబర్టో మినర్విని (ది డ్యామ్డ్), రంగనో న్యాని (ఆన్ బికమింగ్ ఎ గినీ ఫౌల్) అవార్డు అందుకున్నారు.కొత్త జీవితం... ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అట్టడుగు వర్గాలవారు, వలసదారులు సమానత్వం కోసం పోరాటం చేసే పరిస్థితుల్లో ఉన్నందువల్ల పోరాటం చేస్తున్నారు. నిజానికి సమానత్వం కోసం పోరాడాలంటే వలసదారులు, అట్టడుగు వర్గాలవారే కానక్కర్లేదు. మనం మంచి మనుషులు అయితే చాలు’’ అంటూ అవార్డు స్వీకరించిన అనంతరం పేర్కొన్నారు అనసూయ సేన్ గుప్తా. అలాగే ‘‘నాకు కొత్త జీవితాన్నిచ్చిన కాన్స్కు ప్రస్తుతానికి గుడ్ బై... కృతజ్ఞతలు’’ అని తన ఇన్స్టా స్టోరీలోనూ ఆమె షేర్ చేశారు. ‘ది షేమ్లెస్’ కథేంటంటే... ఢిల్లీలోని ఒక వ్యభిచార గృహంలో పోలీసును హత్య చేస్తుంది వేశ్య రేణుక. ఆ తర్వాత మరో రాష్ట్రంలోని సెక్స్ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం ΄÷ందుతుంది. అక్కడ పదిహేడేళ్ల వయసులో ఉన్న దేవిక అనే అమ్మాయితో రేణుక ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత రేణుక, దేవికల జీవితాలు ఎలా మారాయి? ఇద్దరూ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? అన్నదే ‘ది షేమ్లెస్’ కథాంశం. ఈ చిత్రంలో రేణుక పాత్రలో అనసూయ సేన్, దేవికగా ఒమరా శెట్టి నటించారు. జర్నలిస్ట్ అవ్వాలనుకుని నటిగా... అనసూయ సేన్ గుప్తా స్వస్థలం కోల్కతా. జాదవ్పూర్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ పూర్తి చేశారామె. జర్నలిజంను వృత్తిగా ఎంచుకోవాలనుకున్నారు. కానీ ఆమె యాక్టర్ అయ్యేలా పరిస్థితులు మారాయి. 2009లో విడుదలైన బెంగాలీ మ్యూజికల్ ఫిల్మ్ ‘మ్యాడ్లీ బెంగాలీ’ అనసూయ సేన్ గుప్తాకు నటిగా తొలి చిత్రం. అంజన్ దత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదల తర్వాత 2013లో అనసూయ ముంబైకి చేరుకున్నారు.ఆమె సోదరుడు అభిషేక్ సేన్ గుప్తా బాలీవుడ్లో దర్శకత్వ విభాగంలో ఉన్నారు. ఎంతో ప్రయత్నించినప్పటికీ నటిగా సరైన అవకాశాలు రాకపోవడంతో ‘సాట్ ఉచక్కీ, రే, మసాబా మసాబా’ వెబ్ వంటి సిరీస్లకు ్ర΄÷డక్షన్ డిజైన్, సెట్ డిజైనింగ్ విభాగాల్లో పని చేశారామె. ఆ తర్వాత కరోనా టైమ్లో 2020 జూన్లో ‘ది షేమ్లెస్’ సినిమాకు ఆడిషన్స్ ఇచ్చారు అనసూయ. అది నచ్చి, దర్శకుడు కాన్ట్సాంటిన్ బోజనవ్ ఆమెను లీడ్ రోల్కి ఎంచుకున్నారు. సంతోష్ శివన్కు ప్రతిష్టాత్మక పియర్ అవార్డు...రెట్రో ఫోకస్, మోడ్రన్ లెన్స్ను కనుగొన్న ఫ్రెంచ్ శాస్త్రవేత్త పియర్ ఏంజెనీకి నివాళిగా 2013 నుంచి ఆయన పేరిట ఓ అవార్డును నెలకొల్పి సినిమాటోగ్రాఫర్లకు అందిస్తున్నారు కాన్స్ చిత్రోత్సవాల నిర్వాహకులు. ఈ ఏడాది ఈ అవార్డును భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ అందుకున్నారు. ఈ చిత్రోత్సవాల్లో పాల్గొన్న ప్రముఖ నటి ప్రీతీ జింతా ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి ఏషియన్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్నే కావడం విశేషం. ఈ సందర్భంగా కాన్స్కు ధన్యవాదాలు తెలిపారు సంతోష్. దర్శక–నిర్మాతగా..మలయాళ ‘నిధియుడె కథ’ (1986) ఛాయాగ్రాహకుడిగా సంతోష్ శివన్కి తొలి చిత్రం. ఆ తర్వాత పలు మలయాళ చిత్రాలకు కెమెరామేన్గా చేసిన ఆయన ‘దళపతి, రోజా, తుపాకీ’ వంటి తమిళ చిత్రాలకు, హిందీ ‘దిల్ సే’, తెలుగు ‘స్పైడర్’ తదితర చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేశారు. దర్శకుడిగా సంతోష్ తెరకెక్కించిన చిత్రాల్లో హిందీలో ‘ముంబైకర్, తహాన్, మలయాళంలో ‘ఉరుమి’ వంటివి ఉన్నాయి. 35ఏళ్లకు పై బడిన కెరీర్లో ఛాయాగ్రాహకుడిగా, దర్శక– నిర్మాతగా సంతోష్ శివన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. -
కేన్స్ 2024: బాలీవుడ్ హీరోయిన్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా!
భారతీయులు సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. కలలు నెరవేరినప్పుడు ఎంత సంతోషపడతారో అందుకు తోడ్పడినవారికి కృతజ్ఞతలు చెప్పేందుకు అంతే ముందుంటారు. ఆ ఆశయాన్ని సాధించడం ఎంతో గౌరవంగా భావిస్తారు. తాజాగా అవనీత్ కూడా ఒకింత సంతోషంగా మరింత గర్వంగా ఉంది.ఎర్ర తివాచీపై వయ్యారంగా..తొలిసారి ఆమె కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొంది. ఫ్రాన్స్లో జరుగుతున్న 77వ కేన్స్ చలనచిత్రోత్సవాలలో రెడ్ కార్పెట్పై నడిచింది. మే 23న ఎర్ర తివాచీపై వయ్యారంగా నడిచింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ తనకు ఇంత గొప్ప అవకాశం వచ్చినందుకుగానూ నేలకు నమస్కరించి తర్వాత అక్కడ రెడ్ కార్పెట్పై హొయలు పోయింది. అచ్చమైన భారతీయురాలుఇది చూసిన జనాలు ఆమెను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. తన కలలు నెరవేరాయి. ఆమె కష్టాన్ని మనం తప్పకుండా గుర్తించి తీరాల్సిందే.. నేలకు నమస్కరించి తను ఒక అచ్చమైన భారతీయురాలు అని నిరూపించింది అని కామెంట్లు చేస్తున్నారు. కాగా మర్దాని సినిమాతో వెండితెరపై ప్రయాణం మొదలుపెట్టిన అవనీత్ బ్రూనీ, ఏక్తా, చిడియాఖన్నా, టికు వెడ్స్ షెరు వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె లవ్ కీ అరేంజ్ మ్యారేజ్, లవ్ ఇన్ వియత్నాం సినిమాలు చేస్తోంది. View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) చదవండి: కేన్స్లో రికార్డ్ క్రియేట్ చేసిన ఇండియన్ నటి.. తొలిసారి దక్కిన అవార్డ్ -
కేన్స్లో రికార్డ్ క్రియేట్ చేసిన ఇండియన్ నటి.. తొలిసారి దక్కిన అవార్డ్
ఫ్రాన్స్లో జరుగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ నటి అనసూయ సేన్గుప్తా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డును అందుకునున్న తొలి భారతీయ నటిగా ఆమె రికార్డ్ క్రియేట్ చేసింది. 'అన్ సర్టెయిన్ రిగార్డ్' విభాగంలో ఉత్తమ నటి అవార్డును ఆమె సొంతం చేసుకుంది.బల్గేరియన్ చిత్రనిర్మాత కాన్స్టాంటిన్ బోజనోవ్ దర్శకత్వం వహించిన 'షేమ్లెస్' చిత్రంలో ఆమె పాత్రకు గాను ఈ అవార్డు లభించింది. ఢిల్లీలోని ఓ వేశ్యాగృహం నుంచి పోలీసులను కత్తితో పొడిచి పారిపోయిన 'రేణుక' అనే ఒక వేశ్య జీవిత ప్రయాణాన్ని ఇందులో చిత్రీకరించారు. కోల్కతాకు చెందిన అనసూయ సేన్గుప్తా వేశ్య పాత్రలో తన నటనతో మెప్పించింది. తాజాగా జరుగుతున్న కేన్స్ వేడుకల్లో 'షేమ్లెస్' చిత్రాన్ని ప్రదర్శించగా ఉత్తమ నటిగా ఆమె అవార్డు దక్కింది.అనసూయ సినిమా రంగంలో ఉన్నప్పటికీ వెండితెరపై కనిపించలేదు. ముంబైలో ప్రొడక్షన్ డిజైనర్గా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం గోవాలో అనసూయ సేన్గుప్తా నివసిస్తోంది. నెట్ఫ్లిక్స్ షో 'మసబా మసబా' చిత్రాన్ని నిర్మించడంలో ఆమె కీలకపాత్ర పోషించింది. బెంగాలీ దర్శకుడు అంజన్ దత్ నిర్మించిన రాక్ మ్యూజికల్ మ్యాడ్లీ బెంగాలీ (2009)లో ఆమె తొలిసారిగా నటించింది. ఆ తర్వాత ఆమె నటనకు దూరమైంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ అంజన్ దత్ సాయంతోనే షేమ్లెస్ చిత్రంలో కనిపించి ఉత్తమ నటిగా అవార్డ్ను సొంతం చేసుకోవడం విశేషం. ఈ సినిమాలో వేశ్యగా 'రేణుక' పాత్రలో అనసూయ సేన్గుప్తా మెప్పించింది. వేశ్యగా జీవిస్తున్న ఆమెకు సమాజంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొందో ఈ చిత్రం చూపుతుంది. -
కేన్స్లో మెరిసిన హైదరాబాదీ బ్యూటీ
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒక్కసారి అయినా ఆ రెడ్ కార్పెట్పై నడవాలని ప్రతి హీరోయిన్కు కోరిక ఉంటుంది. ప్రస్తుతం ఫ్రాన్స్లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో ఈ వేడుకలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన హీరోయిన్లు, డిజైనర్లు కేన్స్ రెడ్ కార్పెట్పై సందడి చేశారు. అయితే తాజాగా అదితిరావు హైదరి మెరిసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.హైదరాబాదీ ముద్దుగుమ్మ అదితిరావు హైదరి కేన్స్ రెడ్ కార్పెట్పై అదిరిపోయే లుక్లో కనిపించింది. హాఫ్ షోల్డర్ వైట్ అండ్ బ్లాక్ ఔట్ఫిట్తో ఆమె సందడి చేశారు. ప్యాషన్ ప్రపంచం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ వేడుకల్లో ఇప్పటికే ఐశ్వర్యరాయ్, శోభిత ధూళిపాళ, ఊర్వశీ రౌతేలా, కియారా అద్వానీ లాంటి తారలు తళుక్కున మెరిసి ఆకర్షించారు. వైట్ అండ్ బ్లాక్ ఔట్ఫిట్తో ఆ రెడ్ కార్పెట్పై అదితిరావు హైదరి నడుస్తుంటే అక్కడ కెమెరామెన్లతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ నటించిన హీరామండి వెబ్ సిరీస్ మంచి టాక్తో నెట్ఫ్లిక్స్లో దూసుకుపోతుంది. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్లో ఆమె గూడఛారిగా మెప్పించింది. -
Cannes 2024: కన్నడ జానపదానికి కాన్స్ బహుమతి
దక్షిణ భారత జానపద కథ కాన్స్ మొదటి బహుమతి గెలుచుకుంది. కోడి కూయకూడదని ఒక అవ్వ పుంజును దొంగిలిస్తే ఆ ఊళ్లో తెల్లారదు. తర్వాత ఏమవుతుందనేది 15 నిమిషాల షార్ట్ఫిల్మ్గా తీశాడు పూణె ఇన్స్టిట్యూట్ చిదానంద నాయక్. ప్రపంచవ్యాప్తంగా 2263 ఎంట్రీలు వస్తే చిదానంద తీసిన ‘సన్ఫ్లవర్స్’కు మొదటి బహుమతి వచ్చింది. ఈ ఘనత సాధించిన చిదానంద పరిచయం.మారుమూల చిన్న పల్లెటూరు. ప్రతి ఉదయం కోడి కూయగానే తెల్లారుతుంది. ఆ రోజు కోడి కూయలేదు. తెల్లారలేదు. చీకటి. ఎక్కడ చూసినా చీకటి. సూర్యుడు ఎందుకు రావడం లేదు? కోడి కూయడం లేదు. కోడెందుకు కూయడం లేదు? ఊళ్లోని అవ్వ దానిని దొంగిలించి దాచేసింది. దేవుడా... పదండి కోడిని వెతకండి. ఊరంతా బయలుదేరింది. లాంతర్లు పట్టుకుని తలోదిక్కు. అంతేనా? దీనికంతటికీ కారణమైన అవ్వ కుటుంబాన్ని వెలేసింది. కోడి దొరక్క΄ోయినా అవ్వ కనపడక΄ోయినా ఆ ఊరిలో సూర్యుడు వచ్చేలా లేడు. తర్వాత ఏమైంది?చిదానంద నాయక్ తీసిన ‘సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్వన్స్ టు నో’ (΄÷ద్దు తిరుగుడు పూలకే మొదట తెలుస్తుంది) షార్ట్ఫిల్మ్ చూడాలి. 15 నిమిషాల ఈ షార్ట్ఫిల్మ్కు కాన్స్ ఫెస్టివల్లో ‘లే సినే’ విభాగంలో ఈ ప్రతిష్టాత్మక బహుమతి దక్కింది.ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థుల కోసం...ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లలో చదివే విద్యార్థులను ్ర΄ోత్సహించేందుకు కాన్స్ ఫెస్టివల్లో ‘లే సినే’ విభాగం ఉంటుంది. దీనికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు గంట నిడివి లోపు ఉన్న షార్ట్ఫిల్మ్స్ను ఎంట్రీగా పంపవచ్చు. జ్యూరీ వీటిని పరిశీలించి ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులు ఇస్తుంది. ఈసారి మొత్తం 555 ఫిల్మ్ స్కూల్స్ నుంచి 2263 ఎంట్రీలు వస్తే మొదటి ప్రైజ్ చిదానంద తీసిన ‘సన్ఫ్లవర్స్’కు దక్కింది. దాదాపు పదమూడున్నర లక్షల ప్రైజ్మనీ ఇస్తారు. ఇది సామాన్యవిషయం కాదు. మన దక్షిణాది జానపదానికి దక్కిన గౌరవం కింద లెక్క.దర్శకుడైన డాక్టర్చిదానంద నాయక్ది కర్ణాటక. చిన్నప్పటి నుంచి అకిరా కురసావా సినిమాలు చూస్తూ పెరిగాడు. సినిమా దర్శకుడు కావాలని ఉన్నా మెడిసిన్ చదవాల్సి వచ్చింది. ‘ఒక డాక్టర్గా అతి దగ్గరి నుంచి జననాన్ని, మరణాన్ని చూడటం నాకు మానవ జీవనసారాన్ని తెలిపింది. ఒక వైద్యుడిగా జీవించడమంటే క్షణంలో ఆనందం క్షణంలో దుఃఖాన్ని చూడటమే. మనుషుల మకిలి లేని నిజాయితీని ఆ సమయంలోనే చూస్తాం’ అంటాడు చిదానంద. డాక్టరయ్యాక కూడా మనసు సినిమా రంగంలోనే ఉన్నట్టు అర్థమయ్యి పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు.నాలుగు రోజుల్లో షూట్:‘సన్ఫ్లవర్స్’ షార్ట్ఫిల్మ్ను తన సంవత్సరాంత అభ్యాసంగా తీశాడు చిదానంద. ‘మా ఇన్స్టిట్యూట్కు 50 కిలోమీటర్ల దూరం లోపల షార్ట్ఫిల్మ్ తీయాలని నియమం. ఆ దూరంలోనే ఒక లోపలి పల్లెలో షూట్ చేశాం. నాలుగు రోజుల్లోనే తీయమని చె΄్పారు. కథంతా రాత్రే కాబట్టి నాలుగు రాత్రులు ఒళ్లు హూనం చేసుకుని పని చేశాం’ అని తెలి΄ాడు. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులే– సూరజ్ (సినిమాటోగ్రఫీ), మనోజ్ (ఎడిటింగ్) సాంకేతిక శాఖలు నిర్వర్తించారు.నీ కోడి కూయక΄ోతే...‘నీ కోడి కూయక΄ోతే తెల్లారదా?’ అనేది లోకోక్తి. అంటే ఎదుటి వారంటే లెక్కలేక΄ోవడం, ఏదైనా లెక్క చేయకుండా ఉండటం ఈ మాటలో ఉంది. కాని ఈ జానపద కథ ప్రతి వ్యక్తి, ప్రతి అనుభవం, ప్రతి మేల్కొలుపు కూడా ముఖ్యమే అని చెబుతుంది. దేనినీ మర్చి΄ోకూడదని, నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తుంది. ‘మా కర్నాటకలో ప్రతి చిన్నపిల్లవాడికి ఈ కథ తెలుసు. దానిని షార్ట్ఫిల్మ్గా తీయడం, ఈ ప్రతిష్టాత్మక బహుమతి రావడం సంతోషంగా ఉంది’ అంటున్నాడు చిదానంద. -
భారత టాలెంట్ సరిహద్దులు దాటుతోంది: రాజమౌళి
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి వారిపై ప్రశంసలు కురిపించారు. ఫ్రాన్స్లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2024లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్గా ఇండియాకు చెందిన చిత్రం ఎంపిక కావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 'సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో' చిత్రబృందాన్ని అభినందించారు. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా వారికి శుభాకాంక్షలు తెలిపారు.రాజమౌళి తన ట్వీట్లో రాస్తూ..'భారతీయ ప్రతిభ సరిహద్దులను దాటుతోంది. ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్గా లా సినీఫ్ అవార్డును గెలుచుకున్న సందర్భంగా ‘సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ ఒన్స్ టు నో’ రూపొందించిన యువతకు ఇవే నా వందనాలు' అంటూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ షార్ట్ ఫిల్మ్ తీసిన చిదానంద నాయక్ను ట్యాగ్ చేశారు.కాగా.. చిదానంద తెరకెక్కించిన సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో షార్ట్ ఫిల్మ్ కేన్స్లో అరుదైన ఘనత సాధించింది. వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి తొలి స్థానంలో నిలిచింది. 16 నిమిషాలు ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ను ఓ కన్నడ జానపద కథ ఆధారంగా రూపొందించారు. వృద్ధురాలి కోడిని ఎవరో దొంగలించడం.. దానిని కనుగొనడం కోసం ఆమె పడే తపనను ఈ చిత్రంలో చూపించారు. ఇప్పుడీ షార్ట్ ఫిల్మ్ హాలీవుడ్తో పోటీ పడి మొదటి బహుమతి గెలుచుకోవడంపై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. Indian talent breaching boundaries… Happy to hear that @Chidanandasnaik’s ‘Sunflowers Were the First Ones to Know’ has won the La Cinef Award for Best Short Film at Cannes 2024!Kudos to the youngsters 👏🏻👏🏻— rajamouli ss (@ssrajamouli) May 24, 2024 -
కేన్స్లో ఇండియన్ సినిమాకు మొదటి బహుమతి
ఫ్రాన్స్లో 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతున్నాయి. యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చిత్రోత్సవాలు మే 25న ముగియనున్నాయి. ప్రతిష్ఠాత్మక కేన్స్ చిత్రోత్సవాల్లో భారత్కు చెందిన 'సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో' షార్ట్ఫిలిం సత్తా చాటింది. 2024కు గాను ఉత్తమ షార్ట్ఫిలిం బహుమతిని సొంతం చేసుకుంది.చిదానంద S నాయక్ తెరకెక్కించిన 'సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో' అనే చిత్రం వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి మొదటి బహుమతి అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 555 ఫిల్మ్ స్కూల్స్ నుంచి 2,263 మంది దరఖాస్తుదారులు ఇందులో పోటీ పడ్డారు. 16 నిమిషాల పాటు నిడివితో ఉన్న ఈ షార్ట్ ఫిలింను కన్నడ జానపద కథ ఆధారంగా తెరకెక్కించారు.ఇదే విభాగంలో బన్నీహుడ్' అనే UK చిత్రానికి మూడో బహుమతి లభించింది. ఈ చిత్రాన్ని మీరట్లో జన్మించిన భారతీయ చిత్రనిర్మాత మహేశ్వరి రూపొందించడం విశేషం. మే 23న ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఉత్తమ షార్ట్ ఫిలిం అవార్డును గెలుచుకున్న టీమ్కు 15,00 యూరోలు, మూడో స్థానానికి 7,500 యూరోలు అందించారు. ఈ రెండు షార్ట్ ఫిలిం టీమ్కు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Festival de Cannes (@festivaldecannes) -
ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
