conflicts
-
ఈ ఏడాది.. పిల్లల పాలిట పెనుశాపమే!
పిల్లల పాలిట చరిత్రలో ఎన్నడూ లేనంతటి దారుణ సంవత్సరంగా నిలిచింది 2024. యుద్ధాలు, ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బాలలు భారీ సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఏకంగా 47.3 కోట్ల మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆరుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది కల్లోల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఒకప్పుడు పేదరికం, కరువు, వంటివాటితో అల్లాడే పిల్లలు ఇప్పుడు ఘర్షణల్లో సమిధలవుతున్నారు. చదువు మాట అటుంచి వారికి పోషకాహారమే గగనమైపోయింది! గాజా, సూడాన్, ఉక్రెయిన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలతో బాలలు విపరీతంగా సతమతమవుతున్నట్టు ఐరాస బాలల సంస్థ యునిసెఫ్ తాజాగా పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 15 నెలల్లో కనీసం 17,492 మంది బాలలు మరణించినట్లు తెలిపింది...! మునుపెన్నడూ లేనంతంగా ఎక్కువ మంది పిల్లలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. బలవంతంగా నిరాశ్రయులవుతున్నారు. ఘర్షణలో మరణిస్తున్న, గాయపడుతున్న పిల్లల సంఖ్య పెరిగింది. పాఠశాలలపై బాంబుల వర్షం కురుస్తోంది. ఇళ్లు ధ్వంసమయ్యాయి. కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. భద్రత మాట పక్కకు పెడితే.. ప్రాథమిక అవసరాలు తీర్చుకునే అవకాశమూ ఉండటం లేదు. వాళ్లు ఆడుకోవడం, నేర్చుకోవడం ఎప్పుడో మరిచారు. ఈ యుద్ధాలు పిల్లల హక్కులను హరిస్తున్నాయి. ఇక, ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్లు, పోషకాహారం విలాసంగా మారాయి. ‘‘ప్రపంచంలో అనియంత్రిత యుద్ధాలకు ఒక తరం పిల్లలు బలవుతున్నారు. యుద్ధ ప్రాంతాల్లోని పిల్లలు మనుగడ కోసం పోరాటమే చేస్తున్నారు. దానికి తమ బాల్యాన్ని పణంగా పెడుతున్నారు. సర్వహక్కులు కోల్పోతున్నారు. ఇది దారుణం’’ అని యునిసెఫ్ డైరెక్ట్ కేథరిన్ రస్సెల్ వాపోయారు. గణాంకాలు చెబుతున్న విషాదాలు.. యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో పిల్లలు 30 శాతం ఉన్నారు. వారిలో 47.3 కోట్ల మంది యుద్ధ ప్రభావింత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రతి ఆరుగురిలో ఒకరు సంఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్నారని అంతర్జాతీయ ఏజెన్సీ తెలిపింది. 1990లలో సుమారు 10 శాతం మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో ఉండగా ఇప్పుడది ఏకంగా రెట్టింపుకు, అంటే 19 శాతానికి పెరిగింది. ఈ యుద్ధాల కారణంగా 2023 చివరి నాటికి 4.7 కోట్ల మంది పిల్లలు నిర్వాసితులయ్యారు. 2024లో హై తీ, లెబనాన్, మయన్మార్, పాల స్తీనా, సూడాన్ నుంచి అత్యధికంగా శరణార్థులుగా వెళ్లారు. ప్రపంచ శరణార్థుల జనాభాలో సుమారు 40 శాతం బాలలే. ఆయా దేశాల్లో నిర్వాసితులయినవారిలో బాలలు 49 శాతమున్నారు. 2023 నుంచి ఇప్పటిదాకా 22,557 మంది పిల్లలపై రికార్డు స్థాయిలో 32,990కు పైగా తీవ్రమైన హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. ముఖ్యంగా బాలికల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంఘర్షణ ప్రాంతాల్లో అత్యాచారాలు, లైంగిక హింస పెచ్చరిల్లాయి. ప్రమాదకర స్థాయిలో యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో విద్యకు తీవ్ర అంతరాయం కలిగింది. సంఘర్షణ ప్రభావిత దేశాలలో 52 మిలియన్లకు పైగా పిల్లలు పాఠశాలకు దూరంగా ఉన్నారు. విద్యా మౌలిక సదుపాయాల విధ్వంసం, పాఠశాలల సమీపంలో అభద్రతా భావం వల్ల ఈ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ పిల్లల్లో పోషకాహార లోపం కూడా ప్రమాదకర స్థాయికి పెరిగింది. యుద్ధం పిల్లల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధాలు జరుగుతున్న దేశాల్లోని పిల్లల్లో 40శాతం మంది టీకాలు అందడం లేదు. వారి మానసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. హింస, విధ్వంసం, కుటుంబ సభ్యులను కోల్పోవడం వల్ల పిల్లల్లో నిరాశ పెరిగింది. పిల్లల్లో ఆగ్రహావేశాలు పెరిగాయి. విచారం, భయం వంటి వాటితో బాధపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఛీ.. ఇంట్లో రోజూ గొడవలే
ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. రెండు వేర్వేరు కుటుంబాల్లో, నేపథ్యాల్లో పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వారి మధ్య విభేదాలు సహజం. అయితే వాటిని ఎలా, ఎంత త్వరగా పరిష్కరించుకున్నానేదే వారి బంధంలోని సంతోషాన్ని నిర్ణయిస్తుంది. విభేదాలను పరిష్కరించుకోకుండా చిన్న చిన్న వాదనలను కూడా పెద్ద పెద్ద గొడవలుగా మార్చుకుంటే కుటుంబ జీవితాన్ని నరకంగా మారుతుంది. అలాంటి ఒక జంట గురించి ఈరోజు మాట్లాడుకుందాం.రవి (32) ప్రియ (30)లకు ఐదేళ్ల కిందట పెళ్లయింది. రవి ఐటీ కన్సల్టెంట్, ప్రియ హెచ్ ఆర్ మేనేజర్. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, ప్రేమ. తమ బిడ్డ కీర్తన అంటే ప్రాణం. ఇంటి పనులతో సహా బాధ్యతలను సమానంగా పంచుకుంటారు. వారాంతాల్లో సినిమాలు, షికార్లు. అప్పుడప్పుడూ విహారయాత్రలు. సుఖంగా సంతోషంగా జరుగుతున్న కాపురం.కానీ గత కొద్ది నెలలుగా మారి మధ్య తరచూ గొడవలవుతున్నాయి. గత నెల జరిగిన గొడవ ఇద్దరూ కొట్టుకునేవరకూ వెళ్లింది. ఆ తర్వాత తమ ప్రవర్తనకు ఇద్దరూ సిగ్గుపడ్డారు. ఎలాంటి విభేదాలున్నా చర్చించుకుని పరిష్కరించుకోవాలే తప్ప గొడవ పడకూడదని నిర్ణయించుకున్నారు. కానీ మళ్లీ పెద్ద గొడవలయ్యాయి. ఇక తమ వల్ల కాదనుకుని కౌన్సెలింగ్ కు వచ్చారు. ఇద్దరితో విడివిడిగా, కలివిడిగా మాట్లాడాను.చిన్న చిన్న అసమ్మతులు, ఇంటి పనులు, బిడ్డ సంరక్షణ లేదా ఆర్థిక విషయాలు అతి త్వరగా తీవ్రమైన గొడవలుగా మారుతున్నాయని చెప్పారు. ఆ తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసినా, మళ్లీ గొడవలు ఆపలేకపోతున్నామన్నారు. దీంతో ఎమోషనల్ గా దూరమవుతున్నామని, ఇంటిమసీ కోల్పోతున్నామని చెప్పారు. ఇలా జరగడం చాలా బాధగా ఉందన్నారు.ఆఫీసులో ప్రాజెక్ట్ వర్క్ వల్ల ఒత్తిడి పెరిగిందని, మళ్లీ ఇంటికి వచ్చి పనిచేయాలంటే కష్టంగా ఉందని రవి చెప్పాడు. తనకు కూడా ఆఫీసులో చాలా వర్క్ ఉంటోందని, ఇంటికి వచ్చాక పాపతో సరిపోతుందని, మళ్లీ ఇంటి పని చేయాలంటే తన వల్ల కావట్లేదని ప్రియ చెప్పింది. అయినప్పటికీ తాను చేస్తున్నా ఎలాంటి గుర్తింపు లేకపోగా, కూరలో ఉప్పు ఎక్కువైనా గొడవ పడుతున్నాడని చెప్పింది.ఇలాంటి విషయాలన్నీ కలిసి కుటుంబం కోసం ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారనే వాదనలుగా మారాయి. అవి వ్యక్తిగత దూషణలుగా మారాయి. పెళ్లికి ముందు జరిగిన విషయాలనుంచి, పెళ్లి రోజు జరిగిన గొడవల వరకూ తవ్విపోసుకున్నారు. ఒకరి తల్లిదండ్రులను మరొకరు విమర్శించారు. వాదనల తర్వాత రవి ఇంటినుంచి బయటకు వెళ్లిపోగా, ప్రియ ఒంటరిగా ఏడుస్తూ కూర్చుంటుంది.వాదనలు వర్సెస్ తగాదాలుమనం మొదట్లో చెప్పినట్లు ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. ఆరోగ్యకరమైన వాదనలు పరిష్కారానికి దారితీస్తే, తగాదాలు భావోద్వేగ గాయాలను మిగుల్చుతాయి. అందుకే వాదనలకు, తగాదాలకు మధ్య తేడా తెలుసుకోవడం అవసరం. 👉 ఒక సమస్యను చర్చించడం, భావాలు, పరిష్కారాలను చర్చించడం, ఆరోపణలు చేయకపోవడం ఆరోగ్యకరమైన వాదనల లక్షణం. ఉదాహరణకు, రవి ఇంటి పనుల కారణంగా ఒత్తిడిగా అనిపిస్తే, ప్రియ వ్యక్తిత్వంపై దాడి చేయకుండా తన అభిప్రాయం చెప్తాడు. ఆరోగ్యకరమైన వాదనలు 👉 విభేదాల సమయంలో కూడా భాగస్వామి పట్ల గౌరవం తొలగిపోదు. భాగస్వామి వాదన వినడం, అది భిన్నమైనదైనా అంగీకరిస్తారు. 👉 ఇద్దరూ ఎమోషనల్ గా ఉన్నప్పుడు అది మరింత దిగజారకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. 👉 విధ్వంసకరమైన తగాదాల్లో సమస్యను గాలికి వదిలి వ్యక్తిగతంగా విమర్శిస్తారు. రవి, ప్రియల మధ్య జరుగుతున్నది ఇదే. 👉 తగాదాల్లో తరచుగా గతం నుండి సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తారు. 👉 ఇద్దరూ గొంతు పెంచి అరచుకోవడం, ఒకరినొకరు అడ్డుకోవడం జరుగుతుంది. రవి తరచుగా వాదన మధ్యలో బయటకు వెళ్లిపోవడం ప్రియకు తనను పట్టించుకోవడం లేదనే అనుభూతిని కలిగించింది. కౌన్సెలింగ్ తో పరిష్కారం... రవి, ప్రియల సమస్య వాదనలు తగాదాలుగా మారడమే. అందుకే వారి మధ్య హెల్తీ కమ్యూనికేషన్ పెంపొందించేలా కౌన్సెలింగ్ సెషన్లు ప్లాన్ చేశాను. 👉 ఏ బంధంలోనైనా యాక్టివ్ లిజనింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కౌన్సెలింగ్ సమయంలో వారు ఒకరినొకరు అడ్డుకోవడం లేదా వ్యక్తిగత దాడులు చేయకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం నేర్చుకున్నారు.👉 ఉద్రిక్తత పెరిగినప్పుడు ఒక చిన్న విరామం తీసుకోవడానికి అంగీకరించారు. దీనివల్ల భావోద్వేగ నష్టం తగ్గుతుంది. వారి వాదనలు నిర్మాణాత్మకంగా మారాయి.👉 వాదనల్లో ఒకే సమస్యపై కేంద్రీకరించాలని, అనవసర విషయాలు తీసుకురాకూడదని తీర్మానించుకున్నారు. 👉 ఒకరి లవ్ లాంగ్వేజ్ ను మరొకరు అర్థం చేసుకున్నారు. తగాదా సమయంలో కూడా పరస్పర గౌరవంతో, ప్రేమతో వ్యవహరించడం నేర్చుకున్నారు. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.com -
కలిసుంటే కలదు సుఖం
పదేళ్లు కలిసి కాపురం చేసిన ఫతేనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని నివాసం ఉండే శ్రీలత (పేరు మార్చాం), మురళి(పేరు మార్చాం) దంపతులు ఇటీవల కాపురంలో కలహాలు పెరగడంతో విడాకుల కోసం పోలీసులను ఆశ్రయించారు. ముగ్గుaరు పిల్లల తర్వాత భర్త మద్యానికి బానిసై, మానసికంగా శారీరకంగా హింసిస్తుండడంతో శ్రీలత భర్త నుంచి విడాకులు తీసుకోవాలని ధృడంగా నిశ్చయించుకుంది.దంపతులిద్దరికీ జీడిమెట్లలోని సీడీఈడబ్ల్యూ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్) సెంటర్లో అధికారులు కౌన్సిలింగ్ చేశారు. పలు దఫాల్లో సర్థిచెప్పిన తర్వాత వారి మధ్య సయోధ్య కుదిరింది. మురళిలోనూ మార్పు వచ్చింది. వారిప్పుడు సంతోషంగా కలిసి ఉంటున్నారు. లక్డీకపూల్లోని నీలోఫర్ ఆసుపత్రి సమీపంలో నివాసం ఉండే 43 ఏళ్ల ముంతాజ్ బేగం (పేరు మార్చాం) 2013 వరకు సెక్యూరిటీ గార్డుగా పనిచేసి ఉద్యోగం మానేశారు. 63 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్ ఖలీల్ (పేరు మార్చాం)ను రెండో వివాహం చేసుకున్నారు. లాక్డౌన్ ముందు వరకు ముంతాజ్ను బాగానే చూసుకున్న ఖలీల్ ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఆమెను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టడం మొద లు పెట్టాడు. తన బతుకుతెరువుకు సైతం డబ్బు ఇవ్వకపోవడంతో బషీర్బాగ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నాంపల్లి సీడీఈడబ్ల్యూ సెంటర్లో దంపతులకు కౌన్సిలింగ్ చేయడంతో ఖలీల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఉంటున్నారు. కొద్దిపాటి మనస్పర్థలు కాపురాలు కూల్చేస్తున్నాయి. ఇక మద్యం మహమ్మారి దంపతుల మధ్య గొడవలకు మరింత ఆజ్యం పోస్తోంది. దంపతుల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం సన్నగిల్లడంతో అనుమానం పెనుభూతమవుతోంది. దీంతో వివాహబంధాన్ని తెంచుకోవాలన్న కఠిన నిర్ణయానికి వస్తున్నారు. విడాకుల కోసం కోర్టు మెట్లు తొక్కుతూ ఏళ్లపాటు వ్యక్తిగత జీవితాలు బలిపెట్టుకుంటున్నారు కొందరు. ఈ నేపథ్యంలో బలమైన కారణం లేకుండానే వివాహ బంధాలను బలి చేసుకోకుండా, కొద్దిపాటి సర్దుబాట్లతో కాపురం తిరిగి కాపురాలు నిలబడేలా తెలంగాణ పోలీసులు ప్రయvస్తున్నారు. కుటుంబ కలహాలతో పోలీస్ స్టేషన్కు వచ్చే జంటలకు ప్రాథమికంగా కౌన్సెలింగ్ ఇచ్చేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీస్శాఖలోని మహిళా భద్రత విభాగం అధికారులు సీడీఈడబ్ల్యూ సెంటర్లు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కలిపి మొత్తం 27 కౌన్సిలింగ్ సెంటర్లను నెలకొల్పారు. 2023 ఫిబ్రవరి నుంచి ఈ సెంటర్లు పనిచేస్తున్నాయి. వీటిల్లో గృహహింస కేసుల్లో బాధిత మహిళలు, వారి భర్తలు, అవసరం మేరకు ఇతర కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తున్నారు. ఇలా పోలీసులను ఆశ్రయించిన జంటల్లో 42 శాతం మందిని తిరిగి కలిపినట్టు మహిళా భద్రత విభాగం ఉన్నతాధికారులు తెలిపారు. మరో 29 శాతం మంది మాత్రం విడాకులు తీసుకునేందుకే నిశ్చయించుకున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి 27 కౌన్సిలింగ్ సెంటర్ల పరిధిలో ఏప్రిల్ 26 నాటికి మొత్తం 7,474 ఫిర్యాదులు నమోదైనట్టు వారు వెల్లడించారు. మొత్తం అందిన ఫిర్యాదుల్లో 853 మంది బాధితుల్లో ఆత్మహత్యలు చేసుకునే మానసిక స్థితి ఉండడంతో వారిని మానసిక నిపుణులైన కౌన్సిలర్ల వద్దకు పంపి వారిలో తిరిగి స్థైర్యాన్ని నింపేలా కౌన్సిలింగ్ ఇప్పించినట్టు అధికారులు తెలిపారు. మొత్తం అందిన 7,474 ఫిర్యాదుల్లో 6,600 కేసులలో పరిష్కారం లభించినట్టు తెలిపారు.ఏమిటీ సీడీఈడబ్ల్యూ సెంటర్లుగృహ హింస కేసుల్లో దంపతులు విడాకులు తీసుకోకుండా, సమస్యను గుర్తించి.. వారికి అర్థమయ్యేలా సర్దుబాటు చేసి తిరిగి కలిపేందుకు తెలంగాణ పోలీస్శాఖ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో సేఫ్ సిటీ ప్రాజెక్టు నిధులతో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక మహిళా కౌన్సెలర్, మహిళా సిబ్బంది ఉంటారు. వీరు గృహహింసకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లకు వచ్చే జంటలకు, అవసరం మేరకు వారి కుటుంబ సభ్యులకు పలు దశల్లో కౌన్సిలింగ్ నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. - సాక్షి, హైదరాబాద్ -
బ్యాంకుల ఎస్ఎఫ్టీ నివేదికల్లో వైరుధ్యాలు
న్యూఢిల్లీ: అధిక విలువ కలిగిన లావాదేవీలకు సంబంధించి కొన్ని బ్యాంకులు సమరి్పంచిన ‘స్టేట్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ (ఎస్ఎఫ్టీ)’ విషయంలో వైరుధ్యాలు ఉన్నట్టు ఆదాయన్ను శాఖ గుర్తించింది. ఆదాయపన్ను శాఖ నిర్ధేశించిన లావాదేవీల వివరాలను ఎస్ఎఫ్టీ కింద ఏటా బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్, వివిధ సంస్థలు ఆదాయపన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్ఎఫ్టీని మే 31 నాటికి దాఖలు చేయాలి. ఫారెక్స్ డీలర్లు, బ్యాంక్లు, సబ్ రిజి్రస్టార్, ఎన్బీఎఫ్సీ, పోస్టాఫీసులు, బాండ్లు/డిబెంచర్లు జారీ చేసిన సంస్థలు, మ్యూచువల్ ఫండ్ ట్రస్టీలు, షేర్ల బైబ్యాక్ చేసిన కంపెనీలు, డివిడెండ్ చెల్లించిన కంపెనీలు ఎస్ఎఫ్టీ పరిధిలోకి వస్తాయి. తమిళనాడుకు చెందిన ప్రముఖ బ్యాంక్ నివేదించిన ఎఫ్ఎఫ్టీలో వ్యత్యాసాలను గుర్తించినట్టు ఆదాయపన్ను శాఖ అత్యున్నత విభాగం సీబీడీటీ ప్రకటించింది. కొన్ని లావాదేవీలను అసలుకే వెల్లడించకపోగా, కొన్ని లావాదేవీల సమాచారం కచి్చతంగా పేర్కొనలేదని వెల్లడించింది. ఉత్తరాఖండ్లో రెండు కోపరేటివ్ బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహించగా, వేలాది కోట్ల రూపాయల లావాదేవీలను రిపోర్ట్ చేయాలేదని బయటపడినట్టు తెలిపింది. వివిధ సంస్థలు ఎస్ఎఫ్టీ ద్వారా ఆదాయపన్ను శాఖకు వివరాలు తెలియజేస్తే.. ఆయా సమాచారాన్ని పన్ను చెల్లింపుదారుల వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో చేరుస్తారు. దీంతో పన్ను చెల్లింపుదారులు తమ ఏఐఎస్ను పరిశీలించుకుని రిటర్నులు దాఖలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎస్ఎఫ్టీల్లో వ్యత్యాసాలు గుర్తించినట్టు ప్రకటించిన సీబీడీటీ, తీసుకున్న చర్యలపై సమాచారం తెలియజేయలేదు. -
విచిత్ర ఘటన: ఓ వృద్ధుడు బతికుండగానే.. తన అంత్యక్రియలు తానే..
బతికుండగానే ఓ వ్యక్తి తన అంత్యక్రియలు తానే నిర్వహించుకున్నాడు. తాను చనిపోయినప్పుడూ ఇక్కడే చివరి కార్యక్రమాలు చేయాలని అభ్యర్థించాడు. తద్దినం దగ్గర నుంచి దశదిన కర్మల వరకు అన్ని తానే నిర్వహించుకున్నాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. అతను ఎందుకిలా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడంటే.. అసలేం జరిగందంటే..యూపీలోని కేవాన్ గ్రామానికి చెందిన జటా శంకర్కి తన కుటుంబంతో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. తాను చనిపోతే అంత్యక్రియలు చేస్తారో లేదో అన్న భయంతో అన్ని కార్యక్రమాలను తాను బతికుండగానే తానే చేసుకున్నాడు. అందుకోసం తన భార్యతో దెబ్బలాడి మరీ ఒప్పించాడు. జూన్15 తాను చనిపోయిన 13వ రోజుగా తీర్మానించి తనకు తానుగా పిండం పెట్టుకున్నాడు. ఆ తర్వాత గ్రామస్తులకు గ్రాండ్గా విందు కూడా ఏర్పాటు చేశాడు. అంతేగాదు శంకర్ తన సమాధి కోసం ఓ కాంక్రీట్ ఫ్లాట్ఫాంని కూడా నిర్మించాడు. తన అంత్యక్రియలు అక్కడే జరగాలని శంకర్ తమతో చెబుతుండేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. తరుచుగా తన కుటుంబంతో తగాదాలు జరగడంతో విరక్తి చెంది ఇంతటి దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు పలువురు చెబుతున్నారు. ఈ విషయం గ్రామంలో దావానంలా వ్యాపించడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. (చదవండి: కెఫిన్ లేని కాఫీ గింజలు..హాయిగా సిప్ చేయొచ్చు) -
ఇందుకే టీడీపీ అధికారంలోకి రానిది
-
గవర్నర్ల సొంత ఎజెండా!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును వివరిస్తూ పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పార్టీ ఎంపీలకు సూచించారు. ఆయా రాష్ట్రాల్లో వారి వ్యవహారం ఆందోళనకరంగా ఉందన్నారు. తెలంగాణతో పాటు కేరళ, తమిళనాడు, కేరళ, ఢిల్లీ మొదలైన చోట్ల గవర్నర్లు సొంత ఎజెండాతో పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ప్రగతిభవన్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో గవర్నర్ల జోక్యాన్ని నిరోధించడంపై దేశంలోని విపక్ష పారీ్టల నేతలతో కలిసి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, దుర్మార్గమైన తీరును దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని బహిష్కరించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం వివిధ రాష్ట్రాల విపక్ష పారీ్టలను కూడా కలుపుకొని పోవాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఈ మేరకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన విపక్ష నేతలతో మాట్లాడుతున్నట్లుగా కేసీఆర్ తెలిపారని పార్టీవర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, స్టాలిన్, విజయన్లతో పాటు విపక్ష నేతలు అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్ తదితరులతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిపాయి. విపక్ష పార్టీల సహకారంతో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని ముఖ్యమంత్రి సూచించినట్లు వివరించాయి. ఇలావుండగా కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్యపూరిత, ప్రమాదకర విధానాల వల్ల దేశ భవిష్యత్తుకు జరుగుతున్న తీరని నష్టాన్ని ఎంపీలకు కేసీఆర్ వివరించారు. పార్లమెంటు జరిగినన్ని రోజులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రజా సమస్యలపై గళం వినిపిస్తూ, కేంద్రం చేస్తున్న తప్పులను దేశం దృష్టికి తీసుకురావాలని సూచించారు. గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్పూర్తికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రగతిలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా అనేక రకాలుగా ఆటంకాలు సృష్టిస్తోంది. గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రాలను నిర్వీర్యపరిచే దిశగా గవర్నర్లను కేంద్రం తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవడం అప్రజాస్వామికం. రాజ్యాంగబద్ధమైన విధులను నిర్వర్తిస్తూ కేంద్రం, రాష్ట్రాల నడుమ సంధానకర్తలుగా ఉండాల్సిన గవర్నర్ల వ్యవస్థను తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న దుర్మార్గ విధానాలను బీఆర్ఎస్ ఎంపీలు ఉభయ సభల్లో తీవ్రంగా వ్యతిరేకించాలి. రాష్ట్ర కేబినెట్ సహా, అత్యున్నత సభలైన శాసనసభ, శాసనమండలి తీసుకున్న నిర్ణయాలను సైతం బేఖాతరు చేస్తూ గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా పెండింగులో పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ప్రభావితం చేయాలని, అభివృద్ధిని, పాలనను అడ్డుకోవాలని చూస్తున్న గవర్నర్ల అప్రజాస్వామిక విధానాలను, కేంద్రం వైఖరిని ఎండగట్టాలి..’ అని కేసీఆర్ ఆదేశించారు. అభివృద్ధికి ఆటంకాలుగా కేంద్రం విధానాలు ‘కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశ సమగ్రతకు, అభివృద్ధికి ఆటంకాలుగా మారాయి. దేశ ప్రజలు కష్టార్జితంతో కూడబెట్టుకుంటున్న సంపదనంతా అప్పనంగా తమ కార్పొరేట్ స్నేహితులకు కట్టబెడుతున్నారు. తమకు అనుకూల కార్పొరేట్ శక్తులపై ప్రేమ కురిపిస్తూ లక్షల కోట్ల రూపాయల రుణాలను కేంద్రం రద్దు చేస్తోంది. ఎల్ఐసీ వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో అదానీ వంటి బడా వ్యాపారవేత్తలకు వాటాలను అప్పనంగా కట్టబెట్టడంతో వారి కంపెనీల డొల్లతనం బయటపడుతూ షేర్ల విలువ హఠాత్తుగా పడిపోయింది. ఒక్క రోజులోనే రూ.లక్షల కోట్లు నష్టపోతున్న వాస్తవాన్ని దేశం గమనిస్తోంది. వారి లాభాలు, సంపద అంతా నీటి బుడగేనని స్పష్టమవుతోంది. ఇలాంటి ఆర్థిక అవకతవకలకు దోహదం చేసే విధంగా దేశ సంపదనంతా ప్రైవేట్ పరం చేస్తూ, కేంద్రం తీరని నష్టం చేస్తోంది. లాభాలను ప్రైవేట్ పరం చేస్తూ నష్టాలను దేశ ప్రజల మీద రుద్దుతోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రమాదకర ఆర్ధిక విధానాలపై పార్లమెంటు ఉభయ సభల్లో గొంతెత్తాలి. దేశ ప్రజల ప్రయోజనాలకు తూట్లు పొడుస్తున్న తీరును బీఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా ఖండించాలి. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ తదితర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యుడి బతుకు రోజురోజుకూ భారమైపోతున్నా కేంద్రానికి ఏమాత్రం పట్టింపులేదు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను పార్లమెంటు వేదికగా దేశ ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేయాలి. రాష్ట్ర విభజన హామీలపై కూడా నిలదీయాలి. కేంద్ర ప్రభుత్వం మీద పోరాటానికి కలిసివచ్చే దేశంలోని ప్రతి పార్టీ ఎంపీని కలుపుకొని పోవాలి. ఆయా అంశాలపై ఉభయ సభల్లో నిలదీయాలి..’ అని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు (రాజ్యసభ), నామా నాగేశ్వర్రావు (లోక్సభ), ఎంపీలు జోగినపల్లి సంతోష్కుమార్, కేఆర్ సురేష్రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి, దీవకొండ దామోదర్రావు, కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్రెడ్డి, మాలోత్ కవితా నాయక్, పసునూరి దయాకర్, బొర్లకుంట వెంకటేశ్, పోతుగంటి రాములు పాల్గొన్నారు. -
ఖతార్ నుంచి హతమార్చేందుకు ప్లాన్.. చంపేందుకు వెళ్తూ..
గుంటూరు రూరల్: వాళ్లిద్దరూ చిన్నప్పటి నుంచీ ప్రాణ స్నేహితులు. బాగా చదువుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆ తరువాత ఇద్దరిమధ్యా తలెత్తిన ఆర్థిక లావాదేవీలు దూరం పెంచాయి. చివరకు కిరాయి హంతకుల సాయంతో మిత్రుడునే హత్య చేయించే స్థాయికి పురిగొల్పాయి. చివరకు పన్నాగం బెడిసికొట్టడంతో నిందితులు పోలీసులకు చిక్కారు. గుంటూరు జిల్లా నల్లపాడు సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు మండలం ఏటీ అగ్రహారానికి చెందిన ప్రశాంత్, అవినాష్రెడ్డి చిన్ననాటి నుంచి స్నేహితులు. చదవండి: ఒకే మహిళతో ఇద్దరు వివాహేతర సంబంధం.. మర్మాంగాలను కోసి.. ప్రశాంత్ ఖతార్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుండగా.. అవినాష్రెడ్డి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగంలోనే స్థిరపడ్డారు. కాగా, అవినాష్రెడ్డికి ప్రశాంత్ తన సొంత ఖర్చుతో పెళ్లి చేశాడు. అనంతరం ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదాలు ఏర్పడ్డాయి. అవినాష్రెడ్డి వైఖరిపై విసుగు చెందిన ప్రశాంత్ అతడిని అంతం చేయాలని పథకం పన్నాడు. తాను ఖతార్లో నుంచి గుంటూరు సుందరయ్య కాలనీకి చెందిన నామాల చందు, దేవళ్ల సూర్య, రాచకొండ గోపీకృష్ణ, వెంగలశెట్టి దుర్గాప్రసాద్, షేక్ కరీముల్లా, షేక్ బాజీ, పూసల బాలాజీ, కమతం కృష్ణను సంప్రదించాడు. అవినాష్రెడ్డిని హతమార్చాలని, ఇందుకోసం ఎంత ఖర్చయినా భరిస్తానని చెప్పాడు. సుమారు రూ.30 లక్షల వరకు సుపారీ చెల్లించాడు. చంపేందుకు వెళ్తూ దొరికిపోయారు సుపారీ తీసుకున్న 8 మంది ఇటీవల విజయవాడలో కత్తులు కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. కాగా, నిందితులకు స్థానికంగా కొందరితో వివాదాలు ఉండటంతో.. హైదరాబాద్లో హత్య చేసి తిరిగొచ్చాక ఇక్కడి వారి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. అనంతరం శుక్రవారం రాత్రి వారంతా కారులో హైదరాబాద్ బయలుదేరగా.. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులు పేరేచర్ల వద్ద 8 మందినీ అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కత్తులు, ఇతర మారణాయుధాలు, కారును స్వాధీనం చేసుకున్నారు. స్నేహితుడి హత్యకు పథకం వేసిన ప్రశాంత్ను ఖతార్ నుంచి స్వగ్రామానికి రప్పించేందుకు చర్యలు చేపట్టారు. -
ఇరాక్లో ఉద్రిక్తతలు.. 3 రోజులుగా పార్లమెంట్లోనే నిరసనకారులు
బాగ్దాద్: ఇరాక్లో ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇరాన్ అనుకూల పార్టీలు, షియా గురువు ముఖ్తదా అల్–సదర్ వర్గాల మధ్య రాజధాని బాగ్దాద్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. అల్–సదర్ అనుచరులు మూడు రోజులుగా పార్లమెంట్లో బైఠాయించారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటవలేదు. ఇరాన్ అండతో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. షియా గురువు అల్–సదర్ అనుచర వర్గం ఆ ప్రయత్నాలను అడ్డుకుంటోంది. ఇరాన్ అనుకూల శక్తుల వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం బాగ్దాద్లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. సంక్షోభం మరింత ముదిరేలా కనిపిస్తోంది. -
ఔను.. వారిద్దరు మళ్లీ కలిశారు..
