Devi Prasad
-
ఆట, పాట, మాటతో.. జన హృదయాలు గెలిచారు
చిక్కడపల్లి (హైదరాబాద్): గద్దర్ ఏ ఒక్క వర్గానికి, భావజాలానికి మాత్రమే పరిమితం కాలేదని, ఆయన పాట, మాట, ఆటతో జనహృదయాలను గెలిచారని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్లర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ కొనియాడారు. చెప్పదలచుకున్న విషయాన్ని జన హృదయాలను తాకేటట్టు నేర్పుగా చెప్పగల గొప్ప వాగ్గేయకారుడు గద్దర్ అని ప్రశంసించారు. బుధవారం రాత్రి చిక్కడపల్లి త్యాగరాయ గానసభ నిర్వహణలో లలిత కళావేదికపై ప్రజా యుద్ధనౌక, ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ సంతాప సభ జరిగింది. ఇనాక్ తనకు గద్దర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గద్దర్ సాహిత్యం సిలబస్గా పెట్టే ప్రయత్నంలో ఎదుర్కొంటున్న అనుభవాలు, గద్దర్లో విప్లవభావాలు, తెలంగాణ భావన, దళిత వర్గాల అభ్యుదయం పట్ల ఆలోచనలను పంచుకున్నారు. సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ, ప్రపంచ జానపద గాయకుని స్థాయికి ఎదిగిన గద్దర్.. పాట ఉన్నంతకాలం నిలిచి ఉంటారని అన్నారు. గద్దర్లో భిన్న కోణాలు ఉన్నాయని బేవరేజెస్ పూర్వ చైర్మన్ దేవీప్రసాద్ పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ శ్రీనివాస్గుప్తా ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా’అన్న గద్దర్ పాటను లయబద్ధంగా పాడి తనకు గద్దర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. అధ్యక్షత వహించిన గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి మాట్లాడుతూ, గద్దర్ గొప్ప కళాకారుడు అయినప్పటికీ అందరినీ ఆప్యాయంగా పలుకరించే మానవతామూర్తి అని ప్రశంసించారు. -
తెల్ల కాగితంలా వెళ్లాలి
‘‘నేను డైరెక్టర్ అయినా ఇతర దర్శకుల చిత్రాల్లో నటిస్తున్నప్పుడు వారికి సలహాలు ఇవ్వను. మనం డైరెక్టర్ అయినా ఒక నటుడిగా నటిస్తున్నప్పుడు ఆ దర్శకుడి వద్దకు తెల్ల కాగితంలా వెళ్లాలి. అప్పుడే దానిపై తనకు నచ్చింది రాసుకుంటాడు’’ అని దేవీ ప్రసాద్ అన్నారు. రాజేంద్రప్రసాద్, విశ్వంత్, ‘వెన్నెల’ కిశోర్, హర్షిత ముఖ్య పాత్రల్లో విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మించిన ఈ సినిమా ఈ నెలలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేసిన దేవీ ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. ► ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. పల్లెటూరి నేపథ్యంలో నడిచే ఆహ్లాదకరమైన కథ. మనుషుల్లోని మంచీ చెడులు, వాటి వల్ల ఏర్పడే సమస్యల ఇతివృత్తంగా తెరకెక్కింది. ► సాధారణంగా కొత్త దర్శకుడు లవ్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ లేదా యాక్షన్ చిత్రాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు. కానీ విశ్వనాథ్ దానికి భిన్నంగా ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని ఎంచుకున్నాడు. ► ఓ గ్రామంలోని పెద్దాయన కొడుకు పాత్ర నాది. కెరీర్ కోసం పట్నం వెళ్లి అక్కడే స్థిరపడిన వ్యక్తిలా కనిపిస్తాను. మనం, మన సంపాదన, భవిష్యత్తు అనే ఆలోచనా ధోరణి ఉంటుంది. ► రాజేంద్రప్రసాద్గారితో చేయాలనే నా కోరిక ‘తోలుబొమ్మలాట’ తో నెరవేరింది. ఆయనతో పాటు ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటులందరి నుంచి నాకు తెలియని చాలా విషయాలు ఈ ప్రయాణంలో నేర్చుకున్నాను. -
ముఖ్యమంత్రి వస్తున్నారు
దేవీప్రసాద్, వాయు తనయ్, శశి, సుచిత్ర ప్రధాన పాత్రల్లో మోహన్ రావిపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేనే ముఖ్యమంత్రి’. వైష్ణవి ఫిలింస్, ఆలూరి క్రియేషన్స్ పతాకాలపై అట్లూరి నారాయణరావు, ఆలూరి సాంబశివరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. అట్లూరి నారాయణరావు మాట్లాడుతూ– ‘‘సమకాలీన రాజకీయ అంశాలను మా చిత్రంలో చర్చించాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు ఆలోచింపజేసే సన్నివేశాలు, సంభాషణలు ఉంటాయి. దేవీప్రసాద్, వాయుతనయ్, శశి, సుచిత్ర మంచి నటన ప్రదర్శించారు. సంగీతానికి కూడా మంచి ప్రాధాన్యత ఉంది’’ అన్నారు. ‘‘నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతూ ఈ చిత్రాన్ని నిర్మించాం. పాటలకు, టీజర్కు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు ఆలూరి సాంబశివరావు. ఈ చిత్రానికి సంగీతం: ఫణి కల్యాణ్, కెమెరా: కమలాకర్. -
నా సెల్ఫీ.. ఓ సందేశం
శ్రీ చరణ్ సెన్సేషనల్ మూవీస్పై చిరుగురి చెంచయ్య, సుగుణమ్మ సమర్పిస్తున్న చిత్రం ‘ఇది నా సెల్ఫీ’. సి.హెచ్ ప్రభాకర్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నువ్వుల వినోద్, ఆరోహి నాయకా నాయికలుగా నటిస్తున్నారు. సతీశ్రాయ్ కో–ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి శ్రీనివాస్ మాలపాటి స్వరాలు అందించారు. ఈ చిత్రం ఆడియోను హైదరాబాద్లో గురువారం విడుదల చేశారు. ఈ వేడుకలో దర్శకులు యన్.శంకర్, దేవీ ప్రసాద్, నిర్మాత సాయివెంకట్ తదితరులు పాల్గొన్నారు. సీహెచ్ ప్రభాకర్ మాట్లాడుతూ– ‘‘ఇది నా సెల్ఫీ’ అనగానే అందమైన సెల్ఫీల గురించి అనుకుంటారు. సెల్ఫీల వల్ల జరిగే అనర్థాలను, జ్ఞాపకాల నేపథ్యంలో తీసిన చిత్రమిది. ఈ చిత్రం సమాజానికి మంచి మెసేజ్ ఇస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు. దర్శకుడు యన్.శంకర్ మాట్లాడుతూ– ‘‘నటీనటులందరూ బాగా నటించారు. పాటలన్నీ బాగున్నాయి. అన్ని ఎమోషన్స్తో కూడిన పాటలు ఉన్నాయి’’ అన్నారు. -
ఉద్యమ స్ఫూర్తితో బంగారు తెలంగాణ
► అందుకు అందరం భాగస్వాములవుదాం: హరీశ్ ► దేవీప్రసాద్కు ఘన సత్కారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం కోసం పోరాడిన స్ఫూర్తితో ఉద్యోగులందరం కలసి సీఎం కేసీఆర్ ఆశించిన బంగారు తెలంగాణను సాధిం చుకుందామని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు పిలుపునిచ్చారు. కలసికట్టుగా కృషిచేసి, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధిచేసుకుందామన్నారు. తెలంగాణ నాన్గెజిటె డ్ అధికారుల కేంద్ర సంఘం (టీఎన్జీఓ) గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుక్రవారం రవీంద్రభారతిలో ఆయన్ను సన్మానించారు. పదవి పెద్దదా చిన్నదా అనేది ముఖ్యం కాదని, ఉద్యమంలో దేవీ ప్రసాద్ పోరాటానికి మించిన పదవి ఏదీ ఉండదని హరీశ్ అన్నారు. ఉద్యమ కాలంలో స్వామి గౌడ్, దేవీప్రసాద్, శ్రీని వాస్గౌడ్, విఠల్ చేసిన పోరాటాలు మరువలేనివన్నారు. ఉద్యమంలో ముందున్న అన్ని వర్గాలు, విభాగాల వారిని సీఎం కేసీఆర్ దశలవారీగా సముచిత స్థానం కల్పించి గౌరవించుకొంటున్నారని చెప్పారు. టీఎన్జీవోస్ని ఏకతాటిపైన నడిపిన ఘనత దేవీప్రసాద్దే అని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి న్నారు. మంత్రులు తుమ్మల, ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణా చారి, ఎంపీ పల్లా రాజేశ్వర్, ఎమ్మెల్యేలు శ్రీని వాస్ గౌడ్, బాబూమోహన్, ఎమ్మెల్సీలు పురా ణం సతీష్, గంగాధర్, సాహిత్య అకాడమీ చైర్మన్ సిధారెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీఎన్జీవోస్ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, టీఎస్పీఎస్ సభ్యుడు విఠల్ పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ముందుకు సాగుదాం 30 ఏళ్లు ఉద్యోగుల కోసం కృషి చేశానని, ఎన్ని పదవులు నిర్వహించినా తెలంగాణ ఉద్యమాల సమయంలో వచ్చిన పేరే గొప్పగా భావిస్తానని దేవీప్రసాద్ చెప్పారు. ఉద్యోగులంతా ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధిలో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన ఉద్యోగులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు దేవీప్రసాద్ను ఘనంగా సత్కరించారు. -
సీపీఎస్ను రద్దు చేయాల్సిందే
ఢిల్లీలో నినదించిన 29 రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు జంతర్మంతర్ వద్ద మహా ధర్నా.. పెద్ద సంఖ్యలో హాజరైన టీఎన్జీవో, గెజిటెడ్ అధికారుల ఫోరం సభ్యులు సాక్షి, న్యూఢిల్లీ: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 29 రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు ఢిల్లీలో కదంతొక్కారు. అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు జంతర్మంతర్ వద్ద మహా ధర్నా చేపట్టారు. ‘పెన్షన్ భిక్షకాదు.. ఉద్యోగుల హక్కు’అని నినదిస్తూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి టీఎన్జీవో, గెజిటెడ్ ఆఫీసర్ల ఫోరం ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలన్నీ ఒకే మాటతో నూతన పెన్షన్ విధానాన్ని ఉపసంహరించుకొనేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు లీలాపత్ డిమాండ్ చేశారు. పెన్షన్ ఉద్యోగుల హక్కు..: దేవీ ప్రసాద్ టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్ మాట్లాడుతూ.. పెన్షన్ తీసుకోవడం ఉద్యోగుల హక్కు అని, ఈ ప్రయోజనానికి ప్రతిబంధకంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. సీపీఎస్ వల్ల ఉద్యోగ భద్రత, కుటుంబ భద్రత లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి ఎలాంటి గ్రాట్యుటీ లభించడం లేదని ఆరోపించారు. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు. సీపీఎస్ విధానం రద్దుకు తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, దీన్ని అభినందిస్తున్నామన్నారు. ఉద్యమ స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలను ఏకం చేస్తామని, కేంద్రం పార్లమెంటులో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టేలా ఒత్తిడి తెస్తామని తెలిపారు. ధర్నాలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్, గెజిటెడ్ ఆఫీసర్ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కె.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు జైట్లీతో చర్చిస్తా: దత్తాత్రేయ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో యూపీ ఎన్నికల అనంతరం చర్చిస్తానని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. అవసరమైతే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కూడా చర్చిస్తానని పేర్కొన్నారు. తనను కలసిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో ఆయన చర్చించారు. -
ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య చిచ్చుకు కుట్ర
టీఎన్జీవోస్ 70 వసంతాల వేడుకలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హన్మకొండ: ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య ఉన్న సత్సంబంధాన్ని చూసి జీర్ణించుకోలేని కొన్ని శక్తులు ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టాలని కుట్రలు చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం రాత్రి హన్మకొండలో టీఎన్జీ వోస్ యూనియన్ 70 వసంతాల వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో కడియం మాట్లా డుతూ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వ కంగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా యూనియన్ పని చేస్తుందని, ఉద్యోగుల సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. స్పీకర్ సిరికొండ మధు సూదనాచారి మాట్లాడుతూ రాష్ట్రాన్ని బంగా రు తెలంగాణ చేయాలని విశ్వాసం టీఎన్జీ వోస్ ఉద్యోగుల్లో కనిపిస్తుందన్నారు. మంత్రి చందూలాల్ మాట్లాడుతూ ఉద్యోగుల సమ స్యలు సీఎం పరిష్కరిస్తారని, ఈ విషయం లో ఎవరూ ఎలాంటి ఇబ్బంది పడవద్ద న్నారు. టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావడం, తెలంగాణ పునర్నిర్మాణమే వరంగల్ డిక్లరేషన్ అన్నారు. టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడితేనే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీం రద్దవుతుందన్నారు. ఈ దిశగా మార్చిన 2న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. -
టీఎన్జీవోలు సిద్ధమే: దేవీప్రసాద్
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల భవిష్యత్తు కోసం టెట్, ఎంసెట్ పరీక్షల నిర్వహణకు స్వచ్ఛందంగా సహకరిస్తామని టీఎన్జీవో గౌరవ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, అధ్యక్షుడు రవీందర్రెడ్డి తెలిపారు. ప్రైవేటు కాలేజీలు, స్కూళ్ల ప్రక్షాళనకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రభుత్వం పరీక్షల తేదీలను ప్రకటించి, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇన్విజిలేషన్ విధులను వేయాలని కోరారు. -
నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి
-టీఎన్జీవోస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ హన్మకొండ(వరంగల్ జిల్లా) కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని టీఎన్జీవోస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ కోరారు. హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో టీఎన్జీవోస్ యూనియన్ క్యాలెండర్ను సోమవారం అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగు సమాఖ్య జాతీయ అధ్యక్షుడు ముత్తుసుందరం, టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవీ ప్రసాద్ మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా ఆందోళనను ఉధృతం చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ నుంచే ఈ పోరాటం ప్రారంభం కానుందన్నారు. దేశవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నాలు చేయనున్నట్లు వివరించారు. ఈ ధర్నాలో రోజుకు మూడు రాష్ట్రాల చొప్పున ఉద్యోగులు పాల్గొంటారని తెలిపారు. ఫిబ్రవరి 14, 15 తేదీలలో కేరళలోని తిరుచూరులో ఉద్యోగుల శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి మాట్లాడుతూ జాతీయ మహిళా సదస్సులో 12 అంశాలతో వరంగల్ డిక్లరేషన్ను ప్రకటించిందని పేర్కొన్నారు. ఈ డిక్లరేషన్లోని అంశాలను దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అందించి అమలు కోసం ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్కుమార్, నగర అధ్యక్షుడు గజ్జెల రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు. -
'స్థానికత ఆధారంగానే విభజించండి'
న్యూఢిల్లీ: ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ఉద్యోగులను వారివారి స్థానికత ఆధారంగానే రెండు రాష్ట్రాలకు విభజించాలని తెలంగాణ ఎన్జీవోలు కోరారు. ఈ మేరకు టీఎన్జీవో నేత దేవీ ప్రసాద్ ఆధ్వర్యంలోని ఉద్యోగ సంఘం నేతలు సోమవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎల్. సి. గోయల్ కు విన్నవించారు. విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని టీఎన్జీవోలు కోరగా.. సాధ్యమైనంత త్వరలో ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు గోయల్ హామీ ఇచ్చారు. -
తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రకు వెళ్లనివ్వం
నాంపల్లి: ఏపీకి చెందిన హెచ్ఓడీలను విజయవాడకు తరలించడాన్ని టీఎన్జీఓ కేంద్ర సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్ , అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి స్వాగతించారు. ఈ మేరకు మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీఓ కేంద్ర సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు విలేకరులతో మాట్లాడారు. తరలింపు వల్ల ఆర్డర్ టు సర్వ్ కింద పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రాకు తీసుకుని పోతామంటే అడ్డుకుంటామని అన్నారు. చంద్రబాబుకు, అశోక్బాబుకు ఉద్యోగుల పట్ల ప్రేమ ఉంటే ఆంధ్రా ఉద్యోగులను ఆంధ్రాకు, తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. మే 28న టీఎన్జీఓ కేంద్ర వర్గ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలియజేశారు. -
'ఎక్కడివారు.. అక్కడే పనిచేయాలి'
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాల రూపకల్పన కమిటీ, ఉద్యోగుల పంపిణీ కమిటీల చైర్మన్ కమల్నాథన్ను శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల విభజనను వెంటనే పూర్తి చేయాలని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తప్పుడు స్థానికత ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన ఉద్యోగులపై తగిన చర్యలు తీసుకోవాలని దేవిప్రసాద్ తెలిపారు. -
టీఆర్ఎస్కు క్షేత్రస్థాయిలో బలం లేదు
అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను చేరుకోలేదు దేవీప్రసాద్ ఓటమికి టీఎన్జీవోలకు సంబంధం లేదు టీఎన్జీవో ప్రభుత్వ అనుబంధ సంస్థ కాదు ఫిట్మెంట్ బకాయిలకు బాండ్లు ఇవ్వరు మీట్ ది ప్రెస్లో టీఎన్జీవో అధ్యక్షుడు కె.రవీందర్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్కు క్షేత్రస్థాయిలో బలంలేక ఓటర్లను చేరుకోలేకపోయిందని, అందువల్లనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ ఓటమి చెందారని టీఎన్జీవో నూతన అధ్యక్షుడు కె. రవీందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అన్ని జిల్లాలకు చెందిన ఓటర్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉండడం, భిన్న సంస్కృతుల నేపథ్యం కూడా ఆయన ఓటమికి కారణమయ్యాయని అన్నారు. దేవీప్రసాద్ పోటీలో ఉండడం వల్లనే 40 వేల ఓట్లు పోలయ్యాయని తాము భావిస్తున్నట్లు చెప్పారు. టీఎన్జీవో అధ్యక్షుడిగా నియమితులైన రవీందర్రెడ్డితో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్(టీయూడబ్ల్యూజే) గురువారం మీట్ ది ప్రెస్ నిర్వహించింది. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవీప్రసాద్ ఓటమికీ టీఎన్జీవోలకు సంబంధం లేదని, ప్రతీ ఉద్యోగి ఆయన గెలుపు కోసం పనిచేశారని అన్నారు. టీఆర్ఎస్ ఓటింగ్ శాతాన్ని పెంచుకోలేకపోయిందని, సమయం తక్కువగా ఉన్నందు వల్ల కిందిస్థాయిలో ఓటర్ల దగ్గరికి వెళ్లలేకపోయినట్లు చెప్పారు. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుపై రెండుసార్లు ఓడిపోయారనే సానుభూతి కూడా పనిచేసిందన్నారు. అవగాహన లేకే.. ఎన్నికల కమిషన్ పట్టభద్రుల ఓట్లు వినియోగించుకునే పద్ధతిపై ఓటర్లకు అవగాహన కల్పించడంలో విఫలమైందని రవీందర్రెడ్డి అన్నారు. దానివల్లే దేవీ ప్రసాద్ ఓడిపోయారని చెప్పారు. దేవీప్రసాద్ ఎప్పటికీ ఉద్యోగ సంఘాల నేతేనని, ఆయనకు గౌరవప్రదమైన స్థానం కల్పించాలని సీఎంను కోరామని చెప్పారు. పెరిగిన పీఆర్సీకి సంబంధించి త్వరలోనే స్పష్టమైన నిర్ణయం వెలువడుతుందన్నారు. బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేసి నగదు రూపంలో చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. నగదు రూపంలోనే చెల్లిస్తారని, హెల్త్కార్డుల జారీకి త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని ఆశిస్తున్నామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందే.. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీఎన్జీవో సమర్థించిందని రవీందర్రెడ్డి అన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలువడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభించదన్నారు. సకలజనుల సమ్మె ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఢిల్లీకి తెలియజేసినట్లు చెప్పారు. ఇన్నాళ్లూ సీమాంధ్ర పాలకులతో సమస్యలపై పోరాడిన టీఎన్జీవో ఇప్పుడు తెలంగాణలో మన ప్రభుత్వం ముందు సమస్యలపై పోరాటం చేయాల్సిన పరిస్థితి రానుందన్నారు. 42 రోజుల సమ్మె కాలాన్ని ఆన్డ్యూటీగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి చెప్పారని, తద్వారా రిటైరైన ఉద్యోగులకు కూడా ఉపయోగం ఉంటుందన్నారు. అంతకు ముం దు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజే యూ) సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు టీఎన్జీవోకు అవినాభావ సంబంధం ఉందన్నారు. మీడియాలో హక్కుల కోసం జర్నలిస్టులు చేసిన పోరాటాలకు కూడా టీఎన్జీవో మద్దతు పలికిందన్నారు. ఈనాడు పత్రికలో యాజమాన్య వైఖరికి నిరసనగా 24 రోజుల పాటు జరిగిన సమ్మెకు మూడున్నర దశాబ్దాల క్రితమే టీఎన్జీవో అండగా నిలిచి పత్రికలోని ఉద్యోగులకు తిండిపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి హమీద్, మన తెలంగాణ దినపత్రిక సంపాదకుడు కె.శ్రీనివాస్రెడ్డి, హెయూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విరాహత్ అలీ, కోటిరెడ్డి, ఇతర నాయకులు సోమసుందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
స్కేటింగ్ చిచ్చరపిడుగు
40 సుమోల కింద దూసుకెళ్లిన క్రీడాకారుడు తిరుపతి: తిరుపతికి చెందిన దేవీప్రసాద్ (8) స్కేటింగ్లో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. మూడో తరగతి చదువుతున్న ఇతను తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయం సమీపంలో గురువారం 40 సుమో వాహనాల కింద 7 అంగుళాల ఎత్తులో తన రెండు కాళ్లును బ్యాలెన్స్ చేసుకుంటూ శరీరాన్ని నేలకు తగలకుండా సమాంతరంగా 15 సెకన్లలో 110 మీటర్లు దూసుకెళ్లే ఫీట్ను చేసి చూపించాడు. వెనుక నుంచి అదే దూరాన్ని 21.24 సెకన్లలో చేరుకుని ఔరా అనిపించాడు. ఈ స్కేటింగ్ వీడియోలను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం పంపిస్తున్నామని దేవీప్రసాద్ తండ్రి లోకనాథం తెలిపారు. -
టీఆర్ఎస్కు ఝలక్!
