Economic Survey
-
ఆర్థిక సర్వే
అన్ని చేతులూ కలిస్తేనే తయారీ దిగ్గజంభారత్ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం, ప్రైవేటు రంగం, విద్యా సంస్థలు, పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) సంస్థలు, ఆర్థిక సంస్థల మధ్య సమన్వయంతో కూడిన సహకారాత్మక చర్యలు అవసరమని ఆర్థిక సర్వే సూచించింది. నియంత్రణలు సడలించడం, అవసరమైన నైపుణ్యాలు, ఉపాధి కల్పన వ్యూహాలు అమలు చేయడం, ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకమైన మద్దతు చర్యలతో భారత పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచొచ్చని అభిప్రాయపడింది. అప్పుడు అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, సవాళ్లను భారత సంస్థలు ఎదుర్కొని రాణించగలవని వివరించింది. బంగారం తగ్గొచ్చు.. వెండి పెరగొచ్చు బంగారం ధరలు ఈ ఏడాది తగ్గొచ్చని, వెండి ధరలు పెరగొచ్చని ఆర్థిక సర్వే అంచనాలు వెల్లడించింది. ప్రపంచ బ్యాంక్ కమోడిటీ మార్కెట్ అవుట్లుక్ 2024 నివేదికను ప్రస్తావిస్తూ. కమోడిటీ ధరలు 2025లో 5.1 శాతం, 2026లో 1.7 శాతం తగ్గుతాయన్న అంచనాలను ప్రస్తావించింది. మెటల్స్, వ్యవసాయ ముడి సరకుల ధరలు స్థిరంగా ఉంటాయని, చమురు ధరలు తగ్గొచ్చని, సహజ వాయువు ధరలు పెరగొచ్చని పేర్కొంది. బంగారం ధరలు తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్పై ప్రభావం చూపించొచ్చని తెలిపింది. దేశం దిగుమతి చేసుకునే కమోడిటీల ధరలు తగ్గడం అది సానుకూలమని, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను తగ్గిస్తుందని అభిప్రాయపడింది. చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాలి.. ఈవీల తయారీలో స్వావలంబన ఎలక్ట్రిక్ వాహనాలు, ఎల్రక్టానిక్స్ తయారీలో స్వావలంబన దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. ముడి సరుకులు, విడిభాగాల కోసం చైనా తదితర కొన్ని దేశాలపై ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గించాలని, సరఫరా వ్యవస్థలోని రిస్్కలను తొలగించే చర్యలు చేపట్టాలని సూచించింది. కీలక విడిభాగాలు, ముడి సరుకులపై అంతర్జాతీయంగా చైనా ఆధిపత్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. సంప్రదాయ వాహనంతో పోల్చి చూసినప్పుడు ఈవీల తయారీలో ఆరు రెట్లు అధికంగా ఖనిజాలను వినియోగించాల్సిన పరిస్థితిని ప్రస్తావించింది. ఈ ఖనిజాల్లో చాలా వరకు మన దగ్గర లభించకపోవడాన్ని గుర్తు చేసింది. ‘‘సోడియం అయాన్, సాలిడ్ స్టేట్ బ్యాటరీలు తదితర అత్యాధునిక బ్యాటరీ సాంకేతిక పరిజ్ఞానాలకు పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) నిధులు పెంచడం ద్వారా స్వావలంబన ఎకోసిస్టమ్ను ప్రోత్సహించాలి. ఈ విభాగంలో మేధో హక్కులను సంపాదించుకోవాలి. బ్యాటరీ రీసైక్లింగ్ సదుపాయాలపై పెట్టుబడులు పెట్టాలి. దీనివల్ల భారత ఆటోమొబైల్ రంగానికి దీర్ఘకాల ప్రయోజనాలు ఒనగూరుతాయి’’అని ఆర్థిక సర్వే సూచించింది. మరోవైపు పర్యావరణ అనుకూల ఇంధనాలకు మళ్లే విషయంలోనూ చైనా దిగుమతులపై అధికంగా ఆధారపడడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణలు సడలించడం ద్వారా దేశీ పరిశ్రమకు మద్దతుగా నిలవాలని సూచించింది. పీఎల్ఐ, ఫేమ్ పథకాలను ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో ఈవీల అవసరాలను తీర్చే విధానాలపై దృష్టి సారించాలని పేర్కొంది. వారానికి 60 గంటలు మించి పని.. ఆరోగ్యానికి హానికరం.. వారానికి 60 గంటలకు మించి పని చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఎకనమిక్ సర్వే పేర్కొంది. ఆఫీస్ డెస్క్ ముందు గంటల తరబడి కూర్చోవడమనేది మానసిక ఆరోగ్యానికి హానికరమని వివరించింది. రోజూ 12 గంటలకు పైగా డెస్క్లోనే గడిపే వారు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఉద్యోగి ఉత్పాదకతకు ఆఫీసులో గడిపిన సమయమే కొలమానమని అభిప్రాయం నెలకొన్నప్పటికీ మెరుగైన జీవన విధానాలు, వర్క్ప్లేస్ సంస్కృతి, కుటుంబ సంబంధాలు మొదలైనవి కూడా ఉత్పాదకతకు కీలకమని సేపియన్ ల్యాబ్స్ సెంటర్ అధ్యయన నివేదికలో వెల్లడైనట్లు ఆర్థిక సర్వే వివరించింది. వారానికి 70–90 గంటలు పని చేయాలన్న ఇన్ఫీ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఎల్అండ్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్న తరుణంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. మెరుగుపడిన విమాన కనెక్టివిటీ కొత్త విమానాశ్రయాలు, ఉడాన్ స్కీముతో దేశీయంగా ఎయిర్ కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. 2020–25 ఆర్థిక సంవత్సరాల మధ్య నిర్దేశించిన రూ. 91,000 కోట్ల పెట్టుబడి వ్యయాల లక్ష్యంలో ఎయిర్పోర్ట్ డెవలపర్లు, ఆపరేటర్లు దాదాపు 91 శాతాన్ని ఖర్చు చేసినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్లో ఏవియేషన్ మార్కెట్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని, భారతీయ ఎయిర్లైన్స్ భారీ స్థాయిలో కొత్త విమానాలకు ఆర్డర్లిచ్చాయని సర్వే వివరించింది. మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ (ఎంఆర్వో) పరిశ్రమకు సంబంధించి భారత్లో ప్లాంట్లను ఏర్పాటు చేయాలంటూ తయారీ కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపింది. రియల్ ఎస్టేట్లో బలమైన డిమాండ్ ఆర్థిక స్థిరత్వం, రహదారులు, మెట్రో నెట్వర్క్ల కల్పన వంటివి దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్ను పెంచినట్టు ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ కోసం ‘రెరా’తోపాటు, జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ఈ రంగానికి మేలు చేసినట్టు తెలిపింది. 2036 నాటికి ఇళ్లకు డిమాండ్ 9.3 కోట్ల యూనిట్లకు చేరుకుంటుందన్న పలు నివేదికల అంచనాలను ప్రస్తావించింది. 2024 మొదటి ఆరు నెలల్లో ఇళ్ల అమ్మకాలు 11 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడాన్ని గుర్తు చేసింది. రెరా రాకతో రియల్ఎస్టేట్ రంగంలో మోసాల నుంచి రక్షణ లభించిందని, పారదర్శకత, సకాలంలో ప్రాజెక్టుల పూర్తికి దారి చూపిందని వివరించింది. ఇళ్ల ప్లాన్లకు ఆన్లైన్ అనుమతులుతో జాప్యం తగ్గి, పారదర్శకత పెరిగినట్టు తెలిపింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లకు(రీట్లు) ప్రోత్సాహం వాణిజ్య రియల్ ఎస్టేట్కు సానుకూలిస్తుందని అభిప్రాయపడింది. 11.6 బిలియన్ డాలర్లకు డేటా సెంటర్ మార్కెట్మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ సేవలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా డేటా సెంటర్ మార్కెట్ 2032 నాటికి 11.6 బిలియన్ డాలర్ల స్థాయికి చేరవచ్చని ఎకనమిక్ సర్వే అంచనా వేసింది. 2023లో ఇది 4.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఐటీ, డిజిటల్ సేవల వ్యవస్థ పటిష్టంగా ఉండటం, రియల్ ఎస్టేట్ ధరలు తక్కువగా వల్ల డేటా సెంటర్ల ఏర్పాటు వ్యయాలు చౌకగా ఉండటం భారత్కు లాభిస్తుందని పేర్కొంది. డేటా సెంటర్ ఏర్పాటుకు ఆ్రస్టేలియాలో సగటున ప్రతి మెగావాట్కు వ్యయాలు 9.17 మిలియన్ డాలర్లుగా, అమెరికాలో 12.73 మిలియన్ డాలర్లుగా ఉండగా భారత్లో 6.8 మిలియన్ డాలర్లేనని సర్వే వివరించింది. జీసీసీల్లో ’గ్లోబల్’ ఉద్యోగాలుభారత్లో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) అంతర్జాతీయ కార్యకలాపాలకి సంబంధించి నియమించుకునే (గ్లోబల్) ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరగనుందని ఆర్థిక సర్వే తెలిపింది. 2030 నాటికి ఇది నాలుగు రెట్లు పెరిగి 30,000కు చేరుతుందని వివరించింది. ప్రస్తుతం ఈ సంఖ్య 6,500గా ఉంది. గత దశాబ్ద కాలంలో భారత్లో జీసీసీ వ్యవస్థ పురోగమించిందని, ప్రోడక్ట్ మేనేజర్లు, ఆర్కిటెక్టుల్లాంటి హై–ఎండ్ ఇంజినీరింగ్ ఉద్యోగాలను కూడా టెక్ నిపుణులు దక్కించుకుంటున్నారని సర్వే తెలిపింది. 2019లో 1,430గా ఉన్న జీసీసీల సంఖ్య 2024 నాటికి 1,700కు పెరిగిందని, వీటిల్లో దాదాపు 19 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని పేర్కొంది.ఏఐతో ఉద్యోగాలకు రిస్కే కృత్రిమ మేథతో (ఏఐ) ఎంట్రీ స్థాయి ఉద్యోగాలకు ముప్పు ఉంటుందని, ముఖ్యంగా జీవనోపాధి కోసం ఉద్యోగాల మీదే ఎక్కువగా ఆధారపడే భారత్లాంటి దేశాల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సరైన ప్రణాళికలు లేకుండా ఉద్యోగుల స్థానాన్ని ఏఐతో భర్తీ చేసేందుకు కంపెనీలు తొందరపడటం శ్రేయస్కరం కాదని ఐఎంఎఫ్ నివేదికను ఉటంకిస్తూ, సూచించింది. ఒకవేళ అలా చేసిన పక్షంలో ఉపాధి కోల్పోయిన వర్కర్లకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకుని, కార్పొరేట్ల లాభాలపై మరింతగా పన్నులు విధించడం, ఇతరత్రా పాలసీపరమైన చర్యలు తీసుకునే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని వివరించింది. ఎఫ్డీలకు అన్ని అడ్డంకులు తొలగాలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) భారత్ మరింతగా ఆకర్షించేందుకు వీలుగా అన్ని అవరోధాలను తొలగించాలని, పన్నుల పరమైన నిలకడను తీసుకురావాలని ఆర్థిక సర్వే సూచించింది. సమీప కాలంలో వడ్డీ రేట్లు, ద్రవ్యల్బోణ ఒత్తిళ్లు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితులు ఉన్నా కానీ, దీర్ఘకాలానికి భారత్ ఎఫ్డీలకు అనుకూల కేంద్రంగా కొనసాగుతుందని అభిప్రాయపడింది. బలమైన దేశ ఆర్థిక మూలాలు, ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాత్మక సంస్కరణలు, కన్జ్యూమర్ మార్కెట్ వృద్ధి సానుకూలతలుగా పేర్కొంది. ఇప్పటికే చాలా రంగాల్లో ఎఫ్డీలను ఆటోమేటిక్ మార్గంలో అనుమతిస్తున్నట్టు తెలిపింది. డిజిటల్ కనెక్టివిటీకి 5జీ దన్నుదేశవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో 5జీ సర్విసులను ప్రవేశపెట్టడంతో పాటు టెలికం మౌలిక సదుపాయాలను, యూజర్ అనుభూతిని మెరుగుపర్చేందుకు నియంత్రణ సంస్థ తీసుకుంటున్న చర్యలతో డిజిటల్ కనెక్టివిటీ మెరుగుపడినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. ప్రస్తుతం 783 జిల్లాలకు గాను 779 జిల్లాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్నట్లు వివరించింది. భారత్ నెట్ ప్రాజెక్టు కింద 2024 డిసెంబర్ నాటికి 6.92 లక్షల కి.మీ. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ) వేసినట్లు పేర్కొంది. -
సంస్కరణల మోత.. వృద్ధికి చేయూత!
భారత ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొంటోందని ఆర్థిక సర్వే కుండబద్దలు కొట్టింది. మన ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగానే ఉన్న నేపథ్యంలో తక్షణం ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేసి, వృద్ధికి చేయూతనివ్వాలంటే... పెట్టుబడులకు అడ్డంకిగా ఉన్న పలు నియంత్రణలను తొలగించడంతో పాటు భూ, కార్మిక తదితర కీలక సంస్కరణలు అమలు చేయాలని తేల్చిచెప్పింది. మరోపక్క, ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, వినిమయం భారీగా పుంజుకునేలా చర్యలు చేపట్టాలని సూచించింది. మరికొద్ది గంటల్లో మోదీ 3.0 సర్కారు కీలక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న తరుణంలో 2024–25 ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్కు సమర్పించారు. న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.3–6.8 శాతానికి పరిమితం కావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఈ ఏడాది వృద్ధి 6.4 శాతానికి పడిపోవచ్చని ఇప్పటికే కేంద్రం ముందస్తు అంచనాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. కరోనా తర్వాత జీడీపీ వృద్ధి రేటు మళ్లీ ఇంతలా బలహీనపడటం ఇదే తొలిసారి. 2023–24 ఏడాదికి వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైంది. కాగా, 2024 నాటికి వికసిత భారత్ (అభివృద్ధి చెందిన దేశం)గా అవతరించాలంటే వచ్చే ఒకట్రెండు దశాబ్దాల పాటు జీడీపీ ఏటా 8 శాతం చొప్పున వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సర్వే నొక్కి చెప్పింది. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించాలంటే పలు రంగాల్లో, ముఖ్యంగా భూ, కార్మిక సంస్కరణలు చేపట్టాలని తెలిపింది. అంతేకాకుండా, జీడీపీలో పెట్టుబడుల శాతాన్ని ఇప్పుడున్న 31 శాతం నుంచి 35 శాతానికి పెంచాల్సిందేనని కూడా పేర్కొంది. తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, బయో టెక్నాలజీ వంటి వర్ధమాన టెక్నాలజీల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని సూచించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 2027–28లో 5 ట్రిలియన్ డాలర్లను, 2029–30లో 6.3 ట్రిలియన్ డాలర్లను తాకే అవకాశం ఉంది. ధరలు దిగొస్తాయి... కొత్త పంట చేతికి రావడం, సీజనల్గా కొన్ని కూర గాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఇక ఆహార ద్రవ్యోల్బణం శాంతించే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఆర్బీఐ ద్రవ్యోల్బణ లక్ష్యం 4%కి అటుఇటుగానే రిటైల్ ద్రవ్యోల్బణం ఉండొ చ్చని పేర్కొంది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అంతర్జాతీయంగా కమోడిటీ ధరల సెగ వంటి రిస్కులు పొంచిఉన్నాయని తెలిపింది. 2024 డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్టమైన 5.2%కి దిగొచ్చింది. అయితే, కూరగాయల ధరల మంటతో ఆహార ద్రవ్యోల్బణం ఇంకా భారీగానే 8.4%గా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తగ్గుతున్నప్పటికీ, భౌగోళిక రాజకీయ రిసు్కలు ఆందోళనకరంగానే ఉన్నా యని కూడా సర్వే పేర్కొంది.నియంత్రణల సంకెళ్లు తెంచాలి... ‘మౌలిక రంగంలో పెట్టుబడులను పెంచాలంటే వ్యవస్థలో పాతుకుపోయిన నియంత్రణ సంకెళ్లను తెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలు కూడా వ్యాపారాలకు అడ్డంకులుగా నిలుస్తున్న పలు నిబంధనలను సరళీకరించడంతో పాటు పలు రకాల టారిఫ్లలో కోత విధించాలి. దేశంలో నవకల్పనలను ప్రోత్సహించి, చిన్న మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) రంగానికి దన్నుగా నిలిచేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. జర్మనీ, స్విట్జర్లాండ్, జపాన్, సింగపూర్ తదితర దేశాల ఆర్థిక విజయంలో ఎస్ఎంఈలు కీలక పాత్ర పోషించాయి. అధిక నియంత్రణ వల్ల ఇన్నోవేషన్, ఆర్థికవ్యవస్థ చురుకుదనానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఈ దిశగా భూ, కార్మిక, తదితర సంస్కరణలు అత్యవసరం’ అని సర్వే పేర్కొంది.సర్వేలో ఇతర ముఖ్యాంశాలు... → దేశంలో సేవల రంగం మంచి పనితీరును కనబరుస్తోంది. తయారీ రంగం మా త్రం కొన్ని ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొంటోంది. → ప్రపంచ ఆర్థిక అనిశి్చతిని సైతం తట్టుకుని మన ఫైనాన్షియల్ రంగం పురోగమిస్తోంది. బ్యాంకులు లాభాలు మెరుగుపడ్డాయి. రుణాలు, డిపాజిట్ల మధ్య వ్యత్యాసం తగ్గుతోంది. → పెట్టుబడులకు దన్నుగా, పొదుపులను మదుపుగా మార్చడంలో, సంపద సృష్టిలో మన క్యాపిటల్ మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2013–14 నుంచి 2023–24 మధ్య ఐపీఓ ద్వారా కంపెనీల లిస్టింగ్లు ఆరు రెట్లు పెరిగాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లకు యువ ఇన్వెస్టర్లే చోదక శక్తిగా నిలుస్తున్నారు. → విదేశాల్లో డిమాండ్ తగ్గడంతో ఎగుమతుల వృద్ధి మందగించింది. మరోపక్క, దేశీయంగా పటిష్ట డిమాండ్తో దిగుమతులు పెరిగాయి. రక్షణాత్మక ధోరణులు పెరిగిపోవడంతో ప్రపంచ వాణిజ్య ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయి. మన ఎగుమతులకు పోటీతత్వం పెంచాలంటే వ్యూహాత్మక వాణిజ్య రోడ్మ్యాప్ అత్యవసరం. → అధిక ప్రభుత్వ వ్యయం, మెరుగుపడుతున్న వ్యాపార విశ్వాసంతో పెట్టుబడులు మళ్లీ పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. → సమృద్ధిగా 640 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఇది 90 శాతం విదేశీ రుణానికి సమానం, అలాగే దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపోతాయి. → వ్యాపారాలకు సానుకూల వాతావరణం కల్పించేలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0లో రాష్ట్రాలు మరింత చొరవ తీసుకోవాలి. క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారంపై ఫోకస్ చేయాలి. → అధిక వృద్ధి పథంలో సాగాలంటే వచ్చే రెండు దశాబ్దాల పాటు మౌలిక రంగంలో పెట్టుబడులను దశలవారీగా పెంచాలి. → కార్పొరేట్ రంగం సామాజిక బాధ్యత విషయంలో మరింతగా దృష్టి సారించాలి. → పప్పు ధాన్యాలు, నూనెగింజలు, టమాటా, ఉల్లి ఉత్పత్తిని పెంచేలా పరిశోధనలు జరగాలి. అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే పంట రకాలను రూపొందించడంతో పాటు పంట దిగుబడి పెంచి, పంట నష్టాలను తగ్గించడంపై దృష్టి పెట్టాలి.వ్యవసాయోత్పత్తి పుంజుకోవడం గ్రామీణ డిమాండ్కు దన్నుగా నిలుస్తోంది. ఆహార ధరలు శాంతించే అవకాశం ఉండటం, స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉన్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో వృద్ధి మళ్లీ పట్టాలెక్కనుంది. భౌగోళిక రాజకీయ, వాణిజ్య అనిశి్చతులతో పాటు కమోడిటీ ధరల షాక్లు మన ఆర్థిక వ్యవస్థకు ప్రధాన అడ్డంకులుగా నిలుస్తున్నాయి. అయినప్పటికీ మనదే ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీ. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే వృద్ధిని పరుగులు పెట్టించాల్సిందే’. – వి. అనంత నాగేశ్వరన్, ప్రధాన ఆర్థిక సలహాదారుపటిష్టమైన దేశీ డిమాండ్, పెట్టుబడులు పుంజుకుంటున్న నేపథ్యంలో వృద్ధి కాస్త మెరుగ్గానే (6.5–6.8%) ఉండొచ్చు. వ్యవసాయ దిగుబడుల జోరు, బలమైన సేవల రంగం వృద్ధికి కీలక చోదకాలు. పాశ్చాత్య దేశాల పాలసీలు, భౌగోళిక–ఆర్థిక అడ్డంకులు సరఫరా వ్యవస్థల రూపురేఖలను మార్చేస్తున్నాయి’. – రుమ్కి మజుందార్, డెలాయిట్ ఇండియా ఎకనమిస్ట్‘భారత్ వృద్ధి రేటు జోరును కొనసాగించాలంటే ప్రపంచ దేశాలతో పోటీతత్వాన్ని పెంచుకోవాల్సిందే. నిర్మాణాత్మక సంస్కరణలు, నియంత్రణల తొలగింపు ద్వారానే ఇది సాధ్యం’ – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
‘ఐటీ’ కటాక్షించేనా?
(సాక్షి, బిజినెస్ డెస్క్, సాక్షి, అమరావతి) : మరి కొద్ది గంటల్లో బడ్జెట్(Budget) ప్రవేశపెట్టనున్న తరుణంలో వెలువడిన కేంద్ర ఆర్థిక సర్వేతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) చేసిన వ్యాఖ్యలు వేతన జీవులు, మధ్య తరగతి వర్గాల్లో ఆశలను పెంచుతున్నాయి. 2014 నుంచి పన్నుల శ్లాబులు మార్చకపోవడం.. మండిపోతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా జీతాలు పెరగని నేపథ్యంలో ఈదఫా వేతన జీవులకు ఊరట లభిస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. శుక్రవారం విడుదలైన ఆర్థిక సర్వే ఇదే సంకేతాలనిచ్చింది. 2023–24లో కంపెనీల లాభాలు 22.3 శాతం పెరగగా ఇదే సమయంలో ఉద్యోగాల కల్పన వృద్ధి 1.3 శాతానికి పరిమితం కావడం.. సంస్థలు వ్యయాల నియంత్రణ పేరుతో సిబ్బంది సంఖ్యతో పాటు వేతనాల్లో కోత పెడుతుండటంపై సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. 2002–03లో దేశ జీడీపీలో 2.1 శాతంగా ఉన్న కార్పొరేట్ కంపెనీల లాభాలు 2023–24 నాటికి ఏకంగా 4.8 శాతానికి చేరుకున్నాయని, ఇదే సమయంలో వేతనాల పెరుగుదల చాలా తక్కువగా ఉండటం ఆర్థిక అసమానతలను పెంచుతుందని సర్వే పేర్కొంది. అయితే దేశ ఆర్థిక పరిస్థితేమీ అంత గొప్పగా లేదు. వృద్ధి నెమ్మదించింది. అమెరికాలో ట్రంప్ విజయం సాధించటమేకాక... భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెంచుతామని బెదిరిస్తున్నారు. స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా విపరీతంగా పెరగటంతో... ఇపుడు బ్లూచిప్, చిన్న, పెద్ద అనే తేడాల్లేకుండా అన్ని కంపెనీల్లోనూ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఫారిన్ ఫండ్స్) తమ వాటాలను అయినకాడికి తెగనమ్మేస్తున్నాయి. ఇక ద్రవ్యోల్బణం పెరుగుతోంది... డాలర్తో పోలిస్తే రూపాయి భారీగా పతనమవుతోంది. నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందే తప్ప తగ్గటం లేదు. ఇలాంటి సమస్యలతో దేశం ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో 2025–26 కేంద్ర బడ్జెట్ను శనివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. ఆమె వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నా... మోదీ ప్రభుత్వం మూడోసారి గెలిచాక ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్.ఎందుకంటే ఎన్నికలు సంవత్సరం మధ్యలో రావటంతో మిగిలిన కాలానికి ఓటాన్ అకౌంట్తో నెట్టుకొచ్చారు. మరి ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవాలంటే సరికొత్త గేమ్ ఛేంజర్ విధానాలు అవసరమన్నది నిపుణుల మాట. ఒకవైపు పేద, మధ్య తరగతి వర్గాలకు తగిన రక్షణ కల్పిస్తూనే.. వృద్ధిని పరుగులెత్తించాల్సిన బాధ్యత ఈసారి బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఏ మేరకు నెరవేరుస్తారన్నదే సర్వత్రా చర్చనీయమవుతోంది.ఆదాయపు పన్నులో మరింత ఊరట!బడ్జెట్ వచ్చిందంటే మధ్య తరగతి ఎదురుచూసేది ఆదాయపు పన్ను సవరణల గురించే. ఈసారి ఆదాయ పన్ను విషయంలో ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలను ప్రకటించే అవకాశముందని సామాజిక మాధ్యమాల్లో రకరకాల కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్ల కిందట ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని తెచ్చింది. ఎలాంటి మినహాయింపులూ లేకుండా పన్ను శ్లాబులను మాత్రం సవరించింది. పాత పన్ను విధానంలోనైతే గృహ రుణం, స్కూలు ఫీజుల నుంచి మనం చేసిన వివిధ సేవింగ్స్ను కూడా మినహాయించుకునే అవకాశముండేది. కొత్త విధానంలో అలాంటి మినహాయింపులేవీ లేవు. కాకపోతే పన్ను రేట్లు కాస్త తక్కువ. జీతాన్ని బట్టి ప్రస్తుతం ఎవరి లెక్కలు వారు వేసుకుని, ఎవరికి ఏది అనుకూలమంటే దాన్ని ఎంచుకుంటున్నారు. కాకపోతే రెండేళ్లు ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో ఆకర్షణీయమైన మార్పులు చేస్తూ... పాత పన్ను విధానం నుంచి ఎవరికి వారు స్వచ్ఛందంగా కొత్త విధానంలోకి మారేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈసారి పాత విధానం వృథా అనేలా చేసే అవకాశం కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్నుల విధానంలో 72 శాతం మందికి పైగా రిటర్నులు దాఖలు చేశారు. పాత పన్నుల విధానాన్ని రద్దు చేసి.. కొత్త పన్నుల విధానంలో పలు రాయితీలను ప్రకటించడం ద్వారా మధ్య తరగతి ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేయవచ్చన్నది ఆర్థిక మంత్రి ఆలోచనగా ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం... కొత్త విధానంలో రూ.10 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని, రూ.15–20 లక్షల వరకు ఆదాయానికి 25 శాతం కొత్త పన్ను శ్లాబ్ను ప్రవేశపెట్టాలనే వాదనలు బలంగా వస్తున్నాయి. ఆర్థిక మంత్రి గనక ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటే బడ్జెట్లో మధ్య తరగతికి మేలు జరిగినట్లే. బడ్జెట్ సమావేశాల ఆరంభానికి ముందు... శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పన్ను మినహాయింపులపై ఆశలు పెంచేలా ఉన్నాయి. మధ్యతరగతి, పేదలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ... వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పేర్కొనడం గమనార్హం. ఇన్ఫ్రాకు బూస్ట్కొంతకాలంగా ప్రభుత్వం మౌలిక వసతుల నిర్మాణంపై దృష్టి సారించడం వల్ల ఇన్ఫ్రా రంగంమీద ఫోకస్ ఉంటుంది. అయితే ఈ రంగంలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు నిరుత్సాహకరంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చే మూలధన వ్యయం మద్దతును పెంచే అవకాశముంది. వివిధ పరిశ్రమలలో ఇప్పటికే మంచి ఫలితాలను చూపించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని విస్తరించడం ద్వారా తయారీ రంగాన్ని బలోపేతం చేసే అవకాశం కనిపిస్తోంది. వినియోగాన్ని పెంచడం తక్షణ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రైవేట్ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోటీతత్వం ,ఉపాధి అవకాశాలను పెంచే దీర్ఘకాలిక వ్యూహాలపై బడ్జెట్ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.యువత ఉపాధి, కీలక రంగాలకు మద్దతురాబోయే రోజుల్లో లక్షల మంది యువతీ యువకులు డిగ్రీ పట్టాలతో మార్కెట్లోకి వస్తారు. వీళ్లందరికీ ఉద్యోగాలు లభిస్తేనే ఆర్థిక వృద్ధి జోరందుకుంటుంది. ఇందువల్ల ఉద్యోగ కల్పనపై కూడా బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారించే అవ కాశం ఉంది. నిర్మాణం, జౌళి, ఇ–కామర్స్, పర్యాటక రంగాలు పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి.ఈ రంగాలకు బడ్జెట్లో మరిన్ని కేటాయింపులు ఉండొచ్చు. దీనికి అదనంగా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం వారికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరించడం లక్ష్యంగా విధానాలు ప్రకటించచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగానికి ప్రభుత్వం నుంచి నిరంతర సహాయం అందేలా చర్యలు తీసుకునే వీలుంది. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొనే ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం రుణ హామీ పథకాలను విస్తరించడం, ఎగుమతులకు అదనపు ప్రోత్సాహæకాలు అందించడం వంటి చర్యలను పరిశీలించవచ్చు. వీటికి తోడు చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై విధించే పన్నుల సరళీకరణ కూడా బడ్జెట్లో ఉండొచ్చు.వ్యవసాయం, గ్రామీణ ఆర్థికంపై ఫోకస్వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగానికి బడ్జెట్లో ఎక్కువ మద్దతు లభించే అవకాశం ఉంది. రైతులు రుణాలను సులభంగా పొందడానికి ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీ పథకాలను విస్తరించవచ్చు. ఈ రంగానికి మరింత మద్దతుగా, ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి మరిన్ని కేటాయింపులు చేసే అవకాశం ఉంది. పంట నిల్వల కోసం గోదాముల నిర్మాణం, వ్యవసాయ మార్కెటింగ్ కోసం మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వొచ్చు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ వంటి కార్యక్రమాలు నీటిపారుదలను గణనీయంగా పెంచినప్పటికీ, ఇంకా పురోగతికి అవకాశం ఉంది. పరిశోధన, అభివృద్ధితో సహా సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యవస్థలతో వ్యవసాయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే ప్రయత్నం చేయొచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెంచడానికి రైతులకు మరింత మద్దతు అవసరం. గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకి పెరుగుతున్న డిమాండ్ని దృష్టిలో ఉంచుకుని, అందుబాటు గృహాల నిర్మాణం మరో ముఖ్యమైన అంశంగా ఉండొచ్చు. ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ఉపాధి పథకాలకు నిధులు పెంచి, దాని పరిధిని విస్తరించే అవకాశముంది. -
Budget 2025: ఆర్థిక సర్వేలో పని గంటల ప్రస్తావన
వర్క్-లైఫ్ బ్యాలెన్సింగ్ గురించి ఈ మధ్యకాలంలో విస్తృతస్థాయి చర్చ నడుస్తోంది. చైర్మన్, సీఈవో స్థాయిలో ఉన్న వ్యక్తులు నేరుగా స్పందిస్తుండడం.. వాటిపై విమర్శలు-సమర్థనలతో ఈ చర్చ కొనసాగుతోంది. ఈ దరిమిలా ఇవాళ విడుదలైన ఆర్థిక సర్వే సైతం పనిగంటల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది.పని గంటల చర్చలో ఇప్పుడు ఎకనామిక్ సర్వే సైతం భాగమైంది. వారానికి 60 గంటలకు మించి పని చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. వివిధ అధ్యయనాల నివేదికలను ఇందులో ప్రముఖంగా ప్రస్తావించింది. ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం..‘‘ఆఫీసుల్లో ఎక్కువ సేపు గడపడం వల్ల మానసిక శ్రేయస్సుకు మంచిది కాదు. రోజుకు 12, అంతకంటే ఎక్కువ గంటలు పనిచేసే వ్యక్తులు గణనీయమైన స్థాయిలో బాధను అనుభవిస్తున్నారు. వారానికి ఎక్కువ గంటలు పని చేయడం ఆరోగ్యానికి హానికరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ(ILO) అధ్యయనాల నివేదికలూ ఈ విషయాన్నే స్పష్టం చేశాయి... అనధికారికంగా.. ఎక్కువ పని గంటలతో ఉత్పాదకత(Productivity) పెరిగినా.. వారానికి 55-50 గంటల మధ్య పని చేయడం ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమేనని డబ్ల్యూహెచ్వో-ఐఎల్వో సంయుక్త అధ్యయన నివేదిక స్పష్టం చేసింది’’ అని ఆర్థిక సర్వే వెల్లడించింది. అలాగే.. సుదీర్ఘంగా ఒకే దగ్గర ఎక్కువ గంటలు పని చేయడం మానసిక ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుందని సపెయిన్ లాబ్స్ సెంటర్ ఫర్ హుమన్ బ్రెయిన్ అండ్ మైండ్ స్టడీ రిపోర్ట్ను ఎకనామిక్ సర్వే హైలెట్ చేసింది.ఇక.. పని గంటలపై పరిమితులు విధించడం ఆర్థిక వృద్ధికి అవాంతరాన్ని కలిగించొచ్చని సర్వే అభిప్రాయపడింది. అలాగే కార్మికుల సంపాదన సామర్థ్యాన్ని దెబ్బ తీసే అవకాశం లేకపోలేదని తెలిపింది. కాబట్టి సౌకర్యవంతమైన పని గంటల విధానం భారతదేశాన్ని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంచుతుందని.. ఈ చర్యలతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధికి తోడ్పడుతుంది అని ఆర్థిక సర్వే సూచించింది.బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఇవాళ పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. అనంతరం 2024-25 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే. బడ్జెట్కు ముందర దీనిని ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్లోని ఎకనామిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తుంది. -
నిపుణ్ భారత్ ఇనిషియేటివ్పై ఆర్థిక సర్వే ఫోకస్
కేంద్ర బడ్జెట్ 2025ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను విడుదల చేశారు. ఇది భారతదేశ ఆర్థిక పనితీరుతోపాటు భవిష్యత్తు పరిణామాలకు పునాది వేసింది. 2026లో 3వ తరగతి పూర్తి చేసుకునే ప్రతి చిన్నారికి సమగ్ర అక్షరాస్యత కల్పించేందుకు ‘నిపుణ్ భారత్ ఇనిషియేటివ్’ కార్యక్రమాన్ని ఈ సర్వే హైలైట్ చేసింది.నిపుణ్ భారత్ ఇనిషియేటివ్కేంద్ర మంత్రిత్వశాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అనంత్ నాగేశ్వరన్ నిపుణ్ భారత్ ఇనిషియేటివ్పై చర్చించారు. 2026 నాటికి 3వ తరగతి పూర్తి చేసుకునే చిన్నారులకు ఈ ప్రోగ్రామ్ ద్వారా బేసిక్ అక్షరాస్యత, సంఖ్యలపై పూర్తి అవగాహన కల్పించేలా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. విద్యా సవాళ్లను పరిష్కరించడంలో, దేశవ్యాప్తంగా లెర్నింగ్ స్కిల్స్ను మెరుగుపరచడంలో ఈ నిర్ణయం కీలకంగా మారుతుందని భావిస్తున్నారు. ఆర్థిక సర్వేలో పేర్కొన్న విధంగా బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో విజయవంతమైన నిర్దిష్ట కార్యక్రమాలను సీఈఏ హైలైట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉండబోయే కొన్ని కీలకాంశాలు కింది విధంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ఆర్థిక సర్వే 2025 ముఖ్యాంశాలుఉపాధ్యాయ శిక్షణ: బేసిక్ నైపుణ్యాలను సమర్థవంతంగా విద్యార్థులకు అందించడానికి ఉపాధ్యాయులకు విస్తృతమైన శిక్షణను అందించడం.పాఠ్యప్రణాళిక రూపకల్పన: ప్రాథమిక దశ నుంచే అక్షరాస్యత, సంఖ్యలపై నైపుణ్యానికి ప్రాధాన్యమిచ్చే పాఠ్యప్రణాళికను రూపొందించి అమలు చేయడం.సమాజాన్ని భాగస్వామ్యం చేయడం: పిల్లల అభ్యసనకు మద్దతు ఇవ్వడానికి విద్యా ప్రక్రియలో తల్లిదండ్రులు, సమాజాన్ని భాగస్వామ్యం చేయడం.మానిటరింగ్ అండ్ అసెస్మెంట్: బేసిక్ నైపుణ్యాల్లో విద్యార్థుల పురోగతిని పర్యవేక్షించడానికి, వాటిని అంచనా వేయడానికి బలమైన వ్యవస్థలను ఏర్పాటు చేయడం. -
స్టాక్ మార్కెట్కు ఆర్థిక సర్వే ఊతం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఆర్థిక సర్వే 2024-25ను సమర్పించిన అనంతరం దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా నాల్గవ సెషన్లో లాభాలను కొనసాగించాయి. ఇంట్రా-డే గరిష్ఠ స్థాయి 77,549.92 పాయింట్లకు చేరుకున్న తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్ దాని మునుపటి ముగింపుతో పోలిస్తే 740.76 పాయింట్లు లేదా 0.97 శాతం పెరిగి 77,500.57 వద్ద స్థిరపడింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 258.90 పాయింట్లు లేదా 1.11 శాతం పెరిగి 23,508.40 స్థాయిల వద్ద ముగిసింది. ఈరోజు ఇండెక్స్ 23,530.70-23,277.40 రేంజ్లో ట్రేడయింది. నిఫ్టీ50లో టాటా కన్స్యూమర్, భారత్ ఎలక్ట్రానిక్స్, ట్రెంట్, లార్సెన్ & టూబ్రో, కోల్ ఇండియా నేతృత్వంలోని 47 స్టాక్లు 6.24 శాతం వరకు లాభాలను చూశాయి. మరోవైపు భారతీ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ హోటల్స్, ఐసీఐసీఐ బ్యాంక్ 0.82 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్గా నిలిచాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 100, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 సూచీలు వరుసగా 1.89 శాతం, 2.11 శాతంతో బెంచ్మార్క్లను అధిగమించాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ నేతృత్వంలోని అన్ని రంగాల సూచీలు వరుసగా 2.04 శాతం, 2.44 శాతం లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఆటో, పీఎస్యూ బ్యాంక్, రియల్టీ, మెటల్, ఓఎంసీలు, ఎంపిక చేసిన ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు శుక్రవారం 1 శాతంపైగా లాభాలతో ముగిశాయి.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) పార్లమెంట్లో సమర్పించనున్న కేంద్ర బడ్జెట్ 2024-25 కోసం డి-స్ట్రీట్ ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ కారణంగా భారతీయ ఈక్విటీ మార్కెట్ శనివారం ట్రేడింగ్కు తెరిచి ఉంటుంది. -
ఏఐతో ముప్పు ఇదీ.. ఆర్థిక సర్వే హెచ్చరిక!
విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో ప్రయోజనాలు ఎంత ఉన్నా దాని విపరిణామాల పట్ల చాలా మందిలో ఆందోళన ఉంది. ఆరోగ్య సంరక్షణ, పరిశోధన నుండి ఆర్థికాంశాలు, విద్య వరకు ఆర్థికంగా విలువైన చాలా పనులను ఆటోమేట్ చేయడం ద్వారా పరిశ్రమలలో విప్లవాత్మక మార్పులు తెస్తామని ఏఐ డెవలపర్లు హామీ ఇస్తున్నప్పటికీ, ఈ పురోగతి గణనీయమైన విపరిణామాలనూ తీసుకుతో రావచ్చని ఆర్థిక సర్వే 2024-2025 (Economic Survey 2024-2025) హెచ్చరిస్తోంది.ఆర్థిక సర్వే 2024-2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తాజాగా పార్లమెంట్ ముందు సమర్పించారు. ఏఐ పురోగతి ముఖ్యంగా మధ్య, దిగువ ఆదాయ కార్మికులపై ప్రభావాన్ని చూపుతుందని, వివిధ రంగాలలో మానవ నిర్ణయాధికారాన్ని ఏఐ అధిగమించడం వలన పెద్ద ఎత్తున ఉపాధిలో మార్పులు సంభవిస్తాయని ఆర్థిక సర్వే అంచనా వేస్తోంది.ఏమిటీ ఎకనామిక్ సర్వే?ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేది గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థలో జరిగిన పరిణామాలను సమీక్షించే ప్రీ-బడ్జెట్ డాక్యుమెంట్. ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలపై పనితీరు, విధానపరంగా సానుకూల మార్పులను సంగ్రహించి విశదీకరిస్తుంది. అలాగే స్వల్ప, మధ్య కాలానికి ఆర్థిక వ్యవస్థకు ఉన్న అవకాశాలను తెలియజేస్తుంది. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందుగా దీన్ని వెల్లడిస్తారు.ఏఐపై ఆర్థిక సర్వే 2024-25 ఏం చెప్పిందంటే.. ఆరోగ్య సంరక్షణ, పరిశోధన, నేర న్యాయం, విద్య, వ్యాపారం, ఆర్థిక సేవలతో సహా వివిధ రంగాలలో క్లిష్టమైన నిర్ణయం తీసుకోవడంలో ఏఐ మానవ పనితీరును అధిగమించగలదని అంచనా ఉంది. ఇది పెద్ద ఎత్తున మధ్య, దిగువ ఆదాయ కార్మికుల ఉపాధిని ప్రభావితం చేస్తుంది.మునుపటి పారిశ్రామిక, సాంకేతిక విప్లవాలతో పోలిస్తే ప్రస్తుత ఏఐ స్వీకరణ ప్రతికూల ప్రభావాల భయాలు అంతగా కనిపించకపోవచ్చు.భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా సేవా ఆధారితమైన నేపథ్యంలో చిన్న స్థాయి ఐటీ సేవల్లో పనిచేసే ఉద్యోగులకు ఆటోమేషన్ ముప్పు ఉంటుంది. ఎందుకంటే కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి కార్మికులను తొలగించి సాంకేతికతతో భర్తీ చేస్తాయి.ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి సామూహిక సామాజిక ప్రయత్నం అవసరం. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, విద్యాసంస్థల మధ్య సహకారం ద్వారా భారతదేశం బలమైన సంస్థల సృష్టిని వేగవంతం చేయాలి.నైపుణ్య సంస్థలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఉద్యోగులను ఏఐతో కలిసి పనిచేసేలా సన్నద్ధం చేయాలి.ఏఐ ప్రస్తుతం శైశవదశలో ఉన్నందున దాని పునాదులను బలోపేతం చేయడానికి, దేశవ్యాప్త సంస్థాగత ప్రతిస్పందనను సమీకరించడానికి అవసరమైన సమయం దేశానికి లభించింది.విస్తృత-వ్యాప్తి స్వీకరణను సాధించడానికి ముందు ఏఐ డెవలపర్లు అధిగమించాల్సిన కొన్ని సవాళ్లు ఉన్నాయి. ప్రాక్టికాలిటీ, విశ్వసనీయత అనేది డెవలపర్లు పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యలు.యువ, డైనమిక్, సాంకేతిక-అవగాహన ఉన్న జనాభాను పెంచడం ద్వారా పని, ఉత్పాదకతను పెంపొందించడానికి ఏఐని ఉపయోగించగల శ్రామిక శక్తిని సృష్టించగల సామర్థ్యాన్ని భారతదేశం కలిగి ఉంది.కార్మిక శక్తి, సాంకేతికత సరైన మార్గంలో సమతుల్యం అయినప్పుడు, ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. పని భవిష్యత్తు శ్రామిక శక్తి, యంత్ర సామర్థ్యాలను ఏకీకృతం చేసే 'అగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్' చుట్టూ తిరుగుతుంది.లేబర్ మార్కెట్లో ఏఐతో వచ్చే మార్పులు శాశ్వత ప్రభావాలను కలిగి ఉండే అవకాశం ఉన్నందున విధాన నిర్ణేతలు ఆవిష్కరణలను సామాజిక వ్యయాలతో సమతుల్యం చేయాలి. -
ఆర్థిక సర్వే 2025 ముఖ్యాంశాలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న సమగ్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో 2024-25లో జరిగిన వృద్ధిని, భవిష్యత్తు అంచనాలతో 2025 ఆర్థిక సర్వేను శుక్రవారం విడుదల చేశారు. అందులోకి కొన్ని ముఖ్యాంశాలు కింది విధంగా ఉన్నాయి.స్థిరమైన జీడీపీ వృద్ధి: అంతర్జాతీయంగా అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం వాస్తవ జీడీపీ వృద్ధి 2025 ఆర్థిక సంవత్సరంలో 6.3 నుంచి 6.8 శాతం ఉంటుందని అంచనా వేశారు. ఇది దశాబ్ద సగటుకు దగ్గరగా ఉంది.రంగాలవారీ పనితీరు: వ్యవసాయం, పరిశ్రమలు, సేవలతో సహా అన్ని రంగాలు మంచి పనితీరు కనబరుస్తున్నాయి. వ్యవసాయ రంగం బలంగా ఉంది.ద్రవ్యోల్బణం నియంత్రణ: రిటైల్ ద్రవ్యోల్బణం 2024 ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో 4.9 శాతానికి తగ్గింది.బ్యాంకింగ్ రంగం: వాణిజ్య బ్యాంకులు తమ స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్పీఏ) నిష్పత్తిలో స్థిరమైన తగ్గుదలను నమోదు చేశాయి. ఇది 2024 సెప్టెంబర్ చివరి నాటికి 2.6% కనిష్టానికి చేరుకుంది.గ్లోబల్ ఐపీఓ లిస్టింగ్స్: గ్లోబల్ ఐపీఓ లిస్టింగ్స్లో భారత్ వాటా 2023లో 17 శాతం నుంచి 2024 నాటికి 30 శాతానికి చేరింది.మూలధన వ్యయం: 2024 నవంబర్ వరకు మొత్తం మూలధన వ్యయంలో రక్షణ, రైల్వేలు, రోడ్డు రవాణా వాటా 75 శాతంగా ఉంది.ఆహార ద్రవ్యోల్బణం: కూరగాయల ధరల కాలానుగుణంగా భారీ ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఖరీఫ్ సీజన్ వస్తుండడంతో ఆహార ద్రవ్యోల్బణం 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి తగ్గుతుందని భావిస్తున్నారు.బీమా రంగ వృద్ధి: బీమా రంగం 2024 ఆర్థిక సంవత్సరంలో 7.7% వృద్ధి చెంది మొత్తం ఎఫ్డీఐల్లో 62% ఆకర్షించింది.హెల్త్ అండ్ మోటార్ ఇన్సూరెన్స్: భారత బీమా రంగం వృద్ధికి ఆరోగ్యం, మోటారు బీమా గణనీయంగా దోహదపడ్డాయి.ఇదీ చదవండి: తగ్గిన జీడీపీ వృద్ధి అంచనానిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గింది. అయితే వృద్ధిరేటు కొనసాగేందుకు క్షేత్రస్థాయి సంస్కరణలు కొనసాగాలి. ప్రపంచస్థాయిలో పోటీపడే దిశగా మెరుగుపడాలి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్కు సరైన యంత్రాంగం లేకపోతే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.భౌగోళిక, రాజకీయ అస్థిరతల వల్ల డాలర్ బలపడడంతో రూపాయి మారక విలువ పడిపోయింది. 2025లో స్టాక్ మార్కెట్లు కొంత పడిపోయే అవకాశం ఉంది. -
పార్లమెంట్ ముందుకు ఎకనామిక్ సర్వే
-
తగ్గిన జీడీపీ వృద్ధి అంచనా
కేంద్ర బడ్జెట్కు ముందు శుక్రవారం మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025 ఆర్థిక సర్వే 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 6.3-6.8 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.2% వృద్ధిని నమోదు చేసిందన్నారు. దాంతో వరుసగా మూడో ఏటా 7% పైగా వృద్ధి నమోదు చేసినట్లయింది.ఆర్థిక సర్వే 2026 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటును 6.3-6.8% అంచనా వేసింది. ఇది అంతకుముందు సంవత్సరం వృద్ధి కంటే తక్కువగా ఉంది. అంతర్జాతీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పడంలో విధానకర్తలు కీలక పాత్ర పోషించారని ఆర్థిక సర్వే తెలిపింది. సవాలుతో కూడిన అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వృద్ధిని కొనసాగించాలంటే గణనీయమైన ప్రయత్నాలు అవసరమని సర్వే నొక్కి చెప్పింది.ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా వంటి కీలక రంగాలు మంచి పనితీరు కనబరుస్తాయని పేర్కొంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సవాళ్లను ఎదుర్కొంటాయని అంచనా వేసింది. ఆయుష్మాన్ భారత్ పథకం, లక్పతి దీదీ పథకం, ఇండియా ఏఐ మిషన్ సహా ఆర్థిక వృద్ధిని పెంచడానికి ఉద్దేశించిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పురోగతి ఉంటుందని ఈ సర్వే తెలిపింది.ఇదీ చదవండి: జాతికి ముప్పు చేసే టెక్నాలజీలుకేంద్ర బడ్జెట్ 2025 అంచనాలుకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఆదాయపు పన్ను శ్లాబులను సవరించడం, మౌలిక సదుపాయాల వ్యయాన్ని పెంచడం, గ్రామీణాభివృద్ధి, విద్యకు కేటాయింపులను పెంచడం వంటి చర్యలతో జీడీపీ వృద్ధిని ప్రోత్సహించడంపై బడ్జెట్ దృష్టి పెడుతుందని నిపుణులు భావిస్తున్నారు. -
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో రైలు నెట్వర్క్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర బడ్జెట్ ఆర్థిక సర్వే(Union Budget Economic Survey 2025) 2025 సందర్భంగా కీలక ప్రకటన చేశారు. భారతదేశ మెట్రో రైలు నెట్వర్క్ 1,000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించిందని ప్రకటించారు. దాంతో చైనా, యునైటెడ్ స్టేట్స్ తరువాత ప్రపంచంలో ఈ విజయం సాధించిన మూడో అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా భారత్ నిలిచింది.భారతదేశం మెట్రో రైలు నెట్వర్క్ 1,000 కిలోమీటర్లకు చేరడం వల్ల ఎంతో మేలు జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ విస్తరణ పట్టణ రవాణాను పెంచడానికి, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో రద్దీని తగ్గించడానికి వీలైంది. వచ్చే ఐదేళ్లలో ప్రస్తుత నెట్వర్క్ను రెట్టింపు చేసే ప్రణాళికలతో మెట్రో, రాపిడ్ రైల్ ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే గణనీయమైన బడ్జెట్ను కేటాయించింది.ఇదీ చదవండి: మిషన్ మౌసమ్తో వాతావరణ సమాచారంకశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు మార్గం ఏర్పాటు చేసే ప్రయాత్నాల్లో భాగంగా చాలా సవాళ్లు ఎదురయ్యాయని రాష్ట్రపతి తెలిపారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టు పూర్తి చేయడాన్ని ముర్ము ప్రస్తావించారు. 272 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు క్లిష్టమైన భూభాగం కారణంగా అనేక సవాళ్లను ఎదుర్కొందన్నారు. అయినా దీన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల ఈ ప్రాంతంలో కనెక్టివిటీ, ఆర్థిక వృద్ధి పెరుగుతుందని, వస్తువులు, ప్రయాణీకుల రవాణా మెరుగవుతుందని భావిస్తున్నారు. -
సూక్ష్మ సేద్యం.. ఏపీకి 4వ స్థానం
సాక్షి, అమరావతి: గత ఆర్థిక సంవత్సరంలో (2023–24) సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నాలుగో స్థానంలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023–24 సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. సూక్ష్మ సేద్యం పరికరాలు రైతులకు ఇవ్వడం లేదని, సూక్ష్మ సేద్యాన్ని అటకెక్కించారంటూ కూటమి నేతలు ఎన్నికల ముందు చేసిన ఆరోపణల్లో నిజం లేదనే విషయం అదే కూటమి ప్రభుత్వం విడుదల చేసిన సర్వే ఎలుగెత్తి చాటింది. గత ఆర్థిక ఏడాదిలో 2.05 లక్షల ఎకరాలను సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచి్చనట్టు సర్వే తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ రూపంలో రూ.793.67 కోట్లు సాయం అందించిందని, తద్వారా 26 జిల్లాల్లో 75,035 మంది రైతులు ప్రయోజనం పొందారని సర్వే పేర్కొంది. టాప్–20లో ఐదు జిల్లాలు ఏపీవే 2023–24లో సూక్ష్మ సేద్యంలో దేశంలోని టాప్ 20 జిల్లాల్లో ఐదు జిల్లాలు (అనంతపురం, ప్రకాశం, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య) ఏపీలోనే ఉన్నాయని సర్వే పేర్కొంది. వైఎస్సార్ జిల్లా పులివెందుల మండల ఇ–కొత్తపల్లి గ్రామ పంచాయతీ సూక్ష్మ సేద్యంలో ఉత్తమ పద్ధతులు, విధానాలను అమలు చేయడంతో ఆ గ్రామాన్ని ‘వన్ డ్రాప్.. మోర్ క్రాప్’ జాతీయ వర్క్షాపు ప్రశంసించిందని సర్వే పేర్కొంది. సూక్ష్మ సేద్యం ప్రయోజనాలపై అధ్యయనం ప్రకారం 18 నుంచి 20 శాతం వరకు అదనపు విస్తీర్ణం సూక్ష్మ సేద్యం కిందకు తీసుకువచ్చినట్టు తేలిందని, అలాగే 35 నుంచి 60 శాతం ఉత్పాదకత పెరిగిందని, 35 నుంచి 40 శాతం విద్యుత్ ఆదా అయిందని, 40 నుంచి 45 శాతం ఎరువులు ఆదా అయ్యాయని, సాగు వ్యయం 18 శాతం తగ్గిందని, నికరాదాయం 75 శాతం పెరిగిందని సర్వే వివరించింది. సూక్ష్మ సేద్యంతో నీరు, విద్యుత్, ఎరువులు, కూలీ వేతనాల్లో భారీ ఆదాతో పాటు అధిక ఆదాయం లభిస్తోందని పేర్కొంది. సూక్ష్మ సేద్యంలో హెక్టార్కు సాగు వ్యయం రూ.21,500 తగ్గుతుందని, హెక్టార్కు రూ.1,15,000 అదనపు ఆదాయం వస్తుందని సర్వే తెలిపింది. -
అడ్వాంటేజ్ డొనాల్డ్ ట్రంప్.. హారిస్తో ఉత్కంఠ పోరు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పది రోజులే మిగిలి ఉంది. పోలింగ్ తేదీ నవంబర్ 5 దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార హోరు పెరిగింది. పోల్స్ ఫలితాలు కూడా తారుమారవుతున్నాయి. అధ్యక్ష బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకొన్న మొదట్లో వరుస పోల్స్ హారిస్ వైపే మొగ్గు చూపాయి. కానీ తీరా పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ పరిస్థితి క్రమంగా తారుమారు అవుతున్నట్టు కన్పిస్తోంది. కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలోకి వెళ్తున్నారు. అంతేగాక తాజా పోల్స్లో సానుకూలతను పెంచుకున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ట్రంప్, హారిస్ పోరు తారాస్థాయికి చేరుతోంది. మొన్నటిదాకా సర్వేల్లో హారిస్ ఆధిక్యంలో ఉండగా తాజాగా ట్రంప్ కాస్త ముందంజలోకి వచ్చారు. వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా సర్వేలో ట్రంప్ 47 శాతం మద్దతు దక్కించుకోగా హారిస్కు 45 శాతం ఓట్లు పోలయ్యాయి. సీఎన్బీసీ ఆల్ అమెరికన్ ఎకనమిక్ సర్వేలోనూ హారిస్ కంటే ట్రంప్ రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. హోరాహోరీ పోరు సాగుతున్న 7 కీలక స్వింగ్ రాష్ట్రాల్లోనూ తాజా సర్వేల్లో హారిస్ కంటే ట్రంప్ ఒక్క పాయింట్ ఆధిక్యం సాధించారు. డెమొక్రాట్ల కంచుకోటలైన మిషిగన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియాతో పాటు నల్లజాతీయులు, లాటినో ఓటర్లలో ఆయన పట్టు సాధిస్తున్నారు.ఇది డెమొక్రాట్లకు ఆందోళన కలిగిస్తోంది. అయితే ప్రాంతీయ, జాతీయ స్థాయిలో ప్రధాన పోల్స్ అన్నింటినీ విశ్లేషించే రియల్క్లియర్పాలిటిక్స్ ప్రకారం హారిస్ ఇప్పటికీ ట్రంప్పై 0.3 శాతం ఆధిక్యంలో ఉన్నారు. కాకపోతే స్వింగ్ స్టేట్లలో మాత్రం ట్రంప్కే 0.9 శాతం మొగ్గుందని అది తేల్చింది. అమెరికా బెట్టింగ్ మార్కెట్ అయితే ట్రంప్ విజయావకాశాలను ఏకంగా 61 శాతంగా అంచనా వేసింది. హారిస్ గెలిచేందుకు 39 శాతం మాత్రమే చాన్సుందని పేర్కొంది. ట్రంప్పై కొన్ని రోజులుగా హారిస్ తీవ్ర విమర్శలు చేస్తుండటం తెలిసిందే. హిట్లర్ను ప్రశంసించిన ట్రంప్ అంతకంటే నియంత అంటూ దుయ్యబట్టారు. ఆయనో అసమర్థుడని ఎద్దేవా చేశారు. ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తే పర్యవసానాల గురించి పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హారిస్ పాపులర్ ఓట్లను గెలుచుకోవచ్చని సర్వేలంటున్నాయి. కానీ కీలక రాష్ట్రాలను కైవసం చేసుకుంటేనే ఎన్నికల విజయం సాధ్యం. మరోవైపు చాలా రాష్ట్రాల్లో ఓటర్లకు హారిస్పై పలు అంశాల్లో ఇప్పటికీ అభ్యంతరాలున్నాయి. మరోవైపు ముందస్తు ఓటేసిన అమెరికన్ల సంఖ్య 3.1 కోట్లు దాటింది.పెన్సిల్వేనియాలో ట్రంప్ ఆధిక్యంస్వింగ్ రాష్ట్రాల్లో అత్యంత ముఖ్యమైనది పెన్సిల్వేనియా. వాటిలో అత్యధికంగా 19 ఎలక్టోరల్ కాలేజీ ఓటు్లున్న రాష్ట్రం. ఇక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రకటనలపైనే రెండు పార్టీలు కోట్లు వెచ్చించాయి. ఇక్కడి ఓటర్లు ఆర్థిక వ్యవస్థపై చాలా ఆందోళన చెందుతున్నారు. వారు క్రమంగా ట్రంప్ వైపే మొగ్గుతున్నారు. వివాదాస్పద, కుంభకోణాల వ్యక్తిగా ట్రంప్పై విముఖత ఉన్నా ఆయన హయాంలో ఆహారం, పెట్రోల్ ధరలు తక్కువగా ఉండేవని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి మహిళలు మాత్రం హారిస్ పట్ల సానుకూలంగా ఉన్నారు. ‘‘ట్రంప్ వ్యాఖ్యలు, ఆయన ప్రవర్తన దారుణం. ఆయన్ను మరోసారి వైట్హౌస్కు పంపించేదే లేదు’’ అంటున్నారు. కాంగ్రెస్ మాజీ సభ్యురాలు, మాజీ ఉపాధ్యక్షుడు డిక్ షెనీ కూతురు లిజ్ షెనీ వంటివారి ప్రచారం కూడా హారిస్కు ఎంతో కొంత కలిసి రానుంది.‘అబార్షన్ హక్కులు’ ప్రభావం చూపేనా?హారిస్కు అమెరికావ్యాప్తంగా ఉన్న సానుకూలత మహిళా ఓటర్లలో బలమైన ఆధిక్యం. ఆమె అభ్యర్థిత్వమే చరిత్రాత్మకం. కానీ ఆమె దీనిపై ప్రచారం చేసుకోవడం లేదు. మహిళల అబార్షన్ హక్కులకు బలంగా మద్దతిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు ప్రవేశపెట్టిన అత్యంత కఠినమైన అబార్షన్ నిషేధం మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీన్ని రాజ్యాంగంలో చేర్చాలా వద్దా అనే అంశాన్ని పది రాష్ట్రాలు ఓటింగ్కు పెట్టాయి. అలాంటి రాష్ట్రాల్లో అరిజోనాలో హారిస్కు మెజారిటీ వచ్చే అవకాశముంది. అయితే అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగినప్పుడు సృష్టించిన వాతావరణాన్ని హారిస్ బలంగా కొనసాగించలేకపోయినట్టు పోల్స్ చెబుతున్నాయి.డెమొక్రాట్లకు ‘గాజా’ షాక్ట్రంప్కే అరబ్–అమెరికన్ల జయహోకీలక రాష్ట్రాల్లో ఒకటైన మిషిగన్లో అరబ్–అమెరికన్ ఓటర్లు అత్యధికంగా ఉంటారు. 2020లో బైడెన్ కేవలం అక్కడ 1.5 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు, ఇక్కడ అరబ్ అమెరికన్ల జనాభా 3 లక్షలు. గాజా, లెబనాన్లలో ఇజ్రాయెల్ దాడులను నియంత్రించడంలో బైడెన్ విఫలమయ్యారని వారంతా భావిస్తున్నారు. ఈ ప్రభావం నేరుగా డెమొక్రాట్ల అభ్యర్థి హారిస్పై పడేలా ఉంది. ఉపాధ్యక్షురాలిగా హారిస్ కూడా దీనికి బాధ్యురాలేనని వారు భావిస్తున్నారు. డెమొక్రాట్ల కంటే అధిక వామపక్ష భావాలున్న వారిలోనూ ఇదే ధోరణి కనబడుతోంది. ‘‘మేమంతా ట్రంప్కు ఓటేస్తాం. అంతేగాక ఆయనకే ఓటేయాలని ఇతరులకూ చెబుతాం’’ అని వారంటున్నారు. ‘‘మేం ట్రంప్కు ఓటేస్తామని ఏడాది కిందట ఊహించను కూడా లేదు. కానీ ఇప్పుడు డెమొక్రాట్లను క్షమించలేం. హారిస్కు ఓటేసేది లేదు’’ అని స్పష్టంగా చెబుతున్నారు. మిషిగన్లో కార్మికవర్గం, యూనియన్ల ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. తామెవరికీ మద్దతివ్వబోమని ఇప్పటికే కొన్ని యూనియన్లు ప్రకటించాయి. హారిస్పై కొన్ని అభ్యంతరాలున్నా ఆమె తప్ప ప్రత్యామ్నాయం లేదని కొందరు భావిస్తుండటం ఆమెకు కాస్త కలిసొచ్చే అంశం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉపాధి రహిత వృద్ధి వృథాయే!
కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల తరువాత ఎదురైన ఆర్థిక సవాళ్లను అధిగమించి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలబడింది. కాబట్టి భవిష్యత్తులో భారత్ ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశాలు ఉన్నా యని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. స్థిరమైన వృద్ధిరేటుతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనతోనే 2047 నాటికి భారత్ ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకో గలుగుతుంది.ఒక్క సంపద సృష్టితోనే ఏ ఆర్థిక వ్యవస్థా బలంగా ఎదగలేదు. సంపద వృద్ధితో పాటు మానవ వనరుల ప్రమాణాలను పెంచే ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన తోనే ఏ ఆర్థిక వ్యవస్థ అయినా బలంగా ఎదుగుతుంది. కానీ ఆరు దశాబ్దాల ప్రణాళికా యుగంలో భారత దేశంలో వృద్ధిరేటు ఉపాధి రహితంగా మందకొడిగా కొనసాగింది. ఫలితంగా ఉద్యోగ అవకాశాల సృష్టిలో వెనకబడటం వలన దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చింది. 1991 నుండి దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తరువాత ఆర్థిక వృద్ధిరేటు పెరిగినా అది కూడా ఉపాధి రహితంగానే కొనసాగిందనే చెప్పాలి.ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వజ్రోత్సవంలో పాల్గొన్న సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ మాట్లాడుతూ... భారత దేశంలోని ఉద్యోగ ఉపాధి కల్పనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల కల్పనలో భారతదేశం జీ–20 దేశాల కంటే వెనకబడి ఉంది. అలాగే 2010– 20ల మధ్యకాలంలో దేశంలో సగటు వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటే ఉపాధి కల్పన రేటు మాత్రం కేవలం రెండు శాతం గానే ఉంది. అంటే ఇప్పటికీ భారతదేశంలో ఉపాధి రహిత వృద్ధి కొనసాగు తోందని గీతా గోపీనాథ్ కూడా భావిస్తున్నారని చెప్పాలి. సులభతర వ్యాపారం ద్వారా దిగుమతి సుంకాలను తగ్గించి మరింత ప్రైవేటు పెట్టబడులను ఆకర్షించటం ద్వారా ఉద్యోగాల సృష్టి జరగటానికి అవకాశం ఉంటుందని గీతా గోపీనాథ్ సూచిస్తున్నారు.2024– 25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతం నుండి 7 శాతం వరకు ఉండే అవకాశం ఉందని ఆర్థిక సర్వే భావిస్తోంది. అలాగే ప్రపంచ బ్యాంకు కూడా భారత్ వార్షిక వృద్ధి రేటు 6.3 శాతంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. కానీ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్ఐఈ) రిపోర్ట్ ప్రకారంగా 2014లో 5.4 శాతంగా ఉన్న నిరుద్యోగితా రేటు 2024 మొదటి త్రైమాసికానికి 9.2 శాతానికి పెరగటం, పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారంగా 15 ఏళ్లు పైబడిన వయసుగల వారిలో నిరుద్యోగిత రేటు 17 శాతంగా ఉండటం కూడా ఆందోళన కలిగించే అంశం.ఆర్థిక మందగమనం వలన ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ విధానాల వలన ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో జాప్యం వలన నిరుద్యోగ సమస్య తీవ్రత దేశంలో పెరుగుతుందని చెప్పాలి. 3,942 అమెరికన్ డాలర్ల జీడీపీగా ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్... గీతా గోపీనాథ్ చెప్తున్నట్లు 2027 నాటికి జర్మనీ, జపాన్లను కూడా అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగవచ్చు. కానీ ఆ ఎదుగుదల ఉపాధి ఉద్యోగాలను సృష్టించేదిగా ఉంటే యువ భారత్కి ఉపయోగకరంగా ఉంటుంది. – డాక్టర్ తిరునహరి శేషు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం, 98854 65877 -
దీర్ఘకాలిక వృద్ధిని పెంచగలదా?
2023–24 ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందింది. తద్వారా పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్ అత్యంత వేగంగా ముందుకు సాగు తున్న దేశంగా నిలబడింది. దీన్నిబట్టి, గత పదేళ్లలో సాధించినదాని పట్ల కేంద్ర ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నట్టుంది! కానీ అధిక వృద్ధి ఫలాలను పెద్ద సంఖ్యలో ప్రజలు పొందుతున్నారా? బడ్జెట్ రూపకల్పన వారికి అనుగుణంగా జరిగిందా? వృద్ధి ఊపందుకున్నప్పటికీ, పేదరికం కారణంగా వినియోగ డిమాండ్ తక్కువగానే ఉంది. ఈ వృద్ధి నిలకడగా ఉండాలంటే, కార్మికులు మెరుగైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. హ్రస్వ దృష్టితో చూస్తే బడ్జెట్ వాస్తవికంగానే కనబడుతుంది. కానీ దీర్ఘకాలిక వృద్ధిని నిర్ధారించే అంశాలను అది పరిష్కరించకుండా వదిలేసింది.ప్రతి సంవత్సరం, ఆర్థిక సర్వే, బడ్జెట్లను ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి సమ ర్పిస్తుంది. ఈ సర్వే ద్వారా ఆర్థిక వ్యవస్థ ఎలా దూసుకు పోతోందో వివరించేందుకు ప్రయత్నిస్తుంది. బడ్జెట్ ద్వారా, తన మనస్సులో ఏ కార్యాచరణ ప్రణాళిక ఉందో వివరించడానికి ప్రయ త్నిస్తుంది. రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు ఉండాలి: ప్రస్తుత పరిస్థితిలో ఏమి చేయాలి? విషయాలు సరైన దిశలో వెళ్ళే అవకాశం ఉందా? చూస్తుంటే గత పదేళ్లలో సాధించినదానిపట్ల ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నట్టుంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందింది. తద్వారా అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారతదేశాన్ని అత్యంత వేగంగా ముందుకు కదలిపోయేదేశంగా నిలబెట్టింది. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2 శాతమే పెరిగింది. 2024–25లో ప్రధాన ద్రవ్యోల్బణాన్ని 4.5 శాతానికికట్టడి చేయగలమనే విశ్వాసంతో ప్రభుత్వం ఉంది. కానీ ఈ కథ పూర్తిగా ఆశాజనకంగా లేదు. 2023–24లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం 7.5 శాతం వరకు ఉంటూ, మరింత ఆందోళనకరంగా మారింది. మొత్తంమీద, ఈ విషయంలో బాగా పనిచేసినందున, కింది వృద్ధి వ్యూహాన్ని ఆర్థిక సర్వే సూచించింది; తద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవచ్చని చెప్పింది: స్థిరంగావృద్ధి చెందడానికి ప్రైవేట్ రంగం దాని సొంత మూలధనాన్ని ఏర్పాటుచేసుకోవాల్సి ఉంది. దేశంలో హరిత పరివర్తన జరగడా నికి ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహించాలి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తమ వృద్ధిని కొనసాగించేలా ప్రభుత్వం ఖాళీలను పూడ్చాలి. దేశం అభివృద్ధి చెందడానికి వీలుగా నైపుణ్యాల అంతరాన్ని పూరించడానికి ఒక విధానం అవసరం. ఈ విధానాన్ని రూపొందించాలంటే, రాష్ట్ర యంత్రాంగ సమర్థత, వ్యవస్థ ఒకేలా ఉండాలి.ఇది పావు శతాబ్దానికి దీర్ఘకాలిక లక్ష్యం అయితే, మనం ఇప్పుడు ఎక్కడ నుండి ప్రారంభించాలి? ముందుగా, పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. నిర్ణీత తగ్గింపు (స్టాండర్డ్ డిడక్షన్) రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచుతున్నారు. రూ.17,000 వరకు ఉద్యోగులకు ఆదా అయ్యేలా శ్లాబుల్ని మెలితిప్పారు. ఉద్యోగాల్లో చేరేందుకు ప్రొఫెషనల్స్ ప్రోత్సా హకాలు పొందబోతున్నారు. దీని వల్ల రెండు లక్షల మంది యువ కులు ప్రయోజనం పొందనున్నారు. కేవలం జీతం ఆదాయం మాత్రమే కాదు, పెట్టుబడిపై లాభాలు ఆర్జించే వారికి మూలధన లాభాలకు మినహాయింపు కూడా పెరుగుతోంది.ఈ లెక్కన తక్కువ పన్నులు చెల్లించాల్సిన మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్ తోడ్పడుతుంది. తమాషా ఏమిటంటే, ఆదాయపు పన్ను చెల్లించే అవసరం లేని పేదలు, వారు తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిన వస్తువులు అన్నింటికీ వాస్తవ చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఇది జీఎస్టీ పరిధిలోకి వస్తుంది. ఏకాభిప్రాయం సాధించడం ఎల్లప్పుడూ కష్టమైనప్పటికీ, మరిన్ని జీఎస్టీ–అనుబంధ సంస్కరణలను కేంద్రం, రాష్ట్రాలు చేపట్టవచ్చు. అంతేకాకుండా, రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని సెస్ నుండి కేంద్రం ప్రయోజనం పొందడం అన్యాయం. పేద పిల్లలు చదువుకునేలా చేయడం వంటి అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే ప్రాజెక్ట్ల కోసం సేకరించగలిగే మొత్తం ఆదాయం రాష్ట్రాలకు అవసరం.నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూనీ, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీనీ సంతోషపెట్టడానికి అనేక భారీ ప్రాజెక్టులకు కూడా బడ్జెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన ప్రాజెక్టులలో పట్నా–పూర్నియా, బక్సర్–భాగల్పూర్ ఎక్స్ప్రెస్వేలు ఉన్నాయి. అంతేకాకుండా, బిహార్లోని బక్సర్ జిల్లాలో గంగా నదిపై రెండు లేన్ల వంతెనను నిర్మించనున్నారు. అదనంగా, భాగల్పూర్లోని పీర్పైంతిలో 2,400–మెగావాట్ల పవర్ ప్లాంట్ రానుంది. ఆంధ్రప్రదేశ్కు రైల్వే, రోడ్డు మార్గాల ప్రాజెక్టులను ప్రకటించారు. కొత్త రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15,000 కోట్లు ప్రకటించారు.బడ్జెట్ అనేది రాజకీయ చర్య. దానికి స్పష్టమైన లక్ష్యంఉంది. బీజేపీ సంకీర్ణ భాగస్వాములు, మధ్యతరగతి సంతృప్తిచెందేలా చూసుకోవడమే దాని లక్ష్యం. ప్రధాన పార్టీపై ఆధిపత్యం చలాయించే రాజకీయ వ్యాపారుల వెరపులేని ధీమా కారణంగానేసంకీర్ణ భాగస్వాములను సంతోషపెట్టాలనే లక్ష్యం నడుస్తుంటుంది. పూర్తిగా సంఖ్యల పరంగానే, చిన్న మధ్యతరగతి ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేదు. పాలకవర్గం అంతిమ ఉద్దేశ్యం జనబాహు ళ్యాన్నిసంతోషపెట్టడమే.అయితే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి మంచి జరగనుంది. ప్రపంచ వ్యాఖ్యాతలు కూడా భారత్ అధిక వృద్ధి రేటును ప్రశంసించారు. కానీ వృద్ధి నిలకడగా ఉండాలంటే, కార్మికులు మెరుగైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ కీలక సమస్యలను పరిష్కరించడానికి బడ్జెట్ సంకేత పథకాలను మాత్రమే ప్రవేశపెట్టింది. అందుకే, అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్లను బాగా అర్థం చేసుకున్నా, దూరదృష్టితో వ్యవహరించడం లేదనేది మొత్తం భావన.ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతోందనే దానితోసంబంధం లేకుండా, బడ్జెట్ అంచనాలు కూడా పరిష్కరించాల్సిన మూడు సమస్యలను ఎత్తిపట్టాయి. వృద్ధి ఊపందు కున్నప్పటికీ, వినియోగ డిమాండ్ తక్కువగానే ఉంది. పైగా ఉపాధి చాలా వెనుకబడి ఉంది. అధిక ఆర్థిక వృద్ధి ఫలాలను పెద్దసంఖ్యలో ప్రజలు పొంద లేకపోతున్నారా? ఇది కొంచెం ఎక్కువగా సాంకేతికమైనది. తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం అనేది ఛేదించగలిగే టంత దృఢంగా ఉందా?నోట్ల రద్దు, కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో, వృద్ధి రేటు అనుకున్నంత ఎక్కువగా లేదని చాలా మంది వాదించారు. కాబట్టి, ఒక విధంగా, ఆర్థిక వ్యవస్థ కేవలం తేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రజలు ఎక్కువ పొదుపు చేయడం వల్ల కాదు కానీ, రెండు ఎదురుదెబ్బల ఫలితంగా ఆదాయ వనరును కోల్పోయినప్పుడు వారు తీసుకున్న భారీ అప్పును తిరిగి చెల్లించ డానికి ప్రయత్నిస్తున్నందున వినియోగం కుంచించుకుపోయింది. రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నది సమృద్ధిగా ఉన్న సరఫరాల వల్ల కాదు. ప్రజలు తాము కోరుకున్న వాటిని వినియోగించుకోలేక పోవడం వల్ల.ఇక్కడ శక్తిమంతమైన వైరుధ్యం కూడా ఉంది. ఆర్థిక వ్యవస్థ, వ్యాపారాలు బాగా కొనసాగాలంటే, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తక్కు వగా ఉంచాలి. అయితే, ఎక్కువ డిపాజిట్లను సంపాదించడానికి బ్యాంకులు అధిక వడ్డీ రేటును ఎలా చెల్లించగలవు? అందు వల్ల, బ్యాంకులు రుణాలు, పొదుపు మధ్య అసమతుల్యతను చూస్తున్నాయి. మొత్తంమీద, హ్రస్వ దృష్టితో చూస్తే బడ్జెట్ వాస్తవికంగానే కనబడుతుంది. కానీ ఇది మధ్యతరగతి ద్వారా, మధ్యతరగతి కోసం చేసే ఒక కసరత్తు. అది దీర్ఘకాలిక వృద్ధిని నిర్ధారించే అంశాలను పరిష్కరించకుండా వదిలివేసింది.- వ్యాసకర్త సీనియర్ ఆర్థిక విశ్లేషకులు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- సుబీర్ రాయ్ -
ఆర్థికంగా ఏపీ బలోపేతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలోపేతమవుతోందని కేంద్ర ప్రభుత్వం 2023–24 ఆర్థిక సర్వేలో వెల్లడించింది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడాన్ని కొనసాగిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని స్పష్టం చేసింది. ఆర్బీఐ నివేదికలతో పాటు కాగ్ గణాంకాల ఆధారంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అంచనా వేసినట్లు సర్వే నివేదిక తెలిపింది. ఏపీ సహా 23 పెద్ద రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయని.. ద్రవ్య లోటు, అప్పులు భారం తగ్గుతోందని సర్వే నివేదిక స్పష్టం చేసింది.అలాగే ఏపీ సహా పలు రాష్ట్రాల వ్యయంలో నాణ్యత పెరిగిందని.. మూలధన వ్యయంపై ప్రభుత్వాలు దృష్టి సారించడం మెరుగుపడిందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో వివిధ పథకాల ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించారని వెల్లడించింది. మహిళల సాధికారత, సామాజిక భద్రత, ఆరోగ్యం, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలను కల్పించినట్లు తెలిపింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు పాలనాపరమైన సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను చూపించిందని నివేదిక పేర్కొంది.వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజల జీవన నాణ్యతను మెరుగుపడుతోందని.. తద్వారా గ్రామీణ ప్రాంతాలు పురోగతి సాధిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో సాంకేతికత ఆధారంగా దిగుబడి అంచనాలను ఏపీతో పాటు తొమ్మిది రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని.. తద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతోందని నివేదిక తెలిపింది. మొత్తంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనకు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా కితాబిచి్చంది. ఏపీ అప్పు రూ.4.85 లక్షల కోట్లుఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాలు తమ ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టానికి(ఎఫ్ఆర్బీఎం) అనుగుణంగా పరిమితికి లోబడి అప్పులు చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం పార్లమెంట్లో వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖతో పాటు ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు లోబడి రాష్ట్రాల అప్పులు ఉంటాయని ఆయన తెలిపారు. 2024 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.4,85,490 కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. -
Economic Survey 2023-24: ఎఫ్అండ్వో ట్రేడింగ్ ప్రమాదకరం
న్యూఢిల్లీ: ప్రభుత్వం డెరివేటివ్స్ ట్రేడింగ్కు వీలుగా కమోడిటీల జాబితాను విస్తరించినప్పటికీ మార్కెట్లు మరింత అభివృద్ధి చెందేటంతవరకూ బియ్యం, గోధుమలుసహా ఇతర తృణధాన్యాలలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రమాదకరమని ఆర్థిక సర్వే ప్రస్తావించింది. సున్నిత(సెన్సిటివ్) కమోడిటీలను ఫ్యూచర్స్ మార్కెట్లనుంచి ప్రస్తుతానికి పక్కనపెట్టడమే మేలు. అగ్రికల్చర్ ఫ్యూచర్స్ మార్కెట్ ఆయిల్సీడ్స్, కాటన్, బాస్మతి బియ్యం, మసాలా దినుసుల వంటి నాన్సెన్సిటివ్ కమోడిటీలపై దృష్టి పెట్టడం మంచిదని పేర్కొంది. ఇటీవల ప్రభుత్వం డెరివేటివ్స్లోకి కమోడిటీలను 91 నుంచి 104కు పెంచింది. యాపిల్స్, జీడిపప్పు, వెల్లుల్లి, పాలపొడి, వైట్ బటర్ తదితరాలను జాబితాలో కొత్తగా చేర్చింది. కాగా.. చిన్న రైతులతోకూడిన రైతు ఉత్పత్తి సంస్థల(ఎఫ్పీవోలు)ను కమోడిటీ మార్కెట్లతో అనుసంధానించాలి. ప్రభుత్వం, సెబీ, కమోడిటీ ఎక్సే్ఛంజీలు ఎఫ్పీవోలను ప్రోత్సహించాలి. ఆర్థిక అక్షరాస్యత ద్వారా వీటి నైపుణ్యం, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరచాలి. వెరసి అగ్రిడెరివేటివ్స్ ద్వారా రైతులు లబ్ది పొందేందుకు వీలు కలి్పంచాలి.అవకతవకలకు చాన్స్ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్అండ్వో) విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్ల లావాదేవీలు పెరిగితే జూదాల(గ్యాంబ్లింగ్)కు వీలు ఏర్పడుతుందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. డెరివేటివ్స్లో రిటైలర్ల ఆసక్తి పుంజుకోవడం ఆందోళనకర అంశం. అభివృద్ధి చెందుతున్న దేశంలో స్పెక్యులేటివ్ ట్రేడింగ్కు అవకాశంలేదు. కొన్ని సందర్భాలలో అసాధారణ లాభాలకు డెరివేటివ్స్ వీలు కలి్పస్తాయి. అయితే ఇది జూదానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్థిక మంత్రి, సెబీ చీఫ్, స్టాక్ ఎక్సే్ఛంజీలు సైతం రిటైల్ ఇన్వెస్టర్లను హెచ్చరించాయి. తక్కువ తలసరి ఆదాయంగల దేశాలలో ఎఫ్అండ్వో సమర్థనీయంకాదు. దిద్దుబాటుకు అవకాశమున్న మార్కెట్లలో రిటైలర్లకు ఎఫ్అండ్వో ద్వారా అధిక నష్టాలకు వీలుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు సైతం చేటు చేస్తుంది. 2019లో రూ. 217 లక్షల కోట్ల టర్నోవర్ 2024కల్లా రూ. 8,740 ట్రిలియన్లకు చేరడం ఎఫ్అండ్వో విభాగ భారీ వృద్ధిని అద్దం పడుతోంది. అయితే ఇదే కాలంలో ఈక్విటీ నగదు టర్నోవర్ సగటు సైతం రూ. లక్ష కోట్ల నుంచి రూ. 330 లక్షల కోట్లకు ఎగసింది. ఇది కూడా ఆందోళనకర అంశమే. కుటుంబ పొదుపులో 20 శాతం ఫైనాన్షియల్ మార్కెట్లలో పెట్టుబడులకు తరలివస్తోంది. ప్రత్యక్షంగా, మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడులు భారీగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ గతేడాది రూ. 14 లక్షల కోట్లు ఎగసింది. ఏయూఎం రూ. 53.4 లక్షల కోట్లను తాకింది. ఇక సెబీ నివేదిక ప్రకారం 89 శాతంమంది రిటైలర్లు 2022లో డెరివేటివ్స్ ద్వారా సగటున రూ. 1.1 లక్షలు నష్టపోయారు.ఆరోగ్యంతోనే ఆశించిన ప్రయోజనాలు భారత్ అధిక జనాభా నుంచి ఆశించిన ఫలాలను పొందాలంటే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లకుతోడు, మానసిక ఆరోగ్యంపై ప్రభుత్వం, ప్రజలు దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే గుర్తు చేసింది. అధికంగా ప్రాసెస్ చేసిన, చక్కెరలు, కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాల వినియోగంతో సమాజంలో స్థూలకాయం పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో 56.4 శాతం వ్యాధులకు అనారోగ్యకర ఆహార అలవాట్లే కారణమన్న ఐసీఎంఆర్ తాజా అంచనాలను వెల్లడించింది. ప్రజల ఆరోగ్యకర జీవనశైలి, స్థూలకాయం నివారణ కోసం తక్షణం చర్యలు తీసుకోవాలని కోరింది. పట్టణ ప్రాంతాల్లో 29.8 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 19.3 శాతం పురుషులు స్థూలకాయంతో బాధపడుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలను ప్రస్తావించింది. కొన్ని రాష్ట్రాల్లో ఇది మరింత అధికంగా ఉందంటూ.. ఢిల్లీలో 41.3 శాతం మహిళలు, 38 శాతం పురుషుల్లో ఈ సమస్య ఉన్నట్టు పేర్కొంది. మానసిక ఆరోగ్యంపై సమాజంలో తగినంత చర్చ జరగడం లేదని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. వ్యక్తిగత, దేశాభివృద్ధిపై ఇది ప్రభావం చూపిస్తుందని తెలిపింది. వైవిధ్యమైన, భిన్నమైన ఆహారం దిశగా అడుగులు వేయాలని సూచించింది. ఈకామర్స్ వృద్ధికి అవరోధాలు డేటా ప్రైవసీ అంశాలు, ఆన్లైన్ మోసాలతో సవాళ్లు వ్యక్తిగత వివరాల గోప్యత సమస్యలు, పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు దేశీయంగా ఈకామర్స్ వృద్ధికి ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. 2030కల్లా దేశీ ఈకామర్స్ మార్కెట్ విలువ 350 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఒక అంచనా. అయితే ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ వినియోగంలో వినియోగదారులు మోసపోకుండా తగిన విధంగా సన్నద్దం(ఎడ్యుకేట్) చేయవలసి ఉంది. ఇదేవిధంగా ఆన్లైన్ విక్రయాలకు సైతం కేటలాగింగ్ తదితర నైపుణ్యాలను పెంచవలసి ఉంది. వీటికితోడు వ్యక్తిగత వివరాల గోప్యత అంశాలు, ఆన్లైన్లో పెరుగుతున్న మోసాలు ఈకామర్స్ వృద్ధిని దెబ్బతీస్తున్నాయి. వెరసి ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ను రక్షణాత్మకంగా వినియోగించుకోవడంలో యూజర్లకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. గత కొన్నేళ్లుగా దేశీ ఈకామర్స్ వేగవంతంగా వృద్ధి చెందుతోంది. ఇందుకు మెరుగుపడుతున్న సాంకేతికతలు, ఆధునికతరం బిజినెస్ విధానాలు, డి/æటల్ ఇండియా వంటి ప్రభుత్వ చర్యలు, ఓఎన్డీసీ, ఎఫ్డీఐ విధానాల్లో సరళత, వినియోగదారుల రక్షణ చట్టాలు సహకరిస్తున్నాయి.124 బిలియన్ డాలర్లకు రెమిటెన్సులు... సేవా రంగం ఎగుమతుల తర్వాత భారతదేశానికి అత్యధిక విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న రెమిటెన్సులు 2024లో 3.7 శాతం పురోగతితో 124 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని సర్వే పేర్కొంది. 2025లో 4 శాతం వృద్ధితో 129 బిలియన్ డాలర్లకు పురోగమిస్తాయని వివరించింది. విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు తమ సొంత దేశానికి నిధులు పంపడానికి సంబంధించిన రెమిటెన్సుల విషయంలో ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలుస్తోంది. 2023లో 120 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు దేశాలనికి వచి్చనట్లు ప్రపంచబ్యాంక్ ఇటీవలి నివేదిక పేర్కొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్ వంటి కీలక దేశాలతో తన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)ని అనుసంధానించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు వ్యయాలను తగ్గించి, చెల్లింపులను వేగవంతం చేయగలవని అంచనా వేసినట్లు సర్వే వివరించింది. ఆటో రంగంలో రూ. 67,690 కోట్ల పెట్టుబడులు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంతో (పీఎల్ఐ) ఆటోమొబైల్, ఆటో విడిభాగాల పరిశ్రమలోకి ఇప్పటివరకు రూ. 67,690 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు ఆర్థిక సర్వే తెలిపింది. 2024 మార్చి ఆఖరు నాటికి రూ. 14,043 కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరిగిందని వివరించింది. దరఖాస్తుదారులు 1.48 లక్షల ఉద్యోగాల కల్పనకు హామీ ఇవ్వగా ఇప్పటివరకు 28,884 ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొంది. ఈ స్కీము కింద 85 దరఖాస్తుదార్లకు ఆమోదం లభించినట్లు సర్వే తెలిపింది. 2023–27 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆటో, ఆటో విడిభాగాల పరిశ్రమ కోసం పీఎల్ఐ స్కీము కింద రూ. 25,938 కోట్ల మేర బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 49 లక్షల ప్యాసింజర్ వాహనాలు, 9.9 లక్షల త్రీ వీలర్లు, 2.14 కోట్ల ద్విచక్ర వాహనాలు, 10.7 లక్షల వాణిజ్య వాహనాల ఉత్పత్తి నమోదైంది. అసమానతల నివారణలో పన్నులు కీలకంకృత్రిమ మేథ (ఏఐ) సాంకేతికత ఉపాధి కల్పన, ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆర్థిక సర్వే తెలిపింది. కనుక రాబోయే రోజుల్లో సమాజంలోని అసమానతల పరిష్కారంలో పన్ను విధానాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. అంతర్జాతీయంగానూ అసమానతలు పెరిగిపోతుండడం విధాన నిర్ణేతలకు కీలక ఆర్థిక సవాలుగా పరిణమిస్తున్నట్టు తెలిపింది. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెబుతూ.. ఉపాధి కల్పన, సంఘటిత రంగంతో అసంఘటిత రంగం అనుసంధానం, మహిళా కారి్మక శక్తి పెంచడం కోసం చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేసింది. దేశంలో ఒక్క శాతం ప్రజలు 6–7 శాతం ఆదాయం పొందుతున్నట్టు, టాప్–10 శాతం వర్గం మొత్తం ఆదాయంలో ఒకటో వంతు వాటా కలిగి ఉన్నట్టు గుర్తు చేసింది. మరింత తగ్గనున్న వాణిజ్య లోటు .. రాబోయే రోజుల్లో వాణిజ్య లోటు మరింత తగ్గగలదని ఆర్థిక సర్వే తెలిపింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాలతో దేశీయంగా తయారీకి ఊతం లభించడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో ఎగుమతులు పెరగడం వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని వివరించింది. అయితే, కమోడిటీల ధరల్లో, ముఖ్యంగా చమురు, లోహాలు, వ్యవసాయోత్పత్తులు మొదలైన వాటి ధరల్లో హెచ్చుతగ్గులనేవి వాణిజ్య సమతౌల్యత, ద్రవ్యోల్బణ స్థాయులపై ప్రభావం చూపవచ్చని పేర్కొంది. అలాగే, ప్రధాన వ్యాపార భాగస్వామ్య దేశాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు భారత ఎగుమతి అవకాశాలను ప్రభావితం చేయొచ్చని వివరించింది. భౌగోళిక రాజకీయ సవాళ్ల వల్ల ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడినప్పటికీ, అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు తగ్గడమనేది 2023 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు తగ్గడానికి తోడ్పడిందని సర్వే వివరించింది. ఉత్పత్తులపరమైన వాణిజ్య లోటు 2022–23లో 265 బిలియన్ డాలర్లుగా ఉండగా 2023–24లో 240 బిలియన్ డాలర్లకు తగ్గింది. వృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యం దేశంలో వృద్ధ జనాభా పెరుగుతున్న తరుణంలో వారి సంరక్షణ అవసరాలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే తెలియజేసింది. వృద్ధుల సంరక్షణ మార్కెట్ ప్రస్తుతం దేశంలో రూ.58వేల కోట్లుగా ఉందంటూ.. మౌలిక వసతులు, వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అంశంలో అంతరాలున్నట్టు గుర్తు చేసింది. 60–69 సంవత్సరాల వయసులోని వారి సామర్థ్యాలను దేశ ఉత్పాదకత పెంపునకు వినియోగించుకోవాల్సిన ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. వృద్ధాప్య అనుకూల ఉద్యోగాలతో జీడీపీ 1.5 శాతం మేర పెంచుకోవచ్చన్న ఆసియా అభివృద్ధి బ్యాంక్ నివేదిక సూచనలను ప్రస్తావించింది. 60 ఏళ్లపైబడిన వయసులోని వారికి తగిన ఉపాధి కలి్పంచడం ద్వారా వారిని సమాజంలో చురుగ్గా, ఆర్థికంగా మెరుగ్గా ఉండేలా చూడొచ్చని, ఇది వారి సంరక్షణ అవసరాలను తగ్గిస్తుందని ఆర్థిక సర్వే సూచించింది. 2022 నాటికి దేశ జనాభాలో 14.7 కోట్ల మంది వృద్ధులు ఉంటే, 2050 నాటికి 34.7 కోట్లకు పెరుగుతారని అంచనా. వాస్తవానికి అద్దంఎకానమీ వాస్తవ పరిస్థితికి సర్వే అద్దం పట్టింది. ఈ అంశాల ప్రాతిపదికన భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడానికి తగిన ‘‘ఆచరణాత్మకమైన’’ మార్గాన్ని సర్వే నిర్దేశించింది. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ 7 శాతానికి మించి వృద్ధి భారత వృద్ధికి సంబంధించి సర్వే సానుకూలంగా ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ 7 శాతం వరకూ ఉంటుందని సర్వే అంచనావేసినా, 8 శాతంగా ఉండే అవకాశం ఉందని విశ్వసిస్తున్నాను. – సంజీవ్ పురి, సీఐఐ ప్రెసిడెంట్సంక్షోభాన్ని దాటి స్థిరత్వం.. కోవిడ్ నేపథ్యంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నుంచి కోలుకున్న ఎకానమీ.. 2047 నాటికి ‘వికసిత భారత్’ ఆవిర్భావ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశలో ముందుకు కదులుతోంది. సర్వే ఈ అంశాన్ని అద్దం పడుతోంది. – సంజీవ్ అగర్వాల్, పీహెచ్డీ చాంబర్సంస్కరణలు బాటన ముందుకు.. ఎకానమీ అవుట్లుక్ పరిణతి చెందినట్లు గమనిస్తున్నాము. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధి రేటును దేశం కొనసాగిస్తుంది. జీఎస్టీ, ఐబీసీ తర్వాత తదుపరి సంస్కరణల బాటన నడవాల్సిన అవసరం ఉంది. – అనిష్ షా, ఫిక్కీ ప్రెసిడెంట్ సాహసోపేత డాక్యుమెంట్ సాహసోపేతమైనది. భారీ ఉపాధి కల్పనతోపాటు ఏఐ వంటి కొత్త సాంకేతికత సది్వనియోగం చేసుకుని 4వ ప్రపంచ పారిశ్రామిక విప్లవాన్ని సద్వినియోగం చేసుకోవాలనే సంకల్పాన్ని సూచిస్తోంది. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ ఆర్థికాభివృద్ధి లక్ష్యంఅపూర్వ ఆర్థిక పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ రంగం, విద్యాసంస్థల మధ్య ఒక ఒప్పందాన్ని ఆర్థిక సర్వే ప్రతిపాదించింది. అలాగే వివిధ నిబంధనలను ప్రభుత్వం విడనాడాలి. – రానెన్ బెనర్జీ, పార్ట్నర్, పీడబ్లు్యసీ ఇండియా. సహకారం కీలకంమధ్య కాలంలో వృద్ధికి ప్రైవేట్ కార్పొరేట్ రంగం, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు అవసరమని సర్వే పరోక్షంగా నొక్కి చెప్పింది. ద్రవ్యోల్బణాన్ని నిర్వహించడం అనేది కేవలం ఆర్బీఐ, దాని ద్రవ్య విధాన కమిటీ ప్రత్యేకాధికారం కాదు. ముఖ్యంగా ఆహార ధరల నిర్వహణ రంగంలో కేంద్రం చురుకైన జోక్యం అవసరం. – అదితీ నాయర్, చీఫ్ ఎకనమిస్ట్, ఇక్రాఇన్ఫ్రా ఊతంఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం పెద్ద బాధ్యతను భుజానికెత్తుకున్నప్పటికీ.. ఐపీ, మెషినరీలో ప్రైవేట్ పెట్టుబడి కూడా బలంగా ఉంది. గృహాలు, నిర్మాణాలలో పెట్టుబడులు అధికంగా ఉన్నాయి. భౌతిక ఆస్తులలో పొదుపు చేయడానికి కుటుంబాలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. – రుమ్కీ మజుందార్, ఎకనమిస్ట్, డెలాయిట్.చిన్న పరిశ్రమల మద్దతు కీలకంప్రభుత్వ దార్శనికత ప్రకారం భారత్ అతి త్వరలో మూడవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలను ముందుకు నడిపిస్తే తప్ప ఈ దార్శనికతను సాధించలేము. ఎందుకంటే అవి భారతదేశానికి ప్రధాన ఉపాధి మార్గాలు, జీడీపీని నడిపించేవి. – వివేక్ జలన్, పార్ట్నర్, ట్యాక్స్ కనెక్ట్ అడ్వైజరీ సరీ్వసెస్. చిన్న పరిశ్రమల మద్దతు కీలకంప్రభుత్వ దార్శనికత ప్రకారం భారత్ అతి త్వరలో మూడవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలను ముందుకు నడిపిస్తే తప్ప ఈ దార్శనికతను సాధించలేము. ఎందుకంటే అవి భారతదేశానికి ప్రధాన ఉపాధి మార్గాలు, జీడీపీని నడిపించేవి. – వివేక్ జలన్, పార్ట్నర్, ట్యాక్స్ కనెక్ట్ అడ్వైజరీ సరీ్వసెస్. సవాళ్ల అధిగమనంఅంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు విస్తరించి ఉన్న అభివృద్ధి మార్గంలో ఆర్థిక వ్యవస్థకు ఉన్న కొన్ని కీలక సవాళ్ల గురించి సర్వే చర్చించింది. ఉద్యోగాలను పెంచడం, గ్రామీణ పట్టణ విభజనను తగ్గించడంపై దృష్టి కేంద్రీకరించడం ప్రభుత్వ రాడార్లో ఉన్నట్లు కనిపిస్తోంది. – రిశి షా, పార్ట్నర్, గ్రాంట్ థాంటన్. పెట్టుబడుల పురోగతిసర్వేలో అంచనా వేసిన 6.5–7 శాతం వృద్ధికి 35–36 శాతం నిజమైన పెట్టుబడి రేటు అవసరం. తదనుగుణంగా 33–34 శాతం నిజమైన పొదుపు రేటు ఉండాలి. ప్రస్తుత పొదుపు, పెట్టుబడి రేట్లను బట్టి ఇది సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. తగిన విధానపర జోక్యాల ద్వారా రెండు మూడు దశాబ్దాల్లో వృద్ధి ఈ స్థాయిలో కొనసాగాలి. – డి.కె.శ్రీవాస్తవ, చీఫ్ పాలసీ అడ్వైజర్, ఈవై ఇండియా. -
Union Budget 2024-25: ఉపాధికి ఊతం.. ధరలకు కళ్లెం!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో వృద్ధి రేటు అంచనాలను ప్రభుత్వం అచితూచి నిర్ధేశించింది. స్థూలదేశీయోత్తత్తి (జీడీపీ) వృద్ధి 6.5–7 శాతం స్థాయిలో ఉండొచ్చని ఆర్థిక సర్వేలో లెక్కగట్టింది. ఉపాధి కల్పనను పెంచాల్సిన అవసరం ఉందని కూడా నొక్కిచెప్పింది. ధరాభారంతో అల్లాడుతున్న పేదలు, అల్పాదాయ వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీ లేదా కూపన్ల రూపంలో నిర్ధిష్టంగా ఆర్థిక తోడ్పాటు కల్పించాల్సిఇన అవసరం ఉందని కూడా సర్వే సూచించింది. దేశంలో తయారీ రంగానికి తోడ్పాటు అందించడంతో పాటు ఎగుమతులను పెంచాలంటే చైనా నుంచి ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (ఎఫ్డీఐ) పెంచాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా, గతేడాది (2023–24) 8.2 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే, ఈ ఏడాది వృద్ధి రేటు అంచనాలు చాలా తక్కువగా ఉండటం విశేషం. ఆర్బీఐ నిర్దేశించిన 7.2 శాతం వృద్ధి రేటు అంచనాలతో పోలి్చనా సర్వేలో వృద్ధి అంచనా తగ్గింది. అనిశి్చత వర్షపాతం, ప్రైవేటు రంగంలో పెట్టుబడుల మందగమనం వంటివి వృద్ధి అంచనాల తగ్గుదలకు ప్రధాన కారణంగా సర్వే పేర్కొంది. ‘భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వృద్ధి బాటలో పయనిస్తోంది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ సవాళ్లన్నింటినీ దీటుగా ఎదుర్కొంటోంది’ అని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సర్వే ముందుమాటలో పేర్కొన్నారు. కాగా, నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడం ద్వారా మధ్యకాలం పాటు నిలకడగా 7% వృద్ధి రేటు కొనసాగవచ్చని సర్వే తేల్చిచెప్పింది.కార్మిక సంస్కరణలు వేగవంతం... కేంద్రంలో వరుసగా మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కారు 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రైవేటు పెట్టుబడులను పెంచడం, చిన్న–మధ్య తరహా వ్యాపారాలకు చేయూతనందించడం, సాగును లాభసాటిగా మార్చేలా వ్యవసాయ సంస్కరణలు, వాతావరణ మార్పుల సమస్యను ఎదుర్కొనేందుకు వనరుల సమీకరణ, ఆర్థిక అసమానాతలను తగ్గించడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని పూడ్చాలని కూడా సర్వే నొక్కిచెప్పింది. దేశంలో ఉద్యోగ కల్పనకు మరింత సానుకూల వాతావరణాన్ని సృష్టించాలంటే కార్మిక సంస్కరణల అమలును వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొంది. ‘దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అనుగుణంగా 2030 నాటికి వ్యవసాయేతర రంగంలో ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను కలి్పంచాల్సి ఉంటుంది’ అని సర్వే తెలిపింది. చైనా పెట్టుబడులు పెరగాలి... భారత్ ఎగుమతులు, దేశీ తయారీ రంగం మరింత పుంజుకోవాలంటే, చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పెరగాలని, లేదంటే చైనా సరఫరా వ్యవస్థతో భారత్ అనుసంధానం కావాల్సి ఉంటుందని సర్వే అభిప్రాయపడింది. మరోపక్క, చైనా నుంచి దేశంలోకి దిగుమతులు తగ్గాలని కూడా పేర్కొంది. ‘అమెరికా తదితర కీలక మార్కెట్లకు భారత్ ఎగుమతులు భారీగా పెరగాలంటే చైనా పెట్టుబడులపై మనం మరింత దృష్టి సారించాలి. తూర్పు ఆసియా దేశాలు గతంలో ఇదే విధంగా లబ్ధి పొందాయి’ అని సర్వే తెలిపింది. 2020లో గాల్వాన్లో చోటు చేసుకున్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా భారత్ టిక్టాక్, యూసీ బ్రౌజర్తో సహా 200 చైనా మొబైల్ యాప్లను నిషేధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా చైనా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం బీవైడీ భారీ పెట్టుబడి ప్రతిపాదనలను కూడా తిరస్కరించింది. 2000–2024 మధ్య భారత్ అందుకున్న మొత్తం ఎఫ్డీఐలలో చైనా కేవలం 0.37% (2.5 బిలియన్ డాలర్లు) వాటాతో 22 స్థానంలో ఉంది. కాగా, కీలక ఖనిజాల విషయంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సర్వే స్పష్టం చేసింది.పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీవడ్డీరేట్ల నిర్ణయంలో ఆహార ధరలను పక్కనబెట్టండి... ఆర్బీఐకి సర్వే సూచన వడ్డీ రేట్లను నిర్ణయించడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆహార ద్రవ్యోల్బణాన్ని చూడటం మానేయాలని ఆర్థిక సర్వే సూచించింది. అధిక ఆహార ధరలను ఎదుర్కోవటానికి పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీని ప్రభుత్వం అన్వేíÙంచాలని సర్వే పేర్కొంది. ‘‘భారతదేశ ద్రవ్యోల్బణ లక్ష్య ఫ్రేమ్వర్క్.. ఫుడ్ ఆరి్టకల్స్ను పక్కనబెట్టాలి. అధిక ఆహార ధరలు చాలా సందర్భాల్లో సరఫరాలకు సంబంధించిన సమస్యే తప్ప, డిమాండ్ ప్రేరితం కాదు’’ అని ఆర్థిక సర్వే పేర్కొంది. మధ్య, దీర్ఘకాలిక ద్రవ్యోల్బణం అవుట్లుక్ ధరల యంత్రాంగం పటిష్టత, మార్కెట్ అంశాలు, నిత్యావసారాల దేశీయ ఉత్పత్తి, దిగుమతులు వంటి అంశాలపై ఆధారపడుతుందని వివరించింది. అననుకూల వాతావరణం, తక్కువ రిజర్వాయర్ స్థాయిలు, పంట నష్టం వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేసి, గత రెండేళ్లలో ఆహార ధరలను పెంచడానికి దారితీసిందని కూడా సర్వే పేర్కొంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు–రెపో (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ఆర్బీఐ వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంపై ఆధారపడే సంగతి తెలిసిందే. ప్లస్ 2 లేదా మైనస్ 2తో ఇది 4 శాతంగా ఉండాలే చూడాలని ఆర్బీఐకి కేంద్రం నిర్ధేశిస్తోంది. ఈ సూచీలో ఫుడ్ ఆరి్టకల్స్ ఒక భాగం. రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం లక్ష్యాన్ని సాధించడంలో ఆహార ధరలు ఒడిదుడుకులు తీవ్ర అడ్డంకిగా మారుతున్నాయి. ఇదే అంశంపై ఆందోళన వ్యక్తంచేస్తూ ఆర్బీఐ 2023 ఫిబ్రవరి నుంచి యథాతథ వడ్డీరేట్ల వ్యవస్థను కొనసాగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. దీనిని పక్కనపెట్టి... రుణ రేట్లను తగ్గిస్తే ఆ నిర్ణయం వృద్ధికి దోహదపడుతుందన్నది సర్వే అభిప్రాయం. ప్రయివేట్ రంగ పెట్టుబడులు కీలకం ప్రయివేట్ రంగ ఫైనాన్సింగ్, కొత్త వర్గాల నుంచి వనరుల సమీకరణ దేశీయంగా నాణ్యమైన మౌలిక సదుపాయాల(ఇన్ఫ్రా) నిర్మాణానికి కీలకమని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పాలసీలు, సంస్థాగత మద్దతుతోపాటు.. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు సైతం ప్రధాన పాత్ర పోషించవలసి ఉంటుంది. మౌలిక రంగంలోని వివిధ విభాగాలకు పెట్టుబడులు సమకూర్చడంలో గణాంకాలు, మార్గదర్శకాలు తదితర నివేదికలు అత్యవసరం. ఇన్ఫ్రాస్ట్రక్చర్కున్న డిమాండ్ను అంచనా వేయడం, ఉపవిభాగాల కల్పనలో సౌకర్యాల వినియోగం వంటి అంశాలకు ప్రస్తుత డేటాబేస్ సామర్థ్యం సరిపోదు. ఆర్థికపరమైన ఒత్తిడి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏకీకృత ప్రణాళికల నేపథ్యంలో ఆచరణసాధ్యమైన ప్రాజెక్టులను చేపట్టి పూర్తిచేయవలసి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం కీలకమవుతుంది.రైల్వేల సామర్థ్యం పెరగాలి.. సామర్థ్యాలను వేగంగా పెంచుకోవడం, కార్యకలాపాలను ఆధునీకరించుకోవడం, ఇంధన ఆదా తదితర అంశాలపై రైల్వేస్ ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎకనమిక్ సర్వే సూచించింది. ఇందుకు అనుగుణంగా సరకు రవాణా కోసం ప్రత్యేక కారిడార్లు, హై స్పీడ్ రైళ్లు, వందే భారత్.. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ .. ఆస్థా స్పెషల్ ట్రెయిన్స్ వంటి ఆధునిక ప్యాసింజర్ సరీ్వస్ రైళ్లు, అధిక సామర్థ్యం ఉండే రైల్వే కోచ్లు, లాస్ట్–మైల్ రైల్ లింకేజీలు మొదలైన వాటిపై ఇన్వెస్ట్ చేయాలని పేర్కొంది. లాజిస్టిక్స్ వ్యయాలను, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు రైల్వేస్ 3 ప్రధాన కారిడార్ల రూపకల్పనలో ఉందని వివరించింది. ట్రాఫిక్ సాంద్రత అధికంగా ఉండే కారిడార్లు, ఇంధన.. ఖనిజ.. సిమెంట్ కారిడార్లు, రైల్ సాగర్ (పోర్టు కనెక్టివిటీ) కారిడార్లు వీటిలో ఉన్నాయని పేర్కొంది.పర్యాటక రంగంలో అవకాశాలు అపారం..పర్యాటక రంగం కలి్పస్తున్న అవకాశాలను సొంతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే సూచించింది. కరోనా విపత్తు తర్వాత పర్యాటక రంగం వేగంగా కోలుకోవడాన్ని ప్రస్తావించింది. ‘2023లో 92 లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్ను సందర్శించారు. క్రితం ఏడాదితో పోల్చి చూస్తే 43.5 శాతం ఎక్కువ. భారత పర్యాటక రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచంలో 39వ ర్యాంక్ సొంతం చేసుకుంది. పర్యాటకం ద్వారా రూ. 2.3 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించింది. ఇది క్రితం ఏడాదితో పోలి్చతే 65.7% అధికం’అని సర్వే తెలిపింది. కృత్రిమ మేథ (ఏఐ) భారత సేవల ఎగుమతులపై ప్రభావం చూపిస్తుందన్న ‘క్యాపిటల్ ఎకనమిక్స్’ నివేదికను ప్రస్తావిస్తూ.. ఉపాధి కల్పన విషయంలో తక్కువ నైపుణ్యాలపై ఆధారపడిన పర్యాటకం ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తోందని పేర్కొంది. వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లు కీలకందేశీ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లు కీలకంగా మారుతున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. టెక్నాలజీ, ఇన్నొవేషన్, డిజిటైజేషన్ దన్నుతో మూలధన నిర్మాణం, పెట్టుబడుల విస్తరణలో క్యాపిటల్ మార్కెట్ల వాటా బలపడుతోంది. అంతేకాకుండా దేశీ స్టాక్ మార్కెట్లు ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక విపత్కర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ రిసు్కలు, వడ్డీ రేట్లుసహా కమోడిటీ ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలోనూ దేశీ క్యాపిటల్ మార్కెట్లు గతేడాది(2023–24) ఉత్తమ పనితీరు చూపిన వర్ధమాన మార్కెట్లలో ఒకటిగా నిలిచాయి. ఈ కాలంలో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇన్వెస్టర్లకు భారీ(25%కిపైగా) రిటర్నులు అందించాయి. ఇందుకు స్థూల ఆర్థిక పరిస్థితుల స్థిరత్వం, దేశీ ఇన్వెస్టర్ల బలిమి తోడ్పాటునిచి్చనట్లు సీతారామన్ పేర్కొన్నారు. 2024 మే నెలలో ఈక్విటీ మార్కెట్ల విలువ 5 ట్రిలియన్ డాలర్ల(రూ. 415 లక్షల కోట్లు)కు చేరింది. ప్రస్తుతం 9.5 కోట్లమంది రిటైల్ ఇన్వెస్టర్లు ప్రత్యక్షంగా 2,500 లిస్టెడ్ కంపెనీలలో 10% వాటాను కలిగి ఉన్నారు. గతేడాది ప్రైమరీ మార్కెట్ల ద్వారా రూ. 10.9 లక్షల కోట్ల మూలధన ఏర్పాటుకు సహకారమందింది.వ్యవసాయంలో సత్వర సంస్కరణలు వ్యవసాయ రంగంలో సంస్కరణలను వెంటనే చేపట్టాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. లేదంటే ఈ రంగంలో నెలకొన్న వ్యవస్థీకృత సమస్యలు దేశ వృద్ధికి అడ్డుపడతాయని విధానకర్తలను హెచ్చరించింది. తూర్పు ఆసియా దేశాలు, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలతో పోలి్చతే.. దేశ వ్యవసాయరంగం సామర్థ్యాలను ఇంకా పూర్తి స్థాయిలో వెలుగులోకి తేవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు వ్యవసాయరంగ సామర్థ్యాలను ఉపయోగించుకోవాలని సూచించింది. ఈ రంగంపై దేశవ్యాప్తంగా చర్చలు అవసరమని నాగేశ్వరన్ పిలుపునిచ్చారు. ‘‘దేశ వ్యవసాయ రంగం ప్రస్తుతం ఎలాంటి సంక్షోభంలో లేదు. కాకపోతే నిర్మాణాత్మక మార్పు అవసరం. ఎందుకంటే వాతావరణ మార్పులు, నీటి సమస్య రానున్న రోజుల్లో పెద్దవి కానున్నాయి’’అని సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుతం రైతులకు ఎరువులు, విద్యుత్, ఆదాయపన్ను, మద్దతు ధరల పరంగా సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ ప్రస్తుత విధానాలను తిరిగి సమీక్షించా లని అభిప్రాయపడింది. టెక్నాలజీ ఆధునికీకరణ, మార్కెటింగ్ మార్గాలను మెరుగుపరచడం, సాగులో ఆవిష్కరణలు, వ్యవసాయం–పరిశ్రమల మధ్య అనుసంధానత పెంపు దిశగా సంస్కరణలను సూచించింది. ఆర్థిక సర్వే హైలైట్స్..→ అసాధారణరీతిలో వరుసగా మూడోసారి ప్రజలు మోదీ 3.0 సర్కారుకు పట్టం కట్టడం దేశంలో రాజకీయపరమైన, విధానపరమైన స్థిరత్వాతనికి అద్దం పడుతోంది. → అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ దేశీయ వృద్ధి చోదకాలు 2023–24లో ఆర్థిక పురోగతికి దన్నుగా నిలిచాయి. → భౌగోళిక, రాజకీయ సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన, స్థిరమైన ప్రగతిని సాధిస్తోంది. → కరోనా మహమ్మారి తదనంతరం దేశీయ వ్యాపార, వాణిజ్య రంగం రికవరీ కోసం ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుంది. → వాణిజ్యం, పెట్టుబడులు, వాతావారణ మార్పుల వంటి ప్రపంచ సమస్యల విషయంలో వివిధ దేశాలతో ఒప్పందాలు క్లిష్టతరంగా మారాయి. → స్వల్పకాలానికి ద్రవ్యోల్బణం అంచనాలు తగ్గుముఖ ధరోణిలోనే ఉన్నప్పటికీ, పప్పుధాన్యాల కొరత , ధరల ఒత్తిడి నిలకడగా కొనసాగుతోంది. → సాధారణ వర్షపాతం, దిగుమతులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ధరలు శాంతించడంతో ఆర్బీఐ సానుకూల ద్రవ్యోల్బణం అంచనాలకు దన్నుగా నిలుస్తోంది. → అధిక ఆహార ధరలతో అల్లాడుతున్న పేదలు, అల్పాదాయ వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీలు, నిర్దిష్ట కొనుగోళ్లకు కూపన్ల రూపంలో కొంతకాలం పాటు ప్రయోజనాలను అందించాలి. → భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానంపై ప్రభావం చూపొచ్చు. → భారతదేశ ఆర్థిక సేవల రంగం పటిష్టమైన అవకాశాలున్నాయి. ఈ రంగంలో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా, దేశీయంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. → కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు పటిష్టంగా ఉండటంతో ప్రైవేటు పెట్టుబడులు మరింత పుంజుకోనున్నాయి. → పన్ను నిబంధలనను సరళతరం చేయడం, వ్యయ నియంత్రణ, డిజిటైజేషన్ వంటివి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను సాధించేందుకు దోహదం చేస్తున్నాయి. → భారత వృద్ధి పథానికి క్యాపిటల్ మార్కెట్లు కీలకంగా నిలుస్తున్నాయి. ప్రపంచ రాజకీయ, ఆర్థిక షాక్లకు మన మార్కెట్లు ఎదురొడ్డి నిలుస్తున్నాయి. → చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) జోరందుకోవడం వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థలు మెరుగుపరచడంలో, ఎగుమతులను పెంచుకోవడంలో భారత్కు దన్నుగా నిలుస్తుంది. → 2024లో దేశంలోకి వచి్చన రెమిటెన్సులు (ప్రవాసులు స్వదేశానికి పంపిన నిధులు) 3.4 శాతం వృద్ధితో 124 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ఈ మొత్తం 129 బిలియన్ డాలర్లను తాకనుంది.గ్రీన్ ఎనర్జీ @ రూ. 30 లక్షల కోట్ల పెట్టుబడులు దేశీయంగా 2024–2030 మధ్య కాలంలో పునరుత్పాదక ఇంధన (ఆర్ఈ) రంగంలో రూ. 30.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాగలవని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇందుకోసం స్థల సమీకరణ సమస్యలను పరిష్కరించుకోవడం, సానుకూల నిబంధనలతో నిధులను సమీకరించుకోవడం కీలకమని పేర్కొంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాలను సాధించే క్రమంలో వివిధ విభాగాలకు ఆర్థికంగా లబ్ధి చేకూరగలదని వివరించింది. మరోవైపు, ఉద్గారాల విషయంలో 2070 నాటికి తటస్థ స్థాయికి చేరుకోవాలంటే భారత్కు ఏటా సగటున 28 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని సర్వే తెలిపింది. నిధులను సమకూర్చుకోవడమనేది ఒక అసాధారణ సవాలు కాగలదని వివరించింది.14 శాతం ఐఫోన్ల తయారీ ఇక్కడే ఎల్రక్టానిక్స్ తయారీలో అంతర్జాతీయంగా భారత్ తన వాటాను పెంచుకుంటున్నట్టు ఆర్థిక సర్వే తెలిపింది. 2023–24లో స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ 14% ఐఫోన్లను భారత్లోనే అసెంబుల్ చేసినట్టు వెల్లడించింది. దేశ ఎలక్ట్రానిక్స్ తయారీ 2014 తర్వాత నుంచి గణనీయమైన వృద్ధిని చూస్తోందంటూ, 2021–22లో అంతర్జాతీయంగా మన వాటా 3.7%. దేశ జీడీపీలో 4% వాటాను ఆక్రమించింది. ఎల్రక్టానిక్స్ ఎగుమతుల్లో మొబైల్ ఫోన్ల విభాగం అధిక వృద్ధిని చూస్తోందని, అమెరికాకు మొబైల్ ఫోన్ల ఎగుమతులు 2022–23లో 2.2 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023–24లో 5.7 బిలియన్ డాలర్లకు దూసుకుపోయినట్టు వివరించింది. 2022–23లో దేశీయంగా ఎల్రక్టానిక్స్ తయారీ రూ.8.22 లక్షల కోట్లకు చేరితే, ఎగుమతులు రూ.1.9 లక్షల కోట్లకు పెరిగినట్టు తెలిపింది.ఏటా 78 లక్షల కొలువులు సృష్టించాలి.. కార్మిక శక్తి పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయేతర రంగాల్లో 2030 నాటికి ఏటా దాదాపు 78.5 లక్షల ఉద్యోగాలను కలి్పంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఈ విషయంలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొంది. ఆర్థిక వృద్ధి అనేది ఉద్యోగాల కల్పన కన్నా జీవనోపాధి కల్పించడంపై ఆధారపడి ఉంటుందని సర్వే వివరించింది. వ్యవసాయ రంగంలో కార్మిక శక్తి 2023లో 45.8 శాతం స్థాయి నుంచి 2047 నాటికి 25 శాతానికి తగ్గుతుందని తెలిపింది. ఇదంతా వ్యవసాయేతర రంగాల వైపు మళ్లు తుంది కాబట్టి ఆ మేరకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఏర్పడుతుందని సర్వే పేర్కొంది. పీఎల్ఐ స్కీములు, మిత్రా టెక్స్టైల్ స్కీము మొదలైనవి ఇందుకు కొంత తోడ్పడగలవని తెలిపింది. స్టాఫింగ్ కంపెనీల ద్వారా తాత్కాలిక సిబ్బంది నియామకాలు పెరుగుతున్నందున అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు దీన్నొక మాధ్యమంగా ఉపయోగించుకోవచ్చని వివరించింది. తయారీ రంగ శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి సాధన దిశగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు వ్యాపారసంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకాలను పునఃసమీక్షించాలని సూచించింది. వర్కర్ల తొలగింపునకు కాకుండా ఉద్యోగాల కల్పనకు కృత్రిమ మేథ(ఏఐ)రెని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై కార్పొరేట్లు మరింతగా దృష్టి పెట్టాలని ముందుమాటలో ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. వికసిత భారత్ వైపు పయనంవికసిత భారత్ను నిర్మించే దిశగా ముందుకు సాగుతున్నందున ప్రస్తుత పటిష్టతలతోపాటు మరింత పురోగతికి అవకాశాలు ఉన్న మార్గాలను సర్వే గుర్తించింది. ఆర్థిక సర్వే మన ఆర్థిక వ్యవస్థ ప్రబలమైన పటిష్టతలతను హైలైట్ చేస్తోంది. మా ప్రభుత్వం తీసుకువచి్చన వివిధ సంస్కరణల ఫలితాలను కూడా సుస్పష్టం చేస్తోంది. – ఎక్స్ పోస్ట్లో ప్రధాని నరేంద్ర మోదీ అంచనాలు సుసాధ్యం7 శాతం వృద్ధి రేటు సాధన భారత్కు తేలికే. మేము నిరాశావాదులం కాదు. రుతుపవనాల పురోగతి సవాళ్లను కూడా మేము పరిగణనలోకి తీసుకుంటున్నాము. ఫైనాన్షియల్ రంగం అవుట్లుక్ పటిష్టంగా కనబడుతోందని, పొదుపులను ఫైనాన్షియల్ మార్కెట్లవైపునకు మళ్లించడాన్ని చూస్తే.. భారత్ కుటుంబాలు కష్టాల్లో లేవన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. – వి. అనంత నాగేశ్వరన్, సీఈఏ పార్లమెంట్లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నేపథ్యంలో బడ్జెట్ బృందంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సహాయమంత్రి పంకజ్ చౌదరి -
Economic Survey 2023-24: ప్రతి ఊరికి కావాలి.. ఇలాంటి స్టీల్ బ్యాంక్
పెళ్లయినా శుభకార్యమైనా పార్టీ మీటింగ్ అయినా ప్రభుత్వ హెల్త్ క్యాంప్లైనా భోజనాల దగ్గర ప్లాస్టిక్ వాడకం ఉంటుంది. చెత్త పేరుకు పోతుంది. డబ్బు కూడా వృథా. అదే స్టీల్ గిన్నెలు ఉంటే? ఒకసారి కొంటే ప్రతిసారి ఉపయోగించుకోవచ్చు. ఈ ఆలోచనతో 2020లో తెలంగాణాలోని సిద్దిపేటలో ఏర్పడిన స్టీల్ బ్యాంక్ ‘ఎకానమిక్ సర్వే 2023–24 బుక్’లో తాజాగా చోటు సంపాదించుకుంది. ఇది మహిళా నిర్వహణకు వారి పర్యావరణ దృష్టికి దక్కిన విజయం.ఇది మహిళల విజయం. జాతీయంగా దక్కిన గుర్తింపు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టే సమయంలో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ను విడుదల చేస్తారు. సోమవారం విడుదల చేసిన రిపోర్ట్ 12వ చాప్టర్లో మౌలిక సదుపాయాలు, వృద్ధిలో భాగంగా సిద్దిపేట స్టీల్ బ్యాంక్ వలన జరిగిన ఉపయోగం గురించి వివరించారు. దీనితో స్టీల్ బ్యాంక్ నిర్వాకులైన మహిళలతో పాటు సిద్దిపేట ఎం.ఎల్.ఏ. హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు.ప్లాస్టిక్ వద్దనుకుని2022లో సిద్దిపేట మున్సిపాలిటీలో ‘కంటి వెలుగు కార్యక్రమం’లో భాగంగా వైద్య సిబ్బందికి ఆయా గ్రామ పంచాయతీలు భోజన ఏర్పాట్లు చేశాయి. వైద్య సిబ్బంది భోజనం చేసేందుకు ప్లాస్టిక్ను వినియోగించాల్సి వచ్చింది. ఇది ఊళ్లో అనవసర చెత్తను పోగు చేస్తోంది. అదే సమయంలో పర్యావరణానికి హాని కూడా. ఈ పారేసిన ప్లాస్టిక్ని పశువులు తింటే ప్రమాదం. అందుకే డీపీఓ దేవకీదేవి ప్లాస్టిక్కు బదులు స్టీలు వాడాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో గ్రామ పంచాయతీ నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ సేకరించి స్టీల్ ప్లేట్లు, గ్లాస్లు, స్పూ¯Œ లు, వాటర్ బాటిల్లను కొనుగోలు చేశారు. ఇలా ఏ గ్రామానికి ఆ గ్రామం కొని జిల్లాలోని 499 గ్రామ పంచాయతీల్లో వినియోగించారు. దీంతో రోజుకు 6 కిలోల నుంచి 8 కిలోల ప్లాస్టిక్ను వినియోగించకుండా నిర్మూలించారు.సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 34 స్టీల్ బ్యాంక్లో ఉన్న పాత్రల వివరాలు భోజనం ప్లేట్లు 25,500, అల్పహార ప్లేట్లు 8,500, వాటర్ గ్లాస్లు 25,500, టీ గ్లాస్లు 8,500, చెంచాలు 25,500, చిన్న గిన్నెలు 25,500, స్టీల్ ట్రేలు 612, బకెట్లు 272, ఇతరములు 3వేలు వస్తువులున్నాయి.– గజవెల్లి షణ్ముఖ రాజు, సిద్దిపేట, సాక్షి– ఫొటోలు: కె. సతీష్ కుమార్సంతోషంగా ఉంది...ప్లాస్టిక్ను నిర్మూలించేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో స్టీల్ బ్యాంక్లను ఏర్పాటు చేయించాం. మనం పాటించి తర్వాత ప్రజలు పాటించాలన్న స్ఫూర్తితో బ్యాంక్ల ఏర్పాటు. కంటి వెలుగు కార్యక్రమంలో వైద్య సిబ్బందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాం. వీరికి స్టీల్ ప్లేట్, గ్లాస్లు, వాటర్ బాటిల్ల ద్వారానే అందించాం. మా కృషికి గుర్తింపు దొరకడం సంతోషంగా ఉంది– దేవకీదేవి, డీపీఓసంఘం మహిళలు‘మాది సిద్దిపేటలోని వెన్నెల సమైక్య మహిళా సంఘం. శ్రీసాయితేజ సమైక్య మహిళా సంఘంకు చెందిన గడ్డమీది నవ్య ఇద్దరం కలిసి గత నాలుగేళ్లుగా స్టీల్ బ్యాంక్ను కొనసాగిస్తున్నాం. మా ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 34 వార్డుల్లో స్టీల్ బ్యాంక్లను ఏర్పాటు చేశారు. 29, ఫిబ్రవరి 2020న మా స్టీల్ బ్యాంక్ ప్రారంభించారు. మా వార్డు పరిధిలో వివాహాలు, ఇతర శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు జరిగితే ముందుగానే సామాగ్రి కోసం సమాచారం ఇస్తారు. వారు ఎంత మందితో కార్యక్రమం నిర్వహిస్తున్నారో చెబితే వారికి సరిపడా సామాగ్రిని అందజేస్తాం. వీటిని ప్రత్యేక సంచిలో వేసి ఇస్తాం. వారి కార్యక్రమం అయిపోయిన తర్వాత క్లీన్ చేసి తీసుకువస్తారు. ఏదైనా వస్తువులు మిస్ అయితే వాటికి డబ్బులు తీసుకుంటాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాస్లు, కప్లు ధర కంటే తక్కువ అద్దెకే కిరాయికి ఇస్తున్నాం. ప్లాస్టిక్ నిర్మూలిస్తున్నామనే సంతోషంతో పాటు మాకు ఆర్థికంగా సైతం దోహదపడుతుంది. మా కమిషనర్ ప్రసన్న రాణి, చైర్పర్సన్ కడవేర్గు మంజుల, కౌన్సిలర్ దీప్తిల సహకారంతో ముందుకు వెళ్తున్నాం. పెళ్లిళ్ల సీజన్ అయితే ఎక్కువ మంది తాకిడి ఉంటుంది. మా దగ్గర అన్ని కిరాయికి పోతే మా పక్క వార్డులో ఉంటే తీసుకుని వారికి అద్దెను చెల్లిస్తాం. ప్రజల నుంచి బాగా స్పందన వస్తోంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి రేపటి తరాలకు మంచి పర్యావరణాన్ని బహుమతిగా ఇవ్వాలనే లక్ష్యంతో వీటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నాం.– బాలగోని దీప్తి, వెన్నెల సమైక్య మహిళా సంఘం. -
ఆకాశాన్నంటిన ఆహార ధరలు.. అదే ప్రధాన కారణం!