ఔను.. వారిద్దరు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఏకమయ్యారు. వీరి పదేళ్ల దాంపత్య జీవితంలో ఇద్దరు కూతుర్లు జన్మించారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య అనుమానాలు తలెత్తాయి. దీంతో భార్యకు సంబంధించిన తప్పులు భర్త, భర్తకు సంబంధించిన తప్పులతో భార్య స్థానిక మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇక ఇద్దరం కలిసి ఉండలేమని నిర్ణయం తీసుకొని విడాకులు కావాలనుకున్నారు. పోలీస్ సిబ్బంది ఇరువురి కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో మూడు దఫాలుగా వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం తిరిగి వారి తప్పులను తెలుసుకున్నారు. దీంతో వారు మళ్లీ కలిశారు. ఇలా జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి మే 15 వరకు 197 ఫిర్యాదులు రాగా అందులో 144 కేసులను కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించారు. సాక్షి, మంచిర్యాలక్రైం: సర్దుకుపోతే సంస్కారం ఒక స్వర్గసీమ. కానీ ప్రస్తుతం పలువురు దంపతులు చిన్నచిన్న సమస్యలనే పెద్దగా చూస్తూ గొడవలు పడుతున్నారు. అనంతరం పెద్దల సమక్షంలో పంచాయితీలు, ఆ తరువాత పోలీస్స్టేషన్ల వరకు చేరి విడిపోతున్నారు. పచ్చటి సంస్కారాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. వారికి పుట్టిన సంతానానికి తల్లిదండ్రుల ప్రేమను దూరం చేస్తూ వారిలో మానసిక ఆందోళనకు కారణమవుతున్నారు. ఇలాంటి సంఘటనలకు కారణాలు ఏమైనా ఉమ్మడి కుటుంబంలో సర్ధిచెప్పేవారు ఉండేవారు. కానీ ప్రస్తుతం చిన్న చిన్న కుటుంబాల్లో చెప్పేవారు లేక భార్యాభర్తలు చిన్నచిన్న గొడవలకే పోలీస్స్టేషన్ వరకు వెళ్లి పచ్చని సంసారాన్ని విచ్ఛినం చేసుకుంటున్నారు. కౌన్సెలింగ్తో ఏకమవుతున్నారు... క్షణికావేశంతో చిన్నచిన్న సమస్యలకే దంపతులు సమన్వయం కోల్పోతున్నారు. ఉమ్మడి కుటుంబాలు ఉంటే పెద్దలు ఇద్దరిని సమన్వయం చేసేవారు. దీంతో కుటుంబంలో తగాదాలు రోడ్డున పడేవి కాదు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబం అనే ఊసే లేదు. కొందరు ఉద్యోగ రీత్యా, మరికొందరు వ్యాపారం ని మి త్తం, ఇంకొందరు అత్తమామ, కుటుంబ సభ్యులతో పడకపోవడం, కారణం ఏదైనా ఉమ్మడి కుటుంబా లు కానరావడం లేదు. ఈ నేపథ్యంలో కుటుంబా ల్లో చిన్నచిన్న సమస్యలు తలెత్తినప్పుడు ఇద్దరికి చె ప్పె వారు లేక కుటుంబాలు పోలీస్స్టేషన్ వరకు వస్తున్నాయి. ఎందుకీ పరిస్థితి... గతంలో పెళ్లైన కొంతకాలం పాటు ఉమ్మడి కుటుంబంతో కలిసిఉండే వారు. ఇంటి యజమాని చెప్పిందే వేదం అన్నట్లుగా కుటుంబమంత నడుచుకునేవారు. ఇది కాస్త రానురాను ఉమ్మడి కుటుంబం కాస్త ఒంటరి కుటుంబంగా తయారైంది. దీంతో చిన్న చిన్న సమస్యలతో భార్యాభర్తలు పంతాలకు పోయి కాపురాన్ని కూల్చుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్కు రోజుకు సుమారు 25నుంచి 30మంది వరకు కుటుంబ సమస్యలతో పోలీస్స్టేషన్ను ఆశ్రయించడం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, పది మంది ముందు చులకన చేసుకోవడంతో పాటు వారి గౌరవాన్ని కించపరుచుకుంటున్నారు. సర్దుకుపోతేనే సమస్యకు పరిష్కారం గతంలో ఉమ్మడి కుటుంబాలుగా ఉండే వారు దీంతో ఎలాంటి గొడవలు వచ్చేవి కావు. ఒక వేల వచ్చిన ఇరుకుటుంబాల పెద్దలు ఇద్దరిని సమన్వయం చేసి పంపించేవారు. అప్పుడు కుటుంబాల్లో విలువలు, మర్యాద, గౌరవం, భయం భక్తి ఉండేది. అవి ప్రస్తుతం లేకపోవడంతో కుటుంబాల్లో చిన్నచిన్న గొడువలకు, పంతాలకు వెళ్లి పెద్దగా చేసుకుంటున్నారు. మొదట క్షణికావేశంతోనే ఏవెవో మాట్లాడుతారు. కౌన్సెలింగ్ ద్వారా 80శాతం కుటుంబాలు కలిసి పోతున్నారు. – బి.శ్రీనివాస్, సీఐ, మహిళా పోలీస్స్టేషన్, మంచిర్యాల -
సీఎస్కే, రవీంద్ర జడేజా మధ్య విబేధాలు.. ఎస్ఆర్హెచ్ బాటలోనేనా!
సీఎస్కే యాజమాన్యం, ఆల్రౌండర్ రవీంద్ర జడేజాల మధ్య విబేధాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ధోని స్థానంలో జట్టును నడిపించడంలో విఫలమైన జడ్డూపై సీఎస్కే గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అందుకు తగ్గట్లే సీఎస్కే ఇటీవలే తన ఇన్స్టాగ్రామ్లో జడేజాను అన్ఫాలో చెయ్యడం పలు అనుమానాలకు తావిస్తుంది. దీనికి తోడూ ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యా్చ్కు జడేజాను పక్కనబెట్టడం వెనుక సీఎస్కే ఫ్రాంచైజీ హస్తం ఉన్నట్లు క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. ఇదే నిజమైతే ఎన్నో ఏళ్లుగా సీఎస్కేకు నమ్మదగిన ఆటగాడిగా ఉన్న జడేజాకు ఆ జట్టుతో అనుబంధం ఇదే ఆఖరు కావచ్చొని పలు వర్గాలు పేర్కొన్నాయి. PC: IPL Twitter ఇక ఐపీఎల్ 2022 సీజన్లో సీఎస్కే దారుణ ప్రదర్శన చేసింది. గతేడాది చాంపియన్గా నిలిచిన సీఎస్కే ఈసారి మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చేయలేక చతికిలపడింది. ఇప్పటివరకు 11 మ్యాచ్ల్లో 4 ఓటములు, ఏడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎస్కే ప్లే ఆఫ్కు చేరడం కష్టమే. అయితే సీఎస్కే దారుణ ప్రదర్శనకు కెప్టెన్సీ మార్పు కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి ముందే ధోని కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్నాడు. దీంతో సీఎస్కే మేనేజ్మెంట్ జట్టులో సీనియర్గా ఉన్న జడేజాపై నమ్మకముంచి నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. జడ్డూ కెప్టెన్సీని సంతోషంగా అంగీకరించినప్పటికి.. నాయకత్వంలో ఘోరంగా విఫలమయ్యాడు. ధోని పెద్దన్న పాత్ర పోషించినప్పటికి సీఎస్కేకు వరుసగా పరాజయాలే ఎదురయ్యాయి. దీంతో ఒత్తిడిని తట్టుకోలేక జడేజా కెప్టెన్సీని తిరిగి ధోనికే అప్పగించాడు. అయితే కెప్టెన్గా సక్సెస్ కాలేకపోయిన జడ్డూ బ్యాటింగ్, బౌలింగ్లోనూ పెద్దగా మెరవలేదు. టాప్ క్లాస్ ఆల్రౌండర్గా పేరు ఉన్న జడేజా నుంచి ఇలాంటి ప్రదర్శనను సీఎస్కే కూడా ఊహించలేదు. ధోని చేతికి కెప్టెన్సీ వచ్చిన తర్వాత రెండు మ్యాచ్ల్లో ఆడిన జడ్డూ తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్కు జడేజాను పక్కనబెట్టడం ఆసక్తి కలిగించింది. CSK Unfollowed Jadeja in Instagram? 🙄 pic.twitter.com/ARDyYtwbvt — K O M B A N (@ValimaiKomban) May 9, 2022 ధోని, రైనా తర్వాత నమ్మదగిన ఆటగాడిగా.. PC: IPL Twitter ఇక ధోని, రైనా తర్వాత సీఎస్కేలో మంచి పేరు జడేజాకే ఉంది. 2012లో తొలిసారి సీఎస్కేలో అడుగుపెట్టిన జడేజా.. మధ్యలో గుజరాత్ లయన్స్(రెండు సీజన్లు సీఎస్కేపై నిషేధం)కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2016లో రూ. 9.5 కోట్లకు జడేజాను సీఎస్కే కొనుగోలు చేసింది. అప్పటినుంచి జడ్డూ సీఎస్కేకు ఆడుతూ వస్తున్నాడు. గతేడాది మెగావేలానికి ముందు సీఎస్కే ధోని, రుతురాజ్ గైక్వాడ్తో పాటు రూ.12 కోట్లకు జడేజాపు రిటైన్ చేసుకుంది. అయితే ధోని తనకు పెద్ద మొత్తం వద్దని.. జడేజాకు ఎక్కువ మొత్తంలో చెల్లిస్తే బాగుంటుందని తనకు తానుగా చెప్పడంతో సీఎస్కే కూడా జడ్డూపై నమ్మకంతో అతనికి ఎక్కువ మొత్తం అందించింది. అయితే తాజా సీజన్లో జడేజా తన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడూ చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ జడేజా- సీఎస్కే వైఖరిని.. వార్నర్- ఎస్ఆర్హెచ్ ఉదంతంతో పోలుస్తున్నారు. ఎస్ఆర్హెచ్ బాటలోనేనా.. గత సీజన్లో వార్నర్కు ఎస్ఆర్హెచ్ నుంచి ఎలాంటి అవమానాలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పవనసరం లేదు. 2016లో వార్నర్ కెప్టెన్సీలోనే ఎస్ఆర్హెచ్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత కూడా ప్రతీ సీజన్లో వార్నర్ జట్టును ప్లే ఆఫ్ చేర్చాడు.(2018లో తప్ప.. వార్నర్పై నిషేధం కారణంగా కేన్ విలియమ్సన్ కెప్టెన్సీ). అయితే ఇవేవి పట్టించుకోని ఎస్ఆర్హెచ్ గత సీజన్లో వార్నర్ను ఘోరంగా అవమానించింది. PC: IPL Twitter ముందు కెప్టెన్సీ నుంచి తొలగించింది.. ఆ తర్వాత తుది జట్టు నుంచి పక్కకు తప్పించింది.. ఆ తర్వాత మ్యాచ్లు ఆడకపోవడంతో డ్రింక్స్ బాయ్ అవతారంలో వార్నర్ను చూసి సొంత అభిమానులే జీర్ణించుకోలేకపోయారు. అప్పట్లో వార్నర్పట్ల ఎస్ఆర్హెచ్ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. అదే వార్నర్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతూ.. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో 92 పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్ ఆడి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. తాజా పరిణామాలు కూడా కాస్త అటూ ఇటుగా ఉన్నాయి. అయితే ఇక్కడ జడేజా తనంతట తానే కెప్టెన్గా తప్పుకున్నాడు. కానీ సీజన్లో జడేజా ఆటగాడిగా పూర్తిగా విఫలమయ్యాడు. అందుకే ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో జడేజాను పక్కనబెట్టారు. మరి ఇది ఒక్క మ్యాచ్కే పరిమితమవుతుందా లేక వార్నర్ బాటలోనే జడేజాకు అవమానాలు ఎదురవుతాయా అనేది ఇప్పటికే ప్రశ్నగానే ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ ప్రశ్నలన్నింటికి ఒక క్లారిటీ వస్తుంది. ఇక సీఎస్కే తన తర్వాతి మ్యాచ్ మే 12న ముంబై ఇండియన్స్తో ఆడనుంది. PC: IPL Twitter చదవండి: Sri Lanka Economic Crisis: దేశం దుర్భర స్థితికి ప్రభుత్వమే కారణం.. అసహ్యమేస్తోంది : లంక మాజీ క్రికెటర్లు Mumbai Indians: ప్లేఆఫ్ అవకాశాలు ఖేల్ఖతం.. ఇంతకుమించి ఏం చేస్తారులే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కన్నకొడుకును నరికి చంపిన తండ్రి
వీరులపాడు (నందిగామ): నిద్రిస్తున్న కుమారుడిని గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు ఓ తండ్రి. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలంలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి కథనం మేరకు.. మండల కేంద్రమైన వీరులపాడు గ్రామానికి చెందిన బొల్లెద్దు గాబ్రియేలు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గాబ్రియేల్కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలకు వివాహాలయ్యాయి. గాబ్రియేల్ భార్య మృతి చెందటంతో 2007లో తిరుపతమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇంటర్ పూర్తి చేసి పెయింటింగ్ పనులు చేస్తున్న కుమారుడు కిరణ్తో కలిసి గాబ్రియేల్ దంపతులు ఉంటున్నారు. అయితే తిరుపతమ్మ, కిరణ్ మధ్య తరచూ వాగ్వాదాలు, ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వారం రోజులుగా కిరణ్ను ఇంట్లో నుంచి పంపించాలని గాబ్రియేల్ను తిరుపతమ్మ వత్తిడి చేస్తోంది. ఈ విషయమై తిరుపతమ్మ, కిరణ్ మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. కిరణ్ ఉన్న ఇంట్లో తాను ఉండనని భర్తకు చెప్పి ఆమె పుట్టింటికి వెళ్లింది. అదే రోజు రాత్రి గాబ్రియేలు కూడా ఇంటి నుంచి వెళ్లిపోవాలని చెప్పగా, ఇల్లు తనదని, తాను వెళ్లాల్సినవసరం లేదని కిరణ్ గట్టిగా చెప్పాడు. ఇది మనసులో పెట్టుకున్న గాబ్రియేలు శనివారం తెల్లవారుఝామున 5.30 గంటల సమయంలో నిద్రపోతున్న కిరణ్ మెడపై గొడ్డలితో కిరాతంగా నరికాడు. తీవ్రంగా గాయపడిన కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు వీరులపాడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని నందిగామ రూరల్ సీఐ ఐ.వి.నాగేంద్రకుమార్తో కలిసి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. (చదవండి: వీడియో కాల్తో వివాహితకు వేధింపులు) -
గవర్నర్లా వ్యవహరిస్తే గౌరవిస్తాం: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: ‘గవర్నర్తో మాకు పంచాయితీ లేదు. ఆమెను ఎక్కడా అవమాన పరచలేదు. ఎక్కడ అవమాన పరిచామో చెబితే వింటాం. అర్థం చేసుకుంటాం..’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. గవర్నర్ వ్యవస్థపై తమకు గౌరవం ఉందని, గవర్నర్లా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తామని చెప్పారు. గురువారం సిరిసిల్ల కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. గవర్నర్ గౌరవానికి భంగం వాటిల్లేలా తాము ఏమీ చేయలేదని కేటీఆర్ చెప్పారు. ‘ఎమ్మెల్సీగా కౌశిక్రెడ్డి విషయంలో అభ్యంతరం పెట్టినందుకు ఆమెను అవమానిస్తున్నారని అన్నట్లు విన్నా. కౌశిక్రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉన్నందున ఎమ్మెల్సీగా అనుమతించలేదని ఆమె చెప్పినట్లు విన్నా. అయితే.. గవర్నర్ కాకముందు ఆమె ఎవరు? బీజేపీ తమిళనాడు పార్టీ అధ్యక్షురాలు కాదా?’అని మంత్రి ప్రశ్నించారు. గవర్నర్ కావడానికి రాజకీయ నేపథ్యం అడ్డం రాదు కానీ ఎమ్మెల్సీ అయ్యేందుకు అడ్డం వస్తదా? అని కేటీఆర్ నిలదీశారు. నరసింహన్ ఉన్నప్పుడు ఏ పంచాయితీ లేదు గవర్నర్గా నరసింహన్ ఉన్నప్పుడు ఏ పంచాయితీ లేదని, వీరితో పంచాయితీ ఉంటదని ఎందుకు ఊహించుకుంటున్నారో వారే ఆలోచించుకోవాలని మంత్రి అన్నారు. తాము రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తున్నామని చెప్పారు. శాసనసభ సమావేశాలు ఒక సంవత్సరంలో మొట్టమొదటిసారి జరుగుతున్నప్పుడు గవర్నర్ ప్రసంగం ఉండాలని రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉందని.. అయితే ఇటీవలి సమావేశం మొదటిది కాదని చెప్పారు. ఆ సమావేశం సైనడై (నిరవధిక వాయిదా) అయిందని, ప్రోరోగ్ కాలేదని తెలిపారు. అందువల్లే గవర్నర్ ప్రసంగం లేదని.. దాన్ని అవమానం కింద తీసుకుంటే తాము చేయగలిగింది ఏమీ లేదని కేటీఆర్ అన్నారు. (చదవండి: తారా స్థాయికి చేరిన గవర్నర్, రాష్ట్ర సర్కార్ మధ్య విభేదాలు..) -
ముదిరిన పంచాయితీ..
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు రాష్ట్ర ప్రభుత్వానికి నడుమ సాగుతున్న ‘పంచాయితీ’ ముదిరి పాకాన పడింది. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వతీరు, టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై గవర్నర్ తీవ్రం గా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం తనను గౌరవించడం లేదని, రాజ్యాంగబద్ధంగా పనిచేయడం లేదనే రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఇందుకు ప్రతిగా కొందరు రాష్ట్ర మంత్రులు కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు. రాజ్భవన్ బీజేపీ పార్టీ కార్యాలయంలా మారిందని విమర్శలు గుప్పిస్తున్నారు. మోదీ, అమిత్ షాతో భేటీపై ఆసక్తి రాష్ట్ర ప్రభుత్వం తన పట్ల అనుసరిస్తున్న తీరుపై తమిళిసై గతంలోనే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతోపాటు రాజ్భవన్లో ఉగాది వేడుకల సందర్భంగా.. తాను శక్తిమంతురాలినని, బలవంతంగా ఎవరూ తన తలవంచలేరంటూ స్వ రం పెంచారు. అదే సమయంలో సీఎం, మంత్రులతో చర్చకు సిద్ధమని, ఎవరికైనా రాజ్భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని కూడా అన్నారు. తాజాగా రెండు రోజులు ఢిల్లీలో మకాం వేసి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా ను కలవడం ద్వారా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్రెడ్డి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడం మొదలు మండలి ప్రొటెమ్ చైర్మన్ నియామకం, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం, మేడారం జాతర, యాదగిరిగుట్ట పర్యటనలో ప్రొటోకాల్కు తిలోదకాలివ్వడం తదితర అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. వీటిపై ఫిర్యాదులతోపాటు ప్రభుత్వ పా లన వైఫల్యాలు, శాంతిభద్రతలు, డ్రగ్స్, అవినీతి వంటి అం శాలపై గవర్నర్ నివేదిక సమర్పించినట్లు తెలిసింది. మీకే కాదు..మాకూ అవమానమే! రాష్ట్రంలో తనకు ఎదురైన అవమానాల గురించి కేంద్ర పెద్దలకు గవర్నర్ వివరించగా.. ‘ఈ అవమానం మీకే కాదు.. మాకూ జరిగినట్టు భావిస్తున్నాం’ అని వారు బదులిచ్చారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగేలా రోడ్డు, రైలు మార్గాల్లో రాష్ట్రం నలుమూలలా పర్యటించేందుకు గవర్నర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు, విజ్ఞాపనలను స్వీకరించడానికి వచ్చే నెల నుంచి రాజ్భవన్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. (చదవండి: బీజేపీ బెటాలియన్ ఏదైనా నాతో యాదాద్రికి వచ్చిందా?) -
హోంమంత్రితో వివాదాలు.. క్లారిటీ ఇచ్చిన సీఎం
సాక్షి, ముంబై: రాష్ట్ర హోంశాఖ మంత్రి దిలీప్ వాల్సే పాటిల్(ఎన్సీపీ)తో వివాదాలున్నట్లు వస్తున్న వార్తలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కొట్టి పారేశారు. ఒక్క పాటిల్పైనే కాదు.. మొత్తం కేబినెట్పైనా తనకు పూర్తి విశ్వాసముందని స్పష్టం చేశారు. మంత్రులందరూ అద్భుతంగా పనిచేస్తున్నారని, తప్పుదారి పట్టించేందుకే అలాంటి నిరాధార వార్తలు ప్రచారం చేస్తున్నారని ఉద్ధవ్ శుక్రవారం ఒక ప్రటకన విడుదల చేశారు. రాష్ట్రంలోని శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ నేతలను కేసుల్లో ఇరికించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ మంత్రి ఫడ్నవీస్ ఆరోపణలపై.. హోంమం త్రివాల్సే అసెంబ్లీ సరైన సమాధానం ఇవ్వలేదని సీఎం అభిప్రాపడినట్లుగా వార్తలొచ్చాయి. కేబినెట్ సమావేశాల్లోనూ ఠాక్రే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వాల్సే... శుక్రవారంనాడు ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తాను పాలనాపరమైన అంశాలు చర్చించేందుకే ముఖ్యమంత్రిని కలిసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే వివరణ ఇచ్చిందని, అందరినీ పరిగణనలోకి తీసుకునే కేబినెట్ నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. చదవండి: బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలి అయితే అంతకుముందు.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. హోంశాఖ బలంగా లేనందునే ఈడీ వంటి ఏజెన్సీలతో మహారాష్ట్ర ప్రభుత్వంపై, ప్రత్యేకించి హోంశాఖపై కేంద్రం దాడి చేస్తోందని అన్నారు. సాధారణంగా సీఎంతో ఉండాల్సిన హోంశాఖ ఎన్సీపీకి వెళ్లిందని అభిప్రాయపడ్డారు. అయితే రౌత్ చెప్పినదాంట్లో తప్పేం లేదని, అలాంటివేమైనా ఉంటే పరిష్కరిస్తామని వాల్సే తెలిపారు. హోంశాఖపై శివసేన దృష్టి పడిందా అన్న ప్రశ్నకు పాటిల్ సమాధానమిస్తూ తానలా భావించడం లేదని, చట్టం ప్రకారమే ప్రభుత్వం నడుస్తుందని, ప్రతి కేసులోనూ హోంశాఖమంత్రి ఉత్తర్వులు ఇవ్వలేరని చెప్పారు. చాలా నిర్ణయాలు డీజీపీ, సీపీ, ఇతర ఉన్నతాధికారుల పరిధిలోనే జరిగిపోతాయని, ఏదైనా ఆలస్యం జరిగితే మాత్రమే హోంశాఖ జోక్యం చేసుకుంటుందని వివరించారు. బీజేపీ పట్ల ఎన్సీపీ మెతకధోరణి అవలంభిస్తోందన్న ఆరోపణలను వాల్సే కొట్టిపారేశారు. మసీదుల్లో అజా(ప్రార్థన)లకు ఉపయోగించే లౌడ్స్పీకర్లను నిషేధించాలన్న బీజేపీ డిమాండ్ గురించి ప్రశ్నించగా... ధరల పెరుగుదల వంటి సమస్యలనుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు బీజేపీ ఇలాంటివి ముందుకు తెస్తుందని మండిపడ్డారు. -
కుమ్ములాటలు షురూ.. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ
లక్నో: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో సమాజ్వాదీపార్టీలో మళ్లీ కుటుంబ కలహాలు మొదలైనట్లు కనిపిస్తున్నాయి. శాసనసభా పక్ష సమావేశానికి తనను పిలవలేదని అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివపాల్ ఆరోపించారు. సైకిల్ గుర్తుపైనే తానూ గెలిచానని ఈ సందర్భంగా గుర్తుచేశారు. శివపాల్ ఆరోపణలపై ఎస్పీ వివరణ ఇచ్చింది. లక్నోలో జరిగింది ఎస్పీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశమని యూపీ ఎస్పీ చీఫ్ నరేషోత్తమ్ అన్నారు. సోమవారం సాయంత్రం భాగస్వామ్యపక్షాలతో అఖిలేష్ భేటీ అవుతారని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో అఖిలేష్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు. ఆయనను ఎస్పీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన అఖిలేష్ కర్హాల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే అజంఘడ్ లోక్సభ స్థానానికి రాజీనామా చేశారు. చదవండి: (కోదండరామ్కు అరవింద్ కేజ్రీవాల్ ఆఫర్! ఆ పార్టీ విలీనం తప్పదా?) కాగా, 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు సమాజ్వాది పార్టీలో కుటుంబ కలహాలు భగ్గుమన్నాయి. పార్టీపై ఆధిపత్యం కోసం శివపాల్, అఖిలేష్ పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో 2019లో ఎస్పీ నుంచి బయటకొచ్చిన శివపాల్ యాదవ్ ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీని పెట్టారు. 2022 అసెంబ్లీ ఎన్నికల ముందు బాబాయ్, అబ్బాయ్కి మధ్య రాజీ కుదిరింది. దీంతో జశ్వంత్నగర్ నుంచి ఎస్పీ టికెట్పై పోటీచేసి శివపాల్ 90వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. అయితే తాజాగా సైకిల్ గుర్తుపై గెలిచిన తనను ఎస్పీ శాసనసభా పక్ష సమావేశానికి ఆహ్వానించకపోవడంపై శివపాల్ గుర్రుగా ఉన్నారు. తన అనుచరులతో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని శివపాల్ తెలిపారు. దీంతో సమాజ్వాదీ పార్టీలో మళ్లీ చీలిక తప్పదనే వార్తలు గుప్పుమంటున్నాయి. -
ఉక్రెయిన్ ఉద్రిక్తతలను అంతం చేసే శాంతి ప్రణాళికలు లేవు
Russian President Vladimir Putin said No Prospects: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫ్రాన్స్, జర్మనీ, కైవ్లతో అంగీకరించిన కీలకమైన 2015 ప్రణాళిక ఒప్పందం ఉక్రెయిన్ వేర్పాటువాద వివాదాన్ని పరిష్కరించగలదని తాను ఇకపై భావించడం లేదని అన్నారు. అంతేకాదు 2015 మిన్స్క్ శాంతి ఒప్పందాల అమలుకు ఎటువంటి అవకాశాలు లేవని మేము అర్థం చేసుకున్నాం. బెలారస్ రాజధానిలో ఉక్రెయిన్ సైన్యం తూర్పున ఉన్న మాస్కో అనుకూల తిరుగుబాటుదారుల మధ్య పోరాటాన్ని ముగించడానికి అంగీకరించినట్లు పుతిన్ తన భద్రతా మండలికి తెలిపారు. రష్యా భద్రతకు ముప్పు కలిగించేలా పాశ్చాత్య శక్తులు ఉక్రెయిన్తో ఉన్న మాస్కో వైరాన్ని ఉపయోగించుకుంటున్నాయంటూ ఆగ్రహం చెందారు. ఉక్రెయిన్ నుంచి విడిపోయిన రష్యా-మద్దతుగల ప్రాంతాల స్వాతంత్య్రాన్ని గుర్తించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. రష్యా ఇలా బహిరంగంగా మద్దతు ఇస్తే అస్థిరమైన శాంతి ప్రణాళికను భంగం వాటిల్లుతుంది. ఒక రకంగా రష్యా నాటకీయంగా దాడిచేసే క్రమంలోని వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందన్న అనుమానాలకు తావిస్తోంది కూడా. రష్యా భూభాగంలోకి చొరబడిన ఐదుగురు ఉక్రెనియన్ విధ్వంసకారులను తమ బలగాలు అడ్డగించి చంపేశాయని, సరిహద్దు పోస్ట్పై ఉక్రెయిన్ షెల్ దాడి చేసిందని రష్యా ఆరోపణలు చేస్తోంది. అయితే కైవ్ వాటన్నింటిని ఖండించింది. నిజానికి మాస్కో అటువంటి ఆపరేషన్కు ఇప్పటికే పునాది వేస్తున్నట్లు కనిపించింది. (చదవండి: పుతిన్- బైడెన్ల అత్యవసర భేటీ!) -
యుద్ధానికి బీ రెడీ!.. ఉక్రెయిన్ వేర్పాటువాదుల ప్రకటనతో ఉలిక్కిపాటు
Ukraine's two breakaway regions announced a general mobilisation: ఉక్రెయిన్ నుంచి విడిపోయిన రెండు ప్రాంతాల వేర్పాటువాద నాయకులు శనివారం యుద్ధానికి సిద్దం అని ప్రకటించారు. దీంతో ఉక్రెయిన్లో రష్యా ఆక్రమణ దాడులు మరింత తీవ్రతరం అవుతాయనే భయాలు మొదలయ్యాయి. యూరప్లోని ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ నిపుణులు రష్యా అనుకూల తిరుగుబాటుదారులచే నియంత్రించబడుతుందని, తూర్పు ఉక్రెయిన్లోని కొన్ని భాగాలలో దాడులు గణనీయంగా పెరిగాయని నివేదిక ఇచ్చిన కొద్ది వ్యవధిలోనే ఈ ప్రకటనలు వెలువడటం గమనార్హం. ఈ మేరకు శనివారం తాజాగా జరిగిన దాడులపై ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ నాయకుడు డెనిస్ పుషిలిన్ తన తోటి సైనికులను సైనిక నిర్భంధ కార్యాలయానికి రావాలని కోరడమే కాక తాము యుధ్దానికి సిధ్దం అనే డిక్రి పై సంతకం చేసిన విషయం గురించి ఒక వీడియోలో వెల్లడించారు. లుగాన్స్ వేర్పాటువాద ప్రాంతం నాయకుడు లియోనిడ్ పసెచ్నిక్, అదే సమయంలో తన ప్రాంతంలోని దాడులను తిప్పికొట్టేందుకు సిద్ధం అని సంతంకం చేసిని డిక్రిని ప్రచురించాడు. అయితే ఉక్రెయిన్ భద్రతా దళాలే దాడులు మొదలుపెట్టాయని.. తాము ఆ దాడులను అడ్డుకున్నామని వేర్పాటువాద నాయకుడు పుషిలిన్ పేర్కొన్నాడు. అంతేకాదు తాము కలిసి విజయాన్ని సాధించడమే కాక రష్యా ప్రజలను రక్షిస్తాం అని ప్రకటించాడు. మరోవైపు వాషింగ్టన్ కూడా ఏ క్షణంలోనే రష్యా దాడులు చేస్తోందంటూ హెచ్చరిస్తోంది. ఇవన్నీ ఉక్రెయిన్ని ప్రధానంగా భయపెడుతున్న అంశాలు. 2014లో రష్యాలో విలీనం అయిన క్రిమియన్ ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకునే నిమిత్తం ఉక్రెయిన్ వేర్పాటు వాదులపై దాడులు జరుపుతోందంటూ వస్తున్న ఆరోపణలను ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఖండించింది. అంతేకాదు 2014లో వేర్పాటు దారులు చేసిన దాడులలో ఉక్రెయిన్ సైన్యం సుమారు 14 వేల మంది చనిపోయారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం బలగాలు వెనుకకు వచ్చేసినట్లు చెబుతుండటం విశేషం. ఉపగ్రహ చిత్రాలలో ఉక్రెయిన్ చుట్టూ రష్యా దళాలు మోహరింపు స్పష్టంగా కనిపిస్తోంది.బెలారస్, క్రిమియా, పశ్చిమ రష్యాలోని అనేక కీలక ప్రదేశాలలో రష్యా సైన్యం కార్యకలాపాల పరిధిని కొత్త ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ ఎప్పటికీ నాటోలో చేరదని హామీ పై బలగాలను వెనుక్కుతగ్గుతాయని రష్యా చెప్తుండడం తెలిసిందే. (చదవండి: : రష్యా అణు విన్యాసాలు) -
కాంగ్రెస్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతోంది
ఫతేపూర్: కాంగ్రెస్ పనిగట్టుకొని ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఇలా విభేదాలను రెచ్చగొట్టే పార్టీలకు పరిపాలించే అధికారం ఉండదన్నారు. యూపీ, బిహార్, ఢిల్లీకి చెందినవారంతా ఒక్కటేనని వారిని పంజాబ్లోకి అడుగు పెట్టనివ్వకూడదంటూ ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ తన స్వప్రయోజనాల కోసం ఒక ప్రాంతం వారిని మరో ప్రాంతంపైకి ఉసిగొల్పుతూ ఉంటుందని నిందించారు. పంజాబ్ అబోహర్లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ చన్నీ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. చన్నీ అలా మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న ప్రియాంకా గాంధీ చప్పట్లు కొడుతున్నారని యావత్దేశం దీనిని చూసిందన్నారు. యూపీలోని ఫతేపూర్లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎంతో స్వార్థంతో ఆలోచిస్తాయని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ని రద్దు చేస్తూ చట్టం తెస్తే విపక్షాలన్నీ ఏకమై వ్యతిరేకించాయని గుర్తు చేశారు. అయితే తన నిర్ణయానికి ముస్లిం మహిళలు అంతా అండగా ఉన్నారని, వారి బతుకులు బాగు చేసినందుకు కృతజ్ఞతలు వెల్లడించారని మోదీ పేర్కొన్నారు. -
Kurnool: టీడీపీలో వర్గపోరు.. తారా స్థాయికి విభేదాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అసెంబ్లీ, పార్లమెంట్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యంలేని దారుణ స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ వర్గపోరుతో మరింత బలహీనపడుతోంది. నేతల మధ్య విభేదాలు ముదిరి పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఆలూరు, ఎమ్మిగనూరు, డోన్తో పాలు పలు నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ ప్రత్యామ్నాయ పారీ్టల వైపు చూస్తోంది. ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే, ఇన్చార్జ్ బీవీ జయనాగేశ్వరరెడ్డికి వ్యతిరేకంగా మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి పనిచేస్తున్నారు. ఈనెల 2వ తేదీన కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. చదవండి: అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తాడు బీవీని వ్యతిరేకించే గోనెగండ్ల మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి, సింగిల్విండో మాజీ అధ్యక్షుడు పరమేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్ రంగముణితో పాలు పలువురికి కోట్ల అండగా నిలిచారు. పైగా పార్టీ ఆదేశిస్తే ఎవ్వరైనా పోటీ చేయొచ్చని ఆయన చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. దీంతో జయనాగేశ్వరరెడ్డికి పార్టీలో ప్రాధాన్యం లేదని టీడీపీ శ్రేణులతో పాటు ఎమ్మిగనూరు ప్రజల్లో భావన మొదలైంది. రెండున్నరేళ్లుగా నాగేశ్వరరెడ్డి నియోజకవర్గాన్ని, టీడీపీ కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కార్యకర్తలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్కు మకాం మార్చారు. దీంతో ప్రణాళిక ప్రకారం అతన్ని తప్పించేందుకు పార్టీ అధిష్టానమే ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తోందనే వాదన విన్పిస్తోంది. ఇదిలా ఉండగా జయనాగేశ్వరరెడ్డి పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి.. పార్టీ వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారని, ఇది సరికాదని వ్యాఖ్యలు చేశారు. వార్డు పర్యటనలు సైతం చేస్తున్నారు. అయితే ఆయన వెంట టీడీపీ ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు కలిసి రావడం లేదు. డోన్లో సుబ్బారెడ్డికి వ్యతిరేక పవనాలు డోన్ నియోజకవర్గంలో పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా కేఈ ప్రతాప్ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్చార్జ్గా ధర్మవరం సుబ్బారెడ్డిని నియమించారు. అయితే సుబ్బారెడ్డి నాయకత్వాన్ని మండల స్థాయి నాయకులు అంగీకరించడం లేదు. ప్యాపిలి మాజీ ఎంపీపీలు తొప్పెర శీను, సరస్వతి, చెన్నయ్య తదితరులు సుబ్బారెడ్డి నాయకత్వంలో తాము పనిచేసే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. సుబ్బారెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్, అక్కడి నుంచి వైఎస్సార్సీపీ, ఆపై టీడీపీలో చేరి రోజుకో పార్టీ మార్చి, వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. ఎవ్వరితో చర్చించకుండా పార్టీ నిర్ణయం తీసుకోవడాన్ని కూడా తప్పుబట్టారు. ఈ పరిణామాలపై ఏకంగా కరపత్రాలు ముద్రించి నియోజకవర్గంలో పంపిణీ చేశారు. డోన్ మునిసిపాలిటీలోని టీడీపీ నాయకులు చిట్యాల మద్దయ్యగౌడ్, కేశన్నగౌడ్లు కూడా సుబ్బారెడ్డి నాయకత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని బాహాటంగానే ప్రకటించారు. సుబ్బారెడ్డిని కేడర్ అంగీకరించకపోవడం, కేఈ ప్రతాప్ను అధిష్టానం వద్దనడంతో డోన్లో నాయకత్వలేమితో టీడీపీ కొట్టుమిట్టాడుతోంది. దీంతో కోట్ల సుజాతమ్మను డోన్కు వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించినట్లు సమాచారం. అయితే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అత్యంత బలంగా ఉన్న డోన్లో తాను గెలవడం సాధ్యం కాదని సుజాతమ్మ డోన్పై విముఖత ప్రదర్శిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో అంతర్గత పోరు, ఆధిపత్య పోరుతో టీడీపీ కొట్టుమిట్టాడుతోంది. నేతల తీరుతో టీడీపీలో ఉంటే భవిష్యత్ లేదని ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు మండల, గ్రామస్థాయి నాయకులు ఇతరపారీ్టల వైపు చూస్తున్నారు. ముదురుతున్న ఆలూరు పంచాయితీ ఆలూరులో కోట్ల సుజాతమ్మ, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ మధ్య వర్గపోరు రోజురోజుకు ముదురుతోంది. ఈనెల 8న కేఈ ప్రభాకర్ మొలగవెల్లిలోని చెన్నకేశవస్వామి రథోత్సవానికి వెళ్లారు. ఆలూరు, కర్నూలు అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్నానని, అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడైనా సరే పోటీ చేస్తానని చెప్పారు. కేఈ వెంట ఆలూరు మాజీ ఇన్చార్జ్ వైకుంఠం మల్లికార్జున చౌదరి, మాజీ ఎంపీపీ దేవేంద్రప్ప కూడా ఉన్నారు. ఈ క్రమంలో వెంటనే మరుసటి రోజు కోట్ల సుజాతమ్మ ఆలూరు, ఆస్పరితో పాటు పలు చోట్ల పర్యటించారు. ఆలూరు నుంచి తానే పోటీ చేస్తానని, అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు తమకు ఉన్నాయని, ఎవ్వరు ఎలాంటి ప్రకటనలు చేసినా నమ్మొద్దని టీడీపీ శ్రేణులకు చెప్పారు. సీనియర్లను కాదని జూనియర్లను మండల కన్వీనర్లుగా నియమించడంతో సుజాతమ్మను టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. వీరంతా కేఈ వర్గం వైపు నడుస్తున్నారు. ఇదిలా ఉండగా 2014లో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన వీరభద్రగౌడ్ కొత్తగా తెరపైకి వచ్చారు. ఆలూరులో ఇటీవలే ఇల్లు తీసుకుని, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు. దీంతో ఇక్కడ టీడీపీ మూడు వర్గాలుగా విడిపోయింది. -
పంజాబ్కు 13 పాయింట్ల ఎజెండా
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూకి, సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీకి మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఇదే ఆఖరి అవకాశం అంటూ 13 పాయింట్ల ఎజెండాను సూచిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సిద్ధూ లేఖ రాశారు. 2017 ఎన్నికల హామీలన్నీ నెరవేర్చేలా పంజాబ్ ప్రభుత్వాన్ని కదిలించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అక్టోబర్ 15న రాసిన ఆ లేఖను ఆదివారం సిద్ధూ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ 13 పాయింట్ల ఎజెండాపై సోనియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని సిద్ధూ వెల్లడించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న పంజాబ్అప్పుల ఊబిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వ్యవసాయం, ఉపాధి అవకాశాలు, ఇసుక మాఫియా, విద్యుత్, రవాణా రంగాల్లో సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. -
పోడు వివాదానికి ఇక తెర!