మండలి ఫలితాల్లో అధికార పార్టీకి చేదు ఫలితం మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో ఓటమి దేవీప్రసాద్పై బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గెలుపు, 13,318 ఓట్ల ఆధిక్యం మొదటి ప్రాధాన్య ఓటుతోనే ఘన విజయం టీఆర్ఎస్ను గట్టెక్కించలేకపోయిన హామీలు నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో మాత్రం ఆధిక్యం నేటి మధ్యాహ్నానికి ఫలితం తేలే అవకాశం సాక్షి, హైదరాబాద్, నల్లగొండ: శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఖంగుతిన్నది. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్ధి దేవీప్రసాద్ ఓటమిపాలయ్యారు. మొదటి ప్రాధాన్య ఓటుతోనే బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గెలుపొందారు. 13,318 ఓట్ల ఆధిక్యతతో విజయభేరి మోగించారు. మొత్తం 1,11,739 ఓట్లు పోలవగా రామచంద్రరావుకు 53,881 ఓట్లు, దేవీప్రసాద్కు 40,563 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి రవికుమార్ గుప్తాకు 2,856 ఓట్లు మాత్రమే పడ్డాయి. లెక్కింపు పూర్తయి ఫలితం తెలిసినప్పటికీ ఎన్నికల కమిషన్ అనుమతితో వివరాలను గురువారం ప్రకటించనున్నారు. కాగా, వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజక వర్గంలో ఓట్ల లెక్కింపు మందకొడిగా సాగుతుండడంతో గురువారం మధ్యాహ్నానికి తుది ఫలితం వస్తుందని అధికార వర్గాలు చెప్పాయి. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం కోసం టీఆర్ఎస్ తీవ్రంగా శ్రమించింది. మంత్రులు హరీశ్రావు, కె.తారకరామారావులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో మంత్రులు పూర్తిగా ప్రచారంపైనే దృష్టి పెట్టారు. హాల్ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. తొమ్మిది నెలలుగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రచారం చేశారు. ఎమ్మెల్యేలను సైతం పూర్తిగా ఎన్నికల ప్రచారంలోకి దించారు. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో ఏకంగా డిప్యూటీ సీఎం సహా ఐదుగురు మంత్రులు విస్తృత ప్రచారం చేశారు. ఇంత చేసినా ఫలితం ప్రతికూలంగా రావడంపై టీఆర్ఎస్ వర్గాలు అంతర్మథనంలో పడ్డాయి. పనిచేయని ‘పీఆర్సీ’ ప్రభుత్వంపై సుమారు రూ. 5 వేల కోట్ల ఆర్థిక భారం పడుతున్నా, ఉద్యోగ వర్గాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా 43 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించింది. ఉత్తర్వులు ఇవ్వడంలో జాప్యం చేసినా.. పట్టభద్రుల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా మూడు జీవోలను సర్కారు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉద్యోగుల సంఖ్య ఎక్కువ కావడంతో ఆ వర్గాలు పూర్తిగా తమ అభ్యర్థికి మద్దతుగా నిలుస్తాయని టీఆర్ఎస్ నాయకత్వం భావించింది. తెలంగాణ ఉద్యమంలో ముందుండి ఉద్యోగులను నడిపించిన టీఎన్జీవోల నేత దేవీప్రసాద్ను అభ్యర్థిగా ఎంచుకోవడంలో కూడా టీఆర్ఎస్ వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. కానీ, చివరకు పీఆర్సీ మంత్రం కూడా పారకపోవడం పార్టీ నాయకత్వాన్ని షాక్కు గురిచేసింది. అలాగే హైదరాబాద్లో పట్టభద్రుల ఓట్లను దృష్టిలో పెట్టుకునే ఆంధ్రా ఉద్యోగులను, సెటిలర్స్ను టీఆర్ఎస్ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా, ప్రయోజనం లేకపోయిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు చేయిచ్చాయా? టీఎన్జీవోల పెత్తనాన్ని ఉపాధ్యాయ సంఘాలు జీర్ణించుకోలేదని, అందుకే రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాలు దేవీప్రసాద్కు వ్యతిరేకంగానే ఓట్లేశాయన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీనికి తోడు ‘ కేవలం ఉద్యోగాలు ఇవ్వడం కోసం డీఎస్సీ ప్రకటించం’ అంటూ సీఎం కే సీఆర్ శాసనమండలిలో చేసిన ప్రకటన కూడా కొంత ప్రతికూల ప్రభావం చూపినట్లు విశ్లేషిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క ప్రకటనా వెలువడ కపోవడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడం కూడా పట్టభద్రుల ఆగ్రహానికి కారణంగా పేర్కొంటున్నారు. మొత్తానికి ఈ ఫలితంతో టీఆర్ఎస్ వర్గాలు పునరాలోచనలో పడ్డాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆ ధీమాతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లాలన్న పార్టీ నేతల ఆశలు అడియాసలయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిట్టీలు ప్రభుత్వంపై గూడుకట్టుకున్న అసంతృప్తిని వెళ్లగక్కుతూ కొందరు నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిట్టీలను బ్యాలెట్ బాక్సుల్లో వేశారు. ‘తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు-నిధులు- నియామకాల కోసం.. కుటుం బ పాలన కోసం కాద’ని కొందరు ఓటర్లు చిట్టీలు వేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలని, వెంటనే డీఎస్సీ ప్రకటన చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఎలాంటి సాకులు చూపొద్దని కూడా చిట్టీలు పడ్డాయి. ప్రభుత్వ పెద్దల తీరు మారకపోతే ఎన్నికల్లో ఇక ముందు కూడా బుద్ధి చెబుతామంటూ కొందరు ఓటర్లు చిట్టీల ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఈసారి భారీగా చెల్లని ఓట్లు పోలవడం గమనార్హం. ఒక్క ‘హైదరాబాద్’ ఎమ్మెల్సీ స్థానంలోనే 8,433 ఓట్లు వచ్చాయి. ఇది మొత్తం ఓట్లలో 7.54 శాతం. దీంతో అభ్యర్థుల భవితను ఇవి కూడా ప్రభావితం చేశాయి. మరో స్థానంలో టీఆర్ఎస్ ఆధిక్యం నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. అర్ధరాత్రి వరకు మూడు రౌండ్ల ఫలితాలు వెల్లడి కాగా టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి 10,886 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహనరావుకు 8,935 ఓట్లు వచ్చాయి. వామపక్షాల అభ్యర్థి సూరం ప్రభాకర్రెడ్డికి 2,947 ఓట్లు, కాంగ్రెస్ పక్షాన పోటీ చేసిన తీన్మార్ మల్లన్నకు 2,639 ఓట్లు లభించాయి. మొత్తంమీద చూస్తే టీఆర్ఎస్కు బీజేపీ గట్టిపోటీ ఇస్తుం డగా, కాంగ్రెస్, వామపక్షాలు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. మొత్తం 13 రౌండ్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే, ఈ ఎన్నికల్లో పోలైన 1.50 లక్షల ఓట్ల లెక్కింపునకు కేవలం 20 టేబుళ్లనే ఏర్పాటు చేయడంతో లెక్కింపు ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతోంది. తుది ఫలితం గురువారం మధ్యాహ్నానికి వెల్లడయ్యే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే, తొలి ప్రాధాన్యత ఓటులో విజేత తేలకుండా రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించాల్సి వస్తే మరింత ఆలస్యం కానుంది. బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానంలో గెలుపుతో బీజేపీలో నూతనోత్సాహం నిండింది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం తమ పార్టీకే ఉందని బీజేపీ నేతల్లో ధీమా పెరిగింది. మూడు జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎన్నికల్లో వచ్చిన గెలుపును పార్టీ విస్తరణకు అనువుగా మార్చుకోవాలని, పక్కా వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ భావిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే సానుకూ ల ఫలితాలు ఉంటాయని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్పై ఉద్యోగుల్లోనూ, విద్యావంతుల్లోనూ పేరుకున్న వ్యతిరేకత ఈ ఫలితాలతో వెల్లడైందని వారు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీజేపీకే అనుకూలం గా మారతాయని స్పష్టమైందని సంబరపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాత్మకంగా ఉంటూనే, పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చినందుకు ఇప్పుడు సత్ఫలితాలు వస్తున్నాయని సీనియర్ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో అనవసరంగా పోటీ చేశామని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ మూడో స్థానానికి పడిపోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం నిండింది. ఇది ప్రభుత్వ వ్యతిరేక తీర్పు ‘ఇది ప్రభుత్వ వ్యతిరేక తీర్పు. మూడు జిల్లాల్లోని పట్టభద్రులు, విద్యావంతులు, ఓయూ విద్యార్థుల పాత్ర నా గెలుపులో ఉంది. టీడీపీ, లోక్సత్తా, కొన్ని సంస్థలు, విద్యార్థి సంఘాలు నా గెలుపు కోసం కృషి చేశాయి. గెలుపు కోసం అధికార పార్టీ డబ్బులు వెద జల్లింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లను బెదిరింపులకు గురి చే సినప్పటికీ నాకు ఓటేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు. ఖాళీ పోస్టుల భర్తీకి, ఇతర నోటిఫికేషన్ల కోసం శాసనమండలిలో నా గళాన్ని వినిపిస్తా. దేవిప్రసాద్ పోటీ చేయనని చెప్పినా... టీఆర్ఎస్ బరిలోకి దింపింది. చివరకు ఆయన్ను బలిపశువును చేశారు’ - ఎన్. రామచంద్రరావు, బీజేపీ అభ్యర్థి ప్రజలు మాకు వ్యతిరేకం కాదు ఇది ప్రభుత్వ వ్యతిరేక తీర్పు కాదు. అభ్యర్థిత్వం ఆలస్యం కావడంతో ఓటర్ల దగ్గరకు వెళ్లలేకపోయాం. రామచంద్రరావు రెండు సార్లు మండలి, ఒకసారి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఓడిపోయారు. దీని వల్ల ఓటర్లను ఎక్కువసార్లు కలుసుకున్న నేత గా ఆయనకు అధిక ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీలు ఒక్కటై టీఆర్ఎస్ను ఓడించాయి. నా గెలుపు కోసం వంద శాతం కట్టుబడి టీఆర్ఎస్ పని చేసింది. కార్మికులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు కష్టపడి పనిచేశారు. ఓటర్ల ను అనేక రకాలుగా ప్రలోభ పెట్టారు. ఓటమిపై విశ్లేషణ చేసుకుంటా. భవిష్యత్ కార్యాచరణతో ముందుకు సాగుతాం. - దేవీప్రసాద్, టీఆర్ఎస్ అభ్యర్థి -
ఇది ప్రభుత్వంపై వ్యతిరేకత కాదు:దేవీ ప్రసాద్
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ఎన్నికలలలో తన ఓటమి ప్రభుత్వంపై వ్యతిరేకత కాదని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో పట్టుభద్రుల స్థానానికి టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన దేవీ ప్రసాద్ అన్నారు. ఈ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు దాదాపు పదివేల ఓట్ల మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ఫలితాలు వెలువడిన అనంతరం దేవీ ప్రసాద్ మాట్లాడుతూ తన ఓటమిని అంగీకరించారు. ఈ ఎన్నికలలో దాదాపు పది వేల ఓట్లు చెల్లలేదని చెప్పారు. తనకు ఓటు వేసినవారికి కృతజ్ఞతలు తెలిపారు.బీజేపీ గెలిచినప్పటికీ అధికార టీఆర్ఎస్కు వ్యతిరేక తీర్పుగా భావించలేం అని ఆయన అన్నారు. -
డిగ్రీ చేయని దేవీప్రసాద్.. ఎమ్మెల్సీనా?
డిగ్రీ కూడా పూర్తిచేయని దేవీప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్సీ పదవికి ఎలా అంగీకరిస్తారని స్వతంత్ర అభ్యర్థి శ్రీశైలం ప్రశ్నించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును నిలిపివేయాలంటూ ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే.. బ్యాలట్ పేపర్లో పార్టీల పేర్లను ఎలా ముద్రిస్తారని కూడా ఆయన తన పిటిషన్లో ప్రశ్నించారు. పార్టీల పేరు ముద్రించడం నిబంధనలకు విరుద్ధమని ఆయన తెలిపారు. -
సీపీఎం మద్దతు కోరిన దేవీప్రసాద్
హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి పోటీచేస్తున్న దేవీప్రసాద్ శుక్రవారం ఎంబీభవన్లో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని కలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో సీపీఎం తరఫున తనకు మద్దతునివ్వాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు రవీందర్రెడ్డి, సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు జి.రాములు, డీజీ నర్సింహారావు, బి.వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం దేవీప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మద్దతు విషయంపై తమ్మినేని సానుకూలంగా స్పందించారన్నారు. ఉద్యోగసంఘాల నాయకుడిగా తనపై వామపక్షాలు అభ్యర్థిని నిలపలేదన్నారు. రాష్ట్రంలో లౌకికవిలువల పరిరక్షణకు సీపీఎం, ఇతర వామపక్షాలు మద్దతునివ్వాలని కోరినట్లు చెప్పారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ఈ నెల 10న జరిగే తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ భేటీలో ఈ అంశంపై చర్చిస్తామన్నారు. దీనిపై ఇతర వామపక్ష పార్టీలతో కూడా చర్చించాక నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. -
హైదరాబాద్లో దేవీప్రసాద్.. నల్లగొండలో పల్లా
అట్టహాసంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం అట్టహాసంగా నామినేషన్లు దాఖ లు చేశారు. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి దేవీప్రసాద్ గన్పార్కు నుంచి ర్యాలీగా తరలి వెళ్లి జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎన్నికల రిట ర్నింగ్ అధికారి నవీన్మిట్టల్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, మహేందర్రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా అగిరు రవికుమార్, ఎ.సునీల్కుమార్, సిల్వేరు శ్రీశైలం,సిద్ధి లక్ష్మణ్గౌడ్,ఎల్.గౌరీశంకర్ప్రసాద్, షేక్ షబ్బీ ర్ అలీ నామినేషన్లు వేశారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్తో సహా ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. వరంగల్-ఖమ్మం-నల్లగొం డ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్, ఎన్నికల అధికారి అయిన సత్యనారాయణ వద్ద నామినేషన్ దాఖలు చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రు లు హరీష్రావు, తుమ్మల నాగేశ్వర్రావు, జగదీశ్వర్రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేవీప్రసాద్ విజయం ఖాయం: నాయిని సకలజనుల సమ్మెతో చరిత్ర సృష్టించిన దేవీప్రసాద్, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టిస్తారని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. బుధవారం దేవీప్రసాద్ నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవీప్రసాద్తో పోటీ పడగల అభ్యర్థులే లేరన్నారు. ప్రభుత్వోద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషిచేసిన ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉద్యోగులు, పట్టభద్రులు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజకీయ జేఏసీ నుంచి మరో అభ్యర్థి పోటీ చేయనున్నారనే ప్రచారం జరుగుతోందన్న ప్రశ్నకు బదులిస్తూ రాజకీయ జేఏసీ అభ్యర్థే దేవీప్రసాద్ అని, మరొకరు పోటీచేసే ప్రసక్తే లేదన్నారు. దేవీప్రసాద్ మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమ పథకాన్నీ అర్హులకే అందేందుకు, ఉద్యమంలో పాల్గొన్నవారు చట్టసభల్లోనూ ఉండాలనే తలంపుతో సీఎం కేసీఆర్ తనకు అవకాశమిచ్చారన్నారు. సెటిల ర్స్, ఆంధ్రా ఉద్యోగులపై తనకెలాంటి వివక్ష లేదన్నారు. మూడు జిల్లాల ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు ఓటింగ్లో పాల్గొని తనను గెలిపించాలని దేవీప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గులాబీ సైనికులకు, తెలంగాణ ద్రోహులకు మధ్య పోరు : మంత్రి హరీశ్రావు నల్లగొండ: ఈ ఎన్నికలు రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన గులాబీ సైనికులకు, తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం నల్లగొండలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన కేబినెట్ సమావేశంలోనే పోల వరం ముంపు పేరుతో ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపి ఖమ్మం జిల్లా ప్రజల గుండెలు గాయపర్చారని మండిపడ్డారు. తాజాగా మరికొన్ని మండలాలను ఏపీలో కలిపేందుకు బీజేపీ మద్దతుతో చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కరెంట్ ఇవ్వాలని అనేకమార్లు కేంద్రమంత్రి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నా తమ గోడును పట్టించుకోలేదని వాపోయారు. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ కల సాకారం చేసుకునేందుకు సీఎం కేసీఆర్కు, టీఆర్ఎస్కు అండా నిలవాలని హరీష్ విజ్ఞప్తి చేశారు. -
'నాకు ఏపీ ఉద్యోగుల మద్దతు ఉంది'
హైదరాబాద్:తనకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కూడా మద్దతిస్తామని ప్రకటించినట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్ తెలిపారు. ఆంధ్రా ఉద్యోగులు తనను వ్యతిరేకిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని పేర్కొన్నారు. ఆంధ్రా ఉద్యోగులు తాను వ్యతిరేకం కాదని దేవీప్రసాద్ మరోసారి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం తాను నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు దేవీప్రసాద్ తెలిపారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దేవీప్రసాద్
‘మహబూబ్నగర్-రంగారెడ్డి - హైదరాబాద్’ పట్టభద్రుల స్థానానికి ఖరారు నేడు ‘వరంగల్ - ఖమ్మం - నల్లగొండ’ అభ్యర్థిని ప్రకటించే అవకాశం మంత్రులు, పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ మంతనాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకుగాను తొలి అభ్యర్థిని అధికార టీఆర్ఎస్ ఖరారు చేసింది. ‘మహబూబ్నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ ’ నియోజకవర్గం నుంచి తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం(టీఎన్జీవో) అధ్యక్షుడు దేవీప్రసాద్ పేరును ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం పార్టీ నేతలతో ఆయన తన క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘ మంతనాలు జరిపారు. మంత్రులు, పార్లమెంటు కార్యదర్శులు, ఇతర కీలక నేతలతో మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశమై సుమారు ఐదు గంటలపాటు అనేక అంశాలపై చర్చించారు. సాయంత్రం దేవీప్రసాద్ పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. కానీ ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’ నియోజకవర్గం విషయంలో మాత్రం నిర్ణయాన్ని వెల్లడించలేదు. నాలుగు రోజులుగా ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నియోజకవర్గం అభ్యర్థిత్వానికి పోటీ ఎక్కువగా ఉండడంతో కేసీఆర్ అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నల్లగొండ మాజీ అధ్యక్షుడు బండ నరేందర్రెడ్డి పేరు దాదాపు ఖరారైందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరిగింది. కానీ ఈలోగా వరంగల్ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు రవీందర్రావు కూడా ప్రయత్నాలు చేశారు. ఈ ఇద్దరినీ కాదని మధ్యే మార్గంగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పల్లా రాజేశ్వర్రెడ్డి పేరును తెరపైకి తెచ్చారు. పలు రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయన వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం స్వయంగా అభ్యర్థి పేరును ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఆశావహులందరినీ అందుబాటులో ఉండాలని కేసీఆర్ సూచించినట్లు తె లిసింది. కాగా దేవీప్రసాద్ తన పేరు ఖరారైనట్లు తెలియగానే కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా మండలి ఎన్నికలు మండలి ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెల 4, 5 తేదీల్లో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు తదితర ప్రజా ప్రతినిధులందరికీ నాగార్జునసాగర్లో శిక్షణ శిబిరాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలతోపాటు ఎమ్మెల్యే కోటాలో మరో ఆరు ఎమ్మెల్సీ పదవులకు మార్చిలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల కోటాలో మరో తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకూ ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్.. మండలి ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు పార్టీ నేతలకు రెండు రోజులపాటు శిక్షణ ఇప్పించాలని భావించినట్లు తెలిసింది. ఈ శిబిరాలకు సుమారు 120 మంది ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు సమాచారం. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే(నా)?