గతేడాది టమాటా ధరలు, ఉల్లి ధరలు మాత్రమే కాకుండా పప్పు ధాన్యాల ధరలు చుక్కలు తాకాయి. ఇప్పడు కూడా టమాటా ధరలు భారీగానే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కేజీ ధర వంద రూపాయలకంటే ఎక్కువ. ఆహార ధరలు పెరగటానికి గల కారణాలను ఆర్ధిక సర్వేలో వెల్లడించారు.వాతావరణంలో ఏర్పడ్డ మార్పులు, రిజర్వాయర్లలో నీటిమట్టం తగ్గడం, పంట నష్టం వంటివి.. ఆహార ధరలు పెరగటానికి ప్రధాన కారణాలుగా ఆర్థిక సర్వే వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పంటలపై ప్రభావం చూపుతాయి. ఆ ప్రభావం ధరల మీద పడుతుందని వివరించింది.పంట దిగుబడి తగ్గితే.. డిమాండ్కు సరిపడా సరఫరా తగ్గుతుంది. దీంతో ధరలు పెనుగుతాయి. గత కొన్ని రోజులుగా ఆహార ధాన్యాలు, టమాటా, ఉల్లి ధరలు పెరగడానికి ఇదే కారణమని ఆర్ధిక సర్వే వెల్లడించింది. వినియోగదారుల ఆహార ధరల సూచీ (CFPI) ఆధారంగా ఆహార ద్రవ్యోల్బణం FY22లో 3.8 శాతం నుంచి FY23లో 6.6 శాతానికి చేరింది. ఇది FY24 నాటికి 7.5 శాతానికి చేరింది.ఉల్లి ధరలు పెరగడానికి గత కోత సీజన్లో వర్షాలు, విత్తడంలో జాప్యం మాత్రమే కాకుండా ఇతర దేశాలు తీసుకున్న వాణిజ్య సంబంధిత చర్యలు కూడా కారణమని తెలుస్తోంది. తక్కువ ఉత్పత్తి కారణంగా పప్పుధాన్యాల ధరలు పెరిగాయని సర్వే పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణ అవాంతరాలతో పాటు రబీ సీజన్లో నెమ్మదిగా విత్తడం కూడా ధరల పెరుగుదలకు కారణమని వెల్లడించింది. -
ఐటీ పుంజుకోదా..? ఎకనామిక్ సర్వే ఏం చెప్పిందంటే..
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో నియామకాలు గణనీయంగా మందగించాయని, ఇవి మరింతగా తగ్గకపోయినప్పటికీ గణనీయంగా పుంజుకునే అవకాశం లేదని ఆర్థిక సర్వే పేర్కొంది.దశాబ్దాల తర్వాత తొలిసారిగా కొన్ని పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో హెడ్కౌంట్ క్షీణించిన తరుణంలో ఆర్థిక సర్వేలో ఐటీ రంగంపై ప్రస్తావించారు. ఫిబ్రవరిలో, టెక్ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం కేవలం 60,000 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని పేర్కొంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం సృష్టించిన 2,70,000 ఉద్యోగాలతో పోలిస్తే చాలా తక్కువ.అయితే ప్రభుత్వం చేపట్టిన ప్రోత్సాహక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవడం, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఎక్కడా లేని సామర్థ్యాన్ని సంగ్రహించడం ద్వారా వ్యాపార, కన్సల్టెన్సీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులను విస్తరించవచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. -
మినీ ఎకనామిక్ సర్వేలో పేర్కొన్న సవాళ్లు ఇవే..
Economic Survey 2024: భారత ఆర్థిక వ్యవస్థ ఇటీవలి సంవత్సరాలలో సంస్కరణల ద్వారా గణనీయమైన వృద్ధిని సాధించింది. అయితే ఇది అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో నాలుగింటిని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్, ఆయన బృందం మధ్యంతర బడ్జెట్కు ముందు గత జనవరిలో వారి “మినీ ఎకనామిక్ సర్వే”లో పేర్కొన్నారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ప్రకటించనున్న 2024-25 పూర్తి బడ్జెట్తోపాటు నేడు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న ఆర్థిక సర్వే-2024లో వీటిని ప్రస్తావించవచ్చు. 'ది ఇండియన్ ఎకానమీ: ఎ రివ్యూ' అనే పత్రంలో పేర్కొన్న ఈ సవాళ్లను ఇప్పుడు తెలుకుందాం..ప్రపంచ ఆర్థిక ధోరణుల ప్రభావంభారతదేశ వృద్ధి, ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ ఆర్థిక ధోరణులు, వాణిజ్య విధానాల ప్రభావం మొదటి సవాలు. దేశ వృద్ధి కేవలం అంతర్గత అంశాలపై మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక ఏకీకరణపై కూడా ఆధారపడి ఉందని పత్రం పేర్కొంది.బ్యాలెన్సింగ్ ఎనర్జీ సెక్యూరిటీఇక రెండవ సవాలు ఏమిటంటే, పునరుత్పాదక శక్తి వైపు ప్రపంచ మార్పుల మధ్య ఆర్థిక వృద్ధిని ఇంధన భద్రతతో సమతుల్యం చేయడం భౌగోళిక రాజకీయ, సాంకేతిక, ఆర్థిక రంగాలలో సంక్లిష్ట సవాళ్లను కలిగిస్తుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పెరుగుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను మూడో సవాలుగా మినీ సర్వే పేర్కొంది. ఏఐ టెక్నాలజీతో మానవ ఉద్యోగాలకు పెంచిన ముప్పు, ముఖ్యంగా సేవా రంగంలో దీని ప్రభావం గురించి ప్రపంచవ్యాప్త ఆందోళనలు నెలకొన్నాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఉపాధిపై దాని ప్రభావాన్ని ఎలా ఎదుర్కొంటాయన్నది కీలకం.నైపుణ్యం, విద్య, వైద్యంస్థిరమైన ఆర్థిక వృద్ధి, ఉత్పాదకతకు నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి , మంచి నాణ్యమైన విద్య, ప్రజారోగ్యాన్ని నిర్ధారించడం చాలా ముఖ్యమైనదని పత్రం పేర్కొంది. -
Budget 2024-25: కేంద్ర ఆర్థిక సర్వే 2023-24 విడుదల
దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసేదిగా ఉండే ఆర్థిక సర్వే 2023-24ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ ఆధ్వర్యంలో ఈ నివేదికను రూపొందించారు. బడ్జెట్లో ‘ఈజ్ ఆఫ్ డూయిండ్ బిజినెస్’పై చాలా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశంలో కేంద్రమంత్రి బడ్జెట్ 2024-25ను ప్రకటిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..‘ఆర్థిక సర్వేలో 2024-25 ఆర్థిక సంవత్సారానికిగాను దేశ వాస్తవ జీడీపీ 6.5-7 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. బడ్జెట్ 2024-25లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై చాలా నిర్ణయాలు తీసుకున్నాం. దాదాపు 11 దశల్లో దీనిపై చర్చలు జరిగాయి’ అన్నారు. #WATCH | Economic Survey 2023-2024 tabled in Lok Sabha by Union Finance Minister Nirmala Sitharaman. pic.twitter.com/XxBVhgW4Lq— ANI (@ANI) July 22, 2024ఆర్థిక సర్వే 2023-24లోని వివరాల ప్రకారం..కేంద్ర ఆర్థిక సలహాదారు మీడియా సమావేశందేశం ఏటా దాదాపు 80 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని కేంద్ర ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ మీడియాతో తెలిపారు.నియంత్రణల సడలింపు ద్వారా ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు సహాయం చేస్తుంది.ప్రధాన ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. ఇది 4 శాతం కంటే తక్కువగా నమోదవుతుంది.దేశ వృద్ధిలో ప్రైవేట్, ప్రభుత్వరంగ విభాగాలదే కీలక పాత్ర.వృద్ధిని మెరుగుపరచడానికి అందుబాటులోని అన్ని విధానాలు, వనరులను ఉపయోగించుకోవడం చాలా అవసరం.#WATCH | Chief Economic Advisor Dr V Anantha Nageswaran says, "The introduction of artificial intelligence, the need to balance energy security & energy transition, and imperatives of employment and skilling- this economic survey picks up on these themes. More importantly, it… pic.twitter.com/LeehHPTvxn— ANI (@ANI) July 22, 2024‘వికసిత్ భారత్’గా ఎదగడానికి దేశీయ వృద్ధి కీలకంగా మారనుంది.ఈ ఆర్థిక సర్వే థీమ్ ‘ఆల్ హ్యాండ్ ఆన్ టేబుల్’.మే 2024 నాటికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాలు గణనీయమైన ఫలితాలు అందిస్తున్నాయి. ఇందులో భాగంగా 2023-24లో రూ.1.28 లక్షల కోట్లకు మించి పెట్టుబడులు సమకూరాయి.2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం మెరుగైన పనితీరు కనబరుస్తుంది. ప్రైవేట్ మూలధన వ్యయం (కాపెక్స్) పెరుగుతోంది.జీసీసీ ఏర్పాటుకు సులభమైన విధానాలుదేశీయంగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను ఏర్పాటు చేయడానికి అవసరమయ్యే విధానాలను సులభతరం చేశారు.150 కంటే ఎక్కువ సంస్థలు గత రెండు సంవత్సరాలుగా దేశంలో జీసీసీలను ఏర్పాటు చేశాయి.1985లో బెంగళూరులో టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా జీసీసీకు నాందిపడింది.జీసీసీల ఏర్పాటుకు ఆన్లైన్ ఆమోదాలు, లైసెన్సింగ్ ప్రక్రియలను క్రమబద్ధీకరించే ప్రక్రియలను ‘డిజిటల్ ఇండియా’ వంటి వ్యూహాత్మక కార్యక్రామాలు చాలా ప్రభావితం చేశాయి.దేశీయంగా 10 నెలలకు పైగా సరిపడే దిగుమతులను చేసేంత ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి.పెరిగిన ఫారెక్స్ నిల్వలు2023-24 ఆర్థిక సంవత్సరంలో విదేశీ మారక నిల్వలు 68 బిలియన్ డాలర్లు పెరిగాయి.గత దశాబ్దంలో అమలు చేసిన నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా 7 శాతానికి పైగా వృద్ధి రేటును సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీన్ని సాధించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగాల మధ్య సహకారం తప్పనిసరి.బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిలు ప్రభుత్వానికి సవాలుగా మారాయి.ప్రజారోగ్యం దిగజారేందుకు నియంత్రణలేని ప్రసార మాధ్యమాల్లో ఎక్కువగా గడపడం, ఎక్కువసేపు స్క్రీన్ చూడడం, అనారోగ్యకరమైన ఆహారం వంటివి కారణాలుగా ఉన్నాయి.ఈ హానికర అలవాట్లకు ప్రైవేట్ రంగం సహకరిస్తోంది.క్లిష్టమైన, అరుదైన ఖనిజాల ఉత్పత్తి, ప్రాసెసింగ్పై చైనా దాదాపు గుత్తాధిపత్యం ఉంది. దీనివల్ల ప్రపంచం ఆందోళన చెందుతోంది. దేశ పునరుత్పాదక ఇంధన కార్యక్రమంలో విశేష మార్పులు చోటుచేసుకోవాలి.ఉపాధి హామీ పథకానికి డిమాండ్.. గ్రామాల దుస్థితికి సూచిక కాదుగ్రామీణ ఉపాధి హామీ పథకానికి డిమాండ్ ఏర్పడడం గ్రామాల దుస్థితికి సూచిక కాదు. ఇది ప్రధానంగా రాష్ట్రాల సంస్థాగత నిర్ణయం, కనీస వేతనాల్లో వ్యత్యాసం మొదలైన వాటితో ముడిపడి ఉంటుంది.2023-24లో 8.2 శాతంగా ఉన్న భారత ఆర్థిక వృద్ధికి పారిశ్రామిక రంగం ఊతాన్నిచ్చింది. ఈ రంగం వృద్ధి రేటు 9.5 శాతంగా నమోదైంది.గత దశాబ్దంలో తయారీ రంగం సగటు వార్షిక వృద్ధి రేటు 5.2 శాతంగా నమోదైంది. అందుకోసం కెమికల్స్, వుడ్ ప్రొడక్ట్స్ అండ్ ఫర్నిచర్, రవాణా పరికరాలు, ఫార్మాస్యూటికల్స్, యంత్రాలు వంటి విభాగాల్లో వృద్ధి నమోదైంది.భారతదేశంలో గతేడాది 997.2 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి జరిగింది. 261 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతి చేసుకుంది. మొత్తంగా 1233.86 మిలియన్ టన్నుల బొగ్గు వినియోగించారు.ఆర్థిక సర్వే ప్రకారం మే 2024 వరకు రూ.1.28 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందుకోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఎంతో ఉపయోగపడ్డాయి. దీనివల్ల రూ.10.8 లక్షల కోట్ల ఉత్పత్తి/ అమ్మకాలు జరిగాయి.భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం ఎగుమతులు రూ.1.9 లక్షల కోట్లకు పెరిగాయి.టమాటా, ఉల్లి ధరల పెరుగుదలఅననుకూల వాతావరణ పరిస్థితులు ఆహార ఉత్పత్తిని అడ్డుకున్నాయి. ఉల్లిగడ్డ, టమాటా ధరలు పెరిగేలా చేశాయి.నిర్దిష్ట పంట తెగులు, రుతుపవన వర్షాలు ముందుగానే కురవడం, రవాణా అంతరాయాల కారణంగా టమోటా ధరలు పెరిగాయి.రబీ ఉల్లి నాణ్యత దెబ్బతినడం, ఖరీఫ్లో ఉల్లిని ఆలస్యంగా విత్తడం, ఇతర దేశాల వాణిజ్య సంబంధిత చర్యల కారణంగా ఉల్లి ధరలు పెరిగాయి.బలమైన డిమాండ్, ఎగుమతి పరిమితుల కారణంగా ఎరువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే 2015-2019 స్థాయిల కంటే ఎక్కువగానే ఉండవచ్చు.తగ్గిన రిటైల్ ఇంధన ద్రవ్యోల్బణం2023-24లో ప్రపంచ ఇంధన ధరల సూచీ భారీగా క్షీణించింది. మరోవైపు ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 మార్చిలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.2 తగ్గించింది. ఫలితంగా రిటైల్ ఇంధన ద్రవ్యోల్బణం తక్కువగానే ఉంది.ఆగస్టు 2023లో ప్రభుత్వం దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరలు తగ్గించింది. దేశంలోని అన్ని మార్కెట్ల్లో ఒక్కో సిలిండర్పై రూ.200 తగ్గింది. అప్పటి నుంచి ఎల్పీజీ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ 2023 నుంచి దిగొస్తోంది.భారీగా పెరిగిన మార్కెట్ క్యాపిటలైజేషన్భారతీయ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పెరిగింది.బలమైన లేబర్ మార్కెట్ కారణంగా ప్రధాన ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది.యువతకు ఇంకా పెద్దమొత్తంలో ఉపాధి కల్పించాలి.మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల నిర్మాణ రంగం ప్రాముఖ్యతను సంతరించుకుంది.వ్యవసాయాన్ని విడిచిపెట్టిన శ్రామిక శక్తిని తిరిగి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలి.ప్రభుత్వ మూలధన వ్యయం పెరిగింది. దాంతో ప్రైవేట్ పెట్టుబడులు ఊపందుకున్నాయి. 2023-24లో స్థూల స్థిర మూలధన వ్యయం 9 శాతం పెరిగింది.దేశ జీడీపీ 6.5-7 శాతం వృద్ధి2022-23లో సగటున 6.7 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం 2023-24లో 5.4 శాతానికి తగ్గింది. అంతర్జాతీయ సమస్యలు, సరఫరా గొలుసు అంతరాయాలు, రుతుపవనాల మార్పుల కారణంగా ఏర్పడిన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ప్రభుత్వం సమర్థంగా నిర్వహిస్తోంది.2023-24లో మూలధన వ్యయ లోటు(సీఏడీ) జీడీపీలో 0.7 శాతంగా ఉంది. ఇది 2022-23 జీడీపీలో 2.0 శాతంగా ఉంది.ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.కార్పొరేట్, బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్స్ బలంగా ఉన్నాయి. ప్రైవేటు పెట్టుబడుల వృద్ధికి ఇది దోహదం చేస్తుంది.భారత వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లది కీలకపాత్ర. భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిణామాలను తట్టుకోలదని ఆర్థిక సర్వే అభిప్రాయం.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్.. ఏపీ, తెలంగాణకు ఏం కావాలంటే..ఆర్థిక సర్వే విడుదలకు ముందు ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ..‘భారత రాజకీయాల్లో 60 ఏళ్ల తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెడుతుండటం గర్వించదగ్గ విషయం. దేశంలోని ప్రజలకు, ప్రభుత్వం లక్ష్యంగా ఏర్పరుచుకున్న ‘అమృత్కాల్’కు ఈ బడ్జెట్ కీలకంగా మారనుంది. ఈ బడ్జెట్ ప్రభుత్వం కలలుకనే ‘విక్షిత్ భారత్’కు పునాది వేస్తుంది’ అన్నారు. -
ఆర్థిక సర్వే, బడ్జెట్ మధ్య తేడా ఏమిటంటే..
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం కేంద్ర ఆర్థిక సామాజిక సర్వే 2024-25ను విడుదల చేయనున్నారు. జులై 23న కేంద్ర బడ్జెట్ను ప్రకటిస్తారు. అసలు ఆర్థిక సర్వే అంటే ఏమిటి.. ఆర్థిక సర్వేకు, బడ్జెట్కు మధ్య తేడా ఏంటీ.. అనే కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.ఆర్థిక సర్వే అంటే..దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసేదిగా ఆర్థిక సర్వేను పేర్కొంటారు. ఏటా దీని ఆధారంగానే కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది. సాధారణంగా కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు ఆధ్వర్యంలో ఈ నివేదికను రూపొందిస్తారు. ప్రస్తుత కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారుగా వి.అనంత నాగేశ్వరన్ వ్యవహరిస్తున్నారు.ఆర్థిక సర్వే, బడ్జెట్ మధ్య తేడాఆర్థిక సర్వేలో ప్రస్తుత ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరును విశ్లేషిస్తారు. ఆర్థిక బలోపేతానికి రానున్న కాలంలో చేయాల్సిన చర్యలను పేర్కొంటారు. కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాల్లో రాబడి, ఖర్చుల కేటాయింపులను తెలియజేస్తారు.సర్వేలో ఉండే అంశాలుదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందనే విషయాన్ని ఆర్థిక సర్వే స్పష్టంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా ప్రధాన రంగాలైన వ్యవసాయం, పారిశ్రామికోత్పత్తి, మౌలిక సదుపాయాలు, ఎగుమతి - దిగుమతులు, విదేశీ మారకనిల్వలు, నగదు చలామణి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల లాంటి అంశాలను వివరిస్తుంది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటివల్ల వస్తోన్న ఫలితాలను విశ్లేషిస్తుంది.ఇదీ చదవండి: మహిళలు ఏం కోరుతున్నారంటే..పరిణామ క్రమంబడ్జెట్ కంటే ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఎన్నో ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది. దీన్ని మొదటిసారి 1950-51లో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 1964 నుంచి దీన్ని బడ్జెట్కి ముందు ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నారు. కేంద్ర బడ్జెట్లో కేటాయింపుల ప్రతిపాదనలను తేలిగ్గా అర్థం చేసుకోవడానికి దీన్ని ప్రత్యేకంగా ప్రకటిస్తున్నారు. -
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఎకానమీగా భారత్..?
భారతదేశం వాస్తవ జీడీపీ వృద్ధి 2024-25లో 7 శాతంకు చేరుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తుంది. మధ్యంతర కేంద్ర బడ్జెట్కు ముందు ప్రకటించిన నివేదికలో ఇందుకు సంబంధించి కీలక అంశాలను పేర్కొంది. 2030 నాటికి ఇండియా 7 శాతం వృద్ధిని అధిగమించగలదని, ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పేర్కొంది. రానున్న మూడేళ్లలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నట్లు పేర్కొంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచం కేవలం 2 శాతం వృద్ధి సాధించబోతుందని, కానీ భారత్ రానున్న రోజుల్లో 7 శాతం వృద్ధి సాధించబోతున్నట్లు ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. దీన్ని ఎకనామక్సర్వేగా భావించకూడదని నాగేశ్వరన్ స్పష్టం చేశారు. ఆర్థికనివేదిక ప్రకారం భారతదేశ వృద్ధిని రెండు దశలుగా విభజించారు. 1950 నుంచి 2014 వరకు ఒకదశ. 2014-2024 వరకు రెండో దశగా పరిగణించారు. 2012-13, 2013-14 మధ్య కాలంలో ఆర్థిక వ్యవస్థ బలహీనపడినట్లు నివేదిక చెప్పింది. దాంతో జీడీపీ 5 శాతం కంటే తక్కువ వృద్ధి నమోదు చేసినట్లు తెలిసింది. ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడం, ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు.. వంటి అంశాలు గతంలో వృద్ధి క్షీణించేందుకు కారణాలుగా మారినట్లు నివేదికలో వెల్లడించారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి మినీ ఎకనామిక్ సర్వేగా పరిగణించిన ఈ నివేదిక అన్ని సానుకూల పరిణామాలు, సవాళ్లను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ ప్రకారం భారత్ వచ్చే మూడేళ్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిసింది. 2030 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేసింది. -
సామాజిక ఆర్థిక సర్వే విడుదల చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: శాసనసభలోని సీఎం చాంబర్లో 2022-23 సామాజిక ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విడుదల చేశారు. అనంతరం ప్రణాళికశాఖ కార్యదర్శి విజయ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రగతిలో ఏపీ నంబర్ వన్ అన్నారు. రూ.13.17 కోట్లు జీఎస్డీపీ నమోదైందన్నారు. గతంతో పోల్చితే రూ.1.18 లక్షల కోట్లు జీఎస్డీపీ పెరిగిందని ఆయన వివరించారు. ఆలిండియా యావరేజ్ కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువ ‘‘వ్యవసాయం లో 13.18 శాతం, పరిశ్రమలలో 16.36 శాతం, సేవా రంగంలో 18.91 శాతం వృద్ధి నమోదైంది. 36 శాతం కంట్రీబ్యూషన్ వ్యవసాయం నుంచి వస్తోంది. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కనిపిస్తోంది. ఆలిండియా యావరేజ్ కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువ. ఏపీ అభివృద్ధి 16.2 శాతం నమోదైంది. విద్య, ఆరోగ్య రంగాల్లో అనుహ్య అభివృద్ధి సాధించాం. శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి’’ అని విజయ్కుమార్ వెల్లడించారు. చదవండి: అసెంబ్లీలో టీడీపీకి మైండ్ బ్లోయింగ్ రిప్లై ఇచ్చిన మంత్రి బొత్స -
ఆర్థిక సర్వే 2023: ఈ దశాబ్ధం భారత్దే
న్యూఢిల్లీ: ఆర్థిక సర్వే 2023ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన మంగళవారం సభ ముందుంచారు. ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సూచనల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం దీన్ని రూపొందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)తో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023–24) జీడీపీ వృద్ధి కొంత నిదానించే అవకాశాల్లేకపోలేదని అంచనా వేసింది. అయినా కానీ, 6–6.8 శాతం మధ్య నమోదు కావచ్చని పేర్కొంది. సాధారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు, చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్ అంచనాలను ఆర్థిక సర్వే తేటతెల్లం చేస్తుంది. ‘‘2020 నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మూడు షాక్లు తగిలాయి. కరోనా రాకతో ప్రపంచ ఉత్పత్తికి బ్రేక్ పడింది. తర్వాత రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా కమోడిటీ ధరలను పెంచేసింది. ఫలితంగా ద్రవ్యోల్బణం ఎగిసింది. దీనికి కట్టడి వేసేందుకు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీ రేట్ల పెంపును చేపట్టాయి. యూఎస్ ఫెడ్ రేట్లను భారీగా పెంచడంతో పెట్టుబడులు అమెరికా మార్కెట్కు తరలేలా చేసింది. దీంతో ఎన్నో కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడింది. ఫలితంగా మన దేశ కరెంటు ఖాతా లోటు విస్తరించింది. నికర దిగుమతి దేశమైన భారత్ వంటి వాటిపై ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దారితీసింది. అయినప్పటికీ 2021–22లో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకుంది. అమెరికా కేంద్ర బ్యాంకు ఇక ముందూ రేట్లను పెంచే అవకాశాల నేపథ్యంలో రూపాయిపై ఒత్తిడి కొనసాగుతుంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు గరిష్ట స్థాయిలోనే ఉన్నందున పెరిగిన కరెంటు ఖాతా లోటు (క్యాడ్) అదే స్థాయిలో కొనసాగొచ్చు’’ అని సర్వే వివరించింది. జీడీపీకి ఢోకా లేదు.. దేశ జీడీపీ 2022–23లో 7 శాతం మేర ఉండొచ్చు. 2022–23లో నమోదైన 8.7 శాతం కంటే తక్కువ. 2023–24 ఆర్థిక సంవత్సరానికి 6–6.8 శాతం మధ్య ఉండొచ్చు. అంతర్జాతీయంగా ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం దీనిపై ఉంటుంది. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అన్నది బలమైన డిమాండ్, మూలధన పెట్టుబడులు పుంజుకోవడంపై ఆధారపడి ఉంటుంది. ప్రైవేటు మూలధన నూతన చక్రం స్పష్టంగా కనిపిస్తోంది. కొనుగోలు శక్తి పరంగా భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మారకం రేటు పరంగా ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రైవేటు వినియోగం పెరగడం, మూలధన పెట్టుబడులు అధికంగా ఉండడం, కార్పొరేట్ల బ్యాలన్స్ షీట్లు బలంగా మారడం, చిన్న వ్యాపార సంస్థలకు రుణ లభ్యత, వృద్ధికి మద్దతునిచ్చే అంశాలు. 2022–23 మొదటి ఎనిమిది నెలల్లో కేంద్ర సర్కారు మూలధన వ్యయాలు 63.4 శాతం పెరిగాయి. వృద్ధికి ఇది కూడా మద్దతునిచ్చే అంశం. దేశ ఆర్థిక వ్యవస్థ 2025–26 లేదా 2026–27 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు (రూ.410 లక్షల కోట్లు), 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు (రూ.574 లక్షల కోట్లు) చేరుకోవచ్చు. దీని ప్రకారం ఆర్థిక వృద్ధి విషయంలో ఈ దశాబ్దం భారత్దేనని ఆర్థిక సర్వే తేల్చిచెప్పింది. ద్రవ్యోల్బణం/రూపాయి ద్రవ్యోల్బణం రేటు 2022 ఏప్రిల్లో 7.8 శాతానికి పెరిగింది. ఆర్బీఐ గరిష్ట పరిమితి 6 శాతానికంటే ఎక్కువ. అయినప్పటికీ ప్రపంచంలో అతి తక్కువ ద్రవ్యోల్బణం దేశాల్లో భారత్ ఒకటి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ ద్రవ్యోల్బణ అంచనా 6.8 శాతం అన్నది గరిష్ట పరిమితి కంటే ఎక్కువ. కానీ వడ్డీ రేట్లు పెరుగుదల అన్నది ప్రైవేటు వినియోగాన్ని దెబ్బతీసేంత స్థాయిలో లేదు. ఎగుమతులు: 2021–22లో దేశ ఎగుమతులు 422 బిలియన్ డాలర్ల ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరినప్పటికీ.. తదనంతర పరిస్థితులు ఎగుమతుల వృద్ధికి అవరోధం కలిగిస్తున్నాయి. ఎగుమతి దేశాలను విస్తరించుకోవడం, స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల ద్వారా ఈ బలహీనతను అధిగమించొచ్చు. ► భారత్ ఇప్పటికే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మార్చి నాటికి 3.5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుంది. ► భారత్కు చెందిన స్టార్టప్లకు సులభతర పన్నుల విధానం, ప్రక్రియలు అవసరం. ► పీఎం గతిశక్తి (మౌలిక సదుపాయలు విస్తరణకు ఉద్దేశించినది), నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ, పీఎల్ఐ ప్రోత్సాహకాలు ఆర్థిక వృద్ధిని బలోపేతం చేస్తాయి. అంతర్జాతీయంగా జీడీపీలో రవాణా వ్యయాలు 8 శాతంగా ఉంటే, మనదేశంలో 14–18 శాతం మధ్య ఉన్నాయి. ► దేశ ఫార్మాస్యూటికల్ మార్కెట్ 2030 నాటికి 130 బిలియన్ డాలర్లకు విస్తరిస్తుంది. 2021 నాటికి 41 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2024 నాటికి 65 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. కరోనా సంవత్సరం 2020–21లో ఈ రంగం 24 శాతం వృద్ధిని చూసింది. ► షిప్పింగ్ కార్పొరేష్, ఎన్ఎండీసీ స్టీల్, బీఈఎంఎల్, హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్, కాంకర్, వైజాగ్ స్టీల్, ఐడీబీఐ బ్యాంక్ ప్రస్తుతం ప్రైవేటీకరణ దశలో ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చాలా వరకు వీటి ప్రైవేటీకరణ పూర్తవుతుంది. ► ఫిజికల్, డిజిటల్ సదుపాయాల సమన్వయం భారత భవిష్యత్ను నిర్ణయించనుంది. కొత్త సేవలకు డిజిటల్ మాధ్యమం విస్తరించినందున తగిన నియంత్రణలు అవసరం. ఆధార్, యూపీఐ తదితర విజయవంతమైన విధానాలను సర్వే ప్రస్తావించింది. ► 5జీ మొబైల్ సేవల విస్తరణతో నూతన ఆర్థిక అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. స్టార్టప్లు, మరిన్ని వ్యాపార ఆవిష్కరణలు ఊపందుకుంటాయి. ► భారత ఆర్థికాభివృద్ధి, ఇంధన భద్రతకు గ్రీన్ హైడ్రోజన్ కీలకంగా మారనుంది. సమగ్ర రూపం భారత వృద్ధి పథం, భారత్ పట్ల ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆశావాదం, మౌలిక రంగంపై దృష్టి, సాగులో వృద్ధి, పరిశ్రమలు, భవిష్యత్ రంగాలపై దృష్టిని ఆర్థిక సర్వే సమగ్రంగా తెలియజేసింది. – ప్రధాని మోదీ కరెన్సీ, చమురుపైనే.. 2025–26 లేదా 2026–27 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు మన ఆర్థిక వ్యవస్థ చేరుకోవచ్చు. 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. కరెన్సీ మారకం రేట్లపైనే ఈ లక్ష్యాలను చేరుకోవడం ఆధారపడి ఉంటుంది. చమురు ధరలపై అంచనాలు ఇవ్వడం కష్టం. ఆర్బీఐ చెప్పినట్టు బ్యారెల్ 100 డాలర్లకు దిగువన ఉంటే, సర్వేలో పేర్కొన్న వృద్ధి గణాంకాలను చేరుకోవడం సాధ్యపడుతుంది. చమురు 100 డాలర్లకు దిగువన ఉన్నంత కాలం మన వృద్ధి లక్ష్యాలకు విఘాతం కలగదు. – అనంత నాగేశ్వరన్, ముఖ్య ఆర్థిక సలహాదారు ఉపాధి కల్పన.. ఓకే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం, నిర్మాణ రంగ కార్యకలాపాలు పెరగడం ఉపాధి అవకాశాలను పెంచినట్టు ఆర్థిక సర్వే పేర్కొంది. కరోనా సమయంలో లాక్డౌన్లతో పట్టణాల నుంచి వలసపోయిన కార్మికులు తిరిగి వచ్చేలా చేశాయి. మహ్మాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా ఉపాధి అవకాశాల కల్పన జరుగుతోంది. పీఎం కిసాన్, పీఎం గరీబ్ కల్యాణ్ యోజన దేశంలో ఆహార భద్రతకు తోడ్పడుతున్నాయి. పట్టణాల్లో నిరుద్యోగం 7.2 శాతానికి తగ్గింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) రుణాల వృద్ధి 2022 జనవరి–నవంబర్ మధ్య 30.6% ఉంది. దీనికి అత్యవసర రుణ హామీ పథకం తోడ్పడింది. దేశంలో 6 కోట్లకు పైగా ఎంఎస్ఎంఈలు ఉండగా, 12 కోట్ల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఈవీ విక్రయాలు@ కోటి.. 2030 నాటికి ఏటా 1 కోటి విద్యుత్ వాహనాలు అమ్ముడవుతాయని ఎకనమిక్ సర్వే తెలిపింది. దీనితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 కోట్ల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని పేర్కొంది. 2022–2030 మధ్య ఈవీల మార్కెట్ వార్షికంగా 49 శాతం వృద్ధి చెందగలదని వివరించింది. పరిశ్రమ వర్గాల ప్రకారం 2022లో సుమారు 10 లక్షల విద్యుత్ వాహనాలు అమ్ముడయ్యాయి. వాహన విక్రయాలపరంగా డిసెంబర్లో జపాన్, జర్మనీలను అధిగమించి భారత్ మూడో స్థానానికి చేరింది. ఆరోగ్యం.. మెరుగు ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల వల్ల ప్రతీ వ్యక్తి ఆరోగ్యం కోసం తన పాకెట్ నుంచి చేసే ఖర్చు 2013–14లో 64.2 శాతంగా ఉంటే, 2018–19 నాటికి 48.2 శాతానికి తగ్గింది. శిశు మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2023 జనవరి 6 నాటికి 220 కోట్ల కరోనా టీకా డోస్లు ప్రజలకు ఇవ్వడం పూర్తయింది. 2023 జనవరి 4 నాటికి ఆయుష్మాన్ భారత్ పథకం కింద 22 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. వ్యవసాయం.. సవాళ్లు సాగు రంగం మెరుగైన పనితీరు చూపిస్తున్నప్పటికీ.. వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటోంది. అలాగే, పెరిగిపోతున్న సాగు వ్యయాలు కూడా సవాలుగా మారాయి. సాగులో యంత్రాల వినియోగం తక్కువగా ఉండడం, తక్కువ ఉత్పాదకత సవాళ్లుగా ఉన్నాయి. కనుక ఈ రంగంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గడిచిన ఆరు సంవత్సరాలుగా సాగు రంగం వార్షికంగా 4.6 శాతం చొప్పున వృద్ధి సాధించింది. కానీ, 2020–21లో 3.3 శాతం, 2021–22లో 3 శాతమే వృద్ధి చెందింది. ప్రపంచ తయారీ కేంద్రంగా.. ప్రపంచ తయారీ కేంద్రంగా మారేందుకు భారత్ ముందు ప్రత్యేక అవకాశం ఉంది. కరోనా అనంతరం ఎదురైన సవాళ్ల నేపథ్యంలో విదేశీ కంపెనీలు తమ తయారీ, సరఫరా వ్యవస్థలను బలంగా మార్చుకోవాలని కోరుకుంటున్నాయి. ప్రస్తుతం దేశ జీడీపీలో తయారీ వాటా 15–16%గా ఉంటే, రానున్న సంవత్సరాల్లో 25%కి చేరుకుంటుంది. భారత్లో తయారీ 2.0 కోసం 27 రంగాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే పీఎల్ఐ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికి 14 రంగాలకు పీఎల్ఐ పథకాలను ప్రకటించారు. -
‘జల్జీవన్’తో వందశాతం రక్షిత మంచి నీరు
సాక్షి, న్యూఢిల్లీ: జల్ జీవన్ మిషన్లో భాగంగా తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలు వంద శాతం మేర ప్రతీ ఇంటికి సురక్షిత మంచినీటిని అందించాయని కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ప్రజలపై పన్నులు మోపి ఆదాయాలు పెంచుకున్నాయని వెల్లడించింది. కోవిడ్–19 మహమ్మారితో రాష్ట్రాల రెవెన్యూలకు పెద్దఎత్తున తగిలిన ఎదురుదెబ్బతో కేంద్ర ప్రభుత్వం పలు రకాలుగా వాటిని ఆదుకుందని పేర్కొంది. అయితే పట్టణ ఆర్థిక వనరులపై ఇటీవల ఆర్బీఐ ఇచి్చన నివేదికలో ఓఈసీడీ దేశాల కంటే భారత్లో ఆస్తిపన్ను వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయని ఎత్తిచూపింది. రాష్ట్రాలు వసూలు చేస్తున్న ఆస్తిపన్నుల్లో అసమానతలు ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల ఆస్తిపన్ను విధానాల్లో పెద్దఎత్తున సంస్కరణలకు అవకాశం ఏర్పడుతుందని ఆర్బీఐ నివేదికలో పేర్కొందని ఆర్థిక సర్వే వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, హర్యానా, కేరళ, అసోం, పుదుచ్చేరి 2022–23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీలను సవరించాయని మంగళవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక సర్వే 2022–23లో పేర్కొన్నారు. వీటితోపాటు 2022 ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకు అకాల భారీ వర్షాల కారణంగా పంటనష్టం, సరఫరాలో అంతరాయం కారణంగా కూరగాయల్లో అధిక ద్రవ్యోల్బణం నమోదైందన్నారు. ఈ కారణంగా టమోటాల ధరల పెరుగుదల ప్రభావం ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై పడిందని వెల్లడించారు. పెరిగిన ద్రవ్యోల్బణం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా సహా చాలా రాష్ట్రాల్లో కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ–సీ) ద్రవ్యోల్బణం పెరిగిందని, దీనికి ఇంధనం, దుస్తులు ప్రధాన కారణమని ఆర్థిక సర్వే పేర్కొంది. ప్రసూతి మరణాల నిష్పత్తి(ఎంఎంఆర్) 2014–16లో లక్షకు 130 మంది ఉండగా, 2018–20లో లక్షకు 97గా నమోదైందని తెలిపింది. కాగా, 2030 నాటికి ప్రతి లక్ష సజీవ జననాలకు ప్రసూతి మరణాలరేటు(ఎంఎంఆర్) 70 కంటే తక్కువకు తగ్గించాలనే లక్ష్యాన్ని తెలంగాణ(43), ఆంధ్రప్రదేశ్(45) సహా ఎనిమిది రాష్ట్రాలు ఇప్పటికే సాధించాయని పేర్కొంది. ముఖ్యంగా, ప్రధానమంత్రి గతిశక్తి, కోవిడ్–19 నేపథ్యంలో లాజిస్టిక్స్ రంగంలోని ప్రస్తుత పరిణామాలను పరిగణనలోకి తీసుకొని విడుదల చేసిన లీడ్స్–2022 సర్వేలో తెలంగాణ 90 శాతం కంటే ఎక్కువ స్కోర్ సాధించి అచీవర్స్ జాబితాలో చేరిందని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. -
ఆర్ధిక సర్వే అంటే ఏమిటి? తొలి సర్వే ఎప్పుడు ప్రవేశ పెట్టారో తెలుసా?
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి ఉదయం 11గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందస్తు బడ్జెట్ పత్రాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆర్ధిక సర్వే అంటే ఈ సందర్భంగా బడ్జెట్ను సమర్పించే ముందు గత సంవత్సరంలో సాధించిన ఆర్థిక అభివృద్ధి,రాబోయే సంవత్సరానికి సూచనలు, సవాళ్లు, పరిష్కారాలను ప్రస్తావిస్తూ కేంద్ర ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సర్వేగా (ఎకానమీ సర్వే) పిలువబడే ఒక పత్రాన్ని పార్లమెంటులో సమర్పిస్తారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల శాఖ ఆర్థిక విభాగం రూపొందించిన ఆర్థిక సర్వే ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ పర్యవేక్షణలో రూపొందించారు. తొలి సర్వే ఎప్పుడు ప్రవేశ పెట్టారో తెలుసా 1950-51లో మొదటి ఆర్థిక సర్వేని ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎకానమీ సర్వే నివేదిక విడుదల చేయడం ఆనవాయితీగా మారింది. 1964 వరకు కేంద్ర బడ్జెట్తో కలిపి దీనిని ప్రవేశపెట్టేవారు. ఆ తర్వాత బడ్జెట్ నుంచి దీనిని విడదీశారు. రెండు విడతల్లో నేటి నుంచి జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోని తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి ఉదయం 11గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. రేపు పార్లమెంట్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. ఇక బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 6 వరకు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడుత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ఫిబ్రవరి 13 వరకు... రెండో విడుత మార్చి 13 నుంచి ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి. ఇలా మొత్తం కలిపి 27 రోజులు పాటు జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఊరట కల్పించేలా కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని దేశ ప్రజలు ఎంతో ఉత్కంటతతో ఎదురు చూస్తున్నారు. చదవండి👉 నిర్మలమ్మా.. 9 ఏళ్లు అయ్యింది, ఈ సారైనా పెంపు ఉంటుందా? -
కరిమింగిన వెలగపండులా దేశ ఆర్థిక వ్యవస్థ
దేశంలో ఈ 8 ఏళ్లల్లో బిలియనీర్ల సంఖ్య అనూహ్యంగా పెరగడం, వారి కారణంగా దేశ స్థూల ఉత్పత్తిలో పెరుగుదల కనిపించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారత్ 5వ స్థానాన్ని ఆక్రమించడం ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఘనతగా చెప్పు కొంటోంది. ఓ దశాబ్దం క్రితం వరకు భారత్ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండేది. ఇప్పుడది 5వ స్థానా నికి ఎగబాకింది. అది కూడా కోవిడ్ సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి, అప్పటివరకు ఐదవ స్థానంలో ఉన్న బ్రిటన్ను వెనక్కు నెట్టి ఆ స్థానంలో నిలబడింది కనుక అది విజయంగా ఎన్డీఏ భావిస్తోంది. దేశంలో అదుపు తప్పిన ధరలు, నిరుద్యోగం, దిగుమతులలో వృద్ధి, ఎగుమతులలో క్షీణత, రూపాయి పతనం, తగ్గుతున్న విదేశీ పెట్టుబడులు... ఇన్ని సమస్యల నేపథ్యంలో దేశం ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్న విషయం విస్మరించరానిది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను భారత్ దాటడం అన్నది నిజానికి ప్రస్తుత యూరప్ సంక్షోభ పరిస్థితులలో గొప్ప విజయమేమీ కాదు. బ్రిటన్లో చాలాకాలంగా ద్రవ్యోల్బణం రెండంకెలు దాటింది. బ్రిటన్లోని అన్ని వర్గాల ఉద్యోగులు, ముఖ్యంగా రైల్వే కార్మికులు, రేవు కార్మికులు, పోస్టల్ కార్మికులు అధిక వేతనాలను డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టారు. తమ కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయిన దృష్ట్యా వేతనాలు పెంచాలని వారు కోరుతున్నారు. ఉపాధ్యాయులు, బ్యాంకు ఉద్యోగులు, చివరకు వైట్ కాలర్ ఉద్యోగులుగా పేర్కొనదగ్గ ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా సమ్మెబాట పట్టడంతో ఇది వరకు ఎన్నడూలేని రీతిలో బ్రిటన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక్క బ్రిటన్ లోనే కాదు.. స్పెయిన్, జర్మనీ, బెల్జియం తదితర సంపన్న యూరోపియన్ దేశాలలో పరిస్థితులు ఏమంత మెరుగ్గా లేవు. జర్మనీలో ఇటీవల పైలెట్లు సమ్మె చేయడంతో వంద లాది విమానాల రాకపోకలు నిలిచిపోయి, దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం కలిగింది. భారతదేశంలో చాలాకాలం క్రితమే పలు కార్మిక చట్టాలను రద్దు చేశారు. లాభాలలో నడుస్తున్న పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడి కార్మికులు, రాజకీయ పార్టీలవారు ఏమీ చేయలేని నిస్సహా యస్థితిలో ఉన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు అనూహ్యంగా పెరిగినా ప్రజలు మౌనంగానే భారాన్ని మోస్తున్నారు. నిర్మాణరంగంలో ఇసుక, స్టీలు, సిమెంటు ధరలు 40 శాతం కంటే మించి పెరిగాయి. ఇక జీఎస్టీని అత్యధికంగా దాదాపు అన్ని వస్తువులపై విధించడంతో పేద ప్రజలు సైతం ధరాఘాతానికి గురవుతున్నారు. కొన్ని రకాలైన ఎరువుల ధరలు 40 నుంచి 80 శాతం మేర పెరగడంతో రైతులపై అదనపు భారం పడింది. దేశ ఆర్థికాభివృద్థి రేటును, స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలను బ్రిటన్తో పోలుస్తున్న కేంద్ర ప్రభుత్వం... మానవాభివృద్ధి సూచికలలో మనం ఏ స్థానంలో ఉన్నామో ఎందుకు వెల్లడించడం లేదు? ఐక్యరాజ్యసమితి తాజాగా వెలువరించిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత్ స్థానం 132 కాగా, బ్రిటన్ది 18వ స్థానం. ఐక్యరాజ్యసమితి వెల్లడించిన గణాంకాల ప్రకారం మన దేశంలో 22 శాతం ప్రజల సగటు ఆదాయం రోజుకు రూ. 160 మాత్రమే. దేశ జనాభాలో 27.9 శాతం మంది ఇంకా పేదరికంతో విలవిల లాడుతున్నారని తాజా సర్వే వెల్లడించింది. కొన్నేళ్లుగా దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. దేశంలోని 21.7 శాతం సంపద కేవలం ఒక శాతంగా ఉన్న బిలియనీర్ల చేతుల్లో ఉండగా, 19.8 శాతం సంపద మాత్రమే 40 శాతం మంది దేశ ప్రజల్లో ఉన్నట్లు సర్వేలో తేలింది. అసమానతలు అన్నవి ఆర్థికంగానే కాక ఇంకా లింగ (జెండర్) అసమానతలు, సామాజిక (సోషల్) అసమానతలు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ నాణేనికి రెండో వైపు ఉన్న పార్శ్వం. ఇక డాలర్తో రూపాయి విలువ క్షీణత ఇంత సుదీర్ఘంగా సాగడం దేశ చరిత్రలో ఎన్నడూ లేదు. ఇందుకు కారణం వాణిజ్యలోటు భారీగా పెరగడమే. గత సెప్టెంబర్లో 2020– 21 వాణిజ్యలోటు 11.7 బిలియన్ల డాలర్లు ఉండగా, ఈ ఆగస్ట్ 2022 నాటికి 28.7 బిలియన్ల డాలర్లకు చేరింది. అంటే లోటు వృద్ధిరేటు దాదాపు 250 శాతం. దిగుమతుల్లో వృద్ధి నానాటికీ పెరిగిపోతుండగా ఎగుమతుల వృద్ధిరేటులో క్షీణత నమోదవుతోంది. తాజా రాజకీయ కారణాలతో దేశం నుంచి ఎగుమతి అయ్యే బాస్మతియేతర, నాన్ పారాబాయిల్డ్ బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకం విధించడం ద్వారా బియ్యం ఎగుమతిని కేంద్రం నియంత్రించింది. మరోపక్క, ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రపంచంలోని పలు దేశాలు భారత్ నుంచి ద్విచక్రవాహనాలు, ఆటో మొబైల్ విడిభాగాలు మొదలైన వాటిని దిగుమతి చేసుకోవడం నిలిపివేశాయి. దీంతో ఎగుమతుల ద్వారా లభించే విదేశీ మారక ద్రవ్య ఆదాయం తగ్గింది. కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల కలుగుతున్న దుష్ఫలితాలేమిటన్నది నిజానికి ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ‘ఆర్థిక సర్వే 2022’లోనే వెల్లడైంది. అధిక ధరల కారణంగా పేద, మధ్య తరగతి ప్రజల పొదుపు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఒక్క ఏడాది కాలంలో, అంటే గత ఏడాదిలో ధనవంతులు 13 లక్షల కోట్ల సంపద ఆర్జించగా, 15 కోట్లమంది పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయం 53 శాతం తగ్గిపోయినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం అంచనా వేసిన విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం ఆర్ధికాభివృద్ధి రేటు సాధించాలంటే జీడీపీలో 39 శాతం పెట్టుబడులు కీలక రంగాలలో పెట్టాలి. కానీ, ఈ రంగాలలో వస్తున్న ప్రైవేటు పెట్టుబడులు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. ఇదిలా ఉండగా, గ్రామీణ ప్రాంత ప్రజలకు మేలు చేకూర్చే ‘మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం’కు కేటాయించే నిధులలో ప్రతి ఏటా కోత విధిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న వివిధ పథకాలలో కోత పడుతోంది. ఇదికాక, పేదలకు అందిస్తున్న గృహ నిర్మాణ పథకం మందగించింది. ఈ పరిణామాలన్నీ దేశంలోని పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజల, రైతుల జీవనాన్ని దుర్భరం చేస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ పైకి నిగనిగలాడుతున్నట్లు కనిపిస్తున్నా లోపల డొల్లమాదిరిగా ఉంది. మరోరకంగా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ ‘కరి మింగిన వెలగపండు’లా ఉంది. - సి. రామచంద్రయ్య శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
AP: ప్రతికూలతలోనూ పెరిగిన దిగుబడులు
సాక్షి, అమరావతి: ఓ వైపు కరోనా మహమ్మారి.. మరో వైపు వరుస ప్రకృతి వైపరీత్యాలు.. అయినా, వ్యవసాయ రంగం పురోభివృద్ధి సాధించింది. దిగుబడులు పెరిగాయి. రైతు మోములో నవ్వు విరిసింది. పూర్తి ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఇచ్చిన చేయూతతో రాష్ట్రంలో రైతన్నలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాష్ట్రం కరువుతో అల్లాడింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వ్యవసాయానికి చేయూతనిచ్చారు. రైతన్నకు అండదండగా నిలిచారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో నదీజలాలు పుష్కలంగా లభించాయి. ఆ నీటిని రాష్ట్ర ప్రభుత్వం సమర్ధంగా వినియోగించింది. ప్రాజెక్టులు, చెరువుల నిండుగా నీరుండేలా చర్యలు తీసుకుంది. రైతులకు పంటలకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చింది. దీంతో రైతులు రికార్డు స్థాయి దిగుబడులతో చరిత్ర సృష్టిస్తున్నారు. గడిచిన మూడేళ్లుగా వస్తున్న దిగుబడులే ఇందుకు నిదర్శనం. 2021–22 సీజన్లో సైతం రికార్డుస్థాయిలో దిగుబడులు వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆరి్ధక సర్వే వెల్లడించింది. 2019–20 సీజన్లో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో 175 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడులు వచ్చాయి. 312 లక్షల టన్నుల ఉద్యాన పంటల దిగుబడులొచ్చాయి. ఇవి 2014–18 మధ్య కాలంలో వచ్చిన దిగుబడుల కన్నా చాలా అధికం. కరోనాకు తోడు వైపరీత్యాల ప్రభావంతో 2020–21 సీజన్లో కాస్త తగ్గినప్పటికీ, టీడీపీ హయాంతో పోల్చుకుంటే మెరుగ్గానే దిగుబడులొచ్చాయి. ఆ సీజన్లో 165.04 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు, 307 లక్షల టన్నుల ఉద్యాన పంటల దిగుబడులొచ్చాయి. 2021–22 సీజన్లో కూడా వరదలు, వైపరీత్యాలు కలవర పెట్టినప్పటికీ దిగుబడులపై పెద్దగా ప్రభావం చూపలేదు.169.57 లక్షల ఆహారధాన్యాలు, 314 లక్షల టన్నుల ఉద్యాన పంటల దిగుబడులొస్తాయని అంచనావేశారు. ముఖ్యంగా ధాన్యం దిగుబడులు 2020–21లో 130.89 లక్షల టన్నులు కాగా, 2021–22 సీజన్లో 135.24 లక్షల టన్నులు వస్తాయని అంచనా. పాడి ఉత్పత్తులను పరిశీలిస్తే 2019–20లో పాలు 152.63 లక్షల టన్నులు, 8.5 లక్షల టన్నుల మాంసం, 2170.77 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరిగింది. 2020–21 సీజన్లో పాల దిగుబడులు 3.60 శాతం తగ్గినప్పటికీ మాంసం, కోడిగుడ్ల ఉత్పత్తి మాత్రం గణనీయంగా పెరిగింది. ఈ సీజన్లో 147.14 లక్షల టన్నుల పాలు, 9.54 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి కాగా, 2496.39 కోట్ల కోడి గుడ్ల ఉత్పత్తి జరిగింది. 2021–22 సీజన్లో 150 లక్షల టన్నుల పాలు, 10 లక్షల టన్నులు మాంసం, 2600 కోట్ల కోడి గుడ్లు ఉత్పత్తి సాధించబోతున్నట్టు అంచనా వేశారు. మత్స్య ఉత్పత్తులు 2019–20 సీజన్లో 41.75 లక్షల టన్నుల దిగుబడులురాగా, 2020–21లో 46.23 లక్షల టన్నులు వచ్చాయి. 2021–22 సీజన్లో 50.85 లక్షల టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నారు. జనవరి నెలాఖరు నాటికి 36.12లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు వచ్చాయని ఆరి్థక సర్వే తెలిపింది. -
‘టీకా’ వేశాం.. ఢోకాలేదు
న్యూఢిల్లీ: కరోనా వైరస్పరమైన సవాళ్లను అధిగమిస్తూ భారత్ అధిక వృద్ధి బాటలో ముందుకు దూసుకెళ్లనుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఎకానమీగా తన స్థానాన్ని నిలబెట్టుకోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9.2%, వచ్చే ఆర్థిక సంవత్సరం 8–8.5% స్థాయిలో వృద్ధి సాధించనుంది. భారీ స్థాయిలో కొనసాగుతు న్న టీకాల ప్రక్రియ, సరఫరా తరఫున సమస్యల పరిష్కారానికి అమలు చేస్తున్న సంస్కరణలు, నిబంధనల సరళీకరణ, భారీ ఎగుమతుల వృద్ధి వంటివి ఇందుకు దోహదపడనున్నాయి. సోమ వారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021–22 ఆర్థిక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఎకానమీకి తోడ్పాటునిచ్చేందుకు, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్థికపరంగా తగినంత వెసులుబాటు ఉందని సర్వే పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలకొన్న పరిస్థితులను విశ్లేషిస్తూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో తీసుకోతగిన చర్యలను సూచించే దీన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. మంగళవారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పెట్టుబడులకు, ఉపాధి కల్పనకు ఊతమిచ్చేలా మంత్రి తగు ప్రతిపాదనలు చేస్తారన్న అంచనాలు నెలకొన్న నేపథ్యంలో సర్వేలోని అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అదుపులోనే ద్రవ్యోల్బణం.. సరఫరా వ్యవస్థను మెరుగ్గా నిర్వహించడంతో పాటు ఇంధనాలపై సుంకాలను తగ్గించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా ధరలు దాదాపు అదుపులోనే ఉన్నాయని సర్వే పేర్కొంది. వంటనూనెలు, పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సి రావడం వల్ల రేట్లు పెరిగిపోయాయని .. కానీ ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించి కొంత మేర కట్టడి చేసిందని తెలిపింది. రిస్కులూ ఉన్నాయ్.. ఇంధన ధరలు అధిక స్థాయిల్లో ఉంటున్న నేపథ్యంలో దిగుమతిపరమైన ద్రవ్యోల్బణం కాస్త ఆందోళనకరంగా ఉండవచ్చని ఆర్థిక శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు, ఎకనమిక్ సర్వే ప్రధాన రూపకర్త సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. భారత్ తన ఇంధన అవసరాల కోసం 85% పైగా దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటున్న సంగతి తెలిసిందే. ఇంధన ధరలు అధికంగా ఉంటే ద్రవ్యోల్బణ రేటు కూడా భారీగా ఎగుస్తుంది. ‘‘ప్రపంచ ఎకానమీకి ఇది కష్టకాలం. మహమ్మారి కారణంగా తలెత్తిన అనిశ్చితితో ప్రస్తుతం ఏర్పడిన అవాంతరాలే కాకుండా దీర్ఘకాలికంగా కూడా ప్రభావాలు ఉండనున్నాయి. టెక్నాలజీలు, వినియోగదారుల ధోరణులు, సరఫరా వ్యవస్థలు, భౌగోళిక రాజకీయాం శాలు, వాతావరణం మొదలైన వాటన్నింటిలోనూ వేగవంతంగా మార్పులు వచ్చిన కారణంగా కోవిడ్ అనంతర ప్రపంచం గురించి అనిశ్చితి నెలకొంది’’ అని సన్యాల్ తెలిపారు. ముడి చమురు ధరలు బ్యారెల్కు ప్రస్తుతం 90 డాలర్ల స్థాయిలో తిరుగాడుతున్నప్పటికీ.. వచ్చే ఏడాది 70–75 డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని సర్వే అంచనా వేసింది. అలాగే వర్షపాతం సాధారణంగానే ఉంటుందని, అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు లిక్విడిటీ ఉపసంహరణను ఎకాయెకిన కాకుండా క్రమపద్ధతిలోనే చేయవచ్చని పేర్కొంది. అంతర్జాతీయంగా ఇంకా అనిశ్చితి నెలకొందని, మిగతా దేశాల్లో అధిక వడ్డీ రేట్లు గానీ లభిస్తే భారత్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోయే అవకాశాలు ఉన్నాయని పరోక్షంగా పేర్కొంది. సర్వేలో పేర్కొన్న 2022–23 వృద్ధి.. ప్రపంచ బ్యాంకు అంచనాలకు అనుగుణంగా, ఎస్అండ్పీ.. మూడీస్ అంచనాలకన్నా కాస్త అధికంగానే ఉన్నప్పటికీ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) 9% కన్నా తక్కువగానే ఉండటం గమనార్హం. ప్రైవేట్ పెట్టుబడుల జోరు.. ఎకానమీ పునరుజ్జీవానికి దోహదపడే స్థాయిలోనే ఆర్థిక స్థితిగతులు ఉండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకోగలవని సర్వే తెలిపింది. పన్ను వసూళ్లు మెరుగుపడటంతో ప్రభుత్వం తగు స్థాయిలో వ్యయాలు చేసేందుకు వెసులుబాటు లభించగలదని పేర్కొంది. క్రిప్టో కరెన్సీ పట్ల తటస్థ విధానం: సంజీవ్ సన్యాల్ దేశ ఆర్థిక స్థిరత్వంపై క్రిప్టో కరెన్సీల ప్రభావం ఉంటుంది కనుక.. వాటి నియంత్రణ విషయంలో తటస్థ వైఖరిని ప్రభుత్వం తీసుకుంటుందని సంజీవ్ సన్యాల్ అన్నారు. ప్రస్తుతానికి దేశంలో క్రిప్టో కరెన్సీల నిషేధం, అనుమతికి సంబంధించి ఎటువంటి చట్టాలు అమల్లో లేవు. సోమవారం పార్లమెంట్కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన ఆర్థిక సర్వేలోనూ క్రిప్టోల ప్రస్తావన లేకపోవడంపై సన్యాల్ మీడియా సమావేశంలో స్పందించారు. ‘మీకు తెలిసిందే ఈ అంశంపై ప్రభుత్వంలోను, ఆర్థిక శాఖ పరిధిలో, పార్లమెంట్లోనూ చర్చ నడుస్తోంది. ఆర్థిక స్థిరత్వ సమస్యలున్నాయి. మరోవైపు ఆవిష్కరణల కోణంలో చర్చ కూడా నడుస్తోంది. కనుక తటస్థ విధానాన్ని ఈ విషయంలో తీసుకోవడం జరుగుతుంది’ అని సన్యాల్ వివరించారు. సర్వేలో ఇతర హైలైట్స్.. ► ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ కరోనా పూర్వ స్థాయికి పుంజుకున్నాయి. 2022–23లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎకానమీ సర్వసన్నద్ధంగా ఉంది. ► కరోనా సవాళ్లను అధిగమించేందుకు ఇతర దేశాల తరహాలో ముందస్తుగా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించడం కాకుండా భారత్ .. ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు అనుగుణంగా విధానాలను అమలు చేసింది. డిమాండ్ నిర్వహణ కాకుండా సరఫరా వ్యవస్థపరమైన సంస్కరణలతో మహమ్మారి సృష్టించిన సమస్యలను ఎదుర్కొంది. ► భారీ ఎగుమతుల వృద్ధి, మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం దగ్గర ఉన్న వెసులుబాటు తదితర అంశాలు వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధికి తోడ్పడనున్నాయి. ► ఆర్థిక వ్యవస్థ మంచి స్థితిలో ఉండటంతో ప్రైవేట్ రంగ పెట్టుబడులు కూడా పుంజుకుని ఎకానమీ పునరుజ్జీవానికి దోహదపడగలవు. ► అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లోటు, రుణ భారాలు భారీగా పెరిగిపోయినప్పటికీ 2021–22లో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడనుంది. ► విదేశీ మారకం నిల్వలపరంగా ‘బలహీనమైన అయిదు’ దేశాల్లో ఒకటిగా కొనసాగిన భారత్ ప్రస్తుతం అత్యధికంగా ఫారెక్స్ నిల్వలున్న దేశాల్లో నాలుగో స్థానానికి ఎదిగింది. దీంతో విధానపరంగా మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు వెసులుబాటు లభించనుంది. ► బేస్ ఎఫెక్ట్ కారణంగానే టోకు ధరల ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉంటోంది. ఇది క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ► అంతర్జాతీయంగా కంటైనర్ మార్కెట్లో అవాంతరాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సముద్ర వాణిజ్యంపై ఈ ప్రభావం కొనసాగనుంది. మహమ్మారి తొలగితే పెట్టుబడులు రయ్: నాగేశ్వరన్ కరోనా మహమ్మారి నియంత్రణలోకి వస్తే సానుకూల పెట్టుబడుల వాతావరణం జోరందుకుని, ఉద్యోగ కల్పనకు దారితీస్తుందని నూతనంగా నియమితులైన కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) ఎ.అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. తక్కువ ఆదాయ వర్గాల వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. దేశంలో ఎక్కువ ఉపాధి కల్పించే నిర్మాణ రంగం ఇప్పటికే పుంజుకోవడం మొదలైనట్టు చెప్పారు. ‘‘ప్రభుత్వం 4 అంచెల విధానం అనుసరిస్తోంది. అనిశ్చిత సమయాల్లో ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా బాధిత వర్గాలకు అండగా నిలవడం. అదే సమయంలో ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టడం. మహమ్మారి కారణంగా నిర్మాణాత్మక, సరఫరా వైపు సంస్కరణల అవకాశాలను విడిచిపెట్టకపోవడం.. ఇలా ఎన్నో చర్యలు తీసుకుంది. సంస్కరణల ప్రక్రియపై ఎంతో శ్రద్ధ, ప్రాధాన్యం చూపిస్తోంది’ అని చెప్పారు. ‘‘ప్రపంచ ఎకానమీకి ఇది కష్టకాలం. పలు దఫాలుగా విజృంభిస్తున్న మహమ్మారి కారణంగా తలెత్తిన అనిశ్చితితో ప్రస్తుతం ఏర్పడిన అవాంతరాలే కాకుండా దీర్ఘకాలికంగా కూడా ప్రభావాలు ఉండనున్నాయి. టెక్నాలజీలు, వినియోగదారుల ధోరణులు, సరఫరా వ్యవస్థలు మొదలైన వాటన్నింటిలోనూ వేగవంతంగా మార్పులు వచ్చిన కారణంగా కోవిడ్ తర్వాత ప్రపంచమంతా అనిశ్చితి నెలకొన్నా భారత్ వీటిని అధిగమిస్తోంది ’’ – ఎకనమిక్ సర్వే ప్రధాన రూపకర్త సంజీవ్ సన్యాల్ ఈసారి 9.2%, వచ్చేసారి 8.5%.. 2021–22 సర్వే అంచనా ► కరోనా కష్టకాలంలోనూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఎకానమీగా భారత్ స్థానాన్ని నిలబెట్టుకోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9.2%, వచ్చే ఆర్థిక సంవత్సరం 8–8.5% స్థాయిలో వృద్ధి సాధించనుంది. ► భారీ స్థాయిలో కొనసాగుతున్న టీకాల ప్రక్రియ, సరఫరా తరఫున సమస్యల పరిష్కారానికి అమలు చేస్తున్న సంస్కరణలు, నిబంధనల సరళీకరణ, భారీ ఎగుమతుల వృద్ధి తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. సోమవారం పార్ల మెంటులో ప్రవేశపెట్టిన 2021–22 ఆర్థిక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ► 2025 ఆర్థిక సంవత్సరానికల్లా 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగాలని నిర్దేశించుకున్న క్రమంలో మౌలిక సదుపాయాల కల్పనపై 1.4లక్షల కోట్ల డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. ► ఎయిరిండియా విక్రయ వ్యవహారం.. డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం నిధులు సమకూర్చుకునేందుకే కాకుండా ప్రైవేటీకరణ ప్రక్రియకు గణనీయంగా ఊతం ఇవ్వగలదు. ► ఈ ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రంగం 3.9 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 3.6 శాతం. ఈ నేపథ్యంలో పంటల్లో వైవిధ్యానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు, నానో యూరియా వంటి ప్రత్యామ్నాయ ఎరువులకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి. -
సెమీకండక్టర్ల కొరత.. భారీగా పడిపోయిన కార్ల అమ్మకాలు!