సాక్షి, మహబూబాబాద్: దశాబ్దాల తరబడి పోడు రైతులకు, అటవీ అధికారులకు మధ్య జరుగుతున్న వివాదానికి తెరపడనుంది. అయితే భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్న రైతులు భూమిని విడిచి పెట్టేందుకు సిద్ధంగా లేకపోగా, ఫారెస్టు భూమిని సైతం తగ్గించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. ఇందులో మధ్యేమార్గంగా వేసిన మంత్రివర్గ ఉపసంఘం చైర్పర్సన్, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, జగదీశ్వర్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఉపసంఘం మూడుసార్లు సమావేశమైంది. అయితే సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకోలేదని చెబుతూనే.. ఇప్పటికే ప్రాథమిక నివేదికను తయారు చేసి సీఎం కేసీఆర్కు అందజేసినట్లు సమాచారం. 2005కు ముందున్నవారికే ప్రాధాన్యం! రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో 2005కు ముందు నుంచి సాగులో ఉన్నవారికే హక్కుపత్రాలు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. అందుకు ఆధారాలుగా గిరిజన ప్రాంతంలోని రేషన్కార్డు, ఓటరు ఐడీ, లేదా ఫారెస్టు, పోలీసు కేసు రికార్డులు ఉంటే సరిపోతుందనే నిబంధనలు పెట్టారు. గిరిజనేతరులైతే మూడు తరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో ఉంటూ భూమిని సాగు చేసుకున్నవారు అర్హులు. ఇందుకోసం 25 ఏళ్లకు ఒక తరం చొప్పున 75 ఏళ్లు, 2005 నుంచి ఇప్పటివరకు 16 ఏళ్లు.. ఇలా మొత్తం 91 ఏళ్లుగా గిరిజనేతరులు సాగులో ఉండాల్సి ఉంటుంది. అయితే గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతంలో ఎలా ఉన్నారనే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు రామప్ప దేవాలయం ఎనిమిది శతాబ్దాల క్రితం నిర్మించారు. అప్పటికే అక్కడే బ్రాహ్మణులు, ఇతర కులాలవారు వ్యవసాయం చేసుకుంటూ జీవించారనే చారిత్రక ఆధారాలు ఉన్నట్లు చర్చ జరిగింది. ఇలా గిరిజనేతరులకు కూడా పట్టాలు ఇవ్వాల్సిన ఆవశ్యకతను కమిటీ చర్చించింది. గొత్తికోయలు మనోళ్లు కాదు.. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాల్సి వస్తే ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గొత్తికోయలకు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రధానంగా ములుగు, మహబూబాబాద్తోపాటు ఖమ్మం జిల్లా చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం మండలాలు, భూపాలపల్లి జిల్లాలోని వాజేడు ప్రాంతంలో గొత్తికోయలు ఉంటున్నారు. వీరు సంచార జీవనంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చినవారే కానీ, స్థానికులు కాదనే అభిప్రాయానికి వచ్చారు. ఒక్కొక్కరికి నాలుగు హెక్టార్ల వరకే పట్టాలు.. అటవీశాఖ భూములే కదా.. అని గిరిజనులు, గిరిజనేతరులు వందల ఎకరాలు ఆక్రమించుకున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. అయితే ఒక్కొక్కరికి 4 హెక్టార్లు(పది ఎకరాలు) భూమికి మాత్రమే పట్టాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకోనుంది. మిగిలిన భూమిని ఫారెస్టులో కలుపుకోవాలని భావిస్తోంది. పండుగ తర్వాతే.. పోడు భూముల పట్టాలు అందించేందుకు అర్హులైన రైతులను ఎంపిక చేసే ప్రక్రియ దసరా తర్వాత ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రొఫార్మా తయారు చేసి దరఖాస్తులను ఏజెన్సీ ప్రాంతాల్లోని రైతులకు అందుబాటులో ఉంచుతారు. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ముందుగా గ్రామపంచాయతీ, మండలస్థాయిలో, రెండో దశలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో, కలెక్టర్, భూ పరిపాలనా విభాగం, ఫారెస్టు, ఐటీడీఏ పీవో స్థాయి అధికారులు పరిశీలించి తుది జాబితా రూపొందిస్తారు. నిజమైన రైతులకు న్యాయం.. భూమినే నమ్ముకొని జీవిస్తున్న నిజమైన రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం తీసుకునే నిర్ణయాలు వారికి అనుకూలంగా ఉంటాయి. ఎన్ని ఎకరాలు ఇవ్వాలి.. ఎప్పటి నుంచి భూమిని సాగు చేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలి.. ఎవరికి ఇవ్వాలి.. అనేవి కీలకాంశాలుగా చర్చ జరుగుతోంది. – సత్యవతి రాథోడ్, రాష్ట్ర మంత్రి, ఉపసంఘం చైర్పర్సన్ శాశ్వత పరిష్కారం చూపాలి ఏజెన్సీ మండలాల్లో ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపాలి. 2005 కంటే ముందు సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇచ్చి రైతుబంధు, రైతుబీమా, సాగునీరు అందించినట్లయితే ఉన్న అడవులను స్థానికులే కాపాడుకుంటారు. – సీతక్క, ములుగు ఎమ్మెల్యే స్వేచ్ఛగా సాగు చేసుకోనివ్వాలి.. ఏజెన్సీ గ్రామాల్లోని పోడు భూముల్లో స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకునే విధంగా చూడాలి. అర్హులైన ప్రతి వ్యక్తికి పట్టాలు ఇచ్చి రెండు పంటలకు నీరందించాలి. అప్పుడే ఆదివాసీల అభివృద్ధి సాధ్యమవుతుంది. – ఆగబోయిన రవి, తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు -
వాళ్లిద్దరి మధ్య విభేదాలా!.. మరోసారి నిరూపితమైంది
Virat Kohli And Rohit Sharma Conflicts.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొంతకాలం కిందట వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ఒక్కోసారి వీరిద్దరి ప్రవర్తన ఉండడంతో మీడియా వార్తలు రాసుకొచ్చేది. అది చూసి ఫ్యాన్స్ కూడా నిజమేనని భావించారు. అయితే అవన్నీ తప్పుడు వదంతులని.. మా మధ్య అలాంటిదేం లేదని కోహ్లి, రోహిత్లు చూపించారు. ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో మ్యాచ్లు విజయం సాధించినప్పుడు.. ఇంగ్లండ్ వికెట్లు కోల్పోయినప్పుడు ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకోవడం.. అభినందించుకోవడం చేశారు. చదవండి: T20 World Cup 2021: సూర్య, ఇషాన్లు ఫామ్లో లేరు.. ఆ స్థానాల్లో వీరే కరెక్ట్ Courtesy: IPL Twitter తాజాగా ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో భాగంగా ఆదివారం ఆర్సీబీ, ముంబై మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై 54 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి రోహిత్ వద్దకు వచ్చి మాట్లాడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇద్దరు మాట్లాడుకుంటున్న సందర్భంలో ముఖాల్లో నవ్వులు పూయడం అభిమానులను సంతోషపరిచింది. ఈ సందర్భంగా వారి ఫోటోను షేర్చేస్తూ ట్వీట్స్తో రెచ్చిపోయారు. '' ఎంతైనా కాబోయే కెప్టెన్.. కాబోయే కెప్టెన్ వద్దకు వచ్చి ప్రస్తుత కెప్టెన్ చర్చలు.. వారిద్దరి మధ్య విభేదాలు లేవనడానికి ఈ ఫోటోనే నిదర్శనం'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: "నువ్వు సూపరప్పా ఊతప్ప".. సీఎస్కే ప్లేయర్ క్రీడాస్పూర్తికి నెటిజన్లు ఫిదా Win or lose but these moments is made my morning beautiful #Rohirat #ViratKohli #RohitSharma pic.twitter.com/P2jUlM3Clv — Maulik Vadariya (@MaulikVadariya) September 27, 2021 -
అనంతపురం జిల్లాలో రోడ్డున పడ్డ టీడీపీ విభేదాలు
-
కాంగ్రెస్ – ట్విట్టర్ వార్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ, సామాజిక మాధ్యమం ట్విట్టర్ మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఇంకా కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికారిక అకౌంట్, పార్టీ నేతలు, కార్యకర్తల ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేసిందని ఆ పార్టీ గురువారం వెల్లడించింది. ఢిల్లీలో అత్యాచారం, హత్యకి గురైనట్టుగా అనుమానిస్తున్న దళిత బాలిక కుటుంబం ఫొటోలను కాంగ్రెస్ నేత రాహుల్ ఇటీవల ట్విట్టర్లో షేర్ చేసినందుకు ఆయన ఖాతాను తాత్కాలికంగా స్తంభింపజేసింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతాని బ్లాక్ చేయడంతో ఆ పార్టీ ట్విట్టర్పైనా, కేంద్రంలో మోదీ ప్రభుత్వంపైనా విరుచుకుపడింది. కేంద్రం ఆదేశాల మేరకే ట్విట్టర్ ఇలా వ్యవహరిస్తోందని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు సుర్జేవాలా, అజయ్ మాకెన్, లోక్సభలో పార్టీ విప్ మాణిక్యం ఠాగూర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మిత దేవ్ తదితరుల ఖాతాలను ట్విట్టర్ నిలిపివేసింది. పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలకు చెందిన మొత్తంగా 5,000 ఖాతాలను ట్విట్టర్ స్తంభింపజేసిందని కాంగ్రెస్ సోషల్మీడియా విభాగం చీఫ్ రోహన్ గుప్తా అన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ట్విట్టర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతల అకౌంట్లు బ్లాక్ చేసే అంశంలో ఆ సంస్థ తన సొంత నిబంధనలు పాటిస్తుందా లేదంటే మోదీ ప్రభుత్వం ఆదేశాల మేరకు నడుచుకుంటుందా అని ప్రశ్నించారు. కాగా, ట్విట్టర్ తమ చర్యల్ని సమర్థించుకుంది. -
అత్తారింట్లో గొడవ: చనిపోతున్నానని సెల్ఫీ వీడియో
సాక్షి,దోమకొండ(నిజామాబాద్): బీబీపేట మండలం యడారం గ్రామానికి చెందిన వల్లెపు రమేష్(39)అనే యువకుడు ఆదివారంరాత్రి దోమకొండ మండలంలింగుపల్లిలో అత్తారింట్లో గొడవపడి వెళ్లిపోయడని ఎస్సై రాజేశ్వర్గౌడ్ తెలిపారు. వివరాలు.. రమేష్ ఆదివారం రాత్రి అత్తారింట్లో బావమరిది శ్రీకాంత్తో గొడవ పడి బైక్ తీసుకుని వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి తాను ఆత్మహత్య చేసుకుంటున్నాననిసెల్ఫీ వీడియో తీసి దానిని బావమరిది శ్రీకాంత్కుపంపినట్లు ఎస్సై చెప్పారు. దీంతో రమేష్ మామ,బావమరిది వెంటనే పోలీస్స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. సెల్ఫోన్ సిగ్నల్ అధారంగా ఆదివారం రాత్రి నుంచి వెతకగా సోమవారంఉదయం దోమకొండ శివారులోని మల్లికార్జునస్వామి ఆలయం సమీపంలో రమేష్ బైక్, దానికి కొద్ది దూరంలో షర్టు లభించాయన్నారు. కాగా తమ కొడుకును అత్తాగారింటి వారు చంపి ఉంటారని రమేష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. డాగ్స్వాడ్తో వెతికినా ఆచూకీ లభించలేదని ఎస్సైతెలిపారు. రమేష్ తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కాగా రమేష్ మామతో పాటు బావమరిదిపై గతంలో పలువురిపై దాడులు, దొంగతనం కేసులు ఉన్నాయని ఎస్సై చెప్పారు. చదవండి: వామ్మో.. బంధువులని చేరదీస్తే ఎంత పనిచేశారు.. -
వ్యాక్సినేషన్.. ఊళ్ల మధ్య చిచ్చు!
వెబ్డెస్క్: వ్యాక్సిన్లు దొరక్క జనాలు అల్లలాడిపోతున్నారు. ఇప్పటికే మొదటి డోస్లు తీసుకున్నవాళ్లకు రెండో డోస్ దొరకడం కష్టతరంగా మారింది. దీనికి తోడు ఏజ్ గ్రూపులు, ఆన్లైన్ స్లాట్ బుకింగ్, టోకెన్ వ్యవస్థ, రోజూ కొందరికే టీకాలు ఇవ్వాలన్న అధికారుల నిర్ణయాలు జనాలకు చికాకు తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊళ్ల మధ్య చిచ్చు పెడుతున్న ఘటనలు రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి. సికర్ జిల్లా జాజోద్ గ్రామంలో శనివారం ఉదయం ప్రభుత్వ పాఠశాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగాల్సి ఉంది. దీంతో ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న ఎనభై మంది సెంటర్ ముందు క్యూ కట్టారు. అయితే అందులో సగం కంటే ఎక్కువ బయటి ఊళ్ల వాళ్లే ఉన్నారు. ఇది గమనించిన జాజోద్ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తూ.. బయటి ఊళ్లవాళ్లకు వ్యాక్సిన్ డోస్లు ఇవ్వకుండా ఆశావర్కర్లను అడ్డుకున్నారు. మరోవైపు కొందరు గ్రామస్తులు.. బయటి ఊళ్ల వాళ్లతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. మళ్లీ మధ్యాహ్నం టైంలో మళ్లీ వ్యాక్సినేషన్ మొదలుపెట్టగా.. బయటి ఊళ్లవాళ్లు అక్కడి నుంచి కదల్లేదు. దీంతో మూడు గంటల తర్వాత మళ్లీ వ్యాక్సినేషన్ ప్రారంభించారు. మొత్తం 90 డోస్లలో ముప్ఫై మాత్రమే తమ ఊరివాళ్లకు ఇచ్చి.. మిగతావి బయటి వాళ్లకు ఇచ్చారని జాజోద్ సర్పంచ్ భర్త మహవీర్ చెబుతున్నాడు. వాళ్లంతా చురు, బికనీర్, నాగౌర్ గ్రామాల నుంచి వచ్చారని, సోమవారం నుంచి బయటివాళ్లను అడ్డుకుని తీరతామని జాజోద్ గ్రామస్తులు చెప్తున్నారు. ఆధార్ వల్లే.. రాజస్థాన్లో ప్రస్తుతం 18 నుంచి 44 ఏళ్లలోపు వాళ్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ నడుస్తోంది. గ్రామాల్లో వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటోంది. దీంతో జనాలు వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్నారు. ఒక ఊరి వాళ్లు.. మరో ఊరికి వ్యాకిన్ కోసం వెళ్తుండడంతో తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. టోంక్ జిల్లాలో కొన్ని గ్రామాల ప్రజలు బయటి వాళ్లు వ్యాక్సినేషన్కు రాకుండా పొలిమేర్లలో రాళ్లు అడ్డం పెట్టడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. చాలామందికి ఆన్లైన్ స్లాట్ బుకింగ్ గురించి అవగాహన లేకపోవడంతో నేరుగా సెంటర్ల దగ్గర క్యూ కట్టి, వెనుదిరుగుతున్నారు. మీడియేటర్ల సాయంతో స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ.. ఆధార్లో వయసు తేడాలున్నాయని ఆశావర్కర్లు వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం లేదు. వీటన్నింటిని తోడు టోకెన్ సిస్టమ్ నడుస్తుండడంతో వ్యాక్సిన్ డోస్లు త్వరగా తీసుకోవాలనే ఉద్దేశంతో వేరే ఊళ్లకు వెళ్తున్నారు. చదవండి: 160 మంది ప్రాణాలు గాలికొదిలేసి.. -
టీడీపీలో సస్పెన్షన్ల కలకలం..
-
టీడీపీలో సస్పెన్షన్ల కలకలం..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల టీడీపీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఇప్పుడు రాజుకుంటున్నాయి. భవిష్యత్లో తనకు ప్రతిబంధకంగా త యారవుతున్న నాయకులను సాగనంపే పనిలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు ఉన్నారు. తనకు పోటీగా తయారవుతున్న నాయకులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. మొన్నటికి మొన్న జి.సిగడాం మండలం సీనియర్ టీడీపీ నేత బాలగుమ్మి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయగా, నేడు టీడీపీ ఉత్తరాంధ్ర కార్యకర్తల శిక్షణ శిబిరం డైరెక్టర్ కలిశెట్టి అప్పలనాయుడును సస్పెండ్ చేస్తున్న ట్టు కళా వెంకటరావు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గరి నుంచి కళా వెంకటరావుకు నియోజకవర్గంలో అసమ్మతి పోరు ఎక్కువైంది. ముఖ్యంగా కళా కుమారుడు రామ్ మల్లిక్ నాయుడును నియోజకవర్గంపై వదలడం, రాష్ట్ర స్థాయి పదవి అప్పగించడంతో కళాపై కినుకు ఎక్కువైంది. అసలే వలస నేత, ఆపై ఆయన కుటుంబ సభ్యులు తమపై పెత్తనం చేయడమేంటని ఆ నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగింది. దీంతో కళా అలెర్ట్ అయ్యారు. వ్యతిరేకంగా గళం విప్పుతున్న నేతలు, పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాయకులపై దృష్టి సారించారు. మొన్నటికి మొన్న జి.సిగడాం మండలం సీనియర్ నేత బాలగుమ్మి వెంకటేశ్వరరావును ఏకపక్షంగా సస్పెండ్ చేయగా, నేడు నియోజకవర్గంలో కీలకమైన కలిశెట్టి అప్పలనాయుడుపైనా అదే వేటు పడింది. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అసలు కళాకు ఆ అధికారం ఎక్కడిదని, ఏ ఆదేశాలైనా పార్టీ నుంచి రావాలని ఆయన్ని వ్యతిరేకిస్తున్న నాయకులంతా ప్రశ్నిస్తున్నారు. బీజేపీతో దోస్తీ.. ఒక వైపు కళా వెంకటరావు సోదరుడు కుటుంబీకులంతా ఇప్పటికే బీజేపీతో టచ్లో ఉన్నారు. సోము వీర్రాజు తదితర నేతలతో మంతనాలు జరిపారు. మే నెలలో బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఇదంతా ఎప్పటికప్పుడు కళా వ్యతిరేక వర్గీయులు బయటపెడుతున్నారు. ఏ రోజుకైనా కళా వెంకటరావు బీజేపీలో చేరడం ఖాయమని కూడా చెప్పుకొస్తున్నారు. ఇలాంటి సమయంలో తనకు వ్యతిరేకంగా నడుస్తున్న నాయకులపై వరుసగా సస్పెన్షన్ వేటు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో ఉండాలంటే అసమ్మతి నేతలందరినీ బయటికి పంపించాలనే షరతుతో అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి తమపై వేటు వేస్తున్నారని అసమ్మతి నేతలు వాపోతున్నారు. అధికారంలో ఉన్నంతకాలం అక్రమాలకు పాల్పడి, పార్టీని అప్రతిష్ట పాలుజేసి, ఇప్పుడు కష్టపడ్డ సీనియర్లను పార్టీ నుంచి దూరం చేయడం వెనక కుట్ర దాగి ఉందని ఆ పార్టీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. చదవండి: ఆ ఇద్దరికీ పదవీ గండం? ఆధ్యాత్మిక స్థలంపై టీడీపీ నేత కన్ను -
వామ్మో.. కిలేడీ చేసిన పనికి విసిగిపోయిన అతడు!
సాక్షి, సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతుందని ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ కిరాతకుడు. గత నెల 29న సదాశివపేట మండలంలోని ముబారక్ పూర్ గ్రామ శివారులో సన్నం వాగు సమీపంలో అనుమానాస్పద స్థితిలో జరిగిన మహిళ హత్య కేసును ‘పేట’ పోలీసులు ఛేదించారు. శనివారం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో హత్యకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ, సీఐ సంతోష్ కుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి మండలంలోని గుడితాండకు చెందిన రమావత్ లక్ష్మీ అలియాస్ బులీబాయి(38) అడ్డమీద కూలీ పని చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తుంది. ఈమెకు సంగారెడ్డి పట్టణంలోని మారుతీనగర్ కు చెందిన వడ్డే నర్సింలు(38)తో పరిచయం ఏర్పడింది. మూడేళ్లుగా రమావత్ లక్ష్మీతో నర్సింలు, అతడి భార్య ఎల్లమ్మకు పరిచయం ఉంది. అందరూ కలిసి కూలి పనులకు వెళ్లేవారు. భార్యాభర్తల మధ్య గొడవలు పెడుతుందని ఈ మధ్యకాలంలో భార్య ఎల్లమ్మ తరుచూ నర్సింలుతో గొడవలు పడుతుంది. తనపై లేనిపోని మాటలు తన భార్యకు చెప్పి గొడవలకు కారణమవుతున్న లక్ష్మీని ఎలాగైనా చంపాలని నర్సింలు నిర్ణయించుకున్నాడు. గత నెల 29న బైక్పై లక్ష్మీని ఇరిగిపల్లికి తీసుకెళ్లి ఇద్దరూ కలిసి కల్లు సేవించారు. అనంతరం రెండు బాటిల్లు తీసుకొని తర్వాత తాగుదామని చెప్పి ముబారక్ పూర్(బి) గ్రామ శివారులో గల సన్నం వాగు ప్రక్కన ఉన్న తుమ్మ చెట్ల పొదలకు తీసుకొని కట్టతో ఆమెను తీవ్రంగా కొట్టి చంపేశాడు. ఈ నెల 5న ఘటన వెలుగులోకి రావడంతో గుర్తుతెలియని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు చాకచక్యంగా వారం రోజుల్లో కేసును ఛేదించారు. నిందితుడు నర్సింలును అదుపులోకి తీసుకొని అతడి నుంచి లక్ష్మికి సంబంధించిన కడియాలు, నిందితుడి బైక్ స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. త్వరితగతిన కేసును ఛేదించిన సీఐ సంతోష్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించి.. పోలీస్ సిబ్బంది రమేశ్, వీరేశం, శ్రీనులకు డీఎస్పీ బాలాజీ రివార్డులు అందజేశారు. -
కమలంలో లుకలుకలు!
బంజారాహిల్స్: కేబీఆర్ పార్కు వేదికగా బీజేపీలో నెలకొన్న లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వద్ద శనివారం వాకర్లను ఓట్లు అభ్యర్థించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్రావు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ కూడా వచ్చారు. చింతల రావడంతోనే అప్పటికే అక్కడికి వచ్చిన పార్టీ నేత గోవర్ధన్ను పక్కకు జరగాలని సూచించారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన గోవర్ధన్ చింతలపై విరుచుకుపడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాహాబాహికి దిగేందుకూ యత్నించారు. కాగా,పరిస్థితి చేయిదాటుతుండటంతో వెంట నే పక్కనే ఉన్న నేతలు కలగజేసుకొని ఇరు వర్గాల వారిని శాంతింపజేశారు. మొన్నటి కార్పొరేటర్ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్ డివిజన్ బీజేపీ టిక్కెట్ ఇవ్వకుండా తనను మోసం చేశారని పల్లపు గోవర్ధన్ కోపంతో ఉన్నారు. దీంతో చింతలతో విభేదాలు తలెత్తాయి. -
రోడ్డునపడ్డ బెజవాడ టీడీపీ నేతలు
-
రోడ్డునపడ్డ బెజవాడ టీడీపీ నేతలు
సాక్షి, విజయవాడ: బెజవాడ టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. విజయవాడ టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. కమ్మ, కాపు నేతల మధ్య ఆధిపత్యపోరు తీవ్రస్థాయికి చేరింది. కేశినేని నానిపై బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్మీరా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు పర్యటన గురించి మాకు కనీసం సమాచారం ఇవ్వరా?. రూట్ మ్యాప్ మార్చడానికి కేశినేని ఎవరని వారు ప్రశ్నించారు. ‘చంద్రబాబు రోడ్షోలో కేశినేని పాల్గొంటే.. మేం పాల్గొనం. మాకు ఏ గొట్టం గాడు అధిష్టానం కాదంటూ’ వారు నిప్పులు చెరిగారు. ‘‘టీడీపీని కుల సంఘంగా మార్చాలని కేశినేని అనుకుంటున్నారా?. దమ్ముంటే కేశినేని ఇండిపెండెంట్గా పోటీచేసి గెలవాలి. కేశినేని చెప్పుచేతల్లో బీసీలు బతకాలా?. కేశినేని నాని చేసేవన్నీ చీకటి రాజకీయాలు. రంగా హత్య కేసు నిందితులందరూ కేశినేని వెంటే ఉన్నారంటూ’’ బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్మీరా విమర్శలు గుప్పించారు. కాగా, విజయవాడలోని ముఖ్య నాయకులు రెండు వర్గాలుగా వ్యవహరిస్తున్నారు. కేశినేని శ్రీనివాస్కు గద్దె రామ్మోహన్ వెంట ఉంటున్నారు. బొండా, బుద్దా, నాగుల్మీరా, పట్టాభి తదితరులు పూర్తిగా దూరమయ్యారు. బీసీ వర్గానికి చెందిన గుండారపు హరిబాబు కుమార్తె పూజితకు ఇచ్చిన టిక్కెట్ను కేశినేని నాని మార్చేశారు. ఈ విషయమై బుద్ధా, మీరాలు పట్టుపట్టినా ఎంపీ ససేమిరా అన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన కొట్టేటి హనుమంతరావు భార్య టికెట్ విషయంలోనూ అదే జరిగింది. పేదసామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఇప్పించుకోలేకపోయినట్లు పొలిట్ బ్యూరో సభ్యుడు, జాతీయ కార్యదర్శి కూడా అయిన వర్ల రామయ్య తన అనుచరవర్గం వద్ద అంతర్గత చర్చల్లో వాపోయినట్లు సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు. చదవండి: ఔను.. మళ్లీ ‘వాళ్ల మాటే’ నెగ్గింది తమ్ముడి గెలుపుపై జేసీ బెంగ.. -
కమలంలో కలహాలు!