ఓ మహిళ ఒక తల్లిగా, వ్యాపారవేత్తగా, మోడల్గా రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. లాయర్ నేపథ్యం నుంచి పూర్తి విరుద్ధ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతోంది. అంతేగాదు ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అద్భుతమైన డిజైనర్ డ్రెస్లో మెరిసింది. ఇంతకీ ఎవరంటే ఆమె..దక్షిణాసియా ఇన్ఫ్లుయెన్సర్, మహిళా వ్యాపార వేత్త అయిన దీపా బుల్లెర్ ఖోస్లా శక్తిమంతమైన మహిళ. విభిన్న రంగాల్లో దూసుకుపోతూ కూడా ఓ తల్లిగా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వహిస్తోంది. ఆమె కంటెంట్ క్రియేటర్గా, సామాజకి కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తూనే వ్యాపార రంగంలో ప్రభంజనం సృష్టిస్తోంది. అంతేగాదు ముంబై ఆమ్స్టర్డామ్ ఆధారిత ఎంటర్ప్రెనూర్గా ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 2.1 మిలియన్ ఫాలోవర్స్ని కలిగి ఉంది. మరోవైపు అందం, ఫ్యాషన్కి సంబంధించిన వ్యాపార రంగాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇక ఫ్రాన్స్లో అట్టహాసంగా జరుగుతున 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రఖ్యాత డిజైనర్ వాల్డ్రిన షైతీ షెల్ఫ్ రూపొందించిన మెటాలిక్ స్ట్రక్చర్డ్ డ్రెస్లో గ్లామరస్గా కనిపించింది. ముఖ్యంగా ఆమె డిజైనర్ డ్రెస్ ముందుభాగంలో ఉన్న లోహ గులాబీ హైలెట్గా నిలిచింది. అందుకు తగ్గట్లుగా బాబ్ స్టైల్ హెయిర్ మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి ఆమెకు. ఈ ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఈవెంట్లో తన అత్యాధుని ఫ్యాషన్ డిజైనర్వేర్ డ్రెస్తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలకు "బ్యాక్ ఎట్ ది కార్పెట్ అట్ ఆల్ స్టార్ట్... హోమ్కమింగ్ @festivaldecannes" అనే క్యాప్షన్ తోపాటు హార్ట్ ఎమోజీని జోడించి మరీ ఇన్స్టాగ్రాంలో షేర్ చేసింది. ఐతే ఆమె ఈ కేన్స్ ఈవెంట్లో గత ఆరేళ్లుగా పాల్గొంటుందట. ఆమె నేపథ్యం..దక్షిణాసియా ఇన్ఫ్లుయెన్సర్ తన పాఠశాల విద్యను ఊటీలో పూర్తి చేసింది. తల్లి డాక్టర్ కావడంతో తాను కూడా అదే వృత్తిలో ఉండాలనుకుంది. ఐతే ఇంటర్నషిప్లో తన ఆలోచనను మార్చుకున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత అంతర్జాతీయ మానవ హక్కుల చట్టంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి అయిన వెంటనే నెదర్లాండ్స్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టోలో న్యాయవాదిగా పనిచేసింది. తదనంతరం లండన్లోని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, ఐఎంఏ ఇన్ఫ్లుయెన్సర్ ఏజెన్సీలో ఇంటర్న్షిప్ చేసింది. అయితే ఎంతోకాలం న్యాయవాద వృత్తిలో కొనసాగలేదు. మళ్లీ డిజట్ కంటెంట్ క్రియెటర్గా కెరీర్గా ఎంచుకుని మరీ దూసుకుపోయింది. ఇక 2022లో తన బ్యూటీ బ్రాండ్ ఇండెవైల్డ్ను ప్రారంభించింది. తన తల్లి నుంచి ప్రేరణ పొందిన ఆయుర్వేదం బ్రాండ్లో పాతుకుపోయింది. చర్మ రక్షణలో ప్రామాణిక ఉత్పత్తులే బెటర్ అని భావించి ఇటువైపు దృష్టి సారించి వ్యాపారవేత్తగా మారింది. 32 ఏళ్ల దీపా తన భర్త డచ్ దౌత్యవేత్త ఒలేగ్ బుల్లెర్తో కలిసి లాభప్రేక్షలేని పోస్ట్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ను ఏర్పాటు చేసింది. ఇది లింగ సమానత్వంపై యూఎస్ UN సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలను పరిష్కరించేందుకు సోషల్ మీడియా శక్తిని వినియోగించుకుంటుంది. ఇన్ని రంగాల్లో రాణిస్తూ బిజీగా ఉన్న కుటుంబం కోసం కూడా కొంత సమయాన్ని కేటాయిస్తుంది. ముఖ్యంగా దీపాకి నాలుగేళ్ల కూతురు దువాతో స్పెండ్ చేయడం మహా ఇష్టం. "సహనానికి ప్రాధాన్యత ఇస్తూ.. ప్రతీది వెంటనే చేయనవసరం లేదని, అలా అని ప్రతి అడుగు వెనక్కి వేసి బ్రేక్ తీసుకోవడం కూడా సరైనది కాదు" అంటుంది దీపా. తన కలలన్నింటిని సాకారం చేసుకుంటూ విజయవంతంగా దూసుకుపోవతూ.. ఎందరో మహిళా పారిశ్రామికవేత్తలందరికీ ఆదర్శంగా నిలిచింది దీపా బుల్లెర్ ఖోస్లా . View this post on Instagram A post shared by Diipa Büller-Khosla (@diipakhosla) (చదవండి: 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!) -
అమ్మ మరణం... ఆమె ఆఖరి కోరిక నెరవేర్చిన ప్రముఖ నటి
మొన్నీ మధ్య 'లాపతా లేడీస్' అనే ఓ సినిమా వచ్చింది. థియేటర్లలో కంటే ఓటీటీలో బాగా ఆదరణ దక్కించుకుంది. ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో మంజు మై అనే పాత్రలో ఆకట్టుకున్న ఛాయా కదమ్ అనే నటి.. ఇప్పుడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంది. ఈ క్రమంలోనే ఈమె ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఎమోషనల్ చేస్తోంది.(ఇదీ చదవండి: నిర్మాత మోసం.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్ నమిత)2009 నుంచి ఛాయా కదమ్ ఇండస్ట్రీలో ఉంది. 'లాపతా లేడీస్'తో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఈమె నటించిన మలయాళ మూవీ 'ఆల్ వుయ్ ఇమేజిన్ యాజ్ లైట్' సినిమా, కేన్స్ చిత్రాత్సవంలో స్క్రీనింగ్ చేయనున్నారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్ వెళ్లిన ఈమె.. చనిపోయిన తల్లి చీర, ముక్కు పుడక పెట్టుకుని వేడుకలో పాల్గొంది.ఈ మేరకు తల్లికి సంబంధించిన గోల్డ్ కలర్ శారీ, ముక్కు పుడకతో కనిపించిన ఛాయా కదమ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. బతికుండగా తన తల్లిని విమానం ఎక్కించాలనుకున్నానని, కానీ ఇప్పుడు కేన్స్లో ఆమె చీర కట్టుకోవడం చాలా బాగుందని, ఇలా తన తల్లి కోరిక నెరవేరిందని భావోద్వేగానికి గురైంది.(ఇదీ చదవండి: సింపుల్గా పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్.. అమ్మాయి ఎవరంటే?) View this post on Instagram A post shared by Chhaya Kadam (@chhaya.kadam.75) -
బయోపిక్లో భార్య రేప్ సీన్.. షాకైన కేన్స్ ఆడియెన్స్
కేన్స్ ఫిల్స్ ఫెస్టివల్ 2024లో ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రముఖ వ్యాపారదిగ్గజం.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయోపిక్ ‘ది అప్రెంటైస్’ అందుకు కారణం. సినిమా మట్టుకు అద్భుతంగా ఉందంటూ 8 నిమిషాలపాటు స్టాండింగ్ ఒవేషన్ దక్కినప్పటికీ.. ట్రంప్ పర్సనల్ లైఫ్లోని కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.తన మాజీ భార్య ఇవానా(దివంగత)పై ట్రంప్ అత్యాచారం చేసినట్లు ఈ చిత్రంలో ఒక సీన్ ఉంది. ఆ సన్నివేశం కేన్స్ ఆడియొన్స్ను ఒక్కసారిగా బిత్తరపోయేలా చేసింది. అంతేకాదు.. ఈ సినిమా ద్వారా బయటి ప్రపంచానికి తెలియని ట్రంప్ వ్యక్తిగత జీవితాన్ని చూపించిందని చిత్రాన్ని వీక్షించిన విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా కేవలం 70, 80 దశకాల్లో కేవలం ట్రంప్ వ్యాపార జీవితాన్నే ప్రముఖంగా ప్రస్తావించినప్పటికీ.. ట్రంప్ టవర్ వేదికగా జరిగిన కొన్ని చీకటి విషయాల్ని చూపించిందని అంటున్నారు. దావాకు రెడీమరోవైపు ఈ చిత్రం తన అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడుతుందని భావించిన ట్రంప్కు.. పెద్ద షాకే ఇచ్చింది. దీంతో ఈ చిత్రంపై దావా వేసేందుకు సిద్ధం అయ్యారాయన. ‘‘ ఈ చిత్రం(ది అప్రెంటైస్) ఒక చెత్త. కల్పిత కథనాలతో సంచలనంగా.. చర్చనీయాంశంగా మారడానికి ప్రయత్నించారు. ఈ చిత్రంపై దావా వేయబోతున్నాం’’ అని ట్రంప్ టీం ఒక అధికారిక ప్రకటక విడుదల చేసింది.ట్రంప్ ఆశ్చర్యపోతారేమో: డైరెక్టర్ అబ్బాసీఅయితే ట్రంప్ టీం దావా బెదిరింపులపైనా చిత్ర డైరెక్టర్ అలీ అబ్బాసీ స్పందించారు. డొనాల్డ్ టీం తప్పకుండా ఈ చిత్రం చూడాలని. ఆ తర్వాతే దావా వేయడం గురించి మాట్లాడాలని అంటున్నారు. అంతేకాదు ట్రంప్ సైతం ఈ చిత్రం చూసి ఆశ్చర్యపోతారే తప్ప నచ్చకపోవడం లాంటిది జరగకపోవచ్చు ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతీ ఒక్కరూ ఆయన ఫలానా వాళ్ల మీద దావా వేస్తున్నారనే చర్చ జరుపుతుంటారు. కానీ, ఆయన ఎలా సక్సెస్ అయ్యారు? వ్యాపారంలో ఆ స్థాయికి ఎలా ఎదిగారన్నది పట్టించుకోరు. ఈ చిత్రం చూస్తే వాళ్లకే అర్థమవుతుంది. బహుశా ట్రంప్ కూడా ఈ చిత్రాన్ని మెచ్చుకోవచ్చు’’ అని అబ్బాసీ అన్నారు.ది అప్రెంటిస్ చిత్రంలో ట్రంప్ పాత్రను నటుడు సెబాస్టియన్ స్టాన్(మార్వెల్ చిత్రాల ఫేమ్) పోషించగా.. ట్రంప్ వ్యక్తిగత లాయర్ జెర్మీ స్ట్రాంగ్ పాత్రలో రోయ్ కోన్, ఇవానా ట్రంప్ రోల్లో మరియా బాకాలోవా నటించారు. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మే 20వ తేదీన చిత్రాన్ని ప్రదర్శించారు. అయితే అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలోనే రిలీజ్ కావాల్సి ఉండగా.. అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. -
ఆనందం.. ఉద్వేగం...
30న హైదరాబాద్లో ‘కన్నప్ప’ టీజర్... శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. విష్ణు మంచు టైటిల్ రోల్లో ముఖేష్ కుమార్ దర్శకత్వంలో మంచు మోహన్బాబు నిర్మిస్తున్నారు. కాన్స్ చిత్రోత్సవాల్లో ‘కన్నప్ప’ ప్రీమియర్ టీజర్ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విష్ణు మంచు, మోహన్బాబు, ప్రభుదేవా పాల్గొన్నారు. ‘‘కన్నప్ప’ టీజర్ను కాన్స్లో చూపించాం. అందరూ ప్రశంసించారు. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ‘కన్నప్ప’ టీజర్ చూసి ముగ్దులయ్యారు. ఈ నెల 30న హైదరాబాద్లో తెలుగు వెర్షన్ ‘కన్నప్ప’ టీజర్ను ప్రదర్శించనున్నాం. జూన్ 13న ఈ టీజర్ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు విష్ణు మంచు.కాన్స్లో తొలిసారి... కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రతిష్టాత్మక ‘పామ్ డి ఓర్’ అవార్డు సినీ పరిశ్ర మకు సుదీర్ఘకాలంగా సేవలు అందించినవారికి ఇస్తుంటారు. ఈ ఏడాది 77వ ఫిల్మ్ ఫెస్టివల్లోని ‘పామ్ డి ఓర్’ అవార్డుకు మెరిల్ స్ట్రీప్, జార్జ్ లూకాస్లను ఎంపిక చేశారు. కాగా కాన్స్ చరిత్రలోనే తొలిసారి ఓ స్టూడియోకు ఈ అవార్డు దక్కింది. జపాన్లోని యానిమేటెడ్ స్టూడియో ‘ఘిబ్లీ’కి ఫామ్ డి ఓర్ అవార్డును ప్రదానం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ స్టూడియో యానిమేషన్ రంగంలో ఉంది. ఇక హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ ఆల్రెడీ ఈ అవార్డు స్వీకరించారు. హాలీవుడ్ దర్శక–నిర్మాత జార్జ్ లూకాస్ చిత్రోత్సవాల చివరి రోజున ఈ అవార్డు అందుకోనున్నారు.కన్నీళ్లు పెట్టుకున్న కెవిన్... కెవిన్ కాస్ట్నర్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘హరిజన్: యాన్ అమెరికన్ సాగ’. అమెరికన్ సివిల్ వార్కు ముందు ఉన్న పరిస్థితులు, వార్ తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మూడు చాప్టర్స్గా ఈ చిత్రం విడుదల కానుంది. తొలి చాప్టర్ ‘హరిజన్: యాన్ అమెరికన్ సాగ’ను కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రీమియర్గా ప్రదర్శించగా, మంచి స్పందన లభించింది. దాదాపు పది నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ దక్కడంతో కెవిన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా నిర్మాణానికి 35 ఏళ్లుగా కెవిన్ కష్టపడుతున్నారని హాలీవుడ్ టాక్. ట్రంప్ బయోపిక్... అమెరికా మాజీ అధ్యక్షుడు, వ్యాపారవేత్త డోనాల్డ్ ట్రంప్ జీవితం ఆధారంగా ‘ది అప్రెంటిస్’ సినిమా తీశారు దర్శకుడు అలీ అబ్బాసి. ఈ సినిమాను తొలిసారిగా కాన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించగా, స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. సెబాస్టియన్ స్టాన్ ఈ చిత్రంలో డోనాల్డ్ ట్రంప్ పాత్రపోషించారు. ఫిల్మ్ మేకర్స్ పొలిటికల్ మూవీస్ మరిన్ని చేయాలని కాన్స్ వేదికగా అలీ అబ్బాసి పేర్కొన్నారు. శునకం సందడి... లాటిటియా డెస్చ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘డాగ్ ఆన్ ట్రయిల్’. ఫ్రాన్స్లో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ కుక్క కొంతమందిని కరుస్తుంది. అప్పుడు ఆ శునకాన్ని ఓ లాయర్ ఏ విధంగా కోర్టు కేసు నుంచి రక్షించారు? అన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. లాటిటియాతో పాటు ఈ సినిమాలో నటించిన శునకం చిత్రోత్సవాలకు హాజరైంది.కాన్స్లో భారతీయం... కాన్స్లో ఈ ఏడాది మన దేశీ తారలు ఐశ్వర్యా రాయ్, ఊర్వశీ రౌతేలా, కియారా అద్వానీ, శోభితా ధూళిపాళ వంటి వారు సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదితీ రావ్ హైదరి ఈ చిత్రోత్సవాల్లో సందడి చేయడానికి ఫ్రాన్స్ వెళ్లారు. ఇక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దాదాపు 35 ఏళ్ల తర్వాత పామ్ డి ఓర్ విభాగంలో పోటికి భారతీయ చిత్రం ‘అల్ వీ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ నిలిచిన సంగతి తెలిసిందే.భారతీయ ఫిల్మ్ మేకర్ పాయల్ కపాడియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కపాడియా ఫ్రాన్స్లోనే ఉన్నారు. అలాగే ‘అన్ సర్టైన్ రిగార్డ్’ విభాగంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఫిల్మ్మేకర్ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్’ చిత్రం ఉంది. ఈ చిత్రంలో నటించిన సహానా గోస్వామి,సంజయ్ బిష్ణోయ్లతో పాటు సంధ్యా సూరి ఫ్రాన్స్ చేరుకున్నారు. -
బిగ్బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
బాలీవుడ్ భామ కిరణ్ రాథోడ్ తెలుగు వారికి సైతం పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. నువ్వు లేక నేను లేను చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ చిత్రాలు చేసింది. అయితే 2016 నుంచి సినిమాలు చేయడం ఆపేసిన ముద్దుగుమ్మ.. గతేడాది జరిగిన తెలుగు బిగ్బాస్ సీజన్-7 మెరిసింది. అయితే మొదటివారంలోనే ఎలిమినేట్ అయి ఫ్యాన్స్ను నిరాశపరిచింది.ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ బ్యూటీ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వీసా విషయంలో తలెత్తిన సమస్యతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్లు పోస్ట్ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అసలేం జరిగిందో ఓ సారి తెలుసుకుందాం.ప్రస్తుతం ఫ్రాన్స్లో ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్కు కిరణ్ రాథోడ్ కూడా హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆమె ఇప్పటికే గతనెలలోనే వీసాకు అప్లై చేసింది. కానీ ఇప్పటికీ ఆమెకు వీసా జారీ కాలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది.కిరణ్ రాథోడ్ ఇన్స్టాలో రాస్తూ..'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు మే 13వ తేదీనే వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే మా టీమ్ అంతా అక్కడికి చేరుకున్నారు. నేను మాత్రం నెల రోజులైనా వీసా కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. ఇప్పటికే ముందస్తుగా హోటల్ బుకింగ్, ట్రావెల్ బుకింగ్ ఖర్చుల కోసం రూ.15 లక్షలు వెచ్చించా. దీంతో తాను మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యా. దీనిపై సదరు వీసా సంస్థ సమాధానం చెప్పాలి.' అని రాసుకొచ్చింది. పాపం.. ఇప్పటికైనా కిరణ్ రాథోడ్కు వీసా వస్తుందేమో చూడాల్సిందే. View this post on Instagram A post shared by Keira Rathore (@kiran_rathore_official) -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసిన కన్నప్ప టీం!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ముఖేష్కుమార్ సింగ్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో అగ్ర సినీతారలు నటిస్తున్నారు. ఇటీవలే రెబల్ స్టార్ ప్రభాస్ సైతం తన షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేశారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సైతం కన్నప్పలో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, శివరాజ్కుమార్, శరత్ కుమార్తో పాటు బాలీవుడ్ స్టార్ అక్షయ్కుమార్ కీలకపాత్రల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభాస్, నయనతారతో పాటు భరతనాట్యంలో నిష్ణాతురాలైన ప్రీతి కథానాయికగా కనిపించనున్నారు. తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2024లో కన్నప్ప టీం సందడి చేసింది. మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా రెడ్ కార్పెట్పై సందడి చేశారు. 'హారిజన్: యాన్ అమెరికన్ సాగా' స్క్రీనింగ్లో వీరంతా పాల్గొన్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Walked the Red Carpet yesterday for the screening of 'Horizon: An American Saga'@themohanbabu @pddancing @vinimanchu#cannes2024 pic.twitter.com/UcC8OPvFh1— Vishnu Manchu (@iVishnuManchu) May 20, 2024 -
రెడ్ కార్పెట్పై తెలుగందం.. చూడటానికి రెండు కళ్లు చాలట్లేదు! (ఫోటోలు)
-
కేన్స్లో మెరిసిన ఐశ్వర్య.. ఫొటోస్ వైరల్! (ఫొటోలు)
-
77వ కేన్స్ చిత్రోత్సవాల్లో ఐశ్వర్య రాయ్ అందాలు (ఫోటోలు)
-
ప్రపంచ ఫిల్మ్ మేకర్స్ను ఏకం చేసే వేదిక ఇది
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘భారత్ పర్వ్’ వేడుకలను తొలిసారిగా నిర్వర్తిస్తోంది భారత ప్రభుత్వం. ఈ వేడుకల్లో భాగంగానే ప్రస్తుతం ఫ్రాన్స్లో జరుగుతున్న 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘భారత్ పెవిలియన్’ను ‘ఫ్రాన్స్లోని భారత రాయబారి’ జావేద్ అష్రఫ్, ఎమ్ఐబీ (మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ) సెక్రటరీ సంజయ్ జాజు ్రపారంభించారు. తొలుత ఈ పెవిలియన్కు ‘ఇండియన్ పెవిలియన్’ పేరు అనుకున్నారట. ఆ తర్వాత ఈ పేరును ‘భారత్ పెవిలియన్’గా మార్చారు.భారత్ పెవిలియన్ ్రపారంభం సందర్భంగా... ‘‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ సినిమాతో మళ్లీ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్పోటీలో నిలిచినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు సంజయ్. ‘‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే కేవలం ఫ్యాషన్, రెడ్ కార్పెట్ మాత్రమే కాదు.. వరల్డ్ సినిమా ఫిల్మ్ మేకర్స్ను ఏకం చేస్తుంది. భవిష్యత్ ఫిల్మ్ మేకింగ్కు ఓ వేదిక అవుతుంది’’ అని పేర్కొన్నారు జావేద్ అష్రఫ్. ఈ కార్యక్రమంలో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డిప్యూటీ ఆర్టిస్టిక్ డైరెక్టర్ క్రిస్టియన్ జ్యూన్, ఇండియన్–కెనడియన్ ఫిల్మ్మేకర్ రిచీ మెహతా పాల్గొన్నారు. చేతికి ఏమైంది?... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు రెండు దశాబ్దాలుగా తప్పకుండా హాజరవుతున్నారు ఐశ్వర్యా రాయ్. ఈ ఏడాది చిత్రోత్సవాల్లోనూ ఆమె మెరవనున్నారు. ఐశ్వర్యారాయ్, ఆమె కుమార్తె ఆరాధ్య ఫ్రాన్స్ చేరుకున్నారు. తొలిసారిగా ఐశ్వర్యా రాయ్ 2002 కాన్స్ ఫిల్మ్ఫెస్టివల్ రెడ్ కార్పెట్పై నడిచిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే తల్లి ఐశ్వర్యతో కలిసి 2012లో ఆరాధ్య తొలిసారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసింది. తాజాగా తన కుమార్తెతో కలిసి ఐశ్వర్య కాన్స్ చిత్రోత్సవాలకు వెళ్లిన ఫొటోలు బయటికి వచ్చాయి. ఆ ఫొటోలను గమనిస్తే.. ఆమె చేతికి కట్టు కట్టుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దాంతో ఆమెకు ఏమైంది? గాయంతో ఐశ్వర్యా రాయ్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్పై ఎలాంటి కాస్ట్యూమ్లో కనిపించనున్నారు? అనే ఆసక్తి నెలకొంది. -