సెమీకండక్టర్ల కొరత కారణంగా కార్ల తయారీ కంపెనీలు డిసెంబర్ 2021 నాటికి 7 లక్షల కార్లను సమయానికి అందించలేక పోయినట్లు నేడు కేంద్రం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వే 2021-22 తెలిపింది. సరఫరాలో ఆలస్యం కారణంగా 2021లో వాహన డెలివరీ సగటు సమయం(ఆర్డర్ తేదీ నుంచి డెలివరీ చేయడానికి గల మధ్య అంతరం) సుమారు 14 వారాలుకు చేరుకున్నట్లు తెలిపింది. ఈ ఎకనామిక్ సర్వే 2021-22లో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేసింది. 2021 డిసెంబరులో కార్ల తయారీదారులు దేశీయ మార్కెట్లో 2,19,421 ప్యాసింజర్ వాహనాలను విక్రయించారని, ఇది 2020తో పోలిస్తే అమ్మకాలు 13% తగ్గిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్(సీఐఏఎమ్) నివేదించింది. దేశంలో సెమీకండక్టర్ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఎకనామిక్ సర్వే తెలిపింది. సెమీకండక్టర్, డిస్ ప్లే తయారీ రంగాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.76,000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సెమీకండక్టర్ల కొరతకు కారణమవుతున్న సమయంలో ఈ పరిశ్రమను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వ జోక్యం చేసుకోవాల్సి వచ్చినట్లు సర్వే తెలిపింది. సరఫరా గొలుసుల్లో విచ్ఛిన్నం కారణంగా అనేక విభిన్న పరిశ్రమలకు చెందిన కంపెనీలు ఉత్పత్తిని తగ్గించడం లేదా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు నివేదిక తెలిపింది. (చదవండి: దేశంలోనే తొలి 3డీ గృహం.. 21 రోజుల్లో నిర్మాణం.. ఆనంద్ మహీంద్రా ఆసక్తి!) -
సెంచరీ కాదు డబుల్ సెంచరీ కూడా దాటేసిన టమాట, ఉల్లి ధరలు..! కారణం అదేనటా..!
కేంద్ర బడ్జెట్ 2022-23 సమావేశాలు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించడంలో లాంఛనంగా ప్రారంభమైనా విషయం తెలిసిందే. బడ్జెట్కు ముందు ఎంతో కీలకంగా పరిగణించే ఆర్థిక సర్వే 2021-22ను ఆర్థిక శాఖ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.ఆర్థిక సర్వే 2021-22కు సంబంధించిన కీలక వివరాలను చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) డాక్టర్ వీ అనంత నాగేశ్వరన్ నేతృత్వంలోని బృందం ఈ సర్వేను రూపొందించింది. అయితే గత ఏడాదిలో ప్రాంతాలను బట్టి దేశవ్యాప్తంగా టమాట, ఉల్లిగడ్డ ధరలు ఎందుకు పెరిగాయనే విషయాలను ఆర్థిక సర్వేలో పొందుపరిచారు. కారణాలు అవే..! గత ఆర్థిక సంవత్సరంలో హోల్సేల్ ప్రైజ్ సేల్ ఇండెక్స్ పైపైకి ఎగబాకింది. ప్రతి నెలలో డబ్ల్యూపీఐ ఇండెక్స్ ఎగబాకుతూ వచ్చింది. దీంతో నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. వీటితో పాటుగా టమాట, ఉల్లి ధరలు గత ఏడాది నవంబర్ వరకు సెంచరీ దాటేసి డబుల్ సెంచరీకు చేరువయ్యాయి. 2021లో టమాట, ఉల్లి ధరలు అధిక అస్థిరతకు గురైనాయి. అకాల వర్షాలు..! ఆయా రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా పంట నష్టంతో టమాటా, ఉల్లి ధరలు గణనీయంగా పెరిగాయి. ఆర్థిక సర్వే ప్రకారం పంజాబ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అకాల వర్షాలు ధరల పెంపు అనివార్యమైందని తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా టమాటా సరఫరాకు అంతరాయం కలగడంతో టమాటా ధరలపై ఒత్తిడి మరింత పెరిగింది. నవంబర్ 2021లో టమాట ధరలు కిలో రూ.100కి చేరాయి. మరోవైపు సరఫరా అడ్డంకులు కూడా ధరల పెరుగుదలకు కారణాలయ్యాయి. ఉల్లి ధరలు అస్థిరంగానే..! గత కొన్ని నెలలుగా ఉల్లి ధరలు కూడా అస్థిరంగానే ఉన్నాయి. ఉల్లి ధరలపై ఆర్ధిక సర్వేలో... సీజనల్ కాంపోనెంట్ రబీ పంట కాలంతో సమానంగా ఉల్లి ధరల్లో ఒత్తిడి కన్పించింది. డిసెంబర్లో ఉల్లి ధరలు గరిష్ట స్థాయికు చేరకున్నట్లు పేర్కొంది. ఆర్థికసర్వే సూచనలు ఇవే..! సామాన్యులకు ఉపశమనం కల్పించేలా...టమాట, ఉల్లి ధరలను నియంత్రించేందుకు ఆర్థిక సర్వే 2021-22 పలు సూచనలను చేసింది. సీజనల్, అకాల వర్షాలు రెండూ టమాట, ఉల్లిపాయల ధరల పెరుగుదలకు దోహదం చేస్తాయి. కాలానుగుణ ఉత్పత్తి విధానాల ఫలితంగా ధరలలో కాలానుగుణతకు విధానపరమైన శ్రద్ధ అవసరమని తెలిపింది. టమోటా మిగులు ఉత్పత్తి ప్రాసెసింగ్లో పెట్టుబడులు, ఉల్లి ప్రాసెసింగ్, నిల్వ మౌలిక సదుపాయాలను ప్రోత్సహించాలి. ఉత్పత్తి వృధాను తగ్గించడం, మెరుగైన సరఫరా గొలుసు నిర్వహణ కూడా డిమాండ్ను తీర్చడంలో సహాయపడుతుందని ఆర్థిక సర్వే సూచించింది. చదవండి: Economic Survey: లోక్సభ ముందుకు ఆర్థిక సర్వే.. వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి ఎంతంటే? -
చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్కి ఏపీతోనూ అనుబంధం!
కేంద్ర బడ్జెట్ 2022 ముందు అనూహ్యంగా డాక్టర్ వీ అనంత నాగేశ్వరన్ను చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (CEA)గా కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. కేవీ సుబ్రమణియన్ మూడేళ్ల పదవీకాలం గత డిసెంబర్లోనే ముగియగా.. ఇప్పుడు అనంత నాగేశ్వరన్ను ఆ స్థానంలో నియమించారు. ఈ నేపథ్యంలో ఈయన నేపథ్యంపై ఓ లుక్కేద్దాం. అనంత నాగేశ్వరన్ ఆర్థిక మేధావి మాత్రమే కాదు.. రచయిత, టీచర్, ఎకనమిక్ కన్సల్టెంట్ కూడా. ప్రధాని నేతృత్వంలోని ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్లో 2019-2021 మధ్య పార్ట్టైం మెంబర్గా ఈయన ఉన్నారు. గతంలో క్రెడిట్ సుయిస్సె గ్రూప్ ఏజీ, జూలియస్ బాయిర్ గ్రూప్ల్లోనూ ఈయన ఎగ్జిక్యూటివ్గా పని చేశారు. అంతకు ముందు బిజినెస్ స్కూల్స్, భారత్లోని కొన్ని మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్స్లో, సింగపూర్లో పని చేశారు. ఐఎఫ్ఎంఆర్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్గా కూడా వ్యవహరించారు. ప్రస్తుత సీఈఏకు ఆంధ్రప్రదేశ్తోనూ అనుబంధం ఉంది. క్రి(క్రె)యా యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గానూ కొంతకాలం ఈయన పని చేశారు. తమిళనాడు మధురైలో స్కూలింగ్, కాలేజీ చదువులు పూర్తి చేసుకున్న నాగేశ్వరన్.. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేసుకున్నారు. 1994లో మస్సాషుసెట్స్ యూనివర్సిటీ నుంచి ఫైనాన్స్లో(empirical behaviour of exchange rates మీద) డాక్టరేట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే ఎనకమిక్ సర్వే అనేది సాధారణంగా సీఈఏ ప్రిపేర్ చేస్తారు. కానీ, బడ్జెట్కు ముందు ఆ స్థానం ఖాళీగా ఉండడంతో ప్రిన్స్పల్ ఎకనమిక్ అడ్వైజర్, ఇతర అధికారులు సర్వే నివేదికను రూపొందించడం గమనార్హం. అంటే.. ఈ దఫా సర్వేలో సీఈఏ లేకుండానే రూపొందగా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్రపతి ప్రసంగం అనంతరం దానిని ప్రవేశపెట్టారు. సంబంధిత వార్త: బడ్జెట్కు ముందే నాగేశ్వరన్ ఎంపిక.. ఎందుకు? -
లోక్సభ ముందుకు ఆర్థిక సర్వే.. కొత్త ఒరవడికి శ్రీకారం
కేంద్ర బడ్జెట్ 2022-23 సమావేశాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించడంలో బడ్జెట్ సమావేశాలకు తెర లేచింది. దీంతో బడ్జెట్కు ముందు ఎంతో కీలకంగా పరిగణించే ఆర్థిక సర్వే 2021-22ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతరామన్ లోక్సభ ముందుకు తెచ్చారు. ఈసారి ఆర్థిక సర్వే సింగిల్ వాల్యూమ్గా రానుంది. ఈ సర్వేలో కీలక అంశాల విషయానికి వస్తే వచ్చే ఆర్థిక సంవత్సరానికి దాదాపు 9 శాతం వృద్ధిని అంచనా వేసింది. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్యసభ ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక సర్వే బహిరంగపరచబడుతుంది. ఎంతో కీలకం..! బడ్జెట్-2022కు ముందు ఆర్థిక సర్వే ఎంతో కీలకంగా మారనుంది. ప్రతీ ఏడాది బడ్జెట్ సెషన్లో సమర్పించే ఆర్థిక సర్వే చాలా ముఖ్యమైనది. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరిస్తుంది. ఆర్థిక సర్వే(Economic Survey 2021-22) ప్రతి సంవత్సరం బడ్జెట్కు ముందు రెండు సంపుటాలుగా సమర్పిస్తారు. ఈ సారి మాత్రం ఒకే సంపుటిగా ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టారు. బ్లూమ్బర్గ్ ప్రకారం FY22గాను జీడీపీ గ్రోత్ రేట్ 9.2 శాతం ఉంటుందని వెల్లడించింది. అవి కనిపించకపోవచ్చును...! భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎదురవుతున్న అడ్డంకులను ఎలా ఎదుర్కొంటారనే దానిపై పూర్తి వివరణ ఈసారి ఆర్థిక సర్వేలో కనిపించకపోవచ్చు. సాధారణంగా, ఆర్థిక సర్వేలో వారు రాబోయే అడ్డంకులు, వాటిని ఎదుర్కోవటానికి రోడ్మ్యాప్ గురించి పూర్తి వివరాలను ఇందులో ఉంటాయి. ఆర్థిక సర్వేలోని పలు కీలక అంశాలు.. ► వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ గ్రోత్ రేట్ 8 నుంచి 8.5 శాతంగా ఉండనుంది. ► గత ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ గ్రోత్ రేట్ 9.2 శాతం. ► వ్యవసాయ రంగంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రోత్ రేట్ 3.9 శాతం. ► పారిశ్రామిక రంగ వృద్ధి రేట్ 11.8 శాతం. ► సర్వీస్ సెక్టార్ వృద్ధి రేట్ 8.2 శాతం ► 2021-22లో భారత దేశ ఎగుమతులు 16.5 శాతం పెరుగుతాయని అంచనా. ► 2021-22లో దిగుమతులు 29.4 శాతం పెరుగుతాయని అంచనా ► భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతున్న దేశాల విజయవంతమైన వాతావరణ చర్యకు క్లైమేట్ ఫైనాన్స్ కీలకమని పేర్కొన్న సర్వే ► అమెరికా, చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. ► డిసెంబర్ 2021లోనే దేశంలో రూ.8.26 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరగడంతో UPI ప్రధాన దశకు చేరుకుంది. ► చాలా రాష్ట్రాల్లో తగ్గిన పన్నుల నేపథ్యంలో కోవిడ్ తిరోగమనం తర్వాత గృహాల అమ్మకాలు ఊపందుకుంటాయని అంచనా ► దేశంలో ఆర్థిక కార్యకలాపాలు కరోనా పూర్వస్థితికి చేరుకున్నాయి. ► 2022-23లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్థిక వ్యవస్థ సంసిద్ధంగా ఉంది. ► 2021 ఆర్థిక సంవత్సరంలో లోటు పెరిగినప్పటికీ.. 2021-22లో ప్రభుత్వ ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ► టీకాల సరఫరా, సరఫరా విభాగంలో అమలు చేసిన సంస్కరణలు 2023 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధిని నిర్దేశిస్తాయి. ► ఎగుమతుల వృద్ధి బలంగా ఉండటం కూడా ఆర్థిక పురోగతికి తోడ్పడుతుంది. ► బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన ఐదు దేశాల జాబితా నుంచి అత్యధిక ఫారెక్స్ నిల్వలు ఉన్న నాలుగు దేశాల్లో ఒకటిగా భారత్ ఎదిగింది. ► వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచించింది. ఆర్థిక సర్వే సూచనలు ► సాంకేతికతను ఉపయోగించి.. చిన్న కమతాల్లో ఉత్పాదకత పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. ► రైతులు వైవిధ్యమైన పంటలు పండించేలా చూడాలి. నూనె గింజలు, పప్పుధాన్యాలు, ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలి. ► 2070 నాటికి భారత్ కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి(నెట్ జీరో) తీసుకురావాలంటే.. క్లైమెట్ ఫైనాన్స్ను విజయవంతంగా నిర్వహించడం ముఖ్యం. చదవండి: 2022–23 కేంద్ర బడ్జెట్కి వేళాయే ! -
మెప్పించని ఆర్థిక సర్వే.. నష్టాల్లో మార్కెట్
ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2020–21 ఆర్థిక సర్వే ఇన్వెస్టర్లను మెప్పించకపోవడంతో మార్కెట్ శుక్రవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 589 పాయింట్లు పతనమై 46,286 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 183 పాయింట్లను కోల్పోయి 13,635 వద్ద నిలిచింది. సూచీలకిది ఆరోరోజూ నష్టాల ముగింపు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం, బలహీన అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. బ్యాంకింగ్, రియల్టీ రంగ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అత్యధికంగా ఐటీ షేర్లు నష్టపోయాయి. ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 1263 పాయింట్ల రేంజ్లో కదలాడింది. నిఫ్టీ సైతం 150 పాయింట్లు పరిధిలో ట్రేడైంది. దేశీయ ఫండ్లు(డీఐఐ)లు రెండోరోజూ రూ.2,443 కోట్ల షేర్లను కొని నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్ఐఐలు రూ. 5933 కోట్ల భారీ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ‘‘ప్రభుత్వం ప్రకటించిన అంచనాల ప్రకారం భారత ఆర్థికవ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.7 శాతం క్షీణించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ కో?లుకునేందుకు దీర్ఘకాలం పడుతుందనే సంకేతాలతో ప్రపంచ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. మరోవైపు ఎఫ్ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ ఉధృతంగా ఉంది. ఈ పరిణామాలతో బడ్జెట్కు ముందు మార్కెట్లో భారీ ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది.’’ అని జియోజిత్ ఫైనాన్స్ ఫైనాన్సియల్ సర్వీస్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. ఆరు రోజుల్లో రూ.11.57 లక్షల కోట్లు ఆవిరి..! మార్కెట్ ఆరురోజుల పతనంతో ఇన్వెసర్లు రూ.11.57 లక్షల కోట్లను నష్టపోయారు. ఫలితంగా ఇన్వెసర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ గరిష్టస్థాయి రూ.197.46 లక్షల కోట్ల నుంచి రూ. 186.12 లక్షల కోట్లకు దిగివచ్చింది. శుక్రవారం ఒక్కరోజే రూ. 2.01 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఇదే ఆరురోజుల్లో సెన్సెక్స్ 3,506 పాయింట్లు, నిఫ్టీ 1,010 పాయింట్లను కోల్పోయాయి. నిరాశపరిచిన ఐఆర్ఎఫ్సీ ఐపీఓ లిస్టింగ్..! గడిచిన వారంలో ఐపీఓను పూర్తిచేసుకున్న ఐఆర్ఎఫ్సీ షేర్లు లిస్టింగ్లో నిరాశపరిచాయి. ఇష్యూ ధర రూ.26 తో పోలిస్తే బీఎస్ఈలో 3.84 శాతం(రూపాయి)నష్టంతో రూ.25 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇంట్రాడేలో మరింత అమ్మకాల ఒత్తిడికి లోనై 6.53 శాతం క్షీణించి రూ.24.30 కు చేరుకుంది. చివరికి 4.42 శాతం పతనమైన రూ.24.85 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ వ్యాల్యుయేషన్ రూ.32,475 కోట్లుగా నమోదైంది. దాదాపు రూ.4,633 పరిమాణం కలిగిన ఈ ఐపీఓకు 3.49 రెట్ల అధిక సబ్స్క్రిప్షన్ లభించిన సంగతి తెలిసిందే. -
2021–22లో ఆర్థిక వ్యవస్థ ‘వి’ షేప్ జోరు..
‘‘మరిన్ని సంస్కరణలు దేశానికి అవసరం. ముఖ్యంగా వ్యవసాయాన్ని ఆధునికీకరించడమే కాదు.. వ్యాపార సంస్థగా చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే స్థిరమైన వృద్ధి సాధ్యపడుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా భరిస్తున్న ఆహార సబ్సిడీ బిల్లును తగ్గించుకోక తప్పని పరిస్థితి. పీడీఎస్ రేట్లను పెంచాల్సిందే. ప్రజారోగ్యంపై మరిన్ని నిధులను వెచ్చించడం ద్వారా.. ఆరోగ్యం, వైద్యం కోసం ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని దించాల్సిన అవసరం ఉంది. కరోనాతో చతికిలపడిన దేశ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో బలంగా పురోగతి సాధిస్తుంది. 2021–22లో 11 శాతం వృద్ధి రేటుకు పుంజుకుంటుంది. ఇందుకు క్రమబద్ధమైన చర్యల మద్దతు కూడా ఉండాలి’’ అంటూ 2020–21 ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను శుక్రవారం పార్లమెంటు ముందుంచారు. ఏటా బడ్జెట్కు ముందు విడుదల చేసే ఆర్థిక సర్వే ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిఫలిస్తుంటుంది. న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ 11 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. నామినల్ జీడీపీ 15.4 శాతంగా ఉంటుందని తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020–21లో జీడీపీ మైనస్ 7.7 శాతానికి పడిపోవచ్చన్న అంచనాలను ప్రస్తావిస్తూ.. రానున్న ఆర్థిక సంవత్సరంలో వీ షేప్ రికవరీ (పడిపోయిన తీరులోనే వేగంగా పురోగమించడం) సాధిస్తుందని పేర్కొంది. కరోనా నివారణ వ్యాక్సిన్ల కార్యక్రమం ఇందుకు చేదోడుగా నిలుస్తుందని ఆర్థిక సర్వే తెలిపింది. జీడీపీ చివరిగా 1979–80 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 5.2 శాతం వృద్ధిని చవిచూసింది. వ్యవసాయ రంగం ఒక్కటీ ఆశాకిరణంగా కనిపిస్తోందంటూ.. సేవలు, తయారీ, నిర్మాణరంగాలు లాక్డౌన్లతో ఎక్కువగా ప్రభావితమైనట్టు ఆర్థిక సర్వే పేర్కొంది. సంస్కరణలు, నియంత్రణల సరళీకరణ, మౌలిక రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక పథకంతో తయారీ రంగానికి ఊతమివ్వడం, వ్యాక్సిన్లతో విచక్షణారహిత వినియోగం పుంజుకోవడం, తక్కువ వడ్డీ రేట్లతో రుణాల లభ్యత పెరగడం వంటివి వృద్ధికి దోహదపడతాయని అంచనా వేసింది. 17 ఏళ్ల తర్వాత కరెంటు ఖాతా మిగులును చూపించబోతున్నట్టు తెలిపింది. ‘‘అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ ద్రవ్యపరమైన చర్యలు చిన్నగానే ఉన్నాయి. కానీ, ఆర్థిక రికవరీకి అవి ఎంతగానో తోడ్పడ్డాయి. దీంతో భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని ద్రవ్యపరమైన ప్రోత్సాహక చర్యలను ప్రకటించేందుకు వెసులుబాటు ఉంది’’ అని సర్వే పేర్కొంది. రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. సాగు.. సంస్కరణల బాట వ్యవసాయ రంగాన్ని ఆధునిక వ్యాపార సంస్థగా చూడాల్సిన అవసరం ఉందని.. స్థిరమైన, నిలకడైన వృద్ధి కోసం ఈ రంగంలో సత్వరమే సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే ప్రస్తావించింది. ‘‘వ్యవసాయరంగంలో పురోగతి దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న తక్కువ ఆదాయ వర్గాల భవిష్యత్తును నిర్ణయించనుంది. అందుకే గ్రామీణ ఉపాధి హామీ రంగంగా కాకుండా ఆధునిక వ్యాపార సంస్థగా వ్యవసాయ రంగాన్ని చూడాల్సిన అవసరం ఉంది’’ అని విశదీకరించింది. కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశ వ్యవసాయ రంగం తన బలాన్ని చాటుకుంటుందని పేర్కొంది. జీడీపీలో భాగమైన ఇతర రంగాలు కరోనాతో నేలచూపులు చూసిన వేళ, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు ఒక్కటే ఆశాకిరణంలా నిలిచాయని తెలిపింది. రుణ, మార్కెట్ సంస్కరణలు, ఆత్మనిర్భర్ భారత్ కింద ఆహార శుద్ధికి తీసుకున్న చర్యలతో వ్యవసాయ రంగం పట్ల ఆసక్తి పెరిగిందని వివరించింది. దేశంలో సమ్మిళిత వృద్ధి అన్నది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లేకుండా సాధ్యం కాదంటూ.. ఇది వ్యవసాయరంగంపైనే ప్రధానంగా ఆధారపడి ఉందని పేర్కొంది. ‘‘నీటిపారుదల కింద సాగు విస్తీర్ణం పెరగాల్సి ఉంది. హైబ్రిడ్, ఇతర మెరుగుపరిచిన విత్తనాల వాడకం, భిన్నమైన వంగడాల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అదే విధంగా విత్తన పరీక్షా కేంద్రాలను పెంచడం వంటివి తక్కువ ఉత్పాదకత ఆందోళనలను తగ్గిస్తుంది’’ అంటూ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సాగు రంగం విషయమై సర్వే తన విస్తృతాభిప్రాయాలను తెలియజేసింది. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అనంతరం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రస్తావిస్తూ.. గ్రామస్థాయి కొనుగోళ్ల కేంద్రాలు, ఉత్పత్తి, ప్రాసెసింగ్, గ్రామీణ మార్కెట్ల అభివృద్ధి, ఏపీఎమ్సీ మార్కెట్లకు బయట విక్రయించుకునే అవకాశం, గోదాముల నవీకరణ, రైల్వే రవాణా సదుపాయాల అభివృద్ధి అవసరమని తెలియజేసింది. ఈ చర్యలు ఉత్పత్తి అనంతరం నష్టాలను తగ్గించడమే కాకుండా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి కూడా సాయపడతాయని ఆర్థిక సర్వే తెలిపింది. మరింత పరిజ్ఞానంతో సాగు చేస్తే ఫలితాలు అధికమవుతాయని సూచిస్తూ.. ఇందుకోసం గ్రామీణ వ్యవసాయ పాఠశాలల ఏర్పాటును ప్రస్తావించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు (అటవీ, మత్స్య) దేశ ఉపాధిలో సగం వాటా ఆక్రమిస్తుండగా.. జీడీపీలో 18 శాతాన్ని సమకూరుస్తున్నాయి. కొత్త చట్టాలతో రైతులకు స్వేచ్ఛ నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేలో బలంగా సమర్థించుకుంది. నూతన తరహా మార్కెట్ స్వేచ్ఛకు నూతన వ్యవసాయ చట్టాలు తోడ్పడతాయని పేర్కొంది. దేశంలో చిన్న, మధ్యతరహా రైతుల జీవితాలను దీర్ఘకాలంలో మెరుగుపరుస్తాయని తెలిపింది. మొత్తం రైతుల్లో 85 శాతంగా ఉన్న చిన్న, మధ్య స్థాయి వారికి ప్రయోజనం కల్పించే ఉద్దేశ్యంతోనే నూతన వ్యవసాయ చట్టాలను రూపొందించినట్టు వివరించింది. వీటికి వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలపై తన వాదనను సమర్థించుకుంది. వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ కమిటీల (ఏపీఎమ్సీ) విషయంలో సంస్కరణల అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కిచెప్పింది. మౌలిక రంగానికి ప్రాముఖ్యత.. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు వృద్ధికి ఊతమిచ్చేందుకు ఉత్తమ మార్గంగా ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. మొత్తం మీద ఆర్థికాభివృద్ధికి, స్థూల ఆర్థిక స్థిరత్వానికి మౌలిక రంగం కీలకమైనదిగా పేర్కొంది. అన్లాక్ తర్వాత ఆర్థిక వ్యవస్థ, మౌలిక రంగాలు వృద్ధి దిశగా పయనిస్తున్నాయంటూ, రోడ్ల నిర్మాణం తిరిగి కరోనా ముందు నాటి వేగాన్ని సంతరించుకుంటుందని అంచనా వేసింది. సంక్షోభానంతర సంవత్సరంలో (2021–22) క్రమబద్ధమైన చర్యల ద్వారా ఆర్థిక రికవరీకి వీలు కల్పించాలని, దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి దీర్ఘకాలిక వృద్ధి క్రమంలోకి కుదురుకునేలా చూడాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. 2020–25 కాలంలో రూ.111 లక్షల కోట్ల జాతీయ మౌలిక సదుపాయాల నిధి అన్నది దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేదిగా అభివర్ణించింది. ఇన్ఫ్రాలో ప్రైవేటు పెట్టుబడులను పెంచేందుకు ప్రభుత్వం పీపీపీ అప్రైజల్ కమిటీని ఏర్పాటు చేసినట్టు.. ఈ కమిటీ రూ.66,600 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులను సిఫారసు చేసినట్టు తెలియజేసింది. ‘రేషన్’ రేట్లను పెంచాల్సిందే ఆహార సబ్సిడీ నిర్వహించలేని స్థితికి చేరిందంటూ స బ్సిడీలను తగ్గించుకోక తప్పని పరిస్థితి ఉందంటూ ఆర్థిక సర్వే పేర్కొంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా 80 కోట్ల మందికి పైగా విక్రయిస్తున్న ఆహార ధాన్యాల ధరలను ప్రభుత్వం పెంచాలంటూ సూచించింది. రేషన్ షాపుల్లో బియ్యం కిలో ధర రూ.3, గోధుమలు కిలో రూ.2, ముతక ధాన్యాల ధరలు కిలో రూ.1గా ఉన్నట్టు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం చెబుతోంది. పీడీఎస్ ద్వారా ఆహారోత్పత్తులపై సబ్సిడీ కోసం 2020–21 బడ్జెట్లో కేంద్రం రూ.1,15,569 కోట్లను కేటాయించడం గమనార్హం. ప్రజారోగ్యానికి పెద్దపీట.. ప్రజారోగ్యం కోసం జీడీపీలో కేటాయింపులను ఒక శాతం నుంచి 2.5–3 శాతానికి పెంచాలంటూ ఆర్థిక సర్వే ముఖ్యమైన సూచన చేసింది. దీనివల్ల ప్రజలు తమ జేబుల నుంచి చేసే ఖర్చును తగ్గించడం సాధ్యపడుతుందని తెలిపింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయాలు పెరిగితే.. అది ప్రస్తుతమున్న ఖర్చులు 65 శాతం నుంచి 30 శాతానికి తగ్గేందుకు తోడ్పడుతుందని వివరించింది. లాక్డౌన్ విధానం కరోనా కేసులను నివారించడంతోపాటు లక్షమంది ప్రాణాలను కాపాడిందని సర్వే పేర్కొంది. సంక్షోభాలను తట్టుకునేవిధంగా ఆరోగ్య సదుపాయాలను అభివృద్ధి చేయాలని.. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకూ మెరుగైన వైద్య సేవల కోసం టెలీమెడిసిన్ విధానాన్ని మరింత బలోపేతం చేయాలని సర్వే సూచించింది. గ్రామీణ విద్యార్థుల్లో స్మార్ట్ఫోన్ల జోరు గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ఫోన్లను కలిగిన విద్యార్థులు 36 శాతం నుంచి 2020–21లో 61 శాతానికి పెరిగినట్టు ఆర్థిక సర్వే ప్రస్తావించింది. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే, విద్యా పరంగా అసమానతలను తగ్గించొచ్చని సూచించింది. ‘‘డేటా నెట్వర్క్, కంప్యూటర్, ల్యాప్ట్యాప్, స్మార్ట్ఫోన్ల సేవలకు ప్రాధాన్యం పెరిగింది. డిస్టెన్స్ లెర్నింగ్, గ్రామీణ ప్రాంతాల నుంచి పనిచేసే అవకాశం ఇందుకు కారణం’’ అని సర్వే తెలిపింది. విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలను ఇందులో ప్రస్తావించింది. దేశ రుణ భారం కచ్చితంగా దిగొస్తుంది వృద్ధి రుణ స్థిరత్వానికి దారితీస్తుంది. ఒకవేళ భారత్ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 2023–2029 మధ్య 3.8% కనిష్ట రేటు నమోదైనా కానీ, దేశ రుణ భారం కచ్చితంగా దిగొస్తుంది. భారత్ తప్పకుండా వృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీంతో మరింత మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం సాధ్యపడుతుంది. వృద్ధి 85% పేదరికాన్ని తగ్గించగలదు. జీడీపీలో ప్రజారోగ్యంపై ఖర్చును 2.5%కి పెంచితే.. అది ఒక సాధారణ కుటుంబం ఆరోగ్యం కోసం చేసే ఖర్చును 65% నుంచి 35%కి తగ్గిస్తుంది. – కేవీ సుబ్రమణియన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు సర్వే ఇంకా ఏం చెప్పిందంటే.. ► ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని వంద సంవత్సరాల్లో ఒక్కసారి వచ్చే సంక్షోభంగా ఆర్థిక సర్వే అభివర్ణించింది. ► ప్రభుత్వ వినియోగం, ఎగుమతులు వృద్ధికి మరింత మద్దతుగా నిలుస్తాయి. 2020–21 ద్వితీయార్ధంలో ఎగుమతులు 5.8% తగ్గొచ్చు. దిగుమతులు సైతం 11.3 శాతం తగ్గొచ్చు. ► 2020–21లో కరెంటు ఖాతాలో 2% మిగులు. ► రేటింగ్ ఏజెన్సీలు భారత్ విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలను సార్వభౌమ రేటింగ్ ప్రతిఫలించడం లేదు. ఇంత వరకు ఒక్క డిఫాల్ట్ రేటింగ్ లేని విషయాన్ని అర్థం చేసుకోవాలి. ► 2014–15 లో ప్రతీ రోజూ 12 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం కొనసాగగా.. అది 2018–19 నాటికి 30 కిలోమీటర్లకు పెరిగింది. 2020–21లో రోడ్ల నిర్మాణం కరోనా కారణంగా రోజువారీ 22 కిలోమీటర్లకు పడిపోయింది. అన్లాక్తో తిరిగి ఇది పుంజుకోనుంది. ► కరోనా మహమ్మారి సవాళ్లలోనూ భారత ఏవియేషన్ పరిశ్రమ నిలదొక్కుకుని, దీర్ఘకాలంలో బలంగా పుంజుకోగలదని నిరూపించింది. ► 2019 జూలై నుంచి 2020 అక్టోబర్ మధ్య రూ.8,461 కోట్లతో 37 సాగర్మాల ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగింది. ► రైల్వే రంగంలో పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అనుమతించింది. తద్వారా రూ.30వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ► కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ప్రేరణనిచ్చేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలను ప్రకటించగా.. ఆర్థిక వ్యవస్థ రికవరీ సంతరించుకున్న వెంటనే వీటిని ఉపసంహరించుకోవడంతోపాటు, ఆస్తుల నాణ్యత మదింపు చేపట్టాలి. ► విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్ ఇప్పటికీ స్వర్గధామం. 2020 నవంబర్లో విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో 9.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వర్ధమాన దేశాల్లో ఎఫ్పీఐలను ఆకర్షించింది భారత్ ఒక్కటే. ► భారత కంపెనీలు 2020–21లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.92,000 కోట్లను సమీకరించాయి. ఇది అంతక్రితం సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 46 శాతం అధికం. ► 9–12 తరగతుల విద్యార్థులకు దశల వారీగా వొకేషనల్ కోర్సులు. ► సామాజిక రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వ్యయం 2020–21లో రూ.17.16 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. ► కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం... ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎమ్–జేఏవై)ను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో, అమలు చేయని రాష్ట్రాలతో పోలిస్తే ఆరోగ్య ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. బీమా వ్యాప్తి పెరిగి, శిశు, చిన్నారుల మరణాల రేటు తగ్గేందుకు దోహదపడుతోంది. ► పన్నుల వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచేందుకు పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల పరిష్కారాన్ని పటిష్టం చేయాలి. ఇందుకోసం స్వతంత్ర వ్యవస్థ. ► ఐటీ–బీపీఎమ్ రంగం 2019–20లో 7.9 శాతం వృద్ధిని సాధించింది. ► పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ విస్తరణ ఎంతో వేగాన్ని సంతరించుకుంది. డేటా వ్యయం తగ్గి మరింత అందుబాటులోకి వచ్చింది. నెలవారీ సగటున ఒక చందాదారు వైర్లెస్ డేటా వినియోగం 2019లో మార్చి నాటికి 9.1జీబీగా ఉంటే 2020లో 12.2 జీబీకి పెరిగింది. ► ద్రవ్యోల్బణం వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా చూసేందుకు ఆహారోత్పత్తులకు ఉన్న వెయిటేజీలో మార్పులు చేయాలి. కోవిడ్–19 మహమ్మారిపరమైన గడ్డుకాలం గట్టెక్కామని, ఎకానమీ తిరిగి వేగంగా కోలుకుంటుందన్న ఆశాభావం సర్వేలో వ్యక్తమైంది. టీకాల లభ్యత, సేవల రంగం రికవరీ వంటి అంశాలు వృద్ధికి మరింతగా ఊతమివ్వగలవు. – చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్ జనరల్, సీఐఐ ఎకానమీ ప్రస్తుత అవసరాలకు తోడ్పడే పలు కీలక అంశాలను సర్వేలో పొందుపర్చారు. రాబోయే బడ్జెట్లోనూ ఇవి ప్రతిఫలించగలవని ఆశిస్తున్నాం. మరిన్ని రంగాలు పటిష్టమైన వృద్ధి బాట పట్టాలంటే 2021 ఆసాంతం ప్రభుత్వం నుంచి నిరంతరం సహాయ, సహకారాలు అవసరం. – ఉదయ్ శంకర్, ప్రెసిడెంట్, ఫిక్కీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాలతో సర్వే ఆశావహ దృక్పథంతో రూపొందింది. కోవిడ్–19 వైరస్ను కట్టడి చేయడంతో పాటు పూర్తిగా నిర్మూలించగలిగితే 2021–22లో మరింత అధిక స్థాయిలోనూ వృద్ధి సాధించగలిగే అవకాశం ఉంది. – దీపక్ సూద్, సెక్రటరీ జనరల్, అసోచాం -
కోవిడ్ను సమర్థంగా ఎదుర్కొన్న ఏపీ
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలిచిందని, కోవిడ్ మరణాల అంచనా ప్రకారం చూస్తే భారీసంఖ్యలో ప్రజల ప్రాణాలను కాపాడిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2020–21 స్పష్టం చేసింది. ‘శతాబ్దానికి ఓసారి వచ్చే సంక్షోభంలో ప్రాణాలు, జీవనోపాధిని కాపాడడం’ అన్న శీర్షికన ఆర్థిక సర్వే తన మొదటి చాప్టర్లో ఈ అంశాలను ప్రస్తావించింది. అనిశ్చిత పరిస్థితుల మధ్య అత్యధిక జనసాంద్రత ఉన్న దేశంలో నష్టాన్ని తగ్గించేందుకు తీసుకున్న చర్యల వల్ల అంచనాల కన్నా సుమారు 37 లక్షల కేసులను తగ్గించగలిగామని, దాదాపు లక్ష ప్రాణాలు కాపాడగలిగామని ఆర్థిక సర్వే పేర్కొంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, బిహార్ రాష్ట్రాలు కేసుల వ్యాప్తిని మెరుగ్గా నిరోధించగలిగాయని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు ఎక్కువ సంఖ్యలో ప్రాణాలను కాపాడగలిగాయని తెలిపింది. కేసుల వ్యాప్తి నిరోధం, ప్రాణాలు కాపాడడంలో మహారాష్ట్ర పనితీరు ప్రభావవంతంగా లేదంది. కోవిడ్ పరీక్షల నిర్వహణలో జాతీయ సగటు లక్షకు 14,081గా ఉండగా.. ఆంధ్రప్రదేశ్లో లక్ష జనాభాలో 22 వేల మందికి పరీక్షలు జరిపినట్టు తెలిపింది. రెవెన్యూ వసూళ్లలో వేగం.. ► కోవిడ్ మహమ్మారి కారణంగా రెవెన్యూ వసూళ్లలో ‘వీ షేప్’ వృద్ధి కనబడగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెవెన్యూ వసూళ్లు వేగంగా పుంజుకున్నాయని, జూన్ మాసం నాటికే ఈ మార్పు కనిపించిందని సర్వే వెల్లడించింది. గుజరాత్, హరియాణాలో జూలై నాటికి, మహారాష్ట్రలో ఆగస్టు నాటికి ఈ మార్పు కనిపించిందని వివరించింది. ఈవే బిల్స్ ఆధారంగా మార్పులను సర్వే విశ్లేషించింది. దేశీయ టూరిజం గమ్యస్థానాల్లో టాప్–5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. ► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4 తో పోల్చితే సర్వే–5లోని ఫేజ్–1లో ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరు కనబరిచింది. పిల్లల్లో ఎదుగుదల లోపం(స్టంటింగ్) తగ్గినట్టు తెలిపింది. అలాగే తక్కువ బరువు లోపాలు లేకుండా చూడడంలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరు చూపిందని పేర్కొంది. ► రాష్ట్ర నికర దేశీయ ఉత్పత్తి(నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్–ఎన్ఎస్డీపీ) 2018–19లో 8.9 శాతం ఉండగా.. 2019–20లో 12.9 శాతంగా ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. తలసరి ఆదాయం 2018–19లో రూ.1,51,173గా ఉండగా.. 2019–20 నాటికి రూ.1,69,519కి పెరిగిందని సర్వే తెలిపింది. తలసరి ఆదాయం విషయంలో 2018–19లో 8.2 శాతం వృద్ధి రేటు ఉండగా.. 2019–20లో 12.1 శాతం వృద్ధిరేటు నమోదైందని వివరించింది. ఆ ఆరేళ్లలో అట్టడుగున... గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహాలకు తాగునీటి లభ్యత సూచీ(ఇండెక్స్) 2012, 2018తో పోల్చితే ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన అనేక రాష్ట్రాలు ప్రగతి కనబరిచాయని ఆర్థిక సర్వే తెలిపింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ అట్టడుగున నిలిచాయంది. 2012తో పోలిస్తే 2018 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రాంతీయ అసమానతలు చోటు చేసుకున్నాయని పేర్కొంది. జల్జీవన్ మిషన్ దీనిపై దృష్టి సారించాల్సి ఉందని పేర్కొంది. -
అస్పష్ట ఆర్థిక చిత్రం
ఒక అనిశ్చితి వాతావరణంలో దేన్నయినా స్పష్టంగా అంచనా వేయటం సమస్యే. బడ్జెట్కు ముందు గడిచిన సంవత్సర స్థితిగతుల్ని తెలిపే ఆర్థిక సర్వేను రూపొందించటంలో ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ సమస్యను ఎదుర్కొనివుంటుంది. కరోనా వైరస్ మహమ్మారి మన దేశంతోపాటు ప్రపంచ దేశాలన్నిటినీ చుట్టుముట్టి ఆర్థిక వ్యవస్థల్ని తలకిందులు చేసిన వర్తమానంలో అదంత సులభం కాదు. అయితే శుక్రవారం పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక సర్వే ఉన్నంతలో పరిస్థితిని అంచనా వేయటానికి ప్రయత్నించింది. దాని ఆధారంగా రాగల ఆర్థిక సంవత్సరం ఎలా వుండబోతు న్నదో తెలిపింది. కరోనా మహమ్మారిని అదుపు చేసే వ్యాక్సిన్లు అందుబాటులోకొచ్చాయి గనుక మన ఆర్థిక వ్యవస్థ మళ్లీ జవసత్వాలు పుంజుకునే అవకాశం వున్నదని ఆర్థిక సర్వే హామీ ఇస్తోంది. రాగల ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధి రేటు సాధ్యమేనని, ఆ మరుసటి సంవత్సరానికి 6.5 శాతం వృద్ధి వుండితీరుతుందని చెబుతోంది. కరోనా మహమ్మారి పర్యవసానంగా వర్తమాన ఆర్థిక సంవ త్సరంలో ఈ వృద్ధి మైనస్ 7.7 శాతానికి పడిపోయిందని అంచనా వేసింది. అయినా వీ షేప్ రిక వరీతో ఇది మళ్లీ కోలుకుంటుందని తెలిపింది. అంటే ఏ తీరులో వృద్ధి రేటు పడిపోయిందో అదే తీరులో మళ్లీ వేగంగా పుంజుకుంటుందని హామీ ఇచ్చింది. వివిధ రకాల సంస్కరణలు, ఇప్పుడున్న నియంత్రణలను సరళీకరించటం, మౌలిక రంగ పరిశ్రమల్లో పెట్టుబడుల్ని ప్రోత్సహించటం, తయారీ రంగానికి ప్రోత్సాహకాలు, స్వల్ప వడ్డీరేట్లతో రుణాల మంజూరు వంటి ప్రభుత్వ విధానాలే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికి తోడ్పడతాయని ఆర్థిక సర్వే భావించింది. అయితే ద్రవ్యలోటు తీవ్రంగా వుంది. ఆర్థిక సర్వే గణాంకాలే ఆ సంగతి చెబుతున్నాయి. ప్రభుత్వానికొచ్చే ఆదాయానికీ, దాని వ్యయానికీ మధ్య లోటు రూ. 11,58,469 కోట్లని సర్వే అంచనా వేసింది. ఆర్థిక ఒడిదుడుకు లను తట్టుకోవటం కోసం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు, ఆహార ధాన్యాల పంపిణీ వగైరాల కోసం ప్రభుత్వ వ్యయం బాగా పెరిగింది. కరోనావల్ల సేవా రంగం, తయారీ రంగం, నిర్మాణరంగం తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయితే లాక్డౌన్ కాలంలో చెప్పుకోదగ్గ ప్రధాన అంశం ఒకటుంది. అన్ని రంగాలూ కుంటుపడిన వేళ సాగు రంగం ఒక్కటే ఆర్థిక వ్యవస్థ వెనక దృఢంగా నిలబడింది. అది మరింత దిగజారిపోకుండా ఆదుకుంది. ఆర్థిక సర్వే కూడా దీన్ని గుర్తించింది. నిజానికి కరోనా వ్యాక్సిన్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాకుండానే ఆ వ్యాధి క్రమేపీ తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం ప్రజానీకంలో సామూహిక రోగ నిరోధకత ఏర్పడటమేనని వాదించేవారున్నారు. అందుకు ఉదాహరణగా బిహార్ ఎన్నికలను చూపుతున్నారు. భారీగా జనసమూహం పాల్గొన్న వేడుకలను ఉదహరిస్తున్నారు. కానీ ఆ విషయంలో తొందపడి నిర్ణయానికి రావటం అసాధ్యం. యూరప్ దేశాల్లోగానీ, అమెరికాలోగానీ ప్రస్తుతం వున్న పరిస్థితులే ఆ సంగతిని వెల్లడిస్తున్నాయి. అక్కడ అందరూ కరోనా వైరస్ దాదాపు నియంత్రణలోకొచ్చిందని స్వేచ్ఛగా సంచరించారు. కానీ ఆ సంతోషం ఎంతోకాలం నిలబడలేదు. ఇప్పుడు మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరిగింది. కొన్ని నెలల క్రితం ప్రారంభమైనట్టు కనబడిన ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. కనుక వీ షేప్ రికవరీ సాధ్యమేనని చెబుతున్న ఆర్థిక సర్వేను విశ్వసించి భరోసాతో వుండగలమా? కరోనా కాటుకు దేశవ్యాప్తంగా 1,53,847మంది మరణించారు. దాని వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం అమలు చేసిన లాక్డౌన్తో సర్వం స్తంభించిపోవటం వల్ల లక్షలాదిమంది ఉపాధి కోల్పో యారు. అన్ని వర్గాల ప్రజల ఆదాయమూ గణనీయంగా పడిపోయింది. కుటుంబాల నెలసరి ఆదాయం తగ్గిపోవటంతో వ్యయంపై దాని ప్రభావం పడింది. రేపన్న రోజు ఎలాగన్న అనిశ్చితి ఏర్పడటంతో ఖర్చుకన్నా పొదుపుపైనే జనం దృష్టి పెట్టారు. కేవలం తిండి, ఆరోగ్యంవంటి ప్రధాన అవసరాల కోసమే వెచ్చించే ధోరణి అలవడింది. చిన్న దుకాణాలు మొదలుకొని భారీ పరిశ్రమల వరకూ అన్నీ ఒడిదుడుకుల్లో పడ్డాయి. ఉత్పాదకత దెబ్బతింది. ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా కుంటుపడటంతో వివిధ వర్గాలు బ్యాంకులకు సక్రమంగా రుణాలు చెల్లిం చటం సాధ్యపడలేదు. బ్యాంకులు కూడా దీన్ని గమనించి రుణాల వసూళ్లలో సంయమనంతో వ్యవహరించాయి. దీన్ని సర్వే పరిగణనలోకి తీసుకుందా అన్న సందేహం వస్తోంది. ఎన్పీఏలు తగ్గాయో, పెరిగాయో బ్యాంకులు వసూళ్లు మొదలుపెడితేగానీ నికరంగా తెలియదు. ఆ రకంగా చూస్తే ఆర్థిక సర్వే మరీ ఎక్కువగా ఆశలు పెట్టుకుందేమోనన్న అభిప్రాయం కలుగుతోంది. అలాగే సాగు రంగ సంస్కరణలతో ఆ రంగం మరింత బలోపేతమవుతుందని సర్వే ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఆ సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన మూడు చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపి వేస్తామని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. పైగా ఆ చట్టాలపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో సాగు రంగ సంస్కరణలు ఎంతవరకూ సాధ్యమో చూడాల్సివుంది. అలాగే ఆహార సబ్సిడీల వ్యయం పెరిగిపోతున్న తీరును వివరిస్తూ దీన్ని అదుపు చేయాల్సి వుంటుం దని, అందుకోసం కేంద్ర జారీ ధరను పెంచాల్సివుంటుందని సూచిస్తోంది. అది కూడా అంత సులభమేమీ కాదు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితులను అధిగమించాలంటే గట్టి చర్యలు అవసరమవు తాయన్న ఆర్థిక సర్వే భావన సరైందే. అయితే ఆ చర్యలు ఏమిటన్నది ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లోగానీ తెలియదు. ఆ చర్యలు పకడ్బందీగా వుంటే భిన్న రంగాలు పుంజుకోవటం, మళ్లీ ఆర్థిక వ్యవస్థ తేరుకోవటం సాధ్యపడొచ్చు. ఆదాయానికీ, వ్యయానికీ మధ్య సమతూకం సాధిస్తూ ద్రవ్య లోటు విజృంభించకుండా చూడటం వర్తమాన పరిస్థితుల్లో కత్తిమీద సామే. రాగల బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆ పని ఎంత సమర్థవంతంగా చేయగలుగుతుందో చూడాలి. -
ఈ సర్వే కోవిడ్ యోధులకు అంకితం : సీఈఏ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణ, ప్రజల ప్రాణాలను కాపాడంలో ప్రభుత్వం చురుగ్గా, సమర్ధవంగా వ్యవహరించిందని ప్రధాన ఆర్థిక సలహాదారు( సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆర్థిక సర్వే 2020-21ని పార్లమెంటులో ప్రవేశపెట్టిన అనంతం సర్వేని మీడియా సమావేశంలో వివరించారు. ఈ సందర్బంగా కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ యాప్లో ఆర్థికసర్వే వివరాలను పొందుపర్చినట్టు వెల్లడించారు. అలాగే మహమ్మారిని దేశాన్ని రక్షించిన కోవిడ్ యోధులకు ఈ ఏడాది సర్వేను అంకితం చేసినట్టు తెలిపారు. కోవిడ్-19 కట్టడికిగాను విధించిన లాక్డౌన్ తదితర ఆంక్షల కారణంగా దేశంలో 3.7 మిలియన్ల కరోనా కేసులను నివారించగలిగామని పేర్కొన్నారు. మార్చి 31 తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 7.7 శాతంగా ఉండొచ్చని తెలిపారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో రియల్ జీడీపీ వృద్ధి 11 శాతంగా ఉంటుందని సర్వే అంచనా వేసిందన్నారు. కరోనా కట్టడిలో, బాధితుల మరణాల నివారణలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలు సమర్ధవంతంగా వ్యవహరించగా, మహారాష్ట్ర కరోనా కేసులు, మరణాల నివారణలో విఫలమైందని పేర్కొన్నారు. -
ఆర్థిక సర్వే : 11 శాతంగా జీడీపీ వృద్ధి
సాక్షి , న్యూఢిల్లీ: కరోనాసంక్షోభం, వాక్సినేషన్, మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య ఈ దశాబ్దంలో తొలి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలిరోజు కోవిడ్ సంబంధిత నిబంధనలతో కొలువు దీరిని ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. మెగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియతో శరవేగంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందనుందని ఆర్థిక సర్వే అభిప్రాయ పడింది. దీంతో లోక్సభ ఫిబ్రవరి 1 వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. మరోవైపు ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఏఈ) డాక్టర్ వి. కృష్ణమూర్తి సుబ్రమణియన్ ఈ రోజు విలేకరుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆర్థిక సర్వే : 2020-21 2020-21పూర్తి ఆర్థిక సంవత్సరానికిగాను వీ షేప్ రికవరీ ఉంటుందని, 2021-22 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2021 - మార్చి 2022 వరకు) జీడీపి వృద్ధి 11 శాతంగా అంచనా వేసింది. వ్యవసాయ రంగంపై కరోనా వైరస్ ప్రభావం పడలేదు. అన్ని రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ వ్యవసాయ రంగంలో మాత్రం వృద్ధి నమోదు చేసిందని తెలిపింది. కాంటాక్ట్ ఆధారిత సేవలు, తయారీ, నిర్మాణ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ వినియోగం, నికర ఎగుమతుల క్షీణత ఆర్థికవృద్ధిని బాగా ప్రభావితం చేశాయి. అయితే ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం రానున్న రెండేళ్ళలో వేగంగా దేశీయ ఆర్థికవ్యవస్థ పుంజుకోనుంది. 17 సంవత్సరాల్లో తొలిసారిగా 2021 ఏడాదిలో జీడీపీలో కరెంట్ ఖాతా మిగులు 2 శాతంగా ఉంటుంది. నిరుపేదలను పేదరికం నుంచి బయట పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికవృద్ధిపై దృష్టి పెట్టాలని కోరింది. కరోనా నేపథ్యంలో హెల్త్ కేర్ రంగంపై మరింత దృష్టి కేంద్రీ కరించాల్సి ఉందని సర్వే సూచించింది. అలాగే చురుకైన కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీలకు పిలుపు నిచ్చింది. ఆర్థిక సంక్షోభాలను పరిష్కరించే క్రమంలో రాజులకాలంనాటి పురాతన మార్గాలను ఉదాహరించింది. వినియోగాన్ని భారీగా పెంచాలని సాధారణ సంవత్సరాలతో పోలిస్తే మాంద్యం సమయంలో, మెండైన ఉపాధి అవకాశాల కల్పనతోపాటు, ప్రైవేటు రంగం ఆర్ధిక సంపదను మెరుగుపర్చడాకి కృషి చేయాలని శుక్రవారం విడుదల చేసిన సర్వే సిఫారసు చేసింది. కాగా కోవిడ్-19 విస్తరణ, పలువురు సభ్యులకు కరోనా సోకిన ఆందోళనల మధ్య వర్షాకాల సమావేశాలను కుదించారు. అలాగే శీతాకాల సమావేశాలను రద్దు చేసిన తరువాత జరుగుతున్న ఈ పార్లమెంటు సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీనికి తోడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని 17 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించినట్టు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. బడ్జెట్ సెషన్ తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయి. రెండో విడత సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్న సంగతి తెలిసిందే. -
ఏపీ సామాజిక, ఆర్థిక సర్వే 2019-20 నివేదిక విడుదల
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2019-20 నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, పుష్పశ్రీవాణి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా నివేదిక రూపొందించామని ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్కుమార్ అన్నారు. (చదవండి : రైతుల కోసం జగన్ సర్కార్ మరో ముందడుగు) ఏపీ సామాజిక, ఆర్థిక సర్వే 2019-20 నివేదికలోని ముఖ్యాంశాలు ► ప్రస్తుత ధరల్లో 2019-20 ఏడాది 12.73 శాతం పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) ►1.10 లక్షల కోట్ల రూపాయల జీఎస్డీపీ పెరుగుదల ►స్థిర ధరల్లో 8.16 శాతం జీఎస్డీపీ పెరుగుదల (దేశంలో సగటున 5శాతం మాత్రమే) ►స్థిర ధరల్లో జీఎస్డీపీ 6,72,018 కోట్ల రూపాయలు ►వ్యవసాయంలో అనుకూల వాతావరణం వల్ల 18.96 శాతం పెరిగిన వ్యవసాయ రంగం గ్రాస్ వాల్యూయాడెడ్ (జీవీఏ) ►11.67 శాతం పెరిగిన ఉద్యాన శాఖ జీవీఏ ►పరిశ్రమల రంగంలో స్థిర ధరల వద్ద 5.67 శాతం వృద్ధి ►సేవా రంగంలో 9.11 శాతం వృద్ధి ►రాష్ట్ర తలసరి ఆశయం 1.51 లక్షల నుంచి 1.69 లక్షలకు పెరుగుదల ►తలసరి ఆదాయంలో 12.14 శాతం పెరుగుదల (దేశ సరాసరి తలసరి ఆదాయం 1.34 లక్షలు మాత్రమే) ►రాష్ట్రంలో గత ఏడాది అక్షరాస్యత 67.35 శాతం -
‘లోటు’ పెరిగినా.. వృద్ధికే ఓటు!
