hospitalised
-
రెండు వాహనాలను ఢీకొన్న గ్యాస్ ట్యాంకర్.. ఏడుగురు మృతి
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ రెండు వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ట్యాంకర్ రాంగ్ రూట్లో రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదం బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. బద్నావర్-ఉజ్జయిని హైవేలోని బమన్సుత గ్రామ సమీపంలోని రోడ్డుపై గ్యాస్ ట్యాంకర్ రాంగ్ రూట్(Wrong route) నుండి వస్తూ, ఎదురుగా వస్తున్న ఒక కారు, జీపును బలంగా ఢీకొంది. ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని ధార్ ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో మృతిచెందారు.ప్రమాదం గురించి సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్రేన్ సహాయంతో వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఈ ఘోర ప్రమాదంలో గాయపడిన వారిని రత్లం జిల్లా ఆస్పత్రికి తరలించారు.ఇది కూడా చదవండి: Balochistan: జిన్నా చేసిన ద్రోహమే.. పాక్కు ముప్పుగా మారిందా? -
వికటించిన విందు భోజనం.. ఆస్పత్రికి 200 మంది
ఉదయపూర్: రాజస్థాన్లోని ఉదయపూర్లో కలుషిత ఆహారం కలకలం రేపింది. ఒక వివాహ వేడుకకు హాజరైన అతిథులు అక్కడ వడ్డించిన విందులో పాల్గొన్నాక అనారోగ్యానికి గురయ్యారు. ఆహారం తింటున్న సమయంలోనే కొందరు వాంతులు చేసుకుని, స్పృహ తప్పి పడిపోయారు.విందు భోజనం వికటించిన ఘటన ఉదయ్పూర్లో చర్చనీయాంశంగా మారింది. అనారోగ్యంపాలైనవారంతా ఆస్పత్రికి పరుగులు తీశారు. మరికొంతమంది బాధితులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితులను పరీక్షించేందుకు ఆస్పత్రిలో తగినంతమంది వైద్యులు లేకపోవడంతో ఇతర ఆస్పత్రుల నుండి వైద్యులను పిలిపించారు. బాధితులు కడుపు నొప్పితో తల్లడిల్లిపోతుండటాన్ని చూసిన వైద్యసిబ్బంది వెంటనే వారికి ప్రథమచికిత్స అందించారు. దీంతో పలువురి ఆరోగ్యం కాస్త కుదుటపడింది.సమాచారం అదుకున్న పోలీసులు ఆ పెళ్లిలో వండిన ఆహార నమూనాలను పరీక్ష కోసం ల్యాబ్కు పంపారు. బాధితుల్లో 15 ఏళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మొత్తం 200 మంది బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. ప్రత్యేక వార్డులో 57 మందికి చికిత్స అందిస్తున్నారు. కొందరు బాధితులకు మందులు ఇచ్చి ఇంటికి పంపించారు. నలుగురు చిన్నారులు చికిత్స పొందుతున్నవారిలో ఉన్నారు.ఉదయపూర్లోని ధన్ మండిలోని ఓస్వాల్ భవన్లో సామూహిక వివాహ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా 600 మందికి విందు ఏర్పాటు చేశారు. ఉదయపూర్తో పాటు వివిధ జిల్లాల నుండి కూడా జనం ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఆహారం తిన్న తర్వాత వందలమంది అస్వస్థతకు గురయ్యారు. కార్యక్రమ నిర్వాహకులు అంబులెన్స్కు ఫోన్ చేసి బాధితులను ఎంబీ ఆస్పత్రికి తరలించారు.ఇది కూడా చదవండి: ‘ప్రయాణికులకు విజ్ఞప్తి.. రైలు నంబరు 13228.. 72 గంటలు లేటుగా ..’ -
ఆస్పత్రిలో అద్వానీ
న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీ(97) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఢిల్లీ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. అబ్జర్వేషన్లో ఉన్నారని వైద్యులు ప్రకటించారు.ఇదిలా ఉంటే.. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అద్వానీ గతంలోనూ అస్వస్థతకు లోనయ్యారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొంది.. కొన్నిరోజులకే వెంటనే కోలుకున్నారు.BJP leader and Bharat Ratna LK Advani admitted to Apollo hospital in Delhi.— News Arena India (@NewsArenaIndia) December 14, 2024క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యాక అద్వానీ మీడియా ముందు కనిపించడం అరుదుగా మారింది. రామమందిర ప్రారంభానికి ఆహ్వానం అందినప్పటికీ.. వయసురిత్యా ఇబ్బందులతో ఆయన హాజరుకాలేకపోయారు. మొన్న.. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించి తర్వాత ప్రధాని మోదీ కూడా అద్వానీ నివాసానికి వెళ్లారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు మోదీ.. అద్వానీ ఆశీస్సులు తీసుకున్నారు.ఇదీ చదవండి: సంవిధాన్.. సంఘ్ కా విధాన్ కాదు -
వేడి వేడి కిచిడీ పడి ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలు..
ఉత్తరప్రదేశ్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మధురలోని ఆశ్రమం వద్ద ప్రసాదం కోసం క్యూలో వేచి ఉన్నఇద్దరు మహిళా భక్తులపై 'కిచిడీ' వడ్డించే వ్యక్తి జారిపడి వేడి ఆహారం వారిపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. క్యూలో నిలబడిన మరో ఎనిమిది మంది మహిళలకు కూడా పాత్రలోని వేడి వేడి కిచిడీ పడటంతో స్వల్ప గాయపడ్డారు. గాయపడిన భక్తులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారిని ప్రథమ చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశారు. కాగా ఇద్దరు భక్తులను పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళలుగా గుర్తించారు.మధురలోని బృందావన్ ప్రాంతంలోని గౌరీ గోపాల్ ఆశ్రమంలో శుక్రవారం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం భక్తులందరూ పరిక్రమ మార్గ్ సంత్ కాలనీలో ఉన్న గౌరీ గోపాల్ ఆశ్రమానికి చేరుకోగా.. బయట ప్రసాదం పంపిణీ చేస్తుండటాన్ని గమనించారు. బియ్యం, పప్పుతో చేసిన కిచిడీని తీసుకునేందుకు భక్తులు క్యూలో నిల్చున్నారు. ఈక్రమంలో కిచిడీని పాత్రను తీసుకొస్తున్న వ్యక్తి జారిపడిపోయాడు. అతని చేతిలోని వేడి ఆహారం పక్కన నిలబడి ఉన్న మహిళలపై పడినట్లు జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వందనా అగర్వాల్ చెప్పారు. ఈ సంఘటన భక్తులను భయాందోళనకు గురిచేసిందని, గాయపడిన 10 మంది మహిళలను ఆసుపత్రికి తరలించినట్లు ఆమె తెలిపారు. -
ఆస్పత్రిలో ఊర్వశి రౌతేలా.. లక్ష గులాబీలు పంపిన అభిమానులు (ఫోటోలు)
-
Uttar Pradesh: కలుషిత ఆహారం తిన్న 60 మందికి అస్వస్థత
మధురలో శ్రీకృష్ణాష్టమి వేళ విషాదం చోటుచేసుకుంది. పండుగ నాడు ఉదయమంతా ఉపవాసం ఉండి, సాయంత్రం వేళ బక్వీట్(గోధుమ తరహా ఆహారధాన్యం) పిండితో చేసిన పకోడీలు తిన్న 60 మందికిపైగా జనం అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రస్తుతం వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటన మధురలోని ఫరా ప్రాంతంలో చోటుచేసుకుంది. బక్వీట్ పకోడీలు తిన్న కొద్దిసేపటికే చాలామంది కడుపునొప్పి, వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. స్థానికులు వీరిని వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ఆరోగ్యం మరింతగా క్షీణించిన ఆరుగురిని ఆగ్రాలోని ఎస్ఎన్ ఆస్పత్రికి తరలించారు. అలాగే 15 మంది బాధితులను మధుర జిల్లా ఆస్పత్రికి, 11 మందిని బృందావన్లోని ఆస్పత్రికి తరలించారు.కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్టాఫ్ నర్సు జస్వంత్ యాదవ్ మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ కారణంగా 60 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారన్నారు. వీరింతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటన అనంతరం జిల్లా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ అధికారులు బక్వీట్ పిండి విక్రయించిన ఇద్దరు దుకాణదారులపై కేసు నమోదు చేశారు. -
ప్రముఖ గాయని పి సుశీలకు అస్వస్థత
-
'వాటర్ పాయిజనింగ్'తో ఆస్పత్రిపాలైన వ్యక్తి! ఎందువల్ల వస్తుందంటే..?
ఫుడ్ పాయిజనింగ్లా ఏంటీ వాటర్ పాయిజనింగ్. నీళ్లు కూడా పాయిజన్గా అవుతాయా..? లేక కలుషిత నీటి వల్ల ఇలా జరుగుతుందా అంటే..?. అవేమీ కాదు. తాగాల్సిన నీటికంటే అధికంగా తాగితే ఈ పరిస్థితికి గురవ్వుతామని చెబుతున్నారు నిపుణుల. దీని వల్ల ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. అసలేంటి వాటర్ పాయిజనింగ్? ఎలా ప్రాణాంతకమో? సవివరంగా చూద్దాం.టెక్సాస్కి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు జూన్లో తీవ్ర వేసవి వేడికి గురయ్యాడు. చెప్పాలంటే తీవ్ర వేడిమికి తాళ్లలేక అధికంగా నీటిని తాగాడు. సుమారు 11 లీటర్ల మేర నీళ్లు ఆత్రంగా తాగేశాడు. అంతే కాసేపటికి కారం, అలసట, ఛాతీ నొప్పిని వంటి సమస్యలతో స్ప్రుహ కోల్పోయాడు. వెంటనే అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడు నీటి పాయిజన్కి గురయ్యినట్లు నిర్థారించారు. అసలేంటి నీటి పాయిజన్ అంటే..వేడి, తేమతో కూడిన పరిస్థితుల్లో నివశించే ప్రజలు అధిక దాహానికి గురవ్వుతారు. త్వరగా నీటిని తాగి డీహైడ్రేషన్ నష్టాన్ని భర్తీ చేయాల్సిఉంటుంది. ఇలా తాగేటప్పుడూ అధికంగా తాగితే నీటిపాయిజన్కి గురవ్వుతారు. వెంటనే ఇది కిడ్నీలు, ఎలక్ట్రోలైట్లు, సోడియంపై ప్రభావం చూపుతుంది. ఇక్కడ నీటిని అధికంగా తీసుకున్న వెంటనే ఎలక్ట్రోలైట్లు, ఉప్పు కరిగిపోవడం జరుగుతుంది. దీంతో ఆ అధిక నీటిని మూత్రపిండాలు బయటకు పంపలేక పాయిజన్గా మారిపోవడం జరుగుతుంది.ఇది ఉబ్బరం, పాలీయూరియా, హైపోనాట్రేమియా (సీరం సోడియం గాఢత 135 mEq/L కంటే తక్కువ), వాపు, బలహీనమైన జీవక్రియకు దారితీస్తుంది. మూత్రపిండాలు ఒక సమయంలో పరిమిత నీటిని మాత్రమే నిర్వహించగలవు. తక్కువ వ్యవధిలో అధిక మొత్తంలో ద్రవాలను నిర్వహించడం తీవ్రమైన పరిణామలకు దారితీసి.. కణాల వాపు, గుండెపోటు వంటి లక్షణాలు ఎదురవ్వుతాయి. లక్షణాలు..కండరాల బలహీనత లేదా తిమ్మిరిరక్తపోటు పెరుగుదలద్వంద్వ దృష్టిగందరగోళంఇంద్రియ సమాచారాన్ని గుర్తించలేకపోవడంశ్వాస తీసుకోవడంలో ఇబ్బందిమానసిక రుగ్మతలో బాధపడుతున్నవారు, క్రీడాకారులు, సైనిక శిక్షణ, అధిక శ్రమతో కూడిన పనులు చేసేవారు అధికంగా నీటిని తాగకూడదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) ప్రకారం అమెరికాలో ప్రతి ఏడాది మూడు నుంచి ఆరు మిలియన్ల మంది ఈ వాటర్ పాయిజనింగ్ బారినపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఎంత నీరు తాగితే మంచిదంటే..ఒక వ్యక్తి రోజూలో ఎంత నీరు తాగొచ్చు అని చెప్పేందుకు ఎలాంటి మార్గదర్శకాలు లేవు. అయితే ఆరోగ్యానికి అవసరమైనంత మేర నీటిని తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. హైపోనట్రేమియాకి గురై, మూత్రపిండాలపై ప్రభావం పడేలా నీటిని అధికంగా తీసుకోకూడదు. విపరీతమైన వేడి వాతావరణంలో శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత కాపాడుకునేలా రోజుకి సుమారు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగితే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: రోజూ ఎనిమిది గ్లాసుల పాలు తాగేవాడినంటున్న బాబీ డియోల్.. దీని వల్ల వచ్చే సమస్యలివే..!) -
ఎమ్మెల్సీ కవిత డిశ్చార్జి, మళ్లీ తీహార్ జైలుకు..
ఢిల్లీ, సాక్షి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఆమెను అధికారులు తిరిగి తీహార్ జైలుకు తీసుకెళ్లారు. గత రెండు రోజులుగా జ్వరంతో ఆమె బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. మంగళవారం ఉదయం ఆమె హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. నీరసంతో కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో అధికారులు ఆమెను దీన్దయాళ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించి.. డిశ్చార్జి చేశారు. లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఆమెను అరెస్ట్ చేయగా.. వంద రోజులకు పైగా ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఆమె కస్టడీని కోర్టు పొడిగిస్తూ వెళ్తుండగా.. మరోవైపు ఆమె బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. -
ఆశ్రమంలో ఇద్దరు చిన్నారులు మృతి.. 10 మంది పరిస్థితి విషమం
మధ్యప్రదేశ్లోని మహ్లార్గంజ్లో గల యుగపురుష్ ధామ్(ఆశ్రమం)లో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా వీరు మృతి చెందారని తెలుస్తోంది. ఆశ్రమానికి చెందిన మరో 10 మంది చిన్నారులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని సమాచారం. యుగపురుష్ ధామ్ ఆశ్రమంలో ఉంటున్న కరణ్, ఆకాశ్ మృతి చెందారు.12 ఏళ్ల కరణ్ దేవాస్ జిల్లా సోన్కచ్చా నివాసి. 15 నెలల క్రితం అతనిని అధికారులు ఆశ్రమంలో చేర్పించారు. అలాగే ఏడేళ్ల ఆకాశ్ను మూడు నెలల క్రితం ఆశ్రమంలో చేర్పించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం కరణ్ అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఇదేవిధంగా మంగళవారం ఉదయం ఆకాశ్ మృతి చెందాడు.ఆశ్రమ పర్యవేక్షకులు తెలిపిన వివరాల ప్రకారం ఆశ్రమంలోని కృష్ణ అనే బాలుడు తొలుత ఇన్ఫెక్షన్కు గురయ్యాడు. ఆ తరువాత ఆ బాలుడు అనారోగ్యం నుంచి కోలుకున్నాడు. అయితే ఆ తరువాత ఆశ్రమంలోని మిగిలిన చిన్నారులు కూడా అనారోగ్యానికి గురయ్యాయి. మధ్యప్రదేశ్కు చెందిన పలువురు చిన్నారులు ఈ ఆశ్రమానికి వచ్చి చదువులు సాగిస్తుంటారు. 2006లో 78 దివ్యాంగ చిన్నారులతో ఈ ఆశ్రమం ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ఆశ్రమంలో 2017 మంది చిన్నారులు ఉన్నారు.కలెక్టర్ ఆశీష్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ఆశ్రమానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వీరిలో ఒక బాలుడు డయారేయాతో, మరో బాలుడు ఫిట్స్తో మృతి చెందాడు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. -
నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
బన్స్కా బిస్ట్రికా: దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్లొవాకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో(59) పరిస్థితి విషమమే అయినప్పటికీ నిలకడగా ఉంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న ఆయనతో గురువారం మాట్లాడినట్లు ఎన్నికైన అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినీ చెప్పారు. ఫికో ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రధాని ఫిగోకు ఐదు గంటలపాటు ఆపరేషన్ చేసినట్లు బన్స్కా బిస్ట్రికాలోని ఎఫ్డీ రూజ్వెల్ట్ హాస్పిటల్ డైరెక్టర్ మిరియమ్ లపునికోవా గురువారం చెప్పారు. విషమమే అయినప్పటికీ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఇలా ఉండగా, ప్రధాని ఫికోపై కాల్పులకు పాల్పడిన వ్యక్తి(71) ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేనట్లుగా తేలిందని ఇంటీరియర్ మంత్రి మటుస్ సుటాజ్ ఎస్టోక్ తెలిపారు. ప్రధానిపై హత్యాయత్నం రాజకీయ ప్రేరేపితమని ఆయన అన్నారు. ఫికో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు అతడు తెలిపాడన్నారు. కవి కూడా అయిన నిందితుడు గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అతడి పేరు, ఇతర వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామన్నారు. బుధవారం హండ్లోవా పట్టణంలో ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఫికోపై దుండగుడు తుపాకీతో పలుమార్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్కు ఎన్నికలు జరగనున్న వేళ చోటుచేసుకున్న ఈ ఘటన యూరప్ వ్యాప్తంగా కలకలం రేపింది. తొలుత ఉక్రెయిన్కు అనుకూలంగా వ్యవహరించిన స్లొవాకియా అనంతరం రష్యా అనుకూలంగా, అమెరికాకు వ్యతిరేకంగా పలు చర్యలు తీసుకుంది. ఫికో రాజకీయ ప్రత్యర్థి, మరికొద్ది రోజుల్లో పదవిని వీడనున్న అధ్యక్షురాలు జుజానా కపుటోవా గురువారం రాజధాని బ్రాటిస్లావాలో మీడియాతో మాట్లాడు తూ.. ‘సమాజంలో పెరుగుతున్న విద్వేషాలకు నిదర్శనం ఈ ఘటన. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి దేశంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తాం’అని తెలిపారు. ఈ సమయంలో ప్రతి పౌరుడూ బాధ్యతగా మెలగాలని ఆమె కోరారు. -
చికెన్ షావర్మా తిని.. 12 మందికి అస్వస్థత
ముంబై: చికెన్ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ జరిగి రెండు ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది.బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్ ప్రాంతంలోని సంతోష్ నగర్లో శాటిలైట్ టవర్ వద్ద చికెన్ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే వీరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. -
సద్గురు జగ్గీ వాసుదేవ్కు బ్రెయిన్ సర్జరీ
న్యూఢిల్లీ: ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ అనూహ్యంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా తరచుగా వాంతి చేసుకుంటోన్న సద్గురుకు స్కానింగ్ నిర్వహించగా.. బ్రెయిన్లో కొంత తేడాను గమనించారు వైద్యులు. ఈ నెల 17న ఢిల్లీ అపొలో ఆస్పత్రికి తరలించగా.. ఆయనకు బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా చేసినట్టు తెలిసింది. సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రస్తుత వయస్సు 66 సంవత్సరాలు. మార్చి 17న ఢిల్లీ అపొలో ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా.. బ్రెయిన్లో స్వెల్లింగ్ వచ్చినట్టు గుర్తించారు. అలాగే కొంత మేర బ్లీడింగ్ను గుర్తించారు. ఢిల్లీ అపొలో ఆస్పత్రిలో డాక్టర్ వినీత్ సురీ నేతృత్వంలోని బృందం ఎమ్మారై పరీక్షలు నిర్వహించగా బ్లీడింగ్ ఎక్కువగా కనిపించినట్టు తెలిసింది. పరిస్థితి విషమించకుండా ఉండాలంటే తక్షణం శస్త్రచికిత్స అవసరమని గుర్తించిన డాక్టర్లు.. వెంటనే ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిసింది. వైద్యబృందంలో డాక్టర్ వినీత్ సూరితో పాటు డాక్టర్ ప్రణవ్ కుమార్, డాక్టర్ సుధీర్ త్యాగి, డాక్టర్ ఎస్ ఛటర్జీ ఉన్నారు. ఆపరేషన్ తర్వాత సద్గురుకు సంబంధించిన అన్ని హెల్త్ పారామీటర్లు మెరుగవుతున్నట్టు తెలిసింది. దీనిపై ఢిల్లీ అపొలో నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. View this post on Instagram A post shared by Sadhguru (@sadhguru) కర్ణాటకలోని మైసూర్లో ఓ తెలుగు కుటుంబంలో పుట్టిన జగ్గీ వాసుదేవ్ నలుగురి సంతానంలో ఆఖరివాడు. సద్గురు తండ్రి రైల్వేశాఖలో కంటి డాక్టర్. 11ఏళ్లప్పుడు యోగా నేర్చుకున్న సద్గురు స్కూలు మైసూర్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీషులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మోటార్ డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టపడే సద్గురు.. పాతికేళ్ల వయస్సులో మోటారు సైకిల్పై చాముండి కొండ పైకి వెళ్ళి ఓ ఆధ్యాత్మిక అనుభవం కలిగిందని చెబుతారు. ఆ తర్వాత ధ్యానమార్గం పట్టి ఈషా ఫౌండేషన్ ప్రారంభించారు. ఈ సంస్థ ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ ఐక్యరాజ్యసమితి ఆర్ధిక, సామాజిక సంస్థకి ప్రత్యేక సలహాదారుగా నియమించబడింది. కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో సద్గురుకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. Neurologist Dr. Vinit Suri of @HospitalsApollo gives an update about Sadhguru’s recent Brain Surgery. A few days ago, Sadhguru underwent brain surgery after life-threatening bleeding in the brain. Sadhguru is recovering very well, and the team of doctors who performed the… pic.twitter.com/UpwfPtAN7p — Isha Foundation (@ishafoundation) March 20, 2024 1983లో మైసూరులో మొదటి యోగా క్లాస్ను నిర్వహించాడు. 1989 లో కోయంబత్తూర్ లో ఈశా యోగ సెంటర్ ఏర్పాటు చేశాడు. కోయంబత్తూరు నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వెళ్ళంగిరి పర్వత పాదాల చెంత పదమూడు ఎకరాల భూమిలో ఈ సెంటర్ నడుస్తోంది. 1999లో సద్గురు ఆశ్రమ ప్రాంగణంలో ధ్యానలింగం ఏర్పాటు చేశారు. ఏ ప్రత్యేక మతానికీ, విశ్వాసానికీ చెందని ధ్యానలింగ యోగాలయం ధ్యానానికి మాత్రమే నిర్దేశించామని, కాంక్రీటు, స్టీలు ఉపయోగించకుండా ఇటుకరాళ్ళూ, సున్నంలతో 76 అడుగుల గోపురం, గర్భగుడిని నిర్మించామని సద్గురు చెబుతారు. హిందూ, ఇస్లాం, క్రైస్తవ, జైన్, టావో, జొరాష్ట్రియన్, జుడాయిజం, షింటో, బౌధ్ధ మతాల గుర్తులతో, అన్ని మతాల ఏకత్వాన్ని చాటుతూ ఓ సర్వధర్మ స్థంభాన్ని ఏర్పాటు చేశారు -
ప్రతిభా పాటిల్కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న పాటిల్ మహారాష్ట్రలోని పూణెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. 89 ఏళ్ల మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బుధవారం భారతి ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సీనియర్ వైద్యులొకరు మీడియాతో మాట్లాడుతూ ‘మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బుధవారం రాత్రి ఆసుపత్రిలో చేరారు. ఆమె జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్స కొనసాగుతోంది. వైద్యులు ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు’ అని తెలిపారు. ప్రతిభా పాటిల్ భారతదేశానికి మొదటి మహిళా రాష్ట్రపతి. ఆమె 2007 నుంచి 2012 వరకు అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నారు. -
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్కు అస్వస్థత
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు వీ హనుమంతరావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని అంబర్పేట ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఆయన ప్రస్తుత ఆరోగ్యంపై సమాచారం అందాల్సి ఉంది. -
అమెరికాలో ఫ్లూతో 15 వేలమంది మృతి!
అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో గల సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, ఈ సీజన్లో ఇప్పటివరకు అమెరికాలో సుమారు రెండు లక్షల 50 వేల మంది ఫ్లూ కారణంగా ఆసుపత్రి పాలయ్యారు 15 వేల మరణాలు సంభవించాయి. ఫిబ్రవరిలో ఇన్ఫ్లుయెంజా బారినపడిన చిన్నారుల మరణాలు నమోదయ్యాయి. ఈ సీజన్లో మొత్తం 74 మంది చిన్నారులు ఇన్ఫ్లుయెంజాతో ఆసుపత్రిలో చేరారు. గడిచిన వారంలో 11 వేలకు పైగా భాధితులు ఆసుపత్రిలో చేరినట్లు పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇన్ఫ్లుఎంజా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఆరు నెలలలోపు చిన్నారులకు వార్షిక ఫ్లూ వ్యాక్సిన్ వేయించాలని అధికారులు తెలిపారు. -
నటుడు మిథున్ చక్రవర్తిని పరామర్శించిన బీజేపీ నేత
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి(73) తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూ కోల్కతాలోని ఒక ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం మిథున్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆయనను వీడియోలో చూసిన అభిమానులు భగవంతునికి ధన్యవాదాలు చెబుతున్నారు. #WATCH | West Bengal BJP chief Sukanta Majumdar met veteran actor and BJP leader Mithun Chakraborty at a private hospital in Kolkata pic.twitter.com/4FRNoTuwKb — ANI (@ANI) February 11, 2024 కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరిన మిథున్ చక్రవర్తిని బీజేపీ నేత సుకాంత్ మజుందార్ పరామర్శించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిథున్ చక్రవర్తికి చెందిన వీడియోను ఏఎన్ఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో మిథున్ చక్రవర్తి హాస్పిటల్ బెడ్పై పడుకుని, వైద్యులతో మాట్లాడటాన్ని చూడవచ్చు. మిథున్ చక్రవర్తి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు ఈ వీడియోలో స్పష్టమవుతోంది. భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కూడా మిథున్ చక్రవర్తిని కలుసుకుని పరామర్శించారు. #WATCH | West Bengal: Former Indian cricketer Sourav Ganguly arrives at a private hospital in Kolkata to meet his mother, who is admitted here. pic.twitter.com/c4goODkOX1 — ANI (@ANI) February 11, 2024 -
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి!
కర్ణాటకలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దక్షిణ కర్ణాటకలోని బెల్తంగడిలోని కుక్కడి గ్రామంలో గల ఒక బాణసంచా తయారీ కర్మాగారంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రత అధికంగా ఉంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటచేసుకుంది. ఈ పేలుడు శబ్దం చాలా మైళ్ల దూరం వరకూ వినిపించింది. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ బాణసంచా ఫ్యాక్టరీ ఉంది. పేలుడు శబ్దం నాలుగు కిలోమీటర్ల దూరం వరకూ వినిపించింది. సమీపప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను వర్గీస్ (62), స్వామి (60), చేతన్ (24)గా గుర్తించినట్లు దక్షిణ కన్నడ పోలీసు సూపరింటెండెంట్ సీబీ రిషియంత్ తెలిపారు. ఈ ఉదంతంపై విచారణ జరిపి, పేలుడుకు గల కారణాలను తెలుసుకుంటున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
జాంబియాలో కలరా కల్లోలం.. పాఠశాలల మూసివేత!
దక్షిణాఫ్రికా దేశమైన జాంబియా కలరా వ్యాధితో పోరాడుతోంది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు కలరా కారణంగా జాంబియాలో 400 మందికి పైగా బాధితులు మృతిచెందారు. 10 వేలమందికి మందికి పైగా జనం ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాజధాని లుసాకాలోని అతి పెద్ద ఫుట్బాల్ స్టేడియంను కలరా చికిత్స కేంద్రంగా మార్చారు. జాంబియన్ ప్రభుత్వం సామూహిక టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. అలాగే దేశంలోని పలు కలరా పీడిత ప్రాంతాలలో రోజుకు 2.4 మిలియన్ లీటర్ల స్వచ్ఛమైన నీటిని ప్రభుత్వం అందజేస్తోంది. ‘జాంబియా పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్’ తెలిపిన వివరాల ప్రకారం జాంబియాలో కలరా వ్యాప్తి గత ఏడాది అక్టోబర్లో ప్రారంభమైంది. ఆ నెలలో కలరా కారణంగా 412 మంది మృతిచెందారు. అలాగే 10,413 కలరా కేసులు నమోదయ్యాయి. దేశంలోని 10 పది రాష్ట్రాలలో తొమ్మిది రాష్ట్రాలు కలరా బారిన పడ్డాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు రెండు కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో రోజుకు 400కు పైగా కలరా కేసులు నమోదవుతున్నాయి. కలరా అనేది నీటి ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది అపరిశుభ్రత కారణంగా వ్యాపిస్తుంది. కలుషిత నీరు లేదా ఆహారం తీసుకోవడం వల్ల కలరా సోకుతుంది. గత ఏడాది ఆఫ్రికాలోని మరో దేశమైన జింబాబ్వేలో కూడా కలరా వ్యాపించింది. ఇక్కడ కూడా స్వచ్ఛమైన తాగునీటి కొరత ఉంది. కలరా వ్యాపిస్తున్న మణికాలాండ్, మాస్వింగో రాష్ట్రాల్లో అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్య 50కి పరిమితం చేశారు. -
ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్: చచ్చిన ఎలుక ఎక్స్ట్రా, కట్ చేస్తే..!
వండుకునే ఓపిక లేకనో, కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడో లేదా కొత్తగా తినాలనే ఆశతోనే రెస్టారెంట్లనుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని లాగించేస్తున్నారా? అయితే ఇకపై ఇలా చేయాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సిందే. అంతేకాదు మనం తినబోతున్న ఆహారం శుభ్రంగానే ఉందా లేదా అనేది చెక్ చేసుకోకపోతే అంతే సంగతులు. ఎందుకంటే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేవారికి షాకిచ్చే సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన ఒక వ్యక్తి ముంబై రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసిన ఆహారాన్ని హ్యాపీగా ఆరంగించేశాడు. కానీ ఆతరువాతే అసలు తిప్పలు మొదలయ్యాయి. ఫలితంగా ఒకటి రెండు కాదు 75 గంటల పాటు ఆసుపత్రి పాలయ్యాడు. I Rajeev shukla (pure vegetarian) from prayagraj visited Mumbai, on 8th Jan'24 night ordered veg meal box from BARBEQUE NATION, worli outlet that a contained dead mouse, hospitalised for 75 plus hours. complaint has not been lodged at nagpada police station yet. Please help pic.twitter.com/Kup5fTy1Ln — rajeev shukla (@shukraj) January 14, 2024 రాజీవ్ శుక్లా తన బాధాకరనమైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీని ప్రకారం జనవరి 8న ముంబై వెళ్లాడు. ఫుడ్ చైన్ బార్బెక్యూ నేషన్కు చెందిన వర్లీ అవుట్లెట్ నుండి వెజ్ మీల్ ఆర్డర్ చేశాడు. కొంత ఆహారం తిన్న తరువాత అందులో చనిపోయిన ఎలుకను చూసి షాకయ్యాడు. ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. దీనికి సంబంధించి ఫుడ్ ఆర్డర్ రసీదు, డెలివరీ ప్యాకేజీ, ఫుడ్ ఫోటోతోపాటు తను ఆసుపత్రిలో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. అలాగే తానింకా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కూడా ట్వీట్ చేశాడు. స్పష్టం చేశాడు.దీంతో ఇది నెట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తమ తమ అనుభవాలను పంచుకుంటూ ట్వీపుల్ స్పందించారు. బార్బెక్యూనేషన్, ఇతర అధికారుల హ్యాండిల్లను ట్యాగ్ చేశారు. దీంతో జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ బార్బెక్యూ నేషన్ స్పందించింది. సమస్యను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామంటూ రిప్లై ఇచ్చింది. -
దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమం!
కరాచీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. తీవ్ర ఆనారోగ్యంతో ఉన్న దావూద్ను సోమవారం పాకిస్తాన్లోని కరాచీలో ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారట. అయితే అతనిపై విష ప్రయోగం జరిగినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి స్పష్టత లేనట్లుగా తెలుస్తోంది. అతను మరో రెండు రోజుల పాటు ఆసత్రిలో ఉండి చికిత్స తీసుకొనున్నట్లు సమాచారం. పాక్ మీడియా కథనాల ప్రకారం.. ఆస్పత్రి లోపల దావూద్ ఇబ్రహీం కట్టుదిట్టమైన భద్రత నడుమ చికిత్స తీసుకుంటున్నాడు. ఆస్పత్రిలోని ఒక ఫ్లోర్ మొత్తం దావూద్ ఒక్కడే పేషెంట్గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అతన్ని చూడటానికి కుటుంబసభ్యులు, ఆస్పత్రి ఉన్నతాధికారులకు మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మాఫియా డాన్ గురించి ఈ ఏడాది జనవరిలో అతని సోదరి ఆసక్తికర విషయాలు చెప్పింది. రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచి దావూద్ కరాచీలోనే ఉంటున్నట్లు ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) విచారణలో ఆమె తెలిపింది. మరోవైపు.. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులు.. పాకిస్థాన్లోని కరాచీ విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించినట్లు ఎన్ఐఏ ఛార్జిషీట్లో పేర్కొంది. చదవండి: ‘మధ్యధరా’లో పడవ మునిగి 60 మంది మృతి -
పెన్షన్ సొమ్ము కోసం భర్తకు నిప్పు!
ప్రపంచంలో అంతకంతకూ అడుగంటుతున్న మానవత్వానికి ఉదాహరణగా నిలిచే ఉదంతం మహారాష్ట్రలోని థానేలో వెలుగు చూసింది. స్థానిక కళ్యాణ్ నగర్లో ఓ భార్య.. భర్త పెన్షన్ కోసం అతనికి నిప్పంటించి, హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఈ ఘటనలో భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీడియాకు ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. మరో ఇద్దరి సహకారంతో ఈ మహిళ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. 61 ఏళ్ల భర్తకు నిప్పంటించి చంపేందుకు ప్రయత్నించిన నేరంపై సదరు మహిళపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితుని కుమార్తె స్నేహితులైన ఇద్దరు యువకులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. కాగా ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. అతని భార్య.. అతనికి నెలనెలా వచ్చే పెన్షన్ విషయమై గొడవ పడేది. అలాగే ఆ ఇద్దరు యువకులు తమ ఇంటికి రావడంపై అతను అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. తన ప్రాణాలకు ఆ యువకుల వలన ముప్పు ఉందని బాధితుడు గతంలో ఆ యువకులిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా బాధితుడు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. అతని భార్యతో పాటు ఆ ఇద్దరు యువకులు అతనికి నిప్పంటించారు. దీనిని గమనించిన పొరుగింటివారు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: ‘ఇదేందిది... హల్దీ ఫంక్షన్లో ఇంత అవసరమా?’ -
విజయకాంత్ ఆరోగ్యంపై వివరణ ఇచ్చిన తమిళనాడు మంత్రి
డీఎండీకే అధినేత, కోలీవుడ్ సినీ నటుడు విజయకాంత్ తీవ్రమైన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణియన్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడ్డ విజయకాంత్ ఆపరేషన్ చేయించుకున్నారు. మళ్లీ అనారోగ్య సమస్యలు రావడం వల్ల ఆయన తిరిగి చికిత్స పొందుతున్నారు. విజయకాంత్కు వైద్యం అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడిన మంత్రి ఈమేరకు చెప్పారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న విజయకాంత్ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి చెప్పడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. విజయకాంత్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితిపై వదంతులు వచ్చాయని డీఎండీకే పార్టీ నేతలు చెప్పారు. తాజాగా మంత్రి సుబ్రహ్మణియన్ కూడా ఇదే విషయాన్ని అధికారికంగా తెలిపారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. రెగ్యులర్గా ఆయనకు అందించే చికిత్సలో భాగంగానే ప్రస్తుతం కూడా చికిత్స కొనసాగుతున్నదని , ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది. రెండు మూడు రోజులలో విజయకాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని పేర్కొంది. -
ఆస్పత్రిలో చేరిన విజయకాంత్.. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫ్యాన్స్
డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్ ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనకు చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలోచికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారంతో డీఎండీకే వర్గాల్లో ఆందోళన నెలకొంది. డీఎండీకే అధినేత విజయకాంత్ సినీ, రాజకీయ పయనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ బాధ్యతలను కోశాధికారి పదవితో ఆయన సతీమణి ప్రేమలత విజయకాంత్ భుజాన వేసుకుని ముందుకెళ్తున్నారు. ఈ పరిస్థితులలో విజయకాంత్ను చూడలేక పోతున్నామే అన్న ఆవేదనలో ఉన్న కేడర్కు ఇటీవల ఆయన దర్శనం కల్పించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన తన జన్మదిన వేడుకకు విజయకాంత్ హాజరయ్యారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసిన కేడర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత నుంచి ఇంట్లోనే విజయకాంత్ ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు ఆరోగ్య పరంగా సమస్యలు తలెత్తడంతో హుటాహుటిన నగరంలోని ఓ ఆస్పత్రికి ఆదివారం తరలించారు. ఆయనకు ఆస్పత్రిలో పరిశోధనలు, చికిత్సలు కొనసాగుతున్నాయి. విజయకాంత్ ఆస్పత్రిలో చేరిన సమాచారంతో డీఎండీకే వర్గాలలో ఆందోళన నెలకొంది. అదే సమయంలో వదంతులు, ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇందుకు ముగింపు పలికే విధంగా డీఎండీకే కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. విజయకాంత్కు సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్పించినట్టు వివరించారు. ఆయన రెండు రోజులలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేడర్కు భరోసా ఇచ్చారు. -
‘గ్రేట్ స్మోగ్ ఆఫ్ లండన్’ అంటే ఏమిటి? నాలుగు రోజుల్లో వేలమంది ఎలా మృతి చెందారు?
సరిగ్గా 70 ఏళ్ల క్రితం లండన్లో ఆ రోజు పగటిపూట హఠాత్తుగా చీకటి కమ్ముకుంది. గాలి కలుషితమై నల్లగా మారి, అంతటా వ్యాపించడంతో వేల మంది ఊపిరాడక మృతి చెందారు. నేటికీ ఈ సంఘటన ఇంగ్లండ్నే కాదు యావత్ ప్రపంచాన్ని భయపెడుతుంది. ఈ ఘటనను ‘గ్రేట్ స్మోగ్ ఆఫ్ లండన్’ అని పిలుస్తారు. విపరీతమైన కాలుష్యం కారణంగా నాలుగు రోజుల్లోనే 12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఏర్పడిన పొగమంచు వేలాది మంది ప్రాణాలను బలిగొంది. ఈ భయంకరమైన ‘చీకటి’ 1952 డిసెంబర్ తొలిరోజుల్లో బ్రిటిష్ రాజధాని లండన్లో విధ్వంసం సృష్టించింది. ఇళ్లను వెచ్చగా ఉంచేందుకు, పారిశ్రామిక వినియోగానికి బొగ్గును విపరీతంగా ఉపయోగించడం కారణంగా ఈ నల్లని పొగమంచు ఏర్పడింది. ఈ పొగమంచు 1952 డిసెంబర్ 5న మొదలై, తదుపరి ఐదు రోజులు అంటే డిసెంబర్ 9 వరకు కొనసాగింది. లండన్వాసులు అప్పటికే దశాబ్దాలుగా పొగమంచుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఈ ఘటన వారిని షాక్కు గురిచేసింది. ఈ పొగమంచు కారణంగా లక్ష మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. కాలుష్యం కారణంగా ఇక్కడి ప్రజల నాడీ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చింది. శ్వాసకోశ వ్యాధులు తలెత్తాయి. లండన్లో వాయు కాలుష్యం 13వ శతాబ్దం నుండే మొదలైంది. దీనిని గమనించి 1301లో ఎడ్వర్డ్- I లండన్లో బొగ్గును కాల్చడాన్ని నిషేధించారు. 16వ శతాబ్దం నాటికి అక్కడి గాలి అత్యంత విషపూరితంగా మారింది. గ్రేట్ స్మోగ్ అనేది బ్రిటీష్ చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా మిగిలిపోతుంది. 1956లో బ్రిటన్లో తొలిసారిగా క్లీన్ ఎయిర్ యాక్ట్ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి వాతావరణ పరిస్థితుల్లో మెరుగుదల కనిపించింది. ఇది కూడా చదవండి: ఆ నిచ్చెనంటే ఎందుకు భయం? జెరూసలేంలో 273 ఏళ్లుగా ఏం జరుగుతోంది? -
గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(65) సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. అయితే వైద్య పరీక్షల అనంతరం.. గవర్నర్కు అపెండిసైటిస్గా వైద్యులు ధృవీకరించారు. గవర్నర్ అస్వస్థత గురించి రాజ్భవన్ అధికారుల నుంచి సమాచారం అందుకున్న వైద్యులు తొలుత విజయవాడకే వచ్చి గవర్నర్కు పరీక్షలు చేశారు. ఆస్పత్రిలో చేరాలని ఆయనకు సూచించారు. వైద్య నిపుణుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరిన గవర్నర్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం.. అపెండిసైటిస్గా తేల్చారు. వెంటనే గవర్నర్ నజీర్కు రోబోటిక్ విధానం ద్వారా సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. రేపు డిశ్చార్జ్ ఆయన అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై.. సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి తిరుపతి, తిరుమల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. గవర్నర్ అస్వస్థత సమాచారం అందుకున్న వెంటనే.. సీఎం జగన్ అధికారులతో మాట్లాడారు.గవర్నర్ త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. -
మాజీ సీఎం కుమారస్వామికి అస్వస్థత.. అపోలోకు తరలింపు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ను విడుదల చేశారు. వివరాల ప్రకారం.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి బుధవారం తెల్లవారుజామున 3.40 గంటలకు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో కుంటుంబ సభ్యులు వెంటనే ఆయనను బెంగళూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాస్త అసౌకర్యం, నీరసం ఉందని కుమారస్వామి చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. Health bulletin on HD Kumaraswamy | "Currently, he is hemodynamically stable, comfortable and coherent and has been kept under close observation," Apollo Specialty Hospital, Jayanagar pic.twitter.com/qMDI9wlyqz — ANI (@ANI) August 30, 2023 ఇక, చికిత్స అనంతరం అపోలో వైద్యులు మాట్లాడుతూ.. కుమార స్వామి తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కుమారస్వామికి చికిత్స జరుగుతోందని అపోలో హాస్పిటల్ డాక్టర్లు వెల్లడించారు. ఆయనకు అన్ని రకాల టెస్ట్లు నిర్వహించినట్లు తెలిపారు. చికిత్స చేస్తున్నామని.. ఆ చికిత్సకు కుమారస్వామి ఆరోగ్యం కూడా బాగానే సహకరిస్తోందని స్పష్టం చేశారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన డాక్టర్లు.. అది ఎప్పుడు అనేది మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం పలువురు ప్రముఖులు బెంగళూరులోని అపోలో ఆస్పత్రికి చేరుకుని కుమారస్వామిని పరామర్శించారు. Former Karnataka Chief Minister HD Kumaraswamy admitted to Apollo Hospital in Bengaluru as he suffers a high temperature. A health bulletin released by the hospital says that the former CM is responding to treatment and is on the road to recovery. #HDKumaraswamy #Karnataka… pic.twitter.com/uDdhqa7x0c — NewsFirst Prime (@NewsFirstprime) August 30, 2023 గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపిన ఆయనకు ఒళ్లు నొప్పులతో పాటు జ్వరం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. గత వారం రోజులనుంచి ఆయన పలు మీటింగుల్లో పాల్గొంటున్నారు. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలార్ జిల్లా పర్యటకు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. తీరికలేని పని వల్లనే ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇటీవలే కుమార స్వామికి గుండె సంబంధిత ఆపరేషన్ కూడా జరిగింది. దీంతో కుటుంసభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: అధీర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ రద్దు.. -
బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్పై చికిత్స..