గాయపడిన ఐశ్వర్య రాయ్.. అయినా అక్కడికి ప్రయాణం
ప్రతి సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు కొత్త కళ తెచ్చేది బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్. ఫ్రాన్స్లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 25 వరకు కొనసాగుతున్న ఈ వేడుకులలో భారత్ తరపున పాల్గొనేందుకు తాజాగా ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్య బచ్చన్తో కలిసి కేన్స్కు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో ఆమె కనిపించారు. కానీ, తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి ఉండటంతో చాలా మంది అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఆమె చేతికి తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది. ఐశ్వర్యకు ఏమైందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఆమె గాయం గురించి పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశారు. ఒక అభిమాని ఇలా అన్నాడు, 'OMG ఆమె గాయపడిన చేతులతో కేన్స్లో ఎలా నడుస్తుంది. కేన్స్ రెడ్ కార్పెట్పై ఐశ్వర్య నడుస్తూ ఉంటే ఆ కార్యక్రమానికే అందం వస్తుంది. కానీ, ఈసారి ఆ రెడ్ కార్పెట్పై ఆమె నడవగలదా అంటూ వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కేన్స్లో ఆమె లుక్ కోసం ఎదురు చూస్తున్నామని మరొకరు తెలిపారు. ఐశ్వర్య చేతికి అయిన గాయానాకి గల కారణాలు మాత్రం తెలియలేదు.ఐశ్వర్య రాయ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2002లో తొలిసారి మెరిసింది. ఆ సమయంలో భారీ బంగారు ఆభరణాలతో నీతా లుల్లా డిజైన్ చేసిన చీరలో రెడ్ కార్పెట్ మీద మొదటిసారి కనిపించింది. అదె సంవత్సరంలో ఆమె నటించిన దేవదాస్ సినిమా ఆ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. షారూఖ్ ఖాన్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీతో ఆమె కేన్స్లో పాల్గొంది. అప్పటి నుంచి దాదాపు ప్రతి సంవత్సరం ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో ఆమె రెడ్ కార్పెట్పై తన అందంతో కట్టిపడేస్తుంది.ఐశ్వర్యతో పాటు అదితి రావు హైదరీ, శోబితా ధూళిపాళ, కియారా అద్వానీ కూడా కేన్స్లో కనిపించనున్నారు. ఊర్వశి రౌతేలా ఇప్పటికే కేన్స్లో పింక్ లుక్లో కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
మీరు నా కెరీర్ రైలు దిగనందుకు కృతజ్ఞతలు
ఫ్రాన్స్ నగరంలోని కాన్స్లో 77వ కాన్స్ చలన చిత్రోత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఈ ఏడాది కాన్స్ జ్యూరీ ప్రెసిడెంట్గా నటి–దర్శకురాలు గ్రెటా గెర్విగ్ వ్యవహ రిస్తున్నారు. ఆమె నేతృత్వంలో జ్యూరీ ఈ సంవత్సరం పోటీ పడుతున్న 22 చిత్రాల నుండి విజేతను ఎంపిక చేస్తుంది. వేడుక చివరి రోజు విజేతకు అవార్డు ప్రదానం చేస్తారు. ఇక వేడుకలు ్రపారంభం అయ్యే ముందు విలేకరులతో ‘మీ టూ’ మూమెంట్ గురించి, సమాజంలో సానుకూల మార్పు తెచ్చే శక్తి బలమైన కథలకు ఉంటుందని గ్రెటా గెర్విగ్ పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి 25 వరకూ జరిగే ఈ ఫెస్టివల్లో తొలి రోజు ్రపారంభ చిత్రంగా క్వెంటిన్ డ్యూపియక్స్ దర్శకత్వంలో రూ΄పొందిన ‘ది సెకండ్ యాక్ట్’ ప్రదర్శితమైంది. అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘పామ్ డి ఓర్’ పురస్కారాన్ని నటి మెరిల్ స్ట్రీప్కి ప్రదానం చేశారు. సినీ రంగానికి మెరిల్ చేసిన సేవలకు గాను ఆమెను ఈ పురస్కారంతో గౌరవించారు. 1989లో కాన్స్ ఉత్సవాల్లో పాల్గొన్నారు మెరిల్. ‘ఈవిల్ ఏంజెల్స్’లో కనబర్చిన నటనకుగాను ఆ ఏడాది ఆమె ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 40 ఏళ్ల వయసు అప్పుడు ఆ అవార్డు అందుకున్న మెరిల్ ఇప్పుడు 74 ఏళ్ల వయసులో ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు. దాదాపు 35 ఏళ్లకు మళ్లీ కాన్స్లో పాల్గొనడం, ప్రతిష్టాత్మక పామ్ డి ఓర్ పురస్కారం అందుకోవడం, అవార్డు అందుకుంటున్న సమయంలో వీక్షకులు ఓ 2 నిమిషాల పాటు నిలబడి చప్పట్లతో అభినందించడంతో మెరిల్ స్ట్రీప్ ఒకింత ఉద్వేగానికి గురై, ఈ విధంగా స్పందించారు. ‘‘గతంలో నేను కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొన్నప్పుడు నా వయసు 40. అప్పటికి ముగ్గురు పిల్లల తల్లిని. నా కెరీర్ ముగిసిపోయిందనుకున్నాను. కానీ ఈ రాత్రి (కాన్స్ వేదికను ఉద్దేశించి) నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మేడమ్ ప్రెసిడెంట్ (గ్రెటా గెర్విగ్ని ఉద్దేశించి... 2019లో గ్రెటా దర్శకత్వం వహించిన ‘లిటిల్ ఉమెన్’ చిత్రంలో నటించారు మెరిల్)తో సహా నేను పని చేసిన ఎంతోమంది ప్రతిభావంతులైన కళాకారులు. ఇక్కడ నా సినిమాల క్లిప్పింగ్స్ని చూస్తుంటే నా కెరీర్ని బుల్లెట్ ట్రైన్ కిటికీలోంచి చూస్తున్నట్లుగా ఉంది. ఆ కిటికీలోంచి నా యవ్వనం మధ్యవయసుకి ఎగరడం నుంచి ఇదిగో ఇప్పుడు ఈ వేదిక వరకూ రావడం.. అంతా కనిపిస్తోంది. ఈ ప్రయాణంలో ఎన్నో ప్రదేశాలు... ఎన్నో ముఖాలు గుర్తొస్తున్నాయి. అన్నింటికీ మించి ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తున్న మీకు (ప్రేక్షకులు) చాలా కృతజ్ఞతలు. నా ముఖం పట్ల మీరు విముఖత చూపనందుకు నా కెరీర్ ట్రైన్ని మీరు దిగనందుకు ధన్యవాదాలు’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు మెరిల్ స్ట్రీప్. మెరిసిన దేశీ తారలు ఈ వేడుకల్లో పలువురు దేశ, విదేశీ తారలు ΄పొడవాటి గౌనుల్లో ఎర్ర తివాచీపై క్యూట్గా క్యాట్వాక్ చేసి ఆకట్టుకున్నారు. బాలీవుడ్ తారలు దీప్తీ సద్వానీ, ఊర్వశీ రౌతేలా తదితరులు పాల్గొన్నారు. టీవీ సిరీస్ ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ ఫేమ్, పలు హిందీ చిత్రాల్లో నటించిన దీప్తీ సద్వానీ రెడ్ కార్పెట్ పై మెరిశారు. ్రపారంభ వేడుకలో పాల్గొన్న ఈ బ్యూటీ మొత్తం మూడు రోజుల పాటు ఈ చిత్రోత్సవాల్లో పాల్గొననున్నారు. కాన్స్ ఉత్సవాల్లో ΄పొడవాటి గౌను ధరించిన తొలి తారగా రికార్డ్ సాధించారు దీప్తి. ‘‘ఈ రెడ్ కార్పెట్పై నడవడం గౌరవంగా భావిస్తున్నాను. అది కూడా రికార్డు బద్దలు కొట్టే ΄పొడవాటి ట్రైల్ ఉన్న గౌను ధరించడం హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు దీప్తీ సద్వాని. ఇక గత ఏడాది కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొన్న బాలీవుడ్ తార ఊర్వశీ రౌతేలా ఈసారీ హాజరయ్యారు. పింక్ కలర్ ఫ్రాక్లో ఆకట్టుకున్నారామె. కాగా 2018లో ఈ వేడుకల్లో పాల్గొన్న దీపికా పదుకోన్ పింక్ రంగు గౌను ధరించారు. ఇప్పుడు ఊర్వశీ ధరించిన గౌనుని అప్పటి దీపికా గౌనుతో పోల్చుతున్నారు. ఇలా తారల తళుకులు, పురస్కారగ్రహీత భావోద్వేగాలతో కాన్స్ చిత్రోత్సవాలు ఆకట్టుకునేలా సాగుతున్నాయి. -
కియారాకు అరుదరైన అవకాశం
ప్రతిష్టాత్మక 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో హీరోయిన్ కియారా అద్వానీ తొలిసారి సందడి చేయనున్నారు. ఈ చిత్రోత్సవాల్లో భాగంగా రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్యానెల్లో కియరా ఇండియాకి ప్రాతినిధ్యం వహిస్తారట. మంగళవారం (మే 14) ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల 25వరకూ జరగనున్నాయి. ఇప్పటివరకు దేశం తరఫున పలుమార్లు ప్రాతినిధ్యం వహించి, మెప్పించారు ఐశ్వర్యా రాయ్. ఆ తర్వాత సోనమ్ కపూర్ కూడా ఇండియా ప్రతినిధిగా మెప్పించారు. ఈ ఏడాది ఇండియాకి ప్రాతినిధ్యం వహించే అవకాశం కియరా అద్వానీని వరించింది. కాన్స్లో వేనిటీ ఫెయిర్ హోస్ట్ చేస్తున్న ‘రెడ్ సీ ఫిల్మ్ ఫౌండేషన్ ఉమెన్ ఇన్ సినిమా’ కార్యక్రమంలోనూ కియరా ΄ాల్గొంటారు. ప్రపంచ సినిమాకు ప్రొత్సాహకాలు, చిత్రీకరణ, సినిమా నిర్మాణంలో వస్తున్న సాంకేతిక అంశాలు.. వంటి వాటి గురించి నాలుగు ప్యానెల్స్ చర్చలు జరపనున్నాయి. మే 18న లా ప్లేజ్ డెస్ పామ్స్లో ఈ చర్చలు జరుగుతాయి. ఆ చర్చల్లోనూ కియారా పాల్గొంటారు. కాగా ఈ ఏడాది చిత్రోత్సవాల్లో ఐశ్వర్యా రాయ్, అదితీ రావ్ హైదరి, శోభితా ధూళి΄ాళ వంటి తారలు దేశం నుంచి హాజరు కానున్నారు. ఇప్పుడు కియారా అద్వానీ పేరు ఈ జాబితాలో చేరింది. ఈ చిత్రోత్సవాల్లో స్టయిలిష్గా కనిపించడానికి, చర్చల్లో తన అభి్ర΄ాయాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి కియారా చాలా ప్రిపేర్ అయ్యారని సమాచారం. -
కాన్స్లో కన్నప్ప
ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘కన్నప్ప’ టీమ్ సందడి చేయనుంది. విష్ణు మంచు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ‘మహాభారత్’ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్బాబు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.కాగా ఈ నెల 14 నుంచి 25 వరకూ జరగనున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో 20వ తేదీన ‘ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప’గా కన్నప్ప మూవీ టీజర్ని ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని విష్ణు మంచు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ‘‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘కన్నప్ప’ సినిమా టీజర్ను ఆవిష్కరించనుండటం ఆనందంగా ఉంది. మేం ఎంతో ఇష్టంగా రూపొందిస్తున్న కన్నప్పను ప్రపంచ ప్రేక్షకులకు చూపించేందుకు కాన్స్ అనువైన వేదికగా ఉపయోగపడుతుంది. మన భారతీయ చరిత్రను ప్రపంచ వేదికపైకి తీసుకురావడం, మన కథలు, సాంస్కృతిక వారసత్వం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని ట్వీట్ చేశారు విష్ణు మంచు. -
కాన్స్ ఉత్సవాల్లో తొలిసారి భారత్ పర్వ్
ఫ్రాన్స్లో ఈ నెల 14 నుంచి 25 వరకు జరగనున్న 77వ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో భారతదేశం ప్రాతినిధ్యం ఉంటుందని భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. భారతదేశంలోని విభిన్నమైన సంస్కృతులు–సంప్రదాయాలను సెలబ్రేట్ చేసేలా ‘భారత్ పర్వ్’ పేరిట భారత పర్యాటక శాఖ దేశంలో వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ నిర్వహించనున్నారు.‘భారత్ పర్వ్’ పేరిట కాన్స్ చిత్రోత్సవాల్లో ఓ విభాగం ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. ఈ చిత్రోత్సవాల్లో భారత్ పెవిలియన్ పేరిట ఓ స్టాల్ను ఏర్పాటు చేస్తారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసీసీఐ) ఈ స్టాల్ను నిర్వహిస్తాయి. అలాగే ఈ ఏడాది గోవాలో నవంబరు 20 నుంచి నవంబరు 28 వరకు జరగనున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) విశేషాలు, ఈ వేడుకల్లో జరగనున్న వరల్డ్ ఆడియో–విజువల్ అండ్ ఎంటర్టైన్ మెంట్ సమ్మిట్ గురించిన వివరాలను కూడా ‘భారత పర్వ్’ సెలబ్రేషన్స్లో భాగంగా వెల్లడించనున్నామని భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార శాఖ పేర్కొంది.భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సినీ రంగానికి సంబంధించిన అన్ని విభాగాల ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది. దేశానికి చెందిన ప్రతిభ గల ఫిల్మ్ మేకర్స్ ఈ వేడుకలను ఓ వారిధిగా చేసుకుని ప్రపంచ ఫిల్మ్ మేకర్స్కు ‘భారత్ పర్వ్’లో తమప్రాజెక్ట్స్ను, తమను మార్కెటింగ్ చేసుకునే వీలు ఉంటుంది. ఇందుకోసం భారత పెవిలియన్ స్టాల్లో భారతీయ సినీ సమాఖ్య ప్రతినిధులు ఉంటారు. కాన్స్ వేదికపై భారత్ హవా... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోని ప్రతిష్టాత్మక విభాగం ఫామ్ డి ఓర్లో భారత్కు చెందిన పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ పోటీ పడుతోంది. అలాగే అన్ సర్టైన్ విభాగంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఫిల్మ్మేకర్ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్’ పోటీలో ఉంది. డైరెక్టర్స్ ఫోర్ట్నైట్ విభాగంలో ఇండియన్ ఫిల్మ్ మేకర్ కరణ్ గంధారి తీసిన ‘సిస్టర్ మిడ్నైట్’, అసోసియేషన్ ఫర్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా విభాగంలో మైసమ్ అలీ తీసిన ‘ఇన్ రీట్రీట్’ ఉన్నాయి.అలాగే ‘ది ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ విద్యార్థులు తీసిన షార్ట్ ఫిల్మ్ ‘సన్ ఫ్లవర్స్ వేర్ ది ఫస్ట్ వన్స్ టు నో’ పోటీలో ఉంది. జాతీయ అవార్డుగ్రహీత, కెమెరామేన్ సంతోష్ శివన్ ఈ చిత్రోత్సవాల్లో ‘పియర్ ఏంజెనీ’ అవార్డు అందుకోనున్నారు. దివంగత ప్రముఖ ఫిల్మ్ మేకర్ శ్యామ్ బెనెగల్ తీసిన ‘మంథన్’ (1976) చిత్రం ప్రదర్శితం కానుంది. ఇలా ఈ ఏడాది కాన్స్ చలన చిత్రోత్సవాల్లో భారత్ హవా బాగానే ఉంది. కాన్స్లో భారతీయ మెరుపులు... కాన్స్ చిత్రోత్సవాలంటే గుర్తొచ్చే విషయాల్లో ‘రెడ్ కార్పెట్’పై తళుకులీనుతూ నటీమణులు అందంగా చేసే క్యాట్ వాక్ ఒకటి. భారతీయ చిత్రపరిశ్రమ నుంచి పలువురు కథానాయికలు ఈ వేడుకలకు హాజరవుతుంటారు. 2000వ సంవత్సరం నుంచి ఐశ్వర్యా రాయ్ హాజరవుతున్నారు. ఈసారి కూడా ఆమె కాన్స్ ఎర్ర తివాచీపై మెరవనున్నారు. అలాగే 2022లో జరిగిన చిత్రోత్సవాల్లో పాల్గొన్న అదితీ రావు హైదరి ఈసారీ హాజరవుతున్నారు. తెలుగు అమ్మాయి శోభితా దూళిపాళ కూడా పాల్గొంటారని టాక్. ఇటీవలే ఈ బ్యూటీ ‘మంకీ మేన్’ చిత్రం ద్వారా హాలీవుడ్కి పరిచయం అయిన విషయం తెలిసిందే. ఐశ్వర్య, అదితి, శోభిత... ఈ ముగ్గురూ కాకుండా ఇంకా ఏయే భారతీయ తారలు కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొననున్నారనే విషయం తెలియాల్సి ఉంది. -
All We Imagine as Light: గోల్డెన్ బరిలో మన బంగారం
డెబ్యూ ఫిక్షన్ ఫీచర్ ఫిల్మ్ ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ముంబైకి చెందిన పాయల్ కపాడియా. కాన్స్ ఫిల్మ్ఫెస్టివల్లోని ప్రిస్టీజియస్ కాంపిటీషన్ సెక్షన్ పామ్ డ ఓర్ (గోల్డెన్ పామ్)లో పాయల్ ఫిల్మ్ పోటీ పడనుంది. మూడు దశాబ్దాల తరువాత మన దేశం నుంచి ఈ విభాగానికి ఎంపికైన చిత్రం ఇదే... ఎకనామిక్స్లో పట్టా పుచ్చుకున్న పాయల్కు ఆర్థికశాస్త్రం కంటే సినిమా శాస్త్రమే ఎక్కువగా దగ్గరైంది. ఆ ఇష్టంతోనే ‘పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్’లో చేరాలనుకుంది. రెండో ప్రయత్నంలో ఫిల్మ్ డైరెక్షన్ కోర్సులో చేరింది. పాయల్కు తొలి గుర్తింపు ఆఫ్టర్నూన్ క్లౌడ్స్. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(2017)కు మన దేశం నుంచి ఎంపికైన ఏకైక చిత్రం ఇది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు డైలాగ్ రైటింగ్ ఎక్సర్సైజ్లో భాగంగా ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’ స్క్రిప్ట్ రాసుకుంది. పాయల్ శబ్దప్రేమికురాలు. ‘చెవులు మూసుకొని సినిమా చూస్తే ఏ ఫీలింగ్ ఉండదు’ అంటున్న పాయల్కు ఏ దృశ్యంలో ఎలాంటి శబ్దం ఉపయోగించాలో బాగా తెలుసు. ‘సినిమాలు ఎందుకు తీస్తారు?’ అనే ప్రశ్నకు ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా జవాబు చెప్పవచ్చు. పాయల్ చెప్పే జవాబు మాత్రం... ‘నన్ను నేను అర్థం చేసుకోవడానికి, చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి చిత్రాలు తీస్తాను’ సినిమాను పాయల్ అర్థం చేసుకునే కోణం కూడా భిన్నమైనది. ‘సినిమా అనేది ΄్లాటే సర్వస్వంగా ఉండనక్కర్లేదు. చక్కని కవిత్వం చదివినట్లు ఉన్నా సరిపోతుంది’ అనేది ఆమె మనసులోని భావం. సోకాల్డ్ ఆడంబరాలు, పాపులర్ కల్చర్కు దూరంగా ఉండే ‘రిషి వ్యాలీ స్కూల్’లో చదువుకున్న చదువు పాయల్ ఆలోచనలను విశాలం చేసింది. ఇప్పుడంటే ప్రపంచ ‘చిత్ర’ పటంలో తనకంటూ కొంత గుర్తింపు సాధించింది పాయల్. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లితే మాత్రం ఫిల్మ్ ఇనిస్టిట్యూట్కు సంబంధించి ఫస్ట్ రిజెక్షన్ ఆమెను అమితంగా బాధించింది. కలల మేడ కళ్ల ముందే కుప్పకూలినట్లుగా అనిపించింది. ‘స్కూల్ రోజుల నుంచి పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో చేరాలనేది నా కల. ఎందుకంటే నేను అభిమానించే ఎంతో మంది దర్శకులు అక్కడ చదువుకున్నారు. మొదట బాధ అనిపించినా ఆ తరువాత రెండో ప్రయత్నం చేయాలనుకున్నాను’ అంటూ గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది పాయల్. రెండో ప్రయత్నం చేసి ఉండకపోతే ఆమె ప్రతిభ వృథాగా పోయేది. ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’కు లభించిన గుర్తింపుతో పాయల్ మనసులో ఆత్మవిశ్వాసం అనే బీజం పడింది. ‘ది లాస్ట్ మ్యాంగో బిఫోర్ ది మాన్సూన్’ ఫిల్మ్తో ఆ విత్తనం మొలకెత్తింది. ఈ షార్ట్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ క్రిటిక్స్ ప్రైజ్ గెలుచుకుంది.‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది పాయల్. ఇది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (2021)లో బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘గోల్డెన్ ఐ’ అవార్డ్ అందుకుంది. ఫిల్మ్మేకర్స్ డిజిటల్ ప్రపంచంలో ఉన్న ఈ కాలంలోనూ ‘ఫిల్మ్’ అంటే పాయల్కు ప్రత్యేక ఇష్టం. ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’ను ఫిల్మ్ పైనే షూట్ చేసింది. ‘డిజిటల్ ఫిల్మ్తో పోల్చితే ఓల్డ్–స్కూల్ ఫిల్మ్లో ఇమేజ్కు సంబంధించిన ఈస్థెటిక్ క్వాలిటీ, సాఫ్ట్నెస్ భిన్నంగా ఉంటుంది’ అంటుంది పాయల్. ఫిల్మ్మేకింగ్ అనేది ఇలా అనుకోగానే అలా అయిపోదు. కొన్నిసార్లు చాలా టైమ్ తీసుకోవచ్చు. అందుకు ఎంతో ఓపిక అవసరం. అందుకే చిత్రనిర్మాణాన్ని శిల్పం చెక్కడంతో పోల్చుతుంది పాయల్. ‘చిత్రనిర్మాణం అనేది చాలా ఓపికగా శిల్పం చెక్కడం లాంటిది. ఆ శిల్పం ఎలా రూపుదిద్దుకోనుందో శిల్పికి కూడా తెలియదు. చిత్రం కూడా అంతే’ అంటుంది పాయల్. పాయల్ తల్లి నళిని మలాని ఆర్టిస్ట్. దేశవిదేశాలకు చెందిన అత్యుత్తమ సినిమాల క్యాసెట్లను ఇంటికి తీసుకువచ్చేది. సినిమాలపై పాయల్ ఆసక్తికి తల్లి ఫిల్మ్ కలెక్షన్ ఒక కారణం. ‘చూడాలేగానీ మన చుట్టూ ఉన్న పరిసరాల్లోనే ఎంతో అందం దాగుంది. అలాంటి అందాలను అమ్మ ఆస్వాదిస్తూ ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది’ అంటుంది పాయల్. తల్లి ప్రభావం పాయల్పై కనిపిస్తుంది. ‘జీవనోత్సాహం నుంచే సృజన జనిస్తుంది’ అంటున్న పాయల్ తనదైన విజువల్ లాంగ్వేజ్ను తయారు చేసుకుంటోంది. మూడు దశాబ్దాల తరువాత... పాయల్ కపాడియా గుర్తింపును మరో స్థాయికి తీసుకు వెళ్లిన ఫీచర్ ఫిల్మ్ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ముంబైలోని నర్స్ ప్రభ, భర్త, ప్రభ స్నేహితురాలు అను కేంద్రంగా సాగే చిత్రం ఇది. షాజీ ఎస్ కరుణ్ మలయాళ చిత్రం ‘స్వాహమ్’ తరువాత కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రధాన పోటీకి ఎంపికైన చిత్రంగా ప్రత్యేకతను సాధించి ప్రశంసలు అందుకుంటోంది. ‘ఆల్ వి...’కి దర్శకత్వంతో పాటు రచన కూడా చేసింది పాయల్. ఈ చిత్రంలో దివ్య ప్రభ(మలయాళం సినిమా టేక్ ఆఫ్ ఫేమ్), కనీ కుస్రుతి (కేరళ కేఫ్ ఫేమ్), హృదు హరూన్ నటించారు. -