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరం 2020–21లో 6–6.5 శాతానికి పుంజుకోవచ్చని 2019–20 ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇందుకోసం ద్రవ్యలోటు లక్ష్యాల విషయంలో పట్టువిడుపుగా వెళ్లాలని.. ప్రజలు ఓటుతో ఇచ్చిన బలమైన తీర్పును సంస్కరణలను వేగంగా అమలు చేసేందుకు వినియోగించుకోవాలని.. భారత్ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా (అసెంబుల్ ఇన్ ఇండియా ఫర్ వరల్డ్) మార్చాలని.. ఆహార సబ్సిడీలను తగ్గించుకోవాలని.. నాణ్యమైన మౌలిక సదుపాయాలకు భారీగా పెట్టుబడులు అవసరమని.. సంపద, ఉద్యోగ సృష్టికర్తలు అయిన వ్యాపారస్తులను గౌరవంగా చూడాలనే సూచనలు కేంద్ర ప్రభుత్వానికి చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020–21 ఆర్థిక బడ్జెట్ను శనివారం పార్లమెంట్చు సమర్పించనున్న విషయం తెలిసిందే. దీనికి ఒక రోజు ముందు శుక్రవారం ఆర్థిక సర్వే నివేదికను ఆమె పార్లమెంటు ముందుంచారు. ద్రవ్యలోటు పరంగా.. 2019–20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు 3.3 శాతానికి పరిమితం చేస్తామని గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. కానీ, కార్పొరేట్ పన్ను కోత, ఇతర పన్నుల వసూళ్లు తక్కువగా ఉండడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ద్రవ్యలోటు 3.8 శాతానికి చేరుతుందన్నది నిపుణుల అంచనాగా ఉంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో వృద్ధి రేటును బలంగా పైకి తీసుకురావడమే ప్రాధాన్యమైన అంశంగా ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ఇందుకోసం ద్రవ్యలోటు లక్ష్య సవరణను పరిశీలించొచ్చని సూచించింది. రూ.1.84 లక్షల కోట్ల మేర ఉన్న ఆహార సబ్సిడీలను తగ్గించుకోగలిగితే ద్రవ్యలోటు విషయంలో ప్రభుత్వానికి ఎంతో వెసులుబాటు లభిస్తుందని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నాక ప్రభుత్వం తన ఖర్చులను స్థీరీకరించుకోవచ్చని, పలు దేశాలు గతంలో ఇదే మార్గాన్ని అనుసరించాయని పేర్కొంది. మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు.. రెవెన్యూ వ్యయాలను తగ్గించుకోవడంతోపాటు మూలధన వ్యయాలను పెంచుకోవడం ద్వారా ఆస్తులను సృష్టించుకోవాలని ఆర్థిక సర్వే సూచించింది. పెద్ద ఎత్తున పెట్టుబడుల ద్వారా ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల పునరుద్ధరణకు సాయంగా నిలవడం ద్వారా పెట్టుబడుల ఆధారిత వృద్ధి సాధ్యపడుతుందని అంచనా వేసింది. వ్యాపార నిర్వహణను సులభంగా చేసేందుకు వీలుగా.. పోర్టుల్లో ఎగుమతులు పెంచేందుకు రెడ్ టేపిజం (అధిక నియంత్రణలతో కూడిన విధానాలు)ను తొలగించాలని సూచించింది. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.350 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరేందుకు మౌలిక రంగంలో కనీసం 1.4 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమని తెలిపింది. ‘‘మౌలిక రంగంలో పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థకు ఎంతో అవసరం. విద్యుత్ కోతలు, చాలీ చాలని రవాణా సదుపాయాలు అధిక వృద్ధి సాధన దిశగ అవరోధంగా నిలుస్తాయి. సాఫీగా, వేగవంతమైన వృద్ధి కోసం భారత్ నాణ్యమైన సదుపాయాల కల్పనకు సకాలంలో తగినన్ని పెట్టుబడులు పెట్టాలి’’ అని ఆర్థిక సర్వే తెలియజేసింది. ప్రభుత్వరంగ బ్యాంకులు పటిష్టం కావాలి.. అధిక మార్కెట్ వాటా కలిగిన ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్బీలు) దేశ ఆర్థిక వ్యవస్థలో పరిణామ పరంగా చిన్నగా ఉండడాన్ని సర్వే ప్రస్తావించింది. దేశ ఆర్థిక వ్యవస్థ స్థాయికి వాటిని పటిష్టం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. పీఎస్బీలు మరింత సమర్థవంతంగా మారడం ద్వారా ఆర్థిక వృద్ధికి చేయూతగా నిలవాల్సిన అవసరాన్ని తెలియజేసింది. ప్రభుత్వరంగ బ్యాంకులు సమర్థంగా లేకపోతే అది ఆర్థిక వ్యవస్థను వినూత్నమైన అవకాశాలను అందుకోలేని వైకల్యంగా మార్చేస్తుందని హెచ్చరించింది. బ్యాంకుల్లో అన్ని కార్యకలాపాలకు ఫైనాన్షియల్ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించింది. అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు (ఈసాప్) ఇవ్వడం ద్వారా సమర్థతను పెంచొచ్చని అభిప్రాయపడింది. ‘‘రుణాలకు సంబంధించి నిర్ణయాల్లో, ముఖ్యంగా పెద్ద రుణాల జారీలో బిగ్ డేటా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ను వినియోగించుకునేందుకు జీఎస్టీఎన్ తరహా సంస్థను ఏర్పాటు చేయాలి. రుణ గ్రహీతలను సమగ్రంగా తెలుసుకునేందుకు పీఎస్బీ నెట్వర్క్ను ఏర్పాటు చేయాలి’’ అని సర్వే సిఫారసు చేసింది. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణతో మెరుగైన ఫలితాలు.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో (సీపీఎస్ఈలు) పెట్టుబడుల ఉపసంహరణను పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరాన్ని కూడా ఆర్థిక సర్వే ప్రస్తావించింది. గతంలో ప్రైవటీకరించిన సీపీఎస్ఈల పనితీరు ఆదాయం, లాభాలు, నికర విలువ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన విషయాన్ని గుర్తు చేసింది. గతంలో ప్రైవేటీకరించిన సీపీఎస్ఈల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు ముందు పదేళ్లు, ఆ తర్వాత పదేళ్ల కాలంలో వాటి పనితీరును సర్వే అధ్యయనం చేసింది. హిందుస్తాన్ టెలీ ప్రింటర్స్, ఎంఎఫ్ఐఎల్, టాటా కమ్యూనికేషన్స్ వంటి కొన్ని కంపెనీలు మినహా మిగిలిన వాటి నికర విలువ, స్థూల ఆదాయం, నికర లాభాల మార్జిన్, ఆదాయాల వృద్ధి అన్నది ప్రైవేటీకరణకు ముందు నాటి కాలంలో పోలిస్తే ప్రైవేటీకరణ అనంతరం కాలంలో ఎంతో మెరుగుపడినట్టు సర్వే వెల్లడించింది. పెట్టుబడుల ఉపసంహరణ అన్నది మొత్తానికి వాటి పనితీరు, ఉత్పాదకతను గణనీయంగా మార్చేసినట్టు తెలిపింది. అధిక లాభదాయకత, సమర్థత పెంపు, మరింత పోటీతత్వం కోసం వేగంగా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంరహరణను చేపట్టాలని సూచించింది. పన్ను కోతతో లాభం పెద్ద కంపెనీలకే.. కార్పొరేట్ పన్నులో గణనీయమైన తగ్గింపుతో ఎక్కువ ప్రయోజనం పెద్ద కంపెనీలకేనని, చిన్న కంపెనీలు అప్పటికే తక్కువ పన్ను రేటు చెల్లిస్తున్న విషయాన్ని ఆర్థిక సర్వే పేర్కొంది. కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్లో నిర్ణయం తీసుకున్న విషయం గమనార్హం. ఈ నిర్ణయం తీసుకునే నాటికే రూ.400 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న కంపెనీలు (దేశంలో 99.1 శాతం ఈ పరిధిలోనివే) 25 శాతం కార్పొరేట్ పన్ను పరిధిలో ఉన్న విషయాన్ని సర్వే ప్రస్తావించింది. అంటే కేవలం 0.9 శాతం కంపెనీలు (4,698 కంపెనీలు) రూ.400 కోట్ల టర్నోవర్ పైగా ఉన్నవి. ఇవి చెల్లించే రేటు 30.9 నుంచి 34.61 శాతం మధ్య (సెస్సులు కూడా కలుపుకుని) ఉంది. దీంతో కార్పొరేట్ పన్ను తగ్గింపు చిన్న కంపెనీలకు 3.2 శాతం నుంచి 13.5 శాతం మేర ప్రయోజనం కలిగిస్తే, పెద్ద కంపెనీలకు 18.5 శాతం నుంచి 27.3 శాతం మధ్య లాభం చేకూర్చినట్టు ఆర్థిక సర్వే వివరించింది. ఇళ్ల ధరలను తగ్గించడం పరిష్కారం! అమ్ముడుపోని ఇళ్లు అధిక సంఖ్యలో ఉండడంతో వీటిని తగ్గించుకునేందుకు నిర్మాణదారులు కొంత మేర ధరలను తగ్గించాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే సూచించింది. రియల్ఎస్టేట్ డెవలపర్లు కొంత మేర హేర్కట్ (నష్టం) భరించి ధరలను తగ్గిస్తే త్వరగా అమ్ముడుపోతాయని పేర్కొంది. బిల్డర్లు ఈ విధంగా చేసినట్టయితే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల బ్యాలెన్స్ షీట్లు సానుకూలంగా మారతాయని తెలిపింది. 2015–16 నుంచి వృద్ధి నిలిచిపోయినప్పటికీ, ఇళ్ల ధరలు అధిక స్థాయిల్లోనే ఉన్నట్లు పేర్కొంది. సంపద సృష్టి ద్వారానే.. సంపదను సృష్టించినప్పుడే దాన్ని పంచడం సాధ్యపడుతుందని ఆర్థిక సర్వే రూపకల్పన బృందానికి నేతృత్వం వహించిన కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ అన్నారు. అనుమానంగా చూడడం, సంపద సృష్టికర్తలను (వ్యాపారవేత్తలు) అమర్యాదగా చూడడం మంచిది కాదన్నారు. జీడీపీ వృద్ధి నిదానించడాన్ని వృద్ధి సైకిల్లో భాగంగానే చూడా లన్నారు. 2011 తర్వాత జీడీపీ రేటును 2.7 శాతం అధికం చేసి చూపిస్తున్నారన్న మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. బలమైన సంస్కరణలు కావాలి 2019–20లో జీడీపీ అంచనా వృద్ధి రేటు 5 శాతం నుంచి 2020–21లో 6–6.5 శాతానికి బలంగా పుంజకుంటుందని తాజా ఆర్థిక సర్వే అంచనా వేసింది. సరైన మోతాదులో సంస్కరణలు, ప్రభుత్వ పెట్టుబడులతో ఈ లక్ష్యం సాధించతగినదే. ఆర్థిక సర్వే అన్నది యూనియన్బడ్జెట్కు ముందస్తు సూచిక. కనుక బలమైన సంస్కరణల చర్యలను ఈసారి బడ్జెట్లో అంచనా వేస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ 6–6.5 శాతం వృద్ధి రేటు సవాలే... డిమాండ్ సైకిల్ ఇంకా పుంజుకోవాల్సి ఉంది. కరోనా వైరస్ ప్రభావం భారత్ సహా అంతర్జాతీయ వృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. ఇందుకు గతంలో సార్స్ వైరస్ ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని చూడాలి. – రణేన్ బెనర్జీ, పీడబ్ల్యూసీ ఇండియా రికవరీ ఆవశ్యకతను చెప్పింది.. బలమైన ఆర్థిక మందగమనం నుంచి వ్యవస్థ రికవరీ అయ్యేందుకు బలమైన సంస్కరణలను ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరాన్ని సర్వే ప్రస్తావించింది. –నిరంజన్ హిరనందాని, అసోచామ్ ప్రెసిడెంట్ -
అపుడు దోసానామిక్స్, ఇపుడు థాలినామిక్స్
సాక్షి, న్యూఢిల్లీ: ఎకనామిక్ సర్వే 2019-20లో ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ తన గురువు, ఆర్బీఐ మాజీ గవర్నరు రఘురామ రాజన్ ఫాలో అయ్యారు. గతంలో రాఘురామ రాజన్ దోసానిమిక్స్ (2016 బడ్జెట్ , ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు)లో ద్రవ్యోల్బణం సైలెంట్ కిల్లర్ అని చెబితే.. తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) లో మాజీ అసోసియేట్ ప్రొఫెసర్ కేవీ సుబ్రమణియన్ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన ఆర్థిక సర్వేలో థాలినోమిక్స్ డిన్నర్ టేబుల్పై ఆహారం ఆర్థికశాస్త్రం ఎలా ప్రభావితం చేస్తుందో తెలియచెప్పడానికి ప్రయత్నించింది. గత13 ఏళ్లలో వెజిటేరియన్-నాన్వెజిటేరియన్ కొనుగోలు శక్తి ఎంత పెరిగిందో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన సర్వేలో వివరించారు 'థాలినామిక్స్: ది ఎకనమిక్స్ ఆఫ్ ఏ ప్లేట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఇండియా' పేరుతో దీనిని ఆర్థిక సర్వేలో ప్రత్యేకంగా పేర్కొంది. దీని ఆధారంగా పై కొనుగోలు శక్తిని తెలిపింది. 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారు 80 కేంద్రాల్లో వినియోగదారుల ధరల సూచిక నుండి వచ్చిన డేటాను ‘థాలి’ ఖర్చుతో ఏప్రిల్ 2006 నుంచి అక్టోబర్ 2019 మధ్య కొనుగోలు వివరాలను ఈ సర్వే విశ్లేషించింది. భారతదేశం అంతటా ఒక థాలి (ఒక భోజనం) కోసం ఒక సాధారణ వ్యక్తి చెల్లించే మొత్తాన్ని లెక్కించే ప్రయత్నమని ఎకనామిక్ సర్వే పేర్కొంది. థాలి రేట్ల ఆధారంగా ఆర్థిక రంగంలో నెలకొన్న ఒడిదుడుకులపై అంచనా వేస్తూ 2006-07 నుంచి 2019-20 మధ్య వెజిటేరియన్ థాలి రేటులో 29 శాతం పెరుగుదల, నాన్ వెజిటేరియన్ థాలిలో 18 శాతం పెరుగుదల నమోదయినట్లు ఈ సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం రోజుకు రెండుసార్లు వెజిటేరియన్ థాలీ తీసుకునే ఐదుగురు వ్యక్తులు కలిగిన ఓ కుటుంబం ఏడాదిలో సగటున రూ.10,887 సంపాదిస్తోందనీ, నాన్ వెజిటేరియన్ కుటుంబం రూ.11,787గా ఉందని పేర్కొంది. సగటున పారిశ్రామిక కార్మికుడి వార్షిక ఆదాయాన్ని బట్టి చూస్తే 2006-07 నుంచి 2019-20 మధ్య శాఖాహార థాలి కొనుగోలు శక్తి 29 శాతం, మాంసాహార థాలి శక్తి 18 శాతం మెరుగుపడింది. వెజిటేరియన్ థాలిలో తృణధాన్యాలు, సబ్జీ, పప్పు వడ్డిస్తారు. నాన్ వెజిటేరియన్ థాలీలో తృణధాన్యాలు, సబ్జీ, మాంసాహారం వడ్డిస్తారు. భారత్లోని నాలుగు ప్రాంతాలు... ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ప్రాంతాల్లో 2015-16 నుంచి వెజిటేరియన్ థాలీ ధరలు క్రమంగా తగ్గాయి. కానీ 2019లో మాత్రం పెరిగాయి. ఇటీవలికాలంలో భోజనం ధరను తెలుసుకోవడానికి సర్వే ప్రయత్నించడం ఇదే మొదటిసారి. #EcoSurvey2020 #WealthCreation: Despite the rise in prices this year, thalis have become more affordable in India compared to 2006-07. (3/3) #Thalinomics @FinMinIndia @PIB_India @nsitharamanoffc pic.twitter.com/eT3u4nPb7U — K V Subramanian (@SubramanianKri) January 31, 2020 -
ఆర్థిక సర్వే : కొన్ని ముఖ్య విషయాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రాన్ని సూచించే ఆర్థిక సర్వే 2020ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దేశ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2020-21) 6- 6.5 శాతంగా నమోదు కావొచ్చని సర్వే అంచనా వేసింది. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ నేతృత్వంలోని బృందం రూపొందించిన ఆర్థిక సర్వే విడుదలయిన నేపథ్యంలో.. కొన్ని ముఖ్య విషయాలు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి ప్రారంభమయ్యే సవాళ్లను ఎదుర్కొవడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం సడలించాల్సి ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది ప్రభుత్వం ఆహారానికి సంబంధించిన సబ్సిడీలను హేతుబద్దీకరించాలని సర్వే అభిప్రాయపడింది. ప్రభుత్వం ధరలను కట్టడి చేయడానికి ఆహార ధాన్యాలను మార్కెట్ ధరల కన్నా తక్కువ ధరలకు పంపిణి చేసిందని సర్వే తెలిపింది. గత ఏడాది (2019-20) బడ్జెట్లో ఆహార రాయితీల కోసం ప్రభుత్వం రూ .1.84 లక్షల కోట్లు బడ్జెట్లో కేటాయించిందని సర్వే తెలిపింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి బడ్జెట్లో ద్రవ్యలోటు లక్ష్యానికి ప్రభుత్వం మినహాయింపు ఇవ్వనుందని, పెట్టుబడులను ఆకర్శించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోనుందని తెలిపారు. మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేసిందుకు ప్రభుత్వం అధికంగా నిధులు సమకూరుస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. రియల్ ఎస్టెట్ కంపెనీలు అమ్ముడుపోని ఇళ్ల ధరలను తగ్గించాలని సర్వే తెలిపింది. ఇళ్ల ధరలను తగ్గించడం ద్వారా అమ్మకాలు పెరిగి బ్యాంకులలో తీసుకున్న రుణాలను చెల్లిస్తారని సర్వే తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మందగమనం దేశ ఎగుమతులపై ప్రభావం చూపించిందని సర్వే తెలిపింది. దశాబ్దకాలంగా ఎన్నడూ లేని విధంగా జులై సెప్టెంబర్లో తక్కువ వృద్ధి రేటు (4.5శాతం) నమోదయిందని, చదువు పూర్తయి లక్షలాది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపింది. ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరానికి(2019-20) వృద్ధి రేటు 5 శాతానికి అంచనా వేసినా అంతర్జాతీయ మందగమనం కారణంగా అనుకున్న లక్ష్యాలను సాధించలేదని తెలిపింది. -
హోటల్ కంటే.. తుపాకీ కొనడం సులువు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక సర్వే 2020 ఆర్థిక వృద్ధిని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో 6-6.5 శాతంగా అంచనా వేసింది.2020సంవత్సరానికి ఇది 5 శాతంగా ఉంది. లోక్సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాలకు అధ్యక్షుడు రామనాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తరువాత 2019-2020 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. అనతరం సభ రేపటికి వాయిదా పడింది. రేపు ఆర్థిక బడ్జెట్ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సభ ముందు ఉంచనున్నారు. మరోవైపు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) కృష్ణమూర్తి వి సుబ్రమణియన్ ఎకనామిక్ సర్వే వివరాలను మీడియాకు వివరించారు. రుపాయి నోటు భారత సంపదకు చిహ్నం. అందుకే, సర్వే కవర్ పేజీని వంద రూపాయల నోటు పాత, కొత్త రంగుల మేళవింపుతో వంకాయ రంగులో రూపొందించినట్టు చెప్పారు. అలాగే ఆర్థిక వ్యవస్థలో సంపద సృష్టికి మార్కెట్ అదృశ్య హస్తం, విశ్వాసం అనేవి రెండు స్తంభాలని సుబ్రమణియన్ అన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన మార్కెట్ అదృశ్య హస్తం, నమ్మకంతో మద్దతు ఇవ్వడంపై ఆధారపడి ఉంటుందని ఆర్థిక సర్వే పేర్కొంది. భారతదేశం చైనా మధ్య ఎగుమతి పనితీరులో వ్యత్యాసాన్ని స్పెషలైజేషన్ ద్వారా వివరించాలని సుబ్రమణియన్ చెప్పారు. చైనా శ్రమతో కూడిన కారకాలలో ప్రత్యేకత కలిగి ఉంది. భారతదేశం కూడా దీన్ని అనుసరించాల్సిన అవసరం వుంది. దేశంలో ఒక హోటల్ను ప్రారంభించడం కంటే, ఒక తుపాకీ లైసెన్సు సంపాదించడం చాలా సులువు అని సర్వే పేర్కొంది. ఒక పిస్తోల్ కలిగి వుండేందుకు కావల్సిన పత్రాల కంటే ఢిల్లీలో ఒక హోటెల్ తెరవాలంటే ఎక్కువ డాక్యుమెంట్లు కావాలని తెలిపింది. ఎకనామిక్ సర్వే 2020 అంచనాలు ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక మందగమనం ప్రభావం మనదేశంపై పడిందని, దానివల్లే పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రాలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల ఆర్థిక రంగంలో తిరోగమన సంకేతాలు కనిపించాయని, దశాబ్ద కాలం నాటి పరిస్థితులు ఆర్థిక రంగంలో చోటు చేసుకున్నాయని అంచనా వేసింది. జులై నుంచి సెప్టెంబర్ మధ్య ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ మందగించిందనే విషయాన్ని కేంద్రం అంగీకరించింది. ఆరేళ్ల తరువాత తొలిసారిగా 4.5 శాతానికి క్షీణించిందని పేర్కొంది. అయితే వృద్ధిని పునరుద్ధరించడానికి ఆర్థిక అంతర లక్ష్యాన్ని సడలించాల్సిన అవసరం ఉందని ఎకనామిక్ సర్వే 2020 తెలిపింది. ప్రస్తుత సంవత్సరానికి ఆర్థిక లోటు లక్ష్యాన్ని సడలించాల్సి ఉంటుందని తెలిపింది. సంపద సృష్టిని పెంచడానికి,మార్కెట్లకు మేలు చేసే ఆర్థిక సర్వేలో పది కొత్త ఆలోచనలను సూచించింది. వచ్చే ఏడాది వృద్ది పుంజుకోవాలంటే సంస్కరణల సరళిని బలంగా అనుసరించాలని సూచించింది. సంపద పంచాలంటే ముందు సంపద సృష్టి జరగాలని తెలిపింది. ఉల్లిపాయల్లాంటి కమోడిటీల ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రయోజనం ఇవ్వలేదని తెలిపింది. వృద్ధికి ఊతమివ్వాలంటే ‘‘అసెంబుల్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్’’ సూత్రాన్ని పాటించాలని, తద్వారా నూతన ఉద్యోగాలను సృష్టించాలని సూచించింది. పెట్టుబడుల కోసం విస్తృత అవకాశాలను కల్పిస్తామని తెలిపింది. మనదేశంలో పెట్టుబడులు పెట్టడానికి విస్తృత అవకాశాలను కల్పించడం ద్వారా జీడీపీ రేటును పెంచాలని భావిస్తున్నట్లు సర్వే పేర్కొంది. ప్రధానంగా వ్యవసాయ, ఉత్పాదక, సేవ రంగాల పరిధిని విస్తృతం చేస్తామని, ఫలితంగా జీడీపీలో వాటి వాటాను పెంచడానికి అవసరమైన చర్యలను చేపట్టబోతున్నట్టు తెలిపింది. ఆటోమొబైల్ వంటి ఉత్పాదక రంగాల్లో నెలకొన్న మందగమనానికి చెక్ పెట్టడంతోపాటు, వాటి పునరుజ్జీవన దిశగా తమ చర్యలు ఉండబోతున్నాయని సర్వే పేర్కొంది. ఉత్పాదక, పారిశ్రామిక రంగాల్లో నెలకొన్న రెడ్ టేపిజాన్ని తొలగించడానికి పూర్తిస్థాయి చర్యలు చేపడతామని కేంద్రం వెల్లడించింది. పెట్టుబడులను ఆహ్వానించడానికి అవసరమైన అడ్డంకులను నివారిస్తామని, భారత్ పెట్టుబడులు పెట్టడాన్ని, భారత్ను కేంద్ర బిందువుగా చేసుకుని తమ ఆర్థిక, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను విస్తృతం చేసుకోవడానికి పారిశ్రామికవేత్తలకు ద్వారాలు తెరుస్తామని, పబ్లిక్ రంగంలో కొనసాగుతున్న బ్యాంకింగ్ వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తామని ఆర్థిక సర్వేలో స్పష్టం చేశారు. #EcoSurvey2020 #WealthCreation: Pro-business policies to strengthen the invisible hand: (iii) enable trade for job creation (iv) efficiently scale up the banking sector to be proportionate to the size of the Indian economy. (5/5) @FinMinIndia @PIB_India @nsitharamanoffc pic.twitter.com/LSIvbWGS3B — K V Subramanian (@SubramanianKri) January 31, 2020 -
వృద్ధి రేటు 6 - 6.5శాతం : ఆర్థిక సర్వే
సాక్షి, న్యూడిల్లీ: దేశ వృద్ధి రేటు రానున్న ఆర్థిక సంవత్సరం (2020-21)కు 6నుంచి 6.5శాతం నమోదవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2025 సంవత్సారానికల్లా దేశం నిర్దేశించుకున్న5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సర్వే పై రాషష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. రేపు (శనివారం) ఉదయం 11.గంటలకు ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఆర్థిక సర్వే హేతుబద్ద పరిష్కార మార్గాలు సూచిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలకు సంబంధించిన స్థితిగతులను తెలుసుకోవడంలో ఆర్థిక సర్వే కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందాలంటే తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని సర్వే అభిప్రాయపడింది. తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తే దేశంలో ఉద్యోగ కల్పన సాధ్యమవుతుందని తెలిపింది. -
ఆర్థిక సర్వేలో ‘అర్ధ సత్యమే!’
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశం రెండంకెల జీడీపీ వృద్ధి రేటును సాధించే చారిత్రక సంధికాలంలో ఉందని ప్రధాన మంత్రి ప్రధాన మాజీ ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ ఐదేళ్ల క్రితం వ్యాఖ్యానించారు. ఆయన ఇటీవలనే నరేంద్ర మోదీ ప్రభుత్వం గత ఐదేళ్లలో సాధించినట్లు చెబుతున్న జీడీపీ వృద్ధి రేట్ల పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం చూపించిన 6.8 నుంచి 7.1 శాతం వృద్ధి రేటు సరైనదని కాదని, అంతకన్నా తక్కువ ఉంటుందని, స్వతంత్ర ఆర్థిక నిపుణులతో తిరిగి లెక్కలు వేయించాలని కూడా సూచించారు. అయితే ‘గత ఐదేళ్ల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సజావుగా ఉంది’ గురువారం విడుదల చేసిన ఆర్థిక సర్వే నివేదికలో ప్రధాన మంత్రి కొత్త ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం చివరి రోజుల్లో జీడీపీ రేటు మరింత పడిపోయిన విషయాన్ని గానీ, నిరుద్యోగ సమస్య 6.1 శాతంతో గత 49 ఏళ్లలోనే గరిష్ట స్థాయికి చేరుకుందంటూ కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందన్న విషయాన్ని సుబ్రమణియన్ ప్రస్తావించలేదు. ప్రస్తుతం 2.8 ట్రిలియన్ డాలర్లు ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడం తన లక్ష్యమన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్న మాటలను ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆ లక్ష్యాన్ని ఆర్థిక సర్వేలో చేర్చారు. దీని కోసం చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాలని కూడా ఆర్థిక సర్వే సూచించింది. అందుకోసం పన్ను రాయతీలు కల్పించాలని, విమాన సర్వీసుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. విమాన సర్వీసుల్లో ప్రాధాన్యతకు సరైన వివరణ, స్పష్టత లేదు. వాళ్ల కోసం సీట్లను రిజర్వ్ చేసి ఉంచాలా? వారు ప్రయాణించాలనుకుంటే అప్పుడు సీట్లను సర్దుబాటు చేయాలా? వారిని మంచి బిజినెస్ క్లాస్లో కూర్చోబెట్టాలా? వారికి టిక్కెట్లలో రాయతీ కల్పించాలా? లేదా ప్రయాణ సౌకర్యం కల్పించాలా? స్పష్టత లేదు. చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలు విమానాల్లో పర్యటించాల్సినంత అవవసరం ఉంటుందా? అన్నది అసలు ప్రశ్న. కారు మబ్బులు కమ్ముకున్న ప్రస్తుత ఆర్థిక ఆకాశం నుంచి కాసులు కురుస్తాయన్న బాగుండేమోగానీ, ఆర్థికాకాశం నీలి రంగులో మెరిసిపోతోందని ఆర్థిక నిపుణులు కేవీ సుబ్రమణియన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆశించిన ఫలితాల కోసం ఎన్ని కాలాలు వేచి చూడాలో! (చదవండి: 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమా?!) -
ఎకానమీపై ఆర్థిక సర్వే సూచనలు
-
గేరు మార్చు.. స్పీడు పెంచు!
న్యూఢిల్లీ: అయిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం మళ్లీ పుంజుకోనుంది. అయితే, 2024–25 నాటికి నిర్దేశించుకున్న 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగాలంటే మాత్రం... ఇటు పెట్టుబడులకు, అటు సంస్కరణలకు తోడ్పడేలా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. తద్వారా నిలకడగా 8 శాతం స్థాయిలో అధిక వృద్ధి సాధిస్తే తప్ప లక్ష్యాన్ని చేరుకోగలిగే పరిస్థితి లేదు. ఈ దిశగా ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు, ఉద్యోగాల కల్పన పెరగటమనేది చాలా కీలకంగా నిలవనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఈ అంశాలను వెల్లడించింది. బడ్జెట్కు ముందురోజు ప్రవేశపెట్టే ఆర్థిక సర్వే... ఇటు ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించడంతో పాటు భవిష్యత్లో తీసుకోవాల్సిన చర్యలకు కూడా దిశానిర్దేశం చేసేదిగా ఉంటుంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం (నేడు) పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఎకనమిక్ సర్వేకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. పుంజుకోనున్న పెట్టుబడులు .. ఆర్థిక సర్వే అంచనాల ప్రకారం 2018–19లో 6.8%కి క్షీణించిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2019–20లో 7% స్థాయిలో నమోదు కానుంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వృద్ధి రేటు అయిదేళ్ల కనిష్ట స్థాయి అయిన 5.8%కి పడిపోయింది. ఇది చైనా నమోదు చేసిన 6.4% వృద్ధి కన్నా తక్కువ కావడం గమనార్హం. ఇక 2011–12 నుంచి క్రమంగా తగ్గుతున్న పెట్టుబడుల రేటు.. ప్రస్తుతం కనిష్ట స్థాయికి చేరుకుందని, ఇక నుంచి మళ్లీ పుంజుకోగలదని ఆర్థిక సర్వే ఆశాభావం వ్యక్తం చేసింది. వినియోగదారుల డిమాండ్, బ్యాంకుల రుణాలు సైతం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని సర్వే తెలియజేసింది. అయితే, పన్ను వసూళ్లు, వ్యవసాయ రంగంపై పెరుగుతున్న ప్రభుత్వ వ్యయాల కారణంగా ద్రవ్యపరమైన ఒత్తిళ్లు తప్పకపోవచ్చని వివరించింది. ప్రస్తుతం 2.7 లక్షల కోట్ల డాలర్ల పరిమాణంతో భారత ఎకానమీ ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది. వచ్చే ఏడాది బ్రిటన్ను దాటేసి అయిదో స్థానానికి చేరొచ్చన్న అంచనాలున్నాయి. రుతుపవనాలు కీలకం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019–20)లో చమురు ధరలు తగ్గవచ్చని ఆర్థిక సర్వే తెలిపింది. దేశ జీడీపీలో దాదాపు 60%గా ఉన్న వినియోగానికి ఇది ఊతమివ్వగలదని పేర్కొంది. కాకపోతే వినియోగం మందగించే రిస్కు లున్నాయని హెచ్చరించింది. ‘వ్యవసాయ రం గం రికవరీ, వ్యవసాయోత్పత్తుల ధరలే గ్రామీణ ప్రాం తాల్లో వినియోగానికి కీలకం కానున్నాయి. రుతుపవనాల పరిస్థితి వీటన్నింటినీ నిర్దేశిస్తుంది. కొన్ని ప్రాం తాల్లో సాధారణ స్థాయికన్నా తక్కువగా వర్షపాతం నమోదు కావొచ్చు. ఇది పంటల దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు’ అని సర్వే పేర్కొంది. కార్మిక సంస్కరణలు ప్రధానం .. దేశంలో డిమాండ్కు ఊతమివ్వాలన్నా, సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాలన్నా, కార్మిక ఉత్పాదకత పెర గాలన్నా ప్రైవేట్ పెట్టుబడులు కీలకమని సర్వే తెలిపింది. ఇవే కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టేందుకు, ఉద్యోగాల కల్పనకు తోడ్పడగలవని వివరించింది. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు కార్మిక రంగం మొదలైన వాటిల్లో వ్యవస్థాగత సంస్కరణలు అవసరమని పేర్కొంది. ఇక లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలు ప్రధానంగా ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఈ రంగం నుంచే వృద్ధికి మరింత ఊతం లభించగలదని ఆర్థిక సర్వే వివరించింది. సర్వేలోని మరిన్ని ముఖ్యాంశాలివీ... ► ఒప్పందాలు సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు న్యాయవ్యవస్థలో సంస్కరణలు తేవాలి. పెట్టుబడులను ఆకర్షించేలా ఉండాలి. ► 2018–19లో ద్రవ్య లోటు 3.4 శాతంగా నమోదు కావొచ్చు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ద్రవ్య లోటు 5.8 శాతంగా ఉండొచ్చని అంచనా. అంతక్రితం ఏడాదిలో ఇది 6.4%. ► రాజకీయ స్థిరత్వం వృద్ధి అవకాశాలకు సానుకూలాంశం. పెట్టుబడులు, వినియోగమే ఎకానమీ వృద్ధికి ఊతమివ్వనున్నాయి. ► 2024–25 నాటికి భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలంటే (ప్రస్తుత స్థాయికి రెట్టింపు) నిలకడగా 8 శాతం వృద్ధి రేటు నమోదు చేయాల్సి ఉంటుంది. పొదుపు, పెట్టుబడులు, ఎగుమతుల ద్వారానే ఇది సాధ్యపడగలదు. ► చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) మరింత ఎదిగేందుకు, ఉద్యోగాలు కల్పించేందుకు, ఉత్పాదకత పెంచుకునేందుకు అనువైన విధానాలు ఉండాలి. ఎప్పటికీ చిన్న స్థాయిలోనే ఉండిపోయే సంస్థల కన్నా భవిష్యత్లో భారీగా ఎదిగే సత్తా ఉన్న అంకుర సంస్థలను ప్రోత్సహించాలి. ► వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వైద్యంపై పెట్టుబడులు పెంచాలి. రిటైర్మెంట్ వయస్సునూ దశలవారీగా పెంచాలి. ► తక్కువ జీతభత్యాలు, వేతనాల్లో అసమానతలే సమ్మిళిత వృద్ధి సాధనకు అవరోధాలుగా ఉంటున్నాయి. వీటిని సరి చేసేందుకు చట్టపరమైన సంస్కరణలు, స్థిరమైన విధానాలు అవసరం. ► కాంట్రాక్టుల అమలయ్యేలా చూసేందుకు సరైన వ్యవస్థ లేకపోవడమే వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో ర్యాంకులను మెరుగుపర్చుకోవడానికి పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది. ► 2018–19లో రూ. 38,931 కోట్ల విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు (ఎఫ్పీఐ) తరలిపోయాయి. 2017–18లో నికరంగా రూ. 1,44,681 కోట్లు వచ్చాయి. ► 28 ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక వాటాల విక్రయం విషయంలో ఆర్థిక శాఖ గణనీయ పురోగతి సాధించింది. మూడింట్లో వాటాల విక్రయం పూర్తి కూడా అయింది. ► 2021 నాటికి ఉక్కు ఉత్పత్తి 128.6 మిలియన్ టన్నులకు చేరనుండగా, 2023 నాటికి వినియోగం 140 మిలియన్ టన్నులకు చేరనుంది. 2018–19లో ఉత్పత్తి 106.56 మిలియన్ టన్నులు. ► ఉపాధి లేని గ్రామాలను గుర్తించేందుకు, ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) ప్రయోజనాలను కల్పించేందుకు రియల్ టైమ్లో వివరాలు లభించేలా ప్రత్యేక సూచీని ఏర్పాటు చేయాలి. ► ప్రజలకు ప్రయోజనం చేకూర్చడంలో డేటా ప్రాధాన్యాన్ని గుర్తించి, దానిపై తగినంత ఇన్వెస్ట్ చేయాలి. ► 2018–19లో దిగుమతులు 15.4 శాతం, ఎగుమతులు 12.5 శాతం వృద్ధి నమోదు చేసి ఉండొచ్చని అంచనా. ► 2018–19లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 283.4 మిలియన్ టన్నుల మేర ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణే ముఖ్యం: సీఈఏ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే రూపకర్త, ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్ స్పష్టం చేశారు. అలా కాకుండా ప్రభుత్వమే భారీగా రుణాలు సమీకరిస్తూ పోతే పెట్టుబడులకు అవకాశాలు దెబ్బతింటాయని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ‘అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. నిధుల లభ్యత బాగుంది. కాబట్టి ఇటు ప్రైవేట్ సంస్థలు, అటు ప్రభుత్వం రుణాల సమీకరణ కోసం అటువైపు దృష్టి పెట్టొచ్చు. 8 శాతం వృద్ధి రేటు సాధించాలంటే జీడీపీలో పెట్టుబడులనేవి 30 శాతానికి పైగా ఉండాలి. చైనాలో ఇది 50 శాతానికి చేరింది. ప్రస్తుతం మన దగ్గర 29.6 శాతంగా ఉన్న పెట్టుబడుల రేటును 35 శాతం దాకానైనా పెంచుకోవాలి‘ అని సుబ్రమణియన్ చెప్పారు. ‘మన వృద్ధి రేటు బాగానే ఉంది. కానీ నిలకడగా 8 శాతం వృద్ధి రేటు సాధించాలంటే మనం గేర్లు మార్చాలి. టేకాఫ్ తీసుకోవడానికి ఇదే సరైన సమయం‘ అని ఆయన పేర్కొన్నారు. టాప్ ట్యాక్స్పేయర్స్కు ప్రత్యేక వెసులుబాట్లు.. సక్రమంగా పన్నులు చెల్లించడాన్ని ప్రోత్సహించే దిశగా ప్రతి జిల్లాలో టాప్ 10 ట్యాక్స్పేయర్స్కు ప్రత్యేక గుర్తింపునిచ్చే అంశాన్ని పరిశీలించాలని ఆర్థిక సర్వే సూచించింది. ఇమ్మిగ్రేషన్ కౌంటర్లో డిప్లమాటిక్ తరహా వెసులుబాట్లు, ఎయిర్పోర్టుల్లో ఎక్స్ప్రెస్ బోర్డింగ్ సదుపాయాలు కల్పించవచ్చని పేర్కొంది. అలాగే ఒక దశాబ్దకాలంలో అత్యధికంగా పన్నులు చెల్లించిన వారి పేర్లను ముఖ్యమైన భవంతులు, రహదారులు, రైళ్లు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రులు, విమానాశ్రయాలకు పెట్టే అంశాన్ని కూడా పరిశీలించవచ్చని ఆర్థిక సర్వే సూచించింది. చాలా మంది కోరుకునే సామాజిక హోదాతో పాటు సంఘంలో గౌరవం కూడా లభించేలా ప్రత్యేక క్లబ్స్ను ఏర్పాటు చేయొచ్చని పేర్కొంది. వ్యవసాయ రంగానికి తోడ్పాటు.. దేశీయంగా కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనా నేపథ్యంలో వ్యవసాయ రంగంలో నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునేలా కొత్త విధానాలు ప్రవేశపెట్టాలని సర్వే సూచించింది. 2050 నాటికి భారత్లో నీటి వనరులు ఆందోళనకరంగా అడుగంటుతాయన్న వార్తల మధ్య .. ’భూమిపరమైన ఉత్పాదకత’పై కాకుండా ’సాగు నీటిపరమైన ఉత్పాదకత’ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొంది. నీటి ఎద్దడిని అధిగమించేందుకు రైతాంగం జలవనరులను సమర్ధంగా వినియోగించుకునేలా ప్రోత్సహించాలని సూచించింది. ఇన్ఫ్రాపై ఏటా 200 బిలియన్ డాలర్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే దిశగా ఇన్ఫ్రా రంగంపై భారత్ వార్షిక వ్యయాలను దాదాపు రెట్టింపు చేయాలని, ఏటా 200 బిలియన్ డాలర్లు పెట్టాల్సి ఉంటుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2032 నాటికి 10 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలంటే దానికి తగ్గ పటిష్టమైన మౌలిక సదుపాయాలూ ఉండాలని పేర్కొంది. అయితే ఈ క్రమంలో ప్రైవేట్ పెట్టుబడులు మరిన్ని వచ్చేలా చూడటమే పెద్ద సవాలుగా ఉండగలదని పేర్కొంది. ప్రస్తుతం భారత్ ఏటా కేవలం 100 నుంచి 110 బిలియన్ డాలర్లు మాత్రమే ఇన్ఫ్రాపై వెచ్చించగలుగుతోందని వివరించింది. స్వచ్ఛ భారత్ లక్ష్యాల సాధన.. స్వచ్ఛ భారత్ కార్యక్రమం లక్ష్యాలు చాలావరకూ నెరవేరాయని, పలు రాష్ట్రాల్లో ప్రతీ ఇంటా మరుగుదొడ్ల నిర్మాణంతో బహిరంగ మలవిసర్జన నూటికి నూరు శాతం నిల్చిందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2014 అక్టోబర్లో ఈ పథకం ప్రారంభించినప్పట్నుంచీ దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని తెలిపింది. 2019 జూన్ 14 నాటికి 30 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో 100 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయని వివరించింది. రాబోయే రోజుల్లో ఎస్బీఎం కింద ద్రవ, ఘన వ్యర్థాల విసర్జనపై దృష్టి సారించాల్సి ఉంటుందని సూచించింది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలి.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సర్వే సూచించింది. వాటిపై పెట్టే వ్యయం తగ్గే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మళ్లేలా చూడొచ్చని పేర్కొంది. ప్రస్తుతం విద్యుత్ వాహనాల వినియోగం నార్వేలో 39 శాతం, చైనాలో రెండు శాతం ఉండగా భారత్లో 0.06 శాతమే ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో చార్జింగ్ మౌలిక సదుపాయాలు పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మరోవైపు, విద్యుత్ వాహనాలపై ఆర్థిక సర్వే సూచనలను పరిశ్రమవర్గాలు స్వాగతించాయి. కొత్త మార్కెట్లలో ఐటీకి బాటలు భారత ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు చాన్నాళ్లుగా సర్వీసులు అందిస్తున్న దేశాల్లో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న మార్కెట్లలో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు కొత్త మార్కెట్లపైనా అవి దృష్టి సారించాలి. యూరప్, జపాన్, చైనా, ఆఫ్రికా వంటి మార్కెట్లలో అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ప్రస్తుతం దేశీ ఐటీ–బీపీఎం (బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్) ఎగుమతులు 2018–19లో 136 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మొత్తం దేశీ ఐటీ–బీపీఎం పరిశ్రమ పరిమాణం 181 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. అటు స్టార్టప్ సంస్థలకు తోడ్పాటునిచ్చేలా పన్నులను క్రమబద్ధీకరించాలని కూడా సర్వే సూచించింది. రిటైర్మెంట్ వయస్సు పెంచాలేమో... భారతీయుల జీవన ప్రమాణాలు పెరుగుతున్న నేపథ్యంలో పదవీ విరమణ వయస్సును కూడా పెంచే అవకాశాలు పరిశీలించాల్సి రావొచ్చని ఆర్థిక సర్వే సూచనప్రాయంగా తెలిపింది. వచ్చే రెండు దశాబ్దాల్లో జనాభా వృద్ధి గణనీయంగా మందగించే అవకాశం ఉందని పేర్కొంది. ఓవైపు యువ జనాభా (0–19 మధ్య వయస్సున్న వారు) సంఖ్య 2041 నాటికి 25 శాతానికి తగ్గనుండగా వృద్ధుల సంఖ్య (60 ఏళ్లు పైబడిన వారు) రెట్టింపై 16 శాతానికి చేరనుంది. ఇక ప్రాథమిక స్థాయి విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతున్నందున పాఠశాలలు లాభదాయకంగా నడవాలంటే కొన్నింటిని విలీనం చేయాల్సి రావొచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. 100 స్మార్ట్ సిటీలు.. స్మార్ట్ సిటీస్ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా దాదాపు 100 నగరాలు తలపెట్టగా, ఈ ప్రాజెక్టుల విలువ సుమారు రూ. 2.05 లక్షల కోట్లు ఉంటుందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ ప్రాజెక్టుల అమల్లో చెప్పుకోతగిన పురోగతి సాధించినట్లు తెలిపింది. నగర ప్రజలకు మెరుగైన జీవన విధానాలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో 2015 జూన్లో అయిదేళ్ల వ్యవధికి కేంద్రం స్మార్ట్ సిటీస్ మిషన్ (ఎస్సీఎం)ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 100 నగరాల్లో 5,151 ప్రాజెక్టులు అమలవుతున్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణ ప్రాంత) కింద ఇప్పటిదాకా 4,427 నగరాలు, పట్టణాలను చేర్చినట్లు తాజా ఆర్థిక సర్వే పేర్కొంది. ఐబీసీతో పటిష్టంగా రికవరీ.. ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టిన కీలక ఆర్థిక సంస్కరణల్లో దివాలా స్మృతి (ఐబీసీ) ఒకటని, దీనివల్ల మొండిబాకీల రికవరీ వ్యవస్థ మరింత పటిష్టంగా మారిందని ఆర్థిక సర్వే తెలిపింది. ఇప్పటిదాకా దీని కింద రూ. 1.73 లక్షల కోట్ల క్లెయిమ్స్ సెటిల్ అయినట్లు వివరించింది. 94 కేసులు పరిష్కారమైనట్లు పేర్కొంది. మరోవైపు మొండిబాకీల భారం తగ్గడంతో బ్యాంకింగ్ రంగం పనితీరు కూడా మెరుగుపడిందని ఆర్థిక సర్వే వివరించింది. ప్రధాన సూచీ 17 శాతం అప్.. గత ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ 17 శాతం, నిఫ్టీ సుమారు 15 శాతం పెరిగాయని ఆర్థిక సర్వే తెలిపింది. 2018 మార్చి 31న 32,969గా ఉన్న సెన్సెక్స్ గతేడాది మార్చి 31న 38,673 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 10,114 నుంచి 11,624కి చేరింది. ఆచరణాత్మక లక్ష్యం: పరిశ్రమ వర్గాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7 శాతంగా ఉండొచ్చన్న ఆర్థిక సర్వే అంచనాలను.. ఆచరణాత్మక లక్ష్యంగా పరిశ్రమవర్గాలు అభివర్ణించాయి. సర్వేలో పేర్కొన్నట్లుగా 2024–25 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదిగే క్రమంలో 8 శాతం వృద్ధి రేటు సాధించాలంటే.. ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం లభించాలని, వినియోగం పెరగాలని పేర్కొన్నాయి. అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు ఎదుర్కొంటున్న నిధుల కొరత వంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందని సీఐఐ, ఫిక్కీ, అసోచాం తదితర పరిశ్రమ సమాఖ్యలు అభిప్రాయపడ్డాయి. ‘7 శాతం వృద్ధి రేటు అంచనా కాస్త ఆచరణాత్మక లక్ష్యమే. విధానాలపరమైన తోడ్పాటు ఉన్నప్పుడు వచ్చే ఐదేళ్లలో సగటున 8 శాతం వృద్ధి రేటు కూడా సాధించవచ్చు‘ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ‘పెట్టుబడులను ప్రోత్సహించడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కేంద్ర బడ్జెట్లో పెట్టుబడులు, వినియోగం, పొదుపును ప్రోత్సహించేలా నిర్దిష్ట చర్యలు ఉంటాయని ఆశిస్తున్నాం‘ అని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమానీ చెప్పారు. ఎగవేతదారులు నరకానికే! ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వినబడుతున్న మాట ‘ఎగవేత’ అంటే అతిశయోక్తి కాదేమో!! పన్నులు, రుణాలను ఎగ్గొడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. సర్కారు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా పరిష్కారం మాత్రం అంతంతే. బహుశా! అందుకేనేమో!! ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు... ప్రభుత్వం ఎగవేతల కట్టడికి ‘మతం’ మంత్రం జపిస్తోంది. ప్రజలకున్న మత విశ్వాసాలను దీనికి విరుగుడుగా వాడాలని చూస్తోంది. ఆర్థిక సర్వేలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. హిందూ మతం ప్రకారం ఎవరైనాసరే అప్పు తీసుకొని ఎగ్గొట్టడం అంటే పాపం చుట్టుకోవడమేకాదు.. తీవ్రమైన నేరం కూడా!!. ఇక రుణగ్రస్తులుగా కన్ను మూస్తే... ఏకంగా నరకానికి పోతారన్నది నానుడి!! అందుకే ఆ నరకకూపంలోకి పోకుండా చూడాలంటే ఆ అప్పులన్నీ తీర్చాల్సిన బాధ్యత తమ పిల్లలదేనని కూడా పెద్దలు చెబుతుంటారు. ఇస్లాం, బైబిల్లో కూడా ఇలాంటి బోధనలే కనబడతాయి. భారతీయ సంస్కృతిలో అప్పులు ఎగ్గొట్టడం అంటే ఎంత పాపమో, నేరమో అన్నది మన మతాలే చెబుతున్నప్పుడు.. దీన్నే ప్రచారాస్త్రంగా వాడుకోవాలన్నది సర్వే చెబుతున్న సారాంశం. మరి మోదీ సర్కారు చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ఏమేరకు ఫలిస్తుందో ఆ దేవుడికే తెలియాలి!!. -
ఉభయసభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
-
దేశ ఆర్థిక సర్వేలో కీలక విషయాలు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని ప్రతిబింబించే కీలకమైన ఎకనమిక్ సర్వే 2019ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో చమురు ధరలు తగ్గుతాయని ఎకనమిక్ సర్వే అంచనా వేసింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 7శాతంగా ఉండనుందని పేర్కొంది. 2018 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2019లో ద్రవ్యలోటు 6.4శాతం నుంచి 5.8 శాతానికి తగ్గిందని సర్వే అంచనా వేసింది. 2025 నాటికి ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలంటే.. 8శాతం జీడీపీ వృద్ధిరేటుతో ముందుకు సాగాల్సిన అవసరముందని పేర్కొంది. -
పార్లమెంట్కు చేరిన ఎకనామిక్ సర్వే దస్త్రాలు
-
ఆర్థిక సర్వే-2019 : చాలా ఉత్సాహంగా ఉంది
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ (47) ట్వీట్ చేశారు. ఎన్డీఏ సర్కారు రెండవ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ మొట్టమొదటి ఆర్థిక సర్వే -2019ను ప్రవేశపెట్టనున్నామని మంగళవారం ట్వీట్ చేశారు కాగా కేంద్ర ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్కు కూడా తొలి మహిళా ఆర్థికమంత్రిగా కేంద్ర ప్రభుత్వ మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ను జూన్ 5వ శుక్రవారం ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయిదేళ్ల కనిష్టానికి పడిపోయిన జీడీపీ, 45 కనిష్టానికి పతనమైన నిరుద్యోగం లాంటి దేశీయ ఆర్థిక పరిస్థతులకు తోడు, అంతర్జాతీయ ఆర్ధిక అనిశ్చితి, ముదురు తున్న ట్రేడ్ వార్ అందోళన నడుము సీతారామన్ బడ్జెట్ కీలకంగా మారనుంది. అరవింద్ సుబ్రమణియన్ పదవీకాలం ముగిసిన దాదాపు ఆరు నెలల తరువాత, కృష్ణమూర్తి సుబ్రమణియన్ గత ఏడాది డిసెంబరులో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులైన సంగతి తెలిసిందే. Looking forward with excitement to table my first - and the new Government's first - Economic Survey in Parliament on Thursday. #EcoSurvey2019 — K V Subramanian (@SubramanianKri) July 2, 2019 -
మోదీ సర్కార్ మెగా సర్వే
దేశ వాస్తవిక ఆర్థిక సమర్థతపై మదింపు వేసేందుకు కేంద్రం తొలిసారిగా భారీ సర్వే నిర్వహించనుంది. ఈ ఆర్థిక సర్వేలో చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారులు సహా అసంఘటిత రంగ కార్మికుల్ని జోడించనుంది. వివిధ అధ్యయనాలు పరిగణనలోకి తీసుకోని ఉద్యోగాలను ఇందులో కలపనుంది. భారీ ఎత్తున ప్రామాణిక ఆర్థిక సర్వే జరపడం వల్ల వ్యవస్థ పరిణామాలను మెరుగ్గా సమీక్షించేందుకు, వివిధ కార్యక్రమాలు, పథకాలు, విధాన సంబంధిత ప్రణాళికలపై సరైన అంచనా వేసే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మాసాంతంలో ఆరంభం పాతిక కోట్లకు పైగా కుటుంబాలు, ఏడు కోట్ల వ్యాపార సంస్థలు ఈ సర్వే పరిధిలోకి రాగలవని అంచనా వేస్తున్నారు. జూన్ మాసాంతానికి ఈ ప్రక్రియ ప్రారంభం కావచ్చునని, ఆరు మాసాల్లో సర్వే నివేదికలు అందవచ్చునని భావిస్తున్నారు. ఉపాధి కల్పనలో, ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో మోదీ సర్కారు విఫలమైందంటూ ప్రతిపక్షం ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంలో పదే పదే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వీధి వ్యాపారులను స్వయం ఉపాధి పొందుతున్న ఉద్యోగులుగా పేర్కొంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేక పార్టీలు ఎద్దేవా చేశాయి. 2018–19 ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసిక వృద్ధి రేటు 5.8 శాతానికి పడిపోవడం, గత 17 త్రైమాసికాలతో పోల్చుకుంటే అత్యంత కనిష్టానికి చేరుకోవడం వంటి పరిణామాలను తీవ్రంగా పరిగణించిన సర్కారు.. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే దిశగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఆర్థిక వృద్ధిని, పెట్టుబడులను, ఉపాధిని పెంచేందుకు బుధవారం ప్రధాని మోదీ రెండు కేబినెట్ కమిటీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
వెనుకబాటుపై బడ్జెట్ పోటు
బీజేపీ ప్రభుత్వ బడ్జెట్ ఉపన్యాసాల్లో కనీసం ఎస్సీ, ఎస్టీ కార్యక్రమాల ప్రస్తావన లేకుండా పోతోంది. ప్రతి సంవత్సరం ప్రకటించే ఎకనామిక్ సర్వే నివేదికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి పట్ల ఒక అంచనా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉండేది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది పూర్తిగా తొలగించారు. వీటన్నింటికీ పరాకాష్టగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అగ్రకులాల పేదలను ఆదుకునే పేరుతో తీసుకొచ్చిన పదిశాతం రిజర్వేషన్లు. ఇది కేవలం దళిత, ఆదివాసీ, వెనుకబడిన కులాల వ్యతిరేక బడ్జెట్ అని చెప్పడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదు. ‘‘సామాజిక న్యాయం, సామాజిక సామరస్య సూత్రాల ఆధారంగా సమాజంలోని అంతరాలను తొలగించడానికి బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. ఆర్థిక న్యాయం, రాజకీయ సాధికారతతో కూడిన సామాజిక న్యాయం మరింత శక్తివంతమయ్యేందుకు, అస్థిత్వ రాజకీ యాలు, తాత్కాలిక ఉపశమనాలకు బదులుగా సమాజంలోని అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీల సమగ్రాభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. విద్య, వైద్యం, ఉపాధి విషయాల్లో సమానావకాశాలను అందించడానికి సమతుల్యతను పాటిస్తాం’’ అని భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల ప్రణాళికలో ఆర్భాటంగాప్రకటించుకుంది. అయితే ఆచరణలో ఐదేళ్ళ మోదీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నదన్నది అక్షర సత్యం. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం బీజేపీ ప్రభుత్వ ఆలోచనలో సైతం లేదన్న వాస్తవాన్ని బలోపేతం చేస్తోంది. గత ఐదేళ్ళుగా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కుల సంగతి అటుంచితే కనీసం వాళ్ళని మనుషులుగా చూడనిపరిస్థితికి అద్దం పడుతోంది. ఐదేళ్ళ బీజేపీ పాలన దేశంలోని దళితుల, ఆదివాసీల బతుకులను శతాబ్దాల అగాధాల్లోకి నెట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి మీద దృష్టిపెడుతున్నది. అందుకోసం విశ్వవిద్యాలయాల్లో పరిశోధన సాగించే వారి కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజీవ్ గాంధీ ఫెలోషిప్స్ ప్రారంభించింది. ఆ పథకం ఎంతో మంది అణగారిన వర్గాల వారిని పరిశోధన వైపు తీసుకురాగలిగింది. కానీ బీజీపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేసింది. బడ్జెట్లో కేటాయింపులే దానికి ప్రత్యక్షనిదర్శనం. బీసీ విద్యార్థుల కోసం ప్రకటించిన జాతీయ స్కాలర్షిప్లు 2012–2013 సంవత్సరంలో 45 కోట్లు ఖర్చు చేస్తే, 2019–20 సంవత్సరానికి 30 కోట్లు కేటాయించడం శోచనీయం. ఇందులో దాగి ఉన్న మరో మోసం ఏమిటంటే, 2018–19 సంవ త్సరం బడ్జెట్లో 110 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. కానీ బడ్జెట్ సవరణలలో అది 30 కోట్లకు కుదించారు. ఇలాంటి నిర్లక్ష్యం కారణంగానే కొన్ని వేల మంది విద్యార్థులు నష్టపోయారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ విద్యార్థులు అధికంగా ఆధారపడే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు చాలా ఘోరంగా కోతకు గురయ్యాయి. 2017–18లో 3414 కోట్లు కేటాయిస్తే, 2019–20 సంవత్సరానికి అది 2926 కోట్లకు పడిపోయింది. ఎస్సీల కోసం ముఖ్యమైన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ కోసం గత రెండేళ్ళుగా కేటాయింపులు లేనేలేవు. ఇక రాష్ట్రాలలో ఆదివాసుల కోసం అమలు చేసే స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ గత రెండేళ్లుగా 1350 కోట్లుగా నిలకడగా కొనసాగుతున్నది. బడ్జెట్ మాత్రం లక్షల కోట్లకు పెరిగిపోతున్నా వీరి అభివృద్ధి కోసం కేటాయిం చాల్సిన నిధులు మాత్రం అంతకంతకూ కనుమరుగైపోతున్నాయి. ఆది వాసీ విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కేటాయించే నిధు లను చూస్తే ప్రభుత్వ చేతలకీ, మాటలకీ పొంతన లేని విషయం తేటతెల్లం అవుతుంది. 2017– 18లో కోటి రూపాయలు, 2019–20లో రెండు కోట్లు కేటాయించారు. అదేవిధంగా బీసీ విద్యార్థులు విదేశాలకు వెళ్ళే స్కాలర్ షిప్ల మొత్తం గణనీయంగా తగ్గించేశారు. 2017–18లో 19 కోట్ల 87 లక్షలుంటే, అది 2018–19, 2019–20లలో 10 కోట్లకు కుదించారు. ఇవి బీజేపీ విధానాల డొల్లతనాన్ని బయటపెట్టే మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించుకున్న కార్యక్రమం స్వచ్ఛ భారత్. ఈ అక్టోబర్ 2తో ఇది పరిసమాప్తం కాబోతున్నది. స్వచ్ఛభారత్లో చెరగని మచ్చ మాన్యువల్ స్కావెంజింగ్. మలమూత్రాలను చేతులతో ఎత్తివేసే అమానవీయ చర్యను నిర్మూలించే ఉద్దేశంతో 15 ఏళ్ళ క్రితమే ఒక చట్టం వచ్చింది. కానీ ఆ చట్టం సమర్థవం తంగా అమలు జరిగిన దాఖలాలు లేవు. ఇప్పటికీ ఈ దారుణమైన పనిలో 58 వేల మంది ఉన్నట్టు ప్రభుత్వమే ప్రకటించింది. కానీ ఈ లెక్కలు కాకి లెక్కలన్న విషయాన్ని సఫాయికర్మచారీ ఆందోళన్ నాయకుడు, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ సాక్ష్యాధారాలతో సహా వివరిస్తున్నారు. మాన్యువల్ స్కావెంజర్స్ సంఖ్య ఒక లక్షకుపైనే ఉంటుం దని బెజవాడ విల్సన్ ప్రకటించారు. అయితే ఈ అత్యంత అమానవీయ పనిలో శతాబ్దాల తరబడి మునిగితేలుతున్న దళితులకు పునరావాసం కల్పించి, వారిని ఆ వృత్తి నుంచి దూరంగా తీసుకురావాలని చట్టం నిర్దేశిస్తున్నది. ప్రతి కార్మికుడికీ ఒకేసారి 40 వేల రూపాయలు ఇచ్చి ఆ పనిని మాన్పించేందుకు సహకరించాలని ప్రభుత్వాలే నిర్ణయించాయి. అయితే ఈ సంవత్సరాంతంలోగా వీరికి పునరావాసం కల్పించాలి. అందుకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 232 కోట్లు అవసరమవుతాయి. సఫాయికర్మచారీ ఆందోళన్ అంచనాను తీసుకుంటే 480 కోట్లు ఖర్చవుతాయి. కానీ, కేంద్రం దీనికి కేవలం 30 కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే ప్రభుత్వ ద్వంద్వ వైఖరి స్పష్టమౌతుంది. 2017–18లో ఈ కార్యక్రమానికి కేటాయింపులే లేకపోవడం మరో విచిత్రమైన విషయం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న నిర్ణయాల్లో ప్రణాళికా సంఘం రద్దు ఒకటి. దీనివల్ల బడ్జెట్లో మార్పులు జరిగాయి. ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్ అనే విధానానికే స్వస్తి పలి కారు. దీంతో ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికోసం రూపొందించిన సబ్ప్లాన్ విధానం ప్రమాదంలో పడిపోయింది. అయితే కేంద్రంలో మాత్రం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు ఏవో లెక్కలు చూపిస్తున్నారు. సెంటర్ ఫర్ బడ్జెట్, గవర్నెన్స్ అకౌంటబిలిటీ సంస్థ అధ్యయనం ప్రకారం, ఈ పథకం కేవలం నామమాత్రంగానే కొనసాగుతున్నదని తేలిపోయింది. 1974 నుంచి ట్రైబల్ సబ్ ప్లాన్, 1979–80 నుంచి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అమలులో ఉంది, 2006 నుంచి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ను షెడ్యూల్డ్ కులాల సబ్ప్లాన్గా మార్చారు. ప్రభుత్వాలు అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా ప్రకారం వారికి బడ్జెట్లో నిధులు కేటాయించాలనేది సబ్ప్లాన్ సారాంశం. ఎస్సీ, ఎస్టీల వాడలు, పల్లెలు, గూడేలు, తండాలు అభి వృద్ధితో పాటు, వ్యక్తిగత అభివృద్ధి కూడా దీని ఉద్దేశం. కానీ కనీసం కాగితాలవరకైనా జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపులే లేవు. ఎస్సీల సబ్ప్లాన్ 16 శాతం కేటాయించాల్సి ఉండగా, 2017–18లో 8.4 శాతం, 2018–19లో 8.8 శాతం, 2019–20లో 9.3 శాతం మాత్రమే కేటాయించారు. ఇవి ఏవీ కూడా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేయవు. రక్షణ రంగం, శాస్త్రసాంకేతిక రంగాలు, పరిశోధనా విభాగాలు, ఇంకా ఇతర రంగాలు ఏవీ కూడా ఎస్సీల అభివృద్ధికి ప్రత్యక్షంగా, పరోక్షంగా గానీ ఉపయోగపడవు. ట్రైబల్ సబ్ప్లాన్ ప్రకారం ఆదివాసులకు 8.6 శాతం కేటాయించాల్సి ఉండగా 2017–18లో 5.6 శాతం, 2018–19లో 5.8 శాతం, 2019–20లో 6.1 శాతం కేటాయింపులు చూపించి చేతులు దులుపుకున్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికోసం గత ప్రభుత్వాలు అనుసరించిన విధా నాలను ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్న దాఖలాలు లేవు. అంతే కాకుండా ఎస్సీ, ఎస్టీల పట్ల ముఖ్యంగా ఎస్సీల పట్ల ఈ ప్రభుత్వం ఒకరకంగా శతృవైఖరినే అవలంబిస్తూ వస్తున్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల బలిదానం నుంచి మొదలుకొని, ఆవు మాంసం తిన్నారనే పేరుతోనో మరో కారణంతోనో దళితుల మీద జరిగిన హత్యాకాండను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రోత్సహిస్తూండటం ప్రజలకు తెలియంది కాదు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ అనుసరిస్తోన్న రాజకీయవిధానం ఇందుకు నిదర్శనం. రాజ్యాంగం అందించిన హక్కుల ద్వారా చదువుకొని, విద్యావంతులవుతున్న దళితుల పట్ల హిందూ సమాజంలోని కులాలకు సహజంగానే కంటగింపుగా ఉంటుంది. రిజర్వేషన్ల వల్ల తమ పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదనే కోపం కూడా ఉంది. దీనిని ఉపయోగించుకొని బీసీలతో సహా హిందూ సమాజంలోని కులాలన్నింటినీ ఏకం చేయడం కోసమే ప్రభుత్వం దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఉత్తరప్రదేశ్లో జరిగిన గత ఎన్నికల్లో ఇది ప్రస్ఫుటంగా కనిపించింది. దానికి ముస్లింల పట్ల ఉన్న వ్యతిరేకతను కూడా ప్రభుత్వం దీనికి జతచేస్తున్నది. దళితులు, ముస్లింలమీద గోసంరక్షణ పేరుతో జరిగిన దాడులు దీనికి నిదర్శనం. ఈ దృక్పథమే బడ్జెట్ కేటాయింపులు, అభివృద్ధి కార్యక్రమాల అమలు మీద ప్రభావం చూపుతున్నది. అందువల్లనే బీజేపీ ప్రభుత్వ బడ్జెట్ ఉపన్యాసాల్లో కనీసం ఎస్సీ, ఎస్టీ కార్యక్రమాల ప్రస్తావనలేకుండా పోతోంది. ప్రతి సంవత్సరం ప్రకటించే ఎకనామిక్ సర్వే నివేదికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి పట్ల ఒక అంచనా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉండేది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది పూర్తిగా తొలగించారు. వీటన్నింటికీ పరాకాష్టగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అగ్రకులాల పేదలను ఆదుకునే పేరుతో తీసుకొచ్చిన పదిశాతం రిజర్వేషన్లు. ప్రభుత్వాల దగ్గర నిధులు లేకకాదు. వాళ్ళు అనుకుంటే వేల కోట్లను రాత్రికి రాత్రే తమ కులాల వాళ్ళకు పంపిణీ చేయగలరు. అది వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు. చివరకు బాగా ముడుపులు అందే రక్షణ రంగం కావచ్చు. కానీ దళిత, ఆదివాసీల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని ఈ బడ్జెట్ చాలా స్పష్టంగా బయటపెట్టింది. ఇది కేవలం దళిత, ఆదివాసీ, వెనుకబడిన కులాల వ్యతిరేక బడ్జెట్ అని చెప్పడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదు. వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య , సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
పేరు చాలు
ఆడవాళ్లు చేలోకి రాకుండా, ఆడవాళ్ల చేతుల్లోకి పొలాలు రాకుండా మున్ముందు ఈ భూమి బతికి బట్టకట్టడం కష్టమేనని ‘ఎకనమిక్ సర్వే’ తేల్చి చెప్పాక కూడా మన ప్రభుత్వాలింకా మహిళల్ని సెల్ఫ్హెల్ప్ గ్రూపులకు, మైక్రో క్రెడిట్ స్కీములకు మాత్రమే పరిమితం చేస్తున్నాయి! రెండు జల్లులు పడితేనే నాలుగ్గింజలు పండుతాయి. ఆ రెండు జల్లులైనా సమయానికి పడాలి. సమయానికి ఆగిపోవాలి. వాన అవసరమైనప్పుడే వచ్చి, అవసరమైనంత వరకే ఉండి వెళ్లిపోవడం రైతుకి దేవుడు చేసే పెద్ద సాయం. అంత సాయం చేశాక కూడా జీవుడు ఆ నాలుగ్గింజలే పండిస్తే ఏం లాభం?! నాలుగు.. గుప్పెడవ్వాలి. గుప్పెడు.. గాదెలవ్వాలి. గాదెలు.. అందరి కడుపులు నింపాలి. కానీ అలా అవ్వట్లేదు. ‘ఇంత ముద్ద ఉంటే పెట్టు తల్లీ’ అని జనాభాలో ఒక్కరైనా భిక్షపాత్ర పట్టకుండా లేరు! ఎలా మరి ఈ దేశాన్ని అక్షయపాత్రగా మార్చి, అందరికీ వడ్డించడం? నీటి ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. మంచి విత్తనాలు వేసుకుంటున్నాం. ఎరువుల్ని సాత్వికంగా మార్చుకుంటున్నాం. ప్రభుత్వాలు కూడా ‘ఫార్మర్–ఫ్రెండ్లీ’ అవుతున్నాయి. రుణాలిస్తున్నాయి. తీర్చలేని రైతుల రుణం తీర్చుకుంటున్నాయి. అయినా అవే నాలుగ్గింజలు. కడుపులో అవే ఆకలి మొలకలు. దేవుడు వర్షాలిచ్చినా, ప్రభుత్వాలు వరాలిచ్చినా, భూమి సారాన్నిచ్చినా, రైతు స్వేదాన్నిచ్చినా.. పండుతున్నది ఆ నాలుగే. ఇప్పుడెవరివైపు చూడాలి? దేవుడు చేయాల్సింది చేస్తున్నాడు. ప్రభుత్వాలు ఇవ్వాల్సింది ఇస్తున్నాయి. పరిశోధనలు జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. టెక్నాలజీ ఎదిగేది ఎదుగుతూనే ఉంది. రైతుకి ఇంకా ఎవరి సాయం కావాలి? ఎప్పుడతడు ధీమాగా కనిపిస్తాడు? ఎప్పుడతడు తలగుడ్డను విదిలించి భరోసాగా భుజంపై వేసుకుంటాడు? ఎప్పుడతడు ‘రుతుపవనమా.. టేక్ యువర్ టైమ్’ అని చుట్ట వెలిగించుకుంటాడు? ఎప్పుడతడు పెదరాయుడిలా.. ‘లోపలికెళ్లి.. అమ్మనడికి.. ఎన్నికావాలో బియ్యం తెచ్చుకోపో’ అని పనివాళ్లతో అంటాడు? ‘మీవాడు సాఫ్ట్వేరా? మావాడు ఫార్మర్’ అని ఎప్పుడతడు బంధువులకు చెప్పుకోగలుగుతాడు? ‘పొలం దున్నే కుర్రాడుంటే చెప్పండి. ఫారిన్ సంబంధం వద్దు’ అని ఎప్పుడతడు ఘనంగా రిజెక్ట్ చెయ్యగలుగుతాడు? ‘ఎప్పుడు?’ అంటే.. ఒక చెయ్యి అతడికి తోడుగా ఉన్నప్పుడు! అదేం అభయహస్తమూ, అదృశ్య హస్తమూ కాదు. చక్కగా పని చేసే చెయ్యి. సొంత పొలం ఉండి, సంతకానికి విలువ ఉన్న చెయ్యి. సాగునీటికి సమృద్ధిగా దోసిలి పట్టగల చెయ్యి. బ్యాంకుకెళ్లి అప్పు పుట్టించుకోగల చెయ్యి, టెక్నాలజీని వెనకాముందూ తిప్పి చూడగల చెయ్యి. శిక్షణతో పదును తిరిగే చెయ్యి. బడ్జెట్కి ముందొచ్చే ‘ఎకనమిక్ సర్వే’ మొన్న కుండబద్దలు కొట్టేసింది. ఆడవాళ్లు చేలోకి రాకుండా, ఆడవాళ్ల చేతుల్లోకి పొలాలు రాకుండా మున్ముందు భూమి బతికి బట్టకట్టడం కష్టమేనని చెప్పేసింది. పండే దగ్గర్నుంచి, పంటను అమ్మే దశ వరకు.. వాళ్లక్కూడా ఒక మాట చెప్పందే, వాళ్ల సలహా తీసుకోందే దిగుబడులు ఇలాగే ఏడుస్తాయని కూడా చెప్పింది. చెప్పడం వరకు చెప్పింది. వినేవాళ్లకు వినిపించాలి. మహిళలకు సెల్ఫ్హెల్ప్ గ్రూపులున్నాయి, మైక్రో క్రెడిట్ స్కీములున్నాయి కదా అంటే.. పైన ఆకాశం ఉంది. కింద భూమి ఉంది. ఇక బతకడానికి ఏమొచ్చింది? అన్నట్లే ఉంటుంది. బతకడం కాదిప్పుడు సమస్య. బతికించడం. తిండిగింజల్ని పెంచడం. సాగుబడిలో మహిళలు ఎంతెక్కువ మంది ఉంటే అంతెక్కువగా ఆకలి మంటలు చల్లారతాయని ఎఫ్.ఎ.ఒ. అంచనా వేసింది. ఎఫ్.ఏ.ఓ.నే చెబుతున్నట్లు మహిళల వల్ల ఇరవై నుంచి ముప్పై శాతం దిగుబడి పెరిగే అవకాశాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు మహిళలకు ప్రాముఖ్యాన్నిచ్చి, భూమినిచ్చి, పరిజ్ఞానాన్నిచ్చి, పరికరాలనిచ్చి వారి చేయూతను కోరవచ్చు. ఇవేవీ ఇవ్వకుండా ఒక్క ‘అక్టోబర్ 15’ను మాత్రం వాళ్లకిచ్చాయి. అంతర్జాతీయ మహిళారైతు దినోత్సవం అది. మంచిదే. ఆ ఉదారతతోనే కాస్త భూమిని కూడా వాళ్ల సొంతానికి వచ్చేటట్లు చెయ్యగలితే మిగతావి వాళ్లే చూసుకుంటారు. భూమి అంటే పంట. మహిళారైతుకు అది నిర్ణయాధికారం కూడా. నిర్ణయం మహిళల చేతుల్లో ఉంటే.. బియ్యపు గింజపై తన పేరు లేని మనిషే ఉండడు. - మాధవ్ శింగరాజు -
రెండంకెల అభివృద్ధి ఎటుపోయింది?