సాక్షి, నిజామాబాద్: బీజేపీలో అంతర్గత కలహాలు ప్రారంభమయ్యాయా..? జిల్లా ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందా..? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. జిల్లాలో పట్టు సాధించే దిశగా పయ నిస్తున్న బీజేపీలో ఇప్పుడు నేతల మధ్య విభేదాలు పెరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. పారీ్టలో ఎంతో కీలకమైన జిల్లా పదాధికారుల సమావేశం శనివారం నగరంలోని ఆ పార్టీ కా ర్యాలయంలో జరిగింది. జిల్లా లోని కీలక నేతలు హాజరైన ఈ సమావేశంలో నేతల మధ్య భేదాభిప్రాయాలు బట్టబయలైనట్లు సమాచారం. ఇటీవల బాన్సువాడలో నిర్వహించిన బహిరంగ సభ నిర్వహణ తీరుపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశానికి నిజామాబాద్ నగరానికి చెందిన మహిళా కార్పొరేటర్లు హాజరు కావడంపై ఒకరిద్దరు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడం వివాదానికి దారి తీసినట్లు సమాచారం. ఇతర ప్రధాన పారీ్టలతో పోలి్చతే బీజేపీలో ప్రస్తుతం మహిళా నేతల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి తరుణంలో పారీ్టలో మహిళల ప్రాధాన్యత పెంచాల్సిన నాయకులు.. మహిళా కార్పొరేటర్ల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై ఎంపీ అరి్వంద్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే మహిళా నేతల కోసం అర్వింద్ ప్రత్యేకంగా రోప్ పార్టీని ఏర్పాటు చేయించారు. నిరసన కార్యక్రమాల సందర్భంగా మహిళా నేతలు ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా రక్షణ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఇటువంటి పరిస్థితిలో మహిళా నేతల హాజరుపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు జిల్లాలో జరిగిన సభ్యత్వ నమోదు ప్రక్రియ విషయంలోనూ సమావేశంలో చర్చకొచ్చినట్లు తెలిసింది. ఆర్మూర్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ మొక్కుబడిగా సాగిందనే అంశంపై చర్చ జరిగింది. ఈ నియోజకవర్గంలో సభ్యత్వ జాబితా తప్పుల తడకగా ఉండటంతో మరో బృందంతో ప్రత్యామ్నాయంగా ఈ ప్రక్రియను చేపట్టినట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతమవుతున్న తరుణంలో.. ఏడాది క్రితం వరకు జిల్లాలో బీజేపీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంది. నిజామాబాద్ అర్బన్ వంటి ఒకటీ రెండు చోట్ల మినహా మిగిలిన నియోజకవర్గాల్లో కార్యకర్తలున్నప్పటికీ, పార్టీని నడిపించే నాయకులు లేకుండా పోయారు. నాయకత్వ సమస్యను అధిగమించేందుకు చేరికలపై పార్టీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో మల్లికార్జున్రెడ్డి, బోధన్లో మేడపాటి ప్రకాశ్రెడ్డి, బాన్సువాడలో మాల్యాద్రిరెడ్డిలను పారీ్టలో చేర్చుకోవడం ద్వారా నాయకత్వ సమస్యను అధిగమించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో ముఖ్య నేతల మధ్య ఉన్న విభేదాలు బట్టబయలవుతుండటం పారీ్టలో అంతర్గత చర్చకు దారి తీస్తోంది. -
నడిరోడ్డుపై విజయవాడ టీడీపీ నేతల రచ్చ
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘23 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు గారు పార్టీలోకి తీసుకున్నారు. అంతకు ముందు వరకు రోజూ వాళ్లు ఆయన్ను బూతులు తిట్టారు. అయినా సరే తీసుకున్నాం. అలాగే జలీల్ఖాన్ చంద్రబాబును అప్పటి వరకు బూతులు తిట్టారు.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?’ అంటూ టీడీపీకి చెందిన విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని)ఇటీవల నడిరోడ్డుపై పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ చేసిన బహిరంగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నిలదీయడంతో కేశినేని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. దీనిపై నెటిజనులు ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 39వ డివిజన్ నుంచి టీడీపీ తరఫున కార్పొరేటర్ అభ్యరి్థగా బరిలో ఉన్నట్లు చెప్పుకుంటున్న కప్పగంతుల శివ స్థానికంగా ఏర్పాటు చేసుకున్న ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎంపీ కేశినేని నాని విచ్చేశారు. నగర పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వర్గానికి చెందిన స్థానిక మాజీ కార్పొరేటర్ గుండారపు హరిబాబు తన మద్దతుదారులతో నాలుగు స్తంభాల సెంటర్లో ఎంపీని అడ్డుకున్నారు. 39వ డివిజన్ కార్పొరేట్ అభ్యరి్థగా హరిబాబు కుమార్తె పూజితను గతంలోనే ఎంపిక చేశారు. టీడీపీతో సంబంధంలేని వారికి టికెట్ ఎలా ఇస్తా్తరంటూ వాగ్వివాదానికి దిగారు. దీనికి సమాధానంగా గతంలో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబునాయుడు ఎలా తీసుకున్నారో ఇప్పుడు తాను అలాగేనని తేల్చిపారేశారు. ఎంపీ అమ్ముడుపోయారు: హరిబాబు కేశినేని నాని అమ్ముడుపోయారని హరిబాబు తన కుమార్తె, నాయకులతో కలిసి మీడియా సమక్షంలో తీవ్రారోపణలు చేశారు. పార్టీ హైకమాండ్ టికెట్టు తమకిచ్చిందని.. వైఎస్సార్లోకి వెళ్లినోళ్లకి టికెట్ ఇస్తామంటే ఒప్పుకునేది లేదన్నారు. డివిజన్కు రూ.20 లక్షలు మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, ఆయన భార్య మూడు పర్యాయాలు గెలిచిన డివిజన్ను తన కూతురు శ్వేత కోసం బెదిరించి లాగేసుకున్నారని హరిబాబు ఆరోపించారు. ఒక్కో డివిజన్ అభ్యర్థికి 15 నుంచి 20 లక్షలు ఖర్చవుతుందని చెప్పి, ఆ మొత్తాన్ని తాను ఇస్తానని ఎంపీ చెప్పారన్నారు. కేశినేని శ్వేతను మేయర్ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించలేదని స్పష్టంచేశారు. చదవండి: పంచాయతీల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం తుదిదశలోను టీడీపీ దాష్టీకం -
కోచ్ గోపీచంద్తో విభేదాల్లేవు
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, టోక్యో ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగానే గచ్చిబౌలిలోని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో సాధన చేస్తున్నానని వరల్డ్ చాంపియన్ పీవీ సింధు స్పష్టం చేసింది. గోపీచంద్ కోరిన మీదటే ‘శాట్స్’ తమ శిక్షణకు స్టేడియాన్ని సిద్ధం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసింది. ఒలింపిక్స్లో తాము పోటీ పడే తరహా వాతావరణం గచ్చిబౌలి స్టేడియంలో అందుబాటులో ఉండటమే తాను అక్కడికి వెళ్లేందుకు కారణమని ఆమె వెల్లడించింది. ‘నాకూ, చీఫ్ కోచ్కు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మా ఇద్దరి మధ్య అంతా బాగుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉన్నాయి. ఇదే తరహా వేదికపైనే ఒలింపిక్ మ్యాచ్లు జరగనున్నాయి. ముఖ్యంగా ఏసీ బ్లోయర్లు మ్యాచ్లో షటిల్ దిశను ప్రభావితం చేస్తాయి. దానికి అలవాటు పడాలంటే అలాంటి సౌకర్యం ఉన్న స్టేడియంలోనే ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ సాధన చేసేందుకు నాకు ‘సాయ్’ కూడా అనుమతి ఇచ్చింది’ అని సింధు పేర్కొంది. కొన్నాళ్ల క్రితం తాను లండన్ వెళ్లినప్పుడు తన కుటుంబంతో విభేదాల గురించి వచ్చిన వార్తలపై చాలా బాధపడ్డానని, అయితే అందరికీ తాను వివరణ ఇస్తూ ఉండలేనని సింధు వ్యాఖ్యానించింది. -
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బరితెగింపు..
-
పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బరితెగింపు..
సాక్షి, విజయవాడ: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బరి తెగించింది. ప్రజా మద్దతు లేకపోవడంతో టీడీపీ నేతల దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ నేతల రభస సృష్టించారు. టీడీపీ నేతల నిర్వాకంతో కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రామాల్లో గొడవలు సృష్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిధంగా రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులపై బెదిరింపులకు దిగారు. కృష్ణా జిల్లా పామర్రు పెరిసేపల్లి పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. మాస్క్ పెట్టుకోలేదన్న నెపంతో వైఎస్సార్ సీపీ మద్దతుదారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారు. కొత్త నిమ్మకూరులో టీడీపీ నేత బరితెగించారు. వృద్ధురాలితో బూత్లోకి వెళ్లి ఓటు వేసేందుకు టీడీపీ నేత ప్రయత్నించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలో సర్పంచ్ అభ్యర్ధిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. కృష్ణపల్లి కేంద్రం వద్ద వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్ధిపై దౌర్జన్యానికి దిగారు. (చదవండి: మాట వినకపోతే చంపేస్తాం.. బాబు పీఏ బెదిరింపులు..) ఇదేం బరితెగింపురా నాయనా..! -
టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు..
అధికారంలో ఉన్నప్పుడు సామ్రాజ్యాలను విస్తరించుకుపోయారు తెలుగు తమ్ముళ్లు. అప్పుడు ఒకరంటే ఒకరికి పడకున్నా చేతిలో పవర్ ఉండటంతో కిమ్మనకుండా ఉన్నారు. తీరా గత సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బ తిని, అధికారానికి దూరమయ్యేసరికి వారి మధ్య ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఎన్నికలకు వెళ్లడమంటే డబ్బుతో కూడుకున్న పని. అందుకు ముఖం చాటేస్తున్న నేతలు ఆ నిందను ఒకరిపై మరొకరు నెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మూడేళ్ల తరువాత జరిగే రాజకీయ పరిణామాలకు ఇప్పటి నుంచే వ్యూహాల కత్తులకు పదును పెడుతున్నారు. సాక్షి ప్రతినిధి,రాజమహేంద్రవరం: జిల్లా టీడీపీ నేతల మధ్య చాప కింద నీరులా ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు.. ప్రస్తుత పంచాయతీ పోరు పుణ్యమా అని రచ్చకెక్కాయి. ఆ పార్టీ పదవులకు, కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలకు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త, పార్టీ సీనియర్ నాయకుడు వీర వెంకట సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) శుక్రవారం గుడ్బై చెప్పారు. మీడియా ముందు రాజీనామా ప్రకటన వేళ మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి కంట తడి పెట్టారు. తమ రాజీనామాలకు మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కారణమని సత్తిబాబు ఆరోపించారు. (చదవండి: టీడీపీ పదవులకు మాజీ ఎమ్మెల్యే దంపతుల రాజీనామా) అయితే సత్తిబాబు దంపతుల మీడియా సమావేశం జరిగిన గంటల వ్యవధిలోనే చినరాజప్ప మాట్లాడుతూ, ఇందులో తన ప్రమేయం ఎంతమాత్రం లేదని అన్నారు. ఏడాది కాలంగా అనంతలక్ష్మి దంపతులు పార్టీ బాధ్యతల నుంచి వైదొలగుతామంటూ చెబుతూ వచ్చి, ఇప్పుడు హఠాత్తుగా తనపై నింద వేస్తున్నారని అన్నారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, బరువు మోయాల్సిన సమయంలో సత్తిబాబు కాడి వదిలేస్తున్నారని వైరి వర్గం ఆరోపిస్తోంది. ఈ వివాదానికి ఇరుపక్షాల నుంచి వినిపిస్తున్న వాదనలు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఈ పచ్చ రచ్చకు అసలు కారణాలు వేరే ఉన్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. (చదవండి: చిత్తూరు జిల్లాలో టీడీపీ హైడ్రామా) భాస్కర రామారావును తీసుకువచ్చేందుకు.. ప్రస్తుతం తటస్థంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావును పార్టీలోకి క్రియాశీలకంగా తీసుకు రావాలనేది సత్తిబాబు వ్యూహం. పార్టీ ఆవిర్భావం నుంచి సత్తిబాబుకు భాస్కర రామారావు ప్రధాన అనుచరుడనే ముద్ర ఉంది. తాను త్యాగం చేసిన కాకినాడ రూరల్ స్థానానికి భాస్కర రామారావును తీసుకువచ్చి, చినరాజప్ప భవిష్యత్తు వ్యూహానికి చెక్ పెట్టాలనేది సత్తిబాబు ఎత్తుగడగా ఉంది. ఎక్కడో కోనసీమ నుంచి వచ్చి, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి, తమ నియోజకవర్గంలో వేలు పెడితే తమ వ్యూహం తమకు ఉండదా అని సత్తిబాబు వర్గం ప్రశి్నస్తోంది. ఆర్థిక స్తోమతతో దూకుడుగా వ్యవహరించే భాస్కర రామారావును కాకినాడ రూరల్కు తీసుకువస్తే పార్టీ శ్రేణులకు ధైర్యం కల్పించినట్టవుతుందని సత్తిబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని ఇటీవల ఆయన వద్ద ప్రతిపాదించారు. ఈ విషయాన్ని సత్తిబాబే స్వయంగా మీడియాకు చెప్పడం గమనార్హం. అయితే భాస్కర రామారావును తీసుకు రావాలనుకుంటే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం తమకు ఎంతమాత్రం లేదని చినరాజప్ప వర్గం పేర్కొంటోంది. భాస్కర రామారావును తీసుకురావాలనే సత్తిబాబు వ్యూహం బయటకు పొక్కడంతో తప్పు తమ నాయకుడిపై నెట్టేందుకు ప్రయతి్నస్తున్నారని చినరాజప్ప వర్గీయులు అంటున్నారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, పవర్ పోయేసరికి పార్టీని వదిలేసిన విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం తప్పేమిటని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గత ఎంపీటీసీ ఎన్నికల నుంచి నేటి పంచాయతీ ఎన్నికల వరకూ నియోజకవర్గ ఇన్చార్జిగా సత్తిబాబు అభ్యర్థులను నిలబెట్టకుండా పార్టీని నిరీ్వర్యం చేయడం వాస్తవం కాదా అని రాజప్ప వర్గీయులు ప్రశి్నస్తున్నారు. ఈ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి ఎటు పయనిస్తుందో వేచి చూడాల్సిందే. ఈలోగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇరు వర్గాల మధ్య రాజీకి ప్రయత్నాలు చేస్తున్నారు. మా కుటుంబంపై మీకేమైనా గౌరవం ఉంటే, మాజీ శాసన సభ్యురాలిగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారనే ఉద్దేశం ఉంటే నేను, నా భార్య అనంతలక్ష్మి చనిపోయిన తరువాత తెలుగుదేశం జెండా కప్పి శ్మశానానికి తీసుకువెళ్లండి. మీతో అభిప్రాయ భేదాలు కాదు.. నేను మనస్తాపం చెందాను. నా కుటుంబం ఇబ్బంది పాలయింది. నా కుర్రాళ్లు ‘తిరం’ కాదు. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను. అర్హత ఉన్న వారిని పెట్టుకోమని చెబుతున్నాను. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు ఇబ్బందులు వచ్చాయి. నెల కిత్రం చంద్రబాబుతో జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడాను. ఆయన సమస్య రెక్టిఫై చేస్తానన్నారు. కానీ రానురానూ జిల్లా పార్టీ యంత్రాంగంలో నాకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. కొంతమంది నాయకులకు నేనంటే ఇష్టం లేదు. ఇష్టం ఉన్న నాయకుడిని పెట్టుకోండి. నాకు ఇబ్బంది లేదు. బొడ్డు భాస్కర రామారావు వద్దకు వెళ్లి, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయాలని, నీ వద్ద ఉన్న డబ్బు, సత్తా, ఎప్పియరెన్స్కు కచ్చితంగా నెగ్గుతావని అన్నాను. చినరాజప్ప తదితరులతో మనస్పర్థలున్నాయి. బొడ్డు భాస్కర రామారావును రమ్మనడం వలన ఇబ్బందులు పెడుతున్నారేమో అర్థం కాలేదు. – పిల్లి వీర వెంకట సత్యనారాయణమూర్తి రూరల్పై రాజప్ప కన్ను వేయడమే కారణమా! టీడీపీలో రగిలిన ఈ రచ్చకు కాకినాడ రూరల్ నియోజకవర్గం కేంద్ర బిందువనే చర్చ నడుస్తోంది. రెండుసార్లుగా పెద్దాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చినరాజప్ప వచ్చే ఎన్నికలకు కాకినాడ రూరల్పై కన్ను వేశారనే ప్రచారం చాలా కాలంగా ఉంది. వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికల్లో చినరాజప్ప కాకినాడ రూరల్ నుంచి పోటీకి దిగుతారని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో చినరాజప్పను పెద్దాపురం నుంచే రెండోసారి బరిలోకి దింపారు. పెద్దాపురంలో పార్టీ శ్రేణులు చెల్లాచెదురై ఆదరణ తగ్గిపోవడంతో మూడేళ్లు ముందే కొత్త స్థానం కోసం చినరాజప్ప వెతుకులాడుతున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో తాను ఆశించిన కాకినాడ రూరల్ నియోజకవర్గంపై ఆయన కన్ను వేశారని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాకినాడ రూరల్లో లైన్ క్లియర్ చేసుకునే లక్ష్యంతోనే చినరాజప్ప ఆ నియోజకవర్గ ఇన్చార్జి సత్తిబాబు దంపతులపై ఏడాది కాలంగా అధిష్టానానికి వ్యూహాత్మకంగా తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో పార్టీని నిర్వీర్యం చేశారని చినరాజప్ప పార్టీ అధినేత చంద్రబాబుకు పదేపదే ఫిర్యాదులు చేస్తూ, తమను తక్కువ చేస్తున్నారని సత్తిబాబు వర్గీయులు మండిపడుతున్నారు. అనంతలక్ష్మి దంపతులను కాకినాడ రూరల్ నుంచి పొమ్మనకుండానే పొగ పెట్టేందుకే రాజప్ప ఈవిధంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. రాజకీయ వేధింపులకు తోడు ఇటీవల కుటుంబ పరంగా ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలోనే పార్టీ పదవులు, ఇన్చార్జి బాధ్యతల నుంచి వైదొలగాల్సి వస్తోందని సత్తిబాబు చెబుతున్నారు. ఆ ప్రకటన బాధాకరం.. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యనారాయణమూర్తి నా కారణంగా బయటకు వెళ్తున్నట్టు శుక్రవారం విలేకర్ల సమావేశంలో చెప్పారు. వీరిద్దరూ గత ఏడాది కాలంగా ఇంటి నుంచి బయటకు రాలేదు. అనంతరం చంద్రబాబు, యనమల రామకృష్ణుడితో పాటు నా వద్దకు కూడా వచ్చి తాను ఇన్చార్జ్గా ఉండలేనని చెప్పారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టాలని రామకృష్ణుడు చెప్పారు. ఆవిధంగానే గ్రామాల్లో అభ్యర్థులను ఏర్పాటు చేశారు. ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు నా కారణంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం బాధాకరం. నేను పార్టీ కోసం పని చేస్తాను. పార్టీకి నష్టం కలిగించే పని చేయను. – నిమ్మకాయల రాజప్ప, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే, పెద్దాపురం -
కలహాల కాపురాలు..చిన్నపాటి విషయాలకే గొడవలు
కుటుంబ కలహాలు సామాజిక సమస్యగా మారుతున్నాయి. చిన్నచిన్న విషయాలకే గొడవలకు దిగి కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. కూర్చుని మాట్లాడుకుని సర్దుబాటు చేసుకునే అవకాశాలున్నా పట్టింపులకు పోయి దూరమవుతున్నారు. మనస్పర్థలు, అపోహలతో మొదలైన విభేదాలే విడిపోయేంత అగాధాన్ని సృష్టిస్తున్నాయి. మానవ సంబంధాలను దూరం చేస్తున్నాయి. సాక్షి, కామారెడ్డి: భార్య,భర్తల మధ్య తలెత్తే స్వల్ప విభేదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే చాలావరకు గొడవల నుంచి బయటపడవచ్చు. ఈ చిన్న పాటి లాజిక్ను వదిలేసి చాలా కుటుంబాలు అనవసర తగదాలకు పోయి దూరమవుతున్నారు. చాలా సందర్భాల్లో ఇవే గొడవలు చిలికిచిలికి గాలివానలా మారి హత్యలు, ఆత్మహత్యలకూ దారితీస్తున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటే దాంపత్యం జీవితం అన్యోన్యంగా సాగిపోతుందని, కానీ చాలామంది తప్పు తనది కాదంటే తనది కాదంటూ పట్టింపులకు పోతుండడం వివాదాలను పెంచుతోంది. ఎవరూ తగ్గడం లేదు.. జీవితం యాంత్రికంగా మారింది. సమయానికి వంట చేయలేదని భర్త, ఇంటికి కావలసిన సామగ్రి తేవడం లేదని భార్య, తనమాట వినడం లేదని భర్త, మద్యం సేవిస్తున్నాడని భార్య, తన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తోందని భర్త, తనను పట్టించుకోవడం లేదని భార్య.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం కుటుంబాల్లో సాదారణంగా మారింది. ఈ సమస్య లన్నీ చిన్నచిన్నవే. వీటిని పరిష్కరించుకునే అవకాశాలు చాలా ఎక్కువ. కానీ ఎవరూ తగ్గడం లేదు. ఫలితంగా గొడవలు పెంచుకుంటున్నారు. ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయకుండా ఎవరికి వారుగా ఇరుగు పొరుగు వారికి చెప్పుకుని రోడ్డున పడుతున్నారు. చెప్పుడు మాటలతో దూరమై పోలీసుస్టేషన్ గడప తొక్కుతున్నారు. ఒక్కోసారి గృహహింస, వరకట్న వేధింపుల వంటి కేసుల వరకూ వెళ్తున్నాయి. ఇవి వారి మధ్య మరింత దూరగడానికి కారణమవుతున్నాయి. గత ఏడాది జిల్లాలో గృహహింసకు సంబంధించి 136 కేసులు నమోదయ్యాయి. కౌన్సెలింగ్ ద్వారా 110జంటలు ఒక్కటయ్యారు. ఖర్చులూ సమస్యే.. పెరిగిన కుటుంబ ఖర్చులు, పిల్లల చదువులకు అ య్యే వ్యయం కుటుంబాలకు భారంగా మారింది. ఇలాంటి సమయంలో భార్య, భర్తలిద్దరూ ఒకరికొకరు చర్చించుకుని ఖర్చు పొదుపుగా చేయడానికి ప్రయత్నించాలి. ఒక్కరే సంపాదిస్తున్నపుడు కు టుంబ పోషణకు సరిపడక ఇబ్బందులు తలెత్తడం సహజం. అలాంటి సందర్భాల్లో ఇద్దరూ చెరోపని ఎంచుకుని చేయడం ద్వారా ఆర్థిక కష్టాలను కొంతవరకు అధిగమించవచ్చు. కానీ ఇద్దరి మధ్య అవగాహన లేకపోవడం మూలంగా ఖర్చు విషయంలో పొదుపు చర్యలు పాటించే ప్రయత్నం చేయడం లేదు. పిల్లల అల్లరి మూలంగా భార్య, భర్తలు గొడవలు పడుతుంటారు. పిల్లలు అల్లరి చేస్తే తల్లిగానీ, తండ్రి గాని వారిని సర్ధిచెప్పే ప్రయత్నం చే యకుండా, రెండు మూడు దెబ్బలు తగిలిస్తున్నా రు. పిల్లల్ని అలా కొడతావా అంటూ గొడవ పడ డం కనిపిస్తోంది. ఇలాంటి చిన్న చిన్న అంశాలు వా రి మధ్య ఘర్షణలకు కారణమవుతున్నాయి. అనాథలుగా చిన్నారులు.. కుటుంబ కలహాలు ఒక్కోసారి హత్యలకు దారితీస్తున్నాయి. అలాగే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇరువురి మధ్య విభేదాలు పెరిగి ఆవేశంలో హత్యలకు పాల్పడుతున్నారు. ఫలితంగా జైలుపాలై, పిల్లలు అనాథలుగా మారాల్సి వస్తోంది. ఇంట్లో తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా పిల్లలు అనాథలుగా మారాల్సి వస్తోంది. చేయని నేరానికి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. హత్యలు, ఆత్మహత్యలకు కారణమైన వారు పోలీసు కేసుల్లో జైలుపాలై ఆర్థికంగా, మానసికంగా దెబ్బతింటున్నారు. సర్దుకుపోయే తత్వం ఏది..? భార్య, భర్తల మధ్య తలెత్తుతున్న చిన్నచిన్న గొడవలను పరిష్కరించుకోవడం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగవచ్చు. కానీ చాలా మంది పంతాలు, పట్టింపులకు వెళ్లి రోడ్డున పడుతున్నారు. చాలావరకు ఎవరో ఒకరు తగ్గితే సర్దుకుపోయే అవకాశం ఉన్నా ఇద్దరూ తప్పు నీదంటే తప్పు నీదంటూ ఒకరికొకరు గొడవ పడుతున్నారు. ఫలితంగా ఇబ్బందులపాలై సమాజంలోనూ చులకన అవుతున్నారు. అర్థం చేసుకుంటే జీవితం అన్యోన్యంగా మారుతుందన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. -
విద్వేషాలకే వింత రాజకీయం
సాక్షి, అమరావతి: తనది 40 ఏళ్ల రాజకీయ అనుభవమని ప్రతిచోటా చెప్పుకునే చంద్రబాబు పంచాయతీ ఎన్నికలకు వింత భాష్యం చెప్పడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పార్టీ గుర్తులేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లోనూ తన క్షుద్ర రాజకీయాన్ని జొప్పించి విద్వేషాలు రగిలించడానికి ఆయన పడుతున్న తాపత్రయం చూసి రాజకీయ పండితులు నివ్వెరపోతున్నారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా ఒకవైపు ప్రభుత్వం పంచాయతీల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తుంటే దానికి వ్యతిరేకంగా చంద్రబాబు పోటీకోసం కాలుదువ్వడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇందుకోసం పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు ఏకంగా మేనిఫెస్టో విడుదల చేసి మరీ తాను గ్రామాలను ప్రశాంతంగా ఉండనిచ్చేదిలేదని పరోక్షంగా చెప్పడంతో టీడీపీ నాయకులే నోరెళ్లబెడుతున్నారు. చదవండి: టీడీపీ కుట్రకు యాప్ దన్ను గ్రామాల్లో ఉద్రిక్తతలు పెంచడమే లక్ష్యమా? గ్రామాల్లో రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు, స్థానికుల మధ్య విభేదాలను నివారించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో ఏళ్ల నుంచి పంచాయతీల్లో పార్టీ గుర్తులేకుండా ఎన్నికలు జరుపుతున్నారు. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు గౌరవిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధానం అమలైంది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏ రాజకీయ పార్టీ అయినా దీన్ని గౌరవించాల్సిందే. ఈ చట్టం ప్రకారమే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాలి. కానీ, చంద్రబాబు దీన్ని ఉల్లంఘిస్తూ పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడంపై సొంత పార్టీ సహా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిరోజూ రాజ్యాంగ పరిరక్షణకు నీతి వాక్యాలు చెప్పే చంద్రబాబు.. మేనిఫెస్టో ప్రకటించడం ద్వారా దానికి తూట్లు పొడిచారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనివల్ల గ్రామాల్లో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంటుందని, ప్రజలను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే చంద్రబాబు ఇలాంటి బరితెగింపు చర్యలకు దిగారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చదవండి: ఇద్దరు ఐఏఎస్లపై చర్యలొద్దు చంద్రబాబు మేనిఫెస్టోకు విలువ ఉందా? చంద్రబాబు చెప్పే మాటలు, విడుదల చేసే మేనిఫెస్టోలకు ఎప్పుడూ విలువలేదు. 2014 ఎన్నికల్లో 600కి పైగా అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ఆయన.. వాటిని పక్కనపెట్టి అడ్డగోలుగా పరిపాలన చేయడంతో 2019 ఎన్నికల్లో ప్రజలు దారుణంగా ఓడించారు. ఇప్పుడు మళ్లీ అవే హామీలు, అలాంటి మేనిఫెస్టోనే విడుదల చేయడం వెనుక స్వార్థ రాజకీయమే తప్ప ప్రజలపై చిత్తశుద్ధిలేదని విశ్లేషకులు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ఎలా విడుదల చేస్తారని ప్రశ్నలు వస్తాయనే ఉద్దేశంతోనే ముందుగానే దాన్ని సమర్థించుకునేందుకు చంద్రబాబు ఒక వాదనను సిద్ధంచేసుకున్నారు. తెర వెనుక రాజకీయాలు ఉన్నా ఎన్నికలు మాత్రం గుర్తుల్లేకుండా జరుగుతాయి కాబట్టి చట్టం ప్రకారం ఇవి పార్టీ రహిత ఎన్నికలే. అలాంటి ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం ద్వారా చంద్రబాబు చట్టాన్ని ఉల్లంఘించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గెలిస్తే కరోనా వ్యాక్సిన్ ఇచ్చేస్తారంట! పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడమే ఒక వింత అయితే, దాన్ని తలదన్నేలా.. పంచాయతీ పోరులో గెలిస్తే 60 రోజుల్లో కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తామని చంద్రబాబు అనడం పెద్ద చర్చనీయాంశమైంది. ఆయనిచ్చిన ఈ హామీపై ఇప్పుడు తెగ సెటైర్లు పేలుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న మనమెలా వ్యాక్సిన్ ఇస్తాం? అదీ పంచాయతీ ఎన్నికల్లో గెలిస్తే? అని ఆ పార్టీ నాయకులే జుట్టు పీక్కుంటున్నారు. వ్యాక్సిన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం.. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో. కానీ, కొన్ని పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలిచినంత మాత్రాన వ్యాక్సిన్ ఇవ్వడం ఎలా సాధ్యమో అర్థంకాక రాజకీయ పండితులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఇవేకాక.. ప్రతి ఒక్కరికీ వంద గజాల్లో రూ.3 లక్షలతో ఇల్లు కట్టిస్తామని, నీటిశుద్ధి కేంద్రాలు ఏర్పాటుచేస్తామని ఎడాపెడా వాగ్దానాలు చేసిపారేశారు. పంచాయతీల్లో గెలిస్తే రాష్ట్రంలో తమ ప్రభుత్వమే వచ్చేస్తుందనే స్థాయిలో చంద్రబాబు మాట్లాడుతుండడంపై ఆ పార్టీ నేతలే నవ్వుకుంటున్నారు. తమ అధినేతకు ఏదో అయిందని.. లేకపోతే ఈ హామీలేంటని వారు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. -
చైనాతో మళ్లీ ఘర్షణ
న్యూఢిల్లీ: ఉత్తర సిక్కింలోని 16 వేల అడుగుల ఎత్తైన నాకు లా ప్రాంతంలో ఉన్న సరిహద్దుల్లో భారత్, చైనా సైనికుల మధ్య గతవారం స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. జనవరి 20న జరిగిన ఈ ఘర్షణ ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ బాహాబాహీలో రెండు దేశాల సైనికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. సుమారు 20 మంది చైనా సైనికులు, నలుగురు భారత జవాన్లు గాయపడ్డారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల స్థానిక కమాండర్లు ఈ సమస్యను పరిష్కరించారని ఆర్మీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తొలగించే లక్ష్యంతో ఇరుదేశాల మధ్య 9వ విడత చర్చలు ఆదివారం ఉదయం ప్రారంభమై.. సోమవారం మధ్నాహ్నం వరకు కొనసాగాయి. తాజా ఘటనను భూతద్దంలో చూసి, అనవసర, అబద్ధపు ప్రచారం చేయవద్దని మీడియాను కోరుతున్నామని భారతీయ ఆర్మీ ప్రకటించింది. ఈ నెల 20న ఉత్తర సిక్కింలోని నాకు లా వద్ద వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి వచ్చేందుకు చైనా సైనికులు ప్రయత్నించారు. భారత సైనికులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. దీనిపై తమ వద్ద సమాచారం లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ వ్యాఖ్యానించారు. ‘సరిహద్దుల్లో శాంతి నెలకొనేందుకు చైనా దళాలు కట్టుబడి ఉన్నాయన్నారు. అహంకార ధోరణి సరికాదు: జిన్పింగ్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్)ను ఉద్దేశించి జిన్పింగ్ సోమవారం ప్రత్యేకంగా ప్రసంగించారు. వారంపాటు జరిగే ఈ డబ్ల్యూఈఎఫ్ ఆన్లైన్ సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోదీ గురువారం ప్రసంగిస్తారు. సొంత ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఇతర దేశాలను ఇబ్బంది పెడ్తూ అహంకార పూరిత ధోరణితో వ్యవహరించే దేశాలు ఒంటరిగా మిగిలిపోతాయని హెచ్చరించారు. ఏ దేశం పేరునూ ప్రస్తావించనప్పటికీ.. అమెరికా, భారత్లను ఉద్దేశించే జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. -
'పంత్తో నాకు ఎలాంటి విభేదాలు లేవు'
ముంబై: టీమిండియా వికెట్కీపర్ వృద్ధిమాన్ సాహా తన సహచర ఆటగాడు రిషబ్ పంత్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ పర్యటనలో రిషబ్ గొప్ప ప్రదర్శన చేసినప్పటికి తన కెరీర్కు వచ్చిన ప్రమాదం ఏం లేదని పేర్కొన్నాడు. 'పంత్కు,నాకు మధ్య మంచి అనుబంధం ఉంది.. కావాలంటే అ విషయంపై మీరు అతన్ని అడగొచ్చు. తుది జట్టులో ఎవరికి చోటు దక్కినా.. ఎవరు బాధపడం.. పైగా ఒకరినొకరు సాయం చేసుకుంటాం. వ్యక్తిగతంగానూ నాకు పంత్తో ఎలాంటి విభేదాలు లేవు.. మా ఇద్దరిలో నెంబర్ 1,2 అంటూ ఎవరు లేరు. బ్యాటింగ్లో ఎవరిశైలి వారికి ఉంటుంది. మ్యాచ్లో ఉత్తమంగా రాణించినవారికి జట్టు అవకాశాలిస్తుంది. నా పని నేను చేసుకుంటూ వెళుతా.. అంతేగాని జట్టు ఎంపిక అనేది నా చేతుల్లో ఉండదు. బ్యాటింగ్లో మంచి ప్రదర్శన కనబరిచిన పంత్ కీపింగ్లోనూ క్రమంగా మెరుగవుతున్నాడు. మొదటి తరగతిలోనే అన్ని నేర్చుకోవాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది.. పంత్ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఏదో ఒకరోజు ఉన్నతస్థాయికి ఎదుగుతాడు. అయితే ఒక్క ఇన్నింగ్స్తోనే రిషబ్ పంత్ను టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనితో పోలుస్తున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎవరి వ్యక్తిగత గుర్తింపు వారికి ఉంటుంది. ఇక రహానే కెప్టెన్సీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సిరీస్లో మేం సాధించిన విజయం ప్రపంచకప్ గెలిచినంత సమానం. రహానే కెప్టెన్సీ చాలా కూల్గా ఉంటుంది. కోహ్లి లాగే అతను ఆటగాళ్లను బాగా నమ్ముతాడు.. భావోద్వేగాలను బయటపెట్టడానికి మాత్రం ఇష్టపడడు. సహచరుల్లో స్పూర్తి ఎలా నింపాలో రహానేకు బాగా తెలుసు.. అతని విజయరహస్యం కూడా ఇదే అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: థ్యాంక్యూ యువీ భయ్యా.. ఇదంతా నీ వల్లే ఆసీస్తో జరిగిన తొలి టెస్టులో విఫలం తర్వాత మిగతా మూడు టెస్టులకు అవకాశం రాకపోవడంపై సాహా స్పందించాడు. ఎవరి కెరీర్లోనైనా ఫెయిల్యూర్ అనే దశ కచ్చితంగా ఉంటుంది. కెరీర్లో ముందుకు సాగాలంటే ఇలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొవడం తప్పనిసరి.. నేను గాయపడడంతోనే కదా.. రిషబ్ పంత్ ప్రతిభ ఎంత అనేది భయపడింది. అంతమాత్రానా నా కెరీర్ ముగిసిపోతుందని నేను అనుకోనని తెలిపాడు. చదవండి: ఐపీఎల్: రిటైన్ లిస్టులో పేరు లేకపోవడం బాధాకరం -
ఘర్షణ: సముద్రంలో ఛేజింగ్!