కాన్స్ చిత్రోత్సవంలో భారతీయ చిత్రాలు
భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్రం చరిత్ర సృష్టించింది. కాన్స్ చలన చిత్రోత్సవంలో ప్రధాన విభాగంగా భావించే పామ్ డ ఓర్’ అవార్డు పోటీలో నిలిచింది ఈ మలయాళ చిత్రం. ముంబైకి చెందిన పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పామ్ డ ఓర్’ అవార్డు కోసం పోటీలో నిలిచినట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ఏడాది కాన్స్ చిత్రోత్సవం మే 15 నుంచి 25 వరకు జరగనుంది. ఈ సందర్భంగా ఈ ఫెస్టివల్కు సంబంధించిన అవార్డులు, స్క్రీనింగ్ కానున్న సినిమాల జాబితాను ప్రకటించారు నిర్వాహకులు. కాన్స్లో అత్యధిక బహుమతిని అందించే పామ్ డ ఓర్’ విభాగంలో భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’తో పాటు అమెరికన్ ఫిల్మ్ ‘అనొర’, యూకే ఫిల్మ్ ‘ఓహ్.. కెనడా’, ఫ్రెంచ్ ఫిల్మ్ ‘బీటింగ్ హార్ట్స్’, పోర్చుగల్ ఫిల్మ్ ‘గ్రాండ్ టూర్’ వంటి దాదాపు 20 చిత్రాలు నిలిచాయి. ఇక ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో బ్రిటిష్ ఇండియన్ దర్శకురాలు సంధ్యా సూరి దర్శకత్వం వహించిన ‘సంతోష్’, బల్గేరియన్ దర్శకుడు కోన్స్టాటిన్ బోజనోవ్ దర్శకత్వంలో భారతీయ నటీనటులు భాగమైన ‘ది షేమ్లెస్’ చిత్రాలతో పాటు చైనా ఫిల్మ్ ‘బ్లాక్డాగ్’, ‘సెప్టెంబర్ సేస్’, జపాన్ ఫిల్మ్ ‘మై సన్షైన్’ వంటి 15 చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఇక ‘అవుట్ ఆఫ్ కాంపిటిషన్’ విభాగంలో ‘ఫూరియోషియా: ది మ్యాడ్మాక్స్ సాగ’, ‘రూమర్స్’తో పాటు మరో మూడు చిత్రాలు ఉన్నాయి. మిడ్నైట్ స్క్రీనింగ్ విభాగంలో ‘ది సఫర్’తో కలిసి నాలుగు చిత్రాలు, కాన్స్ ప్రీమియర్లో ‘ఇట్స్ నాట్ మీ’తో పాటు ఆరు చిత్రాలు, స్పెషల్ స్క్రీనింగ్ విభాగంలో ‘ది బ్యూటీ ఆఫ్ ఘాజా’తో కలిపి ఐదు చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. మూడు దశాబ్దాల తర్వాత... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పామ్ డ ఓర్’ విభాగంలో భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’ పోటీ పడుతోంది. ఈ విభాగంలో 1994లో మలయాళ చిత్రం ‘స్వాహం’ నామినేషన్ను దక్కించుకున్నా, అవార్డు గెల్చుకోలేకపోయింది. ఈ సినిమాకు షాజీ నీలకంఠన్ కరుణ్ దర్శకత్వం వహించారు. అలాగే ఇదే విభాగంలో అవార్డు గెలుచుకున్న ఏకైక భారతీయ చిత్రం ‘నీచా నగర్’. 1946లో విడుదలైన ఈ హిందీ సినిమాకు చేతన్ ఆనంద్ దర్శకుడు. ‘నీచా నగర్’ చిత్రం తర్వాత ‘అమర్ భూపాలి’, ‘ఆవారా’ వంటి చిత్రాలు పామ్ డ ఓర్’కు నామినేషన్ దక్కించుకున్నా అవార్డు గెల్చుకోలేకపోయాయి. 30 ఏళ్లకు ఈ విభాగంలో పోటీ పడుతున్న భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’కు అవార్డు వస్తుందా? అనేది చూడాలి. ఈసారి పామ్ డ ఓర్’ విభాగంలో విజేతను నిర్ణయించే జ్యూరీ అధ్యక్షురాలిగా అమెరికన్ నటి గ్రెటా గెర్విక్ వ్యవహరిస్తున్నారు. ఆల్ వీ ఇమాజిన్... కథేంటంటే... కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ప్రభ, అనులు ముంబైలో పని చేస్తుంటారు. ఈ ఇద్దరూ వారి వారి రిలేషన్షిప్స్లో ఇబ్బందులు పడుతుంటారు. అలా ఈ ఇద్దరూ ఓ రోడ్ ట్రిప్కు వెళ్లినప్పుడు ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రం కథాంశమని సమాచారం. ఈ మలయాళ చిత్రానికి రచయిత–దర్శకురాలు, ఎడిటర్ పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. ఇక పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ కూడా ఇదే కావడం విశేషం. గతంలో పాయల్ దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’ 2015లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్కు ఎంపిక అయింది. అలాగే పాయల్ దర్శకత్వంలో వచ్చిన మరో డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ 2021లో జరిగిన కాన్స్ ఫెస్టివల్లో ‘గోల్డెన్ ఐ’ అవార్డును గెలుచుకుంది. మరి.. ఈసారి కూడా పాయల్ అవార్డును గెలుస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సంతోష్ కథేంటంటే... బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరికి దర్శకురాలిగా ‘సంతోష్’ తొలి చిత్రం. ఉత్తర భారతదేశంలోని ఓ గ్రామం నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుంది. వితంతువు సంతోష్కి తన భర్త చేసే పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం దక్కుతుంది. బలహీన వర్గానికి చెందిన ఓ అమ్మాయిపై జరిగిన అత్యాచారం, ఆ పై హత్యకు సంబంధించిన కేసుని ఛేదించే దర్యాప్తు బృందంలో సంతోష్ భాగం అవుతుంది. ఈ కేసుని ఆమె ఎలా హ్యాండిల్ చేసింది? అనేది కథాంశం. మరి.. ఈ చిత్రం కూడా అవార్డు దక్కించుకుంటుందా? చూడాలి. -
ఇండియన్ సినిమాకు అరుదైన ఘనత.. దాదాపు 30 ఏళ్ల తర్వాత!
ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత తొలిసారి ఇండియన్ సినిమాకు చోటు లభించింది. పాయల్ కపాడియా డైరెక్షన్లో తెరకెక్కించిన 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' కేన్స్లో పామ్ డి ఓర్ అవార్డుకు నామినేట్ అయింది. పాయల కపాడియా తెరకెక్కించిన మొదటి ఫిక్షన్ చిత్రమిది. ఈ ఏడాది మే 14 నుంచి 25 వరకు జరగనున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అత్యున్నత పురస్కారాల కోసం పోటీలో నిలిచింది. దాదాపుగా పామ్ డి ఓర్ అవార్డు కోసం పోటీ పడుతున్న మొదటి భారతీయ చిత్రం ఇదే కావడం గమనార్హం. కాగా.. గతంలో 1994లో షాజీ ఎన్ కరుణ్ తెరకెక్కించిన 'స్వహం' మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఎంపికైంది. ప్రముఖ హాలీవుడ్ చిత్రాలతో కపాడియా 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' పోటీ పడుతోంది. ఈ ఏడాది జరగనున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు జ్యూరీకి 'లేడీబర్డ్', 'బార్బీ' డైరెక్టర్ గ్రెటా గెర్విగ్ అధ్యక్షత వహించనున్నారు. అంతే కాకుండా బ్రిటీష్-ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరి చిత్రం 'సంతోష్' కూడా అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగానికి ఎంపికైంది. కాగా.. గతంలో పాయల్ కపాడియా డాక్యుమెంటరీ 'ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్' 2021 ఎడిషన్లో ఉత్తమ డాక్యుమెంటరీగా గోల్డెన్ ఐ అవార్డ్ను గెలుచుకుంది. 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' అనే మూవీని ఒక నర్సు జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. గతంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఎంపికైన భారతీయ చిత్రాలలో చేతన్ ఆనంద్, వి శాంతారామ్, రాజ్ కపూర్, సత్యజిత్ రే, ఎంఎస్ సత్యు, మృణాల్ సేన్ రచనలు ఉన్నాయి. 'నీచా నగర్' పామ్ అవార్డ్ గెలుచుకున్న ఏకైక భారతీయ చిత్రంగా నిలిచింది. Explore the dark heart of India with Sandhya Suri’s sophomore feature SANTOSH, in Official Selection at UN CERTAIN REGARD.#Santosh #SandhyaSuri @shahanagoswami @sunita_rajwar #GoodChaos @hautetcourt #LionfishFilms @BFI @Festival_Cannes #Cannes2024 #UnCertainRegard pic.twitter.com/UClJuS7rtW — mk2 films (@FilmsMk2) April 11, 2024 ALL WE IMAGINE AS LIGHT – Payal KAPADIA#Competition #Cannes2024 — Festival de Cannes (@Festival_Cannes) April 11, 2024 -
సత్తా చాటిన సమంత 'శాకుంతలం'.. ఏకంగా నాలుగు అవార్డులు!
సమంత, దేవ్ మోహన్ ప్రధానపాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాలో సమంత శకుంతల పాత్ర పోషించగా, దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించారు. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రేక్షకులు ఆశించినంత స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. (ఇది చదవండి: NTR ఫ్యామిలీలో ఒకే ఒక్క మగాడు తారక్: ఆర్జీవీ) అయితే అభిమానులను మెప్పించలేకపోయిన ఈ సినిమాకు అవార్డులు మాత్రం క్యూ కడుతున్నాయి. సమంత కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలిపోయిన ఈ మూవీకి గతంలో న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్- 2023లో బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్గా,బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్గా అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: హీరోల కోసం హీరోయిన్లను వెయిట్ చేయించేవారు: ఆదాశర్మ) తాజాగా ఫ్రాన్స్లో కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ అవార్డులు కొల్లగొట్టింది. ఈ సినిమాకు నాలుగు విభాగాల్లో అవార్డులు దక్కాయి. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ కేటగిరీల్లో సత్తా చాటింది. ఈ విషయాన్ని గుణటీమ్ వర్క్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే దీనిపై నెటిజన్స్ భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు కంగ్రాట్స్ చెబుతుండగా.. మరికొందరేమో ఈ సినిమాకు ఎవరు ఇచ్చారు? అంటూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. కాగా థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే శాకుంతలం సినిమా ఓటీటీలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Gunaa Teamworks (@gunaa_teamworks) -
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నగరవాసి
బంజారాహిల్స్ (హైదరాబాద్): ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై నగరానికి చెందిన బిజినెస్ టైకూన్ సుధా రెడ్డి సందడి చేశారు. ప్రఖ్యాత డైరెక్టర్ మార్టిన్ స్క్రోసేస్, హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో చిత్రం ’కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’ నేషనల్ ప్రీమియర్లో భాగంగా ఆమె రెడ్ కార్పెట్ వాక్ చేశారు. స్టార్–స్టడెడ్ ఫెస్టివల్లో ప్రపంచ ప్రముఖులతో అలరించే రెడ్ కార్పెట్పై వాక్ చేసిన మొట్టమొదటి సినిమాయేతర సెలబ్రిటీ సుధారెడ్డి కావడంవిశేషం. ఈ సందర్భంగా ఆమె కస్టమ్–మేడ్ ఫల్గుణి షేన్ పీకాక్ పీచ్ పెర్ల్ డ్రెప్ చీరలో ఆకట్టుకున్నారు. అనంతరం ప్రతిష్టాత్మకమైన బీచ్ డెస్టినేషన్, ప్లేజ్ హోటల్ బారియర్ లే మెజెస్టిక్లో జరిగిన మేడమ్ ఫిగరో ఈవెంట్లో తళుక్కుమన్నారు. -
చంపేస్తామని బెదిరించారు.. అడల్ట్ ఇండస్ట్రీలో ఇబ్బందులపై హీరోయిన్!
సన్నీ లియోన్ ఇప్పుడు బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ షోతో ఫేమ్ తెచ్చుకున్న భామ ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. మహేశ్ భట్ తెరకెక్కించిన చిత్రం జిస్మ్-2తో అరంగ్రేటం చేసింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత జాక్ పాట్, రాగిణి ఎంఎంఎస్, ఏక్ పహేలీ లీలా లాంటి చిత్రాల్లో కనిపించింది. తాజాగా ఫ్రాన్స్లో జరుగుతున్న 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసింది బాలీవుడ్ భామ. ఈ వేడుకలో ప్రస్తుతం తాను హీరోయిన్గా నటిస్తోన్న కెన్నెడీ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపింది. తాజా ఇంటర్వ్యూలో సన్నీ లియోన్ అడల్ట్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్కు మారే క్రమంలో ఎదురైన ఇబ్బందులను పంచుకుంది. (ఇది చదవండి: రప్ఫాడిస్తున్న మెగాస్టార్.. భోళాశంకర్ క్రేజీ అప్డేట్) సన్నీ లియోన్ మాట్లాడుతూ..' మొదట నన్ను బిగ్ బాస్ మేకర్స్ సంప్రదించారు. కాల్ చేసి షోలో పాల్గొనాలని కోరారు. కానీ దీనిపై నేను నా ప్రియుడు, భర్త డేనియల్ వెబర్తో మాట్లాడా. నీకు బుద్ధి లేదు. నేను ఇండియా వెళ్లడం లేదు. వారంతా నన్ను ద్వేషిస్తారు. ఎందుకంటే నేను ఇప్పటికే అడల్డ్ ఇండస్ట్రీలో ఉన్నా.' అంటూ సన్నీ చెప్పుకొచ్చింది. బిగ్బాస్ హౌస్ గురించి మాట్లాడుతూ.. 'అయితే ఈ షోకి రాకముందే నాకు చాలా అడ్డంకులు వచ్చాయి. చంపేస్తామని బాంబు బెదిరింపులు కూడా వచ్చాయి. తాను బిగ్ బాస్లో దాదాపు 7 వారాల పాటు ఉన్నా. ప్రతి వారం గడిచేకొద్దీ ఏదో మంచి జరుగుతుందని ఆశించా. హౌస్లో ఉండగానే తనకు సినిమా ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత ఒక వ్యక్తిగా వారితో రిలేషన్ తర్వాత తాను అడల్ట్ ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నా.' అంటూ చెప్పింది. (ఇది చదవండి: లైంగిక వేధింపుల కేసు.. హీరోకు షాకిచ్చిన హైకోర్టు!) బిగ్ బాస్ హౌస్లో అందరితో కలిసి వంటచేయడం, రోజువారీ జీవితం నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది. బిగ్ బాస్లో పాల్గొనడం వల్లే అడల్ట్ ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నట్లు తెలిపింది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అంతా బాగానే ఉందని.. కానీ మధ్యలో తాను అనేక అడ్డంకులు ఎదుర్కొన్నట్లు పేర్కొంది. కాగా.. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కిస్తున్న కెన్నెడీ చిత్రంలో రాహుల్ భట్ సరసన నటిస్తోంది. View this post on Instagram A post shared by Deadline Hollywood (@deadline) -
ఊర్వశి రౌతేలా నెక్లెస్.. ధరపై నెటిజన్స్ ట్రోల్స్!
ఫ్రాన్స్లో జరుగుతున్న కేన్స్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పలువురు బాలీవుడ్ తారలు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఐశ్వర్యారాయ్తో పాటు బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తళుక్కున మెరిసింది. అయితే ఈ వేడుకల్లో ఆమె ధరించిన క్రోకోడైల్ నెక్లెస్పైనే అందరి దృష్టి పడింది. ఇంతకీ ఆమె వేసుకున్న నెక్లెస్ ధర ఎంతై ఉంటుందని నెటిజన్స్లో తెగ చర్చిస్తున్నారు. దీంతో తాజాగా ఆమె టీమ్ నెక్లెస్ ధరను వెల్లడించింది. (ఇది చదవండి: 'డింపుల్తో డీసీపీ ర్యాష్గా మాట్లాడారు.. అందుకే కాలితో తన్నారు') కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కొత్త డ్రెస్సులు, తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది.అయితే ఆమె ధరించిన మొసలి నెక్లెస్పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేశారు. పింక్ కలర్ గౌనులో మెరిసిన ఊర్వశి రౌతేలా.. ఫేక్ నెక్లెస్ పెట్టుకుని వెళ్లిందని ట్రోల్స్ కూడా చేశారు. View this post on Instagram A post shared by Brut India (@brut.india) (ఇది చదవండి: హన్సికను వేధించిన టాలీవుడ్ టాప్ హీరో.. ఎవరై ఉంటారబ్బా?) అయితే ఈ ట్రోల్స్పై నటి బృందం క్లారిటీ ఇచ్చింది. నెక్లెస్ ధర తెలుపుతూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. 'ఊర్వశి ధరించిన నెక్లెస్ ఫేక్ కాదు. దాని ధర రూ.276 కోట్ల వరకు ఉంటుంది. అది ఆమె ఫ్యాషన్ నిదర్శనం.' అని పేర్కొంది. ప్రస్తుతం దీని ధర చూసి అందరూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. నెక్లెస్ అంత ధర ఉంటుందా? జోక్ బాగుందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. కాగా.. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఆడిపాడిన ఊర్వశి.. ఇటీవల అఖిల్ ఏజెంట్లోనూ కనిపించింది. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిన అమన్ గుప్తా..
ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ సహ వ్యవస్థాపకుడు అమన్ గుప్తా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిశారు. రెడ్ కార్పెట్ మీద భార్య ప్రియా దాగర్తో కలిసి అడుగులు వేశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇలా రెడ్ కార్పెట్పై నడిచిన మొదటి భారతీయ పారిశ్రామిక వేత్త ఆయనే. అమన్ గుప్తా తొలిసారిగా కేన్స్ ప్రదర్శన కోసం భార్య ప్రియా దాగర్తో కలిసి వచ్చారు. ఈ మేరకు అమన్ గుప్తా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఫొటోలను షేర్ చేశారు. ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్పై నడిచిన తొలి భారతీయ పారిశ్రామికవేత్తను నేనే కావడం గర్వంగా ఉంది’ అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Aman Gupta (@boatxaman) మరోవైపు బాలీవుడ్ తారలు సారా అలీ ఖాన్, మానుషి చిల్లర్, ఈషా గుప్తా, మృణాల్ ఠాకూర్ వంటి వారు ఈ సంవత్సరం కేన్స్లోకి అడుగుపెట్టారు. కేన్స్ వెటరన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ లోరియల్ బ్రాండ్ అంబాసిడర్గా 21వ సారి ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చింది. -
వైభవంగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్: రెడ్ కార్పెట్పై మెరిసిన ఊర్వశీ రౌతేలా (ఫొటోలు)
-
Cannes Film Festival 2023: కేన్స్లో మన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
అట్టహాసంగా ఆరంభమైన కాన్స్ చిత్రోత్సవాలు
76వ కాన్స్ చిత్రోత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఫ్రాన్స్లో ఈ నెల16న మొదలైన ఈ చిత్రోత్సవాలు 27 వరకు కొనసాగుతాయి. ఎనిమిది మంది జ్యూరీ సభ్యులకు స్వీడన్కు చెందిన రూబెన్ ఓస్ట్లాండ్ సారథ్యం వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సమా చార, ప్రసార శాఖ డిప్యూటీ మినిస్టర్ ఎల్. మురుగన్ ఈ చిత్రోత్సవాల్లో ఇండియన్ టీమ్ను లీడ్ చేస్తున్నారు. 12 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో పలువురు దేశ, విదేశీ తారలు రెడ్ కార్పెట్పై మెరవనున్నారు. ఇక తొలి రోజు వేడుక విశేషాల్లోకి వెళదాం. ఏడు నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ తొలి రోజు బయోగ్రఫికల్ డ్రామా ‘జాన్ డ్యు బెర్రీ’ ప్రదర్శనతో ప్రారంభమై, చివరి రోజు ఉత్సవాలు ‘ఎలిమెంటల్’ సినిమా ప్రదర్శనతో ముగుస్తాయి. ‘జాన్ డ్యు బెర్రీ’ సినిమాలో ఓ లీడ్ రోల్ చేసిన జానీ డెప్ ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు. ఈ చిత్రప్రదర్శన ముగిసిన తర్వాత వీక్షకులు ఏడు నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ఇవ్వడం విశేషం. తమ చిత్రానికి ఇంత అద్భుత స్పందన లభించిన నేపథ్యంలో జానీ డెప్ కళ్లు చెమర్చాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది. మైవెన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. కాన్స్లో భారతీయం ప్రతి ఏడాదీ కాన్స్ చిత్రోత్సవాల్లో భారతీయ తారలు మెరుస్తుంటారు. ఈ ఏడాది తొలి రోజు హిందీ తారలు సారా అలీఖాన్, ఈషా గుప్తా, మానుషీ చిల్లర్, ఊర్వశీ రౌతేలా రెడ్ కార్పెట్పై మెరిశారు. కాగా సారా, ఈషా, మానుషీ లు తొలిసారి కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ ముగ్గురితో పాటు ఊర్వశి కూడా రెడ్ కార్పెట్ పై సందడి చేశారు. దేశీ లుక్లో అగుపించిన సారాకి ప్రశంసలు లభించాయి. వీరు మాత్రమే కాదు.. ఇంకా హీరోయిన్లు అనుష్కా శర్మ, మృణాల్ ఠాకూర్, సన్నీ లియోన్, నాగాల్యాండ్ యాక్ట్రస్ ఆండ్రియా కెవిచుసాలు తొలిసారిగా ఈ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంటారు. ఇంకా ఆస్కార్ అవార్డు విన్నింగ్ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా, దర్శకుడు మధుర్ భండార్కర్, హీరోయిన్ అదితీరావ్ హైదరీ, నటుడు విజయ్వర్మ, దర్శకుడు విఘ్నేష్ శివన్ వంటి వారు పాల్గొననున్నట్లు సమాచారం. అలాగే దర్శకుడు అనురాగ్ కశ్వప్ తెరకెక్కించిన ‘కెన్నెడీ’, దర్శకుడు కను బెహ్లీ తీసిన ‘ఆగ్రా’, మణిపూర్ దర్శకుడు అరిబామ్ శ్యామ్ శర్మ తెరకెక్కించిన ‘ఇషానౌ’, యుధాజిత్ బసు ‘నెహెమిచ్’ వంటి భారత చిత్రాలు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కానున్నాయి. ‘కెన్నెడీ’ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఒకరిగా నటించిన సన్నీ లియోన్ ఈ చిత్రం ప్రదర్శనలో భాగంగానే ఉత్సవాలకు హాజరవుతున్నారు. రెండు దశాబ్దాలుగా... కాన్స్ చిత్రోత్సవాలంటే చాలామంది ఐశ్వర్యా రాయ్ కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే దాదాపు రెండు దశాబ్దాలుగా కాన్స్ రెడ్ కార్పెట్పై ఐష్ మెరుస్తున్నారు. షారుక్ ఖాన్, ఐశ్వర్యా రాయ్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రల్లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘దేవదాస్’ (2002) చిత్రం 55వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. అప్పట్నుంచి ఐశ్వర్యా రాయ్ క్రమం తప్పకుండా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరవుతున్నారు. ఈ ఏడాది చిత్రోత్సవాల్లో సందడి చేసేందుకు తన కూతురు ఆరాధ్యతో కలిసి ఐశ్వర్యా రాయ్ బుధవారం ముంబై నుంచి బయలుదేరారు. -
Cannes Film Festival 2023: అట్టహాసంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఫొటోలు)
-
రెడ్ కార్పెట్పై మెరవనున్న సీతారామం బ్యూటీ
Mrunal Thakur: ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్కి కాన్స్ నుంచి కబురొచ్చింది. ప్రతి ఏడాది ఫ్రాన్స్లో జరిగే కాన్స్ చిత్రోత్సవాలు ఈ నెల 16న ఆరంభమయ్యాయి. 27 వరకు కొనసాగుతాయి. ఈ చిత్రోత్సవాల్లో మృణాల్ రెడ్ కార్పెట్పై తొలిసారి మెరవనున్నారు. ఈ విషయంపై మృణాల్ మాట్లాడుతూ – ‘‘అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్మేకర్స్తో మాట్లాడటానికి ఈ వేదిక నాకు ఉపయోగపడుతుంది. భారతీయ చలన చిత్రపరిశ్రమ ఖ్యాతిని నేను అక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను’’ అన్నారు మృణాల్. ఈ నెల 17 నుంచి 19 తేదీల్లో మూడు రోజుల పాటు మృణాల్ కాన్స్ చిత్రోత్సవాల్లో సందడి చేస్తారట. -
Cannes Film Festival 2022: అట్టహాసంగా ముగిసిన కాన్స్ వేడుకలు
ఫ్రాన్స్లో మొదలైన 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలు ఆట్టహాసంగా ముగిశాయి. ఈ నెల 17న కాన్స్ చలన చిత్రోత్సవాలు మొదలైన సంగతి తెలిసిందే. ఫీచర్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ విభాగాల్లో దాదాపు 21 అవార్డులు అందజేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘పామ్ డీ ఆర్’ అవార్డును స్వీడెన్ ఫిల్మ్మేకర్ రూబెన్ ఓస్ట్లండ్ దక్కించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ట్రయాంగిల్ ఆఫ్ సాడ్నెస్’కు ‘పామ్ డీఆర్’ అవార్డు లభించింది. రూబెన్స్ తెరకెక్కించిన ఫిల్మ్కు ఈ అవార్డు రావడం ఇది రెండోసారి. 2017లో ‘ది స్వైర్’ చిత్రానికిగాను కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఈ అవార్డు అందుకున్నారాయన. విలాసవంతమైన విహారయాత్రకు ఆహ్వానించబడ్డ ఇద్దరు ఫ్యాషన్ మోడల్ సెలబ్రిటీల నేపథ్యంలో ‘ట్రయాంగిల్ ఆఫ్ సాడ్నెస్’ సాగుతుంది. ‘కాన్స్’ చలన చిత్రోత్సవంలో రెండో గొప్ప అవార్డుగా భావించే గ్రాండ్ ప్రైజ్ను రెండు సినిమాలు పంచుకున్నాయి. క్లైరే డెనిస్ దర్శకత్వంలో వచ్చిన ‘స్టార్స్ ఎట్ నైట్’, లుకాస్ థోన్స్ దర్శకత్వంలోని ‘క్లోజ్’ చిత్రాలు గ్రాండ్ ప్రైజ్ను పంచుకున్నాయి. జ్యూరీ ప్రైౖజ్ విషయంలోనూ ఇలానే జరిగింది. ‘ఈవో’(జెర్జిస్కో లిమౌస్కీ దర్శకుడు), ‘ది ఎయిట్ మౌంటెన్స్’ (ఫెలిక్స్ వాన్స్ – చార్లెట్ దర్శకులు) చిత్రాలకు జ్యూరీ అవార్డు దక్కింది. ‘బ్రోకర్’కి సాంగ్– కాంగ్ హూ ఉత్తమ నటుడిగా, ‘హోలీ స్పైడర్ ’ చిత్రానికి ఇరానీ యాక్ట్రస్ జార్ అమిర్ ఇబ్రహీమి ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు. ‘డెసిషన్స్ టు లీవ్’ చిత్రాని పార్క్ చాన్స్ హూక్ ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. ఇండియా డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ కి అవార్డు 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలకు భారతదేశం తరఫున ఎంపికైన ‘ఆల్ దట్ బ్రీత్స్’ డాక్యుమెంటరీకి ‘ది గోల్డెన్స్ ఐ’ అవార్డు దక్కింది. షౌనక్ సేన్స్ దర్శకత్వం వహించారు. ఢిల్లీకి చెందిన మహ్మద్ సౌద్, నదీమ్ షెహజాద్ అనే ఇద్దరు బ్రదర్స్ గాయపడ్డ పక్షులను ఎలా సంరక్షించేవారు? బ్లాక్కైట్స్ బర్డ్స్ సంరక్షణ కోసం వీరు ఏం చేశారు? అనే అంశాలతో ‘ఆల్ దట్ బ్రీత్స్’ డాక్యుమెంటరీ ఉంటుంది. ఈ ఏడాది అమెరికాలో జరిగిన ‘సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో కూడా ‘ఆల్ దట్ బ్రీత్స్’కి వరల్డ్ సినిమా గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ లభించింది. కాగా కాన్స్ చలన చిత్రోత్సవాల స్పెషల్ జ్యూరీ విభాగంలో ‘మేరిముపోల్ 2’ (మాంటస్ దర్శకుడు) డాక్యుమెంటరీకి అవార్డు లభించింది. రష్యా, ఉక్రెయిన్స్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో డాక్యుమెంటరీ షూటింగ్ నిమిత్తం మేరియుపోల్ వెళ్లారు లిథువేనియన్స్ దర్శకుడు మాంటస్. ఏప్రిల్లో రష్యా బలగాల దాడుల్లో ఖైదు కాబడిన మాంటస్ ఆ తర్వాత చనిపోయారనే వార్తలు ఉన్నాయి. పాకిస్తాన్ ఫిల్మ్ ‘జాయ్లాండ్’ కి ‘అన్ సర్టెన్ రిగార్డ్ కేటగిరీ’ విభాగంలో జ్యూరీ ప్రైజ్ లభించింది. కాగా 75వ చలన చిత్రోత్సవాల్లో జ్యూరీ మెంబర్ దీపికా పదుకొనెతో పాటు మరికొంతమంది తారల రెడ్ కార్పెట్ వాక్స్ హైలైట్గా నిలిచాయి. -
Fashion: కాన్స్.. మన తారల లుక్ అదుర్స్! డ్రెస్ ఎంపికలోనే అంతా!
ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకునే వేదిక అది.. అందం, హుందాతనం కలిసి నడిచే కార్పెట్ అది. అందరి చూపులను తమ వైపు పడేలా చేయాలంటే అందుకు తగిన డ్రెస్ ఎంపిక ఎంతో ప్రత్యేకంగా ఉండాలి. సమయం, సందర్భం, సీజన్... ఇలా వేడుకకు తగిన నియమాలనూ పాటించాలి. ఇవన్నీ మన కళ్లకు కడుతుంది కాన్స్ ఫిల్మ్ఫెస్టివల్. రెడ్ కార్పెట్పైన మన తారలు వెదజల్లిన జిలుగులు ఇవి.. దీపికా పదుకోన్ సబ్యసాచి డిజైనర్ శారీ ధరించిన దీపిక రెడ్కార్పెట్పై హుందాతనాన్ని ప్రదర్శించింది. ఈ ఫిల్మోత్సవంలో దీపికా పదుకోన్ తన ఫ్యాషన్ పరంపరను కొనసాగించింది. లేత అకుపచ్చ రంగులో ఉన్న గౌన్ నిండా పింక్ గులాబీలు, ఆకులతో ఆమె నవ్వులతో పోటీపడుతున్నట్టుగా ఉన్నాయి. మ్యాచింగ్ బూట్లు మరింత ఆకర్షణీయంగా అమరాయి. ఐశ్వర్యా బచ్చన్ ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌజ్ ‘డోల్స్ అండ్ గబ్బానా’ డిజైనర్ బ్లాక్ శాటిన్ గౌన్ను ధరించింది ఐశ్వర్యాబచ్చన్. అంచు భాగం వెడల్పాటి ఫ్లేర్తో, అందమైన పువ్వులతో డిజైన్ చేసిన ఈ గౌన్ విశేషంగా ఆకట్టుకుంది. వెస్ట్రన్ పార్టీలో ఫ్లోరల్స్కున్న ఘనతను ఇలా చాటింది. పూజా హెగ్డే లెబనీస్ ఫ్యాషన్ బ్రాండ్ మైసన్ గేయన్నా బాల్ గౌన్తో కాన్స్లో సందడి చేసింది పూజా హెగ్డే. ఫెదర్ డిజైన్ ఈ గౌన్ ప్రత్యేకతను మరింత పెంచింది. పొనీటెయిల్, లాంగ్ హ్యాంగింగ్స్తో సింపుల్ అనిపించే ఆహార్యంతో ఆకట్టుకుంది పూజా. తమన్నా డిజైనర్స్ గౌరీ అండ్ నైనిక రూపొందించిన గౌనులో తమన్నా రెడ్ కార్పెట్పైన సందడి చేసింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో శాటిన్ నెక్లైన్తో తన రూపాన్ని మరింతగా హైలైట్ చేసింది. నర్గిస్ ఫక్రీ టర్కీ డిజైనర్ నెడ్రెట్ టాసిరోగ్లు రూపొందించిన బేబీ పింక్ కలర్ షిమ్మర్ డ్రెస్లో రెడ్ కార్పెట్పైన నడిచింది నర్గీస్ ఫక్రీ. హాల్టర్ నెక్ ఈ డ్రెస్ ప్రత్యేకత. నడుము వరకు సరైన ఫిటింగ్తో ఉన్న గౌన్ కింది భాగమంతా వెడల్పాటి ఫ్లెయర్తో ఆకట్టుకుంది. అదితీరావు హైదరీ ఇండియన్ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన స్లీవ్డ్ బ్లాక్ గౌన్ను ధరించి ఫిల్మోత్సవంలో పాల్గొంది అదితీరావు హైదరీ. ఫ్లోరల్ లేస్, క్రూ నెక్, ఎంబ్రాయిడరీ ఈ డ్రెస్ ప్రత్యేకతలు. అంతేకాదు గౌన్ హైలైట్ అయ్యేలా డిజైనర్ బ్రాండ్ బెల్ట్, రాయల్ బెంగాల్ టైగర్ గోల్డ్ యాక్ససరీస్.. కార్పెట్పైన స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ఊర్వశి రౌతేలా టోనీ వార్డ్ కోచర్ నుండి తీసుకున్న తెల్లటి రఫుల్డ్ గౌన్లో రెడ్ కార్పెట్ మీద మెరిసింది ఊర్వశి రౌతేలా. రఫుల్స్తో విప్పారినట్టుగా ఉన్న గౌన్ను నడుము, భుజం వద్ద జత కలిపిన డిజైన్ డ్రెస్కి మరింత అందాన్నిచ్చింది. చదవండి👉🏾 Catherine Tresa: ఈ హీరోయిన్ ధరించిన అంగ్రఖా కుర్తా ధర 32వేలు! డ్రెస్ ప్రత్యేకత ఇదే! -
ఆ హీరోయిన్స్ను జిరాఫీలు అన్న అదితి రావ్.. ఎందుకంటే ?
Aditi Rao Hydari About Cannes Film Festival 2022 Debut Experience: తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది బ్యూటీఫుల్ హీరోయిన్ అదితి రావ్ హైదరీ. ఇటీవల మహా సముద్రం, హే సినామిక చిత్రాలతో అలరించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో తళుక్కుమంది. బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొణె, నవాజుద్ధీన్ సిద్ధిఖీ, ఆర్ మాధవన్, పూజా హెగ్డేతోపాటు అదితి పాల్గొంది. వేడుకలో భాగంగా ఐదో రోజు రెడ్ కార్పెట్పై రెడ్ అండ్ పింక్ గౌన్లో అందంగా నడిచి ఆకట్టుకుంది. ఈ క్రమంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది అదితి రావ్ హైదరీ. 'నేను చాలా పొట్టిగా ఉంటాను. అందుకే కేన్స్ ఫెస్టివల్లో ఉన్న జిరాఫీలతో (మిగతా హీరోయిన్స్ తనకన్నా హైట్గా ఉంటారన్న ఉద్దేశ్యంతో) పోటీపడలేనని మాటల సందర్భంలో సబ్యసాచితో (డిజైనర్) చెప్పాను. నేను నటిని. పొట్టిగా ఉన్నప్పటికీ నాకు బాధ లేదు. ఎందుకంటే నాలాగా ఉండటానికి నేను ఎంతో సౌకర్యవంతంగా ఫీల్ అవుతాను. అందుకే ధైర్యం చేసి ఫెస్టివల్లో పాల్గొంటాను. నేను చాలా తెలివితక్కువ పని చేయబోతున్నాను. రెడ్ కార్పెట్పై నడిచేప్పుడు కచ్చితంగా ఏదో ఒక పొరపాటు చేస్తాను. అప్పుడు నన్ను అందరు విమర్శిస్తారు. అయినా పర్లేదు. అంతా మన మంచికే. దాని నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు.' అని అదితి చెప్పుకొచ్చింది. అయితే రెడ్ కార్పెట్పై ఎలాంటి పొరపాటు లేకుండా హొయలు పోయింది అదితి రావ్ హైదరీ. చదవండి: లగ్జరీ కారు కొన్న అదితి రావు హైదరీ.. ధర ఎంతంటే ? View this post on Instagram A post shared by Vivo India (@vivo_india) View this post on Instagram A post shared by Vivo India (@vivo_india) -
కాన్స్లో దీపిక ధరించిన ఈ నెక్లెస్ ధరెంతో తెలుసా?