కలకత్తా: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య(79) ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన్ని ఈ రోజు మధ్యాహ్నం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై ఉన్నారు. 'ప్రస్తుతం ఆయన కండీషన్ విషమంగా ఉంది. ఆక్సిజన్ స్థాయిలు 70కి పడిపోయాయి. దీంతో ఆయన సృహలో లేరు. అనంతరం ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స కొనసాగిస్తున్నాం.' అని వైద్యులు తెలిపారు. 2000 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన బుద్ధదేవ్ భట్టాచార్య.. గత కొంతకాలంగా ఆనారోగ్యం బారిన పడ్డారు. సీఓపీడీ సమస్యతో పాటు పలు వయస్సు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సీపీఐఎమ్ పాలిటీబ్యూరోతో పాటు సెంట్రల్ కమిటీ నుంచి కూడా ఆయన 2015లో తప్పుకున్నారు. రాష్ట్ర సెక్రటేరియట్ నుంచి 2018లో తన సభ్యత్వాన్ని వదులుకున్నారు. ఆయన భార్య మీరా భట్టాచార్య, కూతురు సుచేతన భట్టాటార్య ఆస్పత్రికి వచ్చారు. ఇదీ చదవండి: Lalu Prasad Yadav: అనారోగ్యం నుంచి కోలుకున్న లాలూ.. బ్యాడ్మింటన్ ఆడుతూ.. -
ప్రజాగాయకుడు గద్దర్కు అస్వస్థత
హైదరాబాద్: ప్రముఖ కవి, ప్రజా గాయకుడు గద్దర్(74) అస్వస్థతకు లోనయ్యారు. చికిత్స కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయన ఏ ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరాన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ప్రజా శాంతి పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించిన ఆయన గత నెలలో కొత్త పార్టీ ప్రకటించారు. గద్దర్ ప్రజా పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి.. ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆ టైంలో తెలిపారాయన. -
ఆసుపత్రిలో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సాధారణ చెకప్ నిమిత్తం గ్రీమ్స్ రోడ్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. గత కొద్ది రోజులుగా జీర్ణకోశ సమస్యతో బాధపడుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రెగ్యులర్ చెకప్ నిమిత్తం గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు ప్రెస్ నోటును విడుదల చేశాయి. ఆయనకు సాధారణ ఎండోస్కోపీ పరీక్ష నిర్వహించి మంగళవారం ఉదయాన్నే డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు అపోలో వైద్యులు. ఇది కూడా చదవండి: ఇప్పుడు మాది డబుల్ ఇంజిన్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్.. షిండే -
జైల్లో కుప్పకూలిన జైన్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై 2022 మే నుంచి తీహార్ జైల్లో ఉన్న మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ గురువారం కుప్పకూలిపోయారు. జైల్లో కళ్లు తిరిగిపడిన జైన్ను పోలీసులు హుటాహుటిన దీన్దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రిలో చేర్పించారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే లోక్నాయక్ జయ్ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి ఐసీయూకి మార్చారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. గురువారం ఉదయం జైలు బాత్రూమ్లో జైన్ కాలుజారి పడిపోయారని జైలు అధికారి చెప్పారు. ‘‘కీలక అవయవాలకు గాయాలయ్యాయా అని వెంటనే వైద్యులు పరిశీలించి అంతా సాధారణంగా ఉందని తేల్చారు. వెనుకవైపు, ఎడమ కాలు, భుజం విపరీతంగా నొప్పి ఉన్నాయని చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాం’’ అన్నారు. స్నానాలగదిలో కళ్లు తిరిగి పడిపోవడంతో వెన్నెముకకు తీవ్ర గాయమైందని ఆప్ తెలిపింది. ‘‘ఢిల్లీ ప్రజలకు మంచి వైద్యం, ఆరోగ్యం అందించాలని చూసిన జైన్ను ఒక నియంత ఇలా శిక్షిస్తున్నాడు. దేవుడు అంతా చూస్తున్నాడు. అందరికీ న్యాయం జరుగుతుంది’ అంటూ ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్చేశారు. జైన్ను చెప్పడంతో జైలు అధికారులు సోమవారమే సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చూపించారు. ‘‘జైన మతవిశ్వాసాలను బాగా పాటించే జైన్ జైల్లో కేవలం పళ్లు, పచ్చి కూరగాయలు తింటున్నారు. దాంతో 35 కిలోలు తగ్గారు. రాత్రంతా బీఐపీఏపీ మెషీన్తో శ్వాస ఇవ్వాలి’’ అని ఆప్ తెలిపింది. -
శరత్బాబుకు తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్కు తరలింపు
ప్రముఖ నటుడు శరత్బాబు మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బెంగళూరులో చికిత్స పొందిన ఆయన తాజాగా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం శరత్బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూ నుంచి జనరల్ రూంకు షిఫ్ట్ చేశామని వైద్యులు తెలిపారు. కాగా 1973లో విడుదలైన ‘రామరాజ్యం’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తమిళ, తెలుగు, కన్నడ పరిశ్రమల్లో 200కి పైగా సినిమాలలో నటించారు. హీరోగానే కాకుండా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు పాత్రలతో అలరించారు. -
ఐటీ సోదాలు.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతకు అస్వస్థత
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని నవీన్ అస్వస్థకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయననను కుటుంసభ్యులు ఆసుపత్రికి తరలించారు. బీపీ ఎక్కువ కావడంతో అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. సాయంత్రం లోగా డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా మైత్రీ మూవీ ఆఫీస్, నిర్మాతల ఇళ్లతో పాటు డైరెక్టర్ సుకుమార్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన కొన్ని భారీ చిత్రాల నిర్మాణానికి విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడిగా తీసుకోవడం, వాటికి సంబంధించి పన్నుల చెల్లింపుల్లో అవకతవకలపై ఐటీ అధికారులు ఈ సోదా లు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వరుస ఐటీ రైట్స్ నేపథ్యంలో నిర్మాత ఎర్నేని నవీన్ ఆందోళనకు గురైనట్లు సమాచారం. 2015లో ప్రారంభమైన మైత్రీ మూవీ మేకర్స్ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప, సర్కారు వారి పాట, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించింది. ప్రస్తుతం పుష్ప2తో పాటు మరికొన్ని సినిమాలను నిర్మిస్తోంది. -
పోసాని కృష్ణమురళికి కరోనా.. ఆసుపత్రికి తరలింపు
ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి మరోసారి కరోనా బారినపడ్డారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సినిమా షూటింగ్లో భాగంగా పూణె వెళ్లిన ఆయన నిన్న(గురువారం)హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అయితే పోసానికి కోవిడ్ సోకడం ఇది మూడోసారి. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. ఇండస్ట్రీలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు పొందిన పోసాని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 45 కరోనా కేసులు నమోదు కాగా.. హైదరాబాద్లోనే 18 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచనలు చేసింది. -
కిమ్స్ ఆసుపత్రి లో చీమలపాడు క్షతగాత్రులు
-
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కేజీఎఫ్ నటి.. ఫోటో వైరల్
కన్నడ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి మాళవిక అవినాష్. శాండల్వుడ్లో సినిమాలతో పాటు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఈమె కేజీఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమాలో సీనియర్ ఉమెన్ జర్నలిస్ట్ పాత్రలో నటించి పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందింది. ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తూ బిజీబిజీగా గడిపేస్తుంది. అయితే తాజాగా మాళవిక అవినాష్ అనారోగ్యం బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఎవరికైనా మైగ్రేన్ సమస్య ఉంటే తేలికగా తీసుకోవద్దు. లేదంటూ నాలాగే ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. పనాడోల్, నెప్రోసిమ్ వంటి సాంప్రదాయ ఔషధం తీసుకోవడంతో పాటు నిర్లక్ష్యం చేయకుండా త్వరగా డాక్టర్ని సంప్రదించండి అంటూ నెటిజన్లను కోరింది. ఈ సందర్భంగా హాస్పిటల్ బెడ్పై ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్గా మారింది. -
అస్వస్థతకు గురైన పోప్.. ఆస్పత్రిలో చేరిక
వాటికన్ సిటీ: పోప్ ఫ్రాన్సిస్ అస్వస్థతో బుధవారం ఆస్పత్రిలో చేరారు. 86 ఏళ్ల పోప్ శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు, ఆయన్ని రోమ్లోని(ఇటలీ) జెమెల్లీ ఆస్పత్రిలో చేరినట్లు వాటికన్ సిటీ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. మరికొన్ని రోజులు ఆయన ఆస్పత్రిలోనే ఉంటారని తెలుస్తోంది. అయితే శ్వాస కోశ సంబంధిత సమస్యలే అయినప్పటికీ.. ఆయన కోవిడ్ సోకలేదని స్పష్టం చేసింది ఆ ప్రకటన. ఆయన అనారోగ్యంపై వార్తలు బయటకు రాగానే.. త్వరగా కోలుకోవాలంటూ సందేశాలు పంపుతున్నారు పలువురు. గత కొంతకాలంగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏడాదికాలంగా పలు ముఖ్యకార్యక్రమాలకు ఆయన గైర్హాజరు అవుతున్నారు. ఇదీ చదవండి: ప్రజల ఇష్టానుసారమే నిర్ణయం తీసుకుంటాం! -
నగ్నంగా రోడ్లపై నటి.. పిచ్చాసుపత్రికి తరలించిన పోలీసులు
అమెరికన్ నటి అమాండా బైన్స్ను పిచ్చాసుపత్రిలో చేర్పిచారు. లాస్ ఏంజిల్స్ వీధుల్లో నగ్నంగా తిరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. 36ఏళ్ల అమాండా గత కొంతకాలంగా మానసికి సమస్యలతో బాధపడుతుంది. పక్కింటికి నిప్పంటించడం, పెంపుడు కుక్కను చంపాలనుకోవడం వంటివి చేసింది. తాజాగా కారు నుంచి నగ్నంగా దిగి లాస్ డౌట్టౌన్ సమీపంలో బట్టలు లేకుండా సంచరించింది. దీంతో గుర్తించిన పోలీసులు ఆమెను సైకియాట్రిస్ట్ నిపుణుల సూచనతో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం 71 గంటల పాటు వైద్యుల పర్యవేక్షనలో అమాండా ఉంది. ఒకవేళ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఇంకొన్ని రోజుల పాటు ఆమె అక్కడ ఉండనుంది. కాగా అమాండా గతంలో డ్రగ్స్కు బానిసై దాన్నుంచి బయటపడ్డానని స్వయంగా ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన అమాండా ఈజీ ఎ, షీ ఈజ్ ది మ్యాన్, వాట్ ఏ గర్ల్ వాంట్ వంటి పలు సినిమాల్లో నటించింది. -
ఆసుపత్రి పాలైన అషూరెడ్డి.. కనీసం నడవలేని స్థితిలో
అషూ రెడ్డి.. బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్ మీడియా యూజర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే అషూ తరచూ తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ కనువిందు చేస్తోంది. చూడటానికి సమంతలా కనిపించటంతో అందరి దృష్టిలో పడిన అషూ బిగ్బాస్ షోతో మరింత పాపులర్ అయ్యింది. షో నుంచి బయటకు వచ్చాక ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూలతో మరింత గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్బాస్ ఓటీటీలో పాల్గొని యూత్లో మాంచి క్రేజ్ దక్కించుకుంది. నటిగా కంటే సోషల్ మీడియాలో ఆమె చేసే గ్లామర్ షోతోనే ఎక్కువగా పాపులర్ అయిన అషూ నిత్యం తనకు సంబంధించి పలు పోస్టులను షేర్ చేస్తుంటుంది. తాజాగా అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలైంది. చేతికి సెలైన్తో నడవలేని స్థితిలో కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను అషూ ఫ్రెండ్స్ ఇన్స్టాలో షేర్ చేస్తూ గెట్ వెల్ సూన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. -
ఆస్పత్రిలో చేరిన ప్రధాని మోదీ సోదరుడు
ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా దామోదర్ దాస్ మల్చంద్ మోదీ, హీరాబెన్లకు జన్మించిన ఐదుగురు సంతానంలో ప్రహ్లాద్ మోదీ నాల్గవవాడు. ఈయనకు గుజరాత్లోని అహ్మదాబాద్లో కిరాణ దుకాణం, టైర్ షోరూంలు ఉన్నాయి. కాగా గతేడాది డిసెంబర్27న కర్ణాటక మైసూరు సమీపంలో ప్రహ్లాద్ మోదీ ప్రమాదానికి గురయ్యారు. కుటుంబంతో కలిసి బందీపూర్ నుంచి మైసూర్ వెళ్తుండగా.. ఆయన కారు ప్రమాదానికి గురైంది. (చదవండి: సీబీఐ అరెస్ట్పై సుప్రీంకోర్టుకు సిసోడియా.. విచారించనున్న సీజేఐ చంద్రచూడ్) -
నేను బాగానే ఉన్నాను: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి
సాక్షి, నెల్లూరు: తాను బాగానే ఉన్నట్లు ఉదయగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. గుండెనొప్పి రావడంతో అసుపత్రికి వచ్చినట్లు పేర్కొన్నారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారని, మరో టెస్టు కోసం చెన్నై తరలిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో క్షేమంగా ఇంటికి తిరిగి వస్తావనని అన్నారు. కాగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గుండెనొప్పితో బుధవారం నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. గుండెలో రెండు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు. -
చికెన్ కబాబ్ తిని.. ఆస్పత్రిపాలైన నర్సింగ్ విద్యార్థినులు
కర్ణాటక: దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులో హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులు ఘీ రైస్, చికెన్ కబాబ్ తిని అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి సిటీ నర్సింగ్ హాస్టల్లో ఉంటున్న 137 మంది విద్యార్థినులు ఆహారం ఆరగించారు. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆహారం వికటించి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వంటల్లో శుభ్రత పాటించకపోవడంతో కలుషితమైనట్లు తెలుస్తోంది. బాధితులను సిబ్బంది సిటీ ఆస్పత్రిలో చేర్చారు. మొత్తం 137 మంది విద్యార్థులను మంగళూరు నగరంలోని వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. తల్లిదండ్రుల ఆగ్రహం సోమవారం రాత్రి పెద్దసంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో ఆస్పత్రికి వచ్చి విచారణ చేపట్టారు. కాలేజీ యాజమాన్యంపై కద్రి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. హాస్టల్లోని అస్తవ్యస్త పరిస్థితులపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం చాలా మంది విద్యార్థులు కోలుకున్నారు. కొందరు డిశ్చార్జ్ కాగా 38 మంది విద్యార్థులు ఆస్పత్రిలో ఉన్నారు. -
ఆస్పత్రి పాలైన ఇలియాన, ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో..!
ఇలియానా.. టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా రాణించింది గోవా బ్యూటీ. ‘దేవదాస్’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె పోకిరి మూవీతో మంచి గుర్తింపు పొందింది. ఇక ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరమైన ఇలియాన సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను, లేటెస్ట్ ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటుంది ఫ్యాన్స్కి చేరువుగా ఉంటుంది. అయితే తాజాగా ఇలియాన తీవ్ర అస్వస్థతకు గురైంది. కనీసం ఆహారం తీసుకోలే స్థితిలో ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతుంది. తాజాగా తన హెల్త్ గురించి సోషల్ మీడియాలో ఇలియాన అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఆస్పత్రి బెడ్పై ఉన్న ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో షేర్ చేసింది. తాను ఆహారం తీసుకోలేని స్థితి ఉండగా వైద్యులు మూడు బాటిళ్ల సలైన్స్ ఎక్కించినట్లు ఈ సందర్భంగా చెప్పింది. తన పోస్ట్లో ఒక్క రోజులో ఎంత మార్పు అంటూ చేతికి సలైన్ ఎక్కిస్తున్న ఫొటోని షేర్ చేసింది. ఇక మరో ఫొటోకి.. డాక్టర్లు తనని బాగా ట్రీట్ చేస్తున్నారని, 3 బ్యాగ్స్ ఐవీ లిక్విడ్స్ ఇచ్చినట్లు క్యాప్షన్ ఇచ్చింది. తన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్, సన్నిహితులను ఉద్దేశిస్తూ ఆమె మరో పోస్ట్ షేర్ చేసింది. ‘అందరూ నా ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఇంతగా నాపై ప్రేమ, అప్యాయత చూపిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞుతురాలిని. ఇప్పుడ నేను బాగానే ఉన్నాను. నాకు మంచి వైద్యం అందుతోంది’’ అని పేర్కొంది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఆకాంక్షిస్తున్నారు. చదవండి: నా కూతురికి దూరంగా ఉండాల్సి వస్తోంది : ప్రణిత ఎమోషనల్ ఆ భయంతోనే అజిత్ సినిమాను వదులుకున్నాను: జయసుధ -
ఎమ్మెల్యే కళావతికి మరోసారి అస్వస్థత..
సాక్షి, పాలకొండ: ప్రజా సేవకై అలుపెరగకుండా, రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా ప్రజలతో మమేకమవుతూ వారి కష్టసుఖాల్లో పాల్గొంటూ పాలకొండ నియోజక వర్గంలోని నాలుగు మండలాల్లో నిర్విరామంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే విశ్వానరాయి కళావతి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 21న దోనుబాయిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆమె అస్వస్థత గురయ్యారు. కాగా, గత నాలుగు రోజులుగా స్వగ్రామం వండవలో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యే కళావతి బుధవారం మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వెంటనే ఆమెను పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్సలు అందించారు. సామాన్య ప్రజలలాగే ఆమె ఏరియా ఆసుపత్రిలో చేరారు. దీంతో సూపరింటెండెంట్ జి. నాగభూషణరావు, ఆర్.ఎం జె.రవీంద్రకుమార్.. ఎమ్మెల్యే కళావతికి వైద్య చికిత్సలు అందజేసారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉండి వైద్య చికిత్సలు పొందిన ఎమ్మెల్యే కళావతి సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం, నెల రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించారు. కాగా, ఏరియా ఆసుపత్రిలోని వైద్య సేవలపై ఎమ్మెల్యే కళావతి సంతృప్తి వ్యక్తం చేశారు. అలుపెరగని ప్రజాసేవ.. పాలకొండ ఎమ్మెల్యే విశ్వానరాయి కళావతి 2014 నుండి 2019 వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రజల పట్ల ఆమెకున్న దీక్షా దక్షతను చూసి 2019లో మరో మారు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా అఖండ విజయం కట్టబెట్టారు. ప్రతి పక్షం నుండి అధికార పక్షంలో అడుగుపెట్టిన కళావతికి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడమే పనిగా మారింది. దీంతో 2019లో అధికారం వచ్చిన తర్వాత నుండి ప్రజా సేవలోనే మమేకమవుతూ వస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయో లేదా తెలుసుకునేందుకు ముందుకు సాగారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా జనవరి 21వ తేదీ వరకు నియోజకవర్గంలో 32 పంచాయతీల్లో 82 రోజుల పాటు అవిశ్రాంతంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇలా ప్రజల సుఖాలు తెలుసుకుంటూ వారికి బాసటగా నిలిచారు. అలాగే, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ఈనెల 21న దోనుబాయిలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో, తమ అభిమాన ఎమ్మెల్యే కళావతి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. -
ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ ఓదార్పు
-
ప్రధాని మోదీ తల్లికి అస్వస్థత
-
నటుడు శరత్కుమార్ ఆరోగ్యంపై వదంతులు.. పీఆర్ టీం క్లారిటీ
ప్రముఖ సినీనటుడు శరత్కుమార్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. డయేరియా, డీహైడ్రేషన్తో శరత్కుమార్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారని వార్తలు రావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సోషల్మీడియాలోనూ శరత్కుమార్ ఆరోగ్యంపై వదంతులు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై శరత్కుమార్ పీఆర్ టీం స్పందించింది. చిన్నపాటి వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ఆసుపత్రికి వెళ్లారని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపింది. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని పీఆర్ టీం తెలిపింది. కాగా తెలుగు, తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శరత్కుమార్కు ప్రస్తుతం వారీసు చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. -
ప్రముఖ నటుడు శరత్కుమార్కు తీవ్ర అస్వస్ధత
ప్రముఖ సీనియర్ నటుడు శరత్కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డయేరియాతో డీహైడ్రేషన్కు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మీ శరత్కుమార్ ఇప్పటికే ఆసుపత్రి వద్దకు చేరుకున్నట్లు తెలుస్తుంది. కాగా 1986లో 'సమాజంలో స్త్రీ' అనే తెలుగు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన శరత్కుమార్ సపోర్టింగ్ రోల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని అనతికాలంలోనే హీరోగా మారాడు. తెలుగునాట మంచి పాపులారిటీ దక్కించుకున్న శరత్కుమార్ ఇటీవలె తెలుగులో పరంపర వెబ్సిరీస్లో నటించిన సంగతి తెలిసిందే. -
ఆసీస్ మాజీ కెప్టెన్ పాంటింగ్ కు అస్వస్థత
-
కన్నడ స్టార్ ఉపేంద్ర ఆరోగ్యంపై వదంతులు.. క్లారిటీ ఇచ్చిన నటుడు
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఓ సినిమా షూటింగ్లో ఉన్న ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో వెంటనే హాస్పిటల్కి తరలించారు. దీంతో ఉపేంద్ర ఆరోగ్యంపై రకరకాల కథనాలు వెలువడ్డాయి.తన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతుండడంతో స్వయంగా ఉపేంద్ర ఓ వీడియోను రిలీజ్ చేశారు.ట్రీట్మెంట్ తీసుకున్న వెంటనే తిరిగి షూటింట్లో పాల్గొన్నాడయన. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సి అవసరం లేదని తెలిపారు. షూటింగ్ లొకేషన్లో దుమ్ము ఎక్కువగా ఉండటంతో కాస్త ఇబ్బంది పడ్డానని, అందుకే దగ్గర్లోని హాస్పిటల్కి వెళ్లి వచ్చినట్లు వివరించారు. కాగా ప్రస్తుతం ఉపేంద్ర వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘కబ్జా’, ‘త్రిశూలం’, ‘యూఐ’ వంటి సినిమాల్లో ఆయన నటిస్తున్నారు. Amidst rumours that Kannada actor #Upendra has been hospitalized due to sudden illness, the actor himself clarified that he is doing fine and is continuing to shoot for #UI pic.twitter.com/4AEHwkDovg — FilmKraft (@FilmKraft24) November 25, 2022 ನಾನು ಆರಾಮಾಗಿ ಇದ್ದೀನಿ ಯಾರು ಭಯಪಡುವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ Upendra | uppi | SK news Kannada #uppi #upendra #sknewskannada #sknews #kannada #media #socialmedia #Karnatakanews #viralnews #news #viral YouTube :-https://t.co/H8vCtVxQEU pic.twitter.com/rw4iHZ8xL3 — SK News Kannada (@SKNewsKannada) November 24, 2022 -
ఈడీ విచారణలో ఎల్ రమణకు తీవ్ర అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) విచారణకు హాజరైన తెలంగాణ ఎమ్మెల్సీ ఎల్ రమణ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ని ఈడీ అధికారులు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. తీవ్ర అస్వస్థతలకు గురైన ఎమ్మెల్సీ రమణను హైదర్గూడా అపోలో ఆస్పత్రికి తరలించారు ఈడీ అధికారులు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కుటుంబ సభ్యులు ఆయన్ని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. చికోటీ ప్రవీణ్ సారథ్యంలో విదేశాల్లో అక్రమ క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తవ్వేకొద్దీ రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో వంద మందితో కూడిన ఓ జాబితా లిస్ట్ను రూపొందించింది ఈడీ. శుక్రవారం ఎమ్మెల్సీ రమణను విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపింది. దీంతో హైదరాబాద్ ఈడీ ఆఫీస్కు వచ్చారు ఆయన. అయితే విచారణ సమయంలో రమణ అస్వస్థతకు గురికాగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ వ్యవహారంలో మంత్రి తలసాని యాదవ్ ఇద్దరు సోదరులను ఇదివరకే ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. -
సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక
సీనియర్ నటులు, సూపర్ స్టార్ కృష్ణ ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆదివారం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా కొంతకాలంగా కృష్ణ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య సమస్యల కారణంగానే ఆయన కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురి కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అమిర్ ఖాన్ తల్లికి తీవ్ర గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ముంబైలోని పంచగని నివాసంలో ఆమిర్ ఖాన్ కుటుంబం దీపావళి వేడుకల్లో ఉండగా, గుండెపోటుతో జీనత్ కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను వెంటనే బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జీనత్ పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. ఆమె నెమ్మదిగా కోలుకుంటున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.ప్రస్తుతం అమిర్ ఆసుపత్రిలోనే ఉన్నాడని తెలుస్తుంది. కాగా అమిర్ ఖాన్ చివరగా లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నటించారు. కరీనా కపూర్ హీరోయిన్గా, నాగచైతన్య కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. -
సీఎస్ సమీర్శర్మకు అస్వస్థత.. విజయానంద్కు బాధ్యతలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్శర్మ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఆయన స్వల్ప అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా.. గుండె సంబంధిత చికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. కొద్ది రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి విధుల్లో చేరే అవకాశం ఉంది. కాగా, సమీర్శర్మను సీఎం వైఎస్ జగన్ బుధవారం ఫోన్లో పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పూర్తి అదనపు బాధ్యతలు విజయానంద్కు.. సీఎస్ డాక్టర్ సమీర్శర్మ అస్వస్థతకు గురై సెలవులో ఉన్న నేపథ్యంలో ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్ కె.విజయానంద్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ) ముఖ్యకార్యదర్శి ముత్యాల రాజు ఉత్తర్వులిచ్చారు. -
మళ్లీ అనారోగ్యానికి గురైన సీనియర్ దర్శకుడు
సీనియర్ దర్శకుడు భారతీరాజా మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని స్థానిక అంజిగరైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. భారతీరాజా అనారోగ్యం కారణంగా గత నెల 24వ తేదీ ఇదే హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. జలుబు, అజీర్ణం సమస్యతో బాధపడుతున్న ఆయనకు అత్యవసర విభాగంలో వైద్య సేవలు అందించారు. సుమారు 20 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్న భారతీరాజా ఆరోగ్యం మెరుగుపడడంతో ఇటీవలే ఇంటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో శుక్రవారం ఆస్పత్రికి తరలించారు. -
హాస్పిటల్ బెడ్పై లేవలేని స్థితిలో యాంకర్ లాస్య.. వీడియో వైరల్
ప్రముఖ యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చీమ ఏనుగు జోక్స్తో కూడా బాగా పాపులర్ ఆమె యాంకర్గా స్టేజీపై ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. కొంతకాలంగా బుల్లితెరకు గ్యాప్ ఇచ్చిన లాస్య తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అలరిస్తుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోలతో నెట్టింట సందడి చేస్తుంది. అయితే తాజాగా లాస్య హాస్పిటల్ పాలైంది. ఈ విషయాన్ని స్వయంగా లాస్య భర్త మంజునాథ్ తన ఇన్స్టా స్టోరీలో చెప్పుకొచ్చారు. గెట్ వెల్ సూన్ అంటూ ఓ పోస్ట్ను షేర్ చేశారు. దీంతో యాంకర్ లాస్యకు ఏమైందంటూ ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. లాస్య హాస్పిటల్లో ఎందుకు చేరిందన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు ఆమె త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. -
కరోనాతో ఆస్పత్రిలో చేరిన పన్నీర్సెల్వం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే నేత పన్నీర్ సెల్వం కోవిడ్-19తో ఆస్పత్రిలో చేరారు. కరోనాకి సంబంధించిన లక్షణాలతో ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం ఉదయమే ఆయన అడ్మిట్ అయ్యారు. ఈ మేరకు పన్నీర్ సెల్వం ఐసోలేషన్ యూనిట్లో చికిత్స తీసుకుంటున్నట్లు ఎంజీఎం హెల్త్కేర్ ఓ మెడికల్ బులిటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని హెల్త్ బులెటన్లో పేర్కొన్నారు.. పన్నీర్ సెల్వం త్వరితగతిన కోలుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన ఆకాంక్షించారు. ఇటీవలే పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురయ్యారు. కాగా, సీఎం స్టాలిన్ సైతం కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. (చదవండి: ఇది ఆమోదయోగ్యం కాదు! బలవంతపు ఏకపక్షవాదం: కపిల్ సిబల్) -
లాలూకు ప్రమాదం.. మెట్లపై నుంచి జారిపడ్డ ఆర్జేడీ చీఫ్
పట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ గాయపడ్డారు. ఇంట్లో మెట్లు దిగుతుండగా ఆయన కాలుజారి పడిపోయినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనలో లాలూ భుజానికి ఫ్రాక్చర్ అయినట్లు పేర్కొన్నాయి. వీపుపై కుడా గాయమైనట్లు చెప్పాయి. 'లాలూ భుజంలో ఫ్రాక్చర్ అయినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. గాయమైన చోట వైద్యులు బ్యాండేజ్ చుట్టారు. కొన్ని మెడిసిన్స్ రాసి వెంటనే ఇంటికి పంపారు’ అని లాలూ కుటుంబంతో సన్నిహత సంబంధాలు ఉన్న ఓ వ్యక్తి చెప్పారు. దాణా కుంభకోణం కేసుల్లో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ.. రెండు నెలల క్రితమే బెయిల్పై విడుదలయ్యారు. అప్పటినుంచి ఆయన సతీమణి, మాజీ సీఎం రబ్రీ దేవి నివాసంలోనే ఉంటున్నారు. లోయలో పడ్డ స్కూల్ బస్సు.. 16 మంది మృతి లాలూ ఇప్పటికే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యల చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఆదివారం అనుకోకుండా ఇంట్లోనే మెట్లపై నుంచి జారిపడి గాయపడ్డారు. వెంటనే కుటుంసభ్యులు లాలూను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. భుజం, వీపుపై కాస్త నొప్పి తప్ప.. లాలూకు ఇబ్బందేమీ లేదని తెలుస్తోంది. కస్టడీకి ‘అమరావతి’ సూత్రధారి -
ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
-
కూల్డ్రింక్ తాగిన 18 మంది మహిళా కూలీలకు అస్వస్థత
వేలూరు(చెన్నై): దుకాణంలో శీతల పానియం తాగిన 18 మంది మహిళా కూలీలు అస్వస్థతకు గురై.. ఆరణి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపంలోని మలయంబట్టు గ్రామానికి చెందిన కుమరేశన్కు చెందిన వ్యవసాయ పొలంలో అదే గ్రామానికి చెందిన మంజుల, శాంతి, విజయలక్ష్మి తో పాటు మొత్తం 18 మంది మహిళలు వ్యవసాయ పనులకు వచ్చారు. మధ్యాహ్నం ఎండలు తీవ్రం కావడంతో కలంబూరులోని ఓ దుకాణంలో కూల్డ్రింక్ తాగారు. వెంటనే 18 మంది వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో స్థానికులు గమనించి మలయంబట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఆరణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కలంబూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో.. 6 నుంచి వీరరాఘవుడి బ్రహ్మోత్సవాలు తిరువళ్లూరు: పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వైద్యవీరరాఘవుడి ఆలయ బ్రహ్మాత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక్కడ ఏటా చైత్రమాసంలో పది రోజుల పాటు ఉత్సవాలను ప్రారంభించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం 4.45 గంటలకు ధ్వజారోహణం, అనంతరం తంగసభ్రం, తిరుమంజనం నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం సింహవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. ఇక ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు ఉదయం గరుడసేవ, సాయంత్రం హానుమంత వాహనంపై స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు. ఏడవ రోజు రథోత్సవం, 8వ రోజు అశ్వవాహన సేవ ఉంటుంది. తొమ్మిదో రోజు ఉదయం తీర్థవారి, పదో రోజు ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగియనున్నట్లు ఆలయ నిర్వాహకులు వివరించారు. చదవండి: యూపీలో దారుణం.. పోలీస్ స్టేషన్లోనే అత్యాచార బాధితురాలిపై పోలీస్ లైంగిక దాడి -
ఆసుపత్రి పాలైన మిథున్ చక్రవర్తి, బయటికొచ్చిన ఆస్పత్రి ఫొటో
Mithun Chakraborty Hospitalised Photos Goes Viral: ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవరి ఆసుపత్రి పాలయ్యారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చేరారు. బీజేపీ నాయకుడు అనుపమ్ హజ్రా ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఆసుపత్రిలోని ఆయన ఫొటోలను ట్వీట్లో షేర్ చేశారు. దీంతో ఆసుపత్రి బెడ్పై పడుకుని ఉన్న మిథున్ చక్రవర్తి ఫొటోలు సోషల్ మీడయా వైరల్గా మారాయి. ఆకస్మాత్తుగా మిథున్ చక్రవర్తి ఆసుప్రతి పాలవడంతో ఆయన అభిమానులంతా ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఆయన రెండో కుమారుడు మిమో చక్రవర్తి ఆయన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చాడు. ఇండియా టూడేతో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. ఆయన కిడ్నీ స్టోన్స్ పెయిన్ ఏప్రిల్ 30న ఆసుప్రతి చేరినట్టు చెప్పాడు. ఆయనకు ఆపరేషన్ జరిగిందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని మిమో చక్రవర్తి చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా 80, 90లలో హీరోగా బెంగాలీ, హిందీ సినిమాలలో చక్రం తిప్పారు మిథున్ చక్రవర్తి. ఇక చివరగా మిథున్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంలో నటించి మెప్పించారు. Get well soon Mithun Da ❤️ তোমার দ্রুত আরোগ্য কামনা করি মিঠুন দা ❤️ pic.twitter.com/yM5N24mxFf — Dr. Anupam Hazra 🇮🇳 (@tweetanupam) April 30, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మరోసారి ఆసుపత్రిలో చేరిన బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం
బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం పీలే మరోసారి ఆసుపత్రిలో చేరాడు. కొంతకాలంగా పీలే పెద్దప్రేగు క్యాన్సర్తో బాధపడుతున్న సంగతి తెలిసిదే. గతేడాది సెప్టెంబర్ 2021లో పెద్దప్రేగుకు ఏర్పడిని కణితిని వైద్యులు తొలగించారు. అప్పటినుంచి పీలే..సావోపోలోని ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆసుపత్రికి తరచు చికిత్స కోసం వెళ్లి వస్తున్నాడు. తాజాగా సోమవారం నొప్పి మరోసారి ఎక్కువవడంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్లు హాస్పిటల్ మేనేజ్మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పీలే పరిస్థితి బాగానే ఉందని.. వైద్యుల పర్యవేక్షణలో ఆయన అబ్జర్వేషన్లో కొనసాగుతున్నాడు. కాగా గత ఫిబ్రవరిలో యూరిన్ ఇన్ఫెక్షన్ సోకడంతో ఆసుపత్రిలో జాయిన్ అయి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కీమోథెరపీ కూడా చేయించుకున్నాడు. కాగా ఫుట్బాల్లో పీలేది చెరగని ముద్ర. మూడు ప్రపంచ కప్లు సాధించిన ఏకైక ఫుట్బాలర్గా పీలే పేరిట చెక్కు చెదరని రికార్డు నమోదయింది. 1958, 1962, 1970 ప్రపంచకప్ల్లో పీలే బ్రెజిల్ను ప్రపంచ ఛాంపియన్గా నిలిపాడు. బ్రెజిల్ తరఫున 92 మ్యాచులు ఆడిన పీలే 77 గోల్స్ చేశాడు. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది. చదవండి: Wimbledon 2022: రష్యన్ టెన్నిస్ ప్లేయర్లకు షాక్.. వింబుల్డన్కు దూరమయ్యే అవకాశం! -
మరోసారి ఆసుపత్రి పాలైన రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య
Aishwaryaa Rajinikanth Admitted In The Hospital: సూపర్స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య మరోసారి ఆసుపత్రి పాలైంది. చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. గతంలో కరోనా కారణంగా ఐశ్వర్య ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా పోస్ట్ కోవిడ్ కారణంగా అనారోగ్యం బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఐశ్వర్య తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. జీవితం కరోనాకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా ఉంది. జ్వరం, వర్టిగోతో మరోసారి ఆసుపత్రిలో చేరాను అంటూ హాస్పిటల్ బెడ్పై ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో ఐశ్వర్య త్వరగా కోలుకోవాలంటూ సినీ ప్రముఖులు సహా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా కోలీవుడ్లో స్టార్ కపుల్గా పేరు తెచ్చుకున్న ధనుష్-ఐశ్వర్యలు ఇటీవలె విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం ఇద్దరూ తమతమ పనుల్లో ఫుల్ బిజీగా మారిపోయారు. View this post on Instagram A post shared by Aishwaryaa Rajinikanth (@aishwaryaa_r_dhanush) -
హాస్పిటల్లో చేరిన కమల్హాసన్.. అభిమానుల ఆందోళన
Kamal Haasan Admitted In Hospital: విలక్షణ నటుడు కమల్హాసన్ మరోసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇటీవలె కరోనా నుంచి కోలుకున్న ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చైన్నైలోని ప్రముఖ శ్రీరామచంద్ర హాస్పిటల్లో చేరారు. అయితే ఆయన రెగ్యులర్ చెకప్ కోసం మాత్రమే ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. జనరల్ చెకప్ అనంతరం ఆయన్ను డిశ్చార్జి చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా కమల్ హోస్ట్ చేస్తున్న బిగ్బాస్ సీజన్5 ఫినాలే ఆదివారం పూర్తయిన సంగతి తెలిసిందే. -
అన్నా హజారేకు అస్వస్థత..ఆసుపత్రిలో చేరిక
సాక్షి, ముంబై: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అస్వస్థతకు గురయ్యారు. 84 ఏళ్ల అన్నా హజారేకు ఛాతిలో నొప్పి రావడంతో పుణెలోని రూబీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. డాక్టర్ల పరిశీలనలో ఉంచినట్టు రూబీ హాల్ క్లినిక్ మెడికల్ సూపరింటెండెంట్ అవధూత్ భోధమ్వాడ్ తెలిపారు. అన్నా హజారేకు యాంజియోగ్రఫీ పరీక్షలు చేయగా గుండెలోని కరోనరీ ఆర్టెరీలో చిన్న బ్లాకేజీ ఉన్నట్లు తేలిందని, దీంతో వైద్య బృందం ఆ బ్లాకేజీని తొలగించినట్లు పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకావం ఉందన్నారు. కాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆసుపత్రికి కాల్ చేసి అన్నా హజారే ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. చదవండి: కంగనా రనౌత్కు ఢిల్లీ అసెంబ్లీ సమన్లు, డిసెంబర్ 6న హాజరవ్వాల్సిందే! -