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆర్థిక సలహాదారుడు అర్వింద్ సుబ్రమణియన్ సోమవారం పార్లమెంట్కు సమర్పించిన 2017–18 ఆర్థిక సర్వే చప్పచప్పగా ఉంది. జీడీపీలో రెండంకెల అభివృద్ధి సాధించడం అందుబాటులోనే ఉందని, మరికొంత కాలంలోనే అది సాకారమవుతుందని ఇదే అర్వింద్ సుబ్రమణియన్ 2014–15 ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన తన తొలి ఆర్థిక సర్వే నివేదికలో వెల్లడించారు. అది ఇప్పటికి సాధ్యంకాకపోగా వచ్చే ఏడాది జీడీపీ వృద్ధి రేటు ఆశాజనకంగా ఉంటుందని, అది ఏడు నుంచి ఏడున్నర శాతం వరకు ఉండవచ్చని చెప్పారు. మూడేళ్ల క్రితం చెప్పిన రెండంకెల అభివృద్ధి ఎందుకు సాధ్యం కాలేదని ఆయన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ‘స్టఫ్ హాపెన్స్’ అంటూ బాధ్యతారహితంగా సమాధానం చెప్పారు. స్టఫ్ హాపెన్స్ అనేది ఆంగ్లంలో క్రూరమైన నానుడి. స్థూలంగా దీని అర్థం ‘కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు అంతే. ప్రత్యేక కారణాలంటూ ఉండవు’. బాధ్యతాయుతమైన పదవులో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి సమాధానాన్ని ఆశించలేం. ఆశించిన ఆర్థికాభివృద్ధి సాధించక పోవడానికి కారణం పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలు బెడిసికొట్టడమేనన్నది అందరికీ తెల్సిందే. అయితే వాటి ప్రభావం మరెంతో కాలం ఉండదని, ఆప్పటికే ఆర్థిక వ్యవస్థ వాటి ప్రభావం నుంచి బయట పడిందని సుబ్రమణియన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఉండొచ్చని ప్రధాన ఆర్థిక సలహాదారు చెప్పారుగానీ, దానికి అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించలేదు. పెట్టుబడుదారులకు భారంగా పెరిగిన వడ్డీ రేట్ల గురించిగానీ, భారతీయ బ్యాంకుల్లో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన రుణాల మొత్తాలను ఎలా రాబట్టుకోవాలో సూచించలేదు. ఆర్థికంగా మరీ భారమైన ఇండియన్ ఎయిర్లైన్స్ను, భారమవుతున్న బ్యాంకులను అమ్ముకోవాలంటూ ఉచిత సలహా మాత్రం ఇచ్చారు. జీఎస్టీతో ఆర్థిక రంగం ముందుకు దూసుకెళుతుందని, జనధన్ యోజన, ఆధార్ లాంటి పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలవుతాయని గతంలో ఊదరగొట్టిన సుబ్రమణియన్ ఈ రోజున వాటి గురించి మాట మాత్రంగాను ప్రస్తావించలేదు. వ్యవసాయంపైనా వాతావరణ పరిస్థితులు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన వాటిని ఎలా ఎదుర్కోవాలో సూచించలేదు. ఎన్నికల సంవత్సరంలో వస్తున్న ఆర్థిక సర్వే కనుక అన్ని రంగాల అభివృద్ధికి సమతౌల్య ప్రణాళికతో ఆర్థిక సర్వే ఉంటుందని భావించిన భారతీయులకు సుబ్రమణియన్ ఆశాభంగమే కలిగించారు. అప్పటికే చక్రం కింద నలిగిన చెరకు గెడను చప్పరించినట్లుగా చప్పచప్పగా ఉంది ఆయన నివేదిక. -
బడ్జెట్పై ఆర్థిక సర్వే
-
రైతు ఆదాయం 25% తగ్గొచ్చు
న్యూఢిల్లీ: వాతావరణంలో మార్పుల కారణంగా రైతుల ఆదాయం రాబోయే కొన్నేళ్లలో 20 నుంచి 25 శాతం వరకు తగ్గొచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, సాంకేతికతను ఉపయోగించడం, సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ ప్రతికూల పరిస్థితిని కొంతవరకు అధిగమించొచ్చంది. ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలంటే వ్యవసాయ, సర్కారీ విధానాల్లో సమూల మార్పులు అవసరమని సర్వే పేర్కొంది. వ్యవసాయదారుల రాబడిని పెంచడంతోపాటు, ఆ రంగంలో సంస్కరణలు తీసుకురావడం కోసం జీఎస్టీ మండలి తరహాలో ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సర్వే సూచించింది. ఎరువులు, విద్యుత్తుపై రైతులకు ఇస్తున్న రాయితీని కూడా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో అందజేయాలని సూచించింది. ప్రస్తుతం దేశంలో 45 శాతం పంట భూమికే సాగునీటి వసతి ఉండగా, ఈ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందంది. మధ్యప్రదేశ్, గుజరాత్లు మినహా మిగతా రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ రీతిలో సాగునీటి వసతి ఉన్న భూమి అంతంత మాత్రంగానే ఉందని సర్వే పేర్కొంది. సాగునీటి వసతిని మెరుగుపరిచేందుకు అధిక నిధులను కేటాయించాలని ఆర్థిక సర్వే సిఫారసు చేసింది. రైతులు నష్టపోకుండా ఉండేందుకు మరింత ప్రభావ వంతమైన, సమర్థవంతమైన పంట బీమా సదుపాయాలను తీసుకురావాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే గుర్తుచేసింది. రైతులు కేవలం వ్యవసాయంపైనే ఆధారపడకుండా, అనుబంధ రంగాలైన పాడి, మత్స్య పరిశ్రమలవైపు కూడా వెళ్లేలా వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరింత ఆకర్షవంతమైన విధానాలు రూపొందించాలంది. వ్యవసాయ రంగంలో ఇప్పటికే స్త్రీలు కీలక భూమిక పోషిస్తున్నప్పటికీ వారి పాత్ర మరింత పెరగాలనీ, మహిళా రైతులకు రుణాలు, భూమి, విత్తనాలు సులభంగా లభించేలా విధానాలు ఉండాలని ఆర్థిక సర్వే పేర్కొంది. -
ఆశావహ స్వరం
ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలూ పదేళ్ల తర్వాత మళ్లీ పుంజుకుంటున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్న వేళ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2018–19 ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రధాన బడ్జెట్కు ముందు ఏటా లాంఛనంగా ప్రవేశపెట్టే ఈ సర్వే దేశ ఆర్థిక స్థితిగతులెలా ఉన్నాయో, వివిధ రంగాల పనితీరు ఎలా ఉన్నదో చెబుతుంది. ఎలా ఉండ బోతున్నదో అంచనా వేస్తుంది. అందులో ఆశావహం కలిగించేవీ ఉంటాయి. బెంబే లెత్తించేవీ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు, అది తీసుకున్న వివిధ చర్యలు ఎలాంటి ఫలితాలిచ్చాయో సర్వే గణాంకాలు సమగ్రంగా వెల్లడిస్తాయి. దేశ సాంఘికార్థిక పరిస్థితుల గురించి కూడా ఆర్థిక సర్వే ఏకరువు పెడుతుంది. సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది జరగాల్సి ఉన్నా అవి ఇంకా ముందే ఉండొచ్చునని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అందువల్లే కావొచ్చు... ఆర్థిక సర్వే మరీ నిరాశాపూరిత అంచనాల జోలికి పోలేదు. కొన్ని రంగాల్లో పరిస్థితులు సక్రమంగా లేవని చెప్పినా వాటిని అధిగమించడానికి అవకాశాలున్నాయనే ధ్వనించింది. ముఖ్యంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7–7.5 శాతం మధ్య ఉండొచ్చునని అది చెప్పిన మాట మార్కెట్లో ఉత్సాహం నింపింది. గత ఆర్థిక సంవత్సరం కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం, ఇప్పుడు ముగుస్తున్న ఆర్థిక సంవత్సరంలో సరుకులు, సేవల పన్ను(జీఎస్టీ) అమలు నిర్ణయం అత్యంత కీలకమైనవి. ఈ రెండూ దేశ ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధం చేయడానికి ఉద్దేశించిన చర్యలు. అయితే ప్రపంచమంతా ఆర్థిక వ్యవస్థలు మెరుగవుతున్న సూచనలు కనిపిస్తుండగా, మనం మాత్రమే వెనకబడి ఉండటానికి కారణం ఈ రెండు నిర్ణయాల ప్రభావమేనన్న మాట వాస్తవం. ఈ సర్వే పెద్ద నోట్ల రద్దు ప్రభావం గురించి నేరుగా ప్రస్తావించలేదు. జీఎస్టీ అమలు సాహ సోపేతమైన నిర్ణయమని, అది విజయవంతంగా అమలవుతున్నదని చెప్పినా... స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)పైనా, ఉపాధి కల్పనపైనా దాని ప్రభావమేమిటో వివరించలేకపోయింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల అదనంగా 18 లక్షలమంది పన్ను చెల్లింపుదారులు వచ్చిచేరినా వారిలో అత్యధికులు తక్కువ స్లాబ్లో ఉన్నవారే. కాబట్టి వీరి వల్ల ఇప్పటికైతే సర్కారుకు ఆదాయం పెద్దగా పెరిగే అవకాశం లేదు. వీరి వార్షికాదాయం రాగల సంవత్సరాల్లో పెరగాలంటే ఆరోగ్య వంతమైన ఆర్థిక వ్యవస్థ అవసరమవుతుంది. మెరుగైన ప్రభుత్వ విధానాలు మాత్రమే అలాంటి ఆర్థిక వ్యవస్థలకు దోహదపడగలవు. నిరుటి ఆర్థిక సర్వే పెద్ద నోట్ల రద్దు వల్ల జీడీపీపై 0.5 శాతం కోత పడి 6.5 శాతంగా ఉన్నదని చెప్పింది. 2017–18లో తిరిగి సాధారణ స్థితి ఏర్పడి జీడీపీ 7.5 శాతానికి ఎగబాకుతుందని జోస్యం చెప్పింది. ఆ తదుపరి రెండేళ్లలో 8 నుంచి 10 శాతం వరకూ తీసుకెళ్తామని కూడా భరోసా ఇచ్చింది. కానీ జరిగిందేమిటి? అది 6.75 ఉండొచ్చునని ప్రస్తుత ఆర్థిక సర్వే భావిస్తోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పర్యవసానాలను సరిగా గుర్తించలేదని నిరుటి ఆర్థిక సర్వేపై అప్పట్లో ఆర్థిక నిపుణులు విమర్శించారు. ఈ నేపథ్యంలో రాబోయే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7–7.5 శాతం మధ్య ఉండొ చ్చునంటున్న అంచనాలు ఏమేరకు సాకారమవుతాయో వేచిచూడాలి. మొత్తానికి దేశ ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధం చేయడానికి ఉద్దేశించిన రెండు నిర్ణయాలూ అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదని సర్వే చూస్తే అర్ధమవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతూ పోతున్న చమురు ధరలు దేశ ఆర్థిక వ్యవస్థపై చూపబోయే ప్రభావాన్ని గురించి ఈ ఆర్థిక సర్వే పలుమార్లు ప్రస్తావిం చిన సంగతిని మరిచిపోకూడదు. ఒక బ్యారెల్ చమురు ధర 10 డాలర్లు పెరిగితే వృద్ధిని అది 0.2 నుంచి 0.3 శాతం వరకూ తగ్గిస్తుందని సర్వే వివరిస్తోంది. ముగు స్తున్న ఆర్థిక సంవత్సరంలో చమురు ధరలు సగటున 14 శాతం పెరిగాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ పెరుగుదల 10–15 శాతం వరకూ ఉండొచ్చునని అంటు న్నది. ఈ సవాళ్లను సర్కారు ఎలా అధిగమిస్తుందో చూడాలి. అయితే ఆర్థిక సర్వే వ్యవసాయ రంగానికి సంబంధించి నిరాశాజనకమైన అంచనాలే ఇస్తోంది. వాతావరణ మార్పుల పర్యవసానంగా ఆ రంగంలో వార్షిక ఆదాయం సగటున 15 నుంచి 18 శాతం వరకూ పడిపోవచ్చునని లెక్కేస్తోంది. నీటిపారుదల సౌకర్యం సక్రమంగా లేని ప్రాంతాల్లో ఇది 20 నుంచి 25 శాతం మధ్య ఉండొచ్చునని కూడా చెబుతోంది. కష్టాల సేద్యం చేస్తున్న రైతాంగానికి ఇది దుర్వార్తే. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు సరిగా పండకపోవడం ఒకపక్క కనబడుతుంటే పంటలు పండిన సందర్భాల్లో సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడం మరోపక్క ఉంటుంది. ఈమధ్యకాలంలో ఉల్లిపాయలు, ఆలు గడ్డలు, టమోటాల వగైరా «ధరలు భారీగా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితులు రైతాంగాన్ని రుణ ఊబిలోకి నెడుతున్నాయి. విత్తనాలు మొదలుకొని ఎరువులు, పురుగుమందుల వరకూ అన్నిటి ధరలూ ఆకాశాన్నంటడంతో సాగు వ్యయం అపరిమితంగా పెరిగింది. దిగుబడుల ధరలు మాత్రం దిగజారుతున్నాయి. దిగు బడికైన వ్యయానికి 50 శాతాన్ని జోడించి గిట్టుబాటు ధరను నిర్ణయించాలన్న స్వామినాథన్ కమిషన్ సిఫార్సును పాలకులు మరిచారు. చిత్రంగా ఆర్థిక సర్వే దాని ఊసే లేకుండా విద్యుత్, ఎరువులు సబ్సిడీలను ఎత్తేసి నగదు బదిలీ ప్రవే శపెట్టమని చెబుతోంది. బిందుసేద్యం, తుంపర సేద్యంవంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలంటున్నది. ఇవి అమలు చేస్తే 2022నాటికి సాగు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని చెబుతోంది. సాగు రంగానికొచ్చేసరికి మన విధాన నిర్ణేతలు ఎప్పుడూ బోర్లాపడుతుంటారు. సర్వేలో ప్రస్తావించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఆలోచనలేమిటో, ఆర్థికరంగ జవసత్వాలకు అది తీసుకోబోయే చర్యలేమిటో మరో మూడురోజుల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ తేటతెల్లం చేస్తుంది. -
బాగుంది... కానీ
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 7–7.5 శాతం మేర ఉండొచ్చన్న ఆర్థిక సర్వే అంచనాలను కార్పొరేట్లు స్వాగతించారు. నిలకడైన ఆర్థిక వృద్ధి సాధనకోసం మానవ వనరుల్ని, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపర్చుకోవడంపై ప్రభుత్వం మరింతగా దృష్టి సారించాలని అభిప్రాయపడ్డారు. ‘రాబోయే సంవత్సరంలో వృద్ధి వేగం మెరుగుపడటానికి, ఆ తర్వాత నుంచి మరింతగా పుంజుకోవడానికి అవసరమైన కొత్త ఐడియాలను సర్వే ప్రస్తావించింది‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ప్రధానంగా మహిళల ఉపాధితో పాటు విద్యావంతులైన, ఆరోగ్యవంతులైన మానవ వనరులను, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపర్చడంపై మధ్య కాలికంగా మరింత దృష్టి సారించాలని సర్వేలో చేసిన సిఫార్సులు సహేతుకమైనవేనని ఆయన చెప్పారు. వీటిలో కొన్నింటినైనా బడ్జెట్లో పరిగణనలోకి తీసుకోగలరని ఆశిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎన్పీఏల పరిష్కారం కీలకం: అసోచామ్ మొండిబాకీల సమస్య పరిష్కారమయ్యే దాకా అధిక వృద్ధి సాధ్యపడకపోవచ్చని అసోచామ్ ప్రెసిడెంట్ సందీప్ జజోడియా అభిప్రాయపడ్డారు. నిరర్ధక ఆస్తులపై పర్యవేక్షణ పెంచడం, బ్యాంకులకు సాధ్యమైనంత త్వరగా అదనపు మూలధనం సమకూర్చడం చేయాలన్నారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబాకీలు పెరుగుతుండటం వంటి ఆందోళనకర అంశాలను సర్వే ప్రస్తావించింది. ఉపాధి కల్పన, వ్యవసాయం, విద్యపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరాన్ని సూచించింది‘ అని సందీప్ తెలిపారు. ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణ కట్టడిపై మరింతగా దృష్టి సారించాలని, సంస్కరణల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని చెప్పారాయన. సేవల రంగంలో ఉద్యోగాలు పెరగాలి: డెలాయిట్ ఆటోమేషన్ పెరిగిపోతున్న నేపథ్యంలో కాయకష్టం అవసరమయ్యే ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతోందని డెలాయిట్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ అనీస్ చక్రవర్తి చెప్పారు. ఈ నేపథ్యంలో సేవల రంగంలో మరిన్ని ఉద్యోగావకాశాల కల్పన జరగాల్సి ఉంటుందన్నారు. తయారీ రంగం వృద్ధి చెందుతుండటం సానుకూలాంశమని పీడబ్ల్యూసీ ఇండియా లీడర్ (ఇన్ఫ్రా విభాగం) మనీష్ అగర్వాల్ పేర్కొన్నారు. రుణాలకు డిమాండ్ పెరగడంతో పాటు సిమెంటు, ఉక్కు మొదలైన వాటి వినియోగం పెరుగుదలతో పారిశ్రామికోత్పత్తి మరింతగా మెరుగుపడగలదన్నారు. 2018–19లో వృద్ధి మెరుగుపడటం ఖాయమే అయినప్పటికీ.. ఇది సర్వేలో అంచనా వేస్తున్న శ్రేణిలో దిగువ స్థాయిలోనే ఉండొచ్చని (7 శాతం) ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ ఎకానమిస్ట్ దేవేంద్ర కుమార్ పంత్ తెలిపారు. దేశ, విదేశీ పరిస్థితుల కారణంగా వృద్ధి ఎటువైపైనా మొగ్గు చూపవచ్చన్నారు. -
'చమురు' వదులుతుందేమో!!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తాలూకు ప్రభావాల నుంచి బయటపడి దేశ ఆర్థిక వ్యవస్థ చక్కగా పుంజుకుంటోందని, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 7– 7.5 శాతం స్థాయిలో వృద్ధి రేటు నమోదవుతుందని 2017–18 సంవత్సర ఆర్థిక సర్వే స్పష్టంచేసింది. సోమవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటు ముందుంచిన ఈ సర్వే... ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా మళ్లీ గత స్థానానికి చేరుకుంటామని ఆశాభావాన్ని వ్యక్తంచేసింది. ‘‘ప్రపంచ వృద్ధి రేటు 2018లో ఒక మోస్తరు స్థాయిలోనే పురోగమిస్తుంది. మనకైతే జీఎస్టీ పూర్తి స్థాయిలో స్థిర పడటం, పెట్టుబడులు పెరిగే అవకాశాలు, కొనసాగుతున్న సంస్కరణలు అధిక వృద్ధి రేటుకు అనుకూలాంశాలుగా కనిపిస్తున్నాయి. కాకపోతే పెరుగుతున్న చమురు ధరలు, పెరిగిన స్టాక్ ధరల్లో భారీ కరెక్షన్ వంటి సవాళ్లుంటాయి. వీటి కారణంగా విదేశీ నిధుల రాక ఆగిపోతుంది’’ అని సర్వే అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు రూపొందించిన ఈ సర్వేను... మరో రెండు రోజుల్లో (ఫిబ్రవరి 1న) బడ్జెట్ సమర్పించనున్న నేపథ్యంలో సోమవారం లోక్సభలో జైట్లీ ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ద్రవ్య క్రమశిక్షణ నిలిచిపోయే అవకాశాన్ని సర్వే తోసిపుచ్చలేదు. అంచనాలను మించే వృద్ధి... ఈ ఆర్థిక సంవత్సరంలో (2017–18) జీడీపీ వృద్ధి 6.75 శాతంగా నమోదవుతుందని సర్వే పేర్కొంది. కాకపోతే ఇది 6.5 శాతంగా ఉండొచ్చని ఇటీవలే కేంద్ర గణాంకాల విభాగం పేర్కొనడం గమనార్హం. 2016–17లో జీడీపీ వృద్ధి 7.1 శాతం కాగా, 2014–15లో ఇది ఏకంగా 8 శాతంగా ఉంది. 2017–18కు స్థూలంగా జోడించిన విలువ (జీవీఏ) 6.1 శాతంగా సర్వే అంచనా వేసింది. గతేడాది ఇది 6.6 శాతం. ఎగుమతులు, ప్రైవేటు పెట్టుబడులు వచ్చే సంవత్సరంలో తిరిగి పుంజుకుంటాయంటూ... జీఎస్టీ సాధారణ స్థితికి చేరడం, రెండు రకాల బ్యాలన్స్ షీటు చర్యలు, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణతో ఆర్థిక రంగంలో (మాక్రో) స్థిరత్వం నెలకొంటుందని అంచనా వేసింది. సవాళ్లు పొంచి ఉన్నాయి... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దిగుమతి చేసుకునే చమురు ధరలు సగటున 14 శాతం పెరగ్గా, 2018–19 ఆర్థిక సంవత్సరంలోనూ 10–15 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని సర్వే అంచనా వేసింది. ఈ నేపథ్యంలో విధానాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ‘‘మధ్య కాలానికి మూడు విభాగాలపై దృష్టి సారించాలి. ఇందులో ఉద్యోగాల కల్పన ఒకటి. యువతకు, ముఖ్యంగా మహిళలకు మంచి ఉద్యోగ అవకాశాలుండాలి. విద్యావంతులైన, ఆరోగ్యవంతులైన కార్మిక శక్తిని సృష్టించడం రెండోది. సాగు ఉత్పాదనను పెంచడం మూడోది. ముఖ్యంగా వచ్చే ఏడాది ఎన్నికలున్నం దున ఆర్థిక నిర్వహణ సవాలుగా ఉంటుంది’’ అని సర్వే హెచ్చరించింది. వ్యాపార నిర్వహణలో మరింత సులభతర దేశంగా భారత్ను మార్చేందుకు అప్పిలేట్, న్యాయ విభాగాల్లో జాప్యం, అపరిష్కృత పరిస్థితులను తొలగించాలని సూచించింది. ఇందుకోసం ప్రభుత్వం, న్యాయ వ్యవస్థల మధ్య సమన్వయంతో కూడిన చర్యల అవసరాన్ని సర్వే గుర్తు చేసింది. ఆర్థిక వ్యవస్థ చక్కగా, బలంగా ఊపందుకుంటోంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తాలూకు తాత్కాలిక ప్రభావాలు సమసిపోయాయి. ఎగుమతులు పుంజుకుంటే వృద్ధి రేటు 7.5 శాతం కంటే ఎక్కువే నమోదవుతుంది. అయితే పెరుగుతున్న చమురు ధరలు, పెరిగిన స్టాక్ ధరల్లో కరెక్షన్ అన్నవి డౌన్సైడ్ రిస్క్లు. ద్రవ్యోల్బణం 0.2–0.3 శాతం పెరిగితే జీడీపీ కూడా ఆ మేరకు ప్రభావితం అవుతుంది. చమురు ధరలు బ్యారెల్కు 10 డాలర్లు పెరిగితే కరెంటు ఖాతా లోటు మరింత విస్తరిస్తుంది.’’ – అరవింద్ సుబ్రమణియన్, కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు ఇవీ... ముఖ్యాంశాలు ♦ 2017–18లో జీడీపీ వృద్ధి రేటు 6.75 శాతంగా ఉండొచ్చు. ♦ 2018–19లో ఇది 7–7.5%కి చేరుతుంది ♦ చమురు ధరలు పెరిగినా లేక షేర్ల ధరలు పడినా విధానపరమైన చర్యలు అవసరం. ♦ వ్యవసాయానికి సహకారం పెంచడం, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ, బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ వచ్చే ఏడాదిలో పూర్తి చేయాలి. ♦ పరోక్ష పన్నులు 50 శాతం పెరిగినట్టు జీఎస్టీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ♦ రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు వసూలు చేసే పన్నులు ఇతర సమాఖ్య దేశాలతో పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ♦ పెద్ద నోట్ల రద్దు కారణంగా ఆర్థిక పొదుపునకు ప్రోత్సాహం లభించింది. ♦ 2017–18లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.3 శాతం. గత 6 ఆర్థిక సంవత్సరాల్లో ఇదే కనిష్ట స్థాయి. ♦ 2017–18లో సంస్కరణల కారణంగా సేవల రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 15 శాతం పెరిగాయి. ♦ కార్మిక చట్టాలు మెరుగ్గా అమలు చేసేందుకు టెక్నాలజీని వినియోగించాలి. ♦ స్వచ్ఛభారత్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల వసతులు పెరిగాయి. 2014లో 39 శాతమే ఉంటే, 2018 నాటికి 76%కి చేరాయి. ♦ సమ్మిళిత వృద్ధికి గాను విద్య, ఆరోగ్యం వంటి సామాజిక రంగాలకు ప్రాధాన్యమివ్వాలి. ఇన్ఫ్రాకు 2040కి 4.5 ట్రిలియన్ డాలర్లు దేశంలో మౌలిక రంగ అభివృద్ధికి వచ్చే 25 సంవత్సరాల్లో 4.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరం అవుతాయి. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే, 3.9 ట్రిలియన్ డాలర్లను మాత్రమే సమీకరించుకోగలిగే అవకాశముంది. ప్రైవేటు పెట్టుబడులతోపాటు, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఎన్ఐఐబీ), ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్(ఏఐఐబీ), న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (బ్రిక్స్ బ్యాంక్) ద్వారా మౌలికానికి పెట్టుబడులను సమీకరించుకోవాలి. విదేశీయుల పర్యటనలు పెరిగాయి... పర్యాటక రంగం అభివృద్ధి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యల వల్ల దేశంలో విదేశీయుల పర్యటనలు గణనీయంగా పెరిగాయి. పర్యాటకం ద్వారా 2017లో విదేశీ మారక ఆదాయం 29 శాతం పెరిగి, 27.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక పర్యాటకుల సంఖ్య 15.6 శాతం పెరిగి, 1.02 కోట్లుగా నమోదైంది. పర్యాటకం అభివృద్ధి దిశలో ఈ–వీసా, ది హెరిటేజ్ ట్రైల్ వంటి అంశాలతో సహా ప్రభుత్వం ఈ విషయంలో చేపట్టిన ప్రచారం కూడా కలిసివచ్చాయి. జీఎస్టీతో పెరిగిన ‘పరోక్ష’ పన్ను బేస్ జూలై నుంచీ అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్ను తో పరోక్ష పన్ను చెల్లింపుదారుల సంఖ్య 50 శాతంపైగా పెరిగింది. 34 లక్షల వ్యాపార సంస్థలు పన్ను పరిధిలోకి వచ్చాయి. పలు చిన్న పరిశ్రమల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. జీఎస్టీ వసూళ్ల పట్ల కొంత అనిశ్చితి ఉన్నప్పటికీ, ఒకసారి వ్యవస్థ స్థిరపడిన తర్వాత, ఆయా పరిస్థితులన్నీ తొలగిపోతాయి. జనవరి 24 వరకూ జీఎస్టీ కింద కోటి మంది పన్ను చెల్లింపుదారులు నమోదయ్యారు. ఎగుమతులూ పుంజుకుంటాయి.. అంతర్జాతీయ వాణిజ్యం పెరగనున్న నేపథ్యంలో మున్ముందు దేశీ ఎగుమతులు కూడా పుంజుకోగలవని సర్వే అంచనా వేసింది. అయితే, చమురు ధరల పెరుగుదల మాత్రం సమస్యలు సృష్టించే అవకాశాలున్నాయని పేర్కొంది. 2016లో 2.4 శాతంగా ఉన్న ప్రపంచ వాణిజ్యం.. 2017లో 4.2 శాతం, 2018లో 4 శాతం మేర వృద్ధి చెందగలదని అంచనా వేసింది. డీమోనిటైజేషన్తో పెరిగిన గృహ పొదుపు పెద్ద నోట్ల రద్దు వల్ల బహుళ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడం ఇందులో ఒకటి. అలాగే గృహ పొదుపు రేట్లూ పెరిగాయి. పెట్టుబడుల పునరుద్ధరణలో పొదుపు రేటు పెంపు కీలకాంశం. అలాగే సాంప్రదాయకంగా బంగారంపై చేసే వ్యయాలను నగదు సంబంధ పొదుపులవైపు మళ్లించడానికి విధానపరమైన ప్రాధాన్యత ఇవ్వాలి. నగదు వాడకం తగ్గి, ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా ఆర్థిక లావాదేవీలు పెరగడం డీమోనిటైజేషన్ వల్ల ఒనగూరిన ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి. ఎన్పీఏల పరిష్కారంలో ఐబీసీది కీలకపాత్ర బ్యాంకుల్లో పేరుకున్న రూ.8 లక్షల కోట్ల మొండిబకాయిల (ఎన్పీఏ) పరిష్కారానికి కొత్త దివాలా చట్టం (ఐబీసీ) పటిష్టవంతమైన యంత్రాంగాన్ని అందిస్తోంది. పలు వివాదాల పరిష్కారానికి నిర్ధిష్టమైన కాలపరిమితులను నిర్దేశిస్తోంది. కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరచుకోవటానికి తగిన విధివిధానాలను అందిస్తోంది. ట్విన్ బ్యాలెన్స్ షీట్ (టీబీఎస్) చర్యలు దీర్ఘకాలిక సమస్యపరిష్కారంలో ప్రధానమైనవి. ప్రస్తుతం దివాలా ప్రొసీడింగ్స్ కింద 11 కంపెనీలకు చెందిన రూ.3.13 కోట్ల విలువైన క్లెయిమ్స్ ఉన్నాయి. ఆరేళ్ల కనిష్టానికి సగటు ద్రవ్యోల్బణం 2017–18లో సగటు ద్రవ్యోల్బ ణం 3.3 శాతం. ఇది ఆరేళ్ల కనిష్టస్థాయి. ఒక స్థిర ధరల వ్యవస్థవైపు ఆర్థికవ్యవస్థ పురోగమిస్తోంది. ధరల కట్టడి ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటి. హౌసింగ్, ఇంధనం మిగిలిన ప్రధాన కమోడిటీ గ్రూపులన్నింటిలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది. సీజనల్ ఇబ్బందుల వల్ల ఇటీవల కూరగాయలు, పండ్ల ధరలు పెరిగాయి. సరఫరాల్లో ఇబ్బందుల తొలగించి ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుంది. ‘గులాబీ బాల’ను గౌరవిద్దాం! మహిళల ప్రాధాన్యాన్ని వివరించిన సర్వే ఆడవారిని గులాబీలతో పోలుస్తారు. అంతటి సుకుమారులు కనకే వారిని ‘గులాబీ బాల’ అని సంబోధిస్తుంటారు. బహుశా.. అందుకేనేమో!! ఈ సారి సర్వేలో మహిళల ప్రాధాన్యాన్ని, లింగ వివక్షపై వ్యతిరేకతను చాటడానికి మోదీ ప్రభుత్వం గులాబీ రంగును ఎంచుకుంది. సర్వే కవర్ పేజీ సహా గులాబీ రంగులో మెరిసింది. మహిళలపై హింసకు ముగింపు పలకాలన్న ఉద్యమానికి మద్దతుగానే కవర్ పేజీకి గులాబీ రంగులద్దారన్నది నిపుణుల మాట. ‘‘కనీసం ఒక్క కుమారుడినైనా కలిగి ఉండాలన్న సామాజిక ప్రాధాన్యతను భారత్ వ్యతిరేకించాలి. స్త్రీ, పురుషులను సమానంగా అభివృద్ధి చేయాలి’’ అని పేర్కొంది. ‘‘47 శాతం మహిళలు ఎటువంటి గర్భనిరోధకాలూ వాడటం లేదు. వాడే వారిలో కూడా మూడోవంతు కన్నా తక్కువ మంది మాత్రమే పూర్తిగా మహిళలకు సంబంధించిన గర్భ నిరోధకాలు వాడుతున్నారు’’ అని సర్వే తెలియజేసింది. నిర్మాణ రంగంలో కోటిన్నర కొత్త ఉద్యోగాలు కొన్నాళ్లుగా స్థిరాస్తి.. నిర్మాణ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ఇందులో వచ్చే అయిదేళ్లలో 1.5 కోట్ల ఉద్యోగాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించడంలో వ్యవసాయం తర్వాత రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం కలిపి రెండో స్థానంలో ఉన్నట్లు తెలియజేసింది. ‘‘2013లో ఈ రంగంలో 4 కోట్లపైగా సి బ్బంది ఉండగా.. 2017కి ఈ సంఖ్య 5.2 కోట్లకు చేరింది. 2022 నాటికి 6.7 కోట్లకు చేరొచ్చు. ఏటా 30 లక్షల ఉద్యోగాల చొప్పున అయిదేళ్లలో కోటిన్నర ఉద్యోగాల కల్పన జరగవచ్చు‘ అని సర్వే వివరించింది. రియల్టీ, కన్స్ట్రక్షన్ రంగంలో 90% మంది నిర్మాణ కార్యకలాపాల్లో పనిచేస్తుండగా, మిగతా 10% ఫినిషింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల్లో ఉంటున్నారు. ఫండ్స్పై పెరుగుతున్న మక్కువ గత ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల పొదుపు... బ్యాంక్ డిపాజిట్లలో 82%, జీవిత బీమా ఫండ్స్లో 66 శాతం, షేర్లు, డిబెంచర్లలో 345% చొప్పున పెరిగాయి. మ్యూచువల్ ఫండ్స్పై ఇన్వెస్టర్ల మక్కువ పెరుగుతోంది. ఫండ్స్ పొదుపులు 400 శాతం వృద్ధి చెందాయి. కేవలం రెండేళ్లలోనే ఫండ్స్ పొదుపులు 11 రెట్లు పెరిగాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ నాటికి మ్యూచువల్ ఫండ్స్లోకి రూ.2.53 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయి. దీంతో గత ఏడాది అక్టోబర్ 31 నాటికి మ్యూచువల్ ఫండ్ సంస్థల నిర్వహణ ఆస్తులు రూ.21.43 లక్షల కోట్లకు పెరిగింది. వనరులు తక్కువైనా విద్య, ఆరోగ్యంపై దృష్టి పరిమిత వనరులున్నా.. విద్య, ఆరోగ్యాలకు ప్రభుత్వం గణనీయ ప్రాధాన్యమిస్తోందని సర్వే తెలిపింది. ‘భారత్ వర్ధమాన దేశం. విద్య, ఆరోగ్యం వంటి కీలకమైన మౌలిక సదుపాయాలపై భారీగా వెచ్చించేందుకు వెసులుబాటుండదు. ప్రభుత్వం మాత్రం వీటిని మెరుగుపర్చేందుకు నిరంతరం ప్రాధాన్యమిస్తూనే ఉంది. సామాజిక సంక్షేమం దృష్ట్యా పథకాలపై వ్యయాలను స్థూల రాష్ట్రీయోత్పత్తిలో (జీఎస్డీపీ) 2016–17లో 6.9%కి పెంచినట్లు తెలిపింది. 2014–15లో ఇది 6%. బాలికల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన బేటీ బచావో, బేటీ పఢావో పథకాన్ని దేశవ్యాప్తంగా మొత్తం 640 జిల్లాలకు విస్తరించనున్నారు. -
సర్వే సంకేతాలు : బడ్జెట్ ఎలా ఉంటుందంటే..
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న బడ్జెట్లో జనాకర్షక పథకాలకు పెద్దగా అవకాశం ఉండదని, ఉపాథి, పెట్టుబడుల ప్రవాహం పెంచే సంస్కరణలకే పెద్దపీట వేస్తుందని ఆర్థిక సర్వే సంకేతాలు పంపింది. ఉపాధి రంగాలైన టెక్స్టైల్స్, లెదర్, అపెరల్స్, జెమ్స్, జ్యూవెలరీ వంటి శ్రామిక శక్తి అధికంగా ఉన్న రంగాలకు బడ్జెట్లో ప్రోత్సాహకాలు ఉంటాయని భావిస్తున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచి..ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు వృద్ధి చెందే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయం, ఎగుమతులకు ఊతం ఉపాధి, విద్య, వ్యవసాయ రంగాలకు భారీగా ఊతమివ్వాలని ఆర్థిక సర్వే స్పష్టం చేసిన క్రమంలో బడ్జెట్లో ఈ రంగాలకు ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉంది. యువత, మహిళలతో పాటు శ్రామిక శక్తికి మెరుగైన ఉద్యోగాలను అందుబాటులోకి తేవడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ద్వారా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం తక్షణ అజెండాగా ఆర్థిక సర్వే పేర్కొనడంతో బడ్జెట్లో ఈ దిశగా చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. వీటికి తోడు ప్రయివేటు పెట్టుబడులు, ఎగుమతులపై ఆర్థిక వృద్ధి వేగాన్ని నిలకడగా కొనసాగించడం కీలకమని సర్వే చాటింది. వర్షపాత లేమితో పలు ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పాదకత పడిపోవడంపై ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో రానున్న బడ్జెట్లో ఇరిగేషన్కు నిధుల కేటాయింపు పెరిగే అవకాశం ఉంది. -
2018 ఆర్థిక సర్వే వచ్చేసింది...
న్యూఢిల్లీ : ఆర్థిక సంవత్సరం 2019లో జీడీపీ వృద్ధి రేటు 7 శాతం నుంచి 7.5 శాతం వరకు పెరుగుతుందని 2018 ఆర్థిక సర్వే అంచనావేసింది. జీఎస్టీ వంటి పలు సంస్కరణలు ప్రవేశపెట్టిన అనంతరం మార్చితో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో రియల్ జీడీపీ వృద్ధి రేటు 6.75 శాతంగా ఉండనున్నట్టు తెలిపింది. నేటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ఈ సర్వేను ప్రవేశపెట్టారు. ఆర్థిక వృద్ధి రేటు పెరగడానికి ప్రధాన కారణంగా జీఎస్టీ, బ్యాంక్ రీక్యాపిటలైజేషన్, సరళీకరణ, విదేశీ పెట్టుబడులు, ఎగుమతులు పెరగడమని వెల్లడించింది. వ్యవసాయం, విద్య, ఉపాధిలపై ఎక్కువగా దృష్టిసారించాల్సి ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2016-17లో 8 శాతం పెరిగి 60.08 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇవి 55.56 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కొన్నేళ్లుగా ప్రతికూలంగా ఉంటూ వస్తున్న ఎగుమతులు 2016-17లో సానుకూలంగా మారాయని, 2017-18లో మరింత పెరుగునున్నట్టు పేర్కొంటోంది. మొత్తంగా 2017-18లో ఎగుమతులు వృద్ధి రేటు 12.1 శాతంగా ఉండనున్నట్టు తెలిపింది. విదేశీ మారక నిల్వలు వార్షిక ప్రాతిపదికన 14.1 శాతం పెరిగి, 409.4 బిలియన్ డాలర్లుగా నమోదైనట్టు ఆర్థిక సర్వే తెలిపింది. తయారీ రంగంపై ఓ గుడ్న్యూస్ను కూడా ఆర్థిక సర్వే ప్రకటించింది. తొలిసారి భారతీయ చరిత్రలో మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు దేశీయ ఎగుమతుల్లో 70 శాతాన్ని నమోదుచేసినట్టు పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2018లో సేవల వృద్ధి 8.3 శాతం, పరిశ్రమల వృద్ధి 4.4 శాతం, వ్యవసాయ వృద్ధి 2.1 శాతంగా ఉన్నట్టు అంచనావేసింది. వచ్చే ఏడాది ఆర్థిక నిర్వహణ సవాల్గా నిలువనున్నట్టు రిపోర్టు చేసింది. గత ఆరేళ్లలో 2017-18 మధ్యకాలంలోనే ద్రవ్యోల్బణం సగటున కనిష్టంగా ఉన్నట్టు ఈ సర్వే పేర్కొంది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఆయిల్ ధరలపై ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తంచేసింది. 2019 ఆర్థిక సంవత్సరంలో సగటున క్రూడ్ ఆయిల్ ధరలు 12 శాతం పెరిగే అవకాశముందని పేర్కొంది. ఒకవేళ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఇలానే పెరుగుతూ వస్తూ ఉంటే... వచ్చే నెలల్లో 'పాలసీ విజిలెన్స్(విధాన నిఘా)' చేపట్టాలని పిలుపునిచ్చింది. 50 శాతం పెరిగిన పన్ను చెల్లింపుదారులు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత కొత్తగా పన్ను చెల్లింపుదారులు 50 శాతం పెరిగారని, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు కూడా పెరిగినట్టు ఆర్థిక సర్వే రిపోర్టు చేసింది. స్వచ్ఛంగా పన్ను చెల్లింపుదారులు కూడా భారీగా పెరిగాయని తెలిపింది. ముఖ్యంగా పెద్ద వ్యాపారుల నుంచి కొనుగోలు చేసే చిన్న వ్యాపారులు ఇన్ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ను ఆశిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను విశ్లేషిస్తూ... బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొన్ని రోజుల ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. గత 12 ఏళ్ల నుంచి పార్లమెంట్లో ఇరుసభల్లో ఈ సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆధ్వర్యంలోని బృందం దీన్ని రూపొందించింది. ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన అనంతరం లోక్సభ ఫిబ్రవరి 1కి(గురువారానికి) వాయిదా పడింది. -
మన ఆర్థికవేత్తల హ్రస్వదృష్టి
విశ్లేషణ మన ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలకు క్షేత్రస్థాయి వాస్తవాలను చూపించడం అవసరం. అప్పుడే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వారికి అర్థం అవుతుంది. లేకపోతే ఆర్థిక సర్వేలాంటి చచ్చు విధాన పత్రాలనే రూపొందిస్తుంటారు. ఆర్థిక సర్వేను రూపొందించే ఆర్థికవేత్తల బృందం కనీసం ఏడాదికి మూడు నెలలు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో గడిపేలా చేయాలి. వారికి గ్రామీణ నాడి తెలియడం అవసరం. లేకపోతే, దేశాన్ని పీడిస్తున్న తీవ్ర వ్యవసాయ సంక్షోభం మరింతగా విషమిస్తుంది. దాదాపు నాలుగేళ్లుగా వార్షిక ఆర్థిక సర్వేలను శ్రద్ధగా అధ్యయనం చేస్తున్న పాఠకుణ్ణి నేను. సాధారణంగా కేంద్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి రెండు రోజుల ముందు విడుదలయ్యే ఆర్థిక నివేదిక ఒక పెద్ద ఉద్గ్రంథం లాంటి పత్రం. ఆ ఏడాది కాలంలో ఆర్థిక వ్యవస్థ తీరు ఎలా సాగిందనే దానిపై అది తగినంత మంచి అం^è నానే ఇస్తుంది. హ్రస్వదృష్టికి అద్దం ఆర్థిక సర్వే అదే సమయంలో అది, వరుసగా వస్తున్న మన ప్రభుత్వాల ఆర్థిక చింతన ఎంత హ్రస్వదృష్టితో ఉంటున్నదో కూడా చెబుతుంది. ఆర్థిక సర్వేను మీరు జాగ్రత్తగా చదివినట్లయితే, దాన్ని రాసిన ఆర్థికవేత్తలు ప్రపంచ బ్యాంకు/ఐఎంఎఫ్, క్రెడిట్ రేటింగ్ సంస్థలు సూచిస్తున్న ఆర్థిక చింతనను గుడ్డిగా అనుసరించారని గుర్తించగలుగుతారు. కనీసం కొన్ని ఆర్థిక సర్వేలనైనా చది వితే మీకు మన ఆర్థిక శాస్త్రవేత్తలు ఆ మూస పద్ధతికి భిన్నంగా, సృజనాత్మకంగా ఆలోచించ సాహసించ లేకపోతున్నారని అత్యంత స్పష్టంగా తెలుస్తుంది. ఏళ్ల తరబడి విఫలమౌతున్న అవే పాత సలహాలను, సూచనలనే వారు మళ్లీ ఇస్తుంటారు. గుర్రాలు మేతపైనే దృష్టిని నిలిపేలా చేయడానికి వాటి కళ్లకు గంతలు కట్టినట్టుగానే, తాము కూడా తెలిసిగానీ లేక తెలియకగానీ మానసికమైన గంతలను కట్టుకున్నామని మన ప్రధాన స్రవంతి ఆర్థికశాస్త్రవేత్తలు గుర్తించడం లేదు. వాళ్లు ఆ గంతల్లోంచి కనిపించే కొద్ది దూరానికి మించి చూడలేరు. బహుశా వారు ఆ పాత మూసపద్ధతికి మించి చూడాలని ఆశిం చడం కూడా లేదేమో. గుర్రాల కళ్లకు కట్టే గంతలు ప్రకృతి నిజంగా అవి వేటిని చూడాలని నిర్దేశించిందో వాటిని చూడనీయకుండా చేస్తాయని మరచిపోకండి. మన ఆర్థికవేత్తలు అంతకంటే మెరుగేమీ కారు. సంక్షోభానికి మూలం తప్పుడు ఆర్థిక చింతనే మీ కోసం గిరిగీసి ఉంచిన పరిధికి మించి చూడలేకపోయినప్పుడు మీరు తప్పులను, తరచుగా తీవ్రమైన తప్పులను చేయడమే చివరికి జరుగుతుంది. జనాభాలో 52 శాతానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జీవనోపాధిని కల్పించే వ్యవసాయరంగాన్నే ఉదాహరణగా తీసుకోండి. గత పదేళ్లుగా ఆర్థిక సర్వేలు వ్యవసాయరంగం గురించి ఏం చెబుతున్నాయో నేను జాగ్రత్తగా అధ్యయనం చేశాను. ఫలితంగా, నేడు దేశం ఎదుర్కొంటున్న ఘోరమైన వ్యవసాయ సంక్షోభానికి మూల కారణం వాస్తవంగా మన తప్పుడు ఆర్థిక చింతనలోనే ఉన్నదని పూర్తిగా నమ్మకం కలిగింది. ఈ తప్పుడు ఆర్థిక చింతనంతా ఆర్థిక సర్వేలలో బయటపడుతుంటుంది. తాము సూచిస్తూ వచ్చిన ఆర్థికపరమైన సలహాలు, సూచనలే ప్రధానంగా వ్యవసాయ సంక్షోభానికి దారితీశాయని అంగీకరించాలని సైతం ఆర్థిక సర్వేలను రాసేవారికి పట్టకపోవడమే విషాదం. ఒక్కొక్క ఏడూ గడిచే కొద్దీ, ఆర్థిక సర్వే వ్యవసాయ రంగానికి మద్దతుగా విఫలమైన అవే సూచనలను చేయడం కొనసాగుతుంది: పంటల ఉత్పాదకతను పెంచడం, నీటి పారుదల సదుపాయాలను విస్తరించడం, ప్రమాదాలను తగ్గించడం, గిట్టుబాటు ధరలను కల్పించడం, మార్కెట్లను ప్రైవేటీకరించడం. వ్యవసాయం రంగ వృద్ధి కోసం కనీసం గత పదేళ్లుగా ఆర్థిక సర్వేలు అవే సూచనలను చేస్తున్నాయి. కాబట్టి వ్యవసాయ సంక్షోభం ఒకొక్క ఏడూ గడిచేకొద్దీ మరింత లోతుగా విస్తరిస్తుండటంలో ఆశ్చర్యమేం లేదు. పెచ్చుపెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలు సైతం, తమ భావజాలపరమైన సూచనలకు మించి ఆలోచించేలా ఆర్థికవేత్తలకు ప్రేరణను కలిగించలేక పోయాయి. గత 22 ఏళ్లలో కనీసం 3.30 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అంచనా. అయినాగానీ ఆర్థికశాస్త్రవేత్తలు కొంత అర్థవంతమైన సూచనలతో ముందుకు రావడానికి సాహసించలేకపోయారనేది వాస్తవం. ఇది మన విధాన చట్రంపైన విషాదకరమైన నీడలు ముసురుకునేలా చేస్తోంది. విత్తన కంపెనీల కోసం జీఎం పంటల రాగం ఇది సరిపోదన్నట్టు, గతంలో దాదాపుగా తాము సూచించనవేవీ పనిచేయలేదని తెలిసి కూడా ఆర్థిక సర్వే 2017 వివాదాస్పదమైన జన్యు మార్పిడి (జీఎం) పంటలపైకి తన దృష్టి కేంద్రీకరణను మరల్చింది. పంటల ఉత్పాదకత పెరిగినప్పుడు మాత్రమే వ్యవసాయరంగంలోని దైన్యం తగ్గుతుంది అంటూ.. అదే తప్పుడు వాదనతో ఆర్థిక సర్వే జీఎం పంటలే శరణ్యమని వాటికి సమంజసత్వాన్ని కల్పించాలని ప్రయత్నించింది. వాణిజ్యపరంగా ప్రవేశపెట్టడానికి వేచిచూస్తున్న జన్యుమార్పిడి ఆవపంటకు మాత్రమే కాదు, అన్ని రకాల జీఎం పంటలకు మనం తలుపులు బార్లా తెరవాలని సైతం నిజానికి అది సూచించింది. జీఎం పంటలను ప్రవేశపెట్టడానికి తగిన పరిస్థితులను కల్పించడానికి వీలుగా ఆర్థికసర్వే, ఇన్నేళ్లుగా జన్యు మార్పిడి విత్తన పరిశ్రమ చెబుతూ వస్తున్న అదే వాదనతో అందుకు సమంజసత్వాన్ని కల్పించాలని చూసింది. అంతకు ముందు ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రహ్మణ్యన్ పప్పుధాన్యాల పంటలలో జీఎం సాంకేతికతను ప్రవేశపెట్టడాన్ని బహిరంగంగానే సమర్థించారు. పౌర సమాజం నుంచి ఆ సూచనకు తీవ్రమైన వ్యతిరేకత రావడంతో, ప్రైవేట్ విత్తన కంపెనీల వాణిజ్యపరమైన ప్రయోజనాల కోసం విధాన పత్రాలతో లాబీయింగ్ చేస్తూ ఆయన మరో అడుగు ముందుకు వేశారు. ఎక్కువ దిగుబడి బూటకం ఉత్పాదకతను పెంచిన జీఎం పంట ప్రపంచంలో ఎక్కడా లేనే లేదనే శాస్రీయ వాస్తవాన్ని పూర్తిగా విస్మరించారు. భారత్లో సాగుచేస్తున్న ఏౖకైక జీఎం పంట బీటీ పత్తి. జీఎం పత్తి ఉత్పాదకత పెరగడానికి తోడ్పడి ఉంటే, బీటీ పత్తిని పండిస్తున్న రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తున్నదో నాకు అంతుపట్టడం లేదు. దేశంలోని మొత్తం రైతు ఆత్మహత్యల్లో దాదాపు 70 శాతం పత్తి రైతుల ఆత్మహత్యలేనని అంచనా. పైగా, పంటల ఉత్పాదకత పెంపుదలే పరిష్కారం అయితే, దేశానికి ధాన్యాగారమైన పంజాబ్లో ఉత్పాదకత అత్యధికంగా ఉన్నా... ఆ రాష్ట్రం రైతు ఆత్మహత్యలకు ప్రధాన కేంద్రంగా ఉండటానికి కారణం ఏమిటో కూడా నాకు అంతుపట్టడం లేదు. ఆహారధాన్యాలకు సంబంధించి పంజాబ్ ప్రపంచంలోనే అత్యధిక ఉత్పాదకతను సాధించింది. అక్కడ 98 శాతం పంట భూములకు సుస్థిర సాగునీటి వసతి ఉన్నది. పంజాబ్ ప్రపంచంలోనే అత్యధికంగా సాగునీటి వసతి ఉన్న ప్రాంతం. అయినా ఆ రాష్ట్రంలో ముగ్గురు లేదా నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా రోజు గడవడం లేదు. జీఎం పంటలు వేయకపోయినా పప్పు ధాన్యాల ఉత్పత్తి ఈ ఏడాది పలు రెట్లు పెరిగింది. అయినా ప్రభుత్వానికి పెరిగిన ఉత్పత్తిని ఏం చేయాలో తెలియకపోవడంతో, ధరలు విపరీతంగా పడిపోయి రైతులు నష్టపోవాల్సి వచ్చింది. కంది క్వింటాలు సేకరణ ధర రూ. 5,050 కాగా, ఎక్కువ మంది రైతులు క్వింటాలు రూ. 3,500 నుంచి రూ. 4,200కు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇక ఉత్పాదకత సమస్య ఎక్కడిది? వ్యవసాయ ఉత్పత్తి కారకాల సరఫరాదార్ల ప్రయోజనాలను పెంపొందింపజేయడం కోసం ఆర్థికవేత్తలు ఇంకా ఎంత కాలం ఇలా ఈ తప్పుడు కథనాన్ని ప్రచారం చేస్తారు? ఆర్థికవేత్తలు గ్రామాల బాట పట్టాలి 2017 ఆర్థిక సర్వే–ఐఐ చదువుతున్నప్పుడు అది నన్ను చాలా నిరాశకు గురిచేసిందని చెప్పడానికి నేను సంకోచించడం లేదు. ఆర్థిక శాస్త్రవేత్తలు కళ్లకు గంతలు కట్టుకోవడం వల్ల వారికి క్షేత్రస్థాయి వాస్తవాలను చూపించడం అవసరం. అప్పుడే వారికి రైతులు ఎందుకు చనిపోతున్నారో అర్థం అవుతుంది. లేకపోతే మనం ఆర్థిక సర్వేలాంటి చచ్చు విధాన పత్రాలను అందుకుంటూనే ఉండాల్సి వస్తుంది. ఆర్థిక సర్వేను తయారుచేసే ఆర్థికవేత్తల బృందం కలసి కనీసం ఏడాదికి 3 నెలలు గ్రామీణ ప్రాంతాల్లో గడపడాన్ని తప్పనిసరి చేయాలని నా సూచన. ఆ బృందానికి ప్రధాన ఆర్థిక సలహాదారు నేతృత్వం వహిం చాలి, నీతి ఆయోగ్ సభ్యులు ఆ బృందంలో సభ్యులుగా ఉండాలి. ఆర్థికవేత్తలకు/ఉన్నతాధికారులకు గ్రామీణ నాడి తెలియడం తక్షణ అవసరమని మీరు కూడా అంగీకరిస్తారనడం నిస్సందేహం. లేకపోతే, దశాబ్దికి పైగా దేశాన్ని పీడిస్తున్న ఘోరమైన వ్యవసాయ సంక్షోభం మరింతగా విషమిస్తుంది. దేవిందర్శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
ప్రొఫెసర్లకు అరవింద్ సుబ్రమణియన్ పాఠాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తాజాగా ప్రొఫెసర్లకు ఆర్థికాభివృద్ధి పాఠాలు నేర్పుతున్నారు. భారత ఆర్థికాభివృద్ధి, ఆర్థిక సర్వేలో సమకాలీన ధోరణుల అంశంపై నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆయన తొలి లెక్చర్ ఇచ్చారు. దేశం నలుమూలల్నించి సుమారు 150 మంది ప్రొఫెసర్లు ఇందులో పాల్గొంటున్నారు. ఏడు రోజుల పాటు సుబ్రమణియన్ 35 ప్రసంగాలు ఇవ్వనున్నట్లు కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఈ కోర్సులో భాగంగా భారత ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, ఇటీవలి పరిణామాలు, ఎదురుకాబోయే సవాళ్లు, అనుసరించతగిన వ్యూహాలు మొదలైన వాటి గురించి లోతుగా తెలుసుకునేందుకు అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కోర్సు పూర్తయ్యాక స్థూల ఆర్థిక పరిణామాలు, విధానాలు తదితర అంశాలను క్షుణ్నంగా అర్థం చేసుకునేందుకు, విశ్లేషించేందుకు తగిన ప్రావీ ణ్యం లభించగలదని జవదేకర్ చెప్పారు. ఒక విధానకర్త ఇలా ప్రొఫెసర్ అవతారమెత్తి, పాఠాలు బోధించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. -
ఎదురు దెబ్బలు తగిలినా భవిష్యత్తు ఆశాజనకమే !