సాక్షి, ఒంగోలు: సముద్రంలో చేపలు, రొయ్యల విషయంలో చీరాల మండలంలోని పలు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో రెండు గ్రూపులుగా విడిపోయిన పలు గ్రామాల మత్స్యకారులు సముద్రంలో పలుమార్లు చేపల వేట చేసుకుంటూనే గొడవలకు దిగుతూ వచ్చారు. అది కాస్తా చిలికి చిలికి గాలివానలా మారి ఒక గ్రామం మత్స్యకారుల వలలను, బోట్లను మరో గ్రామానికి చెందిన మత్స్యకారులు తీసుకెళ్లడంతో ఘర్షణలు తారస్థాయికి చేరాయి. ఆ తరువాత తీసుకెళ్లిన బోట్లు, వలలకు చెందిన గ్రామస్తులు ఇతర గ్రామాలకు చెందిన బోట్లను, వలలను తీసుకెళ్లడంతో మత్స్యకారుల మధ్య గొడవ కాస్తా గ్రామాల మధ్య గొడవగా మారింది. దీంతో గ్రామాల వారీగా ఒకరిపై ఒకరు చీరాల, ఈపూరుపాలెం పోలీస్స్టేషన్లలో కేసులు పెట్టుకునే స్థాయికి చేరుకుంది. దీంతో గ్రామాల మధ్య నెలకొన్న ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో ఆ గ్రామాల మధ్య పంచాయతీ జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. దీంతో బుధవారం ఒంగోలులోని మత్స్యశాఖ జేడీ కార్యాలయంలో ఓడరేవు గ్రామానికి చెందిన మత్స్యకారులను, రెండవ వర్గానికి చెందిన కఠారివారిపాలెం, రామచంద్రపురం, పొట్టిసుబ్బయపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులతో మత్స్యశాఖ అధికారులు, పోలీసులు సంప్రదింపులు జరిపారు. ఒక గ్రామానికి చెందిన పడవలు, వలలు మరో గ్రామానికి చెందిన వారు తీసుకెళ్లడం, మరో గ్రామాలకు చెందిన పడవలు, వలలను ఇంకొక గ్రామానికి చెందిన మత్స్యకారులు తీసుకెళ్లడం మానుకోవాలని అధికారులు ఆయా గ్రామాల మత్స్యకారులకు సూచించారు. ఘర్షణ వాతావరణం లేకుండా సయోధ్యగా ఉండాలని కూడా ఆయా గ్రామాల మత్స్యకారులకు నచ్చజెప్పారు. అర అంగుళం సైజు కంటే తక్కువ కన్ను ఉన్న వలలను వాడటంతో సముద్రంలో ఉన్న గుడ్లుతో సహా వలల్లో వస్తున్నాయని దీంతో మత్స్యసంపద నశించిపోతుందన్న ఉద్దేశంతో ఘర్షణ వాతావరణం నెలకొందనే ఉద్దేశమని అధికారులు నిర్ధారణకొచ్చారు. దీనిపై మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ ఆవుల చంద్రశేఖరరెడ్డి ఆయా గ్రామాల్లో వాడుతున్న వలలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఈలోగా గొడవలు లేకుండమత్స్యకారులు కలిసిమెలిసి ఉండాలని ఆయన సూచించారు. -
బీజేపీలో.. పదవుల ముసలం..!
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో అంతంత మాత్రంగా ప్రభావం ఉన్న బీజేపీని ఆ పార్టీలోని వర్గపోరు మరింత బలహీనం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కనీసం మూడు వర్గాలుగా విడిపోయిన జిల్లా బీజేపీలో పదవుల కోసం లొల్లి మొదలైందని అంటున్నారు. ము న్సిపల్ ఎన్నికల వరకు అంతా కలిసికట్టుగా ఉన్నట్టు కనిపించిన బీజేపీలో ఆ తర్వాత పరిణామాలతో అభిప్రాయభేదా లు ఏర్పడ్డాయి. జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన కంకణా ల శ్రీధర్రెడ్డి ఏకపక్షంగా జిల్లా కార్యవర్గాన్ని నియమించుకున్నారన్న అసంతృప్తి గొడవలకు దారి తీస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. జిల్లా మాజీ అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్గౌడ్, ప్రస్తుత అధ్యక్షుడు కంకణాల శ్రీధర్రెడ్డి వర్గాలుగా జిల్లా బీజేపీ విడిపోయిందన్న చర్చ జరుగుతోంది. కొత్త అధ్యక్షుడిగా శ్రీధర్రెడ్డి నియామకం అయిన తర్వాత పార్టీ సమావేశాలు నిర్వహించడంలో, వివిధ కార్యక్రమాల నిర్వహణకు సీనియర్లను ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సీనియర్ నాయకులతో పాటు ద్వితీయ శ్రేణి కార్యకర్తలు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రానికి వచ్చే సందర్భంలో సీనియర్లకు కనీస సమాచారం లేకుండా కొందరిని కోటరిగా పెట్టుకుని వారు చెప్పినట్లుగా నడచుకుంటున్నారనే అపవాదును ఎదుర్కొంటున్నారు. అందరినీ కలుపుకొనిపోయి పార్టీని బలోపేతం చేయకుండా తమకు నచ్చని వారిని పక్కన పెట్టేసి, పార్టీని బలహీన పర్చేలా జిల్లా అధ్యక్షుడే వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇక, జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలు, ప్రజా సమస్యలపై ఎలాంటి ఆందోళనలు, పో రాటాలు చేయకుండా కేవలం ప్రెస్మీట్లతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు వివాదం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అంతా కలిసి పనిచేయాల్సిన పార్టీ నాయకత్వం అభిప్రాయభేదాలతో ఎవరికి వారు అన్నట్లు వ్యవహరిస్తుండడం, ఆందోళన కలిగిస్తోందని బీజేపీ తటస్థ శ్రేణులు పేర్కొంటున్నాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సారి నల్లగొండ– ఖమ్మం– వరంగల్ ఎమ్మెల్సీ స్థానంపై పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ సంస్థాగత గ్రూపుల లొల్లి విజయావకాశాలను ప్రశ్నార్థకం చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పే పార్టీ నాయకత్వం మూడు గ్రూపులుగా విడిపోయి అంతర్గత పోరుతో రచ్చకెక్కడం పార్టీ శ్రేణులను కలవరానికి గురి చేస్తోంది. ఇటీవల జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు సన్నాహక సమావేశంలో జిల్లా అధ్యక్షుడు తప్ప ఇతర సీనియర్ నాయకులు ఒక్కరు కూడా పాల్గొనకపోవడం చూస్తుంటే అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోందని పార్టీ శ్రేణులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. జిల్లా అధ్యక్షుడు వ్యవహరిస్తున్న తీరుతో తాము సమావేశాలకు, ఇతర కార్యక్రమాలకు గైర్హాజరవుతున్నా ఏ మాత్రం మార్పు రావడంలేదని నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడి వద్దకు పంచాయితీ ! గతంలో ఎన్నడూ లేనివిధంగా అంతర్గత పోరు రచ్చకెక్కుతుండడంతో తటస్థ కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై పోరాడాల్సిన పార్టీ జిల్లా నాయకత్వం గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు అపనమ్మకంతో వ్యవహరిస్తున్నరన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మాజీ జిల్లా అధ్యక్షుడి ఇంటికి వెళ్లి లాబీయింగ్ చేస్తున్నావా అంటూ ఏకంగా జిల్లా అధ్యక్షుడు జిల్లా కేంద్రానికి చెందిన ఓ నాయకుడితో మాట్లాడిన మాటల ఆడియో పార్టీ నేతలను ఒకింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆడియోలో ఇరువురి మధ్య మాటల, తూటాలు పేలాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా అధ్యక్షుడి ఏకపక్ష నిర్ణయాలపై అసమ్మతి నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ముందే తేల్చుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర అధ్యక్షుడు ఈనెల 8వ తేదీన హైదరాబాద్కు వస్తున్నారని, ఆయన రాగానే జిల్లా పార్టీలో జరిగిన ఏకపక్ష నిర్ణయాలు, అధ్యక్షుడి తీరును వివరించేందుకు వ్యతిరేకవర్గం సిద్ధమవుతోందని చెబుతున్నారు. -
ఉద్రిక్తంగానే సరిహద్దు.. రాజ్నాథ్ ప్రకటన
న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు వివాదంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో గురువారం మరోసారి ఆసక్తికర ప్రకటన చేశారు. సరిహద్దు వివాదంపై ఎంపీలు లేవనెత్తిన ప్రశ్నలకు రాజ్నాథ్ సమాధానమిచ్చారు. చైనాతో ఎలాంటి పరిస్థితులున్నా తాము ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు మరోసారి స్పష్టం చేశారు. మన సాయుధ బలగాలతో చైనాకు ఇప్పటికే గట్టిగా సమాధానమిచ్చామని.. ఇరుదేశాల మధ్య ఉన్న ఒప్పందాలను చైనా బహిరంగంగానే ఉల్లఘింస్తుందని మరోసారి గుర్తుచేశారు. కాగా మంగళవారం చైనా సరిహద్దు వివాదంపై రాజ్నాథ్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని సమస్య ఇంకా పరిష్కారం కాలేదని స్పష్టం చేశారు. మన బలగాలు దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నాయని, చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు భారత దళాలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. చైనా మొండిగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది మే నుంచి సరిహద్దుల్లో భారీగా సాయుగాధ బలగాలను మొహరించిందని వివరించారు. (చదవండి : సరిహద్దు వివాదం : రక్షణ మంత్రి కీలక ప్రకటన) -
పబ్జీ ‘ఆట’కట్టు
-
పబ్జీ ‘ఆట’కట్టు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా కవ్వింపు నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీ సహా 118 చైనా మొబైల్ యాప్లను నిషేధిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పబ్జీ మొబైల్ లైట్, బైదు, బైదు ఎక్స్ప్రెస్ ఎడిషన్, అలీపే, వాచ్లిస్ట్, వీచాట్ రీడింగ్, కామ్కార్డ్తో పాటు పలు గేమింగ్ యాప్లు నిషేధానికి గురైన వాటిలో ఉన్నాయి. దేశ భద్రతకు ముప్పుగా పేర్కొంటూ కేంద్రం వీటిపై కొరడా ఝళిపించింది. పబ్జీ గేమ్ పిల్లలు, యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందనే అభిప్రాయం ఉంది. భారత్లో పబ్జీ క్రియాశీల వినియోగదారులు 3.3 కోట్ల మంది ఉన్నారు. ప్రతిరోజూ మనదేశంలో 1.3 కోట్ల మంది దీన్ని ఆడుతున్నారు. లద్దాఖ్లో చైనాతో ఘర్షణల నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 29న కేంద్ర ప్రభుత్వం... అత్యంత ప్రజాదరణ కలిగిన టిక్టాక్, యూసీ బ్రౌజర్తో సహా మొత్తం 59 చైనా యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే. తర్వాత మరో 47 యాప్లను నిషేధిత జాబితాలో చేర్చింది. బుధవారం వేటుపడిన వాటితో కలిపితే ఇప్పటిదాకా భారత్ మొత్తం 224 చైనా యాప్లపై నిషేధం విధించింది. భారత్ లాంటి పెద్దమార్కెట్లో ఉనికి కోల్పోవడం ఈ చైనా కంపెనీలకు ఆర్థికంగా పెద్దదెబ్బే. టిక్టాక్పై భారత్ నిషేధం విధించాక... అమెరికా కూడా అదేబాటలో నడిచిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15కల్లా టిక్టాక్ అమెరికా వ్యాపారాన్ని అమ్మివేయాలని, లేని పక్షంలో నిషేధం అమలులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీచేశారు. దేశ భద్రతకు ముప్పు... ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని సెక్షన్ 69 (ఎ), ప్రజల సమాచారం సంగ్రహించడాన్ని నిరోధించే విధానం, భద్రతల నిబంధనలు– 2009 పరిధిలో ఈ 118 యాప్లను నిషేధించింది. అందుబాటులో ఉన్న సమాచారం దృష్ట్యా ఆయా మొబైల్ యాప్లు భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ రక్షణ, ప్రజాభద్రతకు హాని కలిగించే కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నందున వాటిపై నిషేధం విధించినట్టు కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ల శాఖకు వివిధ వర్గాల నుంచి ఆయా యాప్లపై అనేక ఫిర్యాదులు అందాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్లలో లభ్యమయ్యే కొన్ని మొబైల్ యాప్లను దుర్వినియోగం చేయడం, వినియోగదారుల డేటాను దొంగిలించడం, అనధికారికంగా భారతదేశం వెలుపల ఉన్న సర్వర్లకు రహస్యంగా పంపించడం చేస్తున్నట్టు కేంద్రం గ్రహించింది. ఈ డేటా సంకలనం భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను చివరికి జాతీయ భద్రతను ప్రభావితం చేయడం ఆందోళన కలిగించే విషయమని, దీనిని నిరోధించే తక్షణ చర్యలో భాగంగా ఈ యాప్లను నిషేధిస్తున్నట్టు తెలిపింది. వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడుతున్నాయని పేర్కొంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, హోం మంత్రిత్వ శాఖ కూడా ఈ హానికరమైన మొబైల్ యాప్స్ నిరోధించటానికి సమగ్రమైన సిఫారసు పంపింది. ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి కూడా వీటిని నిషేధించాలన్న డిమాండ్ ఉందని కేంద్ర ఐటీ శాఖ వివరించింది. -
కాంగ్రెస్లో విభేదాలు!
న్యూఢిల్లీ: కీలక సీడబ్ల్యూసీ భేటీ నేడు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్లో విభేదాలు బయటపడ్డాయి. పార్టీ అగ్ర నాయకత్వంలో సమూల మార్పు కావాలని కోరుతున్న వర్గం ఒకవైపు, రాహుల్ గాంధీ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతున్న మరో వర్గం తెరపైకి వచ్చాయి. పార్టీ నాయకత్వంలో మార్పు ప్రస్తుతం అత్యవసరమని, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత నాయకత్వం, ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాల్లో అనునిత్యం అందుబాటులో ఉండే నాయకత్వం ఇప్పుడు పార్టీకి కావాలని పేర్కొంటూ సుమారు 23 మంది సీనియర్ నేతలు ఇటీవల సోనియాగాంధీకి లేఖ రాశారు. మరోవైపు, గాంధీ కుటుంబ సభ్యులే కాంగ్రెస్కు సరైన నాయకత్వం అందించగలరని మరికొందరు నేతలు స్పష్టం చేశారు. పార్టీ శ్రేణుల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు, అభిమానం ఉన్న నాయకుడిగా రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను మళ్లీ చేపట్టాలని పలువురు సీనియర్లు డిమాండ్ చేశారు. కాగా, పార్టీ నాయకత్వంలో మార్పు కావాలని కోరుతూ రాసిన లేఖపై ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందించినట్లు తెలుసోంది. పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. (అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా..!) ఈ విషయాన్ని పార్టీలోని సన్నిహిత నేతలకు ఆమె ఇప్పటికే స్పష్టం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. సోమవారం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశముందని వెల్లడించాయి. అయితే, సోనియా పార్టీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నారన్న వార్తలను కాంగ్రెస్ ఖండించింది. సోనియా గాంధీ నుంచి అలాంటి ప్రకటనేదీ రాలేదని పార్టీ స్పష్టం చేసింది. పార్టీ ప్రెసిడెంట్గా సోనియా గాంధీ కొనసాగడమో, లేక రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టడమో సరైన నిర్ణయమని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, లోక్సభలో కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురి, మాజీ కేంద్ర మంత్రులు సల్మాన్ ఖుర్షీద్, అశ్విన్ కుమార్, కేకే తివారీ తదితరులు అభిప్రాయపడ్డారు. నాయకత్వ మార్పు కోరుతూ లేఖ రాసినవారిలో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, శశి థరూర్, కపిల్ సిబల్, మనీశ్ తివారీ, హరియాణా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హూడా తదితరులున్నారు. గత సంవత్సరం ఆగస్ట్ 10న సీడబ్ల్యూసీ అభ్యర్థన మేరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు స్వీకరించారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగేందుకు అయిష్టత చూపి తప్పుకొన్న విషయం తెలిసిందే. చాలా మార్పులు జరగాలి.. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించాలని, పీసీసీలకు మరిన్ని అధికారాలను అప్పగించాలని సోనియాకు రాసిన లేఖలో సీనియర్లు కోరారు. అధికారం కేంద్ర స్థాయిలో ఎక్కువగా కేంద్రీకృతం కావడం, ప్రతీ చిన్న అంశాన్ని అగ్ర నాయకత్వమే నిర్ణయించడం దీర్ఘకాలంలో పార్టీకి ప్రతికూలంగా పరిణమిస్తుందని వారు ఆ లేఖలో హెచ్చరించారు. నాయకత్వ స్థాయిలో అనిశ్చితి వల్ల పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం ఆవరిస్తుందని, అది చివరకు పార్టీని బలహీన పరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నూతనంగా రూపొందే సమగ్ర, క్రియాశీల నాయకత్వంలోనూ నెహ్రూ–గాంధీ కుటుంబం కీలక భూమిక నిర్వహించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ప్రథమ ప్రధాని నెహ్రూ దార్శనికత కాంగ్రెస్ పార్టీకి దిక్సూచిగా కొనసాగుతుందన్నారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక బృందం సీడబ్ల్యూసీ ఎంపిక, పనితీరుపైనా వారు లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ రాజ్యాంగంలో పేర్కొన్న విధానం ద్వారా సీడబ్ల్యూసీ ఏర్పడాలన్నారు. అలాగే, కేంద్ర పార్లమెంటరీ బోర్డు, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలను మళ్లీ కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని లేఖలో సూచించారు. ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ.. సాధ్యమైనంత త్వరగా పార్టీ పునరుత్తేజం కోసం చర్యలు చేపట్టాలన్నారు. వ్యవస్థీకృత, సమీకృత నాయకత్వ విధానం తక్షణావసరమన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలో సీడబ్ల్యూసీ సమర్ధంగా పని చేయడం లేదని అభిప్రాయపడ్డారు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో పార్టీ ఓటమికి చాలా కారణాలున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. 2019 ఎన్నికలు జరిగి 14 నెలలు పూర్తయినా.. ఇప్పటికే ఆ ఓటమిపై నిష్పక్షపాత సమీక్ష జరగలేదన్నారు. దేశంలో ప్రస్తుతం అభద్రతతో కూడిన భయ వాతావరణం నెలకొని ఉందని, ఈ పరిస్థితులను ఎదుర్కొనే క్రియాశీల విపక్షంగా నిలవాల్సిన బాధ్యత కాంగ్రెస్పై ఉందన్నారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ల్లో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనను కూడా సీనియర్లు ఆ లేఖలో తప్పుబట్టారు. ఆ నిర్ణయం రాహుల్ గాంధీదేనన్న విషయం గమనార్హం. డీసీసీ అధ్యక్షుల నియామక నిర్ణయాన్ని పీసీసీ అధ్యక్షుడి సూచనల మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తీసుకునేలా చూడాలన్నారు. నిష్పక్షపాత విధానంలో సంస్థాగత ఎన్నికలు జరగాలని కోరారు. ప్రజాస్వామ్య, లౌకిక వేదిక ప్రజాస్వామ్య, లౌకిక శక్తులతో కూడిన దేశవ్యాప్త కూటమిని రూపొందించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించాలని సూచించారు. గతంలో కాంగ్రెస్లో ఉన్న నేతలందరినీ కూడా ఈ వేదికలో భాగస్వామ్యులను చేయాలన్నారు. మళ్లీ రాహుల్ రావాలి ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరుతూ మరి కొందరు నేతలు లేఖ రాశారు. ఎంపీ మానికం ఠాగోర్ ఈ డిమాండ్ను తెరపైకి తెచ్చారు. ‘గాంధీలు త్యాగానికి గుర్తులు. రాహుల్ గాంధీ మళ్లీ అధ్యక్షుడు కావాలని 1,100 మంది ఏఐసీసీ సభ్యులు, 8,800 పీసీసీ సభ్యులు, 5 కోట్లమంది పార్టీ కార్యకర్తలు, 12 కోట్లమంది పార్టీ మద్దతుదారులు కోరుకుంటున్నారు’అని ఆయన పేర్కొన్నారు. గాంధీ కుటుంబమే బెస్ట్ ప్రస్తుత పరిస్థితుల్లో గాంధీ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. పార్టీ పునర్వ్యవస్థీకరణకు ఇది సరైన సమయం కాదన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గట్టి విపక్షం రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బలమైన, ఐక్య విపక్షం లేకపోవడం బీజేపీకి కలసి వస్తోందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. మొత్తం పార్టీ కోరుకునే, శ్రేణులందరికీ చిరపరిచితుడైన నాయకుడు కావాలని, గాంధీ కుటుంబ సభ్యులే అందుకు సరైన వారన్నారు. కాంగ్రెస్ కార్యకర్త లేని గ్రామం దేశంలో లేదని, ఆ ఘనత గాంధీ కుటుంబం కారణంగానే సాధ్యమైందని తెలిపారు. కోరుకున్నంత కాలం సోనియాగాంధీనే ప్రెసిడెంట్గా ఉండాలని, ఆ తరువాత రాహుల్ ఆ బాధ్యతలను తీసుకోవాలని సూచించారు. సీనియర్ల లేఖ దురదృష్టకరమని రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ అన్నారు. నాయకత్వానికి సంబంధించి ఎన్నికల నిర్వహణ ఈతరుణంలో సరైన నిర్ణయం కాదని, దానివల్ల విభేదాలు పెరిగే అవకాశముందని సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ అభిప్రాయపడ్డారు. రాహుల్కు పార్టీ శ్రేణులు, నాయకుల మద్దతుందన్నారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం.. పార్టీ రాజ్యాంగం ప్రకారం.. సీడబ్ల్యూసీలో పార్టీ ప్రెసిడెంట్, పార్లమెంట్లో పార్టీ నేత, 23 మంది ఇతర సభ్యులు ఉంటారు. ఆ 23 మందిలో 12 మందిని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎన్నుకుంటుంది. మిగతావారిని పార్టీ ప్రెసిడెంట్ ఎంపిక చేస్తారు. 1990 నుంచి సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరగలేదు. అప్పటినుంచి, ఏకగ్రీవ మార్గంలో సీడబ్ల్యూసీ సభ్యుల ఎంపిక జరుగుతోంది. కాంగ్రెస్లో సంచలనం సృష్టించిన తాజా లేఖలో పలువురు మాజీ కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్ నేతలు సంతకాలు చేశారు. వారిలో గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, శశి థరూర్, పీజే కురియన్, ఆనంద్ శర్మ, మనీశ్ తివారీ, రేణుకా చౌదరి, మిలింద్ దేవ్రా, అజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, జితిన్ ప్రసాద, భూపిందర్ సింగ్ హూడా, రాజిందర్ కౌర్ భట్టల్, వీరప్ప మొయిలీ, పృథ్వీరాజ్ చవాన్, రాజ్ బబ్బర్, అరవింద్ సింగ్ లవ్లీ, సందీప్ దీక్షిత్ తదితరులున్నారు. నేడు జరగనున్న సీడబ్ల్యూసీ భేటీలో ఈ లేఖలోని అంశాలపై లోతైన, వాడి వేడి చర్చ జరిగే అవకాశముందని భావిస్తున్నారు. -
ఏం చేశారు.. ఆ ఇద్దరు కార్పొరేటర్లు
బనశంకరి: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన దేవరజీవనహళ్లి, కమ్మగొండనహళ్లి హింసాకాండల కేసులో ఇద్దరు కాంగ్రెస్ కార్పొరేటర్లపై సీసీబీ పోలీసులు దృష్టి సారించారు. డీజే హళ్లి కార్పొరేటర్, మాజీ మేయర్ సంపత్రాజ్, పులకేశినగర వార్డు కార్పొరేటర్ అబ్దుల్ రాఖిద్ జాకీర్ను సీసీబీ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు మంగళవారం సీసీబీ డీసీపీ కేసీ.రవికుమార్ తెలిపారు. సీసీబీ జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్పాటిల్ నేతృత్వంలో చామరాజపేటే సీసీబీ కార్యాలయంలో వీరి విచారణ సాగింది. (బెంగళూరు అల్లర్లు: ఐదుగురిపై ఎఫ్ఐఆర్ దాఖలు) మరో 30 మంది అరెస్టు : అల్లర్ల కేసులో రోజురోజుకు అరెస్టులు పెరుగుతున్నాయి. సోమవారం రాత్రి మళ్లీ 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి వివిధ విభాగాల పోలీసులు డీజేహళ్లి, కేజీ హళ్లి పోలీస్స్టేషన్ల పరిధిలో గల్లీ గల్లీలో ఉన్న ఇళ్లపై దాడిచేసి 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారి సంఖ్య 380కి పెరిగింది. గొడవ చోటుచేసుకున్న రోజు ఫోటోలు, సీసీ కెమెరా దృశ్యాలు, నిందితులు చెబుతున్న సమాచారం ప్రకారం ప్రతిరోజూ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. పోలీసులు వెళ్లగానే కొందరు దాక్కోగా ఇల్లిల్లూ గాలించి నిర్బంధించారు. గలాటాల తరువాత వివిధ ప్రాంతాలకు పారిపోయినవారిని పట్టుకునేందుకు పోలీసులు కేరళ, తమిళనాడు తదితర ప్రాంతాలకు వెళ్లారు. అనుమానిత ఉగ్రవాది విచారణ ఆల్హింద్ ఉగ్ర సంస్ధ సభ్యుడు, అనుమానిత ఉగ్రవాది సమీయుద్దీన్ను ఏటీసీ విభాగం అధికారులు రహస్య ప్రాంతంలోకి తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. కేజీ.హళ్లి, డీజే.హళ్లి అల్లర్లకు సంబంధించి డీజే.హళ్లి నివాసి సమీయుద్దీన్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా ఉగ్రసంస్ధ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇతను డీజే.హళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న అల్లర్లలో భాగస్వాములైనట్లు అనుమానం వ్యక్తమైంది. ఘటన సమయంలో నిప్పుపెట్టడానికి చేతులతో సైగ చేసే దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. ఇతడి వాట్సాప్ మెసేజ్ చేయడం, వందలాది ఫోన్లు చేసినట్లు విచారణలో వెలుగుచూసింది. ఆ రోజు ఎక్కడ ఉన్నారు గలాటాలు జరిగిన రోజు మీరు ఎక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడారు మొదలైన సాధారణ ప్రశ్నల నుంచి లోతుగా ఆరా తీస్తున్నారు. అల్లరిమూకలతో కార్పొరేటర్లకు సంబంధాలు ఉన్నాయా అని విచారణ సాగుతోంది. వారి మొబైల్ఫోన్ల కాల్స్ను పరిశీలిస్తున్నారు. ప్రమేయం లేదని తేలితే వదిలిపెట్టే అవకాశముంది, లేదంటే అరెస్టు చేయవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. సంపత్రాజ్ వ్యక్తిగత సహాయకున్ని కూడా ఖాకీలు ప్రశ్నిస్తున్నారు. -
రాజుకున్న రాజధాని
ఎమ్మెల్యే సమీప బంధువైన యువకుడు ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ మూకదాడులకు కారణమైంది. వేలాది మంది పోలీస్స్టేషన్, ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి విధ్వంసకాండకు పాల్పడ్డారు. ఐటీ సిటీలో గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఈ అల్లర్లు పెను ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. సాక్షి, బెంగళూరు: బెంగళూరు నడిబొడ్డున పులకేశినగర నియోజకవర్గం కాడుగొండన (కేజీ) హళ్లి, దేవరజీవన (డీజే) హళ్లిలో దావాగ్నిలా అల్లర్లు, హింస చెలరేగాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో 24 గంటల పాటు 144 సెక్షన్ విధించారు. ఘటనలో 60 మంది పైగా పోలీసులు గాయపడ్డారు. సుమారు 145 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీగా ఆస్తినష్టం దాడుల్లో 26 ఇళ్లు దెబ్బతిన్నాయి. రెండు ఆటోలు, మూడు కార్లు, 40 పైగా ద్విచక్రవాహనాలు కాలిపోయాయి. దాడుల్లో ఏటీఎం పగలగొట్టారు. ఉన్నత స్థాయి పోలీసు అధికారుల కార్లకు కూడా నిప్పు పెట్టారు. ఇక పోలీసుల కాల్పుల్లో పది మంది వరకూ గాయపడ్డారు. ఆస్తినష్టం కోట్ల రూపాయల్లో ఉండవచ్చని అంచనా. ఎలా మొదలైందంటే పులకేశినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తికి మేనల్లుడయ్యే నవీన్ అనే యువకుని ఫేస్బుక్ ఖాతాలో మంగళవారం సాయంత్రం అనుచితమైన పోస్టింగ్లు వచ్చాయి. దీంతో కొందరు మైనారిటీ వర్గాల యువకులు మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో డీజే హళ్లి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లారు. అవహేళనగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారని ఫిర్యాదు చేశారు. ఇంతలో వేలాది మంది అక్కడికి చేరుకుని పోలీస్స్టేషన్లోని వాహనాలకు నిప్పు పెట్టి భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. కొన్ని గంటలపాటు ఈ తతంగం కొనసాగింది. పోలీసులు కూడా అదుపు చేయలేక తలోదిక్కుకు పరుగులు తీశారు. మరికొందరు పోలీసులు స్టేషన్లోపల దాక్కున్నారు. పదుల సంఖ్యలో వాహనాలు భస్మీపటలం అయ్యాయి. ఆ వీధిలో ఉన్న ప్రజల వాహనాలు, ఇళ్లను కూడా వదిలిపెట్టలేదు. కార్లు, బైక్లు బూడిదయ్యాయి. తరువాత ఎమ్మెల్యే ఇంటిపైకి ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి అండతోనే నవీన్ ఇలా చేస్తున్నాడని భావించి కావల్ బైరసంద్రలోని ఎమ్మెల్యే నివాసంపై దాడికి దిగారు. అక్కడ ఉన్న వాహనాలకు నిప్పు పెట్టగా.. ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో ఎమ్మెల్యే గానీ, కుటుంబం కానీ లేకపోవడంతో ముప్పు తప్పింది. కానీ అక్కడ కూడా భారీ విధ్వంసమే చోటుచేసుకుంది. అల్లరిమూకల్ని అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపగా ముగ్గురు యువకులు మరణించారు. అల్లర్లలో 60 మంది వరకూ పోలీసులు గాయపడ్డారు. కాగా అల్లర్లకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం యడియూరప్ప ప్రకటించారు. పోలీసుల అదుపులో పాషా ఎస్డీపీఐ (సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా) సంస్థ ఆధ్వర్యంలోనే దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్డీపీఐ బెంగళూరు నేత ముజామిల్ పాషాను పోలీసులు అరెస్టు చేశారు. అతడే మొదటి నిందితుడని డీజే హళ్లి పోలీసులు పేర్కొన్నారు. ఘటన జరుగుతున్న సమయంలో అతడు మైక్ పట్టుకుని గుంపునుద్దేశించి మాట్లాడుతున్న దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డయ్యాయి. పాషాపై డీజే హళ్లి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఐదు కేసులు ఉన్నాయి. సీసీ కెమెరాల చిత్రాలు, సోషల్ మీడియాలో వస్తున్న చిత్రాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వందలాది మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పులకేశినగరలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. -
నోటి దురుసు తెచ్చిన తంటా..
బషీరాబాద్: విధి నిర్వాహణలో ఉన్న ఎస్ఐతో దురుసుగా మాట్లాడిన ఓ కానిస్టేబుల్ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మహిపాల్ మూడు రోజుల కిందట స్థానిక ఎస్ఐ గిరి పట్ల అనుచితంగా మాట్లాడారు. ఈ విషయాన్ని ఎస్ఐ గిరి ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ నారాయణ విచారణ జరిపించి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మహిపాల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా సదరు కానిస్టేబుల్పై విచారణలో అవినీతి ఆరోపణలు కూడా తేలినట్లు తెలిసింది. ఎస్ఐ గిరి బదిలీ.. బషీరాబాద్ ఎస్ఐగా 9 నెలల పాటు పనిచేసిన ఎస్ఐ గిరి తాండూరు పట్ణణ ఎస్ఐగా బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐ బదిలీ విషయం తెలుసుకున్న పలువురు సర్పంచ్లు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆయనను సన్మానించారు. -
యుద్ధం కాదు శాంతే పరిష్కారం!