-
ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థిగా దేవీప్రసాద్
హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా టీఎన్జీవో నాయకుడు దేవీ ప్రసాద్ పేరు ఖరారైంది. మరోవైపు వరంగల్, నల్లగొండ, ఖమ్మం నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లె రాజేశ్వరరెడ్డి పేరును టీఆర్ఎస్ అధినాయకులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. శనివారం సాయంత్రం అధికారికంగా పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్జీవో నేత దేవీప్రసాద్ ముందుగానే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దేవీప్రసాద్ మెదక్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. కాగా దేవీప్రసాద్ రాజీనామాను అధికారులు ఇంకా ఆమోదించాల్సి ఉంది. -
ప్రతిపక్షాల నజర్
ఎమ్మెల్సీ స్థానంపై ఆశలు మెజారిటీ లేకపోయినా పీఠం కోసం ప్రయత్నాలు హైదరాబాద్లో రహస్య సమావేశం టీఆర్ఎస్ తరఫున తెరపైకి టీఎన్జీవో నేత దేవిప్రసాద్ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మూడేళ్లుగా ఖాళీగా ఉంటున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంపై ప్రతిపక్ష పార్టీలు కూడా కన్నేశాయి. స్థానిక సంస్థల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు ఏ ఒక్క పార్టీకి సొంతంగా గానీ, అన్ని పార్టీలు ఏకమై బరిలోకి దిగినా ఈ పీఠాన్ని గెలుచుకునేందుకు సరి పడా మెజారిటీ లేదు. అయినా.. ఈ స్థానం కోసం ప్రతిపక్ష పార్టీల నే తలు ఒకరిద్దరు తెరవెనుక పావులు కదుపుతున్నా రు. ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులతోపాటు, అధికార పార్టీ సభ్యులకు కూడా భారీ మొత్తంలో నజరానాలు ఇచ్చి గట్టెక్కేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు మూడు ప్రతిపక్ష పార్టీల నేతలు కొందరు ఇటీవల హైదరాబాద్లో సమావేశమవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. గతంలో కూడా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్కు మెజారిటీ లేకపోయినా, కాంగ్రెస్కు చెందిన ప్రేంసాగర్రావు ఇలాగే ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అప్పట్లో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కన్నా టీడీపీకి సుమారు 160 మంది సభ్యుల మెజారిటీ ఉండేది. అయినా కొందరు టీడీపీ సభ్యుల సహకారంతో కాంగ్రెస్ నుంచి ప్రేంసాగర్రావు గట్టెక్కారు. ఈసారీ అలాంటి ఎత్తుగడలు వేసేందుకు టీఆర్ఎస్యేతర పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే పట్టభద్రులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా మోగనుంది. చివరిసారిగా జిల్లాలోని స్థానిక సంస్థలకు 2007లో ఎన్నికలు జరిగాయి. గెలుపొందిన ప్రేంసాగర్రావుకు లాటరీలో ఆరేళ్ల పదవీ కాలం లభించింది. 2013తో ఆయన పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంటోంది. తెరపైకి దేవిప్రసాద్ పేరు.. అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున కొత్తగా టీఎన్జీవో నేత దేవిప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. గతంలో ఆయనకు ఇచ్చిన హామీ మేరకు దేవిప్రసాద్ను ఇక్కడి నుంచి బరిలోకి దింపాలని అధినేత కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే నిర్మల్కు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత శ్రీహరిరావు కూడా ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ పార్టీకి చెందిన తూర్పు, పశ్చిమ జిల్లాల అధ్యక్షులు పురాణం సతీష్, లోక భూమారెడ్డిల పేర్లు మొదటి నుంచీ వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జీగా పనిచేసిన ప్రవీణ్కుమార్ పేరు కూడా అధినేత పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గెలుపు అవకాశాలు పూర్తిస్థాయిలో ఉన్న జిల్లా నుంచి టీఎన్జీవో నేత దేవిప్రసాద్ను బరిలోకి దింపాలనే యోచనలో అధినేత కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్కు అత్యధిక బలం.. వరుస ఎన్నికల్లో జిల్లాలో విజయ ఢంకా మోగించిన టీఆర్ఎస్ స్థానిక సంస్థలపై గులాబీ జెండాను ఎగురవేసింది. జిల్లా పరిషత్తోపాటు, భైంసా మినహా మిగిలిన ఐదు మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే 52 మండలాల్లో 42కు పైగా మండల పరిషత్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కొన్ని మండలాల్లో అసలు ప్రతిపక్ష పార్టీల ఉనికే లేకుండా పోయింది. పూర్తి మెజారిటీ ఉన్న టీఆర్ఎస్కు విజయావకాశాలున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు ఎప్పుడో పూర్తి చేసింది. ఈ స్థానిక సంస్థల జిల్లా ప్రజాప్రతినిధుల ఓటరు జాబితాను రెండు నెలల క్రితమే ఎన్నికల సంఘానికి పంపారు. -
అంతర్జాతీయ ట్రేడ్ సదస్సుకు దేవీప్రసాద్
ఖాట్మాండులో ఈనెల 12 నుంచి 15 వరకు సమావేశాలు సాక్షి, హైదరాబాద్: నేపాల్లోని ఖాట్మాండులో ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే 12వ అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్ కాన్ఫరెన్స్కు రాష్ట్రం నుంచి టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ హాజరు కానున్నారు. ప్రతి మూడేళ్లకోసారి జరిగే ఈ సమావేశాలకు హాజరు కావాలని ఆయనకు ఆహ్వానం అందింది. ఆయనతోపాటు ఆంధ్రప్రదేశ్నుంచి ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్బాబు హాజరుకానున్నారు. మన దేశం నుంచి 10 మందికి ఆహ్వానం అందినట్లు టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్ వెల్లడించారు. అంతర్జాతీయంగా వివిధ దేశాలు, రాష్ట్రాల్లో ఉద్యోగ, కార్మిక విధానాలు, ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు, సంక్షేమ పథకాలపై ఉద్యోగుల స్పందించేతీరు, పనివిధానం ఎలా ఉందన్న అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తారని తెలిపారు. -
అయితే కోదండరామ్.. కాదంటే దేవీప్రసాద్!
-
'కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా'
హైదరాబాద్ : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే చెస్ట్ ఆసుపత్రిని మరో ప్రాంతానికి తరలించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని టీ ఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో మాట్లాడుతూ.... కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. చెస్ట్ ఆసుపత్రి తరలింపుపై ఉద్యోగులు చేస్తున్న ఆందోళన వెంటనే విరమించాలని వారికి దేవీ ప్రసాద్ హితవు పలికారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ అనంతగిరి క్షయ నివారణ కేంద్రం (టీబీ శానిటోరియం)ను తొలగించి.. ఆ స్థానంలో మానసిక రోగుల చికిత్సాలయం, చెస్ట్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే ప్రభుత్వం రంగంలోకి దిగి సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఎర్రగడ్డలోని ఈ రెండు ఆస్పత్రుల స్థానంలో పెరేడ్ గ్రౌండ్కు శాశ్వత వేదికగా ఉపయోగించుకోనున్నట్లు ఇటీవల ఆయా ఆస్పత్రుల తనిఖీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెస్ట్ ఆసుపత్రిని తొలగించడం భావ్యం కాదని ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు ఆందోళనకు దిగిన విషయం విదితమే. -
దేవి గీసిన బొమ్మ
దేవి ప్రసాద్... డెరైక్టర్గా మెగాఫోన్ పట్టుకుని వెండితెరపై చిత్రాలను సృష్టించినంత అలవోకగా.. కుంచెతో అందమైన చిత్రాలు ఆవిష్కరిస్తాడు. ఆరు సినిమాలతో హిట్ డెరైక్టర్గా అనతి కాలంలోనే మంచి టాక్ సంపాదించిన దేవిలో... ‘బాపు’ బొమ్మ గీసి ఆయనకే బహుమతిగా ఇచ్చేంత మంచి ఆర్టిస్ట్ దాగున్నాడు. సినిమా సినిమాకు మధ్య ఖాళీని తన కుంచెతో పూరిస్తున్న దేవీప్రసాద్ ‘సిటీప్లస్’తో పంచుకున్న ముచ్చట్లు... మా సొంతూరు గుంటూరు జిల్లా కనగాల గ్రామం. నాన్న కోటేశ్వర్రావు ప్రభుత్వ విభాగంలో ఫార్మాసిస్ట్. వృత్తి రీత్యా ప్రాంతాలు మారుతుండటంతో నా చదువు కూడా డిఫరెంట్ లొకేషన్స్లో సాగింది. చిన్నప్పటి నుంచే పెయింటింగ్ అంటే ఇష్టం. పాఠశాల స్థాయిలోనే బొమ్మలు గీస్తుండేవాడిని. మాచర్ల సత్యనపల్లి హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదివేటప్పుడు బాపూతో పాటు సినీ దర్శకులు, నటుల బొమ్మలు గీస్తుంటే నాన్న గారు చూశారు. ‘ఏంటిరా ఈ బొమ్మలు గీస్తున్నావు’ అంటే.. ‘పెద్దయ్యాక మద్రాస్లో వీళ్లను కలిసి ఈ బొమ్మలు ఇస్తా’ అని చెప్పా. అంతే నాన్న సెలవుపెట్టి మరుసటి రోజే మద్రాసు తీసుకెళ్లారు. అరుదైన సమయాలు... మొదట బాపు ఇంటికి వెళ్లాం. అప్పుడే నేను గీసిన బొమ్మ బాపూగారికి ఇచ్చాను. అప్పటివరకు ఆయనంటే నాకు తెలియని ఇష్టం ఉండేది. ఆయన్ని ప్రత్యక్షంగా చూశాక బాపూగారి గొప్పతనం అర్ధమైంది. ఆయన బొమ్మలు గీసే గది చూపించారు. అది నా లైఫ్లో స్వీట్ మెమరీ. ఆ తర్వాత పుండరీకాక్షయ్య ఆఫీసుకెళ్లాం. అక్కడ పాటల రచయిత కొసరాజు రాఘవయ్య గారు కలిశారు. ‘ఈ బొమ్మలు నువ్వే గీశావా?’ అని అడిగాడు. వెంటనే ఆ ఆఫీసులోనే ఉన్న ఎన్టిఆర్ ఫొటో చూసి చిత్రరూపమిచ్చా. వెంటనే కౌగిలించుకొని... ప్యాడ్, పేపరు తీసుకొని నా పేరు వచ్చేలాగా పద్యం రాసి, సంతకం పెట్టి గిఫ్ట్గా ఇచ్చారు. అవి రెండొ అరుదైన సమయాలు. నేనెన్నటికీ మరువలేనివి. కాలేజీ చదువు బాపట్లలో సాగింది. స్కూల్, కాలేజీ రోజుల్లో నాటకాలు వేసేవాడిని. అలా సినిమాల్లోకి వెళ్లాలన్న ఆసక్తి కలిగింది. పదేళ్ల విరామం... సినిమా ఫీల్డ్కు వచ్చాక కోడి రామకృష్ణ గారి దగ్గర పనిచేశా. బిజీ లైఫ్. దాదాపు పదేళ్ల పాటు బొమ్మలు గీయడానికి దూరంగా ఉన్నా. హైదరాబాద్ వచ్చాక డెరైక్టర్గా అవకాశం వచ్చింది. సినిమా, సినిమా మధ్య ఖాళీ సమయాల్లో మళ్లీ పాతరోజుల్లాగా బొమ్మలు గీయడం ప్రారంభించాను. ఈ సమయంలోనే నా అభిమాన డెరైక్టర్ బాలచందర్గారు తెలుగు డెరైక్టర్ అసోసియేషన్కు వచ్చినప్పుడు... నేను గీసిన ఆయన చిత్రాన్ని ఇచ్చా. అది చూసి చాలా మెచ్చుకున్నారు. అంతేకాదు... ‘ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆర్ట్ని వదులుకోవద్దు, అది డెరైక్షన్కి కూడా ఉపయోగపడుతుంది’ అని చెప్పారు. ఆ మాటలే శిరోధార్యంగా టైం దొరికితే చాలు బొమ్మలకు రూపునిచ్చే పనిలో నిమగ్నమవుతున్నా. విపరీతమైన ఒత్తిడి సమయాల్లోనూ కుంచె పట్టుకుంటే చాలు... ప్రశాంతత కలుగుతుంది. భవిష్యత్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నా. - వాంకె శ్రీనివాస్ -
ఎమ్మెల్సీ స్థానాలకు కేసీఆర్ స్కెచ్!
పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకోసం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జేఏసీ నాయకులను రంగంలోకి దింపాలని సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి, టీ జేఏసీకి మధ్య దూరం చాలా పెరిగిందని వినిపించింది. ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన వాళ్లలో శ్రీనివాస గౌడ్ మహబూబ్నగర్ ఎమ్మెల్యేగా, స్వామి గౌడ్ శాసన మండలి చైర్మన్గా ఎన్నికయ్యారు. కానీ తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్కి మాత్రం ఏ పదవీ దక్కలేదు. మెదక్ లోక్సభ టికెట్ ఆశించినా, ఆయనకు భంగపాటు తప్పలేదు. ఆ సమయంలో ఇచ్చిన హామీ మేరకే దేవీ ప్రసాద్కు ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరో స్థానానికి అడ్వకేట్ జేఏసీ నేత రాజేందర్ రెడ్డి, మరో జేఏసీ నేత మల్లేపల్లి లక్ష్మయ్య పేరును కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరికి అదృష్టం వరిస్తుందో చూడాలి. 2009లో మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి ఇండిపెండెంట్గా కె.నాగేశ్వర్ ఎన్నికయ్యారు. అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున కపిలవాయి దిలీప్ కుమార్ ఎన్నికయ్యారు. వారిద్దరి పదవీ కాలం 2015 మార్చి 29తో ముగియనుంది. ఆయా స్థానాలకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆ రెండు స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని గులాబి బాస్ స్కెచ్ గీస్తున్నట్లు సమాచారం. -
ఆదర్శపాలన అందించాలి
ఖమ్మం జడ్పీసెంటర్ : తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఆదర్శవంత పాలన సాగాలంటే కేంద్రం ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ఖమ్మంలోని టీఎన్జీఓ ఫంక్షన్హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 9, 10 షెడ్యూల్లో ఉన్న ఉమ్మడి సంస్థను ఇప్పటి వరకు విభజించలేదన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో అనేక అంశాల్లో కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరి వల్ల ఉద్యోగుల్లో భయాందోళన నెలకొందన్నారు. డిసెంబర్ 31 వరకు ఉద్యోగుల పంపకాలు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. 80 ప్రభుత్వ ప్రధాన శాఖలు ఉంటే 30 శాఖల్లో మాత్రమే కేడర్ స్ట్రెంట్త్ మాత్రమే విభజన జరిగిందని, హెచ్ఓడీలు శాఖాధిపతులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల ఈ పరిస్థితి నెలకొందని అన్నారు. కేడర్ స్ట్రెంట్త్ పంపని అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇరు ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్యమంత్రులు మాట్లాడి సమస్యను పరిష్కరించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవసరమైతే సూపర్ న్యూమరి పోస్టులు ఏర్పాటు చేస్తామని చెబుతోందని, కానీ ఆంధ్రలో ఒక్కటి కూడా ఏర్పాటు చేయ టం లేదని అన్నారు. ప్రజల మధ్య వైరుధ్యాలను తొలగించేందుకు తెలంగాణ టీడీపీ నేతలు కృషిచేయాలన్నారు. 1-7-2013 నుం చి ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. సంఘం కేంద్ర ప్రధాన కార్యదర్శి రవీందర్రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. కాకతీయ మిషన్ ద్వారా చెరువుల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఉద్యోగులు ఒకరోజు శ్రమదానం చేయాలన్నా రు. సమావేశంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కూరపాటి రంగరాజు, రామయ్య, నాయకులు లక్ష్మీనారాయణ, వల్లోజు శ్రీనివాస్, సాగర్, వెంకటేశ్వర్లు, రమణయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రానిది కుట్రపూరిత ఆలోచన
సిద్దిపేట జోన్ : తెలంగాణ ప్రభుత్వ సర్వీసులను దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర పూరిత ఆలోచన చేస్తోందని టీఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు. ఆదివారం రాత్రి స్థానిక ఎన్జీఓ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కమలనాథన్ కమిటీ 56 వేల మంది ఉద్యోగుల విభజన ప్రక్రియపై సుదీర్ఘ కసరత్తు చేసి రెండునెలలు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. ఇంకా మార్చి 31 లోపు ప్రభుత్వ శాఖల్లోని పరిపాలన అధికారులు, సచివాలయ ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించడంపై టీఎన్జీఓ యూనియన్ నిరసన వ్యక్తం చేస్తోందన్నారు. శంషాబాద్విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. హైదరాబాద్లో పార్కులు, వీధులకు ఉన్న ఆంధ్రా నాయకుల పేర్లను మార్చాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కేటాయింపుతో పాటు ఇతరత్రా అంశాల్లో విభజన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘిస్తోందని దేవీప్రసాద్ ఆరోపించారు. ఉద్యోగులకు 2013 జూలై నుంచి పేరివిజన్ నివేదిక అమలు చేయాలని, 69 శాతం ఫిట్మెంట్ను అందించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారం రవీందర్రెడ్డి మాట్లాడుతూ హౌసింగ్ సొసైటీల అక్రమాలపై సమగ్రమైన విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్యామ్రావు, నాయకులు విక్రమ్, శ్రీహరి, శ్రీనివాస్రెడ్డి, విక్రమ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాడు వద్దన్నది.. నేడు ముద్దా?