Cannes Filim Festival 2022: 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలు ఫ్రాన్స్ దేశంలోని కాన్స్ నగరంలో మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఈ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటే సినీ సెలబ్రెటీలకు అతిపెద్ద పండుగ. ఈ వేడుకలో వివిధ దేశాలకు చెందిన తారంతా రెడ్ కార్పెట్ హోయలు పోతారు. ఇందుకు కోసం విభిన్నమైన వస్త్రాధారణతో అందిరిని ఆకట్టుకుంటారు. ఇందుకోసం స్పెషల్ డిజైన్ చేసిన దస్తులు, ఆకర్షణీయమైన ఆభరణాలతో తళుక్కున మెరుస్తారు సీని తారలు. చదవండి: యూరప్లో పర్సు పోయింది, పైసా లేదు.. ఎవరూ సాయం చేయలేదు ఇదిలా ఉంటే ఈ ఏడాది కాన్స్ ఫిలిం ఫెస్టివల్కు మన భారత్కు గౌరవ సభ్య దేశంగా హోదా దక్కడంతో కేంద్ర మంద్రి అనురాగ్ ఠాగూర్ నేతృత్వంలో మన భారత సెలబ్రెటీల టీం హాజరైంది. అయితే ఈసారి ఈ అవార్డుల వేడుకలో దీపికా పదుకొనె జ్యూరీ మెంబర్గా వ్యవహరించడం విశేషం. ఈ సందర్భంగా దీపకా ధరించిన దుస్తులు, ఆభరణాలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ఈ క్రమంలో దీపికా ధరించిన ఓ నెక్లెస్, దాని ధర ప్రస్తుతం హాట్టాపిక్గా నిలిచింది. కంటెను తలపించేలా ఉన్న ఈ నెక్లెస్పై అందరి దృష్టి పడటంతో దాని ఖరీదేంటుందని ఆరా తీయం ప్రారంభించారు నెటిజన్లు. దీంతో దాని ధర తెలిసి నెటిజన్లను షాక్ అవుతున్నారు. చదవండి: కాన్స్ ఫిలిం ఫెస్టివల్.. పూజా హెగ్డేకు చేదు అనుభవం కాగా నలుపు రంగు సూట్ మీద దీపికా ధరించిన ఈ వజ్రాల నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్సించింది. తాతమ్మల కాలంనాటి కంటెను తలపించేలా ఉన్న ఈ నగకు ముందు భాగంలో పులి ముఖాలు వచ్చేలా డిజైన్ చేశారు. ఈ పులుల కళ్ల స్థానంలో ఖరీదైన పచ్చలను పొదిగి ఉంది. అయితే ఈ నెక్లెస్ను ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ నగల తయారీ సంస్థ కార్టియర్ తయారు చేసిందట. పూర్తిగా 18 క్యారెట్ల తెల్ల బంగారంతో తయారు చేసిన ఈ నెక్లెస్ ధర సుమారుగా 3 కోట్ల 80లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఇక దీని ధర తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. కాగా ఈసారి భారత్ నుంచి ఐశ్వర్యారాయ్, ఆర్ మాధవన్, నవాజుద్దిన్ సిద్దిఖీ, ఎఆర్ రెహమాన్, పూజా హెగ్డే, నయనతార, తమన్నా, దీపికా పదుకొనె తదితరులు హాజరైన సంగతి తెలిసిందే. -
Cannes Film Festival: పూజా హెగ్డేకు చేదు అనుభవం
75వ కాన్స్ చలన చిత్రోత్సవాలు ఫ్రాన్స్లో వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో మన సౌత్ హీరోయిన్లు పూజా హెగ్డే, తమన్నా, నయన తారలు కూడా మెరిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో రెడ్ కార్పెట్పై నడిచి విదేశి మీడియాను, అంతర్జాతీయ స్టార్స్ను ఆకట్టుకున్న పూజాకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఈ వేడుక కోసం తాను సిద్ధం చేసుకున్న నగలు, దుస్తులు, మేకప్ సామాన్ల బ్యాగ్లు పొగొట్టుకుందట ఈ బుట్టబోమ్మ. దీంతో తను, తన టీం అంతా ఆందోళనకు గురై ఒక రోజంతా ఏం తినకుండ ఉన్నామని చెప్పుకొచ్చింది పూజా. చదవండి: Cannes Film Festival: కాన్స్ ఫిలిం ఫెస్టివల్ రెండో రోజు హైలైట్స్ అక్కడి విదేశి మీడియాతో ముచ్చటించిన ఆమె ఈ విషయం చెప్పుకొచ్చింది. ‘తొలిసారి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కు ఆహ్వానం అందడంతో చాలా సంతోషపడ్డాను. ఇక్కడ రెడ్ కార్పెట్పై మెరిసేందుకు బ్యూటీ ప్రొడక్ట్స్, ఫ్యాషన్ వేర్ దుస్తులను నా టీం స్పెషల్గా డిజైన్ చేసింది. ఎంతో కష్టపడి అంతా సిద్ధం చేసుకున్నాం. తీరా ఫ్రాన్స్ వచ్చాక ఆ బ్యాగులు కనిపించకుండ పోయాయి. ఇండియా ఎయిర్పోర్టులోనే బ్యాగ్లు పోయాయి. ఎయిర్పోర్టులో నా బ్యాగ్స్ చెకిన్ అయ్యాయి. కానీ అందులో నా మేకప్, దుస్తులకు సంబంధించిన బ్యాగ్స్ మాత్రం కనిపించలేదు. తీరా ఫ్రాన్స్లో ల్యాండ్ అయ్యాకే అసలు విషయం తెలిసింది. దీంతో నేను, నా టీం ఆందోళనకు గురయ్యాం’ అని చెప్పుకొచ్చింది. చదవండి: ఎన్టీఆర్ బర్త్డే, చరణ్ స్పెషల్ బర్త్డే విషెస్ అనంతరం ‘రెడ్ కార్పెట్పై వాక్ చేసేందుకు అవసరమైన దుస్తులు లేకపోయేసరికి అందరిలో కంగారు మొదలైంది. బట్టలు, హెయిర్ ప్రొడక్ట్స్, మేకప్ కిట్లు అన్ని పోయాయి. దీంతో ఏం చేయాలని ఆలోచిస్తున్న క్రమంలో ఇండియాలో కొన్న బంగారు నగలు నా హ్యాండ్ బ్యాగులో ఉన్నాయి. దీంతో ఊపిరి పీల్చుకున్నాను. ఆ తర్వాత నా టీంకి మేకప్ సామన్లు, దుస్తులు కొని తీసుకురమ్మన్నాను. వెంటనే వారు అవసరమైన వస్తువులన్నీ కొని తెచ్చారు’ అని చెప్పింది. అయితే బ్యాగ్స్ మిస్ అయ్యేసరికి టెన్షన్లో ఆ రోజంత తనతో పాటు తన టీం ఎవరు కూడా బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేయలేదని, రాత్రి రెడ్ కార్పెట్ వాక్ ముగిసిన తర్వాతే అందరం తిన్నామని పూజా తెలిపింది. కాగా ఈ ఫిలిం ఫెస్టివల్లో పూజా ఫెదర్స్ గౌన్లో రెడ్ కార్పెట్పై నడిచి బుట్టబొమ్మలా మెరిసింది. View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
కాన్స్లో మెరిసిన భారత సోయగం (ఫొటోలు)
-
కాన్స్లో తమిళ కళా శిఖరాలు
తమిళ సినిమా: కాన్స్ చిత్రోత్సవాల్లో తమిళ కళాశిఖరాలకు రెడ్ కార్పెట్ స్వాగత గౌరవం లభించింది. మంగళవారం నుంచి ఫ్రాన్స్లో 75వ కాన్స్ చిత్రోత్సవాల సందడి మొదలైన విషయం తెలిసిందే. ఇందులో పలు భారతీయ సినిమాలతో పాటు విదేశీ చిత్రాలు ప్రదర్శింపబడుతూ కను విందు చేస్తున్నాయి. కాగా ఈ చిత్రోత్సవంలో ఏఆర్ రెహ్మాన్ దర్శకత్వం వహించిన లీ మస్క్, మాధవన్ స్వీయ దర్శకత్వంలో నటించిన రాకెట్, పార్థీపన్ స్వీయ దర్శకత్వంలో నటించిన ఇరవిన్ నిళల్ చిత్రాలను ప్రదర్శించనున్నారు. అదే విధంగా కమలహాసన్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన విక్రమ్ చిత్ర ట్రైలర్ను విస్టా వేర్స్, లోటస్ మెటా ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి బుధవారం ప్రదర్శించారు. -
అట్టహాసంగా కాన్స్ వేడుకలు: విదేశీ చిత్రాలకు కేంద్రమంత్రి ఆఫర్లు
75వ కాన్స్ చలన చిత్రోత్సవాలు ఫ్రాన్స్లో వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భారతదేశం ‘కంట్రీ ఆఫ్ హానర్’గా నిలిచింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. కాన్స్ వేదిక సాక్షిగా భారతదేశంలో చిత్రీకరించే విదేశీ చిత్రాలకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు అనురాగ్ ఠాకూర్. తొలి రోజు (మంగళవారం) చిత్రోత్సవాల్లో మన తారలు మెరిశారు. రెండో రోజూ ఇదే జోరు కొనసాగింది. కమల్హాసన్ ‘విక్రమ్’, మాధవన్ ‘రాకెట్రీ: ది నంబియార్’ చిత్రాల ట్రైలర్స్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దర్శకత్వంలోని ‘లే మస్క్’ స్క్రీనింగ్కి అర్హత పొందిన విషయం తెలిసిందే. మరిన్ని విశేషాలు ఈ విధంగా... ‘‘మా దగ్గర ఫిలిం ఇండస్ట్రీ లేదు. మా దగ్గర సిని‘మా’ (దేశంలో అమ్మని మా అని కూడా అంటారు కాబట్టి ‘మా’ పదాన్ని ఒత్తి పలుకుతూ)’’ ఉంది అని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. కాన్స్ చిత్రోత్సవాల్లో ‘ఇండియన్ పెవిలియన్’ని ప్రారంభించారు అనురాగ్ ఠాకూర్. ఈ వేదికపై 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ గోవా 2022) పోస్టర్ని ఆవిష్కరించారు. ‘‘భారతదేశంలో చెప్పడానికి చాలా కథలు ఉన్నాయి. ప్రపంచానికి ‘కంటెంట్ హబ్’గా మారే శక్తి సామర్థ్యాలు ఉన్న దేశం’’ అంటూ కాన్స్ చలన చిత్రోత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సందేశాన్ని కాన్స్ వేదికపై పంచుకున్నారు. ఇంకా అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ – ‘‘గడచిన 20 ఏళ్లల్లో షర్మిలా ఠాగూర్, ఐశ్వర్యా రాయ్, విద్యా బాలన్, శేఖర్ కపూర్ వంటి ఎందరో కాన్స్ ఫెస్టివల్లో జ్యూరీ సభ్యులుగా ఉన్నారు. ఈసారి ఆ గౌరవం దీపికా పదుకోన్కి దక్కింది. భారతదేశంలో చిత్రీకరించే విదేశీ చిత్రాలను ప్రోత్సహించే దిశగా తీసుకున్న నిర్ణయాలను ఈ వేదికపై ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. భారతదేశంలో విదేశీ చిత్రాల ఆడియో–విజువల్ కో–ప్రొడక్షన్, షూటింగ్ కోసం 260 వేల డాలర్ల (దాదాపు రూ. 2 కోట్లు) పరిమితితో 30 శాతం వరకు నగదు ప్రోత్సాహాన్ని అందిస్తాం. అలాగే దేశంలో జరిపే విదేశీ చిత్రాల షూటింగ్కు 15 శాతం లేదా అంతకంటే ఎక్కువ మంది భారతీయ సిబ్బందిని నియమిస్తే 65 వేల డాలర్ల (రూ. 50 లక్షలు) పరిమితితో అదనపు బోనస్ ఇస్తాం. భారతదేశాన్ని ప్రపంచంలోని కంటెంట్ హబ్గా మార్చడానికి, ఫిల్మ్ మేకింగ్, ఫిల్మ్ ప్రొడక్షన్, పోస్ట్–ప్రొడక్షన్ తదితర అంశాలకు భారతదేశాన్ని ప్రపంచానికి గమ్యస్థానంగా మార్చడానికి భారత ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తుంది. జాతీయ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్ కింద భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ రిస్టోరేషన్ ప్రాజెక్టును ప్రారంభించింది. దీనివల్ల దేశంలోని పలు భాషలకు చెందిన 2,200 చిత్రాలు తమ పూర్వ వైభవం సంతరించుకుంటాయి. భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు జరుపుకుంటున్నందున ఈ సంవత్సరం ప్రత్యేకమైనది. ఇది 75వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కావడం విశేషం. ఈ చిత్రోత్సవాల్లో భారతదేశం ‘గౌరవనీయమైన దేశం’గా అర్హత పొందింది కాబట్టి ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఈ 75వ కాన్స్ ఉత్సవాల్లో సృజనాత్మకతను, ప్రతిభను సెలబ్రేట్ చేసుకోవడానికి భారతదేశం, ఫ్రాన్స్ కలిశాయి’’ అన్నారు. అనురాగ్ ఠాకూర్తో కలసి ప్రముఖ నటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శక–నటుడు శేఖర్ కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తదితరులు రెడ్ కార్పెట్పై నడిచారు. 30 ఏళ్ల తర్వాత కాన్స్కి టామ్ క్రూజ్ హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ 1992లో కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొన్నారు. 30 ఏళ్ల తర్వాత ఈ వేడుకలకు హాజరయ్యారాయన. టామ్ క్రూజ్ నటించిన ‘టాప్ గన్: మేవరిక్’ చిత్రం కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానుంది. 1986లో విడుదలైన ‘టాప్ గన్’కి సీక్వెల్గా ఈ చిత్రం రూపొందింది. తొలి భాగంలోనూ టామ్ క్రూజ్ హీరోగా నటించారు. స్టార్స్ స్టెప్పేస్తే... కాన్స్లో ‘ఇండియన్ పెవిలియన్’ ప్రారంభోత్సవంలో జానపద కళాకారుడు, సంగీత దర్శకుడు మామే ఖాన్ పాట పాడగా దీపికా పదుకోన్, తమన్నా, పూజా హెగ్డే, ఊర్వశీ రౌతేలా స్టెప్పులేశారు. కాన్స్ చిత్రోత్సవాలకు వెళ్ళాలనే నా కల నెరవేరింది. అనురాగ్ ఠాకూర్గారి వల్లే ఇది సాధ్యపడింది. విశేషం ఏంటంటే.. ఏదైనా బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి నేనిక్కడికి రాలేదు. మన దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి వచ్చాను. భారతీయ నటిగా దేశాన్ని సెలబ్రేట్ చేయడానికి వచ్చాను. – పూజా హెగ్డే భారతదేశం చాలా ఏళ్లుగా ప్రపంచ చలనచిత్ర పరిశ్రమకు ఎంతో చేస్తూ వస్తోంది. దేశం స్వాతంత్య్రం పొందిన 75వ సంవత్సరంలో భారతదేశంతో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ భాగస్వామి కావడం నిజంగా అద్భుతం. – తమన్నా ఇండియా శిఖర సమాన ప్రయాణం మొదలైంది. ఇది ప్రారంభమే... భారతదేశం ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేకుండా, కాన్స్ చలన చిత్రోత్సవమే భారతదేశానికి వచ్చే రోజు వస్తుంది. - దీపికా పదుకోన్ View this post on Instagram A post shared by Global Pageant Buzz (@globalpageantbuzz) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) చదవండి 👇 ఆది పినిశెట్టి పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ హీరోల డ్యాన్స్ సీరియల్ నటి వివాహం.. నెట్టింట వీడియో వైరల్ -
ఓటీటీలతో సినీ ఇండస్ట్రీకి ముప్పుపై దీపికా సమాధానం..
Cannes 2022: Deepika Padukone On OTT Platforms Risk To Cine Industry: ప్రతిష్టాత్మక కేన్స్ 75వ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె సందడి చేసింది. ఎనిమిది మంది జ్యూరీ సభ్యుల్లో ఆమె ఒక మెంబర్గా మే17న వ్యవహరించింది. సబ్యసాచి డిజైన్ చేసిన దుస్తులను ధరించిన దీపికా ఈ వేడుకలో ఆకట్టుకుంది. అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొంది. ఓటీటీ ప్లాట్ఫామ్లతో సినీ ఇండస్ట్రీకి ఏమైనా ముప్పు ఉందా అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది దీపికా పదుకొణే. 'రెండు రకాల ప్రేక్షకులు ఉంటారు. కొంతమంది థియేటర్లలో చూసేందుకు ఇష్టపడితే మరికొందరు ఇంట్లో కూర్చుని వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తారు. ఓటీటీల్లో చూసేవారు కూడా థియేటర్లకు వెళతారు. వారివల్ల థియేటర్స్ బతుకుతాయి. అలాగే కొన్ని కథలను ఓటీటీలోనే కొత్త ఫార్మాట్లలో చెప్పవచ్చు. మీరు డిజిటల్ ప్లాట్ఫామ్ కోసం సినిమాను తీస్తే కథను కొత్తగా చెప్పాలి. ఈ విధంగా కథలను చెప్పడం మంచిదనే నా అభిప్రాయం. అలా అని సినీ ఇండస్ట్రీకి నష్టం కానీ ముప్పు కానీ ఉంటుందని నేను అనుకోవట్లేదు. డిజిటల్ ప్లాట్ఫామ్స్ను అవకాశంగా మాత్రమే చూస్తాను. ఓటీటీల వల్ల దర్శకులు, నిర్మాతలు, రచయితలు, నటులకు అవకాశాలు పెరుగుతాయే తప్ప సినీ ఇండస్ట్రీకి ఎలాంటి ముప్పు ఉండదు.' అని దీపికా పదుకొణె పేర్కొంది. చదవండి: ఏడో తరగతిలో అలా చేయడం.. అదే తొలిసారి, చివరిసారి: దీపికా పదుకొణె var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నియంతలు అంతం కాక తప్పదు: కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు
Ukraine President Zelensky in Surprise Video At Cannes Film Festival: ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు ఫ్రాన్స్లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరిగే ఈ 75వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వర్చువల్గా ప్రారంభోపన్యాసం చేశారు. వీడియో లింక్ ద్వారా ప్రసంగించిన ఆయన తెరపై కనిపించగానే ఈ వేడుకలో పాల్గొన్న వారంత ఆయనకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా జెలెన్స్కి మాట్లాడుతూ.. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రేనియన్లకు సినీ ప్రపంచం అండగా నిలవాలని, సంఘీభావం తెలపాలని కోరారు. సినిమా-వాస్తవికత మధ్య ఉన్న సంబంధంపై సుదీర్ఘంగా మాట్లాడారు. చదవండి: అట్టహాసంగా కాన్స్ చిత్రోత్సవాలు ఆరంభం అనంతరం 1979లో వచ్చిన ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పాల సినిమా ‘అపోకలిప్స్ నౌ’, 1940లో వచ్చిన చార్లీచాప్లిన్ సినిమా ‘ది గ్రేట్ డిక్టేటర్’పై ఆయన ప్రస్తావించారు. ‘‘ది గ్రేట్ డిక్టేటర్’ సినిమాను ఉటంకిస్తూ.. మనుషుల మధ్య విద్వేషం నశించిపోతుంది. నియంతలు అంతమవుతారు. ప్రజల నుంచి లాక్కున్న అధికారం తిరిగి ప్రజల చేతుల్లోకి వస్తుంది’’ అని జెలెన్స్కీ నొక్కి చెప్పారు. మన కాలపు సినిమా నిశ్శబ్దంగా లేదని చాటిచెప్పే మరో కొత్త చార్లీ చాప్లిన్ కావాలని అన్నారు. వారి భవిష్యత్ సినిమాపైనే ఆధారపడి ఉందని చెప్పిన జెలెన్స్కీ.. నేడు సినిమా నిశ్శబ్దంగా లేదని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. చదవండి: ‘కంగనా చిత్రాలన్ని ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నా’ ప్రజల చేతుల్లోంచి లాక్కున్న అధికారం తిరిగి వారికే దక్కుతుందని స్పష్టం చేశారు. జెలెన్స్కీ ప్రసంగానికి ప్రతి ఒక్కరు లేచి నిలబడి చప్పట్లతో హర్షధ్వానాలు తెలిపారు. కాగా 12 రోజులపాటు జరగనున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో సెర్గీ లోజ్నిట్సా డాక్యుమెంటరీ ‘ది నేచురల్ హిస్టరీ ఆఫ్ డిస్ట్రక్షన్’ సహా ఉక్రెయిన్కు చెందిన పలు సినిమాలను ప్రదర్శిస్తారు. యుద్ధం కారణంగా ఈ ఏడాది ఏప్రిల్లో లిథువేనియన్ చిత్ర నిర్మాత మాంటాస్ క్వేదరవియస్ మృతి చెందారు. మరణానికి ముందు ఆయన చిత్రీకరించిన ఫుటేజీని ఆయన కాబోయే భార్య హన్నా బిలోబ్రోవా కేన్స్లో ప్రదర్శించనున్నారు. ఈ ఫెస్టివల్లో ఈసారి ఆరు భారతీయ చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఈ జాబితాలో ‘రాకెట్రీ ద నంబీ ఎఫెక్ట్’, ‘గోదావరి’, ‘దుయిన్’, ‘ఆల్ఫా బీటా గామా’, ‘బూంబా రైడ్’, ‘నిరయి తాతకుల్ల మారమ్’ చిత్రాలు ఉన్నాయి. భారత్కు గౌరవ సభ్య దేశం హోదా దక్కడంతో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని సెలబ్రిటీల టీమ్ ఈ వేడుకలకు హాజరయ్యారు. మాధవన్, రిక్కీ కేజ్, వాణీ త్రిపాఠి, ప్రసూన్ జోషి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శేఖర్ కపూర్.. ఫస్ట్ రోజు రెడ్ కార్పెట్పై ఫొటోలకు పోజులిచ్చారు. ఇక జ్యురీ సభ్యురాలిగా దీపికా పడుకోన్.. సభ్యసాచి చీరకట్టులో అదరహో అనిపించారు. నటి, ప్రముఖ మోడల్ ఊర్వశి రౌటెలా, మిల్కీ బ్యూటీ తమన్నా డిజైనర్ వేర్స్లో రెడ్కార్పొట్పై హొయలు పోయారు. And here is the video of today's performance by Zelenskyy at the Cannes Film Festival. “I am sure that the dictator will lose. We will win this war,” the President of Ukraine said. The audience gave a standing ovation 👏 pic.twitter.com/s5yiroFpOq — ТРУХА⚡️English (@TpyxaNews) May 17, 2022 -
కాన్స్ ఫిలిం ఫెస్టివల్ షురూ ...మెరిసిన తారలు, జెలెన్స్కీ స్పెషల్ ఎట్రాక్షన్
-
Cannes Film Festival: అట్టహాసంగా కాన్స్ చిత్రోత్సవాలు ఆరంభం (ఫొటోలు)
-
అట్టహాసంగా కాన్స్ చిత్రోత్సవాలు ఆరంభం
75వ కాన్స్ చలన చిత్రోత్సవాలు ఫ్రాన్స్ దేశంలోని కాన్స్ నగరంలో మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఈసారి వేడుకల్లో మన దేశం నుంచి ఏఆర్ రెహమాన్, శేఖర్ కపూర్, మాధవన్, నవాజుద్దిన్ సిద్ధిఖి, తమన్నా, నయనతార, పూజా హెగ్డే, ఊర్వశి రౌతేలా.. ఇలా పలువురు తారలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్తో కలిసి నటులు నవాజుద్దిన్, మాధవన్, దర్శకుడు– నటుడు శేఖర్ కపూర్, సంగీతదర్శకుడు రిక్కీ కేజ్, సీబీఎఫ్సి (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) చైర్ పర్సన్ ప్రసూన్ జోషి, సీబీఎఫ్సి సభ్యురాలు వాణీ త్రిపాఠి తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇక గతంలో తాను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొన్నారు దీపికా పదుకోన్. ఈసారి చిత్రోత్సవాల్లో ఆమె జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రిక్కీ కేజ్, వాణీ త్రిపాఠి, మాధవన్, ప్రసూన్ జోషి, అనురాగ్ ఠాగూర్, నవాజుద్దిన్ సిద్ధిఖి, శేఖర్ కపూర్ ఫ్రెంచ్ నటుడు విన్సెంట్ లిండన్ అధ్యక్షతన దీపికాతో పాటు ఎనిమిది మంది నటీనటులు, దర్శకులు ఈ జ్యూరీలో ఉంటారు. తొలి రోజు వేడుకల్లో పువ్వుల చొక్కా, లేత ఆకుపచ్చు రంగు ప్యాంటులో అప్పుడే విరిసిన మల్లెపువ్వులా అగుపించారు దీపికా పదుకోన్. వజ్రాలు పొదిగిన లక్నో రోజ్ డైమండ్ నెక్లెస్, చిన్ని చెవి దుద్దులతో చిరునవ్వులు చిందిస్తూ తళుకులీనారు. చిత్రోత్సవాల్లో భాగంగా జ్యూరీతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. మోడ్రన్ డ్రెస్, చీరలో మార్కులు కొట్టేశారు. ఈ నెల 28 వరకూ ఈ చిత్రోత్సవాలు జరుగుతాయి. -
కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో మన మూవీస్
-
కాన్స్ చిత్రోత్సవంలో మన తారలు
ప్రతిష్టాత్మక కాన్స్ చలన చిత్రోత్సవానికి రంగం సిద్ధమైంది. 75వ కాన్స్ చలన చిత్రోత్సవం ఈ నెల 17 నుంచి 28 వరకు జరగనుంది. ఈ వేడుకల తొలి రోజు భారతదేశం తరఫున అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, పూజా హెగ్డే రెడ్ కార్పెట్పై సందడి చేయనున్నారు. వీరితో పాటు శేఖర్ కపూర్, తమన్నా, నయన తార, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) చైర్మన్ ప్రసూన్ జోషి, సీబీఎఫ్సీ బోర్డు సభ్యురాలు వాణీ త్రిపాఠి తదితరులు కనిపిస్తారు. ఈ టీమ్కు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సారథ్యం వహిస్తారు. ఇక దీపికా పదుకోన్ ఈసారి కాన్స్ ఉత్సవాల్లో జ్యూరీ సభ్యురాలిగా పాల్గొననుండటం విశేషం. ఈ వేడుకల్లో ‘క్లాసిక్ సినిమా’ విభాగంలో సత్యజిత్ రే తీసిన ‘ప్రతిధ్వని’ స్క్రీనింగ్ అవుతుంది. అలాగే నటుడు మాధవన్ దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మే 19న ప్రదర్శితం కానుంది. భారత ఖగోళ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో నంబి నారాయణన్ పాత్రను మాధవన్ పోషించారు. అలాగే ఢిల్లీకి చెందిన షౌనక్ సేన్ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ స్పెషల్ స్క్రీనింగ్ విభాగంలో ప్రదర్శితం కానుంది. కమల్హాసన్ నటించిన ‘విక్రమ్’ ట్రైలర్ కూడా విడుదల కానుంది. -
దీపికాకు అరుదైన గౌరవం, జ్యూరీ మెంబర్గా మన హీరోయిన్!