యుద్ధం సమస్యను సృష్టిస్తుందే కానీ, సమస్యను పరిష్కరించదు. యుద్ధానికి చర్చలే పరిష్కారం కానీ, యుద్ధం దేనికీ పరిష్కారం కాజాలదు. అందుకే మహాత్మాగాంధీ యుద్ధం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాంఛనీయం కాదని తేల్చి చెప్పారు. అయితే ఏ దేశమైనా మరో దేశం దురాక్రమణను సహిం చాల్సిన అవసరం లేదు. నిజానికి రెండు వేల ఏళ్ళనాడే ఏ ఆయుధాలు లేకుండా ప్రేమతో భారత దేశం చైనాను గెలుచుకున్నది. ఇప్పుడు చైనా ప్రజలు మనలాగా తూర్పుకు తిరిగి దండం పెట్టరు. భారత దేశం వైపు నిలబడి నమస్కరిస్తారు. ఎందుకంటే గౌతమ బుద్ధుడు పుట్టిన దేశం, భారత దేశం వారికి పడమరవైపు ఉన్నది. అందుకే ప్రజల మధ్య ఐక్యతను ఏ యుద్ధాలూ వేరుచేయలేవు. ‘‘రెండు దేశాలు యుద్ధానికి తలపడు తోంటే, ఆపాల్సిన బాధ్యత శాంతిని, అహిం సను కోరుకునే వాళ్ళపైనే ఉంటుంది. ఇరు దేశాల పౌరులు కూడా ఆ కర్తవ్యాన్ని తీసుకోవాలి. వ్యక్తులకు ఆ అధికారం లేకపోవచ్చు. ఆ వ్యక్తికి అంత శక్తి కూడా ఉండకపోవచ్చు కూడా. అయినా ఆ ప్రయత్నం చేయాలి. చివరకు యుద్ధంలో పాల్గొంటోన్న సైనికుడు సైతం యుద్ధాన్ని ఎట్లా ఆపాలో ఆలోచించాలి. దానితో, తను మాత్రమే కాదు, తన దేశాన్నీ, తన ప్రజలనూ, యావత్ ప్రపంచాన్ని యుద్ధం నుంచి విముక్తి చేయాలి’’ భారత స్వాతంత్య్ర ఉద్యమ సారథి మహాత్మాగాంధీ అన్న మాటలివి. యుద్ధాలు చేసిన వాళ్ళు, యుద్ధాలు చూసిన వాళ్లు సైతం యుద్ధమంటే అసహ్యించుకున్నారు. యుద్ధాన్ని ప్రారంభించడానికి ముందు ఉన్న కోపం, ద్వేషం, యుద్ధం ముగిసిన తర్వాత వైరాగ్యంగా మారుతుంది. ఇది చరిత్ర పొడవునా కనిపించే కఠోర సత్యం. యుద్ధాన్ని ఆశించే వారు ఈ సజీవ సాక్ష్యాన్ని ఎరుగరు. యావత్ ప్రపంచం కరోనాతో యుద్ధం చేస్తున్నది. మన దేశం కూడా రోజు రోజుకూ ప్రమాదపుటంచుల్లోకి వెళుతోంది. సరిగ్గా ఈ సమయంలోనే భారత్–చైనా సరిహద్దుల్లో జరిగిన అవాంఛనీయ ఘర్షణలో ఇరవైమంది భారత సైనికులు ప్రాణాలొదిలారు. కచ్చి తమైన సంఖ్య తెలియనప్పటికీ చైనా కూడా తగిన మూల్యం చెల్లిం చుకుంది. సరిహద్దుల్లో అప్పుడప్పుడు ఉద్రిక్తతలు తలెత్తడం, చిన్న చిన్న ఘర్షణలు జరగడం సర్వసాధారణం. కానీ ఈసారి అది భారీ నష్టానికి దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయమై అఖిల పక్ష సమావేశంలో మాట్లాడుతూ, చైనా మన భూభాగంలోకి చొచ్చు కురాలేదని, ఆందోళన అవసరం లేదని, ఒక వేళ చైనా వైపునుంచి ఎటువంటి దాడులు జరిగినా భారత ప్రభుత్వం ఊరుకోజాలదని హెచ్చరించారు. దానికి అన్ని పక్షాలూ మద్దతు పలికాయి. ఇదిలా ఉండగా సమయంలోనే గత వారం అమెరికా విదేశాంగ శాఖా మంత్రి మైక్ పాంపియో జర్మనీలోని బ్రస్సెల్స్లో మాట్లాడుతూ తమ సైన్యాన్ని సగానికి పైగా జర్మనీ నుంచి తరలిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సైన్యాన్ని ఎక్కడికి పంపిస్తున్నారు అని ఒక విలేకరి ప్రశ్నిం చగా, ఆయన చైనా చేస్తున్న దురాక్రమణ చర్యలను ఎదుర్కోవడానికి దక్షిణాసియాకు పంపిస్తున్నామని జవాబు చెప్పారు. ముఖ్యంగా ఇటీ వల భారత్–చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణను ఆయన ప్రత్యేకంగా ఉదహరించారు. అంతేకాకుండా దక్షిణ చైనా భూభాగంలో ఉన్న సము ద్రంపై కూడా చైనా హక్కులను ప్రకటించుకుంటున్నదని, అందువల్ల చైనా దక్షిణాసియాకు ప్రమాదకారిగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్–భారత్ల మధ్య దౌత్యం నెరపుతానంటూ అమెరికా ఉవ్విళ్ళూరింది. అమెరికా జోక్యాన్ని భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. కాశ్మీర్ విషయంలో ఎవరి జోక్యం అక్కర్లేదని తేల్చి చెప్పింది. కానీ మైక్ పోంపియో చైనాకు వ్యతిరేకంగా, భారత్కు అనుకూలంగా ప్రకటన చేసి వారం దాటినప్పటికీ, భారత ప్రభుత్వం నుంచి స్పందన లేదు. పైగా చైనా యాప్లను నిషేధిస్తు న్నట్టు ప్రధాని ప్రకటించారు. దీనిని పత్రికలు డిజిటల్ స్ట్రైక్గా పేర్కొం టున్నాయి. అంతే కాకుండా చైనా వస్తువులను బహిష్కరించా లనే కొందరి డిమాండ్ కూడా బాగా ప్రచారంలో వుంది. చైనా యుద్ధా నికి కాలు దువ్వితే చేతులు ముడుచుకొని కూర్చోవాలని ఎవ్వరూ చెప్పరు. అది సరైంది కూడా కాదు. కానీ ఇక్కడ అమెరికా జోక్యం పలు అనుమానాలకు దారితీస్తున్నది. ఈ రెండు దేశాల వైరం అమెరికా ఉపయోగించుకునే ప్రమాదం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తన వద్ద నిల్వ ఉన్న ఆయుధాలను అమ్ముకొనేందుకు కూడా అమెరికా యత్ని స్తోంది. అమెరికాని విశ్వసిస్తే మాత్రం మనం తప్పు చేసినవాళ్ళ మవుతాం. ఇప్పటికే మన దేశం కొన్నివేల కోట్లు ఖర్చుచేసి, ఆయుధా లను కొనుగోలు చేస్తున్నది. ప్రపంచంలో ఆయుధాల కొనుగోళ్ళలో మనం రెండవ స్థానంలో ఉన్నాం. భారత్–చైనా మధ్య యుద్ధం జరి గితే దాన్ని, అమెరికా తన వ్యాపారాభివృద్ధి కోసం ఉపయోగించు కోవడానికి సిద్ధంగా ఉంది. రెండో వైపు తన ఆధిపత్యాన్ని ఆసియా దేశాలకు విస్తరింపజేయడానికీ పథకం వేస్తున్నది. వీటితో పాటు మరొక ముఖ్యమైన అంశం ఇందులో దాగి ఉన్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్, చైనా దేశాలు బలమైన శక్తులుగా అవతరిస్తున్నాయి. అమెరికా తన మొదటి స్థానాన్ని ఎప్పుడో కోల్పో యింది. 2013వ సంవత్సరం నుంచే జాతీయ స్థూల ఆదాయంలో చైనా మొదటి స్థానంలోకి రాగా, అమెరికా రెండవ స్థానంలోకి దిగ జారింది. 2030 నాటికి ఆ రెండవ స్థానాన్ని భారత దేశం కైవసం చేసు కోబోతోంది. అమెరికా మూడవ స్థానంలోకి వెళ్ళబోతున్నది. ఇది అమె రికాకు మింగుడు పడని విషయం. ఒకవేళ భారత్–చైనాల మధ్య యుద్ధమే జరిగితే భారత్, చైనాలు రెండూ ఆర్థికంగా దెబ్బతింటాయి. ముఖ్యంగా భారత దేశం ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే అమెరికా తన ఆర్థిక ఆధిక్యతను నిలబెట్టుకుని, తను కోరు కున్న స్థానాన్ని చేరుకుంటుంది. రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ఇరు దేశాల పౌరులు, దేశభక్తులు గుర్తించాలి. పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి, నాటక రచయిత, తత్వవేత్త జాన్ డ్రైడన్ యుద్ధం గురించి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ చక్కగా సరి పోతాయి. ‘యుద్ధం రాజులకు వ్యాపారం. యుద్ధాలు అన్నీ కూడా సంపదల పంపకానికో, పెంపకానికో జరుగుతాయి. అన్ని యుద్ధాల వెనుకా కనిపించని కుట్రలెన్నో దాగుంటాయి’ అంటారాయన. నిజా నికి భారత్–చైనాల మధ్య వైరం కన్నా స్నేహం చాలా బలమైనది. ప్రాచీనమైనది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి చైనా–భారత్ల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మొదలయ్యాయి. చైనాలో మొదలై రోమ్ వరకు సాగిన సిల్క్ రూట్ వ్యాపారం రెండు దేశాల ఉత్పత్తులను విశ్వవ్యాప్తం చేశాయి. చంద్రగుప్త మౌర్య కాలంలో కూడా చైనాతో భారత దేశానికి వ్యాపార, రాజకీయ సంబంధాలున్నాయి. చైనా నుంచి ప్రపంచానికి దిగుమతి అయిన సిల్క్ వస్త్రాలు మన దేశంలో కూడా చాలా ప్రసిద్ధి. పట్టు పీతాంబరాలు, చీని చీనాంబరాల గురించి మన సాహిత్యంలో మనం ఎన్నో సార్లు చదివాం. అశోకుడు, కనిష్కుడు లాంటి బౌద్ధ చక్రవర్తుల కాలంలో భారత్–చైనా సంబం ధాలు మరింత విస్తరించాయి. భారత్ నుంచి బౌద్ధం ప్రపంచానికి ప్రత్యేకించి దక్షిణాసియాకు విస్తరించడానికి చైనా ఒక మార్గంగా పనిచేసింది. పల్లవ రాజకుమారుడైన బోధి ధర్మ చైనాలో మహాయాన బౌద్ధాన్ని విస్తృతపరిచాడు. కుమార జీవ అనే బౌద్ధ దార్శనికుడు ఎన్నో ముఖ్యమైన బౌద్ధ గ్రంధాలను చైనా భాషలోకి అనువదించి, అక్కడ ఆరాధ్యుడయ్యారు. బోధి ధర్మం నేర్పిన మార్షల్ ఆర్ట్స్ షావోలిన్ టెంపుల్ నిర్మాణానికి, అక్కడ యుద్ధ విద్యలకు ఉపయోగపడింది. అలాగే చైనా యాత్రికులైన షాహియాన్, హుయాన్త్సాంగ్లు భారత దేశంలో పర్యటించి ఆనాటి చరిత్రను నిక్షప్తం చేశారు. చైనా విప్లవంలో భారత దేశం నుంచి పాల్గొన్న డాక్టర్ ద్వారకా నాథ్ కొట్నిస్ను చైనా ప్రజలు ఇప్పటికీ గుండెల్లో పెట్టుకుంటారు. చైనా విప్లవాన్ని భారత ప్రజలు ఎంతగానో గౌరవిస్తారు. యుద్ధం సమస్యను సృష్టిస్తుందే కానీ, సమస్యను పరిష్కరించదు. చివరకు వాదాలు, వివాదాలు అన్నీ చర్చల ద్వారా పరిష్కారం కావాల్సిందే. నిజానికి యుద్ధానికి చర్చలే పరిష్కారం కానీ, యుద్ధం దేనికీ పరి ష్కారం కాజాలదు. అందుకే మహాత్మాగాంధీ యుద్ధం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాంఛనీయం కాదని తేల్చి చెప్పారు. అయితే ఏ దేశమైనా మరో దేశం దురాక్రమణను సహించాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిని వేరొక వ్యక్తి, ఒక దేశాన్ని మరో దేశం దోపిడీ చేస్తోంటే, పీడిస్తోంటే దాన్ని సహించాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయితే ఆయా సందర్భాల్లో శాంతి కోసం జరిగే యుద్ధానికి ఓ అర్థం ఉంటుంది. కానీ ప్రభుత్వాల కన్నా ప్రజాభిప్రాయం బలమైనది. శక్తి వంతమైనది. ఆ మాటకొస్తే ప్రజలు ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోరు. ఇది సత్యం. నిజానికి రెండు వేల ఏళ్ళనాడే ఏ ఆయుధాలు లేకుండా ప్రేమతో భారత దేశం చైనాను గెలుచుకున్నది. ఇప్పుడు చైనా ప్రజలు మనలాగా తూర్పుకు తిరిగి దండం పెట్టరు. భారత దేశం వైపు నిల బడి నమస్కరిస్తారు. ఎందుకంటే గౌతమ బుద్ధుడు పుట్టిన దేశం, భారతదేశం పడమరవైపు ఉన్నది. అందుకే ప్రజల మధ్య ఐక్యతను ఏ యుద్ధాలూ వేరుచేయలేవు. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
పెళ్ళి భోజనాల కోసం ఘర్షణ
పశ్చిమగోదావరి, ఆకివీడు: కోళ్ల పర్రు గ్రామంలో పెళ్లి భోజనాల కోసం శుక్రవారం రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన గండికోట స్వామి వివాహం ఈ నెల 15న జరిగింది. 18న యానాల భోజనాలు సక్రమంగా జరగలేదని, ఎవరూ రాలేదని బంధువులైన గండికోట బుల్లయ్య, దుర్గ తదితరులు ఆరోపిస్తూ, పెళ్లి కొడుకు తల్లిదండ్రులను విమర్శించారు. అంతేకాకుండా వారిపై దౌర్జన్యం చేసి గాయపరిచారని ఎస్సై వీరభద్రరావు చెప్పారు. వారిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
ఢిల్లీలో జరిగిన మాదిరిగా హైదరాబాద్లో కూడా..
సాక్షి, సిటీబ్యూరో: సోషల్మీడియాలో వాట్సాప్ ద్వారా వదంతులు సృష్టించిన నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలోని అహ్మద్నగర్కు చెందిన రహ్మత్ షరీఫ్ వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. ఇతగాడు ఆదివారం నాలుగు నిమిషాల నిడివితో ఓ ఆడియో క్లిప్ రూపొందించాడు. అందులో తానే మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీ జరిగిన మాదిరిగా హైదరాబాద్లోని కలహాలు జరిగే ఆస్కారం ఉందంటూ మాట్లాడాడు. దీనికి ఆధారాలు అంటూ కొన్ని అసందర్భ వ్యాఖ్యలు జోడించాడు. ఈ ఆడియో వాట్సాప్లో వైరల్ కావడంతో సోమవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. తీవ్రమైన వ్యాఖ్యలతో ఉన్న ఈ ఆడియోపై సుమోటో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా... తన ఆడియో వైరల్గా మారిందని, ఫలితంగా తీవ్ర పరిణామాల ఎదుర్కోవాల్సి వస్తుందని షరీఫ్ స్నేహితులు అతడిని భయపెట్టారు. దీంతో మంగళవారం అతడే వెళ్లి బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో విషయం చెప్పి లొంగిపోయాడు. ఈ ఆడియోపై అప్పటికే సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదై ఉండటంతో అక్కడి అధికారులు సైబర్ కాప్స్కు అప్పగించడంతో అరెస్టు అయ్యాడు. పుకార్లు సృష్టించవద్దని సీపీ అంజనీకుమార్ ట్వీట్లో సూచించారు. -
‘పరదాగేట్ ప్యాలెస్’ విక్రయంలో మరో వివాదం
సాక్షి, సిటీబ్యూరో: నిజాం వైభవానికి ప్రతీక అయిన నజ్రీభాగ్ ప్యాలెస్ విక్రయం వివాదంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ముంబై కేంద్రంగా ఓ కేసు నమోదు కాగా.. తాజాగా పరదాగేట్ ప్యాలెస్ను తమకు తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారని, ఆపై మోసం చేస్తూ మరో సంస్థకు అమ్మేశారని ఆరోపిస్తూ ఎస్ఆర్ఈఐ సంస్థ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఇ.వేణుగోపాల్ హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) ఫిర్యాదు చేశారు. దీంతో నగరానికి చెందిన ఆషి రియాల్టర్స్, ముంబై సంస్థ నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్లకు చెందిన నలుగురిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన నిందితుల జాబితాలో సుఖేష్ గుప్తా, నీతూ గుప్తా, రవీంద్రన్, సురేష్కుమార్ ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు నిందితుల కోసం గాలిస్తున్నారు. వివాదం వెనక అసలు కథ.. ముంబైకి చెందిన నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ రెసిడెన్షియన్, కమర్షియల్ నిర్మాణాల్లో పేరెన్నికగన్న సంస్థ. ఇది కొన్నాళ్ల క్రితం ప్రిన్స్ ముకర్రంజా మొదటి భార్య ఎస్త్రా నుంచి కింగ్కోఠిలోని నజ్రీభాగ్ (పరదాగేట్) ప్యాలెస్ను కొనుగోలు చేసింది. 5 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ భవంతి ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ వ్యక్తిగత నివాసంగా వెలుగొందింది. అయిదెకరాల విస్తీర్ణంలో కింగ్కోఠి ప్యాలెస్గా పిలిచే నిర్మాణంలో మొత్తం మూడు భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒకదాంట్లో నిజాం ట్రస్ట్, మరోదాంట్లో కోఠి ఈఎన్టీ ఆస్పత్రి కొనసాగుతున్నాయి. మూడో భవనమైన నజ్రీభాగ్కు జీపీఓ హోల్డర్గా ఉన్న ఎస్త్రా నుంచి నిహారిక కన్స్ట్రక్షన్స్ సంస్థ రూ.150 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ప్యాలెస్ను నిహారిక సంస్థ భౌతికంగా తన అధీనంలోకి తీసుకోవాల్సి ఉంది. 2019 ప్రథమార్థంలో సంస్థ డైరెక్టర్ల మధ్య కొన్ని స్పర్థలు వచ్చాయి. దీంతో గత ఏడాది జూన్లో నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉద్యోగులు హైదరాబాద్ వచ్చినప్పుడు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించారు. ఈ నేపథ్యంలోనే నజ్రీభాగ్ ప్యాలెస్ యాజమాన్య హక్కులు కశ్మీర్కు చెందిన ఐరిష్ హాస్పిటాలిటీస్కు బదిలీ అయినట్లు గుర్తించారు. దీనిపై లోతుగా ఆరా తీయగా నిహారిక సంస్థకు రాజీనామా చేసి బయటకు వచ్చిన హైదరాబాద్ వాసి రవీంద్రన్తో పాటు సురేష్కుమార్ తదితరులప్రమేయంతోనే ఇది జరిగినట్లు తేల్చారు. నిహారిక సంస్థతో పాటు నజ్రీభాగ్ ప్యాలెస్ పేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వీళ్లు రూ.150 కోట్లకు ఐరిష్ హాస్పిటాలిటీస్కు 2019 జనవరిలో విక్రయించేశారు. ఈ విషయాలు గుర్తించిన నిహారిక సంస్థ ముంబైలోని వర్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిహారిక సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు అక్రమంగా విక్రయించేశారని అనుమానించిన పోలీసులు కేసును దర్యాప్తు నిమిత్తం అక్కడి ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగానికి (ఈఓడబ్ల్యూ) బదిలీ చేసింది. దీంతో ఆ వింగ్లోని యూనిట్– 9 అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రవీంద్రన్, సురేష్లతో పాటు మహ్మద్ ఉస్మాన్, సుఖేష్ గుప్తాలను నిందితుల జాబితాలో చేర్చింది. ఈ కేసులో కొన్ని అరెస్టుల్ని చేసిన ముంబై ఈఓడబ్ల్యూ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసు కొనసాగుతుండగానే.. అక్కడ కేసు ఇలా ఉండగానే.. ఇటీవల బంజారాహిల్స్ కేంద్రంగా పని చేసే ఎస్ఆర్ఈఐ ఎక్వీప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్కు చెందిన అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఇ.వేణుగోపాల్ సీసీఎస్ పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. బషీర్బాగ్ కేంద్రంగా పని చేసే ఆషి రియాల్టర్స్కు చెందిన సుఖేష్ గుప్తా, నీతు గుప్తా, ముంబైకి చెందిన నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సురేష్ కుమార్, రవీంద్రన్లు ఎస్ఆర్ఈఐ వద్ద రూ.110 కోట్ల రుణం కోసం 2018 జూన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభించి ప్రతి మూడు నెలలకు ఇన్స్టాల్మెంట్ చొప్పున చెల్లిస్తూ మొత్తం నాలుగు దఫాల్లో రుణం వడ్డీతో సహా తీర్చాలన్నది ఒప్పందం. ఈ రుణానికి సంబంధించి ష్యూరిటీగా హఫీజ్పేటలో ఉన్న ఎనిమిది ఎకరాల స్థలంతో పాటు కింగ్కోఠిలో 28,106 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నజ్రీభాగ్ ప్యాలెస్ను చూపిస్తూ 2018 జూలై 15న అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎస్ఆర్ఈఐ నుంచి తీసుకున్న రుణం చెల్లించడంలో సుఖేష్ గుప్తా తదితరులు విఫలం కావడంతో గత ఏడాది డిసెంబర్ 30న హఫీజ్పేటలోని స్థలాన్ని వేలం వేసి ఎస్ఆర్ఈఐ సంస్థ రూ.102.6 కోట్లు రాబట్టుకుంది. మిగిలిన మొత్తం రికవరీ కోసం నజ్రీభాగ్ను వేలం వేయాలని ప్రయత్నించగా.. నిందితులు అప్పటికే తమను మోసం చేస్తూ ఐరిష్ హాస్పిటాలిటీస్కు విక్రయించినట్లు గుర్తించింది. దీనికి సంబంధించి ఆషి, నిహారిక సంస్థలతో చేసిన సంప్రదింపులు ఫలితాలు ఇవ్వకపోవడంతో ఎస్ఆర్ఈఐ సంస్థ గత నెల 28న సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు సుఖేష్ గుప్తా, నీతు గుప్తా, రవీంద్రన్, సురేష్కుమార్లపై ఐపీసీ 420, 406 రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
పబ్ వ్యవహారాలకు పగ్గాలు లేవా?
బంజారాహిల్స్: తెల్లవారుజాము వరకు మందుబాబులు పబ్లను వదిలి బయటకు రావడం లేదు. గొడవలు లేకుండా లేనిరోజులేదు. దీంతో పోలీసులకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. జూబ్లీహిల్స్తో పాటు పలు సంపన్న ప్రాంతాల్లో పబ్లలో రాత్రి ఒంటిగంటదాటిందంటే లోపల, బయట గొడవల్లేని రోజంటూ ఉండటం లేదు. తాజాగా శని, ఆదివారాల్లో జూబ్లీహిల్స్లోని రెండు పబ్లలో గొడవలు శృతి మించి రాగాన పడ్డాయి. నెల క్రితం రోడ్ నెం 36లోని ఎయిర్ లైవ్ పబ్లో అయిదుగురు యువకులు పీకలదాకా మద్యం సేవించి సమీపంలోని ఓ వైన్షాప్కు వెళ్ళి వైన్బాటిల్ తస్కరిస్తూ పట్టుబడి గొడవకు దిగాడు. నిన్నగాక మొన్న ప్రిజమ్ పబ్లో రాహుల్ సిప్లిగంజ్ గొడవ పలు విమర్శలకు దారి తీసింది. నెల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని ఓ పబ్కు ఉన్నతాధికారి వెళ్ళి మద్యం మత్తులో గొడవకు దిగాడు. అదే రాత్రి ఆ పబ్ సర్వర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదు. తాజాగా మూడు రోజులక్రితం కూడా మరో ఉన్నతాధికారి అదే పబ్లో సిబ్బందితో గొడవపడ్డాడు. ఆ కేసు కూడా పోలీసులుదాకా రాకుండానే మూతపడింది. మూడు నెలల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 ఓ పబ్లో యువ హీరో మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. జూబ్లీహిల్స్రోడ్ నెం. 36లోని రెండు పబ్లలో నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. అర్ధరాత్రి ఒంటింగంట దాటిందంటే అమ్మాయిలు బయటికి రాగానే అబ్బాయిలు మత్తులో చెలరేగిపోతుంటారు. పోలీసులుదాకా కొన్ని కేసులు వస్తుంటే మరికొన్ని అక్కడిక్కడే పరిష్కారం అవుతుంటాయి. దీనికి తోడు బౌన్సర్ల దాడులు పెరిగిపోతున్నాయి. మత్తులో యువతీ, యువకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారిని నియంత్రించే క్రమంలో బౌన్సర్లు చేస్తున్న అరాచకాలు పలు విమర్శలకు దారి తీస్తున్నాయి. ఇటీవల జూబ్లీహిల్స్ పోలీసులు పది మంది బౌన్సర్లపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. జూబ్లీహిల్స్లోని ఓ పబ్లో గొడవలపై ఇప్పటికే పది కేసులు నమోదయ్యాయి. మద్యం మత్తులో యువతితో అసభ్య ప్రవర్తన..పబ్ వద్ద గొడవ బంజారాహిల్స్: పబ్లో పీకలదాకా మద్యం తాగిన ఓ యువకుడు బయటకు వచ్చిన తర్వాత అప్పుడే పబ్ నుంచి బయటకు వచ్చిన ఓ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పబ్ బయట జరిగిన ఈ గొడవ వివరాలు ఇలా ఉన్నాయి... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో ఉన్న హార్ట్కప్ పబ్లోకి శనివారం రాత్రి పాతబస్తీకి చెందిన ఫిరోజ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి వచ్చాడు. అంతా కలిసి మద్యం తాగారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఫిరోజ్ ఓ యువతిని వేధించాడు. అయితే ఆమె పెద్దగా పట్టించుకోలేదు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో బయటకు వచ్చిన ఫిరోజ్ ఆమె కోసం బయటే వేచి ఉన్నాడు. సదరు యువతి రాగానే వెనక నుంచి వెళ్ళి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
‘సీఏఏ’ వర్గాల మధ్య ఘర్షణ
న్యూఢిల్లీ/అలీగఢ్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్లో ఆదివారం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మౌజ్పూర్లో రెండు సమూహాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. భద్రత కారణాలతో మౌజ్పూర్, బదర్పూర్ మెట్రో స్టేషన్లను మూసివేశారు. 500 మందితో కూడిన బృందం శనివారం జఫ్రాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో ధర్నా చేసింది. ఈ నేపథ్యంలోనే వారు ఆదివారం నిరసన కొనసాగించారు. ఇటు సీఏఏకు మద్దతుగా ఆదివారం స్థానిక బీజేపీ నేత కపిల్ మిశ్రా నేతృత్వంలో ఓ వర్గం మౌజ్పూర్లో ర్యాలీ ప్రారంభించింది. ఇరు వర్గాలు ఒక దగ్గరికి చేరడంతో ఘర్షణ రేగింది. యూపీలోనూ ఘర్షణ: సీఏఏకు వ్యతిరేకంగా ఉత్తర్ప్రదేశ్లోని అలీగఢ్ ప్రాంతంలో చేపట్టిన నిరసన కారుల ర్యాలీ హింసాత్మకంగా మారడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. ఆదివారం మధ్యాహ్నం అలీగఢ్ జిల్లా కొట్వాలి పోలీస్స్టేషన్ పరిధిలోని అప్పర్ కోట్ ఏరియాలో నిరసనకారులు భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వగా వారిని చెదరగొట్టేందుకు టియర్గ్యాస్ షెల్స్ను ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు. మహ్మద్ అలీ రోడ్డు ప్రాంతంలో శనివారం నుంచే కొందరు మహిళా నిరసన కారులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో∙ఆదివారం సాయంత్రం ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు రోడ్డుపై నుంచి తప్పించే క్రమంలో ఘర్షణ తలెత్తింది. -
కొట్టుకున్న అన్నాచెల్లెలు కుటుంబాలు
దొడ్డబళ్లాపురం : వయసుపైబడ్డ కన్నతల్లిని చూసుకునే విషయంలో కొడుకు, కూతురు ఘర్షణపడి పర్యవసానంగా రెండు కుటుంబాలు వారు కొట్టుకుని ఆస్పత్రిపాలైన సంఘటన దేవనహళ్లి తాలూకాలో చోటుచేసుకుంది. దేవనహళ్లి తాలూకా దొడ్డసాగరహళ్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామస్తురాలైన బిజుమా కుమారుడు ఇమాంసాబ్, కుమార్తె జంగమా కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. వయసుపైబడ్డ బిజుమా గత 15 సంవత్సరాలుగా కుమార్తె జంగమా ఇంట్లోనే ఉంటోంది. అయితే బిజుమాకు వస్తున్న పెన్షన్ డబ్బులను జంగమా ఒక్కతే తింటోందని ఇమాంసాబ్ భార్య నన్నిమా జంగుమా గ్రామంలో జంగమా కనిపించినపుడల్లా తిట్టినట్లు సమాచారం. దీంంతో మనస్తాపం చెందిన జంగమా తల్లిని ఇమాంసాబ్ ఇంటికి పంపించేసింది. అయితే ఇమాంసాబ్ కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. ఇందుకు సంబంధించి ఇరు కుటుంబాలను కూర్చోబెట్టి గ్రామం పెద్దలు మసీదులో పంచాయతీ నిర్వహించారు. ఇలా ఉండగా ఆదివారం రాత్రి ఇమాంసాబ్ తరపు మనుషులు జంగమా ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను దుర్భాషలాడి కొట్టారు. జంగమా, ఈమె పిల్లలు బీబీజాన్, రేష్మ, భర్త మౌలా, మనవరాలు అలియాలపై మారణాయుధాలతో దాడి చేయగా వారంతా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దేవనహళ్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విజయపుర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సీఎం గారూ.. మీ ప్రవర్తన హద్దుమీరింది!
పుదుచ్చేరి: లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, సీఎం నారాయణస్వామిల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కిరణ్ బేడీ పదవి బాధ్యతలు స్వీకరించినప్పటీ నుంచే సీఎం నారాయణస్వామిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. ప్రతిగా సీఎం నారాయణస్వామి కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కాగా.. గత కొద్దిరోజులుగా వీరిరువురి మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం జరుగుతోంది. పుదుచ్చేరి ఆదాయం పెంచుకునేందుకు కాసినోలు, మద్యం తయారీ సంస్థలు, లాటరీ కంపెనీలు స్థాపించాలని సీఎం నారాయణస్వామి భావిస్తుండగా, కిరణ్ బేడీ అందుకు అభ్యంతరం చెబుతుండడంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం నెలకొంది. చదవండి: 'పాకిస్తాన్ వెళ్లమంటారా అంటూ కేంద్రమంత్రి సీరియస్' ఈ క్రమంలో సీఎం నారాయణస్వామి కిరణ్ బేడీ గురించి ప్రస్తావిస్తూ.. ఆమె దెయ్యం, మనస్సాక్షి లేని వ్యక్తి, జర్మనీ నియంత హిట్లర్కు చెల్లెలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కిరణ్ బేడీ కూడా కాస్త ఘాటుగా స్పందించింది. సీఎం కాస్త హుందాగా నడుచుకుంటే మంచిదని హితువు పలికారు. కొన్నిరోజులుగా మీరు నన్ను అనేక పేర్లతో దూషిస్తున్న విధానం గమనిస్తున్నాను. ఇటీవలే మీ ప్రవర్తన హద్దుమీరింది. లెఫ్టినెంట్ గవర్నర్గా నేనెప్పుడూ ప్రజల క్షేమం గురించే ఆలోచిస్తాను. ఈ సందర్భంగా బుద్ధుడు పేర్కొన్న హితోక్తిని కూడా కిరణ్ బేడీ ప్రస్తావించారు. 'ఎవరైనా ఒకర్ని దూషించినప్పుడు రెండో వ్యక్తి ఆ తిట్లను స్వీకరించకపోతే, ఆ తిట్లు మొదటి వ్యక్తి వద్దే ఉంటాయి' అంటూ వ్యాఖ్యానించారు. -
వారిద్దరు విడిపోయారా?!