కొత్త పింఛన్ పథకం విషయంలో బీజేపీ వైఖరిపై దేవీ ప్రసాద్ సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ.. నేడు అధికారంలోకి రాగానే అదే పథకాన్ని కొనసాగించేందుకు ఉత్సాహం చూపుతోందని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల(టీఎన్జీవో) సంఘం అధ్యక్షులు దేవీప్రసాద్ అన్నారు. అధికారంలో ఎవరున్నా ఉద్యోగుల పట్ల వారు అవలంభించే వైఖరి మాత్రం ఒకేలా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారమిక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అఖిలభారత నవోదయ ఉద్యోగుల సంఘం మహాసభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్త కార్యవర్గం ఎన్నిక నవోదయ ఉద్యోగుల సంఘం మహాసభల ముగింపు కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం జాతీయ అధ్యక్షులుగా జగదీశ్ రాయ్, ప్రధాన కార్యదర్శిగా ఎల్. బుచ్చిరెడ్డి తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
అశోక్బాబు కుట్రలు చేస్తున్నారు: దేవీ ప్రసాద్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులు తమపై దాడి చేస్తున్నారంటూ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో దేవీ ప్రసాద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలోనే ఎక్కడా ఏపీ ఉద్యోగులపై ఎలాంటి దాడులు చేయలేదని గుర్తు చేశారు. అలాంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ ఉద్యోగులు ఎందుకు దాడి చేస్తారని ప్రశ్నించారు. అంతర్గత కలహాలతో కుస్తీ పడుతున్న ఏపీ ఎన్జీవోలు... తెలంగాణ ప్రభుత్వంతో యుద్దం చేసే ప్రయత్నాలను మానుకోవాలని దేవీ ప్రసాద్ హితవు పలికారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఏపీ ఎన్జీవో సంఘంలోని హైదరాబాద్ ఉద్యోగులు న్యాయమైన వాటా కోసం పట్టుపడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఏపీ ఎన్జీవోను ఏపీకి తరలించే క్రమంలో నిధులు, వాటాల కోసం ఆ సంస్థ ప్రతినిధులకు సమాధానం చెప్పలేక అశోక్బాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. -
ప్రజల కోసం హెల్ప్డెస్క్లు
జిల్లా, తాలూకా కేంద్రాల్లో ఏర్పాటు: దేవీప్రసాద్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి తాలూకా, జిల్లా కేంద్రాల్లో హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. మంగళవారం హైదరాబాద్లో జరిగిన టీఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో హెల్ప్డెస్క్ల ఏర్పాటుకు తీర్మానించినట్టు టీఎన్జీఓ అధ్యక్షుడు జి. దేవీప్రసాద్ అనంతరం విలేకరులకు తెలిపారు. ముందుగా జిల్లా కేంద్రాల్లోని తమ కార్యాలయాల్లో ఏర్పాటు చేసి, ఆ తరువాత తాలూకా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. వీటిద్వారా ప్రజలకు అవసరమైన సలహాలు, సూచనలు అందించడమేగాక, కార్యాలయాల్లో వారి సమస్యలు త్వరగా పరిష్కరించేలా చూస్తామన్నా రు. ఉద్యోగులు అలసత్వాన్ని వీడే లా, పని సంస్కృతిని పెంచేలా చర్యలు చేపడుతామన్నారు. కొన్నిశాఖల్లో రోజుకు అదనంగా 2 గంటలు పనిచేస్తున్నామ ని చెప్పారు. ఉద్యోగుల విభజన సమస్యలపై వచ్చే నెల 26, 27 తేదీల్లో ఒక రోజు ఛలో ఢిల్లీ నిర్వహిస్తామన్నారు. విభజన 31లోగా పూర్తిచేయాలి ఉద్యోగుల విభజనను ఈనెల 31 లోగా పూర్తి చేయాలని దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. -
'కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది'
హైదరాబాద్:ఉద్యోగుల విషయంలో కేంద్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ మండిపడ్డారు. మంగళవారం టీఎన్జీవోల రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల అంశానికి సంబంధించి విభజన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో కేంద్రం స్పందించకపోతే ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని దేవీ ప్రసాద్ హెచ్చరించారు. దీంతో పాటు తెలంగాణ పబ్లిక్ కమిషన్ ను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. -
ఉద్యోగుల విభజనపై కేంద్రం ఆలస్యం చేస్తోంది: దేవీప్రసాద్
హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ఉద్యోగుల విభజన విషయంలో ఆలస్యం చేస్తోందని టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ అన్నారు. ఉద్యోగుల విభజనపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని గృహకల్ప ప్రాంగణంలో తెలంగాణ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. నల్లబ్యాడ్జీలతో కమలనాథన్ కమిటీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవీప్రసాద్ మాట్లాడుతూ... రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఉద్యోగులు ఏపీ ప్రభుత్వంలో పనిచేయాల్సి రావడం బాధాకరం అన్నారు. ఉద్యోగుల విభజనపై త్వరలోనే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఉద్యోగులకు అండగా ఉంటుందన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు విఠల్,హైదరాబాదు టీఎన్జీఓ అధ్యక్షుడు ముజీబ్, తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
'నిషేధం ఎత్తివేయడానికి సీఎం అంగీకారం'
హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగు ప్రమోషన్లలో నిషేధాన్ని ఎత్తివేయడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం సీఎంను కలిసిన అనంతరం దేవీ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల ప్రమోషన్లపై నిషేధం ఎత్తివేయాలన్న తమ విజ్ఞప్తిపై కేసీఆర్ సానకూలంగా స్పందించారన్నారు. ఈ నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయడానికి సీఎం అంగీకారం తెలపారని దేవీ ప్రసాద్ తెలిపారు. ఉద్యోగులకు హెల్త్ కార్డ్ లు పీఆర్ సీపీ వెంటనే అమలు చేయాలని కోరామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వీటిన్నంటిపై కేసీఆర్ సానుకూలంగానే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. -
రాజకీయాలకన్నా ఉద్యోగుల సమస్యలే మిన్న
సిద్దిపేట టౌన్ : రాజకీయాల కన్నా తనకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడమే ముఖ్యమని రాష్ట్ర టీఎన్జీవోల సంఘం చైర్మన్ దేవీప్రసాద్ అన్నారు. సిద్దిపేట ఎన్జీఓ భవన్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెదక్ లోక్సభ ఉప ఎన్నికలో తనకు టిక్కెటు ఇవ్వని అంశాన్ని రాజకీయ దురుద్దేశంతో వాడుకోవడం తగదన్నారు. ఉద్యోగుల విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చే యాలన్నారు. స్పష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసినప్పుడే తెలంగాణలో పాలన వేగవంతమవుతుందన్నా రు. స్థానికత ఆధారంగానే ఉద్యోగులను విభజించాలన్నారు. జిల్లా, జోన్ స్థాయి అధికారులను వారి ప్రాంతాలకు పంపిం చాలన్నారు. దసరా లోగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగులకు హెల్త్ కార్డులను, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు. బంగారు తెలంగాణలో తాము సైతం భాగస్వామ్యం అవుతామన్నారు. సమావేశంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి రవీందర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజేందర్, ప్రధా న కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, నేతలు విక్ర మ్, శ్రీహరి, మజీద్ పాల్గొన్నారు. -
ఉద్యోగుల విభజన.. తప్పులతడక
కమలనాథన్ కమిటీ ప్రకటించిన ఉద్యోగుల విభజన అంతా తప్పుల తడకగా ఉందని తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మండిపడ్డారు. అన్ని స్థాయిలలోని పోస్టులను కలిపి గంపగుత్తగా చూపించారని, ఇది సరికాదని ఆయన అన్నారు. ఇది సరికాదని, ఏ స్థాయి ఉద్యోగులను ఆ స్థాయిలో విభజించాలని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన ప్రక్రియను మళ్లీ చేపట్టాలని దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. -
దేవీప్రసాద్కు కేసీఆర్ హామీ!
హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ సీటుపై ఆశలు పెంచుకున్న ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ కు చుక్కెదురైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామాతో మెదక్ పార్లమెంట్ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. గత కొద్ది రోజులుగా మెదక్ సీటు టికెట్ రేసులో దేవీ ప్రసాద్ దూసుకుపోతున్నట్టు వార్తలు వెలువడ్డాయి. దేవీ ప్రసాద్ కు పోటీగా కొత్త ప్రభాకర్ రెడ్డి పేరు తెరమీదకు రావడంతో టికెట్ కేటాయింపు అంశం ఆసక్తిగా మారింది. కేసీఆర్ సింగపూర్, మలేషియా పర్యటనలో నేపథ్యంలో మెదక్ లోకసభ సీటు అభ్యర్థి ఎంపిక వాయిదా పడింది. పార్టీ కమిటీ పలు దఫాలుగా నిర్వహించిన చర్చల అనంతరం మెదక్ లోకసభ టీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డిని ఖారారు చేశారు. దాంతో ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ నిరాశలో మునిగినట్టు సమాచారం. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికలో ఉద్యోగ సంఘాల మద్దతు కూడగట్టడానికి ఎమ్మెల్యే కోటాలో దేవీ ప్రసాద్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కేసీఆర్ బుజ్జగించినట్టు సమాచారం. -
మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే...
హైదరాబాద్: నాన్ గెజిటెడ్ తెలంగాణ ఉద్యోగుల సంఘం(టీఎన్జీవో) ప్రతినిధులు కమలనాథన్ను కలిశారు. ఉద్యోగుల విభజన త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా జోనల్ పోస్టుల్లో 40 వేలకు పైగా ప్రాంతీయేతర ఉద్యోగుల్ని గుర్తించి వారి వివరాలు కమిటీకి సమర్పించామని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్ తెలిపారు. విభజన సమస్యలపై రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే నష్టపోయేది ఆంధ్రప్రదేశేనని ఆయన హెచ్చరించారు. ఉద్యోగుల విభజనలో కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల్లోని 18(ఎఫ్) నిబంధన తొలగించాలని అంతకుముందు దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. ఆంధ్రకు చెందిన ఉద్యోగులకు ఆప్షన్స్ వర్తింప చేయరాదని అన్నారు. -
దేవీప్రసాద్కు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలి
హైదరాబాద్: తెలంగాణ ఎన్జీవోల అత్యవసర సమావేశం ముగిసింది. మెదక్ ఎంపీ స్థానానికి టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ను పోటీ చేయించాలని సమావేశంలో తీర్మానం చేశారు. త్వరలో సీఎం కేసీఆర్ను కలిసి దేవీప్రసాద్ కు టికెట్ ఇవ్వాలని టీఎన్జీవో సంఘం నేతలు కోరనున్నారు. సెప్టెంబర్ 13న మెదక్ ఉప ఎన్నిక జరగనుంది. కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో మెదక్ స్థానం ఖాళీ అయింది. కాగా, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. -
ప్రతి ఉద్యోగీ పాల్గొనాలి : దేవీ ప్రసాద్
హైదరాబాద్: తెలంగాణలో జీతం తీసుకునే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి 19న సర్వేలో పాల్గొనాల్సిందేనని టీఎన్జీవో అధ్యక్షుడు దే వీప్రసాద్ వుంగళవారం ఇక్కడ విలేకరులతో వూట్లాడుతూ స్పష్టం చేశారు. ఏ ప్రాంతం, ఏ రాష్ట్రం వారైనా ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే చర్యలు తప్పవన్నారు. తెలంగాణలో ఉంటామంటూ ఆప్షన్లు ఇచ్చే ఉద్యోగులు సర్వేలో పాల్గొనబోమంటూ ఆంధ్రా కు ఉద్యోగం చేస్తారా? అని ప్రశ్నిం చారు. అది సరికాదన్నారు. 50 వేల మంది పెన్షనర్లు కూడా పనిచేసేందుకు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. సర్వేలో వివరాలను ధైర్యంగా చెప్పాలని సెటిలర్లకు దేవీప్రసాద్ సూచించారు. -
కమలనాధన్ కమిటీని కీలుబొమ్మలా ఆడిస్తోంది
హైదరాబాద్: స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ అన్నారు. కమలనాధన్ కమిటీపై ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన శాఖ పెత్తనం చేస్తోందని దేవీ ప్రసాద్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగితే మరో ఉద్యమం తప్పదని దేవీ ప్రసాద్ హెచ్చరించారు. 18 (ఎఫ్ ) నిబంధన వల్ల తెలంగాణ ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుందని, వెంటనే ఆ జీవోను తొలగించాల్సిందేనని టీఎన్జీ వో నేత విఠల్ అన్నారు. కమలనాధన్ కమిటీని కేంద్రం కీలుబొమ్మలా చేసి ఆడిస్తోందని, జోనల్, జిల్లా పోస్టుల విభజన కూడా జరగాల్సిందన్నారు. ఏపీ ప్రభుత్వం వెకిలి చేష్టలు మానకపోతే తగిన బుద్ధి చెబుతామని శ్రీనివాసగౌడ్ వ్యాఖ్యలు చేశారు. -
ఉద్యోగులకు ఆప్షన్లు తొలగించాలి
టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ సంగారెడ్డి: ఉద్యోగులకు ఆప్షన్లు తొలగించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఆదివారం జరిగిన జిల్లా టీఎన్జీవో సంఘం కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణలోని ఖాళీల్లోకి ఆంధ్రా ఉద్యోగుల్ని పంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఉద్యోగుల విభజన మార్గదర్శకాల్లో ఉన్న 18ఎఫ్ క్లాస్ను వెంటనే తొలగించాలని, స్థానికత ఆధారంగా విభజన జరగాలని డిమాండ్ చేశారు. తద్వారా ఏర్పడే ఖాళీలను తెలంగాణ ఉద్యోగుల పదోన్నతులతో నింపాలన్నారు. జిల్లాల్లో పనిచేస్తున్న ఆంధ్రా అధికారులందరినీ పంపించాలని డిమాండ్ చేశారు. గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసే సీబీసీఐడీ విచారణ కేవలం ఉద్యోగుల పట్లనే కాకుండా బాధ్యులైన ప్రజా ప్రతినిధులను కూడా విచారించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. -
ఉద్యోగులకు ఆప్షన్లు వద్దు
ఆంధ్ర ఉద్యోగులను పంపే కుట్ర : టీ ఉద్యోగ జేఏసీ 8 ఎఫ్ను తొలగించాలి స్థానికత ధ్రువపత్రాలు వెబ్సైట్లో పెట్టాలి హైదరాబాద్: ఉద్యోగుల విభజనకు సంబంధించి ఆప్షన్లను తొలగించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఉద్యోగుల విభజనలో భాగంగా తెలంగాణలోని ఖాళీల్లోకి ఆంధ్రా ఉద్యోగులను పంపించే కుట్ర జరుగుతోందని జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగానే విభజన మార్గదర్శకాల్లో ‘18 ఎఫ్’ క్లాజును పెట్టారని మండిపడ్డారు. దానిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. శనివారం టీఎన్జీవోల కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. అనంతరం దేవీప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల విభజన బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలనశాఖ (జీఏడీ) పరిధి నుంచి తొలగించి, స్వతంత్ర సంస్థ ఆధ్వర్యంలో చేపట్టాలని.. లేదా తెలంగాణ రాష్ట్ర అధికారులకు అందులో భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అక్టోబరు 31లోగా ఉద్యోగుల విభజనను పూర్తి చేయాలని.. రాష్ట్ర స్థాయి అధికారులు, సిబ్బందితోపాటు జోనల్, మల్టీజోనల్, జిల్లా స్థాయిల్లోనూ ఉద్యోగుల విభజన చేపట్టాలని కోరారు. ఉద్యోగుల స్థానికత తదితర వివరాలను తెలియజేసే ధ్రువపత్రాలను వెబ్సైట్లో పెట్టాలన్నారు. ఉద్యోగుల సర్వీసు బుక్ నిర్మాణమే సరిగా లేదని, అందులో స్థానికత అంశమే లేదని, ఈ విషయాన్ని కమలనాథనే చెప్పారని దేవీప్రసాద్ చెప్పారు. అనంతరం తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ మాట్లాడుతూ... కమలనాథన్ కమిటీ ఉత్సవ విగ్రహంలా మారిందని, ఆంధ్రప్రదేశ్ అధికారులు దానిని తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్గౌడ్ మాట్లాడుతూ.. మిగులు ఉద్యోగులను ఎక్కడి వారిని అక్కడే నియమించుకోవాలని పేర్కొన్నారు. ఇందుకు కేసీఆర్ అంగీకరించారని చెప్పారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది: శ్రీనివాస్గౌడ్ కమలనాథన్ కమిటీకి ఎన్నో వినతిపత్రాలు అందజేసినా చివరకు తాము భయపడ్డ తరహాలోనే నిర్ణయం తీసుకున్నారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏ ప్రాంతానికి చెందిన వారు అదే ప్రాంత ప్రభుత్వంలో పనిచేసేలా కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు. తాజా మార్గదర్శకాలు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉన్నాయని విమర్శించారు. -
అన్యాయం జరిగితే మళ్లీ ఉద్యమం
కమలనాథన్ కమిటీ విడుదల చేసిన మార్గదర్శకాలపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి అక్టోబర్ 31లోగా ఉద్యోగుల విభజన పూర్తి చేయాలని జేఏసీ నాయకుడు దేవీప్రసాద్ అన్నారు. ఎవరికీ ఆప్షన్లు ఇవ్వద్దని, స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని డిమాండ్ చేశారు. తప్పుడు సర్టిఫికెట్లు పెట్టిన వారిపై న్యాయవిచారణ జరపాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ జీఏడీ విభజనతో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా దీనిలో భాగస్వామ్యం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల విభజన మొత్తం స్వతంత్ర సంస్థతో నిర్వహించాలని, తమకు మాకు అన్యాయం జరిగితే మరోసారి ఉద్యమిస్తామని జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ స్పష్టం చేశారు. -
అన్యాయం జరిగితే మళ్లీ ఉద్యమం
-
రిటైర్మెంట్ వయసు పెంచాలి
* ఆంధ్రా తరహాలో 60 ఏళ్లకు పెంచాలని సీఎం కేసీఆర్కు టీఎన్జీవోల విజ్ఞప్తి * జాబ్లకు నోటిఫికేషన్లు జారీ చేయండి * కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్సిబ్బందిని క్రమబద్ధీకరించండి * ఇళ్ల స్థలాలు, స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయండి * సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని, ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని టీఎన్జీవోల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని, పీఆర్సీపై కసరత్తును వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్కు ఆదివారం టీఎన్జీవోల సంఘం నేతలు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. తెలంగాణ ఉద్యోగుల సమస్యలన్నింటీని పరిష్కరిస్తామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు. టీఎన్జీవోల కార్యవర్గం భేటీ.. ఆదివారం హైదరాబాద్లోని టీఎన్జీవో భవన్లో సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విభజన అంశాలతో పాటు, ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. అనంతరం 10 ప్రధాన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ను టీఎన్జీవో ప్రతినిధి బృందం కలసి ఒక వినతి పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవీప్రసాద్, రవీందర్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని, డీఎస్సీల ద్వారా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే అశాస్త్రీయంగా జరిగిన ఉద్యోగుల విభజనపై కమలనాథన్ దృష్టి పెట్టాలని... జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులను విభజించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెన్యువల్ చేసి.. వారి క్రమబద్ధీకరణపై దృష్టి సారించాలన్నారు. పీఆర్సీపై కసరత్తును వేగవంతం చేయాలని, హెల్త్కార్డులపై మళ్లీ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. 42 రోజుల సకల జనుల సమ్మె కాలాన్ని ఆన్ డ్యూటీగా మార్పు చేయాలని.. ఉద్యోగులు, విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని టీఎన్జీవో నేతలు కోరారు. ఉద్యోగ సంఘాలతో చర్చిస్తా: కేసీఆర్ తెలంగాణ ఉద్యోగుల సమస్యలన్నింటినీ వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తానని టీఎన్జీవో నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో త్వరలోనే మాట్లాడుతానని చెప్పారు. సీఎం కేసీఆర్ను క్యాంపు కార్యాలయంలో కలసిన టీఎన్జీవో నేతలు కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, తీర్మానాలను ఆయనకు వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపకం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేసీఆర్కు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ఇంకా పూర్తిగా స్థిరపడలేదని.. కొంత సమయం తీసుకుంటుందని కేసీఆర్ వివరించారు. ఉద్యోగుల సమస్యలు, ఇంకా చిన్న విషయాలను పెండింగ్లో పెట్టుకోకుండా పునర్నిర్మాణంవైపు వేగంగా అడుగులు వేసుకుందామని టీఎన్జీవో నేతలకు సూచించారు. కేసీఆర్ను కలిసిన వారిలో టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి కారెం రవీందర్రెడ్డి, మహిళా నేత రేచల్ తదితరులు ఉన్నారు. -
తెలంగాణ కోసం ఒకటిన్నర రోజు వేతనం విరాళం
ఉద్యోగుల విభజన తాత్కాలికమే: టీఎన్జీవో నేత దేవీప్రసాద్ సిద్దిపేట : కొత్తగా ఏర్పాటవుతున్న తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కోసం టీఎన్జీవోలు ఒకటిన్నర రోజు వేతనాన్ని తొలి ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ ప్రకటించారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఒక రోజు వేతనం ప్రజా సంక్షేమం కోసం, సగం రోజు వేతనం అమరుల కుటుంబీకుల సహాయం కోసం వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త రాష్ట్ర పరిపాలనను పటిష్టం చేయడానికి ఉద్యోగులు అదనంగా పనిచేస్తారన్నారు. కొత్త ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. అక్రమంగా జరిగిన ప్రమోషన్లు, పోస్టింగ్లు చెల్లవన్నారు. -
మెదక్ ఎంపీ అభ్యర్థిపై కేసీఆర్ కసరత్తు
మెదక్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కసరత్తును తీవ్ర తరం చేశారు. జూన్ 2వ తేదీన తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ లోపే మెదక్ ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు తీవ్రంగా కేసీఆర్ కృషి చేస్తున్నారు. అయితే ఆ లోక్సభ స్థానాన్ని ఎవరికి కేటాయించాలి అనే అంశంపై పార్టీ సీనియర్ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన తీవ్రంగా చర్చిస్తున్నారు. మెదక్ లోక్సభ స్థానానికి తమ సంఘం నాయకుడు దేవీప్రసాద్ని ఎంపిక చేయాలని తెలంగాణ ఎన్జీవో సంఘానికి చెందిన నేతలు కేసీఆర్పై ఒత్తిడి తెస్తున్నారు. మెదక్ ఎంపీ స్థానానికి పోటీ చేయాలని మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డిని కేసీఆర్ కోరగా, నాయిని సున్నితంగా తిరస్కరించారు. తానకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఇక్కడే ఉంటూ రాష్ట్రానికి సేవ చేసుకుంటానని ఆయన కేసీఆర్కు తన మనసులోని మాట చెప్పారు. అలాగే మాజీ ఐఏఎస్ అధికారి కె.వి.రమణాచారి అయితే ఎలా ఉంటుంది అనే అంశంపై కూడా పార్టీ నాయకులతో తీవ్రంగా చర్చించారు. మెదక్ ఎంపీ అభ్యర్థి పేరుని రేపటిలోగా ఖరారు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ అటు గజ్వేల్ అసెంబ్లీతోపాటు ఇటు మెదక్ లోక్సభ స్థానానికి పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు. జూన్ 2వ తేదీ కేసీఆర్ తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్బంగా మెదక్ లోక్సభ స్థానానికి కేసీఆర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
స్థానికేతర ఉద్యోగులు 1300 పైనే!