-
ఆసక్తికరంగా మారిన ఆర్థిక సర్వే.. ఏం చెప్తారో?
బడ్జెట్ గడియలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక్కరోజు ముందు అంటే నేటి మధ్యాహ్నం (మంగళవారం) ఆర్థిక సర్వే పార్లమెంట్ ముందుకు వస్తోంది. గడిచిన 12 నెలల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధిని ఈ సర్వేలో సమీక్షించనున్నారు. పలు ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు చూపించిన ప్రదర్శనను కూడా ఈ సర్వేలో వివరించనున్నారు. అంతేకాక భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రభావాన్ని అంచనా వేయనున్నారు. చీఫ్ ఎకనామిక్ అడ్వయిజరీ అరవింద్ సుబ్రహ్మణ్యం, ఆయన టీమ్ సభ్యులు కలిసి రూపొందించారు. నేడు ప్రవేశపెట్టబోతున్న ఆర్థిక సర్వేలో కొన్ని ముఖ్యాంశాలు జీడీపీ అంచనాలు : పెద్ద నోట్ల రద్దు అనంతరం 2017-18 గణాంకాలు, ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరం ఎంతో కీలకంగా మారాయి. ఐఎంఎఫ్ ఇప్పటికే 2016-17 భారత వృద్ధి రేటును 6.6 శాతానికి కోత పెట్టింది. ఈ సంస్థ ముందస్తు అంచనాలు 7.6 శాతంగా ఉండేవి. కరెన్సీ బ్యాన్ వినియోగాన్ని తాత్కాలికంగా షాకింగ్లోకి నెట్టేసిందని ఐఎంఎఫ్ వెల్లడించింది. అదేవిధంగా 2017-18 ఆర్థిక సంవత్సర వృద్ధి రేటును 7.6 శాతం నుంచి 7.2 శాతానికి కుదించేసింది. దీంతో జీడీపీ అంచనాలపై ఆర్థిక సర్వేలో చేయబోయే వ్యాఖ్యనాలపై ఎక్కువగా ఫోకస్ నెలకొంది. పెద్ద నోట్ల రద్దు : డీమానిటైజేషన్పై సుబ్రహ్మణ్యం, ఆయన టీమ్ సభ్యులు ఏం చెప్తారోనని విశ్లేషకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశంలో చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీ అంటే రూ.15.44 లక్షల కోట్ల కరెన్సీ ప్రభుత్వ తీసుకున్న రద్దు నిర్ణయంతో నిరూపయోగంగా మారిన సంగతి తెలిసిందే. వినియోగ వ్యయంపై ఇది భారీగా ప్రభావం చూపింది. వినియోగవ్యయం జీడీపీలో కనీసం 60 శాతం ఆదాయాన్ని అందిస్తోంది. ఒక్కసారిగా వినియోగ వ్యయం పడిపోవడంతో జీడీపీ వృద్ధి అంచనాలు పడిపోతున్నాయి. యూనివర్సల్ బేసిక్ ఇన్ కమ్ : సామాజిక భద్రత పేరిట ఈసారి ఆర్థిక సర్వేలో ప్రత్యేక ఫీచర్గా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఉంటుందని సుబ్రహ్మణ్యం ముందస్తుగానే తన రిపోర్టులో పేర్కొన్నారు. పేదరికం ఆధారంగా డబ్బులు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం 20 కోట్ల మంది తేలినట్టు సమాచారం. అంతర్జాతీయ అంశాలు : మన ఆర్థికవ్యవస్థపైనే కాక, గ్లోబల్ ఎకానమీపై కూడా చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ పలు వ్యాఖ్యలు చేయనున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, రక్షణాత్మక ఆర్థిక విధానాలపై ప్రపంచంలో చాలా దేశాలు దృష్టిసారించడం వంటి వాటిని సుబ్రహ్మణ్యం ప్రస్తావించనున్నారు. బ్లాక్ మనీ : గత ఏడాది ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో సుబ్రహ్మణ్యం అధిక పన్ను వేయాల్సినవసరం ఉందని నొక్కి చెప్పారు. భారత జీడీపీకి మొత్తంగా పన్నుల ద్వారా వచ్చే కేవలం 5.4 శాతమేనని, ఇది ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం పన్నులపై ఎలాంటి ప్రకటన చేయనున్నారోనని ఆసక్తి నెలకొంది. బ్లాక్మనీని రూపుమాపడానికి ప్రభుత్వం ఎలా వ్యవహరించనుందో ఆయన ఈ సర్వేలో వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. -
శరణార్థులతో ఆర్థిక వ్యవస్థకు మేలే!
లాస్ ఏంజెలిస్: శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తే ఆర్థికంగా భారం అవుతారని పరిగణించటం రివాజు. అయితే.. శరణార్థులు, ప్రత్యేకించి డబ్బు రూపేణా సాయం పొందే వారు.. నిజానికి తమకు ఆశ్రయం ఇచ్చిన దేశానికి ఆర్థికంగా గణనీయమైన బలాన్నిస్తారని ఓ అధ్యయనంలో గుర్తించారు. శరణార్థుల వల్ల ఒనగూరే ఆర్థిక ప్రయోజనాలు.. వారికి విరాళమిచ్చిన సాయంకన్నా గణనీయంగా అధికంగా ఉందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-డేవిస్(యూసీ డేవిస్) పరిశోధకులు పేర్కొన్నారు. కాంగో శరణార్థులకు ఆశ్రయమిచ్చిన రువాండాలోని మూడు శరణార్థి శిబిరాల ఆర్థిక ప్రభావాన్నిఅధ్యయనంలో పరిశీలించారు. ఇందులో రెండు శిబిరాల్లోని శరణార్థులకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం నుంచి ఆర్థిక సాయం అందింది. అలాగే మూడో శిబిరంలోని శరణార్థులకూ అదే మొత్తంలో సాయం ఆహారం రూపంలో అందింది. ఈ మూడు శిబిరాల్లోని శరణార్థుల ప్రభావం ఆశ్రయమిచ్చిన దేశంపై ఎలా ఉందనే అంశంపై ఆ శిబిరాల చుట్టూ పది కి.మీ. పరిధిలో ఆర్థిక సర్వే నిర్వహించారు. ఆహార రూపంలో ఇచ్చిన సాయం కన్నా.. డబ్బు రూపంలో చేసిన సాయం ఆశ్రయమిచ్చిన దేశంపై అత్యధిక సానుకూల ప్రభావం చూపించిందని కనుగొన్నారు. డబ్బు సాయం అందుకున్న శిబిరాల్లోని శరణార్థులు, అక్కడి వ్యాపారులు చుట్టుపక్కల ప్రాంతాల్లోని వ్యాపారాలు, ఇళ్ల నుంచి వస్తువులు, సేవలు కొనుగోలు చేయటం ద్వారా.. ఆ ప్రాంతంలో తలసరి ఆదాయం గణనీయంగా పెరగటానికి దోహదపడ్డారని గుర్తించారు. ఈ ప్రాంతంలో వాణిజ్యం పెరగటం ద్వారా.. ఆ ప్రాంతం నుంచి మిగతా దేశంలోని వాణిజ్యానికి కూడా డిమాండ్ పెరిగి వాణిజ్యం పెరిగిందని అధ్యయనంలో వివరించారు. -
దిశ మార్పుతో దశ మారేనా?
విశ్లేషణ 2016, ఫిబ్రవరి 29న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, 19.78 లక్షల కోట్ల రూపాయల ప్రతిపాదనలతో కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్కు నేపథ్యంగా, స్వయానా దేశీయ ఆర్థిక సర్వే, జైట్లీయే అంగీకరించి నట్లుగా అంతర్జాతీయంగానూ, జాతీయంగానూ ఆర్థికరంగంలో మార్కెట్కు డిమాండ్ పతనమైన పరిస్థితులున్నాయి. మన దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జి.డి.పి.) బాగానే వృద్ధి చెందు తోందని (2015-2016లో 7.6 శాతంగా) పాలకులు తమ గణాంకాలతో నమ్మింప చూస్తున్నప్పటికీ ఇతర గణాం కాలూ, నేలబారు వాస్తవాలూ దీనికి భిన్నమైన స్థితిని సూచి స్తున్నాయి. పలువురు ఆర్థికవేత్తలూ, కడకు ఆర్.బి.ఐ. గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా మన జి.డి.పి, గణాంకాలు సరైనవేనా? అని సందేహించడం మనం మరువరాదు. కాగా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పతనం వలన మన కేంద్ర ప్రభుత్వం 2014 సెప్టెంబర్లో అట్టహాసంగా ఆరంభించిన ‘‘మేకిన్ ఇండియా’’ కార్యక్రమం పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడేనన్న తీరుగా మిగిలి పోయింది. ఇక, 2014 నుంచీ అంతర్జాతీయ మార్కెట్లలో సరుకులు, చమురు ధరల భారీ పతనం కారణంగా మన దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. అయితే, ఈ ధరల పతనం తాలూకు వాస్తవ ఫలితాలు చిల్లర ధరల తగ్గుదల రూపంలో జనసామాన్యానికి చేరడంలేదు. మొత్తంమీద అంతర్జాతీయంగా ఈ సరుకులు, చమురుధరల తగ్గుదల తాలూకు సానుకూల ఫలితాలు వాణిజ్య సమతుల్యత, విదేశీమారకం నిల్వల సానుకూలత రూపంలో మోదీ ప్రభుత్వానికి మాత్రం కలసి వచ్చాయి. ఈ మొత్తం కథ నేపథ్యంలోనే నేటి మన కేంద్ర బడ్జెట్ తయారైంది. ఈ బడ్జెట్లో సుమారు రెండు దశాబ్దాల అనంతరం వ్యవసాయానికి కాస్తంత ప్రాధాన్యత లభిం చింది. 1990లలో ప్రపంచీకరణ విధానాల అమలు ఆరంభం అయిన తరువాత మనదేశ పాలకుల ప్రాధాన్యతలు ప్రధానంగా దేశంలోని కులీన, విద్యాధిక వర్గాలకు అనుకూల మైన సేవారంగం చుట్టూరానే తిరుగాడాయి. సరుకు ఉత్పత్తి రంగం సవతి తల్లి ప్రేమనే పొందింది. కాగా, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా చిదిమివేశారు. అందువల్లనే దేశీయంగా 60% పైగా జనాభాకు, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జీవనోపాధిగా ఉన్న వ్యవసాయ రంగానికి నేడు మన జి.డి.పి.లో కేవలం 15- 16% వాటా మాత్రమే ఉంది. ఇక సరుకు ఉత్పత్తిరంగం పరిస్థితి కూడా అంతంత మాత్రమే. కాగా, దేశ ప్రజలలోని సుమారు 20% మందికి జీవనోపాధిని కల్పిస్తోన్న సేవారంగానికి జి.డి.పి.లో 60% మేరన వాటా ఉంది. ఆర్థిక రంగంలో ఈ సమతుల్యతా లోపాన్ని సరిదిద్దే పేరిట మేకిన్ ఇండియా కార్యక్రమం ముందుకు వచ్చింది. కాగా, వ్యవసాయానికి మాత్రం ఎటు వంటి సానుకూల విధానం ఇప్పటివరకూ ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే నేడు నలువైపులా ఆర్థిక సంక్షోభ వాతావరణం చుట్టుముడుతోన్న పరిస్థితులలో దేశీయంగా మన ప్రజల కొనుగోలు శక్తినీ, మార్కెట్ డిమాండ్లను పెంచగలిగేదిగా 2016-2017 బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేసే ప్రయత్నం జరిగింది. అలాగే, గ్రామీణ వ్యవసాయ కార్మికులకోసం ఉద్దేశించిన జాతీయ ఉపాధి హామీ పథకం నిధులనూ రికార్డు స్థాయిలో మంజూరు చేశామని ఈ బడ్జెట్ ప్రకటించుకుంది. కాగా, ఇంత సుదీర్ఘకాల విరామం తరువాత మన ప్రభుత్వం, వ్యవసాయరంగం పట్ల తన శ్రద్ధను ప్రకటిం చడం సంతోషకరమే. కానీ, నేటి ఆర్థిక గడ్డుకాలంలో వ్యవసాయం పట్ల చూపిన ఈ శ్రద్ధ వ్యూహాత్మకమైనదా? లేకుంటే కేవలం ఎత్తుగడలపరమైనదేనా? అనే ప్రశ్నలు మన ముందు ఇంకా మిగిలే ఉన్నాయి! అలాగే, ప్రస్తుత బడ్జెట్లోని వ్యవసాయ, గ్రామీణరంగ కేటాయింపుల తీరు తెన్నులు నిజ జీవితంలో ఎంతవరకూ సమర్థవంతంగా దేశీయ ఆర్థిక పరిస్థితులను గట్టెక్కించగలవు? అన్నది కూడా మరో ప్రశ్న. ఈ బడ్జెట్లోనే, ఎరువుల సబ్సిడీల పట్ల చూపిన ప్రతికూల దృక్పథం ఇక్కడ గమనార్హం. ఇది, వ్యవసాయ రంగానికీ, రైతాంగానికి ఇబ్బంది కలిగించే నిర్ణయమే. అలాగే, బడ్జెట్ ప్రతిపాదనల నాడే డీజిల్ ధరలను పెంచడం మోటార్లతో సాగే వ్యవసాయంపై ఎంతో కొంత అదనపు భారమే. ఇక జాతీయ ఉపాధి హామీకి గత బడ్జెట్లో 34,699 కోట్ల రూపాయలను కేటాయించారు. కాగా, ఆ బడ్జెట్ కాలవ్యవధి ముగిసిపోనున్న నేటి తరుణంలో ఇప్పటికీ, ఈ పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు, మొత్తం కేటాయింపులో 16 శాతం మేరకు (రూ.5,595 కోట్లు) బకాయి ఇంకా చెల్లింపు జరగకుండా మిగిలి ఉండటం గమనార్హం. కాబట్టి నేటి సరికొత్త బడ్జెట్లో ఈ పథకానికి రికార్డు స్థాయిలో (రూ. 38,500 కోట్లు) కేటాయించామని చెబుతున్న అంశం భవిష్యత్ ఆచరణలో మాత్రమే రుజువుకు నోచుకోగలదు. అంతే కాకుండా అధికారంలోకి వచ్చిన కొత్తలోనే జాతీయ ఉపాధి హామీ పథకం అనేది యు.పి.ఎ. ప్రభుత్వం తాలూకూ అతిపెద్ద తప్పిదంగా మోదీ అభివర్ణించడాన్ని కూడా మనం మరువరాదు. కాబట్టి, ఈ పథకం అమలులో నేటికీ కనబడుతున్న 3% లోపు గ్రామీణ కుటుంబాలకు మాత్రమే పూర్తిస్థాయిలో 100 రోజులపాటు మాత్రమే ఉపాధిని కల్పించగలగడం, 70% శాతం పైగా కూలీల వేతనాల చెల్లింపులలో జాప్యాలు వంటి బలహీనతలను అధిగమించకుండా మన గ్రామీణ రైతు కూలీల కొనుగోలు శక్తిని పెంచలేరు. అలాగే ధనవం తులపై పన్నులూ, సెస్లూ విధించడం ద్వారా ఈ బడ్జెట్ గ్రామీణ రంగానికి అదనంగా నిధులను సమకూర్చేందుకు చేసిన ప్రయత్నం ముదావహమే కానీ రైతాంగం, వ్యవసాయ రంగాల తాలూకు మౌలిక సమస్యలను పరిష్కరించడానికి కేవలం ఇదొక్కటే సరిపోదు. నేటి వ్యవసాయ సంక్షోభానికీ, రైతాంగం కడగండ్లకూ మూల కారణాలుగా ఉన్న ఉత్పాదకాల వ్యయాలు అధికంగా ఉండటం, నకిలీల సమస్య, అరకొర నిల్వ సదుపాయాలు, బ్యాంకు రుణాల అందుబాటు, విద్యుత్ సబ్సిడీలు, నిరంతర సరఫరాలు, మార్కెట్ అందుబాటు వంటి అనేకానేక సమస్యల పరిష్కారం దిశగా కూడా తగిన శ్రద్ధ అవసరం. కాబట్టి, కేంద్ర ఆర్థిక మంత్రి సమర్పించిన బడ్జెట్ తాలూకు వాస్తవ ఫలితాలు ఈ దిశగా ప్రభుత్వ చిత్తశుద్ధీ, అలాగే పరిపాలనా చర్యల వంటి పలు రోజువారీ అంశాలపై కూడా పెద్ద స్థాయిలో ఆధారపడి ఉంటాయి. అంతిమంగా, ఆర్థికంగా అగాథం అంచుకు చేరుతోన్న అంతర్జాతీయ, జాతీయ ఆర్థిక స్థితిగతులలో, ఈ బడ్జెట్ ఏ మేరకు మనలను ఆదుకోగలదు? ఇదంతా కేవలం చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడమేనా? అన్న ప్రశ్నలకు రానున్న ఆర్థిక సంవత్సరకాలం మాత్రమే తగిన జవాబులను ఇవ్వగలదు. వ్యాసకర్త ఆర్థిక రంగ విశ్లేషకులు, డి. పాపారావు మొబైల్ : 9866179615 -
సర్వే జోరుతో లాభాలు
♦ ఆకట్టుకున్న ఆర్థిక సర్వే ♦ 178 పాయింట్ల లాభంతో 23,154కు సెన్సెక్స్ ♦ 59 పాయింట్ల లాభంతో 7,030కు నిఫ్టీ ఆర్థిక సర్వే ఆశావహ పరిస్థితులను ఆవిష్కరించడంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల్లో ముగిసింది. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ఉండటం కూడా కలసివచ్చింది. దీంతో 3 రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈ రిలీఫ్ ర్యాలీతో సెన్సెక్స్ 23 వేల పాయింట్లకు, నిఫ్టీ 7,000 పాయింట్ల ఎగువకు చేరాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 178 పాయింట్లు లాభంతో 23,154 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 7,030 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 250 పాయింట్లు లాభపడింది. ఈ వారంలో సెన్సెక్స్ 555 పాయింట్లు(2.34 శాతం), నిఫ్టీ 181 పాయింట్లు(2.51 శాతం) చొప్పున నష్టపోయాయి. యూబీ గ్రూప్ షేర్ల జోరు బడ్జెట్లో హౌసింగ్ రంగానికి అనుకూలమైన సంస్కరణలు ఉంటాయన్న అంచనాలతో హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ షేర్లు 1-8 శాతం రేంజ్లో లాభపడ్డాయి. యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ పదవికి విజయ్ మాల్యా రాజీనామా చేయడంతో యూబీ గ్రూప్ కంపెనీలు-యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ 20 శాతం, మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ 8 శాతం, యునెటైడ్ బ్రూవరీస్ 1 శాతం, యునెటైడ్ స్పిరిట్స్ 2 శాతం చొప్పున లాభపడ్డాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు లాభాల్లో ముగిశాయి. 1,443 షేర్లు నష్టాల్లో, 1,041 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే స్థాయిలో తగిన నిధులు ఉన్నాయని చైనా కేంద్ర బ్యాంక్ అధినేత వెల్లడించడంతో చైనాతో సహా ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ లాభాల్లోనే ముగిశాయి. -
తాయిలాలు ఇస్తే... తంటా తప్పదు
2015-16 ఆర్థిక సర్వే చెబుతోంది ఇదే... వృద్ధి పరుగులో ముందుండాలంటే సంక్షేమానికి చోటుండకూడదని ఆర్థిక సర్వే కటువుగానే చెప్పింది. వచ్చే ఐదేళ్లలో 8 నుంచి 10 శాతం వృద్ధి రేటు సాధించే సత్తా భారతావనికి ఉందంటూనే... అందుకు కఠిన చర్యల్ని తప్పనిసరి చేసింది. సబ్సిడీల కోత, పొదుపు పథకాలపై పన్ను విధించటం, గ్యాస్ సిలెండర్ల సంఖ్యను తగ్గించటం, ఐటీ మినహాయింపుల్ని పరిమితం చేయటం వంటి చర్యల్ని సూచించిన సర్వే... అందాల్సిన వారికి అందకుండా పోతున్నాయనే కారణాన్ని చూపించింది. కానీ వేలికి దెబ్బ తగిలిందనే కారణంతో చేతిని నరుక్కున్న చందాన... కొంతమంది అనర్హులకు చేరుతున్నాయనే కార ణాన్ని చూపిస్తూ మొత్తానికే ఎత్తేస్తే అర్హుల మాటేంటన్న ఊసే ఈ సర్వేకు పట్టలేదు. ఖజానా పెంచుకునే సూచనలనే కాదు. కొన్ని రంగాల దుస్థితినీ సర్వే కళ్లకు కట్టింది. వైద్యం అందరానిదవుతోందని... ప్రభుత్వాసుపత్రుల్లో అయ్యే ఖర్చుకు నాలుగైదు రెట్లు ప్రయివేటు ఆసుపత్రులు వసూలు చేస్తున్నాయనే ఆందోళన తాజా పరిస్థితికి అద్దం పట్టేదే. పెద్ద ఎత్తున స్టార్టప్ కంపెనీలు ఏర్పడుతున్నా, వాటికి నిధులు దొరకటమైతే కష్టంగా ఉందని, పెట్టుబడులు అందుకున్న వాటి విలువలు కూడా తక్కువగా ఉండటంతో ఇన్వెస్టర్లు ఎగ్జిట్ కాలేకపోతున్నారంటూ... స్టార్టప్ ఇండియా సవాళ్లను సర్వే కళ్లకు కట్టింది. బ్యాంకుల దుస్థితినీ గుర్తించిన సర్వే... వాటికి మూలధనం ఇవ్వటానికి కొన్ని పీఎస్యూ కంపెనీల్ని విక్రయించటమే శరణ్యమని కూడా సూచించింది. సౌకర్యం కోసం కంపెనీలు కాంట్రాక్టు ఉద్యోగులపై, ఔట్సోర్సింగ్పై ఆధారపడుతున్నాయని, మెరుగైన జీతంతో పాటు ఉద్యోగ భద్రత కూడా ముఖ్యమేనని చెప్పిన మాట... అక్షరాలా నడుస్తున్న చరిత్రకు అద్దం. ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు... ♦ వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7-7.75% మధ్య ఉంటుంది. ♦ ఈ ఏడాది వృద్ధి మాత్రం 7.6% ఉంటుంది. ఎగుమతులు వేగంగా పెరిగినట్లయితే దీర్ఘకాలంలో 8-10 శాతం వృద్ధి సాధించే సత్తా ఉంది. ♦ అంతర్జాతీయంగా అన్ని దేశాలూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో సుస్థిరతకు చిరునామా ఇండియా నిలుస్తోంది. ♦ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు సగటు ధర బ్యారెల్కు 35 డాలర్ల వరకూ ఉండొచ్చు. ఈ ఏడాది అది 45 డాలర్లుగా ఉంది. ♦ 2016-17 సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 4.5-5% ఉండొచ్చు. ♦ {దవ్యోల్బణం తక్కువ స్థాయిల్లో ఉండటంతో ధరల్లో స్థిరత్వం వస్తుంది. ♦ {పస్తుతం సంపాదిస్తున్న వ్యక్తుల్లో 5.5 శాతం మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు. దీన్ని 20 శాతానికి చేర్చాలి. ♦ అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావం ఆర్థిక విధానాలపై ఉంటుంది. ♦ జీడీపీలో ద్రవ్యలోటు 3.9 శాతానికి కుదించాలన్న ఈ ఏడాది లక్ష్యం సాధించగలం. వచ్చే ఏడాది మాత్రం కాస్త కష్టం. ♦ వచ్చే ఏడాది సబ్సిడీల బిల్లు జీడీపీలో 2 శాతం కన్నా తక్కువే ఉంటుంది. ♦ జీఎస్టీ బిల్లు ఆమోదంలో ఆలస్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ♦ కార్పొరేట్లు, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు విపరీతమైన ఒత్తిడిలోనే ఉంటాయి. కారణాలు గుర్తించటం, తిరిగి మూలధనం కల్పించటం, సంస్కరణల బాట పట్టడం ద్వారానే దీన్ని అధిగమించగలం. ♦ 2019 మార్చికల్లా ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.1.8 లక్షల కోట్ల మూలధనం కావాలి. ♦ ఫిబ్రవరి మధ్యనాటికి కరెంటు ఖాతా లోటు 1-1.5 శాతంగా, విదేశీ మారక నిల్వలు 351.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ♦ 2015-16లో సేవల రంగం 9.2 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ♦ విదేశీ మూలధనం వెనక్కెళ్లిపోయే అవకాశం ఉంది. అందుకని దేశీయంగా డిమాండ్ పెంచే చర్యలు చేపట్టాలి. ♦ ఇటీవలి సంస్కరణలతో పారిశ్రామిక మౌలిక సదుపాయాల రంగం, కార్పొరేట్ రంగం చక్కని పనితీరు కనబరుస్తున్నాయి. ♦ ఆరోగ్య, విద్యా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు రావాలి. వ్యవసాయంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి. ♦ బడ్జెట్ అంచనాకన్నా ప్రభుత్వ పన్ను ఆదాయాలు ఎక్కువగా ఉంటాయి. ♦ ఎగుమతుల మందగమనం కొనసాగుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వేగం పుంజుకుంటుంది. ♦ వాణిజ్యంలో రక్షణాత్మక చర్యల్ని భారతదేశం అడ్డుకోవాలి. ♦ ఎరువుల రంగానికి సంస్కరణల ప్యాకేజీ ఇవ్వాలి. డిమాండ్ వృద్ధికి చర్యలు... ఆర్థిక వ్యవస్థలో పటిష్ట డిమాండ్కు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలి. ఇది వృద్ధికి ఊతం ఇస్తుంది. ఈ దిశలో ప్రభుత్వం బడ్జెట్లో తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం. - హర్షవర్థన్ నోతియా, ఫిక్కీ ప్రెసిడెంట్ పెట్టుబడులపై దృష్టి అవసరం అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి పెట్టుబడులు వెనక్కు వెళుతున్న తీరును జాగ్రత్తగా గమనించడం, ఆ తరహా సవాళ్లను అధిగమించడం కీలకం. అంతర్జాతీయ మందగమన పరిస్థితుల నేపథ్యంలో రానున్న బడ్జెట్, ఆర్థిక విధాన నిర్ణయాలు అత్యంత సవాళ్లతో కూడుకున్నవనడంలో సందేహం లేదు. - సునిల్ కనోరియా, అసోచామ్ ప్రెసిడెంట్ సంస్కరణలు కీలకం ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితుల్లోనూ భారత్ ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉండడం హర్షణీయం. అయితే వృద్ధి పటిష్టతకు ప్రభుత్వం సంస్కరణల అజెండాను ముందుకు తీసుకువెళ్లాలి. ప్రభుత్వ వ్యయాలు పెరగాల్సిన అవసరాన్ని కూడా సర్వే ఉద్ఘాటిస్తోంది. ముఖ్యంగా ఇన్ఫ్రాపై ప్రత్యేక దృష్టి అవసరం. ఇలాంటి బడ్జెట్నే పరిశ్రమ కోరుకుంటోంది. - సుమిత్ మజుందార్, సీఐఐ ప్రెసిడెంట్ ఐటీ మినహాయింపు పరిమితులు పెంచొద్దు.. వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపుల పరిమితులను పెంచుకుంటూ పోవటం మంచిది కాదు. ఆస్తి పన్ను పరిధిని మరింత విస్తృతం చేయాలి. వ్యక్తిగత ఆదాయాలు సహజసిద్ధంగా పెరిగేందుకు, పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచేందుకు ఈ నిర్ణయాలు దోహదపడతాయి. సంపన్న ప్రైవేట్ రంగానికి ప్రయోజనం చేకూరుస్తున్న పన్ను మినహాయింపుల విధానాలను సమీక్షించి, దశ లవారీగా తొలగించటమే మంచిది. అలాగే వ్యవసాయం కావొచ్చు పరిశ్రమలు, సర్వీసులు, రియల్టీ కావొచ్చు... ఏ మార్గంలోనైనా ఆదాయాల పరంగా మెరుగ్గానే ఆర్జిస్తున్న వారిపై సహేతుక రీతిలో పన్నులు విధించాలి. ప్రస్తుతం ఎకానమీలో ఇంకా 85 శాతం మంది పన్ను పరిధిలోనే లేరు. ఆదాయాలు ఆర్జిస్తున్న వారిలో కేవలం 5.5 శాతం మందే పన్ను పరిధిలో ఉన్నారు. దీన్ని కనీసం 23 శాతానికి చేర్చాల్సి ఉంది. ఆస్తి పన్ను రేట్లు మరింతగా పెంచాలి. ఇలా చేస్తే స్పెక్యులేషన్ను కట్టడి చేసే వీలుంటుంది. పొదుపు పైనా పన్ను .. ఒకవైపు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తుండగా... పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి వాటిపై పన్ను మినహాయింపులను ఎత్తివేయాలని ఎకనమిక్ సర్వే సూచించటం గమనార్హం. ‘‘ఈ మొత్తాలను విత్డ్రా చేసుకునేటప్పుడు పన్ను వేయాలి. ఈఈటీ విధానం అనుసరించాలి’’ అని పేర్కొంది. ఈఈటీ విధానమంటే డిపాజిట్ చేసినపుడు, వడ్డీపైన పన్నుండదు. చివర్లో విత్డ్రా చేసుకున్నపుడు పన్ను విధిస్తారు. అంటే ఎగ్జంప్ట్, ఎగ్జంప్ట్- ట్యాక్సబుల్ అన్న మాట. పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు డిపాజిట్లపై కూడా ఈఈటీ విధానం కింద పన్ను విధించాలని సర్వే పేర్కొంది. ‘‘సాధారణంగా ఇలాంటి స్కీములకిచ్చే ప్రయోజనాలు స్థితిమంతులకే ఉపయోగపడుతున్నాయి’’ అని సర్వే వ్యాఖ్యానించింది. ప్రస్తుతం పీపీఎఫ్ కింద 15 ఏళ్ల డిపాజిట్లకు పెట్టుబడి పెట్టే దశలోనూ, వడ్డీ మీద, విత్డ్రాయల్ సమయంలోనూ పన్ను ఉండటం లేదు. 2014-15 బడ్జెట్లో పీపీఎఫ్ పెట్టుబడి పరిమితిని రూ.50,000కు పెంచిన తర్వాత డేటాను పరిశీలిస్తే ఎక్కువగా అధిక పన్నులు చెల్లించాల్సిన అధికాదాయ వర్గాలే ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకున్నట్లు తేలినట్లు సర్వే వెల్లడించింది. ఐదేళ్లలో వృద్ధి 10 శాతానికి ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ న్యూఢిల్లీ: భారత్ త్వరలో 8 నుంచి 10 శాతం వృద్ధి సాధించే స్థాయికి చేరుకుంటుందని, దీనికి రెండు నుంచి ఐదేళ్లు పడుతుందని భావిస్తున్నట్లు ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ చెప్పారు. వ్యవస్థాగత సంస్కరణలు, రాష్ట్రాల మధ్య ఆర్థిక వృద్ధికి సంబంధించి పోటీ తత్వాన్ని పెంచటం వంటి విధానాల ద్వారా ఈ లక్ష్యాన్ని దేశం చేరుకుంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ పార్లమెంటులో 2015-16 ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టిన సుబ్రమణియన్ విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనంలో ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్న ఆయన, ఈ సవాలును ఎదుర్కొనే క్రమంలో దేశీయ డిమాండ్ వృద్ధిపై దృష్టి పెడతామని చెప్పారు. వస్తు, సేవల పన్ను వంటి వ్యవస్థాగత చర్యలు దేశాన్ని చక్కటి వృద్ధి బాటకు తీసుకువెళతాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. లక్ష కోట్ల సబ్సిడీ... సంపన్నులకే దాదాపు లక్ష కోట్ల విలువ చేసే సబ్సిడీలు స్థితిమంతులకే వెళుతున్నాయి. మెరుగైన ద్రవ్య నిర్వహణ కోసం వీటిలో తక్షణం కోత వేయాల్సి ఉంది. వంట గ్యాస్, రైల్వేలు, విద్యుత్, విమాన ఇంధనం, బంగారం, కిరోసిన్ వంటి ఆరు కమోడిటీలకు సంబంధించి సబ్సిడీ విధానాలు, చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై రాబడులు... పన్నులపరమైన ప్రయోజనాలు... తదితరాల రూపంలో ఈ సబ్సిడీలు కాస్త స్థోమత ఉన్నవారికి చేరుతున్నాయి. పటిష్ఠంగా దేశీ మార్కెట్లు.. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే దేశీ మార్కెట్లు కొంత పటిష్టంగానే ఉన్నాయి. రాబోయే రోజుల్లో పెట్టుబడులకు గమ్యంగా ఎదిగేందుకు భారత్కు అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. 2015 ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) 31 శాతం ఎగిసి 24.8 బిలియన్ డాలర్లకు చేరాయి. క్రితం ఏడాది (2014) ఇదే వ్యవధిలో ఇవి 18.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, సర్వీసులు, ట్రేడింగ్, ఆటోమొబైల్, నిర్మాణ, కెమికల్స్, టెలికమ్యూనికేషన్స్ తదితర రంగాల్లోకి ఎఫ్డీఐల రాక పెరిగింది. సింహభాగం నిధులు సింగపూర్, మారిషస్ల నుంచి వచ్చాయి. గ్యాస్ సిలిండర్లను 10కి తగ్గించాలి.. వంట గ్యాస్ సబ్సిడీని క్రమబద్ధీకరించే దిశగా సబ్సిడీపై ప్రతి కుటుంబానికి అందించే సిలిండర్ల సంఖ్యను వార్షికంగా 10కే పరిమితం చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి 12గా ఉంది. 14.2 కేజీల సిలిండర్ ఒక్కింటికి మార్కెట్ రేటు ప్రస్తుతం రూ. 575గా ఉండగా, సబ్సిడీపై రూ. 419.26కి లభిస్తోంది. యూపీఏ హయాంలో 2012లో తొలుత ఏడాదికి ఆరు సిలిండర్లు చొప్పున పరిమితిని నిర్ణయించగా.. ఆ తర్వాత ఏడాది జనవరిలో దీన్ని తొమ్మిదికి, 2014 జనవరిలో 12కి పెంచారు. మరోవంక సబ్సిడీ, సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్లపై పన్నులు, ఎక్సైజ్ సుంకాల విధానాలను కూడా మార్చాల్సిన అవసరం ఉంది. వాణిజ్య సిలిండర్లతో పోలిస్తే సబ్సిడీ సిలిండర్లపై ఎక్సయిజ్, కస్టమ్స్ సుంకాలు ఉండవు కనక వీటిని ఇతర అవసరాల కోసం బ్లాక్మార్కెట్కు మళ్లించడం జరుగుతోంది. ద్రవ్య లోటు క ట్టడి కష్టమే.. ద్రవ్య లోటును ఈ ఏడాది 3.9 శాతానికి కట్టడి చేయగలిగినా.. వచ్చే సారి మాత్రం ఇది కష్టసాధ్యమే. 7వ పే కమిషన్ సిఫార్సుల అమలు వల్ల పడే అదనపు భారం, అంతర్జాతీయ మందగమనం దీనికి ప్రధాన కారణాలవుతాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును స్థూల దేశీయోత్పత్తిలో 3.5%కి కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఏడాదికి పైగా స్తబ్దుగా ఉన్న ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సర నుంచి పుంజుకునే అవకాశముంది. కమోడిటీల క్షీణతతో వాణిజ్య, కరెంటు అకౌంట్ల లోటులు అదుపులోనే ఉండొచ్చు. 2017 నాటికి అన్ని పోస్టాఫీసుల కంప్యూటరీకరణ.. దేశవ్యాప్తంగా ఉన్న 1.55 లక్షల పైచిలుకు పోస్టాఫీసుల కంప్యూటరీకరణ వచ్చే ఏడాది కల్లా పూర్తయ్యే అవకాశముంది. ఇందులో భాగంగా ఐటీ ఆధునీకరణ ప్రాజెక్టు కోసం పోస్టల్ విభాగం దాదాపు రూ. 4,909 కోట్లు వెచ్చిస్తోంది. దీని కింద దేశవ్యాప్తంగా మెయిల్ ఆఫీసులు, అకౌంట్ ఆఫీసులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులు మొదలైన వాటన్నింటినీ అనుసంధానం చేయడం జరుగుతుంది. అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చే క్రమంలో పోస్టాఫీసు పొదుపు ఖాతాల సంఖ్య 30.86 కోట్ల నుంచి 33.97 కోట్లకు చేరుకున్నాయి. వీటిలో మొత్తం డిపాజిట్లు, నగదు సర్టిఫికెట్ల విలువ రూ. 6.53 లక్షల కోట్లుగా ఉంది. బ్యాంకులకు నిధుల కోసం పీఎస్యూల అమ్మకం.. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనం సమకూర్చాల్సిన అవసరం చాలా ఉంది. అందుకని కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించి, ఆ నిధులను ఇందుకోసం వినియోగిస్తే బాగుంటుంది. ఆర్థికేతర కార్యకలాపాల సాగించే కొన్ని నిర్ధిష్ట సంస్థల్ని ఇందుకోసం పరిశీలించవచ్చు. రుణ సమస్యల పరిష్కారానికి ‘4ఆర్’ సూత్రాలను పాటిస్తే మంచిది. సమస్యాత్మక రుణాలను గుర్తించడం (రికగ్నిషన్), తగు మూలధనాన్ని సమకూర్చుకోవడం (రీక్యాపిటలైజేషన్), పరిష్కారం అమలు(రిసొల్యూషన్), భవిష్యత్లో మళ్లీ సమస్య తలెత్తకుండా సంస్కరించుకోవడం (రిఫార్మింగ్) ఇందులో భాగం. దేశంలో 19వేల పైగా స్టార్టప్లు.. దేశీయంగా దాదాపు 19,400 టెక్నాలజీ ఆధారిత స్టార్టప్లున్నాయి. వీటిలో 5వేల పైచిలుకు స్టార్టప్లు గతేడాదే ప్రారంభమయ్యాయి. అయితే, ప్రాథమిక స్థాయిలో వీటిలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు వైదొలగాలంటే చాలా తక్కువ వాల్యుయేషన్లే లభిస్తున్నాయి. 2015 ప్రథమార్ధంలో దేశీ స్టార్టప్లు 3.5 బిలియన్ డాలర్లు సమీకరించాయి. క్రియాశీలకంగా ఉన్న ఇన్వెస్టర్ల సంఖ్య 2014లో 220గా ఉండగా.. 2015లో 490కి పెరిగింది. ప్రైవేట్ వైద్యం..పెను భారం... వైద్య సేవల్లో ప్రైవేట్ ఆస్పత్రులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ.. ప్రసూతి మినహాయిస్తే.. ఇతరత్రా వైద్యం ఖర్చులు ప్రభుత్వాస్పత్రులకన్నా బోలెడన్ని రెట్లు అధికంగా ఉంటున్నాయి. అందుబాటు రేటులో వైద్యాన్ని అందించడంలో ఎదురవుతున్న సవాళ్లను ఇది ప్రతిబింబిస్తోంది. వైద్యరంగంలో పరిమిత వనరులు, అపరిమిత డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రాధాన్యాంశాలపైనే వ్యయాలు చేయాలి. 2014 జనవరి-జూన్ మధ్య నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ (ఎన్ఎస్ఎస్వో) నిర్వహించిన సర్వే ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరిన వారి చికిత్స ఖర్చులు సగటున రూ.6,120గా ఉండగా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అదే చికిత్సకు ఏకంగా రూ.25,850 అవుతోంది. రక్షణాత్మక చర్యలతో ఐటీకి విఘాతం.. వివిధ దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక ధోరణుల వల్ల దేశీ ఐటీ-బీపీవో రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. వ్యాపారాభివృద్ధికి కంపెనీలు అంతర్గతంగా జరిపే నిపుణుల బదిలీలను... ఆయా దేశాలకు వలసలుగా ముద్ర వేసి, నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నాయి. నివేదిక ప్రకారం 2015-16లో ఐటీ-బీపీవో రంగం(హార్డ్వేర్సహా) 143 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేయగలదని అంచనా. దేశీ ఐటీ రంగం వృద్ధికి వీసా సమస్యలు మొదలైన వాటిని ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. వ్యవసాయానికి ఊతమిచ్చే చర్యలు.. దేశీ వ్యవసాయ రంగానికి ఊతమివ్వటానికి పలు చర్యలు చేపట్టాల్సి ఉంది. హైబ్రిడ్, జన్యు పరివర్తిత (జీఎం) విత్తనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, పంటలకు అధిక మద్దతు ధర లభించేలా చూడటంతో పాటు సాగు నీటి లభ్యతను పెంచడం, మార్కెట్ సదుపాయాలను మెరుగుపర్చడం వంటివి ఈ చర్యల్లో కీలకం. జీఎం విత్తనాల భద్రతపై చర్చించి, వచ్చే ఆరు నెలల్లోగా వాటిని ప్రవేశపెట్టేలా కసరత్తు చేయాలి. పంటల దిగుబడి పెరగడంతో పాటు వ్యవసాయ రంగం మెరుగయ్యేందుకు ఇవి దోహదపడతాయి. గతేడాది దేశమంతటా వాతావరణ పరిస్థితులను తీవ్రంగా మార్చేసిన ఎల్ నినో ప్రభావాలు ఈసారి ఉండకపోవచ్చు. అయితే, అనూహ్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగు అత్యవసర ప్రణాళికలతో సిద్ధంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. మెరుగైన ఉద్యోగాలు రావాలి.. మంచి జీతంతో పాటు భద్రత కూడా కల్పించే ఉద్యోగాల కల్పన కోసం చర్యలు అవసరం. ఇందులో ప్రైవేట్ రంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రానికి కూడా కీలక పాత్ర ఉంటుంది. కాంట్రాక్టు ఉద్యోగుల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. తయారీ రంగంలో నమోదైన మొత్తం సిబ్బందిలో కాంట్రాక్టు వర్కర్ల వాటా 1999లో 12 శాతంగా ఉండగా.. 2010 నాటికి 25 శాతానికి పైగా పెరిగింది. -
పార్లమెంట్లో జైట్లీ ఆర్థిక సర్వే నివేదిక
*ఆర్థిక వృద్ధి రేటు టార్గెట్ 7 శాతం *ఆరోగ్య, విద్యా రంగాలపై పెట్టుబడులు *వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత *ఆర్థిక సర్వే విడుదల న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వృద్ధి రేటు తక్కువలోతక్కువ జాతీయ స్థూల ఉత్పత్తిలో 7 నుంచి 7.75 శాతం మధ్య ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. మరిన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకరావాలని, పన్నుల పరిధిని విస్తరించి, పన్నులపై ఇస్తున్న రాయతీలను ఎత్తివేయాలని సూచించింది. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ద్య్రవ్య స్థిరీకరణ టైమ్ టేబుల్ పాటించాలని సూచించింది. వీలైనంత త్వరగా వస్తు సేవల పన్నును అమల్లోకి తీసుకరావాలని అభిప్రాయపడింది. ఏడవ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయడం ఆర్థిక వ్యవస్థను పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని, ఇతరేతర మార్గాల ద్వారా ఈ మేరకు ఆర్థిక వనరులను సమీకరించవచ్చని కూడా అభిప్రాయపడింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర జనరల్ బడ్జెట్ను సమర్పించడానికి మూడు రోజులు ముందుగా శుక్రవారం నాడు పార్లమెంట్కు ఆర్థిక నివేదికను సమర్పించారు. 2016-17 సంవత్సరానికి కనిష్టంగా 7 నుంచి 7.75 శాతం వృద్ధి రేటు సాధిస్తామని, వృద్ధి రేటును 8 నుంచి 10 శాతం రేంజ్కు తీసుకెళ్లాలంటే మరి కొన్ని సంవత్సరాలు నిరీక్షించాల్సిందేనని ఆర్థిక నివేదిక వెల్లడించింది. గతేడాది ఆర్థిక సంవత్సరానికి 8.1 నుంచి 8.5 శాతం రేంజ్కు వస్తుందని అంచనా వేయగా, 7.6 శాతం వద్దనే ఆర్థిక వృద్ధి రేటు ఆగిపోయింది. జాతీయ స్థూల ఉత్పత్తిలో ద్రవ్యలోటు 4.5-5 శాతానికి పడిపోతుందని ఆర్థిక నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ద్రవ్యలోటు 1-1.5 శాతం మధ్య ఉండడం వల్ల ధరలు స్థిరంగా ఉన్నాయని అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోవడంతో ద్రవ్యలోటు ప్రధానంగా తగ్గింది. రూపాయి విదేశీ మారక విలువ సముచితంగా కొనసాగించాలని నివేదిక సూచించింది. రూపాయి మరింత బలపడక పోయినా ఆర్థిక సరళీకరణ ద్వారా సముచిత స్థాయిలో రూపాయి విలువను సముచిత స్థాయిలో కొనసాగించవచ్చని అభిప్రాయపడింది. పెట్టుబడుల రాక తగ్గినప్పుడు లేదా బలహీనంగా ఉన్నప్పుడు కొంత మేరకు రూపాయి మారక విలువ తగ్గింపును అనుమతించవచ్చని సూచించింది. చైనా తరహాలో ఆసియాలో కరెన్సీ సర్దుబాట్లను చేసుకోవచ్చని చెప్పింది. పన్నుల పరిధిని 5.5 శాతం నుంచి 20 శాతానికిపైగా విస్తరించాలని, పన్ను రాయతీలను సమీక్షించి క్రమేణా ఎత్తివేయాలని నివేదిక సూచించింది. 2018-19 నాటికి బ్యాంకులకు పెట్టుబడుల అవసరం 1.8 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా భారత ఆర్థిక పరిస్థితి స్థిరంగా, ప్రపంచంకన్నా బలంగా ఉందని వ్యాఖ్యానించింది. మార్కెట్ వ్యతిరేక విధానాల జోలికి వెళ్లవద్దని, ఆరోగ్య, విద్యా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడింది. -
ఒడిదుడుకుల వారం..!
రైల్వే బడ్జెట్, ఆర్థిక సర్వేలపై అందరి దృష్టి... * విశ్లేషకుల అభిప్రాయం... * ఫిబ్రవరి ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల * ముగింపు ఈ వారంలోనే... న్యూఢిల్లీ: డెరివేటివ్ల కాంట్రాక్టుల ముగింపు వారమైనందున ఈ వారంలో స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. రెండు కీలకమైన అంశాలు-రైల్వే బడ్జెట్, ఆర్థిక సర్వేలపై అందరి కళ్లు ఉంటాయని, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, ముడి చమురు ధరల గమనం, ఆర్థిక సర్వే, రైల్వే బడ్జెట్లో ప్రకటించే సంస్కరణలు, రూపాయి కదలికలు.. ఇవన్నీ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. ఎలాంటి ప్రధాన ప్రపంచ సంఘటనలు లేనందున ఆర్థిక సర్వే, ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ అంశాలు తగిన ప్రభావం చూపిస్తాయనేది విశ్లేషకుల మాట. ఫిబ్రవరి డెరివేటివ్ల కాంట్రాక్టులు ఈ నెల 25న(గురువారం)ముగుస్తాయని, ఈ నేపథ్యంలో స్టాక్ సూచీలు ఒడిదుడుకుల్లోనే చలిస్తాయని, సానుకూలంగానే స్టాక్ మార్కెట్ ఉండొచ్చని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ల పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం ఇత్యాది అంశాలకనుగుణంగానే స్టాక్ మార్కెట్ గమనం ఉంటుందని క్యాపిటల్వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్(రీసెర్చ్) వివేక్ గుప్తా చెప్పారు. బడ్జెట్ కీలకం... వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెలలోనే పార్లమెంట్కు సమర్పించే రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్లపైననే స్టాక్ మార్కెట్ భవిష్యత్ గమనం ఆధారపడి ఉంటుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు. ఈ మంగళవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25న ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్ కారణంగా స్టీల్, సిమెంట్, బొగ్గు, ఐరన్ ఓర్, ఎరువుల కంపెనీలకు సంబంధించిన షేర్లలో కదలికలు ఉంటాయని సింఘానియా వివరించారు. మరోవైపు ఈ నెల 26(శుక్రవారం)గత ఏడాది కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో జరిగిన పరిణామాల సమీక్ష-ఆర్థిక సర్వే ఉంటుంది. ప్రభుత్వ విధానాల అమలు తీరును ఈ సర్వే ప్రతిబింబిస్తుంది. సాధారణ బడ్జెట్ ఈ నెల 29న ప్రవేశపెడతారు. బడ్జెట్ అంచనాల కారణంగా రంగాల వారీగా కంపెనీల షేర్లు ప్రభావితం కావచ్చని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా చెప్పారు. గత వారంలో సెన్సెక్స్ 723 పాయింట్లు లాభపడి 23,709 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా ఈ నెల మొదటి మూడు వారాల్లో సెన్సెక్స్ 1,162 పాయింట్లు(4.67%) నష్టపోయింది. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే, ఈ నెలకు సంబంధించి యూరోజోన్ మార్కెట్ ఎంఎంఐ కాంపొజిట్ ఇండెక్స్ గణాంకాలు నేడు(సోమవారం) వెలువడుతున్నాయి. అమెరికాలో క్యూ4 జీడీపీ గణాంకాలు శుక్రవారం(ఈ నెల 26న) వెలువడుతాయి. రూ. 4,600 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి.. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.4,600 కోట్ల పెట్టుబడులు భారత క్యాపిటల్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధిపై ఆందోళన, ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు దీనికి ప్రధాన కారణాలు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.13,414 కోట్లు ఉపసంహరించుకున్నట్లైంది. డిపాజిటరీ సంస్థల గణాంకాల ప్రకారం, ఈనెల 1-18 తేదీల మధ్య విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.4,503 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.96 కోట్లు మొత్తం రూ.4,599 కోట్లు నికరంగా తమ పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. కాగా జనవరిలో విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి నికరంగా రూ.13,381 కోట్లు ఉపసంహరించుకోగా, డెట్ మార్కెట్లో రూ.3,274 కోట్లు నికరంగా పెట్టుబడులు పెట్టారు. ముడి చమురు ధరల పతనం కారణంగా పశ్చిమాసియా దేశాల సావరిన్ వెల్త్ ఫండ్స్.. వర్థమాన దేశాల మార్కెట్లో చేసిన భారీ ఇన్వెస్ట్మెంట్స్ను వెనక్కి తీసుకుంటున్నాయని సాస్ ఆన్లైన్డాట్కామ్ సీఓఓ సిద్ధాంత్ జైన్ చెప్పారు. ఫలితంగా భారత్ వంటి వర్థమాన దేశాల నుంచి విదేశీ నిధులు ఈ స్థాయిలో తరలిపోతున్నాయన్నారు. రూపాయి పతనం, చైనా ఆర్థిక మందగమనంపై ఆందోళన విదేశీ ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయని వివరించారు. -
23 నుంచి బడ్జెట్ పార్లమెంట్
25న రైల్వే బడ్జెట్.. 29న కేంద్ర బడ్జెట్ * రెండు విడతలుగా పార్లమెంటు సమావేశాలు * ఈ నెల 23 నుంచి మార్చి 16 వరకూ తొలి విడత * ఏప్రిల్ 25 నుంచి మే 13 వరకూ రెండో విడత భేటీ న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 23వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించే ఈ సమావేశాల్లో ఈ నెల 25న రైల్వే బడ్జెట్ను, నెలాఖరు రోజైన 29వ తేదీన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టటానికి ముందు ఈ నెల 26న ఆర్థిక సర్వేను పార్లమెంటుకు సమర్పిస్తారు. బడ్జెట్ సమావేవాలు రెండు విడతలుగా జరుగుతాయి. తొలి విడత ఈ నెల 23 నుంచి మార్చి 16 వరకూ.. రెండో విడత ఏప్రిల్ 25 నుంచి మే 13 వరకు కొనసాగుతాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 24 వరకూ పార్లమెంటు సమావేశాలకు విరామం ఉంటుంది. ఈ సమయంలో పార్లమెంటరీ స్థాయీ సంఘాలు వివిధ బడ్జెట్ బిల్లులను పరిశీలిస్తాయి. మొత్తం 81 రోజుల పాటు బడ్జెట్ సెషన్ కాలం ఉండగా.. అందులో 31 రోజులు పార్లమెంటు సమావేశమవుతుంది. ఈ నెల 23వ తేదీన ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తారు. సూచనలు, సెలవులు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం... బడ్జెట్ సమావేశాల షెడ్యూలును గురువారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాలపై మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య మీడియాకు తెలిపారు. లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్లు కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సుకు హాజరయ్యేందుకు వీలుగా, వివిధ పార్టీల నేతల సూచనలు, ఏప్రిల్లో సెలవులను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ భేటీ తేదీలను నిర్ణయించినట్లు చెప్పారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగానే పలు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికల ప్రక్రియ మొదలుకానుందని.. పార్లమెంటు సమావేశాల్లో విరామం వద్దని తమకు సలహాలు అందాయని చెప్పారు. 2011లో బడ్జెట్ సమావేశాల సమయంలో పలు రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల ప్రక్రియ మొదలైనందున.. బిల్లులను స్థాయీ సంఘాలకు నివేదించరాదని నిర్ణయించిందని వెంకయ్య ప్రస్తావించారు. పనిదినాలు తగ్గించొద్దు: ప్రతిపక్షాలు బడ్జెట్ సమావేశాల ఖరారుపై సీసీపీఏ భేటీకి ముందు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పటికీ బడ్జెట్ సమావేశాలకు కోత పెట్టరాదని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ‘‘సమావేశాల పనిదినాలను తగ్గించరాదు. మంత్రిత్వశాఖలకు చేసిన బడ్జెట్ కేటాయింపులను స్థాయీ సంఘాలు పరిశీలించేందుకు వీలుగా సమావేశాల మధ్యలో పూర్తి విరామం ఇవ్వాలి’’ అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఆజాద్ మీడియాతో పేర్కొన్నారు. పార్లమెంటు పనిదినాలను తగ్గించరాదన్న అంశంపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉందని జేడీయూ నేత శరద్యాదవ్ చెప్పారు. పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం ప్రతి ఏటా కేలండర్ను రూపొందించి ప్రకటించాలని.. దానివల్ల పార్లమెంటు సమావేశాలు జరిగే తేదీలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీలను నిర్ణయించటానికి వీలుంటుందని సీపీఎం నేత సీతారాం ఏచూరి సూచించారు. జీఎస్టీ బిల్లు ఆమోదానికి సహకరించాలి ఈ బడ్జెట్ సమావేశాల్లో కీలకమైన వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుతో పాటు రియల్ ఎస్టేట్ తదితర అంశాలకు సంబంధించిన బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందుతాయని వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ బిల్లులు దేశ విస్తృత ప్రయోజనాలకు సంబంధించినవి కాబట్టి వాటిని ఆమోదించటానికి సహకరించాలని ప్రతిపక్షాలకు, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి ఆయన విజ్ఞప్తిచేశారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు సభా కార్యక్రమాలను స్తంభింపజేసి, కీలక సంస్కరణల బిల్లులను అడ్డుకున్న గత రెండు సమావేశాల తరహాలో కాకుండా.. రాబోయే బడ్జెట్ సమావేశాలు నిర్మాణాత్మకంగా, సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి ముక్తార్ అబ్బాస్నక్వీ పేర్కొన్నారు. ‘‘ఈ సమావేశాలు సరైన రీతిలో సాగేందుకు వీలుగా మేం అందరితో చర్చిస్తున్నాం. అన్ని పార్టీలతోనూ అధికారికంగా, అనధికారికంగా మాట్లాడుతున్నాం’’ అని చెప్పారు. -
ఫిబ్రవరి 23 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
-
ఫిబ్రవరి 23 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 26న రైల్వే శాఖ మంత్రి రైల్వే బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే మార్చి 27న ఆర్థిక సర్వే, ఆ మరుసటి రోజే అంటే మార్చి 28న ఆర్థిక మంత్రి సాధారణ బడ్జెట్ సభలో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ కమిటీ అన్ పొలిటికల్ ఎఫైర్స్ బుధవారం న్యూఢిలీలో సమావేశమై బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. మొదటి విడత ఫిబ్రవరి 23 నుంచి మార్చి 20 వరకు... రెండో విడత ఏప్రిల్ 20 నుంచి మే 8 వరకు జరగనున్నాయి. కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు అధికార బీజేపీతోపాటు ప్రతిపక్షం కాంగ్రెస్ ఇతర పార్టీలు సన్నాహాకాలు ప్రారంభించాయి. -
కాడి వీడుతున్న కర్షకుడు
ఏలూరు సెంట్రల్ :పొలాలనన్నీ హలాల దున్నీ.. ఇలా తలంలో హేమం పిండే రైతన్నలకు గడ్డు రోజులు దాపురించాయి. ఒకప్పుడు రాజనాలు పండించిన అన్నదాతలకు నేడు భోజనాలు కరువయ్యాయి. నేలతల్లిని నమ్ముకుని-నమ్మకాల నీడల్లో.. నాగేటి సాళల్లో నాటిన ఆశల విత్తులు వారి కుత్తుకలు కత్తిరించే విచ్చు కత్తులవుతున్నాయి.. ఫలితంగా ఇప్పటికే చాలా మంది కర్షకులు కాడి కిందేశారు. మిగిలిన వారి దింపుడు కళ్లెం ఆశలు కూడా ఆవిరయ్యే రోజులు ఆట్టే దూరం లేవు. ఇది ఎవరో చెప్పిన జోస్యం కాదు. ఆర్థిక సర్వే నిగ్గు తేల్చిన చేదు నిజం.ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం వ్యవసాయాన్ని వదిలేసి ఇతర రంగాల్లో ఉపాధి వెతుక్కుంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ గణనీయంగా పెరుగుతోంది. అయినా దేశంలో ఇప్పటికీ 54.60 శాతం మందికి వ్యవసాయమే ఉపాధి కల్పిస్తోందనేది సత్యం. డాక్టర్ తనయుడు డాక్టర్ అయినట్టు.. యాక్టర్ వారసుడు యాక్టర్ అయినట్టు.. రైతు పుత్రుడు భూమిపుత్రడు కావడం లేదు. అన్నపూర్ణగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లాలో 2001 లెక్కల ప్రకారం 5లక్షల 45వేల 301 మంది రైతులున్నారు. ఏటా ఈ సంఖ్య తగ్గుతూ 2014 నాటికి సుమారు 15శాతం పడిపోయిందని రైతు సంఘం నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ సంఖ్య పెరిగినట్లు కనిపించినా వారు కౌలు రైతులు మాత్రమేనని, ఈ జిల్లాలో 2001 నుంచి ఇప్పటి వరకు సగం మంది భూ యజమానులు ఏనాడో కాడి వదిలేశారని అంచనా. ప్రస్తుతం సాగు కష్టమైన నేపధ్యంలో కౌలు రైతులు కూడా సేద్యానికి దూరమైతే ఉన్న పొలాలను తెగనమ్ముకోవడమే తప్ప యజమానులు సాగుకు సిద్ధంగా లేరన్నది వాస్తవం. వ్యవసాయానికి కౌలురైతులే ఆయువుపట్టుగా మారారు. ఆహార పంటల సాగులో వీరిదే అగ్రస్థానం. సేద్యం కొనసాగిస్తున్న కొద్ది మంది భూ యజమానులు వాణిజ్య పంటల సాగుకే మొగ్గు చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే ఆహారధాన్యాల ఉత్పత్తిలో కీలక భాగస్వాములైన కౌలు రైతులను కాపాడుకోవాల్సిన కనీస ధర్మం పాలకులకుంది.2004లో జయంతీఘోష్, 2006లో కోనేరు రంగారావు కమిషన్లు కౌలు రైతులకు గుర్తింపుకార్డులు జారీ చేసి రుణాలు, ఇన్పుట్ సబ్సిడీలు, ప్రకృతి నష్ట పరిహారాలు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి. లేకపోతే మొత్తం సేద్యమే మూలనపడుతుందని హెచ్చరించాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయం దండగ కాదు.. పండగని నిరూపించే ప్రయత్నం చేశారు. అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలో ఆయన హఠాన్మరణం సమస్యను మళ్లీ మొదటికి తెచ్చింది. తర్వాత వచ్చిన రోశయ్య కానీ, కిరణ్కుమార్రెడ్డి కానీ వ్యవసాయం ఊసే ఎత్తలేదు. మద్దతు ధర ఏది! మరోవైపు పంటలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే కనీస మద్ధతుధర కూడా కౌలు రైతులకు దక్కడం లేదు. వరి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1,340లకు ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా కొనాల్సి ఉండగా అదీ అమలు కావడం లేదు. గత్యంతరం లేక అయిన కాడికి కౌలురైతులు కమిషన్దార్లు, మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. సాగుకు కౌలు రైతులే దిక్కు జిల్లాలోని డెల్టా ప్రాంతంలో 80శాతానికి పైగాను, మెట్ట ప్రాంతంలో 50శాతానికి పైగా భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారు. పెరిగిన కౌలు, సాగు ఖర్చులతో కౌలు రైతులకు సాగు భారంగా మారింది. 2003నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 23వేల రైతుమిత్ర గ్రూపులేర్పడితే 5వేల గ్రూపులకు మాత్రమే పంట రుణాలిచ్చారు. -
ఈ ఏడాది 5.5% వృద్ధి రేటు
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న సంకేతాలు కనబడుతున్నాయని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పేర్కొంది. ప్రస్తుతం 2014-15 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 5.5-6 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా వేసింది. 2013-14 ఏడాదికి సంబంధించి గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. తయారీ, మైనింగ్ రంగాలు పుంజుకుంటుండటం, పెట్టుబడులు కూడా క్రమంగా మెరుగవుతుండటం వంటివి ఇందుకు దోహదం చేయనున్నాయని తెలిపింది. ‘ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం చర్యలతో ప్రైవేటు రంగానికి తగినన్ని ఆర్థిక వనరులు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా.. ఎగుమతుల వృద్ధిబాట, అంతర్జాతీయ కమోడిటీ ధరల స్థిరీకరణ వంటివి కూడా దేశీ ఆర్థిక వ్యవస్థ రికవరీకి చేదోడుగా నిలిచే అంశాలు’ అని ఆర్బీఐ వివరించింది. అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థి రికవరీ నెమ్మదించడం, మిగతా సీజన్లో కూడా వర్షాలు ముఖం చాటేయడం, వివిధ దేశాల్లో నెలకొన్న అనిశ్చితి, ఘర్షణలు మరింత పెరగడం వంటివి జరిగితే.. భారత్ వృద్ధి దిగజారే రిస్క్లు కూడా పొంచిఉన్నాయని హెచ్చరించింది. 2013-14 ఏడాదికి తాజాగా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో కూడా ఈ ఏడాది వృద్ధి రేటు 5.4-5.9 శాతం మేర ఉండొచ్చని అంచనా వేసిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం అంచనాల్లో మార్పు లేదు... ఈ ఏడాది ఆరంభంలో తాము నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణం అంచనాల్లో ఎలాంటి మార్పులు లేవని ఆర్బీఐ పేర్కొంది. 2015 జనవరి నాటికి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 8 శాతానికి, 2016 జనవరికల్లా 6 శాతానికి కట్టడి చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యం. ఏప్రిల్, మే నెలల్లో 7.5 శాతం స్థాయికి తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం.. జూలైలో మళ్లీ 8 శాతానికి ఎగబాకింది. దీనికి ప్రధానంగా రుతుపవన వర్షపాతంలో కొరత ప్రభావంతో కూరగాయల ధరలు భారీగా పెరగడమే కారణం. అయితే, ఇది తాత్కాలికమేనని.. రానున్న రోజుల్లో రేట్లు దిగొచ్చే సంకేతాలు ఉన్నాయని ఆర్బీఐ అభిప్రాయపడింది. ద్రవ్యోల్బణం కట్టడికే తాము అత్యధిక ప్రాధాన్యమిస్తామని కూడా స్పష్టం చేసింది. తగ్గనున్న లోట్లు... ఈ ఆర్థిక సంవత్సరం మిగతా కాలంలో ద్రవ్యలోటు తగ్గుముఖం పట్టనుందని పేర్కొంది. కొద్ది నెలలుగా విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలు పెరుగుతుండటంతో ఆర్థిక వ్యవస్థకు ఎదురయ్యే ఎటువంటి ఇబ్బందులనైనా ఎదుర్కొనే స్థితిలో ఉన్నట్లు నివేదికలో తెలిపింది. ఆగస్టు 6తో ముగిసిన వారాంతానికి దేశ ఫారెక్స్ నిల్వలు అంతక్రితం వారంతో పోలిస్తే కొద్దిగా పెరిగి 319 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ నిల్వలు 282.45 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రభుత్వం ఈ ఏడాది ద్రవ్యలోటును జీడీపీలో 4.1 శాతానికి కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) గతేడాదితో పోలిస్తే(జీడీపీలో 1.7 శాతం, 32.4 బిలియన్ డాలర్లు) ఈ సంవత్సరం పెరిగే అవకాశాలున్నాయని.. అయినాకూడా తట్టుకోగల స్థాయిలోనే ఉండొచ్చని ఆర్బీఐ అభిప్రాయపడింది. అమెరికాలో సహాయ ప్యాకేజీల కోత పరిణామాలను ఎదుర్కొనేందుకు వర్ధమాన దేశాలు పాలసీపరంగా మరింత పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ పేర్కొంది. అదేవిధంగా విధానపరమైన చర్యల విషయంలో దిగ్గజ సెంట్రల్ బ్యాంకుల మధ్య మరింత సమన్వయం ఉండాలన్న వాదనను మరోసారి వినిపించింది. సింగిల్ గ్రూప్ రుణ పరిమితిపై సమీక్ష... దేశీ బ్యాంకులు ఒక నిర్దిష్ట విభాగానికి(సింగిల్ గ్రూప్) ఇచ్చే రుణ పరిమితి(40 శాతం) చాలా ఎక్కువగా ఉందని.. దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తగ్గించడంపై(బాసెల్ నిబంధనల ప్రకారం టైర్-1 మూలధనంలో 25 శాతానికి) ఈ ఏడాది సమీక్ష జరపనున్నట్లు కూడా ఆర్బీఐ పేర్కొంది. 40% మేర ప్రాధాన్య రంగ రుణ కేటాయింపులు జరపాలన్న నిబంధనలను సమీక్షించాల్సిన అవసరం ఉందని నివేదికలో అభిప్రాయపడింది. ఒకే గ్రూపునకు ఇంత భారీగా రుణాలిచ్చినప్పుడు ఒకవేళ అనుకోని ప్రతికూలతలు ఎదురైతే బ్యాంకులపై తీవ్ర ప్రభావం పడుతుందని.. ఈ రిస్క్లను తగ్గించేందుకు పరిమితి కుదింపుపై దృష్టిపెడుతున్నట్లు పేర్కొంది. -
విద్యార్జనకు దగ్గర చేసే దూరవిద్య!
భారత సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం 2011-12 నాటికి ఉన్నత విద్యకు సంబంధించి విద్యార్థుల స్థూల నమోదు శాతం (జీఈఆర్) 20.4 శాతంగా ఉంది. దీన్ని 2017 నాటికి 25.2 శాతానికి, 2020 నాటికి 30 శాతం మైలురాయికి చేర్చేందుకు యూజీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో రెగ్యులర్, డిస్టెన్స్ విధానాల ద్వారా విద్యార్థులను యూజీ, పీజీ, రీసెర్చ్ కోర్సులకు దగ్గర చేసేందుకు 12వ పంచవర్ష ప్రణాళిక కింద వివిధ కార్యక్రమాల అమలుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణల నేపథ్యంలో దేశంలో పారిశ్రామిక, సేవల రంగాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో నిపుణులైన మానవ వనరులకు డిమాండ్ పెరగడంతో దూరవిద్యా కోర్సులు విస్తరిస్తున్నాయి. వేలకు వేలు ఫీజుల భారాన్ని మోయలేని వారికి, అప్పటికే చేస్తున్న ఉద్యోగాలను వదులుకొని ఉన్నత విద్యకు సమయాన్ని వెచ్చించలేని వారికి దూరవిద్యా విధానంలో కోర్సులు అండగా నిలుస్తున్నాయి. దూరవిద్య లక్ష్యాలు: వివిధ కారణాల వల్ల సంప్రదాయ విద్యలో ప్రవేశం పొందలేని వారికి ఉన్నత విద్యావకాశాలను కల్పించడం.చదువును మధ్యలో ఆపేసిన వారికి‘లిబరల్ ఎడ్యుకేషన్’ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, వృత్తి నైపుణ్యాలను అభివృద్ధిపరిచే కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడం.విద్యార్థులకు అందుబాటులో ఉండే సమయానికి అనుగుణంగా కోర్సులను, అధ్యయన పద్ధతులను అందించడం. విద్యార్థులకు, విద్యా సంస్థలకు మధ్య దూరాన్ని తగ్గించి మంచి విద్యా వాతావరణాన్ని పెంపొందించడం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అవసరమయ్యే కోర్సులకు రూపకల్పన చేసి, విద్యార్థులకు అందుబాటులో ఉంచడం. కోర్సు కోర్సుకూ ప్రత్యేకత: గతంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సాధారణ డిగ్రీ కోర్సులే అందుబాటులో ఉంటాయన్న భావన విద్యార్థుల్లో ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ప్రస్తుత మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విశ్వవిద్యాలయాలు కొత్త కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. సంప్రదాయ కాంబినేషన్లతో పాటు విభిన్న కాంబినేషన్లతో కోర్సులు అందిస్తున్నాయి. ఉదాహరణకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ- సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బీఎస్సీ(కాస్ట్యూమ్ డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ), బీఎస్సీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), బీహెచ్ఎం (బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్), ఎంఎస్సీ (ఫుడ్ అండ్ న్యూట్రిషన్), ఎంఎస్సీ (బయో ఇన్ఫర్మాటిక్స్) వంటి కోర్సులను ఆఫర్ చేస్తోంది. ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్- ఉస్మానియా యూనివర్సిటీ బీఎస్సీ (ఏవియేషన్), పీజీ డిప్లొమా ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్, పీజీ డిప్లొమా ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వంటి వినూత్న కోర్సులను డిస్టెన్స్ విధానంలో ఆఫర్ చేస్తోంది. ఎంసీఏ, ఎంబీఏలకు డిమాండ్: డిస్టెన్స విధానంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సులు ఆదరణ పొందుతున్నాయి. ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు బాగుండటంతో ఎంసీఏను పూర్తిచేసి, వివిధ అనుబంధ కోర్సులు చేసి యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకుంటోంది. అప్పటికే ఏదో ఒక ఉద్యోగంలో చేరిన వారు కెరీర్లో ఉన్నత అవకాశాలు పొందేందుకు మేనేజ్మెంట్ కోర్సులైవైపు మొగ్గు చూపుతున్నారు. నైపుణ్యాలు పెంచుకొని పదోన్నతులు పొందడానికి ఈ కోర్సులు ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని చాలా యూనివర్సిటీలు మేనేజ్మెంట్లో యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు నిర్ణీత సమయాల్లో కాంటాక్ట్ కోర్సులు నిర్వహిస్తారు. అవసరమైన స్టడీ మెటీరియల్ అందిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ మూడేళ్ల కాల వ్యవధితో ఎంసీఏ, రెండేళ్ల కాల వ్యవధితో ఎంబీఏ కోర్సులతో పాటు ఏడాది కాలవ్యవధితో బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమాను ఆఫర్ చేస్తోంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎంసీఏతో పాటు ఎంబీఏ (ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్), ఎంబీఏ (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్), పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ వంటి కోర్సులను అందిస్తోంది. వివిధ రంగాల్లోనూ అందుబాటులో: న్యాయశాస్త్రం, వైద్య విద్య వంటి ప్రాక్టికల్ ఓరియెంటెడ్ కోర్సుల్లోనూ డిస్టెన్స్ కోర్సులు లభిస్తున్నాయి. హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా కూడా వివిధ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎల్ఎల్ఎం (లేబర్ లాస్), కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లా, కాన్స్టిట్యూషనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా వంటి కోర్సులను ఆఫర్ చేస్తోంది. సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ.. డిప్లొమా ఇన్ మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ రీసెర్చ్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ వంటి కోర్సులను అందుబాటులో ఉంచింది. సింబయాసిస్ సెంటర్ ఆఫ్ హెల్త్కేర్ వంటి సంస్థలు కూడా ఏడాది కాల వ్యవధితో పలు కోర్సులను అందిస్తున్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వంటి నియంత్రణ సంస్థల నిబంధనల నేపథ్యంలో పూర్తిస్థాయి కోర్సులు కాకుండా ఆయా విభాగాలకు సంబంధించిన అనుబంధ కోర్సులను విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం: ఇప్పుడు అన్ని రంగాల్లోనూ సాంకేతికత రాజ్యమేలుతోంది. అంతా ఆన్లైన్లోనే అన్నట్లున్న ప్రస్తుత పరిస్థితుల్లో దూరవిద్యా కోర్సుల బోధన విధానంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. అధికశాతం యూనివర్సిటీలు డిస్టెన్స్ విద్యార్థులకు‘ఈ-లెర్నింగ్’సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. కోర్సు రిజిస్ట్రేషన్ నంబరు, లేదా అడ్మిషన్ నంబరు ఆధారంగా సదరు యూనివర్సిటీ వెబ్సైట్లో యూజర్-ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే ‘ఈ-లెర్నింగ్’ మెటీరియల్ లభిస్తుంది. దూరవిద్యకు పెద్ద దిక్కు: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) దేశంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ప్రస్తుతం సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, డాక్టోరల్ ప్రోగ్రామ్స్ తదితర విభాగాల్లో కోర్సులను ఆఫర్ చేస్తోంది. దేశ, విదేశాల్లోని నెట్వర్క ద్వారా దాదాపు 30 లక్షల మంది వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారు. నిరంతరం మార్కెట్ అవసరాలకు తగినట్లుగా పరిశ్రమ వర్గాలతో చర్చించి సరికొత్త కోర్సులకు రూపకల్పన చేస్తోంది. ఈ క్రమంలో ఏటా కొత్త కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. విద్యా విధానంలో ఆడియో విజువల్ మెటీరియల్, టెలీకాన్ఫరెన్స్లు, ప్రాక్టికల్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ ఇలా విభిన్న అంశాలతో విద్యార్థులకు చేరువవుతోంది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ టూరిజం స్టడీస్, డిప్లొమా ఇన్ ఆక్వాకల్చర్, పీజీ సర్టిఫికెట్ ఇన్ సైబర్ లా, సర్టిఫికెట్ ఇన్ బిజినెస్ స్కిల్స్, సర్టిఫికెట్ ఇన్ డయాబెటిస్ కేర్ ఫర్ కమ్యూనిటీ వర్కర్, సర్టిఫికెట్ ఇన్ ఆయుష్ నర్సింగ్, పీజీ డిప్లొమా ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ నర్సింగ్ వంటి ఎన్నో కోర్సులు అందిస్తోంది. రాష్ట్రంలో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ: రాష్ట్రంలోని యూనివర్సిటీలు పలు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో సర్టిఫికెట్ స్థాయి మొదలు డిప్లొమా, పీజీ డిప్లొమా, యూజీ, పీజీ కోర్సులు ఉన్నాయి. మన రాష్ట్రంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ‘ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్’ నినాదంతో విద్యా సేవలు అందిస్తోంది. మల్టీమీడియా టీచింగ్-లెర్నింగ్ విధానంతో విద్యార్థులకు చేరువవుతోంది. బీఈడీ, ఎంఈడీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ హెర్బల్ ప్రొడక్ట్స్ వంటి కోర్సులను ఆఫర్ చేస్తోంది. మక్కువ అందుకే! విద్యార్థులను ఉన్నత విద్యకు దగ్గరచేసే ఉత్తమ మార్గం దూరవిద్య. ప్రవేశాలు, అర్హతలు, పరీక్షలు, ప్రాంతం, ఖర్చు తదితర అంశాల్లో సరళత కారణంగా విద్యార్థులు దూరవిద్య కోర్సులపై మక్కువ చూపుతున్నారు. ఉదాహరణకు ఇగ్నోకు సంబంధించి హైదరాబాద్లో కోర్సులో ప్రవేశించి, ముంబైలో పరీక్షలు రాయొచ్చు. అవసరమైతే ప్రవేశాన్ని ముంబైకి మార్చుకోవచ్చు. విద్యార్థి కేంద్రంగా, అవసరాలకు అనుగుణంగా దూరవిద్యా విధానంలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సెల్ఫ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్, ఆడియో-వీడియో ప్రోగ్రామ్స్, ఇంటరాక్టివ్ రేడియో కౌన్సెలింగ్, వెబ్ కాన్ఫెరెన్సెస్ వంటి సేవలు అందుకునేందుకు అవకాశముంది. నిపుణులు రూపొందించిన మెటీరియల్ కోర్సులకు ప్రత్యేక ఆకర్షణ. ఇగ్నో కోర్సులు 21 స్కూల్స్ ఆఫ్ స్టడీస్, 67 ప్రాంతీయ కేంద్రాలు, దాదాపు 2,667 లెర్నర్ సపోర్ట్ కేంద్రాలు, 29 విదేశీ భాగస్వామ్య కేంద్రాలతో విస్తరించిన ఇగ్నో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులకు సేవలు అందిస్తోంది. 228కు పైగా సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, డాక్టోరల్ ప్రోగ్రామ్స్ను ఆఫర్ చేస్తోంది. ప్రముఖ కోర్సులు: ఎంసీఏ, ఎంఏ ఇన్ రూరల్ డెవలప్మెంట్, టూరిజం అండ్ మేనేజ్మెంట్, ఇంగ్లిష్, హిందీ, పిలాసఫీ, గాంధీ అండ్ పీస్ స్టడీస్, ఎక్స్టెన్షన్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్, ఎడ్యుకేషన్, ఆంత్రోపాలజీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, జెండర్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, అడల్ట్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ కామర్స్, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎంఎస్సీ డైటీటిక్స్ అండ్ ఫుడ్ సర్వీసెస్ మేనేజ్మెంట్, ఎంఎస్సీ కౌన్సెలింగ్ అండ్ ఫ్యామలీ థెరఫీ. జాబ్ మార్కెట్కు తగినట్లు దేశంలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కోర్సులను ఇగ్నో ప్రవేశపెడుతోంది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది. ఉదాహరణకు అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్, జియో ఇన్ఫర్మాటిక్స్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (కౌన్సెలింగ్) కోర్సులను చెప్పుకోవచ్చు. ఇప్పుడు జాబ్ మార్కెట్లో విద్యార్థి కోర్సు ఎక్కడ చేశారు? ఎన్ని మార్కులు వచ్చాయి? వంటి వాటి కంటే అసలు విద్యార్థి పరిజ్ఞానం, నైపుణ్యాల ఆధారంగానే అవకాశాలు లభిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచే దిశగా ఇగ్నో కోర్సులకు రూపకల్పన చేస్తోంది. విద్యా సేవలు అందించడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. దీనికి ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ (ైఉఖ), మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుల (కైైఇట)ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. - డా. పి.వి.కె.శశిధర్, అసోసియేట్ ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్, ఇగ్నో, న్యూఢిల్లీ. -
జలయజ్ఞంతో 20 లక్షల ఎకరాల సాగులోకి
మరో 3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి బడ్జెట్ ప్రసంగంలోనూ పేర్కొన్న ఆర్థికమంత్రి సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించిన జలయజ్ఞం పథకం కింద చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఇప్పటివరకు 19.696 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. మరో 3.036 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన 2013-14 సామాజిక, ఆర్థిక సర్వే ఈ విషయాలను వెల్లడించింది. శాసనసభకు బడ్జెట్ను సమర్పించిన రోజునే.. సామాజిక, ఆర్థిక సర్వేను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం విదితమే. ‘‘13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో జలయజ్ఞం కింద 52.05 లక్షల ఎకరాలను ఆయకట్టు కిందకు తీసుకురావడం, 21.18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం లక్ష్యంగా 54 ప్రాజెక్టుల (26 మేజర్, 18 మీడియం, 4 ఫ్లడ్ బ్యాంక్స్, 6 ఆధునికీకరణ ప్రాజెక్టులు)ను చేపట్టారు. ఇప్పటివరకు 13 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 14 ప్రాజెక్టులు పాక్షికంగా వినియోగంలోకి వచ్చాయి. జలయజ్ఞం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 19.696 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీటి వసతి కల్పించారు. 3.036 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు’’ అని ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలోనూ వెల్లడి... రాష్ట్ర ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలో కూడా జలయజ్ఞం ద్వారా కొత్త ఆయకట్టు సృష్టించిన విషయాన్ని వివరించారు. ‘‘2004 నుంచి రూ. 80,620 కోట్ల అంచనా వ్యయంతో 54 భారీ, మధ్య తరహా సాగునీటి పథకాలు చేపట్టారు. అందులో 13 పథకాలు పూర్తయ్యాయి. మరో 14 పథకాలు పాక్షికంగా వినియోగంలోకి వచ్చాయి. ఈ పథకాల ద్వారా రూ. 19,378 కోట్ల వ్యయంతో 11.878 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. 3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడింది. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా 39 పథకాలు పూర్తి కావాల్సి ఉంది. అందులో 11 పథకాల నిర్మాణం చివరి దశలో ఉంది. ఇవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తికానున్నాయి. వీటి ద్వారా 2,03,628 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రానుంది. మరో 35,990 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది’’ అని పేర్కొన్నారు. సాగునీటి రంగంపై ప్రభుత్వం రూపొందించిన శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించి ఆ తర్వాత కేవలం టాకింగ్ పాయింట్స్ పేరుతో ఒక పత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జలయజ్ఞంలో అవినీతి జరిగిందంటూ విమర్శలు గుప్పించిన విషయమూ విదితమే. కానీ.. వాస్తవాలను దాచిపెట్టలేక శ్వేతపత్రంలో కొత్త ఆయకట్టును యథాతథంగా పేర్కొన్నారు. అదే విషయాలను ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలోనూ పేర్కొనడం గమనార్హం. -
ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వరూపమిది
దేశవ్యాప్తంగా జనాభాలో పదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ కిక్కిరిసిన తూర్పు గోదావరి... విజయనగరంలో అతి తక్కువ 46 మండలాల్లో ప్రమాదం అంచున భూగర్భ జలాలు.. ప్రణాళికా విభాగం సామాజిక ఆర్ధిక సర్వేలో వెల్లడి విద్యావకాశాలు.. ► ఆంధ్రప్రదేశ్లో 146 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 141 ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలున్నాయి. వీటిలో 2.24 లక్షల మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. ► సాంకేతిక విద్యకొస్తే 1,357 మంది డిప్లొమో, డిగ్రీ స్థాయి వృత్తి విద్య కళాశాలల్లో 3,44,551 మంది విద్యార్ధులు అభ్యసిస్తున్నారు. హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వరూపాన్ని ప్రణాళికా విభాగం తాజాగా విడుదల చేసిన ఆర్థిక సర్వేలో ఆవిష్కరించింది. 2013-14 సామాజిక ఆర్ధిక సర్వే ఆధారంగా ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు, సామాజిక ఆర్ధిక స్థితిగతులు, జనాభా, పంటల ఉత్పత్తి, విద్యావకాశాలు తదితర అంశాలను పొందుపరిచారు. అయితే భౌగోళికంగా రాష్ట్రానికి సరిహద్దుగా మహారాష్ట్ర ఉందని ఆర్థిక సర్వేలో పేర్కొనడం గమనార్హం. భౌగోళిక స్థితిగతులు ► ఉత్తరాన చత్తీస్గఢ్, తెలంగాణాతోపాటు ఒడిశా రాష్ట్రాలు. తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు, పడమర కర్ణాటక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు సరిహద్దుగా ఉన్నాయి. రెండు పెద్ద నదులైన కృష్ణా, గోదావరి రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. జనాభా.. జన సాంద్రత ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా 4.94 కోట్లు. పురుషుల సంఖ్య 2.47 కోట్లు(50.1 శాతం) కాగా మహిళల సంఖ్య 2.46 కోట్లు (49.9 శాతం). దేశంలో జనాభా విషయంలో ఏపీ పదో స్థానంలో నిలిచింది. దేశ జనాభాలో రాష్ట్ర జనాభా 4.08 శాతంగా ఉంది. ► 2011 జనాభా లెక్కలతో పోలిస్తే రాష్ట్రంలో జనాభా పెరుగుదల శాతం తగ్గింది. 2011లో పెరుగుదల 9.21 శాతం ఉంటే 2001లో 11.89 శాతంగా ఉంది. అంటే జనాభా పెరుగుదల శాతం పదేళ్లలో 2.68 శాతం తగ్గిందన్న మాట. ఇక తూర్పు గోదావరిలో అత్యధికంగా 51.54 లక్షల జనాభా ఉంది. విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 23.44 లక్షల జనాభా ఉన్నారు. జనసాంద్రత విషయానికొ స్తే 2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో చదరపు కిలోమీటర్కు 308 మంది చొప్పున ఉంటే, దేశంలో 382 మంది ఉన్నారు. కృష్ణా జిల్లాలో చ.కి.మీకి అత్యధికంగా 518 మంది జనాభా ఉండగా కడపలో అత్యల్పంగా 118 మంది ఉన్నారు. ఆహార ధాన్యాల దిగుబడి.. ► రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 48.25 శాతం (78,388.6 చదరపు కిలోమీటర్లు) భూమి సాగులో ఉంది. అటవీ శాఖ రికార్డుల ప్రకారం 34,572 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉంది. భౌగోళిక విస్తీర్ణంలో 796.8 చదరపు కి.మీ. భూమిని పరిశ్రమలకు వినియోగిస్తున్నారు. ఆక్వా కల్చర్కు 1,801.2 చదరపు కి.మీ. వినియోగిస్తున్నారు. 2012-13 లెక్కల ప్రకారం ఆహార ధాన్యాలు 41.56 లక్షల హెక్టార్లలో సాగు చేయగా 104.96 లక్షల టన్నుల దిగుబడి నమోదైంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 83.21 శాతం కాగా అపరాల ఉత్పత్తి 10.79 శాతంగా ఉంది. భూగర్భ జలాల స్థితి రాష్ట్రంలో 46 మండలాల్లో భూగర్భ జలాలు ప్రమాదం అంచున ఉన్నాయి. 12మండలాల్లో నీటిమట్టం ప్రమాదక రంగా ఉంది. వాతావరణం విషయానికొస్తే సగటున అధికంగా 39, కనిష్టంగా 15.70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏటా సగటున 911 మి.మీ. వర్షపాతం కురుస్తోంది. 2013-14లో నైరుతి రుతుపవనాల సీజన్లో 514 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 554 మి.మి.గా ఉంది. -
వికలాంగులు, అంధులకు ఎన్యుమరేటర్లుగా విధులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రభుత్వం ఈనెల 19న ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహణ ఏర్పాట్లలో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాల్సిన ఎన్యుమరేటర్ల ఎంపిక అస్తవ్యస్తంగా జరిగింది. వికలాంగులకు, ముఖ్యంగా చూపులేని వారికి కూడా ఎన్యుమరేటర్లుగా ఎంపిక చేశారు. నామమాత్రంగా చదువు వచ్చే కొందరు నాలుగో తరగతి సిబ్బందికి కూడా ఈ విధులు అప్పగించారు. ఈ ఎన్యుమరేటర్లు ఒక్కో కుటుంబానికి సంబంధించి 80కిపైగా అంశాల సమాచారం సేకరించాలి. సమర్థవంతమైన ఎన్యుమరేటర్లు సర్వే చేస్తేనే సమగ్ర సమాచారం వస్తుంది. సర్వే పకడ్బందీగా జరుగుతుంది. కానీ సర్వేలో ఎంతో కీలకమైన ఈ ఎన్యుమరేటర్ల ఎంపిక ఇష్టారాజ్యంగా జరగడంతో సమగ్ర సర్వే ప్రశ్నార్థకంగా మారింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలోని 52 మండలాల పరిధిలోని 866 గ్రామపంచాయతీలు, ఏడు మున్సిపాలిటీలో జిల్లాలో 6.96 లక్షల కుటుంబాలు ఉన్నాయి. కానీ ఈ సర్వే నిమిత్తం వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు ముందస్తుగా సేకరించిన ప్రాథమిక సమాచారం మేరకు 7.47 లక్షల కుటుంబాలున్నట్లు తేలింది. ఈ సర్వేను నిర్వహించేందుకు అధికారులు 30,800 మంది ఎన్యుమరేటర్లను గుర్తించారు. అలాగే సుమారు 3 వేల మంది అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఎన్యుమరేటర్ల గుర్తింపులో అధికారుల నిర్లక్ష్యానికి పైన పేర్కొన్న ఉదాహరణలు అద్దం పడుతున్నాయి. ఎంపిక జరిగిందిలా.. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి ఈ సర్వే విధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నడూ లేనివిధంగా పోలీసు సిబ్బందిని కూడా ఈ సర్వేలో భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఆయా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది జాబితాను ఇవ్వాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలందాయి. ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది అందరు ఈ సర్వే విధులు సమర్థవంతంగా నిర్వహించగలరా? లేదా? అనే అంశాలేవీ పట్టించుకోకుండానే ఆయా శాఖల అధికారులు ఉద్యోగులు, సిబ్బంది జాబితాను ఉన్నతాధికారులకు పంపారు. ఈ జాబితా మేరకు రెవెన్యూ అధికారులు ఎన్యుమరేటర్లుగా గుర్తించారు. ఈ మేరకు శిక్షణ తరగతులకు రావాలని వారికి సర్వేకు సంబంధించిన లేఖలను పంపారు. ఈ సర్వేలో అనేక క్లిష్టమైన అంశాలుండటంతో అనేక మంది సిబ్బంది అవాక్కయ్యారు. తమ పరిస్థితులను వివరించడంతో అధికారులు నాలుక కరుచుని ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సర్వే నుంచి మినహాయింపు ఇవ్వండి.. - వికలాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం సర్వే విధుల నుంచి వికలాంగులకు మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ వికలాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్కు వినతిపత్రం అందజేసినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎల్.రాజసమయ్మ, ఎ.నారాయణలు పేర్కొన్నారు. అంగ వైకల్యంతో ఒకేరోజు 25 కుటుంబాలు తిరిగి సర్వే చేయడం ఇబ్బందిగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. -
ఇంటింటి సర్వే రాజ్యాంగ విరుద్ధం: చౌదరి
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినున్న ఇంటింటి సర్వే రాజ్యాంగ విరుద్ధమని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలుకాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుపడుతోందని విమర్శించారు. ఏపీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్ కు విశేషాధికారాలు అప్పగించాల్సిందేననని అన్నారు. ఇంటింటి సర్వే వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మరో టీడీపీ ఎంపీ గుండు సుధారాణి చెప్పారు. నెల రోజులపాటు సర్వే నిర్వహించాలని ఆమె సూచించారు. -
ఏపీ ఉద్యోగుల అవసరం లేదు: టీఎన్జీవో
హైదరాబాద్: తెలంగాణలో నిరహించనున్న సమగ్ర ఇంటింటి సర్వేకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల అవసరంలేదని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. సర్వేను పూర్తి చేసే శక్తి తెలంగాణ ఉద్యోగులకు ఉందని ఆయన తెలిపారు. ఈనెల 19న సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, ఇంటింటి సర్వేలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సిబ్బందికి విధులు అప్పగించడమేమిటని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రశ్నించింది. తమ ఉద్యోగులకు డ్యూటీ వేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ఆదేశాలివ్వడాన్ని తప్పుబట్టింది. -
'తెలంగాణ సర్వేలో పాల్గొనం'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న సామాజిక, ఆర్థిక సర్వేలో ఆంధ్ర ఉద్యగోలు పాల్గొనరని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. సర్వేలో పాల్గొనాలని 22 మంది ఆంధ్ర ఉద్యోగులకు జీహెచ్ఎంసీ కమిషనర్ నోటీసులు పంపారని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. తమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెబితేనే సర్వేలో పాల్గొంటామని చెప్పారు. ఆంధ్ర ఉద్యోగులపై నమ్మకం లేనప్పుడు సర్వేకు హాజరు కావాలని ఎలా కోరుతారని వారు ప్రశ్నించారు. ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి సంగతి తెలిసిందే. -
వివాదాల సుడిగుండంలో ఇంటింటి సర్వే!
* బతుకుదెరువు కోసం వెళ్లిన లక్షలాది జనం * సూరత్, భీవండితోపాటు గల్ఫ్ దేశాలకూ వలసలు * సుదూర ప్రాంతాల్లో గొర్రెలకాపర్లు, కూలీలు * ఒక్కరోజులో సర్వే ఎలా సాధ్యమవుతుంది? * ప్రభుత్వంపై విమర్శలకు దిగిన ప్రతిపక్షాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన ఇంటింటి సర్వేను పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ నెల 19న ప్రతీ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను వ్యక్తిగతంగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఏ గ్రామానికి చెందిన వారు ఆ గ్రామంలో లేకుంటే ప్రభుత్వం, సంక్షేమ పథకాల లెక్కల్లో లేనట్టేనని హెచ్చరించడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు, అత్యవసర విధుల్లో ఉన్నవారు, పొట్టకూటి కోసం వివిధ వృత్తులవారు రోజుల తరబడీ, నెలల తరబడీ ఊరికి దూరంగా వెళ్తుం టారు. ఆ ఒక్కరోజు వ్యక్తిగతంగా వెళ్లలేకపోతే జీవితాంతం నష్టపోవాల్సిందేనా? అని వారు భయాందోళన చెందుతున్నారు. ఉదాహరణకు.. తెలంగాణలో గణనీయంగా గొర్రెల కాపరులు దూరప్రాంతాల్లో ఉన్న జిల్లాలకు వరుసగా ఐదారు నెలల పాటు వలస వెళ్తారు. మహబూబ్నగర్కు చెందిన గొర్రెల కాపర్లు గొర్రెల మంద(జీవాల)ను ఇటు కరీంనగర్ నుంచి అటు గుంటూరులాంటి జిల్లాలకు కాలినడకన కొట్టుకుని పోతారు. ఇంటింటి సర్వే విషయంపై వీరికి కనీసం సమాచారం అందే అవకాశమే తక్కువ. ఒకవేళ ఇప్పుడున్న సెల్ఫోన్ల వంటి సమాచార వ్యవస్థ వల్ల సమాచారం అందినా.. గొర్రెల మందను ఎక్కడో విడిచిపెట్టి స్వంత గ్రామాలకు చేరడం సాధ్యం కాదు. హైదరాబాద్, ఇతర పట్టణాలకు కూలీ పనులు, చిన్న జీతాల కోసం వెళ్లినవారికీ ఆ ఒక్కరోజే ఊరికి వెళ్లడం సాధ్యమేనా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఆస్పత్రుల్లో ఉన్నవారి సంగతి...? అత్యవసర వైద్యం అవసరమై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు, వారికి అటెం డెంట్లుగా ఉన్నవారు వ్యక్తిగతంగా హాజరు కావడానికి అవకాశం లేదు. వైద్యం, ఫైరింగ్, పోలీసు వంటి అత్యవసర ఉద్యోగాల్లో ఉన్నవారూ వ్యక్తిగతంగా హాజరు కావడం చాలా కష్టం. మీడియాలో పనిచేస్తున్నవారు కూడా స్వంత గ్రామాలకు వెళ్లాలంటే ఇబ్బందే. అందరికీ ఒకేరోజు సెలవు ఇస్తే ఆస్పత్రులు, మీడియా వంటి సంస్థలు ఎలా నడుస్తాయి? స్వంత గ్రామాల్లోనే వీరి వివరాలను నమోదు చేసుకోవాలనుకున్నవారు వీటిపై సతమతమవుతున్నారు. ఇతర ప్రాంతాల్లోని వారెట్లా..? పొట్ట చేతపట్టుకుని దుబాయ్కి వలస వెళ్లినవారు కరీంనగర్, నిజామాబాద్ వంటి జిల్లాల నుంచి ఎందరో ఉన్నారు. సూరత్ (గుజరాత్), భీవండి (మహారాష్ట్ర) లాంటి ప్రాంతాల్లోని వివిధ పరిశ్రమల్లో రోజుకూలీలుగా పనిచేయడానికి తెలంగాణ జిల్లాల్లోని వేలాది కుటుంబాలు వలస వెళ్లాయి. కాళ్లుచేతుల్లో సత్తువ ఉన్నంతకాలం రెక్కల కష్టంతో కొంత సంపాదించుకుని, సొంత గ్రామంలోనే స్థిరపడాలని చాలామంది కోరుకుంటున్నారు. వీరంతా ఒకేరోజు రావాలంటే రవాణా సదుపాయాలు సాధ్యం కావడం లేదు. వీరిలో కొందరికి సమాచారం లేకపోగా మరికొందరికి ఇదేంటో అర్థం కావడం లేదు. కచ్చితంగా సొంత గ్రామానికి రావాలని కోరుకుంటున్నవారికి రైలు టికెట్లు దొరకడం లేదు. ఇప్పటికే సూరత్ నుంచి వచ్చే రైళ్లకు టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. ఇక విదేశాల్లో ఉన్నవారికి విషయం తెలిసినా ఒక్కరోజు కోసం రావడం సాధ్యమేనా? అనే అనుమానాలు ముప్పిరి గొంటున్నాయి. అప్పోసప్పో చేసి విదేశాలకు వెళ్లిన చిరువేతన జీవులు వేలకు వేలు ఖర్చుచేసి ఒక్కరోజుకోసం స్వంత గ్రామానికి రావాలంటే ఎన్నో వ్యయప్రయాసలుంటాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా.. ఒక్కరోజే ఈ సర్వే అంటే ఎలా సాధ్యమని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. -
సర్వే రోజు ఇంట్లో ఉండాల్సిందే
-
సర్వే రోజు ఇంట్లో ఉండాల్సిందే
* టీ సర్కార్ స్పష్టీకరణ * హాస్టల్స్లో చదువుకుంటున్న * విద్యార్థులకు మాత్రం మినహాయింపు * హైదరాబాద్ సహా... రాష్ట్రమంతటా ఈనెల 19న ఒకే రోజు సర్వే * విదేశాలకు వెళ్లినవారు, వలసలు వెళ్లినవారు అవసరం అనుకుంటే రావచ్చు సాక్షి, హైదరాబాద్: ఈనెల 19న జరిగే సమగ్ర ఇంటింటి సర్వే రోజు కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకరో, ఇద్దరో ఉండి వివరాలు చెబుతామంటే కుదరదని వెల్లడించింది. కేవలం హాస్టళ్లలోని విద్యార్థులకు మాత్రమే మినహాయింపు ఇస్తామని, అయితే వారు హాస్టల్లో ఉన్నట్లు రుజువులు ఇవ్వాలని, ఆ విద్యార్థులు ఏ హాస్టల్లో చదువుతున్నారో నమోదు చేసుకుంటామని స్పష్టం చేసింది. శుక్రవారం రెండున్నర గంటలపాటు సర్వేపై జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ‘సెర్ప్’ సీఈ వో మురళీలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తరువాత రేమండ్ పీటర్ తనను కలసిన విలేకరులతో మాట్లాడారు. ఎక్కడ ఉన్నవారు అక్కడే ప్రయోజనం పొందాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని, సంక్షేమ పథకాలు దుర్వినియోగం కాకుండా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే అందించడానికి యత్నిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏవిధమైన పథకాలు ప్రవేశపెట్టాలన్నా.. దానికి సమగ్ర సమాచారం ఉంటేనే.. ఆ కార్యక్రమాలు ఫలవంతం అవుతాయని రేమండ్ పీటర్ వివరించారు. రేషన్కార్డులు, పింఛన్లు మంజూరయ్యాక... వారు ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల.. వారికి రావాల్సిన పెన్షన్, రేషన్ను మధ్య దళారీలు తినేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్కార్డులున్నా అనేకమంది వివిధ కారణాలతో సరుకులు తీసుకోవడం లేదని, వారిపేరుతో దళారీలు వాటిని దోచుకుంటున్నారని, ఇలాంటి వాటిని తొలగించడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. సూరత్, ముంబై వెళ్లి అక్కడ పనిచేసుకుంటున్న వారికి.. ఇక్కడ సంక్షేమ పథకాలతో అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలో ఒకేరోజు మొత్తం సర్వే నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ఏర్పా ట్లు చేస్తున్నట్లు వివరించారు. కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోల సమావేశంలో విడుదల చేసిన సర్వే ఫార్మాట్కు ఆ సమావేశంలో వచ్చిన సూచనల మేరకు కొన్ని మార్పులు చేశామని అన్నారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, శనివారం సర్వే తుది ఫార్మాట్ను ప్రభుత్వ వెబ్సైట్లో పెడతామని ఆయన వివరించారు. స్థానికతకు.. సర్వేకు సంబంధం లేదు: రేమండ్ పీటర్ సమగ్ర ఇంటింటి సర్వేకు స్థానికతకు ఏమాత్రం సంబంధం లేదని రేమండ్ పీటర్ వెల్లడించారు. సర్వే ఫార్మాట్లో ఏ రాష్ట్రం నుంచి వచ్చారు..? ఎంతకాలం నుంచి ఉంటున్నారు..? వంటి ప్రశ్నలు ఉండబోవని స్పష్టం చేశారు. కాగా, కలెక్టర్ల సదస్సు సమయంలో మహ బూబ్నగర్ జిల్లా కొందుర్గు మండలంలో బీహార్ నుంచి వచ్చిన కూలీలు ఎక్కువగా ఉన్నారని, మరి వారి పేర్లను, రాష్ట్రాన్ని నమోదు చేయాలా.? అని జిల్లా కలెక్టర్ సందేహం వ్యక్తం చేయడంతో.. నమోదు చేయాలని భావించి, సవరించిన ఫార్మాట్ను జిల్లాలకు పంపించారు. కాని ఆ తరువాత అది వివాదాస్పదమవుతుండటంతో తుది ఫార్మాట్లో ఆ కాలాన్ని తొలగించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని తుది ఫార్మాట్ ఇస్తున్నట్లు రేమండ్ పీటర్ వివరించారు. -
సమగ్ర సర్వేకు కసరత్తు
* సమీక్ష నిర్వహించిన జీహెచ్ఎంసీ సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19న జరగనున్న సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే నిర్వహణకు గ్రేటర్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. 625 చ.కి.మీ. మేర విస్తరించిన జీహెచ్ఎంసీలో దాదాపు 20 లక్షల ఇళ్లున్నట్లు అంచనా వేసిన అధికారులు సర్వే నిర్వహణకు దాదాపు లక్షమంది సిబ్బంది అవసరమవుతారని అంచనా వేశారు. జీహెచ్ఎంసీ, పోలీసులు, ఇతర ప్రభుత్వ సిబ్బందిని సర్వే సేవలకు వినియోగించుకున్నా 40 వేల నుంచి 50 వేల మంది వరకు మాత్రమే ఉన్నట్లు అంచనా వేశారు. దీంతో.. ప్రైవేటు విద్యాసంస్థలు, స్వయం సహాయక మహిళా గ్రూపులు, స్వచ్ఛంద సేవాసంస్థలు, తదితరుల సేవల్ని విని యోగించుకుంటే ఎలా ఉంటుంది ? అనే ఆలోచనలో ఉన్నారు. సర్వే నిర్వహణ సన్నాహకాల్లో భాగంగా బుధవారం జీహెచ్ఎంసీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్తోపాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేశ్కుమార్ మీనా, గ్రేటర్ పరిధిలోకి వచ్చే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సర్వే ఎలా చేస్తే బాగుంటుంది.. పర్యవేక్షణ ఎలా ఉండాలి.. తదితర వివరాలపై ఒకటి రెండు రోజుల్లో నివేదిక రూపొందించాల్సిందిగా కమిషనర్ సూచించారు. * ఇంటింటి సర్వే నిర్వహణ కోసం జీహెచ్ఎంసీలో సిబ్బందితో పాటు, వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన 30 వేల నుంచి 40 వేల మంది ఉద్యోగులను వినియోగించనున్నారు. * 19వ తేదీ సర్వేకు ఒక రోజు ముందు అంటే 18వ తేదీన కూడా సంబంధిత సిబ్బంది తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి సర్వే పై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. * సర్వేలో కీలకమైన 9 అంశాలను సిద్ధంగా ఉంచుకోవలసిందిగా ప్రజలను కోరుతారు. * ప్రభుత్వం కోరిక మేరకు కేంద్రం సైన్యాన్ని పంపితే వినియోగించుకుంటారు. * జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే తీరును పర్యవేక్షించేందుకు 250 మంది నోడల్ అధికారులను నియమిస్తారు. * మరో 2వేల మందిని క్లస్టర్ ఇంచార్జిలుగా నియమిస్తారు. కలెక్టరేట్లో సమీక్ష రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న తలపెట్టిన సామాజిక ఆర్ధిక సర్వేను విజయవంతం చే సేందుకు హైదరాబాద్ జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఏజేసీ సంజీవయ్య వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వేలో పాల్గొనేందుకు అవసరమైన సిబ్బంది వివరాల సేకరణపై బుధవారం వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష జరిపారు. జిల్లా వ్యాప్తంగా 94 ప్రభుత్వ విభాగాలు ఉండగా, ఇప్పటి వరకు కేవలం 32 విభాగాల నుంచే సిబ్బంది వివరాలు అందాయని ఏజేసీ పేర్కొన్నారు. నగరంలో సర్వే కోసం 36 వేల మంది సిబ్బంది అవసరం కాగా, అన్ని ప్రభుత్వ విభాగాల్లో కలిపి 16వేల మందే ఉన్నట్లు పలువురు అధికారులు ఏజేసీ దృష్టికి తెచ్చారు. సీపీవో బలరాం మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలోని 108 డివిజన్లను 8600 ఎన్యుమరేటర్ బ్లాకులుగా విభజించామన్నారు. ఆయా బ్లాకుల్లో 9 లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నట్లు అంచనా వేశామన్నారు. ప్రొఫార్మాలో వివరాల నమోదుకు ముందు తగిన అధారాలను కూడా పరిశీలించాలని సీపీవో బలరాం సూచించారు. -
అక్షరాలా లక్షమంది!
- గ్రేటర్లో సామాజిక, ఆర్థిక సర్వే - సిద్ధమవుతున్న జీహెచ్ఎంసీ - వివిధ శాఖల సిబ్బంది సాయంతో ముందుకు.. 25 వేల మంది సైనికులు... భారీ సంఖ్యలో సాధారణ పోలీసులు.. అదే స్థాయిలో ట్రాఫిక్ పోలీసులు... మొత్తం దాదాపు లక్షమంది గ్రేటర్ నగరంలో రంగంలోకి దిగనున్నారు. ఏంటీ? నగరంలో మళ్లీ ఏదో అలజడి రేగే ప్రమాదం ఉందనో...లేకపోతే ఎవరో ప్రముఖుడు వస్తున్నారనో అనుకుంటున్నారా? అదేం కాదు. త్వరలో చేపట్టేబోయే సామాజిక, ఆర్థిక గణనలో వీరంతా పాలు పంచుకోనున్నారు. అదీ సంగతి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే నిర్వహించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దీనికోసం వివిధ విభాగా ల నుంచి సిబ్బందిని కేటాయిం చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ విస్తీర్ణం, సర్వేకు కావాల్సిన యంత్రాంగం కొరత తదితర అంశాల నేపథ్యంలో నగరంలో ఈ కార్యక్రమం సాగదనే సంశయాలు నెలకొన్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు వీలునుబట్టి అదే రోజున లేదా మరో తేదీన గ్రేటర్ నగరంలోనూ సామాజిక ఆర్థిక సర్వేకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిసింది. అందుకు అనుగుణంగా జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. వీలై తే ఒకే రోజున.. లేదా రెండు రోజుల పాటు సర్వే నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన యంత్రాంగం, సర్వేలో ఎవరెవరిని వినియోగించుకోవాలి? ఏయే అంశాలు పొందుపరచాలనే విషయమై జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. జీహెచ్ఎంసీతో పాటు నగరంలోని వివిధ శాఖల ప్రభుత్వోద్యోగులు, పోలీసులు, మిలటరీ బలగాలనూ వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ చెప్పారు. సర్వే విధానంపై కసరత్తు సుమారు 625 చ.కి.మీల మేర విస్తరించిన జీహెచ్ఎంసీ ప్రస్తుత జనాభా 90 లక్షలు దాటింది. దీన్ని పరిగణనలోకి తీసుకొని సుమారు కోటి మంది వివరాలను సేకరించేందుకు లక్ష మంది అవసరమవుతారని జీహెచ్ఎంసీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఒక్కొక్కరు సగటున 25 ఇళ్లలో సర్వే చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. నగరంలో చిరునామాలు గందరగోళంగా ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని, సర్వేకు ఎలాంటి విధానాన్ని పాటించాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల పోలింగ్ స్టేషన్ల వారీగా సర్వే జరపాలనే అభిప్రాయాలతో పాటు జనగణన సమయంలో పాటించిన ఎన్యూమరేషన్ బ్లాకుల వారీగా చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలూ పరిశీలనకు వచ్చాయి. ఎన్యూమరేషన్ బ్లాకుల వారీగా అయితే శాస్త్రీయంగా ఉంటుందని భావిస్తున్నారు. ఎన్యూమరేషన్ బ్లాకుల మ్యాపులు ఉన్నందున పని సులువవుతుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు జీహెచ్ఎంసీలోని ఆస్తి పన్ను విభాగం, అంగన్వాడీల సేవలూ వినియోగించుకోవాలనే ఆలోచన ఉన్నా...వాటి వల్ల తగిన ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నివిధాలా యోగ్యమైన విధానం కోసం ఒకటి రెండు రోజుల పాటు ఆలోచనలు సాగే అవకాశం ఉంది. పూర్తయితే స్టిక్కర్లు సర్వే పూర్తయిన ఇళ్లకు సంబంధించి ఈ విషయం తెలియజేసేలా స్టిక్కర్లు అతికించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ స్లిప్ల పంపిణీలోనూ జీహెచ్ఎంసీ అధికారులు ఈ విధానాన్ని పాటించారు. ఓటరు స్లిప్పులు అందజేసిన వారి ఇళ్లకు స్టిక్కర్లు అతికించారు. ఆ అనుభవంతో ఈ సారి మరింత పకడ్బందీగా స్టిక్కర్ల కార్యక్రమాన్ని అమలు చేయగలమని భావిస్తున్నారు. సర్వే విధుల్లో పాల్గొనే లక్ష మందిపై వివిధ స్థాయిల్లో సూపర్వైజర్లు, ఇన్ఛార్జులను నియమించనున్నారు. తమ పరిధిలో సర్వే తీరు ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కార్యక్రమం విజయవంతమయ్యేం దుకు చర్యలు చేపడతారు. -
2021 నాటికి ‘వర్కింగ్ ఏజ్’ జనాభా 64%
న్యూఢిల్లీ: దేశంలో పనిచేసే వయసులో ఉన్నవారి జనాభా నిష్పత్తి 2001లో ఉన్న 58 శాతం నుంచి 64 శాతానికిపైగా పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆర్థిక సర్వేలో అంచనా వేసింది. వీరిలో 20 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసువారు ఎక్కువగా ఉంటారని తెలిపింది. 2020 నాటికి 125 కోట్లకు చేరుకునే దేశ జనాభాలో ప్రజల సగటు వయసు 29 ఏళ్లుగా ఉంటుందని వివరించింది. 2011 నుంచి 2016 మధ్యలో 6.35 కోట్ల మంది యువతీయువకులు కొత్తగా ఈ జాబితాలో చేరతారని ప్రభుత్వం తెలిపింది. మానవ వనరుల అభివృద్ధికి ఈ జనాభా పెరుగుదలను అవకాశంగా మలచుకోవాలని సర్వే సూచించింది -
పన్నుల వడ్డింపునకే కేబుల్టీవీ డిజిటైజేషన్!
న్యూఢిల్లీ: వివిధ రకాలుగా పన్నులను వడ్డించేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో కేబుల్ టీవీ డిజిటైజేషన్ ప్రక్రియ అమలుకు సిద్ధమయ్యాయని ‘ఆర్థిక సర్వే’ పేర్కొంది. సర్వేలో వెల్లడైన ప్రకారం.. రాష్ట్రప్రభుత్వాల ప్రాథమిక సమాచారాన్ని బట్టి చూస్తే.. ఇదివరకే వినోదపు పన్ను వడ్డింపు రెండు నుంచి మూడు రెట్లు పెరిగింది. డిజిటైజేషన్ ద్వారా కేబుల్ టీవీ చందాదారులకు సంబంధించి పూర్తి పారదర్శకత వస్తుందని, తద్వారా పన్నులు కచ్చితంగా వసూలు అయ్యేందుకు వీలవుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేశాయి. డిజిటైజేషన్కు అవసరమైన సెట్టాప్ బాక్సుల తయారీవల్ల దేశీయ ఎలక్ట్రానిక్ పరిశ్రమకు మేలు చేకూర్చడంతోపాటు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలూ దొరుకుతాయి. టీవీ, రేడియో, సినిమా, ప్రింట్ మీడియా, యానిమేషన్ వంటి రంగాలు గత రెండేళ్లలో అనూహ్య వృద్ధి సాధించాయి. 2018 నాటికి ఈ రంగాలు రూ.1,78,600 కోట్ల వృద్ధిసాధిస్తాయి. దేశంలో ప్రస్తుతం 800 టీవీ చానెళ్లు, 245 ఎఫ్ఎం, 170 కమ్యూనిటీ రేడియోలు ఉన్నాయి -
హైదరాబాద్లో తగ్గిన ఇళ్ల ధరలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2007-2013 మధ్య కాలంలో 24 నగరాల్లో నివాస స్థలాలు, ఇళ్ల ధరలు పెరగగా.. రెండు నగరాల్లో మాత్రం తగ్గాయని ఆర్థిక సర్వే వెల్లడించింది. కొచ్చిలో 15 శాతం, హైదరాబాద్లో 7 శాతం నివాస స్థలాలు, ఇళ్ల ధరలు తగ్గాయని పేర్కొంది. చెన్నైలో అత్యధికంగా 230 శాతం, పూణేలో 123, ముంబైలో 122 శాతం పెరిగాయని పేర్కొంది. -
ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. గురువారం లోక్ సభలో ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది వృద్ధిరేటు 5 శాతానికి తక్కువగానే ఉందని ఆర్థిక సర్వే తెలిసింది. 2014-15లో జీడీపీ వృద్ధి 5.4నుంచి 5.9 శాతం పెరుగుతుందని అంచనా. ఏప్రిల్ నుంచి పారిశ్రామిక రంగంలో వృద్ది సాధించవచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. జీడీపీ వృద్ధిరేటు 5.4నుంచి 5.9వరకు పెరగవచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇక కీలక వడ్డీ రేట్లు తగ్గవచ్చని తెలుస్తోంది. ఆర్థిక సర్వే వివరాలు: *ఈ ఏడాది ఎల్నినో వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి *ఉపాధి హామీతో కార్మికుల కొరత ఏర్పడింది, ధరల పెరిగాయి *ద్రవ్యోల్బణం కొంత తగ్గింది కానీ.. ఇప్పటికీ భరించే స్థాయికంటే ఎక్కువగా ఉంది *ఈ ఏడాది ఆఖరుకు స్థూల ద్రవ్యోల్బణం తగ్గొచ్చు *ఇంటా బయటా తలెత్తిన పరిస్థితులతో...ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది *ఆర్థిక లోటు తగ్గాలంటే సబ్సిడీలను హేతుబద్ధం చేయాల్సిందే *ఆర్థిక లోటు, కరెంట్ అకౌంట్ లోటు తగ్గడం...దీర్ఘకాలంలో వృద్ధిరేటును పెంచుతుంది *చెల్లింపుల సమతుల్యం (బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్) మెరుగుపడింది *ఈ ఆర్థిక సంవత్సరంలో...జీడీపీ వృద్ధిరేటు అంచనాలను కష్టపడి అందుకోవచ్చు *వచ్చే రెండేళ్లలో ఆర్థిక లోటు తగ్గుతుంది *ఎరువులకు పోషకాల ఆధారిత సబ్సిడీ ఇవ్వాలి *మార్కెట్ల ధరలకు అనుగుణంగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచాలి *వివిధ దేశాల మధ్య తలెత్తుతున్న ఉద్రిక్త పరిస్థితులతో ఇండియాకు కష్టం, నష్టం *వ్యవసాయ ఉత్పత్తులకు ఉమ్మడి మార్కెట్ ఉండాలి *2013-14లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో 4.7 శాతం వృద్ధి