‘ఐ వానా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు’.. అంటూ ఇన్ని రోజులు ఒకరినొకరు ఫాలో అయ్యారు హీరోయిన్ ఇలియానా, ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ అండ్రూ నీబోన్. చేతిలో చేతులు వేసుకుని ఇన్ని రోజులు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట తాజాగా చేతులు దులుపుకుని విడిపోయారని ప్రచారం జరుగుతోంది. ఆండ్రూతో కలిసి ఉన్న ఫొటోలను తన ఇన్స్టా అకౌంట్ నుంచి తొలగించారు ఇలియానా. అలాగే ఇన్స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. దీంతో ఆమెకు, ఆండ్రూకు మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు నిజమేనని ఊహించుకోవచ్చు. ఇలియానా ఓ సందర్భంలో ఆండ్రూని ‘హబ్బీ’ (భర్త) అంటూ ఇన్స్టాలో క్యాప్షన్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి... ఈ బ్రేకప్ ప్రచారం గురించి ఇలియానా స్పందిస్తే కానీ ఊహాగానాలకు ఫుల్స్టాప్ పడదు. ఇక సినిమాల విషయానికి వస్తే... హిందీలో ఇలియానా కథానాయికగా నటించిన ‘పాగల్ పాంతీ’ సినిమా విడుదలకు రెడీగా ఉంది. -
రోహిత్తో విభేదాలు.. అబద్ధపు ప్రచారమని కోహ్లి ఆవేదన
అవకాశం వచ్చినప్పుడల్లా రోహిత్ శర్మను ప్రశంసలతో ముంచెత్తాను. నాలో అభద్రతాభావం ఉంటే ఇలా చేసేవాడినా? భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందన ఇది. ఇటీవల తనకు, రోహిత్కు పడటం లేదంటూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి అతను తెర దించే ప్రయత్నం చేశాడు. ఎక్కడా దాటవేత ధోరణి లేకుండా ఈ అంశంపై కోహ్లి పూర్తి స్పష్టతనిచ్చాడు. పేరుకు వెస్టిండీస్తో సిరీస్కు బయల్దేరడానికి ముందు జరుగుతున్న అధికారిక మీడియా సమావేశమే అయినా రోహిత్తో సంబంధాల గురించే కోహ్లి వివరణ సుదీర్ఘంగా సాగింది. కోచ్ రవిశాస్త్రి కూడా కెప్టెన్తో జత కలిసి జట్టు ప్రయోజనాల కోసమే ఎవరైనా ఆడతారని, జట్టుకంటే ఎవరూ ఎక్కువ కాదంటూ ‘గాలివార్తలను’ కొట్టిపారేశాడు. కోహ్లి తాజా సమాధానాలతోనైనా విభేదాల వార్తలకు ఫుల్స్టాప్ పడుతుందో లేదో వేచి చూడాలి. ముంబై: భారత కెప్టెన్ కోహ్లి తన డిప్యూటీ రోహిత్ శర్మతో విభేదాల వార్తలపై పెదవి విప్పాడు. జట్టులో అంతా బాగుందని, ఎవరో కావాలని ఇలాంటివి పుట్టిస్తున్నారని ఒకింత అసహనాన్ని ప్రదర్శించాడు. టి20, వన్డే, టెస్టు సిరీస్లు ఆడేందుకు సోమవారం రాత్రి టీమిండియా సభ్యులు విండీస్ బయల్దేరారు. దానికి ముందు కోహ్లి, కోచ్ రవిశాస్త్రి మీడియాతో సంభాషించారు. విశేషాలు కోహ్లి మాటల్లోనే... రోహిత్తో విభేదాల గురించి వాస్తవాలేమిటి? నేను కూడా బయటి నుంచి కొన్ని రోజులుగా ఎన్నో విషయాలు వింటున్నాను. నిజంగా జట్టు సభ్యుల మధ్య సుహృద్భావ వాతావరణం లేకపోతే నాకు తెలిసి ఇంతటి విజయాలు సాధ్యం కావు. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో జట్టు ప్రదర్శనలో డ్రెస్సింగ్ రూమ్లో మంచి సంబంధాలు, నమ్మకం కూడా కీలక పాత్ర పోషిస్తాయి. గత 2–3 ఏళ్లలో మేం ఎన్నో గొప్ప ఘనతలు సాధించాం. వన్డేల్లో ఏడో స్థానం నుంచి నంబర్వన్కు చేరుకున్నాం. ఒకరిపై మరొకరికి పరస్పర విశ్వాసం, సమన్వయం, తగిన గౌరవం లేకపోతే ఇదంతా జరగకపోయేది. నిజంగా సంబంధాలు బాగా లేకపోతే అది మైదానంలో ప్రతిఫలిస్తుంది. ప్రచారంలో ఉన్న వార్తలపై స్పందన ఏమిటి? ఇవన్నీ చాలా చికాకు పరుస్తాయి. మేం జనంలోకి వెళితే మీరు వరల్డ్ కప్లో చాలా బాగా ఆడారంటూ ప్రశంసలు వినిపిస్తుంటే మరోవైపు ఇలాంటి హాస్యాస్పద మాటలు వినాల్సి రావడం దురదృష్టకరం. పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మన మెదళ్లలోకి వాటిని నింపి నిజమని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. జట్టుకు సంబంధించిన విజయాలు, సానుకూలాంశాల గురించి అసలేమీ తెలియనట్లుగా నటిస్తున్నారు. వ్యక్తిగత అంశాలను ఆటలోకి తీసుకురావడం అందరినీ అగౌరవపర్చడమే. నేను చాలా కాలంగా ఇలాంటివి అనుభవిస్తూనే ఉన్నాను. మా జట్టు డ్రెస్సింగ్ రూమ్ ఎంత బాగుంటుందో వచ్చి చూడండి. కుల్దీప్తో ఎలా మాట్లాడతాం, ధోనిలాంటి సీనియర్ను ఎలా ఆటపట్టిస్తామో వీడియో తీసి చూపించలేను కదా? రోహిత్తో అంతా బాగున్నట్లేనా! నా గురించి ఒక్క మాట చెబుతాను. నిజంగా నాకు ఎవరిపైనైనా కోపం ఉంటే అది నా ముఖంలో కనిపిస్తుంది. నాకు ఎలాంటి అభద్రతాభావం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా రోహిత్ శర్మను ప్రశంసించేందుకు ఎప్పుడూ వెనుకాడలేదు. ఎందుకంటే అతనిపై నాకు నమ్మకముంది. రోహిత్ దానికి అర్హుడు. నేను 10 ఏళ్లుగా, రోహిత్ 11 ఏళ్లుగా ఆడుతున్నాం. జట్టును ఈ స్థాయికి తెచ్చేందుకు నాలుగేళ్లుగా కలిసి ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మేం బతికేది, శ్వాసించేది, ఏం చేసినా భారత క్రికెట్ బాగు కోసమే. మా మధ్య ఎలాంటి సమస్య లేదు. ఇలాంటివి పుట్టించి ఎవరు లాభపడుతున్నారో అర్థం కావడం లేదు. మిడిలార్డర్ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? దీనిపై కచ్చితంగా ఇలాగే చేయాలంటూ పరిష్కారం ఏమీ లేదు. పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడమే. టాపార్డర్ బాగుందంటూ ప్రశంసించిన వారే మిడిలార్డర్కు బ్యాటింగ్ అవకాశం రాలేదంటారు. రాక రాక ఒక మ్యాచ్లో అవకాశం వచ్చి వారు విఫలమైతే 1–2 మ్యాచ్లతోనే వారి ప్రదర్శనను ఎలా అంచనా వేస్తాం! నాలుగో స్థానం గురించి బెంగ ఏమీ లేదు. ప్రపంచ కప్లో ఓడినంత మాత్రాన ఏదో ప్రమాదం జరిగినపోయినట్లు కాదు. రవిశాస్త్రికే నా ఓటు... కోచ్ రవిశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని కోహ్లి మరోసారి ప్రదర్శించాడు. ఒకవైపు క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) హెడ్ కోచ్ ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించి ఆ ప్రక్రియ కొనసాగుతుండగానే తన ఓటు మాత్రం శాస్త్రికేనని బహిరంగంగా మద్దతిచ్చేశాడు. ‘కోచ్ ఎంపిక విషయంపై సీఏసీ ఇప్పటి వరకైతే నన్ను ఏమీ అడగలేదు. అయితే నాకు, శాస్త్రికి మధ్య మంచి సమన్వయం ఉంది. ఆయన కోచ్గా కొనసాగాలని కోరుకుంటున్నా. నన్ను అభిప్రాయం అడిగితే మాత్రం ఇదే చెబుతా’ అని కోహ్లి స్పష్టం చేసేశాడు. రాబోయే విండీస్ పర్యటన ఎలా ఉండబోతోంది? మంచి ఆటకు, వినోదానికి అనువైన దేశం వెస్టిండీస్. ఈ టూర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ముందుగా టి20ల్లో కొత్త కుర్రాళ్లకు అవకాశం కల్పించి ప్రయత్నించాలని భావిస్తున్నాం. అయితే టెస్టు చాంపియన్షిప్ నేపథ్యంలో ఈ సారి టెస్టు సిరీస్ కూడా ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న సాధారణ ద్వైపాక్షిక సిరీస్లతో పోలిస్తే ఇకపై ప్రతీ టెస్టులో సవాళ్లు, తీవ్రత ఎక్కువ ఉంటాయి. టెస్టులు బతికేందుకు ఇది చాలా అవసరం. నా దృష్టిలో కూడా మొదటి ప్రాధాన్యత, నేను ఇష్టపడేది కూడా సుదీర్ఘ ఫార్మాట్నే. -
పాన్ షాపుకన్నా అధ్వానం!!
న్యూఢిల్లీ: దేశీ విమానయాన సంస్థ ఇండిగోలో ప్రమోటర్ల మధ్య వివాదాలు మరింతగా ముదిరాయి. కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దాలని కోరుతూ కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన రాకేష్ గంగ్వాల్ తాజాగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి లేఖ రాశారు. ఇండిగోలో గవర్నెన్స్ లోపాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, దానితో పోలిస్తే కనీసం పాన్ షాపు నిర్వహణైనా మెరుగ్గా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. సంస్థను నేడు అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన విలువలకు తిలోదకాలిచ్చి.. కంపెనీ పక్క దారి పడుతోందని గంగ్వాల్ ఆరోపించారు. మరో ప్రమోటరు రాహుల్ భాటియా, ఆయన సంస్థలు సందేహాస్పద లావాదేవీలు జరిపినట్లు పేర్కొన్నారు. చిరకాల మిత్రుడైన భాటియాకు కంపెనీపై అసాధారణ నియంత్రణాధికారాలు కట్టబెట్టేలా షేర్హోల్డర్ల ఒప్పందం ఉందని గంగ్వాల్ ఆరోపించారు. ‘సందేహాస్పద లావాదేవీలతో పాటు కనీసం ప్రాథమికమైన గవర్నెన్స్ నిబంధనలు, చట్టాలను కూడా పాటించడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే దురదృష్టకర పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణం సరిదిద్దే చర్యలు తీసుకోవాలి‘ అని లేఖలో పేర్కొన్నారు. దీని కాపీని అటు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్కు కూడా పంపారు. 19లోగా వివరణివ్వండి..: రాకేష్ గంగ్వాల్ చేసిన ఫిర్యాదులపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో కీలక వివరాలు ఇవ్వాలంటూ ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ను ఆదేశించింది. దీనికి జూలై 19 గడువు విధించింది. స్టాక్ ఎక్సే్చంజీలకు ఇండిగో ఈ విషయాలు తెలిపింది. సెబీకి గంగ్వాల్ రాసిన లేఖ ప్రతి తమకు కూడా అందినట్లు వివరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీఎస్ఈలో ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ షేరు స్వల్పంగా నష్టపోయి రూ. 1,565.75 వద్ద క్లోజయ్యింది. వివాదం ఇదీ.. ఇండిగో సహవ్యవస్థాపకుడు అయిన గంగ్వాల్కు కంపెనీలో 37% వాటాలు ఉన్నాయి. మరో సహవ్యవస్థాపకుడు రాహుల్ భాటియా, ఆయన సంబంధ సంస్థల (ఐజీఈ గ్రూప్)కు 38% వాటాలున్నాయి. సంబంధ పార్టీల మధ్య సందేహాస్పద లావాదేవీలపై ఇద్దరు ప్రమోటర్ల మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో అత్యవసర షేర్హోల్డర్ల సమావేశం నిర్వహించాలంటూ గంగ్వాల్ గతంలో ప్రతిపాదించగా భాటియా దాన్ని తిరస్కరించారు. అసమంజసమైన ఆయన డిమాండ్లను కంపెనీ బోర్డు ఒప్పుకోనందున గంగ్వాల్ ఇలాంటివన్నీ చేస్తున్నారంటూ భాటియా ఆరోపించారు. దేశీయంగా అతి పెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగోకు దాదాపు 49%మార్కెట్ వాటా ఉంది. 200 పైచిలుకు విమానాలతో రోజూ 1,400 ఫ్లయిట్స్ నడుపుతోంది. భాటియాకు అసాధారణ అధికారాలు కట్టబెట్టేలా షేర్హోల్డరు ఒప్పందం ఉన్నప్పటికీ.. సుదీర్ఘ మిత్రత్వం దృష్టిలో ఉంచుకుని, కంపెనీపై నియంత్రణాపేక్ష పెట్టుకోకుండా అగ్రిమెంటు తాను అంగీకరించానని గంగ్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం భాటియాకు చెందిన ఐజీఈ గ్రూప్నకు ఆరుగురిలో ముగ్గురు డైరెక్టర్లను, చైర్మన్, సీఈవో, ప్రెసిడెంట్ను నియమించే అధికారాలు ఉంటాయి. ప్రస్తుత చైర్మన్ స్వతంత్రతను తాను ప్రశ్నించడం లేదని కానీ స్వతంత్ర చైర్మన్ పేరిట జరిపే నియామక ప్రక్రియే సెబీ నిబంధనలను తుంగలో తొక్కేలా ఉందని గంగ్వాల్ ఆరోపించారు. -
మనస్తాపంతో హిజ్రా ఆత్మహత్య
సాక్షి, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని బాబాసాహబ్ పహడ్లో ఓ హిజ్రా ఆత్మహత్య చేసుకున్నారు. ఆరోటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పదేళ్ల క్రితం హరీష్ అనే వ్వాపారి హిజ్రాగా మారారు. స్నేహగా నగరంలో బాబాసాహెబ్ పహడ్లో ఉంటోంది. గత నాలుగేళ్లుగా కంఠేశ్వర్కు చెందిన నాగరాజ్తో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. స్నేహను తరుచూ ఫోన్లో తిట్టడంతో ఇద్దరి మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరింది. దీంతో మనస్థాపం చెందిన స్నేహ శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం తలుపులు తీయకపోవడంతో చుట్టు పక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా స్నేహ ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. నాగరాజ్ను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. -
ఏఆర్లో మామూలే!
పోలీసు శాఖలో ఏఆర్ విభాగం వివాదాలకు కేరాఫ్గా మారుతోంది. ఆ విభాగంలో కొంతమంది అధికారుల నిర్ణయాల వలన సిబ్బంది తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. సిబ్బందికి విధుల కేటాయింపులో పక్షపాత ధోరణి అవలంబించడం వెనుక డబ్బులు చేతులు మారుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం సెంట్రల్: ఏఆర్విభాగంలో సిబ్బంది విధుల కేటాయింపులు నిత్యం వివాదాస్పదంగా మారుతున్నాయి. పలుకుబడి ఉన్న వారికి సులభతరమైన పనులు.. ఎవరూ లేని వారికి గార్డు డ్యూటీలు వేస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల సైతం గుర్తించారు. నర్సరీల్లో మొక్కలకు నీళ్లు పెట్టే విధులకు ఇటీవల రిక్రూట్ అయిన ఉద్యోగులు పనిచేస్తుండగా... బందోబస్తు విధులకు ఉద్యోగ విరమణ పొందేందుకు దగ్గరలో ఉన్న వారు వెళ్తున్నారు. డ్రైవర్ పోస్టులకు ఇక భారీగా డిమాండ్ ఉంది. గతంలో రూ.20వేల నుంచి రూ. 30వేలు ముట్టజెప్పి విధులకు వేయించుకున్న సందర్భాలున్నాయి. ఇటీవల ఇదే విధంగా హైవే పెట్రోలింగ్కు వెళ్లిన ఓ కానిస్టేబుల్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వలన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఇందుకు కారణం పోలీసు వాహనమేనని సదరు ఆర్టీసీ డ్రైవర్లు పేర్కొన్నారు. దీనిపై విచారించిన పోలీసు అధికారులు సదరు కానిస్టేబుల్ను వాహన డ్రైవరు పోస్టు నుంచి తప్పించారు. విధులకు వెళ్లిన పది రోజుల వ్యవధిలోనే ఈ సంఘటన జరిగింది. దీంతో తన డబ్బులు తనకు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయం ఏఆర్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పీఎస్ఓల నియామకమూ వివాదాస్పదమే తాజాగా పీఎస్ఓల నియామకం వివాదాస్పదంగా మారుతోంది. వీవీఐపీలు జిల్లా పర్యటనల్లో సేవలు వినియోగించుకోవడానికి ఇటీవల ఒంగోలులో శిక్షణ ఇచ్చారు. అయితే వీరి సేవలను పీఎస్ఓలకు వినియోగించుకుండా ఏఆర్ అధికారులకు నచ్చినవారిని పంపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పీఎస్ఓల నియామకంలో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇతర విభాగాలకు నియమితులైన సిబ్బందిని పీఎస్ఓల విధులకు పంపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫిట్నెస్ విషయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలి. దీనికీ తిలోదకాలిచ్చినట్లు తెలుస్తోంది. కొంతమంది వీఐపీల నుంచి అభిప్రాయం తీసుకోకుండానే పీఎస్ఓలను పంపతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని కోరుతున్నారు. నిబంధనల ప్రకారమే ఏఆర్లో అవినీతి అక్రమాలకు ఆస్కారం లేదు. ఇటీవల గెలుపొందిన ప్రజాప్రతినిదులకు పీఎస్ఓలను కేటాయిస్తున్నాం. వారి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే కేటాయిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాం. – మురళీధర్, ఏఆర్ డీఎస్పీ -
ఈసీలో అసమ్మతి ‘లావా’సా
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు పూర్తయి, ఓట్ల లెక్కింపునకు గడువు సమీపిస్తున్న సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)లో విభేదాలు బయటపడ్డాయి. నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులపై తీసుకునే నిర్ణయాల్లో తన అసమ్మతిని రికార్డు చేయనందుకు నిరసనగా ఈసీ సమావేశాలకు దూరంగా ఉంటానని ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా ప్రకటించారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరాకు లావాసా లేఖ రాయడం కలకలం రేపింది. మరోమార్గం లేకనే దూరంగా ఉంటున్నా ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఎన్నికల ప్రచారం సందర్భంగా నియమావళిని ఉల్లంఘించడంపై వచ్చిన ఫిర్యాదులపై చర్యల విషయంలో తన అభిప్రాయాన్ని రికార్డు చేయనందుకు కమిషనర్ అశోక్ లావాసా అసంతృప్తి వ్యక్తం చేశారు. 16న సీఈసీ అరోరా లేఖ రాశారు. అందులో ‘ఈసీలో పారదర్శకత ఉండాలన్న తన నోట్పై స్పందించనందుకు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులపై దూరంగా ఉండటం మినహా మరోమార్గం లేదని భావిస్తున్నా. మైనారిటీ అభిప్రాయాలను రికార్డు చేసేదాకా కమిషన్ సమావేశాలకు గైర్హాజరు కావాల్సిన పరిస్థితిని కల్పించారు. అసమ్మతిని రికార్డు చేయనప్పుడు సమావేశాల్లో పాల్గొనడంలో అర్థంలేదు’ అని లేఖలో పేర్కొన్నారు. ‘చాలా సందర్భాల్లో నేను వ్యక్తం చేసిన మైనారిటీ అభిప్రాయం బహుళ సభ్యుల చట్టబద్ధ సంస్థలు పాటించే సంప్రదాయాలకు భిన్నంగా అణచివేతకు గురైంది’ అని పేర్కొన్నారు. న్యాయ నిపుణులు ఏమన్నారంటే.. నిబంధనల ప్రకారం.. ఎన్నికల సంఘం ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అది సాధ్యం కానప్పుడు మెజారిటీ అభిప్రాయమే అంతిమం అవుతుంది. నియమావళి ఉల్లంఘనల ఫిర్యాదులపై నిర్ణయాలు తీసుకునే సమయంలో ట్రిబ్యునల్లో మాదిరిగా విచారణ ఉండదని, ఈసీ నిర్ణయాలపై సీఈసీతోపాటు మిగతా ఇద్దరు సంతకాలు చేస్తున్నందున మైనారిటీ అభిప్రాయాన్ని రికార్డు చేయాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు చెప్పారు. మెజారిటీ అభిప్రాయాన్నే ఈసీ నిర్ణయంగా వెలువరిస్తారని, అసమ్మతి అభిప్రాయాన్ని రికార్డు చేస్తారే తప్ప బహిర్గతం చేయబోరని అంటున్నారు. మోదీ, అమిత్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ వచ్చిన 11 ఫిర్యాదులపై లావాసా అసమ్మతిని తెలపగా కమిషన్లోని సీఈసీ, మరో సభ్యుడు సుశీల్చంద్ర అన్ని ఫిర్యాదులపై క్లీన్చిట్ ఇచ్చారు. ఆరోపణలపై విచారణ: కాంగ్రెస్ ఈసీపై మోదీ ప్రభుత్వం ఒత్తిడి చేసిందన్న లావాసా ఆరోపణలపై విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా.. ‘మోదీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ను ‘ఎలక్షన్ ఒమిషన్’గా మార్చేసింది. లావాసా అసమ్మతిని రికార్డు చేసి ఉన్నట్లయితే ఈసీని ప్రభుత్వం మరిన్ని ఇబ్బందులు పెట్టి ఉండేది’ అని అన్నారు. మోదీ– అమిత్ షా ద్వయం ఉల్లంఘనలపై కమిషనర్ లావాసా పలు పర్యాయాలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఎన్నికల సంఘం వారికి క్లీన్చిట్ ఇవ్వడమే పనిగా పెట్టుకుందని ఆరపించారు. లేఖలో పేర్కొన్న అంశాలను తీవ్రమైనవిగా పరిగణించాలన్నారు. సుప్రీంకోర్టులో తీర్పుల సందర్భంగా జడ్జీలు వ్యక్తం చేసిన మెజారిటీతోపాటు మైనారిటీ అభిప్రాయాన్ని వెల్లడిస్తుండగా ఈసీలో అసమ్మతి అభిప్రాయాన్ని ఎందుకు బహిర్గతం చేయరని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ఎన్నికల సంఘంలో సంభవిస్తున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ఈసీ నిష్పాక్షికతపై అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఇది ఈసీ అంతర్గత విషయం: సీఈసీ అరోరా ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా లేఖ ఎన్నికల సంఘం అంతర్గత విషయమని సీఈసీ అరోరా అన్నారు. ఉల్లంఘన ఫిర్యాదులపై చర్యల విషయంలో ఈసీ పనితీరుపై మీడియాలో వచ్చిన కథనాలు ‘అభ్యంతరకరం. ఇది ఈసీ అంతర్గత విషయం’ అని అన్నారు. ‘కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యులు కూడా ఒకే వైఖరితో ఉండాలని ఏమీ లేదు. గతంలో ఎన్నోసార్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అది సహజం. కానీ, అదంతా ఎన్నికల సంఘం పరిధికి లోబడి జరిగింది. ఇటీవల మే 14వ తేదీన జరిగిన సమావేశంలోనూ ప్రవర్తనా నియమావళిసహా 13 అంశాలను పరిష్కరించేందుకు గ్రూపుల ఏర్పాటుపై ఏకాభిప్రాయం వ్యక్తమయింది. అవసరమైన సందర్భాల్లో బహిరంగ చర్చకు నేను వెనుకాడలేదు. ఆఖరి దశ ఓటింగ్,23న లెక్కింపు వేళ లావాసా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు మిగతా విషయాలపై చర్చించేందుకు 21న ఈసీ పూర్తిస్థాయి సమావేశం ఉంటుంది’ అని అరోరా వెల్లడించారు. -
కేంద్రఎన్నికల సంఘంలో విభేదాలు!
-
పెళ్లి భోజనాల వద్ద బిర్యానీ కోసం కొట్లాట
పశ్చిమగోదావరి, పెరవలి: శుభమా అని పెళ్ళి చేసుకుంటే భోజనాల దగ్గర జరిగిన చిన్న గొడవతో ఇరువర్గాలు కొట్టుకోవటంతో 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పెరవలి ఎస్సై వి.జగదీశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తణుకు పాతూరుకు చెందిన వధువు తరుఫు బృందం, పెరవలి మండలం అజ్జరం గ్రామానికి చెందిన వరుడి ఇంటి వద్ద వివాహ వేడుకకు శుక్రవారం ఉదయం వచ్చారు. పెళ్ళి తంతు ముగిసిన తరువాత భోజనాలు చేస్తుండగా బిర్యానీ గురించి మాటామాటా పెరిగి వధువు, వరుడి వర్గాలు పరస్పరం కొట్టుకున్నారు. ఈ దాడిలో వరుడి తరుఫున ఆరుగురికి, వధువు తరఫున ఆరుగురికి గాయాలయ్యాయి. పెళ్ళి మండపం వద్ద గొడవ జరుగుతోందని సమాచారం రావటంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటికే ఇరువర్గాలు కొట్టుకోవటంతో గాయాలైన వారిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసామని ఎస్సై తెలిపారు. -
అదుపులో ‘అంబర్పేట’
అంబర్పేట : అంబర్పేటలో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి. స్థలం కూల్చివేతపై నెలకొన్న వివాదం ఘర్షణకు దారితీసిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ వివాదం రాత్రి 10 గంటలకు అదుపులోకి వచ్చింది. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, పలువురు ఉన్నతాధికారులు వందల సంఖ్యలో అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలుమార్లు లాఠీ చార్జి, వాటర్ క్యానన్లను ప్రయోగించి చెదరగొట్టారు. అంబర్పేటలోని ప్రతి గల్లీలో పికెట్లు ఏర్పాటు చేసి ఎక్కడి వారిని అక్కడే కట్టడి చేశారు. అర్ధరాత్రి వరకు సీపీ అంబర్పేట ప్రధాన రోడ్డుపైనే తిష్ట వేసి పరిస్థితిని సమీక్షించారు. రహదారిని దిగ్బంధం చేసి సాధారణ వాహనాలను అనుమతించకుండా తమ చేతుల్లోకి తీసుకున్నారు. సోమవారం సంఘటనా స్థలం వద్ద అదనపు బలగాలతో ప్రత్యేక పికెట్ను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా పహారా కాశారు. వివాదాస్పద స్థలం వద ్దకు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మూడు కేసులు నమోదు... అంబర్పేటలో తలెత్తిన ఉద్రిక్తత పూర్తిగా సద్దుమణిగిందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ఈ ఘటనపై మూడు కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సంఘటనలో గాయపడిన పోలీసులు, పౌరుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. పౌరులు ఏలాంటి వదంతులు నమ్మవద్దని కోరారు. సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాట్సాప్లో వచ్చిన వీడియోలను పరిశీలించకుండా ఇతరులకు పంపిస్తూ వదంతులు సృష్టిస్తే కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామన్నారు. అంబర్పేట ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
‘నాలుగో విడత’లో హింస
న్యూఢిల్లీ/కోల్కతా: సార్వత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్ హింసాత్మకంగా ముగిసింది. 8 రాష్ట్రాల్లోని 71 లోక్సభ స్థానాలకు సోమవారం జరిగిన ఈ ఎన్నికల్లో 64 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. నాలుగో విడత పోలింగ్లో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో నిలవగా, రాజస్తాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, బిహార్ రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బెంగాల్లోని ననూర్, రామ్పుర్హత్, నల్హటి, సురి ప్రాంతాల్లో పోలింగ్ సందర్భంగా అధికార తృణమూల్, విపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో పలువురు గాయపడ్డారు. ఈ సందర్భరంగా 145 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్చేశారు. అసన్సోల్ లోక్సభ స్థానంలోని బర్బానీలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కారును టీఎంసీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సుప్రియో సురక్షితంగా బయటపడ్డారు. అలాగే దుర్బాజ్పూర్ ప్రాంతంలో కొందరు దుండగులు సెల్ఫోన్లతో పోలింగ్ కేంద్రంలోకి చొరబడి తమపై దాడికి యత్నించడంతో కేంద్ర బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. మొరాయించిన ఈవీఎంలు.. మధ్యప్రదేశ్లో మాక్పోలింగ్ సందర్భంగా 207 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) మొరాయించాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) వీఎల్ కాంతారావు తెలిపారు. వీటిని వెంటనే మార్చామన్నారు. ఆ తర్వాత పోలింగ్ సందర్భంగా ఇబ్బందులు తలెత్తడంతో మరో 107 ఈవీఎంలను సమకూర్చామని వెల్లడించారు. ఇక రాజస్తాన్లోని బన్స్వారాలో అత్యధికంగా 72.34 శాతం పోలింగ్ నమోదుకాగా, బర్మర్లో 72.21 శాతం నమోదైనట్లు అక్కడి ఎన్నికల అధికారులు చెప్పారు. భారత ఆర్థిక రాజధాని ముంబైలోని ఆరు నియోజకవర్గాల్లో 51.11 శాతం పోలింగ్ నమోదయింది. కశ్మీర్లోని అనంతనాగ్ నియోజవకర్గంలో రెండో విడత ఎన్నికల్లో 10.5 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఒడిశాలో కాంగ్రెస్ కార్యకర్త హత్య.. ఒడిశాలోని బలికుడా–ఎరసమా పోలింగ్ కేంద్రం నుంచి తిరిగివెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్త లక్ష్మణ్ బెహరాపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడిచేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. జాజ్పూర్–కేంద్రపరా, బాలాసోర్ లోక్సభ స్థానాల్లో రిగ్గింగ్కు పాల్పడుతున్నారంటూ బీజేడీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మరోవైపు తన భార్య డింపుల్ యాదవ్ పోటీచేస్తున్న కన్నౌజ్లో ఈవీఎంల్లో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. యూపీలోని జమ్కారా పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారి తనకు బదులుగా ఈవీఎం బటన్ నొక్కేశాడని ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేయడంతో సదరు అధికారిని విధుల నుంచి తప్పించి పోలీసులకు అప్పగించారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత బబూల్ సుప్రియోపై సోమవారం కేసు నమోదయింది. పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ లోక్సభ స్థానం నుంచి పోటీచేస్తున్న సుప్రియో బర్బానీలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్లోకి దూసుకెళ్లారు. అనంతరం అక్కడి ఎన్నికల అధికారితో పాటు ప్రత్యర్థి పార్టీ ఏజెంట్తో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు సుప్రియోపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. అయితే ప్రజలను ఓటేయకుండా అడ్డుకున్నట్లు సమాచారం రావడంతోనే తాను బర్బానీకి వచ్చానని సుప్రియో వివరణ ఇచ్చారు. ఆమిర్ ఖాన్ దంపతులు, సల్మాన్ ఖాన్, ఊర్మిళ ప్రియాదత్, సంజయ్ దత్, కంగనా రనౌత్ దీపికా పదుకొణె, మాధురీ దీక్షిత్, అభిషేక్, ఐశ్వర్య -
కొండ చుట్టూ వివాదాలు