తెలంగాణ ఆవిర్భావ దినం సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ‘లోకల్’ లొల్లి మొదలైంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రాంత ఉద్యోగులే జిల్లాలో పనిచేసే దిశగా సన్నాహాలు ముమ్మరమయ్యాయి. రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న తెలంగాణేతర ఉద్యోగులను సీమాంధ్రకు పంపించాలని నిర్ణయించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ మేరకు చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా జిల్లాలోనూ వివిధ ప్రభుత్వ శాఖల్లో 1300కు పైగా మంది సీమాంధ్ర ఉద్యోగులు పనిచేస్తున్నట్టు తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రాథమికంగా అంచనా వేశాయి. ఈ మేరకు సంబంధిత ఉద్యోగుల వివరాలు సేకరించడంలో నిమగ్నమయ్యాయి. సాక్షి, కరీంనగర్ : ఈ నెల 24న కరీంనగర్ వచ్చిన టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్.. జిల్లాలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించి టీఆర్ఎస్ వార్రూమ్, టీఎన్జీవో గ్రీవెన్స్సెల్కు సమాచారం ఇవ్వాలని ఉద్యోగ సంఘాలకు సూచించారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరిగే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. నాలుగో తరగతి నుం చి పదో తరగతి వరకు తెలంగాణలో విద్యాభ్యాసం చేసిన సీమాంధ్రులకు స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుంది. వారికి మాత్రమే స్థానికేతర సమస్య నుంచి మినహాయింపు ఉంది. వివరాల సేకరణలో నిమగ్నం జిల్లాలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించడంలో టీఎన్జీవోలు నిమగ్నమయ్యారు. ఇందుకోసం ప్రత్యేకంగా జ్టౌఠజ్చుఃజఝ్చజీ.ఛిౌఝ, ్టజ్ఛౌఠీటఃజఝ్చజీ.ఛిౌఝ వెబ్సైట్ రూపొందించారు. జిల్లాలో 72 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. వీటిలో ఉన్న త, ప్రాథమిక విద్య, పోలీసుశాఖలు మినహాయించి ఇప్పటివరకు 27 శాఖల నుంచి సమాచారం సేకరిం చారు. 350 మంది సీమాంధ్రులు జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించారు. ఇంకా 45 శాఖల నుంచి సమాచారం రావాల్సి ఉంది. ఒక్క సీమాంధ్ర ఉద్యోగిని వదలకుండా అందరి సమాచారం సేకరించాలని టీ ఎన్జీవో జిల్లాశాఖ అన్ని శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ ఉద్యోగులకు సూచించింది. ఆ మూడు శాఖల్లో ఎక్కువ పోలీస్, విద్య, యూనివర్సిటీ లో సింహభాగం మంది సీమాంధ్ర ఉద్యోగులున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 14,400 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో నాలుగు వందలకు పైగా సీమాంధ్రులున్నారు. డీఎస్సీల్లో 80 శాతం రిజర్వేషన్, 20 శాతం ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. 1994 డీఎస్సీ నుంచి 2000 డీఎస్సీ వరకు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 70 శాతం రిజర్వేషన్, 30 శాతం ఓపెన్ కేటగిరీల్లో ఉద్యోగాలి చ్చారు. దీంతో అదనపు కోటా కింద జిల్లాలో 130 మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు పొందారు. వీరందరు గుంటూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచే ఉన్నారు. 2000 మేలో టీడీపీ అధినేత చంద్రబాబు సచివాలయ బదిలీలకు తెరలేపారు. అక్రమ బదిలీలతో 40 మంది కి పైగా ఉపాధ్యాయులు జిల్లాలో వివిధ పాఠశాలల్లో తిష్టవేశారు. వీరితోపాటు ఓపెన్ కేటగిరీ లో ఉద్యోగాలు సాధించిన వారందరూ జిల్లా నుంచి వెళ్లిపోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో 31 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పోలీసు, యూనివర్సిటీలో వందలాది మంది సీమాంధ్రులున్నారు. వీరందరి వివరాలు సేకరిస్తే.. వందలాది పోస్టులు ఖాళీ అవుతాయని ఉద్యోగసంఘాలు పేర్కొంటున్నాయి. సింగరేణి సంస్థలో సీమాంధ్రుల ఆధిపత్యం కొనసాగుతోంది. క్లరికల్, ఇంజినీరింగ్, ఇతర ఉన్నత స్థానాల్లో 90 శాతం అధికారులు సీమాంధ్రకు చెందిన వారే ఉన్నారు. ఆదినుంచి తెలంగాణ వాసులు కింది స్థాయి ఉద్యోగాలకే పరిమితమయ్యారు. జిల్లాలో ఈ ఒక్క సంస్థలోనే సుమారు 320 మంది స్థానికేతరులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నట్టు కార్మిక సంఘాలు వెల్లడిస్తున్నాయి. ఆర్టీసీలోనూ సీమాంధ్రు ఉద్యోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. నాలుగో రోజుల్లో పూర్తి సమాచారం - ఎంఏ.హమీద్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జిల్లాలోని సీమాంధ్ర ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నాం. నాలుగు రోజుల్లో స్థానికేతర ఉద్యోగుల గుర్తిం పు పూర్తవుతుంది. ఇప్పటివరకు 350 మందిని గుర్తిం చాం. జిల్లాలో మొత్తం 1300 మందికి పైగా ఉంటార ని ప్రాథమిక సమాచారం. సింగరేణి, ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థలు కావడం, ప్రత్యేక పాలసీలు ఉండటంతో ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరముంది. -
కేసీఆర్కు అభినందనల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో తిరుగులేని ఆధిక్యతను సాధించిన సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావును వివిధ పార్టీల నేతలు, అధికారులు, ఉద్యోగసంఘాల నేతలు కలసి అభినందనలు తెలిపారు. కేసీఆర్ నివాసం, తెలంగాణభవన్ వద్ద శుక్రవారం ఉదయం నుండే కోలాహలం కనిపించింది. ఐఏఎస్ అధికారులు కృష్ణప్రసాద్, హూడా, రిటైర్డు ఐఏఎస్ అధికారులు కేసీఆర్ను కలిశారు. పోలీసు అధికారుల సంక్షేమ సంఘం నేత రాంనరసింహారెడ్డి, టీఎన్జీవో నేతలు దేవీప్రసాద్, కారెం రవీందర్ రెడ్డి, విఠల్, ఏ. పద్మాచారి,వర్కింగ్ ప్రెసెడెంట్ లచ్చిరెడ్డి, గోపాల్రెడ్డి,ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు. తెలంగాణ భవన్లో మిన్నంటిన సంబురాలు: టీఆర్ఎస్ గెలుపుతో తెలంగాణభవన్ సంబురాలతో మిన్నంటింది. తెలంగాణ భవన్లో పెద్ద టీవీస్క్రీన్ ఏర్పాటు చేశారు. ఫలితాలను ఎప్పటి కప్పుడు అందించారు. టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినప్పుడల్లా కేరింతలు కొడుతూ తమ హర్షం వ్యక్తం చేశారు. బ్యాండు మేళాలు, పెద్ద ఎత్తున బాణాసంచా, నినాదాలు వంటివాటితో తెలంగాణ భవన్ దద్దరిల్లింది. -
‘విభజన’ సమస్యలు పరిష్కరించండి
* సీఎస్ మహంతికి టీఎన్జీవోల నివేదన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తుతున్న వివిధ సమస్యలను తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి దృష్టికి తీసుకెళ్లారు. గురువారం సచివాలయంలో టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవీప్రసాద్, రవీందర్రెడ్డి నేతృత్వంలో యూనియన్ నూతన కార్యవర్గం సభ్యులు సీఎస్ను కలిశారు. ఈ సందర్భంగా సీఎస్ దృష్టికి వారు పలు అంశాలను తీసుకెళ్లారు. సీఎస్ స్పందిస్తూ శాఖల విలీన ప్రతిపాదనలు లేవని చెప్పినట్లు యూనియన్ నేతలు వెల్లడించారు. వారు ప్రస్తావించిన అంశాలు... * ఉద్యోగుల విభజన స్థానికత ఆధారంగా జరిగేలా చర్యలు చేపట్టాలి. రాష్ట్ర స్థాయి అధికారులను స్థానికత ఆధారంగా వెంటనే బదిలీ చేయాలి. జోనల్ స్థాయి, జిల్లా స్థాయి అధికారుల విషయంలోనూ చర్యలు చేపట్టాలి. * జీహెచ్ఎంసీలోని స్థానికేతర అధికారులను బదిలీ చేయాలి. * రాంకీ సంస్థతో జీహెచ్ఎంసీ చేసుకున్న ఒప్పందం రద్దు చేయాలి. * కోఠిలోని వైద్యశాఖ కార్యాలయాన్ని సీమాంధ్రకు కేటాయించే ప్రతిపాదనను రద్దు చేయాలి. * 17న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు తెలంగాణ ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా లేకపోతే వెంటనే ఉద్యమిస్తాం. * సాంఘిక సంక్షేమ, బీసీ, గిరిజన సంక్షేమ హాస్టళ్లను రెసిడెన్షియల్ సొసైటీలో కలిపే ప్రతిపాదనలు వెంటనే ఉపసంహరించుకోవాలి. నూతన కార్యవర్గానికి అభినందన... టీఎన్జీవో కార్యవర్గానికి రెండోసారి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన దేవీప్రసాద్, రవీందర్రెడ్డిలను రాజకీయ జేఏసీ, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు అభినందించారు. సహకార శాఖ, డ్రగ్ కంట్రోల్, వ్యవసాయ విశ్వ విద్యాలయం, వైద్య శాఖ, ఎస్సెస్సీ బోర్డు, ఇంటర్ బోర్డు తదితర శాఖల ఉద్యోగులు సన్మానించారు. -
దెయ్యాలపై పరిశోధన
శ్రీ మహేశ్వరి పరమేశ్వరా క్రియేషన్స్ పతాకంపై నజీరానూరి సమర్పణలో చాంద్ పాషా దర్శకత్వంలో బేగం, ఖాదర్బాబు ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఆనంద్కుమార్, రాజా, కార్తీక్, ‘రోషం’ బాలు, అనూష, స్వప్న ముఖ్య తారలు. బుధవారం జరిగిన ఈ చిత్రం ప్రారంభోత్సవంలో తొలి సన్నివేశానికి దేవీప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా, సాయి వెంకట్ క్లాప్ ఇచ్చారు. వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘దెయ్యాలున్నాయా? అనే అంశంపై ముగ్గురు విద్యార్థులు పరిశోధన చేసి, బంగారు పతకం సాధిస్తారు. దెయ్యాలున్నాయని తేలిందా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రాన్ని ఆగస్ట్లో విడుదల చేస్తాం’’ అన్నారు. ఇది రొమాంటిక్ హారర్ మూవీ అని, 20న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్. సన్నీ, కెమెరా: ఆనంద్ శ్రీరామ్, సహనిర్మాత: సల్మాన్ఖాన్. -
‘ముంపు’ ఉద్యోగులు తెలంగాణకే..