నటుడు కైకాల సత్యనారాయణ పరిస్థితి విషమం
Kaikala Satyanarayana: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్పై అందించి చికిత్స అందిస్తున్నారు. గతనెల 30న ఇంట్లో జారిపడటంతో అనారోగ్యానికి గురైన కైకాల కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మరోసారి ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. -
ఉప్మాలో పాము పిల్ల.. 56 మంది అస్వస్థత
సాక్షి, బళ్లారి(కర్ణాటక): ఉప్మాలో పాము పిల్ల పడిన విషయం తెలియక దాన్ని ఆరగించిన విద్యార్థులు అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. యాదగరి తాలూకా అబ్బెతుమకూరు గ్రామంలోని విశ్వరాధ్య విద్యావర్థక రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్లో గురువారం ఉదయం విద్యార్థులకు అల్పాహారంగా ఉప్మా వడ్డించారు. దానిని తిన్న విద్యార్థుల్లో 56 మందికి నిమిషాల్లోనే వాంతులు, విరేచనాలయ్యాయి. వెంటనే వారినిప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి కలుషిత ఆహారమే కారణమని నిర్థారించారు. సిబ్బంది వెంటనే హాస్టల్కు వెళ్లి పరిశీలించగా ఉప్మా ఉన్న పాత్రలో చనిపోయిన పాముపిల్ల కనిపించింది. ఈ విషయాన్ని వైద్యులకు తెలపగా వారు విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ వార్త తెలిసిన వెంటనే పిల్లల తల్లిదండ్రులు ఆస్పత్రులకు చేరుకున్నారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. యాదగిరి జిల్లా ఎస్పీ వేదమూర్తి వసతి పాఠశాలను సందర్శించారు. ఆస్పత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు అస్వస్ధత
Kaikala Satyanarayana Hospitalized: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఆయన జారిపడ్డారు. దీంతో గతరాత్రి నొప్పులు ఎక్కువగా ఉండటంతో సికింద్రాబాద్లోని ప్రముఖ ప్రైవేటు హాస్పిటల్లో ఆయనను చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన పడాల్సి అవసరం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. చదవండి: పునీత్ మా ఇంటికి వచ్చేవారు..కలిసి భోజనం చేసేవాళ్లం: బన్నీ పునీత్ రాజ్కుమార్కు పవర్స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందంటే.. -
కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్కు అస్వస్థత
-
ఐసీయూలో కన్నడ సూపర్స్టార్ పునీత్ రాజ్కుమార్
-
శోక సంద్రంలో పునీత్ రాజ్కుమార్ అభిమానులు... వారి భయమే నిజమైంది
Actor Puneeth Rajkumar Health Condition: ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిమ్ చేస్తుండగా శుక్రవారం ఉదయం 9.45 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో బెంగళూరులోని రమణశ్రీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విక్రమ్ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో ఆయనకు చికిత్స అందించారు. పునీత్ అస్వస్థతకు గురయ్యాడని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆయనకు ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఆయన ఆస్పత్రిలో ఉండగానే.. కర్ణాటక సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించడం... సినిమా థియేటర్లు మూసివేయాలని ఆదేశించడంతో అభిమానులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఆస్పత్రితో పాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరొకవైపు తమ ప్రియతమ నటుడు క్షేమంగా బయటపడాలని దేవున్ని ప్రార్థించారు అభిమానులు. అయితే, వారి మొరని దేవుడు ఆలకించలేదు. పరిస్థితి విషమించడంతో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ మృతి చెందినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ వార్తతో సినీ ప్రముఖులు.. పునీత్ రాజ్కుమార్కు నివాళులు అర్పిస్తున్నారు. పునీత్ని అభిమానులు ఎంతో ప్రేమగా అప్పూ అని పిలుచుకుంటారు. లెజెండరీ నటుడు కంఠీరవ రాజ్కుమార్ మూడవ కొడుకే పునీత్ రాజ్కుమార్. 1976లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన పునీత్... 1989 వరకు బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. ఉత్తమ బాలనటుడిగా నేషనల్ అవార్డును సంపాదించుకున్నారు. 2002లో అప్పూ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన.. హీరోగా ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించారు. -
ఐసీయూలో నటుడు సత్యజిత్.. పరిస్థితి విషమం
Actor Sathyajith Admitted In Hospital: శాండల్వుడ్ సీనియర్ నటుడు సత్యజిత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కొద్దిరోజుల క్రితం కామెర్లు సోకడంతో పాటు గత శుక్రవారం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. బీపీ, షుగర్ ఉన్న కారణంగా చికిత్సకు స్పందించడం లేదని తనయుడు ఆకాశ్జిత్ తెలిపారు. చికిత్స ఖర్చులకు ఫిలిం చాంబర్, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. చదవండి: Ram Pothineni: హీరో రామ్కు గాయాలు.. షూటింగ్కు బ్రేక్ సింపుల్గా ధ్రువసర్జా జన్మదిన వేడుకలు శాండల్వుడ్ నటుడు ధ్రువ సర్జా సోమవారం సింపుల్గా పుట్టినరోజును ఆచరించారు. ఏటా తన స్నేహితులు, అభిమానులతో కలిసి వైభవంగా జరుపుకొనే వారు. కరోనాతో కారణంగా, ఇంట్లోనే కుటుంబసభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. చదవండి: MAA Elections 2021: కృష్ణం రాజును కలిసిన మంచు విష్ణు -
ఆస్పత్రి పాలైన నటి.. త్వరగా కోలుకోవాలంటూ మాజీ భర్త పోస్ట్
Shweta Tiwari Hospitalised, Ex-Husband Reacts: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నటి శ్వేతా తివారి త్వరగా కోలుకోవాలంటూ ఆమె మాజీ భర్త ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. నా కొడుకు కస్టడీకి సంబంధించిన విషయం ప్రస్తుతం కోర్టులో ఉంది. కానీ శ్వేత త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. చాలామంది యాక్టర్స్(నటీనటులు) ప్రేక్షకుల నుంచి ఎక్కువ ప్రేమ పొందేందుకు, తమను తాము మరింత అందంగా చూపించుకునేందుకు డైట్ పేరిట తక్కువ తిని, ఎక్కువ వర్కవుట్స్ చేస్తూ తమ శరీరాన్ని ఒత్తిడికి గురి చేస్తారు. ఇలానే చేస్తూ పోతే ఏదో ఒకరోజు వారి గుండె అలిసిపోతుంది అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. చదవండి: అరెరె.. కత్రినా కైఫ్కు జిరాక్స్ కాపీలా ఉందే.. ఖత్రోన్ కే ఖిలాడి సీజన్11 ఫైనలిస్ట్, హిందీ సీరియల్ నటి శ్వేత తివారి బలహీనత, లో- బీపీ కారణంగా హాస్పిటల్ పాలైంది. షూటింగ్స్లో బిజీ ఉండటంతో తగినంత విశ్రాంతి తీసుకోకపోవడంతో ఆమె అనారోగ్యానికి గురైందని శ్వేత పీఆర్ టీం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో శ్వేతా తివారికి, భర్త అభినవ్తో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఓ రియాలిటీ షో కోసం కేప్టౌన్ వెళ్లేందుకు రెడీ అయిన శ్వేత.. తన కొడుకు రేయాన్ కోసం సరైన ఏర్పాట్లు చేయకుండానే దేశం విడిచి వెళ్తుందంటూ అభినవ్ ఆరోపించాడు. దీంతో తన కొడుకును బలవంతంగా అభినవ్ తీసుకెళ్లేందుకు చూస్తున్నాడంటూ సీసీటీవీ ఫుటేజిని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. కాగా బాలీవుడ్ నటి శ్వేతా తివారి 2013లో అభినవ్ కోహ్లిని రెండో పెళ్లి చేసుకుంది. విభేదాల కారణంగా 2019లో వీరు విడిపోయారు. డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ నటుడు View this post on Instagram A post shared by Abhinav Kohli (@abhinav.kohli024) -
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన హీరో అడివి శేష్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ఆసుపత్రిలో చేరారు. తీవ్ర అనారోగ్యానికి గురైన నటుడు హైదరాబాద్లో ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కాగా గతవారం అడివి శేష్ డెంగ్యూ బారిన పడగా.. తాజాగా ఆయనకు రక్తంలో ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా తగ్గిపోవడంతో సెప్టెంబర్ 18న ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శేష్ అనారోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు హీరో అరోగ్యం విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. కాగా హీరో శేష్ ప్రస్తుతం “మేజర్” సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘ 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. దీంతోపాటు ‘గూఢచారి’కి సీక్వెల్గా ‘గూఢచారి 2’ చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ‘హిట్’కు సీక్వెల్గా రూపొందుతున్న ‘హిట్2’లో శేష్ సీక్రెట్ ఏజెంట్గా కనిపిస్తారట. ‘హిట్’ తొలి భాగాన్ని డైరెక్ట్ చేసిన శైలేష్ కొలనుయే ‘హిట్ 2’ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. చదవండి: నగరంలో వరుస హత్యలు.. రావాలి ఓ గూఢచారి Sonu Sood: ప్రతి రూపాయి పేదల కోసమే.. ఐటీ సోదాలపై సోనూసూద్ -
Sidharth Shukla: 'సిద్ధార్థ్తో పాటు నువ్వు కూడా త్వరగా చచ్చిపో'..
Jasleen Matharu Hospitalised After Sidharth Shuklas Death: బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. 40 ఏళ్ల సిద్ధార్థ్ తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే శుక్లా మరణించినట్లు ముంబైలోని కూపర్ ఆసుపత్రి ధృవీకరించిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ మరణాన్ని సహ నటులు, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.ముఖ్యంగా ఆయన ప్రేయసి షెహనాజ్ గిల్ విలపించిన తీరు వర్ణనాతీతం. అంత్యక్రియలకు హాజరైన షెహనాజ్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. మరోవైపు సిద్ధార్థ్ మరణ వార్త విని ఓ అభిమాని ఇటీవలె ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. చదవండి: 'సిద్ధార్థ్ శుక్లా ప్రతినెలా బలవంతంగా డబ్బులు పంపేవాడు' తాజాగా 'ముజ్సే షాదీ కరోగి' రియాలీటీలో సిద్ధార్థ్ శుక్లా కలిసి పని చేసిన, బిగ్బాస్ 12 పార్టిసిపెంట్ జస్లీన్ మాతరు ఆసుపత్రి పాలైంది. తీవ్రమైన జ్వరంతో ఆమె ఆసుపత్రిలో చేరినట్లు స్వయంగా ఆమె ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో షేర్చేసింది. సిద్ధార్థ్ శుక్లాకు సంతాపంగా చేసిన పోస్ట్కి ఓ నెటిజన్ నుంచి ఊహించని విధమైన కామెంట్స్ రావడంతో భయబ్రాంతులకు లోనై ఈ పరిస్థితుల్లో ఉన్నానంటూ వీడియోలో పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "సిద్ధార్థ్ చనిపోయిన వార్త విన్న వెంటనే షాక్లోనే అతని ఇంటికి వెళ్లాను. అక్కడి పరిస్థితులు నన్ను ఎంతో కలవరపరిచాయి. షెహనాజ్, రీతూ ఆంటీ (సిద్ధార్థ్ తల్లి)ని కలిసి ఇంటికి తిరిగి వచ్చాను. అనంతరం ఇంటికి వచ్చాక సోషల్ మీడియాలో వచ్చిన మేసేజ్లు చూసుకుంటుండగా.. అందులో ఓ వ్యక్తి నుంచి ఓ భయంకరమైన మెసేజ్ వచ్చింది. సిద్ధార్థ్ మరణ వార్త తెలిసి అతనికి సంతాపంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాను. దానికి ఓ నెటిజన్.. 'నువ్వు కూడా త్వరగా చచ్చిపో' అని మెసేజ్ చేశాడు. ఇది చూసి భయంతో వణికిపోయి, 103 డిగ్రీల జ్వరంతో ఆసుపత్రిలో చేరాను అని పేర్కొంది. చదవండి : కసరత్తు ఎక్కువైనా ప్రమాదమేనా..! సిద్ధార్థ్ మరణం తనని ఎంతో ఎఫెక్ట్ చేసిందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని, త్వరలోనే తాను కోలుకుంటానని తెలిపింది. కాగా సిద్ధార్థ్కు సంతాపంగా పలువురు ప్రముఖులు సోషల్మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. నటి జస్లీన్ సైతం సిద్ధార్థ్కు సంతాపంగా ఓ పోస్ట్ను షేర్ చేయగా, దానికి ఓ నెటిజన్ 'నువ్వు కూడా త్వరగా చచ్చిపో' అని కామెంట్ చేశాడు. దీంతో 'ఒకరి చావు గురించి కూడా జోక్స్ ఎలా వేస్తారు? ఇలా అనడానికి సిగ్గు లేదా?.. అందరూ చనిపోయిన తర్వాత ఒక్కరే ఉంటారా? ఇంత అసహ్యంగా ఎలా మాట్లాడుతారు' అంటూ జస్లిన్ ఘాటుగా బదులిచ్చింది. View this post on Instagram A post shared by Jasleen Matharu ਜਸਲੀਨ ਮਠਾੜੂ (@jasleenmatharu) -
నీరజ్ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
చండీగఢ్: టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వగ్రామం హరియాణలోని పానిపట్ సమీపంలోని సమల్ఖాకు బయల్దేరాడు. ఢిల్లీ నుంచి పానిపట్ వరకు భారీ కాన్వాయ్తో బయల్దేరగా స్వగ్రామం చేరుకునేలోపు నీరజ్ అస్వస్థతకు గురయ్యాడు. ఉదయం నుంచి కారు టాప్పై ఉండి అందరికీ అభివాదం చేస్తూ స్వర్ణ పతకం చూపిస్తూ ఊరేగింపులో పాల్గొన్నాడు. ఆరు గంటల పాటు సాగిన ఈ యాత్రలో నీరజ్ నీరసించిపోయాడు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కొన్నిరోజులుగా నీరజ్ జ్వరంతో బాధపడుతున్నాడు. ఇటీవల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి ఈ కారణంగానే నీరజ్ గైర్హాజరయ్యాడు. అయితే ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో మాత్రం నీరజ్ పాల్గొన్నాడు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి మోదీని కలిసి అభినందనలు పొందాడు. (చదవండి: స్వర్ణ విజేత నీరజ్ చోప్రాకు తీవ్ర జ్వరం) ఒలింపిక్స్ తర్వాత తొలిసారి స్వగ్రామం సమల్ఖాకు మంగళవారం వెళ్లిన నీరజ్కు అపూర్వ స్వాగతం లభించింది. గ్రామస్తులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా నీరజ్పై పూల వర్షం కురిపించారు. పిండిపదార్థాలు ప్రత్యేకంగా తయారుచేశారు. పానిపట్కు చేరుకున్న అనంతరం నీరజ్ నీరసించడంతో వెంటనే అతడి స్నేహితులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నీరజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని స్నేహితుడు ఒకరు తెలిపారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ అని తేలిన విషయం తెలిసిందే. స్వర్ణ పతకం సాధించి వచ్చిన అనంతరం నీరజ్ చాలా బిజీ అయ్యాడు. వరుస కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండడంతో అనారోగ్యం చెందాడు. కొంత విశ్రాంతి ఇస్తే ఈ 23 ఏళ్ల యువకుడు కొంత కోలుకునే అవకాశం ఉంది. చదవండి: ‘ట్విటర్ పక్షి’ని మాంచిగా వండి లాగించేసిన కాంగ్రెస్ నాయకులు -
ఆసుపత్రిలో చేరిన బీసీసీఐ బాస్ సోదరుడు
కోల్కతా: బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ సోదరుడు స్నేహాశీష్ గంగూలీ ఆసుపత్రిలో చేరారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) కార్యదర్శి అయిన స్నేహాశీష్.. స్వల్ప అస్వస్థకులోనై(జ్వరం, కడుపునొప్పి) శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఆసుపత్రిలో చేరారు. ఈ ఏడాది జనవరిలో ఆయనకు అపోలో ఆసుపత్రిలో యాంజియోప్లాస్టీ జరిగింది. దీంతో యాంజియోప్లాస్టీ వల్లే ఏమైనా సమస్య వచ్చిందేమోనని కుటంబ సభ్యులు ఆందోళన చెందారు. జ్వరంగా కూడా ఉండటంతో కోవిడ్ పరీక్ష చేయించారు. అందులో నెగిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని ఉడ్ల్యాండ్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ ఏడాది జనవరిలో సౌరవ్ గంగూలీకి కూడా యాంజియోప్లాస్టీ జరిగింది. -
ఆసుపత్రి పాలైన ప్రముఖ బాలీవుడ్ నటి
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటి నుష్రత్ బరుచా ఆసుపత్రి పాలైంది. లవ్ రంజన్ సెట్స్పై ఉండగానే ఉన్నట్లుండి ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. దీంతో యూనిట్ సభ్యులు నుష్రత్ను వెంటనే ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేర్పించారు. మూడు వారాల పాటు విరామం లేకుండా షూటింగ్ చేయడంతో ఆమె మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి లోనయినట్లు వైద్యులు తెలిపారు. మరో 15 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారు. కాగా కొన్నాళ్ల నుంచి తాను వెర్టిగో సమస్యతో బాధపడుతున్నానని, దీంతో ఉన్నట్లుండి కళ్లు తిరిగి పడిపోవడం, బలహీనంగా అయిపోవడం లాంటివి జరుగుంటాయని..ఆరోజు కూడా అదే విధంగా జరిగిందని నుష్రత్ తెలిపింది. ఆరోజు షూటింగ్ జరుగుతండగానే నా ఆరోగ్యం కాస్త క్షీణిస్తున్నట్లు అనిపించింది. అప్పటికే నా బీపీ 65/55 కి పడిపోయింది. దీంతో కనీసం నడవలేని స్థితిలో ఉండగా వీల్ చెయిర్లోనే ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లారు. అప్పటికే అమ్మానాన్న అక్కడికి చేరుకున్నారు. బాగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే నేను ఇంకా హాస్పిటల్లోనే ఉంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ఇంట్లోనే పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నాను. త్వరలోనే షూటింగ్లో పాల్గొంటాను అని పేర్కొంది. ప్రస్తుతం నుష్రత్ చేతిలో లవ్ రంజన్తో పాటు రామ్సేతు, హుర్దాంగ్ సహా మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. -
ఆస్పత్రిలో చేరిన మేయర్ కిశోరీ
సాక్షి, ముంబై: శివసేన కార్పొరేటర్, ముంబై మేయర్ కిశోరీ పేడ్నేకర్ ఛాతీ నొప్పితో ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆదివారం మధ్యాహ్నం మేయర్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. శనివారం రాత్రి నుంచే ఆమె స్వల్ప ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం నొప్పి మరింత తీవ్రం కావడంతో పరేల్లోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. అయితే మేయర్ కార్యాలయం వర్గాలు ఆమె ఆరోగ్యం ఎలా ఉందనే దానిపై ఇంతవరకు ఎలాంటి బులెటిన్ విడుదల చేయలేదు. ఆమె ఆస్పత్రిలో చేరినట్లు తెలియగానే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతోపాటు పలువురు మంత్రులు, ఆ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు. -
నయనతార తండ్రికి అస్వస్థత.. ఐసీయూలో చికిత్స
ప్రముఖ హీరోయిన్ నయనతార తండ్రి కురియన్ కొడియట్టు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. నయనతార తండ్రి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియుడు విఘ్నేశ్ శివన్తో కలిసి నయనతార ఇటీవలి కాలంలో ప్రత్యేక విమానంలో కొచ్చికి వచ్చి వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక తన కూతురి పెళ్లిని కళ్లారా చూసుకోవాలని నయన్ తండ్రి ముచ్చటపడుతున్నారట. కొద్ది కాలంగా ఇదే విషయాన్ని నయన్తోనూ ప్రస్తావించారట. గత నాలుగేళ్లుగా విఘ్నేశ్తో ప్రేమలో ఉన్న నయనతార.. పెళ్లి విషయంపై మాత్రం కాస్త వెనకడుగు వేస్తుందట. కానీ ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక తమ పెళ్లి విషయాన్ని ఈ మధ్యే విఘ్నేశ్ శివన్ సైతం అధికారికంగా ప్రకటించారు. ఇన్స్టాలో ఫ్యాన్స్తో ముచ్చటించిన ఆయన త్వరలోనే తమ పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వివాహం కూడుకున్నదని, అందుకు ఇప్పటినుంచే డబ్బులు సేవ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో అతి త్వరలోనే నయన్-విఘ్నేశ్ పెళ్లి పీటలెక్కనున్నారని తెలుస్తోంది. -
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వనజీవి రామయ్య
సాక్షి, ఖమ్మం: పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చేర్చి వైద్యులు ప్రత్యేక వైద్య సేవలందించారు. ఆస్తమా, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో రామయ్య ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని రామయ్యకు సూచించారు. విశ్రాంతి తీసుకోవడం అవసరం కాగా ఇటీవల వనజీవి రామయ్య మరోసారి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గడిచిన మూడు నెలల వ్యవధిలో మూడు సార్లు అస్వస్థతకు గురయ్యారు రామయ్య. ప్రస్తుతం ఆయ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. హరితహరంలో భాగంగా రామయ్య గ్రామాల్లో తిరుగుతు చెట్లు నాటుతు ఉండటం వల్ల శ్వాస కోశ ఇబ్బందులు వచ్చాయని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రామయ్య బయట తిరగకుండా విశ్రాంతి తీసుకోవడం అవసరమన్నారు. వయసు భారం దృష్ట్య రామయ్య కోన్ని ఆనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పుతున్నారన్నారు. కాగా గత కొంతకాలంగా వనజీవి రామయ్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురై ఆసుపత్రిలో చేరిన రామయ్య అనంతరం కోలుకున్నారు. అయితే నిరంతరం మొక్కల గురించి ఆలోచించే ఆయన.. ఏంత ఇబ్బంది ఉన్న మొక్కలను నాటే కార్యక్రమంను మాత్రం ఏ రోజు వాయిదా వేయరు. ప్రతి రోజు మొక్కలను నాటుతునే ఉండాలన్నది ఆ కోరిక. అంతేకాదు తన చివరి శ్వాస పోయే వరకు కూడా మొక్కలను నాటుతునే ఉంటానని సాక్షి ఇంటర్వ్యూలో కూడ రామయ్య చెప్పుకొచ్చారు. 50ఏళ్ల నుంచి మొక్కలను నాటుతూ వస్తున్న రామయ్య.. ఇప్పటి వరకు 3కోట్ల మొక్కలను నాటారు. -
కలహాల కాపురం? విషం సేవించిన భార్యాభర్తలు
జయపురం: నవరంగపూర్ జిల్లా రాయిఘర్ సమితి కచరాపర-2 గ్రామానికి చెందిన భార్యాభర్తలు కుటుంబంలో తగవుల కారణంగా ఆస్పత్రి పాలైనట్లు అనుమానిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మనోరంజన్కు ఉమ్మరకోట్ సమితి గుబురి గ్రామానికి చెందిన జయంతితో 15 యేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. శుక్రవారం జయంతి విషం తాగి వాంతులు చేసుకుంటుండడం చూసిన భర్త, గ్రామస్తులు వెంటనే రాయిఘర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకువెళ్లగా డాక్టర్లు పరీక్షించి మందులు ఇచ్చారు. కొంతసేపటికి ఆరోగ్యం కుదుటపడుతున్న సమయంలో జయంతి తండ్రి హిరెన్ మండల్, మరి కొంతమంది బంధువులతో హాస్పిటల్కు వచ్చి తన కుమార్తె పరిస్థితికి భర్తే కారకుడని ఆరోపించి దాడి చేసి కొట్టారు. ఈ దెబ్బలకు మనోరంజన్ అక్కడే సృహ కోల్పోవడంతో వెంటనే నవరంగపూర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కుటుంబకలహాలే ఈ పరిస్థితికి కారణమని పోలీసులు, బంధువులు, గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలిసిన రాయిఘర్ పోలీసు అధికారి ఠంకుగిరి భొయి సిబ్బందితో రాయిఘర్ ఆస్పత్రికి చేరుకుని సంఘటనపై కేసు నమోదు చేశారు. భార్యాభర్తలు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని, వారిని విచారణ చేస్తామని వెల్లడించారు. -
కరోనా గుట్టు.. చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు!
వెబ్డెస్క్: కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందన్న ఆరోపణలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో చైనా చుట్టూ గట్టి ఉచ్చు బిగించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. సార్స్-సీవోవీ-2 వైరస్ కారకం వుహాన్ ల్యాబ్లోనే పుట్టిందనే అనుమానాల్ని బలపరిచేలా మరో కీలక ఆధారాన్ని డబ్ల్యూహెచ్వో ప్యానెల్ ముందు అమెరికా ఉంచిది. కరోనా విజృంభణ మొదలుకాక ముందు.. నవంబర్ 2019లో వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేసే ముగ్గురు పరిశోధకులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో వాళ్లను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వాళ్లు ట్రీట్మెంట్ తీసుకుంటున్నవిషయాన్ని చాలా గోప్యంగా ఉంచింది ల్యాబ్. అంతేకాదు ఆ ఆస్పత్రి బయట గట్టి కాపలా ఉంచింది. అమెరికన్ నిఘా వర్గాలు ఈ వివరాలతో సమగ్రంగా ఒక రిపోర్ట్ తయారు చేశాయి. తాజాగా డబ్ల్యూహెచ్వో డెషిషన్ మేకింగ్ బాడీ మీటింగ్లో ఈ రిపోర్ట్ ప్రస్తావనకు వచ్చింది. దీంతో కరోనా పుట్టుక గురించి జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ రిపోర్ట్ను ప్రధానంగా పరిశీలించాలని డబ్ల్యూహెచ్వో ప్యానెల్ డిసైడ్ నిర్ణయించుకుంది. ఈ విషయాల్ని ప్రముఖ అమెరికన్ పత్రిక వాషింగ్టన్ డీసీ ప్రచురించింది. అమెరికా అతిచేస్తోంది వుహాన్ ల్యాబ్ సిబ్బంది ముగ్గురూ కోవిడ్19 లక్షణాలతో పాటు సీజనల్ జబ్బులతో ఆస్పత్రుల్లో చేరారని అమెరికన్ ఇంటెలిజెన్సీ రిపోర్ట్ పేర్కొంది. అయితే వాళ్లు ఆస్పత్రుల్లో చేరిన సమయం, చికిత్సను గోప్యంగా ఉంచడం, కొన్నాళ్లకే కరోనా విజృంభించడం.. ఈ అనుమానాలన్నీ ‘కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్’ సృష్టే అనే వాదనను బలపరుస్తున్నాయని తెలిపింది. చైనా మాత్రం అమెరికా ఆరోపణలను మొదటి నుంచే ఖండిస్తోంది. ‘అమెరికా అతిచేస్తోందని, ఈ ఆరోపణలు దర్యాప్తును పక్కదారి పట్టించేలా ఉన్నాయ’ని విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు కరోనా తమ భూభాగంలో పుట్టలేదని, మేరీల్యాండ్లో ఫోర్ట్ డెట్రిక్ మిలిటరీ బేస్ మీదే తమకు అనుమానాలు ఉన్నాయని చైనా ఇది వరకే డబ్ల్యూహెచ్వోకి ఒక రిపోర్ట్ అందజేసింది కూడా. అయితే వుహాన్ ల్యాబ్ రీసెర్చర్ల ట్రీట్మెంట్ గురించి ట్రంప్ హయాంలోనే రిపోర్ట్ తయారైనప్పటికీ.. బైడెన్ కార్యాలయం మాత్రం ఈ ఇష్యూపై స్పందించట్లేదు. శాంపిల్స్ ఇవ్వట్లేదు శరదృతువు (సెప్టెంబర్ నుంచి డిసెంబర్ నెలల మధ్య) కాలంలో వుహాన్ రీసెర్చలు సీజనల్ జబ్బులు పడడం సర్వసాధారణమని డచ్ వైరాలజిస్ట్ మరియోన్ చెబుతోంది. ఆ ముగ్గురు కొవిడ్ లక్షణాలతోనే చేరారా? అనేది అనుమానం మాత్రమే అని ఆమె ఆంటోంది. ఇక 2019 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య డెబ్భై ఆరువేల మంది సీజనల్ జబ్బుల బారినపడ్డారు. వాళ్లలో యాంటీ బాడీస్ కోసం 92 మందిని మాత్రమే చైనా పరీక్షించింది. ఈ విషయం డబ్ల్యూహెచ్వో దృష్టికి రావడంతో వాళ్ల రిపోర్ట్లు కోరింది. అయితే గోప్యతను సాకుగా చూపెడుతూ చైనా అందుకు నిరాకరించింది. ఇక వుహాన్ ల్యాబ్ బ్లడ్ బ్యాంక్ రిపోర్ట్లను సైతం ఇచ్చేందుకు చైనా మొదట అంగీకరించకపోగా.. డబ్ల్యూహెచ్వో ఒత్తిడితో దిగొచ్చింది. కానీ, ఇప్పటిదాకా ఎలాంటి రిపోర్టులు సమర్పించలేదని తెలుస్తోంది. -
క్షీణించిన మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యం
రాయగడ: ఒడిషా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ గిరిధర్ గొమాంగొ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స నిమిత్తం భువనేశ్వర్ ఎయిమ్స్ హాస్పిటల్లో చేర్పించినట్లు ఆయన కుమారుడు, బీజేపీ నాయకుడు శిశిర్ గొమాంగొ ఓ ప్రకటనలో సోమవారం వెల్లడించారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన ఆరోగ్యం కోలుకుని ఇంటికి చేరుకోగా, ఇంటికి చేరిన కొన్నిరోజులకే ఇలా బాగాలేకపోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు శిశిర్ గొమాంగొ తెలిపారు. చదవండి: రేపు పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు అంతలోనే.. చదవండి: కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి -
ఆసుపత్రిలో చేరిన ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త, ప్రముఖ హాలీవుడ్ గాయకుడు నిక్ జోనస్ ఆసుత్రిలో చేరినట్లు తెలుస్తోంది. లాస్ ఏంజెల్స్లో శనివారం రియాలిటీ షో ‘ది వాయిస్’ షూటింగ్ చేస్తున్న సమయంలో నిక్కు స్వల్ప గాయాలయినట్లు, దీంతో అతన్ని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసినట్లు సమాచారం. గాయాలు పెద్దవేమి కాకపోవడంతో డాక్టర్ల చికిత్స అనంతరం ఆదివారం డిశ్చార్జ్ అయినట్లు వినికిడి. నిక్ యదావిధిగా సోమవారం మాత్రం తన రియాలిటీ షో ‘ది వాయిస్’లో పాల్గొనబోతున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే అతనికి గాయాలు ఎలా అయ్యాయనే విషయం తెలియరాలేదు. కాగా 2018లో ప్రియాంక, ప్రముఖ అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్ను ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసున్న విషయం తెలిసిందే. ప్రియాంక కంటే నిక్ పదేళ్లు చిన్న వాడు. ప్రస్తుతం వీరిద్దరూ తమతమ వృత్తుల్లో బిజీగా ఉన్నారు. ప్రియాంక తన ప్రాజెక్ట్స్ కోసం లండన్, నిక్ జోనస్ లాస్ ఏంజెల్స్లో ఉంటున్నాడు. మరోవైపు భారత్లో కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రియాంకా చోప్రా, తనభర్త నిక్ జోనాస్ కలిసి కోవిడ్ బాధితుల కోసం ‘టుగెదర్ ఇండియా’ అంటూ విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: అవును ఒప్పుకుంటున్న, నా వయసైపోతుంది: ప్రియాంక -
సంతలో లస్సీ.. 100 మంది ప్రాణం మీదకు వచ్చింది..
భువనేశ్వర్: వేసవి కాలం కావడంతో చల్లగా లస్సీ తాగి సేదతీరిన వ్యక్తులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. సరదాగా తాగిన లస్సీ వారి ప్రాణం మీదకు వచ్చింది. అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వంద మందికిపై అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా కుర్తి గ్రామంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం బాధితులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై వైద్యాఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు. శుక్రవారం కుర్తిలో వారాంతపు సంత జరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. ఎండ తీవ్రంగా ఉండడంతో ప్రజలు స్వాంతన కోసం అక్కడ ఉన్న ఓ దుకాణంలో చల్లగా లస్సీ తాగారు. లస్సీ తాగి వారి పనులు ముగించుకుని వెళ్లారు. కొద్దిసేపటికి లస్సీ తాగిన వారికి తీవ్ర కడుపునొప్పి వచ్చింది. చాలామందికి తీవ్రంగా కడుపునొప్పి రావడంతో ఒక్కసారిగా ఆస్పత్రులకు బాధితులు వచ్చారు. వంద మందికిపైగా జబ్బు పడ్డారు. దీంతో వైద్యులు కంగారుపడ్డారు. బాధితులంతా ఒకే సమస్యతో బాధపడుతున్నారని గుర్తించి వివరాలు సేకరించారు. ఈ విచారణలో అందరూ లస్సీ తాగారని గుర్తించి ఆ లస్సీ వలనే కడుపునొప్పి వచ్చిందని నిర్ధారించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. ఈ ఘటనతో వెంటనే స్పందించిన సీడీఎంఓ ప్రఫుల్లా కుమార్ నందా కుర్తి గ్రామాన్ని సందర్శించారు. వైద్యాధికారులు సందర్శించి ఆ దుకాణం వద్ద వివరాలు సేకరించారు. గ్రామంలో ఎవరైనా ఈ బాధతో పడుతున్నారో గుర్తించారు. లస్సీ తాగడంతో కడుపునొప్పి రావడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. లస్సీలో ఏమైనా కలిసిందా? లేదా వాడిన ఐస్ మంచిదేనా? శుభ్రమైన నీరు వాడరా? లేదా? అనే విషయాలు వైద్య శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. చదవండి: ఆక్సిజన్ అందక కర్నూలులో ఐదుగురు మృతి చదవండి: ‘భారత్ కోలుకో’: నయాగారా జలపాతం త్రివర్ణశోభితం -
ఐసీయూలో కరీనా కపూర్ తండ్రి రణదీర్
ముంబై : కపూర్ ఫ్యామిలీలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. ఇటీవలె రణ్బీర్ కపూర్, నీతూ కపూర్లు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా కరీనా కపూర్ తండ్రి, నటుడు రణధీర్ కపూర్కు కరోనా సోకింది. 74ఏళ్ల రణధీర్ కపూర్కు కరోనా పాజిటివ్ అని తేలడంతో వెంటనే ఆయన్ను ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్పించారు. శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఉండటంతో ప్రస్తుతం రణదీర్ను ఐసీయూలోకి షిఫ్ట్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే గతేడాది సరిగ్గా ఇదే సమయంలో ఏప్రిల్ 30న రణధీర్ కపూర్ సోదరుడు, ప్రముఖ నటుడు రిషి కపూర్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన ఏడాదికే ఆయన సోదరుడు రణధీర్ కపూర్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే ఆయన రణధీర్ సోదరుడు రాజీవ్ కపూర్ కూడా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇటీవలె రణధీర్ కపూర్ కరోనా వ్యాక్సిన్ రెండవ డోస్ను కూడా తీసుకున్నట్లు సమాచారం. రణధీర్ కపూర్ త్వరలోగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. చదవండి : నా కొడుకు లవ్ బ్రేకప్కు ఆ హీరోయిన్లే కారణం కరీనా రెండో కొడుకు ఫోటో షేర్ చేసిన రణ్ధీర్ -
ప్రముఖ హాస్యనటుడికి గుండెపోటు, పరిస్థితి విషమం
సాక్షి, చెన్నై: ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ (59) తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు తీవ్ర ఛాతీ నొప్పి రావడంతో ఆయనను శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కార్డియాక్ అరెస్ట్తో బాధపడుతున్న వివేక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే వివేక్ తీవ్ర అనారోగ్యానికి గురి కావడం కలకలం రేపింది. అయితే వ్యాక్సిన్కు, గుండెపోటుకు సంబంధం ఉందా అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుతం ఎక్మో ట్రీట్మెంట్ అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తోంది కాగా చెన్నై ఓమందూరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివేక్ గురువారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టీకా మాత్రమే మన ప్రాణాలను కాపాడుతుందంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
కరోనాతో ఆస్పత్రిలో చేరిన మాజీ ముఖ్యమంత్రి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు హోం ఐసోలేషన్లో ఉన్న ఆయన శనివారం ఉదయం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేదని తెలుస్తోంది. అయితే ముందస్తు జాగ్రత్తలో భాగంగా చేరినట్లు ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మార్చి 30వ తేదీన 83 ఏళ్ల ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అప్పటి నుంచి ఆయన హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. అప్పటి నుంచి ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. అయితే వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఈ మేరకు ఫరూక్ శ్రీనగర్లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆయన కరోనా వ్యాక్సిన్ పొందిన తర్వాత పాజిటివ్ రావడం గమనార్హం. ‘తన తండ్రి కోసం ప్రతిఒక్కరూ చేస్తున్న ప్రార్థనలు, మద్దతు తెలుపుతున్నందుకు మా కుటుంబం గర్వపడుతుంది’ అని పేర్కొన్నారు. ఫరూక్ అబ్దుల్లా ఆరోగ్యం విషయమై ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆయన ఆరోగ్య వివరాలు తెలుసుకుని ఆయన వెంటనే కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. Based on the advice of doctors to enable them to better monitor my father, he has been admitted to hospital in Srinagar. Our family remains grateful to everyone for their messages of support & their prayers — Omar Abdullah (@OmarAbdullah) April 3, 2021 -
పోలియో బదులు శానిటైజర్.. చిన్నారులు అస్వస్థత
ముంబై: పోలియో చుక్కల పంపిణీలో సిబ్బంది చేసిన నిర్వాకంతో చిన్నారులు అస్వస్థతకు గురయ్యాయి. కరోనా రాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వినియోగించే శానిటైజర్ను పోలియో చుక్కల మాదిరిగా వేశారు. దీంతో చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పారు. అయితే ఈ ఘటనపై చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆదివారం (జనవరి 31) చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ చేశారు. అయితే యావత్మల్లో పిల్లలకు పోలియో చుక్కలకు బదులు శానిటైజర్ చుక్కలు వేశారు. దీంతో చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపింది. శానిటైజర్ చుక్కలు వేయించుకున్న 12 మంది పిల్లల అస్వస్థతకు గురయ్యారు. కంగారుపడిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడు గుర్తించారు.. పిల్లలకు పోలియో బదులు శానిటైజర్ వేశారని. ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం బాగుందని.. కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. అయితే విధుల్లో నిర్లక్ష్యం వహించిన డాక్టర్, ఆరోగ్య, ఆశా కార్యకర్తలను సస్పెండ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
భారత మాజీ క్రికెటర్ చంద్రశేఖర్కు అస్వస్థత
సాక్షి, బెంగళూరు: భారత మాజీ క్రికెటర్, విఖ్యాత లెగ్ స్పిన్నర్ బి.ఎస్. చంద్రశేఖర్ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన భార్య సంధ్య వెల్లడించారు. రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపినట్లు ఆమె చెప్పారు. 75 ఏళ్ల చంద్రశేఖర్ గత శుక్రవారం తీవ్రమైన అలసటకు గురయ్యారు. దాంతో పాటు మాట తడబడటంతో ఆయన్ని స్థానిక హాస్పిటల్లో చేర్పించారు. అత్యవసర విభాగంలోని వైద్యనిపుణులు ఆయనను పరీక్షించి... స్వల్ప బ్రెయిన్ స్ట్రోక్గా నిర్ధారించి చికిత్స చేశారు. మెదడు రక్తనాళాల్లో బ్లాకేజ్లు ఏర్పడ్డాయని అందువల్లే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెప్పారు. అనంతరం సాధారణ వార్డ్కు మార్చారని, ఇప్పుడు ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం, సమస్యా లేదని సంధ్య తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారం పది రోజుల్లోనే పూర్తిగా కోలుకుంటారని ఆమె పేర్కొన్నారు. మైసూరుకు చెందిన చంద్రశేఖర్ తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 58 టెస్టులు ఆడి 242 వికెట్లు పడగొట్టారు. అప్పటి సహచర స్పిన్నర్లు బిషన్సింగ్ బేడీ, ప్రసన్న, వెంకటరాఘవన్లతో కలిసి 1960, 70 దశకాలను శాసించారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ‘అర్జున’, ‘పద్మశ్రీ’ పురస్కారాలతో గౌరవించింది. -
గేల్.. నువ్వు త్వరగా కోలుకోవాలి
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కు ఏది కలిసిరావడం లేదు. శనివారం కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో సులభంగా గెలిచే మ్యాచ్ను కష్టతరం చేసుకొని ఆపై కేవలం రెండు పరుగుల తేడాతో ఓడిపోవడం ఆ జట్టు దారుణ వైఫల్యం గురించి చెబుతుంది. ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోని మిడిలార్డర్ బ్యాట్స్మన్లు దారుణంగా ఫేయిలయ్యారు. చివరి బంతిని మ్యాక్స్వెల్ భారీ షాట్కు ప్రయత్నించినా.. దురదృష్టం ఆ జట్టును వెంటాడుతుండడంతో అది బౌండరీగా మారి వారి పాలిట శాపంగా మారింది. లీగ్లో వరుసగా విఫలమవుతూ వస్తున్న మ్యాక్స్వెల్ స్థానంలో క్రిస్ గేల్ను జట్టులోకి తీసుకోవాలంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. (చదవండి : ‘గేల్ను తీసుకోకుండా మళ్లీ తప్పు చేశారు’) శనివారం కేకేఆర్తో జరిగిన మ్యాచ్లోనూ గేల్ను తుది జట్టులోకి తీసుకోలేదు. అయితే గేల్ను జట్టులోకి తీసుకోకపోవడం వెనుక బలమైన కారణమే ఉంది. నిజానికి ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లోనే గేల్ను తీసుకోవాలని భావించారు. కానీ గేల్కు ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రిలో చేరాడని.. అందుకే మ్యాచ్ ఆడలేదని ఆ జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. ఇప్పుడు అతని పరిస్థితి బాగానే ఉన్నా కాస్త అనారోగ్యం ఉండడంతో కేకేఆర్తో మ్యాచ్లోనూ బరిలోకి దిగలేదని పేర్కొన్నాడు. కాగా గేల్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందిన అతని అభిమానులు గేల్ నువ్వు త్వరగా కోలుకోవాలంటూ సోషల్మీడియాలో కామెంట్స్ షేర్ చేశారు. దీంతో క్రిస్ గేల్ తన ఆరోగ్య పరిస్థితిపై ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను విడుదల చేశాడు. 'మీ అందరికి ఒక విషయం చెప్పదలచుకున్న. సమస్యలో ఉన్నప్పుడు పోరాటం చేయకుండా నేను వెనుకడుగు వేయను. నేను యునివర్స్ల్ బాస్ను.. నేను ఎన్నటికి మారను. ఎంత కష్టం వచ్చిన దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను తప్ప నా శైలిని మార్చుకోను. బతకడం అనేది ఒక కళ.. అది అందరికి రాదు. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా.. మీ ఆశీర్వాద బలం ఎప్పటికి ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటాన్నా. నా కోసం ప్రార్ధించిన మీ అందరికి ధన్యవాదాలు. అంటూ తెలిపాడు. కాగా పంజాబ్ ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఇకపై పంజాబ్కు ప్రతీ మ్యాచ్కు కీలకంగా మారనుంది. ఇప్పటినుంచి ఆడే ప్రతీ మ్యాచ్లోనూ పంజాబ్ గెలవాల్సి ఉంటుంది. తన తర్వాతి మ్యాచ్ను అక్టోబర్ 15న ఆర్సీబీతో తలపడనుంది.(చదవండి : దినేశ్ కార్తీక్.. ఏం తిన్నావ్: మాజీ క్రికెటర్) -