దీపికా పదుకోన్కి అరుదైన గౌరవం దక్కింది. అందుకే ఆమె భర్త, హీరో రణ్వీర్ సింగ్ ‘వావ్’ అంటున్నారు. ఇక ఆమె అభిమానులైతే ‘మన దేశీ అమ్మాయి మనకు గర్వకారణంగా నిలిచింది’ అని ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఈ ప్రశంసలు ఎందుకంటే.. ప్రతిష్ఠాత్మక కాన్స్ చలన చిత్రోత్సవాల్లో దీపికా పదుకోన్ జ్యూరీ మెంబర్గా ఎంపికయ్యారు. ఫ్రెంచ్ నటుడు విన్సెంట్ లిండన్ అధ్యక్షతన దీపికాతో పాటు ఎనిమిది మంది నటీనటులు, దర్శకులు జ్యూరీలో ఉంటారు. ఈ 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలు మే 10 నుంచి 28 వరకు జరగనున్నాయి. మొత్తం 21 చిత్రాలు చూసి, ఒక చిత్రాన్ని అవార్డుకి ఎంపిక చేస్తారు. మే 28న అవార్డు ప్రదానం జరుగుతుంది. కాగా ఫ్రాన్స్ దేశంలోని కాన్స్ నగరంలో జరిగే ఈ చిత్రోత్సవాల్లో 2010 నుంచి దీపికా పాల్గొంటున్నారు. రెడ్ కార్పెట్పై వీలైనంత ఆకర్షణీయంగా కనిపించి, మార్కులు కొట్టేశారు. ఇప్పుడు జ్యూరీ సభ్యురాలి హోదాలో వెళ్లనున్నారు. కాన్స్లో ‘విక్రమ్’ ట్రైలర్ కమల్హాసన్, ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రధారులుగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విక్రమ్’. జూన్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ను కాన్స్ చిత్రోత్సవాల్లో విడుదల చేయనున్నారు. ఈ ఆవిష్కరణ వేడుకలో పాల్గొనడానికి కమల్, లోకేశ్ తదితరులు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి హాజరవుతారని తెలిసింది. చదవండి: చిచ్చు పెట్టిన హిందీ భాష, స్టార్ హీరోల మధ్య ట్వీట్ల వార్ స్క్రీన్షాట్లున్నాయి, అంత ఈజీగా వదిలిపెట్టను: లైవ్లో నటుడి వార్నింగ్ -
ఆమెది ఎవరూ చేయని సాహసం
ముంబైకి చెందిన పాయల్ కపాడియా.. ఈ పేరు అంతర్జాతీయ సినీ ప్రపంచంలో ఇప్పుడు మారుమోగుతోంది. 74వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఎ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’కిగానూ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు అందుకుంది ఈమె. తద్వారా ఓ‘యిల్ డె‘ఓర్(గోల్డెన్ ఐ) గెల్చుకున్న మూడో మహిళగా.. భారత్ తరపు నుంచి ఈ ఘనత అందుకున్న తొలి ఫిమేల్ ఫిల్మ్మేకర్ చరిత్ర సృష్టించింది. మొత్తం 28 డాక్యుమెంటరీలు ఈ ప్రతిష్టాత్మక కేటగిరీ కోసం పోటీపడగా.. ముంబైకి చెందిన పాయల్ కపాడియాను ప్రైజ్ వరిచింది. వెల్వెట్ అండర్గ్రౌండ్, ఆండ్రియా ఆర్నాల్డ్స్ కౌ, త్రో ది లుకింగ్ గ్లాస్ లాంటి టఫ్ డాక్యుమెంటరీలతో కపాడియా తీసిన ‘ఎ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ పోటీపడి నెగ్గింది. ఢిల్లీ డైరెక్టర్ రాహుల్ జైన్ తీసిన ‘ఇన్విజిబుల్ డెమన్స్’ కూడా ఈ కేటగిరీలో పోటీ పడింది. The Oeil d’Or, the award for best documentary presented at the Cannes Film Festival all sections combined, goes to A NIGHT OF KNOWING NOTHING by Payal Kapadia, a film selected at the Directors’ Fortnight. Our warmest congratulations to Payal Kapadia and the entire film crew! 🎉 pic.twitter.com/s0e5ZwyUze — Quinzaine des Réal. (@Quinzaine) July 17, 2021 శెభాష్ పాయల్ విద్యార్థుల నిరసన ప్రదర్శనల నేపథ్యంలో సాగే డాక్యుమెంటరీ ఇది. విడిపోయి దూరంగా ఉన్న తన లవర్కి ఓ యూనివర్సిటీ విద్యార్థి రాసే సీక్వెన్స్తో ‘ఎ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ కథ సాగుతుంది. కలలు, వాస్తవం, జ్నాపకాలు, స్మృతులు.. ఇలా అన్నీ ఎమోషన్స్ మేళవించి ఉన్నాయి ఇందులో. ఒక సున్నితమైన అంశం చుట్టూ తిరిగే ఈ కథను చాలా సాహసోపేతమైన ప్రయత్నంగా అభివర్ణించారు ఓయిల్ డెఓర్ జ్యూరీ హెడ్ ఎజ్రా ఎడెల్మన్. ఇదివరకు ఒకసారి ఎఫ్టీఐఐ స్టూడెంట్ అయిన కపాడియా.. వాట్ ఈజ్ సమ్మర్ సేయింగ్ డాక్యుమెంటరీ, లాస్ట్ మ్యాంగో బిఫోర్ ది మాన్సూన్ లాంటి షార్ట్ ఫిల్మ్స్ తీసింది కూడా. 2017లో ఆమె తీసిన ఆఫ్టర్నూన్ క్లౌడ్స్ షార్ట్ ఫిల్మ్ ‘సినీఫాండేషన్’ సెలక్షన్ కింద కేన్స్లో ప్రదర్శించారు కూడా. గోల్డెన్ ఐ కేటగిరీని ఆరేళ్ల క్రితం ప్రవేశపెట్టగా.. మూడుసార్లు మహిళలే గెల్చుకున్నారు. మహిళ దర్శకుల్లో అగ్నెస్ వార్దా (ఫేసెస్ ప్లేసెస్ 2017), సిరియన్ జర్నలిస్ట్ ఫిల్మ్ మేకర్ వాద్ అల్ కతీబ్(సోమా-2019)కి ఈ ప్రెస్టేజియస్ అవార్డు గెల్చుకున్నారు. ఇప్పుడు పాయల్ మూడో వ్యక్తి. అయితే భారత్కు చెందిన షెర్లీ అబ్రహం-అమిత్ మధేషియా తీసిన ‘ది సినిమా ట్రావెలర్స్’కు 2017లో గోల్డెన్ అవార్డు స్పెషల్ జ్యూరీ మెన్షన్ మాత్రం ఇచ్చారు. -
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వాయిదా
కోవిడ్ వల్ల గత ఏడాది పలు ప్రముఖ చిత్రోత్సవాలు వాయిదా పడ్డాయి. కొన్నింటిని వర్చువల్గా ఆన్లైన్లో నిర్వహించారు. గత ఏడాది 73వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగలేదు. ఈ ఏడాది ఫెస్టివల్ వాయిదా పడింది. 74వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ను ఈ ఏడాది మేలో నిర్వహించాలనుకున్నారు. మే 11 నుంచి 22 వరకూ ఈ వేడుక జరపాలనుకున్నారు. తాజాగా జూలై నెలకు వాయిదా వేశారు. జూలై 6 నుంచి 17 వరకూ ఈ చిత్రోత్సవాలు జరగనున్నాయి. కరోనా ప్రభావమే ఈ వాయిదాకి కారణం. కొత్త నిబంధనలు పాటిస్తూ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ను ఎలా నిర్వహించబోతున్నారో నిర్వాహకులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. -
‘ముద్దు సీన్ గురించి అమ్మతో చర్చించాకే..’
బాలీవుడ్ నటి హీనా ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 11 ఏళ్ల క్రితం ‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు హీనా ఖాన్. ఆ తర్వాత బిగ్బాస్ షోతో మరింత ప్రచారం పొందారు. ఇక ఆమె నటించిన తొలి చిత్రం కేన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. తాజాగా ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా సత్తా చాటారు హీనా ఖాన్. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో తన ప్రయాణం గురించి హ్యూమన్స్ బాంబేతో పంచుకున్నారు హీనా ఖాన్. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నేను సనాతన కాశ్మీరీ కుటుంబం నుంచి వచ్చాను, అక్కడ నటన అనే మాట నిషిద్ధం. కాలేజీ చదువుల నిమిత్తం నన్ను ఢిల్లీ పంపేందుకు నా తల్లిదండ్రులు సందేహించారు. కానీ నాన్నను ఒప్పించి ఢిల్లీ వచ్చాను. ఆ సమయంలో ఓ స్నేహితురాలు సీరియల్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. నువ్వు వెళ్లు అని చెప్పింది. నేను నో చెప్పాను. కానీ తను వదలలేదు. అలా తన బలవంతం మీద నేను ఆడిషన్కి వెళ్లాను. తర్వాతి రోజే నేను సెలక్ట్ అయినట్లు కాల్ వచ్చింది’ అన్నారు. ‘అలా 20 ఏళ్ల వయసులో ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్లాను. ఇల్లు వెతుక్కొవడంలో ప్రొడక్షన్ వాళ్లు నాకు ఎంతో సాయం చేశారు. ఇక నేను నటిస్తున్నాననే విషయం గురించి నాన్నతో చెప్పడానికి నాకు కొన్ని వారాలు పట్టింది. విషయం వినగానే ఆయన షాక్ అయ్యారు. అమ్మ స్నేహితులు, బంధువులు మా కుటుంబంతో బంధాలు తెంచుకున్నారు. కానీ నా సీరియల్ పాపులర్ అయ్యింది. కొన్నేళ్లపాటు టాప్లో కొనసాగింది. ఇక నాన్న కూడా అంగీకరించారు. కానీ చదువు కూడా కొనసాగించాలని కండిషన్ పెట్టారు. దాంతో బ్రేక్ టైంలో వెళ్లి పరీక్షలు రాసి వచ్చేదాన్ని. అమ్మవాళ్లు ముంబైకి మారారు’ అన్నారు. (చదవండి: ఇద్దరినీ ఇష్టపడి.. పెళ్లి చేసుకున్నా) బిగ్బాస్ ఎంట్రీతో మొత్తం మారిపోయింది ‘అలా ఎనిమిది సంవత్సరాల పాటు సీరియల్లో కొనసాగాను. ఇలా ఉండగానే 2017లో బిగ్బాస్ 11 ఆఫర్ వచ్చింది. అయితే సీరియల్స్లో నటించే సమయంలో నేను ‘షార్ట్స్ వేసుకోను.. అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించనని’ కండిషన్స్ పెట్టాను. కానీ బిగ్బాస్ ఆఫర్ వచ్చేనాటికి నా సొంత నియమాలు రూపొందించుకున్నాను. ఇక మా అమ్మ నాన్న పెళ్లి సంబంధాలు చూడ్డం ప్రారంభించారు. దాంతో నేను రాకీ గురించి వారికి చెప్పాను. ఇది విని కుటుంబంలో అందరు షాక్ అయ్యారు. కానీ చివరకు ఒప్పుకున్నారు. ఇప్పుడు మా అమ్మనాన్న నా కంటే ఎక్కువ తననే ప్రేమిస్తారు’ అని తెలిపారు. (చదవండి: పదేళ్లుగా డేటింగ్.. ఇప్పుడు బ్రేకప్) సినిమాల్లోకి వెళ్లే రిస్క్ చేశాను ‘ఇక టీవీ అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్న వేళ నేను ధైర్యం చేసి సినిమాల్లోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నాను. ఇక నా మొదటి చిత్రం గతేడాది జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఎంపికయ్యింది. ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. ఆ తర్వాత ఓటీటీలోకి ప్రవేశించాను. ఇక స్క్రిప్ట్లో భాగంగా ముద్దు సీన్లో నటించాల్సి వచ్చింది. దీని గురించి అమ్మనాన్నలకు చెప్పి.. వారు అర్థం చేసుకుని అంగీకరించిన తర్వతే ఆ సీన్కి ఎస్ చెప్పాను. ఆ చిత్రం ఇప్పుడు ఆన్లైన్లో అత్యధిక మంది చూసిన చిత్రాల జాబితాలో చేరింది. నేను మొట్టమొదట కెమెరాను ఎదుర్కొని 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. శ్రీనగర్లో పుట్టిన చిన్నారి కేన్స్ వరకు వెళ్లడం గురించి నిజంగా ఊహించలేదు. కానీ కష్టమైన ఎంపికల శ్రేణి నన్ను ఇక్కడ వరకు నడిపించింది. శ్రీనగర్ నుంచి ముంబై వరకు చేరిన నా ప్రయాణంలో నా కుటుంబంలో.. మొదటి నటి నుంచి వేరే సమాజానికి చెందిన వారితో డేటింగ్ చేయడం వరకు నా స్వంత మార్గాన్ని నేనే ఏర్పాటు చేసుకున్నాను అని గర్వంగా చెప్పగలను’ అన్నారు హీనా ఖాన్. -
ఫెస్టివల్ క్యాన్సిల్
ప్రఖ్యాత ఫిల్మ్ ఫెస్టివల్ కాన్స్ వాయిదా పడింది. ఈ ఏడాది కాన్స్ చిత్రోత్సవాలు కరోనా కారణంగా జరుగుతాయా? లేదా? అనుకుంటున్న సందర్భంలో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించబోవడం లేదని కాన్స్ నిర్వాహకులు ప్రకటించారు. ప్రతి ఏడాది ఫ్రాన్స్లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. కాన్స్లో గెలుపొందిన సినిమాల నుంచే ఆస్కార్ రేసు కూడా మొదలవుతోంది. ఈ ఏడాది మే 12 నుంచి 23 వరకు ఈ ఫెస్టివల్ను నిర్వహించాలని ముందు అనుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో జరగడంలేదని ఓ లేఖను విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కాన్స్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. జూన్ చివర్లోనో లేదా జూలై ప్రారంభంలోనో కాన్స్ ఫెస్టివల్ని నిర్వహించాలనుకుంటున్నాం’’ అని చిత్రోత్సవాల నిర్వాహకులు పేర్కొన్నారు. -
ప్రపంచ వ్యాప్తంగా 10 వేల మరణాలు
ప్యారిస్: కరోనా వైరస్ మహమ్మారి ధాటికి ప్రపంచం దాదాపు స్తంభించిపోతోంది. చైనాలో పుట్టి 150 దేశాలకుపైగా విస్తరించిన ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య పదివేలు దాటగాదాదాపు 2.44 లక్షల మందికి ఈ వైరస్ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే వైరస్ మొదలైన చైనాలోని వూహాన్ ప్రాంతంలో రెండో రోజూ కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అమెరికాలోనూ కోవిడ్ మృతుల సంఖ్య 200 దాటిపోయింది. స్పెయిన్లో వెయ్యికి చేరిన మృతుల సంఖ్య... యూరోపియన్ దేశం స్పెయిన్లో శుక్రవారం నాటికి కరోనా వైరస్ ధాటికి వెయ్యిమంది బలయ్యారు. మొత్తం 20 వేల మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు శ్రీలంక శుక్రవారం నుంచి దేశవ్యాప్త కర్ఫ్యూ విధించింది. కరోనా వైరస్తో ఇరాన్లో మృతుల సంఖ్య 1433కి చేరిందని, 20వేల మంది పాజిటివ్గా తేలారని అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాలో మొత్తం 274 మంది వ్యాధి బారిన పడ్డ విషయం తెలిసిందే. పాకిస్తాన్లో 452 మంది వ్యాధి బారిన పడగా ముగ్గురు మరణించారు. చైనాలో ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 3,248కి చేరుకుంది. ఏటా జరిగే అగ్రదేశాధినేతల సమావేశం జీ–7తోపాటు ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డాయి. ఇటలీలో ఒక్కరోజే 627 మంది మృతి రోమ్: ఇటలీలో కరోనా విలయం కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 627 మంది బలయ్యారు. దీంతో ఆ దేశంలో మొత్తం మరణాల సంఖ్య 4,032కి చేరింది. అలాగే, కేసుల సంఖ్య 47 వేలు దాటింది. భారత ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘సార్క్ కరోనా ఎమర్జెన్సీ ఫండ్’కు నేపాల్ సుమారు 10 లక్షల డాలర్ల(10 కోట్ల నేపాలీ రూపాయలు) విరాళం ప్రకటించింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలంటూ ప్రధాని మోదీ చేసిన ప్రతిపాదనకు పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ మద్దతు ప్రకటించారు. -
కాన్స్ ఫెస్టివల్ క్యాన్సిల్ ?