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. పింక్ డైమండ్ మాయమైందన్న దానిపై స్పష్టత లేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. లెక్కలేనన్ని వివాదాలు టీటీడీని చుట్టుముట్టుతున్నా.. ఉన్నతాధికారుల నుంచి ఆధారాలతో కూడిన వివరణ చెప్పిన దాఖలాలు కనిపించడం లేదు. శ్రీవారికి సమర్పించిన అనేక బంగారు ఆభరణాలు కనిపించలేదనే ఆరోపణలు ఉన్నాయి. తిరుమల పోటులో గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు జరిపారన్న దానిపై టీటీడీ పొంతనలేని సమాధానాలు.. ప్రభుత్వ పెద్దల సేవ కోసం తహతహలాడే టీటీడీ అధికారులు కొందరు స్వామివారిని సైతం పస్తులు ఉంచారని అర్చకుల ఆందోళన.. టీటీడీ నిధులు టీడీపీ నేతల ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. తిరుమల ఆలయంలో జరుగుతున్న అపచారాలపై నోరు విప్పినందుకు టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, మరి కొందరిని రిటైర్మెంట్ పేరుతో ఇంటికి పంపారని ఆరోపణలు ఉన్నాయి. శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి గురైన కిరీటాల వెనుక నిర్లక్ష్యంపై ఎవరిపైనా ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాజాగా తమిళనాడులో పట్టుబడ్డ రూ.కోట్లు విలువచేసే బంగారంపై టీటీడీ పొంతనలేని సమాధానాలు ఇవ్వడంపై మరిన్ని అనుమానాలకు తావిచ్చినట్లు అవుతోంది. ఇలా టీటీడీపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టి నిజాలను నిగ్గుతేల్చి భక్తుల్లో నమ్మకాన్ని పెంచాల్సిన ప్రభుత్వ అధికారులు, టీటీడీ ఆ ప్రయత్నాలేవీ చేయకపోవడంపై మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పింక్ డైమండ్.. పోటు తవ్వకాలపై వీడని మిస్టరీ కోట్ల రూపాయలు విలువచేసే డైమండ్ను విదేశాల్లో విక్రయించారని తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆరోపించారు. పింక్ డైమండ్తో పాటు శ్రీవారికి సమర్పించిన విలువైన ఆభరణాలు కూడా మాయమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్రానికి విరుద్ధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, అందులో శ్రీవారి పోటులో రహస్యంగా తవ్వకాలు జరిపారన్న ది రమణదీక్షితులతో పాటు, టీటీడీ ఆలయ చరిత్రపై ముద్రించిన పుస్తకాల్లోనూ పేర్కొన్నారు. ఆలయంలోని ప్రదక్షిణ ప్రాకారంలో శ్రీవారికి సమర్పించిన విలువైన కానుకలను పూడ్చిపెట్టారని చరిత్రకారులు చెబుతున్నారు. బ్రిటిష్ కాలంలో తహశీల్దార్గా పనిచేసిన శ్రీనివాసాచార్యులు పోటులో తవ్వకాలు జరిపి అర్థాంతరంగా ఆపివేసిన విషయాన్ని అప్పటి కలెక్టర్ జేమ్స్ స్టార్టన్ రచించిన ‘సవాల్ ఈ జవాబ్’ పుస్తకంలో పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని టీటీడీలో పనిచేస్తూ ఉద్యోగ విమరణ పొందిన సొరకాయల కృష్ణారెడ్డి ‘గోపీకృష్ణ’ పేరుతో ‘మన ఆలయాల చరిత్ర’గా తెలుగులో అనువదించారు. అందులో ‘శ్రీవారికి అనేక మంది కానుకలు సమర్పించారు. వాటిని ఎక్కడ దాయాలో తెలియక అప్పట్లో ఆలయ నిర్వాహకులు ప్రదక్షిణ ప్రాకారంలో పూడ్చిపెట్టారు. ఆ ప్రదక్షిణ ప్రాకారం 300 గజాల పొడవు.. 40 గజాల వెడల్పు కలిగి ఉంటుంది. ఆ విస్తీర్ణంలో రాజులు శ్రీవారికి సమర్పించిన కానుకలను బండల కింద ఎక్కడ పూడ్చిపెట్టారో తెలుసుకునేందుకు అప్పట్లో తహశీల్దార్గా పనిచేసిన శ్రీనివాసాచార్యులు ప్రయత్నించారు. అయితే తనకు, తనతో పనిచేసే వారికి అకస్మాత్తుగా జబ్బుచేయడంతో అది అపచారంగా భావించి ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అప్పటి నుంచి అనేక మంది తవ్వకాలు జరిపి విఫలమయ్యారు. ఆ తరువాత ప్రదక్షిణ ప్రాకారాన్ని మూతవేశారు. అందులో శ్రీరామానుజస్వామి, తొండమాన్ చక్రవర్తి సమర్పించిన విలువైన కానుకలు కూడా బండల కింద దాచి ఉంచినట్లు ప్రచారం ఉంది. వాటిలో అతి ముఖ్యమైంది నాగా భరణం. ఈ ఆభరణం బిల్వ పత్రాలను పోలి ఉంటుంది.’ అని పేర్కొన్నారు. ఆ బంగారం పట్టుబడకుండా ఉంటే? తమిళనాడులో ఎన్నికల ముందు రోజు గత బుధవారం రాత్రి రూ.400 కోట్లకుపైగా విలువచేసే 1381 కిలోల బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ బంగారం మొదటి తమకు సంబంధం లేదని చెప్పిన టీటీడీ, కొన్ని గంటల తరువాత ఆ బంగారం టీటీడీదేనని ప్రకటించింది. అన్ని కోట్లు విలువచేసే బం గారం తరలించే సమయంలో ఎటువంటి భద్రత లేకుండా తీసుకు రావడం వెనుక ఆంతర్యం ఏమి టని పలువురు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో పట్టుబడ్డ బంగారాన్ని ఎక్కడికో తరలిస్తుండగా పట్టుబడిందా? అధికారులు పట్టుకోవడంతో టీటీడీ ట్రెజరీకి చేరిందంటున్నారు. బంగారం తరలింపు విషయంలో ఇటు టీటీడీ, అటు బ్యాంకు అధికారులు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదని విచారణాధికారి మన్మోహన్సింగ్ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంకు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అదే విధంగా తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే బంగారు ఆభరణాలను జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా కొందరు అధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి నగదు, బం గారాన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే తవ్వకాలు జరిపారా ? క్రీస్తు పూర్వం 1150లో నిర్మించిన ఆలయంలోని పోటులోనే రోజూ మూడు వేళలా మూడు రకాల ప్రసాదాలు త యారు చేసి స్వామి వారికి సమర్పిస్తారు. అటువంటి ప్రాకారాలను పగులగొట్టడానికి 2017 డిసెంబర్ 8 నుంచి 30 వరకు మూతవేశారనేది రమణదీక్షితులు చేసిన ఆరోపణ. ఆలయంలో విమాన ప్రాకారం, బూందిపోటు, లోపల పోటులో ఏ పనిచేయాలన్నా ఆగమశాస్త్రం ప్రకారమే చేపట్టాల్సి ఉందని అర్చకులు అభిప్రాయం. పోటులో చేపట్టిన పనులకు సంబంధించి ఎవ్వరికీ తెలియదని, అంత రహస్యంగా ఎందుకు పనులు చేయాల్సిన అవసరం ఏముందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆలయంలో మరమ్మతులు చేయాలంటే ఆగమ అడ్వైజర్ను సంప్రదించాల్సి ఉన్నా.. అటువంటి ప్రయత్నాలేవీ చేయలేదని దీక్షితుల ప్రశ్న. డిసెంబర్ 20న పోటును పరిశీలించే వరకు ఆ అపచారం గురించి తనకు తెలియదని పేర్కొన్నారు కూడా. పోటులో జరిగిన తవ్వకాలు చూసి ఆశ్చర్యపోయానని, పురాతనమైన గోడలను, బండలను పగులగొట్టడం చూసి బాధ వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటీ ష్ హయాంలో జిల్లా కలెక్టర్ పుస్తకంలో రాసిన అంశాలు, రమణదీక్షితులు చేసిన ఆరోపణలకు పోలికలు ఉన్నాయని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ 22 రోజులు పోటులో ఏం జరిగిందనే దానిపై అటు భక్తులు, ఇటు టీటీడీ అధికారులు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణల్లో నిజం లేదని చెబుతున్న టీటీడీ, ఆ సమయంలో ఉన్న సీసీ పుటేజీని బయటపెడితే నిజా నిజాలు బయటపడే అవకాశం ఉన్నా.. ఆ ప్రయత్నం చేయక పోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే టీటీడీ అధికారులు కొందరు వీవీఐపీల సేవలో తరిస్తూ భక్తులను విస్మరిస్తున్నారనే ఆరో పణలు ఉన్నాయి. ఇంకా స్వామి వారికి రోజూ జరిగే సుప్రభాతసేవను అర్ధరాత్రి నుంచే నిర్వహించాలని ఒత్తిడి చేస్తున్నారని, 20 నిమిషాలపాటు జరగాల్సిన తోమాల సేవను పది నిమిషాల్లో ముగించాలని అధికారులు ఒత్తిడి చేస్తు న్నారని ప్రధాన అర్చకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిపాజిట్లుప్రైవేటు బ్యాంకులోఎందుకు? తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు.. వచ్చే ఆదా యం సుమారు రూ.వెయ్యి కోట్లు టీటీడీ ప్రైవేటు బ్యాంకులో డిపాజిట్ చేసిం ది. ప్రభుత్వ బ్యాంకులు ఉన్నా... ప్రైవేటు బ్యాంకులో ఎందుకు డిపాజిట్ చేయాల్సి వచ్చిందని రాయలసీమ హక్కుల పోరాట సమితి కన్వీనర్ నవీన్కుమార్రెడ్డి వెలుగులోకి తీసుకురావడంతో పాటు కోర్టును ఆశ్రయించారు. టీటీడీ తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిన టీటీడీ సబ్ కమిటీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. అదే విధంగా లడ్డూ పోటును విస్తరించే క్రమంలో ఉగ్రాణం వద్ద ఉన్న గోడను తొలగించి పెద్దది చేయాలని టీటీడీ భావించినట్లు సమాచారం. ఆ గోడను తొలగించేందుకు టీటీడీ రూ.2 కోట్లతో టెండర్ పిలిచి నిధులు దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఒక గోడను తొలగించేందుకు రూ.2 కోట్లు అవసరమా? అని టీటీడీ అధికారులే కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. అదే విధంగా శ్రీవారి ఆలయంలో వెండివాకిలి వద్ద భక్తులకు వీలుగా ఉండేందుకు మెట్లను ఏర్పాటు చేశారు. అది ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఏర్పాటు చేశారని అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో వెంటనే తొలగించారు. ఆ మెట్లు ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.33 లక్షలు ఖర్చుచేసినట్లు తెలిసింది. ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను కొందరు అధికారులు స్వలాభం కోసం ఖర్చుచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. టీటీడీ నిర్లక్ష్యంతోనే కిరీటాలు చోరీ శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాలకు అలంకరించిన కిరీటాల చోరీకి టీటీడీ నిర్లక్ష్యమే కారణమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అదే విధంగా చోరీ చేధించే విషయంలో ఎక్కడా టీటీడీ పాత్ర నామమాత్రంగా కూడా కనిపించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 3న శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు అలకరించిన మూడు బంగారు కిరీటాలు మాయమైన విషయం తెలిసిందే. చోరీకి గురైన కిరీటాలను దొంగ కరిగించి అమ్మిసొమ్ము చేసుకున్నాడు. చోరీకి గురై 80 రోజులు గడచిపోయినా.. కిరీటాలు అపహరణకు గురైన విషయంలో బాధ్యులపై టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు పట్టుకుని అప్పగించడంతో దొంగ దొరి కాడని, బంగారం దొరికిందని సముదాయించుకుంటున్నారు తప్పితే టీటీడీ చేసిందేమీ లేదని తెలుస్తోంది. మొత్తంగా ఐదేళ్ల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో టీడీపీ నేతల పెత్తనం అధికం కావడంతో అధికారులు కూడా ఇష్టారాజ్యం వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేక దర్శనాల టికెట్లు, లడ్డూలు బ్లాక్ మార్కెట్లో అమ్మి సొమ్ముచేసుకోవడంలోనూ విమర్శలు ఉన్నాయి. పాలకమండలి సభ్యులు ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలతో పాటు వివిధ సేవా టికెట్లను బ్లాక్లో విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారే ప్రచారం ఉంది. ఇలా టీటీడీ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నా... వాటిపై ఎక్కడా విచారణ చేపట్టి నిజాలను నిగ్గుతేల్చిన దాఖలాలు లేవని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అనుచరులకు రెస్టారెంట్లు తిరుమలలో మంత్రి అనుచరులకు రెస్టారెంట్లు కట్టబెట్టారు. తిరుమలలో ఉన్న రెస్టారెంట్లు, క్యాంటీన్లలో టీటీడీ నిర్ణయించిన ధరలు అమలు కావడం లేదని వాటిని మూసివేశారు. ఆ తరువాత వాట న్నింటికీ ఇటీవల టెండర్లు పిలిచారు. అయితే అన్నమయ్య భవన్తో పాటు అన్నమయ్య రెస్టారెంట్, మ్యూజియం సమీపంలోని సందీప రెస్టారెంట్కు మాత్రం టెండరు విధానం కాకుండా కొత్త పద్ధతిలో అప్పగించేందుకు పథకం వేశారు. అందులో భాగంగా ఈ రెస్టారెంట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. ఆసక్తి ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో సందీప రెస్టారెంట్ దరఖాస్తు చేసుకుంది. ఆ రెస్టారెంట్లకు నెలకు రూ.3 లక్షల అద్దె చెల్లించేందుకు సిద్ధమైంది. ఇదే రెస్టారెంట్ గతంలో రూ.45.66 లక్షలు పలికింది. దీనికి ముందు ఉన్న మయూర హోటల్ వారు ఇదే రెస్టారెంట్కు నెలకు రూ.8.83 లక్షలు అద్దె చెల్లిస్తూ వచ్చారు. అయితే దీన్ని కేవలం రూ.3 లక్షలకే ఏపీటీడీసీకి కట్టబెట్టేందుకు టీడీపీ పాలకమండలి తీర్మానించింది. ఈ లెక్కన గత టెండరుతో పోల్చితే నెలకు రూ.42 లక్షలు, ఏడాదికి రూ.5 కోట్లు టీటీడీ నష్టపోవాల్సి వస్తోంది. ఇంత తగ్గించి అప్పజెప్పినా ఆ రెస్టారెంట్లలో భక్తులకు తక్కువ ధరకు భోజనం పెడుతున్నారా? అంటే అదీ లేదు. జనతా హోటల్లో రూ.60 భోజనం ఉంటే.. ఏపీటీడీసీలో రూ.120 ఉంది. వడ రూ. 24 ఉంటే.. ఏపీటీడీసీలో రూ.60 ఉంది. ఇలా అన్ని తినుబండారాల ధరలు రెట్టింపుగా ఉన్నాయి. రెస్టారెంట్ను దక్కించుకున్నా ఏపీ టూరిజం శాఖ వారు నడుపుతున్నారా? అంటే అదీ లేదు. వాటిని మంత్రి అనుచరులకు నామమాత్రపు ధరతో అప్పగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతల స్వప్రయోజనాలకు నిధులు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కోసం భూమి కేటాయించలేదు. అయితే టాటా ఆస్పత్రికి మాత్రం సుమారు రూ.వెయ్యి కోట్లు విలువచేసే భూమిని కేటాయించడంపై అప్పట్లో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. అదే విధంగా టీడీపీ నేతల స్వప్రయోజనాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పనుల కోసం రూ.40 కోట్లు టీటీడీ నిధులు కేటాయించింది. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.150 కోట్లు కేటాయించింది. ఇంత పెద్ద మొత్తంలో ఆల య నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్న టీటీడీకి ప్రభుత్వం అమరావతిలో భూమిని ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. ప్రైవేటు సంస్థలకు వందల ఎకరాలను ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వం టీటీడీకి మాత్రం ఉచితంగా ఇచ్చేందుకు ఇష్టపడలేదు. ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించడంతో పాటు భూమిని కూడా టీటీడీనే కొనుగోలు చేయాలని హుకుం జారీ చేసింది. దీంతో టీటీడీ అమరావతిలో రూ.12.50 కోట్లు వెచ్చించి భూమిని కొనుగోలు చేసింది. నిత్యావసరాల కొనుగోల్మాల్ తిరుమలలో శ్రీవారి భక్తులకు నిత్యాన్నదానం, లడ్డూ ప్రసాదాల తయారీ కోసం టీటీడీ కొనుగోలు చేసే నిత్యావసర వస్తువుల కొనుగోళ్లలో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. శ్రీవారి ప్రసాదాల కోసం వినియోగించే నెయ్యి, జీడిపప్పు, ఎండుద్రాక్ష, పప్పుదినుసులు పూర్తిగా నాసిరకంగా ఉంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా స్వామి వారికి అభిషేకం తరువాత వినియోగించే పట్టువస్త్రాలు, వీఐపీలకు కప్పే వస్త్రాలు తదితరాలు కూడా నాసిరకమైనవిగా ప్రచారం జరుగుతోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ, వడ, జిలేబి, వివిధ రకాల పప్పుదినుసులు, కొబ్బరికాయలు, స్వామివారి పట్టువస్త్రాలు, వీఐపీలకు కప్పే పట్టువస్త్రాలతో పాటు సుమారు 250 రకాల వస్తువులను టీటీడీ కొనుగోచేస్తోంది. వాటిని తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గోదాములో నిల్వచేస్తుంటారు. ఈ వస్తువుల కోసం ఏటా టీటీడీ కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తుంటుంది. అందులో భాగంగా గత ఏడాది రూ.450 కోట్లు కేటాయించింది. అధికమాసం కారణంగా ఈ ఏడు రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండడం, పెరటాసి నెల రావడంతో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తాన్ని సరుకుల కొనుగోళ్లకు టెండర్ పిలిచి కాంట్రాక్టరుకు అప్పగించారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా ఆ ఆరోపణలపై విచారణ చేపట్టి నిజాలను నిగ్గుతేల్చిని దాఖలాలు లేవు. అన్న ప్రసాదం ‘చిన్న’ బోయింది తిరుమలలో అన్నప్రసాదాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. తిరుమల శ్రీవారికి లడ్డూతో పాటు మరెన్నో రకాల అన్నప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. శ్రీవారి లడ్డూలు ఎంత రుచిగా ఉంటాయో.. స్వామికి సమర్పించే అన్న ప్రసాదాలు మరింత రుచిగా ఉంటాయి. అటువంటి అన్న ప్రసాదాలు ఇటీవల కాలంలో దొరకడమే అరుదైపోతోంది. చక్కెర పొంగలి, దద్దోజనం, సీరా, కదంబం, పులిహోరా, మలిహోరా, పాయసం, పోలీ, సుగీ, జిలేబి ఇవన్నీ రుచిగా ఉంటాయి. నెయ్యి కారుతూ.. జీడిపప్పు తేలుతూ ఉండే శ్రీవారి అన్నప్రసాదం కొద్దిగానైనా ఆరగించాలని భక్తులు ఆశపడుతారు. అటువంటి అన్న ప్రసాదాలు ప్రస్తుతం కరువయ్యాయి. సాధారణ రోజుల్లో రోజుకు 900 కిలోలు (200 గంగాళాలు), వారంతాల్లో రోజుకు 1200 కిలోలు (250 గంగాళాలు) ప్రసాదాలు తయారు చేసేవారు. ఈ ప్రసాదాలను వకుళామాత పోటు, పాకశాల, అవ్వపోటు అని పిలిచే వంటశాలలోనే దాదాపు వెయ్యి ఏళ్లుగా తయారువుతున్నాయి. ఇక్కడ సిద్ధమైన ప్రసాదాలను శ్రీవారి గర్భాలయంలోకి తీసుకెళ్లి స్వామికి ఆరగింపు చేస్తారు. ఆపై భక్తులకు పంచిపెడుతుంటారు. స్వామి వారికి సమర్పించే ప్రసాదాలను వైఖానస వైష్ణవులు అత్యంత నిష్టతో తయారు చేస్తారు. తిరుమలలో నిత్యం గంగాళాలకు గంగాళాలు ప్రసాదాలు తయారై వస్తుండేవి. చిన్న లడ్డూ రోజులో ఒకటి రెండు గంటలు సమయం మాత్రమే భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు. మిగతా సమయం అంతా అన్న ప్రసాదాలనే పంపిణీ చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. దేవస్థానంలో జరుగుతున్న అపచారాలు, పొరబాట్లను ఎత్తిచూపినందుకు ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, మరి కొందరు అర్చకులను పాలకమండలి రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపింది. అర్చకులను ఇంటికి పంపడం వెనుక కేవలం కక్ష సాధింపేనని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకు కొన్నాళ్లకు ముందు ఏర్పాటైన పాలకమండలి అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
యుద్ధాలు అధికారానికి సోపానాలా?
ఉగ్రవాదుల ఏరివేతకు వైమానిక దళం బాలాకోట్పై జరిపిన దాడి నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ దాడితో లోక్సభ ఎన్నికల్లో తమకు మరో పాతిక సీట్లు ఎక్కువ వస్తాయని బీజేపీ నేత యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు వీరి ఆరోపణకు బలాన్నిచ్చాయి. అయితే, సైనిక ఘర్షణలు నిజంగానే పార్టీలు అధికారంలోకి రావడానికి దోహదపడతాయా అంటే కచ్చితంగా అవునని జవాబు చెప్పలేం. అయితే, వీటి వల్ల దేశంలో రాజకీయ ముఖ చిత్రంలో మార్పులు జరిగినట్టు గత యుద్ధాలు, సైనిక ఘర్షణల తదనంతర పరిణామాలు తెలియజేస్తున్నాయి. దేశ విభజన జరిగిననాటి నుంచి ఇంత వరకు భారత్ పాకిస్తాన్తో నాలుగుసార్లు, చైనాతో ఒకసారి యుద్ధానికి దిగింది. శ్రీలంకలో అంతర్యుద్ధం నివారణకు సైనిక జోక్యం చేసుకుంది. వీటి తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి మళ్లీ విజయం దక్కినా దక్కకపోయినా రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారాయి. ఉదాహరణకు భారత్ 1962లో చైనాతో, 1965లో పాకిస్తాన్తో తలపడింది. చైనా యుద్ధంలో ఓడిపోతే, పాకిస్తాన్పై విజయం సాధించింది. ఈ రెండు యుద్ధాలు కూడా 1962, 1967 సార్వత్రిక ఎన్నికల మధ్యనే జరిగాయి. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ యుద్ధాల తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లు, సీట్లు కూడా తగ్గాయి. 1971లో జరిగిన బంగ్లాదేశ్ కోసం భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగింది. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన ఈ యుద్ధం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బలం భారీగా పెరిగింది. వాజ్పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో కార్గిల్ యుద్ధం జరిగింది. దీంట్లో భారత్ విజయం సాధించింది. తర్వాత కొన్ని నెలలకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారం కైవసం చేసుకుంది. అయితే, సీట్లు మాత్రం ఏమీ పెరగలేదు. కేవలం యుద్ధాల వల్లే రాజకీయ పార్టీల తలరాత మారిందని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఆర్థిక, సామాజికాంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మూడో భారత్–పాక్ యుద్ధం(1971) బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన ఈ యుద్ధంలో భారత్ గెలిచింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండగా ఈ యుద్ధం జరిగింది. 1971 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలలకు ఈ యుద్ధం జరిగింది. తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా 158 సీట్లు కోల్పోయింది. 1971 ఎన్నికల్లో 352 సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి 154 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో జనతా పార్టీ గెలిచింది. స్వాతంత్య్రం తర్వాత కేంద్రంలో ఏర్పడ్డ తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఇది. మొదటి భారత్–పాక్ యుద్ధం(1947) కశ్మీర్ యుద్ధంగా పేరొందిన ఇది 1947 అక్టోబర్– 1948 డిసెంబర్ల మధ్య జరిగింది. ఆ తర్వాత 1952లో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. భారత్–చైనా యుద్ధం (1962) 1962, అక్టోబర్ 20 నుంచి 1962 నవంబర్ 21 వరకు జరిగింది. దీంట్లో భారత్ ఓడింది. యుద్ధం సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 361 సీట్లు సాధించింది. ఐపీకేఎఫ్ (1987) శ్రీలంకలో అంతర్యుద్ధాన్ని నివారించడం కోసం శాంతి పరిరక్షక దళాన్ని భారత్ అక్కడికి పంపి లంక సైనిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంది. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురయ్యారు. ఐపీకేఎఫ్ను పంపడానికి ముందు 1984లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో 404 సీట్లు గెలుచుకుంది. ఈ జోక్యం తర్వాత జరిగిన (1989) ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. రెండో భారత్–పాక్ యుద్ధం(1965) లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉండగా, 1965లో ఈ యుద్ధం జరిగితే, రెండేళ్ల తర్వాత 1967లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి 283 సీట్లతో అధికారం దక్కించుకుంది. అయితే, అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే 78 సీట్లు తక్కువ వచ్చాయి. కార్గిల్ యుద్ధం(1999) బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో కార్గిల్ యుద్ధం జరిగింది. 1999 మే నుంచి జూలై వరకు జరిగిన ఈ యుద్ధంలో భారత్దే గెలుపు.ఈ యుద్ధానికి ముందు 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. కార్గిల్ యుద్ధం తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 138 సీట్లు మాత్రమే వచ్చాయి. అంతకుముందు ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఇవి 44 తక్కువ. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా మెజారిటీ సీట్లు సాధించలేక పోయింది. అయినా కూడా ఇతర పార్టీలతో కలిసి యూపీఏ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
ధర్మనిరతి అంటే అది!
పూర్వం కాశీరాజ్యంలోని ఒక అడవిలో ధర్మనిరతుడు అనే భిక్షువు ఉండేవాడు. ఆ అడవిలో ఒక పెద్ద కొలను ఉంది. దాన్నిండా తామరపూలు. లేత పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. ఆ సరోవరం దాపునే ధర్మనిరతుని నివాసం. ఆ సరోవరానికి ఒక కాపలాదారు ఉన్నాడు. ఒకరోజున ఉదయాన్నే ధర్మనిరతుడు లేచి కొలనులో స్నానం చేసి, గాలి వాలుకు పోయి నిలబడ్డాడు. పూలపరిమళాలు పీలుస్తూ తన్మయుడవుతున్నాడు. అంతలో అతన్ని కాపలాదారు ‘‘స్వామీ! దొంగతనం తప్పా? ఒప్పా?’’ అడిగాడు. ‘‘నాయనా! దొంగతనమే కాదు, ఒకరు ఇవ్వకుండా మనది కానిది ఏది తీసుకున్నా తప్పే. అదీ దొంగతనం కిందే లెక్క’’ అన్నాడు చిరునవ్వుతో. ‘‘అయితే... మీరు దొంగే!’’ అన్నాడు కాపలాదారు. ‘‘నేనా? నేనేమీ దొంగిలించలేదే’’ అన్నాడు భిక్షువు. ‘‘ఇదిగో... ఈ పూలపరిమళాలు ఆఘ్రాణించారు కదా! ఇది గంధచౌర్యమే కదా. తమరు నా కొలనులోని సువాసనల్ని దొంగిలించినట్లే కదా’’ అన్నాడు. భిక్షువు అతనితో అలా మాట్లాడుతూ ఉండగానే, కొలను ఆవలిగట్టున ఒక వ్యక్తి వచ్చి కొలనులో దిగి కొన్ని తామరపూలు తెంపుకుని వెళ్లిపోయాడు. అతణ్ణి కాపలాదారు చూశాడు. కానీ, అతణ్ణి ఏమీ అనలేదు. కనీసం కేకవేసి మందలించలేదు. అప్పుడు భిక్షువు– ‘‘బాగుందయ్యా! వాసన చూసిన నన్ను తప్పుపట్టావు. పూలు తెంపుకుపోతున్న వాణ్ణి పన్నెత్తి చూడలేదు’’అని అడిగాడు. ‘‘స్వామీ! అతను లోభి. ధూర్తుడు. అజ్ఞాని. కానీ, తమరు జ్ఞానులు. ప్రబోధకులు. స్వచ్ఛమైన కర్మలు ఆచరించేవారు. దోషం ఎంచలేని దొడ్డవారు. అతను పెద్ద తప్పు చేసినా చిన్నగానే కనిపిస్తుంది. మీలాంటివారు కంట్లో నలుసంత తప్పు చేసినా కారుమేఘమంతగా అందరికీ కనిపిస్తుంది కదా!’’ అన్నాడు. భిక్షువు మౌనం వహించాడు. ధార్మికులు జీవితంలో ఎంత జాగరూకులై ఉండాలో బుద్ధుడు చెప్పిన సందేశాత్మక కథ ఇది. – డా. బొర్రా గోవర్ధన్ మీకు తెలుసా ►కుటుంబసభ్యుల మధ్య వున్న విభేదాలు, తగాదాలు, ఘర్షణలు తొలగిపోయి... అందరూ కలిసి మెలిసి సత్సంబంధాలుగా ఏర్పడేందుకు ‘విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాల’ ను నిత్యం పారాయణం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజూ పఠిస్తే.. ఏ సమస్యలు తలెత్తవు. అన్ని పనులలో విజయాలను సాధిస్తారు. ►లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ని నిత్యం పారాయణం చేస్తే మంచి సద్గుణాలతో కలిగినవారు వివాహ సంబంధాలు తీసుకువస్తారు. అలాగే పెళ్లి పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరుగుతాయి. ►సంతానం లేని వారు ప్రతిరోజు ‘గోపాల స్తోత్రం’ ను పఠిస్తే.. మంచి ఫలితం లభిస్తుందని... అలాగే గర్భిణులు ఇదే స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తే ప్రసవం సుఖంగా అవుతుందని పండితులు, పురోహితులు శాస్త్రాల ఆధారంగా చెబుతున్నారు. ►గరికను నగదు ఉంచే ప్రదేశంలో పెడితే, రావలసిన నగదు త్వరగా వచ్చేస్తుంది. ►శనీశ్వరుడిని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలిననాటి శని, అష్టమ శని దోషాలు తొలగిపోతాయి. ►గరికను దారంతో కట్టి గణపతికి మాల వేస్తే కోరికలు నెరవేరుతాయి. -
నెల్లూరు జిల్లా టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
-
ప్రకాశం జిల్లా టీడీపీలో ముసలం
-
వైఎస్సార్ జిల్లాలో టీడీపీలో వర్గ విభేదాలు
-
గొడవ ఆపేందుకు వెళితే..
బన్సీలాల్పేట్: చిన్నపాటి ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు వెళ్లిన వృద్ధుడిని తండ్రీకొడుకు కలిసి చితకబాదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కవాడిగూడ కల్పన థియేటర్ సమీపంలో కోదండరెడ్డినగర్ బస్తీకి చెందిన శివ ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులతో ఘర్షణ పడుతున్నాడు. అదే సమయంలో బయటికి వచ్చిన యాదగిరి అనే ఆటో డ్రైవర్ అక్కడి వెళ్లి ఇద్దరికి సర్ధిచెప్పి పంపించి వేశాడు. కాగా ఒకే బస్తీకి చెందిన యాదగిరి, శివ కుటుంబాల మధ్య గతంలో పార్కింగ్ విషయమై గొడవలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఘర్షణలో యాదగిరి జోక్యం చేసుకోవడం సహించలేని శివ తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. శివ తండ్రి శ్రీనివాసులు, తల్లి లక్ష్మి అక్కడికి వచ్చి యాదగిరితో గొడవకు దిగారు. శివ, యాదగిరి ఛాతిలో పిడిగుద్దులు గుద్దడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై సమాచారం అందడంతో సంఘటనాస్థలానికి చేరుకున్న యాదగిరి భార్య మణెమ్మపై కూడా శివ దాడి చేసినట్లు సమాచారం. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీనివాసులు, శివ, లక్ష్మీలపై నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో పట్టుకుంటామని సీఐ నేర్కొన్నారు. మృతుడు యాదగిరి రాణిగంజ్లో ఆటోట్రాలీ నడుపుకుంటూ జీవనం సాగిస్తుండగా, నిందితుడు శ్రీనివాసులు జీహెచ్ఎంసీ చెత్తబండి నడుపుతున్నాడు. గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రాజీనామాకు నేను సిద్ధమే
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆదివారం బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.సోమశేఖర మాట్లాడుతూ..‘రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. అదే సిద్దరామయ్య హయాంలో అయితే, కెంపెగౌడ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు వంటి భారీ పనులు చేశారు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం కుమారస్వామి స్పందించారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాటలను ఆ పార్టీ నేతలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలే తమ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకోవాలి. లేదా వారు ఇలాగే మాట్లాడతామంటే పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధం. సీఎం కుర్చీపై నాకు మోజు లేదు’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి అనేక అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంకీర్ణ ధర్మం పాటించడంలో కాంగ్రెస్ విఫలం అవుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రకటనపై కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావ్ స్పందిస్తూ..ఎమ్మెల్యే సోమశేఖర తన పరిధిని అతిక్రమించి మాట్లాడారు. తన వ్యాఖ్యలపై కుమారస్వామికి సోమశేఖర క్షమాపణలు చెప్పారని దినేశ్ పేర్కొన్నారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ కుమారస్వామితో చర్చించి విభేదాలను పరిష్కరించుకుంటామని తెలిపారు. సిద్దరామయ్య గొప్ప సీఎం అని, ఎమ్మెల్యేలు అలా అనడంలో తప్పు లేదని డిప్యూటీ సీఎం పరమేశ్వర్ వెనకేసుకొచ్చారు. సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేసినా వచ్చే నష్టంలేదని బీజేపీ నేత, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ అన్నారు. కుమారస్వామికి సిగ్గుంటే పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేత ఈశ్వరప్ప ఎద్దేవా చేశారు. -
టేలాబండి వ్యాపారుల ఘర్షణ
చార్మినార్: చార్మినార్ కట్టడం సమీపంలోని ఫరాషా హోటల్ ముందు గల ఫుట్పాత్ వ్యాపారుల మధ్య జరిగిన ఘర్షణ దాడికి దారితీసింది. ఈ సంఘటనలో రెచ్చిపోయిన టేలాబండి వ్యాపారులు పక్కనే ఉన్న మరో చిరు వ్యాపారిని చితక బాదారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చార్మినార్ వద్ద బహిరంగంగా అందరూ చూస్తుండగానే కర్రలతో చితకబాదారు. దాడిలో గాయపడిన బాధితుడి ఫిర్యాదు మేరకు హుస్సేనీఆలం పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. ఆదివారం చార్మినార్ ఏసీపీ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రెయిన్బజార్కు చెందిన సలీం(33) కొంత కాలంగా ఫరాషా హోటల్ ముందు ఫుట్పాత్పై టేలాబండి వ్యాపారం చేస్తున్నాడు. గతంలో ఇతని వద్ద పనిచేసి వేరే దుకాణం పెట్టుకున్న బార్కాస్కు చెందిన మహ్మద్ సయ్యద్(32), సలీం(31), మహమ్మద్(28)లు శనివారం రాత్రి సలీంతో ఘర్షణకు దిగారు. తమ దుకాణానికి అడ్డంగా కాకుండా కొద్దిగా పక్కకు జరగాలని కోరడంతో ఇరువురి మధ్యా వాగ్వాదం మొదలైంది. దీంతో రెచ్చిపోయిన మహ్మద్ సయ్యద్, సలీం, మహమ్మద్లు సలీంపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు హుస్సేనీఆలం పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఏసీపీ అంజయ్య తెలిపారు. -
అసభ్యకరమైన దూషణలతో...
నాలుకతో ఆరడుగుల మానవ దేహం ఇలా ప్రాధేయపడిందట...నరం లేని ఓ నాలుకా హద్దులు దాటొ ద్దు... నీ దురుసుతనం వల్లనే చెడ్డపేరు వస్తోంది. లోలోపలుండి... ఎవరికీ కనిపించకుండా... ఇష్టం వచ్చి నట్టు నాలుక తిప్పడం కారణంగా ‘నో టి దురుసుతనమంటూ, విచక్షణా ఞా్ఞనం లేదంటూ’ ఎదుటివాళ్లు అసహ్యించుకుంటూ దూరమవుతున్నారు. నోట్లోని భాగాలు మరో అడుగు ముందుకువేసి ‘నీవేదో వాగితే పళ్లు రాలిపోతాయంటూ, గూబ గుయ్యిమంటుం’దంటూ ముందుగా మాపై మండిపడుతున్నారని వాపోయాయి. మాట తూలితే వచ్చే కష్టాలపై వ్యంగ్య ఛమక్కు ఇదీ. ఈ జిల్లాలో ఉ న్నతంగా అధి కారం వెలగబెడుతున్నఓ అధికారి నాలుకకు కూడా అసభ్యకర దూషణలు అలవోకగా వ చ్చేస్తుంటాయి. ఎదురుగా ఉన్నవారు కూడా ఉ న్నతాధికారులనే విచక్షణ లేకుండా తిట్ల దండ కం దండుకోవడంపై మండిపడుతున్నారు. ‘నోరు మంచిదైతేనే ఊరు మంచిదవుతు’ందనే నానుడి ఆ దొరగారికి తెలుసో లేదో మరి... సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలోని ఓ ఉన్నతాధికారి నోటి దురుసుతనంపై అధికారులు గుర్రుగా ఉన్నారు. అవమాన భారంతో రగిలిపోతున్నారు. సమీక్షా సమావేశాల్లో ఆయన అనుసరిస్తున్న తీరు వివాదస్పదంగా మారుతోంది. విసిగి వేసారిన కొందరు అధికారులు ప్రభుత్వంలోని కీలక మంత్రి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లారు. కాకపోతే ఆ ఉన్నతాధికారికి సదరు మంత్రి అండదండలు దండిగా ఉండటంతో ఫలితం లేకుండా పోయింది. దీంతో అధికారులు కక్కలేక మింగలేక సతమతవుతున్నారు. భరించలేక కొందరు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోతుండగా మరికొందరు ‘ఈయన ఎప్పుడు వెళ్లిపోతాడా’ అని ఎదురు చూస్తున్నారు. ఇంకొందరు తప్పదని బాధను దిగమింగుకుంటూ పనిచేస్తున్నారు. అన్నీ తానై ఓవర్ యాక్షన్... జిల్లా ఉన్నతాధికారి వైఖరి చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలిగించకమానదు. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలా జిల్లాలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కీలక మంత్రితో ‘సాన్నిహిత్యం’ ఉండటంతో కొన్ని సందర్భాల్లో ఇక్కడ టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలను సహితం లెక్క చేయడం లేదన్న విమర్శలున్నాయి. ఆయన జిల్లాకు వస్తే చాలు కార్యకర్తకన్నా అధ్వానంగా ప్రవర్తిస్తుండడం ఆ పార్టీలోనివారికే అసహ్యమనిపిస్తోంది. సదరు మంత్రి కారు డోర్ వద్ద నిలబడి కిందస్థాయి సిబ్బందిలా వ్యవహరిస్తారు. ఎయిర్ పోర్టు వద్దకు వెళ్లి కూడా తనకున్న స్వామి భక్తిని ప్రదర్శిస్తుంటారు. అసభ్యకరమైన దూషణలతో... సమీక్షల సమయంలో ఆ ఉన్నతాధికారి అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉంటోందని ఉద్యోగ బాధితులు ‘సాక్షి’ ముందు వాపోతున్నారు. వయస్సును, హోదాను చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. మహిళా అధికారులని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించడం విమర్శలకు దారితీస్తోంది. బజారులో తిరిగే వ్యక్తిలా ఏమిటా మాటలంటూ మండిపడుతున్నారు. ఈ అధికారి బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నరవుతున్నా వైఖరిలో మార్పు రాకపోవడంతో ఆయన వద్దకు వెళ్లాలంటేనే అధికారులు భయపడుతున్నారు. పాలనాపరమైన వ్యవహారాల్లో చిన్నపాటి తప్పిదాలు చోటుచేసుకుంటే హెచ్చరించడం మంచిదే...అప్పటికీ మార్పురాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి కానీ ఇష్టారీతిన మాట్లాడితే ఎలా అని కొద్డి రోజుల్లో ఉద్యోగ విరమణ చేసే ఓ ఉద్యోగి వాపోవడం గమనార్హం. ఎన్నాళ్లిలా...ఏదో ఓ రోజు నిలదీయకపోతే ఇంకా రెచ్చిపోతుంటారని ఆయా ఉద్యోగ సంఘాల్లో చర్చ జోరుగా నడుస్తోంది. ఇప్పటికిప్పుడైతే మేం బయటపడాం...కానీ ఏదో ఓ రోజు బద్దలవకతప్పదని...ఆ రోజు దగ్గరలోనే ఉందని కొంతమంది ఉద్యోగులు ‘సాక్షి’ ముందు తమ మనసులోని మాట చెప్పారు.