- టీఎన్జీజీవో కార్యవర్గ సమావేశం తీర్మానం - 2న ఘనంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకే కేటాయించాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘ కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. టీఎన్జీవో అధ్యక్షులు దేవీప్రసాద్ అధ్యక్షతన తెలంగాణభవన్లో సోమవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. సమావేశంలో ప్రధానకార్యదర్శి కారం రవీందర్రెడ్డి ప్రతిపాదించిన 11 తీర్మానాలను కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ర్ట విభజన ప్రక్రియ జరుగుతున్నా.. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలను వెల్లడించకపోవడంపై సమావేశం నిరసన వ్యక్తం చేసింది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని, సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలోనే కొనసాగించడానికి తాత్కాలిక జాబితాను రూపొందిస్తే మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది. సమావేశంలో కేంద్ర సంఘం నాయకులు, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. సమావేశం చేసిన తీర్మానాలివీ... - ఎన్నికల్లో ఉద్యోగుల పాత్రకు అభినందనలు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న అన్ని స్థాయిల్లోని ఉద్యోగులు, సిబ్బందికి ఒక నెల వేతనం ప్రోత్సాహకంగా ఇవ్వాలి. - స్థానికత ఆధారంగానే గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం దాకా ఉద్యోగుల విభజన జరగాలి. రాష్ట్ర, జోనల్ స్థాయిలో పనిచేస్తున్నవారిని ఆంధ్రప్రదేశ్కు పంపాలి. - జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవాలి. అమరవీరులకు నివాళులు అర్పించి, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసి, కొత్తరాష్ట్రంలో విధులకు హాజరుకావాలి. - స్థానికత పేరుమీద తప్పుడు ధ్రువపత్రాలను సమర్పిస్తున్నవారిపై సమగ్ర పరిశీలన జరిపి, చర్యలు తీసుకోవాలి. - ఎన్నికల మేనిఫెస్టోల్లో పార్టీలు ఇచ్చిన హామీలను అమలుచేసే విధంగా ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి తేవాలి. - గిర్గ్లానీ నివేదికను, 610 జీవోను అమలుచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. పదో పీఆర్సీ అమలు, ఆరోగ్యకార్డుల జారీ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలి. - పోలవరం ముంపు గ్రామాల ఉద్యోగులను తెలంగాణకే కేటాయించాలి. తెలంగాణలోనే ఉండాలంటూ ముంపు గ్రామాల ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలి. - ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని సంస్కృతిని పెంచడానికి అన్ని జిల్లాల్లో సెమినార్లు నిర్వహించాలి. పనిగంటలతో సంబంధం లేకుండా పనిచేయాలి. - తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాత అన్ని శాఖల్లో జరిగిన ప్రమోషన్లు, నియామకాలపై విచారణ జరపాలి. అక్రమ నియామకాలు, పదోన్నతులను నిలిపివేయాలి. -
'తెలంగాణలో ఆంధ్రా ఉద్యోగుల్ని ఉండనివ్వం'
తెలంగాణలో ఆంధ్రా ఉద్యోగుల్ని ఉండనివ్వబోమని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీ ప్రసాద్ స్పష్టం చేశారు. శనివారం వరంగల్ వచ్చిన దేవీ ప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ... గ్రామస్థాయి నుంచి సచివాలయం వరకు ఉద్యోగుల్ని విభజించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వం సత్వరం చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. అలా కానీ పక్షంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన ఉదమాలను తలదన్నే మరో ఉద్యమాన్ని ప్రారంభించవలసి వస్తుందని దేవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
స్థాయి మరిచి తిట్టేవాడు: దేవీప్రసాద్
* ఉద్యోగుల్లో అభద్రత నింపారు * లేదంటే పనే చేయరని భ్రమించారు * వారి కుటుంబాల్లో కల్లోలం నింపారు * తిట్టడం, కసురుకోవడమే బాబు నైజం * పెన్షనర్ల ఉసురు కూడా పోసుకున్నారు చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వోద్యోగుల్లో అభద్రత నింపారని, వారి కుటుంబాలకు కూడా మనశ్శాంతి లేకుండా చేశారని టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ విమర్శించారు. రిటైర్డు ఉద్యోగులకు కనీసం కరవు భత్యం కూడా ఇవ్వకుండా కర్కశత్వం ప్రదర్శించారన్నారు. ఇప్పుడు ఆయన వూయువూటలు చెప్పినంత మాత్రాన మోసపోలేమని స్పష్టం చేశారు. ఉద్యోగులతో బాబు వ్యవహార శైలిపై దేవీప్రసాద్ అభిప్రాయాలు... చంద్రబాబు తొమ్మిదేళ్ల దుర్మార్గపు పాలనను ప్రభుత్వోద్యోగులు జీవితంలో వురిచిపోరు. వారికి వునశ్శాంతి అనేదే లేకుండా చేసిన పాశవిక పాలన బాబుది. కనీసం ఉద్యోగ భద్రత కూడా లేకుండా చేశారు. భద్రత ఉంటే ఉద్యోగులెవరూ పని చేయురనే తప్పుడు భావనకు లోనై, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు తెర తీశారు. అలా చరిత్రహీనుడిగా మిగిలిపోయూరు. ‘ఉద్యోగులు గానీ, వారి కుటుం బాలు గానీ సంతోషంగా ఉండకూడదు. ఎప్పుడూ అభద్రతా భావంతో, నిత్యం కలత చెందుతూనే ఉండాలి. అప్పుడే ఆఫీసుల్లో పనులు జరుగుతాయి’ అనేది బాబు పైశాచిక ఆలోచన. అందుకే కాంట్రాక్టు నియూవుకాలకు దిగారు. ఖాళీలు రద్దు.. ఔట్సోర్సింగే ముద్దు బాబు పుణ్యమా అని చివరికి పరిస్థితి ఎంతగా దిగజారిందంటే... ఆస్పత్రుల్లో రోగులకు పాలు, రొట్టె వంటివి సరఫరా చేసేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించిన మాదిరిగానే వునుషులు (కాంట్రాక్టు ఉద్యోగాల కోసం) కావాలని కూడా టెండర్లు పిలిచే దుష్ట సంప్రదాయం వచ్చింది. దానికి తెర తీసిన ఘనడు చంద్రబాబు. ఒక్కసారిగా థర్డ్ పార్టీ విధానానికి ఎర్ర తివాచీ పరవడంతో బాబు బంధుగణం, హితులు, స్నేహితుల తాలూకు ఔట్సోర్సింగ్ సంస్థలు పాతిక దాకా పుట్టుకొచ్చారుు. అలా 57 వేల వుంది కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్నారు. వురోపక్క ఉద్యోగ నియూవుకాలకు బాబు పూర్తిగా స్వస్తి పలికారు. నిజంగానే ప్రపంచబ్యాంకు జీతగాని మాదిరిగా ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఉద్యోగ నియూవుకాలపై ఆంక్షలు విధించారు. రిటైర్మెంట్ల వల్ల ఏర్పడే ఖాళీలను పూర్తిగా రద్దు చేసేశారు! పదవీ విరవుణ తర్వాత వాటిని ఆర్నెల్లు ఖాళీగా ఉంచడం... జీరో బేస్డ్ బడ్జెట్ సాకుతో తర్వాత వాటిని రద్దు చేయడం... ఇదీ వరస! ఇలా పలు ప్రభుత్వ శాఖల్లో 70 వేల నుంచి 80 వేల దాకా ఉద్యోగాలను రద్దు చేసిన పచ్చి ఉద్యోగ వ్యతిరేకి చంద్రబాబు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రెవెన్యూ, రోడ్లు-భవనాల శాఖలను సింగపూర్కు చెందిన ఒక సంస్థకు అప్పగించేందుకు కూడా బాబు విశ్వ ప్రయుత్నాలు చేశారు. ఇక ఆర్టీసీని ఎలాగోలా ప్రైవేటీకరించాలని కూడా తహతహలాడారు. తడబడితే సస్పెన్షన్ బాబు పాలనలో ఉద్యోగులకు వేధింపులు, అవహేళలు, అవవూనాలు, సస్పెన్షన్లకు కొదవే లేదు. వుుఖ్యవుంత్రి స్థారుు వ్యక్తి నేరుగా వచ్చి వూట్లాడితే కింది స్థారుులో ఎవరికైనా కాస్త బెరుకు సహజం. కానీ ఉద్యోగులు తన ప్రశ్నలకు వద్ద కాస్త తడబడ్డా బాబు ఏమాత్రం వూనవత్వం లేనట్టుగా వూట్లాడేవారు. పదివుందిలో నిలబెట్టి అవవూనించేవారు. ఒకసారి హైదరాబాద్ బీహెచ్సీఎల్ దగ్గర జెడ్పీ స్కూల్లో బాబు ఆకస్మిక తనిఖీ చేశారు. హెడ్వూస్టర్ను వరుసగా అ ఆలు చెప్పవున్నారు. బిత్తరపోయిన ఆయన, అఆలు చెప్పే క్రమంలో తడబడడంతో ఆయనను ఏకంగా సస్పెండ్ చేశారు బాబు. కరీంనగర్ జిల్లాలో ఒక గ్రామంలో జన్మభూమి కార్యక్రవుం సందర్భంగా ఒక అసిస్టెంట్ ఇంజినీర్ను గ్రావుస్తులకు చూపించి ‘ఈయునెవరో గుర్తించగలరా?’ అని అడిగారు. వారు తెలియుదనడమే తరువాయి, ఊళ్లోకి రాకుండానే, పనులు చేసినట్టుగా చెబుతున్నారనే నిర్ణయూనికి వచ్చి సస్పెన్షన్ వేటు వేశారు. ప్రాణాన్ని బలి తీసుకున్నారు వీడియో కాన్ఫరెన్సులంటే చంద్రబాబుకు వల్లవూలిన ప్రేవు. వారంలో రెండు వుూడుసార్లయినా నిర్వహించేశారు. ఒక కాన్ఫరెన్స్ అయ్యూక దానికి సంబంధించిన సవూచారాన్ని తెప్పించుకోవడంలోనే ఉద్యోగులు తలవుునకలయ్యేవారు. ఆఫీసు పనులు, ప్రజలకు చెందిన ఫైళ్లు పేరుకుపోరుునా పట్టించుకునే సమయం కూడా ఉండేది కాదు. బాబు కోరినట్టే సవూచారాన్ని క్రోడీకరించుకునేవారు. వీడియో కాన్ఫరెన్సులో చిన్న తప్పిదం జరిగినా, ఏదైనా సవూచారం ఇవ్వలేకపోరుునా వుుందూ వెనకా చూడకుండా, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరి వుుందూ తిట్టేవారు. తప్పు లేనప్పుడు వూటెందుకు పడాలనే ఉద్దేశంతో ఏ అధికారైనా నోరు తెరిచి జవాబు చెబితే బాబు సహించేవారు కాదు. ‘ఏం? ఒళ్లెలా ఉంది? పిచ్చపిచ్చగా ఉందా?’ అంటూ అని సీఎం స్థారుుని కూడా వురిచి తిట్టేవారు. ఒకట్రెండుసార్లు ఇలా జరిగాక ఉద్యోగులు ఇంకేం చేయలేక వనాన్నే ఆశ్రయించడం అలవాటు చేసుకున్నారు. ఒక సారి వీడియో కాన్ఫరెన్స్లో బాబు తిట్లతో వునస్తాపానికి గురైన పంచాయుతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఒకరు గుండెపోటుతో వురణించారు. ఫైళ్లు తగులబెట్టించారు కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని నియమించేందుకు కూడా చంద్రబాబుకు చేతులు రాలేదు. ఆ పనుల్ని కూడా అక్కడి ఉద్యోగులతోనే చేయించిన ఘనుడాయన. ఈ నిర్వాకానికి క్లీన్ అండ్ గ్రీన్ అని పేరు కూడా పెట్టారు. మరోవైపు ప్రచారార్భాటాలకు మాత్రం భారీగా ఖర్చు చేస్తూ పోయారు. ఫైళ్ల విలువ కూడా తెలియుని వాళ్లను ఔట్సోర్సింగ్ ద్వారా తీసుకొచ్చి పెట్టారు. వాళ్లు ఎన్నో ఫైళ్లను తగలబె ట్టేశారు. పనికి ఆహార పథకం బియ్యాన్ని మాత్రం అస్మదీయులకు దోచిపెట్టారు. చివరికి జనం ఒక టీడీపీ మంత్రి పేరుకు ముందు ‘బియ్యుం’ అని చేర్చి చెప్పుకున్న పరిస్థితి వచ్చింది. పెన్షనర్లకు కరువు భత్యం వెత ఉద్యోగులపై చంద్రబాబు ఎంతగా కక్ష కట్టారంటే రిటైరైన ఉద్యోగులకు కరవు భత్యం కూడా నిలిపేశారు. ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా ఎనిమిది విడతలు కరవు భత్యం ఇవ్వలేదు. దాంతో నానా ఇక్కట్లకు గురైన వేలాది మంది పెన్షనర్లు... బాబుకు, టీడీపీకి జీవితంలో ఓటేయొద్దంటూతమ బంధువులకు, స్నేహితులకు లేఖలు రాశారు. పెన్షనర్లే కాదు, ఉద్యోగులు కూడా బాబు పాలన తాలూకు దారుణాలను ఇప్పటికీ వురిచిపోలేదు! వైఎస్ రాజశేఖరరెడ్డి వుుఖ్యవుంత్రి అయ్యూక 4.25 లక్షల వుంది పెన్షనర్లకు బాబు నిలిపేసిన తొమ్మిది విడతలతో పాటుగా రూ.3,000 కోట్లకు పైగా కరవు భత్యం చెల్లించారు. ఉద్యోగ నియూవుకాలు జరిపారు. నష్టాల్లో ఉన్న పలు ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల బాట పట్టించారు. - దేవీప్రసాద్, టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు -
ఆప్షన్లకు ఒప్పుకోం:దేవీప్రసాద్
టీ-ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ నల్లగొండ, న్యూస్లైన్: తెలంగాణలో ఈ ప్రాంత ఉద్యోగులే పనిచేయాలని, ఆప్షన్లంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని తెలంగాణ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. బుధవారం నల్లగొండలో జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల విభజనలో 58 : 42 నిష్పత్తిలో పంచుతామంటున్నారని, ఇలా చేస్తే, తెలంగాణ కార్యాలయాల్లో కేవలం 20 శాతం తెలంగాణ ఉద్యోగులు ఉంటారని, ఇటువంటి ప్రక్రియను సహించమన్నారు. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు కేవలం తెలంగాణ ప్రాంత ఉద్యోగులే పనిచేయాలన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలతో సహా, ఇతర పార్టీలకు చెందిన వాళ్లు ఆప్షన్ల విషయంలో తమ అభిప్రాయాలను వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఎన్జీవో రాష్ట్ర జనరల్ సెక్రటరీ కారం రవీందర్రెడ్డి, మహిళా విభాగం చైర్పర్సన్ రేచల్, మందడి పేందర్రెడ్డి, బాణాల రాంరెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పందిరి వెంకటేశ్వరమూర్తి, ఎ. వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో ఎవరికీ మద్దతివ్వం: కోదండరాం
* తటస్థంగా ఉండి తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకుంటాం: టీ జేఏసీ చైర్మన్ కోదండరాం * ఎన్నికల్లో జేఏసీ వైఖరి, నిర్మాణం, పునర్నిర్మాణ ఎజెండాపై స్టీరింగ్ కమిటీ భేటీ * ఏ రాజకీయ పార్టీకి మద్దతిచ్చినా జేఏసీ ఉనికికి ప్రమాదమని నేతల అభిప్రాయం * కొండా సురేఖ, మహేందర్రెడ్డి, బాజిరెడ్డికి టీఆర్ఎస్ టికెట్లపై అభ్యంతరం * 18న మరోసారి భేటీ.. నిర్దిష్టంగా వైఖరి ప్రకటించాలని నిర్ణయం * జేఏసీ కన్వీనరుగా దేవీప్రసాద్.. కో-చైర్మన్గా విఠల్ నియామకం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ మద్దతు ఇవ్వకూడదని.. తటస్థంగానే ఉంటూ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో జేఏసీ పాలుపంచుకోవాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. అంతేగాకుండా సోనియా సహా ఏ పార్టీకి సంబంధించిన ఎన్నికల సభల్లోనైనా జేఏసీ నేతలు పాల్గొనవద్దని నిర్ణయించింది. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్లోని టీఎన్జీవో భవన్లో సోమవారం జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరి, జేఏసీ నిర్మాణం, పునర్నిర్మాణ ఎజెండా, తెలంగాణ రాష్ట్రంలో జేఏసీ పాత్ర తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. జేఏసీలో రాజకీయపార్టీలు ఉండాలా? ప్రజా సంఘాలతోనే జేఏసీని కొనసాగించాలా? జేఏసీ నిర్మాణం, రాజకీయ పార్టీల పట్ల అనుసరించాల్సిన వైఖరి వంటివాటిపై ఈ నెల 18న మరోసారి సమావేశమై నిర్ణయాన్ని ప్రకటించాలని .. జేఏసీ వైఖరిని స్పష్టంగా, నిర్దిష్టంగా, మార్గదర్శకాలను రాతపూర్వకంగా ప్రకటించాలని నిర్ణయించారు. జేఏసీ ఎజెండాను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన కాంగ్రెస్, టీఆర్ఎస్కు ఈ సందర్భంగా జేఏసీ కృతజ్ఞతలు తెలియజేసింది. జేఏసీ ముఖ్యనేతలు దేవీప్రసాద్, మల్లేపల్లి లక్ష్మయ్య, సి.విఠల్, ఎం.నారాయణ, కారెం రవీందర్రెడ్డి, రఘు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. సమైక్యవాదులకు టీఆర్ఎస్ టికెట్లా..? ఇప్పటిదాకా ఉద్యమంలో ఉన్న టీఆర్ఎస్కు వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇస్తే బాగుంటుందని సమావేశంలో కొందరు పేర్కొనగా... సీమాంధ్రలో రాజకీయంగా నష్టపోయిన కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన పి.మహేందర్రెడ్డి, కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్ధన్ వంటివారికి టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిందని... తెలంగాణ ఉద్యమకారులపై దాడులకు దిగిన ఇలాంటి నేతలకు తెలంగాణవాదులు ఎలా మద్దతిస్తారని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు మద్దతిస్తే.. జేఏసీ ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు. ఏదైనా ఒక రాజకీయపార్టీకి మద్దతు ఇస్తే జేఏసీ పునర్నిర్మాణ ఎజెండాను అమలుచేయడంలో ఇబ్బందులు వస్తాయని... జేఏసీ మద్దతిచ్చిన పార్టీ అధికారంలోకి రాకుంటే ఎజెండాను అమలుచేయించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. మొత్తంగా... ఏ పార్టీకీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండాలని అభిప్రాయానికి వచ్చారు. ఇక గతంలో జేఏసీలో పనిచేసి.. ఇప్పుడు వేర్వేరు పార్టీల తరఫున పోటీ పడుతున్న అభ్యర్థుల విషయంలో అనుసరించాల్సిన వైఖరిపైనా చర్చ జరిగింది. తెలంగాణ ఉద్యమకారులు ఏ పార్టీలో ఉన్నా.. వారిని గెలిపించాలని పిలుపు ఇవ్వాలని సమావేశంలో భావించారు. జేఏసీలో కీలకంగా పనిచేసిన నాయకులకు మద్దతుగా కొన్ని సంఘాలు వ్యవహరించే అవకాశముందని.. అయితే, జేఏసీగా బహిరంగ ప్రచారం ఉండకూడదని నిర్ణయించారు. టీడీపీ, బీజేపీ పొత్తు విషయంపైనా చర్చించారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన టీడీపీ, వైఎస్సార్సీపీలను ఓడించాలని పిలుపు ఇవ్వాలని... టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల విషయంలో ఒకే విధంగా వ్యవహరించాలని అభిప్రాయం వ్యక్తమైంది. రాజకీయ సభలకు దూరంగానే.. రాజకీయపార్టీల ఎన్నికల సభకు దూరంగా ఉంటామని సమావేశం అనంతరం కోదండరాం ప్రకటించారు. గతంలో కొన్ని ఎన్నికల సభల్లో పాల్గొన్నా... అది పొరపాటుగా జరిగిందని భావిస్తున్నట్లు చెప్పారు. సోనియా సహా ఎన్నికల సభలకు ఎవరు ఆహ్వానించినా పాల్గొనబోమన్నారు. అయితే సోనియా హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా గౌరవపూర్వకంగా కలిసే అవకాశముందని జేఏసీ నేతలు వెల్లడించారు. ఆదివాసీలను ముంచొద్దు..: మల్లేపల్లి పోలవరం ప్రాజెక్టుతో ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆదివాసీల జీవితాలు ఛిద్రం అవుతాయని మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర విభజన సందర్భంగా ఆప్షన్లు తప్పనిసరి కాదని... అది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని కన్వీనర్ దేవీప్రసాద్, కో-చైర్మన్ సి.విఠల్ అన్నారు. తెలంగాణ సచివాలయం, ఉద్యోగులు, ప్రభుత్వ శాఖల కొనసాగింపు వంటి అధికారాలన్నీ తెలంగాణ ప్రభుత్వానికే ఉండాలన్నారు. అపాయింటెడ్ తేదీ వచ్చే వరకూ ముఖ్యమైన నిర్ణయాలేమీ తీసుకోవద్దని డిమాండ్ చేశారు. జేఏసీ కన్వీనర్గా దేవీప్రసాద్.. తెలంగాణ జేఏసీ కన్వీనర్గా టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ను నియమించినట్టు జేఏసీ చైర్మన్ కోదండరాం వెల్లడించారు. కో-చైర్మన్గా సి.విఠల్, అధికార ప్రతినిధులుగా రఘు, హమీద్ అహ్మద్ఖాన్, కో-కన్వీనర్లుగా వెంకటేశం, ప్రహ్లాద్, జ్ఞానేశ్వర్, వెంకటరెడ్డిలను నియమించినట్లు తెలి పారు. జేఏసీ నిర్మాణంలో కొన్ని అంతర్గత ఖాళీలు ఉన్నాయని.. వాటిని పూరించే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే, జేఏసీ కన్వీనర్గా ఉన్న స్వామిగౌడ్ పదవీ విరమణ చేయడం, తర్వాత టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికకావడంతో... కన్వీనర్ పదవి ఖాళీ అయింది. అప్పటికి కో-చైర్మన్గా ఉన్న వి.శ్రీనివాస్గౌడ్, టీఎన్జీవో అధ్యక్షుడిగా ఎన్నికైన దేవీప్రసాద్ జేఏసీ కన్వీనర్ పదవికోసం పోటీపడ్డారు. ఈ పోటీ రచ్చకెక్కడంతో కొంతకాలం దానిని ఎవరికీ ప్రకటించకుండా ఖాళీగా ఉంచారు. శ్రీనివాస్గౌడ్ ఉద్యోగానికి రాజీ నామా చేసి టీఆర్ఎస్ అభ్యర్థిగా మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ పడుతుండడంతో... కన్వీనర్ పదవిని దేవీప్రసాద్కు అప్పగించారు. అయితే ఈ స్టీరింగ్ కమిటీ సమావేశానికి టీజీవోల సంఘం నుండి ప్రతినిధిని పంపాలని జేఏసీ ఆహ్వానించినా ఎవరూ రాకపోవడం గమనార్హం. -
ఎన్నికల్లో పోటీచేయను: కోదండరాం
కేసీఆర్తో భేటీ.. గంటన్నర చర్చలు ఉద్యమాల్లోనే ఉంటూ పునర్నిర్మాణంలో పాలుపంచుకుంటానన్న జేఏసీ నేత సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావుతో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, టీఎన్జీవో అధ్యక్షులు దేవీ ప్రసాద్ సమావేశమయ్యారు. కేసీఆర్ నివాసంలోనే బుధవారం వీరు సుమారు గంటన్నర పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా చాలా అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. తెలంగాణ బిల్లు ఆమోదానికి ముందు, ఆ తరువాత ఢిల్లీలో జరిగిన పరిణామాలు, కాంగ్రెస్తో జరిగిన చర్చలు, భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య పంపకాలు, సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి, దానికి సంబంధించిన ప్రధానమంత్రి ప్రకటన వంటివాటిపై సుదీర్ఘంగా చర్చించారు. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి లోక్సభ స్థానాల్లో ఏదో ఒక చోటి నుంచి పోటీ చేయాలని కోదండరాంను కేసీఆర్ ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఏర్పాటు కాబోయే ప్రభుత్వాలపై ఒత్తిడి కోసం ప్రజా సంఘాల ఆవశ్యకత ఉందని, అలాంటి ఉద్యమాల్లో ఉంటూ పునర్నిర్మాణం కోసం పాటు పడతానని కోదండరాం సమాధానం ఇచ్చారు. ఢిల్లీలో ఉన్న పరిచయాలతో పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి అవకాశంగా ఉంటుందని, ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావడానికి ఇదొక అవకాశంగా ఈ ప్రతిపాదన చేసినట్టుగా కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ప్రతిపాదన చేసినందుకు కృతజ్ఞతలు అని, పోటీ చేయడానికి ఇబ్బందులు ఉన్నాయని సున్నితంగా తిరస్కరించినట్టుగా కోదండరాం విలేకరులకు వెల్లడించారు. -
త్వరలో కమల్నాథన్ కమిటీ పర్యటన
తర్వాతే ఉద్యోగుల విభజనపై స్పష్టత: టీఎన్జీవోలకు చెప్పిన సీఎస్ సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజనలో అనుసరించాల్సిన విధానంపై కమల్నాథన్ కమిటీ పర్యటన తర్వాతే స్పష్టత వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి టీఎన్జీవో ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధిబృందం సోమవారం సచివాలయంలో సీఎస్తో భేటీ అయింది. ఉద్యోగుల విభజనలో అనుసరించే మార్గదర్శకాలు జారీ చేయాలని, ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళన తొలగించాలని బృందం విజ్ఞప్తి చేసింది. లేదంటే ఉద్యోగుల మధ్య అనవసర ఘర్షణలకు అవకాశముందని, అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొంది. దీనిపై సీఎస్ ప్రతిస్పందిస్తూ.. ‘‘ఉద్యోగుల విభజన ప్రక్రియను పర్యవేక్షించడానికి కేంద్రం ఏర్పాటు చేసిన కమల్నాథన్ కమిటీ త్వరలో రాష్ట్రంలో పర్యటించనుంది. అన్ని ఉద్యోగ సంఘాలతో కమిటీ సమావేశమవుతుంది. మీ సలహాలు, సూచనలు తీసుకుంటుంది. కమిటీ పర్యటన తర్వాతే ఉద్యోగుల విభజన విధానంపై స్పష్టత వస్తుంది’ అని చెప్పినట్టు టీఎన్జీవో నేతలు వెల్లడించారు. -
కాంగ్రెస్తో విలీనం వద్దు: దేవిప్రసాద్
-
గడువు పెంచితే ఊరుకోం: దేవీప్రసాద్
సాక్షి, నల్లగొండ: తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించడానికి గడువు పొడిగిస్తే ఊరుకునేది లేదని, ఈ ప్రాంత ప్రజల ఆగ్రహం కట్టలు తె ంచుకుంటుందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ హెచ్చరించారు. నల్లగొండలో మంగళవారం జరిగిన టీఎన్జీవో-2014 డైరీ ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ చర్చకు గడువు పొడిగించాలనడం అప్రజాస్వామికమని చెప్పారు. ఒకవేళ గడువు పొడిగిస్తే తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులతో సమావేశమై ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యమిచ్చి అసెంబ్లీలో చర్చ జరిపితే, తామే గడువు కావాలని అడిగేవాళ్లని పేర్కొన్నారు. ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలు, సూచనలు చెప్పాల్సింది పోయి, ఓటింగ్ కోసం పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులను చూసి, వీళ్లేనా నాయకులు? అని ముక్కు మీద వేలు వేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగులను, పెన్షనర్లను విభజించాలని డిమాండ్ చేశారు. విభజన పేరుతో ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే మళ్లీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఏపీఎన్జీఓలు తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి అనుమతివ్వడాన్ని దే వీప్రసాద్ తప్పుబట్టారు. తెలంగాణవాదులు ఎటువ ంటి ర్యాలీలు, కార్యక్రమాలు చేపట్టేందుకు ఎందుకు అనుమతివ్వలేదని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడితే తమపై దేశద్రోహం, రైల్వే కేసులు పెట్టిన ప్రభుత్వం.. తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడినా అశోక్బాబుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? 60 రోజుల సీమాంధ్ర ఉద్యమంలో ఒక్కరినైనా అరెస్టు చేశారా? అని ప్రశ్నిం చారు. మరికొన్ని రోజుల్లో సీఎంవి 100 తప్పులు పూర్తవుతాయని, ఆ తర్వాత తప్పుకోక తప్పదని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి బీజేపీపై చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, కలెక్టర్ చిరంజీవులు, ఏపీఎన్జీఓల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారం రవీందర్డ్డ్రి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడారు. -
చివరిదాకా పోరాడుదాం..
=బిల్లు ఆమోదం పొందేవరకు అప్రమత్తంగా ఉండాలి.. =టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ పిలుపు అఫ్జల్గంజ్,న్యూస్లైన్: ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ ఆమోదించిందని సంబరపడకుం డా.. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేవరకు అప్రమత్తంగా ఉండాలి. అప్పటివరకు వివిధ పద్ధతుల్లో పోరాడాల్సిన అవసరముందని’ టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ పిలుపునిచ్చారు. ఎన్నికుట్రలు, విమర్శలు చేసినా ఓపిగ్గా ఉండాలని తెలంగాణవాదులకు సూచించారు. శుక్రవారం నాంపల్లిలోని టీఎన్జీవోభవన్లో తెలంగాణ వాణిజ్యపన్నులశాఖ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం కోలాహలంగా జరిగింది. దేవీప్రసాద్ ముఖ్యఅతిథిగా విచ్చేసి నూతన కార్యవర్గంచే ప్రమాణం చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణఉద్యమంలో వాణిజ్యపన్నులశాఖ టీఎన్జీవోలు క్రీయాశీలకపాత్ర పోషిం చారని, ఉద్యోగుల త్యాగాల వల్లే ఆరుదశాబ్దాల కల సాకారమయ్యే సమయం వచ్చిందన్నారు. టీఎన్జీవో ప్రధానకార్యదర్శి కె.రవీందర్రెడ్డి, హైదరాబాద్జిల్లా అధ్యక్షుడు ముజీబ్, జి.జ్ఞానేశ్వర్, రామినేని శ్రీనివాస్రావు, వెం కట్, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం : అధ్యక్షుడిగా బి.శ్యాం, అసోసియేట్ అధ్యక్షుడు ప్రదీప్కుమార్, ఉపాధ్యక్షులు నర్సింగ్రావు, సురేష్, రవీందర్నాయక్, ప్రధానకార్యదర్శి వేణుగోపాల్రావు, సహాయకార్యదర్శులు సుధీర్రెడ్డి, శ్రీనివాస్రావు, కోశాధికారి హరిప్రసాద్, కార్యనిర్వాహకకార్యదర్శి హరినాథ్, ప్రచారకార్యదర్శి ఎం.ఎ.మన్నన్,కార్యాలయకార్యదర్శి ఎం.శ్రీనివాస్రావు, కార్యవర్గసభ్యులు వెంకటరమణ, సునీత, నారాయణ, పవన్కుమార్లు ప్రమాణస్వీకారం చేశారు. -
భద్రాచలం ప్రజలు ఒంటరి కాదు: దేవీప్రసాద్
భద్రాచలం, న్యూస్లైన్ : తెలంగాణలోనే ఉంటామని పోరాడుతున్న భద్రాచలం ప్రాంత ప్రజలు ఒంటరి కాదని, వారి వెనుక నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ వాసులు ఉన్నారని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. డివిజన్ టీఎన్జీవో ఆధ్వర్యంలో భద్రాచలంలోని తానీషా కల్యాణమండంపం ఆవరణలో సోమవారం రాత్రి జరిగిన ఉద్యోగ గ ర్జన సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. మూడు తరాల పోరాటాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించబోతోందని, ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాట తప్పే నాయకులను భూస్థాపితం చేయాలన్నారు. విభజనతో సంబంధం లేకుండా తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలన్నారు. సీమాంధ్రకు చెందిన సుమారు 1.40 లక్షల మంది తెలంగాణలో పనిచేస్తున్నారని, వీరంతా వెళ్లిపోతే జిల్లాకు చెందిన పది వేల మంది తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వ కొలువులు వస్తాయన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పాలకులు పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం విడిపోతున్న తరుణంలో సీమాంధ్ర నాయకులు ప్యాకేజీల కోసం ఒత్తిడి చేస్తున్నారని, అసలు వారికెందుకు ప్యాకేజీలు ఇవ్వాలని ప్రశ్నించారు. ఇంత కాలం నదీ జలాలు, సహజ వనరులుదోపిడీ చేసినందుకు తెలంగాణ ప్రాంతానికే ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి తెలంగాణ ప్రాంతంలోని నదీ జలాలను, ఉద్యోగాలను దోచుకున్నది సరిపోక, ప్యాకేజీలంటూ గోలచేయటం సిగ్గుచేటన్నారు. కొత్త రాష్ట్రంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు ఎటువంటి అన్యాయం జరగదన్నారు. 1/70, జీవో నంబర్ 3, అలాగే జీవో నంబర్ 68 ఇలా అన్ని రకాల గిరిజన చట్టాలు వారి అభివృద్ధి కోసం పకడ్బందీగా అమలు చేసేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. రిజర్వేషన్ల అమలులో నూరు శాతం అమలయ్యేలా కొత్త ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తామన్నారు. భద్రాచలం ప్రాంత ప్రజల నుంచి నేర్చు కోవాల్సింది ఎంతో ఉందన్నారు. భద్రాచలం తెలంగాణలోనే ఉంచాలని ఈ ప్రాంత వాసులు ముక్కు సూటిగా నేతలను ప్రశ్నించటం, ఇక్కడ జర్నలిస్టులు 72 గంటల పాటు బంద్ చేయటం అభినందనీయమన్నారు. భద్రాచలం డివిజన్ జేఏసీ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో టీజేఏసీ రాష్ట్ర నాయకులు కె రవీందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు, రేచల్, గుంటుపల్లి వేణుగోపాలరెడ్డి డివిజన్ గెజిటడ్ ఉద్యోగుల సంఘం నాయకులు కె సీతారాములు, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఎస్కే గౌసుద్ధీన్, ఆవుల సుబ్బారావు, వెక్కిరాల, ఈశ్వర్,సోమశేఖర్, నలజాల శ్రీనివాస్, రేగలగడ్డ ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాప్రతినిధులు ప్రేక్షకపాత్ర వీడాలి: దేవీ ప్రసాద్
ఖమ్మం కలెక్టరేట్,న్యూస్లైన్: భద్రాచలం డివిజన్ను ఆంధ్రాలో కలపాలనే ప్రతిపాదన విషయంపై జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రేక్షకపాత్ర వీడి ఉద్యమంలోకి రావాలని, ప్రభుత్వంతో ఒక స్పష్టమైన ప్రకటన చేయించాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీ ప్రసాద్ హెచ్చరించారు. భద్రాచలం డివిజన్ను ఖమ్మం జిల్లాలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారం రెండోరోజుకు చేరుకోగా, దేవీప్రసాద్తో పాటు పలువురు నేతలు దీక్షాశిబిరాన్ని సందర్శించి ఏలూరికి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా దేవీప్రసాద్ ప్రసంగిస్తూ భద్రాచలాన్ని కాజేయాలని సీమాంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ నేతలు చూస్తున్నారని ఈ కుయుక్తులను తిప్పికొట్టేందుకు ఏలూరి చేసిన సాహసం అభినందనీయమన్నారు. పోలవరంతో రాముడిని ముంచడానికి సీమాంధ్ర పెట్టుబడిదారులు చేస్తున్న కుట్రలను ఛేదించాలని పిలుపునిచ్చారు. పోలవరం నిర్మాణంతో అస్థిత్వం కోల్పోతామని గిరిజనులు చెబుతుంటే నిర్మించి తీరుతామని చెప్పడం సరికాదన్నారు. ఈ సమస్య ఉద్యోగులది కాదని, ప్రజా ప్రతినిధులు అర్థం చేసుకొని మౌనం వీడి,స్పష్టమైన ప్రకటన చేయించి ఏలూరి దీక్షను విరమింపచేయాలన్నారు. సమస్య పరిష్కారం అయ్యేవరకూ దీక్ష కొనసాగుతుందని దీనికి తమ మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందన్నారు. టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారం రవీందర్రెడ్డి మాట్లాడుతూ ఏలూరి దీక్షతోనైనా ప్రజాప్రతినిధులలో చలనం రావాలన్నారు. భద్రాద్రి రాముడిని తెలంగాణ ప్రభువుగా, దేవుడిగా కొనియాడుతున్నారని, అలాంటి రాముడి జోలికి రావడం తగదన్నారు. సీమాంధ్రుల కుట్రలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. టీఎన్జీవో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు రేఛల్ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించిన ఏలూరి మళ్లీ భద్రాచలం కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైరా శాసన సభ్యురాలు చంద్రావతి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో పాలకు ఎదో ఒక రకంగా ప్రజలను తికమక పెడుతున్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకుడు పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టేందుకు ఏలూరి చేస్తున్న దీక్ష అభినందనీయమన్నారు. ఎక్కువ భూభాగాన్ని దక్కించుకోవాలని సీమాంధ్రులు చూస్తున్నారని, దీనిని ఎదుర్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ల్యాండ్ సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు పవన్,శ్రీనివాస్,ఉద్యోగజేఏసీ అధ్యక్షప్రధాన కార్యదర్శులు కూరపాటి రంగరాజు,నడింపల్లి వెంకటపతిరాజు,టీజీవో జిల్లా అధ్యక్షుడు ఖాజామియా ,టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి గంగవరపు నరేంధర్,రాష్ట్ర కోశాధికారి గుంటుపల్లి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలి : దేవీ ప్రసాద్
సూర్యాపేట, న్యూస్లైన్ : తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లా భద్రాచలం వెళ్తూ సూర్యాపేటలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భద్రాచలం, మునగాలను సీమాంధ్రలో కలుపుకునేందుకు కొందరు సీమాంధ్ర నాయకులు, పెట్టుబడి దారులు కుట్రపన్నుతున్నారని పేర్కొన్నారు. ఆ కుట్రలను బహిర్గతం చేసేందుకు టీఎన్జీఓ కృషి చేస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే భద్రాద్రి రామయ్య ఆలయం పూర్తిగా మునిగి పోతుందని గతంలోనే అనేక ప్రజా సంఘాల వారు వ్యతిరేకత వ్యక్తం చేశారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే పోలవరం నిర్మాణం కోసమే భద్రాచలాన్ని సీమాంధ్రలో కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కేంద్రం సీమాంధ్రుల ఒత్తిడికి లొంగకుండా 119 మంది ఎమ్మెల్యేలున్న తెలంగాణను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు డిసెంబర్ ఒకటో తేదీన ఢిల్లీకి వెళ్లి జీఎంఓ ప్రతినిధులకు సంఘం తరఫున వినతిపత్రాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. సమైక్యవాదులుగా ఉన్న సీపీఎం వారు కూడా భద్రాచలం, మునగాల తెలంగాణలోనే ఉండాలని డిమాండ్ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. విభజన జరిగితే తెలంగాణవారికి ప్రమోషన్లు రావంటూ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అనడంలో అర్ధం లేదన్నారు. సీమాంధ్రుల పాలనలోనే తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ఏర్పాటవుతున్న తరుణంలో రాయల తెలంగాణను తెరపైకి తేవడం సరికాదన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్రెడ్డి మాట్లాడుతూ జీతం కోసం పీఆర్సీ..జీవితం కోసం తెలంగాణ అనే నినాదంతో ఉద్యోగులు ఉద్యమిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ నెల చివరి వరకు ప్రభుత్వం పరిష్కరించకుంటే డిసెంబర్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో టీఎన్జీవోస్ రాష్ట్ర నాయకులు బుచ్చిరెడ్డి, ఉపేందర్రెడ్డి, రేచల్, శ్రీనివాసరావు, శైలజ, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల సంఘం అధ్యక్షులు పందిరి వెంకటేశ్వరమూర్తి, కె.వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామ్రెడ్డి ఉన్నారు. -
భద్రాచలం, మునగాల తెలంగాణలో అంతర్భాగమే
నల్గొండ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్రం కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతుందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ డిసెంబర్ 1న ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలను కలుస్తామన్నారు. భద్రాచలం, మునగాల.... తెలంగాణలో అంతర్బాగమేనని దేవీప్రసాద్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
గవర్నర్ పాలనను అంగీకరించం: దేవీప్రసాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్పై గవర్నర్ పాలనకు అంగీకరించబోమని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ చెప్పారు. కేంద్రపాలిత ప్రాంతంగానూ ఒప్పుకునేది లేదన్నారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల హెల్త్ కార్డులకు సంబంధించిన జీవోలో లోపాలు సరిచేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతిని కలసి విన్నవించినట్లు తెలిపారు. ఓయూ ఉద్యోగులు, మార్కెట్ కమిటీ ఉద్యోగులు, ఎయిడెడ్ ఉద్యోగులకు కూడా హెల్త్కార్డులు వర్తింపజేయాలని సీఎస్కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఒప్పుకోం: శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్లో శాంతిభద్రతల పర్యవేక్షణను గవర్నర్ చేతిలో పెడితే సహించేది లేదని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్ పేర్కొన్నారు. స్వయంపరిపాలన కోరుకుంటున్న తమకు ఈ ప్రతిపాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అలాంటి పాలన ఒక్క రోజు ఉన్నా కూడా సహించబోమని స్పష్టంచేశారు. శుక్రవారం జరిగిన టీజీవో క్యార్యవర్గ సమావేశంలో 12 అంశాలపై తీర్మానాలను ఆమోదించారు. -
'ఏపీభవన్....ఆంధ్రాభవన్గా మారింది'
కరీంనగర్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేస్తున్న దీక్ష ప్రజలను అవమానపరచటమేనని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ఏపీభవన్....ఆంధ్రాభవన్గా మారిందని అన్నారు. రాష్ట్రంలో పరిపాలనకు పక్షవాతం వచ్చిందని దేవీప్రసాద్ వ్యాఖ్యానించారు. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జీఓఎం కమిటీ అస్పష్టంగా ఉందని.... నివేదికకు నిర్ణీత గడువు విధించాలని దేవీ ప్రసాద్ అన్నారు. దినేష్ రెడ్డి వ్యాఖ్యలపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. 1౦వ వేతన సవరణ కోసం ఉద్యమం చేయనున్నట్లు దేవీప్రసాద్ తెలిపారు. -
ఏపీఎన్జీవోల సమ్మెలో స్పష్టత లేదు
హైదరాబాద్ :సీమాంధ్రలో గత రెండు మాసాలనుంచి సమ్మెతో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్న ఏపీఎన్జీవోల పై టీఎన్జీవో నేత దేవీ ప్రసాద్ మండిపడ్డారు. అక్కడ చేస్తున్న సమ్మెలో స్పష్టత కనిపించడం లేదని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లో నిజాంకళాశాలలో నిర్వహిస్తున్న సకలజన భేరీ సభలో దేవీ ప్రసాద్ మాట్లాడారు. ఏపీఎన్జీవోలు ఎందుకు ఉద్యమం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. హైద్రాబాద్ నిజాం కళాశాలలో నిర్వహిస్తున్న సకల జన భేరి సభకు మండలంలోని జగదేవ్పూర్, మునిగడప, ఎరవ్రల్లి, గొల్లపల్లి, తిగుల్, చాట్లపల్లి , పిర్లపల్లి తదితర గ్రామాల నుండి తెలంగాణ వాదులు ఆదివారం భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల జేఏసీ ఆధ్వర్యంలో బస్లు, సుమోలను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ,విద్యుత్ రంగ కార్మికులు ,విద్యార్థి సంఘాల నాయకులు ప్రజలను భారీగా తరలించారు. ఈ సభకు వెళ్లిన వారిలో జేఎసీ నాయకులు తుమ్మ కృష్ణ, విద్యుత్ రంగ కార్మికులు మల్లారెడ్డి, మధు, కృష్ణ, తెలంగాణ వాదులు భిక్షపతి, డి. కృష్ణ, బింగి బాస్కర్, అప్పల ప్రవీణ్ తదితరులు బయిల్దేరి వెళ్లారు. -
హైదరాబాద్ సిర్ఫ్ హమారా
సంగారెడ్డి/హైదరాబాద్, న్యూస్లైన్ : తెలంగాణలో అంతర్భాగమైన హైదరాబాద్ను వదులుకునే ప్రసక్తేలేదని టీఎన్జీఓల రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి కలెక్టరేట్, హైదరాబాద్లోని టీఎన్జీవో కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సీడబ్ల్యూసీ ప్రకటన అనంతరం సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం కొనసాగేందుకు కేంద్రం నాన్చుడు ధోరణే కారణమన్నారు. ఏపీఎన్జీవోల నేత ‘అబద్ధాల అశోక్బాబు’ అని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగుల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను కూడా ఉద్యమంలో పాల్గొంటున్నట్టుగా ప్రభుత్వం అధిష్టానానికి నివేదిక అందిస్తోందని ఆయన ఆరోపించారు. సకల జనుల సమ్మెలో ప్రభుత్వం అనుసరించే విధానాన్నే సీమాంధ్ర ఉద్యమానికి వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ అనే నినాదాన్ని సభ విజయవంతం ద్వారా సీమాంధ్రులకు తెలియజేయాలన్నారు. 29న నిర్వహించే సకలజన భేరిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 26న వరంగల్, 27న నల్లగొండలో భారీ సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సకల జనభేరి పోస్టర్ను దేవీప్రసాద్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అశోక్ బాబూ.. జాగ్రత్త : శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్: తెలంగాణ ఉద్యమంపై.. ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్బాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడి అవమానపరిస్తే సహించేదిలేదని తెలంగాణ జేఏసీ రాష్ట్ర కో-చైర్మన్ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. మహబూబ్నగర్లోని టీఎన్జీవో భవన్లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీఎన్జీవోలది ముమ్మాటికీ ప్రభుత్వం చేయిస్తున్న ఉద్యమమే అని పేర్కొన్నారు. సీమాంధ్రుల గురించి మాట్లాడితే తమ గౌరవాన్ని కించపరుచుకున్న వారమవుతామని చెప్పారు. తెలంగాణ ప్రకటించి 53 రోజులు అవుతున్నా.. ఇంతవరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. కాంగ్రెస్ మరోసారి మోసం చేసే అవకాశాలున్నందున, కాంగ్రెస్ నేతలు మేల్కొని కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. -
హైదరాబాద్ మాదే! : దేవీప్రసాద్
ఆర్మూర్/ఆదిలాబాద్, న్యూస్లైన్ : నాలుగు వందల ఏళ్లుగా తెలంగాణ ప్రాంత ప్రజలు తమ శ్రమశక్తితో నిర్మించుకున్న హైదరాబాద్పై వేరెవ్వరికీ హక్కులేదని, ముమ్మాటికీ హైదరాబాద్ తమదేనని టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్పై ఏపీఎన్జీవోలు ఆధిపత్య, దురహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే తమకు సమ్మతమని, లేనిపక్షంలో విస్ఫోటం తప్పదన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల మౌనమే రాష్ట్ర ఏర్పాటులో జాప్యానికి కారణమన్నారు. ఈ నెల 29న జరిగే సకల జనుల భేరిని ఉద్యోగులు విజయవంతం చేయాలని, అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి ఆత్మగౌరవాన్ని చాటాలని కోరారు. సమావేశం సంఘం కార్యదర్శి రవీందర్రెడ్డి మాట్లాడుతూ ఏపీ ఎన్జీవోలు సమ్మెను విరమించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్లో పెట్టేంత వరకు రాజీలేని పోరాటం చేస్తామని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన టీఎన్జీవోల భేరిలో దేవీప్రసాద్ అన్నారు. -
ఏపీఎన్జీఓలకు సర్కారు ప్రోత్సాహం
కలెక్టరేట్, న్యూస్లైన్ : తెలంగాణ ప్రజల దశాబ్దాల పోరా ట ఆకాంక్షపై కేంద్రం యూటర్న్ తీసుకు న్నా... హైదరాబాద్పై ఇంకేమైనా నిర్ణ యం తీసుకున్నా.. యుద్ధానికి సిద్ధమేనని టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అ న్నారు. సోమవారం నగరంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన టీఎన్జీఓస్ భేరిలో ఆయన మాట్లాడారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు, ఉద్యమా ల ఫలితంగా కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిందన్నారు. ఆ ప్రకటనపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఏపీఎన్జీఓలు హైదరాబాద్లో నిర్వహించిన సేవ్ఆంధ్రప్రదేశ్ సభకు సర్కారే దగ్గరుండి రాచ మర్యాదలు చేసిందని విమర్శిం చారు. ఏపీఎన్జీఓలకు బస్లలో బిర్యాని పొట్లా లు, మినరల్ బాటిల్లు అందించిందన్నారు. సభ నిర్వహణ, స్క్రిప్ట్ అంతా ముఖ్యమంత్రి కనుసన్నుల్లో నడిచిందన్నారు.తెలంగాణ ఉద్యోగుల పోరాటం సీమాంధ్ర ప్రజలపై కాదని స్పష్టం చేశారు. అందుకే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో, మండలాల్లో శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. ఏపీఎన్జీఓలకు తెలంగాణ ప్రాంతంపై అవగాహన లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీఎన్జీఓ అధ్యక్షులు అశోక్బాబు ఒక్కటేనన్నారు. చంద్రబాబు రచించిన స్క్రిప్ట్ను అశోక్బాబు అమలు పరుస్తున్నాడన్నా రు. తెలంగాణ ప్రజలు, ఉద్యోగులపై మొదటి నుంచి వివక్ష కొనసాగుతోందన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాల తరబడి పోరాటం కొనసాగిస్తున్నారన్నా రు. ఈ పోరాటంలో ఎంతో మంది ఉద్యోగులు అరెస్టు అయ్యారని, సస్పెన్షన్లు, డిస్మిస్లు జరి గినా అలుపెరుగకుండా పోరాటం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన, ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 29న హైదరాబాద్లో నిర్వహించతలపెట్టిన సకల జనుల భేరికి లక్షలాదిగా తరలిరావాలన్నారు.సకల జనుల భేరి విజయవంతానికి తెలంగాణలోని అన్ని జిల్లాలో టీఎన్జీఓల భేరి నిర్వహిస్తున్నామన్నారు. 1969 సంవ త్సరం నుంచి టీఎన్జీఓలు తెలంగాణ ఉద్యమంలో ముందున్నారన్నారు. 1969లో 38 రోజులు, 1985లో ఎన్టీఆర్ హయాంలో, 2009 సకల జనులసమ్మెలో తెలంగాణ కోసం గొంతెత్తి టీఎన్జీఓలు పోరా టం చేశారన్నారు. సీడబ్ల్యూసీలో తెలంగాణకు అనుకూలమని తీర్మానం చేసిన అనంతరం కూడా కేంద్రం తెలంగాణ ఏర్పాటులో జాప్యం చేస్తోందన్నారు. మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తన మాతృశాఖలో ఏం జరుగుతుందో కూ డా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారన్నారు.ట్రెజరీ గజిటెడ్ అధికారులు నేటి నుంచిసమ్మొకు పిలుపునిస్తే ఆయన సీమాంధ్ర సమ్మె ఉధృతం గా ఉందంటూ ఢిల్లీలో లాబీలకు దిగారన్నారని విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందన్నారు.జూలై 1 నుంచి పీఆర్సీ ప్రకటించాల్సిన ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోం దన్నారు. ఉద్యోగులందరికీ 45 శాతం ఇంటీరియల్ రిలీఫ్ ఫండ్ విడుదల చేయాలని ఆయ న డిమాండ్ చేశారు. టీఎన్జీఓస్ రాష్ట్ర కార్యాదర్శి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నిజాం కాలం నుంచి తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి ఉం దన్నారు. ఏపీఎన్జీఓలు రెచ్చగొట్టినా తెలంగాణ ఉద్యోగులు మౌనం దాల్చరని, అది బలహీనత అనుకుంటే భ్రమేనన్నారు. మాల మహానాడు అధ్యక్షులు అద్దంకి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సహనాన్ని సీమాంధ్రులు పరీక్షిస్తున్నారన్నారు. నిజంగా తెలంగాణ ప్రజ లు తలుచుకుంటే హైదరాబాద్లో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవ్వరూ వెనక్కి వెళ్లలేకపోయేవారన్నారు. తెలంగాణ కోసం 1969లో 400 మంది, 2009 నుంచి వెయ్యిమందికిపైగా అమరులైనారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం ఏపీఎన్జీఓల అధ్యక్షులు అశోక్బాబుది దింపుడు కల్లెం ఆశ మాత్రమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని యూీ పఏ కాకుంటే ఎన్డీయే ఇచ్చితీరుతుందన్నారు. టీపీఎఫ్ ఉపాధ్యక్షులు వేదకూమార్ మాట్లాడుతూ బడుగు, బలహీన, సామాజిక ఉద్యమం తెలంగాణ ఉద్యమమన్నారు. ఉద్యమానికి ప్రజ లు నాయకత్వం వహిస్తున్నారన్నారు. జేఏసీ జిల్లా చైర్మన్ గోపాల్శర్మ, తెలంగాణ కళాకారుడు రసమయి బాలకిషన్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు గైని గంగారాం, ఎ.కిషన్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కరుణాటి యాదగిరి, బీజేపీ నాయకులు బాపురెడ్డి, బీఎస్ పీ నాయకులు ఎడ్ల రాము, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అధ్యక్షుడు సూర్యప్రకాశ్, జేఏసీ నాయకులు విఠల్రావు, భాస్కర్, లక్ష్మన్, బాబురాం, 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శంకర్, ట్రెజరీ అధ్యక్షులు రాములు, వెయ్యి మంది ఉద్యోగులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ లేకుంటే ఉద్యమమే వృథా : దేవీప్రసాద్
హైదరాబాద్/నిజామాబాద్,న్యూస్లైన్: హైదరాబాద్ మొద టి నుంచి తెలంగాణలో అంతర్భాగమేనని టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. సోమవారం హైదారబాద్లోని జేఎన్టీయూహెచ్ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థివిభాగం ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ కార్యక్రమంలో, నిజామాబాద్లో జరిగిన టీఎన్జీవోల రణభేరిలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తే ఇన్నేళ్ల ఉద్యమానికి అర్థంలేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ను వదులుకునే ప్రసక్తేలేదన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టకుండా కాలయాపన చేయడం వెనుక పాలక, ప్రతిపక్షాల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి 50రోజులు గడుస్తున్నా ఒక అడుగుకూడా కేంద్రం ముందుకు పోలేదన్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. కేంద్రం ఏ మాత్రం వెనుకడుగు వేసినా, హైదరాబాద్ను యూటీ అన్నా యుద్ధం తప్పదని హెచ్చరించారు. ఈనెల 29న హైదరాబాద్లో జరుపతల పెట్టిన సకల జనుల భేరీని విజయవంతం చేయడానికి అన్ని జిల్లాలలో సభలు నిర్వహిస్తున్నామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్బాబు ఒక్కటేనన్నారు. చంద్రబాబు తయారు చేసిన స్క్రిప్ట్ను ఆశోక్బాబు అమలు పరుస్తారని విమర్శించారు. ఏపీఎన్జీవోల సభలకు సర్కారే కొమ్ము కాస్తోందని, నిర్వహణ ఖర్చు భరిస్తోందని, సీమాంధ్ర ఉద్యోగులకు బిర్యానీ, మినరల్వాటర్ ప్యాకెట్లు పంచి పెడుతోందనీ ఆరోపించారు. -
శాంతా, సమరమా?
సాక్షి, హైదరాబాద్: ‘‘రాజ్యంగంపై గౌరవమున్న వారిగా, ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చేవారిగా శాంతికైనా, స్నేహానికైనా మేం సిద్ధం. ఇవేవీ కాకుండా యుద్ధానికి వచ్చినా సిద్ధమే. శాంతి, స్నేహం కావాలో, యుద్ధమే కావాలో సీమాంధ్రులే తేల్చుకోవాలి. సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం నడుపుతున్న ప్రజాప్రతినిధులకు, పెట్టుబడిదారులకు ఇది నా సవాల్’’ అని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. హైదరాబాద్ యూటీ ప్రతిప్రాదనకు నిరసనగా ఆరె కటిక పోరాట సమితి, అమ్మల సంఘం ఇందిరా పార్కు ధర్నా చౌక్లో సోమవారం చేసిన దీక్షలో, సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో టీఎన్జీవో భేటీలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతమంటే మరో సకల జనుల సమ్మెకు టీఎన్జీవోలంతా సన్నద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా ఏకం కావాలన్నారు. ‘‘సీమాంధ్రులు శాడిస్ట్ ప్రేమికుల్లా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ వారికి దక్కదని తెలిసి, తెలంగాణకు కూడా దక్కకుండా కేంద్రపాలిత ప్రాంతం చేయాలని పావులు కదుపుతున్నారు. ఈ కుట్రలు, కుతంత్రాలను ఇకపై సహించేది లేదు. ఈ యూటీ కుట్రలను సంఘటితంగా తిప్పికొట్టాలి. తెలంగాణ కోసం వేలాదిమంది ఆత్మ బలిదానం చేసుకుంటే స్పందించని లోక్సత్తా అధినేత జేపీ ఇప్పుడు తెలుగుతేజం పేరుతో యాత్రలు చేపట్టడం సిగ్గుచేటు. తెలంగాణ పై ప్రధాన ప్రతిపక్షాలు వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నాయి’’ అని ఎద్దేవా చేశారు. అశోక్బాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోల సమ్మెకు చట్టబద్ధత లేదని, అటువంటి సమ్మెకు నాయకత్వం వహిస్తున్న ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్బాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు గంజి వెంకటేశ్వర్లు సోమవారం డిమాండ్ చేశారు. -
ఉమ్మడి రాజధానిపై సీమాంధ్ర నుంచి వ్యతిరేకత
హైదరాబాద్ : ఉమ్మడి రాజధాని విషయంలో సీమాంధ్ర నుంచి వ్యతిరేకత వస్తోందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేసే ప్రతిపాదనకు ఎవరూ ఒప్పుకోవటం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత కింది నుంచి పైస్థాయి వరకూ అందరూ రెండుగా చీలిపోయారని దేవీప్రసాద్ వ్యాఖ్యానించారు. విభజనతో పాటు హైదరాబాద్, వచ్చే సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శేషారెడ్డి మాట్లాడుతూ సాధ్యం కానిది ఏమీ లేదని... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ముఖ్యమంత్రి పోరాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, నేతలు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారే తప్ప, రాబోయే తరం గురించి ఆలోచించటం లేదని శేషారెడ్డి అన్నారు. -
యూటీ అంటే ఉద్యమమే
శాడిస్టు ప్రేమికుల్లా సీమాంధ్ర నేతల కుట్రలు టీఎన్జీవోల నేత దేవీప్రసాద్ హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం(యూటీ)గా మార్చాలని చూస్తే మరో మహోద్యమం తప్పదని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ దేవీప్రసాద్రావు హెచ్చరించారు. యూటీ చేయడంవల్ల ప్రభుత్వంలో స్థానిక ప్రజల భాగస్వామ్యం రద్దవుతుందని, దీన్ని సహించబోమన్నారు. ముల్కీ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం కరీంనగర్లో శాంతి ర్యాలీ, దీక్షల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన టీఎన్జీవోల భవనంలో మీడియాతో మాట్లాడారు. తమకు దక్కనిది ఇతరులకు దక్కకూడదన్న శాడిస్టు ప్రేమికుల్లాగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు హైదరాబాద్ను యూటీ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్లో 7న జరుపతలపెట్టిన శాంతి ర్యాలీకి అనుమతివ్వాలని 10 రోజుల ముందే అనుమతి కోరితే నిరాకరించిన ప్రభుత్వం ఏపీఎన్జీవోల సభకు మాత్రం ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’కు అనుమతి కుట్రే సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట విభజన వద్దంటూ సభ నిర్వహించడం రెచ్చగొట్టడమేనని, హైదరాబాద్ను అశాంతి నగరంగా మార్చే కుట్రలో భాగంగానే ఈ సభకు అనుమతిచ్చారని ఆరోపించారు. తాము గతంలో ఎప్పుడు సభలకు అనుమతి కోరినా చివరి నిమిషం వరకు తేల్చకుండా ఇబ్బంది పెట్టిన పోలీసులు నాలుగు రోజుల ముందే ఈ సభకు ఎలా అనుమతిస్తారన్నారు. అసెంబ్లీ వద్ద గతంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల ఆందోళనలకు అనుమతించలేదని, మంగళవారం సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ధర్నాకు మాత్రం పోలీసులు దగ్గరుండి రక్షణ కల్పించారన్నారు. ప్రభుత్వమే సీమంధ్ర ఉద్యమాన్ని నడుపుతోందన్న విషయం ఇప్పుడు రుజువైందని చెప్పారు. శాంతి ర్యాలీకి టీ మంత్రులే అనుమతి ఇప్పించాలని, ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలకైనా టీ మంత్రులే బాధ్యత వహించాలన్నారు. అనుమతి ఇవ్వకపోయినా ర్యాలీ నిర్వహించి తీరుతామని తేల్చిచెప్పారు. ఉద్యోగుల అపోహలను కేంద్రం పరిష్కరించాలని దేవీప్రసాద్ కోరారు. -
శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వాలి:దేవీ ప్రసాద్
హైదరాబాద్ నగరాన్ని అశాంతి నగరంగా మార్చేందుకే కిరణ్ సర్కార్ 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు అనుమతి ఇచ్చిందని టీఎన్జీవో రాష్ట్రాధ్యక్షుడు దేవీ ప్రసాద్ ఆరోపించారు. బుధవారం ఆయన కరీంనగర్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఏపీఎన్జీవోలకు అనుమతి ఇచ్చినట్లే టీఎన్జీవోలు నిర్వహించే శాంతి ర్యాలీ కూడా అనుమతి ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ ప్రాంత ఉద్యోగులు నిర్వహించే శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వకుంటే తెలంగాణ వ్యాప్తంగా శాంతియుత నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఏడో తేదీన హైదరాబాద్లో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ జరిగితే తదనంతర జరగబోయే పరిణామాలకు తెలంగాణ ప్రాంత మంత్రులే బాధ్యత వహించాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించేందుకు రాష్ట ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని లేదా తమ ప్రాంతానికి బదిలీ చేయాలని దేవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే మరో ఉద్యమం తప్పదని ఆయన కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేస్తున్నారని టీఎన్జీవో నేత దేవీ ప్రసాద్ వ్యాఖ్యానించారు.