ప్రతీ ఏడాది వేసవిలో ఫ్రాన్స్ దేశం మరింత కళకళలాడుతుంది. దానికి కారణం కాన్స్ చలన చిత్రోత్సవాలు. ఈసారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 12 న మొదలు కావాలి. అయితే కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రోత్సవాలు జరుగుతాయో లేదోననే సందేహాలు ఏర్పడ్డాయి. ‘‘మార్చి నెలాఖరులోగా కరోనా తీవ్రత తగ్గుతుందనే ఆశతో ఉన్నాం. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఫెస్టివల్ను క్యాన్సిల్ చేసే చాన్స్ ఉంది’’ అన్నారు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రెసిడెంట్ పీర్రీ లీస్కూర్. -
కాన్స్లో మన క్వీన్స్
కాన్స్ ఫెస్టివల్ మళ్లీ తిరిగొచ్చింది. ఫ్రెంచ్ రివెరా నదీ తీరాన 72వ కాన్స్ చలన చిత్రోత్సవాలు మొదల య్యాయి. ప్రపంచవ్యాప్తంగా సినిమాలను సెలబ్రేట్ చేసుకునే పండగే కాన్స్. ఈ ఏడాది మే 14 నుంచి 25 వరకూ ఈ ఫెస్టివల్ జరుగుతుంది. సినిమాలతో పాటు కాన్స్ మెయిన్ అట్రాక్షన్ ఎర్ర తివాచీపై కనిపించే పొడుగు గౌన్లు. అందుకే దీన్ని పొడుగు గౌన్ల పండగ అని కూడా అనుకోవచ్చు. ‘ఐ కేన్’ అంటూ కాన్స్లో ప్రతీ హీరోయిన్ మీటర్ల కొద్దీ గౌన్లను ధరించడానికి రెడీ అవుతుంటారు. ఈ ఏడాది కాన్స్లో ఎర్ర తివాచీపై పొడవు గౌన్లతో దీపికా పదుకోన్, కంగనా రనౌత్, ఐశ్వర్యారాయ్, సోనమ్ కపూర్ కనిపించడానికి రెడీ అవుతున్నారు. తొలిసారి అందాల ప్రదర్శన చేయడానికి ప్రియాంకా చోప్రా, డయానా పెంటీ, హీనా ఖాన్ సిద్దమయ్యారు. వీరిలో దీపికా, కంగనా, ప్రియాంకలు కాన్స్ ఎర్రతివాచీపై హోయలొలికించారు. దీపికా, ప్రియాంక గౌనుల్లో దర్శనమిస్తే కంగనా మాత్రం కంచి పట్టు చీరలో కనువిందు చేశారు. -
కేన్స్-2019లో తారల సందడి
-
మల్టీ టాస్కింగ్ సోనమ్...!!
ముంబై : ప్రతీ ఒక్కరి జీవితంలో వివాహమనేది మధుర ఙ్ఞాపకం. వివాహం కొత్త బంధాలతో పాటు బాధ్యతలు కూడా తీసుకువస్తుంది. ఈ విషయంలో సెలబ్రిటీలైనా, సామాన్యులైనా సమానమే. అందుకు బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్... కాదు కాదు శ్రీమతి సోనమ్ కపూర్ అహుజా తాను కూడా మినహాయింపు కాదంటున్నారు. సోనమ్ కపూర్ ఈ నెల 8న వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన వెంటనే కేన్స్ ఫిలిం ఫెస్టివల్కు వెళ్లిన సోనమ్ అక్కడి నుంచి తిరిగి రాగానే.. ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. అంత బిజీ షెడ్యూల్లోనూ భార్యగా తన వంతు బాధ్యత నిర్వహిస్తున్నారు. వ్యాపారంతో నిత్యం బిజీగా ఉండే తన భర్త ఆనంద్ను రిసీవ్ చేసుకోవడానికి ఆమె ముంబై ఎయిర్పోర్ట్కు వెళ్లారు. భర్తను చూడగానే సంతోషంతో సోనమ్ ముఖం వెలిగిపోయింది. అంతే ఇక ఈ కొత్త జంటను కెమెరాల్లో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు పోటీ పడ్డారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను అలరిస్తున్నాయి. పెళ్లి, కెరీర్ ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడం కాస్త కష్టమైన విషయమే. కానీ అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికితే అదేమంత పెద్ద విషయం కాకపోవచ్చు. ఈ విషయంలో సోనమ్ అదృష్టవంతురాలే అనుకోవచ్చంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
కాన్ఫిడెన్స్ క్వీన్
కె ఫర్ కంగనా. కాదు కాదు కె ఫర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు బాలీవుడ్ జనాలు. కారణం కంగనా రనౌత్ కాన్ఫిడెన్సే. మేటర్ ఏంటంటే.. ఇటీవల కాన్స్ ఫెస్టివల్స్లో రెడ్ కార్పెట్పై ఫస్ట్ టైమ్ నడిచారు క్వీన్ కంగనా రనౌత్. కానీ కాన్స్ రెడ్ కార్పెట్ మీద కచ్చితంగా నడుస్తాను అని 22 ఏళ్ల వయసులోనే ఊహించారట ఆమె. ఈ విషయం గురించి కంగనా మాట్లాడుతూ – ‘‘22 ఏళ్ల వయసులో సొంతంగా డబ్బు సంపాదిస్తున్న టైమ్లో ఫ్రాన్స్ విజిట్ చేయాలనిపించింది. అక్కడ 10 డేస్ స్పెండ్ చేశాను. పెర్ఫ్యూమ్ తయారు చేసే ఫ్యాక్టరీల చుట్టూ తిరిగాను. ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నాను. ఆ తర్వాత రెడ్ కార్పెట్ చూడాలనిపించింది. ఆ ప్లేస్కు ఒక టూరిస్ట్గా వెళ్లాను. ఆ టైమ్లో ఎందుకో అనిపించింది ‘రెడ్ కార్పెట్ చూడవసరంలేదు, ఎలాగూ ఏదో రోజు ఆ కార్పెట్ మీద మనం నడుస్తాను’ అని. అలా అనుకున్న వెంటనే వెనక్కి వచ్చేశా’’ అని పేర్కొన్నారు కంగనా. ఇది జరిగిన జస్ట్ 9 ఏళ్లలోనే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్పై నడిచారీ క్వీన్. ఏదైనా విషయాన్ని కాన్ఫిడెంట్గా బిలీవ్ చేస్తే చాలు అయిపోతుంది అనడానికి ఇదో ఉదాహరణ. -
వివాదాస్పద సినిమా ఫస్ట్లుక్ పోస్టర్
ప్రముఖ అవార్డు గ్రహీత దర్శకుడు రహత్ కాజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లిహాఫ్’(మెత్తని బొంత) సినిమా తొలి పోస్టరు మాంటోలో జరుగుతున్న71వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విడుదలయ్యింది. కాన్స్లో విడుదల చేసిన ఈ పోస్టర్లో ఒక ఎర్రని బొంత మీద ఇద్దరు మహిళల పాదాలు ఉన్నాయి. వాటిలో ఒకరి పాదాలకు బాగా అలకంరించిన మువ్వలు ఉండగా, మరొకరి పాదాలకు సాదా మువ్వలున్నాయి. ప్రముఖ ఉర్డూ రచయిత ఇస్మై చుగ్తాయి రచించిన వివాదస్పద పుస్తకం ‘లిహాఫ్’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తనిష్తా ఛటర్జీ రచయిత ‘చుగ్తాయి’ పాత్రలో నటిస్తుండగా, సోనల్ సెహగల్ ‘బేగమ్ జాన్’ పాత్రలో నటిస్తున్నారు. భర్త నిరాదరణకు గురైన మహిళ మానసిక సరిస్థితి ఎలా ఉంటుంది, ఆ సమయంలో ఆమెను ఎలాంటి విషయాలు ఆకర్షిస్తాయనే ఇతివృత్తంతో తెరకెక్కుతుంది ఈ సినిమా. స్వలింగ సంపర్కం నేపథ్యంలో ‘చుగ్తాయి’ రచించిన ఈ కథ లక్నోలో ప్రారంభమవుతుంది. ఈ కథనంతా బేగమ్ జాన్ చిన్న మేనకోడలు వివరిస్తుంది. అక్కడ ఒంటరిగా ఉంటున్న బేగమ్ జాన్, తన పరిచారికతో ఎలాంటి సంబంధాన్ని పెట్టుకున్నది, దాని పర్యావసనాలు ఏమిటనే నేపథ్యంలో సాగుతుంది. తనకు, పరిచారికకు మధ్య ఉన్న సంబంధం గురించి మేనకోడలికి తెలియడంతో బేగమ్ జాన్ ఆమెను చంపేస్తుంది. చుగ్తాయి రాసిన ‘లిహాఫ్’, అలానే ఆమె స్నేహితుడు సాదత్ హసన్ మంటో రాసిన పుస్తకం ‘బూ’ రెండింటిల్లోను అశ్లీలత ఎక్కువగా ఉందనే ఆరోపణలు ఎదుర్కొన్నాయి. ఈ చిత్రానికి కజ్మీ, తారిక్ ఖాన్, ఉత్పల్ ఆచార్య నిర్మాతలుగా వ్వవహరిస్తుండగా, ఆస్కార్ అవార్డు గ్రహిత మార్క్ బషేట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
మన సినిమాలు అక్కడవరకూ వెళ్లాలి
‘‘కాన్స్ చలన చిత్రోత్సవాల్లో తెలుగు సినిమాల ప్రదర్శన లేకపోవడం బాధాకరం. ఈ విషయం గురించి తెలుగు ఇండస్ట్రీలో కొంతమందితో మాట్లాడాను. అయితే కాన్స్ ఉత్సవాల వరకూ ఎలా వెళ్లాలి? అనే విషయంలో తమకు సరైన అవగాహన లేదన్నట్లుగా వారు చెప్పారు. మన వైపు నుంచి ప్రయత్నం ఉంటే బాగుంటుందని ఐ అండ్ బీ మినిస్ట్రీ పేర్కొంది’’ అని అల్లు శిరీష్ అన్నారు. ఫ్రాన్స్లో జరుగుతోన్న కాన్స్ చలన చిత్రోత్సవాలకు శిరీష్ వెళ్లారు. ఈ సందర్భంగా తన అనుభవాల గురించి శిరీష్ మాట్లాడుతూ– ‘‘ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే చిత్రాలను చూసేందుకు, విభిన్న చిత్రాలను తీసే దర్శకులను కలిసి మూవీస్ గురించి డిస్కస్ చేసేందుకు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్లాను. మినిస్ట్రీ ఆఫ్ ఐ అండ్ బి (మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్) అండ్ ఎఫ్ఐసీసీఐ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) నిర్వహించిన కొన్ని సెమినార్స్లో పాల్గొని, ఆసక్తికర విషయాలను తెలుసుకున్నాను. టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాకుండా ఎంటర్టైన్మెంట్ ప్రపంచం ఎంత పెద్దగా ఉందో తెలిసింది. అంతేకాదు దేశంలో నార్త్ ఈస్ట్ నుంచి వచ్చే సినిమాలు, మరాఠీ సినిమాల గురించి ఎక్కువమందికి సరైన అవగాహన లేకపోవడం దురదృష్టకరం. కాన్స్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ మీద నడవడం ఆనందాన్నిచ్చింది’’ అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే... సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందనున్న ఓ చిత్రంలో శిరీష్ కీలక పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. -
‘ఆనంద్ అహుజా, ఇది మనకోసం’
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కొత్త పెళ్లి కూతురు సోనమ్ జిల్జిగేల్మనించారు. వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను పెళ్లాడిన వెంటనే కేన్స్ ఫెస్టివల్లో వాలిపోయిన ఈ అమ్మడు, కలర్ఫుల్ గౌన్లలో దర్శనమిస్తూ తొలి రోజు నుంచి చూపర్లకు మతి పోగొట్టారు. ఇక చివరి రోజు కేన్స్ ఫెస్టివల్లో ఈ అమ్మడుకు స్పెషల్ సర్ప్రైజే అందింది. సోనమ్ ఎండోర్సస్ చేసుకున్న కాస్మోటిక్ బ్రాండ్ స్పెషల్ కేక్ కటింగ్ వేడుకతో ఈ నటికి సర్ప్రైజ్ ఇచ్చింది. ఎల్ ఓరియల్ అనే కాస్పొటిక్ బ్రాండ్ తరుపున ప్రస్తుతం సోనమ్ కేన్స్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. పెళ్లి అయిన తర్వాత వెంటనే తమ సంస్థ తరుఫున ఫెస్టివల్లో పాల్గొనడంతో, సోనమ్ కపూర్ చేత పెళ్లి కానుకగా అతిపెద్ద కేక్ను కటింగ్ చేయించారు. ఈ కేక్ను లిప్స్టిక్లతో అలకరించారు. ఎల్ ఓరియల్ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ను సోనమ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన భర్త ఆనంద్ ఆహుజాకు ట్యాగ్ చేస్తూ...‘ఇది మనకోసం’ అని పోస్టు చేశారు. కేన్స్ ఫెస్టివల్ అనంతరం సోనమ్ త్వరలో థియేటర్లలోకి రాబోతున్న ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా ప్రమోషన్లో పాల్గొననున్నారు. సోనమ్తో పాటు ఈ సినిమాలో కరీనా కపూర్, స్వరా భాస్కర్, శిఖాలు ప్రధాన పాత్రల్లో నటించారు. భిన్న మనస్తత్వాలు కలిగిన నలుగురు యువతుల జీవితాల్లో చోటు చేసుకున్న సంఘటనలు, వారు ఎదుర్కొన్న పరిణామాల సమాహారమే ఈ సినిమా. జూన్ 1న ఈ సినిమా విడుదల కాబోతుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సోనమ్ పాల్గొనడం ఇది ఎనిమిదో సారి. -
ముద్దుల తనయకు తియ్యని ముద్దు
కాన్స్ చలన చిత్రోత్సవాలకు వెళ్లేటప్పుడు ముద్దుల తనయ ఆరాధ్యను తీసుకెళతారు ఐశ్వర్యా రాయ్. తల్లితో పాటు కూతురు కూడా అక్కడి ఉత్సవాలకు సెంటరాఫ్ ఎట్రాక్షన్. తల్లీకూతుళ్లను కెమెరాలో బంధించడానికి అక్కడి ఫొటో జర్నలిస్ట్లు చాలా ఉత్సాహం చూపిస్తారు. వాళ్ల కెమెరాకు కావల్సిన ‘క్లిక్’ దొరికింది. ముద్దుల కూతురుకు ఐష్ తియ్యని ముద్దు ఇస్తున్న వేళ పలు కెమెరాలు క్లిక్మన్నాయి. -
హీరోలూ... పారితోషికం తగ్గించుకోండి!
‘‘సినిమా బడ్జెట్ 10 మిలియన్ డాలర్లు అనుకుందాం. అందులో 9.7 శాతం హీరోలు పట్టుకుపోతుంటే ఇక మాకేం మిగులుతుంది’’ అంటున్నారు హాలీవుడ్ తార సల్మా హయక్. ఫ్రాన్స్ దేశంలో జరుగుతోన్న కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఆమె ఈ విధంగా పేర్కొన్నారు. స్త్రీ–పురుష సమానత్వం గురించి ఈ ఉత్సవాల్లో పలువురు ఇప్పటికే మాట్లాడారు. చిత్రసీమలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా మొదలైన ‘మీటూ’, ‘టైమ్ ఈజ్ అప్’ ఉద్యమానికి మద్దతు పలుకుతూ 82 మంది మహిళలు కాన్స్ సాక్షిగా నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదే వేదిక సాక్షిగా హీరో, హీరోయిన్ల పారితోషికం గురించి సల్మా హయక్ మాట్లాడారు. సినిమాకి పెడుతున్న బడ్జెట్లో దాదాపు 9 శాతానికి పైగా హీరోలు తీసేసుకుంటే.. ఇక హీరోయిన్లకు ఎంత దక్కుతుందన్నారామె. ఇంకా సల్మా హయక్ మాట్లాడుతూ – ‘‘హీరోలకు సమానంగా హీరోయిన్లకూ పారితోషికం దక్కాలి. అది జరగాలంటే హీరోయిన్లకు కూడా నిర్మాతలు ఎక్కువ పారితోషికం ఇస్తే సరిపోదు. హీరోలు తమ పారితోషికం తగ్గించుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా సమానం అవుతుంది’’ అన్నారు. అటు హీరోకీ ఇటు హీరోయిన్కీ ఎక్కువ పారితోషికం ఇస్తే.. ఇక నిర్మాతకు ఏం మిగులుతుంది? దానికి బదులు హీరోలే పారితోషికం తగ్గించుకుంటే బాగుంటుందన్నది సల్మా అభిప్రాయం. పాయింటే కదా. ఆ సంగతలా ఉంచితే... పలువురు నటీమణుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన నిర్మాత హార్వీ వెయిన్స్టీన్ తనను కూడా హెరాస్ చేశాడని అన్నారామె. సల్మా నటించి, నిర్మించిన చిత్రం ‘ఫ్రిడా’ (2002). ‘‘ఈ సినిమా అప్పుడు హార్వీ వెయిన్స్టీన్ ఇచ్చిన అడ్వాన్స్ని తిరస్కరిస్తే నా మోకాలి చిప్పలను పగలగొడతానని బెదిరించాడు. ఇలాంటివాళ్లను తరిమికొట్టాలి’’ అని సల్మా ఘాటుగా స్పందించారు. -
అమ్మాయిలు చూసేవారు కాదు: నటుడు
‘మోస్ట్ డిజైరబుల్ వ్యక్తిగా ఎన్నికయినందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ నా చిన్నప్పుడు చాలా లావుగా ఉండేవాడిని...అమ్మాయిలేవరు నన్ను చూసేవారు కాదు’ అంటున్నాడు ‘ఖిల్జీ’...అదేనండి రణ్వీర్ సింగ్. ఇంతకు విషయం ఏమిటంటే ఒక ప్రముఖ దినపత్రిక నిర్వహించిన ‘మోస్ట్ డిజైరబుల్ మెన్ 2018’ పోటిలో రణ్వీర్ సింగ్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా తనకు ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడుతూ ‘నేను చిన్నప్పుడు చాలా లావుగా ఉండేవాడిని, అమ్మాయిలు నన్ను చూసేవారు కాదు. అయినా అప్పుడు నేను కూడా నా లుక్స్ గురించి అంతగా పట్టించుకునేవాడిని కాను’ అన్నాడు ఈ ‘బాజీరావ్’. దీపికా పదుకోణ్ కొంటె మెసెజ్... మోస్ట్ డిజైరబుల్ మెన్గా తనను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ట్విటర్లో పోస్టు చేశాడు రణ్వీర్. దానికి దీపిక ‘యూ ఆర్ వెలకమ్’ అంటూ రీ ట్విట్ చేసింది. అసలు ఈ పోటి నిర్వహించినట్లు దీపకకు తెలుసో, లేదో తెలియదు కానీ ఈ క్రెడిట్ను మాత్రం తన ఖాతాలో వేసుకుందీ ‘మస్తానీ’. ‘పద్మావత్’ తర్వాత ఈ జంట ఇంతవరకు మళ్లీ ఏ చిత్రంలో కలిసి నటించలేదు మరోసారి కాన్స్ వేదికపై... ఈ నెల 10, 11 తేదీలలో జరగనున్న ‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో మరోసారి రెడ్కార్పెట్ మీద హొయలొలికించనుంది. దీపిక ఈ వేడుకలకు హజరవడం ఇది రెండోసారి. ఈ వేడుకల్లో దీపిక ‘లోరియల్ ’ఉత్పత్తులకు ప్రచారకర్తగా పాల్గొననుంది. -
కాన్స్ ఉత్సవాల్లో క్వీన్
ఐశ్వర్యా రాయ్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్, విద్యాబాలన్, సోనమ్ కపూర్, మల్లికా షెరావత్.. వంటి స్టార్ హీరోయిన్స్ కాన్స్ ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. అయితే.. బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ ఇప్పటి వరకూ కాన్స్ ఉత్సవాల్లో పాల్గొనలేదు. తొలిసారి ఆమెకు ఈ ఉత్సవాల్లో పాల్గొనే అరుదైన అవకాశం వచ్చింది. ప్రతి సంవత్సరం కాన్స్లో అంతర్జాతీయ సినిమా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకలో వివిధ దేశాల నుంచి పలువురు నటీనటులు పాల్గొని సందడి చేస్తుంటారు. ఇండియా తరఫున పైన పేర్కొన్న పలువురు బాలీవుడ్ కథానాయికలు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఏడాది మేలో జరగనున్న కాన్స్ ఉత్సవాల్లో రెడ్ కార్పెట్పై తళుకుబెళుకులు చూపించే అరుదైన అవకాశం కంగనాని వరించింది. 2018 కాన్స్ ఉత్సవాల్లో పాల్గొనాలంటూ ఆమెకు ఆహ్వానం అందింది. ఇండియన్ సినిమా బ్రాండ్ అంబాసిడర్గా, ఓ బ్రాండ్ ప్రమోటర్గా కంగన ఈ ఉత్సవాలకు హాజరు కానున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఆమె నటించిన తాజా చిత్రం ‘మణికర్ణిక’ విడుదలకు సిద్ధంగా ఉంది.