ఆ పుకార్లు నమ్మకండి: సంజయ్దత్
సంజయ్దత్ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం గురించి వివిధ రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన ఊపిరితిత్తుల కాన్సర్తో బాధపడుతున్నారని,దానికి సంబంధించిన వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఆగస్టు 8 వతేదీన ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి రావడంతో ముంబైలోని లీలావతి హాస్పటల్లో చేరారు. ఆయనకు కరోనా టెస్ట్లు చేయగా నెగిటివ్ అని తేలింది. అయితే దీనికి సంబంధించి సంజయ్ దత్ ట్వీట్ చేశారు. నేను కొంత సమయం పాటు నా పనికి బ్రేక్ ఇచ్చాను. నా ఆరోగ్యం కొద్దిగా క్షీణించడంతో చికిత్స నిమిత్తం హాస్పటల్లో చేరాను. ఇక్కడ నేను నా కుటుంబ సభ్యులు, హాస్పటల్ సిబ్బంది పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాను. ప్రస్తుతం నేను బాగున్నాను. నా గురించి వస్తున్న పుకార్లను దయచేసి ఎవరు నమ్మకండి. మీ అందరి అభిమానం, ఆశీస్సులతో నేను త్వరగానే తిరిగి వస్తాను’ అని ట్విట్టర్లో తెలిపారు. ఇక సంజయ్దత్ ప్రస్తుతం ఆలియాభట్ నటిస్తున్న సడక్2 చిత్రంలో కనిపించనున్న విషయం తెలిసిందే. సంజయ్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులతో పాటు చాలా మంది సెలబ్రెటీలు సైతం సంజయ్దత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్విట్ చేస్తున్నారు. 🙏🏻 pic.twitter.com/tinDb6BxcL — Sanjay Dutt (@duttsanjay) August 11, 2020 చదవండి: ‘సంజయ్ జీవితమంతా పోరాడుతూనే ఉన్నారు’ -
ప్రముఖ నటుడు రిషీకపూర్కు అస్వస్థత
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీకపూర్ బుధవారం అస్వస్థతకు గురుయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషీకపూర్ను ఆయన కుటుంబసభ్యులు ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ చేర్పించారు. ఈ విషయాన్ని రిషి కపూర్ సోదరుడు రణ్ధీర్ కపూర్ మీడియాకు వెల్లడించారు. ‘రిషీకపూర్ హాస్పిటల్లో ఉన్నారు. ఆయన క్యాన్సర్, శాస్వకోస సమస్యతో బాధపడుతున్నారు. అందుకే హాస్పిటల్లో చేర్పించాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది’ అని రణ్ధీర్ కపూర్ తెలిపారు. కాగా, క్యాన్సర్తో బాధపడుతున్న రిషీకపూర్ ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతం గతేడాది సెప్టెంబర్లో ఆయన భారత్కు వచ్చారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ఫ్యామిలీ ఫంక్షన్కు హాజరైన సమయంలో అస్వస్థతకు లోనుకావడంతో అక్కడే హాస్పిటల్లో చేర్పించారు. ఆ సమయంలో తాను ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్టుగా రిషీకపూర్ వెల్లడించారు. ఢిల్లీ నుంచి ముంబై వచ్చిన తర్వాత వైరల్ ఫీవర్తో ఆయన మరోసారి హాస్పిటల్లో చేరారు. అయితే త్వరగానే ఆయన డిశ్చార్జి అయ్యారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రిషీకపూర్.. ఏప్రిల్ 2 నుంచి తన ట్విటర్ అకౌంట్లో ఎలాంటి పోస్టులు చేయలేదు. ప్రస్తుతం ఆయన హాలీవుడ్ చిత్రం ‘ది ఇంటర్న్’ హిందీ రీమేక్లో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ కథానాయికగా నటింస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్కి బ్రేక్ పడింది. చదవండి : దేశ ప్రతిష్టను పెంచిన నటుడు ఇర్ఫాన్ఖాన్ మృతి పట్ల సినీ ఇండస్ట్రీ నివాళి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1361281962.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మరోసారి హాస్పిటల్లో చేరిన సీనియర్ నటుడు
బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీ కపూర్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. 2018 సెప్టెంబర్లో క్యాన్సర్ చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లిన దాదాపు ఏడాది తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరోసారి హాస్పిటల్లో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని ఓ ఫ్యామిలీ ఫంక్షన్కు హాజరైన సమయంలో రిషీ కపూర్ అనారోగ్యానికి గురికావడంతో.. ఆయనను ఆస్పత్రిలో చేర్పించినట్టుగా తెలుస్తోంది. రిషీ కపూర్ వెంట ఆయన భార్య నీతూ కపూర్ కూడా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న రణబీర్ కపూర్, ఆలియా భట్లు వెంటనే ఢిల్లీకి బయలుదేరారు. అయితే రిషీ కపూర్ ఏ సమస్యతో హాస్పిటల్లో చేరాడనేదానిపై మాత్రం స్పష్టత లేదు. కాగా, అర్మాన్ జైన్ మెహందీ ఫంక్షన్లో రిషీ కపూర్ కుటుంబసభ్యులు కనిపించకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. -
ఆస్పత్రిలో చేరిన ములాయం
లక్నో : సమాజ్వాదీ పార్టీ వ్యవస్ధాపక నేత ములాయం సింగ్ యాదవ్ అస్వస్ధతతో శుక్రవారం లక్నోలోని పీజీఐ ఆస్పత్రిలో చేరారు. ములాయం ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యులు ఆయనకు పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు. కొద్ది గంటల్లోనే ములాయంను డిశ్చార్జి చేస్తామని పీజీఐ వైద్యులు వెల్లడించారు. సాధారణ చెకప్ కోసమే ములాయం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని చెప్పారు. రొటీన్ చెకప్లో భాగంగా తనకు గ్యాస్ర్టో, నరాల సంబంధిత సమస్యలపై ఆయన ఫిర్యాదు చేశారని పరీక్షల అనంతరం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడైనట్టు వైద్యులు తెలిపారు. కాగా లోక్సభ ఎన్నికల్లో మొయినాబాద్ నుంచి బరిలో నిలిచిన ములాయం ఇటీవల తన బద్ధ శత్రువు, బీఎస్పీ చీఫ్ మాయావతితో కలిసి ప్రచార వేదికను పంచుకున్నారు. యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి బీజేపీని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. -
రిసార్టులో ఎమ్మెల్యేల బాహాబాహీ
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో ఉన్న ఈగల్టన్ రిసార్టులో కలకలం చెలరేగింది. ఈ రిసార్టులో శనివారం రాత్రి కాంగ్రెస్ నేతలు భోజనం చేస్తుండగా కంప్లి ఎమ్మెల్యే జె.ఎన్.గణేశ్, హోసపేటె ఎమ్మెల్యే, గనుల వ్యాపారి ఆనంద్ సింగ్ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన గణేశ్ టేబుల్పై ఉన్న మద్యం బాటిల్తో ఒక్కసారిగా ఆనంద్సింగ్పై దాడిచేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆనంద్సింగ్ను నేతలు అపోలో ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయనకు 12 కుట్లు వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఆసుపత్రి ముందు మోహరించిన పోలీసులు ప్రస్తుతం రాజకీయ నేతలెవరినీ లోపలకు వెళ్లనివ్వడం లేదు. ఈ గొడవ విషయమై కాంగ్రెస్ అధికార ప్రతినిధి మధుయాష్కి మాట్లాడుతూ..‘బళ్లారి జిల్లాకు చెందిన గణేశ్, ఆనంద్ సింగ్ ఇద్దరూ పలు వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారానికి సంబంధించి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అదికాస్తా ముదరడంతో గణేశ్, ఆనంద్ సింగ్పై దాడి చేశారు. ఈ దాడికి, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు. రహస్య సమాచారం లీక్ చేశాడనే.. ఈగల్టన్ రిసార్టులో రెండ్రోజులుగా గణేశ్, ఆనంద్ సింగ్ మధ్య వాగ్వాదం కొనసాగుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో భాగంగా బీజేపీ నేతలు గణేశ్ను సంప్రదించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు తనను సంప్రదించిన విషయాన్ని, ఇస్తామన్న ఆఫర్ను గణేశ్ ఆనంద్సింగ్తో పంచుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ సీఎల్పీ భేటీకి విప్ జారీచేయడంతో గణేశ్ గత్యంతరం లేక హాజరయ్యారు. సమావేశం అనంతరం సీనియర్లు ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేలను నేరుగా రిసార్టుకు తరలించారు. ఈ సందర్భంగా గణేశ్ను బీజేపీ ప్రలోభపెట్టిన విషయాన్ని ఆనంద్సింగ్ సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య చెవిన వేశారు. ఈ విషయం తెలుసుకున్న గణేశ్ ఆగ్రహంతో ఊగిపోయారు. చివరికి మాటామాటా పెరగడంతో ఆనంద్సింగ్ తలపై మద్యం బాటిల్తో దాడిచేశారు. కాగా, తన భర్తపై దాడిచేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆనంద్సింగ్ భార్య ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని బిదాది పోలీసులు తెలిపారు. బీజేపీ విమర్శలు ఈగల్టన్ రిసార్టులో జరిగిన ఘటన ప్రజాస్వామ్యానికే కళంకమని బీజేపీ విమర్శించింది. ఈ గొడవను రాష్ట్ర పీసీసీ చీఫ్ గుండూరావు ఆపలేకపోవడం నిజంగా దురదృష్టకరమని ఎద్దేవా చేసింది. ఇన్నాళ్లూ ప్రతీ సమస్యకు బీజేపీనే కారణమని ఆరోపించిన గూండూరావు ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించింది. మరోవైపు కర్ణాటక బీజేపీ చీఫ్ యాడ్యూరప్ప ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా రాష్ట్రానికి తిరిగివస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే గవర్నర్ వజూభాయ్ వాలాను కలిసి కుమారస్వామి సర్కారును బలనిరూపణకు ఆదేశించాల్సిందిగా కమలనాథులు కోరే అవకాశమున్నట్లు సమాచారం. -
కర్ణాటక హైడ్రామా : ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బాహాబాహీ
-
ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బాహాబాహీ
సాక్షి, బెంగళూర్ : కర్ణాటకలో రిసార్ట్స్ రాజకీయాలు వేడెక్కాయి. బెంగళూర్లోని ఈగల్టన్ రిసార్ట్స్లో సేదతీరుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలిసింది. ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులు బాహాబాహీకి తలపడగా, ఈ అంశాన్ని కాంగ్రెస్లో కీచులాటలకు సంకేతంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, జేఎన్ గణేష్ల మధ్య వాగ్వాదం జరగ్గా సింగ్ తలపై గణేష్ బాటిల్ విసిరికొట్టారని సమాచారం. గాయపడిన ఆనంద్ సింగ్ను ఆస్పత్రికి తరలించారని స్ధానిక మీడియా వెల్లడించింది. కాగా ఆనంద్ సింగ్ను ఛాతీ నొప్పి రావడంతోనే ఆస్పత్రిలో చేర్పించినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇక బీజేపీ నుంచి బేరసారాలు జరుగుతాయనే భయంతో పాటు సీఎల్పీ భేటీకి నలుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రిసార్ట్స్కు తరలించిన సంగతి తెలిసిందే. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ను కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. -
దిలీప్కుమార్కు తీవ్ర అస్వస్థత
ముంబై : బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ (95) తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. న్యుమోనియా తిరగబెట్టడంతో దిలీప్ కుమార్ను ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చేర్చారని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అభిమానులకు, శ్రేయోభిలాషులకు సమాచారం చేరవేస్తామని దిలీప్ కుమార్ కుటుంబ సన్నిహితుడు ఫైసల్ ఫరూఖి ట్వీట్ చేశారు. దిలీప్ కుమార్ ఆరోగ్యం క్షీణించిందని ఇటీవల వార్తలు రాగా, ఫైసల్ ఫరూఖి ఇవి వదంతులేనని తోసిపుచ్చారు. 1944లో జ్వర్ భటా మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన దిలీప్ కుమార్ ఐదు దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్లో మరుపురాని చిత్రాల్లో తన అసమాన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కోహినూర్, మొఘల్ ఇ ఆజం, దేవ్దాస్, నయా దౌర్, రాం ఔర్ శ్యామ్ చిత్రాల్లో దిలీప్ కుమార్ నటనకు ప్రేక్షకులు నీరాజనం పలికారు. దిలీప్ కుమార్ చివరిసారిగా 1998లో ఖిలా మూవీలో బిగ్ స్ర్కీన్పై కనిపించారు. 1994లో దాదాసాహెబ్ పాల్కే అవార్డు, 2015లో పద్మవిభూషణ్ అవార్డులు ఆయనను వరించాయి. -
క్షీణించిన నవాజ్ షరీఫ్ ఆరోగ్యం
ఇస్లామాబాద్ : పాక్ బహిష్కృత ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్ధితి క్షీణించడంతో ఆయనను రావల్పిండిలోని అదియాల జైలు నుంచి పాకిస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీఐఎంఎస్)కు తరలించారు. ఛాతీ నొప్పితో బాధపడుతున్న మాజీ ప్రధాని ఆరోగ్యపరిస్థితిని పరీక్షించిన వైద్యులు కరోనరీ కేర్ యూనిట్ (సీసీయూ)లో చికిత్స అందిస్తున్నారని జియో న్యూస్ వెల్లడించింది. రావల్పిండిలోని జైలులో ఆయనకు నిర్వహించిన కార్డియోగ్రామ్ పరీక్షలో లోటుపాట్లు గుర్తించిన వైద్యులు ఆయనను ఆస్పత్రికి తరలించాలని సూచించారని పంజాబ్ ప్రావిన్స్ హోంమంత్రి షౌకత్ జావేద్ తెలిపారు. వైద్యుల సూచనపై జైల్ సూపరింటెండెంట్ పాక్ ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని సంప్రదించిన మీదట షరీఫ్ను పిమ్స్కు తరలించారు. నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితిపై ఈ నెల 24న వైద్య మండలిని నియమించిన సంగతి తెలిసిందే. షరీఫ్కు నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమని ఐదుగురు సభ్యులతో కూడిన వైద్య మండలి సూచించింది. -
మాదాల రంగారావు పరిస్థితి విషమం
విప్లవ నటుడు, నిర్మాత మాదాల రంగారావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన్ను స్టార్ హాస్పిటల్లో చేర్పించారు. ఈ మేరకు ఆయన కుమారుడు మాదాల రవి ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది తీవ్ర అనారోగ్యానికి గురైన మాదాల రంగారావుకు స్టార్ హాస్పిటల్ వైద్యులు చికిత్స చేశారు. అప్పటి నుంచి రంగారావు స్టార్ హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకుంటున్నారు. శనివారం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురికావటంతో హాస్పిటల్ చేర్పించారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్న ఆయనకు డయాలిసిస్ చేస్తున్నట్టుగా మాదాల రవి తెలిపారు. -
కోలుకుంటున్న భూ బాధితులు
సాక్షి, బుచ్చెయ్యపేట(చోడవరం): మండలంలోని ఎంబీపాలెంలో గ్రామస్తుల దాడిలో గాయపడిన మహిళలు అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. తమ భూమిలో జీడి పిక్కలు సేకరిస్తున్న గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు కలం వెంకట లక్ష్మి, అప్పాన మహాలక్ష్మిలపై అదే గ్రామానికి చెందిన కొందరు ఈ భూములు తమవంటూ శుక్రవారం దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. అపస్మారక స్థితికి చేరిన ఇద్దరినీ 108లో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల, చేతులు, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలైన అక్కాచెల్లెళ్లు మంచానికే పరిమితం అయ్యారు. 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోడానికి నాయకులు, అధికారులు కలిసి తమను భయాందోళనలకు గురి చేస్తున్నారన్నారు. తమకు న్యాయం జరగడం లేదంటూ ఆరోపించారు. సెలవులతో ధర్నా వాయిదా.. మహిళలపై దాడికి నిరసనగా శనివారం బుచ్చెయ్యపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు బాధిత మహిళల కుటుంబీకులు, గ్రామస్తులు యోచించారు. శనివారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులతో అధికారులు అందుబాటులో ఉండరని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఎనిమిది మందిపై ఫిర్యాదు బాధితుల ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ కుమారుడు కరణం నూకరాజుతో పాటు తహసీల్దార్ కె.వెంకట శివ, గ్రామానికి చెందిన అప్పాన అప్పలనాయుడు, ముత్యాలు, బేరా పడమటమ్మ, బర్ల చిన్న, పురిటి రాజు, సత్యంలు తమపై దాడితోపాటు అత్యాచారానికి ప్రయత్నించారని, బలవంతంగా భూములను లాక్కోవడానికి చూస్తున్నారని బాధితులు బుచ్చెయ్యపేట ఎస్ఐకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్ఐ కృష్ణారావు తెలిపారు. తహసీల్దార్ తమను డబ్బులు డిమాండ్ చేశారని, తన గదిలోకి రమ్మన్నారని బాధిత మహిళలు ఆరోపించారు. -
భార్య కాపురానికి రాలేదని..
సాక్షి, కావలిరూరల్: భార్య కాపురానికి రాలేదని మనస్థాపంతో ఓ యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం జరిగింది. స్థానిక కొనదిన్నె గిరిజనకాలనీకి చెందిన కొమరగిరి శివ దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న సాయిబాబా మందిరం వద్ద ఉంటుంది. శనివారం భార్య వద్దకు వచ్చి ఆమెను కాపురానికి రమ్మని పిలవగా నిరాకరించింది. దీంతో మనస్థాపానికి గురైన శివ సమీపంలో ఉన్న బ్లేడును తీసుకుని గొంతు కోసుకున్నాడు. స్థానికులు అతన్ని అడ్డుకుని 108కు సమాచారమిచ్చారు. పైలెట్ అబ్దుల్ జబ్బార్, ఈఎంటీ సలీంఖాన్ క్షతగాత్రుడిని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. -
గ్రామీణ బ్యాంకులో గోల్మాల్
సాక్షి, రంగారెడ్డి: అజీజ్నగర్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. తమ ఫిక్స్డ్ డిపాజిట్లలోని కోట్లాది రూపాయల డబ్బు ఖాతాదారులకు తెలియకుండానే మాయం అయింది. సమాచారం తెలిసిన ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. పరిసర గ్రామాల ప్రజలు బ్యాంకుకు తరలివస్తున్నారు. గ్రామస్తుల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని బ్యాంకు సిబ్బంది ఫిక్స్డ్ డిపాజట్లలోని డబ్బును మాయం చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఎఫ్డీలో డబ్బు మాయం అయిందన్న సమాచారంతో నాగిరెడ్డిగూడెం వాసి అయిన ఓ ఖాతాదారు కుప్పకూలిపోయాడు. దీంతో ఆయన్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్సలందిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది. -
సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
-
సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో బాధపడుతోన్న ఆమెను ఢిల్లీలోని శ్రీ గంగారాం ఆస్పత్రికి తరలించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిమ్లా(హిమాచల్ ప్రదేశ్) వెళ్లిన ఆమె.. అక్కడి గెస్ట్హౌస్లో ఉన్న సమయంలో ఇబ్బందికి గురయ్యారని కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. సిమ్లా నుంచి ప్రత్యేక వాహనంలో ఆమెను ఢిల్లీకి తీసుకొచ్చారు. ప్రస్తుతం సోనియా గాంధీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, చికిత్స వివరాలను తెలియజేస్తామని గంగారాం ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అధినేత్రి ఆస్పత్రిలో చేరడంపై కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న సోనియా.. గత ఏడాది అమెరికా వెళ్లి చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. -
విషమంగానే మహానటుడి ఆరోగ్యం
ముంబై: బాలీవుడ్ మహానటుడు దిలీప్ కుమార్(94) ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉన్నట్లు లీలావతి ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. డీహైడ్రేషన్తోపాటు మూత్రసంబంధిత ఇబ్బందులలో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు బుధవారం ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, దిలీప్ కిడ్నీలు కూడా చెడిపోయినట్లు వైద్యులు గుర్తించారని కొన్ని జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అలనాటి నటి, దిలీప్ కుమార్ సతీమణి సైరాబాను శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. ‘ అభిమానుల ప్రార్థనల మేరకైనా ఆయన తిరిగి కోలుకుంటార’నే ఆశాభావం వ్యక్తం చేశారు. వృధ్దాప్య సమస్యలకు తోడు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతోన్న దిలీప్.. ఈ ఏడాది ఏప్రిల్లోనూ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ‘ట్రాజెడీ కింగ్’గా గొప్ప పేరు తెచ్చుకున్న దిలీప్ కుమార్ అసలు పేరు మొహమ్మద్ యూసుఫ్ ఖాన్. అందాజ్, మధుమతి, ఆన్, దేవ్దాస్, మొఘల్ ఏ ఆజం, గంగా జమున, క్రాంతి, కర్మా తదితర చిత్రాలలో తనదైన నటనను ప్రదర్శించారు. 1998లో వచ్చిన ఖలీ.. దిలీప్ నటించిన చివరి సినిమా. కళారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ పురస్కారంతోపాటు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేసింది. -
కేంద్రమంత్రి మేనకాగాంధీకి అస్వస్థత
-
ఆసుపత్రిలో స్టార్ కమెడియన్
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, కమెడియన్, టీవీ షో వ్యాఖ్యాత కపిల్ శర్మ అనారోగ్యానికి గురయ్యారు. స్వల్ప అనారోగ్యంతో బుధవారం ఆయన అంధేరిలోని ఒక ఆసుపత్రిలో చేరారు. లో బ్లడ్ ప్రెషర్ కారణగా అసౌకర్యానికి గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శర్మ కోలుకుంటున్నారనీ, ఆయన ఆరోగ్య పరిస్తితి నిలకడగానే ఉందని బాలీవుడ్ మీడియా కథనం. ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ ఎపుడు డిశ్చార్చ్ చేసేది ఇంకా ఆసుపత్రి వర్గాలు ప్రకటించలేదు. అయితే నేడు జరగనున్న దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పంక్షన్కు హాజరు లేకపోవచ్చని బాలీవుడ్.లైఫ్ తెలిపింది. ఈ గౌరవ పురస్కారానికి ఈ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ రెండవ సారి ఎంపిక య్యారు. ఒకవైపు కపిల్ షో, మరోవైపు బాలీవుడ్ సినిమా షూటింగ్ పనుల్లో తీవ్రమైన ఒత్తిడికి గురైనట్టు పేర్కొంది. కాగా కామెడీ నైట్స్ విత్ కపిల్ ద్వారా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న కపిల్ శర్మ తాజాగా ది కపిల్ శర్మ షో కు వ్యాఖ్యాతగా ఉన్నారు. మరోవైపు ఫిరంగి మూవీ షూటింగ్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న కపిల్ ఇటీవల కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. -
కోలుకుంటున్న సోనియా గాంధీ
న్యూఢిల్లీ: ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆస్పత్రి పాలైన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కోలుకుంటున్నారని సర్ గంగారామ్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమెను ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని తెలిపాయి. ‘ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆదివారం ఆస్పత్రిలో చేరిన సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆమె క్రమంగా కోలుకుంటున్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశముంద’ని సర్ గంగారామ్ ఆస్పత్రి మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. 69 ఏళ్ల సోనియా గత ఏడాది ఇదే ఆస్పత్రిలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. -
ఆస్పత్రిలో చేరిన ఎన్డీ తివారి
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ (91) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఆయనను గతరాత్రి కుటుంబసభ్యులు రామ్ మనోహర్ లోహియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చేర్పించారు. తివారీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ...ఇవాళ తివారిని పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ’తివారీ తమకు వారసత్వ సంపద’ లాంటివారిని సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తివారీ తనయుడు రోహిత్...సీఎంను చూసి భావోద్వేగానికి గురయ్యాడు. కాగా ఈ నెల 19న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తివారీ హాజరయ్యారు. -
సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీకి అస్వస్థత
కొచ్చి: ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ,కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు రామ్ జెఠ్మలానీ అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. కేరళలోని క్రిమినల్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ఎన్ ఈ వీనింగ్ విత్ లెజెండ్’ పేరుతో న్యాయవాద వృత్తిలో 75 సం.రాల పాటు ఆయన చేసిన సేవలకు గాను ఓ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన కొచ్చీ వెళ్లారు. ఈ సందర్భంగా తనకు అన్ ఈజీగా ఉందని చెప్పడంతో వెంటనే న్యాయవాదులు ఆయనను ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగాఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కానీ 24 గంటల పరిశీలన కోసం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచినట్టు చెప్పారు. వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తోందని తెలిపారు. -
శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం!
తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ భర్త నటరాజన్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. నటరాజన్కు శ్వాసకోశ సమస్యలు రావడంతో ఆయన ఇబ్బంది పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనకు ఊపిరి అందడం లేదని చెప్పడంతో ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చామని అన్నారు తప్ప.. తదుపరి సమాచారం ఏమీ వెల్లడించలేదు. దాంతో నటరాజన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న అనుమానాలు తలెత్తాయి. ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు శశికళ సిద్ధం అవుతున్న నేపథ్యంలోనే ఉన్నట్టుండి నటరాజన్ ఆస్పత్రి పాలు కావడం పలువురిని ఆందోళనకు గురిచేసింది. ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేయడంతో, ఎమ్మెల్యేలంతా కలిసి తమ శాసనసభా పక్ష నేతగా 62 ఏళ్ల శశికళను ఎన్నుకున్న సంగతి తెలిసిందే. గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసిన శశికళ, తాను ప్రభుత్వం ఏర్పాటుచేస్తానని చెప్పారు. ఆమె ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. -
శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం!
-
ఎస్కేయూ రెక్టార్కు అస్వస్థత
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రెక్టార్ ఆచార్య జి.శ్రీధర్ మంగళవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. అర్ధరాత్రివేళ గుండెపోటు రావడంతో హుటాహుటిన పుట్టపర్తి సూపర్స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. హృదయనాళం పనితీరులో ఇబ్బందులు తలెత్తడంతో బుధవారం స్టంట్ వేశారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కుదుటపడినట్లు శ్రీధర్ కుటుంబసభ్యులు తెలిపారు. -
బుష్కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్(సీనియర్) (92) అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. టెక్సాస్లోని హ్యూస్టన్లో గల ఓ ఆస్పత్రిలో బుధవారం ఉదయం ఆయనను చేర్పించినట్లు అక్కడి కేహెచ్ఓయూ అనే టెలివిజన్ సంస్థ తెలిపింది. కొద్ది రోజుల తర్వాత ఆయనను ఆస్పత్రి వర్గాలు ఇంటికి పంపించే అవకాశం ఉందని జీన్ బెకర్ అనే వ్యక్తి తెలిపారు. అయితే, ఆయనను ఏ ఆస్పత్రిలో చేర్పించారనే విషయం మాత్రం బయటకు తెలియనివ్వలేదు. అలాగే, ఆయన ఆస్పత్రిలో అనూహ్యంగా చేరడానికి గల కారనాలు కూడా చెప్పలేదు. గతంలో ఓ సారి ఆయన కిందపడి ఆయన మెడలోని ఎముక విరిగిపోవడంతో తనకుమారుడు జార్జ్ బుష్ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుర్చీకే పరిమితం అయిన సీనియర్ బుష్ ఇప్పటికే తన మెడకు పట్టీని కొనసాగిస్తున్నారు. -
మళ్లీ ఆస్పత్రికి సోనియా
-
నటుడు శరత్కుమార్కు అస్వస్థత
చెన్నై: సీనియర్ నటుడు, అఖిల భారత సమత్తువ కచ్చి నేత శరత్కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఆయనకు తీవ్రంగా గుండె పోటు వచ్చింది. దీంతో కుటుంబు సభ్యులు ఆయన్ని థౌజండ్ లైట్స్ సమీపంలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యుల ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందించారు. అనంతరం శరత్కుమార్ సాయంత్రమే ఇంటికి వెళ్లిపోయినట్లు ఆయన మేనేజర్ వెల్లడించారు. ఇటీవల శరత్ కుమార్ రాజకీయ పరంగానూ, వ్యక్తిగతంగానూ తీవ్ర అశాంతికి గురయ్యారని సమాచారం. ఆ మధ్య జరిగిన దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికలో పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. నాటి నుంచి ఆయన నటనకు దూరంగా ఉంటూ వచ్చారు.అదే విధంగా ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లోనూ ఆయన పరాజయం పాలైయ్యారు. ఇటీవల విహారయాత్రకు విదేశాలు వెళ్లిన శరత్కుమార్ గత వారం చెన్నై నగరానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఓ కన్నడ చిత్ర షూటింగ్లో పాల్గొన్నారు కూడా. -
యూపీ గవర్నర్కు అస్వస్థత
లక్నో : ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న ఆదివారం ఆయన చికిత్స నిమిత్తం లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుషన్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు రామ్ నాయక్కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అటల్ బిహారీ వాజ్పేయ్ కేబినెట్ లో రామ్ నాయక్ పెట్రోలియం-సహజ వాయువులు మంత్రిగా పనిచేశారు. 1994వ సంవత్సరంలో కేన్సర్ బారిన పడ్డ ఆయన క్రీయశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. -
ప్రముఖ రచయిత్రికి అస్వస్థత
కోల్కతా: ప్రముఖ రచయిత్రి, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత మహాశ్వేతాదేవి (89) అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్స కొనసాగుతోందని బెల్లె వ్యూ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం మహాశ్వేతా దేవిని పరామర్శించారు. తొందరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. -
రఘువీరాకు అస్వస్థత
పెందుర్తి: విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి గురువారం అస్వస్థతకు గురయ్యారు. ఘగర్ లెవెల్స్ పడిపోవడంతో కళ్లు తిరిగిపడిపోయారు. పెందుర్తి మండలం చిన్నముసిడివాడ శారదాపీఠానికి వచ్చే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆయనను విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆస్పత్రిలో సిద్ధూ
న్యూఢిల్లీ: నవ్జోత్ సింగ్ సిద్ధూ అంటే క్రికెటర్ మాత్రమే కాదు... మాటల మాంత్రికుడు. అతనిలో ఉరిమే ఉత్సాహం, హాస్యం కలగలిసి సెలయేరులా పదాల ప్రవాహం సాగిపోతుంది. మ్యాచ్ ఏదైనా కామెంటరీతో ఆనందాన్ని రెట్టింపు చేసే సిద్ధూ ఇప్పుడు దానికి విరామం ఇవ్వాల్సి వచ్చింది. అతను ప్రమాదకరమైన ‘డీప్ వీన్ త్రోంబోసిస్’ వ్యాధి బారినపడటం ఒక్కసారిగా అందరినీ షాక్కు గురి చేసింది. నరాల్లో రక్తం గడ్డకట్టే ఈ వ్యాధితో అతను మంచాన పడ్డాడు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది. ఇలాంటి స్థితిలోనూ సిద్ధూ సై్థర్యం కోల్పోలేదు. ‘కొంచెం కుంగిపోయాను కానీ పూర్తిగా కుప్పకూలిపోలేదు (డౌన్ బట్ నాటౌట్), ప్రాణాంతకమైన వ్యాధి డీవీటీ వచ్చింది. దేవుని దయ వల్ల కోలుకుంటా. జీవితం చాలా సున్నితమైంది. ప్రార్థనలతో కాపాడుకోవాలి’ అని దేవునిపై తన విశ్వాసాన్ని ప్రకటించాడు. -
మంచంపట్టిన మందుబాబులు !
-
విషవాయువులు పీల్చి ఏడుగురు కూలీలకు అస్వస్థత
గాజువాక (విశాఖపట్టణం): విషవాయువు పీల్చి ఏడుగురు కూలీలు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన విశాఖపట్టణం జిల్లా గాజువాక సమీపంలోని రాంనగర్లోని కెమికల్ గోడౌన్లో బుధవారం జరిగింది. వివరాలు.. రసాయనిక పదార్థాల బస్తాలు దించుతుండగా గోడౌన్లో చేరవేస్తుండగా విషవాయువు పీల్చడంతో వారు సొమ్మసిల్లి పడిపోయారు. ఫ్యాక్టరీ యజమానులు వెంటనే వారిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. -
జ్వరంతో ఆస్పత్రిలో చేరిన ములాయం
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ (75) తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం అస్వస్థతకు గురైన ములాయం గుర్గావ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చినట్టు వైద్య వర్గాలు చెప్పాయి. వైద్య పరీక్షల అనంతరం మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని ములాయంకు సూచించినట్టు వైద్య వర్గాలు తెలిపాయి. కాగా సాధారణ పరీక్షల కోసమే ములాయం ఆస్పత్రికి వెళ్లినట్టు సమాజ్వాదీ పార్టీ వర్గాలు చెప్పాయి. -
టీచర్పై దాడి.. ఆస్పత్రి పాలు
ఇంపాల్: మణిపూర్లో ఓ ప్రవైటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడిపై దాడి జరిగింది. తమ పిల్లాడిని బెత్తంతో కొట్టినందుకు ఆగ్రహించిన తల్లిదండ్రులు, బంధువులు, ఓ స్టూడెంట్ వింగ్ కలిసి అతడిపై తీవ్రంగా దాడి చేశారు. పిడిగుద్దులు గుప్పించారు. దీంతో ఆ టీచర్ ఆస్పత్రి పాలయ్యాడు. ఇంపాల్లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో కంప్యూటర్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు ఆరో తరగతి చెందిన ఒక విద్యార్థిని తప్పుచేశాడని దండించాడు. క్లాస్ రూంలో అందరిమధ్య కర్రతో కొట్టాడు. దీంతో ఆ బాలుడు కుటుంబ సభ్యులతో పాటు ఓ విద్యార్థి యూనియన్కు చెప్పగా మొత్తం పదహారు మందివచ్చి దాడి చేశారు. వారందరనీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ విద్యార్థి తప్పు చేసినందునే తాను విద్యార్థిని దండించానని, కావాలని ఏ ఉపాధ్యయుడు తన విద్యార్థిని కొట్టడని బాధిత ఉపాధ్యాయుడు వాపోయాడు. అతడు కోలుకునేందుకు కొన్ని వారాలు పడుతుందని వైద్యులు తెలిపారు. -
జశ్వంత్ సింగ్కి అస్వస్థత
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు నిన్న రాత్రి ఆసుపత్రిలో చేర్చినట్లు ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి ప్రతినిధి వెల్లడించారు. గతేడాది ఆగస్టు 8వ తేదీన ఇంట్లో జారిపడిన జశ్వంత్ సింగ్ తలకు గాయమవడంతో కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. నాలుగు నెలలు పాటు న్యూరో సర్జన్ల బృందం పర్యవేక్షణలో ఉన్న ఆయన కోలుకోవటంతో డిశ్చార్జ్ చేశారు. అయితే బుధవారం ఆయన మళ్లీ అస్వస్థతకు గురి అవటంతో ఆస్పత్రికి తరలించారు. -
'ఎంఎస్ నారాయణ చనిపోలేదు'
-
ఆస్పత్రి పాలయిన అరుణ్ జైట్లీ
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆస్పత్రి పాలయ్యారు. ఆయనను దేశ రాజధాని నగరంలోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఆస్పత్రి న్యూఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో ఉంది. సోమవారం సాయంత్రమే జైట్లీని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆయనకు ఓ చిన్నపాటి శస్త్రచికిత్స చేయనున్నట్లు తెలిసింది. అయితే అది ఏ శస్త్రచికిత్సో, ఎంతకాలం జైట్లీ విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందో మాత్రం ఇంకా తెలియరాలేదు. బడ్జెట్ సమర్పించే సమయంలో కూడా అరుణ్ జైట్లీ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడటంతో భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా కుర్చీలో కూర్చుని ఆయన బడ్జెట్ను సమర్పించారు. అప్పటినుంచి కూడా ఆయన తరచు చిన్నచిన్న ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిసింది. అందుకే ఆస్పత్రిలో చేర్చారని సమాచారం. -
రాజ్ నాథ్ కు అస్వస్థత, ఎయిమ్స్ లో చేరిక
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉదర సంబంధిత సమస్యలు తలెత్తడంతో రాజ్ నాథ్ ను వెంటనే ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రాత్రి 8.30 గంటలకు ఎయిమ్స్ లో చేర్పించామని అధికారులు ధ్రువీకరించారు. రాజ్ నాథ్ ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ ఆస్పత్రిలోని గాస్ట్రోఎంటరాలజీ విభాగం వైద్యులు సుబ్రత్ ఆచార్య పరిశీలిస్తున్నారని అధికారులు తెలిపారు. గురువారం కూడా రాజ్ నాథ్ ఆస్పత్రిలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
కొత్తపల్లి సుబ్బరాయుడికి తీవ్ర అస్వస్ధత
-
చలి కాచుకుందామని వెళ్లి...!
‘సినిమావాళ్లు సుకుమారంగా ఉంటారు. కష్టం ఎలా ఉంటుందో వాళ్లకు తెలీదు. నిరంతరం లగ్జరీ లైఫ్ని అనుభవిస్తుంటారు’... చాలామంది అభిప్రాయం ఇదే. కానీ.. వారి జీవితం సుఖాలకు ఆలవాలం ఎంతమాత్రం కాదని, వారిక్కూడా లెక్కలేనన్ని కష్టాలుంటాయని, ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంటుందని బయటి వారికి తెలీదు. షూటింగుల్లో గాయాలపాలై చావు దరిదాపుల్లోకెళ్లి వచ్చిన కళాకారులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి టబు కూడా చేరారు. వివరాల్లోకెళితే... ప్రస్తుతం టబు ‘హైదర్’ అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ జమ్ముకాశ్మీర్లోని ఓ భయంకరమైన కొండ ప్రాంతంలో జరుగుతోంది. శనివారం తెల్లారు జామున మైనస్ డిగ్రీల చలిలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు విశాల్భరద్వాజ్. షాట్ గ్యాప్లో ఓ పక్కకెళ్లి కూర్చున్నారు టబు. ఉన్నట్లుండి చలి తీవ్రత ఎక్కువైంది. దాంతో పక్కనే ఏర్పాటు చేసిన చలిమంటను ఆశ్రయించారు. ఆ మంటలోంచి పొగరావడం మొదలైంది. ఆ పొగను పీల్చి ఉక్కిబిక్కిరైపోయారు టబు. ఒకానొక దశలో శ్వాస సరిగ్గా అందలేదు. అక్కడిక్కడే స్పృహ కోల్పోయారు. వెంటనే యూనిట్ సభ్యులు అప్రమత్తమయ్యారు. అయితే.. హాస్పిటల్ 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలస్యం చేయకుండా హుటాహుటిన ఉదయం 9 గంటలకల్లా టబుని హాస్పిటల్లో చేర్చారు. సమయానికి హాస్పిటల్కి చేర్చడంతో ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెప్పారు. చికిత్స పూర్తి చేసి, ఆ రోజు సాయంత్రం టబుని డిశ్చార్చ్ చేశారు. దీన్ని బట్టి సినిమా వాళ్ల కష్టాలు ఏ రేంజ్లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. -
జయేంద్ర సరస్వతికి అస్వస్థత
-
జయేంద్ర సరస్వతికి అస్వస్థత
నెల్లూరు, న్యూస్లైన్: కంచి కామకోటి పీఠాధిపతి, జగద్గురు జయేంద్ర సరస్వతి స్వామి(79) అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం నెల్లూరు వచ్చిన ఆయన సాయంత్రం జొన్నవాడ కామాక్షితాయి ఆలయానికి వెళ్తూ దారి మధ్యలో వాహనంలోనే స్పృహకోల్పోయారు. ఆయనను నెల్లూరులోని జయభారత్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత దగ్గర్లోని డయాగ్నోస్టిక్స్ సెంటర్లో సీటీ, ఎంఆర్ఐ స్కాన్ పరీక్షలు నిర్వహించి మళ్లీ ఆస్పత్రికి తెచ్చి ఈసీజీ పరీక్ష చేశారు. స్వామీజీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళనపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. షుగర్ లెవల్స్ తగ్గడంతో సృహకోల్పోయారన్నారు. స్వామీజీకి చికిత్స కోసం చెన్నై నుంచి ప్రముఖ న్యూరాలజిస్ట్ కల్యాణ్రామన్ బయల్దేరారని తెలిపారు. నెల్లూరులోని శంకరమఠంలో కొత్తగా నిర్మించిన చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కోసం జయేంద్ర సర స్వతి వచ్చారు. ఆయన అస్వస్థత విషయాన్ని టీవీల ద్వారా తెలుసుకున్న భక్తులు ఆందోళనకు గురయ్యారు. పలువురు జయభారత్ ఆస్పత్రికి చేరుకున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడారు.