IPL 2021
-
SL Vs Pak: పాక్తో ఫైనల్! అప్పుడు వాళ్లు అలా.. ఇప్పుడు మేమిలా: దసున్ షనక
ఆసియా కప్-2022 టీ20 టోర్నీ మొదటి మ్యాచ్లో పరాభవం.. అఫ్గనిస్తాన్ చేతిలో ఘోర ఓటమి.. కానీ ఆ తర్వాత శ్రీలంక జట్టు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.. బంగ్లాదేశ్పై తొలి గెలుపు నమోదు చేసిన దసున్ షనక బృందం విజయాల బాట పట్టి టోర్నీ ఆసాంతం అజేయంగా నిలిచింది. సూపర్-4లో వరుసగా అఫ్గనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్లను ఓడించి ఫైనల్ చేరి.. తుదిపోరులో మరోసారి పాక్ను మట్టికరిపించి ఆసియా కప్ 15వ ఎడిషన్ విజేతగా అవతరించింది. దేశ ఆర్థిక పరిస్థితులు, సంక్షోభం దృష్ట్యా.. సొంత ప్రేక్షకుల కేరింతల నడుమ అందుకోవాల్సిన ట్రోఫీని దుబాయ్ గడ్డపై ముద్దాడింది. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తమ దేశ ప్రజలకు.. ఈ మెగా టోర్నీలో విజయంతో ఉపశమనం కలిగించి.. వాళ్ల ముఖాలు విజయదరహాసంతో వెలిగిపోయేలా చేసింది యువ ఆటగాళ్లతో కూడిన లంక జట్టు. అసాధారణ.. అద్వితీయ గెలుపు కోటి రూపాయలకు పైగా ప్రైజ్మనీ సాధించి దేశానికి శుభవార్త అందించింది. క్లిష్ట పరిస్థితుల్లో వచ్చిన ఈ గెలుపు నిజంగా అసాధారణమైనది. వారు పంచిన ఆనంతం అనిర్వచనీయమైనది. ముఖ్యంగా దుబాయ్ పిచ్ మీద టాస్ గెలిస్తేనే విజయం అన్న అభిప్రాయాన్ని తలకిందులు చేస్తూ జయకేతనం ఎగురవేసి.. గెలుపులోని అసలైన మజాను రుచిచూసింది. మాకు సీఎస్కే ఆదర్శం! ఈ నేపథ్యంలో విజయానంతరం శ్రీలంక కెప్టెన్ దసున్ షనక తన ఆనందాన్ని పంచుకుంటూ.. ఈ మ్యాచ్లో.. ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తమకు స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నాడు. ఈ మేరకు షనక మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ 2021 చెన్నై ఫైనల్లో.. తొలుత బ్యాటింగ్ చేసి.. గెలిచింది. మేము మ్యాచ్ ఆడుతున్నపుడు నా మదిలో ఇదే విషయం మెదిలింది. మా జట్టులోని యువ ఆటగాళ్లు ఇక్కడి పరిస్థితులను చక్కగా అర్థం చేసుకున్నారు. ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న వేళ వనిందు నిజంగా తన అద్భుతమైన ఇన్నింగ్స్తో ప్రభావం చూపాడు. చమిక, ధనుంజయ డి సిల్వా కూడా బాగా బ్యాటింగ్ చేశారు. చివరి బాల్ను సిక్స్గా మలచడం మాకు టర్నింగ్ పాయింట్. 160 పరుగుల స్కోరు అనేది ఛేదించదగ్గ లక్ష్యంగానే కనిపిస్తుంది. అయితే, 170 మార్కు మానసికంగా ప్రత్యర్థిపై కాస్త ఒత్తిడి పెట్టేందుకు ఉపకరిస్తుంది. ఇక మధుషంక గురించి చెప్పాల్సిన పనిలేదు. కెప్టెన్గా తనకు నేను ఎంత వరకు అండగా ఉండాలో అంత వరకు మద్దతుగా నిలిచాను’’ అని షనక చెప్పుకొచ్చాడు. కాగా కరోనా నేపథ్యంలో ఐపీఎల్-2021 రెండో దశ మ్యాచ్లో యూఏఈలో నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పుడు చెన్నై.. ఇప్పుడు శ్రీలంక ఈ క్రమంలో దుబాయ్లో జరిగిన మ్యాచ్లలో దాదాపు అన్నింటిలోనూ సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. అయితే, ఫైనల్లో ధోని సేన టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసినప్పటికీ కోల్కతా నైట్రైడర్స్ను ఓడించింది. 27 పరుగుల తేడాతో మోర్గాన్ బృందాన్ని మట్టికరిపించి చాంపియన్గా నిలిచింది. ఇప్పుడు అదే వేదికపై అదే తరహాలో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక.. పాక్ను 23 పరుగులతో ఓడించి ఆసియా కప్-2022 చాంపియన్గా అవతరించింది. చదవండి: SL Vs Pak: అందుకే లంక చేతిలో ఓడిపోయాం.. ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్ ఆజం SL Vs Pak: అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్కు విలువే ఉండేది కాదు! కానీ.. -
IPL 2022: గత సీజన్లో అదరగొట్టారు.. కోట్లు కొట్టేశారు.. ఈసారి అట్టర్ ఫ్లాఫ్!
IPL 2022: ఐపీఎల్ లాంటి టీ20 టోర్నమెంట్లో ఎప్పుడు ఎవరు అదరగొడుతారు? ఎప్పుడు ఎవరు డీలా పడతారు? ఏ జట్టు పైచేయి సాధిస్తుందన్న విషయాలను అంచనా వేయడం కాస్త కష్టమే! ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవగా.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. పొట్టి ఫార్మాట్లో ఫామ్ను కొనసాగిస్తూ ముందుకు సాగటం కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది. ఒక సీజన్లో అదరగొట్టిన వాళ్లు.. మరో ఎడిషన్లో ఏమాత్రం ప్రభావం చూపకపోవచ్చు. లేదంటే ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆసీస్ డేవిడ్ వార్నర్లా గతంలో ఫామ్లేమితో ఇబ్బంది పడిన వాళ్లు తిరిగి విజృంభించనూ వచ్చు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2021లో అదరగొట్టి.. 2022 ఎడిషన్లో చతికిలపడ్డ టాప్-5 ఆటగాళ్లు ఎవరో ఓసారి గమనిద్దాం. PC: IPL/BCCI మయాంక్ అగర్వాల్ పంజాబ్ కింగ్స్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ ఐపీఎల్-2021లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 12 ఇన్నింగ్స్లలో కలిపి 441 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ శతకాలు ఉండటం విశేషం. ఇక పంజాబ్ తరఫున గత ఎడిషన్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్గా మయాంక్ నిలిచాడు. అయితే, తాజా సీజన్లో పరిస్థితులు మారాయి. 12 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుని పంజాబ్ కెప్టెన్గా అతడిని నియమించింది ఫ్రాంఛైజీ. కానీ కెప్టెన్సీ భారం మోయలేక మయాంక్ చేతులెత్తేశాడు. బ్యాటర్గానూ విఫలమయ్యాడు. ఐపీఎల్-2022లో ఆడిన 12 మ్యాచ్లలో కలిపి 195 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మయాంక్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ పెద్దగా రాణించింది కూడా లేదు. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్లలో కేవలం ఆరు గెలిచి ఏడో స్థానంలో ఉంది. PC: IPL/BCCI వెంకటేశ్ అయ్యర్ దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన మధ్యప్రదేశ్ యువ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ను కోల్కతా నైట్రైడర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత సీజన్ రెండో అంచెలో వరుస అవకాశాలు దక్కించుకున్న వెంకటేశ్.. 10 ఇన్నింగ్స్లలో 370 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియాలోనూ చోటు దక్కించుకున్నాడు. హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయగల ఆల్రౌండర్గా ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఐపీఎల్-2022లో అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. వరుస వైఫల్యాలతో ఒకానొక సమయంలో తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఇక మొత్తంగా ఈ సీజన్లో 12 ఇన్నింగ్స్ ఆడిన అతడు కేవలం 182 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 50 నాటౌట్. తనను రిటైన్ చేసుకునేందుకు ఫ్రాంఛైజీ ఖర్చు చేసిన 8 కోట్లకు న్యాయం చేయలేకపోయాడు. PC: IPL/BCCI కీరన్ పొలార్డ్ వెస్టిండీస్ బ్యాటర్, ముంబై ఇండియన్స్ హిట్టర్ కీరన్ పొలార్డ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2010 నుంచి ముంబై జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ విండీస్ మాజీ కెప్టెన్ గత సీజన్లో 245 పరుగులు చేశాడు. చెన్నైపై సంచలన ఇన్నింగ్స్(34 బంతుల్లో 87 పరుగులు నాటౌట్) ఆడాడు. కట్ చేస్తే ఐపీఎల్-2022లో పరిస్థితి తలకిందులైంది. 6 కోట్లకు ముంబై రిటైన్ చేసుకుంటే స్థాయికి తగ్గట్లు రాణించలేక అతడు డీలా పడ్డాడు. ఆడిన 11 మ్యాచ్లలో కలిపి పొలార్డ్ చేసిన స్కోరు 144. ఇక వరుసగా పొలార్డ్ నిరాశపరిచిన నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే తలంపుతో అతడిని తుది జట్టు నుంచి తప్పించారు. PC: IPL/BCCI హర్షల్ పటేల్ గత ఐపీఎల్ ఎడిషన్లో అదరగొట్టే ప్రదర్శనతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్. ఆడిన 15 మ్యాచ్లలో 8.14 ఎకానమీతో 32 వికెట్లు పడగొట్టి ‘పర్పుల్’ పటేల్ అని కితాబులందుకున్నాడు. ఆర్సీబీని ప్లే ఆఫ్స్ చేర్చడంలో హర్షల్ కీలక పాత్ర పోషించాడు. అయితే, రిటెన్షన్లో వదిలేసిన్పటికీ మెగా వేలంలో ఆర్సీబీ అతడ కోసం 10.75 కోట్లు వెచ్చించింది. కానీ తాజా సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 12 మ్యాచ్లలో అతడు తీసినవి 18 వికెట్లు. గతేడాది పోలిస్తే ఈసారి పెద్దగా రాణించలేదనే చెప్పాలి. PC: IPL/BCCI వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత ఐపీఎల్ సీజన్లో 17 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ అద్భుత ప్రదర్శనతో యూఏఈ వేదికగా సాగిన రెండో అంచెలో కోల్కతా నైట్రైడర్స్ అదరగొట్టింది. ఏకంగా ఫైనల్ చేరి రన్నరప్గా నిలిచింది. ఈ క్రమంలో ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో వరుణ్ను 8 కోట్లకు రిటైన్ చేసుకుంది కేకేఆర్. కానీ అతడు ధరకు తగ్గ న్యాయం చేయలేకపోయాడు. దీంతో తుదిజట్టు నుంచి తప్పించి హర్షిత్ రాణా వంటి కొత్త ఆటగాళ్లకు అవకాశమిచ్చారు. ఐపీఎల్-2022లో వరుణ్ చక్రవర్తి 11 ఇన్నింగ్స్లో కలిపి తీసిన వికెట్ల సంఖ్య- 6. చదవండి👉🏾IPL 2022: సన్రైజర్స్ చేసిన అతిపెద్ద తప్పిదం అదే.. అందుకే ఇలా: సెహ్వాగ్ చదవండి👉🏾IPL 2022: యార్కర్లతో అదరగొట్టాడు.. చివరి మ్యాచ్లోనైనా అవకాశమివ్వండి! -
9.25 కోట్లు వెచ్చించారు.. కానీ, ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు..!
IPL 2022 Auction: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన భారత అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కిన కర్ణాటక ఆల్రౌండర్ కృష్ణప్ప గౌతమ్.. త్వరలో జరగనున్న 15వ ఐపీఎల్ మెగా వేలంలోనూ భారీ ధరను ఆశిస్తున్నాడు. గతేడాది కృష్ణప్ప గౌతమ్ను ఏకంగా రూ.9.25 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన చెన్నై సూపర్ కింగ్స్..ఈ ఏడాది ఆటగాళ్ల రిటెన్షన్లో భాగంగా అతన్ని వదులుకుంది. గత సీజన్ వేలంలో కృష్ణప్ప కోసం సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్లు తీవ్రంగా పోటీపడినప్పటికీ చివరికి సీఎస్కే అతన్ని సొంతం చేసుకుంది. అయితే, ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అన్ని కోట్లు వెచ్చించి, ప్రత్యర్ధి జట్లతో పోటీపడి మరీ చేజిక్కించుకున్న ఆటగాడిని సీఎస్కే ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. అయినప్పటికీ, కృష్ణప్పకు లక్కీగా శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఆ మ్యాచ్లో అతను ఓ వికెట్, 2 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో తదనంతర పరిణామాల్లో అతను కనుమరుగయ్యాడు. తాజాగా ఐపీఎల్ మెగా వేలం దగ్గర పడడటంతో అతని పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. కుడి చేతి వాటం స్పిన్ ఆల్రౌండర్ అయిన కృష్ణప్ప గౌతమ్.. తన ఐపీఎల్ కెరీర్లో 24 మ్యాచ్లు ఆడి 13 వికెట్లు, 186 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే, గతేడాది ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ఐదుగురు ఆటగాళ్లలో కృష్ణప్ప గౌతమ్ ఒకడు. రాజస్థాన్ రాయల్స్ క్రిస్ మోరిస్పై 16 కోట్లు వెచ్చించగా, కివీస్ ఆల్ రౌండర్ కైల్ జేమీసన్పై ఆర్సీబీ 15 కోట్లు, జే రిచర్డ్సన్పై పంజాబ్ 14 కోట్లు, గ్లెన్ మాక్స్వెల్పై ఆర్సీబీ 14.2 కోట్లు వెచ్చించాయి. వీరి తర్వాత అత్యంత భారీ ధర పలికిన అనామక క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్ కావడం విశేషం. చదవండి: IND VS WI 2nd ODI: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు.. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు -
IPL 2022: ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకున్న లక్నో.. రాహుల్కు ఎన్ని కోట్లంటే!
ఐపీఎల్ మెగా వేలానికి ముందు కొత్త ఫ్రాంఛైజీ లక్నో బీసీసీఐ నిబంధనలను అనుసరించి తమ ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. టీమిండియా వన్డే జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్, భారత లెగ్స్పిన్నర్ రవి బిష్ణోయిని తమ జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ముగ్గురి కోసం లక్నో ఫ్రాంఛైజీ 30 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక రాహుల్ను మొదటి ఆప్షన్గా ఎంచుకున్న యాజమాన్యం అతడి కోసం 15 కోట్ల రూపాయలు వెచ్చించగా... స్టొయినిస్ను 11 కోట్లు, రవి బిష్ణోయిని 4 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పర్సులో 60 కోట్ల రూపాయలతో లక్నో మెగా వేలంలో పాల్గొననుంది. కాగా రాజీవ్ ప్రతాప్ సంజీవ్ గోయెంకా వెంచర్స్ లిమిటెడ్ రికార్డు స్థాయిలో ఏకంగా రూ.7,090 కోట్లు వెచ్చించి లక్నో ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. కాగా ఐపీఎల్-2021 సీజన్లో కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. రాహుల్ ఆ టీమ్తో కొనసాగేందుకు ఇష్టపడక అందరికీ అందుబాటులోకి వచ్చాడు. ఇప్పుడు భారీ మొత్తంతో లక్నోకు సారథ్యం వహించేందుకు రాహుల్కు అవకాశం వచ్చింది. ఇదిలా ఉండగా... ఇప్పటి వరకు పంజాబ్, బెంగళూరు, ఢిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహించిన స్టొయినిస్కు అతని తాజా ఫామ్ ప్రకారం చూస్తే భారీ మొత్తం దక్కినట్లే! ఇక భారత అండర్– 19 తరఫున సత్తా చాటడంతో పాటు రెండు ఐపీ ఎల్ సీజన్లలో కేవలం 6.95 ఎకానమీతో 24 వికెట్లు తీసిన బిష్ణోయ్కు ‘అన్క్యాప్డ్’ కారణంగా తక్కువ మొత్తానికే లక్నో దక్కించుకుంది. చదవండి: IPL 2022: ధోని ‘గుడ్ బై’.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా రవీంద్ర జడేజా!? రాహుల్ ఆడిన 13 ఇన్నింగ్స్లో 626 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 98 నాటౌట్. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉండగా మరో కొత్త ఫ్రాంఛైజీ అహ్మదాబాద్ హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. పాండ్యా, రషీద్ కోసం రూ. 15 కోట్లు.. గిల్కు రూ. 7 కోట్లు చెల్లించేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం-2022 నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చదవండి: IPL: అతడికి 16 కోట్లు.. అయ్యర్కు ఇప్పటి వరకు 35 కోట్లు.. ఆర్సీబీ, పంజాబ్, కేకేఆర్ పోటీ... రికార్డు బద్దలవడం ఖాయం! చదవండి: IPL Auction: కోట్ల ఖర్చు.. మెగా వేలం.. ఆ ఫ్రాంఛైజీ పర్సులో 72 కోట్లు.. మరి మిగిలిన జట్ల వద్ద ఎంతంటే! -
Venkatesh Iyer: వేలంలో రెండు రౌండ్లపాటు నన్ను ఎవరూ పట్టించుకోలేదు.. ఆ తర్వాత
Venkatesh Iyer Comments: ‘‘గతేడాది ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించాను. ఏ జట్టుకు ఆడినా గెలుపునకై నా వంతు కృషి చేస్తాను. ఈ క్రమంలోనే కేకేఆర్ నన్ను వేలంలో కొనుగోలు చేసింది. నిజానికి రెండు రౌండ్ల పాటు నేను అన్సోల్డ్(కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపలేదు)గా మిగిలిపోయాను. చివరి రౌండ్లో కేకేఆర్ నన్ను కొనుగోలు చేసింది. వారికి నా ధన్యవాదాలు. ఒకవేళ కేకేఆర్ నన్ను ఎంచుకుని ఉండకపోతే.. నేను ఇక్కడ ఉండేవాడినే కాదు’’ అని టీమిండియా యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ గతాన్ని నెమరువేసుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ మినీ వేలం-2021లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్ వెంకటేశ్ను కొన్న సంగతి తెలిసిందే. 20 లక్షల రూపాయలు వెచ్చింది అతడిని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో యూఏఈ వేదికగా జరిగిన రెండో అంచెలో వెంకటేశ్ అత్యద్భుతంగా రాణించాడు. 10 ఇన్నింగ్స్ ఆడిన ఈ ఓపెనర్ 370 పరుగులు సాధించాడు. అంతేకాదు కేకేఆర్ అనూహ్యంగా పుంజుకుని ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో దేశవాళీ టీ20 టోర్నీ, ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా అతడు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ సిరీస్తో టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టీమిండియా పర్యటన నేపథ్యంలో తొలిసారిగా వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇలా అతడి దశ తిరిగిపోయింది. ఈ నేపథ్యంలో జర్నలిస్టు బోరియా మజుందార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేశ్ తన కెరీర్లోని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘ఒక్కసారి కేకేఆర్ క్యాంపులో అడుగుపెట్టిన తర్వాత.. నాకంటూ ఓ గుర్తింపు వచ్చిందనుకున్నా. నా జీవితానికి సంబంధించి ఇదో కీలక మలుపు. మొదటి దశలో అవకాశం రాలేదు. అయినా కేకేఆర్ యాజమాన్యం నాపై నమ్మకం ఉంచింది. యూఏఈలో ఆడే అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 20- 30 ఏళ్ల తర్వాత కూడా చెప్పుకోదగ్గ స్టోరీ ఇది. నిజంగా నా జీవితంలో ఇదెంతో ప్రత్యేకమైనది’’ అని కేకేఆర్ ఫ్రాంఛైజీ పట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో భాగంగా కోల్కతా అయ్యర్ను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఏకంగా 8 కోట్లు ఖర్చు చేసింది. చదవండి: WTC Points Table: దక్షిణాఫ్రికా చేతిలో పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియాకు మరో షాక్.. Virat Kohli: ఆ కారణంగానే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా..! Enjoyed speaking to @venkateshiyer Love his attitude. Wants to matches for India and isn't satisfied with just being there. That's what matters. @KKRiders YT link https://t.co/8p4DgbZckR Congrats to him on 50 over selection and wish you all a safe and healthy 2022. pic.twitter.com/8308liOBRE — Boria Majumdar (@BoriaMajumdar) January 1, 2022 -
MS Dhoni: పాక్ పేసర్కు ధోని స్పెషల్ గిఫ్ట్.. భావోద్వేగానికి గురైన క్రికెటర్
MS Dhoni: టీమిండియా కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని గొప్పదనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అత్యుత్తమ సారథిగా.. బ్యాటర్గా.. వికెట్ కీపర్గా.. బెస్ట్ ఫినిషర్గా.. క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేశాడు. కేవలం ఆటతోనే కాకుండా.. సహచర క్రికెటర్లు, ఇతర జట్ల ఆటగాళ్లతో తను వ్యవహరించే తీరుతో కూడా కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు ధోని భాయ్. తాజాగా మరోసారి ఈ విషయాన్ని నిరూపించుకున్నాడు. పాకిస్తాన్ పేసర్ హారిస్ రవూఫ్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు ధోని. సంతకం చేసిన తన జెర్సీని అతడికి పంపించాడు. ఈ విషయాన్ని రవూఫ్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘‘దిగ్గజం.. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని ఈ అందమైన బహుమతిని నాకు పంపించాడు. తన షర్టు ఇది. తన మంచి మనసుతో నెంబర్ ‘7’ ఇంకా హృదయాలను కొల్లగొడుతూనే ఉన్నాడు’’ అంటూ రవూఫ్ ధోనిపై అభిమానం చాటుకున్నాడు. ఇందుకు స్పందించిన సీఎస్కే మేనేజర్ రసెల్ రాధాకృష్ణన్.. ‘‘మా కెప్టెన్ మాట ఇచ్చాడంటే.. తప్పక నెరవేరుస్తాడు’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా కొనసాగుతున్న ధోని 2021లో జట్టును చాంపియన్గా నిలిపిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సీఎస్కే నాలుగుసార్లు టైటిల్ గెలిచింది. ఇక టీ20 ప్రపంచకప్-2021 సందర్భంగా టీమిండియా మెంటార్గా వ్యవహరించిన ధోని... భారత్తో పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత దాయాది జట్టు ఆటగాళ్లతో కాసేపు ముచ్చటించిన సంగతి తెలిసిందే. చదవండి: Ind Vs Sa 2nd Test: నువ్వు తోపు అనుకోకు.. అలా చేశావో నిన్ను మించినోడు లేడని చెప్పాను.. అంతే.. ఇక ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలే! When our captain @msdhoni promises he delivers , glad you love it champ #whistlepodu @ChennaiIPL https://t.co/3qybd0oFEE — Russell (@russcsk) January 7, 2022 View this post on Instagram A post shared by ICC (@icc) -
IPL 2021: నన్ను ఎక్కువగా హర్ట్ చేసింది అదే: వార్నర్
David Warner: ‘‘కెప్టెన్సీ నుంచి తొలగించడం... కనీసం తుది జట్టులో చోటు కల్పించకపోవడం... జట్టులోని యువ ఆటగాళ్లపై ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇలా చేయడం ద్వారా వారికి మీరు ఏం సందేశం ఇస్తున్నారు. నన్ను తీవ్రంగా బాధించిన విషయం ఏదైనా ఉందంటే... జట్టులోని యువ క్రికెటర్ల గురించే. ‘‘మాకు కూడా ఏదో ఒకరోజు ఇలా జరుగుతుంది’’ అనే అభద్రతా భావాన్ని పెంచుకునే అవకాశం ఉంది’’- ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ భావోద్వేగంతో పలికిన మాటలు ఇవి. ఎస్ఆర్హెచ్కు తొలి ఐపీఎల్ కప్ సాధించి పెట్టిన వార్నర్కు గత సీజన్లో ఘోర అవమానం జరిగిన సంగతి తెలిసిందే. తొలుత సారథ్య బాధ్యతల నుంచి తొలగించిన యాజమాన్యం.. ఆ తర్వాత తుది జట్టులో కూడా చోటు ఇవ్వలేదు. రిటెన్షన్ సమయంలో కూడా అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో హైదరాబాద్ జట్టుతో వార్నర్ బంధానికి తెర పడినట్లయింది. అయితే, ఈ విషయాన్ని ఆరెంజ్ ఆర్మీ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. వార్నర్ అన్న మళ్లీ ఎస్ఆర్హెచ్కు ఆడితే చూడాలని ఉందంటూ సోషల్ మీడియా వేదికగా అతడికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై పలుమార్లు స్పందించిన వార్నర్ భాయ్... తాజాగా జర్నలిస్టు బోరియా మజుందార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని ఆవేదన పంచుకున్నాడు. ‘‘జరిగిందేదో జరిగిపోయింది. పక్కన పెట్టినంత మాత్రాన ఎవరినీ విమర్శించే తత్వం కాదు నాది. ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు. బాధ పడుతూ కూర్చోకుండా.. వాస్తవాన్ని అర్థం చేసుకుని.. అసలు నన్ను ఎందుకు తప్పించారోనన్న విషయం గురించే ఆలోచిస్తాను’’ అంటూ స్ఫూర్తిదాయకంగా మాట్లాడాడు. కాగా మెగా వేలం-2022లో భాగంగా వార్నర్కు భారీ ధర లభించే అవకాశం ఉంది. రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుకు జట్టుకు అతడు కెప్టెన్ అవుతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఐపీఎల్-2021లో వైఫల్యం తర్వాత టీ20 ప్రపంచకప్-2021 టోర్నీతో ఫుల్ ఫామ్లోకి వచ్చిన వార్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు అందుకున్నాడు. చదవండి: Ind Vs Sa 2nd Test: నువ్వు తోపు అనుకోకు.. అలా చేశావో నిన్ను మించినోడు లేడని చెప్పాను.. అంతే.. ఇక ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలే! -
'ఐ లవ్ యూ ఏబీ'.. నా గుండె ముక్కలయ్యింది
Virat Kohli Emotional Tweet After AB De Villiers.. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు.. ఆర్సీబీ విధ్వంసకర ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లుగా శుక్రవారం ట్విటర్లో ప్రకటించాడు. డివిలియర్స్ నిర్ణయంపై ఆర్సీబీ సహచర ఆటగాడు.. చిరకాల మిత్రుడు విరాట్ కోహ్లి ట్విటర్ వేదికగా ఎమోషనల్ అయ్యాడు. ''ఏబీ డివిలియర్స్.. నీ నిర్ణయం నా గుండెను ముక్కలు చేసింది. కానీ సరైన సమయంలోనే ఆటకు గుడ్బై చెప్పాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఇక మా కాలంలో నువ్వొక అత్యుత్తమ ఆటగాడివి. నేను కలుసుకున్న అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తివి. ఆర్సీబీకి నీతో కలిసి ఆడిన క్షణాలు ఎప్పటికి గుర్తుండిపోతాయి.. అంతేకాదు దానిని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఆటకు గుడ్బై చెప్పినప్పటికి మన బంధం బయట కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.. చివరగా ఐ లవ్ యూ డివిలియర్స్.'' అంటూ ముగించాడు. కాగా కోహ్లి ట్వీట్పై స్పందించిన ఏబీ.. ''లవ్ యూ టూ బ్రదర్'' అంటూ రిప్లై ఇవ్వడం విశేషం. 2011లో ఆర్సీబీలోకి వచ్చిన ఏబీ డివిలియర్స్.. కోహ్లితో కలిసి ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్లు ఆడాడు. ఇద్దరు కలిసి ఎన్నో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును గెలిపించారు. ఐపీఎల్లో 5వేలకు పైగా పరుగులు చేసిన డివిలియర్స్ విదేశీ ఆటగాళ్లలో అత్యంత సక్సెస్ అయిన ఆటగాడిగా నిలిచాడు.ఓవరాల్గా ఐపీఎల్లో ఇప్పటివరకు 184 మ్యాచ్లాడిన ఏబీ 5162 పరుగులు చేశాడు. This hurts my heart but I know you've made the best decision for yourself and your family like you've always done. 💔I love you 💔 @ABdeVilliers17 — Virat Kohli (@imVkohli) November 19, 2021 -
#JusticeForSanjuSamson: మా గుండె పగిలింది.. అసలేంటి ఇదంతా?!
Sanju Samson posts a cryptic tweet after being left out of the T20I squad against New Zealand: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపారు. న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు అతడిని ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో ఫిట్నెస్ కారణాల వల్లే ఈ కేరళ బ్యాటర్ను పక్కనపెట్టారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2021 టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సంజూ.. తనపై వస్తున్న వార్తలకు ట్విటర్ వేదికగా దీటుగా బదులిచ్చాడు. వివిధ సందర్భాల్లో బౌండరీ వద్ద అద్భుత క్యాచ్లు అందుకుంటున్న ఫొటోలు షేర్ చేసి తన సత్తా ఏమిటో చెప్పాడు. కాగా న్యూజిలాండ్తో టీ20, టెస్టు సిరీస్ నేపథ్యంలో బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది. ఐపీఎల్లో అద్భుతంగా ఆకట్టుకున్న వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్లకు టీ20 జట్టులో స్థానం కల్పించింది. రాజస్తాన్ కెప్టెన్ అయిన సంజూ సైతం ఐపీఎల్ 2021లో మంచి ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో 14 ఇన్నింగ్స్లో 484 పరుగులు చేసి ఆరోస్థానంలో నిలిచాడు. అయినప్పటికీ సంజూకి చోటు దక్కకపోవడంతో.. అతడికి న్యాయం చేయాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇంత మంచి ఆటగాడిని ఎందుకు సెలక్ట్ చేయడం లేదో అర్థం కావడం లేదు. మా గుండె పగిలింది. ఐపీఎల్లో అత్యుత్తమంగా రాణించినా, దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా ఆడుతున్నా ఎందుకు సెలక్ట్ చేయడం లేదు’’ అంటూ సెలక్టర్ల తీరును విమర్శిస్తున్నారు. భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, మొహమ్మద్ సిరాజ్. భారత్, న్యూజిలాండ్ టి20 సిరీస్ షెడ్యూల్ నవంబర్ 17: తొలి మ్యాచ్ (జైపూర్లో) నవంబర్ 19: రెండో మ్యాచ్ (రాంచీలో) నవంబర్ 21: మూడో మ్యాచ్ (కోల్కతాలో) చదవండి: Harbhajan Singh: 62 నాటౌట్, 70, 79 నాటౌట్.. అతడేం పాపం చేశాడు.. ఇంకేం చేస్తే సెలక్ట్ చేస్తారు? So as usual Sanju is dropped🙂 Man literally had his best IPL season🥲 Sanju started playing IPL at the age of 18 also won the emerging player award. He is now 26! If groomed earlier he could hv been our no4. Don't want him to be a wasted talent🥺#JusticeForSanjuSamson pic.twitter.com/eRi3Vuvsll — RO45 ☀️ (@Maanvi_264) November 9, 2021 Kumar Sangakara could recognize but when will BCCI recognize Sanju Samson 💔 #JusticeForSanjuSamson pic.twitter.com/aqv2iHU6Dc — Just Butter (@JustButter07) November 9, 2021 Rohit sharma till 2013 He was also useless like sanju but dhoni backed him Now he should also back sanju in t20Is but he is biased towards mumbai players #JusticeForSanjuSamson pic.twitter.com/6Mw56gRa4W — FL1CK🇦🇺🇦🇺🇦🇺 (@55of37) November 9, 2021 pic.twitter.com/rUxkLvLBSV — Sanju Samson (@IamSanjuSamson) November 10, 2021 -
Shubman Gill: ‘‘దేవతలతో ప్రేమలో పడకూడదు’’.. ‘బ్రేకప్ అయ్యిందా బ్రో’
Shubman Gill Instagram Post Leaves Fans Guessing About His Breakup Goes Viral: టీమిండియా యువ ఆటగాడు శుభ్మన్ గిల్ ప్రస్తుతం విశ్రాంతి సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. తనకు ఇష్టమైన వ్యాపకాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. కాగా ఐపీఎల్-2021లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగిన శుభ్మన్... 17 మ్యాచ్లలో 17 ఇన్నింగ్స్ ఆడి 478 పరుగులు చేశాడు. కేకేఆర్ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఇంతవరకు టీ20 మ్యాచ్లలో భారత్ తరఫున అరంగేట్రం చేయని శుభ్మన్ గిల్కు... టీ20 ప్రపంచకప్- 2021 ఆడే భారత జట్టులో చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. దీంతో... అతడికి బిజీ షెడ్యూల్ నుంచి కాస్త విరామం దొరికింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తున్న శుభ్మన్ గిల్... తాజాగా పంచుకున్న ఓ ఫొటో చర్చకు దారితీసింది. సిగ్మా రూల్ నెంబర్ 1 అంటూ అద్దంలో తనను తాను చూసుకుంటున్న ఫొటోను గిల్ షేర్ చేశాడు. ఇందులో గిల్ నల్లని టీ షర్టు ధరించినట్లుగా కనిపిస్తోంది. అంతేగాక షర్టు వెనుక భాగంలో... ‘‘దేవతలతో ప్రేమలో పడకూడదు’’ అన్న కొటేషన్ రాసి ఉంది. దీంతో గిల్కు తన ప్రేయసి గుడ్బై చెప్పిందేమో... బ్రేకప్ అయిపోయిందా అంటూ కొంతమంది నెటిజన్లు ఇష్టారీతిన కామెంట్లు చేస్తున్నారు. గిల్ షర్టుపై ఉన్న కోట్కు తమకు నచ్చిన భాష్యాలు చెబుతున్నారు. కాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్తో శుభ్మన్ గిల్ ప్రేమలో పడ్డాడనే వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు ఒకరు కామెంట్ చేస్తూ.. కాస్త స్నేహంగా ఉన్నట్లు కనిపించడంతో గాసిప్ రాయుళ్లు ఈ కథనాలు అల్లేశారు. అయితే... గిల్, సారాలు మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు. ఇక ఇప్పుడు శుభ్మన్ ఈ ఫొటో షేర్ చేయడంతో మరోసారి అతడి రిలేషన్షిప్ స్టేటస్కు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: T20 WC 2021: 'ప్రపంచకప్ మాదే' అన్న పాక్ అభిమాని.. స్టువర్ట్ బ్రాడ్ సూపర్ రిప్లై View this post on Instagram A post shared by Ꮪhubman Gill (@shubmangill) View this post on Instagram A post shared by Ꮪhubman Gill (@shubmangill) -
Shreyas Iyer: ఢిల్లీ జట్టును వీడనున్న మాజీ కెప్టెన్.. ఎందుకంటే!
Shreyas Iyer likely to leave Delhi Capitals to get leadership role in IPL 2022: టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్కు సంబంధించిన ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అయ్యర్... త్వరలోనే ఆ జట్టును వీడనన్నట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్లో అతడు ఢిల్లీ జెర్సీలో కనిపించకపోవచ్చనే సంకేతాలు వస్తున్నాయి. కాగా 2018లో భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అర్ధంతరంగా ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోగా.. శ్రేయస్ అయ్యర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2020 సీజన్లో ఢిల్లీని ఫైనల్కు చేర్చి కెప్టెన్గా తానేమిటో నిరూపించుకున్నాడు. అయితే, ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ గాయపడిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇంగ్లండ్తో సిరీస్తో పాటు ఐపీఎల్-2021 మొదటి దశకు కూడా అతడు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా యువ ఆటగాడు రిషభ్ పంత్కు ఢిల్లీ ఫ్రాంఛైజీ సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. యూఏఈ అంచెకు శ్రేయస్ అందుబాటులోకి వచ్చినా పంత్నే కెప్టెన్గా కొనసాగించింది. ఈ క్రమంలో మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పంత్... ఢిల్లీని ఈ ఏడాది టేబుల్ టాపర్గా నిలబెట్టాడు. కానీ.. ఫైనల్కు మాత్రం చేర్చలేకపోయాడు. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ మాత్రం బ్యాటర్గా మెరుగ్గానే రాణించాడు. ఐపీఎల్-2021 రెండో దశలో భాగంగా 8 మ్యాచ్లలో 8 ఇన్నింగ్స్ ఆడిన అతడు 175 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2022లో రెండు కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్ వచ్చి చేరనున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీకి కెప్టెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు కాబట్టి... జట్టును వీడాలని అయ్యర్ భావిస్తున్నాడట. కొత్త జట్లు లేదంటే.. సారథి కోసం చూస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వంటి ఏదో ఒక జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశాలను పరిశీలిస్తున్నాడట. -
Marcus Stoinis: ధోని కాంప్లిమెంట్ ఇచ్చాడో.. సెటైర్ వేశాడో తెలియలేదు!
Marcus Stoinis Comments On MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన సారథిగా.. ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్ను నాలుగుసార్లు చాంపియన్గా నిలిపిన కెప్టెన్గా.. అనేకానేక ఘనతలు అతడి ఖాతాలో ఉన్నాయి. ఇక ఇలాంటి రికార్డులతోనే కాకుండా... ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లతో కూడా అతడు వ్యవహరించే తీరు కూడా కోట్లాది మంది అభిమానులను సంపాదించిపెట్టింది. టీ20 వరల్డ్కప్-2021 టోర్నీలో భాగంగా.. టీమిండియాతో మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ ఆటగాళ్లు వచ్చి ధోని వద్ద సలహాలు తీసుకోవడం అతడి వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆస్ట్రేలియా ఆల్రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ మార్కస్ స్టొయినిస్ సైతం ఇదే మాట అంటున్నాడు. ఐపీఎల్-2021లో భాగంగా చెన్నై సూపర్కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సందర్భంగా ధోని తనతో మాట్లాడిన మాటలను స్టొయినిస్ గుర్తుచేసుకున్నాడు. ఈ మేరకు గ్రేడ్ క్రికెటర్స్ యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ... ‘‘నిజానికి తను నాతో చాలా నిజాయితీగా మాట్లాడాడు. నా ఆట తీరు గురించి తనకు అవగాహన ఉంది. అందుకే నా కోసం సీఎస్కే ఎలాంటి ప్రణాళికలు రచించిందో.. ఫీల్డ్ను ఎలా సెట్ చేస్తారో కూడా చెప్పాడు. నిజానికి అది నాకు తను ఇచ్చిన కాంప్లిమెంటా లేదంటే... నీ గురించి మొత్తం తెలుసులేనన్న సెటైరో అర్థం కాలేదు(నవ్వులు)’’ అని స్టొయినిస్ వ్యాఖ్యానించాడు. ఇక క్రికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్గా పేరొందిన ధోని.. ఫినిషింగ్కు సంబంధించి తనకు ఆసక్తికర విషయాలు చెప్పాడని స్టొయినిస్ పేర్కొన్నాడు. ‘‘కొంతమంది బాధ్యతాయుతంగా ఆడుతూ చివరి వరకు క్రీజులో ఉంటారు. మరికొందరు మ్యాచ్ ఆరంభంలోనే రిస్క్ తీసుకోవడానికి కూడా వెనుకాడరు. ఇందులో ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి అని తను అన్నాడు. నిజమే కదా’’ అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా..‘‘ ఆటలో మన బలహీనతలను గుర్తించాలి.. అయితే అది మన బలాన్ని ప్రభావితం చేసేలా మాత్రం ఉండకూడదనే స్ఫూర్తిదాయక మాటలు చెప్పాడు’’ అని తెలిపాడు. కాగా స్టొయినిస్ ప్రస్తుతం టీ20 వరల్డ్కప్-2021లో ఆడుతుండగా... ధోని టీమిండియాకు మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: Gary Kirsten: పాకిస్తాన్ హెడ్ కోచ్గా.. టీమిండియా మాజీ కోచ్! -
నేను ఇంకా ఎక్కడికీ వెళ్లడం లేదు: ధోని
ప్రతీ ఫైనల్ ప్రత్యేకమే. ఫైనల్లో ఎక్కువసార్లు ఓడిన జట్టు కూడా మాదే. అయితే పడ్డ ప్రతీసారి కోలుకొని పైకి లేవడం అన్నింటికంటే ముఖ్యం. మేం ఆటగాళ్లను మారుస్తూ వచ్చాం. ప్రతీసారి ఒక మ్యాచ్ విన్నర్ బయటకు వచ్చి అద్భుతాలు చేశారు. నిజాయితీగా చెప్పాలంటే జట్టు సమావేశాల్లో మేం పెద్దగా మాట్లాడుకోం. ఏమైనా ఉంటే ఒక్కొక్కరితో విడిగా చెప్పడమే. మేం ఎక్కడ ఆడినా మాకు అండగా నిలిచే చెన్నై అభిమానులకు కృతజ్ఞతలు. ఇప్పుడు కూడా చెన్నైలో ఆడుతున్నట్లే అనిపించింది. వచ్చేసారి రెండు కొత్త జట్లు వస్తున్నాయి కాబట్టి ఆటగాళ్లను కొనసాగించడం గురించి ఏమీ చెప్పలేను. నేను ఇదే జట్టుతో కొనసాగుతానా లేదా అనేది సమస్య కాదు. ఫ్రాంచైజీ కోసం ఒక పటిష్టమైన జట్టును తయారు చేయడం ముఖ్యం. సరిగ్గా చెప్పాలంటే వచ్చే 10 ఏళ్లు జట్టును నడిపించగల ప్రధాన బృందాన్ని ఎంచుకోవడం ముఖ్యం. నా వైపు నుంచి గొప్ప ఘనతలు ఇచ్చి వెళుతున్నానని అంటున్నారు. కానీ నేను ఇప్పుడే పోతే కదా. –ఎమ్మెస్ ధోని, (చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్) -
ధోని పక్కా వ్యూహం.. వారి వయసు 35 ఏళ్లకు పైనే..
సాక్షి క్రీడా విభాగం: ‘మేం వచ్చేసారి బలంగా తిరిగొస్తాం... అభిమానులకు ఇదే నా సందేశం’... గత ఏడాది ఐపీఎల్లో చెత్త ప్రదర్శనతో ఏడో స్థానంలో నిలిచిన తర్వాత ధోని చేసిన వ్యాఖ్య ఇది. జట్టుపై, తనపై ఎంత నమ్మకముంటే ధోని ఇలాంటి మాటలు చెప్పగలడు. ఎందుకంటే అతను ధోని కాబట్టి! చూస్తుంటే టీమ్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. వయసు పెరిగిపోయి, ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ఆటగాళ్లతో ఈసారే కాలేదు, వచ్చే ఏడాది ఏమవుతుంది అని అన్ని వైపుల నుంచి వ్యంగ్య స్పందనలు. కానీ ఇలాంటి స్థితి నుంచి టీమ్ను నిజంగా విజేతగా నిలపడం అంటే అసాధారణం. సీఎస్కేకు తొలి సీజన్ నుంచి కర్త, కర్మ, క్రియ అన్నీ ధోనినే. జట్టు గెలిచినా, ఓడినా, చాంపియన్షిప్లు సాధించినా అంతా అతని సారథ్యం అనడంలో సందేహం లేదు. టీమ్ మేనేజ్మెంట్ కూడా ఇదే నమ్మింది. ఇన్నేళ్ల విజయాల్లో భిన్న ఆటగాళ్లు తమదైన పాత్ర పోషించారు. కానీ మారనిది ధోని, అతని వ్యూహ చతురతే! సరిగ్గా చెప్పాలంటే ఈ సీజన్లో 40 ఏళ్ల ధోని బ్యాటింగ్ చూస్తే సూపర్ కింగ్స్ పది మంది ఆటగాళ్లు, ఒక కెప్టెన్తో ఆడినట్లు ఉంది. కేవలం నాయకత్వం కారణంగానే అతను టీమ్లో ఉన్నాడనేది వాస్తవమైతే అతను నాయకుడిగా ఉన్నాడు కాబట్టే టీమ్ ఇలా పురోగమించిందనేది కూడా అంతకంటే వాస్తవం! చెన్నై టీమ్లో ఐదుగురు ఆటగాళ్లు 35 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. టి20లు అనగానే ఈ విషయంలో కాస్త సంశయం కనిపిస్తుంది. అయితే బరిలోకి దిగి అద్భుతాలు చేసేందుకు వారికి వయసు అడ్డు రాలేదు. వీరంతా టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. 37 ఏళ్ల డు ప్లెసిస్ ఏకంగా 633 పరుగులతో సత్తా చాటి ఓపెనర్గా శుభారంభాలు అందించాడు. 38 ఏళ్ల బ్రావో 14 కీలక వికెట్లు తీసి తాను చెన్నై బృందంలో సుదీర్ఘ కాలంగా ఎందుకు కొనసాగుతున్నాడో చూపించాడు. 34 ఏళ్ల సీనియర్, అత్యంత విజయవంతమైన చెన్నై ఆటగాడు సురేశ్ రైనా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతుంటే మరో 35 ఏళ్ల రాబిన్ ఉతప్పను తుది జట్టులోకి తీసుకొని చేసిన వ్యూహం సూపర్గా పేలింది. తొలి క్వాలిఫయర్లో మెరుపు బ్యాటింగ్ చేసిన ఉతప్ప, ఫైనల్లో జట్టు ఒత్తిడిలోకి వెళుతున్న సమయంలో 3 సిక్సర్లతో ఆట మార్చేశాడు. 36 ఏళ్ల రాయుడు కూడా కీలక సమయంలో రెండు అర్ధ సెంచరీలతో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇక ఐపీఎల్ గెలిచిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచిన 34 ఏళ్ల మొయిన్ అలీని కూడా ధోని సమర్థంగా వాడుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్లతో పాటు అతని చక్కటి ఫీల్డింగ్ జట్టుకు ఎంతో పనికొచ్చాయి. ఎప్పటిలాగే రవీంద్ర జడేజా తనదైన శైలిలో అన్ని రంగాల్లో రాణించడం చెన్నై బలాన్ని పెంచింది. ఇక టీమ్ ప్రస్థానంలో చెప్పుకోదగ్గ పేరు రుతురాజ్ గైక్వాడ్. గత ఏడాది ఐపీఎల్ సమయంలో అనూహ్యంగా కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత ఆరంభంలో విఫలమైనా... చివరి మ్యాచ్లలో సత్తా చాటాడు. ఈసారి తనలోని పూర్తి స్థాయి ఆటను చూపిస్తూ సెంచరీ సహా 635 పరుగులు సాధించడం చెన్నై టైటిల్ విజయంలో కీలకంగా మారింది. వీరందరినీ సమర్థంగా వాడుకుంటూ ధోని నడిపించిన తీరు నాయకుడిగా అతని వన్నె ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. చివరగా... వచ్చేసారి ఐపీఎల్లో మెగా వేలం ఉన్న నేపథ్యంలో ఇంకా నియమ నిబంధనలు ఏమిటనేది బీసీసీఐ ఇంకా స్పష్టం చేయలేదు. అయితే విజేతలుగా నిలిచిన ఈ టీమ్లోని సభ్యుల్లో కూడా ఎంత మంది మళ్లీ ఐపీఎల్లో కనిపిస్తారనేది వేర్వేరు కారణాలతో సందేహమే. ఒకవేళ ఆడినా ఇదే సక్సెస్ఫుల్ టీమ్ ఒక్క చోటికి చేరడం సహజంగానే కష్టం. ఈ నేపథ్యంలో వీరు సాధించిన విజయపు ఘనత చిన్నదేమీ కాదు. చెన్నై ఫ్యాన్స్ మాత్రమే కాదు, సగటు క్రికెట్ అభిమాని కూడా... ఏం ఆడిందిరా ఈ టీమ్ అనేలా ఘనంగా చెన్నై ముగింపు పలికింది. -
నాలుగోసారి ‘కింగ్స్’
ఐపీఎల్లో మళ్లీ ‘విజిల్ పొడు’... పసుపు మయమైన దుబాయ్ మైదానంలో తమ ఆరాధ్య ఆటగాడు మాహి మళ్లీ ఐపీఎల్ ట్రోఫీతో చిరునవ్వులు చిందిస్తుంటే... దసరా రోజున చెన్నై క్రికెట్ అభిమానుల పండగ ఆనందం రెట్టింపైంది... అనుభవం, అద్భుత నాయకత్వం వెరసి చెన్నై మరోసారి ధనాధన్ లీగ్లో తమ విలువేంటో చూపించింది. తుది పోరులో అన్ని రంగాల్లో మెరిసి నాలుగోసారి ఐపీఎల్ చాంపియన్గా నిలిచింది. మెరుపు బ్యాటింగ్తో మొదటి భాగంలోనే విజయానికి బాటలు వేసుకున్న జట్టు, బౌలింగ్లో కీలక సమయంలో సత్తా చాటి ప్రత్యర్థిని పడగొట్టింది. ఫైనల్ పోరులో తమదైన పాత్ర పోషించిన ప్రతీ ప్లేయర్ హీరోలుగా నిలిచారు. అటు కోల్కతా నైట్రైడర్స్ ఆరంభంలోనే భారీగా పరుగులు సమరి్పంచుకొని పట్టు కోల్పోయింది. నమ్ముకున్న బౌలర్లంతా విఫలం కాగా... బ్యాటింగ్లో టోర్నీ ఆసాంతం వెంటాడిన మిడిలార్డర్ వైఫల్యం అసలు సమయంలో పెద్ద దెబ్బ కొట్టింది. ఫలితంగా తమ మూడో ఫైనల్ను ఓటమితో ముగించాల్సి వచి్చంది. దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత నిలకడైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) నాలుగో టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్లో చెన్నై 27 పరుగుల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫాఫ్ డు ప్లెసిస్ (59 బంతుల్లో 86; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, మొయిన్ అలీ (20 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (27 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్), రాబిన్ ఉతప్ప (15 బంతుల్లో 31; 3 సిక్సర్లు) కీలక ప్రదర్శన చేశారు. అనంతరం కోల్కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులే చేయగలిగింది. ఓపెనర్లు శుబ్మన్ గిల్ (43 బంతుల్లో 51; 6 ఫోర్లు), వెంకటేశ్ అయ్యర్ (32 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఒకదశలో 91/0తో లక్ష్యం దిశగా సాగిన జట్టు... 34 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. విజేతగా నిలిచిన చెన్నై జట్టుకు రూ. 20 కోట్లు... రన్నరప్ కోల్కతా జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు... సీజన్ మొత్తంలో ఆడిన తరహాలోనే చెన్నైకి మరోసారి ఓపెనర్లు రుతురాజ్, డు ప్లెసిస్ శుభారంభం అందించారు. షకీబ్ ఓవర్లో రుతురాజ్ వరుసగా 4, 6 కొట్టగా, అదృష్టం కలిసొచ్చిన డు ప్లెసిస్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరింది. నరైన్ ఈ జోడీని విడదీసిన సమయంలో కోల్కతా స్పిన్నర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నట్లు అనిపించింది. అయితే మూడో స్థానంలో వచి్చన రాబిన్ ఉతప్ప ఉన్న కొద్దిసేపు మెరుపు బ్యాటింగ్తో ఆట గమనాన్ని మార్చేశాడు. మరోవైపు ఫెర్గూసన్ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన 35 బంతుల్లోనే డు ప్లెసిస్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నరైన్ బౌలింగ్లో ఉతప్ప వెనుదిరిగినా అలీ దూకుడుతో చెన్నై ఇన్నింగ్స్లో జోరు తగ్గలేదు. శివమ్ మావి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన అలీ, వరుణ్ చక్రవర్తి ఓవర్లోనూ మరో ఫోర్, సిక్స్ కొట్టాడు. ఫెర్గూసన్ ఓవర్లో 19 పరుగులు రాబట్టి కింగ్స్ పండగ చేసుకుంది. ఇన్నింగ్స్ చివరి బంతికి డు ప్లెసిస్ అవుటైనా... మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాల్లో (61, 63, 68) అతను తన పాత్రను సమర్థంగా పోషించాడు. ఓపెనర్లు మినహా... చెన్నైతో పోలిస్తే ఛేదనలో కోల్కతా మరింత దూకుడు కనబర్చింది. ఫామ్లో ఉన్న ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ వరుస బౌండరీలతో జోరును ప్రదర్శించగా, గిల్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. చహర్, శార్దుల్ ఓవర్లలో వెంకటేశ్ రెండేసి ఫోర్లు కొట్టాడు. పవర్ప్లేలో 55 పరుగులు రాగా, జడేజా ఓవర్లో 16 పరుగులు రాబట్టడంతో సగం ఇన్నింగ్స్ ముగిసేసరికి స్కోరు 88 పరుగులకు చేరింది. అయితే ఈ దశలో శార్దుల్ మ్యాచ్ను మలుపు తిప్పాడు. అతని ఓవర్లో భారీ షాట్కు ప్రయతి్నంచిన వెంకటేశ్... జడేజా అద్భుత క్యాచ్కు వెనుదిరగడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడగా, అదే ఓవర్లో రాణా (0) అవుటయ్యాడు. నరైన్ (2), కార్తీక్ (9), షకీబ్ (0), గాయంతో బ్యాటింగ్కు దిగిన త్రిపాఠి (2), పేలవ ఫామ్లో ఉన్న కెపె్టన్ మోర్గాన్ (4) వరుసగా విఫలమయ్యారు. దాంతో కేకేఆర్ ఇన్నింగ్స్ వేగంగా పతనమైంది. చివర్లో 21 బంతుల్లో 68 పరుగులు చేయాల్సిన స్థితిలో జత కలిసిన శివమ్ మావి (13 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్సర్లు), ఫెర్గూసన్ (18 నాటౌట్) కొన్ని మెరుపు షాట్లు ఆడి 39 పరుగులు జోడించినా అది వృథా ప్రయాసే అయింది. డు ప్లెసిస్కు అవకాశం ఇచి్చ... సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ చేసిన పెద్ద తప్పు చెన్నైకి ఊపిరి పోసింది. షకీబ్ బౌలింగ్లో డు ప్లెసిస్ ముందుకు దూసుకు రాగా, సునాయాస స్టంపింగ్ అవకాశాన్ని కార్తీక్ వదిలేశాడు. ఆ సమయంలో ప్లెసిస్ స్కోరు 4 మాత్రమే! ఆ తర్వాత అతనే భారీ స్కోరుకు కారణమయ్యాడు. కోల్కతా ఆటగాడు వెంకటేశ్ ‘0’ వచి్చన ఇచ్చిన క్యాచ్ను అనూహ్యంగా ధోని వదిలేసి అతని అర్ధ సెంచరీకి అవకాశం ఇచి్చనా... చివరకు అది నష్టం కలిగించలేదు. మరోవైపు 27 పరుగుల వద్ద గిల్ క్యాచ్ను రాయుడు అందుకున్నా... బంతి స్పైడర్ క్యామ్ వైర్కు తగిలి రావడంతో అంపైర్లు డెడ్బాల్గా ప్రకటించడం ధోనికి అసహనం తెప్పించింది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) మావి (బి) నరైన్ 32; డు ప్లెసిస్ (సి) వెంకటేశ్ (బి) మావి 86; ఉతప్ప (ఎల్బీ) (బి) నరైన్ 31; మొయిన్ అలీ (నాటౌట్) 37; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–61, 2–124, 3–192. బౌలింగ్: షకీబ్ 3–0–33–0, మావి 4–0–32–1, ఫెర్గూసన్ 4–0–56–0, వరుణ్ 4–0–38–0, నరైన్ 4–0–26–2, వెంకటేశ్ 1–0–5–0. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (ఎల్బీ) (బి) దీపక్ చహర్ 51; వెంకటేశ్ (సి) జడేజా (బి) శార్దుల్ 50; రాణా (సి) డు ప్లెసిస్ (బి) శార్దుల్ 0; నరైన్ (సి) జడేజా (బి) హేజల్వుడ్ 2; మోర్గాన్ (సి) చహర్ (బి) హేజల్వుడ్ 4; దినేశ్ కార్తీక్ (సి) రాయుడు (బి) జడేజా 9; షకీబ్ (ఎల్బీ) (బి) జడేజా 0; త్రిపాఠి (సి) అలీ (బి) శార్దుల్ 2; ఫెర్గూసన్ (నాటౌట్) 18; మావి (సి) చహర్ (బి) బ్రేవో 20; వరుణ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–91, 2–93, 3–97, 4–108, 5–119, 6–120, 7–123, 8–125, 9–164. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–32–1, హేజల్వుడ్ 4–0–29–2, శార్దుల్ ఠాకూర్ 4–0–38–3, బ్రావో 4–0–29–1, జడేజా 4–0–37–2. ఐపీఎల్–2021 అవార్డులు ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్) రుతురాజ్ గైక్వాడ్ 635 పరుగులు చెన్నై సూపర్ కింగ్స్ ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ రుతురాజ్ గైక్వాడ్ –ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) హర్షల్ పటేల్–32 వికెట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ హర్షల్ పటేల్ – ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ హర్షల్ పటేల్ – ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ రవి బిష్ణోయ్ (పంజాబ్ కింగ్స్) ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ హెట్మైర్ – ఢిల్లీ క్యాపిటల్స్ ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు పవర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ వెంకటేశ్ అయ్యర్ కోల్కతా నైట్రైడర్స్ ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ కేఎల్ రాహుల్ (30 సిక్స్లు) పంజాగ్ కింగ్స్ ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు ఫెయిర్ ప్లే టీమ్ ఆఫ్ ద సీజన్: రాజస్తాన్ రాయల్స్ -
ధోని ఫ్యాన్స్కు మరో గుడ్ న్యూస్.. ఐపీఎల్ ట్రోఫీతో పాటు..?
MS Dhoni And Sakshi Dhoni Expecting Their Second Child In 2022: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ను నాలుగోసారి(2010, 2011, 2018, 2021) విజేతగా నిలిపి ఆ ఫ్రాంఛైజీ అభిమానులు గర్వపడేలా చేసిన మహేంద్ర సింగ్ ధోని.. తన ఫ్యాన్స్కు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పాడు. ధోని రెండోసారి తండ్రి కాబోతున్న విషయాన్ని అతని భార్య సాక్షి సింగ్ రావత్ స్నేహితురాలు, సురేశ్ రైనా భార్య ప్రియాంక రైనా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సాక్షి రావత్ ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి అని.. వచ్చే ఏడాదిలో ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వనుందని ప్రియాంక రైనా పేర్కొన్నట్లు సమాచారం. నిన్న సీఎస్కే ట్రోఫీ గెలిచిన అనంతరం సాక్షి, కుమార్తె జీవాతో కలిసి మైదానంలోకి వచ్చి సందడి చేశారు. ఆ సమయంలో సాక్షి బేబీ బంప్ స్పష్టంగా కనిపించడంతో ధోని అభిమానులు విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. దీంతో ధోని ఫ్యాన్స్కు డబుల్ ధమాకా లభించినట్లైంది. ఇదిలా ఉంటే, శుక్రవారం జరిగిన ఐపీఎల్-2021 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. కోల్కతా నైట్ రైడర్స్ను 27 పరుగుల తేడాతో ఓడించి, నాలుగోసారి ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. డుప్లెసిస్ (86), రుతురాజ్ గైక్వాడ్ (32), రాబిన్ ఉతప్ప (31), మొయిన్ అలీ (37) రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్కు ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (50), శుభ్మన్ గిల్ (51) శుభారంభాన్ని అందించినప్పటికీ.. మిగతా బ్యాటర్లంతా తేలిపోవడంతో మోర్గాన్ సేన ఓటమిపాలై, మూడోసారి కప్కు గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. చదవండి: తీవ్ర విషాదం... గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి -
IPL2021: సీఎస్కే విన్నింగ్ మూమెంట్స్ (ఫోటోలు)
-
గోల్డెన్ డక్ విషయంలో నితీష్ రాణా చెత్త రికార్డు
Nitish Rana Golden Duck.. గోల్డెన్ డక్ విషయంలో కేకేఆర్ బ్యాటర్ నితీష్ రాణా చెత్త రికార్డు నమోదు చేశాడు. 2020 ఏడాది ఆరంభం మొదలైనప్పటి నుంచి నితీష్ రాణా ఐదుసార్లు గోల్డెన్డక్గా వెనుదిరగడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సీఎస్కేతో జరుగుతున్న ఐపీఎల్ 2021 సీజన్ ఫైనల్లో కేకేఆర్ ఓటమి దిశగా పయనిస్తుంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే కేకేఆర్కు 193 పరుగుల భారీ లక్ష్యం విధించింది. సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్ (59 బంతుల్లో 86;7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. రుతురాజ్ 32, ఊతప్ప 31 పరుగులు చేశారు. ఆఖర్లో మొయిన్ అలీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2, శివమ్ మావి 1 వికెట్ తీశాడు. -
IPL 2021 Final: తెలుగులో మాట్లాడిన కేకేఆర్ ఆటగాడు.. ఫ్యాన్స్ ఫిదా
Dinesh Karthik Speaking Telugu In IPL 2021 Final: 2021 ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా కోల్కతా నైట్రైడర్స్ వికెట్కీపర్ దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మెగా ఫైనల్ ప్రారంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానెల్ కోసం మాట్లాడిన డీకే.. ఎలాంటి తడబాటు లేకుండా స్పష్టమైన ఉచ్చారణతో తెలుగు మాట్లాడి ఆకట్టుకున్నాడు. ప్రముఖ వాఖ్యాత, తెలుగువాడైన హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. డీకే అనర్గలంగా తెలుగులో మాట్లాడాడు. Wow. @DineshKarthik is killing it in Telugu. As fluent as his on field conversations in Tamil with Varun Chakravarthy. #IPLFinal pic.twitter.com/pLABDPES4U — PK - VJ (@msd21888) October 15, 2021 మెగా ఫైనల్ అని ఏమైనా ఒత్తిడి ఉందా అని హర్షా ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, సాధారణ మ్యాచ్లానే ఈ మ్యాచ్నూ పరిగణిస్తున్నామని తెలిపాడు. అయితే ఫైనల్ మ్యాచ్ అంటే సహజంగా ఎవరికైన కాస్తో కూస్తో ఒత్తిడి ఉంటుందని, దాన్ని అధిగమించేందుకు ప్రాక్టీస్ చేశామని, సరైన ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. తమ జట్టు సెకండాఫ్లో అద్భుతంగా రాణించిందని, ఫైనల్కు చేరేందుకు ఆటగాళ్లు ఎంతో శ్రమించారని అన్నాడు. ఈ సందర్భంగా డీకే.. కేకేఆర్ ఆటగాళ్లందరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. Ha! Never thought I would do a pre-game interview in Telugu with @DineshKarthik. Bagane Telugulo mataladtaadu mana DK! — Harsha Bhogle (@bhogleharsha) October 15, 2021 కాగా, దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడటం పట్ల తెలుగు అభిమానులు ఫిదా అవుతున్నారు. డీకే అచ్చం తెలుగువాడిలా అద్భుతంగా మాట్లాడుతున్నాడంటూ సోషల్మీడియాలో వీడియోని షేర్ చేస్తూ ముచ్చటపడిపోతున్నారు. హర్షా భోగ్లే సైతం డీకేను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. తెలుగు ఇంటర్వ్యూ చేస్తానని కలలో కూడా ఊహించలేదని అన్నాడు. ఇదిలా ఉంటే, డీకే.. 2020 ఐపీఎల్ సందర్భంగా కూడా తెలుగులో మాట్లాడి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చదవండి: IPL 2021 Final: ఐపీఎల్ చరిత్రలో అద్భుత రికార్డు -
IPL 2021 Final: ఐపీఎల్ చరిత్రలో అద్భుత రికార్డు
CSK Opener Ruturaj Gaikwad Became Youngest Orange Cap Holder In IPL History: ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. కోల్కతా నైట్ రైడర్స్తో శుక్రవారం జరిగిన ఐపీఎల్-2021 తుది సమరంలో 24 పరుగుల వద్ద పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్(626 పరుగులు) నుంచి ఆరెంజ్ క్యాప్ను చేజిక్కించుకున్న రుతురాజ్(24 ఏళ్లు).. లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు పంజాబ్ మాజీ ఓపెనర్ షాన్ మార్ష్ పేరిట ఉండేది. 2008లో 25 సంవత్సరాల వయసులో షాన్ మార్ష్ 616 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను అందుకున్నాడు. ఇదిలా ఉంటే, నేటి మ్యాచ్లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన సీఎస్కే 14 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. రుతురాజ్ 32 పరుగుల వద్ద సునీల్ నరైన్ బౌలింగ్లో శివమ్ మావికి క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. రాబిన్ ఊతప్ప(31) నరైన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. క్రీజ్లో డుప్లెసిస్(57), మొయిన్ అలీ(1) ఉన్నారు. చదవండి: T20 World Cup 2021: టీమిండియాతో మెగా పోరుకు ముందు పాక్ జట్టుకు భారీ షాక్.. -
ఏడుసార్లలో మూడు కేకేఆర్పైనే.. అన్ని గెలుపే
Ruturaj Gaikwad And Faf Du Plesis.. కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో సీఎస్కే ఒక అరుదైన రికార్డు సాధించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్లు ఈ సీజన్లో తొలి వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ఇది ఏడోసారి. కాగా ఇందులో మూడుసార్లు కేకేఆర్పైనే నమోదు చేశారు. ఇంకో విశేషమేమిటంటే.. సీఎస్కే ఓపెనర్లు అర్థసెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన ఆరు మ్యాచ్ల్లోనూ సీఎస్కే విజయం సాధించడం విశేషం. ఇక సీఎస్కే ఓపెనర్లుగా రుతురాజ్- డుప్లెసిస్ జోడి ఈ సీజన్లో 756 పరుగులు జోడించి ఓవరాల్గా ఐపీఎల్ చరిత్రలో మూడో స్థానంలో నిలిచారు. కోహ్లి- డివిలియర్స్(ఆర్సీబీ) జోడి 2016 ఐపీఎల్ సీజన్లో 939 పరుగులతో తొలి స్థానంలో ఉన్నారు. డేవిడ్ వార్నర్- బెయిర్ స్టో జోడి(ఎస్ఆర్హెచ్) 2019 ఐపీఎల్ సీజన్లో 791 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు. -
CSK Vs KKR Final: ఐపీఎల్ 2021 టైటిల్ విజేత సీఎస్కే
ఐపీఎల్ 2021 టైటిల్ విజేత సీఎస్కే ఐపీఎల్లో సీఎస్కే నాలుగోసారి చాంపియన్గా నిలిచింది. కేకేఆర్తో జరిగిన ఫైనల్లో సీఎస్కే 27 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించి ఐపీఎల్ 2021 విజేతగా నిలిచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఆరంభంలో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ దూకుడుతో ఇన్నింగ్స్ను ఘనంగానే ఆరంభించింది. అయితే అయ్యర్, గిల్ ఔటైన తర్వాత మ్యాచ్ మొత్తం మారిపోయింది. ఆ తర్వాత జడేజా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్ టర్న్ అయింది. ఆ తర్వాత వరుస విరామాల్లో కేకేఆర్ వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా అడుగులేసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్ (59 బంతుల్లో 86;7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. రుతురాజ్ 32, ఊతప్ప 31 పరుగులు చేశారు. ఆఖర్లో మొయిన్ అలీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2, శివమ్ మావి 1 వికెట్ తీశాడు. ఎనిమిదో వికెట్ వికెట్ డౌన్.. ఓటమి దిశగా కేకేఆర్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ వరుసగా వికెట్లు కోల్పోతూ వస్తుంది. షకీబుల్ హసన్ జడేజా బౌలింగ్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్ 15 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. అంతకముందు9 పరుగులు చేసిన కార్తీక్ జడేజా బౌలింగ్లో రాయుడుకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా.. 51 పరుగులు చేసిన శుబ్మన్ గిల్ దీపక్ చహర్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. . వెంకటేశ్ అయ్యర్ ఔట్.. కేకేఆర్ 93/2 సీఎస్కే జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. నితీష్ రాణా గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. అంతకముందు వెంకటేశ్ అయ్యర్(50) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. దాటిగా ఆడుతున్న అయ్యార్ శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్లో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. గిల్ 40, నితీష్ రాణా పరుగులతో క్రీజులో ఉన్నారు. చుక్కలు చూపిస్తున్న వెంకటేశ్ అయ్యర్.. కేకేఆర్ 72/0 కేకేఆర్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ సీఎస్కే బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 25 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులతో ఆడుతున్న అయ్యర్కు మరో ఓపెనర్ శుబ్మన్ గిల్(27) సహకరిస్తున్నాడు. ప్రస్తుతం కేకేఆర్ 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ధీటుగా బదులిస్తున్న కేకేఆర్ 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ధీటుగానే బదులిస్తుంది. కేకేఆర్ ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, శుబ్మన్ గిల్లు దాటిగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులెత్తిస్తున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 21, గిల్ 15 పరుగులతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL సీఎస్కే 192/3 .. కేకేఆర్ ముందు భారీ టార్గెట్ ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్లో సీఎస్కే కేకేఆర్కు 193 పరుగుల భారీ లక్ష్యం విధించింది. సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్ (59 బంతుల్లో 86;7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. రుతురాజ్ 32, ఊతప్ప 31 పరుగులు చేశారు. ఆఖర్లో మొయిన్ అలీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2, శివమ్ మావి 1 వికెట్ తీశాడు. 17 ఓవర్లలో సీఎస్కే 153/2 17 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్ డుప్లెసిస్ 69 పరుగులతో ఆడుతుండగా.. మొయిన్ అలీ 16 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. 124/2 రాబిన్ ఊతప్ప(31) రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. నరైన్ బౌలింగ్లో ఊతప్ప ఎల్బీగా ఔట్ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్కే 14 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. డుప్లెసిస్ 57 పరుగులతో ఆడుతున్నారు. 13 ఓవర్లలో సీఎస్కే స్కోరు 116/1 13 ఓవర్ల ఆట ముగిసేసరికి సీఎస్కే వికెట్ నష్టానికి 116 పరుగులు చేసింది. డుప్లెసిస్ 56,రాబిన్ ఊతప్ప 25 పరుగులతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే.. రుతురాజ్(32) ఔట్ రుతురాజ్ గైక్వాడ్(32)రూపంలో సీఎస్కే తొలి వికెట్ను కోల్పోయింది. కేకేఆర్ స్పిన్నర్ నరైన్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ తొలి బంతిని రుతురాజ్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. శివమ్ మావి క్యాచ్ అందుకున్నాడు. ప్రస్తుతం సీఎస్కే 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. 6 ఓవర్లలో సీఎస్కే 50/0 సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్లు ఇన్నింగ్స్ ధాటిగా ఆడుతున్నారు. కేకేఆర్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. రుతురాజ్ 26, డుప్లెసిస్ 23 పరుగులతో ఆడుతున్నారు. 3 ఓవర్లలో సీఎస్కే 22/0 కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో సీఎస్కే 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. రుతురాజ్ 18, డుప్లెసిస్ 3 పరుగులతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL దుబాయ్: ఐపీఎల్ 2021లో భాగంగా సీఎస్కే, కేకేఆర్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక మ్యాచ్లో సీఎస్కే ఫెవరెట్గా కనిపిస్తుండగా.. కేకేఆర్ కూడా పటిష్టంగానే కనిపిస్తుంది. లీగ్ దశలో సీఎస్కే 14 మ్యాచ్ల్లో 9 విజయాలు.. 5 ఓటములతో రెండో స్థానంలో నిలిచింది. ఇక కేకేఆర్ 14 మ్యాచ్ల్లో 7 విజయాలు.. ఏడు ఓటములతో నాలుగో స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫయర్ 1లో సీఎస్కే ఘన విజయం సాధించి నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఆర్సీబీని ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడించిన కేకేఆర్ క్వాలిఫయర్ 2లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్ దశలో రెండుసార్లు తలపడగా.. సీఎస్కేనే విజయం వరించింది. ముఖాముఖి పోరులో 24 సార్లు తలపడగా.. 16 మ్యాచ్ల్లో సీఎస్కే విజయం సాధించగా.. కేకేఆర్ 8సార్లు గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్వుడ్ కోల్కతా నైట్ రైడర్స్: శుబ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లోకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి -
IPL 2021 Final: పలు అరుదైన రికార్డులపై కన్నేసిన సీఎస్కే ఆటగాళ్లు
CSK Players Set To Reach Milestones In IPL 2021 Final Match Against KKR: చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్లో పలు అరుదైన రికార్డులు బద్దలయ్యే ఆస్కారముంది. ఆ రికార్డులు ఏంటో, వాటిని ఏ సీఎస్కే ఆటగాడు బద్దలు కొట్టనున్నాడో ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. * నేటి మ్యాచ్తో సీఎస్కే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్లో 200వ మ్యాచ్ ఆడనున్నాడు. * ఇవాళ మ్యాచ్లో సీఎస్కే బ్యాటర్ రాబిన్ ఊతప్ప మరో 55 పరుగులు సాధిస్తే, పొట్టి ఫార్మాట్ మొత్తంలో 7000 పరుగులను పూర్తి చేసుకుంటాడు. అలాగే మరో 5 బౌండరీలు సాధిస్తే టీ20 ఫార్మాట్ మొత్తంలో 700 ఫోర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. * సీఎస్కే మిడిలార్డర్ ఆటగాడు అంబటి రాయుడు మరో 84 పరుగులు చేస్తే ఐపీఎల్లో 4000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. అలాగే మరో సిక్సర్ బాదితే ఐపీఎల్లో 150, టీ20 ఫార్మాట్ మొత్తంలో 200 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు. * నేటి మ్యాచ్లో సీఎస్కే ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో మరో 5 వికెట్లు తీస్తే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన లసిత్ మలింగ(170) రికార్డును అధిగమిస్తాడు. * సీఎస్కే సారధి ధోని నేటి మ్యాచ్లో మరో 65 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్ మొత్తంలో 7000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. * ఇవాళ మ్యాచ్లో సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మరో 24 పరుగులు చేస్తే పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ నుంచి ఆరెంజ్ క్యాప్ చేజిక్కించుకోవడంతో పాటు ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించనున్నాడు. * నేటి మ్యాచ్తో సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్ 100వ ఐపీఎల్ మ్యాచ్ ఆడనున్నాడు. అలాగే మరో 7 సిక్సర్లు బాదితే ఐపీఎల్లో 100 సిక్సర్ల ఘనతను, మరో 3 ఫోర్లు కొడితే టీ20 ఫార్మాట్ మొత్తంలో 600 ఫోర్ల మైలురాయిని చేరుకుంటాడు. చదవండి: సీఎస్కే జెర్సీలో వార్నర్.. అసలేం జరిగింది..? -
బయోబబూల్లో మా పరిస్థితి ఇలాగే ఉంది..
Virat Kohli Shows Life In Bio Bubble.. ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లి ఐపీఎల్ 2021 టైటిల్ అందుకోవడంలో మరోసారి విఫలమయ్యాడు. తనకు కెప్టెన్గా ఇదే చివరి సీజన్ అని విరాట్ కోహ్లి ఇప్పటికే ప్రకటించడంతో ఈసారి ఎలాగైనా ఆర్సీబీ కప్ కొడుతుందని అంతా భావించారు. కానీ కేకేఆర్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ అనూహ్యంగా ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇక తర్వాతి సీజన్ నుంచి కోహ్లి ఆర్సీబీకి ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. చదవండి: Virat Kohli Crying: కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఆ వెంటే డివిలియర్స్ కూడా ఇక తాజాగా విరాట్ కోహ్లి టి20 ప్రపంచకప్ ఉండడంతో టీమిండియా బయోబబూల్లోకి వెళ్లిపోయాడు. అయితే కరోనా వైరస్ తర్వాత బయోబబూల్ ప్రతీ ఒక్కరికి సర్వసాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో బయోబబూల్ అనేది ఎంత కష్టంగా ఉందో కోహ్లి ఒక్క ఫోటోతో చూపించాడు. తనను తాను కుర్చీకి కట్టేసుకొని.. బయోబబూల్లో మా పరిస్థితి అచ్చం ఇలాగే ఉందని పేర్కొన్నాడు. బయోబబూల్ వల్ల చాలా మంది ఆటగాళ్లు మానసిక ఒత్తిడి గురయ్యారు. పంజాబ్ కింగ్స్ ఆటగాడు క్రిస్ గేల్ బయోబబూల్ కారణంగానే ఐపీఎల్ వీడిన సంగతి తెలిసిందే. తాజాగా కోహ్లి కూడా బయోబబూల్ అనేది నచ్చలేదంటే పరోక్షంగా ఒక్క ఫోటోలోనే చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం కోహ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IPL 2021: టి20 కెప్టెన్గా ఎంఎస్ ధోని అరుదైన రికార్డు View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
టి20 కెప్టెన్గా ఎంఎస్ ధోని అరుదైన రికార్డు
MS Dhoni As First Captain As 300 T20 Matches.. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ముందు అరుదైన రికార్డు ఎదురుచూస్తుంది. కేకేఆర్తో జరగనున్న ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ ద్వారా 300 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన ఘనతను ధోని అందుకోనున్నాడు. కాగా ధోని సారధ్యంలోనే సీఎస్కే మూడుసార్లు(2010, 2011, 2018)లో చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. అంతేగాక ఇప్పటివరకు సీఎస్కే తరపున తొమ్మిదిసార్లు ఫైనల్ చేర్చిన ధోని.. 2017లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ను ఫైనల్ చేర్చాడు. దీంతోపాటు టి20ల్లో కెప్టెన్గా ఎక్కువ విజయాలు అందుకున్న కెప్టెన్గా ధోని అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో 213 మ్యాచ్ల్లో నాయకత్వం వహించిన ధోని 130 విజయాలు అందుకున్నాడు. ధోని తర్వాత ఐపీఎల్లో కెప్టెన్గా ఎక్కువ విజయాలు అందుకున్న వారిలో రోహిత్ శర్మ 75 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ల పరంగా కోహ్లి 140 మ్యచ్లతో రెండో స్థానంలో ఉన్నాడు. చదవండి: MS Dhoni: హెలికాప్టర్ షాట్ ప్రాక్టీస్ చేస్తున్న ధోని.. వీడియో వైరల్ కాగా వచ్చే ఐపీఎల్ సీజన్కు ధోని సీఎస్కేలో కొనసాగుతాడా లేదా అనేది స్పష్టంగా తెలియదు. అయితే ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ అనంతరం ధోని సీఎస్కేకు ఆడడంపై క్లారిటీ ఇచ్చాడు. తనను వచ్చే సీజన్లో ఎల్లో డ్రెస్లో కనిపిస్తానని.. అయితే జట్టులో ఆటగాడిగా.. లేక ఇతర స్థానంలో కొనసాగే అవకాశం ఉందని తెలిపాడు. ఇక టి20 ప్రపంచకప్ సందర్భంగా ధోని టీమిండియాకు మెంటార్గా ఎంపికైన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2021: అందరూ ధోనిలు కాలేరు.. పంత్కు కాస్త సమయం ఇవ్వండి -
సీఎస్కే జెర్సీలో వార్నర్.. అసలేం జరిగింది..?
David Warner Shares Pic In CSK Jersey Ahead Of IPL 2021 Final: చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య మరికాసేపట్లో మొదలుకానున్న ఐపీఎల్-2021 తుది పోరు నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ సారధి, ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఇన్స్టా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. ఇందులో వార్నర్ సీఎస్కే జెర్సీ ధరించి తన కుమార్తెను భుజాలపై ఎత్తుకుని దర్శనమిచ్చాడు. సీఎస్కే, కేకేఆర్ జట్ల మధ్య జరిగే నేటి ఫైనల్ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో కచ్చితంగా చెప్పలేను కానీ.. ఓ అభిమాని కోరికను కాదనలేక ఈ పోస్ట్ను చేస్తున్నానంటూ క్యాప్షన్ జోడించాడు. David Warner supporting CSK tonight and also posted an edit of him and his daughter in CSK jersey. pic.twitter.com/VlVh4D5P1f — Mufaddal Vohra (@mufaddal_vohra) October 15, 2021 అయితే, ఈ పోస్ట్ చేసిన కొద్ది నిమిషాలకే వార్నర్ దీన్ని తొలగించడం ప్రస్తుతం సోషల్మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వార్నర్ నేటి మ్యాచ్ వరకే సీఎస్కే అభిమానిగా ఉంటాడా లేక వచ్చే సీజన్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీఎస్కే జట్టుకు వెళ్లిపోతాడా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్లో వరుస వైఫల్యాల కారణంగా ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వార్నర్ను తుది జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్-2021 సీజన్ తొలిదశలో వార్నర్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీని న్యూజిలాండ్ స్కిప్పర్ కేన్ విలియమ్సన్కు కోల్పోయాడు. చదవండి: టీ20 క్రికెట్కు అశ్విన్ అనర్హుడు.. నేనైతే అతన్ని జట్టులోకి తీసుకోను -
కేకేఆర్.. 13 ఏళ్లు అయిపోయింది..ఈసారైనా?
కేకేఆర్.. ఇప్పటికే రెండు ఐపీఎల్ టైటిల్స్ సాధించి మూడోసారి రేసులో నిలిచింది ఈ జట్టు. తాజా ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ అనూహ్యంగా ఫైనల్కు చేరింది. అసలు ప్లే ఆఫ్కు వస్తుందా అనే దశ నుంచి ఏకంగా తుదిపోరుకు అర్హత సాధించింది. ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీని ఓడించిన కేకేఆర్.. క్వాలిఫయర్-2లో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తుచేసింది. దాంతో చెన్నై సూపర్కింగ్స్తో అమీతుమీకి సిద్ధమైంది. ఫలితంగా 2012, 2014 సీజన్లో చాంపియన్గా నిలిచిన ఈ జట్టు.. ఇప్పుడు మరొ టైటిల్పై కన్నేసింది. ప్రస్తుత ఐపీఎల్ ఒక్క మ్యాచ్తో ముగియనున్న నేపథ్యంలో కేకేఆర్ టైటిల్తో పాటు మరో రికార్డును బ్రేక్ చేయాలనే భావనలో ఉంది. 13 ఏళ్లుగా నో ‘సెంచరీ’ ఐపీఎల్ ఆరంభపు సీజన్లో భాగంగా ఆటగాళ్ల వ్యక్తిగత విభాగంలో తొలి సెంచరీ సాధించిన జట్గుగా రికార్డు నమోదు చేసిన కేకేఆర్.. ఆపై ఇప్పటివరకూ మరో సెంచరీ సాధించిన చరిత్ర లేదు. మెకల్లమ్ 73 బంతుల్లో 158 పరుగులు సాధించిన తర్వాత ఆ జట్టులో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు దినేశ్ కార్తీక్. 2019లో రాజస్థాన్ రాయల్స్ దినేశ్ కార్తీక్ అజేయంగా 97 పరుగులు సాధించినప్పటికీ సెంచరీ చేయలేకపోయాడు. దాంతో మరో సెంచరీ సాధించే రికార్డు రెండేళ్ల కిందటే చేజారిపోయింది. మరి ఈ సీజన్లో కేకేఆర్ జట్టు నుంచి మరొక ప్లేయర్ శతకం సాధిస్తాడని భావించినా ఇప్పటివరకూ అది జరగలేదు. చదవండి: IPL Final CSK Vs KKR: ఎవరిదో ‘విజయ’ దశమి..? కేకేఆర్ టీమ్(ఫైల్ఫోటో) ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్లో కేకేఆర్ జట్టు నుంచి ఎవరైనా శతకం నమోదు చేసి 13 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి. కేకేఆర్ జట్టు నుంచి అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన వారిలో మెకల్లమ్, దినేశ్ కార్తీక్ల తర్వాత స్థానంలో మనీష్ పాండే(94-2014లో పంజాబ్ కింగ్స్పై),క్రిస్ లిన్(93 నాటౌట్-2017లో గుజరాత్ లయన్స్పై), గౌతం గంభీర్(93- 2012లొ ఆర్సీబీపై)లు వరుసగా ఉన్నారు. మెకల్లమ్ సుడిగాలి ఇన్నింగ్స్ మెకల్లమ్(ఫైల్ఫోటో) కోల్కతా నైట్రైడర్స్-ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన మొదటి సీజన్(2008) తొలి మ్యాచ్లో ఒక జట్టు అంచనాలు మించి ఆడితే మరొక జట్టు పూర్తిగా తేలిపోయింది. ఇందులో అంచనాలు మించి ఆడిన జట్టు కేకేఆర్ కాగా, ఆర్సీబీ పూర్తిగా తేలిపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ.. ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో కేకేఆర్ ఇన్నింగ్స్ను ఆరంభించింది. కేకేఆర్ ఇన్నింగ్స్ను సౌరభ్ గంగూలీ, బ్రెండన్ మెకల్లమ్లు ధాటిగా ప్రారంభించారు. ప్రధానంగా మెకల్లమ్ విధ్వంసకర బ్యాటింగ్తో ఆర్సీబీ బౌలర్లకు ఆదిలోనే చుక్కలు కనబడ్డాయి. 5.2 ఓవర్లలో కేకేఆర్ 61 పరుగులు చేసిన తర్వాత గంగూలీ(10) తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. కానీ మెకల్లమ్ బ్యాటింగ్ మోత మాత్రం తగ్గలేదు. స్టేడియం నలువైపులా షాట్లు కొడుతూ ఐపీఎల్కు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చాడు. పొట్టి ఫార్మాట్ క్రికెట్లో పరుగుల రుచి ఎలా ఉంటుందో మెకల్లమ్ చూపించడాంటే అతిశయోక్తి కాదేమో. ఒకవైపు కేకేఆర్ స్టార్ ఆటగాళ్లు రికీ పాంటింగ్(20), డేవిడ్ హస్సీ(12)లు విఫలమైనా మెకల్లమ్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే భారీ సెంచరీ నమోదు చేశాడు. 73 బంతుల్లో 13 సిక్స్లు, 10 ఫోర్లతో అజేయంగా 158 పరుగులు చేసి కేకేఆర్ 222 భారీ పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇది ఐపీఎల్ తొలి మ్యాచ్లో సెంచరీ కావడమే కాకుండా ఈ రికార్డు ఐదేళ్లు పాటు పదిలంగా ఉండటం విశేషం. ఆటగాళ్ల అత్యధిక పరుగుల రికార్డులో మెకల్లమ్ నమోదు చేసిన 158 పరుగులు ఇప్పటికీ రెండో స్థానంలో ఉంది. చదవండి: హెలికాప్టర్ షాట్ ప్రాక్టీస్ చేస్తున్న ధోని.. వీడియో వైరల్ -
IPL Final CSK Vs KKR: అతనే బలం... ‘సూపర్’ దళం!
పాత చాంపియన్ల మధ్య కొత్త చాంపియన్షిప్ చివరి పోరుకు రంగం సిద్ధమైంది. ఏకంగా తొమ్మిదిసార్లు ఫైనల్ చేరి లీగ్కే వన్నె తెచి్చన ఫేవరెట్ చెన్నై సూపర్కింగ్స్ నాలుగో టైటిల్పై కన్నేయగా... రెండు సార్లు ఫైనల్ చేరితే ఆ రెండుసార్లూ విజేతగా నిలిచిన కోల్కతా నైట్రైడర్స్ ఈ ఆనవాయితీని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మూడో ఐపీఎల్ టైటిల్తో దుబాయ్ నుంచి దిగి్వజయంగా తిరిగి రావాలని ఆశిస్తోంది. దుబాయ్: అవాంతరాలతో ఆగి, భారత్నుంచి విదేశం తరలి వెళ్లి మళ్లీ మొదలైన 2021 ఐపీఎల్కు ఇంకొన్ని గంటల్లో దుబాయ్లో శుభం కార్డు పడనుంది. 14వ సీజన్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకునేందుకు మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ సై అంటే సై అంటున్నాయి. గత ఏడాది ప్లే ఆఫ్స్కే అర్హత సాధించని ఇరు జట్లను కెపె్టన్లు ధోని, మోర్గాన్ ఈ సీజన్లో సమర్థంగా నడిపించారు. ఇప్పుడు అసలు పోరులో వారి సారథ్యం, బ్యాటింగ్ సామర్థ్యం జట్టుకు గెలిపిస్తాయా అనేది ఆసక్తికరం. ధోని నాయకత్వంలోనే చెన్నై మూడు సార్లు చాంపియన్గా నిలవగా, ధోనిలాగే వరల్డ్ కప గెలిపించిన మోర్గాన్ సారథిగా తొలి ఐపీఎల్ టైటిల్పై కన్నేశాడు. అతనే బలం... ‘సూపర్’ దళం బ్యాటింగ్ మెరిసినా, మెరిపించకపోయినా ధోని ధోనినే! ఈ క్రికెట్ జ్ఞాని శిబిరంలో ఉంటే ఆ జట్టుకు వంద ఏనుగుల బలం. అందుకే భారత క్రికెట్ బోర్డు కూడా వచ్చే టి20 ప్రపంచకప్ వేటకు వెళ్లే కోహ్లి సేనకు ధోనిని మెంటార్గా నియమించింది. తొలి క్వాలిఫయర్లో ధోని మెరుపులు జట్టుని గెలుపుతీరానికి చేర్చాయి. ఈ ధనాధన్ టి20ల్లో అతని విశేషానుభవం, సారథ్య సామర్థ్యం జట్టుకు అదనపు బలం. అందుకే 12 సీజన్లు ఐపీఎల్ ఆడితే ఏకంగా 9 సార్లు ఫైనల్కు చేర్చిన ఘనత ధోనిదే! ఓపెనింగ్ రుతురాజ్ గైక్వాడ్ భీకర ఫామ్లో ఉన్నాడు. దీనికి డుప్లెసిస్ ధాటి కూడా తోడైతే సూపర్ కింగ్స్ భారీస్కోరు చేయడం ఖాయమవుతుంది. టాపార్డర్ నుంచి దీపక్ చహర్ దాకా పది మందికి పరుగులు చేసే సత్తా ఉండటం కూడా చెన్నైలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతోంది. దీంతోపాటు ఈ సీజన్లో అక్కడా... ఇక్కడా... రెండు సార్లు కోల్కతాపై గెలిచిన సానుకాలంశం చెన్నైని మురిపిస్తోంది. ముంబై, అబుదాబీలో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్లలో సూపర్కింగ్స్ జట్టే గెలిచింది. టాపార్డర్ కీలకం... మరోవైపు కోల్కతా నైట్రైడర్స్ సీజన్ క్లైమాక్స్ దశలో రెచి్చపోతోంది. అయితే భారీ స్కోర్లతో, మెరిపించే బ్యాట్స్మెన్తో కాదు... తిప్పేసే స్పిన్ ద్వయంతో పాయింట్ల పట్టికలో తనకన్నా మెరుగైన బెంగళూరు, ఢిల్లీ జట్లను కంగుతినిపించింది. ఇప్పుడు ఫైనల్ మజిలీకొచి్చంది. ఇక్కడి దాకా వస్తే టైటిల్తోనే వెళ్లిన రికార్డూ ఊరిస్తోంది. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలు తమ స్పిన్ మాయాజాలంతో సూపర్కింగ్స్ను కట్టిపడేస్తే... లీగ్లో ఎదురైన పరాజయాలకు బదులు తీర్చుకోవచ్చు. అయితే గత రెండు మ్యాచ్లు షార్జా పిచ్పై జరిగాయి. కానీ ఇది దుబాయ్ వికెట్. యూఏఈ అంచెలో మెరుగైన స్కోర్లు నమోదైన వేదిక కూడా ఇదే! టాపార్డర్ బ్యాట్స్మెన్ శుబ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠిలతో పాటు అనుభవజు్ఞలైన కెపె్టన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్లు పరుగుల బాధ్యతను పంచుకోవాలి. చక్కని బ్యాటింగ్కు జతగా స్పిన్ మ్యాజిక్ పనిచేస్తే కోల్కతాకు ఫైనల్లో తిరుగుండదు. దుబాయ్లో మూడో స్పిన్నర్ అవసరం పెద్దగా ఉండకపోవడంతో పాటు రసెల్ ఫిట్గా ఉంటే షకీబ్ స్థానంలో అతనికి చోటు దక్కవచ్చు. తుది జట్లు (అంచనా) చెన్నై సూపర్కింగ్స్: ధోని (కెపె్టన్), రుతురాజ్, డుప్లెసిస్, మొయిన్ అలీ, ఉతప్ప, రాయుడు, జడేజా, బ్రావో, శార్దుల్, దీపక్ చహర్, హాజల్వుడ్. కోల్కతా నైట్రైడర్స్: మోర్గాన్ (కెపె్టన్), గిల్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, షకీబ్ / రసెల్, నరైన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, ఫెర్గూసన్. -
అందరూ ధోనిలు కాలేరు.. పంత్కు కాస్త సమయం ఇవ్వండి
Everyone Cant Be MS Dhoni, Give Rishabh Pant Some Time Says Ashish Nehra : ఐపీఎల్-2021 సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి తన జట్టును ఫైనల్కు చేర్చేందుకు విఫలయత్నం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ సారధి రిషబ్ పంత్కు టీమిండియా మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా మద్దతు పలికాడు. సారధిగా బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్లోనే పంత్ తనను తాను నిరూపించుకున్నాడని, 2007 టీ20 ప్రపంచకప్లో ధోని టీమిండియాను విజేతగా నిలిపినట్లుగా పంత్ కూడా తన జట్టును ఛాంపియన్గా నిలపాలని ఆశించడం అత్యాశే అవుతుందని తెలిపాడు. శ్రేయస్ అయ్యర్ తర్వాత ఈ ఏడాది ఢిల్లీ సారధ్య బాధ్యతలను భుజానికెత్తుకున్న పంత్.. సీనియర్లు, జూనియర్లతో సమతూకం కలిగిన జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడని, అతనికి నిలదొక్కుకునేందుకు మరికాస్త సమయమిచ్చి, వచ్చే సీజన్లో కూడా కెప్టెన్గా కొనసాగించాలని సూచించాడు. కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు మినహా పంత్ సారధ్య బాధ్యతలకు వంద శాతం న్యాయం చేశాడని, అతన్ని కెప్టెన్గా కొనసాగించాలా వద్దా అన్నది అనవసరమైన రాద్దాంతమని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్గా పంత్కు వీలైనన్ని అవకాశాలు కల్పించాలని, అది వ్యక్తిగతంగా అతనికి, జట్టుకు ఉపయోగకరమని ఈ ఢిల్లీ ఆటగాడు పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుత ఐపీఎల్లో లీగ్ దశ వరకు టేబుల్ టాపర్గా నిలిచిన డీసీ జట్టు క్వాలిఫైయర్స్లో చెన్నై, కేకేఆర్ జట్ల చేతిలో వరుస ఓటములతో ఫైనల్ చేరకుండానే ఇంటి దారి పట్టింది. చదవండి: సీనియర్లకు రెస్ట్.. టీమిండియాలోకి ఐపీఎల్ హీరోస్..! -
టీ20 క్రికెట్కు అశ్విన్ అనర్హుడు.. నేనైతే అతన్ని జట్టులోకి తీసుకోను
Ashwin Is Not A Wicket Taker In T20 Format Says Sanjay Manjrekar : టీమిండియా టీ20 ప్రపంచకప్ జట్టు సభ్యుడు, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్పై వివాదాస్పద వ్యాఖ్యాత, టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్ టీ20 క్రికెట్కు అనర్హుడని, ఈ ఫార్మాట్లో అతనికి వికెట్లు తీసే సామర్ధ్యమే లేదని పేర్కొన్నాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో అశ్విన్ను ఎందుకు ఆడిస్తున్నారో అర్ధం కావడం లేదని, నేనైతే అశ్విన్ను అసలు జట్టులోకే తీసుకోనని వ్యాఖ్యానించాడు. అశ్విన్ గురించి మాట్లాడుతూ ఇప్పటికే చాలా సమయాన్ని వృధా చేశామని, టీ20 బౌలర్గా అతను ఏ జట్టుకు కూడా ఉపయోగపడింది లేదని అభిప్రాయపడ్డాడు. పొట్టి ఫార్మాట్లో అశ్విన్ బౌలింగ్ శైలి మారాలనుకుంటే అది జరిగేది కాదని, గత ఐదారేళ్లుగా అతను ప్రాతినిధ్యం వహించిన ప్రతి జట్టుకు భారంగానే ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టర్నింగ్ వికెట్లపై తాను వికెట్ టేకింగ్ బౌలర్లవైపే మొగ్గుచూపుతానని.. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, చహల్ లాంటి వారు తన బెస్ట్ ఛాయిస్ బౌలర్లని వెల్లడించాడు. సాంప్రదాయ టెస్ట్ ఫార్మాట్లో అశ్విన్ అద్భుతమైన బౌలరే అయినప్పటికీ.. పొట్టి ఫార్మాట్కు మాత్రం అస్సలు పనికిరాడని తెలిపాడు. ఓ ప్రముఖ క్రీడా ఛానల్ లైవ్ షోలో మాట్లాడుతూ.. మంజ్రేకర్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, ఐపీఎల్-2021లో భాగంగా బుధవారం జరిగిన క్వాలిఫయర్-2 పోటీలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు నువ్వా నేనా అన్న రీతిలో తలపడిన సంగతి తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో చివరి ఓవర్ వేసిన అశ్విన్ తొలుత వరుస బంతుల్లో వికెట్లు తీసి ఢిల్లీ శిబిరంలో ఆశలు రేకెత్తించినప్పటికీ.. ఐదో బంతికి కేకేఆర్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి సిక్సర్ బాది తన జట్టును ఫైనల్కు చేర్చాడు. చదవండి: ప్రపంచ ప్రఖ్యాత కట్టడంపై టీమిండియా జెర్సీ.. చరిత్రలో తొలిసారి -
IPL 2021: ఫైనల్కు ముందు కేకేఆర్కు బిగ్ షాక్!
DInesh Karthik Breach IPL Code Of Conduct.. ఐపీఎల్ 2021లో భాగంగా బుధవారం జరిగిన క్వాలిఫయర్–2 మ్యాచ్లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. అయితే ఫైనల్లో అడుగుపెట్టిన కోల్కతాకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కేకేఆర్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ దినేష్ కార్తీక్కు ఐపీఎల్ యాజమాన్యం జరిమానా విధించింది.ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 18 ఓవర్ వేసిన రబడా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిన కార్తీక్.. అసహనానికి లోనై స్టంప్స్ను కొట్టి పెవిలియన్కు వెళ్లాడు. ‘ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 అఫెన్స్ 2.2 రూల్ ప్రకారం కార్తీక్ చేసిన పని క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. అతడు నేరాన్ని అంగీకరించాడు. తుది నిర్ణయం మ్యాచ్ రిఫరీపై ఆదారపడి ఉందని' ఐపీఎల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే మ్యాచ్ రిఫరీ విధించే శిక్షకు కార్తీక్ కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఆటగాళ్లకు మ్యాచ్ రిఫరీ ఒక్క మ్యాచ్ నిషేదం కూడా విధించిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో కార్తీక్ తప్పును రిఫరీ సీరియస్గా తీసుకుంటే, ఫైనల్ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించే అవకాశం కూడా ఉంది. చదవండి: Rahul Tripathi: ' సిక్స్ కొడతానని ఊహించలేదు' -
అంపైర్ను ఫ్రాంక్ చేసిన రిషబ్ పంత్.. వీడియో వైరల్
Rishab Pant Prank On Umpire Anil Chaudary.. ఐపీఎల్ 2021లో కేకేఆర్తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అంపైర్ అనిల్ చౌదరీని ఫ్రాంక్ చేయడం వైరల్గా మారింది. కేకేఆర్ బ్యాటింగ్ సమయంలో అశ్విన్ బంతిని పరిశీలిస్తుండగా.. అనిల్ చౌదరీ బాల్ బాక్స్ను పట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన పంత్ అనిల్ చౌదరీ వెనక్కి వెళ్లి.. అతనికి తెలియకుండా కుడి మోచేతిని టికిల్ చేశాడు. వెంటనే అనిల్ తిరిగి చూడగా అక్కడ ఎవరు కనిపించలేదు. దీంతో పంత్ నేనే అంటూ అంపైర్కు చెప్పడంతో మైదానంలో నవ్వులు విరపూశాయి. ఈ వీడియోపై అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. చదవండి: Rahul Tripathi: ' సిక్స్ కొడతానని ఊహించలేదు' ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్లో మూడోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన క్వాలిఫయర్–2 మ్యాచ్లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (39 బంతుల్లో 36; 1 ఫోర్, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (27 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. అనంతరం కోల్కతా 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వెంకటేశ్ అయ్యర్ (41 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శుబ్మన్ గిల్ (46 బంతుల్లో 46; 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరు తొలి వికెట్కు 74 బంతుల్లో 96 పరుగులు జోడించారు. చదవండి: Rishab Pant Emotioanl: ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా.. పంత్ భావోద్వేగం 24 year old kiddopic.twitter.com/LFvvWBx3UA — Ryan (@RyanIke4) October 13, 2021 -
'సిక్స్ కొడతానని ఊహించలేదు'
Rahul Tripathi after the match-winning six: ఐపీఎల్ 2021లో భాగంగా బుధవారం జరిగిన క్వాలిఫయర్–2 మ్యాచ్లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. అయితే చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరగిన ఈ మ్యాచ్లో అఖరి 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సిన నేపథ్యంలో సిక్స్ కొట్టి రాహుల్ త్రిపాఠి కోల్కతాను విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన త్రిపాఠి.. ఆ సమయంలో తనపై తనకు జట్టును గెలిపించగలనన్న నమ్మకం ఉందని తెలిపాడు. "జట్టు విజయం చాలా ముఖ్యం. ఒకటి లేదా రెండు కఠినమైన ఓవర్లు మా ఇన్నింగ్స్లో ఉన్నాయి. కానీ చివరికి టార్గెట్ అంత కష్టంగా మారుతుందని నేను అనుకోలేదు. అఖరికి మేము మ్యాచ్ గెలిచినందుకు సంతోషంగా ఉంది. 18 వ ఓవర్ రబాడా చాలా కఠినంగా బౌలింగ్ చేశాడు. స్పిన్నర్లో ఒకరని టార్గెట్ చేయాలని అనుకున్నాను. అదే పని నేను చేశాను. మేము ప్లాన్ చేసుకున్నాము. చివరి రెండు బంతులల్లో సాధ్యమైనంత వరకు పరగులు చేయాలని నిర్ణయించుకున్నాము. కానీ రెండు బంతులే మిగిలి ఉండడంతో గెలుపు సాధ్యం కాదని అనుకున్నా.. ఆ సమయంలో ఒక పెద్ద హిట్ కావాలని భావించా.. అయితే సిక్స్తో ముగిస్తానని మాత్రం ఊహించలేదు' అని త్రిపాఠి పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ ముందు ఉంచింది. అయితే 136 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతాకు ఓపెనర్లు శుభమన్ గిల్, వెంకటేష్ అయ్యర్ 96 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తరువాత కేవలం 7పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కేకేఆర్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అఖరి ఓవర్లో 7 పరుగుల కాల్సిన నేపథ్యంలో మెదటి 4 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు ఆశ్విన్ పడగొట్టాడు. ఇక ఢిల్లీ విజయం లాంఛనమే అనుకున్న సమయంలో.. క్రీజులో ఉన్న రాహుల్ త్రిపాఠి ఐదో బంతికి సిక్స్ కొట్టి కేకేఆర్ను ఫైనల్కు చేర్చాడు. చదవండి: Rishab Pant Emotioanl: ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా.. పంత్ భావోద్వేగం -
ఫైనల్ చేరడం సంతోషం.. కప్ కొట్టడమే మిగిలింది
Venkatesh Iyer Reaction After Winning Match Vs Delhi Capitals.. ఐపీఎల్ 2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫయర్ 2లో కేకేఆర్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ మరోసారి మెరిశాడు. అర్థ శతకంతో రాణించిన వెంకటేశ్ అయ్యర్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్ శుబ్మన్ గిల్తో కలిసి తొలి వికెట్కు 96 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయకుంటే పరిస్థితి మరోలా ఉండేది. ఓపెనర్లిద్దరు ఔటైన తర్వాత కేకేఆర్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అశ్విన్ వేసిన ఆఖరి ఓవర్లో కేకేఆర్ రెండు వికెట్లు పోగొట్టుకోవడంతో పాటు మ్యాచ్పై ఉత్కంఠ నెలకొంది. అయితే ఓవర్ ఐదో బంతిని త్రిపాఠి స్టన్నింగ్ సిక్స్ కొట్టి జట్టను ఫైనల్ చేర్చాడు. ఇక రేపు (అక్టోబర్ 15న) సీఎస్కేతో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. చదవండి: KKR vs DC, IPL 2021: కోల్కతా ‘సిక్సర్’తో... PC: IPL Twitter ఈ నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన వెంకటేశ్ అయ్యర్ స్పందించాడు. ''ఈరోజు మ్యాచ్లో నా ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నా. డొమొస్టిక్ క్రికెట్.. ఐపీఎల్ ఇలా ఏదైనా నాకు పెద్ద తేడా ఏం ఉండదు.. నా ఆటతీరు ఇలాగే ఉంటుంది. నేను ఐపీఎల్లో ఎలాగైతే ఆడాలనుకున్నానో అదే విధంగా ఆడుతున్నా. ఫైనల్ చేరడంతో సంతోషంగా ఉంది.. ఇక కప్ కొట్టడమే ఒక్కటే బాకీ ఉంది. ఆ విషయంలో మాత్రం కేకేఆర్ మేనేజ్మెంట్తో పాటు కెప్టెన్ మోర్గాన్ నాకు పూర్తి స్వేచ్చనిచ్చారు.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మధ్యప్రదేశ్కు చెందిన వెంకటేశ్ అయ్యర్కు ఐపీఎల్లో ఇది మూడో అర్థసెంచరీ. ఐపీఎల్ 2021 తొలి ఫేజ్లో కేకేఆర్ ఆటతీరు అగమ్యగోచరంగా ఉంది. వరుస పరాజయాలతో ఉక్కరిబిక్కిరైన కేకేఆర్ మలిదశలో మాత్రం అదరగొట్టింది. ముఖ్యంగా వెంకటేశ్ అయ్యర్ ఓపెనర్గా ప్రమోట్ అద్బుత ఆటతీరుతో ఆకట్టుకుంటూ కేకేఆర్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. Venkatesh Iyer: అయ్యారే అయ్యర్.. కేకేఆర్ తరపున రెండో బ్యాటర్గా -
KKR vs DC, IPL 2021: కోల్కతా ‘సిక్సర్’తో...
136 పరుగుల స్వల్ప లక్ష్యం...ఓపెనర్లే 96 పరుగులు జోడించి గెలుపు దిశగా నడిపించారు... ఒకదశలో చేతిలో 9 వికెట్లు ఉండగా 25 బంతుల్లో 13 పరుగులు చేస్తే చాలు... కానీ కోల్కతా ఒక్కసారిగా తడబడింది. 7 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు పడగా, 23 బంతుల్లో 7 పరుగులే వచ్చాయి. నలుగురు డకౌట్! ఢిల్లీ క్యాపిటల్స్లో విజయంపై ఆశలు... చివరి 2 బంతుల్లో 6 పరుగులు కావాలి. అయితే త్రిపాఠి నైట్రైడర్స్ను గట్టెక్కించాడు. అశ్విన్ వేసిన ‘రసగుల్లా’లాంటి ఐదో బంతిని సిక్సర్గా మలచి ఏడేళ్ల విరామం తర్వాత మాజీ చాంపియన్ను మూడోసారి ఫైనల్కు చేర్చాడు. గత ఏడాది ఫైనల్లో ఓడిన ఢిల్లీ ఇప్పుడు నిరాశగా మూడో స్థానంతో ముగించింది. మూడుసార్లు చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్, గతంలో ఫైనల్ చేరిన రెండుసార్లూ (2012, 2014) విజేతగా నిలిచిన కోల్కతా మధ్య శుక్రవారం ఫైనల్ జరగనుండటంతో ఈ ఏడాదీ ఐపీఎల్లో కొత్త చాంపియన్ లేకపోవడం ఖాయమైంది. షార్జా: మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్లో మూడోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన క్వాలిఫయర్–2 మ్యాచ్లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (39 బంతుల్లో 36; 1 ఫోర్, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (27 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. అనంతరం కోల్కతా 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వెంకటేశ్ అయ్యర్ (41 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శుబ్మన్ గిల్ (46 బంతుల్లో 46; 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరు తొలి వికెట్కు 74 బంతుల్లో 96 పరుగులు జోడించారు. సమష్టి వైఫల్యం... ఢిల్లీ ఇన్నింగ్స్లో 12 ఓవర్లలో 6 లేదా అంతకంటే తక్కువ పరుగులు చేసిన సందర్భాలున్నాయి. టి20 మ్యాచ్లో ఒక జట్టు ఓడిపోవడానికి ఇలాంటి పేలవ ప్రదర్శన చాలు! మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఇలాంటి ఆటతోనే ఓటమిని ఆహా్వనించింది. పిచ్ ఎంత నెమ్మదిగా ఉన్నా, స్పిన్కు కాస్త అనుకూలంగా కనిపిస్తున్నా కూడా ఒక్క బ్యాటర్ కూడా ఎదురుదాడికి దిగి ధాటిగా ఆడే ప్రయత్నం చేయకపోవడంతో ఇన్నింగ్స్లో 6 ఫోర్లు మాత్రమే నమోదయ్యాయి. తొలి 4 ఓవర్ల వరకు క్యాపిటల్స్ ప్రదర్శన మెరుగ్గా సాగింది. షకీబ్ ఓవర్లో పృథ్వీ వరుసగా 6, 4 కొట్టగా... నరైన్ వేసిన వరుస బంతుల్లో ధావన్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఇది చూస్తే ఒక హోరాహోరీ పోరుకు తెర లేచినట్లు కనిపించింది. కానీ ఆ తర్వాతే కేకేఆర్ బౌలర్ల ఆధిపత్యం ముందు ఢిల్లీ తేలిపోయింది. వరుణ్ తన తొలి బంతికే పృథ్వీ షాను అవుట్ చేసి పతనానికి శ్రీకారం చుట్టాడు. ఓపెనర్ల జోరు... ఢిల్లీ చేసిన తప్పును కోల్కతా చేయలేదు. పిచ్ స్వభావంపై దృష్టి పెట్టకుండా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మొదటి నుంచి దూకుడు కనబర్చింది. ముఖ్యంగా వెంకటేశ్ తన అద్భుత ఫామ్ను కొనసాగించాడు. అశ్విన్ ఓవర్లో ఫోర్తో జోరు ప్రారంభించిన అతను అక్షర్ బౌలింగ్లో రెండు, రబడ ఓవర్లో ఒక సిక్సర్ బాదాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 51 పరుగులకు చేరింది. మరో ఎండ్లో గిల్ ప్రశాంతంగా ఆడగా... 38 బంతుల్లోనే వెంకటేశ్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు వెంకటేశ్ను రబడ అవుట్ చేసి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీసినా కోల్కతా విజయం అప్పటికే దాదాపుగా ఖాయమైనట్లు అనిపించింది. అయితే అనూహ్య మలుపులతో డ్రామా సాగి చివరకు మరో బంతి మిగిలి ఉండగా నైట్రైడర్స్ గెలుపు తీరం చేరింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (ఎల్బీ) (బి) వరుణ్ 18; ధావన్ (సి) షకీబ్ (బి) వరుణ్ 36; స్టొయినిస్ (బి) మావి 18; శ్రేయస్ (నాటౌట్) 30; పంత్ (సి) త్రిపాఠి (బి) ఫెర్గూసన్ 6; హెట్మైర్ (రనౌట్) 17; అక్షర్ పటేల్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–32, 2–71, 3–83, 4–90, 5–117. బౌలింగ్: షకీబ్ 4–0–28–0, ఫెర్గూసన్ 4–0–26–1, నరైన్ 4–0–27–0, వరుణ్ 4–0–26–2, మావి 4–0–27–1. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) పంత్ (బి) అవేశ్ 46; వెంకటేశ్ (సి) (సబ్) స్మిత్ (బి) రబడ 55; రాణా (సి) హెట్మైర్ (బి) నోర్జే 13; రాహుల్ త్రిపాఠి (నాటౌట్) 12; కార్తీక్ (బి) రబడ 0; మోర్గాన్ (బి) నోర్జే 0; షకీబ్ (ఎల్బీ) (బి) అశి్వన్ 0; నరైన్ (సి) అక్షర్ (బి) అశి్వన్ 0; ఫెర్గూసన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 10, మొత్తం (19.5 ఓవర్లలో 7 వికెట్లకు) 136. వికెట్ల పతనం: 1–96, 2–123, 3–125, 4–126, 5–129, 6–130, 7–130. బౌలింగ్: నోర్జే 4–0–31–2, అశి్వన్ 3.5–0–27–2, అవేశ్ ఖాన్ 4–0–22–1, అక్షర్ పటేల్ 4–0–32–0, రబడ 4–0–23–2. -
సూపర్ క్యాచ్ పట్టాడు.. కానీ నోబాల్ అయిపోయింది
Shubman Gill Stunning Catch But Umpire Gives No Ball.. ఐపీఎల్ 2021లో కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో శుబ్మన్ గిల్ సూపర్ క్యాచ్తో మెరిశాడు. అయితే అది నో బాల్ కావడంతో ప్రత్యర్థి బ్యాటర్ బతికిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ 17వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఆ ఓవర్ వరుణ్ చక్రవర్తి వేయగా.. ఓవర్ 4వ బంతిని హెట్మైర్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న గిల్ ముందుకు పరిగెత్తి డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో హెట్మైర్ పెవిలియన్ చేరాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. గిల్ క్యాచ్ పట్టినప్పటికీ అంపైర్కు నోబాల్ అనే అనుమానం వచ్చింది. వెంటనే రిప్లై చూడగా.. అందులో వరుణ్ చక్రవర్తి ఫ్రంట్ ఫుట్ క్రీజు దాటి ముందుకు వచ్చినట్లు కనిపించింది. అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అంపైర్ నోబాల్ ఇవ్వడంతో కేకేఆర్కు నిరాశ మిగిలింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ 36 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. శ్రేయాస్ అయ్యర్ 30 పరుగులు చేశాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, ఫెర్గూసన్, శివమ్ మావి చెరో వికెట్ తీశారు. చదవండి: T20 World Cup 2021: మెంటార్గా ధోని పని ప్రారంభించాడు.. అందుకే శార్దూల్ -
మెంటార్గా ధోని పని ప్రారంభించాడు.. అందుకే శార్దూల్
Shardul Thakur T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్ 2021కు సంబంధించి టీమిండియా మెంటార్గా ఎంఎస్ ధోని ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెంటార్గా ధోని తన పనిని ప్రారంభించాడంటూ ఫ్యాన్స్ మీమ్స్, ట్రోల్ చేస్తున్నారు. అదేంటి.. ఇంకా టి20 ప్రపంచకప్ ఆరంభం కాకముందే ధోని ఎలా ప్రారంభించాడని సందేహ పడకండి. తాజాగా శార్దూల్ ఠాకూర్ .. అక్షర్ పటేల్ స్థానంలో టి20 ప్రపంచకప్ టీమిండియా జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. చదవండి: T20 World Cup 2021: హార్దిక్ అన్ఫిట్.. జట్టులోకి మరో ఆల్రౌండర్! దీనివెనుక ధోనినే పరోక్షంగా కారణమంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్లో శార్దూల్ ఠాకూర్ సీఎస్కేకు ఆడుతున్న సంగతి తెలిసిందే. ధోని నాయకత్వంలోని సీఎస్కే ఈ సీజన్లో ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. సీఎస్కే ఆడిన 15 మ్యాచ్ల్లో శార్దూల్ 18 వికెట్లు తీసి కీలకపాత్ర పోషించాడు. అంతేగాక లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్లోనూ సత్తా చాటుతున్నాడు. ఈ రెండు అంశాలు శార్దూల్కు ప్లస్గా మారాయని.. ధోని దగ్గరుండి అతనికి విలువైన సూచనలు, సలహాలు ఇచ్చాడని సీఎస్కే ఫ్యాన్స్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే శార్దూల్పై ఫ్యాన్స్ ఫన్నీ మీమ్స్తో విరుచుకుపడ్డారు. లార్డ్ శార్దూల్ ఈజ్ బ్యాక్.. బీసీసీఐ అతన్ని సెలెక్ట్ చేయలేదు.. అతని టాలెంట్తో ఎంపికయ్యాడు.. ధోని మెంటార్గా వచ్చాడు.. పని మొదలుపెట్టాడు.. అంటూ మీమ్స్తో రెచ్చిపోయారు. చదవండి: T20 World Cup 2021: టీమిండియాలో అనూహ్య మార్పు.. 🇮🇳 #T20WorldCup Call up 💥#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/sf6d9JmS4C — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 13, 2021 Lord Is Here #WorldCup pic.twitter.com/AUHlGEI2OU — Aakash Chopra (@cricketaakash) October 13, 2021 Lord Shardul Thakur replacing Axar Patel in #TeamIndia be like 🙈 pic.twitter.com/I5RSZilRhr — Paapsee Tannu ( Tax chor ) 2.0 🐦 (@tiranga__1) October 13, 2021 -
DC Vs KKR: ఉత్కంఠ పోరులో కేకేఆర్ సూపర్ విక్టరీ.. ఢిల్లీ ఔట్
ఉత్కంఠ పోరులో కేకేఆర్ సూపర్ విక్టరీ.. ఢిల్లీ ఔట్ 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్(41 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్మన్ గిల్(46 బంతుల్లో 46; ఫోర్, సిక్స్) శుభారంభాన్ని అందించినప్పటికీ కేకేఆర్ మిడిలార్డర్ దారుణంగా విఫలం కావడంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయి ఆఖరి ఓవర్లో ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాట ఆడింది. అయితే మరో బంతి మిగిలుండగా రాహుల్ త్రిపాఠి అద్భుతమైన సిక్సర్ బాది కేకేఆర్ను ఫైనల్కు చేర్చాడు. దీంతో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించి సగర్వంగా ఫైనల్కు చేరింది. కేకేఆర్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్లో చెన్నైతో పోరుకు అర్హత సాధించింది. రసవత్తరంగా మారిన మ్యాచ్.. కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్ కేకేఆర్ బౌలర్ రబాడ 18వ ఓవర్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి దినేశ్ కార్తీక్(0) వికెట్ను పడగొట్టడంతో మ్యాచ్ ఒక్కసారిగా రసవత్తరంగా మారింది. 18 ఓవర్ల తర్వత కేకేఆర్ స్కోర్ 126/4. క్రీజ్లో రాహుల్ త్రిపాఠి(2), మోర్గాన్ ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. శుభ్మన్ గిల్(46) ఔట్ ఆవేశ్ ఖాన్ వేసిన 16.4 ఓవర్లో వికెట్ కీపర్ పంత్కు సింపుల్ క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్(46 బంతుల్లో 46; ఫోర్, సిక్స్) ఔటయ్యాడు. 17 ఓవర్ల తర్వత కేకేఆర్ స్కోర్ 125/3. క్రీజ్లో రాహుల్ త్రిపాఠి(1), దినేశ్ కార్తీక్ ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. నితీశ్ రాణా(13) ఔట్ కేకేఆర్ విజయానికి 25 బంతుల్లో 13 పరుగులు కావాల్సిన తరుణంలో నితీశ్ రాణా(12 బంతుల్లో 13; సిక్స్) రెండో వికెట్గా వెనుదిరిగాడు. నోర్జే బౌలింగ్లో హెట్మైర్కు క్యాచ్ ఇచ్చి రాణా ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వత కేకేఆర్ స్కోర్ 123/2. క్రీజ్లో గిల్(45), రాహుల్ త్రిపాఠి ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్(55) ఔట్ స్వల్ప లక్ష్య ఛేదనలో కేకేఆర్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(41 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన అర్ధ శతకంతో రాణించి విజయం ముంగిట రబాడ బౌలింగ్లో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ స్కోర్ 98/1. క్రీజ్లో గిల్(32), నితీశ్ రాణా(1) ఉన్నారు. ఆడుతూ పాడుతూ లక్ష్యం దిశగా సాగుతున్న కేకేఆర్ పిచ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ కేకేఆర్ ఓపెనర్లు ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నారు. శుభ్మన్ గిల్(33 బంతుల్లో 31; ఫోర్), వెంకటేశ్ అయ్యర్(39 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒత్తిడికి లోను కాకుండా సింగల్స్ తీస్తూ స్కోర్ బోర్డును నెమ్మదిగా నడిపిస్తున్నారు. 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ స్కోర్ 92/0. ధాటిగా ఆడుతున్న కేకేఆర్ ఓపెనర్లు.. 6 ఓవర్ల తర్వాత 51/0 136 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో కేకేఆర్ ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. శుభ్మన్ గిల్(16 బంతుల్లో 17; ఫోర్), వెంకటేశ్ అయ్యర్(20 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ.. కేకేఆర్ను లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నారు. 6 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 51/0. Photo Courtesy: IPL ఢిల్లీ నామమాత్రపు స్కోర్.. కేకేఆర్ టార్గెట్ 136 కేకేఆర్ బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ జట్టు 5 వికెట్ల నష్టానికి 135 పరుగుల నామమాత్రపు స్కోర్ మాత్రమే చేయగలిగింది. ధవన్(36), శ్రేయస్ అయ్యర్ (27 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్) ఓ మోస్తారుగా రాణించడంతో ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కేకేఆర్ బౌలర్లు వరుణ్ చక్రవర్తి(2/26), ఫెర్గూసన్(1/26), శివమ్ మావి(1/27), షకీబ్(0/28), సునీల్ నరైన్(0/27) తమ కోటా ఓవర్లు ముగించి ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేశారు. Photo Courtesy: IPL హెట్మైర్ రనౌట్.. ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ ఒకసారి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న హెట్మైర్ 17 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. నరైన్ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. సింగిల్ రిస్క్ అని తెలిసినప్పటికి నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న హెట్మైర్ సగం పిచ్ దాటేశాడు . అయితే అక్కడే ఉన్న వెంకటేశ్ అయ్యర్ త్రో వేయగా.. కార్తీక్ బంతిని అందుకొని వికెట్లను గిరాటేశాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది ఢిల్లీకి బిగ్ షాక్.. పంత్(6) ఔట్ 15.2 ఓవర్లో ఢిల్లీ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్(6 బంతుల్లో 6; ఫోర్) ఫెర్గూసన్ బౌలింగ్లో రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఢిల్లీ 90 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజ్లో శ్రేయస్ అయ్యర్(9), హెట్మైర్ ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. ధవన్(36) ఔట్ కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఢిల్లీ జట్టును మరో దెబ్బ కొట్టాడు. తొలుత ఓపెనర్ పృథ్వీ షాను ఔట్ చేసిన అతను..15వ ఓవర్ తొలి బంతికి ధవన్(39 బంతుల్లో 36; ఫోర్, 2 సిక్సర్లు)ను కూడా బోల్తా కొట్టించాడు. భారీ షాట్ ఆడే క్రమంలో షకీబ్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో ధవన్ వెనుదిరిగాడు. 14.1 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 83/3. క్రీజ్లో శ్రేయస్ అయ్యర్(8), రిషబ్ పంత్ ఉన్నారు. స్టోయినిస్(18) క్లీన్ బౌల్డ్.. ఢిల్లీ 71/2 ఇన్నింగ్స్ 12వ ఓవర్లో శివమ్ మావి బౌలింగ్లో స్టోయినిస్(23 బంతుల్లో 18; ఫోర్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 11.3 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 71/2. క్రీజ్లో ధవన్(32), శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. ఆచితూచి ఆడుతున్న ఢిల్లీ.. 11 ఓవర్ల తర్వాత 70/1 5వ ఓవర్లోనే ఓపెనర్ పృథ్వీ షా(18) వికెట్ కోల్పోయాక ఢిల్లీ జట్టు ఆచితూచి ఆడుతుంది. ధవన్(32 బంతుల్లో 31; ఫోర్, 2 సిక్సర్లు), స్టోయినిస్(22 బంతుల్లో 18; ఫోర్) చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోర్ బోర్డును నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తున్నారు. 11 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 70/1. Photo Courtesy: IPL తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీ షా(18) ఔట్ టాస్ ఓడి ప్రత్యర్థి ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ధాటిగా ఆడుతున్న పృథ్వీ షా(12 బంతుల్లో 18; 2 ఫోర్లు, సిక్స్) వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 4.1 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 32/1. క్రీజ్లో ధవన్(14), స్టోయినిస్ ఉన్నారు. Photo Courtesy: IPL షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 చివరి అంకానికి చేరుకుంది. క్వాలిఫయర్ 2లో భాగంగా నేడు జరగనున్న డూ ఆర్ డై మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. నేటి మ్యాచ్ విజేత అక్టోబర్ 15న జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుండగా, ఓడిన జట్టు లీగ్ నుంచి నిష్క్రమించనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు నేటి మ్యాచ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ఇక ముఖాముఖి పోరు విషయానికొస్తే.. ఇరు జట్లు 28 సార్లు హెడ్ టూ హెడ్ తలపడగా.. కేకేఆర్ 15 మ్యాచ్ల్లో, ఢిల్లీ 12 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. ప్రస్తుత సీజన్ లీగ్ దశలో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా.. చెరో మ్యాచ్లో గెలుపొందాయి. తుది జట్లు: ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధవన్, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్), హెట్మైర్, స్టోయినిస్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, అన్రిచ్ నోర్జే, కాగిసో రబాడ, అవేష్ ఖాన్. కోల్కతా నైట్రైడర్స్: శుభ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణా, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), షకిబ్ ఉల్ హాసన్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, లుకీ ఫెర్గూసన్, శివమ్ మావి. -
T20 WC 2021: బాగా రాణిస్తున్నాడు.. జట్టులో చోటు మాత్రం కష్టమే
Sunil Narine Wont Include In West Indies T20 Sqaud.. అక్టోబర్ 17 నుంచి టి20 ప్రపంచకప్ 2021 ప్రారంభం కానున్న సందర్భంగా అన్ని జట్లు తమ సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఆయా దేశాలు తమ జట్లలో ఏమైనా మార్పులు ఉంటే చేసుకోవచ్చవని.. అక్టోబర్ 15వ తేదీ వరకు చివరి అవకాశం ఉందని ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది. కాగా టి20 ప్రపంచకప్కు సంబంధించి విండీస్ జట్టుకు సునీల్ నరైన్ ఎంపిక కాలేదు. అయితే ఐపీఎల్ 2021 సీజన్లో కేకేఆర్ తరపున ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నాడు. ముఖ్యంగా ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన నరైన్ బౌలింగ్లో 4 వికెట్లు.. ఆ తర్వాత బ్యాటింగ్లో 26 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్గా కేకేఆర్ తరపున 8 మ్యాచ్లాడి 6.12 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. దీంతో నరైన్ ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న కరీబియన్ ఫ్యాన్స్ విండీస్ టి20 ప్రపంచకప్ జట్టులో చోటు కల్పించాలని పెద్ద ఎత్తున కోరారు. చదవండి: T20 World Cup 2021: టీమిండియాలో అనూహ్య మార్పు.. అయితే వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ నరైన్ బాగా రాణిస్తున్నప్పటికీ విండీస్ జట్టులో చోటు దక్కడం కష్టమే అని తెలిపాడు. ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో పొలార్డ్ మాట్లాడాడు. '' ఐపీఎల్ 2021 జరుగుతున్న యూఏఈ గడ్డపై నరైన్ బాగా రాణిస్తున్నాడు. నరైన్ మొదట నాకు మంచి స్నేహితుడు. ఆ తర్వాత అతనొక వరల్డ్ క్లాస్ క్రికెటర్. అయితే ప్రస్తుతం టి20 ప్రపంచకప్కు జట్టుకు ఎంపికైన 15 మంది ప్రత్యేక శైలి కలిగిన వారే. ఇప్పుడున్న పరిస్థితుల్లో జట్టును మార్చి నరైన్కు అవకాశం ఇవ్వలేము. అయితే ఎంపిక నా చేతుల్లో ఉండదు. సెలెక్టర్లు నన్ను సంప్రదిస్తే నరైన్ పేరు కచ్చితంగా పేర్కొంటా. కానీ ఆ అవకాశం లేకపోవచ్చు.'' అని చెప్పుకొచ్చాడు. ఇక టి20 ప్రపంచకప్లో రెండుసార్లు చాంపియన్గా నిలిచిన వెస్టిండీస్ సూపర్ 12లో గ్రూఫ్ 1లో ఉంది. విండీస్ తమ తొలి మ్యాచ్ను అక్టోబర్ 23న ఇంగ్లండ్తో ఆడనుంది. చదవండి: T20 World Cup 2021: హార్దిక్ అన్ఫిట్.. జట్టులోకి మరో ఆల్రౌండర్! Chris Gayle: ఆ క్రికెటర్పై గౌరవం చచ్చిపోయింది.. గేల్ సంచలన వ్యాఖ్యలు -
'ఢిల్లీ తప్పనిసరిగా టైటిల్ గెలుస్తుంది'
Ricky Pontings Motivational Speech to DC players ahead of KKR clash: ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ తప్పనిసరిగా టైటిల్ నెగ్గుతుందని ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాటింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా నేడు క్వాలిఫయర్ - 2లో భాగంగా షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్.. కేకేఆర్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో చెన్నైతో ఢీకొట్టనుంది. ప్రస్తుత సీజన్లో 14 మ్యాచ్ల్లో 10 విజయాలు సాధించి పాయింట్ల ఢిల్లీ పట్టికలో అగ్రస్ధానంలో నిలిచింది. అయితే క్వాలిఫయర్-1లో సీఎస్కే చేతిలో ఓటమి చెందిన తరువాత ఢిల్లీ కాస్త ఢీలా పడింది. ఈ క్రమంలో నేడు జరగబోయే క్వాలిఫయర్ - 2లో ఏ విధంగానైనా గెలిచి ఫైనల్కు చేరాలని ఢిల్లీ ఉర్రుతలూగుతుంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు రికీ పాంటింగ్ తన జట్టుకు భావోద్వేగంతో కూడిన ప్రసంగం ఇచ్చాడు. తమ జట్టు గత కొద్ది సీజన్ల నుంచి చాలా బాగా ఆడుతుందని, మా ఆటగాళ్ల మీద పూర్తి నమ్మకం ఉందని, తప్పని సరిగా ఢిల్లీ ఛాంపియన్గా నిలుస్తోందని పాటింగ్ తెలిపాడు. "నేను మూడు సంవత్సరాలుగా ఢిల్లీ జట్టులో ఉన్నాను .2018లో పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలిచాము. 2019లో మా జట్టు మూడో స్ధానంలో నిలవగా, గత సంవత్సరంలో రన్నర్ప్గా నిలిచాము. మేము ఈ ఏడాది టైటిల్ గెలవగలమన్న నమ్మకముంది. రెండేళ్ల క్రితం ఉన్న ఢిల్లీ జట్టుకు.. ప్రస్తుతం ఉన్న ఢిల్లీ జట్టుకు చాలా తేడా ఉందంటూ' పాంటింగ్ పేర్కొన్నాడు. చదవండి: T20 World Cup 2021: కోల్కతా ఓపెనర్ వెంకటేష్ అయ్యర్కు బంపర్ ఆఫర్.. -
ఐపీఎల్ 2021: సిరాజ్, ఆవేశ్ ఖాన్ సరికొత్త రికార్డు
Most Dot Balls In IPL 2021 Season.. ఐపీఎల్ 2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ బౌలర్లు ఆవేశ్ ఖాన్, మహ్మద్ సిరాజ్లు కొత్త రికార్డు సృష్టించారు. ఈ సీజన్లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన జాబితాలో ఇద్దరు అగ్రస్థానంలో ఉన్నారు. ఆవేశ్ ఖాన్, సిరాజ్లు ఈ సీజన్లో 147 డాట్ బాల్స్ వేయగా.. ఆ తర్వాత మహ్మద్ షమీ(పంజాబ్ కింగ్స్) 145 డాట్ బాల్స్తో రెండో స్థానంలో, 142 డాట్ బాల్స్తో బుమ్రా మూడోస్థానంలో, ట్రెంట్ బౌల్ట్ 138 డాట్ బాల్స్తో నాలుగో స్థానంలో, 137 డాట్ బాల్స్తో వరుణ్ చక్రవర్తి ఐదో స్థానంలో ఉన్నాడు. ఇందులో ఆవేశ్ ఖాన్ ఇప్పటికే టాప్ పొజీషన్లో ఉండగా.. వరుణ్ చక్రవర్తి మినహా మిగతా బౌలర్లకు టాప్ స్థానానికి చేరుకునే అవకాశం లేదు. ఒకవేళ కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనున్న క్వాలిఫయర్ 2లో ఓడిన జట్టు ఇంటి బాట పట్టనుంది. కాగా ఇప్పటికే సీఎస్కే ఫైనల్కు చేరుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Gautam Gambhir: 'మిస్టరీ' అంటారు.. మరి ఇన్నేళ్లుగా ఎలా ఆడుతున్నాడు IPL 2022 Mega Auction: రైనా సహా ఆ ముగ్గురి ఖేల్ ఖతమైనట్టే..! -
కోల్కతా ఓపెనర్ వెంకటేష్ అయ్యర్కు బంపర్ ఆఫర్..
Venkatesh Iyer to join Indian team as net bowlers during T20 World Cup: ఐపీఎల్ 2021 చివరి అంకానికి చేరుకుంది. నేడు (బుధవారం)జరుగనున్న క్వాలిఫైయర్-2, ఆక్టోబర్ 15న జరిగే ఫైనల్తో ఈ సీజన్ ముగుస్తున్నది. అయితే ప్రస్తుత సీజన్లో బ్యాటింగ్, బౌలింగ్లోను అద్భుతంగా రాణిస్తున్న కోల్కతా ఓపెనర్ వెంకటేష్ అయ్యర్కు బంఫర్ ఆఫర్ తగిలింది. టీ20 వరల్డ్ కప్లో టీమిండియాకు నెట్ బౌలర్గా అయ్యర్ సేవలు అందించనున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇండియాకు తిరిగి వెళ్లకుండా యూఏఈలో ఉండాలని బీసీసీఐ ఆదేశించింది. ఇప్పటికే ఎస్ఆర్హెచ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఆవేశ్ ఖాన్ కూడా నెట్ బౌలర్గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వెంకటేష్ అయ్యర్ రావడంతో ఆ సంఖ్య మూడు కు చేరింది. మధ్యప్రదేశ్కు చెందిన ఈ యువ ఆల్రౌండర్ ఐపీఎల్ 2021 సీజన్లో కేకేఆర్ తరపున 8 మ్యాచ్ల్లో 265 పరుగులు , మూడు వికెట్లు సాధించాడు. కాగా ఆక్టోబర్ 24న భారత్ తన తొలి మ్యాచ్లో దాయాది దేశం పాక్తో తలపడనుంది. చదవండి: T20 World Cup 2021: టీమిండియా నెట్ బౌలర్గా ఆవేశ్ఖాన్ -
DC vs KKR, Qualifier 2: చెన్నైని ఢీ కొట్టేదెవరు?
షార్జా: వరుసగా ఈ సీజన్లో కూడా ఫైనల్ చేరేందుకు ఢిల్లీ క్యాపిటల్స్కు ఇదే ఆఖరి అవకాశం. ధోని సేనపై సాధించలేకపోయిన విజయాన్ని ఇప్పుడు మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్పై తప్పనిసరిగా సాధించాలి. అయితే లీగ్ చివరి దశ మ్యాచ్లతో పాటు ఎలిమినేటర్లో పుంజుకున్న కోల్కతా అంత ఆషామాషీ ప్రత్యర్థి కాదిపుడు. ఇంకా చెప్పాలంటే మరో సూపర్కింగ్స్లాంటి జట్టుతో మళ్లీ తలపడటమే ఈ రెండో క్వాలిఫయర్! ఇప్పుడు నైట్రైడర్స్ను ఓడిస్తేనే ఢిల్లీ టైటిల్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంటుంది. లేదంటే 2019 సీజన్లాగే మూడో స్థానానికి పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ సేన సర్వశక్తులు ఒడ్డి పోరాడేందుకు సిద్ధమైంది. మరోవైపు వరుస విజయాలతో జోరుమీదున్న కోల్కతా మూడో టైటిల్పై కన్నేసింది. ఇప్పటికే రెండుసార్లు విజేత అయిన ఈ మాజీ చాంపియన్ ఈ సీజన్లో ఇంకో రెండు మ్యాచ్లు గెలిస్తే అనుకున్నది సాధిస్తుంది. టాపార్డర్దే బాధ్యత క్యాపిటల్స్ గత మ్యాచ్లో చేసిన స్కోరు పటిష్టమైందే. కానీ టాపార్డర్లో పృథ్వీ షా ఒక్కడే మెరిశాడు. అనుభవజ్ఞుడైన ధావన్ (7), శ్రేయస్ అయ్యర్ (1) ఇద్దరు కలిసి కనీసం 10 పరుగులైనా చేయలేకపోయారు. ఇప్పుడు రెండో క్వాలిఫయర్ రూపంలో ఇద్దరికీ మరో అవకాశం వచ్చింది. టాపార్డర్ బ్యాట్స్మెన్ బాధ్యతను పంచుకుంటే మిడిలార్డర్లో కెప్టెన్ రిషభ్ పంత్, హెట్మైర్ ధనాధన్ మెరుపులతో స్కోరు అమాంతం పెంచేయగలరు. గత మ్యాచ్లో తడబడిన టాపార్డర్కు చికిత్స చేసింది కూడా పంత్, హెట్మైర్లే! ప్రమాదకారిగా మారిన కోల్కతా స్పిన్నర్ సునీల్ నరైన్ను ఎదుర్కోవడంపై పాంటింగ్ కోచింగ్ బృందం కసరత్తు చేయాలి. లేదంటే బెంగళూరులాగే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. బౌలింగ్ విభాగంలో నోర్జే, రబడ చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. టామ్ కరన్, సీనియర్ స్పిన్నర్ అశ్విన్, అక్షర్ పటేల్లు కూడా కోల్కతాను కట్టడి చేస్తే ఢిల్లీ ఫైనల్ చేరుకోవచ్చు. జోరుమీదున్న కోల్కతా లీగ్లో తన కిందున్న ముంబైకి ఏమాత్రం చాన్స్ ఇవ్వకుండా ఎలిమినేటర్ చేరుకున్న నైట్రైడర్స్ అక్కడ తనకంటే మెరుగైన బెంగళూరును ఇంటిదారి పట్టించింది. ఇప్పుడు ఏకంగా లీగ్ టాపర్ను ఓడించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్లలో శుబ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ చక్కని ఆరంభాలిస్తున్నారు. నితీశ్ రాణా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నాడు. అయితే అనుభవజ్ఞులైన దినేశ్ కార్తీక్, కెప్టెన్ మోర్గాన్, షకీబ్లు కూడా ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడితే నైట్రైడర్స్కు తిరుగుండదు. గత మ్యాచ్లో నరైన్ ఆల్రౌండ్ షో హైలైట్. మేటి హిట్టర్లను నిలదొక్కుకునే లోపే పడగొట్టేసిన నరైన్ బ్యాటింగ్లో ఒకే ఓవర్లో చేసిన విధ్వంసం కోల్కతాను గెలుపుబాట పట్టించింది. సీమర్ ఫెర్గూసన్ ఎప్పట్లాగే తన మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తే ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు కష్టాలు తప్పవు. యూఏఈ అంచె లీగ్లో ఐదు విజయాలు సాధించిన ఢిల్లీకి చెక్ పెట్టిన జట్టు కోల్కతానే! ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. జట్లు (అంచనా) ఢిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్ (కెప్టెన్), పృథ్వీ షా, ధావన్, శ్రేయస్, హెట్మైర్, అక్షర్ పటేల్, టామ్ కరన్, అశ్విన్, రబడ, అవేశ్ ఖాన్, నోర్జే. కోల్కతా నైట్రైడర్స్: మోర్గాన్ (కెప్టెన్), గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్, నరైన్, షకీబ్, ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి. -
IPL 2021: స్విమ్మింగ్ఫూల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల జల్సా..
DC Players Have Fun Pool Session.. ఐపీఎల్ 2021లో కేకేఆర్తో క్వాలిఫయర్ 2 మ్యాచ్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు సరదాగా గడిపారు. కెప్టెన్ రిషబ్ పంత్, శిఖర్ ధవన్, అక్షర్ పటేల్, మరికొంతమంది డీసీ ఆటగాళ్లు స్విమ్మింగ్ఫూల్లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా.. ప్రస్తుతం వీడియో ట్రెండింగ్గా మారింది. ఇక ఐపీఎల్ 2021 సీజన్లో లీగ్ దశలో అద్బుత ప్రదర్శన కనబరిచిన ఢిల్లీ క్యాపిటల్స్ టేబుల్ టాపర్గా నిలిచింది. అయితే క్వాలిఫయర్ 1లో సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో పరాజయం పాలైంది. అయితే క్వాలిఫయర్ 2 ద్వారా ఫైనల్ చేరే అవకాశం ఉండడంతో కేకేఆర్తో మ్యాచ్ను సీరియస్గా తీసుకోనుంది. చదవండి: Gautam Gambhir: 'మిస్టరీ' అంటారు.. మరి ఇన్నేళ్లుగా ఎలా ఆడుతున్నాడు Virat Kohli Crying: కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఆ వెంటే డివిలియర్స్ కూడా View this post on Instagram A post shared by Delhi Capitals (@delhicapitals) -
T20 World Cup 2021: టీమిండియా నెట్ బౌలర్గా ఆవేశ్ఖాన్
Avesh Khan As Net Bowelr For Team India T20 WC 2021.. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఆవేశ్ ఖాన్ ఐపీఎల్ ముగిసిన తర్వాత యూఏఈలో ఉండనున్నాడు. టి20 ప్రపంచకప్ 2021కు సంబంధించి ఆవేశ్ ఖాన్ టీమిండియా నెట్బౌలర్గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ఆవేశ్ఖాన్ను సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే ఎస్ఆర్హెచ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కూడా నెట్ బౌలర్గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆవేశ్ ఖాన్ కూడా నెట్బౌలర్గా రావడంతో ఆ సంఖ్య రెండుకు చేరింది. అయితే ఆవేశ్ ఖాన్ స్టాండ్ బై లిస్ట్ ప్లేయర్గా కూడా పరిగణిస్తున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: T20 World Cup 2021: మెంటార్గా ధోని ఎలాంటి ఫీజులు తీసుకోవడం లేదు Courtesy: IPL Twitter మధ్యప్రదేశ్కు చెందిన ఆవేశ్ ఖాన్ ఫాస్ట్ బౌలింగ్కు పెట్టింది పేరు. 140 నుంచి 145 కిమీ వేగంతో వైవిధ్యమైన బంతులు విసరడం ఆవేశ్ ఖాన్ స్పెషాలిటీ. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్కు వెన్నుముకలా మారిన ఆవేశ్ ఖాన్ ఆ జట్టు తరపున ఐపీఎల్ 2021 సీజన్లో 15 మ్యాచ్ల్లో 23 వికెట్లు తీశాడు. సీజన్లో అత్యధిక వికెట్ల పరంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఢిల్లీ మరో రెండు మ్యాచ్లు ఆడే అవకాశం ఉండడంతో అత్యధిక వికెట్ల జాబితాలో తొలి స్థానానికి చేరే అవకాశం ఉంది. ఇక ఆవేశ్ ఖాన్ ఐపీఎల్ 2021 తొలి అంచె పోటీల్లో అన్రిచ్ నోర్ట్జే, ఇషాంత్ శర్మలతో సమానంగా మెరుగ్గా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ టూర్కు నెట్బౌలర్గా ఎంపికయ్యాడు. టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు కౌంటీ సెలెక్ట్ లెవెన్తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో దురదృష్టవశాత్తూ టూర్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత గాయం నుంచి కోలుకొని యూఏఈకి చేరిన ఆవేశ్ ఖాన్ సెకండ్ఫేజ్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రధాన బౌలర్గా మారాడు. Courtesy: IPL Twitter -
'మిస్టరీ' అంటారు.. మరి ఇన్నేళ్లుగా ఎలా ఆడుతున్నాడు
Gautam Gambhir Lauds Sunil Narine.. టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కేకేఆర్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నరైన్ అందరు ఇంకా మిస్టరీ స్పిన్నర్గానే చూస్తున్నారని.. మరి ఇన్నేళ్లుగా క్వాలిటి బౌలింగ్ ఎలా చేస్తున్నాడంటూ ప్రశ్నించాడు. కాగా సోమవారం ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సునీల్ నరైన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. ముందు బౌలింగ్లో 4 వికెట్లు తీసిన నరైన్.. ఆ తర్వాత బ్యాటింగ్లో కీలక దశలో 3 సిక్సర్లు బాది జట్టు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నరైన్ ప్లేఆఫ్స్ మెరిసిన రెండుసార్లు కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. చదవండి: David Warner: వచ్చే సీజన్లో ఎస్ఆర్హెచ్కే ఆడాలని ఉంది.. కానీ Courtesy: IPL Twitter ఈ సందర్భంగా గంభీర్ నరైన్ ఆటతీరుపై స్పందించాడు. '' సునీల్ నరైన్ విషయంలో మిస్టరీ అనే పదం ఇప్పటికి వినిపిస్తుండడం నన్ను ఆశ్చర్చపరిచింది. మిస్టరీ అనే పదం కంటే క్వాలిటీ అనే పదం నరైన్కు ఎందుకు ఉపయోగించరో అర్థం కాదు. నరైన్ బౌలింగ్ మిస్టరీగానే ఉంటే ఇన్నేళ్ల పాటు విండీస్ తరపున క్రికెట్ ఎలా ఆడుతున్నాడు. కోహ్లి, డివిలియర్స్, మ్యాక్స్వెల్లు నరైన్ బౌలింగ్లో ఔట్ అయ్యారు. ఇన్నేళ్లు ఎలా అతని బౌలింగ్లో వెనుదిరిగారో ఇప్పుడు కూడా అలానే ఔట్ అయ్యారు. దీనిలో కొత్త విషయం ఎక్కడుంది. నరైన్ బౌలింగ్లో ఆ ముగ్గురు ఇప్పటికీ ఆడలేకపోతున్నారనేదానిపై మరోసారి క్లారిటీ వచ్చింది. టాప్క్లాస్ బ్యాట్స్మెన్ను వెనక్కి పంపగల సత్తా నరైన్కు ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. Courtesy: IPL Twitter ఇక కేకేఆర్ గంభీర్ కెప్టెన్సీలోనే రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 2012, 2014లో టైటిల్ గెలిచిన గంభీర్ సేనలో సునీల్ నరైన్ కీలకపాత్ర పోషించాడు. 2012 సీజన్లో 24 వికెట్లు తీసిన నరైన్.. 2014 సీజన్లో 21 వికెట్లు తీశాడు. తాజా సీజన్లో(ఐపీఎల్ 2021) 14 వికెట్లతో వరుణ్ చక్రవర్తి తర్వాత కేకేఆర్ తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న రెండో స్పిన్నర్గా కొనసాగుతున్నాడు. ఇక కేకేఆర్ రేపు(అక్టోబర్ 13) ఢిల్లీ క్యాపిటల్స్తో క్వాలిఫయర్ 2 ఆడనుంది. చదవండి: Sunil Narine: ఆ ముగ్గురిని ఔట్ చేయడం ఇది రెండోసారి మాత్రమే -
'నీకు సోదరిగా పుట్టినందుకు గర్విస్తున్నా'
Bhawna Kohli Dhingra Commnets On Virat kholi: ఐపీఎల్ 2021లో భాగంగా సోమవారం కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లి సోదరి భవ్నా కోహ్లి ధింగ్రా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేసింది. "నీవు కెప్టెన్గా ఆర్సీబీకి శక్తి మేరకు పనిచేశావు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఎల్లప్పుడూ జట్టు భారాన్ని నీ భుజాలపైన వేసుకుని నడిపించావు. ఆర్సీబీ గొప్ప కెప్టెన్లో ఒకడిగా నిలిచిపోతావు. ఎప్పటికీ గౌరవ, ప్రశంసలకు నీవు అర్హుడివే. నేను నీకు సోదరిగా పుట్టినందుకు గర్విస్తున్నా" అంటూ భవ్నా కోహ్లి రాసుకొచ్చింది. కాగా కెప్టెన్గా కోహ్లికు ఇదే చివరి సీజన్ కాగా.. ఈసారి ఎలాగైనా కప్ సాధించి కెప్టెన్గా ఘనమైన వీడ్కోలు తీసుకోవాలని అతడు భావించాడు. కానీ ఆ కోరిక తీరకుండానే కోహ్లి కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. చదవండి: Virat Kohli: ఆశించిన ఫలితం దక్కలేదు.. కోహ్లి భావోద్వేగం -
వచ్చే సీజన్లో ఎస్ఆర్హెచ్కే ఆడాలని ఉంది.. కానీ
David Warner Intrested Play For SRH IPL 2022.. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్కు ఆడడంపై కన్సల్టింగ్ ఎడిటర్ బోరియా మజుందార్ స్పందించాడు. ఐపీఎల్ 2022లో వార్నర్కు ఎస్ఆర్హెచ్కే ఆడాలని ఉంది.. కానీ టైం ఎప్పుడు ఏం నిర్ణయిస్తుందో చెప్పలేమని తెలిపాడు. అయితే వచ్చే సీజన్లో ఏ జట్టుకు ఆడే దానిపై వార్నర్ చేతుల్లో ఏం ఉండదని.. అతని కోసం వచ్చే సీజన్లో రెండు కొత్త జట్లతో పాటు ఇప్పుడున్న జట్లు కూడా వేలంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నాడు. కాగా వార్నర్ ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో తుది జట్టులో అవకాశం రాకపోవడంతో ఎస్ఆర్హెచ్ డగౌట్లో ఉండలేకపోయాడు. అయితే ఎస్ఆర్హెచ్ ఆడిన మ్యాచ్లకు ప్రేక్షకుడిగా హాజరై ఫ్లాగ్ను ఊపుతూ జట్టును ఉత్సాహపరిచాడు. చదవండి: IPL 2021: ఐపీఎల్ రేటింగ్స్.. బీసీసీఐకి బ్యాడ్న్యూస్ ఇక ఐపీఎల్ 14వ సీజన్ తొలి అంచె పోటీల్లో కెప్టెన్గా జట్టును నడిపించడంలో విఫలమయ్యాడన్న కారణంతో వార్నర్ను ఎస్ఆర్హెచ్ యాజమాన్యం నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించి కేన్ విలియమ్సన్కు కెప్టెన్సీ అప్పగించారు. అయినప్పటికీ ఎస్ఆర్హెచ్ తలరాత మాత్రం మారలేదు. సీజన్ మొత్తం దారుణ ప్రదర్శన కనబరిచిన ఎస్ఆర్హెచ్ 14 మ్యాచ్ల్లో 3 విజయాలు.. 11 ఓటములతో ఆఖరిస్థానంలో నిలిచింది. ఇక 2014లో ఎస్ఆర్హెచ్ జట్టులోకి వచ్చిన వార్నర్ తన తొలి సీజన్లోనే ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఆ తర్వాత సీజన్లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన వార్నర్ 2016 ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ను చాంపియన్గా నిలిపాడు. ఇక వార్నర్ ఐపీఎల్లో 150 మ్యాచ్ల్లో 5449 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు.. 50 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: 'ప్లీజ్ అన్న.. ఎస్ఆర్హెచ్లోనే ఉండవా'.. వార్నర్ ఫన్నీ రిప్లై -
కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఆ వెంటే డివిలియర్స్ కూడా
Virat Kohli Cried After He Lost Against Kkr: ఐపీఎల్ 2021లో భాగంగా సోమవారం కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే కెప్టెన్గా కోహ్లికు ఇదే చివరి సీజన్ కాగా.. ఈసారి ఎలాగైనా కప్ సాధించి కెప్టెన్గా ఘనమైన వీడ్కోలు తీసుకోవాలని అతడు భావించాడు. కానీ ఆ కోరిక తీరకుండానే కోహ్లి కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం విరాట్ గ్రౌండ్లోనే కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ వెంటే డివిలియర్స్ కూడా కన్నీరు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లి కన్నీరు పెట్టుకోవడం అభిమానులకు ఎంతో భాదను కలిగిస్తోంది. ఇన్నాళ్లు తనకు సహకరించిన యాజమాన్యం, సహాయక సిబ్బంది... మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ విరాట్ కోహ్లి ఉద్వేగభరిత ట్వీట్ కూడా చేశాడు. కాగా 2013 ఐపీఎల్ సీజన్ నుంచి ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లి ఒక్కసారి కూడా జట్టుకు టైటిల్ అందించలేకపోయాడు. కోహ్లి ఇప్పటివరకు 140 మ్యాచ్ల్లో 66 విజయాలు.. 70 పరాజయాలు అందుకున్నాడు. మరో 4 మ్యాచ్లు ఫలితం తేలలేదు. చదవండి: Virat Kohli: ఆశించిన ఫలితం దక్కలేదు.. కోహ్లి భావోద్వేగం first time kohli is crying.Last match as RCB Captain. @imVkohli @BCCI @ICC @IPL #Kohli#crying#last#match#captain#rcb pic.twitter.com/kZDWQgwKRT — Shubham Yadav( Dainik Bhaskar) (@shubham00211591) October 11, 2021 -
Sunil Narine: ఆ ముగ్గురిని ఔట్ చేయడం ఇది రెండోసారి మాత్రమే
Sunil Narine Was Only 2nd Bowler Dismiss RCB Trio.. ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కేకేఆర్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ మ్యాచ్ హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. మొదట బౌలింగ్లో 4 ఓవర్లు వేసి 21 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్లో మూడు సిక్సర్లతో 26 పరుగులు చేసి గేమ్ చేంజర్గా నిలిచాడు. అయితే ఇదే మ్యాచ్లో ఆర్సీబీ త్రయం కోహ్లి, డివిలియర్స్, మ్యాక్స్వెల్ను పెవిలియన్ చేర్చిన నరైన్ ఒక కొత్త రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్లో ఒకే మ్యాచ్లో ఈ త్రయాన్ని ఒక బౌలర్ వెనక్కి పంపడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్ప్రీత్ బార్ కోహ్లి, మ్యాక్స్వెల్, ఏబీలను వెనక్కి పంపిన తొలి బౌలర్గా నిలిచాడు. ఇక కేకేఆర్ అక్టోబర్ 13న ఢిల్లీ క్యాపిటల్స్తో క్వాలిఫయర్ 2 ఆడనుంది. ఇప్పటికే సీఎస్కే జట్టు ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2021: ఐపీఎల్ రేటింగ్స్.. బీసీసీఐకి బ్యాడ్న్యూస్ ఐపీఎల్లో నరైన్ అందుకున్న కొన్ని రికార్డులు పరిశీలిస్తే.. ►ఐపీఎల్లో నరైన్ ప్లేఆఫ్స్లో రాణించిన రెండు సందర్భాల్లోనూ కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ను గెలవడం విశేషం. ఇక మూడో టైటిల్ కోసం కేకేఆర్ వేట కొనసాగుతుంది. ►ఐపీఎల్ చరిత్రలో లీడింగ్ వికెట్ టేకర్ జాబితాలో నరైన్ ముందు వరుసలో ఉన్నాడు. 132 మ్యాచ్ల్లో 141 వికెట్లు పడగొట్టాడు. ► ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ ఎకానమీ కలిగిన బౌలర్లలో నరైన్ అగ్రభాగంలో ఉన్నాడు. చదవండి: IPL 2021: లాస్ట్ బాల్ సిక్స్ కొడితే ఆ మజా వేరు pic.twitter.com/ITc0bcd44c — Cricsphere (@Cricsphere) October 11, 2021 pic.twitter.com/4duozs0Vnk — Cricsphere (@Cricsphere) October 11, 2021 -
ఐపీఎల్ రేటింగ్స్.. బీసీసీఐకి బ్యాడ్న్యూస్
IPL 2021 Viewership Ratings.. ఐపీఎల్ 2021 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. క్వాలిఫయర్ 2తో పాటు ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలిఉంది. అయితే క్యాష్రిచ్ లీగ్గా పేరున్న ఐపీఎల్లో ప్రతీసారి వీక్షకుల సంఖ్య రికార్డుస్థాయిలో నమోదవుతూ వస్తుంది. అయితే ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో మాత్రం రేటింగ్స్ పడిపోయినట్లు రిపోర్ట్స్లో తేలింది. రిపోర్ట్స్ ప్రకారం ఐపీఎల్ రేటింగ్స్ దాదాపు 15-20 శాతం పడిపోయినట్లు తెలిసింది. కాగా ఐపీఎల్ మ్యాచ్లన్నీ స్టార్స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రసారం చేస్తుంది. స్టార్స్పోర్ట్స్ ఇంగ్లీష్, హిందీ చానెళ్లతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో మ్యాచ్లు ప్రసారమవుతున్నాయి. చదవండి: ఐపీఎల్ 2021 సీజన్లో ఎవరి మ్యాచ్లు ఎక్కువగా చూశారంటే.. అయితే ప్రకటనదారులతో రేటింగ్లు తగ్గడం లేదని.. వీక్షకుల సంఖ్య పడిపోవడం వల్లే ఇలా జరిగిందని ఎంటర్టైన్మెంట్(ఈటీ)లో తేలింది. రేటింగ్ల పతనానికి సంబంధించిన ఖాతాలపై ప్రకటనదారులు పరిహారం కోసం వెతికే అవకాశం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఇలా ఐపీఎల్ రేటింగ్స్ పడిపోవడం బీసీసీఐకి అంత సానుకూలాంశం కాదు. ఇది ఇలాగే కొనసాగితే ప్రకటనదారుల నుంచి వేలకోట్లు నష్టపోయే అవకాశం ఉంది. కాగా అక్టోబర్ చివరి నాటికి కొత్త మీడియా హక్కుల టెండర్ను విడుదల చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. రాబోయే వారంలో రేటింగ్లు పెరగకపోతే మాత్రం బీసీసీఐకి భారీ నష్టాలు చూసే అవకాశం ఉంటుంది. చదవండి: Ab De villiers: డివిలియర్స్ చెత్త రికార్డు.. కలిసి రాని యూఏఈ -
డివిలియర్స్ చెత్త రికార్డు.. కలిసి రాని యూఏఈ
AB De Villiers Failure In IPl 2021 UAE.. ఐపీఎల్ 2021లో భాగంగా కేకేఆర్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కరోనా విరామం తర్వాత సెకండ్ఫేజ్లో ఆర్సీబీ బ్యాటింగ్ విభాగంలో పడిక్కల్, కోహ్లి, మ్యాక్స్వెల్, కేఎస్ భరత్ కీలకపాత్ర పోషించారు. అయితే సీనియర్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్కు మాత్రం యూఏఈ గడ్డ ఏమాత్రం కలిసిరాలేదు. ప్లేఆఫ్స్తో కలిపి డివిలియర్స్ 8 మ్యాచ్ల్లో 17.66 సగటుతో 106 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 0,12,11,4, 23, 19, 26,11 ఇవి డివిలియర్స్ యూఏఈ గడ్డపై నమోదు చేసిన స్కోర్లు. ఇందులో ఒక గోల్డెన్ డక్ ఉండడం విశేషం. చదవండి: Virat Kohli: కెప్టెన్గా ఇదే చివరిసారి.. అంపైర్తో కోహ్లి వాగ్వాదం ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎలిమినేటర్ మ్యాచ్లో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. కేకేఆర్ బ్యాటింగ్లో సునీల్ నరైన్ 26 పరుగులతో గేమ్ చేంజర్ కాగా.. గిల్ 29, వెంకటేశ్ అయ్యర్ 26, నితీష్ రాణా 23 పరుగులు చేశారు. అంతకముందు ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. సునీల్ నరైన్(4/21) బౌలింగ్లో మెరవడంతో ఆర్సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కోహ్లి 39 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. పడిక్కల్ 21 పరుగులు చేశాడు. చదవండి: Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా ముగిసిన కథ pic.twitter.com/4duozs0Vnk — Cricsphere (@Cricsphere) October 11, 2021 -
KL Rahul: పంజాబ్ కింగ్స్కు బిగ్ షాక్ ఇవ్వనున్న కేఎల్ రాహుల్!
KL Rahul Likely to Say Good Bye to Punjab Kings: ఐపీఎల్ 2021లో పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టిన పంజాబ్ కింగ్స్కు మరో గట్టి షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ జట్టుకు గుడ్బై చెప్పబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రస్తుత సీజన్లో టాప్ స్కోరర్గా నిలిచిన కేఎల్ రాహుల్ వచ్చే ఏడాది పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించడం లేదని ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ క్రిక్ బజ్ తమ సర్వేలో వెల్లడైనట్లు తెలిపింది. త్వరలో జరగనున్న మెగా వేలంలోకి వెళ్లాలని రాహుల్ నిర్ణయించుకున్నట్లు క్రిక్ బజ్ వెల్లడించింది. ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీలు రాహుల్ సంప్రదించినట్లు సమాచారం. అయితే రిటేన్ పాలసీ ప్రకారం ప్రతీ జట్టు ముగ్గురు ప్లేయర్స్ను రిటేన్ చేసుకునే హక్కు ఫ్రాంచైజీకి ఉంటుంది. అయితే బ్యాట్స్మన్గా అద్బుతంగా రాణిస్తున్నప్పటికి.. కెప్టెన్గా ఆ జట్టుకు టైటిల్ అందించకపోవడంపై రాహుల్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు వినికిడి. కాగా బీసీసీఐ తదుపరి సీజన్ కోసం రిటేన్ పాలసీ మార్గదర్శకాలను ఇంకా ప్రకటించలేదు. ఇక ఈ సీజన్లో 13 మ్యాచ్లలో రాహుల్ 626 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. ప్రస్తుతం రాహుల్ టీ20 వరల్డ్కప్ కోసం టీమిండియా బబుల్లో చేరాడు. అక్టోబరు 17 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. చదవండి: Daniel Christian: ఆర్సీబీని ముంచేశారు కదరా; ప్లీజ్.. నా భార్యను వదిలేయండి! -
హర్షల్ పటేల్ను అభినందనల్లో ముంచెత్తిన బ్రావో.. సూపర్ అంటూ..
Harshal Patel: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా హర్షల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. దీంతో హర్షల్ పటేల్ 2013 సీజన్లో అత్యధిక వికెట్లు (32) తీసిన డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో తనతో సమంగా నిలిచిన హర్షల్ పటేల్ను అభినందించాడు. "అభినందనలు హర్షల్. నీవు ఖచ్చితంగా ఈ రికార్డును సాధిస్తావు !! నీ పోరాట పటిమ చూడటానికి చాలా బాగుంది!' అని బ్రావో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాశాడు. కాగా మొత్తం 15 మ్యాచ్లాడిన హర్షల్ పటేల్ 32 వికెట్లు పడగొట్టాడు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా సోమవారం కోల్కతా నైట్ రైడర్స్ జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టిన హర్షల్ ఈ ఘనత సాధించాడు. కాగా 17ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్లో సునీల్ నరైన్ క్యాచ్ పడక్కల్ వదిలివేయడంతో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డను తృటిలో చేజార్చుకున్నాడు. ఇప్పటికే ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా హర్షల్ పటేల్ నిలిచాడు. కాగా కోల్కతా నైట్రైడర్స్తో సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో కేకేఆర్.. ఢిల్లీ క్యాపిటల్స్తో క్వాలిఫైయర్-2 ఆడేందుకు అర్హత సాధించగా... కోహ్లి సేన ఇంటిముఖం పట్టింది. చదవండి: Glenn Maxwell: కొంచెం డీసెంట్గా ఉండండి.. చెత్తగా వాగొద్దు -
RCB Vs KKR: బెంగళూరు బైబై... పాపం.. కోహ్లి.. ఇదే ఆఖరు!
ఐపీఎల్–14 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు నిష్క్రమించింది. విరాట్ కోహ్లి సారథ్యం కూడా నిరాశగానే ముగిసింది. కోల్కతా నైట్రైడర్స్ ప్లేయర్ సునీల్ నరైన్ (4 వికెట్లు, 15 బంతుల్లోనే 3 సిక్సర్లతో 26 పరుగులు) ఆల్రౌండ్ షోతో ఎలిమినేటర్లో బెంగళూరు పరాజయం పాలైంది. దాంతో ఐపీఎల్ టైటిల్ ఈ సీజన్లోనూ బెంగళూరుకు అందని ద్రాక్షే అయ్యింది. రేపు జరిగే రెండో క్వాలిఫయర్లో ఫైనల్ బెర్త్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ను ఢీకొట్టేందుకు కోల్కతా నైట్రైడర్స్ సిద్ధమైంది. షార్జా: సునీల్ నరైన్ మంత్రం ముందు కోహ్లి రణతంత్రం గెలవలేకపోయింది. మొదట తన స్పిన్ మాయాజాలంతో బెంగళూరును కట్టిపడేసిన ఈ స్పిన్నర్ తర్వాత భారీ సిక్సర్లతో మ్యాచ్పై ప్రత్యర్థి పట్టు తప్పించాడు. దీంతో సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ నాలుగు వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించి క్వాలిఫయర్–2కు అర్హత సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిరీ్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఓపెనర్లు కోహ్లి (33 బంతుల్లో 39; 5 ఫోర్లు), దేవ్దత్ పడిక్కల్ (18 బంతుల్లో 21; 2 ఫోర్లు) తర్వాత నరైన్ (4/21) మాయాజాలానికి ఇంకెవరూ 15 పరుగులను కూడా దాటలేకపోయారు. తర్వాత కోల్కతా నైట్రైడర్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి గెలిచింది. శుబ్మన్ గిల్ (18 బంతుల్లో 29; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. నరైన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. బౌండరీలతో వేగం పెరిగినా... బెంగళూరు ఓపెనర్లు పడిక్కల్, కోహ్లి మెరుపులు మెరిపించకపోయినా... బౌండరీ లతో స్కోరు బోర్డును పరిగెత్తించారు. అయితే ఫెర్గూసన్ ఆరో ఓవర్ తొలి బంతికి దేవ్దత్ (18 బంతుల్లో 21; 2 ఫోర్లు)ను బౌల్డ్ చేశాడు. దీంతో 49 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం చెదిరింది. గత ‘మ్యాచ్ విన్నర్’ శ్రీకర్ భరత్ (9)కు టాపా ర్డర్లో ప్రమోషన్ ఇచ్చారు. కానీ దీన్ని ఈ ఆంధ్ర ఆటగాడు సది్వనియోగం చేసుకోలేకపోయాడు. 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 70/2 స్కోరు చేయగలిగింది. నరైన్ 4–0–21–4 కట్టుదిట్టమైన బౌలింగ్తో కోల్కతా పట్టుబిగించింది. ఇది చాలదన్నట్లు నరైన్ ఓవర్కో కీలకమైన వికెట్ను పడగొట్టడంతో బెంగళూరుకు కష్టాలు తప్పలేదు. 13వ ఓవర్ వేసిన స్పిన్నర్ కెపె్టన్ కోహ్లిని బౌల్డ్ చేశాడు. తన తదుపరి ఓవర్లో (15వ) ‘మిస్టర్ 360’ డివిలియర్స్ (11)ను క్లీన్»ౌల్డ్ చేశాడు. 17వ ఓవర్ తొలి బంతికి షహబాజ్ వికెట్ కూడా చిక్కేది. కానీ బౌండరీ దగ్గర సునాయాసమైన క్యాచ్ను శుబ్మన్ గిల్ చేజార్చాడు. అయినా నిరాశచెందని నరైన్ ... మ్యాక్స్వెల్ (15)ను ఫెర్గూసన్ క్యాచ్తో పడేశాడు. తర్వాత కొట్టేవాళ్లు, చితగ్గొట్టేవాళ్లు కరువవడంతో... 14వ ఓవర్లో వంద పరుగులకు చేరుకున్న బెంగళూరు 20 ఓవర్లలో కనీసం 140 పరుగులైనా చేయలేకపోయింది. ఆఖరి 5 ఓవర్లలో పడుతూ లేస్తూ 30 పరుగులు మాత్రమే చేసింది. ఆశలు రేపిన సిరాజ్ ఆరంభ ఓవర్లలో కోల్కతా ఓపెనర్లు శుబ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ (26) ధాటిగా ఆడారు. గార్టన్ నాలుగో ఓవర్లో గిల్ హ్యాట్రిక్ ఫోర్లతో అలరించాడు. కానీ అతని దూకుడుకు ఆరో ఓవర్లో హర్షల్ పటేల్ కళ్లెం వేశాడు. రాహుల్ త్రిపాఠి (6)ని చహల్ బోల్తాకొట్టించాడు. మరోవైపు అయ్యర్ నిలకడగా ఆడటంతో 10 ఓవర్లలో కోల్కతా 2 వికెట్లకు 74 పరుగులు చేసింది. అయ్యర్ ఔటయ్యాక మ్యాచ్లో పట్టు సాధించాలనుకున్న కోహ్లికి నరైన్ మళ్లీ కొరకరానికొయ్యగా మారాడు. క్రిస్టియాన్ వేసిన 12వ ఓవర్లో 3 సిక్స్లతో 22 పరుగులు రాబట్టుకోవడంతోనే బెంగళూరు ఆశలు ఆవిరయ్యాయి. ఆఖరి 18 బంతుల్లో 15 పరుగుల విజయ సమీకరణం కోల్కతాను సులువుగా ఊరిస్తుండగా... 18వ ఓవర్ వేసిన సిరాజ్ ఆశలు రేపాడు. 3 పరుగులే ఇచ్చి నరైన్, దినేశ్ కార్తీక్ (10)లను ఔట్ చేశాడు. 19వ ఓవర్లో గార్టన్ 5 పరుగులిచ్చాడు. ఆఖరి ఓవర్లో కోల్కతా 7 పరుగులు చేయాల్సిన దశలో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కానీ క్రిస్టియాన్ తొలి బంతికే షకీబ్ బౌండరీ బాదడం... ఆ తర్వాత మూడు బంతులకు మూడు సింగిల్స్ రావడంతో కోల్కతా మరో 2 బంతులుండగానే విజయం సాధించింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: దేవ్దత్ (బి) ఫెర్గూసన్ 21; కోహ్లి (బి) నరైన్ 39; భరత్ (సి) వెంకటేశ్ (బి) నరైన్ 9; మ్యాక్స్వెల్ (సి) ఫెర్గూసన్ (బి) నరైన్ 15; డివిలియర్స్ (బి) నరైన్ 11; షహబాజ్ (సి) శివమ్ మావి (బి) ఫెర్గూసన్ 13; క్రిస్టియాన్ (రనౌట్) 9; హర్షల్ పటేల్ (నాటౌట్) 8; గార్టన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 138. వికెట్ల పతనం: 1–49, 2–69, 3–88, 4–102, 5–112, 6–126, 7–134. బౌలింగ్: షకీబ్ 4–0–24–0, శివమ్ మావి 4–0–36–0, వరుణ్ 4–0–20–0, ఫెర్గూసన్ 4–0–30–2, నరైన్ 4–0–21–4. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) డివిలియర్స్ (బి) హర్షల్ 29; వెంకటేశ్ అయ్యర్ (సి) భరత్ (బి) హర్షల్ 26; రాహుల్ త్రిపాఠి (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్ 6; రాణా (సి) డివిలియర్స్ (బి) చహల్ 23; నరైన్ (బి) సిరాజ్ 26; దినేశ్ కార్తీక్ (సి) భరత్ (బి) సిరాజ్ 10; మోర్గాన్ (నాటౌట్) 5; షకీబ్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 5; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–41, 2–53, 3–79, 4–110, 5–125, 6–126. బౌలింగ్: సిరాజ్ 4–0–19–2, గార్టన్ 3–0–29–0, హర్షల్ 4–0–19–2, చహల్ 4–0–16–2, మ్యాక్స్వెల్ 3–0–25–0, క్రిస్టియాన్ 1.4–0–29–0. -
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా ముగిసిన కథ
Virat Kohli RCB Captain As Last IPL 2021... ఐపీఎల్లో ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లి కథ ముగిసింది. ఈసారి ఎలాగైనా కప్ కొట్టి కెప్టెన్గా ఘనమైన వీడ్కోలు తీసుకోవాలని కోహ్లి భావించాడు. కానీ ఆ కోరిక తీరకుండానే కోహ్లి కెప్టెన్గా వైదొలిగాడు. వరుసగా రెండో ఏడాది ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ ఇంటిబాట పట్టింది. గతేడాది సీజన్(ఐపీఎల్ 2020)లో ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడిన ఆర్సీబీకీ ఈ సీజన్లో కేకేఆర్ షాక్ ఇచ్చింది. దీంతో ఐపీఎల్ టైటిల్ లేకుండానే ఒక జట్టుకు కెప్టెన్గా కోహ్లి గుడ్బై చెప్పాల్సి వచ్చింది. చదవండి: Virat Kohli: కెప్టెన్గా ఇదే చివరిసారి.. అంపైర్తో కోహ్లి వాగ్వాదం Courtesy: IPL Twitter 2013 ఐపీఎల్ సీజన్ నుంచి ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లి 140 మ్యాచ్ల్లో 66 విజయాలు.. 70 పరాజయాలు అందుకున్నాడు. మరో 4 మ్యాచ్లు ఫలితం తేలలేదు. అతని కెప్టెన్గా పని చేసిన కాలంలో ఆర్సీబీ ఒకసారి రన్నరఫ్(2016 ఐపీఎల్ సీజన్), మరో మూడుసార్లు ప్లేఆఫ్స్(2015, 2020, 2021 )చేరింది. కెప్టెన్గా ఆర్సీబీకి టైటిల్ అందించడంలో విఫలమయ్యాడేమో కానీ బ్యాట్స్మన్గా మాత్రం ఎప్పుడు విఫలం కాలేదు. ఆర్సీబీ కెప్టెన్గా ఐపీఎల్ 2021 సీజన్ చివరిదని.. ఇకపై ఆ జట్టుకు ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని సెకండ్ఫేజ్ ఆరంభంలోనే ప్రకటించాడు. దీంతో ఆర్సీబీ టీమ్ ఎలాగైనా కోహ్లికి కప్ అందించి ఘనమైన వీడ్కోలు పలకాలని భావించింది. అందుకు తగ్గట్టుగానే లీగ్ దశలో ఒకటి రెండు మ్యాచ్లు మినహా మంచి ప్రదర్శన కనబరిచి ప్లేఆఫ్స్కు చేరింది. అయితే ప్లేఆఫ్స్ దశలో తమకు అలవాటైన ఒత్తిడిని అధిగమించడంలో ఆర్సీబీ మరోసారి విఫలమైంది. Final post match presentation of Virat Kohli as a #RCB captain. pic.twitter.com/B5IBGkXsFa — Johns. (@CricCrazyJohns) October 11, 2021 Virat Kohli led RCB for the final time today. The end of an era ♥️#RCBvKKR | #IPL2021 pic.twitter.com/Eo88SqLrF7 — ESPNcricinfo (@ESPNcricinfo) October 11, 2021 -
ఐపీఎల్లో హర్షల్ పటేల్ నయా రికార్డు
Harshal Patel Most wickets In IPL Season.. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన ఘనత అందుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా హర్షల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. మొత్తం 15 మ్యాచ్లాడిన హర్షల్ పటేల 32 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక హ్యాట్రిక్ ఉండడం విశేషం. తద్వారా హర్షల్ పటేల్ సీఎస్కే బౌలర్ డ్వేన్ బ్రావోతో సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు. 2013 ఐపీఎల్లో సీఎస్కే తరపున ఆ సీజన్లో 32 వికెట్లు తీశాడు. హర్షల్ పటేల్, బ్రావోల తర్వాత రెండో స్థానంలో కగిసో రబడ( ఢిల్లీ క్యాపిటల్స్, 30 వికెట్లు, ఐపీఎల్ 2020) ఉన్నాడు. ఇక జేమ్స్ ఫాల్కనర్ (28వికెట్లు, 2013 ఐపీఎల్), లసిత్ మలింగ (28 వికెట్లు, 2011 ఐపీఎల్), బుమ్రా( 27 వికెట్లు, ఐపీఎల్ 2020) వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు. కాగా 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ప్రస్తుతం 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కేకేఆర్ విజయానికి ఇంకా 12 పరుగుల దూరంలో ఉంది. -
మ్యాక్స్వెల్ కొత్త చరిత్ర.. ఆర్సీబీ తరపున తొలిసారి
Glenn Maxwell Completes 500 Runs For RCB.. ఆర్సీబీ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీ తరపున 500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా కోహ్లి, గేల్, డివిలియర్స్ త్రయం కాకుండా ఆర్సీబీ తరపున ఐదు వందల మార్క్ను అందుకున్న రెండో ఆటగాడిగా మ్యాక్స్వెల్ నిలిచాడు. ఇంతకముందు జాక కలిస్ ఆర్సీబీ తరపున 2010 ఐపీఎల్ సీజన్లో 572 పరుగులు సాధించాడు. అంతేగాక ఆర్సీబీ తరపున తొలిసారి ఆడుతున్న మ్యాక్స్వెల్ 500 పరుగుల మార్క్ను అందుకొని కొత్త చరిత్ర సృష్టించాడు. ఇక కేకేఆర్తో జరుగుతున్న ఆర్సీబీ పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. 17 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. చదవండి: Virat Kohli: ఆరు సార్లు ఔటయ్యాడు.. 145 పరుగులు చేశాడు -
ఆరు సార్లు ఔటయ్యాడు.. 145 పరుగులు చేశాడు
Virat Kohli Runs In 7-15 Overs IPL 2021.. మెషిన్ గన్ విరాట్ కోహ్లి ఫామ్లో ఉంటే పరుగులు వస్తూనే ఉంటాయి. కానీ ఈ ఆర్సీబీ కెప్టెన్కు ఐపీఎల్ 2021 సీజన్లో 7 నుంచి 15 ఓవర్ల మధ్యలో బ్యాడ్ రికార్డు నమోదు చేశాడు. మధ్య ఓవర్లలో ఎక్కువగా పరుగులు రాబట్టలేకపోయాడు. 8 ఓవర్లలో(7 నుంచి 15 ఓవర్లు) చూసుకుంటే 8 ఇన్నింగ్స్ల్లో 145 పరుగులు చేసిన కోహ్లి ఏకంగా ఆరుసార్లు ఔట్ కావడం విశేషం. బ్యాటింగ్ యావరేజ్ 24.17 ఉండగా.. స్ట్రైక్రేట్ 110.70 గా ఉంది. కాగా మ్యాచ్లో కేఎస్ భరత్(9) రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. నరైన్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ నాలుగో బంతిని భరత్ లాంగాఫ్ మీదుగా భారీ షాట్ యత్నించినప్పటికీ బౌండరీ లైన్ వద్ద ఉన్న వెంకటేశ్ అయ్యర్ క్యాచ అందుకున్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. కోహ్లి 32, మ్యాక్స్వెల్ 1 పరుగుతో ఆడుతున్నారు. అంతకముందు 21 పరుగులతో మంచి టచ్లో కనిపించిన పడిక్కల్ ఫెర్గూసన్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. చదవండి: IPL 2021: లాస్ట్ బాల్ సిక్స్ కొడితే ఆ మజా వేరు -
IPL 2021: లాస్ట్ బాల్ సిక్స్ కొడితే ఆ మజా వేరు
Match Won By Last-ball Six IPL History.. క్రికెట్ మ్యాచ్లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపిస్తే ఆ మజా వేరుగా ఉంటుంది. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఎంఎస్ ధోని ఆఖరిబంతికి సిక్స్ కొట్టి టీమిండియాకు కప్ అందించి 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఈ ఒక్క సిక్స్ అభిమానుల్లో ధోని పేరు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా చేసింది. అలా లాస్ట్బాల్ సిక్స్ కొట్టడం అంతకముందు జరిగాయి.. ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కీలక మ్యాచ్లో ఆఖరి సిక్స్ కొట్టి జట్టును గెలిపించడం ఐపీఎల్లోనూ చాలానే చూశాం. తాజాగా ఐపీఎల్ 2021 సీజన్లోనూ ఇలాంటివే పునరావృతమవుతున్నాయి. అందులో ఒక మూడు మాత్రం ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోతాయి. అవేంటో చూద్దాం. కెఎస్ భరత్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, 2021 Courtesy: IPL Twitter తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో భరత్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి ఆర్సీబీకి ఉత్కంఠ విజయాన్ని కట్టబెట్టాడు. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 6 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయింది. అయితే భరత్ మొదట డివిలియర్స్, ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్తో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించి ఇన్నింగ్స్ నడిపించాడు. ఇక ఆఖరి ఓవర్లో ఆర్సీబీ గెలుపుకు 15 పరుగులు అవసరమయ్యాయి. మొదటి ఐదు బంతుల్లో ఆవేశ్ ఖాన్ 9 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక ఆఖరి బంతికి ఆరు పరుగులు అవసరమయ్యాయి. అయితే ఒత్తిడిలో ఆవేశ్ ఖాన్ వైడ్ వేయడంతో ఈక్వేషన్ ఒక బంతికి ఐదు పరుగులుగా మారింది. ఈ దశలో ఆవేశ్ ఖాన్ వేసిన లో ఫుల్టాస్ను భరత్ లాంగాన్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ కొట్టి ఆర్సీబీకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఐపీఎల్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్గా ఆర్సీబీ- డీసీ మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్లో కేఎస్ భరత్ 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 78 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఎంఎస్ ధోని( రైజింగ్ పుణే సూపర్ జెయింట్, 2016) Courtesy: IPL Twitter ఎంఎస్ ధోని అంటే మొదటగా గుర్తుకు వచ్చే పదం మ్యాచ్ ఫినిషర్. అయితే ఎంఎస్ ధోని ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్పై ఆఖరిబంతికి సిక్స్ కొట్టి గెలిపించాడు. కానీ 2016లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ తరపున పంజాబ్ కింగ్స్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆఖరి బంతికి ధోని సిక్స్ కొట్టి జట్టును గెలిపించడం ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. ఆ మ్యాచ్లో 173 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన రైజింగ్ పుణే జట్టు 19 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. విజయానికి 23 పరుగులు అవసరం కాగా.. క్రీజులో ధోనితో పాటు అశ్విన్ ఉన్నాడు. అక్షర్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్లో ధోని స్ట్రైక్ తీసుకున్నాడు. తొలి బంతికి పరుగు రాలేదు. ఐదు బంతుల్లో 23 పరుగులు. అక్షర్ వైడ్ వేశాడు. అయితే ఆ తర్వాత అక్షర్ వేసిన నాలుగు బంతులను ధోని వరుసగా ఫోర్లు బాదాడు. ఈ క్రమంలోనే పుణే విజయానికి ఆఖరి బంతికి సిక్స్ కావాలి. అక్షర్ పటేల్ ఫుల్ డెలివరీ వేశాడు. అంతే ధోని ఫ్రంట్ఫుట్ వచ్చి మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టడంతో రైజింగ్ పుణే జట్టులో సంబరాలు షురూ అయ్యాయి. డ్వేన్ బ్రావో(చెన్నై సూపర్కింగ్స్, 2012) Courtesy: IPL Twitter ఐపీఎల్ చరిత్రలో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపించిన తొలి బ్యాటర్గా డ్వేన్ బ్రావో నిలిచాడు. 2012లో లీగ్ దశలో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో బ్రావో ఈ ఫీట్ను నమోదు చేశాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 19 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరం అయ్యాయి. ధోనితో పాటు బ్రావో క్రీజులో ఉన్నాడు. రజత్ బాటియా వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతికి బ్రావో సింగిల్ తీశాడు. రెండో బంతికి ధోని బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత మూడు బంతుల్లో మూడు పరుగులు మాత్రమే చేయడంతో సీఎస్కేకు ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో బాటియా వేసిన ఫుల్టాస్ డెలివరీని లాంగాన్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ బాదడంతో సీఎస్కే డ్రెస్సింగ్ రూమ్లో సంబరాలు జరుపుకుంది. -
IPL 2021: అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నా: విరాట్ కోహ్లి
Virat Kohli Reveals Why he Decided to Step Down as RCB Captain ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించి అభిమానులను విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. అయితే కెప్టెన్గా ఎందుకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడో కోహ్లి తాజాగా వెల్లడించాడు. నేడు( సోమవారం) కోల్కతా నైట్రైడర్స్తో ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ తలపడనుంది. ఈ క్రమంలో అతడు, డివిలియర్స్తో కలిసి స్టార్ స్పోర్ట్స్ వర్చువల్ ఇంటర్వూలో పాల్గొన్నాడు. తన నిర్ణయం వెనుక పనిభారం అతిపెద్ద కారణమని కోహ్లి పేర్కొన్నాడు. ఇక బాధ్యతల విషయంలో తాను నిజాయతీ లేకుండా వ్యవహరించలేని విరాట్ తెలిపాడు. 'కెప్టెన్గా తప్పుకోవడానకి పనిభారం ప్రధాన కారణం. నా బాధ్యత పట్ల నేను నిజాయితీ లేకుండా వ్యవహరించలేను. నేను దేనినైనా వందకు 120% ఇవ్వలేకపోతే, దానిని పట్టుకొని వేలాడే వ్యక్తిని కాను. ఈ విషయంలో నేను క్లియర్గా ఉంటాను’ అని స్టార్ స్పోర్ట్స్లో మాట్లాడుతున్నప్పుడు కోహ్లి చెప్పాడు. కాగా 2013లో కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కోహ్లి ఆర్సీబీకి టైటిల్ అందించడంలో విఫలమయ్యాడు. ఇక టోర్నీ ఆరంభమైనప్పటి నుంచీ ఇంతవరకు బెంగళూరు ఒక్కసారి కూడా ఛాంపియన్గా నిలవలేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కప్ సాధించి కెప్టెన్గా కోహ్లికి ఘనంగా వీడ్కోలు పలకాలని ఆటగాళ్లు భావిస్తున్నారు. చదవండి: CSK Vs DC: అతడితో 19వ ఓవర్ వేయించాల్సింది.. ఆ నిర్ణయం తప్పు: గంభీర్ Curious to know what prompted @imVkohli to step down from captaincy? 🤔 The #RCB skipper reveals the reason on #InsideRCB: Tomorrow, 8:30 AM & 12 PM | Star Sports 1/1HD/2/2HD pic.twitter.com/rqcIdonx5o — Star Sports (@StarSportsIndia) October 10, 2021 -
CSK Vs DC: చెన్నై అడుగు టైటిల్ వైపు
ఐపీఎల్లో ఇది 14వ సీజన్. ఇందులో రెండు సీజన్లు నిషేధంతో చెన్నై బరిలోకే దిగలేదు. అంటే ఆడింది 12 సీజన్లే కానీ తొమ్మిదోసారి ఫైనల్ చేరింది. చెన్నై మళ్లీ సూపర్ కింగ్స్లా ఆడింది. ఆఖరి దశకు చేరేకొద్దీ శివాలెత్తే చెన్నై ఇప్పుడు కూడా అదే చేసింది. లీగ్ టాపర్ను కొట్టి మరీ తొలి క్వాలిఫయర్తోనే ఫైనల్ చేరింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ గత సీజన్లాగే తొలి క్వాలిఫయర్లో ఓడి ఫైనల్లో బెర్త్ కోసం రెండో క్వాలిఫయర్ ఆడేందుకు సిద్ధమైంది. దుబాయ్: గతేడాది యూఏఈలో చెత్తగా ఆడి లీగ్లోనే నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఈసారి గొప్పగా ఆడి ఫైనల్ చేరింది. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన తొలి క్వాలిఫయర్లో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. పృథ్వీ షా (34 బంతుల్లో 60; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), కెపె్టన్ రిషభ్ పంత్ (35 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి173 పరుగులు చేసి గెలిచింది. రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 70; 5 ఫోర్లు, 2 సిక్స్లు), రాబిన్ ఉతప్ప (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. కెపె్టన్ ధోని (6 బంతుల్లో 18 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో చెన్నైను విజయతీరానికి చేర్చాడు. పృథ్వీ ‘షో’... పృథ్వీ షా దూకుడుతో ఢిల్లీ చకచకా పరుగులు సాధించింది. హాజల్వుడ్ రెండో ఓవర్లో 4, 6 కొట్టిన షా... దీపక్ చహర్ మూడో ఓవర్లో ఏకంగా 4 ఫోర్లు కొట్టాడు. కానీ ధావన్ (7) నిరాశపరిచాడు. మరోవైపు శార్దుల్ వేసిన ఐదో ఓవర్లో పృథ్వీ రెండు కళ్లు చెదిరే సిక్సర్లు బాదాడు. 4.5 ఓవర్లలో జట్టు 50 పరుగులు పూర్తయ్యాయి. ఇందులో పృథ్వీ ఒక్కడివే 42 పరుగులు! తర్వాత ఓవర్లోనే శ్రేయస్ అయ్యర్ (1) చెత్తషాట్ ఆడి రుతురాజ్ చేతికి చిక్కాడు. ఈ రెండు వికెట్లు హాజల్వుడ్కే దక్కాయి. అక్షర్ పటేల్ రాగా... పృథ్వీ 27 బంతుల్లో ఫిఫ్టీ (6 ఫోర్లు, 3 సిక్సర్లు) పూర్తి చేసుకున్నాడు. కాసేపు ఓపిగ్గా ఆడిన అక్షర్ పటేల్ (10) మొయిన్ అలీ బౌలింగ్లో భారీ షాట్కు యతి్నంచి డగౌట్ చేరాడు. 10 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 79/3. ఇంతవరకు బాగానే ఉన్నా తర్వాతి ఓవర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జడేజా పృథ్వీ ‘షో’కు తెరదించాడు. అనంతరం పంత్, హెట్మైర్ (24 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుతో ఢిల్లీ ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఉతప్ప, రుతురాజ్ దూకుడు లక్ష్యఛేదనకు దిగిన చెన్నై తొలి ఓవర్లోనే ఓపెనర్ డుప్లెసిస్ (1) వికెట్ను కోల్పోయింది. నోర్జే అతన్ని బౌల్డ్ చేశాడు. కానీ ఢిల్లీకి ఈ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. మరో ఓపెనర్, సూపర్ ఫామ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్కు జతయిన వెటరన్ రాబిన్ ఉతప్ప చెలరేగాడు. అవేశ్ ఖాన్ వేసిన ఆరో ఓవర్లో ఉతప్ప 6, 4, 0, 6, 4తో 20 పరుగులు పిండు కున్నాడు. పవర్ ప్లేలో చెన్నై 59/1 స్కోరు చేసింది. ఇద్దరు క్రీజులో పాతుకుపోవడంతో ఢిల్లీకి కష్టాలు తప్పలేదు. ఉతప్ప 35 బంతుల్లో అర్ధసెంచరీ (5 ఫోర్లు, 2 సిక్స్లు) పూర్తి చేసుకోగా... చెన్నై 12.1 ఓవర్లలో వంద పరుగులకు చేరుకుంది. 14వ ఓవర్ వేసిన టామ్ కరన్... ఉతప్పను బోల్తా కొట్టించి రెండో వికెట్కు 110 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. అదే ఓవర్లో శార్దుల్ ఠాకూర్ (0)ను డకౌట్ చేశాడు. మరుసటి ఓవర్లో రాయుడు (1) రనౌటయ్యాడు. 15 ఓవర్లకు చెన్నై స్కోరు 121/4. విజయానికి ఆఖరి 30 బంతుల్లో 52 పరుగులు చేయాలి. 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకొన్న రుతురాజ్ జట్టును నడిపించాడు. 12 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన దశలో రుతురాజ్ ఔటవ్వడం చెన్నైని ఆందోళనలో పడేసింది. ఉత్కంఠ పెరిగిన ఈ దశలో ధోని తానే రంగంలోకి దిని లక్ష్యాన్ని పూర్తిచేశాడు. ఆఖరి ఓవర్లో మొయిన్ అలీ (16) ఔటైనా... ఇంకో రెండు బంతులు మిగిలుండగానే ధోని మూడు బౌండరీలతో ముగించాడు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) డుప్లెసిస్ (బి) జడేజా 60; ధావన్ (సి) ధోని (బి) హాజల్వుడ్ 7; శ్రేయస్ (సి) రుతురాజ్ (బి) హాజల్వుడ్ 1; అక్షర్ (సి) సబ్–సాన్ట్నర్ (బి) అలీ 10; పంత్ (నాటౌట్) 51; హెట్మైర్ (సి) జడేజా (బి) బ్రావో 37; టామ్ కరన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–36, 2–50, 3–77, 4–80, 5–163. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–26–0, హాజల్వుడ్ 4–0–29–2, శార్దుల్ 3–0–36–0, జడేజా 3–0–23–1, మొయిన్ అలీ 4–0–27–1, బ్రావో 3–0–31–1. చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) అక్షర్ (బి) అవేశ్ ఖాన్ 70; డుప్లెసిస్ (బి) నోర్జే 1; ఉతప్ప (సి) శ్రేయస్ (బి) టామ్ కరన్ 63; శార్దుల్ (సి) శ్రేయస్ (బి) టామ్ కరన్ 0; రాయుడు (రనౌట్) 1; మొయిన్ అలీ (సి) రబడ (బి) టామ్ కరన్ 16; ధోని (నాటౌట్) 18; జడేజా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–3. 2–113, 3–117, 4–119, 5–149, 6–160. బౌలింగ్: నోర్జే 4–0–31–1, అవేశ్ ఖాన్ 4–0– 47–1, రబడ 3–0–23–0, అక్షర్ 3–0–23–0, టామ్ కరన్ 3.4–0–29–3, అశ్విన్ 2–0–19–0. Pure joy of #Yellove 🥺💛#DCvCSK #WhistlePodupic.twitter.com/3esen8fPyz — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 10, 2021 -
CSK Vs DC Qualifier 1: ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్..ఫైనల్స్కు చేరిన చెన్నై..
ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్..ఫైనల్స్కు చేరిన చెన్నై.. ఐపీఎల్ 2021 తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి చెన్నై ఫైనల్లో అడుగు పెట్టింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఆదిలోనే డుప్లిసిస్ వికెట్ కోల్పోయింది. ఆనంతరం బ్యాటింగ్ వచ్చిన రాబిన్ ఊతప్ప, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరూ కలిసి రెండో వికెట్కి 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి చెన్నై ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఊతప్ప 44 బంతుల్లో 7 ఫోర్లు, 63 పరుగులు చేసి టామ్ కుర్రాన్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. అనంతరం 4పరుగుల వ్యవధిలో చెన్నై మూడు వికెట్లు కోల్పోయింది. టామ్ కరన్ వేసిన 14 ఓవర్లలో ఊతప్ప ,శార్దుల్ ఠాకూర్ పెవిలియన్కు చేరగా, రబాడా బౌలింగ్లో అంబటి రాయుడు రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. 50 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో అక్షర్ పటేల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆవేశ్ ఖాన్ వేసిన 19వ ఓవర్లో మొయిన్ ఆలీ ఓ ఫోర్, ధోనీ ఓ సిక్సర్ బాదడంతో 11 పరుగులు వచ్చాయి. టామ్ కరన్ వేసిన అఖరి ఓవర్లో 13 పరుగుల కావల్సిన సమయంలో తొలి బంతికి మొయిన్ ఆలీ ఔట్ అవ్వగా, వరుసగా 3 ఫోర్లు బాది ధోని చెన్నైను విజయతీరాలకు చేర్చాడు. ధోని కేవలం 6 బంతుల్లో 3ఫోర్లు 1 సిక్స్తో 18 పరుగులు సాధించాడు. అంతక ముందు ఢిల్లీ క్యాపిటల్స్ నీర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ ఆదిలోనే శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. అయినప్పటకీ పృథ్వీ షా ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పృథ్వీ 34 బంతుల్లో 7 ఫోర్లు , 2 సిక్స్లతో 60 పరుగులు సాధించాడు. పృథ్వీ ఔటయ్యాక రిషబ్ పంత్(50), షిమ్రాన్ హెట్మైర్(37) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై బౌలర్లలో జోష్ హాజెల్వుడ్ రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావో చెరో వికెట్ సాధించారు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన చెన్నై.. 4పరుగుల వ్యవధిలో చెన్నై మూడు వికెట్లు కోల్పోయింది. టామ్ కరన్ వేసిన 14 ఓవర్లలో ఊతప్ప ,శార్దుల్ ఠాకూర్ పెవిలియన్కు చేరగా, రబాడా బౌలింగ్లో అంబటి రాయుడు రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. 15 ముగిసే సరికి చెన్నై నాలుగు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రుతురాజ్ గైక్వాడ్(52),మొయిన్ అలీ(1) పరుగులతో ఉన్నారు. కాగా చెన్నై విజయానికి 30 బంతుల్లో 52 పరుగులు కావాలి. రెండో వికెట్ కోల్పోయిన చెన్నై.. ఊతప్ప(63) ఔట్ 113 పరుగుల వద్ద ఊతప్ప రూపంలో చెన్నై రెండో వికెట్ కోల్పోయింది. టామ్ కరన్ బౌలింగ్లో ఊతప్ప(63) శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. నిలకడగా ఆడుతున్న చెన్నై.. 10 ఓవర్లకు 94/1 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై నిలకడగా ఆడుతుంది. ఆదిలోనే డుప్లెసిస్ వికెట్ కోల్పోయినప్పటకీ రాబిన్ ఉతప్ప(51), రుతురాజ్ గైక్వాడ్(43) ఇద్దరూ నిలకడగా ఆడుతూ చెన్నై స్కోర్ బోర్డును చక్కదిద్దారు. 11.3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. చెన్నైకు బిగ్ షాక్.. డు ప్లెసిస్(1) ఔట్ 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ డుప్లెసిస్ కేవలం 1 పరుగుకే నోర్జ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్కు చేరాడు. 2 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాబిన్ ఉతప్ప(10), రుతురాజ్ గైక్వాడ్(3) పరుగులతో ఉన్నారు. Photo Courtesy: IPL మెరిసిన పృథ్వీ షా.. చెన్నై టార్గెట్ 173 ఐపీఎల్ 2021 తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నీర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ ఆదిలోనే శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. అయినప్పటకీ పృథ్వీ షా ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పృథ్వీ 34 బంతుల్లో 7 ఫోర్లు , 2 సిక్స్లతో 60 పరుగులు సాధించాడు. పృథ్వీ ఔటయ్యాక రిషబ్ పంత్(50), షిమ్రాన్ హెట్మైర్(37) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై బౌలర్లలో జోష్ హాజెల్వుడ్ రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావో చెరో వికెట్ సాధించారు. నాలగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీ షా (60) ఔట్ సీఎస్కే జరగుతున్న మ్యాచ్లో అర్ధసెంచరీ సాధించి మంచి ఊపు మీద ఉన్న పృథ్వీ షా వికెట్ను ఢిల్లీ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన పృథ్వీ షా, డు ప్లెసిస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. కాగా పృథ్వీ 34 బంతుల్లో 7 ఫోర్లు , 2 సిక్స్లతో 60 పరుగులు సాధించాడు. 12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్(7), షిమ్రాన్ హెట్మైర్(7) పరుగలుతో ఉన్నారు మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. అక్షర్ పటేల్ (10) ఔట్ 77 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది.మొయిన్ అలీ బౌలింగ్లో అక్షర్ పటేల్ (10), సాంటినర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ..అయ్యర్(1) ఔట్ 51 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ కేవలం (1) పరుగు మాత్రమే చేసి జోష్ హాజెల్వుడ్ బౌలింగ్లో రుతురాజ్ గైక్వాడ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 7 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 60 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పృథ్వీ షా(42), అక్షర్ పటేల్(6) పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Courtesy: IPL తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. ధావన్(7) ఔట్ ఐపీఎల్ 2021 తొలి క్వాలిఫయర్లో భాగంగా సీఎస్కే జరగుతున్న మ్యాచ్లో ఢిల్లీ ధావన్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన ధావన్, హాజెల్వుడ్ బౌలింగ్లో ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. కాగా మరో ఓపెనర్ పృథ్వీ షా బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. కేవలం 17 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 42 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో పృథ్వీ షా(42),శ్రేయస్ అయ్యర్(1) పరుగులతో క్రీజులో ఉన్నారు. Chennai Super Kings & Delhi Qualifier 1 Highlights: ఐపీఎల్ 2021లో భాగంగా తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్తో, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ ఆసక్తికరమైన సమరానికి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వబోతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కి అర్హత సాధించనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్లో రెండు జట్లు ఇప్పటి వరకూ 25 మ్యాచ్ల్లో ముఖాముఖి తలపడ్డాయి. 15మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించగా.. మిగిలిన 10 మ్యాచ్ల్లో ఢిల్లీ గెలిచింది. కాగా ప్రస్తుత సీజన్ లీగ్ దశలో జరిగిన రెండు మ్యాచ్ల్లోను చెన్నైని ఢిల్లీ చిత్తుగా ఓడించింది. తుది జట్లు: చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ధోని (కెప్టెన్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్వుడ్ ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్), టామ్ కరన్, అక్షర్ పటేల్, షిమ్రాన్ హెట్మైర్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అవేశ్ ఖాన్, అన్రిచ్ నోర్జ్ చదవండి: 'ప్లీజ్ అన్న.. ఎస్ఆర్హెచ్లోనే ఉండవా'.. వార్నర్ ఫన్నీ రిప్లై -
'ప్లీజ్ అన్న.. ఎస్ఆర్హెచ్లోనే ఉండవా'.. వార్నర్ ఫన్నీ రిప్లై
ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత డేవిడ్ వార్నర్ ఎస్ఆర్హెచ్కు గుడ్బై చెప్పనున్న సంగతి తెలిసిందే. అధికారికంగా వార్నర్ గుడ్బై చెప్పినట్లు ఎక్కడ వార్తలు రాకపోయినప్పటికీ.. సెకండ్ఫేజ్లో ఎస్ఆర్హెచ్ ఆడిన తొలి రెండు మ్యాచ్లు మినహా మిగతా ఏ మ్యాచ్లోనూ వార్నర్ ఆడలేదు. వార్నర్ స్థానంలో రాయ్ను ఆడించడం.. అతనికి జోడీగా సాహా, అభిషేక్ శర్మలు ఓపెనింగ్ చేశారు. ఈ విషయంతో వార్నర్ ఎస్ఆర్హెచ్కు ఇకపై ఆడడనేది మరింత క్లియర్గా తెలిసొచ్చేలా చేసింది. వచ్చే ఐపీఎల్ మెగా వేలంలో వార్నర్ కచ్చితంగా వేరే టీమ్కు ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చదవండి: నిజంగా గుండె పగిలింది.. కనీసం చివరి మ్యాచ్ అయినా ఆడనివ్వండి! ఇదే సమయంలో ఫ్యాన్స్ మాత్రం డేవిడ్ వార్నర్ను ఎస్ఆర్హెచ్ను వదిలిపెట్టి వెళ్లొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు వార్నర్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. '' వార్నర్ అన్నా.. ఎస్ఆర్హెచ్ వదిలివెళ్లకు.. మీకు మేమున్నాం'' అంటూ కామెంట్ చేశాడు. దీనికి బదులుగా వార్నర్.. కేవలం లాఫింగ్ ఎమోజీని జత చేశాడు. అంతకముందు ఎస్ఆర్హెచ్తో తన బంధం ముగిసిదంటూ వార్నర్ తన ఇన్స్టాగ్రామ్లో ఉద్వేగభరిత పోస్ట్ షేర్ చేశాడు. ''ఇంతకాలం మద్దతుగా నిలిచిన అభిమానులకు థ్యాంక్స్. ఏడేళ్లలో మీరు నాకిచ్చిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. మా జట్టు వంద శాతం ప్రదర్శన చేయడంలో మీరే డ్రైవింగ్ ఫోర్స్ . మీరిచ్చిన సపోర్ట్కు కృతజ్ఞతలు. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరపున నా కెరీర్ అద్భుతంగా సాగింది. నేను-నా కుటుంబం మిమ్మల్ని మిస్ అవుతున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. వార్నర్ ఈ సీజన్లో మొత్తం 8 మ్యాచ్లు ఆడాడు. దాంట్లో 195 రన్స్ చేశాడు. వాటిల్లో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఎస్ఆర్హెచ్ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో వార్నర్ ముందున్నాడు. సన్రైజర్స్ తరపున 95 మ్యాచుల్లో 49.55 సగటుతో 4014 రన్స్ చేశాడు . 2016లో వార్నర్ సారథ్యంలో హైదరాబాద్ జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. చదవండి: T20 World Cup: కచ్చితంగా వార్నరే ఓపెనింగ్ చేస్తాడు: ఫించ్ David Warner: మైదానంలో వార్నర్.. ఏంటన్నా ఇదంతా.. వచ్చే సీజన్లో... -
'ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలనేది ఎన్నో ఏళ్ల కల'
KS Bharart... ఐపీఎల్ లీగ్ చివరి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ జట్టు తరఫున కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు విశాఖ కుర్రాడు శ్రీకర్ భరత్. కోహ్లీతో సహా మరో ఓపెనర్ ఆరుపరుగుల స్కోర్కే పెవిలియన్కు చేరిన దశలో టాప్లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై మరుపురాని ఇన్నింగ్స్తో వికెట్ కీపర్ భరత్ చరిత్రలో నిలిచిపోయాడు. ఈ మ్యాచ్లో భరత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భరత్ షార్జా నుంచి ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడాడు. Courtesy: IPL Twitter ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలని ఎన్నో ఏళ్ల నుంచి కల కంటున్నానని చెప్పాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో చివరి బంతికి ఐదు పరుగులు కావల్సిన స్థితిలో లాంగ్ఆన్ మీదుగా భారీ సిక్సర్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాయల్స్పై 44, ముంబైపై 32, సన్రైజర్స్పై 12 పరుగులు చేసిన భరత్ లీగ్ చివరి మ్యాచ్లో(78నాటౌట్) మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది తానేంటో చూపించి విశాఖ కీర్తిని ఇనుమడింపజేశాడు. నాకవుట్లో 11న నైట్రైడర్స్తో షార్జాలో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడడానికి సిద్ధమవుతున్నాడు. Courtesy: IPL Twitter చదవండి: KS Bharat: కప్ కొట్టి కోహ్లి చేతిలో పెట్టడమే లక్ష్యం Virat Kohli Celebration: సిక్స్తో గెలిపించిన శ్రీకర్ భరత్.. కోహ్లి రచ్చ రచ్చ -
DC vs CSK: ‘ఫైనల్’ వేటలో...
గత రెండేళ్లుగా పురోగతి సాధిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం ఈ సారి టైటిలే! 2019లో ప్లే ఆఫ్స్కు చేరి మూడో స్థానంలో నిలిచిన జట్టు గతేడాది ఫైనల్ వరకు వెళ్లి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇప్పుడూ ఫైనల్ చేరి ఆపై లక్ష్యాన్ని పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు చెన్నై ప్లే ఆఫ్స్ కొత్త కాదు. మూడు సార్లు చాంపియన్. అయితే గతేడాది లీగ్లోనే ని్రష్కమించిన చేదుఅనుభవాన్ని ఈసారి టైటిల్తో చెరిపేయాలని చూస్తోంది. ఈ క్రమంలో మొదటి అడుగు ఫైనల్పై దృష్టి పెట్టింది. దుబాయ్: ముందుగా ప్లే ఆఫ్స్ చేరుకున్న జట్ల మధ్య ముందుగా ఫైనల్ తేల్చుకునే మ్యాచ్ నేడు జరుగనుంది. ఆదివారం తొలి క్వాలిఫయర్లో ఢిల్లీ క్యాపిటల్స్తో చెన్నై సూపర్కింగ్స్ జట్టు తలపడనుంది. లీగ్ దశలో ఢిల్లీనే టాపర్. ఏ జట్టూ గెలవనన్ని మ్యాచ్లు గెలిచింది. క్యాపిటల్స్ జట్టు ఆల్రౌండ్ సత్తాతో దూసుకొచి్చంది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో నేరుగా ఫైనల్కు చేరాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు చెన్నై టాపార్డర్తోనే నెట్టుకొచి్చంది. అనుభవజ్ఞులకు కొదవలేకపోయినా... ఈ సీజన్లో ఆ ప్రభావం కనిపించలేదు. ఇప్పుడు అసలైన సమరం మొదలు కావడంతో తప్పకుండా ధోని సేన సిసలైన ఆటతీరును ప్రదర్శించడం ఖాయం. కాబట్టి చెన్నై కూడా మరో మ్యాచ్ దాకా వేచి చూడకుండా ఈ విజయంతోనే తుది పోరుకు చేరేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరగనుంది. అక్కడ... ఇక్కడ... ఢిల్లీదే పైచేయి ఈ సీజన్లో ఢిల్లీ దూసుకెళ్తోంది. కోచ్ రికీ పాంటింగ్ ప్రణాళికలు గత రెండు సీజన్లుగా మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. నిలకడైన బ్యాటింగ్, కట్టడి చేసే బౌలింగ్ ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తొలి దశ పోటీలు జరిగిన భారత్లో, రెండో అంచె జరుగుతున్న యూఏఈలో చెన్నై సూపర్ కింగ్స్పై క్యాపిటల్స్దే పైచేయి. ముంబైలో చెన్నైని ఓడించిన పంత్ సేన ఇక్కడా అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఓపెనింగ్లో పృథ్వీ షా, శిఖర్ ధావన్ శుభారంభం అందిస్తే... ఆ తర్వాత ఇన్నింగ్స్ను మెరుపు వేగంతో చక్కబెట్టేందుకు కెపె్టన్ పంత్తో పాటు శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. ఆ తర్వాత స్లాగ్ ఓవర్లలో హెట్మైర్, స్టొయినిస్ మెరుపులు జట్టుకు భారీస్కోరును కట్టబెడతాయి. ఇక బౌలింగ్లో రబడ, నోర్జేలిద్దరూ ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు ప్రమాదకరంగా మారారు. కుర్రాడు అవేశ్ ఖాన్ కూడా బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. స్పిన్నర్లలో అనుభవజు్ఞడైన అశ్విన్, అక్షర్ పటేల్లు అవసరమైనపుడు బ్యాట్లతోనూ ఇన్నింగ్స్ను నడిపించడం ఢిల్లీకి అదనపు బలం. ఓపెనర్లపైనే భారం మరోవైపు చెన్నై బ్యాటింగ్ బలంతో ముందడుగేసింది. సింహ భాగం మ్యాచ్ల్లో జట్టు భారమంతా రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ మోశారు. అడపాదడపా రాయుడు, మొయిన్ అలీ మెరిపిస్తున్నాడు. అనుభవజు్ఞడైన సురేశ్ రైనా వైఫల్యం వల్ల రాబిన్ ఉతప్పకు అవకాశమిచ్చారు. అయితే కీలకమైన ఈ మ్యాచ్లో మళ్లీ రైనాను తుది జట్టులోకి తెచ్చే అవకాశాలున్నాయి. ధోని మార్క్ ఇన్నింగ్స్ ఈ సీజన్లో ఇంకా బాకీ ఉంది. ఈ మ్యాచ్లో అతని నుంచి ‘విజిల్ పొడు’చే ఇన్నింగ్స్ ఆవిష్కృతమైతే తప్పకుండా చెన్నై అభిమానులకు పండగే! బ్రావో ‘ఎక్స్ట్రా’ల బౌలింగ్ జట్టును కలవరపెడుతోంది. ముఖ్యంగా ఇటీవలి మ్యాచ్ల్లో బ్రావో ధారాళంగా పరుగులు సమరి్పంచుకోవడంతో పాటు ఎక్స్ట్రాల రూపంలో విరివిగా పరుగులు సమరి్పంచుకుంటున్నాడు. శార్దుల్ ఠాకూర్, హాజల్వుడ్లు ఆరంభ ఓవర్లలో కట్టడి చేయగలిగితే స్పిన్తో జడేజా మాయచేసేందుకు అవకాశముంటుంది. ఢిల్లీ ఎంత బలంగా ఉన్నా... మాజీ చాంపియన్ చెన్నై వీరంగం చేస్తే కష్టాలు తప్పవు. జట్లు (అంచనా) ఢిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్ (కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, హెట్మైర్, రిపాల్ పటేల్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబడ, నోర్జే, అవేశ్ ఖాన్. చెన్నై సూపర్కింగ్స్: ధోని (కెపె్టన్), రుతురాజ్, డుప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప/సురేశ్ రైనా, జడేజా, బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్, హాజల్వుడ్. -
ఐపీఎల్ 2021 సీజన్లో ఎవరి మ్యాచ్లు ఎక్కువగా చూశారంటే..
ముంబై: ఐపీఎల్ 2021 సీజన్లో సీఎస్కే దుమ్మురేపింది. టోర్నీ ముగియకముందే అత్యధిక వీక్షకులను సంపాధించిన జట్టుగా సీఎస్కే చరిత్ర సృష్టించింది. సీఎస్కే తర్వాత ముంబై ఇండియన్స్ మ్యాచ్లను టీవీల్లో జనాలు ఎక్కువగా వీక్షించినట్లు బార్క్ (బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్) తెలిపింది. ఐపీఎల్ 2020 సీజన్లో దారుణ ప్రదర్శనతో నిరాశపరిచిన సీఎస్కే ఈ సీజన్లో దుమ్మురేపడంతో పాటు.. భారీగా వీక్షకులను పెంచుకుంది సీఎస్కే ఆడిన ప్రతీ మ్యాచ్కు కనీసం 2-3 శాతం వీక్షకులు పెరగడం విశేషం. సీఎస్కే ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడులోని చెన్నై మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి సీఎస్కే మ్యాచ్లు ఎక్కువ మంది చూసినట్లు బార్క్ ప్రకటించింది. సీఎస్కే తర్వాతి స్థానంలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. చదవండి: IPL 2021: ఈసారైనా వాళ్లు ట్రోఫీ సాధిస్తే చూడాలని ఉంది! Courtesy: IPL Twtitter కాగా ఐపీఎల్ మ్యాచ్లన్ని స్టార్స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్స్పోర్ట్స్ హిందీతో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లో మ్యాచ్లు ప్రసారమవుతున్నాయి. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 1 మధ్యబార్క్) నివేదిక ప్రకారం స్టార్స్పోర్ట్స్ హిందీ చానెల్ మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఐపీఎల్ 2021 ఫేజ్2 ప్రారంభమైన తర్వాత ఒక వారంలో స్టార్స్పోర్ట్స్ 1 హిందీ చానెల్ మూడోస్థానానికి పరిమితం కావడం ఇదే తొలిసారి. బార్క్ నివేదిక ప్రకారం తొలి రెండు స్థానాల్లో సన్టీవీ, స్టార్ప్లస్ ఉన్నాయి. కాగా ఐపీఎల్ 2020, ఐపీఎల్ 2021 తొలిఫేజ్ మ్యాచ్లు జరిగిన అన్ని వారాలు స్టార్స్పోర్ట్స్ 1 హిందీ చానెల్ తొలి స్థానంలో కొనసాగడం విశేషం. కాగా ఐపీఎల్ సెకండ్ఫేజ్లో తొలివారం దాదాపు 400 మిలియన్ల మంది మ్యాచ్ను వీక్షించినట్లు అధికారులు ప్రకటించారు. ఇక ఐపీఎల్ 14వ సీజన్ తొలిదశలో 35 మ్యాచ్లు ముగిసేసరికి 380 మిలియన్ల మంది వీక్షకులను సంపాదించింది. ఐపీఎల్ 2020 కంటే 12 మిలియన్లు ఎక్కువగా ఉండడం విశేషం. చదవండి: Virat Kohli Celebration: సిక్స్తో గెలిపించిన శ్రీకర్ భరత్.. కోహ్లి రచ్చ రచ్చ -
RCB Vs DC: చివరి బంతికి సిక్సర్తో ఆర్సీబీని గెలిపించిన ఆంధ్ర బ్యాట్స్మెన్!
దుబాయ్: ఒకే ఒక్క ఇన్నింగ్స్తో ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ హీరోగా అవతరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో వైజాగ్కు చెందిన భరత్ సూపర్ షోతో అదరగొట్టాడు. ఆఖరి ఓవర్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయానికి 15 పరుగులు అవసరం కాగా... తొలి మూడు బంతులకు 7 పరుగులు లభించాయి. దాంతో బెంగళూరు విజయ సమీకరణం చివరి మూడు బంతుల్లో 8 పరుగులుగా మారింది. స్ట్రయికింగ్ ఎండ్లో ఉన్న భరత్... అవేశ్ ఖాన్ వేసిన నాలుగో బంతికి పరుగులు రాబట్టలేకపోయాడు. ఐదో బంతికి రెండు పరుగులు సాధించడంతో... ఆఖరి బంతికి 6 పరుగులు అవసరమయ్యాయి. అయితే అవేశ్ ఖాన్ వైడ్ వేయడంతో... బెంగళూరు గెలుపు సమీకరణం చివరి బంతికి ఐదు పరుగులుగా మారింది. ఉత్కంఠ తారస్థాయికి చేరిన ఈ సమయంలో ఎటువంటి ఒత్తిడికి లోనుకాని భరత్ ... లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాది జట్టును గెలిపించాడు. దాంతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీపై బెంగళూరు 7 వికెట్లతో గెలిచి లీగ్ను విజయంతో ముగించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రీకర్ భరత్ (52 బంతుల్లో 78 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు), మ్యాక్స్వెల్ (33 బంతుల్లో 51 నాటౌట్; 8 ఫోర్లు) అజేయమైన నాలుగో వికెట్కు 111 పరుగులు జోడించారు. అంతకుముందు ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా (31 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్లు), శిఖర్ ధావన్ (35 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్లు), హెట్మైర్ (22 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. సిరాజ్ (2/25) ప్రత్యర్థి భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 166 పరుగులు చేసి గెలుపొందింది. సూపర్ ఛేజింగ్... ఛేదనలో బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. పడిక్కల్ (0), కెపె్టన్ కోహ్లి (4) వెంట వెంటనే అవుటవ్వగా... అశలు పెట్టుకున్న డివిలియర్స్ (26 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా నిరాశ పరిచాడు. అయితే ఈ సమయంలో క్రీజులో ఉన్న భరత్, మ్యాక్స్వెల్ జట్టును గెలిపించే బాధ్యతను తీసుకున్నారు. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. అదే సమయంలో ఢిల్లీ పేలవ ఫీల్డింగ్ కూడా బెంగళూరుకు కలిసొచ్చింది. అక్షర్ వేసిన 14వ ఓవర్లో మ్యాక్స్వెల్ ఇచి్చన రెండు సులభమైన క్యాచ్లను శ్రేయస్ అయ్యర్, అశి్వన్ జారవిడిచారు. ఈ క్రమంలో భరత్ 37 బంతుల్లో... మ్యాక్స్వెల్ 32 బంతుల్లో అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. ఇక చివరి ఓవర్లో వీరిద్దరూ చెలరేగడంతో బెంగళూరుకు విజయం ఖాయమైంది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) గార్టన్ (బి) చహల్ 48; ధావన్ (సి) క్రిస్టియాన్ (బి) హర్షల్ పటేల్ 43; పంత్ (సి) భరత్ (బి) క్రిస్టియాన్ 10; శ్రేయస్ అయ్యర్ (సి) క్రిస్టియాన్ (బి) సిరాజ్ 18; హెట్మైర్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 29; రిపల్ పటేల్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–88, 2–101, 3–108, 4–143, 5–164. బౌలింగ్: మ్యాక్స్వెల్ 3–0–29–0, సిరాజ్ 4–0–25–2, గార్టన్ 3–0–20–0, యజువేంద్ర చహల్ 4–0– 34–1, హర్షల్ పటేల్ 4–0–34–1, క్రిస్టియాన్ 2–0–19 –1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) రబడ (బి) నోర్జే 4; దేవదత్ పడిక్కల్ (సి) అశ్విన్ (బి) నోర్జే 0; శ్రీకర్ భరత్ (నాటౌట్) 78; డివిలియర్స్ (సి) శ్రేయస్ అయ్యర్ (బి) అక్షర్ పటేల్ 26; మ్యాక్స్వెల్ (నాటౌట్) 51; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–3, 2–6, 3–55. బౌలింగ్: నోర్జే 4–0–24–2, అవేశ్ ఖాన్ 4–0– 31–0, అక్షర్ పటేల్ 4–0–39–1, కగిసో రబడ 4–0–37–0, అశ్విన్ 1–0–11–0, రిపల్ పటేల్ 3–0–22–0. -
MI Vs SRH: పాపం ముంబై... 235 పరుగులు చేసినా...
‘అంకెలు నన్ను భయపెడుతున్నాయి’... టాస్ సమయంలో రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్య ఇది. 171 పరుగులతో గెలవడం దాదాపు అసాధ్యమనే స్థితిలో అతను ఈ మాట అన్నా... మ్యాచ్ తొలి భాగంలో తాము చేయగలిగిన ప్రయత్నం ముంబై చేసింది. ఇషాన్, సూర్యకుమార్ రెచ్చిపోవడంతో ఏకంగా ఐపీఎల్ చరిత్రలోనే తమ అత్యధిక స్కోరు 235 పరుగులను నమోదు చేసింది. హైదరాబాద్ను 65 లేదా అంతకంటే తక్కువ స్కోరుకు ఆపితే ప్లే ఆఫ్స్ అవకాశం ఉండగా... 5.5 ఓవర్ వద్ద రైజర్స్ 66వ పరుగు తీయడంతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. చివరకు మ్యాచ్లో గెలుపు దక్కగా... సన్రైజర్స్ ఆఖరి స్థానంతో లీగ్ను ముగించింది. అబుదాబి: ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయినా... అద్భుత ఆటతో ముంబై ఇండియన్స్ అభిమానులను అలరించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో ముంబై 42 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 84; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 82; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు. హోల్డర్కు 4 వికెట్లు దక్కగా... నబీ 5 క్యాచ్లు అందుకొని ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఫీల్డర్గా నిలిచాడు. అనంతరం రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసి ఓడిపోయింది. కెపె్టన్ మనీశ్ పాండే (41 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... అభిషేక్ శర్మ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్), జేసన్ రాయ్ (21 బంతుల్లో 34; 6 ఫోర్లు) రాణించారు. ఇషాన్, సూర్య సూపర్... 72 బంతుల్లో (12 ఓవర్లు) ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కలిపి 230.56 స్ట్రయిక్రేట్తో 166 పరుగులు చేయగా, మిగతా ముంబై జట్టు 48 బంతుల్లో (8 ఓవర్లు) 120.83 స్ట్రయిక్రేట్తో 58 పరుగులు చేసింది... ఇదీ వీరిద్దరు ఎంత దూకుడుగా ఆడారో చూపిస్తోంది. కనీసం 250 పరుగులు చేయాలనే లక్ష్యంగా బరిలోకి దిగిన ముంబై దాదాపుగా ఆ స్కోరుకు చేరువగా వచ్చింది. రోహిత్ శర్మ (18)ను మరో ఎండ్లో నిలబెట్టి ఇషాన్ చెలరేగిపోయాడు. తొలి ఓవర్లో సిక్స్తో మొదలు పెట్టిన అతను కౌల్ వేసిన తర్వాతి ఓవర్లో 4 ఫోర్లు కొట్టాడు. నబీ వేసిన మూడో ఓవర్లో మళ్లీ మూడు ఫోర్లు బాదగా... హోల్డర్ ఓవర్లో 3 ఫోర్లు, 1 సిక్స్లతో ముంబై 22 పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో 2021 సీజన్లో వేగవంతమైన అర్ధసెంచరీ (16 బంతుల్లో)ని ఇషాన్ నమోదు చేశాడు. పవర్ప్లే ముగిసేసరికే స్కోరు 83 పరుగులకు చేరింది. ఆ తర్వాత కూడా మరో 3 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టిన ఇషాన్ను ఎట్టకేలకు ఉమ్రాన్ మాలిక్ అవుట్ చేయడంతో రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. అయితే ఆ తర్వాత సూర్యకుమార్ జోరు మొదలైంది. ఏ బౌలర్నూ వదిలి పెట్టకుండా అతను కూడా చెలరేగిపోయాడు. కౌల్ ఓవర్లో మూడు ఫోర్లు బాదడంతో 24 బంతుల్లోనే సూర్య హాఫ్ సెంచరీ కూడా పూర్తయింది. ఇంత విధ్వంసం తర్వాత హోల్డర్ వేసిన చివరి ఓవర్లో ముంబైకి ఐదు పరుగులే వచ్చాయి! రాణించిన పాండే... అనూహ్యంగా ఆసక్తి రేపిన పోరులో ఒక్కసారిగా ముంబై ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలకు తెర పడిన తర్వాత మిగిలింది లాంఛనమే అయిపోయింది. రాయ్, అభిõÙక్ కొన్ని చక్కటి షాట్లతో 32 బంతుల్లోనే 64 పరుగులు జోడించారు. ఆపై రైజర్స్ ఎప్పటిలాగే మిడిలార్డర్లో తమ పేలవ ప్రదర్శనను కొనసాగించింది. ఓపెనర్లు వెంటవెంటనే వెనుదిరగ్గా, మూడు పరుగుల వ్యవధిలో నబీ (3), సమద్ (2) కూడా అవుటయ్యారు. ఈ దశలో పాండే, గార్గ్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్) 36 బంతుల్లోనే 56 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. అయితే రైజర్స్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో మరో ఎండ్లో పాండే పోరాడినా ఫలితం లేకపోయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) నబీ (బి) రషీద్ 18; ఇషాన్ కిషన్ (సి) సాహా (బి) ఉమ్రాన్ 84; హార్దిక్ (సి) రాయ్ (బి) హోల్డర్ 10; పొలార్డ్ (సి) రాయ్ (బి) అభిషేక్ 13; సూర్యకుమార్ (సి) నబీ (బి) హోల్డర్ 82; నీషమ్ (సి) నబీ (బి) అభిõÙక్ 0; కృనాల్ (సి) నబీ (బి) రషీద్ 9; కూల్టర్నైల్ (సి) నబీ (బి) హోల్డర్ 3; చావ్లా (సి) సమద్ (బి) హోల్డర్ 0; బుమ్రా (నాటౌట్) 5; బౌల్ట్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 235. వికెట్ల పతనం: 1–80, 2–113, 3–124, 4–151, 5–151, 6–184, 7–206, 8–230, 9–230. బౌలింగ్: నబీ 3–0–33–0, కౌల్ 4–0–56–0, హోల్డర్ 4–0–52–4, ఉమ్రాన్ 4–0–48–1, రషీద్ 4–0–40–2, అభిõÙక్ 1–0–4–2. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: రాయ్ (సి) కృనాల్ (బి) బౌల్ట్ 34; అభిõÙక్ (సి) కూల్టర్ నైల్ (బి) నీషమ్ 33; పాండే (నాటౌట్) 69; నబీ (సి) పొలార్డ్ (బి) చావ్లా 3; సమద్ (సి) పొలార్డ్ (బి) చావ్లా 2; గార్గ్ (సి) హార్దిక్ (బి) బుమ్రా 29; హోల్డర్ (సి) బౌల్ట్ (బి) కూల్టర్ నైల్ 1; రషీద్ (సి అండ్ బి) బుమ్రా 9; సాహా (సి అండ్ బి) కూల్టర్నైల్ 2; కౌల్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–64, 2–79, 3–97, 4–100, 5–156, 6–166, 7–177, 8–182. బౌలింగ్: బౌల్ట్ 4–0–30–1, బుమ్రా 4–0–39–2, చావ్లా 4–0–38–1, కూల్టర్ నైల్ 4–0–40–2, నీషమ్ 3–0–28–2, కృనాల్ 1–0–16–0. -
RCB Vs SRH: ‘సన్’తోషించాల్సిన విజయం!
అబుదాబి: టోర్నీలో ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయిన తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానుల కోసం ఒక చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 4 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. తక్కువ స్కోరు చేసి కూడా... ఫామ్లో ఉన్న ఆర్సీబీని హైదరాబాద్ నిలువరించడం విశేషం. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (38 బంతుల్లో 44; 5 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ విలియమ్సన్ (29 బంతుల్లో 31; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు సాధించింది. దేవదత్ పడిక్కల్ (52 బంతుల్లో 41; 4 ఫోర్లు), గ్లెన్ మ్యాక్స్వెల్ (25 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. చివరి 2 ఓవర్లలో బెంగళూరు గెలుపు కోసం 18 పరుగులు చేయాల్సి ఉండగా, 19వ ఓవర్లో హోల్డర్ 5 పరుగులే ఇచ్చి కట్టడి చేశాడు. ఆఖరి ఓవర్ వేసిన భువనేశ్వర్... డివిలియర్స్ క్రీజ్లో ఉన్నా సరే, ఒత్తిడిని అధిగమించి 8 పరుగులే ఇవ్వడంతో గెలుపు హైదరాబాద్ సొంతమైంది. ఆఖరి బంతికి సిక్స్ కొట్టాల్సి ఉండగా ఒక పరుగే వచి్చంది. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి అండ్ బి) క్రిస్టియాన్ 44; అభిõÙక్ (సి) మ్యాక్స్వెల్ (బి) గార్టన్ 13; విలియమ్సన్ (బి) హర్షల్ పటేల్ 31; ప్రియమ్ గార్గ్ (సి) డివిలియర్స్ (బి) క్రిస్టియాన్ 15; అబ్దుల్ సమద్ (ఎల్బీ) (బి) చహల్ 1; వృద్ధిమాన్ సాహా (సి) డివిలియర్స్ (బి) హర్షల్ పటేల్ 10; హోల్డర్ (సి) క్రిస్టియాన్ (బి) హర్షల్ పటేల్ 16; రషీద్ ఖాన్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1–14, 2–84, 3–105, 4–107, 5–107, 6–124, 7–141. బౌలింగ్: మొహమ్మద్ సిరాజ్ 3–0–17–0, గార్టన్ 2–0–29–1, షహబాజ్ 4–0–21–0, హర్షల్ పటేల్ 4–0–33–3, యజువేంద్ర చహల్ 4–0–27–1, క్రిస్టియాన్ 3–0–14–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 5; పడిక్కల్ (సి) సమద్ (బి) రషీద్ 41; క్రిస్టియాన్ (సి) విలియమ్సన్ (బి) కౌల్ 1; భరత్ (సి) సాహా (బి) ఉమ్రాన్ 12; మ్యాక్స్వెల్ (రనౌట్) 40; డివిలియర్స్ (నాటౌట్) 19; షహబాజ్ (సి) విలియమ్సన్ (బి) హోల్డర్ 14; గార్టన్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–6, 2–18, 3–38, 4–92, 5–109, 6–128. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–25–1, హోల్డర్ 4–0–27–1, సిద్ధార్థ్ కౌల్ 4–1–24–1, ఉమ్రాన్ మాలిక్ 4–0–21–1, రషీద్ ఖాన్ 4–0–39–1. -
నాలో ఆత్మవిశ్వాసానికి ఆ నలుగురు కారణం: ఇషాన్ కిషన్
షార్జా: ముంబై ఇండియన్స్ యువ సంచలనం ఇషాన్ కిషన్ రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో తిరిగి ఫామ్లోకి వచ్చాడు. 25 బంతుల్లోనే 50 పరుగులు చేసిన ఇషాన్.. 5 ఫోర్లు, 3 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చేలరేగిపోయాడు. ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ముంబై విజయంలో కీలకపాత్ర పోషించింది. వరుసగా విఫలమవుతున్న సందర్భంలో కొన్ని మ్యాచ్ల్లో కిషన్ చోటు కూడా దక్కించుకోలేదు. ఈ క్రమంలో బాధతో కుంగిపోయిన తనలో నలుగురు సీనియర్ ఆటగాళ్లు, మద్దతుగా నిలిచారని అతడు తెలిపాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ లు తనకు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చి తనలో ఆత్మవిశ్వాసం పెంచారని కిషన్ పేర్కొన్నాడు.. "తిరిగి మళ్లీ ఓపెనింగ్కు రావడం, జట్టు కోసం పరుగులు సాధించడం, జట్టు విజయంలో భారీ తేడాతో గెలవడానికి సహాయపడటం సంతోషంగా ఉంది. ఇది నిజంగా ఒక మంచి అనుభూతి. ఇది మా టీమ్ వేగంగా పుంజుకోవడానకి చాలా సహయపడుతుంది. ఏ ఆటలోనైనా క్రీడాకారుడిలో హెచ్చు తగ్గులు సహజం అని నేను భావిస్తున్నాను. నేను కూడా మంచి ఫామ్లో లేను. గత సీజన్లలో లాగా చాలా మంది బ్యాటర్లు పరుగులు చేయలేదు. మాకు గొప్ప సహాయక సిబ్బంది ఉన్నారు. నేను మా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ భాయ్, హార్దిక్ భాయ్తో చాట్ చేసాను .. అందరూ నాకు మద్దతుగా నిలిచారాని "అని మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో ఇషాన్ వెల్లడించాడు. చదవండి: IPL 2021: ఇలా గెలిస్తే ముంబై ఇండియన్స్ లేదంటే కేకేఆర్ -
ముంబై మెరుపు వేగంతో...
డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ‘ప్లే ఆఫ్స్’ ఆశలు నిలబెట్టుకుంది. లీగ్లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో రోహిత్ సేన తమ బలాన్ని ప్రదర్శించి రాజస్తాన్ రాయల్స్ను చిత్తుగా ఓడించి అవకాశం చేజారిపోకుండా కాపాడుకుంది. కూల్టర్ నైల్, నీషమ్ పదునైన బౌలింగ్తో రాయల్స్ను 90 పరుగులకే పరిమితం చేసిన ముంబై, ఇషాన్ కిషన్ జోరుతో మరో 70 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. తాజా ఫలితంతో రాజస్తాన్ ముందంజ వేసే అవకాశాలు ముగియగా... నాలుగో స్థానం కోసం చివరి మ్యాచ్ ఫలితంతో పాటు రన్రేట్ విషయంలో కూడా కోల్కతాతో ముంబై పోటీ పడటం ఖాయమైంది. షార్జా: ముంబై ఇండియన్స్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఐపీఎల్లో భారీ విజయాన్ని అందుకుంది. మంగళవారం జరి గిన మ్యాచ్లో ముంబై 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ను ఓడించింది. ముందుగా రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 90 పరుగులకే పరిమితమైంది. లూయిస్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్)దే టాప్ స్కోర్. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కూల్టర్ నైల్ (4/14), జిమ్మీ నీషమ్ (3/12) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అనంతరం ముంబై 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 94 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో చెలరేగాడు. జయంత్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో 15 పరుగులు రావడం మినహా రాజస్తాన్ ఇన్నింగ్స్ పేలవంగా సాగింది. ముంబై బౌలర్లు కూల్టర్ నైల్, నీషమ్ పదునైన బంతులతో రాయల్స్ పని పట్టారు. యశస్విని అవుట్ చేసి కూల్టర్ నైల్ తొలి వికెట్ అందిం చగా, బుమ్రా బౌలింగ్లో లూయిస్ వికెట్ల ముందు దొరికిపోయాడు. నీషమ్ తన వరుస ఓవర్లలో సామ్సన్ (3), దూబే (3) లను డగౌట్ చేర్చడంతో రాజస్తాన్ కుప్పకూలింది. రన్రేట్ మెరుగుపర్చుకోవడమే లక్ష్యంగా ఛేదనలో దూకుడు కనబర్చిన ముంబై ఫటాఫట్గా ముగించింది. ముస్తఫిజుర్ వేసిన తొలి ఓవర్లోనే ఫోర్, సిక్స్తో 14 పరుగులు రాబట్టిన రోహిత్ తన ఉద్దేశాన్ని ప్రదర్శించాడు. అతడిని సకారియా అవుట్ చేయడంతో రాజస్తాన్కు తొలి వికెట్ దక్కింది. సూర్యకుమార్ (13) మళ్లీ విఫలమయ్యాడు. అయితే ఆ తర్వాత ఇషాన్ కిషన్ జోరు మొదలైంది. కుల్దీప్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన కిషన్... సకారియా ఓవర్లో ఫోర్, 2 భారీ సిక్సర్లు బాదాడు. ముస్తఫిజుర్ వేసిన తర్వాతి ఓవర్ తొలి రెండు బంతుల్లోనూ ఫోర్, సిక్స్ కొట్టి ముంబై విజయాన్ని ఖాయం చేశాడు. స్కోరు వివరాలు: రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: లూయిస్ (ఎల్బీ) (బి) బుమ్రా 24; యశస్వి (సి) ఇషాన్ (బి) కూల్టర్ నైల్ 12; సామ్సన్ (సి) జయంత్ (బి) నీషమ్ 3; దూబే (బి) నీషమ్ 3; ఫిలిప్స్ (బి) కూల్టర్ నైల్ 4; మిల్లర్ (ఎల్బీ) (బి) కూల్టర్ నైల్ 15; తెవాటియా (సి) ఇషాన్ (బి) నీషమ్ 12; గోపాల్ (సి) ఇషాన్ (బి) బుమ్రా 0; సకారియా (బి) కూల్టర్ నైల్ 6; కుల్దీప్ (నాటౌట్) 0; ముస్తఫిజుర్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 3, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 90. వికెట్ల పతనం: 1–27, 2–41, 3–41, 4–48, 5–50, 6–71, 7–74, 8–76, 9–82.బౌలింగ్: బౌల్ట్ 4–0–24–0, జయంత్ 2–0–17–0, బుమ్రా 4–0–14–2, కూల్టర్ నైల్ 4–0–14–4, నీషమ్ 4–0–12–3, పొలార్డ్ 2–0–9–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) యశస్వి (బి) సకారియా 22; ఇషాన్ కిషన్ (నాటౌట్) 50; సూర్యకుమార్ (సి) (సబ్) లోమ్రోర్ (బి) ముస్తఫిజుర్ 13; హార్దిక్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 4; మొత్తం (8.2 ఓవర్లలో 2 వికెట్లకు) 94. వికెట్ల పతనం: 1–23, 2–56. బౌలింగ్: ముస్తఫిజుర్ 2.2–0–32–1, సకారియా 3–1–36–1, గోపాల్ 1–0–9–0, కుల్దీప్ 2–0–16–0. 400 టి20 క్రికెట్లో రోహిత్ శర్మ 400 సిక్స్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రికెటర్గా, ఓవరాల్గా ఏడో ప్లేయర్గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో గేల్ (1042) టాప్ ర్యాంక్లో ఉన్నాడు. -
DC vs CSK: ఢిల్లీ ‘టాప్’ గేర్.. చెన్నైపై విజయం
దుబాయ్: చెన్నై సూపర్కింగ్స్ ఆట చెదిరింది. అగ్ర స్థానం కూడా మారింది. ఇద్దరు సమఉజ్జీల మధ్య జరిగిన తక్కువ స్కోర్ల మ్యాచ్ ఆఖరికొచ్చేసరికి ఉత్కంఠను రేపింది. గతి తప్పిన బౌలింగ్తో చెన్నై మూల్యం చెల్లించుకోగా... ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. అంబటి రాయుడు (43 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ (2/18) చెన్నైని దెబ్బ తీశాడు. అనంతరం ఢిల్లీ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (35 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్లు), హెట్మైర్ (18 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) జట్టును గెలిపించే ఆట ఆడారు. బ్యాటింగ్ వైఫల్యంతో... ఈ మ్యాచ్లో చెన్నై బ్యాటింగ్ నిరాశ పరిచింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (13), డుప్లెసిస్ (10) సహా రాబిన్ ఉతప్ప (19), మొయిన్ అలీ (5) పూర్తిగా నిరాశ పరిచారు. వీళ్లంతా 62 పరుగులకే పెవిలియన్ చేరిపోయారు. చప్పగా సాగిపోతున్న చెన్నై ఇన్నింగ్స్కు రాయుడు పెద్ద దిక్కయ్యాడు. కానీ అవతలి వైపు విశేష అనుభవజ్ఞుడైన కెప్టెన్ ధోని (27 బంతుల్లో 18) కనీసం ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. కష్టంగా 17వ ఓవర్లో చెన్నై స్కోరు వందకు చేరింది. ఢిల్లీ కూడా డీలా సునాయాస లక్ష్యమే అయినా ఢిల్లీ ఆటలేం సాఫీగా సాగలేదు. మూడు బౌండరీలు బాదిన పృథ్వీ షా (12 బంతుల్లో 18) ఎంతో సేపు నిలువలేదు. క్రీజులో నిలిచేందుకు తొలుత ఆపసోపాలు పడిన శిఖర్ ధావన్... ఐదో ఓవర్లో చెలరేగాడు. వరుసగా 6, 4, 4, 6 బాదడంతో ఆ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. ఇన్నింగ్స్కే కాదు... మొత్తం మ్యాచ్కే ఇది హైలైట్. కానీ శ్రేయస్ అయ్యర్ (2), కెప్టెన్ రిషభ్ పంత్ (15), రిపాల్ పటేల్ (18)లను చెన్నై బౌలర్లు తేలిగ్గానే బోల్తా కొట్టించడంతో ఢిల్లీ కూడా డీలాపడింది. అందరిలో బాగా ఆడుతున్న ధావన్ కూడా భారీ షాట్కు యత్నించి డగౌట్ చేరాడు. అశ్విన్ (2), అక్షర్ పటేల్ (5) ఔట్ కావడంతో మ్యాచ్లో ఉత్కంఠ పెరిగింది. గౌతమ్ క్యాచ్ నేలపాలు చేయడంతో బతికిపోయిన హెట్మైర్ మరో పొరపాటు చేయకుండా మ్యాచ్ను గెలిపించాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) అశ్విన్ (బి) నోర్జే 13; డుప్లెసిస్ (సి) శ్రేయస్ (బి) అక్షర్ 10; ఉతప్ప (సి) అండ్ (బి) అశ్విన్ 19; అలీ (సి) శ్రేయస్ (బి) అక్షర్ 5; రాయుడు నాటౌట్ 55; ధోని (సి) పంత్ (బి) అవేశ్ 18; జడేజా నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 136. వికెట్ల పతనం: 1–28, 2–39, 3–59, 4–62, 5–132. బౌలింగ్: నోర్జే 4–0–37–1, అవేశ్ 4–0–35–1, అక్షర్ 4–0–18–2, రబడ 4–0–21–0, అశ్విన్ 4–0–20–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) డుప్లెసిస్ (బి) దీపక్ 18; ధావన్ (సి) అలీ (బి) శార్దుల్ 39; శ్రేయస్ (సి) రుతురాజ్ (బి) హాజల్వుడ్ 2; పంత్ (సి) అలీ (బి) జడేజా 15; రిపాల్ (సి) దీపక్ (బి) జడేజా 18; అశ్విన్ (బి) శార్దుల్ 2; హెట్మైర్ నాటౌట్ 28; అక్షర్ (సి) అలీ (బి) బ్రావో 5; రబడ నాటౌట్ 4; ఎక్స్ట్రాలు 8; మొత్తం (19.4 ఓవర్లలో 7 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–24, 2–51, 3–71, 4–93, 5–98, 6–99, 7–135. బౌలింగ్: దీపక్ 3–0–34–1, హాజల్వుడ్ 4–0–27–1, జడేజా 4–0–28–2, అలీ 3–0–16–0, శార్దుల్ 4–0–13–2, బ్రావో 1.4–0–20–1. -
RCB Vs PBKS: బెంగళూరు బహు బాగు... ‘ప్లే ఆఫ్స్’లోకి!
ఐపీఎల్–2021 రెండో దశ (యూఈఏ)లో తొలి మ్యాచ్లో 92 ఆలౌట్తో చిత్తు... ఆపై తర్వాతి మ్యాచ్లోనూ పరాజయం... పరిస్థితి చూస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పాత జట్టులా మళ్లీ ఓటమి బాటలోకి వెళ్లి నిష్క్రమించేలా కనిపించింది. అయితే ఒక్కసారిగా చెలరేగిన ఆర్సీబీ ‘హ్యాట్రిక్’ విజయాలతో సత్తా చాటింది. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే వరుసగా రెండో సీజన్లో ‘ప్లే ఆఫ్స్’లోకి ప్రవేశించింది. ఉత్కంఠగా సాగిన పోరులో పంజాబ్ కింగ్స్ను ఓడించి కోహ్లి సేన ముందంజ వేసింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎప్పటిలాగే ఒత్తిడికి లోనై చివర్లో విజయం చేజార్చుకున్న కింగ్స్ ఆట ఈ ఏడాదికి ముగిసినట్లే! షార్జా: చెన్నై, ఢిల్లీ తర్వాత మూడో జట్టు బెంగళూరు తమ ప్లే ఆఫ్స్ స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్లెన్ మ్యాక్స్వెల్ (33 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, దేవదత్ పడిక్కల్ (38 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (42 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్సర్లు) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు... కోహ్లి (24 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), పడిక్కల్ మరోసారి బెంగళూరుకు అర్ధ సెంచరీ భాగస్వామ్యం అందించారు. 9 పరుగుల వద్ద కోహ్లిని స్టంపౌట్ చేసే అవకాశం వదిలేసిన రాహుల్... అదే ఓవర్లో పడిక్కల్ ఇచి్చన క్యాచ్ను కూడా వదిలేశాడు. 10 పరుగుల వద్ద సర్ఫరాజ్ క్యాచ్ వదిలేయడంతో కోహ్లి మళ్లీ బతికిపోయాడు. అర్ష్దీప్ ఓవర్లో పడిక్కల్ సిక్స్, ఫోర్ కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి ఆర్సీబీ స్కోరు 55 పరుగులకు చేరింది. కొద్దిసేపటికి హెన్రిక్స్ తన తొలి ఓవర్లోనే కోహ్లిని అవుట్ చేసి ఈ జోడీని విడదీయగా, తర్వాతి బంతికే క్రిస్టియాన్ (0) కూడా అవుటయ్యాడు. హెన్రిక్స్ తన తర్వాతి ఓవర్లోనే పడిక్కల్ను కూడా వెనక్కి పంపించాడు. అయితే ఈ దశలో మ్యాక్స్వెల్ దూకుడైన బ్యాటింగ్ ఆర్సీబీ ఇన్నింగ్స్ను నిలబెట్టింది. హర్ప్రీత్ ఓవర్లో 2 సిక్స్లు కొట్టిన మ్యాక్స్వెల్, ఆ తర్వాత రవి బిష్ణోయ్ ఓవర్లోనూ మరో రెండు సిక్స్లు బాదాడు. ఆ తర్వాత డివిలియర్స్ (18 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్సర్లు) జోరుతో షమీ ఓవర్లో చాలెంజర్స్ 17 పరుగులు రాబట్టింది. 29 బంతుల్లో మ్యాక్స్వెల్ అర్ధసెంచరీ పూర్తయింది. సర్ఫరాజ్ డైరెక్ట్ హిట్తో డివిలియర్స్ రనౌట్ కావడంతో 73 పరుగుల (39 బంతుల్లో) మెరుపు భాగస్వామ్యానికి తెర పడింది. ఓపెనర్లు మినహా... ఓపెనర్ల మధ్య మరో భారీ భాగస్వామ్యం పంజాబ్కు శుభారంభాన్ని అందించినా... చివరకు అది విజయానికి మాత్రం పనికి రాలేదు. రాహుల్, మయాంక్ కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టడంతో ఆరు ఓవర్లో ముగిసేసరికి కింగ్స్ 49 పరుగులు సాధించింది. రాహుల్తో పోలిస్తే మయాంక్ కాస్త ధాటిగా ఆడాడు. క్రిస్టియాన్, చహల్ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన అతను షహబాజ్ బౌలింగ్లో భారీ సిక్స్ బాదాడు. రాహుల్ను షహబాజ్ అవుట్ చేసిన తర్వాత ఒక్కసారిగా పంజాబ్ ఛేదన కష్టంగా మారిపోయింది. స్కోరు వివరాలు ఆర్సీబీ ఇన్నింగ్స్: కోహ్లి (బి) హెన్రిక్స్ 25; పడిక్కల్ (సి) రాహుల్ (బి) హెన్రిక్స్ 40; క్రిస్టియాన్ (సి) సర్ఫరాజ్ (బి) హెన్రిక్స్ 0; మ్యాక్స్వెల్ (సి) సర్ఫరాజ్ (బి) షమీ 57; డివిలియర్స్ (రనౌట్) 23; షహబాజ్ (బి) షమీ 8; శ్రీకర్ భరత్ (నాటౌట్) 0; గార్టన్ (బి) షమీ 0; హర్షల్ పటేల్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–68, 2–68, 3–73, 4–146, 5–157, 6–163, 7–163. బౌలింగ్: మార్క్రమ్ 1–0–5–0, షమీ 4–0–39–3, అర్ష్దీప్ 3–0–42–0, బిష్ణోయ్ 4–0–35–0, హర్ప్రీత్ 4–0–26–0, హెన్రిక్స్ 4–0–12–3. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) హర్షల్ (బి) షహబాజ్ 39; మయాంక్ (సి) సిరాజ్ (బి) చహల్ 57; పూరన్ (సి) పడిక్కల్ (బి) చహల్ 3; మార్క్రమ్ (సి) క్రిస్టియాన్ (బి) గార్టన్ 20; సర్ఫరాజ్ (బి) చహల్ 0; షారుఖ్ (రనౌట్) 16; హెన్రిక్స్ (నాటౌట్) 12; హర్ప్రీత్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–91, 2–99, 3–114, 4–121, 5–127, 6–146. బౌలింగ్: 4–0–33–0, గార్టన్ 4–0–27–1, షహబాజ్ 3–0–29–1, హర్షల్ 4–0–27–0, చహల్ 4–0–29–3, క్రిస్టియాన్ 1–0–11–0. -
ముంబై మళ్లీ ఓడింది
షార్జా: పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్తో గెలుపు బాట పట్టిందనుకున్న ముంబై ఇండియన్స్ మళ్లీ పేలవ ప్రదర్శన కనబర్చింది. శనివారం ఇక్కడ జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రోహిత్ శర్మ బృందం నాలుగు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడింది. ఫలితంగా ఫ్లే ఆఫ్స్కు వెళ్లే అవకాశాలను ముంబై క్లిష్టం చేసుకుంది. తొలుత ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. అవేశ్ ఖాన్ (3/15), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అక్షర్ పటేల్ (3/21) ముంబైని కట్టడి చేశారు. సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించాడు. ఛేదనలో ఢిల్లీ 19.1 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసి గెలుపొందింది. శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు), రవిచంద్రన్ అశి్వన్ (21 బంతుల్లో 20 నాటౌట్; 1 సిక్స్) జట్టుకు విజయాన్ని అందించారు. రిషభ్ పంత్ (22 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయ్యర్ మరోసారి సూపర్ ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ మరోసారి ఢిల్లీని ఆదుకున్నాడు. ఓపెనర్లు ధావన్ (8), పృథ్వీ షా (6), స్మిత్ (9) నిరాశ పరిచారు. ఈ దశలో అయ్యర్, పంత్ జట్టును ఆదుకున్నారు. ఒక ఎండ్ లో అయ్యర్ ఓపికగా ఆడితే... మరో ఎండ్లో పంత్ దూకుడుగా ఆడాడు. అయితే ఐదు ఓవర్ల వ్యవధిలో పంత్, అక్షర్ (9), హెట్మైర్ (15)లను అవుట్ చేసిన ముంబై... ఢిల్లీని ఒత్తిడిలోకి నెట్టింది. అయితే అశ్విన్, అయ్యర్లు జట్టును గెలిపించే బాధ్యతను తీసుకున్నారు. చివరి ఓవర్లో గెలుపునకు నాలుగు పరుగులు అవసరం కాగా... తొలి బంతిని సిక్సర్గా మలిచిన అశి్వన్ మ్యాచ్ను ముగించాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రబడ (బి) అవేశ్ 7; డికాక్ (సి) నోర్జే (బి) అక్షర్ 19; సూర్యకుమార్ (సి) రబడ (బి) అక్షర్ 33; సౌరభ్ తివారీ (సి) పంత్ (బి) అక్షర్ 15; పొలార్డ్ (బి) నోర్జే 6; హార్దిక్ (బి) అవేశ్ 17; కృనాల్ (నాటౌట్) 13; కూల్టర్ నైల్ (బి) అవేశ్ 1; జయంత్ (సి) స్మిత్ (బి) అశ్విన్ 11; బుమ్రా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 129. వికెట్ల పతనం: 1–8, 2–37, 3–68, 4–80, 5–87, 6–109, 7–111, 8–122. బౌలింగ్: నోర్జే 4–1–19–1, అవేశ్ ఖాన్ 4–0–15–3, అశ్విన్ 4–0–41–1, రబడ 4–0– 33–0, అక్షర్ పటేల్ 4–0–21–3. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (ఎల్బీ) (బి) కృనాల్ 6; ధావన్ (రనౌట్) 8; స్మిత్ (బి) కూల్టర్ నైల్ 9; పంత్ (సి) హార్దిక్ (బి) జయంత్ 26; శ్రేయస్ (నాటౌట్) 33; అక్షర్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 9; హెట్మైర్ (సి) రోహిత్ (బి) బుమ్రా 15; అశి్వన్ (నాటౌట్) 20; ఎక్స్ట్రాలు 6; మొత్తం (19.1 ఓవర్లలో 6 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–14, 2–15, 3–30, 4–57, 5–77, 6–93. బౌలింగ్: బౌల్ట్ 4–0–24–1, జయంత్ 4–0–31–1, కృనాల్ 2.1–0–18–1, బుమ్రా 4–0–29–1, కూల్టర్ నైల్ 4–0–19–1, పొలార్డ్ 1–0–9–0. -
రాయల్స్ రాజసం
అబుదాబి: యశస్వీ జైస్వాల్ (21 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్స్లు) ‘పవర్’ గేమ్, శివమ్ దూబే (42 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్ రాజస్తాన్ రాయల్స్ను గెలిపించాయి. ఐపీఎల్లో శనివారం జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్లో రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్కు షాక్ ఇచి్చంది. మొదట బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 101 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) ‘శత’గ్గొడితే... ఆఖర్లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 32 నాటౌట్) చితగ్గొట్టాడు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 17.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసి గెలిచింది. యశస్వీ, దూబే అర్ధసెంచరీలతో చెలరేగారు. వరుసగా నాలుగు విజయాల తర్వాత చెన్నైకిదే తొలి ఓటమి. తాజా గెలుపుతో రాజస్తాన్ ‘ప్లే ఆఫ్స్’ రేసులో సజీవంగా ఉంది. రుతురాజ్ సూపర్ ఇన్నింగ్స్... చెన్నై ఆట రుతురాజ్ బౌండరీతో మొదలైంది. ఆఖరి బంతికి అతడు కొట్టిన సిక్సర్తోనే ఇన్నింగ్స్ ముగిసింది. జట్టు చేసిన 189 పరుగుల్లో అతనొక్కడే వందకొట్టాడు. డుప్లెసిస్ (25; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి తొలి వికెట్కు 47 పరుగులు, మొయిన్ అలీ (17 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్కు 57 పరుగులు జోడించాడు. అతని వేగంతో జట్టు 14వ ఓవర్లో 100 పరుగులు దాటింది. గైక్వాడ్ 43 బంతుల్లో (6 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజా ఆఖర్లో దూకుడుగా ఆడాడు. ఆఖరి బంతిని సిక్సర్గా బాదడంతో రుతురాజ్ 60 బంతుల్లో సెంచరీ సాధించాడు. తొలి బంతి నుంచే... భారీస్కోరు చేశామన్న చెన్నై ధీమా సన్నగిల్లేందుకు ఎంతో సేపు పట్టలేదు. లూయిస్ (12 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్లు)తో కలిసి యశస్వీ జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యేకించి హాజల్వుడ్పై వీరంగమే చేశాడు. అతని రెండు ఓవర్లను (2, 5వ) జైస్వాలే ఆడి... ఆ 12 బంతుల్లో 2, 4, 0, 2, 4, 4, 0, 6, 6, 4, 6, 0 విధ్వంసంతో 38 పరుగులు పిండుకున్నాడు. అలా రాజస్తాన్ నాలుగో ఓవర్లలోనే 50 పరుగులు దాటేయగా... యశస్వీ 19 బంతుల్లోనే (6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీ కొట్టాడు. ఆరో ఓవర్లో లూయిస్ను శార్దుల్ పెవిలియన్ చేర్చా డు. పవర్ ప్లేలో రాయల్స్ 81/1 స్కోరు చేసింది. ఏడో ఓవర్ తొలి బంతికి యశస్వీ విధ్వంసానికి ఆసిఫ్ చెక్ పెట్టాడు. అనంతరం కెప్టెన్ సామ్సన్ (28; 4 ఫోర్లు) , శివమ్ దూబే జట్టును విజయానికి చేరువ చేశారు. దూబే 31 బంతుల్లో (2 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ శతకం చేశాడు. మూడో వికెట్కు ఇద్దరు 89 పరుగులు జోడించారు. సామ్సన్ ఔటైనా... దూబే, గ్లెన్ ఫిలిప్స్ (14 నాటౌట్; ఫోర్, సిక్స్) జట్టును విజయతీరానికి చేర్చారు. స్కోరు వివరాలు చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (నాటౌట్) 101; డుప్లెసిస్ (స్టంప్డ్) సామ్సన్ (బి) తెవాటియా 25; రైనా (సి) దూబే (బి) తెవాటియా 3; అలీ (స్టంప్డ్) సామ్సన్ (బి) తెవాటియా 21; రాయుడు (సి) ఫిలిప్స్ (బి) సకారియా 2; జడేజా (నాటౌట్) 32; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–47, 2–57, 3–114, 4–134. బౌలింగ్: ఆకాశ్ సింగ్ 4–0–39–0, సకారియా 4–0–31–1, ముస్తఫిజుర్ 4–0–51–0, తెవాటియా 4–0–39–3, మార్కండే 3–0–26–0, ఫిలిప్స్ 1–0–3–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: లూయిస్ (సి) హాజల్వుడ్ (బి) శార్దుల్ 27; జైస్వాల్ (సి) ధోని (బి) ఆసిఫ్ 50; సామ్సన్ (సి) గైక్వాడ్ (బి) శార్దుల్ 28; శివమ్ దూబే (నాటౌట్) 64; ఫిలిప్స్ (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు 7; మొత్తం ( 17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–77, 2–81, 3–170. బౌలింగ్: స్యామ్ కరన్ 4–0–55–0, హాజల్వుడ్ 4–0–54–0, శార్దుల్ 4–0–30–2, ఆసిఫ్ 2.1–0–18–1, మొయిన్ అలీ 2.2–0–23–0, జడేజా 1–0–9–0. -
పంజాబ్కో గెలుపు
విజయానికి అత్యంత చేరువగా రావడం... చివరకు ఒత్తిడిలో ఓటమిని ఆహా్వనించడం అలవాటుగా మార్చుకున్న పంజాబ్ జట్టు ఈసారి అలాంటి క్షణాలను అధిగమించి బయటపడింది. ఆఖర్లో కొంత అదృష్టం కూడా కలిసి రావడంతో కింగ్స్ ఖాతాలో ఒక విజయం చేరింది. శుభారంభం లభించినా కోల్కతా నైట్రైడర్స్ సాధారణ స్కోరుకే పరిమితం కాగా... కెపె్టన్ కేఎల్ రాహుల్ ముందుండి పంజాబ్ టీమ్ను నడిపించాడు. అతనికి షారుఖ్ ఇచి్చన సహకారం ప్రీతిజింటా టీమ్లో ఆనందం నింపింది. మరోవైపు పంజాబ్ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారైంది. దుబాయ్: ఐపీఎల్లో ని్రష్కమణకు చేరువగా వచ్చిన దశలో పంజాబ్ కింగ్స్కు కీలక గెలుపు దక్కింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ 5 వికెట్లతో కోల్కతా నైట్రైడర్స్ను ఓడించింది. ముందుగా కోల్కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (49 బంతుల్లో 67; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... రాహుల్ త్రిపాఠి (26 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రాణా (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అర్ష్దీప్ 3 వికెట్లు, రవి బిష్ణోయ్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం పంజాబ్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కేఎల్ రాహుల్ (55 బంతుల్లో 67; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మయాంక్ అగర్వాల్ (27 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. కీలక భాగస్వామ్యం... అలెన్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో వెంకటేశ్ శుభారంభం అందించినా... తర్వాతి ఓవర్లోనే శుబ్మన్ గిల్ (7) బౌల్డ్తో కోల్కతా తొలి వికెట్ కోల్పోయింది. అయితే వెంకటేశ్, త్రిపాఠి రెండో వికెట్ భాగస్వామ్యంతో జట్టు స్కోరు వేగంగా సాగింది. ఎలిస్ వేసిన మూడు ఓవర్లలో వెంకటేశ్ రెండేసి ఫోర్లు కొట్టడం విశేషం. రెండో వికెట్కు 55 బంతుల్లో 72 పరుగులు జోడించిన అనంతరం త్రిపాఠి డగౌట్ చేరాడు. 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంకటేశ్ కొద్ది సేపటికే భారీ షాట్కు ప్రయతి్నంచి అవుటయ్యాడు. మోర్గాన్ (2), దినేశ్ కార్తీక్ (11), సీఫెర్ట్ (2) విఫలం కావడంతో చివర్లో కోల్కతా ఎక్కువ పరుగులు సాధించలేకపోయింది. రాహుల్ అర్ధ సెంచరీ... తాను ఎదుర్కొన్న తొలి బంతికే మోర్గాన్ సులువైన క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన మయాంక్ ఆ తర్వాత దూకుడు ప్రదర్శించాడు. సౌతీ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన అతను నరైన్ ఓవర్లో కూడా మరో సిక్సర్ కొట్టడంతో 6 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 46 పరుగులకు చేరింది. చక్కటి బంతితో మయాంక్కు బోల్తా కొట్టించిన వరుణ్, తన తర్వాతి ఓవర్లోనే పూరన్ (12)ను కూడా అవుట్ చేశాడు. మార్క్రమ్ (18), హుడా (3) ప్రభావం చూపలేకపోయారు. గత మ్యాచ్లలో జట్టు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాహుల్ వేగంగా ఆడకపోయినా చివరి వరకు క్రీజ్లో నిలిచి జట్టును గెలిపించే బాధ్యతను తీసుకున్నాడు. విజయానికి 4 పరుగుల దూరంలో రాహుల్ వెనుదిరిగినా... మిగిలిన పనిని షారుఖ్ ఖాన్ (9 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) పూర్తి చేశాడు. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: వెంకటేశ్ (సి) హుడా (బి) బిష్ణోయ్ 67; గిల్ (బి) అర్ష్దీప్ 7; త్రిపాఠి (సి) హుడా (బి) బిష్ణోయ్ 34; రాణా (సి) మయాంక్ (బి) అర్ష్దీప్ 31; మోర్గాన్ (ఎల్బీ) (బి) షమీ 2; కార్తీక్ (బి) అర్ష్దీప్ 11; సీఫెర్ట్ (రనౌట్) 2; నరైన్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 8, మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–18, 2–90, 3–120, 4–124, 5–149, 6–156, 7–165. బౌలింగ్: అలెన్ 4–0–38–0, షమీ 4–0–23–1, అర్ష్దీప్ 4–0–32–3, ఎలిస్ 4–0–46–0, రవి బిష్ణోయ్ 4–0–22–2. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) మావి (బి) అయ్యర్ 67; మయాంక్ (సి) మోర్గాన్ (బి) వరుణ్ 40; పూరన్ (సి) మావి (బి) వరుణ్ 12; మార్క్రమ్ (సి) గిల్ (బి) నరైన్ 18; హుడా (సి) త్రిపాఠి (బి) మావి 3; షారుఖ్ (నాటౌట్) 22; అలెన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6, మొత్తం (19.3 ఓవర్లలో 5 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–70, 2–84, 3–129, 4–134, 5–162. బౌలింగ్: సౌతీ 4–0–40–0, శివమ్ మావి 4–0–31–1, వరుణ్ 4–0–24–2, నరైన్ 4–0–34–1, వెంకటేశ్ 2.3–0–30–1, రాణా 1–0–7–0. -
CSK Vs SRH: చెన్నై అడుగు పడింది...
గత ఏడాది పేలవ ఆటతో ‘ప్లే ఆఫ్స్’కు దూరం కావడంతో పాటు ఏడో స్థానంతో సరిపెట్టుకున్న మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి సగర్వంగా సత్తా చాటింది. తొమ్మిదో విజయంతో అందరికంటే ముందుగా ముందంజ వేసింది. మరో వైపు తొమ్మిదో ఓటమితో హైదరాబాద్ అధికారికంగా ప్లే ఆఫ్స్కు దూరమైంది. షార్జా: ఒక జట్టుకు తొమ్మిదో విజయం... మరో జట్టుకు తొమ్మిదో పరాజయం... మ్యాచ్ ఫలితం ఒక టీమ్ను ముందుకు పంపిస్తే మరో టీమ్ను నిష్క్ర మించేలా చేసింది. ఈ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్పై గెలిచింది. హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసింది. వృద్ధిమాన్ సాహా (46 బం తుల్లో 44; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఒక్కడే ఫర్వాలేదని పించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోష్ హాజల్వు డ్ (3/24), బ్రావో (2/17) సన్ను కట్టడి చేశారు. చెన్నై 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి గెలిచింది. రుతురాజ్ గైక్వాడ్ (38 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డు ప్లెసిస్ (36 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. సాహా మినహా... గత మ్యాచ్లో గెలుపు రుచి చూసిన హైదరాబాద్ జట్టు...మళ్లీ పరాజయాన్ని ఆహా్వనించింది. చెన్నై సీమర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు నిర్లక్ష్యంగా వికెట్లను సమరి్పంచుకుంది. జేసన్ రాయ్ (2), కెప్టెన్ విలియమ్సన్ (11), ప్రియమ్ గార్గ్ (7)... ఇలా కీలక బ్యాటర్స్ ప్రత్యర్థి జోరుకు తలవంచారు. ఓపెనర్ సాహా ఒక్కడే ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కోగలిగాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో దీపక్ చహర్ వేసిన మూడో ఓవర్లో సాహా రెండు భారీ సిక్సర్లతో అదరగొట్టాడు. కానీ ఆ తర్వాత ఇతర బ్యాటర్స్ చేతులెత్తేయడంతో తను బాధ్యతతో నింపాదిగా ఆడాడు. ఓపెనింగ్ అదిరింది... ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ చెన్నైకి శుభారంభం ఇచ్చారు. భువీ నాలుగో ఓవర్లో రుతురాజ్, డుప్లెసిస్ చెరో సిక్సర్ బాదారు. 6.4 ఓవర్లో జట్టు స్కోరు 50 పరుగులకు చేరుకుంది. పది ఓవర్ల దాకా ఎదురేలేకుండా సాగిన ఈ జోడీని హోల్డర్ 11వ ఓవర్లో విడగొట్టాడు. రుతురాజ్ ఔటవడంతో 75 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం ముగి సింది. రైనా (2)తో పాటు క్రీజులో పాతుకుపోయిన డుప్లెసిస్ను హోల్డర్ ఔట్ చేయడంతో కాస్త ఉత్కం ఠ రేపింది. కానీ రాయుడు (17 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), ధోని (14 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) మరో వికెట్ పడకుండా లక్ష్యాన్ని అందుకున్నారు. ధోని ఆఖరి ఓవర్ నాలుగో బంతిని సిక్సర్గా బాది మ్యాచ్ను ముగించాడు. స్కోరు వివరాలు హైదరాబాద్ ఇన్నింగ్స్: రాయ్ (సి) ధోని (బి) హాజల్వుడ్ 2; సాహా (సి) ధోని (బి) జడేజా 44; విలియమ్సన్ (ఎల్బీ) (బి) బ్రావో 11; గార్గ్ (సి) ధోని (బి) బ్రావో 7; అభిషేక్ (సి) డుప్లెసిస్ (బి) హాజల్వుడ్ 18; సమద్ (సి) అలీ (బి) హాజల్వుడ్ 18; హోల్డర్ (సి) చహర్ (బి) శార్దుల్ 5; రషీద్ ఖాన్ (నాటౌట్) 17; భువనేశ్వర్ (నాటౌ ట్) 2; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 134. వికెట్ల పతనం : 1–23, 2–43, 3–66, 4–74, 5–109, 6–110, 7–117. బౌలింగ్: దీపక్ 4–0–32–0, హాజల్వుడ్ 4–0–24–3, శార్దుల్ 4–0–37–1; బ్రావో 4–0– 17–2, జడేజా 3–0–14–1, అలీ 1–0–5–0. చెన్నై ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) విలియమ్సన్ (బి) హోల్డర్ 45, డుప్లెసిస్ (సి) సిద్ధార్థ్ (బి) హోల్డర్ 41; అలీ (బి) రషీద్ఖాన్ 17; రైనా (ఎల్బీ) (బి) హోల్డర్ 2; రాయుడు (నాటౌట్) 17; ధోని (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు 3; మొత్తం (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–75, 2–103, 3–107, 4–108. బౌలింగ్: సందీప్ 3–0–18–0, భువనేశ్వర్ 4–0–34–0, హోల్డర్ 4–0–27–3, రషీద్ 4–0–27–1, సిద్ధార్థ్ కౌల్ 2.4–0–24–0, అభిõÙక్ శర్మ 2–0–9–0. -
IPL 2021: అదిరిపోయే రికార్డు.. లీగ్ చరిత్రలో అత్యధికం
IPL 2021 Created Wonderful Record In TV Viewership: క్రికెట్ అతి పెద్ద పండుగ అయిన ఐపీఎల్లో వీక్షకుల సంఖ్య సీజన్ సీజన్కు మిలియన్ల సంఖ్యలో పెరుగుతూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వస్తుంది. తాజా సీజన్లో ఈ సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోయి 380 మిలియన్లు దాటింది. ఇది 35వ మ్యాచ్ ముగిసే సమయానికి గతేడాదితో పోలిస్తే.. ఏకంగా 12 మిలియన్లు అధికం. ప్రస్తుత సీజన్లో ప్లే ఆఫ్ బెర్తులు ఇంకా ఖరారు కాక ముందే ఈ స్థాయిలో వీక్షకుల సంఖ్య నమోదు కావడం ఇదే ప్రధమమని, లీగ్ ముగిసే సమయానికి ఇది 500 మిలియన్ల మార్కును దాటుతుందని లీగ్ బ్రాడ్కాస్టర్ ప్టార్ ఇండియా ఆశాభావం వ్యక్తం చేసింది. I am delighted to share that #IPL2021 continues to register significant growth in viewership📈380 million TV viewers (till match 35)12 million more than 2020 at the same stage🙌🏾Thank you, everyone. It will only get more exciting from here on @IPL @StarSportsIndia @BCCI— Jay Shah (@JayShah) September 30, 2021 వీక్షకుల పరంగా అదిరిపోయే రికార్డు సాధించడం పట్ల బీసీసీఐ కార్యదర్శి జై షా సైతం ట్విటర్ వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఐపీఎల్ టీవీ వీక్షకుల సంఖ్య గత నాలుగు సీజన్లుగా 400 మిలియన్ల మార్కును దాటుతుంది. ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఈ ఏడాది తొలి ఐపీఎల్ మ్యాచ్ టీవీ వీక్షకుల పరంగా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మే 1న జరిగిన ఆ మ్యాచ్ను 323 మిలియన్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. చదవండి: కోహ్లిపై ఫిర్యాదు.. విరుచుకుపడిన టీమిండియా ఆటగాడు -
RCB Vs RR: బెంగళూరు మరింత బలంగా...
తొలిసారి చాంపియన్గా నిలవాలని పట్టుదలగా ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. గత మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టును చిత్తు చేసిన ఆర్సీబీ మరో సమష్టి ప్రదర్శనతో కీలక విజయాన్ని అందుకుంది. బౌలింగ్లో చహల్, షహబాజ్ ప్రదర్శనకు తోడు బ్యాటింగ్లో మ్యాక్స్వెల్, కోన శ్రీకర్ భరత్ రాణించడంతో రాజస్తాన్పై అలవోక విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు శుభారంభం అందించినా దానిని కొనసాగించలేకపోయిన రాయల్స్ పేలవ బౌలింగ్తో ఏమాత్రం పోటీనివ్వకుండా తలవంచింది. దుబాయ్: ఐపీఎల్ రెండో దశలో రెండు పరాజయాల తర్వాత కోహ్లి సేనకు వరుసగా రెండో విజయం దక్కింది. బుధవారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ను ఓడించింది. ముందుగా రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. లూయిస్ (37 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, యశస్వి జైస్వాల్ (22 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చహల్ (2/18), హర్షల్ పటేల్ (3/34), షహబాజ్ (2/10) ఆకట్టుకున్నారు. అనంతరం ఆర్సీబీ 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్వెల్ (30 బంతుల్లో 50 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), కోన శ్రీకర్ భరత్ (35 బంతుల్లో 44; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్లు మినహా... తొలి వికెట్కు 49 బంతుల్లోనే 77 పరుగులు... 11 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 100 పరుగులు... బ్యాటింగ్కు చాలా బాగా సహకరిస్తున్న పిచ్! ఇన్ని అనుకూలతలను కూడా రాజస్తాన్ పూర్తిగా ఉపయోగించుకోలేకపోయింది. బెంగళూరు కట్టుదిట్టమైన బౌలింగ్, తమ స్వయంకృతం కలగలిసి రా యల్స్ చివరకు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు మినహా తర్వాతి బ్యాట్స్మెన్ పేలవ షాట్లకు వెనుదిరగడంతో ఇన్నింగ్స్ కుప్పకూలింది. రాణించిన భరత్... ఛేజింగ్లో మోరిస్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి కోహ్లి (20 బంతుల్లో 25; 4 ఫోర్లు) ఛేదనను జోరుగా మొదలు పెట్టాడు. మరో ఎండ్లో కూడా వేగంగా ఆడిన పడిక్కల్ (17 బంతుల్లో 22; 4 ఫోర్లు) ను ముస్తఫిజుర్ అవుట్ చేసి భాగస్వామ్యాన్ని విడదీశాడు. తర్వాతి ఓవ ర్లో కోహ్లి రనౌట్గా వెనుదిరిగాడు. ఈ దశలో ఆంధ్ర క్రికెటర్ భరత్, మ్యాక్స్వెల్ ఇన్నింగ్స్ను నడిపించారు. వీరిద్దరు మూడో వికెట్ కు 55 బంతుల్లో 69 పరుగులు జోడించాక భరత్ వెనుదిరిగాడు. ఈ దశలో బెంగళూరు విజయం కోసం 24 బంతుల్లో 23 పరుగులు కావాల్సి ఉండగా 7 బంతు ల్లోనే ఆట ముగిసింది! మోరి స్ వేసిన 17వ ఓవర్లో మ్యాక్స్ వెల్ (6, 2, 4, 2, 4, 4) 22 పరుగులు రాబట్టగా... పరాగ్ వేసిన తర్వాతి ఓవర్ తొలి బంతిని డివిలియర్స్ (4 నాటౌట్) ఫోర్ బాది గెలిపించాడు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: లూయిస్ (సి) భరత్ (బి) గార్టన్ 58; యశస్వి (సి) సిరాజ్ (బి) క్రిస్టియాన్ 31; సామ్సన్ (సి) పడిక్కల్ (బి) షహబాజ్ 19; లోమ్రోర్ (స్టంప్డ్) భరత్ (బి) చహల్ 3; లివింగ్స్టోన్ (సి) డివిలియర్స్ (బి) చహల్ 6; తెవాటియా (సి) పడిక్కల్ (బి) షహబాజ్ 2; పరాగ్ (సి) కోహ్లి (బి) హర్షల్ 9; మోరిస్ (సి) పడిక్కల్ (బి) హర్షల్ 14; సకారియా (సి) డివిలియర్స్ (బి) హర్షల్ 2; త్యాగి (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 4, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–77, 2–100, 3–113, 4–113, 5–117, 6–127, 7–146, 8–146, 9–149. బౌలింగ్: గార్టన్ 3–0–30–1, సిరాజ్ 3–0–18–0, మ్యాక్స్వెల్ 2–0–17–0, హర్షల్ 4–0–34–3, క్రిస్టియాన్ 2–0–21–1, చహల్ 4–0–18–2, షహబాజ్ 2–0–10–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (రనౌట్) 25; పడిక్కల్ (బి) ముస్తఫిజుర్ 22; భరత్ (సి) (సబ్) రావత్ (బి) ముస్తఫిజుర్ 44; మ్యాక్స్వెల్ (నాటౌట్) 50; డివిలియర్స్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 8; మొత్తం (17.1 ఓవర్లలో 3 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–48, 2–58, 3–127. బౌలింగ్: మోరిస్ 4–0–50–0, త్యాగి 2–0–23–0, సకారియా 3–0–18–0, ముస్తఫిజుర్ 3–0–20–2, తెవాటియా 3–0–23–0, లోమ్రోర్ 2–0–13–0, పరాగ్ 0.1–0–4–0. -
సైబరాబాద్ పరిధి లో భారీ బెట్టింగ్ ముఠా అరెస్ట్
-
MI Vs PBKS: వరుస పరాజయాల తర్వాత.. ముంబై ఎట్టకేలకు...
అబుదాబి: వరుసగా మూడు పరాజయాల తర్వాత యూఏఈ గడ్డపై డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్కు తొలి విజయం దక్కింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలో తడబడినా అనుభవజ్ఞులైన ఆటగాళ్లు రోహిత్ శర్మ బృందాన్ని గెలుపు తీరం దాటించారు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో ముంబై 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మార్క్రమ్ (29 బంతుల్లో 42; 6 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం ముంబై 19 ఓవర్లలో 4 వికెట్లకు 137 పరుగులు సాధించింది. సౌరభ్ తివారి (37 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్లతో జట్టును గెలిపించారు. రాణించిన మార్క్రమ్... 47 బంతుల్లో 61 పరుగులు... ఐదో వికెట్కు మార్క్రమ్, దీపక్ హుడా (26 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్) భాగస్వామ్యమిది. మరీ దూకుడుగా ఆడకపోయినా సరే, వీరిద్దరి ఈ పార్ట్నర్షిప్ లేకపోతే పంజాబ్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండేది. 12 పరుగుల వ్యవధిలో నలుగురు కీలక బ్యాట్స్మెన్ వెనుదిరిగిన జట్టు ఇన్నింగ్స్ను వీరు నిలబెట్టారు. మయాంక్ స్థానంలో జట్టులోకి వచ్చిన మన్దీప్ సింగ్ (15)ను కృనాల్ ఎల్బీగా అవుట్ చేయడంతో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే ఆపై ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పొలార్డ్ పెద్ద దెబ్బ కొట్టాడు. తాను వేసిన ఏకైక ఓవర్లో రెండో బంతికి క్రిస్ గేల్ (1)ను, నాలుగో బంతికి రాహుల్ (22 బంతుల్లో 21; 2 ఫోర్లు)ను అతను వెనక్కి పంపాడు. బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లోనే పూరన్ (2) అవుటయ్యాడు. ఈ దశలో మార్క్రమ్, హుడా మంచి సమన్వయంతో ఆడారు. బౌల్ట్ ఓవర్లో మూడు ఫోర్లతో 15 పరుగులు రాబట్టి జోరు పెంచుతున్న దశలో మార్క్రమ్ను రాహుల్ చహర్ అవుట్ చేయగా, హుడా కూడా చివర్లో ధాటిగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగాడు. మార్క్రమ్ అవుటైన తర్వాత పంజాబ్ జట్టు 28 బంతులు ఆడినా... వాటిలో ఒక్క ఫోర్ కూడా రాలేదు! ఛేదనలో ముంబై కూడా తడబడింది. యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ వరుస బంతుల్లో రోహిత్ శర్మ (8), సూర్యకుమార్ యాదవ్ (0)లను అవుట్ చేసి జట్టును దెబ్బ తీశాడు. అయితే డి కాక్ (29 బంతుల్లో 27; 2 ఫోర్లు), తివారి కలిసి జట్టును నడిపించారు. ముఖ్యంగా తివారి కొన్ని చక్కటి షాట్లతో తన జోరును ప్రదర్శించాడు. డి కాక్ను షమీ అవుట్ చేయడంతో క్రీజ్లోకి వచ్చిన హార్దిక్కు 7 పరుగుల వద్ద లైఫ్ లభించింది. పాయింట్లో అతను ఇచ్చిన క్యాచ్ను హర్ప్రీత్ వదిలేయడంతో బతికిపోయిన హార్దిక్ ఆ తర్వాత పట్టుదలను ప్రదర్శించాడు. తివారి వెనుదిరిగినా పొలార్డ్ (15 నాటౌట్)తో కలిసి హార్దిక్ మ్యాచ్ ముగించాడు. వీరిద్దరు 23 బంతుల్లోనే 45 పరుగులు జత చేశారు. షమీ వేసిన 19వ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్తో హార్దిక్ చెలరేగి జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) బుమ్రా (బి) పొలార్డ్ 21; మన్దీప్ (ఎల్బీ) (బి) కృనాల్ 15; గేల్ (సి) హార్దిక్ (బి) పొలార్డ్ 1; మార్క్రమ్ (బి) చహర్ 42; పూరన్ (ఎల్బీ) (బి) బుమ్రా 2; హుడా (సి) పొలార్డ్ (బి) బుమ్రా 28; హర్ప్రీత్ (నాటౌట్) 14; ఎలిస్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 6, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–36, 2–39, 3–41, 4–48, 5–109, 6–123. బౌలింగ్: కృనాల్ 4–0–24–1, బౌల్ట్ 3–0–30–0, బుమ్రా 4–0–24–2, కూల్టర్ నైల్ 4–0–19–0, పొలార్డ్ 1–0–8–2, చహర్ 4–0–27–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మన్దీప్ (బి) బిష్ణోయ్ 8; డి కాక్ (బి) షమీ 27; సూర్యకుమార్ (బి) బిష్ణోయ్ 0; తివారి (సి) రాహుల్ (బి) ఎలిస్ 45; హార్దిక్ (నాటౌట్) 40; పొలార్డ్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 2, మొత్తం (19 ఓవర్లలో 4 వికెట్లకు) 137 వికెట్ల పతనం: 1–16, 2–16, 3–61, 4–92. బౌలింగ్: మార్క్రమ్ 3–0–18–0, షమీ 4–0–42–1, అర్ష్దీప్ 4–0–29–0, రవి బిష్ణోయ్ 4–0–25–2, ఎలిస్ 3–0–12–1, హర్ప్రీత్ 1–0–11–0. -
పది సెకండ్ల యాడ్కు 18 లక్షలా....!
కోవిడ్-19 దెబ్బకు ఐపీఎల్-14 వాయిదా పడిన విషయం తెలిసిందే. రెండో దఫా ఐపీఎల్-14 యూఎఈలో కొనసాగుతుంది. ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ హక్కులను దక్కించుకున్న స్టార్స్పోర్ట్స్కు యాడ్స్ రూపంలో కనక వర్షం కురుస్తోంది. ఐపీఎల్-14 రెండో దఫా నేపథ్యంలో స్టార్స్పోర్ట్స్ యాడ్ రేట్లను భారీగా పెంచినట్లు తెలుస్తోంది.దసరా, దీపావళి పండుగ సీజన్ల నేపథ్యంలో పలు కంపెనీ బ్రాండ్స్ నుంచి భారీగా డిమాండ్ ఉండటంతో సుమారు 25 శాతం నుంచి 30 శాతం మేర యాడ్స్ రేట్లను పెంచింది. చదవండి: Forgotten Password: పాస్వర్డ్ మరిచిపోవడంతో... పది లక్షల కోట్ల రూపాయలు ఆగం...! విశ్వసనీయ వర్గాల ప్రకారం.. తొలి దఫా ఐపీఎల్లో ఒక యాడ్ పది సెకన్ల పాటు టీవీలో కన్పించేందుగాను సుమారు రూ. 13 నుంచి 14 లక్షలు ఉండగా...ప్రస్తుతం రూ. 18 లక్షలను ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాడ్స్ పెంపుపై స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం స్పందించలేదు. స్టార్స్పోర్ట్స్ను ఇప్పటివరకు 12 బ్రాండ్ కంపెనీలు సంప్రదించారు. సహ-సమర్పణ స్పాన్సర్లుగా... డ్రీమ్ 11, ఫోన్పే, బైజుస్ ఉన్నాయి. అసోసియేట్ స్పాన్సర్లుగా..బింగో, కమలా పసంద్, ఏఎమ్ఏఫ్ఐ, ఏషియన్ పెయింట్స్, క్యాడ్బరీ డైరీ మిల్క్, అమెజాన్ ప్రైమ్, థమ్స్ అప్, గార్నియర్ మెన్, క్రెడ్ కంపెనీలు ఉన్నాయి ఎక్స్చేంజ్4మీడియా నివేదిక ప్రకారం...ఐపీఎల్-14 మొదటి దశలో 10 సెకన్ల యాడ్స్కు సుమారు రూ. 14.1 నుంచి 14.3 లక్షలను స్టార్స్పోర్ట్స్ ఛార్జ్ చేసింది. సహ-ప్రాయోజిత వ్యయం రూ.110-125 కోట్ల పరిధిలో ఉండగా, అసోసియేట్ స్పాన్సర్షిప్ ధర రూ.65-70 కోట్లుగా ఉంది. బ్రాడ్కాస్టర్ సహ-సమర్పించే స్పాన్సర్ల నుంచి 10 సెకన్లకు 13.2 లక్షలు, అసోసియేట్ స్పాన్సర్ల నుంచి 10 సెకన్లకు 13.6 లక్షలను వసూలు చేసింది. చదవండి: iPhone13: ఐఫోన్-13పై చిప్ దెబ్బ..కొన్ని వారాలు ఎదురు చూడాల్సిందేనా? -
మ్యాక్స్వెల్ ‘షో’కు హర్షల్ తోడుగా...
బెంగళూరు మళ్లీ సంబరాల్లో మునిగింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత డీలా పడిన జట్టుకు కొత్త ఉత్సాహాన్నిచ్చే గెలుపు దక్కింది. సీజన్ తొలి మ్యాచ్ తరహాలోనే డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్పై అద్భుత విజయంతో ఆర్సీబీ సత్తా చాటింది. ముందుగా మ్యాక్స్వెల్ మెరుపు బ్యాటింగ్కు తోడు కోహ్లి ఆట జట్టుకు చెప్పుకోదగ్గ స్కోరును అందిస్తే... ఆపై హర్షల్ పటేల్, చహల్ చెలరేగి ముంబైని కుప్పకూల్చారు. బౌలింగ్లోనూ మ్యాక్స్వెల్ రెండు వికెట్లతో ఒక చేయి వేయగా... హర్షల్ ‘హ్యాట్రిక్’ హైలైట్గా నిలిచింది. మరోవైపు యూఏఈకి వచ్చిన తర్వాత ఆడిన మూడు మ్యాచ్లలోనూ ఓడిన ముంబై ఇండియన్స్ లీగ్లో ముందంజ వేసే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. దుబాయ్: విరాట్ కోహ్లి సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 54 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ను చిత్తు చేసింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్వెల్ (37 బంతుల్లో 56; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లి (42 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించగా, ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ముంబై 18.1 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ శర్మ (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. హర్షల్ పటేల్ (4/17) ‘హ్యాట్రిక్’తో చెలరేగగా... చహల్ 3, మ్యాక్స్వెల్ 2 వికెట్లు తీశారు. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్లలోనూ బెంగళూరు గెలవడం విశేషం. మ్యాక్స్వెల్ సూపర్... బౌల్ట్ వేసిన రెండో బంతినే స్క్వేర్ లెగ్ మీదుగా కోహ్లి మెరుపు వేగంతో సిక్స్గా మలచడంతో బెంగళూరు స్కోరు మొదలు కాగా... బుమ్రా తన తొలి ఓవర్లోనే పడిక్కల్ (0)ను అవుట్ చేసి దెబ్బ తీశాడు. అయితే తర్వాతి మూడు భాగస్వామ్యాలు ఆర్సీబీకి చెప్పుకోదగ్గ స్కోరును అందించాయి. మూడో స్థానంలో వచి్చన ఆంధ్ర ఆటగాడు భరత్ మంచి షాట్లతో ఆకట్టుకున్నాడు. బుమ్రా బౌలింగ్లో కవర్స్ దిశగా చూడచక్కటి ఫోర్ కొట్టిన అతను, రాహుల్ చహర్ బౌలింగ్లో రెండు సిక్సర్లు బాదాడు. మరోవైపు కోహ్లి ఇన్నింగ్స్ కూడా జోరుగా సాగింది. బుమ్రా ఓవర్లో వరుసగా 4, 6 బాదిన కెప్టెన్... మిల్నే వేసిన తర్వాతి ఓవర్లో కూడా ఇలాగే వరుసగా 4, 6 కొట్టాడు. 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చహర్ బౌలింగ్లో హార్దిక్ క్యాచ్ వదిలేయడం కూడా విరాట్కు కలిసొచి్చంది. అయితే అదే ఓవర్లో భరత్ను అవుట్ చేసి చహర్ 68 పరుగుల (43 బంతుల్లో) రెండో వికెట్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత వచి్చన మ్యాక్స్వెల్ దూకుడుతో ఒక్కసారిగా ఆర్సీబీ దూసుకుపోయింది. ముఖ్యంగా మ్యాక్సీ ‘స్విచ్ హిట్’లతో ఘనంగా పరుగులు రాబట్టాడు. కృనాల్, చహర్ల బౌలింగ్లో ఈ షాట్తో రెండు భారీ సిక్స్లు కొట్టిన అతను, మిల్నే బౌలింగ్లోనూ దాదాపు ఇదే తరహాలో రివర్స్ స్వీప్తో మరో సిక్స్ కొట్టడం విశేషం! 40 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే కోహ్లి ని్రష్కమించగా, బుమ్రా ఓవర్లో సిక్స్, ఫోర్తో డివిలియర్స్ (11) తన ఉనికిని ప్రదర్శించాడు. మిల్నే ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన మ్యాక్స్వెల్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అయితే మ్యాక్స్వెల్, ఏబీలను వరుస బంతుల్లో బుమ్రా అవుట్ చేశాక చివరి 10 బంతుల్లో ఆర్సీబీ 4 పరుగులే చేయగలిగింది. రోహిత్ మినహా... ఛేదనలో ముంబైకి శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్, డి కాక్ (23 బంతుల్లో 24; 4 ఫోర్లు) ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టారు. జేమీసన్ ఓవర్లో రోహిత్ వరుసగా మూడు ఫోర్లు కొట్టగా, క్రిస్టియాన్ ఓవర్లో డి కాక్ మూడు ఫోర్లు రాబట్టాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరింది. అయితే ఒక్కసారిగా బెంగళూరు బౌలర్లు పుంజుకోవడంతో ముంబై బ్యాటింగ్ తడబడింది. 40 పరుగుల వ్యవధిలో ఆ జట్టు సగం వికెట్లు కోల్పోయింది. చక్కటి బంతితో డి కాక్ను చహల్ బోల్తా కొట్టించగా, భారీ షాట్కు ప్రయతి్నంచిన రోహిత్ బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చాడు. ఇషాన్ (9), కృనాల్ (5) పేలవ షాట్లు ఆడి స్వయంకృతంతో అవుట్ కాగా, సిరాజ్ వేసిన వైడ్ బాల్ను వెంటాడి సూర్యకుమార్ (8) వెనుదిరిగాడు. ఈ దశలో ముంబై కోలుకునే అవకాశమే లేకపోయింది. హార్దిక్ (7), పొలార్డ్ (3) కూడా చేతులెత్తేయడంతో ముంబై ఓటమి లాంఛనమే అయింది. ఒకదశలో వరుసగా 50 బంతుల పాటు ముంబై ఇన్నింగ్స్లో ఒక్క ఫోర్ కూడా లేకపోవడం పరిస్థితిని సూచిస్తోంది! స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) (సబ్) రాయ్ (బి) మిల్నే 51; పడిక్కల్ (సి) డి కాక్ (బి) బుమ్రా 0; భరత్ (సి) సూర్యకుమార్ (బి) చహర్ 32; మ్యాక్స్వెల్ (సి) బౌల్ట్ (బి) బుమ్రా 56; డివిలియర్స్ (సి) డి కాక్ (బి) బుమ్రా 11; క్రిస్టియాన్ (నాటౌట్) 1; షహబాజ్ (బి) బౌల్ట్ 1; జేమీసన్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 11, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–7, 2–75, 3–126, 4–161, 5–161, 6–162. బౌలింగ్: బౌల్ట్ 4–0–17–1, బుమ్రా 4–0–36–3, మిల్నే 4–0–48–1, కృనాల్ 4–0–27–0, రాహుల్ చహర్ 4–0–33–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) పడిక్కల్ (బి) మ్యాక్స్వెల్ 43; డి కాక్ (సి) మ్యాక్స్వెల్ (బి) చహల్ 24; ఇషాన్ (సి) హర్షల్ (బి) చహల్ 9; సూర్యకుమార్ (సి) చహల్ (బి) సిరాజ్ 8; కృనాల్ (బి) మ్యాక్స్వెల్ 5; పొలార్డ్ (బి) హర్షల్ 7; హార్దిక్ (సి) కోహ్లి (బి) హర్షల్ 3; మిల్నే (బి) హర్షల్ 0; చహర్ (ఎల్బీ) (బి) హర్షల్ 0; బుమ్రా (బి) చహల్ 5; బౌల్ట్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7, మొత్తం (18.1 ఓవర్లలో ఆలౌట్) 111. వికెట్ల పతనం: 1–57, 2–79, 3–81, 4–93, 5–97, 6–106, 7–106, 8–106, 9–111, 10–111. బౌలింగ్: జేమీసన్ 2–0–22–0, సిరాజ్ 3–0–15–1, క్రిస్టియాన్ 2–0–21–0, హర్షల్ 3.1–0–17–4, చహల్ 4–1–11–3, మ్యాక్స్వెల్ 4–0–23–2. కోహ్లి @ 10000 విరాట్ కోహ్లి టి20 క్రికెట్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయిని తొలి భారత ఆటగాడిగా, ఓవరాల్గా ఐదో బ్యాట్స్మన్గా (గేల్, పొలార్డ్, షోయబ్ మాలిక్, వార్నర్ తర్వాత) కోహ్లి నిలిచాడు. 314 మ్యాచ్లలో కోహ్లి మొత్తం 10,038 పరుగులు చేశాడు. ఇందులో 3159 అంతర్జాతీయ టి20ల్లో సాధించాడు. హర్షల్ పటేల్ హ్యాట్రిక్ సీజన్ తొలి మ్యాచ్లో ముంబైపైనే 5 వికెట్లతో చెలరేగిన హర్షల్ పటేల్ ఈసారి 4 వికెట్లతో సత్తా చాటాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉండటం విశేషం. 17వఓవర్ తొలి మూడు బంతుల్లో అతను వరుసగా హార్దిక్ పాండ్యా, పొలార్డ్, రాహుల్ చహర్లను అవుట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో మొత్తం 20 హ్యాట్రిక్లు నమోదయ్యాయి. ఈ టోర్నీలో హ్యాట్రిక్ నమోదు చేసిన 17వ బౌలర్గా హర్షల్ పటేల్ నిలిచాడు. అమిత్ మిశ్రా అత్యధికంగా మూడుసార్లు, యువరాజ్ సింగ్ రెండుసార్లు ‘హ్యాట్రిక్’ తీశారు. -
ఐపీఎల్: ఢిల్లీ ధమాకా.. ప్లే ఆఫ్స్కు చేరువ
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నీ తాజా సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కనబరుస్తోంది. రాజస్తాన్ రాయల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ 33 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకొని ప్లే ఆఫ్స్కు చేరువైంది. తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (32 బంతుల్లో 43; 1 ఫోర్, 2 సిక్స్లు) ఆకట్టుకోగా... హెట్మైర్ (16 బంతుల్లో 28; 5 ఫోర్లు), రిషభ్ పంత్ (24 బంతుల్లో 24; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ముస్తఫిజుర్ (2/22), చేతన్ సకారియా (2/33) రాణించారు. ఛేదనలో రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులు చేసి ఓడిపోయింది. కెపె్టన్ సంజూ సామ్సన్ (53 బంతుల్లో 70 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్) జట్టు విజయం కోసం ఒంటరి పోరాటం చేశాడు. అన్రిచ్ నోర్జే 2 వికెట్లు తీశాడు. అయ్యర్ కీలక ఇన్నింగ్స్ టాస్ గెలిచిన రాజస్తాన్ సారథి సామ్సన్ ఢిల్లీని బ్యాటింగ్కు ఆహ్వానించాడు. పిచ్ మందకొడిగా ఉండటంతో పరుగులు సాధించేందుకు ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా (10), శిఖర్ ధావన్ (8; 1 ఫోర్) కష్టపడ్డారు. పృథ్వీ షా స్వేచ్ఛగా షాట్లను ఆడలేకపోయాడు. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో హీరోగా నిలిచిన కార్తీక్ త్యాగి ధావన్ రూపంలో రాజస్తాన్కు తొలి వికెట్ను అందించాడు. మరికాసేపటికే పృథ్వీ షా కూడా పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో క్రీజులో ఉన్న శ్రేయస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. పిచ్కు తగ్గట్టు తన ఆటను మార్చుకున్న అతడు భారీ షాట్ల జోలికి పోకుండా సింగిల్స్, డబుల్స్కు ప్రాధాన్యమిచ్చాడు. మరో ఎండ్లో ఉన్న కెపె్టన్ పంత్ కూడా స్ట్రయిక్ రొటేట్ చేసేందుకే మొగ్గు చూపాడు. కుదురుకున్నాక బ్యాటింగ్ గేర్ మార్చిన శ్రేయస్ అయ్యర్ వరుస ఓవర్లలో రెండు సిక్సర్లు బాది స్కోరు బోర్డును పెంచే ప్రయత్నం చేశాడు. ముస్తఫిజుర్ బౌలింగ్లో వికెట్ల మీదకు ఆడుకున్న పంత్ పెవిలియన్కు చేరాడు. దాంతో 62 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే తెవాటియా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన శ్రేయస్ అయ్యర్ స్టంపౌట్ అయ్యాడు. హెట్మైర్ క్రీజులోకి రాగానే దూకుడు ప్రదర్శించాడు. 15వ ఓవర్లో రెండు ఫోర్లు... 16వ ఓవర్లో మరో మూడు ఫోర్లు బాది ఢిల్లీకి భారీ స్కోరును అందించేలా కనిపించాడు. అయితే ముస్తఫిజుర్ బౌలింగ్లో అతడు అవుటయ్యాడు. అనంతరం ధాటిగా ఆడే బ్యాట్స్మెన్ లేకపోవడంతో ఢిల్లీ 154 పరుగులకు పరిమితమైంది. సామ్సన్ మినహా... ఛేదనలో రాజస్తాన్ జట్టు ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్లు లివింగ్స్టోన్ (1), యశస్వి జైస్వాల్ (5), మిల్లర్ (7) అలా వచ్చి ఇలా వెళ్లారు. దాంతో రాజస్తాన్ 17 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో క్రీజులో ఉన్న సామ్సన్, మహిపాల్ లొమ్రోర్ (24 బంతుల్లో 19; 1 సిక్స్) కాసేపు వికెట్లు పడకుండా అడ్డుకున్నారు. ఈ జోడీని రబడ విడదీశాడు. 15వ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన సామ్సన్ 39 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. మరో ఎండ్ నుంచి సహకారం అందకపోవడం... చేయాల్సిన రన్రేట్ భారీగా పెరగడంతో సామ్సన్ చివరి వరకు నిలిచినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) లివింగ్స్టోన్ (బి) సకారియా 10; ధావన్ (బి) కార్తీక్ త్యాగి 8; శ్రేయస్ అయ్యర్ (స్టంప్డ్) సామ్సన్ (బి) తెవాటియా 43; పంత్ (బి) ముస్తఫిజుర్ 24; హెట్మైర్ (సి) సకారియా (బి) ముస్తఫిజుర్ 28; లలిత్ యాదవ్ (నాటౌట్) 14; అక్షర్ పటేల్ (సి) మిల్లర్ (బి) సకారియా 12; అశి్వన్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–18, 2–21, 3–83, 4–90, 5–121, 6–142. బౌలింగ్: ముస్తఫిజుర్ 4–0–22–2, మహిపాల్ లొమ్రోర్ 1–0–5–0, సకారియా 4–0–33–2, కార్తీక్ త్యాగి 4–0–40–1, షమ్సీ 4–0–34–0, తెవాటియా 3–0–17–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: లివింగ్స్టోన్ (సి) పంత్ (బి) అవేశ్ ఖాన్ 1; జైస్వాల్ (సి) పంత్ (బి) నోర్జే 5; సామ్సన్ (నాటౌట్) 70; మిల్లర్ (స్టంప్డ్) పంత్ (బి) అశి్వన్ 7; మహిపాల్ లొమ్రోర్ (సి) అవేశ్ ఖాన్ (బి) రబడ 19; పరాగ్ (బి) పటేల్ 2; తెవాటియా (సి) హెట్మైర్ (బి) నోర్జే 9; షమ్సీ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 121. వికెట్ల పతనం: 1–6, 2–6, 3–17, 4–48, 5–55, 6–99. బౌలింగ్: అవేశ్ ఖాన్ 4–0–29–1, నోర్జే 4–0–18–2, అశ్విన్ 4–0–20–1, రబడ 4–0–26–1, అక్షర్ పటేల్ 4–0–27–1. -
హోల్డర్ మెరిసినా... సన్రైజర్స్ అవుట్
ఐపీఎల్ సీజన్లో మీది చెత్త జట్టా...లేక మాదా! శనివారం ఒకదశలో పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఆట చూస్తే ఇరు జట్లు ఈ విషయంలో ఒకరితో మరొకరు పోటీ పడినట్లు అనిపించాయి. పట్టికలో చివరి రెండు స్థానాలతో బరిలోకి దిగిన ఈ టీమ్ల పేలవ ఆటతో మూడొంతుల మ్యాచ్ చప్పగా సాగింది. అయితే జేసన్ హోల్డర్ బ్యాటింగ్ సీన్ను ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చేసింది. రైజర్స్ విజయం కోసం 42 బంతుల్లో 66 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన హోల్డర్ సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. తనొక్కడే 29 బంతుల్లో 47 పరుగులు చేసి విజయానికి చేరువగా తెచి్చనా గెలుపు గీత దాటించలేకపోయాడు. ఉత్కంఠ క్షణాలను దాటి చివరకు పంజాబ్ ఊపిరి పీల్చుకోగా... హైదరాబాద్ జట్టు అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి ని్రష్కమించింది. షార్జా: గత మ్యాచ్లో అనూహ్యంగా ఓడిన పంజాబ్ కింగ్స్ ఈసారి 125 పరుగుల స్కోరును కూడా కాపాడుకోగలిగింది. సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో సన్ విజయానికి 17 పరుగులు అవసరం కాగా, 11 పరుగులే వచ్చాయి. ఆఖరి బంతికి 7 పరుగులు కావాల్సి ఉండగా... ఐపీఎల్లో అరంగేట్రం చేసిన పేసర్ ఎలిస్ సింగిల్ మాత్రమే ఇచ్చాడు. ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. మార్క్రమ్ (32 బంతుల్లో 27; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, హోల్డర్ (3/19) ప్రత్యరి్థని కట్టడి చేశాడు. అనంతరం సన్రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులే చేయగలిగింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జేసన్ హోల్డర్ (29 బంతుల్లో 47 నాటౌట్; 5 సిక్సర్లు) చెలరేగగా, వృద్ధిమాన్ సాహా (37 బంతుల్లో 31; 1 ఫోర్) రాణించాడు. రవి బిష్ణోయ్కు 3 వికెట్లు దక్కాయి. హోల్డర్ బ్యాటింగ్ను మినహాయిస్తే సన్ మొత్తం ఇన్నింగ్స్లో రెండంటే రెండే ఫోర్లు ఉన్నాయి! గేల్ విఫలం... పంజాబ్ ఇన్నింగ్స్లో ఏ దశలోనూ దూకుడు కనిపించలేదు. నెమ్మదిగా ఉన్న పిచ్పై షాట్లు ఆడటం కొంత ఇబ్బందిగా ఉండటంతో పాటు హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగులు రావడం కష్టంగా మారిపోయింది. టాప్–4లో ఒక్కరి స్ట్రయిక్రేట్ కూడా వందకంటే ఎక్కువగా లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్లు రాహుల్ (21 బంతుల్లో 21; 3 ఫోర్లు), మయాంక్ (5) తొలి నాలుగు ఓవర్లలో 26 పరుగులు జోడించగలిగారు. అయితే ఐదో ఓవర్ వేసిన హోల్డర్ మ్యాచ్ను సన్రైజర్స్ వైపు తిప్పాడు. తొలి బంతికి, ఐదో బంతికి అతను ఓపెనర్లను అవుట్ చేశాడు. ఆ తర్వాత ఒక్క బ్యాట్స్మన్ కూడా కింగ్స్కు కావాల్సిన పరుగులు అందించలేకపోయాడు. గత మ్యాచ్లో అవకాశం దక్కని క్రిస్ గేల్ (17 బంతుల్లో 14; 1 ఫోర్) ఈసారి తుది జట్టులోకి వచి్చనా అతని బ్యాటింగ్లో జోరు కనిపించలేదు. రషీద్ తొలి ఓవర్లోనే అతను వికెట్ల ముందు దొరికిపోగా, రివ్యూ చేసినా ఫలితం లేకపోయింది. 3 పరుగుల వద్ద వార్నర్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన మార్క్రమ్ ఎక్కువ సేపు క్రీజ్లో నిలిచినా ఆ ‘లైఫ్’ వల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదు. కీలకమైన నాలుగు ఓవర్లలో (16–19) పంజాబ్ కనీసం ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయింది! చివరకు భువనేశ్వర్ వేసిన ఆఖరి ఓవర్లో ఒక ఫోర్, ఒక సిక్స్తో మొత్తం 14 పరుగులు రావడంతో స్కోరు 120 దాటింది. టపటపా... సన్రైజర్స్ బ్యాట్స్మెన్ కూడా పేలవ ప్రదర్శనలో పంజాబ్తో పోటీ పడ్డారు. ఆ జట్టు ఛేదన కూడా పేలవంగా ప్రారంభమైంది. షమీ దెబ్బకు జట్టు 10 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే వార్నర్ (2) అవుట్ కాగా, మూడో ఓవర్లో విలియమ్సన్ (1) వికెట్లపైకి ఆడుకున్నాడు. ఆరు ఓవర్లు ముగిసేసరికి జట్టు ఒకే ఒక ఫోర్తో 20 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో సన్రైజర్స్ జట్టుకు ‘పవర్ప్లే’లో ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం! మనీశ్ పాండే (13), కేదార్ జాదవ్ (12) మళ్లీ విఫలమై జట్టును కష్టాల్లో పడేశారు. ఒక ఎండ్లో నిలబడి సాహా పట్టుదలగా ఆడినా, చివర్లో హోల్డర్ ప్రదర్శనతో ఆశలు రేగినా...ఇవి హైదరాబాద్కు విజయాన్ని అందించలేకపోయాయి. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) (సబ్) సుచిత్ (బి) హోల్డర్ 21; మయాంక్ (సి) విలియమ్సన్ (బి) హోల్డర్ 5; గేల్ (ఎల్బీ) (బి) రషీద్ 14; మార్క్రమ్ (సి) పాండే (బి) సమద్ 27; పూరన్ (సి అండ్ బి) సందీప్ 8; హుడా (సి) (సబ్) సుచిత్ (బి) హోల్డర్ 13; హర్ప్రీత్ (నాటౌట్) 18; ఎలిస్ (సి) పాండే (బి) భువనేశ్వర్ 12; షమీ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–26, 2–27, 3–57, 4–66, 5–88, 6–96, 7–118. బౌలింగ్: సందీప్ 4–0–20–1, భువనేశ్వర్ 4–0–34–1, హోల్డర్ 4–0–19–3, ఖలీల్ 3–0–22–0, రషీద్ ఖాన్ 4–0–17–1, సమద్ 1–0–9–1. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) రాహుల్ (బి) షమీ 2; సాహా (రనౌట్) 31; విలియమ్సన్ (బి) షమీ 1; పాండే (బి) బిష్ణోయ్ 13; జాదవ్ (బి) బిష్ణోయ్ 12; సమద్ (సి) గేల్ (బి) బిష్ణోయ్ 1; హోల్డర్ (నాటౌట్) 47; రషీద్ ఖాన్ (సి అండ్ బి) అర్‡్షదీప్ 3; భువనేశ్వర్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 120. వికెట్ల పతనం: 1–2, 2–10, 3–32, 4–56, 5–60, 6–92, 7–105. బౌలింగ్: షమీ 4–1–14–2, అర్‡్షదీప్ 4–0–22–1, ఎలిస్ 4–0–32–0, హర్ప్రీత్ 4–0–25–0, రవి బిష్ణోయ్ 4–0–24–3. -
గర్జించిన చెన్నై.. పాయింట్ల పట్టికలో టాప్ గేర్లోకి
షార్జా: యూఏఈ గడ్డపై చెన్నై సూపర్కింగ్స్ గర్జిస్తోంది. ఇక్కడ వరుసగా రెండో మ్యాచ్లోనూ గెలుపొందడంతో ధోని సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై 6 వికెట్లతో బెంగళూరుపై నెగ్గింది. తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. దేవ్దత్ పడిక్కల్ (50 బంతుల్లో 70; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ కోహ్లి (41 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో మెరిపించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డ్వేన్ బ్రావో (3/24) బెంగళూరును దెబ్బతీశాడు. తర్వాత లక్ష్యఛేదనలో చెన్నై 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 157 పరుగులు చేసి గెలిచింది. రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), అంబటి రాయుడు (22 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఓపెనింగ్ సూపర్హిట్ గత మ్యాచ్లో బెంగళూరు అంతకలిపి వందలోపే ఆలౌటైంది. కానీ ఈ మ్యాచ్లో వంద పరుగుల్లోపు ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ఓపెనర్లు కోహ్లి, దేవ్దత్ పడిక్కల్ కసిదీరా ఆడారు. అదును చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. అదుపు తప్పిన బంతిని సిక్సర్గా బాదారు. దీపక్ చహర్ తొలి ఓవర్లో మొదటి రెండు బంతుల్ని కోహ్లి ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్లో మూడో ఫోర్ను పడిక్కల్ బాదాడు. బౌలర్ మారితే వీరి బ్యాటింగ్ జోరూ మారింది. హేజల్వుడ్ బౌలింగ్లో పడిక్కల్, శార్దుల్ ఓవర్లో కోహ్లి సిక్స్లు కొట్టారు. పవర్ ప్లేలో 55/0 స్కోరు చేసిన బెంగళూరు 11.1 ఓవర్లోనే వందకు చేరింది. ఎట్టకేలకు 14వ ఓవర్లో బ్రావో... కోహ్లిని ఔట్ చేసి ఈ దూకుడుకు అడ్డుకట్ట వేశాడు. ఇక్కడి నుంచి బెంగళూరు ఆట గతి తప్పింది. 17వ ఓవర్ వేసిన శార్దుల్ వరుస బంతుల్లో డివిలియర్స్ (12)ను, పడిక్కల్ను పెవిలియన్ చేర్చాడు. లక్ష్యఛేదనకు దీటుగా... చెన్నై ఓపెనర్లు రుతురాజ్, డుప్లెసిస్ (26 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్లు) లక్ష్యఛేదనకు దీటుగా పరుగులు పేర్చుకుంటూ పోయారు. హసరంగ వేసిన నాలుగో ఓవర్లో రుతురాజ్ 4, 6తో వేగం పెంచాడు. సైనీ ఆరో ఓవర్లో డు ప్లెసిస్ ఒక సిక్స్, రెండు ఫోర్లతో చెలరేగిపోయాడు. దీంతో సగటున ఓవర్కు 8 పరుగుల రన్రేట్తో సూపర్కింగ్స్ ఇన్నింగ్స్ సాగిపోయింది. జట్టు స్కోరు 71 పరుగుల వద్ద రుతురాజ్ను ఔట్ చేసిన చహల్... ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. కాసేపటికే మ్యాక్స్వెల్... డు ప్లెసిస్ను ఔట్ చేశాడు. ఈ దశలో రాయుడు, మొయిన్ అలీ (18 బంతుల్లో 23; 2 సిక్స్లు)తో కలిసి బాధ్యతను పంచుకోవడంతో చెన్నై లక్ష్యం చేరేందుకు పెద్దగా ఇబ్బంది పడలేదు. ఈ ఇద్దరూ ఔటయినా... మిగిలిన లాంఛనాన్ని ధోని (11 నాటౌట్; 2 ఫోర్లు) రైనా (17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) పూర్తి చేశారు. ఐపీఎల్లో సింగపూర్ క్రికెటర్... టి20 స్పెషలిస్టు, హార్డ్ హిట్ట ర్గా పేరొందిన సింగపూర్ బ్యాట్స్మన్ టిమ్ డేవిడ్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగాడు. జేమీసన్ స్థానంలో అతను తుది జట్టులోకి వచ్చాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) జడేజా (బి) బ్రావో 53; పడిక్కల్ (సి) రాయుడు (బి) శార్దుల్ 70; డివిలియర్స్ (సి) రైనా (బి) ఠాకూర్ 12; మ్యాక్స్వెల్ (సి) జడేజా (బి) బ్రావో 11; డేవిడ్ (సి) రైనా (బి) చహర్ 1; హర్షల్ (సి) రైనా (బి) బ్రావో 3; హసరంగ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–111, 2–140, 3–140, 4–150, 5–154, 6–156. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–35–1, హేజల్వుడ్ 4–0–34–0, శార్దుల్ ఠాకూర్ 4–0–29–2, రవీంద్ర జడేజా 4–0–31–0, డ్వేన్ బ్రావో 4–0–24–3. చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) కోహ్లి (బి) చహల్ 38; డు ప్లెసిస్ (సి) సైనీ (బి) మ్యాక్స్వెల్ 31; మొయిన్ అలీ (సి) కోహ్లి (బి) హర్షల్ 23; రాయుడు (సి) డివిలియర్స్ (బి) హర్షల్ 32; రైనా (నాటౌట్) 17; ధోని (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 5; మొత్తం (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–71, 2–71, 3–118, 4–133. బౌలింగ్: సిరాజ్ 3–0–23–0, సైనీ 2–0–25–0, హసరంగ 4–0–40–0, హర్షల్ పటేల్ 3.1–0–25–2, చహల్ 4–0–26–1, మ్యాక్స్వెల్ 2–0–17–1. ఐపీఎల్లో నేడు డ్వేన్ బ్రావో -
RCB Vs CSK: ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో సీఎస్కే విజయం
ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో సీఎస్కే విజయం ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 18.1 ఓవర్లలో చేధించింది. సీఎస్కే ఓపెనర్స్ రుతురాజ్ గైక్వాడ్(38), డుప్లెసిస్ (31) పరుగులతో రాణించి రన్రేట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. వీరిద్దరు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ(23), అంబటి రాయుడు(32) ఇన్నింగ్స్ను నిర్మించారు. చివర్లో వీరిద్దరు ఔటైన మిగతాపనిని రైనా(16), ధోని(11) పూర్తి చేశారు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 2, చహల్, మ్యాక్స్వెల్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో సీఎస్కే 9 మ్యాచ్ల్లో 7 విజయాలు.. రెండు ఓటములతో 14 పాయింట్ల సాధించి టేబుల్ టాపర్గా నిలవగా.. ఆర్సీబీ 9 మ్యాచ్ల్లో 5 విజయాలు.. నాలుగు ఓటములతో 10 పాయింట్లతో మూడో స్థానంలోనే ఉంది. అంతకముందు ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లు కోహ్లి(53, 41 బంతులు; 6 ఫోర్లు, 1 సిక్సర్), పడిక్కల్(70, 50 బంతులు; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) శుభారంభం అందించినప్పటికి తర్వాత వచ్చిన బ్యాట్స్మన్ పూర్తిగా విఫలం కావడంతో ఆర్సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కాగా కోహ్లి, పడిక్కల్ మధ్య 111 పరుగుల భాగస్వామ్యం నమోదు కావడం విశేషం. ఇక సీఎస్కే బౌలర్లలో బ్రావో 3, శార్దూల్ ఠాకూర్ 2, దీపక్ చహర్ 1 వికెట్ తీశాడు. రాయుడు ఔట్.. సీఎస్కే 133/4 157 పరుగుల లక్ష్య చేధనలో సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. ఉన్నంతసేపు చక్కని షాట్లతో అలరించిన రాయుడు(32, 3 ఫోర్లు, 1 సిక్స్) హర్షల్ పటేల్ బౌలింగ్లో డివిలియర్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే 16 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. రైనా 5, ధోని 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. 9 ఓవర్లలో 71/2 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే రెండు వికెట్లు కోల్పోయింది. మొదట 38 పరుగులు చేసిన రుతురాజ్ చహల్ బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ డుప్లెసిస్ 31 పరుగుల వద్ద మ్యాక్స్వెల్ బౌలింగ్లో నవదీప్ సైనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. మొయిన్ అలీ 9, అంబటి రాయుడు 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. నాలుగు ఓవర్లలో సీఎస్కే 35/0 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసింది. రుతురాజ్ 16, డుప్లెసిస్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఆర్సీబీ 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. సీఎస్కే టార్గెట్ 157 పరుగులు సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లు కోహ్లి(53, 41 బంతులు; 6 ఫోర్లు, 1 సిక్సర్), పడిక్కల్(70, 50 బంతులు; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) శుభారంభం అందించినప్పటికి తర్వాత వచ్చిన బ్యాట్స్మన్ పూర్తిగా విఫలం కావడంతో ఆర్సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కాగా కోహ్లి, పడిక్కల్ మధ్య 111 పరుగుల భాగస్వామ్యం నమోదు కావడం విశేషం. ఇక సీఎస్కే బౌలర్లలో బ్రావో 3, శార్దూల్ ఠాకూర్ 2, దీపక్ చహర్ 1 వికెట్ తీశాడు. వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ దూకుడు మీద బెంగళూరు వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. శార్ధల్ ఠాకుర్ వరుస బంతుల్లో డివిలియర్స్ (12) పడిక్కల్(70) పెవిలియన్కు పంపాడు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ ..కోహ్లి(53) ఔట్ 112 పరుగుల వద్ద బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. బ్రావో బౌలింగ్లో మంచి ఊపు మీద ఉన్న కెప్టెన్ కోహ్లి(53) జడేజా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆర్సీబీ 14 ఓవర్లో ఒక వికెట్ నష్టానికి 114 పరుగులు చేసింది. పడిక్కల్ (54) డివిలియర్స్ (2) పరుగులతో క్రీజులో ఉన్నారు. కోహ్లి సూపర్ ఫిప్టి ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆకాశమే హద్దుగా ఆర్ధసెంచరీతో చేలరేగాడు. కేవలం 38 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 53 పరుగులు సాధించాడు. ఆర్సీబీ 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 111 పరుగులు చేసింది. కోహ్లి 53, పడిక్కల్ 555పరుగులతో క్రీజులో ఉన్నారు పడిక్కల్ ఆర్ధసెంచరీ ఆర్సీబీ ఓపెనర్ ఆర్ధసెంచరీతో చెలరేగాడు. కేవలం 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లుతో 52 పరుగులు సాధించాడు. ఆర్సీబీ 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 104 పరుగులు చేసింది. కోహ్లి 47, పడిక్కల్ 54పరుగులతో క్రీజులో ఉన్నారు Photo Courtesy: IPL కోహ్లి జోరు.. ఏడు ఓవర్లలో 61/0 ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి దూకుడుగా ఆడుతున్నాడు. ఆరంభం నుంచి కోహ్లి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. అతనికి మరో ఓపెనర్ పడిక్కల్ చక్కగా సహకరిస్తున్నాడు. పవర్ ప్లే ముగిసిన అనంతరం ఆర్సీబీ ఏడు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. కోహ్లి 34, పడిక్కల్ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆర్సీబీ ఓపెనర్ల జోరు.. 4 ఓవర్లలో 36/0 ఆర్సీబీ తన ఇన్నింగ్స్ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్లు కోహ్లి, పడిక్కల్లు బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ స్కోరు బోర్డును పరిగెత్తిస్తున్నారు. ప్రస్తుతం 4 ఓవర్ల ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. కోహ్లి 19, పడిక్కల్ 17 పరుగులతో క్రీజులో ఉన్నా 3 ఓవర్లలో ఆర్సీబీ స్కోర్ 18/0 సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ ఇన్నింగ్స్ను నిలకడగా ఆరంభించింది. 2 ఓవర్ల ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి13, దేవదత్ పడిక్కల్ 5 పరుగులతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL షార్జా: ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న సీఎస్కే, ఆర్సీబీ తలపడనున్నాయి. టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. ఇక తొలి అంచె పోటీల్లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సీఎస్కే పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 191 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆర్సీబీ 122 పరుగులకే పరిమితమై 69 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కాగా ఆ మ్యాచ్లో రవీంద్ర జడేజా వన్మ్యాన్ షోతో అలరించాడు. ముందు బ్యాటింగ్లో 28 బంతుల్లోనే 62 పరుగులు.. ఆ తర్వాత బౌలింగ్లో 13 పరుగులకే 3 వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ముఖాముఖి పోరులో ఇరు జట్లు 27 సార్లు తలపడ్డాయి. వీటిలో 17 సార్లు సీఎస్కే విజయం సాధించగా.. 9 మ్యాచ్ల్లో ఆర్సీబీ విజయాలు దక్కించుకుంది. గత ఐదు మ్యాచ్లు పరిశీలిస్తే.. ఆర్సీబీ 2.. సీఎస్కే మూడు విజయాలు సాధించింది. ఇక రెండో అంచె పోటీల్లో ముంబైతో జరిగిన మ్యాచ్లో సీఎస్కే విజయం సాధించి జోష్లో ఉంది. మ్యాచ్లో తక్కువ స్కోరు నమోదు చేసినప్పటికీ బౌలర్ల సాయంతో మ్యాచ్ను కాపాడుకుంది. ఇక కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ మాత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 94 పరుగులకే ఆర్సీబీ ఆలౌట్ కాగా.. కేకేఆర్ 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. సీఎస్కే జట్టు: ఎంఎస్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్వుడ్ ఆర్సీబీ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్, టిమ్ డేవిడ్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, యజ్వేంద్ర చాహల్ -
పొలార్డ్కే దమ్కీ ఇద్దామనుకున్నాడు.. తర్వాతి ఓవర్ చూసుకుంటా
Kieron Pollard Vs Prasidh Krishna.. టి20 అంటేనే క్షణాల్లో మారిపోయే ఆట.. కసిగా కొట్టాలని బ్యాటర్ భావిస్తే.. పరుగులు ఇవ్వకూడదని బౌలర్ అనుకుంటాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో ముంబై ఇండియన్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్, ప్రసిధ్ కృష్ణ మధ్య కొన్ని సెకన్ల పాటు మాటల యుద్దం చోటుచేసుకుంది. ప్రసిధ్ కృష్ణ పొలార్డ్కు దమ్కీ ఇద్దామని భావించాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ చివరి బంతిని ఆఫ్స్టంప్ మీదుగా విసిరాడు. బంతిని డిఫెన్స్ చేద్దామనే ప్రయత్నంలో పొలార్డ్ ప్రసిధ్ వైపు కొట్టాడు. అయితే బంతిని అందుకున్న ప్రసిధ్ పొలార్డ్ వైపు విసురుదామనుకొన్నాడు కానీ బంతి చేజారింది. చదవండి: IPL 2021: కేకేఆర్కు భారీ షాక్.. కెప్టెన్తో పాటు ఆటగాళ్లకు కూడా భారీ జరిమానా అంతే పొలార్డ్ కోపంగా ప్రసిధ్ కృష్ణ వైపు చూస్తూ తర్వాతి ఓవర్లో చూసుకుంటా.. అంటూ బ్యాట్ను కొడుతూ కౌంటర్ ఇచ్చాడు. మళ్లీ 18వ ఓవర్లో బౌలింగ్కు వచ్చిన ప్రసిధ్కు పొలార్డ్ తన పవరేంటో చూపించాడు. వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. ఈ దెబ్బకు ప్రసిధ్కు దిమ్మతిరిగి మూడు వైడ్స్, ఒక నో బాల్ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్లో కేకేఆర్ ముంబైపై ఘన విజయాన్ని సాధించింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 15.1 ఓవర్లలోనే చేధించింది. వెంకటేశ్ అయ్యర్(53), రాహుల్ త్రిపాఠి(74 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా.. ముంబై మరో ఓటమితో ఆరో స్థానానికి చేరుకుంది. చదవండి: Aakash Chopra: నీకు స్పీడ్ ఎక్కువైంది.. చలాన్లు పడుతాయేమో చూసుకో pic.twitter.com/XU63FEDu8G — pant shirt fc (@pant_fc) September 23, 2021 -
IPL 2021: కోల్కతా ఫటాఫట్.. ముంబైపై ఘన విజయం
అబుదాబి: యూఏఈ గడ్డపై గత రెండు రోజులు చప్పగా సాగిన మ్యాచ్లకు, బోర్ కొట్టిన ప్రేక్షకులకు చక్కటి మెరుపు విందు కోల్కతా నైట్రైడర్స్ ఇచ్చింది. సిక్సర్లు, ఫోర్లతో 150 పైచిలుకు లక్ష్యాన్ని 15.1 ఓవర్లలోనే ముగించేసింది. ఐపీఎల్లో గురువారం జరిగిన పోరులో కోల్కతా 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (42 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధసెంచరీ సాధించాడు. ఫెర్గూసన్, ప్రసిధ్ కృష్ణ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కోల్కతా నైట్రైడర్స్ 15.1 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసి గెలిచింది. రాహుల్ త్రిపాఠి (42 బంతుల్లో 74 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్లు), వెంకటేశ్ అయ్యర్ (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగారు. కోల్కతా కోల్పోయిన మూడు వికెట్లు బుమ్రాకే దక్కాయి. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠిలకు కాకుండా రోహిత్ శర్మ వికెట్ తీసిన స్పిన్నర్ సునీల్ నరైన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కడం గమనార్హం. ఓపెనింగ్ అదిరినా... కోల్కతా జట్టు పార్ట్టైమ్ ఆఫ్ స్పిన్నర్ నితీశ్ రాణాతో తొలి ఓవర్ వేయించి ఆశ్చర్యపరిచింది. ముంబైకి ఓపెనింగ్ జోడీ ఇచ్చిన శుభారంభం... వంద స్కోరు దాకా 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన వైనం చూస్తే... భారీ స్కోరు తథ్యమనిపించింది. కానీ 150 పరుగుల పైచిలుకు పరుగులతోనే సర్దుకుంది. ఓపెనర్లలో ముందుగా అదరగొట్టింది రోహిత్ శర్మే. బౌండరీలతో స్కోరు వేగాన్ని పెంచాడు. కాసేపటికే డికాక్ ఈ వేగానికి సిక్సర్లతో మెరుపుల్ని జతచేశాడు. ఫెర్గూసన్ బౌలింగ్లో ఒకటి, ప్రసిధ్ కృష్ణ ఓవర్లో రెండు సిక్సర్లు బాదేయడంతో పవర్ ప్లేలో ముంబై 56/0 స్కోరు చేసింది. తర్వాత రసెల్ను బౌలింగ్కు దించినా డికాక్ వరుస బౌండరీలతో తన జోరు చూపాడు. కానీ తర్వాతి పదో ఓవర్లో నరైన్... రోహిత్ శర్మ (30 బంతుల్లో 33; 4 ఫోర్లు)ను ఔట్ చేసి 78 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరదించాడు. సూర్యకుమార్ (5)ను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో డికాక్ క్రీజులో ఉన్నా... ఇషాన్ కిషన్ (14; 1 సిక్స్) లాంటి హిట్టర్ జతయినా ముంబై స్కోరు మందగించింది. డికాక్ 37 బంతుల్లో ఫిఫ్టీ (3 ఫోర్లు, 3 సిక్స్లు) పూర్తి చేసుకున్న కాసేపటికే పెవిలియన్ బాటపట్టాడు. పొలార్డ్ (15 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్), కృనాల్ (12) వారి శైలికి తగ్గట్లు ధాటిగా ఆడలేకపోయారు. సిక్సర్లతో షురూ... ఆట మొదలైందో లేదో చకచకా బాదేసే పనిలో పడ్డారు కోల్కతా ఓపెనర్లు. బౌల్ట్ లాంటి మేటి బౌలర్ వేసిన తొలి ఓవర్ రెండో బంతిని శుబ్మన్ గిల్ (13), నాలుగో బంతిని వెంకటేశ్ అయ్యర్ సిక్సర్లుగా బాదారు. తర్వాత మిల్నేకు 6, 4, 4లతో అయ్యర్ తన తడాఖా చూపెట్టాడు. 2 ఓవర్లకే నైట్రైడర్స్ స్కోరు 30/0. బుమ్రా వేసిన మూడో ఓవర్లో ఇద్దరు చెరో బౌండరీ కొట్టారు. కానీ బుమ్రా... గిల్ను బోల్తా కొట్టించాడు. తొలి 3 ఓవర్లలోనే 40 పరుగులు రావడంతో తర్వాత కాస్త నింపాదిగా ఆడినాసరే జట్టు రన్రేట్ లక్ష్యాన్ని కరిగించే వరకు పది పరుగులకు దిగనేలేదు. అయ్యర్ తన ధాటిని కొనసాగించాడు. రాహుల్ త్రిపాఠి ముందు జాగ్రత్త పడ్డాడు... తర్వాత ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో ఇన్నింగ్స్ పదో ఓవర్లో జట్టు స్కోరు 100 దాటింది. 11వ ఓవర్లో అయ్యర్ 25 బంతుల్లో (4 ఫోర్లు, 3 సిక్స్లు), 12వ ఓవర్లో త్రిపాఠి 29 బంతుల్లో (5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీలను ధనాధన్గా అధిగమించారు. అయ్యర్ ఔటైనా త్రిపాఠి నిలబడి మిగతా లాంఛనాన్ని 15.1 ఓవర్లలోనే పూర్తి చేశాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) శుబ్మన్ గిల్ (బి) నరైన్ 33; డికాక్ (సి) నరైన్ (బి) ప్రసిధ్ కృష్ణ 55; సూర్యకుమార్ (సి) దినేశ్ కార్తీక్ (బి) ప్రసిధ్ కృష్న 5; ఇషాన్ కిషన్ (సి) రసెల్ (బి) ఫెర్గూసన్ 14; పొలార్డ్ (రనౌట్) 21; కృనాల్ (సి) వెంకటేశ్ (బి) ఫెర్గూసన్ 12; సౌరభ్ తివారీ (నాటౌట్) 5; మిల్నే (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–78, 2–89, 3–106, 4–119, 5–149, 6–149. బౌలింగ్: నితీశ్ రాణా 1–0–5–0, వరుణ్ చక్రవర్తి 4–0–22–0, సునీల్ నరైన్ 4–0–20–1, ఫెర్గూసన్ 4–0–27–2, ప్రసిధ్ కృష్ణ 4–0–43–2, రసెల్ 3–0–37–0. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: శుబ్మన్ గిల్ (బి) బుమ్రా 13; వెంకటేశ్ అయ్యర్ (బి) బుమ్రా 53; రాహుల్ త్రిపాఠి (నాటౌట్) 74; మోర్గాన్ (సి) బౌల్ట్ (బి) బుమ్రా 7; నితీశ్ రాణా (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 7; మొత్తం (15.1 ఓవర్లలో 3 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–40, 2–128, 3–147. బౌలింగ్: బౌల్ట్ 2–0–23–0, మిల్నే 3–0–29–0, బుమ్రా 4–0–43–3, కృనాల్ 3–0–25–0, రాహుల్ చహర్ 3–0–34–0, రోహిత్ శర్మ 0.1–0–4–0. -
పంజాబ్ ఆటగాడిపై మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానం.. బీసీసీఐ సీరియస్
-
IPL 2021: సన్రైజర్స్ అవుట్!
హైదరాబాద్ ఆట ఈ సీజన్లో అందరికంటే ముందుగా ఇంటి బాట పట్టే విధంగా తయారైంది. ఇప్పటిదాకా ఒక్కటే గెలిచిన జట్టు ఏకంగా ఏడింట ఓడి దాదాపుగా లీగ్ నుంచి ని్రష్కమించినట్లే! మరో వైపు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం సాధించి మళ్లీ అగ్రస్థానానికి చేరింది. బౌలింగ్లో నోర్జే, రబడా బ్యాటింగ్లో ధావన్, అయ్యర్ రాణించి జట్టును గెలిపించారు. దుబాయ్: తీరు మార్చుకోని సన్రైజర్స్ ఐపీఎల్లో ఇక ముందుకు వెళ్లే అవకాశం లేదు. దేశం మారినా ఈ ఫ్రాంచైజీ దశ మారట్లేదు. ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితిలోనూ ఆ తీవ్రత కనబర్చలేకపోయింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట సన్రైజర్స్ హైదరాబాద్ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అబ్దుల్ సమద్ (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... మిగతా బ్యాట్స్మెన్ను ఢిల్లీ బౌలర్లు తేలిగ్గానే కట్టడి చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నోర్జే (2/12) కీలక వికెట్లను పడగొట్టగా, రబడాకు 3 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి గెలిచింది. శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు), ధావన్ (37 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్), పంత్ (21 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. వార్నర్ డకౌట్ హైదరాబాద్ ఆట ఆరంభించగానే పరుగుకు ముందే కష్టాలెదురొచ్చాయి. వార్నర్ (0) డకౌటయ్యాడు. నోర్జే బంతిని అంచనా వేయలేకపోయిన వార్నర్... అక్షర్ పటేల్కు సులువైన క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. కెపె్టన్ విలియమ్సన్ (18; 1 ఫోర్) వచ్చీ రాగానే బౌండరీ బాదాడు. అప్పటికే రెండు ఫోర్లు కొట్టిన ఓపెనర్ సాహా (17 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్) రబడా బౌలింగ్కు దిగితే భారీ సిక్సర్తో స్వాగతం పలికాడు. కానీ అదే ఓవర్ చివరి బంతికే ఔటయ్యాడు. తర్వాత మెరుపుల్లేని ఆట పేలవంగా సాగిపోయింది. రిషభ్ పంత్, పృథ్వీ షా క్యాచ్లు జారవిడవడంతో రెండు సార్లు లైఫ్లు పొందినా కెప్టెన్ విలియమ్సన్ ఎక్కువసేపు నిలువలేకపోయాడు. మనీశ్ పాండే (17; 1 ఫోర్), కేదార్ జాదవ్ (3)లు జట్టును గట్టెక్కించలేకపోయారు. దీంతో 90 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో అబ్దుల్ సమద్ ఇన్నింగ్స్లో అందరికంటే ఎక్కువగా చేసిన పరుగులు, రషీద్ ఖాన్ (19 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆడిన తీరుతో సన్రైజర్స్ పరువు నిలిచే స్కోరు చేయగలిగింది. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. ధావన్ పరిచిన బాటలో... కష్టసాధ్యం కాని లక్ష్యఛేదనకు ఓపెనర్ శిఖర్ ధావన్ చక్కని బాట వేశాడు. పృథ్వీ షా (11) విఫలమైనా... శ్రేయస్ అయ్యర్తో కలిసి రెండో వికెట్కు 52 పరుగులు జోడించాడు. శిఖర్ ఔటయ్యాక మిగతా బాధ్యతల్ని అయ్యర్, కెపె్టన్ రిషభ్ పంత్ పంచుకున్నారు. అజేయంగానే మిగిలిపోయిన లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఈ క్రమంలో భువనేశ్వర్ వేసిన 16వ ఓవర్లో, ఖలీల్ 17వ ఓవర్లో రిషభ్ పంత్ చూడచక్కని సిక్సర్లతో అలరించాడు. హోల్డర్ 18వ ఓవర్లో భారీ సిక్సర్తో శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ను ముగించాడు. అబేధ్యమైన మూడో వికెట్కు పంత్, అయ్యర్ 67 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) అక్షర్ (బి) నోర్జే 0; సాహా (సి) ధావన్ (బి) రబడా 18; విలియమ్సన్ (సి) హెట్మైర్ (బి) అక్షర్ 18; పాండే (సి) అండ్ (బి) రబడా 17; కేదార్ (ఎల్బీ) (బి) నోర్జే 3, సమద్ (సి) పంత్ (బి) రబడా 28; హోల్డర్ (సి) పృథ్వీ షా (బి) అక్షర్ 10; రషీద్ఖాన్ రనౌట్ 22; భువనేశ్వర్ నాటౌట్ 5; సందీప్ రనౌట్ 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 134. వికెట్ల పతనం: 1–0, 2–29, 3–60, 4–61, 5–74, 6–90, 7–115, 8–133, 9–134. బౌలింగ్: నోర్జే 4–0–12–2, అవేశ్ఖాన్ 4–0–27–0, అక్షర్ పటేల్ 4–0–21–2, రబడా 4–0–37–3, స్టొయినిస్ 1.1–0–8–0, అశ్విన్ 2.5–0–22–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) విలియమ్సన్ (బి) అహ్మద్ 11; ధావన్ (సి) అబ్దుల్ సమద్ (బి) రషీద్ ఖాన్ 42; శ్రేయస్ అయ్యర్ నాటౌట్ 47; పంత్ నాటౌట్ 35; ఎక్స్ట్రాలు 4; మొత్తం (17.5 ఓవర్లలో 2 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–20, 2–72. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–33–1, భువనేశ్వర్ 3–0–21–0, హోల్డర్ 3.5–0–33–0, రషీద్ ఖాన్ 4–0–26–1, సందీప్ శర్మ 3–0–26–0. ఐపీఎల్లో నేడు ముంబై X కోల్కతా వేదిక: అబుదాబి; రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
మ్యాచ్ విజయం.. షర్ట్ లేకుండా డ్యాన్స్ చేసిన ఆటగాళ్లు
PBKS Winning Moment.. ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్లో భాగంగా పంజాబ్ కింగ్స్పై రాజస్తాన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ విజయంలో కార్తిక్ త్యాగి పాత్ర మరువలేనిది. ఆఖరి ఓవర్లో పంజాబ్కు నాలుగు పరుగులు అవసరమైన దశలో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆర్ఆర్ మ్యాచ్ గెలవడంతో డ్రెస్సింగ్ రూమ్లో సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా మ్యాచ్ హీరో కార్తిక్ త్యాగి, బౌలర్ చేతన్ సకారియాలు షర్ట్ లేకుండా డ్యాన్స్లు చేస్తూ రచ్చ చేశారు. వీరికి యశస్వి జైశ్వాల్ తోడవ్వడంతో మరింత కళ వచ్చి చేరింది. దీనికి సంబంధించిన వీడియోను రాజస్తాన్ యాజమాన్యం ట్విటర్లో షేర్ చేసింది. ఈ విజయం డ్రెస్సింగ్ రూమ్లో సంతోషాన్ని నింపింది. హల్లాబోల్.. రాయల్స్ ఫ్యామిలీ అంటూ ఆర్ఆర్ ట్వీట్ చేసింది. Courtesy: IPL Twitter చదవండి: Kartik Tyagi: ఆఖరి ఓవర్ బౌలింగ్ చేయడం అంత సులువు కాదు.. కానీ కార్తిక్ 'ఒక మ్యాచ్ గెలిచామంటే సంబరాలు చేసుకోవడం సాధారణం. అయితే అద్భుత మ్యాచ్లు అప్పుడప్పుడే జరుగుతుంటాయి. కానీ కార్తిక్ త్యాగి అసాధారణ ప్రతిభతో మ్యాచ్ను గెలిపించాడు. ఇది అతని సొంతం' అంటూ పంజాబ్ కింగ్స్ డైరెక్టర్ కుమార్ సంగక్కర తెలిపాడు. 📹 Straight from a 𝓱𝓪𝓹𝓹𝔂 dressing room. 💗#HallaBol | #RoyalsFamily | #IPL2021 pic.twitter.com/gNxggS8BA1 — Rajasthan Royals (@rajasthanroyals) September 22, 2021 -
ఆఖరి ఓవర్ బౌలింగ్ చేయడం అంత సులువు కాదు.. కానీ కార్తిక్
Irfan Pathan Lauds Kartik Tyagi.. ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ కార్తిక్ త్యాగి హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆఖరి ఓవర్లో పంజాబ్కు నాలుగు పరుగులు అవసరమైన దశలో కార్తిక్ త్యాగి అద్భుతంగా బౌలింగ్ చేసి నికోలస్ పూరన్, దీపక్ హుడా వికెట్లు తీసి రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ సందర్భంగా కార్తిక్ త్యాగిపై అన్ని వైపుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్పాన్ పఠాన్ కూడా కార్తిక్ త్యాగిపై ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. 'కార్తిక్ త్యాగి ఒక యంగ్స్టర్.. ఎలాంటి అనుభవం లేని ఆటగాడు. ఒక అన్క్యాప్ ప్లేయర్ ఇలాంటి ప్రదర్శన కనబరచడం సంతోషం కలిగించింది. ఆఖరి ఓవర్లో ప్రత్యర్థి జట్టుకు నాలుగు పరుగులు ఇవ్వకుండా అడ్డుకోవడం అంత సులువు కాదు. కానీ కార్తిక్ ఆ ఒత్తిడిని అధిగమించి సూపర్ బౌలింగ్ కనబరిచాడు. త్వరలోనే జాతీయ జట్టు తలుపు తట్టే అవకాశం ఉంది.' అని తెలిపాడు. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 19వ ఓవర్లో 4 పరుగులే చేసిన పంజాబ్ జట్టు... కార్తీక్ త్యాగి వేసిన ఆఖరి ఓవర్లో గెలిచేందుకు 4 పరుగులు చేయాలి. కానీ పంజాబ్ జట్టు ఒకటే పరుగు చేసి 2 వికెట్లు కూడా కోల్పోయి చేతులెత్తేసింది. చివరకు 2 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ అనూహ్య విజయాన్నందుకుంది. ముందుగా రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. యశస్వి (36 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మహిపాల్ లోమ్రోర్ (17 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), ఎవిన్ లూయిస్ (21 బంతుల్లో 36; 7 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 32 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులకే పరిమితమైంది. మయాంక్ (43 బంతుల్లో 67; 7 ఫోర్లు 2 సిక్సర్లు), రాహుల్ (33 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్కు 71 బంతుల్లోనే 120 పరుగులు జోడించినా ఫలితం దక్కలేదు. చదవండి: Fabian Allen: ఫాబియెన్ అలెన్ కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో వైరల్ -
Fabian Allen: ఫాబియెన్ అలెన్ కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో వైరల్
దుబాయ్: ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు ఫాబియెన్ అలెన్ కళ్లు చెదిరే క్యాచ్తో మెరిశాడు. రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో అలెన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అర్ష్దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఐదో బంతిని లియామ్ లివింగ్స్టోన్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీలైన్ వద్ద అప్పటికే కాచుకొని ఉన్న అలెన్ డైవ్ చేస్తూ అద్భుత క్యాచ్గా అందుకున్నాడు. తాను ఎంత గొప్ప ఫీల్డర్ అనేది అలెన్ మరోసారి రుచి చూపించాడు. ఇంతకముందు సీపీఎల్, బిగ్బాష్ లీగ్లోనూ ఇలాంటి ఫీట్స్నే నమోదు చేశాడు. చదవండి: KL Rahul Stunning Catch: కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. షాక్ తిన్న సంజూ కాగా మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్ అయింది. ఆరంభంలో దూకుడుగా ఆడడంతో రాజస్తాన్ స్కోరు 200 దాటుతుందని అంతా భావించారు. కానీ ఆఖర్లో పంజాబ్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షదీప్ 5 వికెట్లతో టాప్ లేపగా.. షమీ 3 వికెట్లతో రాణించాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్ 36, యశస్వి జైశ్వాల్ 49 పరుగులతో రాణించారు. ఆ తర్వాత లివింగ్ స్టోన్ 25 పరుగులతో రాణించడం.. చివర్లో మహిపాల్ లామ్రోర్ (17 బంతుల్లో 43 పరుగులు, 2 ఫోర్లు, 4 సిక్సర్ల)తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. Fabian Allen- what a beauty😍 #PBKSvsRR pic.twitter.com/BzEryruxwU — Kart Sanaik (@KartikS25864857) September 21, 2021 -
Adil Rashid: ఆదిల్ రషీద్ కొత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో మూడో ఆటగాడు
Adil Rasid IPL Debue.. ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్లో రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ ద్వారా పంజాబ్ కింగ్స్ తరపున ఆదిల్ రషీద్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఈ నేపథ్యంలో ఆదిల్ రషీద్ కొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్ అరంగేట్రం సమయానికి ఆదిల్ రషీద్ ఇంగ్లండ్తో పాటు మిగతా లీగ్లు కలిపి 201 టి20 మ్యాచ్లు ఆడాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ డెబ్యూ సమయానికి అత్యధిక టి20 మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా మూడో స్థానంలో ఉన్నాడు. ఇంతకముందు డేవిడ్ మలాన్ పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్లో అరంగేట్రం చేసే సమయానికి 227 టి20 మ్యాచ్లతో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక 202 టి 20 మ్యాచ్లతో రెండో స్థానంలో ఉన్న జో డెన్లీ 2019 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ తరపున ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్ ఆడాడు. చదవండి: KL Rahul: 22 పరుగుల దూరం.. ఐపీఎల్ చరిత్రలో రెండో బ్యాట్స్మన్గా ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఆరంభించిన రాజస్తాన్ ఇన్నింగ్స్ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఎవిన్ లూయిస్, యశస్వి జైశ్వాల్లు తొలి వికెట్కు 54 పరుగులు జోడించారు. ప్రస్తుతం రాజస్తాన్ వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. జైశ్వాల్ 16, సంజూ శాంసన్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. Ishan Porel, Adil Rashid and Aiden Markram are all set to make their debut for @PunjabKingsIPL 🙌🙌🙌#PBKSvRR #VIVOIPL pic.twitter.com/FugKDrQpub — IndianPremierLeague (@IPL) September 21, 2021 -
KL Rahul: 22 పరుగుల దూరం.. ఐపీఎల్ చరిత్రలో రెండో బ్యాట్స్మన్గా
3Milestones For KL Rahul Single Match.. ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్లో భాగంగా నేడు కింగ్స్ పంజాబ్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ను మూడు రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటనేవి ఒకసారి పరిశీలిద్దాం. ఇక రికార్డుల విషయానికి వస్తే.. ఐపీఎల్లో రాహుల్ మూడు వేల పరుగుల మార్క్ను అందుకోవడానికి కేవలం 22 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇప్పటివరకు 88 మ్యాచ్లాడిన కేఎల్ రాహుల్ 46.53 సగటుతో 2978 పరుగులు చేశాడు. ఒకవేళ రాబోయే మ్యాచ్ల్లో గనుక రాహుల్ మూడువేల మార్క్ను అందుకుంటే ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలవనున్నాడు. 2018 నుంచి పంజాబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేఎల్ రాహుల్ వ్యక్తిగతంగా ప్రతీ సీజన్లోనూ అదరగొడుతూనే వస్తున్నాడు. ఒక్క పంజాబ్ జట్టు తరపునే రాహుల్ 2253 పరుగులు సాధించడం విశేషం. చదవండి: IPL 2021 2nd Phase: అరంగేట్రంలోనే అదరగొట్టిన ఆటగాళ్లు వీరే 4 సిక్సర్లు కొడితే.. పంజాబ్ తరపున 100 సిక్సర్లు కేఎల్ రాహుల్ ఇప్పటివరకు ఐపీఎల్లో 88 మ్యాచ్ల్లో 120 సిక్స్లు, 261 ఫోర్లు బాదాడు. కాగా ఇందులో 96 సిక్సర్లు పంజాబ్ కింగ్స్ తరపునే బాదడం విశేషం. మరో నాలుగు సిక్సర్లు కొడితే.. పంజాబ్ కింగ్స్ తరపున 100 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా నిలవనున్నాడు. courtesy: IPL.com 6 క్యాచ్లు పడితే.. కీపర్గా మరో రికార్డు వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ను మరో రికార్డు ఊరిస్తుంది. రాహుల్కు ఐపీఎల్లో ఎక్కువగా కీపింగ్ చేసే అవకాశం రాలేదు. ఇప్పటివరకు కీపర్గా టి20ల్లో 44 క్యాచ్లు అందుకున్నాడు. మరో ఆరు క్యాచ్లు అందుకుంటే 50 క్యాచ్ల మైలురాయిని చేరుకుంటాడు. రాజస్తాన్తో మ్యాచ్లో ఇది సాధ్యపడకపోవచ్చు.. కానీ టి20 అంటేనే క్షణాల్లో మారిపోయే ఆట. మరి రాహుల్ ఆ రికార్డులను అందుకుంటాడా లేదా చూడాలి. courtesy: IPL.com చదవండి: CSK Vs MI: పొలార్డ్ చేసిన తప్పు ఇదే.. లేదంటే చెన్నై 80 పరుగులకే ఆలౌట్ అయ్యేది! -
IPL 2021 2nd Phase: అరంగేట్రంలోనే అదరగొట్టిన ఆటగాళ్లు వీరే
Debut Performances By Uncapped Indian Players.. ఐపీఎల్ లాంటి లీగ్ వల్ల చాలా మంది ఆటగాళ్లు పరిచయమవ్వడమే గాక జాతీయ జట్టులో ఆడేందుకు అవకాశాలు తలుపు తట్టాయి. అలాంటి ఐపీఎల్ కొందరికి వెలుగునివ్వగా.. మరికొందరు రాణించినప్పటికి దేశవాలికే పరిమితమయ్యారు. జాతీయ జట్టుకు ఆడకుండానే ఐపీఎల్లో డెబ్యూ మ్యాచ్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లు కొందరు ఉన్నారు. తాజాగా ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో భాగంగా ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్లో వెంకటేశ్ అయ్యర్ డెబ్యూ మ్యాచ్లోనే అదరగొట్టాడు. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్గా ఐపీఎల్లో అదరగొట్టిన ఆటగాళ్లను ఇప్పుడు చూద్దాం. చదవండి: PBKS Vs RR: వారిద్దరు ఓపెనర్స్గా వస్తే గెలుపు అవకాశాలు ఎక్కువ జస్ప్రీత్ బుమ్రా(2013, ముంబై ఇండియన్స్) Courtesy: Mumbai Indians బుమ్రా ఇప్పుడంటే టీమిండియా స్టార్ బౌలర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే బుమ్రాకు గుర్తింపు రావడానికి మాత్రం ఐపీఎల్ ఒక కారణమని చెప్పొచ్చు. టీమిండియాకు ఆడకముందు 2013లో ముంబై ఇండియన్స్ తరపున బుమ్రా డెబ్యూ మ్యాచ్ ఆడాడు. ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్లో మూడు వికెట్లతో రాణించాడు. బుమ్రా తాను వేసిన తొలి బంతిని కోహ్లి బౌండరీ తరలించగా.. తరువాతి బంతికే కోహ్లిని అవుట్ చేసి ఐపీఎల్లో తొలి వికెట్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్లను పెవిలియన్ చేర్చిన బుమ్రా ఓవరాల్గా 4 ఓవర్లు వేసి 32 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. కానీ ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ రెండు పరుగుల తేడాతో ఓటమి పాలయింది. అలా తొలి మ్యాచ్లోనే తన బౌలింగ్తో ఆకట్టుకున్న బుమ్రా ప్రస్తుతం టీమిండియా జట్టులో కీలక బౌలర్గా మారాడు. 𝐌𝐔𝐌𝐁𝐀𝐈 𝐈𝐍𝐃𝐈𝐀𝐍𝐒 - महाराष्ट्राच्या प्रत्येक फॅमिलीचा अभिमान 💙 चला पलटन, #IPL2021 मध्ये होऊ द्या आपलाच आवाज 🔥😎#OneFamily #MumbaiIndians pic.twitter.com/KkTSbiOkYg — Mumbai Indians (@mipaltan) September 15, 2021 స్వప్నిల్ అస్నోడ్కర్(2008, రాజస్తాన్ రాయల్స్) Courtesy: IPL. Com ఐపీఎల్ తొలి సీజన్(2008)లో రాజస్తాన్ రాయల్స్ చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే అండర్డాగ్స్గా బరిలోకి దిగిన రాజస్తాన్ టైటిల్ గెలవడం వెనుక గోవా కుర్రాడు స్వప్నిల్ అస్నోడ్కర్ పాత్ర చాలా ఉంది. అప్పటి రాజస్తాన్ కెప్టెన్ షేన్ వార్న్ అస్నోడ్కర్పై నమ్మకముంచి ఓపెనింగ్ స్థానంలో పంపించాడు. అలా కేకేఆర్తో ఆడిన తొలి మ్యాచ్లోనే అస్నోడ్కర్ మంచి ప్రదర్శన కనబరిచాడు. 34 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 60 పరుగులు చేశాడు. అతని దెబ్బకు రాజస్తాన్ 196 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ మ్యాచ్లో రాజస్తాన్ 45 పరుగులతో విజయాన్ని అందుకుంది. గ్రేమి స్మిత్కు జతగా ఓపెనర్గా వచ్చిన అస్నోడ్కర్ తొమ్మిది మ్యాచ్ల్లో 311 పరుగులు సాధించాడు. చదవండి: KKR vs RCB: డెస్సింగ్రూంలో సంబరాలు.. మేం మిమ్మల్ని ఓడించగలం వెంకటేశ్ అయ్యర్(2021, కోల్కతా నైట్రైడర్స్) Courtesy: KKR తాజాగా ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. డెబ్యూ మ్యాచ్లోనే శుబ్మన్ గిల్తో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగిన అతను (41 పరుగులు నాటౌట్) చివరి వరకు నిలిచి మ్యాచ్ను గెలిపించాడు. 27 బంతుల్లో 41 పరుగులు చేసిన వెంకటేశ్ ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఆర్సీబీపై గెలవడంలో కీలక పాత్ర పోషించిన వెంకటేశ్ అయ్యర్ రానున్న మ్యాచ్ల్లో కేకేఆర్కు కీలకంగా మారనున్నాడు. చదవండి: Suresh Raina Wicket: అయ్యో రైనా.. వికెట్తో పాటు బ్యాట్ను విరగొట్టుకున్నాడు -
PBKS Vs RR: వారిద్దరు ఓపెనర్స్గా వస్తే గెలుపు అవకాశాలు ఎక్కువ
దుబాయ్: ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా.. మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఫెవరెట్గా కనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు. దీంతో పాటు ఈరోజు మ్యాచ్ ఆడనున్న పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవెన్ను ప్రకటించాడు. చదవండి: Gautam Gambhir: అయ్యో ఏంటిది గంభీర్.. నీ అంచనా తప్పింది.. పంజాబ్ కింగ్స్ తన ఓపెనర్లను మార్చాల్సిన అవసరం ఉందని తెలిపాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరపున కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాలు ఓపెనర్లుగా వస్తున్నారు. కొన్ని సీజన్ల నుంచి వీరిద్దరి కాంబినేషన్ మంచి ఆరంభాలు ఇస్తుంది. అయితే క్రిస్గేల్ను ఓపెనర్గా పంపి.. మయాంక్ను మూడోస్థానంలో బ్యాటింగ్కు పంపిస్తే పంజాబ్కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక నాలుగో స్థానంలో నికోలస్ పూరన్కు అవకాశం ఇవ్వాలి. ఇక ఏడో స్థానంలో క్రిస్ జోర్డాన్ స్థానంలో మొయిసెస్ హెన్రిక్స్కు అవకాశం ఇవ్వాలి. అతను ఏడో స్థానంలో వస్తే బ్యాటింగ్లో మెరుపులతో పాటు బౌలింగ్లోనూ ఉపయోగపడుతాడు. ఇక స్పిన్నర్గా రవి బిష్ణొయి అయితే బాగుంటుంది. ఆకాశ్ చోప్రా ప్లేయింగ్ ఎలెవెన్: క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, షారుఖ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, నాథన్ ఎల్లిస్, రవి బిష్ణోయ్, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ చదవండి: RCB Vs KKR: కోహ్లి డబుల్ సెంచరీ.. ఆర్సీబీ కెప్టెన్ ఖాతాలో మరో రికార్డు -
CSK vs MI: గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్.. చెన్నైదే పైచేయి
దుబాయ్: ఒకదశలో చెన్నై స్కోరు 24/4... కీలక బ్యాట్స్మెన్ పెవిలియన్ చేరారు... ఈ దశలో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నీతానై (58 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్లు) అద్భుత ఇన్నింగ్స్తో చెన్నై ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్తోపాటు రవీంద్ర జడేజా (33 బంతుల్లో 26; 1 ఫోర్), డ్వేన్ బ్రావో (8 బంతుల్లో 23; 3 సిక్స్లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడారు. దాంతో ముంబై ఇండియన్స్కు చెన్నై గౌరవప్రద లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ తర్వాత చెన్నై బౌలర్లు సమష్టిగా రాణించి ముంబై ఇండియన్స్ను కట్టడి చేశారు. ఫలితంగా ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె తొలి మ్యాచ్లో చెన్నై 20 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్పై గెలిచింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు సాధించింది. ముంబై బౌలర్లలో ఆడమ్ మిల్నే, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ తలా రెండేసి వికెట్లు తీశారు. ఛేజింగ్లో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసి ఓడింది. సౌరభ్ తివారీ (40 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు) మినహా మిగిలిన బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. చెన్నై బౌలర్లు బ్రావో (3/25), దీపక్ చహర్ (2/19) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. మోకాలి గాయంతో ముంబై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరంకాగా. పొలార్డ్ తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు. రుతురాజసం... టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన చెన్నైని ముంబై పేసర్లు బౌల్ట్, మిల్నేలు నిప్పులు చెరిగే బంతులతో హడలెత్తించారు. వీరిధాటికి డు ప్లెసిస్ (0), రైనా (4) మొయిన్ అలీ (0), కెప్టెన్ ధోని (3) వెంట వెంటనే పెవిలియన్కు చేరారు. మిల్నే బంతికి గాయపడ్డ అంబటి రాయుడు (0) రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. దాంతో చెన్నై పవర్ప్లే ముగిసేసరికి 24/4గా నిలిచింది. అయితే రుతురాజ్ సూపర్ ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. తన వ్యక్తిగత స్కోరు 19 పరుగుల వద్ద కీపర్ డికాక్ క్యాచ్ను జారవిడవడంతో ఊపిరి పీల్చుకున్న రుతురాజ్... ఆ తర్వాత ఎటువంటి పొరపాటు చేయలేదు. జడేజాతో కలిసి జట్టు స్కోరు బోర్డును నడిపించాడు. ఈ క్రమంలో అతను చూడ చక్కని షాట్లు ఆడుతూ 41 బంతుల్లో ఐపీఎల్లో తన ఆరో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. వీరిద్దరూ ఐదో వికెట్కు 84 పరుగులు జోడించారు. జడేజా అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన బ్రావో దూకుడుగా ఆడాడు. 19వ ఓవర్లో బ్రావో, రుతురాజ్ ధాటిగా ఆడటంతో ఆ ఓవర్లో చెన్నైకి 24 పరుగులు లభించాయి. బుమ్రా వేసిన చివరి ఓవర్ మూడో బంతికి ఫోర్ కొట్టిన రుతురాజ్.. ఆఖరి బంతిని సిక్సర్గా మలిచాడు. చివరి ఐదు ఓవర్లలో ముంబై 69 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. ఛేజింగ్లో ముంబై బోల్తా 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైని చెనై బౌలర్లు దెబ్బ తీశారు. ఓపెనర్లు డికాక్ (17; 3 ఫోర్లు), అన్మోల్ప్రీత్ సింగ్ (16; 2 ఫోర్లు, 1 సిక్స్)లను దీపక్ చహర్ పెవిలియన్కు చేర్చాడు. ఆ వెంటనే సూర్యకుమార్ యాదవ్ (3), ఇషాన్ కిషన్ (11)లు కూడా అవుటయ్యారు. ఒక ఎండ్లో సౌరభ్ తివారీ ఆడుతున్నా అతడికి సహకరించే బ్యాట్స్మన్ కరువయ్యాడు. గెలిపిస్తాడనుకున్న పొలార్డ్ (15) కీలక సమయంలో ఎల్బీగా వెనుదిరిగాడు. చివర్లో మిల్నే సాయంతో తివారీ కాసేపు చెన్నై బౌలర్లను ప్రతిఘటించాడు. చివరి ఓవర్లో ముంబై గెలుపునకు 24 పరుగులు అవసరంకాగా... ముంబై 3 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (నాటౌట్) 88; డు ప్లెసిస్ (సి) మిల్నే (బి) బౌల్ట్ 0; మొయిన్ అలీ (సి) తివారీ (బి) మిల్నే 0; అంబటి రాయుడు (రిటైర్డ్ హర్ట్) 0; రైనా (సి) రాహుల్ చహర్ (బి) బౌల్ట్ 4; ధోని (సి) బౌల్ట్ (బి) మిల్నే 3; జడేజా (సి) పొలార్డ్ (బి) బుమ్రా 26; బ్రావో (సి) కృనాల్ (బి) బుమ్రా 23; శార్దుల్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు: 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–1, 2–2, 3–7, 4–24, 5–105, 6–144. బౌలింగ్: బౌల్ట్ 4–1–35–2, మిల్నే 4–0–21–2, బుమ్రా 4–0–33–2, పొలార్డ్ 2–0–15–0, రాహుల్ చహర్ 4–0–22–0, కృనాల్ పాండ్యా 2–0–27–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డికాక్ (ఎల్బీ) (బి) దీపక్ చహర్ 17; అన్మోల్ప్రీత్ సింగ్ (బి) దీపక్ చహర్ 16; సూర్యకుమార్ (సి) డు ప్లెసిస్ (బి) శార్దుల్ 3; ఇషాన్ కిషన్ (సి) రైనా (బి) బ్రావో 11; సౌరభ్ తివారీ (నాటౌట్) 50; పొలార్డ్ (ఎల్బీ) (బి) హేజల్వుడ్ 15; కృనాల్ (రనౌట్) 4; మిల్నే (సి) (సబ్) గౌతమ్ (బి) బ్రావో 15; రాహుల్ చహర్ (సి) రైనా (బి) బ్రావో 0; బుమ్రా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు: 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 136. వికెట్ల పతనం: 1–18, 2–35, 3–37, 4–58, 5–87, 6–94, 7–134, 8–135. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–18–2, హేజల్వుడ్ 4–0–34–1, శార్దుల్ ఠాకూర్ 4–0–29–1, మొయిన్ అలీ 3–0–16–0, డ్వేన్ బ్రావో 4–0–25–3, రవీంద్ర జడేజా 1–0–13–0. -
IPL 2021 2nd Phase: ముంబై ఇండియన్స్పై సీఎస్కే విజయం
ముంబై ఇండియన్స్పై సీఎస్కే విజయం ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే విజయాన్ని అందుకుంది. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆఖరి ఓవర్లలో ఒత్తిడిని తట్టుకోలేక చతికిలపడి 8 వికెట్లు నష్టపోయి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటింగ్లో సౌరబ్ తివారి 50 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాట్స్మన్ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. సీఎస్కే బౌలర్లలో బ్రేవో మూడు, దీపక్ చహర్ చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో లీగ్లో తొలి మ్యాచ్లో ఓటమికి సీఎస్కే బదులు తీర్చుకున్నట్లు అయింది. సగం వికెట్లు కోల్పోయిన ముంబై ముంబై ఇండియన్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. హేజిల్వుడ్ వేసిన బంతికి పొలార్డ్ ఎల్బీగా వెనుదిరిగాడు. ముంబై రివ్యూ కోరినప్పటికి రిప్లేలో బంతి మిడిల్స్టంప్ను ఎగురగొట్టినట్లు క్లియర్గా కనిపించింది. ప్రస్తుతం ముంబై 14 ఓవర్ల తర్వాత ముంబై 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం సౌరబ్ తివారి 24, కృనాల్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. 11 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ బ్రేవో బౌలింగ్లో రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మూడో వికెట్ కోల్పోయిన ముంబై.. సీఎస్కే విధించిన 157 పరుగుల లక్ష్యచేధనలో ముంబై ఇండియన్స్ తడబడుతుంది. ప్రస్తుతం ఏడు ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. ప్రస్తుతం సౌరబ్ తివారి 6, ఇషాన్ కిషన్ 3 పరుగులు చేశారు. అంతకముందు సూర్యకుమార్ యాదవ్(3), అన్మోల్ ప్రీత్ సింగ్(17) వెనుదిరిగారు. తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. డికాక్ ఔట్ 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తొలి వికెట్ను కోల్పోయింది. దీపక్ చహర్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ రెండో బంతికి 17 పరుగులు చేసిన డికాక్ ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో ధోని రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి ఇన్సైడ్ ఎడ్జ్లో వికెట్ను తాకుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. అమన్మోల్ ప్రీత్ 16, సూర్యకుమార్ 1 పరుగుతో ఆడుతున్నారు. రుతురాజ్ గైక్వాడ్ మెరుపులు ముంబై ఇండియన్స్ టార్గెట్ 157 ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఒక దశలో 10 పరుగుల లోపే మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. చెన్నై స్కోరు కనీసం వంద పరుగులైనా దాటుతుందా అనే అనుమానం కలిగింది. తర్వాత వచ్చిన ధోని కూడా 3 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం చక్కని ఇన్నింగ్స్తో అలరించాడు. 57 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 88 పరుగులు చేశాడు. జడేజా 26 పరుగులతో ఆకట్టుకున్నాడు. చివర్లో బ్రేవో 8 బంతుల్లో 23 పరుగులు చేశాడు. రుతురాజ్ మెరుపులతో సీఎస్కే గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ►ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో నిలకడగా ఆడతున్న సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. స్కోర్ బోర్డ్ 107 పరుగుల వద్ద జడేజా 26 వికెట్ కోల్పోయింది. బూమ్రా బౌలింగ్లో సూర్యకూమర్ యాదవ్ క్యాచ్ ఇచ్చి జడేజా వెనుదిరిగాడు. 18 ఓవర్లు పూర్తి అయ్యే సరికి చెన్నై జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 117 పరుగులు సాధించింది. రుతురాజ్ 67, బ్రేవో 8 పరుగులు చేశాడు. రూతురాజ్ గైక్వాడ్ అర్ధ సెంచరీ ►ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో సీఎస్కే ఒపెనర్ రూతురాజ్ గైక్వాడ్ ఆర్ధ సెంచరీ సాధించాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న చెన్నై జట్టును రూతురాజ్ గైక్వాడ్ ఆదుకున్నాడు. జడేజాతో కలిసి 69 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. పుంజుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. ►పీకల్లోతు కష్టాల్లో ఉన్న చెన్నై జట్టును ఒపెనర్ రూతురాజ్ గైక్వాడ్ ఆదుకున్నాడు. జడేజాతో కలిసి గైక్వాడ్ స్కోర్ బోర్డును చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి 63 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం 15 ఓవర్లు పూర్తి అయ్యే సరికి చెన్నై జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 87 పరుగులు సాధించింది. క్రీజులో రుతురాజ్ , జడేజా 25 పరుగులతో ఉన్నారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, మిల్నే 2 వికెట్లు సాధించారు. ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో బౌలర్ల ధాటికి చెన్నై పీకల్లోతు కష్టాల్లో పడింది. పది ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 23, జడేజా 7పరుగులతో ఉన్నారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, మిల్నే 2 వికెట్లు సాధించారు. ధోని ఔట్..27 పరుగులకే నాలుగు వికెట్లు.. ►చెన్నై సూపర్ కింగ్స్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోతుంది. స్కోర్ బోర్డ్ 24 పరుగుల వద్ద కెప్టెన్ ధోని(3) వికెట్ కోల్పోయింది. ఆడామ్ మిల్నే బౌలింగ్లో ట్రెంట్ బౌల్ట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. రుతురాజ్ (17), జడేజా(0) పరుగులతో క్రీజులో ఉన్నారు. రైనా ఔట్.. ఏడు పరుగులకే మూడో వికెట్ డౌన్ ►ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో సీఎస్కే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. ఇన్నింగ్స్ 3వ ఓవర్లో సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. నాలుగు పరుగులు చేసిన రైనా బౌల్ట్ బౌలింగ్లో రాహుల్ చహర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో సీఎస్కే ఏడు పరుగులకే మూడో వికెట్ కోల్పోయింది. అంతకముందు అంబటి రాయుడు రిటైర్ట్ హర్ట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే 4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 11 పరుగులు చేసింది. రుతురాజ్ 5, ధోని (0) పరుగులతో క్రీజులో ఉన్నారు. ►సీఎస్కే 2 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్ను కోల్పోయింది. ఆడమ్ మిల్నే బౌలింగ్లో మోయిన్ ఆలీ సౌరబ్ తివారీకి క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే 2 వికెట్ల నష్టానికి 3 పరుగులు చేసింది. రుతురాజ్ 1, రాయుడు(0) పరుగులతో క్రీజులో ఉన్నారు. ►డుప్లిసిస్ డకౌట్.. సీఎస్కే తొలి వికెట్ డౌన్ సీఎస్కేకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. బౌల్ట్ వేసిన ఓవర్ తొలి ఓవర్ మూడో బంతికి డుప్లెసిస్ డకౌట్గా వెనుదిరిగాడు. షార్ట్బాల్ను అంచనా వేయడంలో పొరబడ్డ డుప్లెసిస్ మిల్నేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో చెన్నై పరుగులేమి చేయకుండానే తొలి వికెట్ కోల్పోయింది. దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్ రెండో అంచె పోటీలకు తెరలేచింది. రెండో అంచె పోటీల్లో భాగంగా తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది. టాస్ గెలిచిన సీఎస్కే బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే రోహిత్ శర్మ ఫిట్నెస్ లేమి కారణంగా మ్యాచ్లో బరిలోకి దిగలేదు.అతని స్థానంలో పొలార్డ్ నాయకత్వం వహించనున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా కూడా మ్యాచ్లో ఆడడం లేదు. ముంబై తరపున అన్మోల్ ప్రీత్ సింగ్ ఐపీఎల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇక సీఎస్కే జట్టులో సామ్ కరన్ స్థానంలో బ్రావో జట్టులోకి వచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో రెండు జట్లు పోటాపోటీగానే కనిపిస్తున్నాయి. అయితే ఈ సీజన్ ప్రదర్శన చూసుకుంటే సీఎస్కే ముందంజలో ఉంది. అయితే సీజన్లో తొలి అంచె పోటీలో ముంబై ఇండియన్స్నే విజయం వరించింది. సీజన్ తొలి మ్యాచ్లో సీఎస్కే తొలుత భారీ స్కోరు చేసినప్పటికీ.. పొలార్డ్ (87 పరుగులు, 34 బంతులు) విధ్వంసం సృష్టించడంతో మ్యాచ్ వన్సైడ్గా మారిపోయింది. అయితే కరోనా కారణంగా లీగ్ వాయిదా పడడం.. మధ్యలో గ్యాప్ రావడం ఆటను సరికొత్తగా మార్చేసింది. ఎవరు ఫెవరెట్ అనేది పక్కన పెడితే మరోసారి పరుగుల వరద ఖాయంగా కనిపిస్తుంది. ముంబయి, చెన్నై జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే..? ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 32 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో 19 మ్యాచ్ల్లో ముంబయి ఇండియన్స్ గెలుపొందగా.. మిగిలిన 13 మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఓవరాల్గా ముంబయి టీమ్ ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలవగా.. చెన్నై జట్టు మూడు సార్లు టైటిల్ గెలిచింది. ముంబై ఇండియన్స్: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, ఇషాన్ కిషన్, అన్మోల్ ప్రీత్సింగ్, సూర్యకుమార్ యాదవ్, సౌరబ్ తివారి,కృనాల్ పాండ్యా, ఆడమ్ మిల్నే, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా సీఎస్కే: ఎంఎస్ ధోని(కెప్టెన్), డుప్లెసిస్, రుతురాజ్, మొయిన్ అలీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా,జోష్ హాజిల్వుడ్, డ్వేన్ బ్రావో, శార్ధూల్ ఠాకూర్, దీపక్ చాహర్ -
తొలి భాగం మొత్తం వీళ్లదే.. రాహుల్ మెరుపులు.. గబ్బర్ గర్జన.. సంజూ శతక్కొట్టుడు
Recap Of First Half IPL 2021: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్-2021 రెండో అంచె నేటి నుంచి ప్రారంభం కానుంది. కోవిడ్ కారణంగా ఆకస్మికంగా వాయిదా పడిన క్యాష్ రిచ్ లీగ్.. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్తో పునః ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సీజన్ మొదటి దశలో చాలా మ్యాచ్లు హోరాహోరీగా సాగాయి. బౌలర్లపై బ్యాట్స్మెన్లు పూర్తి ఆధిపత్యం చలాయించారు. భారీ సంఖ్యలో ఫోర్లు, సిక్సర్లు నమోదవ్వడంతో పరుగుల వరద పారింది. కొన్ని మ్యాచ్ల్లో బౌలర్లు సైతం ప్రతాపం చూపినప్పటికీ వారి ప్రభావం నామమాత్రమే. సీజన్ తొలి దశలో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే.. టీమిండియా బ్యాట్స్మెన్లు పరుగుల వరద పారించారు. ముఖ్యంగా శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న గబ్బర్.. ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచ్ల్లో 54.28 సగటుతో 380 పరుగులు చేసి ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుత సీజన్లో అత్యధిక ఫోర్ల (43) రికార్డు కూడా ధవన్ పేరిటే ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 3 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ధవన్.. ఓ ఇన్నింగ్స్లో అత్యధికంగా 92 పరుగులు చేశాడు. తొలి దశలో గర్జించిన గబ్బర్.. రెండో దశలో ఎలా రాణిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: IPL 2021: జోరు మీదున్న ధోని.. సీఎస్కే ప్రతీకారం తీర్చుకుంటుందా? మరోవైపు తొలిదశ ఐపీఎల్-2021లో టీమిండియా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం మెరుపులు మెరిపించాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఆశించిన మేరకు ప్రభావం చూపనప్పటికీ.. వ్యక్తిగతంగా రాణించాడు. ఈ సీజన్లో రాహుల్ సారధ్యంలో పంజాబ్ 8 మ్యాచ్ల్లో మూడింటిలో మాత్రమే నెగ్గింది. అయినా బ్యాట్స్మెన్గా రాహుల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 7 మ్యాచ్ల్లో 66.20 సగటుతో 331 పరుగులు చేసి ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. దీంతో పాటు ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు (16), అత్యధిక అర్ధ సెంచరీ(4)ల రికార్డులు కూడా రాహుల్ పేరిటే నమోదై ఉన్నాయి. కాగా, టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులో ఉన్న రాహుల్ రెండో దశలోనూ రాణించి.. జట్టును విజయాల బాట పట్టించాలని పంజాబ్ కింగ్స్ అభిమానులు కోరుకుంటున్నారు. వీరిద్దరితో పాటు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డుప్లెసిస్( 7 మ్యాచ్ల్లో 64 సగటుతో 320 పరుగులు, 4 హాఫ్ సెంచరీలు), మరో ఢిల్లీ ఆటగాడు పృథ్వీ షా(8 మ్యాచ్ల్లో 38.50 సగటుతో 308 పరుగులు, 3 అర్ధ శతకాలు), రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్(7 మ్యాచ్ల్లో 46.16 సగటు, 145.78 స్ట్రయిక్ రేట్తో 277 పరుగులు, సెంచరీ), మరో రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్(7 మ్యాచ్ల్లో 36. 29 సగటు, 153.01 స్ట్రయిక్ రేట్తో 254 పరుగులు, సెంచరీ), రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు దేవ్దత్ పడిక్కల్(6 మ్యాచ్ల్లో 39 సగటు, 152.34 స్ట్రయిక్ రేట్తో 195 పరుగులు, సెంచరీ) జోరును ప్రదర్శించారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ సీజన్ మొత్తానికే హైలైట్గా నిలిచాడు. 7 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టి సీజన్ టాప్ బౌలర్గా కొనసాగుతున్నాడు. ఇందులో ఓసారి ఐదు వికెట్ల ప్రదర్శన(5/27) కూడా ఉంది. హర్షల్ తర్వాత చెప్పుకోదగ్గ బౌలింగ్ ప్రదర్శనల్లో ఆవేశ్ ఖాన్(8 మ్యాచ్ల్లో 14), క్రిస్ మోరిస్(7 మ్యాచ్ల్లో 14) ఉన్నారు. ముంబైతో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఆటగాడు ఆండ్రీ రసెల్(5/15) సీజన్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. చదవండి: ఆ మూడు బాదితే రోహిత్ ఖాతాలో మరో రికార్డు.. -
IPL 2021: అహ్మదాబాద్లో ఆగిన ఆట
కరోనా దెబ్బతో అర్ధాంతరంగా ఆగిన ఐపీఎల్ అభిమానులను అలరించేందుకు మరోసారి వచ్చేసింది. 2020లో యూఏఈలో విజయవంతంగా నిర్వహించినా... బీసీసీఐ అతి విశ్వాసం కారణంగా ఈ ఏడాది భారత్లోనే లీగ్ మొదలైంది. చివరకు కోవిడ్ దెబ్బకు టోర్నీని సగంలోనే ఆపి వేయాల్సి వచి్చంది. అయితే లీగ్తో ముడిపడి ఉన్న వేల కోట్ల రూపాయలను దృష్టిలో ఉంచుకుంటూ మళ్లీ యూఏఈనే నమ్ముకున్న బోర్డు, విరామం తర్వాత మళ్లీ పోటీలను నిర్వహించేందుకు సన్నద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య నేడు జరిగే పోరుతో లీగ్ పునః ప్రారంభం కానుంది. దుబాయ్: ఐపీఎల్ తాజా సీజన్లో మే 2న అహ్మదాబాద్లో ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య చివరి మ్యాచ్ జరిగింది. మే 4న కోల్కతా, బెంగళూరు మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా... నైట్రైడర్స్ టీమ్లోని వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా పాజిటివ్గా తేలారు. దాంతో ఆ మ్యాచ్ను షెడ్యూల్ నుంచి తప్పించిన గవరి్నంగ్ కౌన్సిల్ తర్వాతి రోజు లీగ్ను నిరవధికంగా వాయిదా వేసింది. ఆపై మన దేశంలో కరోనా రెండో వేవ్ ఉధృతంగా కొనసాగడంతో భారత్లో టోర్నీ నిర్వహణ అసాధ్యమని తేలిపోయింది. దాంతో చర్చోపర్చల అనంతరం భారత మ్యాచ్ల షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకుంటూ బీసీసీఐ రెండో దశ పోటీల షెడ్యూల్ విడుదల చేసింది. సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటన అనంతరం ఇప్పుడు ధనాధన్ క్రికెట్తో సగటు అభిమానులకు ధనాధన్ వినోదం లభించనుంది. అక్టోబర్ 15న ఫైనల్... ఒక్కో సీజన్ ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ సహా మొత్తం 60 మ్యాచ్లు జరుగుతాయి. టోర్నీ అర్ధాంతరంగా ఆగిపోయే సమయానికి 29 మ్యాచ్లు ముగిశాయి. అంటే 27 రోజుల్లో మిగిలిన 31 మ్యాచ్లను బీసీసీఐ నిర్వహించనుంది. తొలి దశతో పోలిస్తే వేదికలు మారడమే కాకుండా పలు జట్లలో కూడా మార్పులు జరిగాయి. వ్యూహ ప్రతివ్యూహాల్లో కూడా ఆ తేడా కనిపిస్తుంది కాబట్టి తొలి దశలో జోరు ప్రదర్శించిన జట్లు ఇక్కడా దానినే కొనసాగించగలవా లేదా అనేది ఆసక్తికరం. పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న టీమ్లు కూడా పుంజుకునేందుకు ఆస్కారం ఉంది. ప్రతీ జట్లలో కొందరు కీలక ఆటగాళ్లు టోర్నీకి దూరమయ్యారు. తొలి దశలో ఆడిన ప్యాట్ కమిన్స్ (కోల్కతా), స్టోక్స్, బట్లర్ (రాజస్తాన్), బెయిర్స్టో (సన్రైజర్స్), వోక్స్ (ఢిల్లీ), వాషింగ్టన్ సుందర్ (బెంగళూరు) వేర్వేరు కారణాలతో ఇప్పుడు బరిలోకి దిగడం లేదు. తొలి దశ పోటీలకు దూరమైన శ్రేయస్ అయ్యర్, నటరాజన్ ఈసారి ఆడనుండగా... షమ్సీ, హసరంగ, చమీరా, గ్లెన్ ఫిలిప్స్, నాథన్ ఎలిస్, రషీద్, టిమ్ డేవిడ్, లూయీస్లాంటి ఆటగాళ్లు ఐపీఎల్లో కొత్తగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దుబాయ్, అబుదాబి, షార్జా నగరాల్లో జరిగే ఈ మ్యాచ్లలో స్థానిక ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తుండటం విశేషం. -
Rohit Sharma: రోహిత్ శర్మకు గ్రాండ్ వెల్కమ్
దుబాయ్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఆ జట్టు ఆటగాళ్లు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇంగ్లండ్తో సిరీస్ అనంతరం యూఏఈకి చేరుకున్న రోహిత్ శర్మ ఆరు రోజులపాటు క్వారంటైన్లో ఉన్నాడు. తాజాగా శనివారంతో క్వారంటైన్ పీరియడ్ కంప్లీట్ చేసుకున్న రోహిత్ జట్టు సభ్యులతో కలిశాడు. ఈ నేపథ్యంలో రోహిత్కు హగ్గులతో పాటు బెస్ట్ విషెస్ అందించారు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. చదవండి: Dinesh karthik: బౌలర్ యార్కర్ దెబ్బ.. క్రీజులోనే కూలబడ్డ బ్యాట్స్మన్ '' మా కెప్టెన్కు ఇదే వెల్కమ్.. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టీమ్మేట్స్'' అని క్యాప్షన్ జత చేసింది. కాగా టి20 ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లి టీమిండియా టి20 కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకోనున్న సంగతి తెలిసిందే. కాగా కోహ్లి స్తానంలో రోహిత్ టి20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఆటగాళ్లు రోహిత్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ముంబై ఇండియన్స్ రెండో అంచె పోటీల్లో తన తొలి మ్యాచ్ను రేపు (సెప్టెంబర్ 19న) సీఎస్కేతో తలపడనుంది. ఇక రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమయ్యాడు. ఇప్పటికే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ను ఐదుసార్లు చాంపియన్గా నిలిపాడు. ఇక ఈ సీజన్లోనూ ముంబై నిలకడ ఆటతీరును కనబరుస్తుంది. ఐపీఎల్ 2021 సీజన్లో ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్లాడి 4 విజయాలు.. మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. చదవండి: MS Dhoni: జోరు మీదున్న తలైవా.. ఫోర్లు, సిక్సర్ల వర్షం NZ Vs Pak Series Cancellation: కివీస్ సిరీస్ రద్దు.. కావాలనే మాపై కుట్రలు పన్నుతున్నారు View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) -
MS Dhoni: జోరు మీదున్న తలైవా.. ఫోర్లు, సిక్సర్ల వర్షం
MS Dhoni Practice Video.. చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని జోరు మీద ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినా అతని ఆటను చూడాలని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దనాధన్ ఆటకు మారుపేరుగా ఉన్న ధోని ఐపీఎల్ 2021 రెండో అంచె పోటీల్లో మునుపటి జోరు చూపిస్తాడని అంతా భావిస్తున్నారు. ఇక ఐపీఎల్ 2021 రెండో అంచె పోటీలు రేపటి నుంచే మొదలవ్వనున్నాయి. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, సీఎస్కే మధ్య జరగనుంది. చదవండి: Dinesh karthik: బౌలర్ యార్కర్ దెబ్బ.. క్రీజులోనే కూలబడ్డ బ్యాట్స్మన్ ఈ సందర్భంగా ప్రాక్టీస్ సమయంలో ధోని తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు అనే తేడా లేకుండా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు.ఇదే మ్యాజిక్ను ధోని అసలు మ్యాచ్ల్లోనూ చూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా ఈ సీజన్లో తొలి అంచె పోటీల్లో ధోనికి బ్యాటింగ్ ఎక్కువగా చేసే అవకాశం రాలేదు. అప్పటికి ఏడు మ్యాచ్లు కలిపి 37 పరుగులు మాత్రమే నమోదు చేశాడు. ఇక ఐపీఎల్ 14వ సీజన్లో సీఎస్కే మునుపటి జోరును కనబరుస్తుంది. కరోనా కారణంగా లీగ్ వాయిదా పడే సమయానికి సీఎస్కే 7 మ్యాచ్ల్లో 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. చదవండి: IPL 2021 2nd Phase Schedule: ఐపీఎల్ 2021 రెండో ఫేజ్ షెడ్యూల్ ఇలా.. కర్టసీ: సీఎస్కే యూట్యూబ్ -
ఐపీఎల్ 2021 రెండో ఫేజ్ షెడ్యూల్ ఇదే..
దుబాయ్: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ పోటీలకు అంతా సిద్ధమైంది. కరోనా కారణంగా వాయిదా పడిన లీగ్ సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానుంది. ఇక ఈసారి సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్లాడి 6 విజయాలు.. రెండు ఓటములతో తొలి స్థానంలో నిలిచింది. ఇక సీఎస్కే రెండో స్థానంలో ఉండగా.. ఆర్సీబీ మూడో స్థానంలో ఉంది. సెకండ్ ఫేజ్లో భాగంగా సీఎస్కే, ముంబై ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. సీఎస్కే రెండో ఫేజ్ మ్యాచ్లు సెప్టెంబర్ 19: సీఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్.. దుబాయ్.. రాత్రి 7.30 గంటలు సెప్టెంబర్ 24 : సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ.. షార్జా.. రాత్రి 7.30 గంటలు సెప్టెంబర్ 26: సీఎస్కే వర్సెస్ కేకేఆర్.. అబుదాబి.. సాయంత్రం 3.30 గంటలు సెప్టెంబర్ 30: సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్.. షార్జా.. రాత్రి 7.30 గంటలు అక్టోబర్ 2: సీఎస్కే వర్సెస్ రాజస్తాన్ రాయల్స్.. అబుదాబి.. రాత్రి 7.30 గంటలు అక్టోబర్ 4: సీఎస్కే వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్.. దుబాయ్.. రాత్రి 7.30 గంటలు అక్టోబర్ 7: సీఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్.. దుబాయ్.. సాయంత్రం 3.30 గంటలు ముంబై ఇండియన్స్ రెండో ఫేజ్ మ్యాచ్లు.. సెప్టెంబర్ 19: ముంబై ఇండియన్స్ వర్సెస్ సీఎస్కే.. దుబాయ్.. రాత్రి 7.30 గంటలు సెప్టెంబర్ 23: ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్.. అబుదాబి.. రాత్రి 7.30 గంటలు సెప్టెంబర్ 26: ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ.. దుబాయ్.. రాత్రి 7.30 గంటలు సెప్టెంబర్ 28: ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ .. అబుదాబి.. రాత్రి 7:30 గంటలు అక్టోబర్ 2 : ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్.. షార్జా.. సాయంత్రం 3.30 గంటలు అక్టోబర్ 5: ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్.. షార్జా.. రాత్రి 7.30 గంటలు అక్టోబర్ 8 : ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ .. అబుదాబి.. రాత్రి 7.30 గంటలు ఆర్సీబీ రెండో ఫేజ్ మ్యాచ్లు సెప్టెంబర్ 20: ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్.. అబుదాబి.. రాత్రి 7.30 గంటలు సెప్టెంబర్ 24 : ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే..షార్జా.. రాత్రి 7.30 గంటలు సెప్టెంబర్ 26: ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్.. దుబాయ్.. రాత్రి 7.30 గంటలు సెప్టెంబర్ 29: ఆర్సీబీ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్.. దుబాయ్ .. సాయంత్రం 3.30 గంటలు అక్టోబర్ 3: ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్.. షార్జా.. సాయంత్రం 3:30 గంటలు అక్టోబర్ 6: ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్.. అబుదాబి.. రాత్రి 7.30 గంటలు అక్టోబర్ 8: ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్.. దుబాయ్.. రాత్రి 7.30 గంటలు ఢిల్లీ క్యాపిటల్స్ రెండో ఫేజ్ మ్యాచ్లు సెప్టెంబర్ 22 : ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్.. దుబాయ్.. రాత్రి 7.30 గంటలు సెప్టెంబర్ 25: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ .. అబుదాబి.. సాయంత్రం 3:30 గంటలు సెప్టెంబర్ 28: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కేకేఆర్.. షార్జా.. సాయంత్రం 3:30 గంటలు అక్టోబర్ 2: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్.. షార్జా.. సాయంత్రం 3.30 గంటలు అక్టోబర్ 4: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సీఎస్కే.. దుబాయ్.. రాత్రి 7.30 గంటలు అక్టోబర్ 8: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ.. దుబాయ్ .. రాత్రి 7.30 గంటలు కోల్కతా నైట్రైడర్స్ రెండో ఫేజ్ మ్యాచ్లు సెప్టెంబర్ 20: కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ.. అబుదాబి.. రాత్రి 7.30 గంటలు సెప్టెంబర్ 23: కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్.. అబుదాబి.. రాత్రి 7.30 గంటలు సెప్టెంబర్ 26: కేకేఆర్ వర్సెస్ సీఎస్కే.. అబుదాబి.. సాయంత్రం 3:30 గంటలు సెప్టెంబర్ 28: కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్.. షార్జా.. సాయంత్రం 3:30 గంటలు అక్టోబర్ 1: కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్.. దుబాయ్.. రాత్రి 7.30 గంటలు అక్టోబర్ 3: కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్.. దుబాయ్.. రాత్రి 7.30 గంటలు అక్టోబర్ 7: కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్.. షార్జా.. రాత్రి 7.30 గంటలు పంజాబ్ కింగ్స్ రెండో ఫేజ్ మ్యాచ్లు సెప్టెంబర్ 21: పంజాబ్ కింగ్స్ వర్సెస్.. రాజస్తాన్ రాయల్స్.. దుబాయ్.. రాత్రి 7.30 గంటలు సెప్టెంబర్ 25: పంజాబ్ కింగ్స్ వర్సెస్.. ఎస్ఆర్హెచ్.. షార్జా.. రాత్రి 7.30 గంటలు సెప్టెంబర్ 28: పంజాబ్ కింగ్స్ వర్సెస్.. ముంబై ఇండియన్స్.. అబుదాబి.. రాత్రి 7.30 గంటలు అక్టోబర్ 1: పంజాబ్ కింగ్స్.. వర్సెస్.. కేకేఆర్ .. దుబాయ్.. రాత్రి 7.30 గంటలు అక్టోబర్ 3: పంజాబ్ కింగ్స్.. వర్సెస్.. ఆర్సీబీ.. షార్జా.. సాయంత్రం 3:30 గంటలు అక్టోబర్ 7: పంజాబ్ కింగ్స్.. వర్సెస్.. సీఎస్కే.. దుబాయ్.. సాయంత్రం 3:30 గంటలు ఎస్ఆర్హెచ్ రెండో ఫేజ్ మ్యాచ్లు సెప్టెంబర్ 22 : ఎస్ఆర్హెచ్.. వర్సెస్.. ఢిల్లీ క్యాపిటల్స్.. దుబాయ్.. రాత్రి 7.30 గంటలు సెప్టెంబర్ 25 : ఎస్ఆర్హెచ్.. వర్సెస్.. పంజాబ్ కింగ్స్.. షార్జా.. రాత్రి 7.30 గంటలు సెప్టెంబర్ 27 : ఎస్ఆర్హెచ్.. వర్సెస్.. రాజస్తాన్ రాయల్స్.. దుబాయ్.. రాత్రి 7.30 గంటలు సెప్టెంబర్ 30 : ఎస్ఆర్హెచ్.. వర్సెస్.. సీఎస్కే.. షార్జా.. రాత్రి 7.30 గంటలు అక్టోబర్ 3 : ఎస్ఆర్హెచ్ వర్సెస్.. కేకేఆర్ .. దుబాయ్.. రాత్రి 7.30 గంటలు అక్టోబర్ 6 : ఎస్ఆర్హెచ్ వర్సెస్.. ఆర్సీబీ.. అబుదాబి.. రాత్రి 7.30 గంటలు అక్టోబర్ 8 : ఎస్ఆర్హెచ్ వర్సెస్.. ముంబై ఇండియన్స్.. అబుదాబి.. సాయంత్రం 3:30 గంటలు రాజస్తాన్ రాయల్స్ రెండో ఫేజ్ మ్యాచ్లు సెప్టెంబర్ 21: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్.. పంజాబ్ కింగ్స్.. దుబాయ్.. రాత్రి 7.30 గంటలు సెప్టెంబర్ 25: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్.. ఢిల్లీ క్యాపిటల్స్.. అబుదాబి.. సాయంత్రం 3:30 గంటలు సెప్టెంబర్ 27: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్.. ఎస్ఆర్హెచ్.. దుబాయ్.. రాత్రి 7.30 గంటలు సెప్టెంబర్ 29: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్.. ఆర్సీబీ.. దుబాయ్.. రాత్రి 7.30 గంటలు అక్టోబర్ 2: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్.. సీఎస్కే.. అబుదాబి.. రాత్రి 7.30 గంటలు అక్టోబర్ 5: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్.. ముంబై ఇండియన్స్.. షార్జా.. రాత్రి 7.30 గంటలు అక్టోబర్ 7: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్.. కేకేఆర్ .. షార్జా.. రాత్రి 7.30 గంటలు -
Chris Woakes: వాటి కోసమే ఐపీఎల్ వద్దనుకున్నా
లండన్: ఐపీఎల్తో పోలిస్తే మరో రెండు ప్రధాన టోర్నీలకే (టి20 వరల్డ్కప్, యాషెస్) తన తొలి ప్రాధాన్యత కావడంతో లీగ్ రెండో దశలో పోటీల్లో పాల్గొనడం లేదని ఇంగ్లండ్ ఆల్రౌండర్ వోక్స్ వెల్లడించాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న అతను ఈసారికి ఆడలేనంటూ తప్పుకున్నాడు. ‘టి20 వరల్డ్ కప్లో పాల్గొనే జట్టులో చోటు లభించడంతో అంతా మారిపోయింది. అందుకే జాతీయ జట్టుకే ప్రాధాన్యతనిస్తూ ఐపీఎల్కు దూరమయ్యాను’ అని వోక్స్ తెలిపాడు. -
షకీబ్ ఆల్టైమ్ ఎలెవెన్ జాబితా.. షాక్లో డివిలియర్స్, గేల్
దుబాయ్: ఐపీఎల్ 14వ సీజన్ సెకండ్ ఫేజ్ ప్రారంభానికి వారం మాత్రమే గడువు ఉండడంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లా స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ తన ఆల్టైమ్ ఐపీఎల్ ఎలెవెన్ జాబితాను ప్రకటించాడు. మొత్తం 11 మందితో కూడిన జాబితాలో విండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యపరిచింది. షకీబ్ ప్రకటించిన టీమ్కు ఎంఎస్ ధోనిని(సీఎస్కే) కెప్టెన్గా, వికెట్ కీపర్గా ఎంపిక చేశాడు. చదవండి: 'నీకు హిందీ వచ్చా' అంటూ ప్రశ్న.. డేవిడ్ మిల్లర్ కౌంటర్ ఇక రోహిత్ శర్మ( ముంబై ఇండియన్స్), డేవిడ్ వార్నర్(ఎస్ఆర్హెచ్)లను ఓపెనర్లుగా ఎంపిక చేశాడు. వన్డౌన్లో విరాట్ కోహ్లి(ఆర్సీబీ), మిడిలార్డర్లో ధోనితో పాటు కేఎల్ రాహుల్( కింగ్స్ పంజాబ్)ను ఎంచుకున్నాడు. ఇక ఆల్రౌండర్లుగా బెన్ స్టోక్స్(రాజస్తాన్ రాయల్స్), రవీంద్ర జడేజా( సీఎస్కే)లను ఎంపిక చేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే మలింగ, బుమ్రా, భువనేశ్వర్లను ఫాస్ట్ బౌలర్లుగా ఎంపిక చేసుకున్నాడు. కాగా షకీబ్ ఐపీఎల్లో కేకేఆర్కు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక షకీబ్ ప్రకటించిన జాబితాలో ఆటగాళ్లు వ్యక్తిగతంగా ఒక్కో మైలురాయిని అందుకోవడం విశేషం. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా రోహిత్ నిలిస్తే.. విదేశీ ఆటగాళ్ల జాబితాలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్నది వార్నర్కే. ఇక కోహ్లి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు(6వేల పరుగులు) చేసిన బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించాడు. ఇక కెప్టెన్గా ఎంపికయిన ధోని ఐపీఎల్లోనే సీఎస్కే మూడు సార్లు ట్రోఫీ అందించిన ఆటగాడిగా నిలిచాడు. షకీబ్ ఆల్టైమ్ ఐపీఎల్ ఎలెవెన్ జాబితా: ఎంఎస్ ధోనిని(కెప్టెన్, వికెట్ కీపర్)రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లి(ఆర్సీబీ), కేఎల్ రాహుల్, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ చదవండి: Gambhir: మనం ఇంకా రాహుల్ అసలైన బ్యాటింగ్ చూడలేదు.. -
నాలాంటి ముసలి వాడికి కాస్త కష్టమే: డివిల్లియర్స్
RCB AB de Villiers: క్రికెట్ ప్రేమికులకు పొట్టి ఫార్మాట్లోని అసలైన మజా అందించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 రెండో దశ త్వరలోనే ఆరంభం కానుంది. ఆటగాళ్లు విజయవంతంగా క్వారంటైన్ పూర్తిచేసుకుని, కోవిడ్ భయాలేవీ లేకుండా అన్నీ సజావుగా సాగితే ఎంటరైన్మెంట్కు కొదవే ఉండదు. ఇక.. యూఏఈ వేదికగా జరుగనున్న మిగిలిన మ్యాచ్ల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచేందుకు ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే యూఏఈకి చేరుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్ సైతం నెట్స్లో ప్రాక్టీసు చేస్తూ.. చెమటోడుస్తున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఆర్సీబీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా.. ‘‘ఇక్కడ అంతా బాగానే ఉంది. వికెట్ కాస్త కఠినంగానే ఉంది. బౌలర్లు చాలా బాగా బౌల్ చేస్తున్నారు. అయితే.. ఇక్కడ హుమిడిటీ(ఆర్ద్రత) ఎక్కువ కదా. విపరీతంగా చెమట పట్టేస్తోంది. బరువు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే, నాలాంటి ముసలివాళ్లకు కాస్త కష్టమే కదా’’ అని 37 ఏళ్ల డివిల్లియర్స్ సరదాగా వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. చాలా గ్యాప్ తర్వాత సహచర ఆటగాళ్లను కలుసుకోవడం గురించి స్పందిస్తూ.. ‘‘ఈ సెషన్ చాలా బాగా సాగింది. క్రికెటర్లందరినీ ఒకే చోట చూడటం సంతోషంగా ఉంది. ఇన్నాళ్లు వాళ్లను చాలా మిస్సయ్యాను. ఇప్పుడు అంతా ఒక్కచోట చేరాం. రేపటి వార్మప్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని డివిల్లియర్స్ చెప్పుకొచ్చాడు. కాగా సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్-2021 రెండో అంచె ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2021 Phase 2: ఇయాన్ మోర్గాన్ నా గురించి ఏమనుకుంటున్నాడో.. Bold Diaries: AB starts net sessions The cameras were on Mr.360 as he resumed practice ahead of #IPL2021. AB spoke to us about his first hit, reuniting with RCB, & how he visualizes the match situations in his mind, on @myntra presents Bold Diaries.#PlayBold #WeAreChallengers pic.twitter.com/jhd23zv99q — Royal Challengers Bangalore (@RCBTweets) September 13, 2021 -
'నీకు హిందీ వచ్చా' అంటూ ప్రశ్న.. డేవిడ్ మిల్లర్ కౌంటర్
కొలంబొ: ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీలకు వారం సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే లీగ్లో పాల్గొననున్న విదేశీ ఆటగాళ్లంతా యూఏఈకి చేరుకుంటున్నారు. ఈసారి అభిమానుల కోలాహలంతో మైదానాలు హోరెత్తనున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్స్మన్ డేవిడ్ మిల్లర్.. ఒక అభిమాని వేసిన చిలిపి ప్రశ్నకు ధీటుగా కౌంటర్ ఇచ్చాడు. మిల్లర్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న మిల్లర్ ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యగ్నిక్ ట్విటర్లో వేసిన ప్రశ్నకు తనదైన శైలిలో మీమ్ క్రియేట్ చేశాడు. చదవండి: IPL 2021 Phase 2: ఇయాన్ మోర్గాన్ నా గురించి ఏమనుకుంటున్నాడో.. మిల్లర్ను ఉద్దేశించి దిశాంత్.. ''మీరు రాజస్తాన్ రాయల్స్ అడ్మిన్ ఎవరో చూడాలనుకుంటున్నారా?'' అని అడిగాడు. దీనికి బదులుగా మిల్లర్.. కబీ ఖుషి కబీ గమ్ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ''బస్ కీజియే బహుత్ హో గయా''( ఇక చాలు.. ఇక్కడితో ఆపేయ్) అని పెట్టాడు. మిల్లర్ పెట్టిన మీమ్పై ఒక అభిమాని చిలిపి ప్రశ్న వేశాడు. ''నీకసలు హిందీ వచ్చా? అని అడిగాడు. ''ఇట్టూ సా'' అంటూ కామెడీ నైట్స్ విత్ కపిల్ షోలో అలీ సాగర్ పాపులర్ డైలాగ్ను పెట్టాడు. ఇట్టు సా అంటే '' నాకింతే వచ్చు'' అని అర్థం. కాగా ఐపీఎల్ 14వ సీజన్ మలిదశ పోటీలకు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ అందుబాటులో లేకపోవడంతో డేవిడ్ మిల్లర్ కీలకం కానున్నాడు. ఈ సీజన్లో మిల్లర్ 6 మ్యాచ్ల్లో 102 పరుగులు చేశాడు. ఇక సంజూ శాంసన్ ఆధ్వర్యంలోని రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో పడుతూ లేస్తూ వచ్చింది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో మూడు విజయాలు.. నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. చదవండి: IPL 2021 Second Phase: ఐపీఎల్లో నెట్ బౌలర్లుగా విండీస్ బౌలర్లు... https://t.co/RNlH6g3xun pic.twitter.com/TxAwlOStrG — David Miller (@DavidMillerSA12) September 13, 2021 -
ఐపీఎల్ 2021: బెయిర్ స్టో స్థానంలో విండీస్ స్టార్ ఆటగాడు
దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్ రెండో అంచె పోటీలకు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు దూరమవుతున్న సంగతి తెలిసిందే. జానీ బెయిర్ స్టో, క్రిస్ వోక్స్, డేవిడ్ మలాన్లు ఐపీఎల్ 14వ సీజన్కు దూరంగా ఉండనున్నారు. రానున్న టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బెయిర్ స్టో స్థానంలో వెస్టిండీస్ వికెట్ కీపర్ షెర్పెన్ రూథర్ఫోర్డ్ను తీసుకున్నట్లు సన్రైజర్స్ హైదరాబాద్ ట్విటర్ ద్వారా తెలిపింది. ఈ మేరకు ప్రస్తుతం సీపీఎల్లో ఆడుతున్న రూథర్ఫోర్ట్ త్వరలోనే దుబాయ్కు చేరుకోనున్నాడు. జానీ బెయిర్ స్టో స్థానంలో కరీబియన్ రైసర్ వస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ టూ షెర్పెన్ రూథర్ఫోర్ట్ అంటూ కామెంట్ చేసింది. చదవండి: Viral Video: రనౌట్ అవకాశం; ఊహించని ట్విస్ట్.. ఫీల్డర్ల పరుగులు ఇక 2018లో వెస్టిండీస్ తరపున అరంగేట్రం చేసిన రూథర్ఫోర్ట్ 6 టీ20 మ్యాచ్లాడి 43 పరగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీశాడు. ఓవరాల్గా ఇప్పటివరకు 43 టీ20 మ్యాచ్లాడి 624 పరుగులు చేశాడు. కాగా ఇంతకముందు రూథర్ఫోర్డ్ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నిరాశజనక ప్రదర్శన కనబరిచింది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. కరోనాతో లీగ్ వాయిదా పడడానికి ముందు డేవిడ్ వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్కు బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. చదవండి: IPL 2021: కళ తప్పనున్న మలిదశ ఐపీఎల్.. ముగ్గురు స్టార్ ఆటగాళ్లు దూరం -
టెస్టు ఆడలేం... ఐపీఎల్కు సిద్ధం!
మాంచెస్టర్/దుబాయ్: ఐపీఎల్ రెండో దశ పోటీ ల్లో పాల్గొనేందుకు భారత క్రికెటర్లు యూఏఈ చేరుకున్నారు. ముంబై ఇండియన్స్ జట్టు తమ ఆటగాళ్లు రోహిత్ శర్మ, బుమ్రా, సూర్య కుమార్ కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేయగా... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా కోహ్లి, సిరాజ్ కోసం ఇదే తరహా ఏర్పాటు చేసింది. టెస్టు సిరీస్లో భాగంగా ఉండి ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లాల్సిన మిగిలిన భారత క్రికెటర్లతో (16 మంది)పాటు ఇంగ్లండ్ ప్లేయర్ స్యామ్ కరన్ మాంచెస్టర్ నుంచి కమర్షియల్ ఫ్లయిట్ ద్వారా యూఏఈకి వెళ్లారు. వీరి కోవిడ్ పరీక్షలన్నీ ‘నెగెటివ్’గా తేలాయి. యూఏఈ దేశపు నిబంధనల ప్రకారం క్రికెటర్లంతా ఆరు రోజుల పాటు తమ హోటల్ గదుల్లో క్వారంటైన్లో గడపాల్సి ఉం టుంది. ఆ తర్వాత తమ జట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బయో బబుల్లో వీరు చేరతారు. ఏదైనా జరగవచ్చని... శుక్రవారం నుంచి ఓల్డ్ట్రాఫోర్డ్ మైదానంలో జరగాల్సిన భారత్, ఇంగ్లండ్ చివరి టెస్టు అనూహ్యంగా రద్దయింది. గురువారం రాత్రి భారత క్రికెటర్లందరి కోవిడ్ రిపోర్టులు ‘నెగెటివ్’గా వచి్చనా... మ్యాచ్ మధ్యలో ఏదైనా జరగవచ్చనే భయమే టీమిండియా ఆటగాళ్లను బరిలోకి దిగకుండా చేసింది. సహజంగానే కరోనా ప్రభావం కొంత ఆలస్యంగా కనిపించే అవకాశం ఉంది కాబట్టి ఆడకపోవడమే మంచిదని కోహ్లి బృందం భావించింది. మ్యాచ్ జరగాల్సిన రోజు ఉదయం సుదీర్ఘ సమయం పాటు చర్చించాక ఇరు బోర్డులు టెస్టును రద్దు చేయాలని నిర్ణ యించాయి. భారత జట్టు పూర్తి జట్టును బరిలోకి దింపే పరిస్థితిలో లేదని ఇంగ్లండ్ బోర్డు ప్రకటించగా... ప్లేయర్ల ఆరోగ్యభద్రతే తమకు అన్నింటి కంటే ముఖ్యమని బీసీసీఐ ప్రకటించింది. విమర్శలు, ప్రతివిమర్శలు... ఐపీఎల్లో ఒక్క మ్యాచ్కు కూడా ఇబ్బంది రాకుండా ఉండాలనే భారత క్రికెటర్లు టెస్టు నుంచి తప్పుకున్నారని, వారికి టెస్టులకంటే ఐపీఎల్ అంటేనే ప్రాధాన్యత అని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు, మీడియా భారత జట్టుపై విరుచుకుపడ్డారు. రెండో కోవిడ్ ‘నెగెటివ్’ రిపోర్టు వచ్చాకే యూఏఈ బయల్దేరిన వీరు అదే రిపోర్టుతో ఒక రోజు ఆలస్యంగా టెస్టు ఆడితే ఏమయ్యేదని వారు ప్రశి్నంచారు. టెస్టు సిరీస్లో భారత్, ఇంగ్లండ్ కాకుండా చివరకు ‘డబ్బు’ గెలిచిందని వారు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై భారత అభిమానులు ‘డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత జట్టు నలభై రోజులు ఖాళీగా కూర్చుంది. టెస్టు సిరీస్ను కాస్త ముందుగా జరపమన్నా వినలేదు. పైగా పనికిమాలిన ‘హండ్రెడ్’ కోసం రెండో, మూడో టెస్టుల మధ్య 9 రోజుల విరామం ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఐపీఎల్ను విమర్శించడంలో అర్థం లేదు’ అని ఘాటుగా స్పందించారు. సిరీస్ ఫలితం ఏమిటి? ఐదో టెస్టు రద్దుతో సిరీస్ ఫలితంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇంకా స్పష్టతనివ్వాల్సి ఉంది. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) నిబంధనల ప్రకారం కోవిడ్ కారణంగా మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే మ్యాచ్ను రద్దు చేయవచ్చు. అలా చూస్తే భారత్ 2–1తో సిరీస్ గెలుచుకున్నట్లే. అయితే ఇంగ్లండ్ బోర్డు (ఈసీబీ) దీనిని అంగీకరించడం లేదు. మధ్యే మార్గంగా ఈ టెస్టును రాబోయే రోజుల్లో మళ్లీ ఎప్పుడైనా ఆడేందుకు తాము సిద్ధమని బీసీసీఐ ప్రకటించింది. వచ్చే ఏడాది జూన్లో భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం ఇంగ్లండ్కు వెళ్లాల్సి ఉంది. అప్పుడు ఏమైనా ఈ టెస్టు కోసం తేదీలు సర్దుబాటు చేయవచ్చు. అయితే ఈసీబీ సీఈఓ టామ్ హారిసన్ మాత్రం దానిని ప్రస్తుత సిరీస్లో భాగంగా కాకుండా ‘ఏౖకైక టెస్టు’గా ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. -
ఆ మూడు ఐపీఎల్ జట్లకు భారీ షాక్.. ముగ్గురు స్టార్ ఆటగాళ్లు దూరం
దుబాయ్: సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచ్లు కళ తప్పనున్నాయా అంటే అవుననే అంటున్నాయి ఇంగ్లీష్ మీడియా కథనాలు. వివరాల్లోకి వెళితే.. వివిధ ఫ్రాంచైజీలకు చెందిన ముగ్గురు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు క్యాష్ రిచ్ లీగ్కు దూరం కానున్నట్లు బ్రిటీష్ మీడియా వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. సన్రైజర్స్ కీలక ఆటగాడు జానీ బెయిర్స్టో, పంజాబ్ కింగ్స్ ఆటగాడు డేవిడ్ మలాన్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు క్రిస్ వోక్స్.. మలిదశ ఐపీఎల్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరుగనున్న టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని సదరు ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ విషయానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఆటగాళ్ల గైర్హాజరీపై ఆయా ఫ్రాంచైజీల యాజమాన్యాలు స్పందిచాల్సి ఉంది. కాగా, ఇదివరకే పలువురు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు వివిధ కారణాల చేత లీగ్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్కు చెందిన జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ ఐపీఎల్కు అందుబాటులో ఉండమని ప్రకటించారు. మొత్తంగా మలిదశ ఐపీఎల్లో ఇంగ్లండ్ ఆటగాళ్ల మెరుపులు లేకపోవడంతో లీగ్ కళ తప్పనుందని అభిమానులు నిరాశ చెందుతున్నారు. చదవండి: ఈసారి టైటిల్ నెగ్గేది మేమే: డీసీ స్టార్ ప్లేయర్ -
ఈసారి టైటిల్ నెగ్గేది మేమే: డీసీ స్టార్ ప్లేయర్
దుబాయ్: సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచ్ల కోసం దుబాయ్ చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు, ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. ఇటీవలే క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ప్రస్తుత ఎడిషన్లో ఢిల్లీ విజయావకాశాలపై ఆయన స్పందిస్తూ.. ఈసారి తమ జట్టు కచ్చితంగా ఫైనల్కు చేరి టైటిల్ చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. అయితే, ఇందుకోసం తాము అత్యుత్తమ క్రికెట్ను ఆడాల్సి ఉందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా అతను శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీపై కూడా స్పందించాడు. అయ్యర్ లాంటి నాణ్యమైన ఆటగాడు జట్టులో ఉండడం సానుకూలాంశమని, అతని చేరికతో ఢిల్లీ టాపార్డర్కు మరింత బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో ఆడే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమన్నాడు. కాగా, గాయం కారణంగా తొలి దశ ఐపీఎల్ 2021కు శ్రేయస్ అయ్యర్ దూరమవ్వడంతో అతడి స్థానంలో స్మిత్ ఆడిన విషయం తెలిసిందే. మరోవైపు, రిషబ్ పంత్ సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలి దశ మ్యాచ్లలో వరుస విజయాలు సాధించింది. ఆడిన 8 మ్యాచ్ల్లో 6 విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తొలిసారి సారథ్య బాధ్యతలు చేపట్టిన పంత్ ఆకట్టుకున్నాడు. దీంతో గాయం నుంచి కోలుకుని అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చినా.. అతడికి కెప్టెన్సీ దక్కలేదు. కాగా, అయ్యర్ సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది ఫైనల్స్కు చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. డీసీ జట్టు సెకెండ్ లెగ్ తొలి మ్యాచ్ను సెప్టెంబర్ 22న సన్రైజర్స్తో ఆడనుంది. చదవండి: ప్రేయసి కోసం కష్టపడ్డాడు.. ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించాడు..! -
నెట్స్లో ఇరగదీసిన శిఖర్ ధావన్.. వీడియో వైరల్
దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021కు సంబంధించి బీసీసీఐ ప్రకటించిన టీమిండియా జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ను ఎంపిక చేయలేదు. ఫామ్లో ఉన్న ధావన్ను పరిగణలోకి తీసుకోకపోవడంపై అభిమానుల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. స్థిరత్వ ప్రదర్శన ఉంటే సరిపోదని.. ఆటలో వేగం ఉండాలనే కారణంతో ధావన్ స్థానంలో మూడో ఓపెనర్గా ఇషాన్ కిషన్ను ఎంపిక చేసినట్లు సెలక్టర్లు చెప్పుకొచ్చారు. చదవండి: T20 World Cup 2021: శిఖర్ ధావన్ను అందుకే ఎంపిక చేయలేదా! ఈ విషయం పక్కనపెడితే శిఖర్ ధావన్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీల్లో పాల్గొనేందుకు ధావన్ ఇప్పటికే యూఏఈకి చేరుకున్నాడు. తాజాగా నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోనూ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ప్యాడ్స్ కట్టుకోవడం దగ్గర్నుంచి బ్యాటింగ్ చేసేవరకు ప్రతీది వీడియోలో పొందుపరిచాడు. వీడియో కింద 'సూర్మా' అని క్యాప్షన్ జత చేశాడు. సూర్మా అంటే పంజాబీ భాషలో ''డేరింగ్ అండ్ డాషింగ్'' అని అర్థం. ఇక శిఖర్ ధావన్ ఐపీఎల్ 14వ సీజన్లో ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి టాప్ స్కోరర్గా నిలిచాడు. 8 మ్యాచ్లాడిన ధావన్ 134.27 స్ట్రైక్ రేట్తో 380 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్రదర్శనతో దుమ్మురేపి టేబుల్ టాపర్గా నిలిచింది. 8 మ్యాచ్ల్లో 6 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. చదవండి: T20 World Cup: వారిద్దరికి దక్కని చోటు.. గావస్కర్ టీ 20 ప్రపంచకప్ జట్టు ఇదే! Shane Warne: టీమిండియా అద్భుతం; ఆటతీరుతో నా టోపీని ఎత్తుకెళ్లారు View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) -
కోహ్లి, సిరాజ్ల కోసం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్
దుబాయ్: ఇంగ్లండ్తో జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ కరోనా కారణంగా అర్థంతరంగా రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా 2-1 తేడాతో సిరీస్తో ఆధిక్యంలో ఉంది. ఇక ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీలకు వారం సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఇంగ్లండ్ టూర్లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు యూఏఈకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ కెప్టెన్ విరాట్ కోహ్లి, మహ్మద్ సిరాజ్ల కోసం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ను లండన్కు పంపించనుంది. చార్టర్ ఫ్లైట్లో దుబాయ్కి చేరుకోనున్న ఈ ఇద్దరు ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. ఈ విషయాన్ని ఆర్సీబీ ఒక ప్రకటనలో తెలిపింది. కోహ్లి, సిరాజ్ల కోసం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ను సిద్ధం చేశాం. శనివారం రాత్రి కోహ్లి, సిరాజ్లు చార్టర్ ఫ్లైట్ ఎక్కుతారు.. ఆదివారం ఉదయం దుబాయ్లో దిగిన వెంటనే నిబంధనల ప్రకారం ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. అంటూ ఆర్సీబీ పేర్కొంది. చదవండి: IND VS ENG 5th Test: ఒక్క టెస్ట్ మ్యాచ్ రద్దవడం వల్ల ఇంత భారీ నష్టమా..? ఇక ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీ మంచి ప్రదర్శన కనబరిచింది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో 5 విజయాలు, రెండు ఓటములతో 10 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించడం ఆర్సీబీ ఫ్రాంచైజీ చరిత్రలో తొలిసారి కావడం విశేషం. ఈసారి టైటిల్ ఫెవరెట్లలో ఆర్సీబీ ఒకటని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చదవండి: SL Vs SA: ఓపెనర్గా వచ్చి నాటౌట్.. అయినా గెలిపించలేకపోయాడు -
ఆ క్రికెట్ దిగ్గజం సలహాలు నా ఆటతీరుని మెరుగుపర్చాయి..
ముంబై: ఒమన్ పర్యటనకు వెళ్లే ముందు తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్తో ముచ్చటించడం తనకు మరపురాని అనుభూతిని కలిగించిందని ముంబై యువ బ్యాట్స్మన్ యశస్వి జైశ్వాల్ పేర్కొన్నాడు. సచిన్ అంతటి ఆటగాడు తనకు సలహాలివ్వడం అద్భుతంగా అనిపించిందని, వాటి వల్ల నా ఆటతీరు చాలా మెరుగుపడిందని తెలిపాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో ముచ్చటించడంపై యశస్వి స్పందిస్తూ.. ఒమన్ పర్యటనకు వెళ్లే ముందు ముంబై క్రికెట్ అసోసియేషన్ సచిన్తో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిందని తెలిసి ఎగిరి గంతులేశానని, ఈ సందర్భంగా సచిన్తో మాట్లాడే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా యశస్వి ఐపీఎల్ మలిదశ మ్యాచ్లపై కూడా స్పందించాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించే యశస్వి.. ఒమన్ పర్యటన తనకు ఉపయోగపడుతుందని తెలిపాడు. ఒమన్లోని వాతావరణం యూఏఈలో లాగే ఉంటుందని, పిచ్లు దాదాపు ఒకే విధంగా ఉంటాయని, ఈ అంశాలు తాను రాణించేందుకు తోడ్పడతాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. అలాగే రాజస్థాన్ ప్లే ఆఫ్ దశకు చేరుతుందని, టీమిండియాకు ఆడడమే తన తదుపరి లక్ష్యమని యశస్వి చెప్పుకొచ్చాడు. కాగా, ఐపీఎల్ 13వ సీజన్లో యశస్వి తొలిసారిగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ఆ సీజన్లో ఆర్ఆర్ జట్టు అతన్ని రూ. 20లక్షల కనీస ధరకు చేజిక్కించుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్లో 3 మ్యాచ్లు ఆడిని యశస్వి.. 66 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, త్వరలో జరుగనున్న టీ20 ప్రపంచకప్ 2021 క్వాలిఫయర్స్ నేపథ్యంలో సన్నాహక మ్యాచ్ల కోసం ముంబై క్రికెట్ జట్టుని ఒమన్ తమ దేశానికి ఆహ్వానించింది. ఈ పర్యటనలో ఒమన్.. ముంబైతో మూడు టీ20లు, నాలుగు వన్డేలు ఆడింది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్లో యశస్వి జైశ్వాల్ అద్భుతంగా రాణించాడు. పలు కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. చదవండి: ఇకపై అక్కడ మహిళల 'ఆటలు' సాగవు.. -
ఢిల్లీ పగ్గాలు పంత్కే.. శ్రేయస్కు భంగపాటు
దుబాయ్: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్ను సారధ్య బాధ్యతల్లో యధావిధిగా కొనసాగించాలని ఢిల్లీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. యూఏఈ వేదికగా ఈనెల 19 నుంచి జరిగే ఐపీఎల్ మలి దశ మ్యాచ్లకు పంత్ను తప్పించి, శ్రేయస్ అయ్యర్కు తిరిగి కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో డీసీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. భుజం గాయం కారణంగా గత కొంతకాలంగా క్రికెట్ దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్కు కెప్టెన్సీ అప్పగించి ప్రయోగం చేయదలచుకోలేదని ప్రకటించింది. ప్రస్తుతం శ్రేయస్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, ఆటగాడిగా జట్టుకు సేవలందిస్తాడని స్పష్టం చేసింది. కాగా, గాయం కారణంగా భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ మొదటి దశ మ్యాచ్లకు శ్రేయస్ దూరం కావడంతో పంత్ డీసీ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. పంత్ సారధ్యంలో డీసీ తొలి దశ మ్యాచ్లలో వరుస విజయాలు(8 మ్యాచ్ల్లో 6 విజయాలు) సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు గత రెండున్నర సీజన్లుగా డీసీ జట్టును శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ముందుండి నడిపించాడు. అతని సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది ఫైనల్స్కు కూడా చేరింది. ఇదిలా ఉంటే, డీసీ జట్టు ఐపీఎల్ సెకెండ్ లెగ్ తొలి మ్యాచ్ను సెప్టెంబర్ 22న సన్రైజర్స్తో ఆడనుంది. చదవండి: అన్నీ మాకు సానుకూలాంశాలే, టీమిండియాను కచ్చితంగా ఓడిస్తాం..పాక్ కెప్టెన్ ధీమా -
విండీస్ విధ్వంసకర ఆటగాడిని దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్
న్యూఢిల్లీ: సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఐపీఎల్ పార్ట్-2 నుంచి పలువురు ఆటగాళ్లు వివిధ కారణాలు చేత తప్పుకోవడంతో ఆయా ఫ్రాంచైజీలు వారి స్థానాలను భర్తీ చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇదివరకే చాలా జట్లు రిప్లేస్మెంట్ ఆటగాళ్లును ఎంపిక చేసుకున్నాయి. తాజాగా, రాజస్తాన్ రాయల్స్ జట్టు వ్యక్తిగత కారణాల చేత లీగ్కు దూరంగా ఉన్న జోస్ బట్లర్ స్థానాన్ని విండీస్ విధ్వంసకర యోధుడు ఎవిన్ లూయిస్తో భర్తీ చేయాలని నిర్ణయించింది. అలాగే గాయం కారణంగా లీగ్ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ప్లేస్ను విండీస్కే చెందిన ఒషేన్ థోమాస్తో రీప్లేస్ చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో ఒషేన్ థోమాస్కు ఐపీఎల్లో ఇదే జట్టుకు 4 మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. ఇక ఎవిన్ లూయిస్ విషయానికొస్తే.. ఈ పవర్ హిట్టర్ గతంలో ముంబై ఇండియన్స్ జట్టుకు 16 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ముంబై తరఫున అతను 131 స్ట్రయిక్ రేట్తో 430 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. కాగా, ఎవిన్ లూయిస్కు అంతర్జాతీయ టీ20ల్లో హార్డ్ హిట్టర్గా మంచి గుర్తింపు ఉంది. అతను విండీస్ తరఫున 45 మ్యాచ్ల్లో 158 స్ట్రయిక్ రేట్తో 1318 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలు, 9 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, సంజూ సామ్సన్ నేతృత్వంలోని ఆర్ఆర్ జట్టు ఐపీఎల్ సెకెండ్ లెగ్లో తమ తొలి మ్యాచ్ను సెప్టెంబర్ 21న ఆడనుంది. ఈ మ్యాచ్లో ఆర్ఆర్.. పంజాబ్ కింగ్స్ను ఢీకొంటుంది. ప్రస్తుత సీజన్లో ఆర్ఆర్ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 3 విజయాలు, 4 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. చదవండి: ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడండి.. టీమిండియా దెబ్బ తిన్న పులిలా గర్జిస్తుంది -
Viral Video: అక్కడ జాన్ సీనా అయితే ఇక్కడ సురేశ్ రైనా..
దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు సురేశ్ రైనా మైదానంలోనూ, వెలుపల ఫుల్ జోష్లో ఉంటాడు. ఐపీఎల్ మలిదశ మ్యాచ్ల కోసం ప్రస్తుతం దుబాయ్లోని ప్రాక్టీస్ సెషన్లలో బిజీగా ఉన్న అతను.. తాజాగా ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అందులో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సీనా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుండగా, స్విమ్మింగ్ పూల్ వద్ద సహచరుడు కేఎమ్ ఆసిఫ్తో రైనా జాన్ సీనా స్టంట్ను ప్రదర్శిస్తాడు. దీనికి 'దట్ నేమ్ ఈజ్ జాన్ సీనా.. మై నేమ్ ఈజ్ సురేశ్ రైనా' అని క్యాప్షన్ను జోడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. రైనా అద్భుతంగా స్టంట్ను ప్రదర్శించాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ సెకెండ్ లెగ్ మ్యాచ్లు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. అదే రోజు సీఎస్కే జట్టు ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఇదిలా ఉంటే, ఈ సీజన్లో జరిగిన తొలి ఏడు మ్యాచ్ల్లో 5 విజయాలు, 2 పరాజయాలతో సీఎస్కే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా, ఢిల్లీ 8 మ్యాచ్ల్లో 6 విజయాలు, 2 పరాజయాలతో టాప్లో కొనసాగుతోంది. అయితే, మొదటి 7 మ్యాచ్ల్లో అర్ధ సెంచరీ సహా కేవలం 123 పరుగులు మాత్రమే చేసిన రైనా.. చెన్నై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. చదవండి: ఆండర్సన్కు ఇదే ఆఖరి సిరీస్.. ఐదో టెస్ట్ అనంతరం రిటైర్మెంట్..? View this post on Instagram A post shared by Suresh Raina (@sureshraina3) -
IPL 2021: ఆర్సీబీకి షాక్.. గాయంతో స్టార్ ఆల్రౌండర్ ఔట్
దుబాయ్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్.. చేతి వేలికి గాయం కారణంగా ఐపీఎల్-2021 మలి దశ మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆర్సీబీ కీలక ఆటగాళ్లలో ఒకడైన సుందర్ సీజన్ మొత్తానికి దూరం కావడంతో ఆ జట్టుపై ప్రభావం పడనుంది. సుందర్ స్థానంలో బెంగాల్ బౌలర్ అకాశ్దీప్కు ఆర్సీబీ యాజమాన్యం అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ఆకాశ్దీప్ ఆర్సీబీ క్యాంప్లో నెట్ బౌలర్గా ఉన్నాడు. కాగా, సుందర్ ఇదే చేతి వేలి గాయం కారణంగా ఇంగ్లండ్ పర్యటన నుంచి అర్ధంతరంగా వైదొలిగిన సంగతి తెలిసిందే. 🔊 ANNOUNCEMENT 🔊 Washington Sundar has been ruled out of the remainder of #IPL2021 as he hasn’t fully recovered from his finger injury. Akash Deep, a state cricketer from Bengal who until now was a net bowler with RCB, has been named as Washi’s replacement. #PlayBold pic.twitter.com/azaMgkaDZp — Royal Challengers Bangalore (@RCBTweets) August 30, 2021 ఇదిలా ఉంటే, యూఏఈ వేదికగా ఐపీఎల్ మలి దశ మ్యాచ్లు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కొన్ని జట్లు దుబయ్ చేరుకుని ప్రాక్టీస్లో నిమగ్నమై ఉన్నాయి. ఆర్సీబీ జట్టు యూఏఈకి ఇంకా బయల్దేరాల్సి ఉంది. ఆర్సీబీ రెండో దశ షెడ్యూల్లో సెప్టెంబర్ 20న కోల్కతా నైట్ రైడర్స్తో తమ తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. చదవండి: చెలరేగిన యశస్వి జైస్వాల్.. ఓమన్పై ముంబై విజయం -
కోల్కతాకు సౌథీ, పంజాబ్తో ఆదిల్ రషీద్ ఒప్పందం
న్యూఢిల్లీ: సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఐపీఎల్ పార్ట్-2 నుంచి పలువురు ఆటగాళ్లు వివిధ కారణాలు చేత తప్పుకోవడంతో వారి స్థానాలను భర్తీ చేసేందుకు ఆయా ఫ్రాంచైజీలు నానా తంటాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఇదివరకే చాలా జట్లు రిప్లేస్మెంట్ ఆటగాళ్లును ఎంపిక చేసుకుంది. తాజాగా, కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) జట్టు న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీని జట్టులోకి తీసుకోగా, పంజాబ్ కింగ్స్ జట్టు ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ను జట్టులోకి చేర్చుకున్నాయి. సౌథీ.. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ను రీప్లేస్ చేయనుండగా, రషీద్ ఆసీస్ పేసర్ జై రిచర్డ్సన్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఆదిల్ రషీద్ ఐపీఎల్లో తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, సౌథీ గతంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో వరుసగా ఆరు సీజన్లు ఆడిన సౌథీ గతేడాది వేలంలో అమ్ముడుపోలేదు. చివరిసారి అతను 2019 ఐపీఎల్లో కోహ్లి సారథ్యంలో ఆర్సీబీకి ఆడాడు. చదవండి: పీసీబీ అధ్యక్షుడిగా పాక్ ప్రధాని సన్నిహితుడు.. -
నేటి నుంచి ధనాధన్ క్రికెట్ లీగ్ ప్రారంభం.. భారత్లోనూ ప్రత్యక్ష ప్రసారం
సెయింట్ కిట్స్: ఐపీఎల్ తరువాత ఆ స్థాయిలో ప్రేక్షకాదరణ కలిగిన కరీబియన్ ప్రిమియర్ లీగ్-2021 నేటి నుంచి ప్రారంభంకానుంది. ఐపీఎల్ను తలపించేలా భారీ షాట్లతో అలరించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధ్వంసకర యోధులు సిద్ధంగా ఉన్నారు. విండీస్ విధ్వంసకర వీరులు క్రిస్ గేల్, కీరన్ పోలార్డ్, ఆండ్రీ రసెల్, డ్వేన్ బ్రావో సహా వివిధ దేశాలకు చెందిన చాలా మంది స్టార్ క్రికెటర్లు ఈ లీగ్లో ఆడనున్నారు. దీంతో ఐపీఎల్కు ముందే ధనాధన్ బ్యాటింగ్ విన్యాసాలు క్రికెట్ అభిమానులకు కనువిందు చేయనున్నాయి. లీగ్లో భాగంగా తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. సెయింట్ కిట్స్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో గయానా అమెజాన్ వారియర్స్(నికోలస్ పూరన్ జట్టు), ట్రింబాగో నైట్ రైడర్స్(పోలార్డ్ జట్టు) తలపడనున్నాయి. ఇదిలా ఉంటే, సీపీఎల్-2021లో భాగంగా జరిగే మ్యాచ్లన్నింటినీ స్టార్ స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. భారత సహా మరో 100 దేశాల్లో ఈ మ్యాచ్లు లైవ్ టెలికాస్ట్ కానున్నాయి. అలాగే సామాజిక మాధ్యమాలైన ట్విటర్, ఫేస్బుక్, యుట్యూబ్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారాలు చేయనున్నట్లు కరీబియన్ ప్రీమియర్ లీగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పీట్ రస్సెల్స్ తెలిపారు. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో విండీస్ క్రికెట్ బోర్డు కొన్ని అంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. స్టేడియాల్లోకి 50 శాతం మంది అభిమానులకు మాత్రమే అనుమితిస్తున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 15న జరిగే ఫైనల్ మ్యాచ్తో ఈ లీగ్ ముగియనుండగా, సరిగ్గా నాలుగు రోజుల తర్వాత(సెప్టెంబర్19) యూఏఈ వేదికగా ఐపీఎల్-2021 మలి దశ మ్యాచ్లు ప్రారంభంకానున్నాయి. చదవండి: ఇంగ్లండ్ అభిమానుల ఓవరాక్షన్.. సిరాజ్పై బంతితో దాడి -
రాజస్థాన్ రాయల్స్లోకి టీ 20 నెం.1 బౌలర్..
జైపూర్: వచ్చేనెలలో జరిగే ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్ కు రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆటగాళ్లు జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, ఆండ్రూ టై దూరమైన విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ టై స్థానంలో టీ 20 నెం.1 బౌలర్, సౌతాఫ్రికా సెన్సేషనల్ స్పిన్నర్ తబ్రాజ్ షమ్సీని రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. యూఏఈలో జరిగే ఐపీఎల్ 2021 సీజన్ మిగిలిన మ్యాచ్లకు తబ్రాజ్ షమ్సీ తో ఒప్పందం కుదర్చుకున్నట్లు రాజస్థాన్ రాయల్స్ బుధవారం ప్రకటించింది. 2017 లో ఇంగ్లాండ్తో జరిగిన ద్వైపాక్షిక టీ 20 సిరీస్లో దక్షిణాఫ్రికా తరఫున తబ్రాజ్ షమ్సీ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. షమ్సీ 39 టీ20 మ్యాచుల్లో 45 వికెట్లు పడగొట్టి ఐసీసీ ర్యాంకింగ్స్లో నెం.1 బౌలర్గా ఎదిగాడు. 2016 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన తబ్రాజ్ షమ్సీ కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కాగా ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్కి దూరమైన జోస్ బట్లర్ స్దానంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గ్లెన్ ఫిలిప్స్ను రాజస్థాన్ తీసుకుంది. చదవండి: హార్ధిక్ పాండ్యా రిస్ట్ వాచ్ ధరెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. 🪄 Magic. Shamsi. Pink. 💗 The world's No.1 T20I bowler will represent the Royals in UAE. 🇦🇪#IPL2021 | #HallaBol | #RoyalsFamily | @shamsi90 pic.twitter.com/TDGIaW9gNJ — Rajasthan Royals (@rajasthanroyals) August 25, 2021 -
ధోనీ, రైనా వీర బాదుడు.. సంబరాల్లో సీఎస్కే ఫ్యాన్స్
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-2021) సెకెండ్ లెగ్ మ్యాచ్ల కోసం కొద్ది రోజుల కిందటే దుబాయ్లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్టు ప్రాక్టీస్ను ముమ్మరం చేసింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు ధోనీ, రైనా, అంబటి రాయుడు నెట్స్లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా ధోనీ, రైనా అయితే నెట్స్లో భారీ షాట్లు ఆడుతూ.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. బంతి పడడమే ఆలస్యం.. వీర బాదుడు బాదుతూ.. మాంచి జోష్లో కనిపించారు. వీరి నెట్ ప్రాక్టీస్కు సంబంధించిన తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. 1🤩 Shots!#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/lTlaQOmZHL — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) August 23, 2021 ఇందులో ధోనీ, రైనా బాధుడును చూసి సీఎస్కే అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. త్వరలో ప్రారంభంకాబోయే ఐపీఎల్ మలిదశ మ్యాచ్ల్లో తమ స్టార్లకు పట్టపగ్గాలుండవని కాలర్ ఎగరేస్తున్నారు. కాగా, సెప్టెంబర్ 19న చెన్నై, ముంబైల మధ్య మ్యాచ్తో ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుంది. ప్రస్తుత సీజన్లో చెన్నై జట్టు 7 మ్యాచ్ల్లో 5 విజయాలు, 2 పరాజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఈ మ్యాచ్ల్లో ధోనీ, రైనా పెద్దగా రాణించింది లేదు. దీంతో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు మిగిలిన మ్యాచ్ల్లోనైనా రాణించాలని పట్టుదలగా ఉన్నారు. మరోవైపు ఫారిన్ ప్లేయర్, ఆసీస్ బౌలర్ హేజిల్వుడ్ జట్టుతో చేరడం సీఎస్కేలో నయా జోష్ వచ్చింది. చదవండి: తాలిబన్ల రాజ్యంలో తొలి నియామకం.. అఫ్గాన్ క్రికెట్ చీఫ్గా ఫజ్లీ -
చెన్నై జట్టులో 'జోష్'.. మరింత పదునెక్కిన సీఎస్కే పేస్ దళం
దుబాయ్: ఐపీఎల్ 2021 తొలి దశ మ్యాచ్లకు వ్యక్తిగత కారణాల చేత దూరమైన ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్.. యూఏఈ వేదికగా జరుగనున్న రెండో దశ మ్యాచ్లకు అందుబాటులోకి రానున్నాడు. ఈ విషయాన్ని అతను ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎస్కే ఫ్రాంచైజీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఆసీస్ స్పీడ్స్టర్ రాకతో చెన్నై జట్టులో జోష్ పెరిగిందని, తమ పేస్ విభాగం మరింత పదునెక్కిందని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ శనివారం మీడియాకు వెల్లడించారు. కాగా, జోష్ హేజిల్వుడ్ ఇటీవల బంగ్లాదేశ్తో ఆడిన టీ20 సిరీస్లో మంచి ఫామ్ను కనబర్చాడు. అతనాడిన నాలుగు మ్యాచ్ల్లో 8 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జోష్ అదే ఫామ్ను కొనసాగించాలని సీఎస్కే కోరుకుంటోంది. జోష్ రాకతో చెన్నై ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జోష్ హేజిల్వుడ్ను సీఎస్కే యాజమాన్యం ఐపీఎల్ 2020కు ముందు రూ. 2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అయితే, ఆ సీజన్లో అతడు మూడు మ్యాచ్లే ఆడాడు. జట్టులో పేసర్లు ఎక్కువగా ఉండడం, విదేశీ ఆటగాళ్ల కోటా పరిమితుల కారణంగా అతడికి ఆడే అవకాశం లభించలేదు. ఇక ఐపీఎల్ 2021 తొలి దశ మ్యాచ్లకు ముందు అతడు వ్యక్తిగత కారణాలతో లీగ్కు దూరం కావడంతో అతడి స్థానంలో ఆసీస్కే చెందిన జేసన్ బెహ్రెన్డార్ఫ్ సీఎస్కే జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం సీఎస్కే జట్టులో సామ్ కర్రన్, లుంగి ఎంగిడి, డ్వేన్ బ్రేవో, జోష్ హేజిల్వుడ్ వంటి విదేశీ ఫాస్ట్ బౌలర్లు, దీపర్ చాహర్, శార్దూల్ ఠాకూర్ వంటి దేశీయ స్టార్ పేసర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే, సెప్టెంబరు 19 ప్రారంభంకానున్న ఐపీఎల్ 2021 మలి దశ మ్యాచ్ల కోసం చెన్నై సూపర్ కింగ్స్ సహా పలు జట్లు ఇప్పటికే దుబాయ్ చేరుకుని ప్రాక్టీస్ను మొదలుపెట్టాయి. సీఎస్కే కెప్టెన్ ధోని, రైనా, అంబటి రాయుడు సహా పలువురు ఆటగాళ్లు నెట్స్లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడే సమయానికి 7 మ్యాచ్లు ఆడిన సీఎస్కే.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ (12 పాయింట్లు) ఆరు విజయాలతో ఉండగా.. మూడో స్థానంలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (10 పాయింట్లు) నిలిచింది. చదవండి: ఐపీఎల్ నుంచి బట్లర్ అవుట్! -
ఆర్సీబీ కీలక నిర్ణయం.. ప్రధాన కోచ్గా మైక్ హెసన్
దుబాయ్: ఐపీఎల్-14వ సీజన్ రెండో అంచె పోటీల ప్రారంభానికి ముందు ఆర్సీబీ కీలక మార్పులు చేస్తుంది. శనివారం జట్టులోకి ముగ్గురు కొత్త ఆటగాళ్లను తీసుకున్న ఆర్సీబీ కోచ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్సీబీ హెడ్ కోచ్ సైమన్ కటిచ్ వ్యక్తిగత కారణాలతో మిగిలిన సీజన్కు అందుబాటులో ఉండటం లేదని ప్రకటించాడు. దాంతో టీమ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ మైక్ హెసన్ ఈ సారి హెడ్కోచ్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఇక ఆర్సీబీ తన జట్టులో మూడు మార్పులు చేసింది. తొలి దశ పోటీల్లో ఆడిన ఆడమ్ జంపా, ఫిన్ అలెన్, డానియెల్ స్యామ్స్ ఈ సారి లీగ్కు దూరమయ్యారు. వారి స్థానాల్లో శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ, దుష్మంత చమీరాలను జట్టు ఎంచు కుంది. సింగపూర్కు చెందిన బ్యాట్స్మన్ టిమ్ డేవిడ్ కూడా ఆర్సీబీ టీమ్లోకి ఎంపికయ్యాడు. సింగపూర్కు చెందిన ఒక ఆటగాడు ఐపీఎల్లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ మంచి ప్రదర్శనే కనబరిచింది. 7 మ్యాచ్లాడిన ఆర్సీబీ ఐదు విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. చదవండి: MS Dhoni: ధోని సిక్సర్ల వర్షం.. ఇంత కసి దాగుందా ఐపీఎల్ నుంచి బట్లర్ అవుట్! -
ధోని సిక్సర్ల వర్షం.. ఇంత కసి దాగుందా
దుబాయ్: ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీలకు సిద్ధమవుతున్న ఎంఎస్ ధోని ప్రాక్టీస్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. యూఏఈ వేదికగా జరగునున్న రెండో దశ పోటీలకు అందరికంటే ముందు సీఎస్కే చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ధోని ప్రాక్టీస్ సమయంలో కసిగా కనిపించాడు. బంతి పడడమే ఆలస్యం.. భారీ సిక్సర్లు సంధించాడు.దీనికి సంబంధించిన వీడియోనూ ఒక అభిమాని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. ధోనీ ఆవాజ్... అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక ఈ సీజన్ మొదటి ఫేజ్లో ధోనికి బ్యాటింగ్ చేసే అవకాశం ఎక్కువగా రాలేదు. అందుకే రెండో అంచె పోటీల్లో అవకాశమొస్తే తన బ్యాటింగ్ పవర్ చూపించడానికి సిద్ధమవుతున్నాడు. కాగా ఐపీఎల్ 2020లో నిరాశజనక ప్రదర్శన కనబరిచిన సీఎస్కే జట్టు ఈసారి మాత్రం దుమ్మురేపింది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో 5 విజయాలు.. రెండు పరాజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్, సీఎస్కే మధ్య జరగనున్న మ్యాచ్తో రెండో అంచె పోటీలకు తెరలేవనుందిఘౌ చదవండి: ఐర్లాండ్ ఆటగాడి సిక్సర్ల వర్షం.. సదరన్ బ్రేవ్దే టైటిల్ Mohammed Siraj: సిరాజ్ సెలబ్రేషన్స్ వైరల్; హైదరాబాద్లో భారీ కటౌట్ View this post on Instagram A post shared by MS Dhoni / Mahi 7781💛🇮🇳 (@d7f.reels) -
ఐపీఎల్ నుంచి బట్లర్ అవుట్!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – 2021 సీజన్ రెండో దశ చేరువవుతుండగా వేర్వేరు కారణాలతో జట్లలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాజస్తాన్ రాయల్స్ జట్టు తమ అత్యంత కీలక ఆటగాడిని కోల్పోయింది. వికెట్ కీపర్ జాస్ బట్లర్ వ్యక్తిగత కారణాలతో లీగ్నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. త్వరలోనే అతని భార్య ప్రసవం ఉండటంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే రాజస్తాన్ జట్టు ఆర్చర్ సేవలు కోల్పోగా...స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఆడేది కూడా సందేహంగానే మారింది. బట్లర్ స్థానంలో న్యూజిలాండ్కు చెందిన వికెట్కీపర్ బ్యాట్స్మన్ గ్లెన్ ఫిలిప్స్ను రాయల్స్ ఎంచుకుంది. దూకుడైన ఆటకు పేరుపొందిన ఫిలిప్స్ కివీస్ జట్టు తరఫున 25 టి20ల్లో 149.70 స్ట్రైక్రేట్తో 506 పరుగులు సాధించాడు. తొలి సింగపూర్ ఆటగాడు... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కూడా మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. తొలి దశ పోటీల్లో ఆడిన ఆడమ్ జంపా, ఫిన్ అలెన్, డానియెల్ స్యామ్స్ ఈ సారి లీగ్కు దూరమయ్యారు. వారి స్థానాల్లో శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ, దుష్మంత చమీరాలను జట్టు ఎంచు కుంది. సింగపూర్కు చెందిన బ్యాట్స్మన్ టిమ్ డేవిడ్ కూడా ఆర్సీబీ టీమ్లోకి ఎంపికయ్యాడు. సింగపూర్కు చెందిన ఒక ఆటగాడు ఐపీఎల్లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ టీమ్ కూడా యూఏఈ చేరుకుంది. శనివారం ఆ జట్టు తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. లెఫ్టార్మ్ పేసర్ అర్జున్ టెండూల్కర్ టీమ్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ జహీర్ ఖాన్ పర్యవేక్షణలో సాధన చేశాడు. -
ఇంటివాడైన సన్రైజర్స్ బౌలర్ సందీప్ శర్మ
Sandeep Sharma Marriage.. టీమిండియా ఆటగాడు.. సన్రైజర్స్ హైదరబాద్ బౌలర్ సందీప్ శర్మ ఒక ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు తాషా సాత్విక్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా సన్రైజర్స్ యాజమాన్యం సందీప్కు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. సందీప్.. అతని భార్య తాషా సాత్విక్ పెళ్లి ఫోటోను షేర్ చేస్తూ.. ''ఎస్ఆర్హెచ్ ఫ్యామిలీకి పెళ్లి కళ వచ్చింది. కంగ్రాట్స్ మిస్టర్ అండ్ మిసెస్ సందీప్ శర్మ.. మీ దాంపత్య జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాం'' అంటూ ట్వీట్ చేసింది. కాగా తాషా సాత్విక్ వృత్తిరిత్యా ఫ్యాషన్,నగల డిజైనర్గా పనిచేస్తున్నారు. 2018లోనే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయినప్పటికీ.. కరోనా కారణంగా వీరి పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా సందీప్ శర్మకు అభిమానులు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇక సందీప్ శర్మ 2013 నుంచి ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఇప్పటివరకు 95 ఐపీఎల్ మ్యాచ్లాడిన సందీప్ శర్మ 110 వికెట్లు తీశాడు. 2013 నుంచి 2017 వరకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కు ఆడిన సందీప్ ఆ తర్వాత 2018 నుంచి సన్రైజర్స్కు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు. ఇక జూలై 17, 2015లో జింబాబ్వేతో జరిగిన T20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. చదవండి: రనౌట్ కోసం థర్డ్ అంపైర్కు అప్పీల్; స్క్రీన్పై మ్యూజిక్ ఆల్బమ్ (ఫోటో గేలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) A special addition to the #SRHFamily.😍 Congratulations to Mr and Mrs Sharma 🙌🏽 🥂 to a lifelong partnership!#OrangeOrNothing #OrangeArmy pic.twitter.com/gQcLsX9nIL — SunRisers Hyderabad (@SunRisers) August 20, 2021 -
పంత్కు షాక్ ఇవ్వనున్న ఢిల్లీ క్యాపిటల్స్.. కెప్టెన్గా మళ్లీ అతనే..?
న్యూఢిల్లీ: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్కు ఆ ఫ్రాంఛైజీ యాజమాన్యం షాక్ ఇవ్వనుందా అంటే.. అవుననే అంటున్నాయి ఆ ఫ్రాంఛైజీ వర్గాలు. ఐపీఎల్-2021 మలి దశ మ్యాచ్లకు పంత్ను తప్పించి, అతని స్థానంలో తిరిగి శ్రేయస్ అయ్యర్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించేందుకు డీసీ యాజమాన్యం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. డీసీ యాజమాన్యం అందరికంటే ముందుగానే శ్రేయస్ను యూఏఈకి పంపి పరోక్ష సంకేతాలు పంపింది. కాగా, భుజం గాయం కారణంగా భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్-2021 మొదటి దశ మ్యాచ్లకు దూరమైన శ్రేయస్.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. దీంతో వాయిదా పడిన ఐపీఎల్ సీజన్తో సహా ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్కు సిద్దమేనని అతను ప్రకటించాడు. స్వదేశంలో గత మార్చిలో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా శ్రేయస్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తూ.. బౌండరీ ఆపే క్రమంలో అతను గాయపడ్డాడు. చదవండి: బోల్డ్ ఫోటో షేర్ చేసిన షమీ భార్య.. దారుణమైన ట్రోలింగ్ ఇదిలా ఉంటే, రిషబ్ పంత్ సారధ్యంలో డీసీ జట్టు తొలి దశ మ్యాచ్లలో వరుస విజయాలు(8 మ్యాచ్ల్లో 6 విజయాలు) సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో శ్రేయస్ జట్టులోకి వచ్చినా పంత్ కెప్టెన్సీకి ఎటుంవంటి ఢోకా ఉండదని అందరూ భావించారు. అయితే, అనూహ్యంగా డీసీ జట్టు పంత్ను కాదని శ్రేయస్కే ఓటేసినట్లు డీసీ వర్గాల సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్ను శ్రేయస్ గతేడాది ఫైనల్కు చేర్చిన విషయాన్ని యాజమాన్యం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ మాత్రం కెప్టెన్సీ గురించి తాను ఆలోచించట్లేదని చెప్పడం కొసమెరుపు. కాగా, యూఏఈ వేదికగా వచ్చే నెల 19 నుంచి ఐపీఎల్-2021 మలిదశ మ్యాచ్లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం ఉదయం యూఏఈకి బయలుదేరుతుంది. దేశ రాజధానిలో దేశీయ ఆటగాళ్లు ఇప్పటికే క్వారంటైన్లో ఉన్నారు. యూఏఈ చేరుకున్న తర్వాత కూడా డీసీ బృందం మరోవారం క్వారంటైన్లో ఉండనుంది. చదవండి: Virat Kohli: 'కోహ్లి నోరు తెరిస్తే బూతులే' -
ఐపీఎల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఏంటంటే..?
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సెకెండ్ ఎడిషన్ మ్యాచ్లు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ, ఈసీబీ(ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు) గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ సెకెండ్ మ్యాచ్ల కోసం మైదానాల్లోకి ప్రేక్షకులను అనుమతించబోతున్నట్లు సూచన ప్రాయంగా వెల్లడించింది. ఇందుకు యూఏఈ ప్రభుత్వం కూడా పచ్చ జెండా ఊపింది. అయితే, ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. కాగా, కరోనా కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయిన క్యాష్ రిచ్ లీగ్ను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ భావించిన సమయంలో స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతిస్తారా..? లేదా అనే విషయంపై పెద్ద చర్చ నడిచింది. అయితే దానిపై అప్పట్లో బీసీసీఐ కానీ, యూఏఈ ప్రభుత్వం కానీ స్పందించలేదు. దాంతో యూఏఈ క్రికెట్ బోర్డు జనరల్ సెక్రెటరీ ముబాషిర్ ఉస్మాన్.. యూఏఈ ప్రభుత్వంతోనూ, ఇటు బీసీసీఐతోనూ మాట్లాడాతమని అప్పట్లో ప్రకటించారు. ఇక తాజాగా ఈ చర్చలు ఫలించడంతో.. 60శాతం ప్రేక్షకులను అనుమతిచ్చేందుకు యూఏఈ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడాలనుకునే ప్రేక్షకులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని కండీషన్ను పెట్టింది. ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది ఐపీఎల్ గురించి కూడా అభిమానులకు బీసీసీఐ ఓ తీపికబురు అందించింది. బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఐపీఎల్-2022 గురించి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది టోర్నీ ప్రేక్షకులకు మరింత మజా పంచనుందని పేర్కొన్నారు. అయితే, ఎప్పటిలా 8 జట్లతో కాకుండా.. 10 జట్లతో టోర్నీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే ఏ జట్లు కొత్తగా చేరబోతున్నాయనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పకుండా సస్పెన్స్లో పెట్టారు. చదవండి: కామెడీ టైమింగ్తో అదరగొట్టిన సూర్యకుమార్, పృథ్వీ షా -
Shreyas Iyer: అయ్యర్ కళ్లు చెదిరే సిక్స్.. వీడియో వైరల్
దుబాయ్: టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 2021 రెండో అంచె పోటీలకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం యూఏఈలో ఉన్న అయ్యర్ దుబాయ్లోని ఐసీసీ అకాడమీ మైదానంలో ప్రాక్టీస్లో మునిగిపోయాడు. ప్రాక్టీస్ సమయంలో అతను కొట్టిన సిక్సర్ మైదానం అవతల పడింది. దీనికి సంబంధించిన వీడియోను అయ్యర్ తన ఇన్స్టాలో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న శ్రేయాస్ అయ్యర్ భుజం గాయంతో ఈ సీజన్కు అనూహ్యంగా దూరమయ్యాడు. అతని గైర్హాజరీలో రిషబ్ పంత్ నాయకత్వం వహించాడు. ఈ సీజన్లో దుమ్మురేపిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్ల్లో 6 విజయాలు.. 2 ఓటములతో పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచింది. అయితే కరోనా నేపథ్యంలో ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా లీగ్లో రెండో అంచె పోటీలు సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానుంది. గాయం నుంచి కోలుకున్న అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్కు మళ్లీ నాయకత్వం వహించనున్నాడు. -
రషీద్ ఖాన్, నబీ ఇద్దరూ అందుబాటులో ఉంటారు: సన్రైజర్స్
హైదరాబాద్: ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్లు ఐపీఎల్ సెకెండ్ లెగ్కు అందుబాటులో ఉంటారో లేదో అన్న సందిగ్ధత నెలకొంది. అయితే యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభంకానున్న లీగ్లో తమ జట్టుకు ఆడాల్సిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీలు అందుబాటులో ఉంటారని సన్రైజర్స్ హైదరాబాద్ సోమవారం ప్రకటించింది. ఓ ప్రముఖ న్యూస్ ఏజన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంఛైజీ సీఈవో షణ్ముగం మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుందన్న దానిపై మేము మాట్లాడదలుచుకోలేదు. అయితే, తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆ దేశ క్రికెటర్లు మాత్రం లీగ్కు అందుబాటులో ఉంటారని చెప్పగలనని పేర్కొన్నారు. ఈ నెల 31న ఎస్ఆర్హెచ్ జట్టు యూఏఈకి బయలుదేరబోతుందని షణ్ముగం వెల్లడించారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రషీద్ ఖాన్, నబీ ఇద్దరూ హండ్రెడ్ టోర్నీ కోసం యూకేలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తన కుటుంబాన్ని అక్కడి నుంచి ఎలా బయటకు తీసుకురావాలన్న దానిపై రషీద్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు. కాబూల్ ఎయిర్స్పేస్ మూసేయడంతో అక్కడి నుంచి వివిధ దేశాలకు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే, కొద్ది రోజుల కిందే తమ దేశాన్ని అనిశ్చితి నుంచి బయటపడేయాలని రషీద్ ఖాన్ ప్రపంచ దేశాల నేతలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. చదవండి: అవును.. లార్డ్స్ ఆండర్సన్ అడ్డానే.. కోహ్లికి కౌంటరిచ్చిన బ్రాడ్ -
ధోనిని కలిసేందకు 1400కి.మీ కాలినడక.. చివరకు ఏమైందంటే!
రాంఛీ: ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పి ఏడాది గడిచిన ప్యాన్స్లో మాత్రం ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా ధోని కు అభిమానులు ఉన్నారు. మన దేశంలో అయితే ప్రత్యేకంగా చేప్పే అవసరంలేదు. అతనంటే ప్రాణం ఇచ్చే వీరాభిమానులూ చాలా మందే కనిపిస్తారు. తాజాగా ఓ అభిమాని ధోనీని కలిసేందుకు పెద్ద సాహసమే చేశాడు. వివరాలు.. హరియాణకు చెందిన అజయ్ గిల్ ధోనీకు వీరాభిమాని. తన చిన్నతనం నుంచి ధోని అంటే పిచ్చి...జీవితంలో ఒక్కసారైన కలవాలని కలలు కనేవాడు. ఈ తరుణంలో ధోనీని కలిసేందుకు ఏకంగా 1400 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాడు. హరియాణ లోని హిసార్ జిల్లా జలన్ ఖేడా గ్రామానికి చెందిన 18 ఏళ్ల అజయ్ జులై 29న తన గ్రామం నుంచి నడక మొదలు పెట్టాడు. జులై 29న పయనమైన అజయ్ 16 రోజుల పాటు నడిచి రాంచీకి చేరుకున్నాడు. చివరకు ధోనీ ఇంటి వద్దకు చేరుకుని నిలబడి ఉన్న అతడిని ఒక జాతీయ మీడియా ప్రతినిధి చూశాడు. ఆ యువకుడుని ఎందుకు ఇక్కడ ఉన్నావు అని ప్రశ్నించాడు. తాను ధోనీ అభిమానిని అని..తనను కలిసేందకు వచ్చాను అని తెలిపాడు. ధోనిని కలిసిన తర్వాత మా ఇంటికి వెళ్తాను'అని అజయ్ గిల్ చెప్పాడు. ఎంతో దూరం నుంచి వచ్చిన తనకు అభిమాన క్రికెటరైన మహీతో 10 నిమిషాలు మాట్లాడిస్తే చాలని వేడుకున్నాడు. అయితే ధోని ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ కోసం దుబాయ్ వెళ్లడాని ఆ మీడియా ప్రతినిధి గిల్కు తెలిపాడు. మూడు నెలల తర్వాత ధోని భారత్కు వస్తాడని చెప్పినా.. తన ఆరాధ్య దైవాన్ని కలవకుండా ఇంటికి వెళ్లే పరిస్థితే లేదని మొండి పట్టాడు. ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత క్రికెట్ ఆడటం మానేశానని గిల్ తెలిపాడు. మహీ ఆశీర్వాదం తీసుకున్నాక మళ్లీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు వివరించాడు. గిల్ తన హెయిర్కు ఎల్లో, ఆరేంజ్, డార్క్ బ్లూ, కలర్స్ వేసుకున్న అతను ఓ పక్క ధోనీ, మరో పక్క మహీ అని వెంట్రుకలపై రాసుకున్నాడు. కానీ 1400 కిలోమీటర్ల కాలినడకన వచ్చిన అజయ్ కోరిక మాత్రం తీరలేదు. -
IPL 2021: ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు జీపీఎస్ వాచ్లు
దుబాయ్: కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీలు యూఏఈలో జరగనున్న విషయం తెలిసిందే. సీఎస్కే, ముంబై ఇండియన్స్లో పలువురు ఆటగాళ్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. అబుదాబి చేరుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. అయితే ఆటగాళ్ల కదలికలపై నిఘా వేసేందుకు అబుదాబి ప్రభుత్వం జీపీఎస్ వాచీలను అందించింది. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా క్వారంటైన్ సమయంలో ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడ్డారో లేదో తెలుస్తుంది. అబుదాబిలో క్వారెంటైన్ రూల్స్ కఠినంగా ఉన్నాయి.ఒకవేళ దుబాయ్ నుంచి అబుదాబిలో ఎంటర్ కావాలన్న.. వాళ్లు కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ చూపించాల్సిందే. మరోవైపు దుబాయ్ హోటల్లో బస చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మాత్రం జీపీఎస్ వాచ్లను ఇవ్వలేదు. క్వారంటైన్ సమయంలో ప్రతి రోజు ఆటగాళ్లకు కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. ఇక సెప్టెంబర్ 19న దుబాయ్లో చెన్నై, ముంబై మ్యాచ్తో ఐపీఎల్ 2021 రెండో అంచె పోటీలు మొదలుకానున్నాయి. -
IPL 2021: ఎయిర్పోర్టులో ప్రత్యక్షమైన ధోని.. ఫోటోలు వైరల్
చెన్నై: సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె మ్యాచ్లు మొదలవనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్కింగ్స్ దుబాయ్కు పయనమయ్యాయి. కాగా సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఎయిర్పోర్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎయిర్పోర్ట్లో లగేజ్తో ఉన్న ధోని పీపీఈ కిట్ ధరించడంతో డ్రెస్సింగ్ స్టైల్ కాస్త కొత్తగా అనిపించింది. ధోనితో పాటు సురేశ్ రైనా, కర్ణ్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చహర్, అంబటి రాయుడులు కూడా దుబాయ్ ఫ్లైట్ ఎక్కారు. అటు ముంబై ఇండియన్స్ జట్టు కూడా యూఏఈ బయలుదేరి వెళ్లింది. కాగా సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్న రెండో అంచె పోటీల్లో తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, సీఎస్కే మధ్య జరగనుంది. ఇక ఈ సీజన్లో సీఎస్కే మంచి ప్రదర్శన కనబరిచింది. ఏడు మ్యాచ్లు ఆడిన సీఎస్కే ఐదు విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇక ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయాలు అందుకొని టాప్లో కొనసాగుతుంది. ✈️ Mode ON#UrsAnbudenEverywhere#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/yHE4c2Qk4X — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) August 13, 2021 -
కోలుకున్నాడు.. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్నకు రెడీ!
బెంగళూరు: భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ పూర్తి మ్యాచ్ ఫిట్నెస్ సంతరించుకున్నట్లు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) తెలిపింది. అతను పోటీ క్రికెట్ ఆడుకోవచ్చని ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో వాయిదా పడిన ఐపీఎల్ సహా ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచకప్నకు అతను అందుబాటులో ఉంటాడు. మార్చిలో ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా అయ్యర్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఇక బ్యాట్ మాట్లాడుతుంది.. ‘‘గాయం నుంచి కోలుకునేందుకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. యుద్ధానికి రెడీ. ఆడటానికి సిద్ధం. ఇక రాబోయే కాలంలో బ్యాట్ మాట్లాడుతుంది’’ అంటూ తన ఆగమనాన్ని ఘనంగా చాటుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు శ్రేయస్ ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా వ్యవహరించిన శ్రేయస్ గాయపడటంతో అతడి స్థానంలో టీమిండియా యువ కెరటం రిషభ్ పంత్ సారథ్య బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే. చదవండి: Neeraj Chopra: గర్ల్ఫ్రెండ్ విషయంపై నీరజ్ చోప్రా క్లారిటీ -
IPL 2021: సెకండ్ ఫేజ్ ఆడడంపై డేవిడ్ వార్నర్ క్లారిటీ
సిడ్నీ: సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ శుభవార్త అందించాడు. సెప్టెంబర్19 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీలకు తాను అందుబాటులోకి వస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ సెకండ్ ఫేజ్లో తాను ఆడబోతున్నట్లు స్పష్టం చేశాడు. '' ఐ విల్ బి బ్యాక్.. అక్కడే మీ అందరిని కలుస్తా'' అంటూ కామెంట్ జత చేశాడు. కాగా ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడడానికి ముందు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వార్నర్ను కెప్టెన్సీ నుంచి తప్పించి కేన్ విలియమ్స్న్కు పగ్గాలు అప్పగించింది. కెప్టెన్గా విలియమ్సన్ ఎంపికపై నెటిజన్లు ఎస్ఆర్హెచ్ యాజమాన్యంను తప్పుబడుతూ ట్విటర్ వేదికగా విమర్శలు సంధించారు. దీనికి తోడూ కెప్టెన్ పదవి నుంచి తొలగించడమేగాక తర్వాతి మ్యాచ్కు వార్నర్ను పక్కనపెట్టారు. ఆ మ్యాచ్కు వార్నర్ ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లకు డ్రింక్స్ అందించడంపై పెద్ద వివాదమే చెలరేగింది. ఈ నేపథ్యంలో వార్నర్ ఎస్ఆర్హెచ్కు ఆడడం ఇదే చివరిసారని వార్తలు వచ్చాయి. కరోనాతో వాయిదా పడిన ఐపీఎల్ రెండో అంచె పోటీలకు కూడా వార్నర్ దూరంగా ఉంటాడని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వార్నర్ తాను ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీలు ఆడడంపై క్లారిటీ ఇచ్చేశాడు. ఏది ఏమైనా వార్నర్ ఐపీఎల్ ఆడడంపై క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల్లో జోష్ పెరిగింది. కరోనాతో వాయిదా పడిన మిగతా లీగ్ మ్యాచ్లు సెప్టెంబర్ 19 నుంచి ఆరంభం కానున్నాయి. అక్టోబర్ 15న ఐపీఎల్ 14వ సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) ఇక 2012లో డెక్కన్ చార్జర్స్ నుంచి సన్రైజర్స్ హైదరాబాద్గా పేరు మార్చుకొని బరిలోకి దిగిన ఆ జట్టుకు డారెన్ సామి, శిఖర్ ధావన్, కామెరున్ వైట్ లాంటి ఎంతో మంది ఆటగాళ్లు కెప్టెన్లుగా పనిచేశారు. అయితే 2015లో డేవిడ్ వార్నర్ ఆ జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేసిన తర్వాత ఆ జట్టు తలరాత మారిపోయింది. 2016లో వార్నర్ కెప్టెన్సీలోనే ఐపీఎల్ టైటిల్ను కొల్లగొట్టింది. ఆ సీజన్లో వార్నర్ బ్యాటింగ్లో అసాధారణ ఆటతీరుతో అదరగొట్టి ఒంటిచేత్తో జట్టుకు టైటిల్ను అందించాడు. అప్పటినుంచి 2018 సీజన్ మినహా మిగతా అన్ని సీజన్లకు కెప్టెన్గా పనిచేసిన వార్నర్ ప్రతీసారి ఫ్లేఆఫ్కు తీసుకురావడం విశేషం. ఇక బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేదం ఎదుర్కొన్న వార్నర్ 2018 ఐపీఎల్ సీజన్కు దూరం కావడంతో అతని స్థానంలో విలియమ్సన్ కెప్టెన్గా పనిచేశాడు. అయితే ఆ ఏడాది విలియమ్సన్ అద్బుత కెప్టెన్సీకి తోడూ ఆటగాళ్లు కూడా విశేషంగా రాణించడంతో ఫైనల్కు వచ్చింది. అయితే ఫైనల్లో సీఎస్కే చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. అయితే ఈ సీజన్ ఆరంభంలో విలియమ్సన్ నాలుగు మ్యాచ్లకు దూరంగా ఉండడం.. వార్నర్ కెప్టెన్సీలో విఫలమవడంతో పాటు బ్యాటింగ్లోనూ అంతంత ప్రదర్శన నమోదు చేయడంతో ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీ మార్పును పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ వరుస ఓటములతో నిరాశ పరిచింది. ఆడిన ఆరు మ్యాచ్ల్లో కేవలం ఒక్క విజయం నమోదు చేసి.. ఐదు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. -
ఐపీఎల్లో కొత్త రూల్.. బ్యాట్స్మెన్లకు ఫంక్షన్, బౌలర్లకు టెన్షన్
ముంబై: కరోనా కారణంగా అర్థంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 మ్యాచ్లకు సన్నాహాలు మొదలయ్యాయి. యూఏఈ వేదికగా లీగ్లో మిగిలిపోయిన 31 మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటికే రెండో దశ లీగ్కు సంబంధించిన షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ మెగా టోర్నీ సెకెండ్ హాఫ్ జరగనుంది. అయితే ఐపీఎల్ తొలి దశ సందర్భంగా ఎదురైన సమస్యలకు చెక్ పెట్టేందుకు బీసీసీఐ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని రెండో దశ ఐపీఎల్ కోసం సరికొత్త రూల్ను తీసుకొచ్చింది. ఎవరైనా ఆటగాడు బంతిని స్టాండ్స్లోకి బాదితే.. ఆ బంతిని తిరిగి ఉపయోగించవద్దనే నిబంధనను తెరపైకి తెచ్చింది. మైదానం ఆవల పడే బంతులను ఇతరులు తాకే అవకాశం ఉన్నందున, తిరిగి అదే బంతిని వాడితే కరోనా సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆ బంతి స్థానంలో కొత్త బంతిని వినియోగించాలని బీసీసీఐ ప్రతిపాదించింది. ఐపీఎల్ సెకెండ్ ఫేస్ మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతిస్తున్నందున ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా, బీసీసీఐ ప్రతిపాదించిన ఈ కొత్త రూల్ బ్యాట్స్మెన్లకు ఫంక్షన్, బౌలర్లకు టెన్షన్ అన్న చందంగా మారింది. ఎందుకంటే కొత్తబంతి హార్డ్గా ఉంటూ సులువుగా బ్యాట్పైకి వస్తుంది. పైగా యూఏఈ పిచ్లు స్పిన్నర్లకు సహకరిస్తాయి. అయితే ఈ నిబంధన కారణంగా కొత్త బంతి వచ్చిన ప్రతీసారి బౌలర్లు దానికి అనుగుణంగా బౌల్ చేయాల్సి ఉంటుంది. దీంతో బౌలర్లకు బంతిపై పట్టుచిక్కకుండా పోతుంది. ఇది బ్యాట్స్మెన్కు అడ్వాంటేజ్గా మారుతుంది. అందుకే ఈ నిబంధన బౌలర్లకు పెద్ద శిక్షేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. -
అలా చేస్తే క్రికెటర్ల కుటుంబసభ్యులనూ వదిలేది లేదు..
ముంబై: యూఏఈ వేదికగా వచ్చే నెల 19 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 2021 పార్ట్-2 నేపథ్యంలో బీసీసీఐ కఠిన బయోబబుల్ నిబంధనలను విడుదల చేసింది. శ్రీలంక పర్యటనలో ఎదురైన చేదు పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ సరికొత్త ప్రొటోకాల్స్ను రూపొందించినట్లు తెలుస్తోంది. లంక పర్యటనలో టీమిండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా కరోనా బారిన పడటం, అతనితో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మంది క్రికెటర్లు ఐసొలేషన్కు వెళ్లడం, వారిలో చహల్, కృష్ణప్ప గౌతమ్కు వైరస్ సోకడం వంటి పరిణామాలు బీసీసీఐపై తీవ్ర ప్రభావాన్ని చూపినట్లు స్పష్టమవుతోంది. దీంతో త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2021 పార్ట్-2 నేపథ్యంలో బయోబబుల్ను ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా.. ఉపేక్షించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఫ్రాంఛైజీలు, క్రికెటర్లు సహా వారి కుటుంబ సభ్యులపైనా కఠిన చర్యలను తీసుకుంటామని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ఐపీఎల్లో పాల్గొనే విదేశీ క్రికెటర్లకు బీసీసీఐ ఊరట కల్పించింది. లీగ్లో పాల్గొనేందుకు వచ్చే వీరిని క్వారంటైన్కు తరలించదలచుకోలేదని స్పష్టం చేసింది. అయితే వీరందరూ యుఏఈ విమానం ఎక్కడానికి కనీసం 72 గంటల ముందటి ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే ఐపీఎల్ 2021 ఫేస్ 2తో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకుని ఉండాలని సూచించింది. ఇదిలా ఉంటే, కరోనా సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్లో నిర్వహించాల్సిన ఐపీఎల్ను యూఏఈకి తరలించిన సంగతి తెలిసిందే. -
ఐపీఎల్-14 ఫేజ్2 షెడ్యూల్ ఇదే
-
ఐపీఎల్-14 ఫేజ్2 షెడ్యూల్ ఇదే.. ఆ రెండు జట్ల మధ్యే తొలి మ్యాచ్
ముంబై: కరోనా కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్ రీషెడ్యూల్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఐపీఎల్-14 ఫైజ్2 తేదీలను వెల్లడించింది. ఐపీఎల్ 14వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి పునఃప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఐపీఎల్ 14వ సీజన్లో 29 మ్యాచ్లు పూర్తికాగా, మిగిలిన 31 మ్యాచ్లను యూఏఈ వేదికగా జరగనున్నాయి. మెదటి మ్యాచ్ ఢిపిండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి షెడ్యూలును బీసీసీఐ విడుదల చేసింది. నూతన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 10న మొదటి క్వాలిఫైయర్, అక్టోబర్ 11న ఎలిమినేటర్, అక్టోబర్ 13న రెండో క్వాలిఫైయర్, అక్టోబర్ 15న దుబాయి వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. BCCI announces schedule for remainder of VIVO IPL 2021 in UAE. The 14th season, will resume on 19th September in Dubai with the final taking place on 15th October. More details here - https://t.co/ljH4ZrfAAC #VIVOIPL — IndianPremierLeague (@IPL) July 25, 2021 -
ఐపీఎల్కు రెడీ.. కెప్టెన్సీ విషయం వాళ్లు చూసుకుంటారు: శ్రేయస్
న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు శుభవార్త. ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్ సమయంలో గాయపడి ఐపీఎల్ 2021 మొదటి దశకు పూర్తిగా దూరమైన శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకున్నాడు. యూఏఈ వేదికగా జరుగనున్న రెండో దశ మ్యాచ్లకు అందుబాటులో ఉండనున్నట్లు స్పష్టం చేశాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈమేరకు వెల్లడించాడు. కాగా, గత సీజన్లో ఢిల్లీ కెప్టెన్గా వ్యవహరించిన అయ్యర్.. గాయంతో లీగ్ మొత్తానికి దూరం కావడంతో అతని స్థానంలో జట్టు సారధ్య బాధ్యతలను రిషబ్ పంత్ చేపట్టాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్లో రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా రాణిస్తుంది. పాయింట్ల పట్టికలో కూడా అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పంత్ను కాదని అయ్యర్కు తిరిగి జట్టు పగ్గాలు అప్పజెప్పుతారా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ విషయమై అయ్యర్ను ప్రశ్నించగా.. దీనిపై మాట్లాడేందుకు ఆయన అయిష్టత ప్రదర్శించాడు. జట్టు పగ్గాల విషయం తన పరిధిలో లేదని, జట్టు యాజమాన్యం ఆ విషయాన్ని చూసుకుంటుందంటూ మాట దాటవేశాడు. మరోవైపు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మాన్గా ఢిల్లీ క్యాపిటల్స్కు వెన్నెముకగా ఉన్న అయ్యర్ జట్టుకు దూరం కావడంతో ఆ స్థానంలో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ జట్టులోకి వచ్చాడు. తాజాగా స్మిత్ కూడా ఐపీఎల్ రెండో దశకు దూరం కానున్నట్లు తెలియడంతో ఢిల్లీ యాజమాన్యం ఆందోళనలో పడింది. అయితే, ఇప్పుడు అయ్యర్ పూర్తిగా కోలుకొని ఫిట్గా ఉండటంతో ఆ జట్టు ఊపిరి పీల్చుకుంది. సెప్టెంబర్ 17 నుంచి యూఏఈ వేదికగా మలి దశ ఐపీఎల్ జరుగనుంది. -
క్రికెట్ ఆస్ట్రేలియాకు షాక్.. విదేశీ సిరీస్ల నుంచి ఏడుగురు ఔట్
సిడ్నీ: ఐపీఎల్ 2021లో ఆడిన అగ్రశ్రేణి ఆసీస్ క్రికెటర్లు వెస్టిండీస్, బంగ్లాదేశ్ పర్యటనల నుంచి వైదొలుగుతూ, క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు షాకిచ్చారు. ఈ ఏడాది చివర్లో జరుగనున్న టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని, సీఏ ఈ రెండు విదేశీ పర్యటనలను ఖరారు చేయగా, ఆసీస్ స్టార్ ఆటగాళ్లు మాత్రం నిరాసక్తత కనబర్చారు . కొందరు వ్యక్తిగత కారణాలు సాకుగా చూపిస్తూ, మరికొందరు గాయాల నుంచి కోలుకోలేదని నివేదికలు సమర్పిస్తూ ఈ రెండు విదేశీ పర్యటనలకు డుమ్మా కొట్టారు. సీనియర్లు డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టాయినీస్లు వ్యక్తిగత కారణాల వల్ల తమను ఈ టూర్ కోసం పరిగణించవద్దని విజ్ఞప్తి చేయగా, స్టీవ్ స్మిత్, జే రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్, డేనియల్ సామ్స్లు ఐపీఎల్ సమయంలో తగిలిన గాయాల కారణంగా జట్టు నుంచి తప్పించమని అభ్యర్ధించారు. టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ నెలలో ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆటగాళ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చూపుతూ జట్టుకు దూరంగా ఉండటం సీఏను కలవరపెడుతుంది. ఇదిలా ఉంటే, విండీస్, బంగ్లా టూర్ కోసం 18 మందితో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం ప్రకటించింది. ఆసీస్ జట్టు జూలై 9 నుంచి 24 మధ్య విండీస్తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉండగా, బంగ్లాదేశ్లో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్పై ఇంకా స్పష్టతరావాల్సి ఉంది. చదవండి: KL RAHUL: ప్రియసఖితో తొలిసారి.. గతంలో విరుష్క జోడీ కూడా ఇలానే -
'ఫ్యామిలీ మ్యాన్-3'కి ప్రిపేర్ అవుతున్నావా బ్రో..
న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ బ్యాట్స్మెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు సురేశ్ రైనా.. తన ఐపీఎల్ సహచరుడు, సీఎస్కే బౌలర్ దీపక్ చాహర్పై ఫన్నీ కామెంట్స్ చేశాడు. చాహర్.. తాజాగా తన న్యూలుక్కి సంబంధించిన ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేయగా, రైనా స్పందించాడు. ఈ ఫోటోలో చాహర్.. ప్రముఖ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్-2లో టెర్రరిస్ట్ క్యారెక్టర్ను పోలి ఉన్నాడని, ఫ్యామిలీ మ్యాన్ పార్ట్ 3 ఆన్ ద వే అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం రైనా చేసిన ఈ కామెంట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. మరోవైపు చాహర్ అభిమానులు కూడా తమదైన శైలిలో స్పందించారు. ఫ్యామిలీ మ్యాన్-2లో లీడ్ రోల్ శ్రీకాంత్.. ఫ్యామిలీ అడ్వైజర్ను కలిసే సీన్ చాహర్కు సరిపోతుందంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే చాహర్.. గజినీలో ఆమీర్ ఖాన్ను పోలి ఉన్నాడంటున్నారు. ఇదిలా ఉంటే, దేశంలో ప్రస్తుతం 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ మేనియా నడుస్తోంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా విడుదలైన ఈ వెబ్ సిరీస్.. విమర్శకుల ప్రశంసల్ని సైతం అందుకుంటుంది. ఫ్యామిలీ మ్యాన్-2లో టాలీవుడ్ హీరోయిన్ సమంతా కీలక పాత్ర పోషించింది. నెగటీవ్ రోల్ అయినప్పటికీ.. రాజీ పాత్రలో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సెకండ్ సీజన్ను తమిళులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమను కించపరిచే సీన్లున్నాయని, అందకే ఈ సినిమాను నిషేధించాలని వారు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, ఈ వెబ్ సిరీస్ను తెలుగు వారు, చిత్తూరు జిల్లాకు చెందిన రాజ్ అండ్ డీకే(రాజ్ నిడిమోరి, దాసరి కృష్ణ) డైరెక్ట్ చేశారు. ఇదిలా ఉంటే, కరోనా వైరస్ నేపథ్యంలో ఫ్యామిలీ మ్యాన్ మూడో పార్ట్ కూడా రానుందని తెలుస్తోంది. ఇక ఐపీఎల్ 2021 సీజన్ అర్థంతరంగా వాయిదా పడటంతో సురేశ్ రైనా, దీపక్ చాహర్ ఇంటికే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో చాహర్కు చోటు దక్కలేదు. అయితే జూలైలో శ్రీలంకలో పర్యటించనున్న భారత బి జట్టులో అతనికి చోటు దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. చదవండి: విశ్వనాథన్ ఆనంద్తో తలపడనున్న ఆమీర్ ఖాన్.. ఎందుకో తెలుసా? -
సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ ఐపీఎల్ మ్యాచ్లు
-
సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం
ముంబై: కరోనా కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్ పునఃప్రారంభం కానుంది. భారత్లో కరోనా ఉధృతి తగ్గని కారణంగా ఐపీఎల్ సెకండాఫ్ మ్యాచ్లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సీజన్లో జరగాల్సిన మిగతా 31 మ్యాచ్లను సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్, అబుదాబి, షార్జాల్లో నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. అలాగే ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను అక్టోబర్ 15న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కాగా, సెకండాఫ్ ఐపీఎల్ మ్యాచ్లకు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా లేరా అంశంపై సందిగ్ధత నెలకొంది. ఇదిలా ఉంటే విదేశీ ఆటగాళ్లు వచ్చినా, రాకపోయినా లీగ్ను మాత్రం కంటిన్యూ చేస్తామని బీసీసీఐ ఉపాధ్యక్షడు రాజీవ్ శుక్లా ఇటీవలే స్పష్టం చేశారు. చదవండి: వాళ్లిద్దరి కెప్టెన్సీ ఒకేలా ఉంటుంది.. ఆ విషయంలో ధోనీ స్టైల్ వేరు -
ఈ ఆర్సీబీ ప్లేయర్ ఎవరో గుర్తు పట్టండి..?
బెంగళూరు: త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్ల నేపథ్యంలో పలు ఫ్రాంఛైజీల యాజమాన్యాలు తమ తమ అభిమానులను ఉత్సాహపరిచే నిమిత్తం సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం ట్విటర్ వేదికగా అభిమానులకు క్విజ్ పోటీ నిర్వహించింది. తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ ఇమేజ్ను షేర్ చేసి అందులో ఉన్న ఆర్సీబీ ఆటగాడు ఎవరో గుర్తుపట్టాల్సిందిగా అభిమానులను కోరింది. ఇందు కోసం ఓ క్లూను కూడా ఇచ్చింది. ఆ ఆటగాడి ఐపీఎల్ అరంగేట్రం 2021 సీజన్లో ముంబై ఇండియన్స్పై జరిగిందని క్లూను వదిలింది. ఇంతకీ ఈ రాయల్ ఛాలెంజర్ ఎవరో మీరు గుర్తు పట్టారా..? చదవండి: చోటా ధోనీని చూడండి.. హెలికాప్టర్ షాట్ను ఇరగదీస్తున్నాడు Can you tell us which Royal Challenger this is, 12th Man Army? 🤔 Hint: He made his debut against MI in #IPL2021. #PlayBold #WeAreChallengers pic.twitter.com/ytN1KOeiP9 — Royal Challengers Bangalore (@RCBTweets) June 6, 2021 -
ఆ ఐపీఎల్ ఆటగాళ్లకు జీతాలు కట్..
దుబాయ్: కరోనా కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ను యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో నిర్వహిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇటీవలే అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ రూపొందించే పనిలో బిజీగా ఉంది. అయితే సెకండాఫ్ మ్యాచ్లకు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండరన్న ఊహాగానాల నేపథ్యంలో ఫ్రాంచైజీల యాజమాన్యాలు ఆయా దేశాలకు చెందిన ఆటగాళ్లపై చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఐపీఎల్ సెకండ్ లెగ్ మ్యాచ్లు ఆడేందుకు యూఏఈకి రాని విదేశీ ఆటగాళ్ల జీతాల్లో కోత విధించాలని నిర్ణయించినట్లు బీసీసీఐకి చెందిన ఓ ముఖ్య అధికారి తెలిపారు. ఇప్పటి వరకు వారు ఆడిన మ్యాచ్లకు మాత్రమే వేతనాలు చెల్లిస్తామని, మిస్ కాబోయే మ్యాచ్లకు ఎటువంటి జీతం చెల్లించబోమని ఆయన వెల్లడించారు. అయితే బీసీసీఐతో ఒప్పంద కుదుర్చుకున్న ఆటగాళ్లకు మాత్రం ఎలాంటి కోత ఉండబోదని పేర్కొన్నారు. కాగా, విదేశీ ఆటగాళ్లు పూర్తిగా ఐపీఎల్ మ్యాచ్లు ఆడకపోతే పారితోషికంలో కోత పెట్టే హక్కు ఫ్రాంచైజీ యాజమాన్యలకు ఉంటుందని సదరు అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే, ఎవరు వచ్చినా రాకపోయినా ఐపీఎల్ మాత్రం ఆగదని ఇటీవలే బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ఫ్రాంచైజీల తాజా నిర్ణయంతో ఐపీఎల్కు డుమ్మా కొట్టాలనుకున్న విదేశీ ఆటగాళ్లలో ఆందోళన మొదలైంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్కు చెందిన కొందరు క్రికెటర్లు ద్వైపాక్షిక సిరీస్ల నేపంతో ఐపీఎల్ ఆడబోమని ఇదివరకే స్పష్టం చేశారు. చదవండి: ముంబై కోచ్గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం..