isi
-
హౌసింగ్ కుంభకోణం: పాక్ మాజీ ఐఎస్ఐ చీఫ్ అరెస్ట్
ఇస్లామాబాద్: మాజీ ఇంటర్ సర్విసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ ఫైజ్ హమీద్ను పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసింది. హౌసింగ్ స్కీమ్ కుంభకోణానికి సంబంధించిన కేసులో అరెస్టు చేసినట్లు సోమవారం పాక్ ఆర్మీ వెల్లడించింది. టాప్ సిటీ కేసు (హైసింగ్ స్కీమ్)లో ఆయనపై వచ్చిన ఆరోపణలు నిరూపితం అయ్యాయి. పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయనపై విచారణను చెపట్టినట్లు పాక్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్ ఆర్మీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఫైజ్ హమీద్పై తగిన క్రమశిక్షణా చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది. ఆయనపై ఇచ్చిన అధికార దుర్వినియోగ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సైన్యం ఏప్రిల్లో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. నవంబర్ 8,2023న టాప్ సిటీ హౌసింగ్ డెవలప్మెంట్ ఓనర్ మోయీజ్ అహ్మద్ ఖాన్ పాకిస్థాన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయటంతో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. హమీద్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అహ్మద్ ఖాన్ 2017లో ఆరోపణలు చేశారు. ఐఎస్ఐ అధికారులు హమీద్ ఇంటిపై దాడులు చేయగా.. బంగారం, వజ్రాలు, నగదుతో సహా విలువైన వస్తువులను బయటపడ్డాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ గతంలో ఐఎస్ఐ (కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్) చిఫ్గా పనిచేశారు. తర్వాత ఆయన జూన్ 2019 నుంచి 6 అక్టోబర్ 2021 వరకు ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. ఫైజ్ హమీద్ ఐఎస్ఐ 24వ డైరెక్టర్ జనరల్గా సేవలు అందించారు. -
చైనా,ఐఎస్ఐ హస్తం?
బంగ్లాదేశ్ కల్లోలం వెనక విదేశీ హస్తముందా? చైనా, పాక్ ఐఎస్ఐ కలిసి పక్కా ప్రణాళికతోనే సంక్షోభాన్ని సృష్టించాయా? భారత్ పట్ల అనుకూలంగా ఉన్నందుకే షేక్ హసీనా పట్ల అక్కసు పెంచుకున్నాయా? తమ జేబు సంస్థల ద్వారా అరాచకం సృష్టించి ఆమెను గద్దె దించడంలో సఫలమయ్యాయా? రిజర్వేషన్ల ఆందోళన వాటికి అందివచ్చిన ఆయుధంగా మారిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. యువత, విద్యార్థుల ఆందోళనలో ఐఎస్ఐ శక్తులు చేరి పరిస్థితి చేయి దాటేలా చూడటంలో సఫలీకృతమైనట్టు పలు దేశాల నిఘా వర్గాలు నిర్థారిస్తున్నాయి.వాటి కథనం ప్రకారం... బంగ్లాదేశ్లో ఎలాగైనా భారత వ్యతిరేక, చైనా–పాక్ అనుకూల సర్కారు కొలువుదీరేలా చూడటమే లక్ష్యంగా ఐఎస్ఐ పావులు కదిపింది. ఇందుకోసం బంగ్లాలోని ఐఎస్ఐ స్లీపర్సెల్స్ రాత్రింబవళ్లూ పని చేశాయి. ముఖ్యంగా ఢాకాలో పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోవడం వెనక ఐఎస్ఐ ముసుగు సంస్థ జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్, దాని విద్యార్థి విభాగం ఇస్లామీ ఛాత్ర శివిర్ (ఐసీఎస్) కీలక పాత్ర పోషించాయి. యువత, విద్యార్థులు చేపట్టిన ఆందోళనలను వీలైనంతగా ఎగదోశాయి. ఇందుకోసం జమాత్, ఐసీఎస్ సభ్యులు విద్యార్థుల ముసుగులో పని చేశారు. జమాత్కు నిత్యం పాక్, ఐఎస్ఐ నుంచే నిధులందుతాయి. ఎప్పుడు, ఎక్కడ, ఏం చేయాలో ఢాకాలోని పాక్ హై కమిషన్ నుంచి ఎప్పటికప్పుడు నిర్దేశాలు వస్తుంటాయి. ఆ మేరకు జమాత్ సభ్యులు సైలెంటుగా పని చక్కబెడతారని పాక్లోని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు కథనాలు వెలువరిస్తున్నాయి. లండన్లో వ్యూహరచన! హసీనాను వీలైనంత త్వరగా గద్దె దింపి భారత వ్యతిరేకి అయిన మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా సారథ్యంలోని విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధికారంలోకి వచ్చేలా చూడటమే టాస్్కగా ఐఎస్ఐ పావులు కదిపింది. తద్వారా నానాటికీ సుదృఢంగా మారుతున్న భారత్–బంగ్లా సంబంధాలకు బ్రేక్ వేయడంతో పాటు కశ్మీర్ నుంచే గాక బంగ్లా వైపు నుంచి కూడా భారత్లోకి ఉగ్రవాదులను చొప్పించే వ్యూహం దీని వెనక దాగుంది. లండన్లో ఇందుకు పక్కగా స్కెచ్ తయారైనట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ఇటీవల ఐఎస్ఐ వర్గాలతో సౌదీ అరేబియాలో భేటీ అయినట్టు సమాచారం.అనంతరం ప్రణాళికను పక్కాగా అమల్లో పెట్టారు. అందులో భాగంగా అల్లర్ల వ్యాప్తికి జూన్లోనే ఐసీఎస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. వీలైనంత అరాచకం సృష్టించడమే లక్ష్యంగా జమాతే, ఐసీఎస్లకు ఐఎస్ఐ భారీగా నిధులిచి్చనట్టు వెలుగులోకి వచి్చంది. వాటిలో అత్యధిక మొత్తాలను ఫండింగ్ చేసింది పాక్లోని చైనా సంస్థలేనని తేలింది. అంతిమంగా బంగ్లాలోనూ తాలిబన్ తరహా పాలన తేవాలన్నది వాటికి ఐఎస్ఐ, చైనా అప్పగించిన టాస్క్ అని నిఘా వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఈ మేరకు కొద్ది నెలల క్రితమే ఐసీఎస్ రంగంలోకి దిగింది.ఢాకాతో పాటు పలు నగరాల్లో విద్యార్థులను నయానా భయానా భారీ సంఖ్యలో తమ సానుభూతిపరులుగా మార్చుకుంది. బంగ్లాదేశ్ అంతటా ఘర్షణలు తీవ్ర రూపు దాల్చేలా, పరిస్థితి చేయి దాటిపోయేలా చేయడం వెనక ఈ సంస్థే ప్రధాన పాత్ర పోషించిందని తేలింది. దానికి ఢాకాలోని పాక్ ఎంబసీ అన్నివిధాలా దన్నుగా నిలిచింది. ఈ క్రమంలో, అవసరమైతే తమ కార్యాలయంలో తలదాచుకోవాల్సిందిగా విద్యార్థులకు చెప్పేదాకా వెళ్లిందని దౌత్య వర్గాలంటున్నాయి!చైనా హస్తం సుస్పష్టంబంగ్లా కల్లోలం వెనక చైనా విదేశాంగ, భద్రతా వ్యవహారాల శాఖ హస్తం కూడా ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. తమకంటే భారత్కు హసీనా ఎక్కువ ప్రాధాన్యమివ్వడం చైనాకు రుచించని అంశాల్లో ఒకటి. పాక్ అనుకూల సర్కారైతే తన చెప్పుచేతల్లో ఉంటుందన్నది చైనా వ్యూహం. హసీనాను గద్దె దింపడం వెనక కచ్చితంగా విదేశీ హస్తముందని ఆ దేశంలో భారత హైకమిషనర్గా చేసిన వీణా సిక్రీ అన్నారు. ‘‘ఇటీవలి చైనా పర్యటన సందర్భంగా హసీనాను ఘోరంగా అవమానించిన తీరే ఇందుకు నిదర్శనం. ఆమెకు కనీస ప్రొటోకాల్ మర్యాద కూడా ఇవ్వలేదు. అధ్యక్షుడు జిన్పింగ్ కూడా హసీనాతో వ్యక్తిగతంగా భేటీ కాలేదు. ఆమె సర్కారును కూలదోయడం వెనక పాక్–చైనా ఉమ్మడి వ్యూహం ఉందన్నది స్పష్టమే’’ అని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమర్నాథ్ యాత్రలో విధ్వంసానికి ఐఎస్ఐ కుట్ర
హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావించే అమర్నాథ్ యాత్రలో విధ్వంసానికి ఐఎస్ఐ తాజాగా ఖలీస్థానీ ఉగ్రవాద గ్రూపు బబ్బర్ ఖల్సాతో జతకట్టి కుట్ర పన్నినట్లు భారత రక్షణ విభాగం గుర్తించింది.బీజేపీ, హిందూ నేతలే టార్గెట్గా ఈ విధ్వంసానికి ఐఎస్ఐ వ్యూహం రచించినట్లు రక్షణశాఖ అధికారులు కనుగొన్నారు. పంజాబ్లోని గ్యాంగ్స్టర్లు.. ఉగ్రవాదులతో కలిసి ఈ కుట్రకు ప్లాన్ చేశారని అధికారులు భావిస్తున్నారు. కాగా గత నెలలో పంజాబ్లోని పఠాన్కోట్ పరిసరాల్లో ఉగ్రవాద కదలికలను ఇండియన్ ఆర్మీ గుర్తించింది. ఇదే సమయంలో జమ్ములో ఏడుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవలికాలంలో భద్రతా బలగాలపై జరుగుతున్న దాడుల వెనుక పాక్ కుట్ర ఉందని భారత రక్షణ విభాగం భావిస్తోంది. తాజాగా నియంత్రణ రేఖ వద్ద భారత బలగాలపై పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ) చేసిన దాడిని భారత ఆర్మీ దళాలు భగ్నం చేశాయి. -
పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
దేశంలో ఫర్నిచర్ ధరలు వచ్చే ఏడాది పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి ప్లైవుడ్ తయారీదారులందరికీ ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్) సర్టిఫికేషన్ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తా సంస్థ ‘మింట్’ నివేదించింది. బాయిలింగ్ వాటర్ ప్రూఫ్గా ప్రచారం చేసే ప్లైవుడ్కు ఆ మేరకు ఐఎస్ఐ సర్టిఫికేషన్ కూడా అవసరముంటుందని ఇద్దరు అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది.ఫర్నిచర్, ఇతర వస్తువుల్లో ఉపయోగించే ప్లైవుడ్ నాణ్యత, మన్నికను మెరుగుపరచడం, సవాళ్లతో కూడిన వాతావరణంలో కూడా అవి ఎక్కువ కాలం ఉండేలా చూడటం లక్ష్యంగా ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, నేపాల్ నుంచి నాసిరకం ప్లైవుడ్ దిగుమతిని అరికట్టవచ్చని భావిస్తున్నారు. కొత్త ప్రమాణాల ప్రకారం ప్లైవుడ్ తయారీదారులు అన్ని గ్రేడ్ల ప్లైవుడ్కు ఫంగల్ నిరోధకత కోసం మైకోలాజికల్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.ఈ నిబంధనపై ప్లైవుడ్ మేకర్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొత్త ప్రమాణాలు ప్లైవుడ్ నాణ్యతను మెరుగుపరుస్తాయని, వినియోగదారులతో పాటు తయారీదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని కొందరు చెబుతుండగా మరికొందరు దీన్ని ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు.అయితే ఈ నిర్ణయం వల్ల వచ్చే ఏడాది ప్లైవుడ్ ధరలు 15 శాతం పెరుగుతాయని ఆల్ ఇండియా ప్లైవుడ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ చైర్మన్ నరేష్ తివారీ తెలిపారు. నాసిరకం ప్లైవుడ్ ఉత్పత్తుల దిగుమతిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్లైవుడ్ తయారీదారులందరూ బీఐఎస్ నిబంధనలను పాటించాలని కోరారు. కాగా దీనిపై అటు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి గానీ, బీఐఎస్ ప్రతినిధుల నుంచి గానీ ఎలాంటి స్పందన లేదు. -
Russia: మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఐఎస్ఐ ఏజెంట్ను అరెస్టు
లక్నో: రష్యా రాజధాని మాస్కో లోని భారత దౌత్య కార్యాలయంలో కీలక విధుల్లో ఉంటూ పాకిస్తాన్ నిఘా విభాగం ఐఎస్ఐకి కీలక సమాచారం చేరవేస్తున్న ఓ అధికారి ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఏటీఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లా షామహియుద్దీన్పూర్ గ్రామానికి చెందిన సతేంద్ర సివాల్ విదేశాంగ శాఖ ఉద్యోగి. ఇతడు మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఇండియా బేస్డ్ సెక్యూరిటీ అసిస్టెంట్(ఐబీఎస్ఏ)గా పనిచేస్తూ 2021 నుంచి దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడు. పాకిస్తాన్లోని ఐఎస్ఐ నెట్వర్క్తో టచ్లో ఉంటూ రక్షణ శాఖ కార్యకలాపాలు, విదేశాంగ శాఖ వ్యవహారా లు, భారత సైన్యం కదలికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని వారికి చేరవేస్తు న్నాడు. కీలక సమాచారం అందిస్తే భారీగా ప్రతిఫలం ముట్టజెపుతామంటూ పలువురు ఇతర అధికారులను సైతం తన వైపు తిప్పుకునేందుకు సతేంద్ర ప్రయత్నిస్తున్నట్లు యూపీ ఏటీఎస్కు ఉప్పందింది. దీంతో, ఏటీఎస్ బృందం ఇతడి కదలికలు, కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచింది. ఆ మేరకు నిబంధనల ప్రకారం ఇతడిని ఇటీవల మీరట్లోని ఫీల్డ్ యూనిట్కు రప్పించి అధికారులు విచారించారు. నేరానికి పాల్పడినట్లు విచారణలో అంగీకరించడంతో సతేంద్ర సివాల్పై ఐపీసీ సెక్షన్ 121ఏతో పాటు అధికార రహస్యాల చట్టం–1923 కింద కేసులు నమోదు చేసినట్లు ఏటీఎస్ వివరించింది. ఇదీ చదవండి: రాష్ట్ర హోదా కోసం లఢక్లో భారీ నిరసనలు -
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహార్ మృతి?
వరల్డ్ మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది మసూద్ అజహార్(55) మృతి చెందాడా?. ఈ ఉదయం గుర్తు తెలియని దుండగులు జరిపిన బాంబు దాడిలో మసూద్ చనిపోయినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. 1999లో కాందహార్ విమాన హైజాక్ జరిగింది ఇతని విడుదల కోసమే. భారత పార్లమెంట్పై 2001లో జరిగిన దాడితో పాటు 2008 ముంబై దాడులు, 2016లో పఠాన్కోట్ దాడి, 2019 పుల్వామా దాడులకు కారణమైన జేషే మహమ్మద్ సంస్థను స్థాపించింది అజహారే. మహమద్ మసూద్ అజహార్ అల్వీ.. ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ స్థాపకుడు. సోమవారం ఉదయం భవల్పూర్ మసీదు నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై బాంబు విసిరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. మసూద్ అజహార్ మృతిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు పాక్లో గత కొంతకాలంగా ఉగ్రవాదులు.. ఉగ్ర సంస్థల నేతలు మిస్టరీ పరిస్థితుల్లో మృతి చెందుతున్న సంగతీ తెలిసిందే. BIG BREAKING NEWS - As per unconfirmed reports, Most wanted terrorist, Kandhar hijacker Masood Azhar, has been kiIIIed in a bomb expIosion by UNKNOWN MEN at 5 am 🔥🔥 He was going back from Bhawalpur mosque. UNKNOWN MEN working even on New Year day ⚡ He was the chief of Terror… pic.twitter.com/XG97TMmIE8 — Times Algebra (@TimesAlgebraIND) January 1, 2024 పాక్ పంజాబ్ రాష్ట్రంలో ఓ విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అజహార్.. కశ్మీర్ స్వేచ్ఛ పేరిట ఉగ్ర కార్యకలాపాలకు దిగాడు. బ్రిటన్కు జిహదీని పరిచయం చేసింది ఇతనే. భారత్ ఇతన్ని అరెస్ట్ చేస్తే.. ఇతని విడుదల డిమాండ్తో ఏకంగా విమానం హైజాక్ చేశారు. కాందహార్ హైజాక్ ఘటనగా భారత్కు ఒక మాయని మచ్చగా మిగిలిపోయిందా ఘటన. జైల్లో ఉన్నప్పుడు అమెరికా దర్యాప్తు సంస్థలు.. ఇంటర్పోల్ సైతం ఇతన్ని గతంలో ప్రశ్నించాయి. 2019, మే 1వ తేదీన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇదీ చదవండి: కాందహార్ హైజాకర్.. ఫర్నీచర్ షాప్ ఓనర్ ముసుగులో ఇంతకాలం! భారత్ పట్టుకుంటే.. 1994లో అజహార్ ఫేక్ ఐడీ మీద శ్రీనగర్కు చేరుకున్నాడు. అక్కడ రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టే యత్నం చేయాలనుకున్నాడు. అయితే భారత భద్రత బలగాలు ఫిబ్రవరిలో అనంతనాగ్ జిల్లా ఖానాబల్ దగ్గర అజహార్ను అరెస్ట్ చేశాయి. అప్పటి నుంచి పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలు అతన్ని బయటకు రప్పించే ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి. చివరకు.. 1999 డిసెంబర్లో మసూద్ అజహార్ సానుభూతి పరులు ఇండియన్ఎయిర్లైన్స్ విమానం 814ను హైజాక్ చేసి కాందహార్కు తరలించారు. ఆ సమయంలో కాందహార్ పాక్ ఐఎస్ఐ మద్దతుతో తాలిబన్ల ఆధీనంలో ఉండేది. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారానికి అజహార్ సోదరుడు అబ్ధుల్ రౌఫ్ అజహార్ నేతృత్వం వహించాడు. విమాన ప్రయాణికుల విడుదల కోసం జరిపిన దౌత్య పరమైన చర్చలు విఫలం కావడంతో.. అప్పటి భారత ప్రభుత్వం అజహార్ను విడుదల చేయాల్సి వచ్చింది. కోట్ భల్వాల్ జైలు నంచి అప్పటి పోలీస్ అధికారి శేష్ పాల్ వైద్ నేతృత్వంలో అజహార్ అప్పగింత జరిగింది. ఆ తర్వాత ఐఎస్ఐ సంరక్షణలోనే చాలా కాలం అజహార్ పాక్ అంతటా స్వేచ్ఛగా తిరుగుతూ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించాడు. అయితే పాక్ మాత్రం అజహార్ తమ దగ్గర లేడంటూ బుకాయిస్తూ వచ్చింది. హైజాక్ ఇలా.. 1999 డిసెంబర్ 24న సుమారు 180 మంది ప్యాసింజర్లు, 11 మంది బృందంతో వెళ్తున్న IC-814 విమానాన్ని .. ఐదుగురు ఉగ్రవాదులు దారి మళ్లించి హైజాక్ చేశారు. అమృత్సర్, లాహోర్, దుబాయ్ మీదుగా కాందహార్కు చేర్చారు. అక్కడ ఆ విమానం తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లింది. ఈ హైజాక్ వ్యవహారంలో.. 25 ఏళ్ల భారత ప్రయాణికుడు రూపిన్ కట్యాల్ను పొట్టనబెట్టుకున్నారు హైజాకర్లు. చివరికి డిసెంబర్ 31న.. కరడుగట్టిన ఉగ్రవాది అజహార్ను భారత్ విడుదల చేయడంతో.. మిగతా ప్రయాణికులను అప్పగించారు. -
నిజ్జర్ హత్య వెనక ఐఎస్ఐ హస్తం..!
ఒట్టావా:కెనడా-భారత్ మధ్య వివాదానికి కారణమైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో పాకిస్థాన్ ఉగ్రసంస్థ ఐఎస్ఐ హస్తం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజ్జర్ హత్యతో భారత్-కెనడా మధ్య చెలరేగిన వివాదం పథకంలో భాగమనే అనుమానాలు వెల్లడవుతున్నాయి. అయితే.. ఇటీవల కెనడాలో పాగా వేయాలనే ఐఎస్ఐ సంకల్పించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఆ దేశంలో కొంత మంది ఉగ్రవాదులను కూడా దింపింది. వారికి సహకరించాలని ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్పై ఒత్తిడి చేసిందట. ఆయన ఐఎస్ఐ ఉగ్రవాదులకు సహకరించకుండా ఖలిస్థానీ మద్దతుదారుల వైపే మొగ్గు చూపారట. అందుకే నిజ్జర్ను హత్య చేశారనే అనుమానాలు వెల్లడవుతున్నాయి. తమకు సహకరించడానికి ఐఎస్ఐ మరో వ్యక్తిని వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖలిస్థానీ మద్దతుదారులకే మద్దతునిస్తున్నారని సమాచారం. ఇండియా-కెనడా వివాదం.. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు ఇండియా-కెనడా మధ్య వివాదానికి దారితీసింది. నిజ్జర్ హత్యలో భారత దౌత్య వేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీనిని భారత్ ఖండించింది. ఈ పరిణామాల తర్వాత ఇరు దేశాలు ఆంక్షలను విధించుకున్నాయి. భారత్ వీసాలను కూడా రద్దు చేసింది. అటు.. దేశంలో ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేస్తోంది. ఐక్యరాజ్య సమితి 78వ సర్వ సభ్య సమావేశంలోనూ ఈ అంశాన్ని భారత్ లేవనెత్తింది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ఆరోపణలు చేయరాదని విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఖలిస్తానీలకు కెనడా ముస్లింలు ఎందుకు మద్దతు పలుకుతున్నారు? -
పాకిస్తాన్ అండతో హాజీ సలీం భారీ దందా .. తాజాగా రూ.25 వేల కోట్ల డ్రగ్స్
అతనిది అత్యంత విలాసవంతమైన జీవన శైలి. అడుగు కదిలితే చుట్టూ అత్యాధునిక ఏకే ఆయుధాలతో అంగరక్షకుల భారీ భద్రత. ఎటు వెళ్లాలన్నా ముందే పలు అంచెల తనిఖీలు, దారి పొడవునా మూడో కంటికి అగుపడని రీతిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు. ఇది ఏ దేశాధ్యక్షుని పరిచయమో కాదు. భారత్తో సహా పలు ఆసియా దేశాలకు కొన్నేళ్లుగా కంటిపై కునుకు లేకుండా చేస్తున్న డ్రగ్ కింగ్ హాజీ సలీం జల్సా లైఫ్ స్టైల్! శనివారం కోచి సమీపంలో అరేబియా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో భారీగా డ్రగ్స్ మోసుకెళ్తున్న ఓ నౌకను పక్కా సమాచారం మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అడ్డగించి ముంచేయడం తెలిసిందే. అందులో ఏకంగా 2.5 టన్నుల మెథంఫెటామిన్ దొరకడం అధికారులనే విస్మయపరిచింది. ఇది ఎన్సీబీకి మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ స్మగ్లర్ అయిన హాజీదేనని దాడిలో పట్టుబడ్డ 29 ఏళ్ల పాక్ జాతీయుడు వెల్లడించాడు. భారత్, శ్రీలంక, సీషెల్స్ తదితర దేశాల్లో సరఫరా నిమిత్తం దీన్ని పాక్ దన్నుతో దొంగచాటుగా తరలిస్తున్నట్టు విచారణలో అంగీకరించాడు. మన దేశంలో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి! అంతేగాక పలు దేశాల్లో సరఫరా నిమిత్తం అత్యంత భారీ మొత్తంలో డ్రగ్స్ను మోసుకెళ్తున్న మదర్ షిప్ ఎన్సీబీకి చిక్కడమూ ఇదే మొదటిసారి! దాని విలువను రూ.12 వేల కోట్లుగా అధికారులు తొలుత పేర్కొన్నారు. కానీ ఇప్పటిదాకా దొరికిన డ్రగ్స్లోకెల్లా ఇదే అత్యంత హెచ్చు నాణ్యతతో కూడినదని తాజాగా పరీక్షల్లో తేలింది. దాంతో దీని విలువను సవరించి ఏకంగా రూ.25,000 కోట్లుగా తేల్చారు! పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాటుకు హాజీ ముఠా అన్నిరకాలుగా సాయపడుతున్నట్టు కూడా తేలింది. పాక్ అడ్డాగా... పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఉగ్ర సంస్థ లష్కరే తొయిబా అండదండలతో అరేబియా సముద్రంలో హాజీ విచ్చలవిడిగా డ్రగ్స్ దందా నడుపుతున్నాడు. పాక్, ఇరాన్, అఫ్గానిస్తాన్ అతని అడ్డాలు! ఎక్కడా స్థిరంగా ఉండకుండా తరచూ స్థావరాలు మార్చడం హాజీ స్టైల్. అతని ప్రస్తుత అడ్డా పాకిస్తాన్. బలూచిస్తాన్లో మకాం వేసి కథ నడుపుతున్నాడు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ హాజీకి దగ్గరి లింకులున్నట్టు ఎన్సీబీ అనుమానం. గమ్మత్తైన సంకేతాలు.. తేలు, ఎగిరే గుర్రం, డ్రాగన్, కొమ్ముగుర్రం, 555, 777, 999. ఇవన్నీ డ్రగ్స్ సరఫరాలో హాజీ ముఠా వాడే సంకేతాల్లో కొన్ని. డ్రగ్స్ ప్యాకెట్లపై ఉండే ఈ ప్రత్యేకమైన గుర్తులు వాటిలోని డ్రగ్స్, దాని నాణ్యతకు సంకేతాలు. కొనుగోలుదారులు మాత్రమే వీటిని గుర్తిస్తారు. హాజీ మనుషులు డ్రగ్స్ను ఏడు పొరలతో పటిష్టంగా ప్యాక్ చేస్తారు. నీళ్లలో పడ్డా దెబ్బతినకుండా ఈ జాగ్రత్త. ఇలా డ్రగ్స్ సరఫరా, విక్రయంలో హాజీది విలక్షణ శైలి. హాజీ అప్పుగానే డ్రగ్స్ సరఫరా చేస్తాడు. తనకు హవాలా మార్గంలోనే సొమ్ము పంపాలని చెబుతాడు. వ్యాపారానికి శ్రీలంక పడవలు వాడుతుంటాడు. అవి పాక్, ఇరాన్ సముద్ర తీరాల్లో మదర్ షిప్ నుంచి డ్రగ్స్ నింపుకొని రహస్యంగా భారత్కు చేరుకుంటాయి. క్వింటాళ్ల కొద్దీ ఉన్న నిల్వను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి గమ్యానికి తరలిస్తారు. -
అతీక్కు ఐఎస్ఐ, లష్కరేతో లింకులు
ప్రయాగ్రాజ్: ఉమేశ్పాల్ హత్యకేసులో గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు అతీక్ అహ్మద్కు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఉగ్రవాద లష్కరే తోయిబాతో సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు. గురువారం యూపీ పోలీసులు అతీక్ అహ్మద్ను, అతడి సోదరుడు అష్రాఫ్ను భారీ బందోబస్తు నడుమ ప్రయాగ్రాజ్లోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ‘నాకు ఆయుధాలు, డబ్బుకు కొదవలేదు. పాక్ నుంచి డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లో పంజాబ్కు ఆయుధాలు, డబ్బు చేరుతాయి. అక్కడ మా వాళ్లు వాటిని అందుకుంటారు. కశ్మీర్ ఉగ్రవాదులు కూడా తీసుకెళతారు. కావాలంటే మీరు నన్ను అక్కడికి తీసుకెళ్తే డబ్బు, ఆయుధాలు అందజేస్తా’అంటూ అతీక్ అహ్మద్ విచారణలో వెల్లడించిన విషయాలను యూపీ పోలీసులు ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు. రెండు గంటలపాటు సాగిన వాదోపవాదాల అనంతరం అతీక్, అష్రాఫ్లిద్దరికీ ఈనెల 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి, ఐదు రోజుల పోలీసు రిమాండ్కు అనుమతిస్తూ మేజిస్ట్రేట్ దినేశ్ గౌతమ్ ఆదేశాలిచ్చారని ఉమేశ్ పాల్ భార్య తరఫు లాయర్ చెప్పారు. ఇద్దరినీ రిమాండ్ పూర్తయ్యేదాకా ప్రస్తుతమున్న సబర్మతీ, బరేలీ జైళ్లలోనే ఉంచుతారన్నారు. -
అమృత్పాల్ @ ఆ ఏడుగురు...
దుబాయ్లో డ్రైవర్గా పని చేసే అమృత్పాల్ సింగ్ రాత్రికి రాత్రే సిక్కు మత ప్రబోధకుడిగా వేషం మార్చడం వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉందన్న అనుమానాలున్నాయి. దేశంలో మత ఘర్షణలు రేపి, శాంతిభద్రతల్ని విచ్ఛిన్నం చేయడానికే ఐఎస్ఐ అమృత్పాల్ను దుబాయ్ నుంచి పంజాబ్కు పంపిందని పోలీసులు చెబుతున్నారు. భారత్కు వచ్చిన ఆరు నెలల్లో ఖలిస్తానీ ఉద్యమం పేరుతో అమృత్పాల్ సింగ్ వార్తల్లో నిలిచాడు. యువతపై మతం మత్తుమందు జల్లి వారి అండదండలతో దేశంలో అశాంతి రేపడానికి పన్నాగాలు పన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అమృత్పాల్ భారత్కు రావడానికి ముందు జార్జియాలో ఐఎస్ఐ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉంది. పపల్ప్రీత్ సింగ్ అమృత్పాల్ను వెనుక నుంచి నడిపించేది ఇతనే. ఐఎస్ఐ ఆదేశాల మేరకే పపల్ప్రీత్ సింగ్ అమృత్సింగ్ను వెనుకుండి నడిపిస్తాడన్న వాదనలున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా పోలీసుల నుంచి పరారీ అవడానికి పపల్ప్రీత్ సింగ్ పూర్తిగా సహకరించాడు. వాహనాలు, వేషాలు మార్చడంలో సాయపడ్డాడు. అమృత్పాల్ బైక్పై వెళుతుండగా దానిని నడుపుతున్న వ్యక్తిని పపల్ప్రీత్గా పోలీసులు గుర్తించారు. ఐఎస్ఐతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న పపల్ప్రీత్ సింగ్ పంజాబ్లో ఉద్రిక్తతల్ని సృష్టించడానికి పన్నా గాలు రచించాడు. ఖలిస్తాన్ డిమాండ్తో అల్లకల్లోలం సృష్టించాలని భావించాడు. పపల్ప్రీత్ సింగ్ సూచనల మేరకే అమృత్పాల్ సింగ్ తనని తాను సిక్కు మతప్రబోధకుడిగా, ఒక సామాన్యుడిగా కనిపించే ప్రయత్నం చేశాడు. భగవంత్ సింగ్ అమృత్పాల్ సింగ్కు కుడిభుజం. పంజాబ్లో అజ్నాలా పోలీసు స్టేషన్లో హింసాకాండకు భగవంత్ సింగ్ బాధ్యు డు. అమృత్పాల్ సింగ్కు మీడియా, సోషల్ మీడియా సమన్వయకర్తగా ఉన్నాడు. అమృత్సింగ్ పరారయ్యాక భగవంత్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అతను సోషల్ మీడియా లైవ్లో వచ్చి తమ అనుచరుల్ని రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. దీంతో పోలీసులు అతని ఛానెల్స్ అన్నీ బ్లాక్ చేసి అదుపులోనికి తీసుకున్నారు. జాతీయ భద్రతా చట్టం కింద విచారిస్తున్నారు. ప్రస్తుతం అస్సాం దిబ్రూగఢ్ జైలులో ఉన్నాడు. గుర్మీత్ సింగ్ అమృత్పాల్ సింగ్ అనుచరుల్లో మొట్టమొదట పోలీసులకు చిక్కినవాడు గుర్మీత్ సింగ్ . పోలీసులు అమృత్సింగ్పై వేట తీవ్రతరం చేశారని తెలిసిన వెంటనే అమృత్సర్ నుంచి తప్పించుకోవడానికి స్థానికంగా గుర్మీత్ సింగ్ అన్ని ఏర్పాట్లు చేశాడు. అరెస్టయిన గుర్మీత్ కూడా దిబ్రూగఢ్ జైల్లోనే ఉన్నాడు దల్జీత్ సింగ్ కల్సి అమృత్సర్కు చెందిన దల్జీత్ సింగ్ కల్సి అమృత్పాల్కు ఫైనాన్షియర్. పాకిస్థాన్ నిఘా ఏజెన్సీ ఐఎస్ఐతో కల్సికి సంబంధాలున్నట్టుగా ఆరోపణలున్నాయి. ఐఎస్ఐకి అమృత్పాల్కి మధ్య సంధానకర్తగా పని చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. లవ్ప్రీత్ తుఫాన్ సింగ్ వారిస్ పంజాబ్ దే సంస్థలో కీలక సభ్యుడు. అత్యంత చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తాడు. అమృత్పాల్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడని ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన నేరానికి పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. లవ్ప్రీత్ను బయటకి తీసుకురావడం కోసమే అమృత్పాల్ ఫిబ్రవరి 24న అజ్నాలా పోలీసు స్టేషన్లో విధ్వంసం సృష్టించాడు. హర్జీత్ సింగ్ అమృత్పాల్ సింగ్కు మామ. ఖలిస్తానీ ఉద్యమానికి గట్టి మద్దతుదారుడు. పోలీసుల కన్నుగప్పి హర్జీత్ సింగ్ కారులోనే తొలుత పారిపోయాడు. ఆ తర్వాత హర్జీత్ పోలీసులకు లొంగిపోయారు. ఒకప్పుడు హర్జీత్ సింగ్ దుబాయ్లో రవాణా వ్యాపారంలో చేసేవాడు. అక్కడే అమృత్పాల్ కూడా మామతో కలిసి పనిచేశాడు. అక్కడ్నుంచి కెనడాకి మకాం మార్చాడు. గత నెలలోనే హర్జీత్ భారత్కు తిరిగి వచ్చాడు. అమృత్పాల్ దుబాయ్ నుంచి పంజాబ్కు వచ్చి ఖలీస్తానీ నాయకుడి అవతారం ఎత్తడం వెనుక హర్జీత్ ప్రభావం అధికంగా ఉంది. కిరణ్దీప్ కౌర్ అమృత్పాల్ సింగ్ భార్య. బ్రిటన్కు చెందిన ఎన్నారై. రివర్స్ మైగ్రేషన్ పేరు చెప్పి ఇతర దేశాల్లో ఉన్న ఖలిస్తాన్ సానుభూతిపరుల్ని తిరిగి పంజాబ్ తీసుకురావడానికే ఈమెను అమృత్పాల్ పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తోంది.అమృత్పాల్కు వివిధ దేశాల నుంచి వచ్చే ఆర్థిక సాయానికి సంబంధించిన లెక్కలన్నీ ఆమెకే తెలుసు. ఎజెండా ఇదీ ... ► పంజాబ్ సమాజాన్ని మతం ఆధారంగా విడదీయడమే అమృత్పాల్ సింగ్ ప్రధాన ఎజెండా. ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి రాష్ట్రానికి వచ్చే నిరుపేదలైన కూలీలపై స్థానికుల్లో వ్యతిరేకత పెంచి అగ్గిరాజేయాలని చూసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ► విదేశీ సంస్థల నుంచి అందిన నిధులతో అక్రమంగా ఆయుధాలను కొనుగోలు చేసి పంజాబ్ యువతలో గన్ కల్చర్ పెంచడానికి కూడా ప్రణాళికలు రూపొందించాడు. ► పంజాబ్లో అనిశ్చితి రేపడానికి ఆనందపూర్ ఖల్సా ఫౌజ్ (ఏకేఎఫ్) పేరుతో ఒక ప్రైవేటు ఆర్మీని రూపొందించాడు. అందులో ఎక్కువ మంది నేరచరితులే. ఐఎస్ఐ ఆర్థిక సాయంతో అందరికీ ఆయుధాలు, వాహనాలు కొనుగోలు చేశాడు. ► డ్రగ్స్కు బానిసలైన వారిని, మాజీ సైనికాధికారులపై వలవేసి వారితో ఒక ఉగ్రవాద సంస్థ నెలకొల్పాలని ప్రయత్నించాడు. దుబాయ్ నుంచి వచ్చాక జల్లూపూర్ కెహ్రా గ్రామంలో డ్రగ్ డీ–ఎడిక్షన్ సెంటర్ని నెలకొల్పాడు. ► డ్రగ్ డీ ఎడిక్షన్ సెంటర్కి తీసుకువచ్చిన వారు ఆరోగ్యం బాగయ్యాక వారిస్ పంజాబ్ దే సంస్థలో చేరి ఎలాంటి విధ్వంసం రేపడానికైనా సిద్ధంగా ఉండాలి. అలా చేయలేనివారిని శారీరకంగా హింసించేవారని పోలీసుల విచారణలో తేలింది. అమృత్పాల్పైనున్న కేసులు వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ సింగ్ మొత్తం ఆరు క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నాడు. వాటిలో పోలీసు అధికారులపై హత్యాయత్నం, దాడి కేసులున్నాయి. ఫిబ్రవరి 16 : అమృత్పాల్పై కిడ్నాప్, దాడి కేసు నమోదు ఫిబ్రవరి 22 : విద్వేషాలు రెచ్చగొడుతున్నాడంటూ కేసు ఫిబ్రవరి 22 – యువతలో అసహనం నింపుతున్నాడని కేసు ఫిబ్రవరి 23 – అమృత్పాల్, అతని సాయుధ అనుచరులు పోలీసు అధికారులపై దాడులు, హత్యాయత్నం కేసులు మార్చి 18 : ఆయుధాల చట్టం కింద కేసు నమోదు మార్చి 19 : ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు జలంధర్లో కేసు -
అమృత్పాల్కు ఐఎస్ఐ లింకులు!
చండీగఢ్: ఖలిస్తానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ చీఫ్ అమృత్పాల్సింగ్ గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకునేందుకు అతడు విదేశాల నుంచి భారీగా నిధులు సేకరించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇటీవల అరెస్టైన అతని ప్రధాన అనుచరుడు దల్జీత్ సింగ్ బ్యాంకు ఖాతాలకు గత రెండేళ్లలో విదేశాల నుంచి రూ.35 కోట్లు జమ అయినట్టు తేలింది. పలు మోసపూరిత ఆర్థిక వ్యవహారాల్లోనూ అతను కీలకంగా వ్యవహరించాడు. అంతేగాక వారిస్ దే సంస్థకు అనుబంధంగా ఆనంద్పూర్ ఖల్సా ఫోర్స్ (ఏకేఎఫ్) ఏర్పాటుకు దల్జీత్ ప్రయత్నిస్తున్నట్లు తేలింది. మరోవైపు అమృత్పాల్ దుబాయ్లో ట్రక్ డ్రైవర్గా ఉండగా అతనికి ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందని పోలీసులంటున్నారు. ‘‘భారత్లో విద్రోహ కార్యకలాపాలు చేపట్టేలా బ్రెయిన్ వాష్ చేసింది. అతనికి పలువురు డ్రగ్స్ పెడ్లర్ల మద్దతుంది. అమృత్పాల్ వాడే మెర్సిడెజ్ కారు రావెల్ సింగ్ అనే డ్రగ్ పెడ్లర్దే. రాష్ట్రవ్యాప్తంగా డీ అడిక్షన్ సెంటర్లు పెట్టి, అక్కడికొచ్చే వారిని తన దారిలోకి తెచ్చుకుంటున్నాడు. ఆ సెంటర్లలో ఆయుధాలు నిల్వ చేస్తున్నాడు. ఐఎస్ఐ సాయంతో మతం ముసుగులో పంజాబ్ను ప్రత్యేక దేశం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు’’ అని చెబుతున్నారు. ఈ కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. అమృత్పాల్ కోసం వేట కొనసాగుతోంది. అతడు కెనడాకు పారిపోయే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. అతని మామ హర్జిత్ సింగ్ సహా ఐదుగురు ఆదివారం అర్ధరాత్రి లొంగిపోయారు. వారిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసులు పెట్టారు. భారత కాన్సులేట్పై దాడి వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయంపై ఖలిస్తానీ అనుకూలవాదులు ఆదివారం దాడికి తెగబడ్డారు. ఆవరణలో ఖలిస్తానీ జెండాలు ఏర్పాటు చేశారు. మరోవైపు బ్రిటన్లో లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఖలిస్తానీవాదులు తొలగించిన ఘటనపై కేంద్రం తీవ్ర నిరసన తెలిపింది. -
హనీట్రాప్: భారత క్షిపణుల డేటా పాకిస్థాన్, చైనాలకు అందిందా?
సాక్షి, హైదరాబాద్: నటాషారావు అనే యువతి హనీట్రాప్లో చిక్కుకున్న హైదరాబాద్లోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అధీనంలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ కాంప్లెక్స్ (ఆర్సీఐ) ఇంజనీర్ డి.మల్లికార్జున్రెడ్డి అత్యంత కీలకమైన క్షిపణుల డేటాను దేశం దాటించినట్లు కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇవే అభియోగాలపై మల్లికార్జున్రెడ్డిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు గత నెల్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతని విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న రక్షణ మంత్రిత్వ శాఖ నష్టనివారణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్టు సమాచారం. జర్నలిస్టుగా పరిచయం చేసుకుని.. మల్లికార్జున్రెడ్డి ఆర్సీఐలోని అడ్వాన్స్డ్ నావెల్ సిస్టం ప్రోగ్రామ్లో 2018 నుంచి తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్నాడు. ఇతడికి 2019లో ఫేస్బుక్ ద్వారా నటాషారావు అనే యువతితో పరిచయమైంది. హనీట్రాప్ కోసం పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ షేర్నీలో ఈమె పని చేస్తున్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. లండన్ కేంద్రంగా పని చేస్తున్న డిఫెన్స్ జర్నలిస్ట్గా మల్లికార్జున్తో పరిచయం పెంచుకున్న నటాషా తన పని ప్రారంభించింది. తాను రాస్తున్న ఆర్టికల్స్లో వినియోగించడానికంటూ ఇతడి నుంచి న్యూక్లియర్ డిటరెన్స్ ప్రోగ్రామ్ (అణ్వస్త్ర కార్యక్రమం)కు సంబంధించిన వివరాలను ముందు సేకరించింది. ఆపై ఇతడి బ్యాంకు ఖాతా నంబర్ తీసుకున్న నటాషా ఇందుకోసం కొంత మొత్తం చెల్లిస్తానంటూ నమ్మబలికినట్లు నిఘా వర్గాల విచారణలో తేలినట్లు తెలిసింది. వలపు వలతో ముగ్గులోకి దింపి.. ఓ దశలో మల్లికార్జున్రెడ్డి దగ్గర ప్రేమ, పెళ్లి ప్రస్తావనలు తెచ్చి, వాట్సాప్ ద్వారా గంటల తరబడి చాటింగ్ చేసి పూర్తిగా ముగ్గులోకి దింపింది. అత్యంత కీలక సమాచారం సంగ్రహించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే అగ్ని క్షిపణులతో పాటు దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్మారకార్థం తయారవుతున్న కె–సిరీస్ క్షిపణులకు సంబంధించిన సాంకేతిక అంశాలు కూడా ఇతడి నుంచి రాబట్టింది. నావికాదళం వినియోగించే అణు ఇంధన ఆధారిత జలాంతర్గామి అయిన అరిహంత్ కోసం డీఆర్డీఓ కె–సిరీస్ మిస్సైల్స్ను అభివృద్ధి చేస్తోంది. కాగా తాను పని చేస్తున్న మాసపత్రికలో ఆర్టికల్స్ రాయాల్సి ఉందని, దానికి నిర్ణీత గడువు ఉందని చెప్తూ మల్లికార్జున్ నుంచి కీలక సమాచారం సేకరించింది. 2020–21 మధ్య డీఆర్డీఓ, ఆర్సీఐల్లో అభివృద్ధి చేసిన మిస్సైల్స్కు సంబంధించిన వివరాలు రాబట్టినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. న్యూక్లియర్ క్యాపబుల్ సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్స్గా (ఎస్ఎల్బీఎం) పిలిచే 3,500 కి.మీల రేంజ్తో కూడిన కె–4, 6 వేల కి.మీల రేంజ్ కె–5, 1,500 కి.మీల రేంజ్ కె–15 సిరీస్లతో పాటు సాగరిక సిరీస్కు చెందిన బీ–05 సిరీస్ మిస్సైల్ డేటా సైతం నటాషాకు చేరింది. సిమ్రన్, ఓమీషా పేర్లతో.. ఈమె ఫేస్బుక్లో సిమ్రన్ చోప్రా, ఓమీషా హడ్డీ పేర్లతోనూ ప్రొఫైల్స్ నిర్వహించింది. మల్లికార్జున్రెడ్డితో ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా చాటింగ్, కాల్స్, వాయిస్ మెసేజ్లు చేసిన నటాషా ఒక్కసారి కూడా వీడియో కాల్ చేయలేదు. ఇతడు కోరినప్పటికీ ఆమె దాటవేస్తూ వచ్చింది. అనేక అంశాలను పరిశీలించిన నిఘా వర్గాలు ఈ సమాచారం పాక్ నుంచి చైనాకు చేరి ఉంటుందని అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఆర్డీవో, ఆర్సీఐలో భద్రతా లోపాలపై నిఘా వర్గాలు ఇప్పటికే అధ్యయనం చేసినట్లు ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
రైల్వే ట్రాక్లను పేల్చేసేందుకు ఐఎస్ఐ కుట్ర
న్యూఢిల్లీ: మనదేశంలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రయత్నిస్తోందని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయి. పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు ఐఎస్ఐ పెద్ద కుట్ర పన్నిందని తెలిపాయి. ఈ మేరకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరిక జారీ చేశాయి. గూడ్స్ రైళ్లే టార్గెట్ సరకు రవాణా రైళ్లను ధ్వంసం చేయడానికి పంజాబ్తోపాటు పరిసర రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్లను పేల్చివేయాలని ఐఎస్ఐ ప్లాన్ చేసిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం భారతదేశంలోని తన కార్యకర్తలకు ఐఎస్ఐ పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తోందని వెల్లడించాయి. భారత్లో ఉన్న పాక్ స్లీపర్ సెల్స్కు తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తోందని వివరించాయి. ఖలిస్తాన్ ఉగ్రవాదుల ఎగదోత ఖలిస్తాన్ ఉగ్రవాదులను కూడా దాడులకు ఐఎస్ఐ ఉసిగొల్పుతోందని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. లాహోర్లో దాక్కున్న ఖలిస్తాన్ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండాను ఇందుకోసం వాడుకుంటోందని వెల్లడైంది. పంజాబ్లో శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు భారత వ్యతిరేక శక్తులు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నట్టు నిఘా సంస్థలు సేకరించిన ఆధారాలు రుజువు చేస్తున్నాయి. భద్రత కట్టుదిట్టం నిఘా వర్గాల సమాచారంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. రైల్వే ట్రాకుల వెంట భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు గస్తీని ముమ్మరం చేశాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని రైలు మార్గాల్లో నిఘా పెంచారు. (క్లిక్: నాన్నా! భయమేస్తోంది.. వచ్చేయాలనుంది) పంజాబ్పై గురి జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఆటలు సాగకపోవడంతో పంజాబ్పై గురిపెట్టారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘జమ్మూకశ్మీర్లో ఐఎస్ఐ విజయం సాధించలేకపోవడంతో సరిహద్దు రాష్ట్రంలో మిలిటెన్సీని పునరుద్ధరించడానికి పంజాబ్ను లక్ష్యంగా చేసుకుంది. ఇందుకోసం సిక్కు తీవ్రవాద సంస్థలైన సిక్కు ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) బబ్బర్ ఖల్సా కూడా పనిచేస్తున్నాయి. కుట్రలో భాగంగా పంజాబ్లోని యువతను పెడదోవ పట్టించి సాయుధ దాడులు చేసేలా ఉసిగొల్పేందుకు ప్రయత్నిస్తున్నాయ’ని వివరించారు. ఖలిస్తాన్ ఉగ్రవాదులు తమ నెట్వర్క్ను ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. ఇటీవల హరియాణలోని కర్నాల్ జిల్లాలో నలుగురు సిక్కు తీవ్రవాదులను అరెస్టు చేయడంతో ఈ విషయం వెల్లడైందన్నారు. (క్లిక్: దేశంలో ఒమిక్రాన్ సబ్వేరియెంట్ కేసుల కలకలం) -
పాక్ నుంచి రిందా కుట్ర
సాక్షి, హైదరాబాద్: పంజాబ్తోపాటు ఢిల్లీ, చండీగఢ్, మహారాష్ట్ర పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న మాఫియా డాన్ హర్వీందర్ సింగ్ అలియాస్ రిందా పాకిస్తాన్ నుంచి భారత్లో పేలుళ్లకు కుట్ర పన్నాడు. పంజాబ్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత సంస్థ బబ్బార్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) ముసుగులో అటు ఐఎస్ఐ, ఇటు ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా (ఎల్ఈటీ)లకు సహకరిస్తున్నాడు. దీనికోసం ఆయా రాష్ట్రాల్లో ఉన్న తన నెట్వర్క్ను వాడుకుంటున్నాడు. రిందా ఆదేశాల మేరకు పంజాబ్లోని ఫిరోజ్పూర్ నుంచి ఆదిలాబాద్కు మారణాయుధాలు, పేలుడు పదార్థమైన ఆర్డీఎక్స్ రవాణా చేస్తున్న నలుగురు ఉగ్రవాదులను హరి యాణాలోని కర్నాల్ వద్ద ఆ రాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. వీటి ట్రాన్సిట్ పాయింట్ ఆదిలాబాద్ అని, అక్కడకు వచ్చే నాందేడ్ ముఠా తీసుకుని వెళ్లేలా రిందా ప్లాన్ చేశాడని పోలీసులు గుర్తించారు. త్రుటిలో తప్పించుకుని పాక్కు.. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన రిందా కుటుంబం పంజాబ్లోని తరంతరాన్ జిల్లాకు వలసవెళ్లింది. 18 ఏళ్ల వయస్సులోనే సమీప బంధువును హత్య చేసిన రిందా.. తర్వాత నాందేడ్కు మకాం మార్చాడు. అక్కడా రెండు హత్యలతోసహా పలు నేరాలు చేసి పంజాబ్కు పారిపోయాడు. పంజాబ్ యూనివర్సిటీలో ఉన్న పరిచయస్తుల సాయంతో అందులోనే తలదాచుకున్నాడు. 2016లో అక్టోబర్లో ఆ వర్సిటీలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న రిందా స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఓఐ) నాయకులపై తుపాకులతో కాల్పులు జరిపాడు. మాఫియా సంబంధాలతో హత్యలు, బలవంతపు వసూళ్లు తదితర నేరాలు చేయడంతో కేసులు నమోదయ్యాయి. 2017లో తన భార్యతో కలిసి బెంగళూరులోని ఓ హోటల్లో ఉన్నట్లు పంజాబ్ పోలీసులు గుర్తించారు. వీరి సమాచారంతో బెంగళూరు పోలీసులు ఆ హోటల్పై దాడి చేశారు. త్రుటిలో తప్పించుకున్న రిందా పాకిస్తాన్ పారిపోయాడు. అక్కడ ఉంటూనే బీకేఐతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. బీకేఐ సంస్థ ఐఎస్ఐ, ఎల్ఈటీల కోసం పని చేస్తున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో గతంలోనే గుర్తించింది. తాజాగా రిందాను వినియోగించుకుని ఈ రెండు సంస్థలు భారత్లో భారీ విధ్వంసాలకు కుట్ర పన్నింది. దీనికోసం ఇతగాడు పంజాబ్లోని∙బీకేఐ స్లీపర్ సెల్స్తోపాటు నాందేడ్లో తన అనుచరులను వాడుకోవాలని పథకం వేశాడు. -
హిజాబ్ వివాదం.. కొత్త మలుపు! ఐబీ హెచ్చరికలు
హిజాబ్ వివాదం ఇప్పుడు మరో రూపం దాలుస్తోంది. హిజాబ్ అంశాన్ని అడ్డుపెట్టుకుని ఉర్దూయిస్థాన్ ఏర్పాటు కుట్ర జరుగుతోందంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ విభాగంతో సంఘ విద్రోహ శక్తులు చేతులు కలపొచ్చని, ఉర్దూయిస్థాన్ ఏర్పాటుకు ప్రయత్నించొచ్చని పోలీసులకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత్లో అశాంతి రాజేందుకు రంగంలోకి దిగినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక అంచనాకి వచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న హిజాబ్ వివాదాన్ని ఖలీస్థానీ విభాగం ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ (ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను సాయంతో మరింత రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టు నిఘా వర్గాలు (ఇంటెలిజెన్స్) హెచ్చరించాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖలకు, చట్టాన్ని అమలు చేసే సంస్థలకు నిఘా వర్గాలు శుక్రవారం ఒక నోట్ ద్వారా సూచించాయి. ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి విద్యా సంస్థలకు రావడం కుదరదంటూ కర్ణాటక రాష్ట్రం అభ్యంతరం చెప్పడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. చదువుకునే చోటు వివాదాలకు, రాజకీయాలకు వేదిక కాకూడదనేది పలువురి అభిప్రాయం. అయితే భారత్ వ్యతిరేక శక్తులు కొన్ని సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నుతో చేతులు కలపొచ్చని, హిజాబ్ అంశాన్ని అడ్డుపెట్టుకుని ఉర్దూయిస్థాన్ కాన్సెప్ట్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో తాజాగా హెచ్చరించింది. రాజస్థాన్, ఢిల్లీ, యూపీ, బిహార్, వెస్ట్ బెంగాల్ లోని ప్రాంతాలతో ఉర్దూయిస్థాన్ ఏర్పాటుకు హిజాబ్ రెఫరెండమ్ ఉద్యమాన్ని ముస్లింలు ప్రారంభించాలంటూ సిఖ్స్ ఫర్ జస్టిస్ పిలుపునిచ్చినట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో పేర్కొంది. ఇందుకు కావాల్సిన నిధులను సమీకరిస్తామంటూ హామీఇవ్వడాన్ని సైతం ప్రస్తావించింది. హిజాబ్ రిఫరెండం కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫారమ్ కొన్ని స్క్రీన్షాట్లు, చిత్రాలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వైరల్ అయ్యాయి. అంతేకాదు గురుపత్వంత్ సింగ్ పన్నూ ప్రసంగం కూడా వైరల్ అవుతున్న విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల నోట్ శుక్రవారం వివరించింది. -
పాక్లో బలపడుతున్న ఉగ్రమూకలు
పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డా అనేది కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా భారత్కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. తీవ్రవాదులకు పాక్ సురక్షిత స్థావరంగా మారిందని అమెరికా సహా చాలాదేశాలు ఎంతోకాలంగా చెబుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో అఫ్గానిస్తాన్లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం... ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది. ఆఫ్గానిస్తాన్ను తీవ్రవాదలకు సురక్షిత స్థావరం కానివ్వకూడదని, వారికెలాంటి ఆర్థిక సహాయం అందకూడదని... తాలిబన్లతో కుదిరిన ఒప్పందంలో అమెరికా, నాటోదళాలు స్పష్టం చేశాయి. భారత్తో పాటు మిగతా దేశాలూ ఇదే కోరుతున్నాయి. అయితే అఫ్గాన్తో పాటు పొరుగున్న పాక్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు... భారత్కు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. అతివాద ఇస్లామిక్ ఉద్యమాన్ని నడుపుతున్న తెహ్రీక్– ఇ– లబ్బాయిక్ పాకిస్తాన్ (టీఎల్పీ) ముందు ఈ నవంబరులో పాక్లోని ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయింది. మహ్మద్ ప్రవక్త గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగనివ్వకూడదు, దైవదూషణకు పాల్పడే వారికి మరణశిక్ష విధిస్తున్న పాక్ చట్టాలను గట్టిగా బలపరచడం... ఈ రెండు టీఎల్పీ సిద్ధాంతాల్లో ముఖ్యమైనవి. 2015లో ఏర్పాటైంది. పంజాబ్ ఫ్రావిన్సులో దీనికి గట్టి పునాదులు, జనాదరణ ఉన్నాయి. దీన్ని రాజకీయ లబ్ధికి ఇమ్రాన్ ఖాన్, మిలటరీ ఉపయోగించుకున్నాయి. ఇమ్రాన్తో చేతులు కలిపిన అతివాదశక్తులు 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఉదారవాద భావాలున్న నవాజ్ షరీఫ్ను గద్దెదింపడంలో సఫలమయ్యాయి. ప్రధాని పదవి చేపట్టిన ఇమ్రాన్... తర్వాత టీఎల్పీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో టీఎల్పీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. అయితే అక్టోబరులో ఈ సంస్థ వేలాది మందితో ఇస్లామాబాద్ ముట్టడికి బయలుదేరడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. 20 మంది పోలీసులు చనిపోయారు. సైన్యాన్ని దింపుతామని హెచ్చరికలు జారీచేసినా... తర్వాత తెరవెనుక ఏ శక్తులు పనిచేశాయో టీఎల్పీతో పాక్ ప్రభుత్వం రాజీ కుదుర్చుకుంది. ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి టీఎల్పీని తొలగించింది. టీఎల్పీ చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సాద్ను జైలు నుంచి విడుదల చేసింది. కేసులను ఎత్తివేయడానికి అంగీకరించింది. స్తంభింపజేసిన బ్యాంకు అకౌంట్లను పునరుద్ధరించింది. అతివాద భావాలున్న ఈ సంస్థ శ్రేణుల నుంచి జైషే మొహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్ఈటీ) లాంటి ఉగ్రసంస్థలు రిక్రూట్మెంట్లు చేసుకునే ప్రమాదం పొంచివుంది. పాక్లో అతివాద శక్తులు బలపడటం... భారత్కు ఆందోళన కలిగించే విషయమే. భావజాల వ్యాప్తితో ప్రమాదం తాలిబన్లు.. ప్రపంచం ఒత్తిడి మేరకు ఆఫ్గాన్కే పరిమితమైనా... వారి ప్రభుత్వంలో భాగమైన హక్కానీ నెట్వర్క్ అలా కాదు. భారత్లో సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న సంస్థలకు దీనినుంచి మద్దతు తప్పకుండా లభిస్తుంది. అలాగే మరో ఉగ్రసంస్థ ఐసిస్–కె కూడా కశ్మీర్ను విముక్తం చేయాలని ఆగస్టులో ప్రకటన చేసింది. ఇకపై ఉగ్రసంస్థలు కశ్మీర్పై దృష్టి సారిస్తాయి. తదుపరి లక్ష్యంగా చేసుకుంటాయి. తాలిబన్ల విజయంతో ఈ ఉగ్రసంస్థలు ద్విగుణీకృత ఉత్సాహంతో చొరబాటు యత్నాలు మొదలుపెట్టాయని రక్షణశాఖలోని విశ్వసనీయవర్గాల సమాచారం. భారత్లో అతివాద భావాజాలన్ని వ్యాప్తిచేయడానికి ఇవి ప్రయత్నిస్తాయి. పాక్ గూడఛార సంస్థ (ఐఎస్ఐ) అండతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర కార్ఖానాలను నడుపుతున్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్లతో పాటు ఐసిస్ కూడా రిక్రూట్మెంట్ల మీద దృష్టి సారిస్తాయి. గతంతో పోలిస్తే ఇంటర్నెట్ ఇప్పుడు బాగా విస్తృతమైంది. సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా అతివాద భావాలున్న యువతను గుర్తించి .. వారితో టచ్లోకి వస్తాయి. ‘జిహాద్’ పవిత్ర కార్యమంటూ నూరిపోసి ఉగ్రవాదం వైపు మళ్లిస్తాయి. ఎన్ఐఏ ఇప్పటికే కశ్మీర్తో పాటు కేరళ తదితర ప్రాంతాల్లో రిక్రూట్మెంట్లపై ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో తాలిబన్లు అధికారంలో (1996–2021) ఉన్న ఐదేళ్లలో కశ్మీర్లో ఉగ్రదాడుల్లో 5,715 సాధారణ పౌరులు మరణించగా... తర్వాత 20 ఏళ్లలో (2001– 2021 అక్టోబరు వరకు) 3,194 మంది చనిపోయారు. తాలిబన్లు అధికారంలో ఉంటే కశ్మీర్ మిలిటెన్సీ పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఎడమ వైపు గ్రాఫ్లో ఆ వివరాలను చూడొచ్చు. కశ్మీర్లో అలజడికి యత్నాలు తాలిబన్లు అధికారం చేపట్టగానే.. ఉగ్రవాద సంస్థల నైతిక స్థైర్యం పెరిగిపోయింది. దీని ప్రభావం కశ్మీర్లో అక్టోబరు, నవంబరు నెలల్లో స్పష్టంగా కనిపించింది. సాధారణ ప్రజలను అకారణంగా పొట్టనబెట్టుకొని... భయోత్పాత వాతావరణాన్ని సృష్టించడానికి తీవ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. స్కూలు టీచర్లు, శ్రీనగర్లో ప్రముఖ మెడికల్ షాపును నిర్వహించే కశ్మీర్ పండిట్ను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలను... ఇలా పలువురిని ఉగ్రమూకలు కాల్పిచంపాయి. ఈ ఏడాదిలో నవంబరు 15 నాటికి కశ్మీర్లో 40 మంది సాధరణ పౌరులు ఉగ్రదాడులకు బలయ్యారని కేంద్ర ప్రభుత్వం గతనెల 30న రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది. ఇందులో ఎక్కువగా అక్టోబరు– నవంబరులోనే జరిగాయి. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం... నవంబరులో 5,500 మంది సాయుధ బలగాల(సీఆర్పీఎఫ్–3,000, బీఎస్ఎఫ్–2,500)ను అదనంగా జమ్మూ కశ్మీర్కు పంపింది. శీతాకాలంలో దట్టంగా మంచు కురుస్తుంది.. దూరాన ఉన్నవి ఏవీ కనపడని వాతావరణం ఉంటుంది కాబట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి చొరబాటు యత్నాలూ పెరిగాయి. దీన్ని అడ్డుకోవడానికి నెలరోజుల పాటు భారత ఆర్మీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. పలువురు చొరబాటుదారులను కాల్చి చంపింది. అలాగే ఉగ్రవాద సానుభూతిపరులు, మస్తిష్కాలను కలుషితం చేస్తూ కాలేజీల్లో యువతను ఉగ్రవాదం వైపు మళ్లించే వారినీ గుర్తించేందుకు జమ్మూ కశ్మీర్ పోలీసు యంత్రాంగ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆర్థిక మూలాలను దిగ్భందం చేస్తోంది. కన్సల్టెన్సీల పేరిట పాక్లో వైద్య కళాశాలల్లోని సీట్లను కశ్మీర్ విద్యార్థులకు వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు అమ్ముతూ... వచ్చే నిధులను ఉగ్ర కార్యకలాపాలకు మళ్లిస్తున్నారని గుర్తించారు. ఆగస్టులో నలుగురు హురియత్ నేతలను అరెస్టు కూడా చేశారు. మొత్తానికి కశ్మీర్లో ఉగ్రవాదుల యాక్టివిటీ పెరిగింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
భారత్ ఆస్తులను ధ్వంసం చేయండి
కాబూల్: అఫ్గానిస్తాన్లో భారత్ నిర్మించిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులను ధ్వంసం చేయాలని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అఫ్గాన్లోని తమ వారిని, తాలిబన్లను ఆదేశించింది. పాకిస్తాన్ నుంచి అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తాలిబన్లకు మద్దతుగా చాలామంది అఫ్గాన్ వెళ్లారని, అక్కడి భారత ఆస్తులను లక్ష్యంగా చేసుకోవాలని వారిని ఆదేశించారని అఫ్గాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాలిబన్ల ఆక్రమణలోకి వచ్చిన ప్రాంతాల్లో వారి తొలి లక్ష్యం భారత్కు సంబంధించిన ఆస్తులు, భవనాలేనని తెలిసిందని పేర్కొన్నాయి. ఇప్పటికే అఫ్గాన్లో ఉన్నవారు కాకుండా, ఇటీవలి కాలంలో కనీసం 10 వేల మంది పాకిస్తానీయులు తాలిబన్లకు మద్దతుగా వివిధ సరిహద్దు మార్గాల ద్వారా అఫ్గానిస్తాన్ వెళ్లారని సమాచారం. అఫ్గానిస్తాన్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం భారత్ సుమారు 300 కోట్ల డాలర్లను ఖర్చు చేసింది. భారత్ నిధుల ద్వారా నిర్మితమైన వాటిలో డేలారం– జారంజ్ల మధ్య నిర్మించిన 218 కిమీల రహదారి, సల్మా డ్యామ్, అఫ్గాన్ పార్లమెంట్ భవనం.. ఉన్నాయి. -
కోల్కతా, బెంగళూరులలో ప్రభుత్వ ఉద్యోగాలు
భారత ప్రభుత్వ స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వశాఖకు చెందిన కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్(ఐఎస్ఐ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 45 ► పోస్టుల వివరాలు: ఇంజనీర్(ఎలక్ట్రికల్)–02, ఇంజనీరింగ్ అసిస్టెంట్(సివిల్)–03, ఇంజనీరింగ్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్)–03, ఎలక్ట్రీషియన్–14, ఆపరేటర్ కమ్ మెకానిక్(లిఫ్ట్)–08, డ్రైవర్–01, కుక్–01, అసిస్టెంట్(లైబ్రరీ)–06, అసిస్టెంట్(ల్యాబొరేటరీ)–04, అసిస్టెంట్(రెప్రో–ఫోటో)–02, అసిస్టెంట్(ఫార్మ్)–01. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత సర్టిఫికేట్లతోపాటు అనుభవం, డ్రైవర్ పోస్టులకు లైట్,హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ► వయసు: 35ఏళ్లకు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ► ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.07.2021 ► వెబ్సైట్: https://www.isical.ac.in ఐటీఐ లిమిటెడ్లో 40 హాస్పిటల్ స్టాఫ్ పోస్టులు బెంగళూరులోని భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఐటీఐ లిమిటెడ్కు చెందిన ఆసుపత్రుల్లో నిర్ణీత కాల వ్యవధి ప్రాతిపదికన హాస్పిటల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 40 ► పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్సు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ఎక్స్రే టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, జూనియర్ ఫార్మసిస్ట్, రిసెప్షనిస్ట్, హెల్పర్. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏడో తరగతి, పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్లలో డిప్లొమా, బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. అనుభవం ఉండాలి. ► వయసు: పోస్టుల్ని అనుసరించి 28ఏళ్లు, 30ఏళ్లు మించకుండా ఉండాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెల కు రూ. 24754 నుంచి రూ.27,757 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: అప్టిట్యూడ్/టెక్నికల్ టెస్ట్/గ్రూప్ టాస్క్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఏజీఎం–హెచ్ఆర్, ఐటీఐ లిమిటెడ్, బెంగళూరు ప్లాంట్, దూరవాణి నగర్, బెంగళూరు 560016 చిరునామాకు పంపించాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.07.2021 ► దరఖాస్తు హార్డ్కాపీలను పంపడానికి చివరి తేది: 24.07.2021 ► వెబ్సైట్: https://www.itiltd.in -
‘నగ్న ఫోటోలపై ఆసక్తే నాతో అలా చేయించింది’
జైపూర్: రాజస్తాన్ లథికి చెందిన సత్యనారాయణ పాలివాల్(42) అనే వ్యక్తిని గూఢచర్యం ఆరోపణలపై.. అధికారిక రహస్యాల చట్టం కింద ఇంటిలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ హనీట్రాప్ వలలో చిక్కిన సత్యనారాయణ.. దేశానికి, మిలటరీకి సంబంధించిన కీలక విషయాలను వారితో పంచుకున్నాడని అధికారులు తెలిపారు. ఇక విచారణ సందర్భంగా ఐఎస్ఐ.. నగ్న ఫోటోలు, సెక్స్ చాట్ని ఎరగా వేసి సత్యనారాయణ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టిందని తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ‘సోషల్ మీడియా ఫేక్ అకౌంట్ ద్వారా సత్యనారాయణకు ఐఎస్ఐకి చెందిన పలువురు మహిళలతో పరిచయం ఏర్పడింది. ఇక నగ్న ఫోటోలపై సత్యనారాయణకు ఉన్న ఆసక్తిని గమనించిన సదరు మహిళలు ఆ కోవకు చెందిన ఫోటోలను అతడికి పంపేవారు. అంతేకాక అతడితో సెక్స్ చాట్ కూడా చేసేవారు’ అని అధికారులు వెల్లడించారు. (హనీట్రాప్ కేసు : కీలక వ్యక్తి అరెస్ట్ ) ‘ఇక నగ్న ఫోటోల మీద ఉన్న ఆసక్తితో సత్యనారాయణ దేశానికి సంబంధించిన రహస్య సమాచారం, పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ కదలికలకు గూర్చిన సున్నితమైన సమాచారాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఐఎస్ఐ మహిళలకు అందజేశాడు. సత్యనారాయణ సోషల్ మీడియా ఖాతాల ద్వారా చాలాకాలంగా ఐఎస్ఐతో సంప్రదింపులు జరుపుతున్నాడు. క్లిష్టమైన సమాచారం కోసం అతడిని హానీట్రాప్ చేశారు’ అని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. అంతేకాక నిందితుడిని కొంతకాలంగా గమనిస్తున్నామని, జైసల్మేర్లో అదుపులోకి తీసుకున్నప్పుడు అతని మొబైల్ ఫోన్లో అనేక ఆర్మీ పత్రాలు దొరికాయని అధికారులు వెల్లడించారు. (చదవండి: ఆ యాప్ ద్వారా భారత్ను టార్గెట్ చేస్తున్న పాక్!) ఈ సందర్భంగా రాజస్తాన్ పోలీసులు మాట్లాడుతూ.. ‘జైసల్మేర్కు చెందిన సత్యనారాయణ పాలివాల్ని గూఢచర్యం ఆరోపణల కింద సీఐడీ స్పెషల్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా అతడు పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ వ్యక్తులతో కాంటాక్ట్లో ఉండటమే కాక మిలిటరీకి సంబంధించిన కీలక సమాచారాన్ని వారికి చేరవేశాడు. ప్రస్తుతం అతడిని జైపూర్కు తరలించాము. రాజస్తాన్ ఇంటిలిజెన్స్ అధికారులు, మిలటరీ అతడిని ప్రశ్నిస్తుంది’ అని తెలిపారు. -
బలూచ్ కార్యకర్త మృతి.. పాక్పై అనుమానం
టొరంటో: ప్రఖ్యాత కార్యకర్త కరీమా బలూచ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. పాకిస్తాన్ సైన్యం, బలూచిస్తాన్ ప్రభుత్వ దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కరీమా బలూచ్ మృతదేహాన్ని టొరంటోలో కనుగొన్నారు. 2016లో పాకిస్తాన్ నుంచి తప్పించుకుని వెళ్లిన కరీమా ప్రస్తుతం కెనడాలో శరణార్థిగా ఆశ్రయం పొందుతున్నారు. కెనడా పోలీసులు లేక్షేర్ ప్రాంతంలో ఓ ద్వీపంలో అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఇక కరీమా పాక్ సైన్యం, బలుచిస్తాన్ ప్రభుత్వం దురాగతాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో టొరంటో సీనియర్ జర్నలిస్ట్ ఒకరు మాట్లాడుతూ.. ‘కరీమా మరణం వెనక పాక్ హస్తం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. టొరంటో పోలీసులు, కెనడా సెక్యూరిటీ ఏజెన్సీ సీఎస్ఐఎస్ ఈ కోణంలో దర్యాప్తు చేయాలి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాక్ ఐఎస్ఐ ఏజెంట్ల బారి నుంచి దేశాన్ని కాపాడటానికి చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. (చదవండి: ‘పాక్ ఆర్మీ ఆగడాల నుంచి రక్షించండి.. ప్లీజ్’ ) పాకిస్తాన్ ఆక్రమణ నుంచి బలుచిస్తాన్ వేరుపడి స్వేచ్ఛ పొందాలని కరీమా బలంగా కోరుకునేది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ ఆర్మీ అధికారులు కెనడాలో స్థిరపడటాన్ని వ్యతిరేకించే కరీమా ఈ విషయంలో వారిపై పదునైన విమర్శలు చేసేంది. అంతేకాక కరీమా ఎంతో ధైర్య సాహసాలు గల మనిషి. కెనడాలో ఐఎస్ఐ ఆపరేషన్లకు ఆమె అడ్డంకిగా మారింది. ఇక కరీమా మృతికి సంతాపంగా బలోచ్ నేషనల్ మూవ్మెంట్ 40 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఎలాంటి కార్యకలపాలు నిర్వహించకూడాని నిర్ణయించింది. ఇక ‘కెనడాలో ప్రవాసంలో నివసిస్తున్న బీఎస్ఎం నాయకురాలు, బలూచ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (బీఎస్ఓ) మాజీ చైర్పర్సన్ కరీమా బలిదానం బలూచ్ దేశానికి, జాతీయ ఉద్యమానికి తీరని నష్టమని’ బలూచ్ నేషనల్ మూవ్మెంట్ కార్యదర్శి తెలిపారు. "బానుక్ కరీమా మరణంతో, మేము ఒక దూరదృష్టిగల నాయకురాలిని, జాతీయ చిహ్నాన్ని కోల్పోయాము. శతాబ్దాల పాటు పూడ్చలేని నష్టం ఇది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఆ 63 మంది హాయిగా ఇంట్లో ఉండేవారు!) ఇక నాలుగేళ్ల క్రితం అంటే 2016లో కరీమా ప్రధాని నరేంద్ర మోదీకి రక్షాబంధన్ సందేశం పంపారు. అదే ఏడాది ఆమె పాక్లో తన ప్రాణానికి ప్రమాదం ఉండటంతో కొందరు స్నేహితులు, కార్యకర్తల సాయంతో దేశం విడిచి పారిపోయారు. ఇక అదే ఏడాది బీబీసీ వెలువరించిన 100మంది అత్యంత ప్రభావవంతైన మహిళల జాబితాలో కరీమా చోటు దక్కించుకున్నారు. -
సోషల్ మీడియాలో పరిచయం.. ఆపై
ముంబై: భారత యుద్ధ విమానాల రహస్యాలను పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్కు(ఐఎస్ఐ) చేరవేస్తున్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఉద్యోగిని అరెస్టు చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. దీపక్ శిర్సాత్(41)నాసిక్లోని హెచ్ఏఎల్లో అసిస్టెంట్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తూ, సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తానీ మహిళగా పరిచయం చేసుకున్న వ్యక్తుల ట్రాప్లో పడ్డాడు. (చదవండి: రిపబ్లిక్ టీవీ సీఎఫ్ఓకు సమన్లు) ఈ నేపథ్యంలో ఐఎస్ఐతో నిత్యం సంబంధాలు నెరపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో, మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ నాసిక్ యూనిట్ అతడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. యుద్ధ విమానాల రహస్య సమాచారాలను పాకిస్తాన్కు దీపక్ పంపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. అతడి దగ్గర 3 మొబైల్ ఫోన్లు, ఐదు సిమ్ కార్డులు, రెండు మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు అతడికి పదిరోజుల ఏటీఎస్ కస్టడీకి అనుమతించింది. -
ఐఎస్ఐ ఆన్లైన్ 'గేమ్' ప్లాన్
సాక్షి, హైదరాబాద్: భారత్లోని మధ్య తరగతి యువతే టార్గె ట్గా, కలర్ ప్రిడిక్షన్ గేమ్ పేరుతో ఆన్లైన్ బెట్టింగ్కు తెరలేపిన చైనాకు చెందిన బీజింగ్ టీ పవర్ సంస్థకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలి జెన్స్ (ఐఎస్ఐ) మద్దతు ఉందా? ఔననే అంటు న్నాయి కేంద్ర నిఘా వర్గాలు. హైదరాబాద్ సిటీ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టుచేసిన చైనా జాతీ యుడు, బీజింగ్ టీ పవర్ కంపెనీ సౌత్ ఈస్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్ యాన్ హూ పాస్పోర్టును అధ్యయనం చేసిన కేంద్ర నిఘా వర్గాలు ఈ అను మానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఐఎస్ఐ లింక్ బీజింగ్ టీ పవర్ సంస్థ.. ‘ఈ–కామర్స్’ ముసుగులో నమోదు చేయించిన 8 కంపెనీల్ని ఢిల్లీలో ఉంటూ యాన్ హూ పర్యవేక్షిస్తున్నాడు. దీనికి ముందే గతేడాది నవంబర్లో ఇతగాడు పాకిస్తాన్ వెళ్లినట్లు అతడి పాస్పోర్టు వివరాల్ని విశ్లేషించిన ఐబీ వర్గాలు చెబుతున్నాయి. 15 రోజులు అక్కడే ఉన్న హూ ఐఎస్ఐ బాధ్యుల్ని కలిసినట్లు అనుమానిస్తు న్నాయి. భారత్ కేంద్రంగా సాగించే ఆన్లైన్ బెట్టింగ్ దందా నిర్వహణపై వారు చర్చించి ఉంటారని, ఐఎస్ఐ సంపూర్ణ మద్దతు తోనే గేమ్ మొదలై ఉం టుందని అంచనా వేస్తు న్నాయి. ఈ కోణంలో మరిన్ని ఆధారాల సేకర ణపై దృష్టి పెట్టాయి. దీనిపై సైబర్ క్రైమ్ పోలీ సులు లేదా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధి కారులు యాన్ హూను కస్టడీలోకి తీసుకున్నప్పుడు విచారించాలని నిర్ణయించారు. కొరియాలో సాఫ్ట్వేర్ అభివృద్ధి? కలర్ ప్రిడిక్షన్ గేమ్లో భాగంగా.. 3 నిమిషాలుండే ఒక్కో బెట్టింగ్లోనూ ఆఖరి 30 సెకండ్లు ఫలితాలను నిర్ధారిస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఏ రంగుపై ఎక్కువ మంది/ ఎక్కువ మొత్తం బెట్టింగ్ కాస్తున్నారో వారు ఓడిపోయేలా ఈ ప్రోగ్రా మింగ్ను డిజైన్ చేశారు. ఈ మొత్తం సాఫ్ట్వేర్ను యాన్ హూ కొరియాలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థ వద్ద అభివృద్ధి చేయించినట్లు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. ఇతడు భారత్కు వచ్చే ముందు కొరియాకు వెళ్లివచ్చినట్లు ఇమ్మిగ్రేషన్ నుంచి సమాచారం అందుకున్న ఐబీ ఈ అంచనాకు వచ్చింది. యాన్ హూ ఇంకా ఇండోనేషియా, మలేషియా, థాయ్లాండ్, యూఏఈ, జపాన్ కూడా వెళ్లొచ్చాడని ఐబీ వర్గాలు చెబుతున్నాయి. ఆన్లైన్ గేమింగ్ ద్వారా వచ్చిన సొమ్మును హాంకాంగ్ నుంచి ఆయా దేశాలకూ మళ్లించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర? ఢిల్లీకి చెందిన హేమంత్ సాయంతో తమ కంపెనీల్లో డమ్మీ డైరెక్టర్లను పెట్టి దందా నడిపిన యాన్ హూ, తన పేరు బయటపడకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే కొన్ని బ్యాంకు ఖాతాల నిర్వహణకు ఆథరైజేషన్ తీసుకోవడం ద్వారా ఆయా కంపెనీలతో సంబంధాలున్నట్లు పరోక్ష ఆధారాలు అందించాడు. ఇప్పుడిదే దర్యాప్తులో కీలకం కానుంది. కలర్ ప్రిడిక్షన్ గేమ్లో రూ.1.5 లక్షలు పోగొట్టుకున్న ఎస్సార్నగర్కు చెందిన యువకుడి ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. ఈ తాజా కేసులో పీటీ వారెంట్పై నిందితుల్ని అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాలకు చెందిన ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘బీజింగ్ టీ పవర్ కంపెనీకి ఐఎస్ఐతో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నాం. ఇందులో మోసంతో పాటు ఇతర కోణాలున్నాయా అనేది పరిశీలిస్తున్నాం. భారత్పై పాక్ చేస్తున్న కుట్రలకు చైనా మద్దతునిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్థికంగా దెబ్బతీసే ఈ దందాకు ఐఎస్ఐ మద్దతునిచ్చిందనే భావిస్తున్నాం. ప్రాథమిక సమాచారాన్ని రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా), కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖలకు చేరవేశాం’ అని వివరించారు. -
అయోధ్యలో ఉగ్ర కుట్రలకు పాక్ పన్నాగం!
న్యూఢిల్లీ: అయోధ్యలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేసే ప్రణాళికలు రచిస్తున్నట్టు భారత నిఘా విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు 15న పాకిస్తాన్ ఐఎస్ఐ ట్రైనింగ్ ఇచ్చిన లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది. భారత్లో ఉగ్రదాడులు చేసి అంతర్గతంగా కల్లోలం సృష్టించాలని ఐఎస్ఐ కుట్రలు పన్నుతోందని పరిశోధన మరియు విశ్లేషణ విభాగం (రా) అధికారులు వెల్లడించారు. మూడు నుంచి ఐదు టెర్రరిస్టు గ్రూపులు మన దేశంలోకి చొరబడేందుకు చూస్తున్నాయని, పాక్ ఐఎస్ఐ వారికి సాయం చేస్తోందని తెలిపారు. 20 నుంచి 25 మంది నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట, 5 నుంచి 6 మంది ఇండో నేపాల్ సరిహద్దుల నుంచి దేశంలోకి చొరబడేందుకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అయోధ్యతోపాటు కశ్మీర్లోనూ దాడులు చేసేందుకు పాకిస్తాన్లోని జలాల్బాద్లో ఐఎస్ఐ వారికి శిక్షణ ఇచ్చిందని తెలిపారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా అధికారులు సరిహద్దుల వెంబడి గస్తీని పెంచారు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన సమయం దగ్గరపడుతున్న వేళ ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఆగస్టు 5 న ప్రధాని మోదీ భవ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు అదే రోజు ఏడాది పూర్తవుతుండటం విశేషం. -
భారత్పై విద్వేషం: ట్విటర్ ఖాతా తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ : గల్ఫ్ దేశాల్లో భారత్పై తప్పుడు వార్తల్ని ప్రచారం చేసేందుకు పాకిస్తాన్ గూడఛర్య సంస్థ ఐఎస్ఐ వాడుతున్న నకిలీ ఖాతాను ట్విటర్ తొలగించింది. సౌదీ యువరాణి నౌరా బింట్ ఫైసల్ పేరును అనుకరించేలా నౌరాఅల్సాద్ ఐడీ పేరుతో ఇదనియాలుసాఫ్ అనే ఖాతాను ట్విటర్ నిలిపివేసింది. పాకిస్తాన్ నుంచి నిర్వహిస్తున్నఈ ట్విటర్ ఖాతా ద్వారా భారత్ వ్యతిరేక ప్రచారాన్ని హోరెత్తిస్తున్నట్టు గుర్తించారు. ఇతరులను బెదిరించడం, వేధింపులకు గురిచేయడం వంటి కార్యకలాపాలు సాగిస్తున్నందున ఇవి తమ ప్రమాణాలకు అనుగుణంగా లేవంటూ సదరు ఖాతాను ట్విటర్ తొలగించింది. సోషల్ మీడియా వేదికల్లో పలు నకిలీ ఖాతాలను ఉపయోగిస్తూ భారత్తో పాటు ప్రధాని నరేంద్ర మోదీపై గల్ఫ్ దేశాల్లో ఐఎస్ఐ విషం చిమ్ముతోందని భారత భద్రతా దళాలు ఎప్పటి నుంచో పేర్కొంటున్న సంగతి తెలిసిందే. నకిలీ ఖాతాలతో సోషల్ మీడియాలో భారత వ్యతిరేక సందేశాలను పాకిస్తాన్ చేరవేస్తోందని ఆధాలతో సహా భారత నిఘా వర్గాలు నివేదికను రూపొందించాయి. భారత్పై విద్వేష విషం చిమ్మేందుకు గల్ప్ దేశాల రాచరిక కుటుంబ సభ్యుల పేరుతో నకిలీ ఖాతాలను సృష్టిస్తున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. చదవండి : ఆయన ఇంకా సీఎం అనే భ్రమలో ఉన్నారు -
క్వెట్టాలో కరెన్సీ ప్రెస్!
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించడానికి పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అక్కడి బలూచిస్థాన్ ప్రాంతంలో ఉన్న క్వెట్టాలో ప్రత్యేకంగా ఓ పవర్ ప్రెస్ ఏర్పాటు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ప్రింట్ అవుతున్న నకిలీ నోట్లు అసలు వాటిని తలదన్నేలా ఉంటున్నాయి. బంగ్లాదేశ్ మీదుగా భారత్లోకి వస్తున్న ఈ కరెన్సీని దక్షిణ భారతదేశంలో చలామణి చేయించడంతో పశ్చిమ బెంగాల్కు చెందిన అమీన్ ఉల్ రెహ్మాన్ అలియాస్ బబ్లూ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. గత ఏడాది ఇతడి అనుచరుడిని పట్టుకున్న దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు దాదాపు 11 నెలల గాలించి ఈ కీలక నిందితుడిని పట్టుకోగలిగారు. ఇతడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది కేసులు నమోదై ఉన్నాయని, 2013 నుంచి రిజిస్టర్ అవుతున్న ఈ కేసుల్లో బబ్లూ వాంటెడ్గా ఉన్నాడని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం ప్రకటించారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. రూట్ మార్చి.. క్వెట్టాలో ముద్రితమవుతున్న నకిలీ కరెన్సీ తొలుత ఆ దేశ రాజధాని కరాచీకి చేరుతోంది. అక్కడ నుంచి ఐఎస్ఐ ప్రత్యేక పార్శిల్స్ ద్వారా వివిధ మార్గాల్లో భారత్కు పంపిస్తోంది. ఒకప్పుడు పాకిస్థాన్ నుంచి విమానాల ద్వారా దుబాయ్/సౌదీ అరేబియాలను తరలించేవారు. అక్కడున్న ఏజెంట్ల సహకారంతో జల మార్గంలో ఓడల ద్వారా గుజరాత్, మహారాష్ట్రల్లోని వివిధ ఓడ రేవులకు చేర్చేవారు. చిత్తుకాగితాలు, ముడిసరుకులు ఇలా అనేక పేర్లతో ఈ కన్సైన్మెంట్స్ వచ్చేవి. గడిచిన కొన్నేళ్లుగా ఈ మార్గంలో తీసుకురావడం కష్టంగా మారడంతో ఐఎస్ఐ తన రూటు మార్చింది. కరాచీ నుంచి విమానాల ద్వారా బంగ్లాదేశ్కు చేరవేస్తోంది. అక్కడ నుంచి పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాకు తీసుకువచ్చి ఏజెంట్ల ద్వారా చలామణి చేయిస్తోంది. వివిధ దశల్లో ఏజెంట్లు.. నకిలీ కరెన్సీ డంప్ చేసి చలామణి చేయించడం ద్వారా పాకిస్థాన్ దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడంతో పాటు అలా వచ్చే నిధుల్ని పరోక్షంగా ఉగ్రవాదానికి వాడుతోందనే అనుమానాలున్నాయి. కరాచీ నుంచి మల్దా వరకు వివిధ దశల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్న ఐఎస్ఐ వారికి కమీషన్లు చెల్లిస్తోంది. సాధారణంగా హైదరాబాద్కు చేరే నకిలీ కరెన్సీ మార్పిడిన రేటు 1:3గా ఉండేది. అంటే రూ.30 వేలు అసలు నోట్లు ఇస్తే ఏజెంట్లు రూ.లక్ష నకిలీ కరెన్సీ ఇచ్చే వారు. ఏళ్లుగా ఇదే రేటు కొనసాగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో ఈ కమీషన్ పెరిగింది. కరెన్సీ నోట్లను పక్కాగా ముద్రిస్తున్న నేపథ్యంలోనే ఈ కమీషన్ కూడా పెంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా మాల్దాకు చెందిన బబ్లూ ఈ కరెన్సీని దక్షిణ భారతదేశంలో ఉన్న అనేక మంది ఏజెంట్లకు సరఫరా చేస్తుంటాడు. ఇలా వెలుగులోకి.. చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలోని బండ్లగూడకు చెందిన మహ్మద్ గౌస్ వృత్తిరీత్యా పండ్ల వ్యాపారి. 1991లో పోలీసులకు బాంబులతో పట్టుబడటంతో బాంబ్ గౌస్గా మారాడు. ఇతడిపై పోలీసులు ఉగ్రవాద చర్యల వ్యతిరేక చట్టం (టాడా) కూడా ప్రయోగించారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం 2011 నుంచి నకిలీ కరెన్సీ దందా ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన అనేక మంది ఏజెంట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఇతగాడు అక్కడ నుంచి నకిలీ కరెన్సీని వివిధ మార్గాల్లో నగరానికి రప్పించి చెలామణి చేస్తున్నాడు. ఇతగాడికి 2013లో మాల్దా జిల్లాలో కృష్ణాపూర్ ప్రాంతానికి చెందిన బబ్లూతో పరిచయం ఏర్పడింది. అతడికి రూ.40 వేల నుంచి రూ.50 వేల చొప్పున అసలు కరెన్సీ చెల్లిస్తూ రూ.లక్ష నకిలీ కరెన్సీ తెప్పించి చలామణి చేసేశాడు. బబ్లూ గౌస్తో పాటు అనేక మందికి సరఫరా చేస్తున్నాడు. ఈ కరెన్సీని నగరంలో సర్క్యులేట్ చేస్తున్న గౌస్ను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు 11 నెలల క్రితం పట్టుకున్నారు. ఇతడి విచారణ నేపథ్యంలోనే బబ్లూ పేరు వెలుగులోకి వచ్చింది. మోస్ట్ వాంటెడ్గా మారిన అతడి కోసం అప్పటి నుంచి పోలీసులు గాలిస్తున్నారు. సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, మహ్మద్ థకియుద్దీన్, వి.నరేందర్లతో కూడిన బృందం మాల్దా వెళ్లి ఇతడి కోసం ముమ్మరంగా గాలించింది. ఎట్టకేలకు పట్టుకుని నగరానికి తీసుకువచ్చింది. తదుపరి చర్యల నిమిత్తం చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించింది. ఇతడి అరెస్టుకు సంబంధించి ఇతర జిల్లాలు, రాష్ట్రాల అధికారులకు సమాచారం ఇవ్వనున్నారు. -
బోర్డర్లో పాకిస్తాన్ కుయుక్తులు..
సాక్షి, న్యూఢిల్లీ : తన భూభాగంలో ఉగ్రవాదుల శిబిరాలను కాపాడేందుకు పాక్ సైన్యం, ఐఎస్ఐ సరిహద్దుల్లో హైటెక్ కెమరాలు, సిగ్నల్ టవర్స్ను ఏర్పాటు చేశాయని నిఘా వర్గాలకు సమాచారం అందింది. వాస్తవాధీన రేఖ వెంబడి గ్రామాల్లో పలు ఐఈడీ పేలుళ్లకు ఉగ్రవాదులు సన్నద్ధమయ్యారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. తమ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడులు చేస్తే వాటిని కాపాడుకునే క్రమంలో పాక్ సైన్యం ఏర్పాట్లు చేస్తోందని సరిహద్దుల్లో కెమెరాలు, సిగ్నల్ టవర్స్తో పహారా కాస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఎల్ఓసీ వెంబడి పాక్ సైన్యం, ఐఎస్ఐ ఇప్పటికే 18 సిగ్నల్ టవర్లను ఏర్పాటు చేశాయి. కెమరాలు, సిగ్నల్ టవర్స్ను ఏర్పాటు చేసిన అనంతరం ఈనెల 8న పీఓకే బ్రిగేడియర్ అసీం ఖాన్ నేతృత్వంలో కోట్లీలో జరిగిన భేటీలో వాస్తవాధీన రేఖ వెంబడి జనవరి 26లోగా పలు ఐఈడీ పేలుళ్లకు పాల్పడాలనే నిర్ణయం తీసుకున్నారని భారత నిఘా వర్గాలకు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
పాక్ కుయుక్తులకు నిఘా వర్గాల చెక్..
న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో అలజడి సృష్టించేందుకు ఖలిస్తాన్ అనుకూల సంస్థలతో పాకిస్తాన్ చేతులు కలిపింది. కశ్మీర్ ఖలిస్తాన్ రిఫరెండమ్ ఫ్రంట్ (కేకేఆర్ఎఫ్) పేరుతో సరికొత్త సంస్థగా ఆవిర్భవించి ఉగ్ర కుట్రకు తెరలేపిందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిఘా వర్గాల సమాచారం ప్రకారం పాక్కు చెందిన ఐఎస్ఐ ఖలిస్తానీ ఉగ్రవాదులతో కుమ్మక్కై భారత్లో భారీ దాడులకు పథక రచన చేసింది. కేకేఆర్ఎఫ్ సంస్థలో యువతను చేర్పించడంతో పాటు భారత్లో తీవ్ర అలజడి సృష్టించేందుకు ఈ ఉగ్ర సంస్థకు పెద్దసంఖ్యలో ఆయుధాలు, పేలడు సామాగ్రిని చేర్చేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు పసిగట్టాయి. కశ్మీర్, ఖలిస్తాన్లను ప్రతిబింబిచేలా కే2 ప్లాన్ను అమలుచేస్తున్న పాకిస్తాన్ సరిహద్దుల ద్వారా సరికొత్త సంస్థలో సరిహద్దుల గుండా ఉగ్రవాదులను చొప్పించడం, డ్రోన్ల ద్వారా ఆయుధ సామాగ్రిని సమకూర్చడం వంటి చర్యలకు ఐఎస్ఐ పాల్పడుతోందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
‘మేమిచ్చిన సమాచారంతోనే లాడెన్ హతం’
వాషింగ్టన్: కరుడుకట్టిన ఉగ్రవాది, ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిల్ లాడెన్ను అంతమొందించడంలో అమెరికాకు చెందిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీకి (సీఐఏ) పాకిస్తాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) సాయం చేసిందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ వెల్లడించారు. లాడెన్ను పట్టుకోవడంలో ఐఎస్ఐ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. లాడెన్ ఎక్కడున్నాడనే సమాచారాన్ని ఫోన్ ద్వారా అందించిందన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్ వాషింగ్టన్లోని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా లాడెన్ను చంపేంత వరకు ఆయన తమ దేశంలో ఉన్నాడనే విషయం తెలియదని ఇప్పటిదాకా పాక్ వాదించిన నేపథ్యంలో ఇమ్రాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికాను తామెప్పుడూ మిత్ర దేశంగానే భావించామని.. అందుకే లాడెన్కు సంబంధించిన సమాచారం అందించామని చెప్పారు. అమెరికా మాత్రం తమ దేశంపై నమ్మకం ఉంచలేకపోయిందని వ్యాఖ్యానించారు. -
భారత్కు దావూద్ కీలక అనుచరుడు!
న్యూఢిల్లీ: డీ-కంపెనీ ప్రధాన హవాలా నిర్వాహకుడు అహ్మద్ రజా అలియాస్ అఫ్రోజ్ వడారియాను భారతదేశానికి తీసుకురావడంలో ముంబై పోలీసులు, భారత ప్రభుత్వం గొప్ప పురోగతిని సాధించాయి. చోటా షకీల్, ఫహీమ్ మక్మాచ్లకు సన్నిహితుడైన రజా సూరత్, ముంబై, థానేలలో డీ-కంపెనీ వ్యాపారాలని నిర్వహిస్తున్నాడు. రజా సూరత్లో వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకొని తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. ముంబై పోలీసు బృందం గత సంవత్సర కాలం నుంచి రజాను ట్రాక్ చేస్తోంది. అతనిపై లుక్ అవుట్ నోటీస్లను కూడా జారీ చేసింది. అహ్మద్ రజాను అనూహ్యంగా గత నెలలో దుబాయ్లో అదుపులోకి తీసుకొని, భారత్కు తరలించే ప్రక్రియను భారత ఏజెన్సీలు ప్రారంభించాయి. ముంబై, థానే మరియు సూరత్లలో అతని సహాయకులను గుర్తించడానికి క్రైమ్ బ్రాంచ్ బృందాలను ఏర్పాటుచేసి విచారణను ముమ్మరం చేసింది. లష్కరే తోయిబా (ఎల్ఈటీ) చీఫ్ మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన నేపథ్యంలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతని డి-కంపెనీపైనా చర్యలు తీసుకోవాలని భారతదేశం ఇప్పుడు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ను కోరుతోంది. దావూద్ పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో కలిసి పనిచేస్తున్నాడు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని నిర్వహించడమే కాకుండా దేశంలోకి నకిలీ కరెన్సీని సరఫరా చేస్తున్నాడని ఆరోపణలున్నాయి. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ల ద్వారా డీ-కంపెనీ నకిలీ కరెన్సీ నోట్లను అక్రమంగా రవాణా చేస్తుంది. భారతదేశానికి నకిలీ నోట్లను తరలించడానికి, డి-కంపెనీ కార్యకలాపాలకు నేపాల్ ఒక రవాణా కేంద్రంగా పనిచేస్తోంది. డి-కంపెనీకి ముఖ్య సహాయకుడు జబీర్ మోతీవాలాను అమెరికాకు అప్పగించకుండా ఉండటానికి పాకిస్తాన్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మనీలాండరింగ్, మాదక ద్రవ్యాల రవాణా ఆరోపణలపై మోతీవాలాను లండన్లో 2018 ఆగస్టులో అరెస్టు చేశారు. చేశారు. మోతీవాలాను అమెరికాకు తరలిస్తే, దావూద్ ఇబ్రహీంకు ఐఎస్ఐతో ఉన్న సంబంధాన్ని అతను బహిర్గతం చేస్తాడని పాకిస్తాన్ భయపడుతోంది. మిలియన్ డాలర్ల అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్ నడుపుతున్న ప్రపంచ ఉగ్రవాదిగా దావూద్ ఇబ్రహీంను అమెరికా ఇప్పటికే ప్రకటించింది. -
పాక్లో మన కరెన్సీ ప్రింటింగ్!
భారత ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే ఉద్దేశంతో భారీగా నకిలీ కరెన్సీని ముద్రించి, దేశంలోకి పంపుతున్న పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ.. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రెస్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత నెలలో హైదరాబాద్లోని పాతబస్తీలో దొరికిన కరెన్సీ అక్కడే ముద్రితమై బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమబెంగాల్కు వచ్చినట్లు భావిస్తున్నారు. పాక్లోని బలూచిస్తాన్ లో ఉన్న క్వెట్టాలో ప్రత్యేకంగా ‘భారత్ పవర్ ప్రెస్’ఉన్నట్లు చెబుతున్నారు. ఇక్కడ ముద్రితమైన నకిలీ నోట్లు అసలు వాటిని తలదన్నేలా ఉన్నా.. అసలు నోట్లపై ఉండే కొన్ని భద్రతా ప్రమాణాలను మాత్రం ఐఎస్ఐ కాపీ చేయలేకపోయింది. – సాక్షి, హైదరాబాద్ రూటు మార్చి భారత్కు.. క్వెట్టాలో ముద్రితమవుతున్న ఈ నకిలీ కరెన్సీ తొలుత ఆ దేశ రాజధాని కరాచీకి చేరుతోంది. అక్కడ నుంచి ఐఎస్ఐ ప్రత్యేక పార్సిల్స్ ద్వారా పలు మార్గాల్లో భారత్కు వస్తోంది. ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి విమానాల ద్వారా దుబాయ్/సౌదీ అరేబియాలకు తరలించే వారు. అక్కడున్న ఏజెంట్ల సహకారంతో జలమార్గంలో ఓడల ద్వారా గుజరాత్, మహారాష్ట్రల్లోని వివిధ ఓడ రేవులకు చేర్చేవారు. చిత్తుకాగితాలు, ముడిసరుకుల పేరుతో వచ్చేవి. కొన్నాళ్లుగా ఈ మా ర్గం ద్వారా తీసుకురావడం కష్టంగా మారడంతో ఐఎస్ఐ రూటు మార్చింది. కరాచీ నుంచి విమానాల ద్వారా బంగ్లాదేశ్కు చేరవేస్తోంది. అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాకు తీసుకొచ్చి ఏజెంట్ల ద్వారా చెలామణీ చేయిస్తోంది. క్వాలిటీతో పాటే పెరిగిన కమీషన్ కరాచీ నుంచి మాల్దా వరకు వివిధ దశల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్న ఐఎస్ఐ వారికి కమీషన్లు చెల్లిస్తోంది. హైదరాబాద్కు చేరే నకిలీ కరెన్సీ మార్పిడి రేటు 1:3గా ఉండేది. అంటే రూ.30 వేలు అసలు నోట్లు ఇస్తే ఏజెంట్లు రూ.లక్ష నకిలీ కరెన్సీ ఇచ్చే వారు. ఇటీవల ఏజెంట్లకు ఇచ్చే ఈ కమీషన్ పెరిగింది. నోట్లను పక్కాగా ముద్రిస్తున్న నేపథ్యంలో కమీషన్ పెంచినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల చిక్కిన కరెన్సీని పాతబస్తీకి చెందిన గౌస్కు, మాల్దాకు చెందిన బబ్లూ రూ.50 వేల అసలు కరెన్సీకి రూ.లక్ష నకిలీ నోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలా వచ్చే నిధులను పాకిస్తాన్ పరోక్షంగా ఉగ్రవాదానికి వాడుతోందనే అనుమానాలు ఉన్నాయి. చిక్కిన గౌస్.. పరారీలో బబ్లూ.. బండ్లగూడకు చెందిన మహ్మద్ గౌస్ పండ్ల వ్యాపారి. 1991లో పోలీసులకు బాంబులతో పట్టుబడటంతో బాంబ్ గౌస్గా మారాడు. ఇతడిపై పోలీసులు ఉగ్రవాద చర్యల వ్యతిరేక చట్టం (టాడా) కూడా ప్రయోగించారు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు 2011 నుంచి నకిలీ కరెన్సీ దందా ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్ నుంచి పలు మార్గాల్లో హైదరాబాద్కు తెప్పించి చెలామణీ చేస్తున్నాడు. పశ్చిమ బెంగాల్లోని బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా మాల్దాలో ఉన్న కృష్ణాపూర్ ప్రాంతానికి చెందిన అమీనుల్ రెహ్మాన్ అలియాస్ బబ్లూతో పరిచయం ఏర్పడింది. ఇతడికి రూ.40 వేలు చొప్పున చెల్లిస్తూ రూ.లక్ష నకిలీ కరెన్సీ తెప్పించి చెలామణి చేసేశాడు. బబ్లూ గౌస్తో పాటు అనేక మందికి సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చారు. బబ్లూ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ మూడు గమనించుకోవాలి.. 1. సెక్యూరిటీ థ్రెడ్ కరెన్సీ నోటుకు ముందు వైపు మధ్యలో కుడివైపుగా నోటు విలువ అంకెల్లో ముద్రితమై ఉంటుంది. దీనికి కుడివైపున నోటు లోపలకు, బయటకు కనిపిస్తూ చిన్న పట్టీ ఉంటుంది. సిల్వర్ బ్రోమైడ్తో తయారయ్యే దీనిపై ఆర్బీఐ అంటూ ఆంగ్లం, హిందీ భాషల్లో చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది. ఇది నీలం, ఆకుపచ్చ రంగుల్లో మెరుస్తూ ఉంటుంది. నకిలీ కరెన్సీపై ఆర్బీఐ మార్క్ ఉన్నా.. ఈ థ్రెడ్ సిల్వర్ కోటెడ్ అయి ఉండి, ఆకుపచ్చ రంగు మాత్రమే ఉంటుంది. 2. బ్లీడ్ లైన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించే రూ.2 వేల కరెన్సీ నోటుకు కుడి, ఎడమ వైపుల్లో పైభాగంలో కొన్ని గీతలు ఉంటాయి. బ్లీడ్ లైన్స్గా పిలిచే ఇవి కాస్త ఎత్తుగా, ఒక్కో వైపు ఏడు చొప్పున ఉంటాయి. సాధారణ నోటును చేతితో తడిమితే ఇవి తగులుతాయి. నకిలీ నోట్లలో ఈ ఫీచర్ను కాపీ చేయడం సాధ్యం కాదు. నకిలీ నోట్లపై కూడా లైన్లు ఉన్నా అవి చేతికి తగిలేలా పైకి ఉండవు. 3. వాటర్ మార్క్ కరెన్సీ నోటుకు ముందు భాగంలో కుడి వైపు ఖాళీ ప్రదేశం ఉంటుంది. పైకి కనిపించని విధంగా గాంధీ బొమ్మ ఉంటుంది. దీనికి పక్కగా ఆ నోటు విలువ వేసి ఉంటుంది. ఈ వాటర్ మార్కును వెలుతురులో పెట్టిచూస్తే అందులోనూ గాంధీజీ ఫొటో కనిపిస్తుంటుంది. దాదాపు సగం ప్రాంతానికి సరిపోతూ ఉంటుంది. నకిలీ నోట్లలోనూ ఈ వాటర్మార్క్లో గాంధీజీ ఫొటో ఉన్నా.. దాని చుట్టూ ఖాళీ ఎక్కువగా ఉంటుంది. -
రాజకీయాల్లో సైన్యం జోక్యం చేసుకోవద్దు
ఇస్లామాబాద్: రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని పాక్ సైన్యాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఐఎస్ఐలాంటి గూఢచార సంస్థలు కూడా చట్టం పరిధిలోనే పని చేయాలని తేల్చిచెప్పింది. 2017లో తెహ్రీక్ ఏ–లబ్బైక్ పాకిస్తాన్ (టీఎల్పీ) ఇతర చిన్న గ్రూపులతో కలసి చేసిన ఫైజాబాద్ ఆందోళనకు సంబంధించిన వ్యవహారంలో కోర్టు విచారణ జరిపింది. ‘తీవ్రవాదం, ఉగ్రవాదం, విద్వేషాలు..’రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఆదేశించింది. ‘విద్వేషాలు, తీవ్రవాదం, ఉగ్రవాదం వ్యాప్తి కార్యక్రమాల్ని నియంత్రించాలని ప్రభుత్వాల్ని ఆదేశిస్తున్నాం. ఈ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై విచారణ జరిపి చట్టాన్ని అనుసరించి శిక్షించాలి..’అని జస్టిస్ ఖాజీ ఫయిజ్ ఇసా, జస్టిస్ ముషీర్ అలంల బెంచ్ వ్యాఖ్యానించింది. అలాగే ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, సైన్యం, దాని కింద నడిచే ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఏజెన్సీలు సైతం చట్టానికి లోబడే పనిచేయాలని తెలిపింది. -
గురుద్వారలో భారత అధికారులకు నో ఎంట్రీ
ఇస్లామాబాద్ : లాహోర్ సమీపంలోని ఫరూఖాబాద్ గురుద్వారను సందర్శించే భారత యాత్రికులను కలుసుకునేందుకు భారత హైకమిషన్ అధికారులను పాకిస్తాన్ మరోసారి అడ్డగించింది. నాన్కన సాహిబ్, గురద్వార వద్ద గురునానక్ దేవ్ 550వ జయంతోత్సవాలు నిర్వహిస్తుండగా రంజిత్ సింగ్, సునీల్ కుమార్ల నేతృత్వంలో ఇస్లామాబాద్ నుంచి చేరుకున్న భారత దౌత్య బృందాన్ని ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) అధికారులు నిలువరించారు. మరోవైపు గురుద్వార వెలుపల సైతం వారి పట్ల పాక్ అధికారులు అమర్యాదకరంగా వ్యవహరించారు. భారత అధికారులను గురుద్వార లోనికి రాకుండా సిక్కుల రూపంలో ఐఎస్ఐ ఏజెంట్లు అడ్డుకున్నారు. భారత్లో ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో ఎన్నో గురుద్వారాలు ఉన్నా ఎక్కడా వాటిలో ప్రవేశించేందుకు నియంత్రణలు లేవని, గురుద్వారలోనికి రాకుండా కొందరు అడ్డుతగలడం తాము తొలిసారిగా చూస్తున్నామని భారత దౌత్యవేత్త చెబుతున్న వీడియో పాక్ దమననీతిని వెల్లడించింది. గురుద్వార పవిత్రతకు భంగం వాటిల్లేలా పాక్ అధికారులు వ్యవహరించారని మండిపడ్డారు. మరోవైపు సాధారణ యాత్రికుల తరహాలోనే తమను గురుద్వారలోకి అనుమతించాలని భారత దౌత్యవేత్త పాకిస్తాన్ అధికారులను కోరగా పంజాబి సిఖ్ సంఘటన్ చీఫ్ గోపాల్ సింగ్ చావ్లా ఆయనతో వాదనకు దిగి మరో రోజు గురుద్వారను సందర్శించాలని సూచించారు. ఇక భారత దౌత్యవేత్తలను తాము గురుద్వారలోకి అనుమతించే పరిస్థితిలో లేమని సిక్కు ప్రముఖులు రమేష్ సింగ్ అరోరా, తారా సింగ్ ప్రధాన్లు తేల్చిచెప్పారు. కాగా పాకిస్తాన్ను సందర్శించే సిక్కు యాత్రికులను కలుసుకునేందుకు భారత హైకమిషన్ అధికారులను పాకిస్తాన్ నిలువరిస్తుంటే పాకిస్తాన్ యాత్రికులతో కలిసి సర్హింద్ షరీఫ్లో చద్దర్ సమర్పించేందుకు భారత్లో పాక్ హైకమిషనర్ను భారత్ అనుమతించింది. -
ఐఎస్ఐ చీఫ్గా అసిమ్ మునీర్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ నియమితులయ్యారు. ప్రస్తుత ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముఖ్తార్ ఈ నెల 1న రిటైరైన నేపథ్యంలో కొత్త చీఫ్గా మునీర్ను నియమిస్తున్నట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. ఈ నెల 25న ఆయన పదవీ బాధ్యతలు చేపడతారని తెలిపింది. 2016 డిసెంబర్ నుంచి ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్(డీజీ)గా ఉన్న ఆయన గతంలో మిలిటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ) అధిపతిగా ఉన్నారు. -
హత్యల వెనుక పాక్ పాత్ర..!
శ్రీనగర్ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన జమ్మూ కశ్మీర్ జవాన్ల హత్య వెనుక బయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కశ్మీర్లోని రామ్గడ్ సెక్టార్తో పాటు.. సరిహద్దులో ముగ్గురు ప్రత్యేక ఎస్వీవోలను పాక్ ఉగ్రవాదులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. కశ్మీర్లో జవాన్ల హత్యలను తీవ్రంగా భావించిన భారత నిఘా వర్గాలు దీని వెనుక పాకిస్తాన్ గుఢచారి సంస్థ ఐఎస్ఐ పాత్ర ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. సైనికుల పేర్లను ఉగ్రవాదులకు చేరవేసి పక్కా ప్రణాళిక ప్రకారమే వారిని హతమార్చినట్లు ఐబీ వెల్లడించింది. ముందుగా వారిని విధుల నుంచి వైదొలగాల్సిందిగా ఉగ్రవాదులు హెచ్చరించారని అయినా కూడా జవాన్లు వారి బెదిరింపులకు లొంగకపోవడంతో కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా హత్యచేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాకిస్తాన్ నైజాం మరోసారి బహిర్గతమైంది. సైనికుల హత్య వెనుక పాక్ హస్తం ఉన్నట్లు మొదటి నుంచి భావించిన భారత్.. ఐరాసలో జరిగే భారత్-పాక్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పాక్ దుశ్చర్యపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. పాక్ తీరుకు ఖచ్చితంగా తూటాలతోనే సమాధానం చెప్తామని ఆర్మీ ప్రకటించింది. దీంతో సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ సరిహద్దులో భారత సైన్యం భారీగా సైన్యాన్ని మోహరించింది. ఈ నేపథ్యంలో పాక్తో జరగాల్సిన చర్చలను భారత్ రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలతో భారత్పై విరుచుకుపడ్డారు. భారత్ అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని.. తక్కువ స్థాయి కలిగిన వ్యక్తులు ఉన్నత స్థాయి పదవిలో ఉంటే ఇలానే ఉంటుందని మోదీపై ఇమ్రాన్ విషంగక్కారు. -
ఇమ్రాన్ ఖాన్ గెలిస్తే పక్కలో తుపాకే!
సాక్షి, న్యూఢిల్లీ : తాలిబన్ ఖాన్, ముల్లా ఖాన్గా ముద్ర పడిన ‘తెహ్రీక్ ఏ ఇన్సాఫ్’ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ బుధవారం పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో విజయం సాధించినట్లయితే అది అటు పాకిస్థాన్కు, ఇటు భారత్కు అంత మంచిది కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్కు పలు టెర్రరిస్టు సంస్థల నాయకులతో అవినాభావ సంబంధం ఉండడం వల్ల టెర్రరిస్టులు భారత్కు వ్యతిరేకంగా మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. కశ్మీర్ మరింత కల్లోలం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాకిస్థాన్ సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్, సైన్యం, ఐఎస్ఐ మద్దతుగల ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఎన్నికల సర్వేలు తెలియజేస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎక్కడికక్కడ విచారించి శిక్షలు విధించే జుడీషియల్ అధికారాలను పాక్ సైన్యానికి కట్టబెడుతూ పాక్ సుప్రీం కోర్టు ఇటీవల అసాధారణ ఉత్తర్వులు జారీ చేయడం రెండు వ్యవస్థల మధ్య నెలకొన్న బంధాన్ని తెలియజేస్తోంది. ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయాన్ని గుప్పిట్లో పెట్టుకున్న పాక్ సైన్యం, ఐఎస్ఐ మున్ముందు ఇమ్రాన్ ఖాన్ ను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకొని వ్యవహరించే ప్రమాదం ఉంది. మరోవైపు ఐక్యరాజ్య సమితి నిషేధించిన హర్కత్ ఉల్ జిహాద్ నాయకుడు మౌలానా ఫజ్లూర్ రెహమాన్ ఖలీల్తోపాటు, లష్కరే తోయిబా మద్దతుగల మిల్లీ ముస్లిం లీగ్, అహ్లే సున్నావాల్ జమాత్, బరేల్వి సున్నీ ఇస్లామిస్ట్ గ్రూప్, తెహ్రీక్ లబ్బాయిక్ యా రసూల్ అల్లా లాంటి తీవ్రవాద సంస్థల నాయకుల మద్దతు ఇమ్రాన్ ఖాన్కు ఉందని ‘భారత రీసర్జ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)’ మాజీ చీఫ్ విక్రమ్ సూద్ ఇటీవలనే తాను ప్రచురించిన ‘ది అన్ఎండింగ్ గేమ్: ఏ ఫార్మర్ ఆర్ అండ్ ఏడబ్లూ చీఫ్సీ ఇన్సైట్ ఇన్టూ ఎస్పియోనేజ్’ పుస్తకంలో వెల్లడించారు. పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ను ఎన్నుకుంటే పక్కలో బల్లెంలా కాకుండా తుపాకీలా ఉంటాడని ప్రముఖ జర్నలిస్ట్, రచయిత మిన్హాజ్ మర్చంట్ లాంటి వాళ్లు అభివర్ణిస్తున్నారు. -
పాక్లో ఊహించని పరిణామాలు
రావల్పిండి : పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాక్లో ప్రధాన రాజకీయ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్(పీఎంఎల్-ఎన్)కు చెందిన నేతలకు పలు కేసుల్లో శిక్షలు విధిస్తూ కోర్టు తీర్పులు వెలువడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే స్వదేశంలో అడుగుపెట్టిన ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ను, ఆయన కూతురు మరియమ్ను పాక్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు హనీఫ్ అబ్బాసీకి జీవిత ఖైదు విధిస్తూ సీఎన్ఎస్ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు రావల్పిండిలోని పాక్ ఆర్మీ హెడ్క్వార్టర్స్ ముందర ఆందోళనకు దిగారు. పాక్ ఆర్మీ గూఢచారి సంస్థ ఐఎస్ఐ(ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్)కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జూలై 25న జరిగే ఎన్నికల్లో తాము అనుకున్న వారిని గెలిపించుకోవడానికి ఐఎస్ఐ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు. తీవ్రవాదం వెనుక పాక్ ఆర్మీ హస్తం ఉందని విమర్శించారు. యూఎస్ కూడా పాక్ ఎన్నికల్లో ఉగ్రవాదులు పోటీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల క్రితం ఇస్లామాబాద్ హైకోర్టు న్యాయమూర్తి షౌకత్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. ఐఎస్ఐ మీడియాను, న్యాయవ్యవస్థను కంట్రోల్ చేస్తుందని అన్నారు. రావల్పిండి బార్ అసోసియేషన్ కూడా ఐఎస్ఐపై తీవ్ర స్థాయిలో మండిపడింది. కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా వచ్చేలా న్యాయమూర్తులపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. షరీఫ్, మరియమ్ కేసుల్లో కూడా అలానే జరిగిందని అన్నారు. కాగా పాక్ మాజీ క్రికెటర్, పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ను అధికారంలోకి తీసుకురావడానికి పాక్ ఆర్మీ ప్రయత్నిస్తున్నట్టు అంతర్జాతీయ సమాఖ్య భావిస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాది రెహమాన్ ఖలీల్ కూడా పీటీఐ పార్టీకి మద్దతుగా ప్రకటన చేయడం ఆందోళన కలిగించే అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పాక్కు గూఢచర్యం.. భారత సైన్యంలో పెను కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : భారత నిఘా వర్గాల్లో ఓ వార్త కలకలం రేపింది. పాక్కు గూఢచర్యం ఆరోపణలతో ఓ ఉన్నతాధికారిని భద్రతా బలగాలు గురువారం అర్ధరాత్రి దాటాక అదుపులోకి తీసుకున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కెప్టెన్ అరుణ్ మార్వా ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. గత కొన్ని నెలలుగా ఐఎస్ఐకి ఆయన కీలక సమాచారాన్ని అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ఐఎస్ఐ అధికారికి అరుణ్ తన వాట్సాప్ ద్వారా ఫోటోలు, కొన్ని పత్రాలను పంపించారు. కీలకమైన సమాచారాన్నే ఆయన పాక్ నిఘా సంస్థకు అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం అరుణ్ని రహస్య ప్రాంతానికి తరలించి విచారణ చేపట్టారు. -
'జాదవ్ కిడ్నాప్కు ఉగ్రవాదులకు కోట్లిచ్చారు'
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్దేశ పూర్వకంగానే భారతీయుడు కులభూషణ్ జాదవ్ను పాకిస్థాన్ కిడ్నాప్ చేసినట్లు మరోసారి స్పష్టమైంది. కోట్లు చెల్లించి ఆయనను పాక్ కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. మామా ఖదీర్ అనే బలోచిస్తాన్కు చెందిన ఓ సామాజిక ఉద్యమకారుడు ఈ విషయం వెల్లడించారు. 'ఇరాన్ నుంచి ముల్లా ఓమర్ అనే ఉగ్రవాది కులభూషణ్ జాదవ్ను కిడ్నాప్ చేశాడు. పాకిస్థాన్ కోట్లలో డబ్బులు ఇవ్వడంతోపాటు ఆదేశ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకే ఈ పనిజరిగింది. ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసిన జాదవ్ను ఇస్లామాబాద్కు క్వెట్టా మీదుగా తీసుకెళ్లి తీవ్రంగా అతడిని హింసించారు. అలా ఆయనతో తమ దేశానికి అనుకూలమైన ప్రకటనలు చెప్పించడం పాక్ మొదలుపెట్టింది. బలోచిస్తాన్లో ఎవరు అదృశ్యం అయినా, హత్యకు గురైనా దాని వెనుక పాకిస్థాన్, దాని సంస్థ ఐఎస్ఐ హస్తం ఉంటుంది' అని ఆయన అన్నారు. -
బెనజీర్ హత్య.. విస్మయపరిచే వాస్తవం!
కరాచి : పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో సంచలన విషయాన్ని పాక్ వెల్లడించింది. ఆమె హత్య కుట్ర వెనక ఉంది ఆల్ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్లాడెన్ అని పేర్కొంది. ఆమె మరణించి పదేళ్లు పూర్తి కావస్తున్నందున(డిసెంబర్ 27, 2017) పాక్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐ రూపొందించిన ఓ నివేదికను ప్రభుత్వం బయటపెట్టింది. అల్ ఖైదా, బిన్ లాడెన్ ఆధ్వర్యంలోనే ఆమె హత్యకు ప్రణాళిక రచించారు. అంతేకాదు ఆ సమయంలో బెనజీర్తోపాటు ముషార్రఫ్, జమైత్ ఉలేమా ఈ ఇస్లాం ఫజల్ చీఫ్ ఫజ్లుర్ రెహమాన్ను కూడా లేపేయాలని లాడెన్ నిర్ణయించుకున్నాడు. ఇందుకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆర్మీ అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. ‘లాడెన్ తన కొరియర్ ముసా తరీఖ్ను ముల్తాన్కు పంపించాడు. వజిరిస్థాన్ నుంచి పెద్ద ఎత్తున్న పేలుడు పదార్థాలను ముసా తీసుకెళ్లాడు. వచ్చే ఆదివారం (డిసెంబర్ 22న) భారీ నర మేధానికి అల్ఖైదా శ్రీకారం చుట్టింది’ అంటూ ఓ లేఖ ఆర్మీకి అందింది. మరుసటి రోజు అంటే సరిగ్గా ఆమె హత్యకు ఆరు రోజుల ముందు మరో హెచ్చరిక కూడా జారీ అయ్యింది. కానీ, ఆమె మాత్రం వాటిని పెడచెవిన పెట్టారు. ఇక ఆ ఫ్లాన్ మొత్తం అఫ్ఘనిస్థాన్ నుంచి లాడెన్ స్వయంగా పర్యవేక్షించాడంట. ఈమేరకు డిసెంబర్ 27, 2007న రావల్పిండి వద్ద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమెను బాంబు దాడిలో హత్య చేశారు. ఆమె హత్యానంతరం తమ ఫ్లాన్ సక్సెస్ అయినట్లు ఓ లేఖ కూడా లాడెన్కు అందినట్లు ఐఎస్ఐ పేర్కొంది. పరిస్థితులు చల్లబడ్డాకే లాడెన్ తిరిగి పాక్కి తిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది. పర్యవేక్షణ చేసింది లాడెనే అయినా ఆమె మరణం ద్వారా ఎక్కువ లబ్ధి(రాజకీయ) పొందాలనుకున్న వారే ఈ కుట్ర వెనుక ఉన్నారన్నది ఆమె అనుచరుల వాదన. అయితే అది ఎవరన్న ప్రశ్న పదేళ్ల తర్వాత కూడా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కాగా, తమ భూభాగంలో లాడెన్ తలదాచుకోలేదని పాక్ వాదించినప్పటికీ.. అమెరికా భద్రతా దళాలు మాత్రం అబ్బోట్టాబాద్లో లాడెన్ ను(2011 మే నెలలో) మట్టుపెట్టిన విషయం తెలిసిందే. -
దావూద్ రైట్ హ్యాండ్.. రకరకాల కథలు
సాక్షి, న్యూఢిల్లీ : దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు, గ్యాంగ్స్టర్ ఛోటా షకీల్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దావూద్ కుడి భుజంగా మెదులుతూ దశాబ్దాలుగా డీ-గ్యాంగ్ కార్యకలాపాలను షకీలే చూసుకుంటున్నాడు. అయితే అతను ఇప్పుడు ప్రాణాలతో లేడనేది దాని సారాంశం. దీనికి రకరకాల కథనాలు వినిపిస్తుండగా.. అందులో ఓ కోణం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. పాక్ నిఘా సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ISI) అతన్ని ప్రాణాలు తీసిందంట. షకీల్కు, దావూద్కు మనస్ఫర్థలు వచ్చాక.. వారి మధ్య సయోధ్య కోసం ఐఎస్ఐ మధ్యవర్తిత్వం వహించిందని... అయితే అది విఫలం కావటంతో షకీల్ ఏక్షణానైనా తమ దేశానికి వ్యతిరేకంగా మారి భారత్కు సహకరిస్తాడన్న ఉద్దేశంతోనే చంపిందన్నది ఆ కథనం సారాంశం. చంపేశాక శవాన్ని సీ-130 రవాణా విమానంలో కరాచీకి తరలించి. గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారని.. ఈ విషయం ప్రపంచానికి తెలీకుండా చాలా జాగ్రత్త పడ్డారంట. ఇక షకీల్ కుటుంబ సభ్యులను లాహోర్లోని ఓ ఇంటికి తరలించారని... దావూద్కు కూడా ఈ సమాచారం ఆలస్యంగా చేరిందనేది అందులో పేర్కొని ఉంది. ఇక మిగతా కథల్లో.. జనవరి 6, 2017న ప్రత్యర్థులు అతన్ని చంపారని.. ఈ మేరకు అతని గ్యాంగ్కు చెందిన బిలాల్కు ముంబైకి చెందిన ఓ గ్యాంగ్ స్టర్కు మధ్య జరిగిన ఆడియో సంభాషణల టేపు ఒకటి చక్కర్లు కొడుతోంది. గుండెపోటుతో మరణించాడనేది మరో కథనం వినిపిస్తోంది. మరో కథలో అతను ప్రాణాలతోనే ఉన్నాడని.. దావూద్తో సంబంధాలను తెగదెంపులు చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాడని చెబుతున్నారు. కానీ, గతంలో ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో షకీల్ మాట్లాడుతూ.. తన తుది శ్వాస వరకు భాయ్(దావూద్) తోనే ఉంటాడని చెప్పటం చూశాం. ఏది ఏమైనా ప్రస్తుతం అతని జాడ అంతుచిక్కకపోవటంతో అతను బతికున్నాడా? లేదా? అన్న విషయంపై భారత నిఘా వర్గాల్లో కూడా స్పష్టత కొరవడింది. గతంలో దావూద్ విషయంలో కూడా ఇలాగే అనారోగ్యం.. చావుబతుకుల్లో ఉన్నాడంటూ వార్తలు రావటం చూశాం. దావూద్ కోసం భారత్ మాస్టర్ ప్లాన్ ఇది కూడా చదవండి -
డీ గ్యాంగ్లో సంక్షోభం
ఇస్లామాబాద్ : ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితులు.. దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీంకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న చోటా షకీల్ కొన్నాళ్లుగా కరాచీలో ప్రత్యేకంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విబేధాల వల్ల దావూద్ను చోటా షకీల్ కలిసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని చీకటి సామ్రాజ్యంలో గుసగులు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాకిస్తాన్ నిఘా సంస్థ అయిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్లు ఒక రిపోర్ట్ ద్వారా బయటకు తెలిసింది. వీరిద్దరూ విడిపోతే భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించలేమని ఐఎస్ఐ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. దాదాపు మూడు దశాబ్దాలుగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చోటా షకీల్ అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. దావూద్ కుడి భుజంగా చోటాషకీల్ను డీ గ్యాంగ్ పిలుచుకుంటారు. దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీం వల్ల ఇద్దరి మధ్య విభేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. డీ గ్యాంగ్ నిర్వహణలో అనీస్ జోక్యం పెరిగిపోవడంతో చోటా షకీల్ దావూద్తో విభేధించినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో చోటా షకీల్ తాజాగా తూర్పు ఆసియా దేశాల్లోని ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఇదిలాఉండగా.. చోటా షకీల్-దావూద్ ఇబ్రహీం మధ్య తిరిగి సయోధ్య నెలకొల్పేందుకు ఐఎస్ఐ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. డీ గ్యాంగ్ సహకారం వల్ల అప్పట్లో ముంబై వరుస బాంబు పేలుళ్లు పాకిస్తాన్ తెగబడింది. ఈ నేపథ్యంలోనే వారిని కలిపేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
భారత్కు పెనుముప్పు
భారత్కు పాకిస్తాన్ను నుంచి పెనుముప్పు పొంచి ఉందా? మిలిటెంట్లకు ఐఎస్ఐ, పాక్ ఆర్మీ సహకారాలు అందిస్తోందా? జీవరసాయన ఆయుధాలతో ఉగ్రవాదులు భారత్పైకి దాడికి దిగుతారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. న్యూఢిల్లీ: పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముక్తార్, ఐఎస్ఐ ఇతర ఉన్నతాధికారులు ఈ మధ్యే ఉగ్రవాదులతో ప్రత్యేకంగా సమావేశమయినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని నిఘా సంస్థలు తెలిపాయంటూ ‘టైమ్స్ నౌ’ వెల్లడించింది. ఉగ్రవాదులు, ఐఎస్ఐ సమావేశంలో ప్రధానంగా జీవరసాయన ఆయుధాలను ఉపయోగించడంపై చర్చించినట్లు సమాచారం. దశాబ్దాల కాలంగా ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ శిక్షణ, ఆయుధాలు, ఇతర సదుపాయాలను కల్పిస్తోందన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. భారత నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. అక్టోబర్ 9న భాగ్ జిల్లాలోని చాకోటి ప్రాంతంలో (పాక్ ఆక్రమిత కశ్మీర్) ఐఎస్ఐ చీఫ్ నవీద్, ఐఎస్ఐ ఉన్నతాధికారులు బ్రిగేడియర్ హఫీజ్ అహ్మద్, లెఫ్టినెంట్ కల్నల్ జావేద్ అహ్మద్, మేజర్ జాఫర్ ఆలీ, పాకిస్తాన ఆర్మీ కెప్టెన్ మన్సూర్ ఆలీ, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థల నేతలు జుద్దాఖాన్, జావేద్ అఖ్తర్లతో సమావేశమయినట్లు నిఘా వర్గాలు ప్రకటించాయి. ఈ సమావేశంలో ప్రధానంగా శీతాకాలం వచ్చే లోపు వీలైనంత మంది ఉగ్రవాదులను భారత్లోకి పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్కు చెందిన 20 మంది సైనికాధికారులు ఇప్పటికే చైనాలో జీవరసాయన యుద్ధాల్లో మెళుకువలు నేర్చుకుంటున్నారని.. వారు తిరిగిరాగానే.. వీరి ద్వారా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తామని ప్రకటించినట్లు తెలిసింది. ఉగ్రవాదులు జీవరసాయన యుద్ధానికి దిగితే భారత్కు భారీ నష్టం కలుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఐఎస్ఐ టార్గెట్ గుజరాత్!
అహ్మదాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాకిస్తాన్ ఐఎస్ఐ గుజరాత్లో భారీ విధ్వంసానికి పూనుకోవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాక్ దళాలు ఇటీవల సరిహద్దు తీరంలో నాలుగు భారత ఫిషింగ్ బోట్లను, వాటి సిబ్బంది నుంచి యూఐడీలను స్వాధీనం చేసుకోవడంతో గుజరాత్పై 26/11 తరహా దాడులకు పాక్ ప్రేరేపించవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల ర్యాలీలు, జనసమూహాలపై పాక్ ఉగ్రవాదులు దాడులతో తెగబడవచ్చని నిఘా వర్గాలు హెచ్చరిస్తూ అధికారులను అప్రపమత్తం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్టార్ క్యాంపెయినర్లుగా ఉండటంతో ఎన్నికలు జరుగుతున్న గుజరాత్ లక్ష్యంగా సముద్ర మార్గం నుంచి ఉగ్రవాదులను ఐఎస్ఐ పంపవచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. భారత ఫిషింగ్ బోట్స్ను, వాటి యూఐడీలను సీజ్ చేసిన పాక్ అధికారులు ఇతర బోట్లపై ఆ యూఐడీలను అమర్చి భారత బోట్స్గా అధికారుల కళ్లుగప్పి మిలిటెంట్లను గుజరాత్లో చొప్పించే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని మోదీ స్వరాష్ట్రం కావడంతో గుజరాత్లో మారుమూల ప్రాంతాలకు వెళ్లి ప్రచారం చేయనుండటం, యూపీ సీఎం ద్వారకా వంటి పలు తీర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ర్యాలీల్లో పాల్గొననుండటంతో పాక్ ఉగ్రవాదులు సముద్ర మార్గం నుంచి చొచ్చుకువచ్చి దాడులకు తెగబడే అవకాశాలు తోసిపుచ్చలేమని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. నవంబర్ 2008లో మత్స్య నౌక ఎంవీ కుబేర్ను హైజాక్ చేసి పాక్ మిలిటెంట్లు ముంబయిలో మారణహోమం సృష్టించిన అనంతరం అధికారులు మత్స్యకారులకు బయోమెట్రిక్ కార్డులు, యూనిక్ ఐడెంటిఫికేషన్ డివైజ్లు (యూఐడీ) అందచేస్తున్నారు. -
ఐఎస్ఐ భారీ కుట్ర.. భారత్పైకి హంతక ముఠా
ఇస్లామాబాద్ : 'ఉగ్రవాదులను అణచివేస్తున్నామంటూ పాకిస్థాన్ ప్రభుత్వం చెబుతుంటే ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ మాత్రం ఉగ్రవాదులతో సంబంధాలు నెరుపుతోంది' ఈ మాటలు స్వయంగా అగ్రరాజ్యం అమెరికా అన్నది. ఇప్పుడు తాజాగా బయటకు తెలిసిన విషయం వింటే ఆ మాటలు నిజమేనేమో అనిపించకమానదు. ఎందుకంటే భారత్పై దాడులకు ఉసిగొలుపుతూ ఐఎస్ఐ ఒక ముఠాను తయారు చేసింది. దానికి హలాల్ దస్తా అనే పేరు పెట్టి ఇప్పటికే ప్రారంభించింది. హలాల్ దస్తా అనగా హంతకుల ముఠా.. ఇందులో ఉన్నవాళ్లంతా బ్యాన్ చేసిన లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులని భారత్కు చెందిన టాప్ ఇంటెలిజెన్స్ సంస్థ హెచ్చరించింది. ఆయా వర్గాల సమాచారం ప్రకారం ఈ హంతక ముఠా ఇప్పటికే భారత్ వైపు బయలుదేరిందట. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న జమ్ముకశ్మీర్లోని సురాన్కోట్, పూంచ్ జిల్లాల్లో దాడులే లక్ష్యంగా ఈ ముఠా కదిలింది. స్వయంగా పాకిస్థాన్ ఆర్మీకి చెందిన యాక్షన్ టీం పనిచేసే ప్రాంతం నుంచే ఈ ముఠాతో భారత్పై దాడులు చేయించేందుకు సిద్ధం చేసి ఐఎస్ఐ భారత్కు పంపిస్తుంది. గతవారమే పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీం భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. -
ఐఎస్ఐకి ఉగ్ర సంస్థలతో లింకులు
వాషింగ్టన్: పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని, సొంత విదేశాంగ విధానంతో అది ముందుకు వెళుతోందని అమెరికా తొలిసారి బహిరంగంగా ప్రకటించింది. భారత్, అఫ్గాని స్తాన్ కూడా గతంలో చాలా సార్లు ఐఎస్ఐకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన సంగతి తెలిసిందే. అమెరికా తాజా ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది. ఉగ్రవాద సంస్థలకు సంబంధించి పాక్ దర్యాప్తు సంస్థలకు కీలకమైన సమాచారం అందించేది ఐఎస్ఐనే అని స్పష్టం చేసింది. కీలకమైన సెనెట్ విదేశాంగ సంబంధాల కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ జోసెఫ్ డన్ఫోర్డ్ మాట్లాడుతూ.. ‘ఐఎస్ఐకి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనేది మాకు స్పష్టంగా తెలుసు’అని కుండబద్ధలు కొట్టారు. ఐఎస్ఐ ఇప్పటికీ తాలిబన్లకు సహాయం అందిస్తోందా? అని సెనెటర్ జో డోనెల్లీ అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానం చెప్పారు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్తో ద్వైపాక్షిక సంబంధాల్లో మార్పునకు అమెరికా చర్యలు తీసుకుంటు న్నట్టు డన్ఫోర్డ్ చెప్పారు. అయితే బహుముఖ వ్యూహంతోనే పాక్ వైఖరిలో మార్పు తేగలమన్నారు. రక్షణ శాఖ మంత్రి జేమ్స్ మాటిస్ కూడా ఐఎస్ఐపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు పాక్ ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే.. మరోవైపు ఐఎస్ఐ సొంత విదేశాంగ విధానాన్ని అమలు చేస్తూ ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తోందని ఆరోపించారు. పాక్ విదేశాంగ మంత్రి ఖావాజా ఆసిఫ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం వాషింగ్టన్ చేరుకున్న కొన్ని గంటలలోనే ట్రంప్ యంత్రాంగం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్ నుంచీ సాయం పొందొచ్చు.. పాక్ ఉగ్రవాద సంస్థలకు సహాయం చేయడం మానేస్తే.. భారత్ నుంచి కూడా భారీగా ఆర్థిక సాయాన్ని పొందవచ్చని అమెరికా రక్షణ మంత్రి మాటిస్ చెప్పారు. పాక్ వైఖరిలో మార్పు తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని, అంతర్జాతీయ సమాజంతో కలసి పనిచేస్తామని చెప్పారు. వారం క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కు వ్యతిరేకంగా అఫ్గానిస్తాన్, దక్షిణాసియా పాలసీని ప్రకటించిన నేపథ్యంలో మాటిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. అఫ్గానిస్తాన్లోనే కాక దక్షిణాసియాలో స్థిరత్వం కొనసాగాలని తాము కోరుకుంటున్నామని మాటిస్ చెప్పారు. మరోవైపు వివాదాస్పద ప్రాంతమైన పీఓకేలోంచి చైనా–పాక్ ఎకనమిక్ కారిడార్ వెళ్లడంపై భారత్ అభ్యంతరాలకు అమెరికా మద్దతు తెలిపింది. ప్రస్తుత ప్రపంచీకరణ సమాజంలో ఎన్నో బెల్ట్లు, ఎన్నో రహదారులు ఉన్నాయని, వీటికి సంబంధించి ఏ ఒక్కదేశమో నియంతృత్వ వైఖరిని అవలంభించడం కుదరదని మాటిస్ చెప్పారు. -
పాక్పై అమెరికా సంచలన ఆరోపణలు
వాషింగ్టన్ : పాకిస్థాన్పై అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకు ఉగ్రవాద సంస్థలతో నేరుగా సంబంధాలున్నాయని, ఇందులో తమకు ఏమాత్రం అనుమానం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్స్ చైర్మన్ జనరల్ జోసెఫ్ డన్ఫోర్డ్ అన్నారు. విదేశాంగ వ్యవహారాల కమిటీ సమావేశం అయిన సందర్భంగా సెనేటర్ జో డోన్లీ అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. భారత్, అప్ఘనిస్థాన్ ఎప్పటి నుంచో పాక్ కు చెందిన ఐఎస్ఐను ఉగ్రవాదులతో సంబంధం ముడిపెడుతున్నాయని, మీరు కూడా ఆ విషయాన్ని నమ్ముతున్నారా అని జో ప్రశ్నించగా డోన్లీ స్పందిస్తూ 'ఉగ్రవాద గ్రూపులతో ఐఎస్ఐకు సంబంధాలు ఉన్నాయనే విషయం స్పష్టం' అని నిర్మొహమాటంగా చెప్పారు. అమెరికా గతంలోనే అమెరికా వైఖరిని మార్చేందుకు పలుమార్లు ప్రయత్నించిందని, అయినప్పటికీ అక్కడి ప్రభుత్వ పెద్దలు ఒక మాదిరిగా నిఘా సంస్థ మాత్రం ఒక తీరుగా పనిచేస్తుందని చెప్పారు. ఐఎస్ఐ ప్రత్యేక విదేశాంగ విధానం ఉందని కూడా ఆయన ఆరోపించారు. పాకిస్థాన్ను మార్చేందుకు మరో మార్గం ఉందని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రయత్నించామని, సరిగ్గా పరిశీలిస్తే స్వయంగా ఉగ్రవాదులను వదిలిపెట్టిన సంఘటనలు కూడా ఎన్నో చూస్తామని తెలిపారు. 'పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పడగొడతామని చెబుతుంది. కానీ, ఐఎస్ఐ మాత్రం సొంత విదేశాంగ విధానంతో ముందుకెళ్లడం మనం చూస్తాం' అని ఆయన చెప్పారు. -
భారత్, పాక్ మ్యాచ్పై ఐసీసీ ప్రకటన
-
భారత్-పాక్ మ్యాచ్పై ఉగ్ర దాడి..!
చాంపియన్స్ ట్రోఫిలో భాగంగా భారత్-పాకిస్తాన్ల బర్మింగ్హామ్లోని ఎడ్గ్బాస్టన్ మైదానాంలో జరగనున్న వన్డే మ్యాచ్పై ఐఎస్ఐ కన్ను పడింది. దాదాపు 14 మంది ఐఎస్ఐ ఏజెంట్లు ఇరుదేశాల మధ్య మ్యాచ్ను వీక్షించేందుకు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్నట్లు తెలిసింది. మ్యాచ్ సందర్భంగా కశ్మీర్ వివాదంపై పోస్టర్లను ప్రదర్శించాలని ఐఎస్ఐ వీరిని కోరినట్లు సమాచారం. కశ్మీర్కు స్వతంత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏ3 ప్లకార్డులను ప్రదర్శించాలని ఐఎస్ఐ వారి ఏజెంట్లతో పేర్కొన్నట్లు తెలిసింది. 'కశ్మీర్ తన వైపు చూడాలని కోరుకుంటోంది. కశ్మీర్ రక్తం కారుస్తోంది. మేం కశ్మీర్కు దన్నుగా నిలుస్తాం. జమ్మూకశ్మీర్కు స్వతంత్రం ఇవ్వాలి.' అనే నాలుగు నినాదాలను ప్ల కార్డుల్లో ఉంచాలని ఏజెంట్లను ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు శనివారం రాత్రి లండన్లో ఉగ్రదాడుల జరిగిన విషయం తెలిసిందే. దీంతో బర్మింగ్హామ్లోని ఎడ్గ్బాస్టన్ గ్రౌండ్లో జరగనున్న భారత్, పాకిస్తాన్ మీద ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఇంగ్లండ్ ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు వర్షం కూడా అంతరాయం కలిగించే అవకాశం ఉంది. -
'ప్రపంచ మ్యాప్లో పాక్ ఉండదు'
-
పక్కలో ఉగ్ర బల్లెం
‘ఉగ్ర’బల్లెం మన పక్కలోనే పొంచి ఉంది. ఆదమరచిన క్షణాల్లో అదను చూసి వెన్నుపోట్లు పొడుస్తోంది. మన దేశమ్మీద ‘ఉగ్ర’దాడులకు తెగబడుతున్నది ముష్కర మూకల ముఠాలే కాదు, పొరుగు సైన్యమే సరి‘హద్దు’మీరి మరీ మన గడ్డ మీదకు చొరబడుతోంది. మన సైనికులను అతి కిరాతకంగా హింసించి, తలలను తెగనరికి పొట్టన పెట్టుకుంటోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తోంది. నియంత్రణ రేఖ వద్ద సరిహద్దుల పొడవునా అడపా దడపా తూటాల వర్షం కురిపిస్తూ నెత్తుటి కళ్లాపు చల్లుతోంది. శాంతి కోరుకునే మన దేశం సహనం, సంయమనం ప్రదర్శిస్తున్న కొద్దీ పొరుగు దేశం మరింతగా రెచ్చిపోతోంది. పొరుగు దేశం ఇదే పంథాను కొనసాగిస్తే ఏదో ఒకరోజు మన దేశానికీ సహనం నశించక తప్పదు. అదే జరిగితే యుద్ధం అనివార్యమవక తప్పదు. ధూర్త దేశం... ‘ఉగ్ర’ సైన్యం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అవిభక్త భారత భూభాగం నుంచి విడివడినప్పటి నుంచి పాకిస్థాన్ ధూర్త దేశంగానే మనుగడ సాగిస్తోంది. భారత్తో జరిగిన యుద్ధాలతో చావుదెబ్బలు తిన్న తర్వాత పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాద సంస్థలకు తీసిపోని రీతిలో ఘాతుకాలకు తెగబడుతోంది. భారత్తో నేరుగా యుద్ధానికి తలపడితే ఓటమి తప్పదన్న ఎరుకతోనే దొంగచాటు దాడులకు పాల్పడుతోంది. పాక్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కూడా ఉగ్రవాద సంస్థలకు సర్వం సమకూరుస్తూ, వాటిని భారత్పై దాడులకు ప్రేరేపిస్తోంది. లష్కరే తోయిబా, లష్కరే ఒమర్, అల్ కాయిదా, జైషే మహమ్మద్, జమాత్ ఉద్ దావా వంటి ఉగ్రవాద సంస్థలకు ఆర్థికసాయం, ఆయుధ సాయం కల్పిస్తున్న పాక్ సైన్యం, ఐఎస్ఐ సంస్థలేనన్నది బహిరంగ రహస్యం. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ సురక్షిత స్థావరంగా ఉంటోంది. పాక్లో తలదాచుకుంటూ దాదాపు 43 ఉగ్రవాద సంస్థలు క్రియాశీలంగా పనిచేస్తున్నట్లు ఒక అంచనా. అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదానికి తాను వ్యతిరేకమని చెప్పుకొనే పాకిస్థాన్, ఆచరణలో మాత్రం ఎప్పటికప్పుడు ఉగ్రవాద సంస్థలకు అన్ని విధాలా అండదండలు అందిస్తూ వస్తోంది. ‘ఉగ్ర’ మూకలను భారత్ మీదకు మాత్రమే కాదు, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల మీదకూ ఎగదోస్తోంది. ప్రపంచవ్యాప్త పరిస్థితి ఉగ్రవాదం ఏ ఒకటి రెండు దేశాలకు మాత్రమో పరిమితమైన సమస్య కాదు. ఇది ప్రపంచమంతటికీ ఆందోళన కలిగిస్తున్న బెడద. ఉగ్రవాదుల దాడుల కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన మొదటి పది దేశాల్లో భారత్ కూడా ఉండటం ఆందోళనకరం. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ (జీటీఐ) గత ఏడాది 2015 నాటి గణాంకాలను వెల్లడించింది. వాటి ఆధారంగా ఉగ్రవాదుల దాడుల కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన మొదటి పది దేశాల వివరాలు... పాక్ సైన్యం పాపాల చిట్టా భారత సైన్యంపై దారుణాలకు తెగబడటం పాకిస్థాన్ సైన్యానికీ, ఉగ్రవాద సంస్థలకు కొత్త కాదు. కార్గిల్ యుద్ధంలో పట్టుబడిన కెప్టెన్ సౌరభ్ కాలియాను పాక్ సైన్యం చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపింది. ఛిద్రమైన అతడి మృతదేహాన్ని భారత్కు పంపింది. కార్గిల్ యుద్ధం ముగిసిన మరుసటి ఏడాదే... 2000 ఫిబ్రవరిలో పాక్ ఉగ్రవాది ఇల్యాస్ కశ్మీరీ నేతృత్వంలోని ‘ఉగ్ర’మూక సరిహద్దులు దాటి వచ్చి నౌషేరా సెక్టార్లో భారత సైన్యంపై దాడికి తెగబడింది. ఆ దాడిలో ఉగ్రవాదులు ఏడుగురు సైనికులను చంపేయడమే కాక, మృతులలో ఒకరైన భావుసాహెబ్ మారుతి తలను నరికి పాకిస్థాన్కు తీసుకుపోయారు. సరిహద్దుల వద్ద గస్తీ తిరుగుతున్న గూర్ఖా రైఫిల్స్ సిపాయి ఒకరు 2008లో దారి తప్పి కేల్ సెక్టార్ వద్ద పాకిస్థానీ బోర్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ) దళాల చేతికి చిక్కాడు. బీఏటీ దళాలు అతడిని తలనరికి దారుణంగా చంపాయి. కొద్దిరోజుల తర్వాత భారత భూభాగంలో ఆ సిపాయి తలలేని మొండెం మాత్రమే దొరికింది. పాక్ బీఏటీ బలగాలు 2013 జనవరిలో భారత భూభాగంలోకి చొరబడి దాడికి తెగబడ్డాయి. ఆ దాడిలో బీఏటీ ముష్కరులు లాన్స్ నాయక్ హేమ్రాజ్ను చిత్రవధ చేయగా, మరో లాన్స్ నాయక్ సుధాకర్ సింగ్ తలను తెగనరికారు. గత ఏడాది అక్టోబర్ 28న మచిల్ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖకు చేరువలో పాక్ మీదుగా చొరబడ్డ ఉగ్రవాదులు భారత జవాను ఒకరిని దారుణంగా చంపి, అతడి మృతదేహాన్ని ఛిద్రం చేశారు. అంతులేని అకృత్యాలు పాకిస్థాన్ సైన్యం, గూఢచర్య సంస్థ ఐఎస్ఐ, వాటి కనుసన్నల్లో పనిచేసే ఉగ్రవాద మూకలు భారత భూభాగంలో అంతులేని అకృత్యాలను కొనసాగిస్తున్నాయి. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద, అంతర్జాతీయ సరిహద్దుల వద్ద పాక్ సైన్యం మరీ బరితెగింపు చర్యలకు పాల్పడుతోంది. అదను చిక్కినప్పుడల్లా సరిహద్దులు దాటి చొరబాట్లకు తెగబడుతోంది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకపోయినా గత ఏడాది 228 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇటీవల మరింత బరితెగించి, సరిహద్దులు దాటి మరీ భారత భూభాగంలోకి చొరబడి జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లా కృష్ణాఘాటి సెక్టార్ వద్ద గస్తీ తిరుగుతున్న ఇద్దరు జవాన్లను తలలు నరికి అత్యంత కిరాతకంగా చంపింది. పాక్ ఘాతుకానికి బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్, ఆర్మీ నాయబ్ సుబేదార్ పరమ్జీత్ సింగ్ బలైపోయారు. ఈ సంఘటనపై యావత్ భారతదేశం ఆగ్రహంతో రగిలిపోయింది. దేశం కోసం తన తండ్రి చేసిన త్యాగానికి బదులుగా యాభై మంది పాక్ సైనికుల తలలు తెగనరికి తేవాలని బీఎస్ఎఫ్ హెడ్కానిస్టేబుల్ ప్రేమ్సాగర్ కూతురు సరోజ్ ఆక్రోశంతో చేసిన వ్యాఖ్యలు దేశప్రజల మనసులను కలచివేశాయి. ఈ సంఘటన మరువక ముందే దక్షిణ కశ్మీర్ జిల్లాలో సెలవులో ఉన్న ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్ను పాక్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, దారుణంగా చంపారు. మన దేశంలో ‘ఉగ్ర’ ఘాతుకాలు ఉగ్రవాద దాడులు మనదేశంలో మూడు దశాబ్దాలకు పైగా జరుగుతూనే ఉన్నాయి. రక్షణ బలగాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఉగ్రవాదులు అదను చూసి పంజా విసురుతూనే ఉన్నారు. మొట్టమొదటి సారిగా మనదేశంలో 1984 ఆగస్టు 2న చెన్నైలోని మీనంబాకం విమానాశ్రయంలో ‘ఉగ్ర’దాడి జరిగింది. తమిళ ఈలం ఆర్మీ (టీఈఏ) పాల్పడిన ఆ దాడిలో 33 మంది బలయ్యారు. పాక్ ప్రోద్బలం వల్ల 1993 మార్చి 12న ముంబైలో దేశంలోనే అత్యంత విధ్వంసకరమైన పేలుళ్లు జరిగాయి. ఒకేరోజులో ముంబై నగరంలో జరిగిన ఆ వరుస పేలుళ్లలో 257 మంది మరణించగా, 717 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ సంఘటనపై ఇరవయ్యేళ్ల సుదీర్ఘ న్యాయ విచారణ తర్వాత 2013లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతడి అనుచరులు టైగర్ మెమన్, యాకూబ్ మెమన్ సహా పదిమంది నిందితులకు శిక్ష విధించింది. యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష విధించగా, మిగిలిన పదిమందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే, దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్లు ఇప్పటికీ పట్టుబడలేదు. వారిద్దరికీ పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందనేది బహిరంగ రహస్యం. అదను దొరికనప్పుడల్లా అడపా దడపా దాడులకు తెగబడుతూ వస్తున్న ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న మరోసారి ముంబైలో వరుస దాడులకు తెగబడ్డారు. పాకిస్థానీ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన పదిమంది ఉగ్రవాదులు జలమార్గంలో ముంబైలోకి చొరబడి ఛత్రపతి శివాజీ టెర్మినస్, తాజ్ హోటల్, ఓబెరాయ్ ట్రైడెంట్ హోటల్, నారిమన్ హౌస్ వంటి కీలక ప్రదేశాలపై దాడులు జరిపారు. ఆ దాడుల్లో పలువురు విదేశీయులు సహా 166 మంది మరణించగా, 308 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో ఏడుగురు పోలీసులు కూడా ఉన్నారు. పోలీసుల ఎదురుదాడిలో తొమ్మిది మంది ఉగ్రవాదులు మరణించగా, అజ్మల్ కసబ్ అనే ఉగ్రవాది ఒక్కడే ప్రాణాలతో పట్టుబడ్డాడు. కోర్టు అతడికి ఉరిశిక్ష విధించింది. మనదేశంలో ‘ఉగ్ర’సంస్థలు గడచిన రెండు దశాబ్దాల కాలంలో భారత్లోను, దక్షిణాసియాలోని ఇరుగు పొరుగు దేశాల్లోను దాదాపు 180 ఉగ్రవాద సంస్థలు క్రియాశీలంగా ఉన్నాయి. వీటిలో కొన్ని సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. భారత ప్రభుత్వం 38 ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించింది. వీటిలో కొన్ని సంస్థలపై అమెరికా, యూరోపియన్ యూనియన్ కూడా నిషేధం విధించాయి. ఈ సంస్థలు ఎక్కువగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, భారత్, నేపాల్ వంటి దేశాలలో తలదాచుకుంటూ ధ్వంసరచన సాగిస్తున్నాయి. ఎన్ని అంతర్జాతీయ నిషేధాలు, ఆంక్షలు అమలులో ఉన్నా, ఉగ్రవాద సంస్థలు రకరకాల పేర్లతో ఎప్పటికప్పుడు భీభత్సకాండను సృష్టిస్తూనే ఉన్నాయి. అమాయకుల ఉసురు పోసుకుంటూనే ఉన్నాయి. దక్షిణాదిలోనూ దాడులు పొరుగుదేశం ప్రోద్బలంతో చెలరేగుతున్న ఉగ్రవాదులు దక్షిణాదిలోనూ అడపా తడపా దాడులు సాగిస్తూనే ఉన్నారు. హైదరాబాద్లోని మక్కా మసీదులో 2007 మే 18న ఉగ్రవాదులు అమర్చిన బాంబులు పేలడంతో నలుగురు పోలీసులు సహా 13 మంది మరణించారు. అదే ఏడాది ఆగస్టు 25న హైదరాబాద్లోని లుంబినీ పార్కులోను, గోకుల్ చాట్ సెంటర్లోను ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఆ పేలుళ్లలో 44 మంది మరణించగా, మరో 52 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరులో 2008 జూలై 25న జరిగిన బాంబు పేలుళ్లలో ఇద్దరు మరణించారు. హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ ప్రాంతంలో 2013 ఫిబ్రవరి 21న జరిగిన బాంబు పేలుళ్లలో 18 మంది మరణించగా, 131 మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసీన్ భత్కల్, పాక్ జాతీయుడు జియా ఉర్ రెహమాన్, అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్లకు ఉరిశిక్ష పడింది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో 2014 మే 1న ఉగ్రవాదులు అమర్చిన బాంబు పేలడంతో ఒక మహిళ మరణించగా, 14 మంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా 2005 నుంచి చూసుకుంటే, ఇప్పటి వరకు జరిగిన ఉగ్రవాద దాడుల్లో 700 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మూడువేల మందికి పైగా ప్రజలు గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో కొందరు శాశ్వత వికలాంగులుగా మిగిలారు. కీలక స్థావరాలపైనా ‘ఉగ్ర’నేత్రం మనదేశంలోని కట్టుదిట్టమైన భద్రత గల కీలక స్థావరాలపైనా ఉగ్రవాదులు కన్నేశారు. ఢిల్లీలోని ఎర్రకోటపై 2000 డిసెంబర్ 22న ఆరుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆ దాడిలో ఇద్దరు సిపాయిలు, ఒక పౌరుడు మరణించగా, మరో 14 మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్కు ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన ఆరుగురు నిందితులకు ఏడేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. ఎర్రకోటపై దాడి చేసిన ఏడాదిలోగానే... పాక్ ఉగ్రవాదులు 2001 అక్టోబర్ 1న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీపై దాడి చేశారు. అదే ఏడాది డిసెంబర్ 13న ఉభయ సభలు కొలువు తీరిన వేళ ఏకంగా పార్లమెంటు భవనంపైన దాడికి పాల్పడి దేశ సార్వభౌమత్వానికే సవాలు విసిరారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీపై జరిగిన దాడిలో 38 మంది మరణించగా, పార్లమెంటుపై జరిగిన దాడిలో ఆరుగురు పోలీసులు, ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. మరో ముగ్గురు పౌరులు మరణించారు. పార్లమెంటుపై దాడికి సంబంధించి జైషే మహ్మద్ ఉగ్రవాది అఫ్జల్ గురుకు ఉరిశిక్ష పడింది. ప్రపంచవ్యాప్త పరిస్థితి ఉగ్రవాదం ఏ ఒకటి రెండు దేశాలకు మాత్రమో పరిమితమైన సమస్య కాదు. ఇది ప్రపంచమంతటికీ ఆందోళన కలిగిస్తున్న బెడద. ఉగ్రవాదుల దాడుల కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన మొదటి పది దేశాల్లో భారత్ కూడా ఉండటం ఆందోళనకరం. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ (జీటీఐ) గత ఏడాది 2015 నాటి గణాంకాలను వెల్లడించింది. వాటి ఆధారంగా ఉగ్రవాదుల దాడుల కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన మొదటి పది దేశాల వివరాలు... అత్యంత ప్రమాదకర ‘ఉగ్ర’సంస్థలు అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థల్లో ఐసిస్ మొదటి స్థానంలో నిలుస్తోంది. జీటీఐ లెక్కల ప్రకారం 2015లో ఐసిస్ ఉగ్రవాదులు 6,141 మందిని పొట్టన పెట్టుకున్నారు. బోకోహరామ్ ఉగ్రవాదుల చేతిలో 5,478 మంది, అఫ్ఘాన్ తాలిబన్ల చేతిలో 4,502 మంది, ‘అల్కాయిదా’ చేతిలో 1,620 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. -
'ప్రపంచ మ్యాప్లో పాక్ ఉండదు'
వాషింగ్టన్: సైన్యం, దాని అడుగుజాడల్లో నడిచే ఐఎస్ఐలే పాకిస్తాన్కు ప్రధాన శత్రువులని ఆ దేశ ప్రధాన ప్రతిపక్షం ముత్తహిదా క్వామీ మూవ్మెంట్(ఎంక్యూఎం) ఆరోపించింది. బలూచ్, మొహజిర్ల హక్కులను కాలరాస్తూ సైన్యం అకృత్యాలు ఇలాగే కొనసాగితే ప్రపంచపటం నుంచి పాకిస్తాన్ కనుమరుగవటం ఖాయమని ఎంక్యూఎం నేత అల్తాఫ్ హుస్సేన్ హెచ్చరించారు. తీవ్రవాదుల ఏరివేత పేరిట పాక్ సైన్యం బలూచిస్తాన్లో చేపట్టిన సైనిక చర్యలో వేలాది మంది బలూచ్ పౌరులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. సింథి, పక్తూన్, పంజాబ్ భూస్వాములు స్వార్థ ప్రయోజనాల కోసం పాక్ సైన్యానికి దాసోహం అంటున్నారని తెలిపారు. కరాచీ, బలూచిస్తాన్లలో ఆర్మీ తన కార్యక్రమాలను వెంటనే నిలిపివేయాలని కోరారు. మొహజిర్, బలూచ్ నాయకత్వాలతో చర్చలు జరిపి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. అలా కాకుండా, సైనిక చర్యలు కొనసాగితే దేశం నాశనం కావటం ఖాయమని పేర్కొన్నారు. సైన్యం, ఐఎస్ఐ కుమ్మక్కై తీవ్రవాదులకు ఆశ్రయం, రక్షణ కల్పిస్తూ పొరుగు దేశాల్లో ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్నాయని ఆరోపించారు. ఒసామా బిన్ లాడెన్ లాంటి అంతర్జాతీయ తీవ్రవాదులకు పాక్ ఆర్మీ, ఐఎస్ఐలు అండగా నిలబడి అనేక ఏళ్ల పాటు రక్షణ కల్పించాయని కూడా తెలిపారు. కాగా, అల్తాఫ్ హుస్సేన్ గత కొన్నేళ్లుగా లండన్లో అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. -
ఆ ఉద్యమం వెనుక ఐఎస్ఐ?
తమిళనాడులో ఉవ్వెత్తున ఎగసిన జల్లికట్టు ఉద్యమం చాలావరకు అహింసాయుతంగానే సాగినా.. చివర్లో మాత్రం ఒక్కసారిగా హింస ప్రజ్వరిల్లింది. దీనిపై పలువురు ప్రముఖులు స్పందించారు. ఉద్యమాన్ని ఆపేయాలని సూపర్ స్టార్ రజనీకాంత్ పిలుపునిచ్చారు. అయితే.. ఈ ఉద్యమం వెనక ఐఎస్ఐ హస్తం ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ సుబ్రమణ్యం స్వామి అనుమానం వ్యక్తం చేశారు. ముందంతా కేవలం విద్యార్థులు, యువత మాత్రమే ఉన్న ఈ ఉద్యమంలోకి ఐఎస్ఐ వచ్చిన తర్వాతే హింస చెలరేగిందని ఆయన అన్నారు. నిజాయితీగా ఉద్యమం చేస్తున్నవాళ్లు చాలామంది ఇప్పుడు అక్కడ లేరని.. దానికి బదులు సంఘవిద్రోహ శక్తులు అందులోకి ప్రవేశించాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జల్లికట్టు కోసం తాను ముందునుంచి పోరాడుతున్నానని, కాంగ్రెస్ పార్టీ మాత్రం దాన్ని దగ్గరుండి నిషేధించిందని అన్నారు. తాము ముందునుంచి ఆట పట్ల సానుభూతితోనే ఉన్నామని.. అయితే ఇప్పుడు తమకు శాశ్వత పరిష్కారం కావాలని వాళ్లంటున్నారు గానీ, అది ఎక్కడి నుంచి వస్తుందని స్వామి ప్రశ్నించారు. -
ఈ ప్రమాదాలకు బాధ్యులు ఎవరు?
మూణ్ణెళ్లుగా దేశంలో వరుసగా జరగుతున్న రైలు ప్రమాదాల్లో 200మందికి పైగా అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. వందల మంది గాయాలపాలయ్యారు. ప్రమాదాలు జరుగుతున్న తీరు విచారణ సంస్ధలకు లభిస్తున్న క్లూలు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. రైలు ప్రమాదాల కేసులను టేకప్ చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఐఏ)కు పలు కీలక ఆధారాలు లభించాయి. తూర్పు చంపారన్ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనాస్ధలిలో ఓ పేలని ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్(ఐఈడీ) పోలీసులకు లభ్యమైంది. అంతేకాకుండా నేపాల్ లో గత ఏడాది జరిగిన రెండు హత్యలకు, భారత్లో జరుగుతున్న రైలు ప్రమాదాలకు సంబంధం ఉందని ఎన్ఐఏ వద్ద ఉన్న ఆధారాలు సూచిస్తున్నాయి. ప్రమాదానికి కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న నిందితులు విచారణలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఈ రైలు ప్రమాదాలకు వ్యూహం రచించినట్లు చెప్పారు. నిందితులు అందించిన సమాచారంతో కూపీ లాగిన అధికారులకు నేపాల్, కరాచీల్లో ఉంటున్న ఇద్దరు వ్యక్తులు రైళ్ల ప్రమాదాలకు పెద్ద ఎత్తున నగదును అందించినట్లు బయటపడింది. రైలు పట్టాలపై పేలని ఐఈడీని కనిపెట్టిన బీహార్ పోలీసులు బాంబును అమర్చిన అనుమానితులు మోతీ పాశ్వన్, ఉమాశంకర్ యాదవ్, ముకేశ్ యాదవ్ లను అరెస్టు చేశారు. ఇండోర్-పాట్నా ఎక్స్ప్రెస్ను పట్టాలు తప్పించాలని నేపాల్లో బ్రిజ్ కిషోర్ గిరి అనే వ్యక్తి కుట్ర పన్నినట్లు విచారణలో వారు చెప్పారు. ఈ సమాచారంతో నేపాల్ వెళ్లిన పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే, ఐఈడీ పేలుడు సఫలీకృతం కానందుకు వాటిని అమర్చిన దీపక్ రామ్, రాక్సావుల్లను నేపాల్కు పిలిపించి గొంతు కోసి చంపినట్లు ఎన్ఏఐ అధికారి ఒకరు చెప్పారు. ఇరువురి మృతదేహాలు ఓ కారులో లభ్యమైనట్లు పేర్కొన్నారు. మృత దేహాలు లభ్యమైన కారు బ్రిజ్కు చెందిందని తెలిసింది. బ్రిజ్తో కలిసి బోర్డర్లో స్మగ్లింగ్ చేసే శంశుల్ హుడా కూడా ఈ హత్యల్లో పాలు పంచుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై నేపాల్ పోలీసులు హుడాను ప్రశ్నించగా తాను దుబాయ్ కు చెందిన బిజినెస్మ్యాన్గా అతను పేర్కొన్నాడు. కాల్ రికార్డుల ఆధారంగా హుడా తరచూ కరాచీకి చెందిన అండర్వరల్డ్ డాన్ షఫీతో తరచూ సంభాషిస్తున్నట్లు తెలిసింది. కాగా, గత కొద్ది సంవత్సరాలుగా షఫీ కార్యకలాపాలపై ఎన్ఐఏ నిఘా పెట్టి ఉంచింది. షఫీపై భారత్లో నకిలీ కరెన్సీ తయారుచేసినట్లు కేసులు ఉన్నాయి. పేలుడు పదార్ధాలను కూడా షఫీ భారత్కు సరఫరా చేస్తున్నట్లు కూడా రిపోర్టులు వచ్చాయి. దీంతో హుడాను పట్టుకునేందుకు యత్నించిన అధికారులకు ఆశ్చర్యకరమైన సంఘటన ఎదురైంది. హుడా కోసం ఓ ట్రావెల్ ఏజెన్సీని పోలీసులు సంప్రదించగా అది అతని మేనల్లుడు జియా నడుపుతున్నట్లు తెలిసింది. జియా భారత పాస్పోర్టును కూడా కలిగివున్నట్లు అధికారులు గుర్తించారు. పలువురికి భారత పాస్పోర్టులు అందించిన జియాకు డాక్యుమెంట్లను ఎవరు అందించారనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. అండర్వరల్డ్ సహాకారంతో భారత్లోకి పేలుడు పదార్ధాలు, నకిలీ నోట్లు సరఫరా చేయడం కొత్తేం కాదు. గతంలో నేపాల్ కూడా భారత్పై ఉగ్రదాడులకు పాల్పడింది. కానీ, తాజాగా జరుగుతున్న రైలు ప్రమాద ఘటనల్లో భారత యువతే ఉంటోంది. ఈ విషయం భద్రతా సంస్ధలకు కలవరపాటుకు గురి చేస్తోంది. ఎంత స్ధాయిలో స్ధానిక యువత అండర్వరల్డ్కు ఉపయోగపడుతోందో సరైన అవగాహన నిఘా సంస్ధలకు ఇంకా లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పారు. -
సిట్ అదుపులో ‘జైషే’ ఉగ్రవాది రెహ్మాన్
బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర కేసులో వాంటెడ్ సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర పన్నిన కేసులో కీలక నిందితుడిగా ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాది జకీ ఉర్ రెహ్మాన్ను సీసీఎస్ అధీనంలోని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 12 ఏళ్లుగా విదేశాల్లో తలదాచుకున్న రెహ్మాన్ తిరిగి వచ్చి పోలీసులకు చిక్కాడు. ఇతడిని విచారిస్తున్న పోలీసులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. దుబాయ్ నుంచే కుట్ర... పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కనుసన్నల్లో పని చేస్తున్న జైషే మహ్మద్కు మౌలానా మసూద్ అజహర్ నేతృత్వం వహిస్తున్నాడు. సైదాబాద్లోని కూర్మగూడ కి చెందిన ఫర్హాతుల్లా ఘోరీ, ఇతడి సమీప బంధువు జకీ ఉర్ రెహ్మాన్లతో పాటు మూసారాంబాగ్కు చెందిన షాహెద్ అలియాస్ బిలాల్ తదితరులు ఉగ్రవాదబాట పట్టిన తర్వాత పోలీసుల నుంచి తప్పించుకోవడానికి దుబాయ్ చేరారు. లష్కరే తొయిబా ద్వారా జైషే మహ్మద్లో చేరారు. దుబాయ్ నుంచే నగరంలో ఉన్న బీజేపీ నేతలు నల్లు ఇంద్ర సేనారెడ్డి, బద్దం బాల్రెడ్డి తదితరుల్ని హత్య చేయ డానికి 2004లో కుట్ర పన్నారు. ఇందుకు నగరానికి చెందిన నలుగురు, సిద్దిపేటకు చెందిన మరొకరిని రంగంలోకి దింపారు. ఈ విషయాన్ని నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో నిందితులు జునైద్, రహీమ్, జాహెద్, ఖదీర్, షకీల్ను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకుని, చార్జిషీట్లు దాఖలు చేశారు. ఎట్టకేలకు చిక్కిన జకీ రెహ్మాన్ నేర నిరూపణకు అవసరమైన సాక్ష్యాధారా లు సేకరించడంలో పోలీసులు విఫలం కావడం తో ఐదుగురిపై ఉన్న అభియోగాలను కొన్నేళ్ల క్రితం కోర్టు కొట్టేసింది. అయితే ఈ కేసులో పరారీలో ఉన్న ఫర్హాతుల్లా ఘోరీ, జకీ ఉర్ రెహ్మాన్, షాహెద్ అప్పట్లో బంగ్లాదేశ్, రియాద్, జెడ్డాల్లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. కరాచీలో షాహెద్ చనిపోగా... షర్హాతుల్లా ఘోరీ ఇప్పటికీ విదేశాల్లోనే ఉన్నాడు. రియాద్లో ఉన్న జకీ సమాచారం సేకరించిన నిఘా వర్గాలు... అక్కడి ఏజెన్సీల సాయంతో గురువారం డిపోర్టేషన్పై దుబాయ్ నుంచి ఢిల్లీకి తరలించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి నగరానికి తీసుకొచ్చారు. -
సినిమా కోసం.. పట్టాలకు బాంబులు పెట్టారు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చేరువలో చోటు చేసుకున్న రెండు రైలు ప్రమాదాలు పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ పనేనని బీహార్ పోలీసులు పేర్కొన్నారు. 2016 అక్టోబర్, డిసెంబర్ నెలల్లో జరిగిన ఈ ఘటనల్లో 151 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోగా.. 200 మందికి గాయాలయ్యాయి. రైలు ప్రమాదాలపై విచారణ చేపట్టిన పోలీసులు ఉమాశంకర్ పటేల్, మోతీలాల్ పాశ్వాన్, ముకేశ్ యాదవ్ లను అరెస్టు చేశారు. భారత్-నేపాల్ సరిహద్దులో పనిచేస్తున్న ఈ ముగ్గురూ ఘోరసహాన్ జిల్లాలోని రైల్వే ట్రాక్ కు కుక్కర్ బాంబును అమర్చినట్లు పోలీసులు చెప్పారు. విచారణలో దుబాయ్ లో ఉంటున్న ఐఎస్ఐ ఏజెంటు సూచనలతోనే రైల్వే ట్రాక్ కు బాంబు అమర్చినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. ముగ్గురిలో ఓ వ్యక్తి ఇండోర్-పాట్నా ఎక్స్ ప్రెస్, అజ్మీర్-సీల్దా ఎక్స్ ప్రెస్ లు పట్టాలు తప్పడంలో తన పాత్ర ఉన్నట్లు చెప్పాడని వివరించారు. రైలు ప్రమాదాలకు కుట్ర పన్నినందుకు ముగ్గురికీ ఇప్పటివరకూ బ్రిజ్ కిషోర్ గిరి అనే నేపాలీ జాతీయుడి నుంచి రూ.3లక్షలు అందినట్లు చెప్పారు. కాగా, బ్రిజ్ తో పాటు శంభు గిరి, ముజాహిర్ అన్సారీ అనే ఇద్దరిని నేపాల్ కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరికి కూడా ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలినట్లు చెప్పారు. అరెస్టయిన వారిలో ఒకడైన మోతీలాల్ పాశ్వాన్ గతంలో ఓ మావోయిస్టు అని తెలిపారు. ఉమాశంకర్ పై నాలుగు క్రిమినల్ కేసులు, మోతీలాల్, ముకేశ్ లపై 12 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. కాగా, రైలు పట్టాలకు బాంబులను అమర్చింది మోతీలాలేనని తెలిసింది. రైళ్లను పట్టాలు తప్పిస్తే పెద్ద మొత్తంలో నగదు, వాహనాలు ఇస్తానని బ్రిజ్ చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా ఓ భోజ్ పూరి సినిమాను తెరకెక్కించేందుకు ఆర్ధికంగా కూడా సాయపడతానని బ్రిజ్ చెప్పినట్లు మోతీలాల్ విచారణలో చెప్పాడని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి చెప్పారు. -
మింటూ.. మామూలోడు కాదు!
చండీగఢ్: పంజాబ్ లోని నభా జైలు నుంచి తప్పించుకున్న ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ హర్మీందర్ సింగ్ మింటూకు సంబంధించి దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. నభా జైలులో ఉండగా అతడు పాకిస్థాన్ కు ఫోన్లు చేసినట్టు విచారణలో వెల్లడైంది. అతడు పాకిస్థాన్ లో ఎవరికి ఫోన్ చేశాడనే దానిపై దర్యాప్తు అధికారులు కూపీ లాగుతున్నారు. ఫోన్ కాల్ వివరాలు పరిశీలిస్తున్నారు. ఖలిస్తాన్ ఉద్యమ సానుభూతిపరులు, ఐఎస్ఐ అధికారులతో మింటూ మాట్లాడినట్టు అనుమానిస్తున్నారు. ఐఎస్ఐ సహకారంతో మింటూ ఆగ్నేయాసియా, ఐరోపాలో తన కార్యకలాపాలు విస్తరించినట్టు భావిస్తున్నారు. అతడిని అధికారులు ఇంటరాగేట్ చేస్తున్నారు. నభా జైలు నుంచి తప్పించుకుని పట్టుబడ్డ అతడి దగ్గర కొంత డబ్బు దొరికింది. ఈ నగదు అతడికి ఎవరు ఇచ్చారో కనుగొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
పంజాబ్పై దాడి చేయండి: ఐఎస్ఐ
న్యూఢిల్లీ: భారత్ పై దాడి చేయాలని పాకిస్థాన్కు చెందిన సిక్కు ఉగ్రవాదులకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల శాఖకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. పంజాబ్లో తమ ఆదీనంలో ఉన్న స్లీపర్ సెల్స్ను అప్రమత్తం చేసిన ఐఎస్ఐ.. సర్బత్ ఖల్సా నిర్వాహకులను అరెస్టు చేసిన అంశాన్ని ఆసరాగా చేసుకొని అనూహ్య దాడులు చేయాలని సూచించినట్లు సమాచారం. ఈ నెల (నవంబర్) 10న బటిండాలో సిక్కులు సర్బత్ ఖల్సా కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు. అయితే, దీన్ని అదనుగా చేసుకొని ఘర్షణలు, అల్లర్లు సృష్టించాలని బబ్బార్ ఖల్సా ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్లు ఇప్పటికే నిఘావర్గాల సమాచారం అందడంతో ఈ కార్యక్రమానికి పోలీసులు, పంజాబ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. 12మంది బబ్బార్ ఖల్సా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడినట్లు కూడా తెలియడంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఆదివారం పంజాబ్ పోలీసులు పెద్ద మొత్తంలో అరెస్టు చేశారు. 180మందిని తమ అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 23న అనుమానిత ఉగ్రవాది కమల్ దీప్ సింగ్ను అరెస్టు చేసినప్పటి నుంచి ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
‘గూఢచర్యం’లో ఎంపీ వ్యక్తిగత సహాయకుడి అరెస్టు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి దేశ రక్షణ సమాచారాన్ని చేరవేస్తున్న కేసులో సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు మునవర్ సలీమ్ వ్యక్తిగత సహాయకుడు(పీఏ) ఫర్హత్ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. శుక్రవారం సలీమ్ నివాసంలో ఫర్హత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 10 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఫర్హత్కు ఐఎస్ఐతో 18 ఏళ్లుగా సంబంధాలున్నాయని, సమాచారం అందజేసినందుకు అతనికి రూ.20 వేలు ఇచ్చేవారని పోలీసులు చెప్పారు. ఫర్హత్ పేరును ఈ కేసులో సూత్రధారి, పాక హైకమిషన్ ఉద్యోగి మెహమూద్ అక్తర్ విచారణలో వెల్లడించాడని పోలీసులు తెలిపారు. వార్తా చానళ్లలో ప్రసారమైన వీడియో వాంగ్మూలంలో ఫర్హత్తో పాటు సహోద్యోగులైన సయ్యద్, ఖాదిమ్, షాహిద్, ఇక్బాల్ చీమా కూడా తనకు సహకరించినట్టు అక్తర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. పూర్తిగా విచారించిన తరువాతే ఫర్హత్ను పీఏగా నియమించుకున్నట్టు సమాజ్వాదీ పార్టీ ఎంపీ సలీమ్ వెల్లడించారు. గతంలో మరికొంత మంది ఎంపీల వద్ద కూడా అతడు పనిచేశాడన్నారు. విచారణకు అన్ని విధాలా తాను సహకరిస్తానన్నారు. -
పార్లమెంటుపై మళ్లీ ఉగ్రవాద దాడి కుట్ర!
న్యూఢిల్లీ: భారత్ పార్లమెంటుపై 2001లో జరిగిన దాడి పునరావృతం కానుందా?. తాజాగా భారత ఇంటెలిజెన్స్ అధికారులు జారీచేసిన హెచ్చరికలు ఈ విషయాన్నే నిర్ధారిస్తున్నాయి. నిర్దేశిత దాడులతో చావుదెబ్బ తిని పగతో రగిలిపోతున్న పాకిస్తాన్ నిఘా సంస్ధ ఐఎఐ భారత పార్లమెంటుపై దాడి చేయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఉగ్రసంస్ధ జైష్ ఏ మొహమ్మద్ (జేఈఎమ్) సాయం కోరినట్లు తెలిసింది. దీంతో పార్లమెంటుపై మళ్లీ దాడిచేసేందుకు జేఈఎమ్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ వ్యూహం రచిస్తున్నట్లు భారతీయ ఇంటెలిజెన్స్ సంస్ధలు హెచ్చరించాయి. ఎలాగైనా పార్లమెంటుపై దాడిచేయాలని అజర్ నుంచి ఆపరేటివ్స్ కు ఇప్పటికే సూచనలు అందినట్లు తెలిసింది. మావవబాంబు ప్రయత్నం పార్లమెంటుపై ఫలించకపోతే, ఢిల్లీ సెక్రటరియేట్, అక్షరధామ్, లోటస్ టెంపుల్ లపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. వీటిపై దాడి కుదరకపోతే జనాభా ఎక్కువగా ఉండే మార్కెట్లలో మానవ బాంబును ప్రయత్నించాలనే సూచనలు కూడా జేఈఎమ్ ఆపరేటివ్స్ కు ఉన్నాయి. ఈ మేరకు భారత ఇంటెలిజెన్స్ వివిధ శాఖల అధికారులను హెచ్చరించింది. పార్లమెంటు భద్రతలో లోపాలను సరిచేసేందుకు ఆప్ నేత తీసిన వీడియోను (పార్లమెంటు పరిసరాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు) ఇంటెలిజెన్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. కాగా, ఇప్పటికే ఇద్దరు జేఈఎమ్ టెర్రరిస్టులు ఫిదాయీ (మానవబాంబు) కావడానికి ఆపిల్ పండ్ల ట్రక్కు ద్వారా మారణాయుధాలతో ఢిల్లీలోని ఓ మార్కెట్ కు వచ్చినట్లు ఇంతకుముందు ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వచ్చాయి. 2012 ఫిబ్రవరిలో ఢిల్లీలో చివరగా ఉగ్రదాడి జరిగింది. ప్రస్తుతం పాక్ లో ఉంటున్న మసూద్ అజర్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, కశ్మీర్ లలో దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఐఎస్ఐ పిలుపుతో మళ్లీ ఢిల్లీలో నరమేధం సృష్టించేందుకు అఫ్ఘానిస్థాన్కు చెందిన మరో ఉగ్రసంస్ధ, జేఈఎమ్ లో చీలిక జైషుల్-హక్ తంజీమ్ తో చేతులు కలిపినట్లు తెలిసింది. జైషుల్-హక్ తంజీమ్ చీఫ్ మౌలానా అబ్దుర్ రెహమాన్ భారతదేశ వ్యాప్తంగా దాడులు నిర్వహించేందుకు గతంలో కుట్ర పన్నాడు. ఇద్దరు ఎంఏఆర్ రిక్రూటర్లు అహ్మద్ ఖాన్ దుర్రాని, అహ్మద్ ఖాద్రీలు గత ఏడాది నవంబర్ లో కాబుల్ నుంచి ఢిల్లీకి వచ్చారు. ఆరు ప్రదేశాల్లో బాంబు పేలుళ్లకు కుట్రపన్నగా అనుకోకుండా పేలుడు సంభవించడంతో పారిపోయారు. -
ద్వారకపై ఉగ్ర గురి
అహ్మదాబాద్: గుజరాత్ లోని ద్వారక గుడిపై దాడికి ఉగ్రమూకలు కుట్ర పన్నాయి. కేంద్ర నిఘా సంస్ధ(సీఐ) బుధవారం అందించిన సమాచారం మేరకు గుజరాత్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ సంస్ధ ఐఎస్ఐ ద్వారక గుడిపై పెద్ద దాడికి కుట్ర పన్నినట్లు సమాచారం ఉందని సీఐ తెలిపింది. గుడిలో నరమేథం సృష్టించేందుకు ఇప్పటికే 12 నుంచి 15 మంది ముష్కరులు గుజరాత్ తీర ప్రాంతానికి చేరుకుని ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. ద్వారకా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ముష్కరులు నక్కి ఉండే అవకాశం కూడా ఉందని తెలిపింది. దీంతో అధికారులు తీర ప్రాంత గస్తీని పెంచారు. రెండు అనుమానాస్పద చేపల పడవలు భారత జలాల్లోకి ప్రవేశించడానికి వేడి చూస్తున్నట్లు కూడా సీఐకు సమాచారం ఉంది. ఈ విషయంపై కోస్ట్ గార్డు, నేవీ, మెరైన్ పోలీసులకు సీఐ సమాచారం అందించినట్లు తెలిసింది. -
పాకిస్థాన్పై రగిలిపోతున్న పీవోకే!
ముజఫరాబాద్: పాకిస్థాన్ ఆర్మీ, ఆ దేశ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ పాల్పడుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రజలు ఆందోళన బాట పట్టారు. పాకిస్థాన్కు వ్యతిరేకంగా గళమెత్తుతున్న కశ్మీర్ ఆజాదీ నేతల బూటకపు ఎన్కౌంటర్లు, అక్రమ హత్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ఆర్మీ, ఐఎస్ఐ కూడబల్కుకొని ఈ హత్యలు చేస్తున్నాయంటూ పీవోకేలోని కోటిల్ వాసులు ఇటీవల భారీ ఆందోళన నిర్వహించారు. ‘కశ్మీర్ను ముక్కలు చేసిన కసాయి పాకిస్థాన్ ఆర్మీ’, ‘ఐఎస్ఐ కన్నా కుక్కలు విధేయంగా ఉంటాయి’ అంటూ ఈ సందర్భంగా ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కశ్మీరీ జాతీయవాద ప్రధాన నేత ఆరిఫ్ షాహిద్ హత్యపై స్వతంత్ర దర్యాప్తు జరుపాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అఖిలపక్ష జాతీయ కూటమి (ఏపీఎన్ఏ) చైర్మన్, జమ్మూకశ్మీర్ జాతీయ విముక్తి కాన్ఫరెన్స్ (జేకేఎన్ఎల్సీ) అధ్యక్షుడు అయిన 60 ఏళ్ల షాహిద్ 2013 మే 14న రావాల్పిండిలో తన ఇంటి ఎదుట హత్యకు గురయ్యారు. పీవోకేలో పాక్ అణచివేతను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయనను ఐఎస్ఐ కుట్రపూరితంగా చంపిందని ఆరోపణలు ఉన్నాయి. ముజఫరాబాద్లోని అఖిలప జాతీయ కూటమి లెక్కల ప్రకారం దాదాపు వందమంది కశ్మీర్ ఆజాదీ అనుకూల రాజకీయ కార్యకర్తలను పాక్ కిరాతకంగా హతమార్చిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీవోకేలో ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. -
పాకిస్థాన్పై రగిలిపోతున్న పీవోకే!
-
‘నకిలీ’ ముద్రణకు పాక్లో పవర్ప్రెస్
- దొంగ నోట్ల తయారీకి క్వెట్టా కేంద్రంగా ఏర్పాటు - బంగ్లాదేశ్ మీదుగా భారత్లోకి పంపుతున్న ఐఎస్ఐ సాక్షి, హైదరాబాద్: భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ఉద్దేశంతో భారీగా నకిలీ కరెన్సీని ముద్రించి, దేశంలోకి పంపిస్తున్న పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ.. దీనికోసం ప్రత్యేకంగా పవర్ప్రెస్ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా ప్రాంతం నుంచి నకిలీ కరెన్సీని తీసుకువచ్చి హైదరాబాద్లో చెలామణి చేయడానికి యత్నించిన అంతర్రాష్ట్ర ముఠాను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు బెంగాలీలతో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 11.95 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఈ కరెన్సీ సైతం పవర్ ప్రెస్లోనే ముద్రితమై బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమ బెంగాల్కు వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతం క్వెట్టాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ‘భారత్ పవర్ ప్రెస్’లో ముద్రితమవుతున్న నకిలీ నోట్లు అసలు కరెన్సీని తలదన్నేలా ఉన్నప్పటికీ... మూడు సెక్యూరిటీ ఫీచర్స్ను మాత్రం ఐఎస్ఐ కాపీ చేయలేకపోయింది. తొలిసారిగా యూఏపీఏ కింద కేసు నకిలీ కరెన్సీ కేసుల్ని పోలీసులు ఐపీసీలోని సెక్షన్ 489 కింద నమోదు చేస్తారు. గౌస్ ఇప్పటికి 9 సార్లు చిక్కగా.. ఇదే సెక్షన్ కింద కేసు నమోదు కావడంతో బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ దందా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తొలిసారిగా నకిలీ కరెన్సీ కేసును అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (యూఏపీఏ) కింద పోలీసులు నమోదు చేశారు. దీంతో ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి మార్గం సుగమమైంది. ఇకపై ఈ తరహా కేసుల్ని ఈ చట్ట ప్రకారమే నమోదు చేయాలని నిర్ణయించారు. నకిలీ కరెన్సీని మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న భార త పవర్ ప్రెస్కు పంపి పరీక్షలు చేయించారు. రూటు మార్చి భారత్కు సరఫరా... క్వెట్టాలో ముద్రితమవుతున్న ఈ నకిలీ కరెన్సీ తొలుత కరాచీకి చేరుతోంది. అక్కడ నుంచి ఐఎస్ఐ ప్రత్యేక పార్శిల్స్ ద్వారా వివిధ మార్గాల్లో భారత్కు పంపిస్తోంది. గతంలోలా సముద్ర మార్గం ద్వారా తరలించడం కష్టంగా మారడంతో ఐఎస్ఐ రూటు మార్చింది. కరాచీ నుంచి విమానాల ద్వారా బంగ్లాదేశ్కు చేరవేస్తోంది. అక్కడ నుంచి పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాకు తీసుకువచ్చి ఏజెంట్ల ద్వారా చెలామణి చేయిస్తోంది. తద్వార దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడంతో పాటు అలా వచ్చే నిధుల్ని పాక్ పరోక్షంగా ఉగ్రవాదానికి వాడుతోందనే అనుమానాలున్నాయి. ఏజెం ట్లకు ఐఎస్ఐ భారీగా కమీషన్లు చెల్లిస్తోంది. -
భారత నకిలీ కరెన్సీ కోసం పాక్ ప్రత్యేక ప్రెస్
భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ఉద్దేశంతో భారీగా నకిలీ కరెన్సీని ముద్రించి, దేశంలోకి పంపిస్తున్న పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ దీనికోసం ప్రత్యేకంగా పవర్ప్రెస్ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం పాతబస్తీలో దొరికిన కరెన్సీ సైతం అక్కడే ముద్రితమై బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమ బెంగాల్కు వచ్చినట్లు భావిస్తున్నారు. పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రాంతంలో ఉన్న క్వెట్టాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ‘భారత్ పవర్ ప్రెస్’లో ముద్రితమవుతున్న ఈ నకిలీ నోట్లు అసలు వాటిని తలదన్నేలా ఉన్నప్పటికీ... మూడు సెక్యూరిటీ ఫీచర్స్ను మాత్రం ఐఎస్ఐ కాపీ చేయలేకపోయింది. రూటు మార్చి భారత్కు సరఫరా... క్వెట్టాలో ముద్రితమవుతున్న ఈ నకిలీ కరెన్సీ తొలుత ఆ దేశ రాజధాని కరాచీకి చేరుతోంది. అక్కడ నుంచి ఐఎస్ఐ ప్రత్యేక పార్శిల్స్ ద్వారా వివిధ మార్గాల్లో భారత్కు పంపిస్తోంది. ఒకప్పుడు పాకిస్థాన్ నుంచి విమానాల ద్వారా దుబాయ్/సౌదీ అరేబియాలను తరలించే వారు. అక్కడున్న ఏజెంట్ల సహకారంతో జల మార్గంలో ఓడల ద్వారా గుజరాత్, మహారాష్ట్రల్లోని వివిధ ఓడ రేవులకు చేర్చేవారు. చిత్తుకాగితాలు, ముడిసరుకులు ఇలా అనేక పేర్లతో ఈ కన్సైన్మెంట్స్ వచ్చేవి. గడిచిన కొన్నేళ్ళుగా ఈ మార్గంలో తీసుకురావడం కష్టంగా మారడంతో ఐఎస్ఐ తన రూటు మార్చింది. కరాచీ నుంచి విమానాల ద్వారా బంగ్లాదేశ్కు చేరవేస్తోంది. అక్కడ నుంచి పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాకు తీసుకువచ్చి ఏజెంట్ల ద్వారా చెలామణి చేయిస్తోంది. క్వాలిటీతో పాటే పెరిగిన ‘కమీషన్’... నకిలీ కరెన్సీ డంప్ చేసి చెలామణి చేయించడం ద్వారా పాకిస్థాన్ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడంతో పాటు అలా వచ్చే నిధుల్ని పరోక్షంగా ఉగ్రవాదానికి వాడుతోందనే అనుమానాలున్నాయి. కరాచీ నుంచి మల్దా వరకు వివిధ దశల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్న ఐఎస్ఐ వారికి కమీషన్లు చెల్లిస్తోంది. సాధారణంగా హైదరాబాద్కు చేరే నకిలీ కరెన్సీ మార్పిడిన రేటు 1:3గా ఉండేది. అంటే రూ.30 వేలు అసలు నోట్లు ఇస్తే ఏజెంట్లు రూ.లక్ష నకిలీ కరెన్సీ ఇచ్చే వారు. ఏళ్ళుగా ఇదే రేటు కొనసాగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో ఈ కమీషన్ పెరిగింది. కరెన్సీ నోట్లను పక్కాగా ముద్రిస్తున్న నేపథ్యంలోనే ఈ కమీషన్ కూడా పెంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం చిక్కిన కరెన్సీని పాతబస్తీకి చెందిన గౌస్కు మాల్దాకు చెందిన బబ్లూ 1:2 రేష్యోలో (రూ.50 వేల అసలు కరెన్సీకి రూ.లక్ష నకిలీ నోట్లు) ఇచ్చినట్లు వెల్లడైంది. పంథా మార్చిన పోలీసులు... సాధారణంగా నకిలీ కరెన్సీ కేసుల్ని పోలీసులు ఐపీసీలోని సెక్షన్ 489 కింద నమోదు చేస్తారు. గౌస్ ఇప్పటికి తొమ్మిదిసార్లు చిక్కగా... ఇదే సెక్షన్ కింద కేసు నమోదు కావడంతో బెయిల్పై బయటకు వచ్చి మళ్ళీ దందా ప్రారంభించాడు. దీన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు తొలిసారిగా నకిలీ కరెన్సీ కేసును అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (యూఏపీఏ) కింద నమోదు చేశారు. దీంతో ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి మార్గం సుగమమైంది. ఇకపై ఈ తరహా కేసుల్ని ఈ చట్ట ప్రకారమే నమోదు చేయాలని నిర్ణయించారు. అయితే ఇలా నమోదు చేసిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న కరెన్సీని విలేకరుల సమావేశంలో బయటకు ప్రదర్శించకూడదు. మరోపక్క 48 గంటల్లో కోర్టు ద్వారా నకిలీ కరెన్సీని మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న భారత పవర్ ప్రెస్కు పంపి పరీక్షలు చేయించారు. అక్కడి అధికారులు గరిష్టంగా 15 రోజుల్లోగా కోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పోలీసులు ఆ సన్నాహాలు ప్రారంభించారు. -
లాడెన్ను కనిపెట్టాడనే కోపంతో..!?
వాషింగ్టన్: అడ్డు తగిలేవారిని, అవసరం తీరిందనుకున్నవాళ్లని సైలెంట్ గా ఫినిష్ చేస్తాయి గూఢచార సంస్థలు! అలాంటి కుట్రల్లో ఆరితేరిన పాక్ ఐఎస్ఐ.. ఓ సీఐఏ అధికారిపైనా విషప్రయోగం జరిపినట్లు తెలిసింది. బిన్ లాడెన్ను తమ దేశంలోనే దాచిపెట్టి, పైకి అతణ్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు నటించిన పాకిస్థాన్.. లాడెన్ జాడ కనిపెట్టడంలో కీలకంగా వ్యవహరించిన సీఐఏ అధికారిపై విష ప్రయోగం జరిపినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. సీఐఏ చీఫ్గా పాకిస్థాన్లో పనిచేసిన మార్క్ కెల్టన్ పై ఐఎస్ఐ విషప్రయోగం చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. 2011 మే 4న అమెరికా సీల్ దళాలు అబోతాబాద్ లోని ఇంటిపై దాడిచేసి అల్ కాయిదా చీఫ్ బిన్ లాడెన్ ను అంతం చేసిన రెండు నెలల తర్వాత సీఐఏ చీఫ్ మార్క్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను పాకిస్థాన్ నుంచి వెనక్కి పిలిపించారు. అమెరికా వెళ్లిన తర్వాత మార్క్ అనారోగ్యం తీవ్రం కావడంతో దాదాపు మరణం అంచుల దాకా వెళ్లొచ్చారు. ఆయన బాధకు కారణం ఏమిటనేది డాక్టర్లు వెంటనే కనిపెట్టలేకపోయారు. చివరికి పొత్తికడుపు ప్రాంతంలో ఆపరేషన్ చేసి మార్క్ ను బతికించిన డాక్టర్లు.. ఆయనపై విషప్రయోగం జరిగి ఉండొచ్చని నిర్ధారించారు. ఇదే విషయాన్ని మార్క్ కూడా అంగీకరిస్తూ.. గూఢచార సంస్థల్లో పనిచేసే వాళ్లపై ఇలాంటి భయంకరమైన ప్రయోగాలు కొత్తేమీ కాదని, ప్రపంచానికి శత్రువు లాంటి లాడెన్ ను చంపడంలో కీలక వ్యక్తినయినందుకు గర్వంగా ఉందని అన్నారు. అయితే విషప్రయోగంపై తగిన ఆధారాలు లభించే అవకాశం లేనందున మార్క్ విషయంలో పాకిస్థాన్ ను బహిరంగంగా నిందించలేమని సీఐఏ అధికార ప్రతినిధి డీన్ బోయ్డ్ అన్నారు. ఐఎస్ఐ గతంలోనూ ఎంతో మంది జర్నలిస్టులు, దౌత్యవేత్తలపై విషప్రయోగాలు జరిపిందని, తనకు ఇష్టం లేని విధంగా కెల్టన్.. లాడెన్ గుట్టురట్టు చేసినందుకు ఐఎస్ఐ ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండొచ్చని ఇంకొందరు సీఐఏ అధికారులు పేర్కొన్నారు. -
గూఢచర్యానికి ఐఎస్ఐ వాడుకుంటున్న దారిదే!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్(ఐఎస్ఐ) భారతీయ రక్షణ వ్యవస్థపై నిఘా ఉంచుతుందన్న విషయం తెలిసిందే. కానీ, ఏ పద్ధతిలో రక్షణ వివరాలను సేకరిస్తోందో తెలిస్తే షాక్ అవకుండా ఉండలేం. ప్రస్తుతం లేవగానే అది లేకుండా బతకలేం అనిపించే మొబైల్ ఇందుకు సాధనంగా వాడుతున్నట్లు లోక్ సభ సమావేశాల్లో హోం శాఖ మంత్రి హరిభాయ్ పటేల్ చౌదరి తెలిపారు. భారత రక్షణ వ్యవస్థలో పనిచేసి రిటైరయిన వారికి ఉద్యోగం, డబ్బు తదితరాలను ఆశ చూపి గూడచర్యానికి ఉపయోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కొన్ని రకాలైన వైరస్ తో ఆండ్రాయిడ్ ఆప్ లను తయారు చేసి ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. టాప్ గన్(ఆటల యాప్), ఎమ్పీ జుంకీ(మ్యూజిక్ యాప్), వీడీ జంకీ(వీడియో యాప్), టాకింగ్ ఫ్రాగ్(ఎంటర్టైన్ మెంట్ యాప్)లలో వైరస్ ను ఉపయోగించి అధికారులను ఆకర్షిస్తున్నారని ఆయన చెప్పారు. 2013 నుంచి 2016 మధ్యకాలంలో ఏడుగురు రిటైర్డ్ ఉద్యోగులు ఐఎస్ఐకు సమాచారం అందిస్తూ దొరికిపోయినట్లు తెలిపారు. ఐఎస్ఐ స్మార్ట్ ఫోన్లను పావుగా వాడుకుంటుడాన్ని భారత భద్రతా సిబ్బంది పసిగట్టిందని ఆయన వివరించారు. ప్రభుత్వ సంస్థలన్నింటికి కంప్యూటర్ సెక్యూరిటీ పాలసీని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సైబర్ దాడులను ఉద్యోగులు, అధికారలు సమర్ధవంతంగా ఎదుర్కొనే విధంగా చేశామని, అన్ని ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ కెమెరాలను ఉపయోగిస్తున్నట్లు చౌదరి తెలిపారు. -
‘ఉగ్ర’ ముఠాలను అణచాల్సిందే
వాషింగ్టన్: ప్రపంచానికి పెను సవాలుగా మారిన ఉగ్రవాద సంస్థలన్నింటిపైనా చర్యలు తీసుకోవాల్సిందేనని పాకిస్తాన్కు అమెరికా స్పష్టం చేసింది. హక్కానీ నెట్వర్క్ సహా ఎవరినీ వదిలిపెట్టకూడదంది. పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐతో హక్కానీకి ఉన్నసంబంధాలను అమెరికాకు చెందిన కేబుల్ ఒకటి బయటపెట్టడంతో అమెరికా ప్రతినిధి కిర్బీ ఈమేరకు స్పష్టం చేశారు. 2009లో అఫ్గానిస్తాన్లోని సీఐఏ క్యాంప్పై ఆత్మాహుతి దాడికిగాను హక్కానీకి ఐఎస్ఐ 2 లక్షల డాలర్లు ఇచ్చినట్టు ఈ కేబుల్స్ చెబుతున్నాయి. కాగా, ద్వెపాక్షిక చర్చల పునరుద్ధరణకు భారత్ ముందుకు రావడం లేదని, ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతుందని ఐరాసలోని పాక్ రాయబారి లోధీ చెప్పారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ఆరంభంలో ఆశావహ వాతావరణం కనిపించినా, ఆమోదయోగ్యం కాని షరతులతో చర్చలు నిలిపేసిందన్నారు. -
'భారతమాతకు వెన్నుపోటు పొడిచారు'
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి దర్యాప్తు మిషతో పాకిస్థాన్ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్(జిట్)ను భారత్ లోకి అనుమతించడాన్ని మొదటినుంచీ వ్యతిరేకిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ తన స్వరాన్ని తీవ్రతరం చేసింది. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పఠాన్ కోట్ విషయంలో మోదీ సర్కార్ తీరును తూర్పారబట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు కలిసి భారతమాతకు వెన్నుపోటు పొడిచారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'ఇది సిగ్గుచేటు. ప్రధాని మోదీ పాకిస్థాన్ ముందు దేశాన్ని అవమానపర్చారు. ఇంతకు ముందున్న ప్రధానులెవ్వరూ ఇలా చెయ్యలేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ఓ వైపు భారత్ మాతాకీ జై కొట్టాలని నినదిస్తున్నారు. కానీ వాళ్లే భారత మాతకు వెన్నుపోటు పొడుస్తున్నారు' అంటూ తన ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు కేజ్రీవాల్. జిట్ నివేదిక బటికి రాకముందే అందులో ఏముందో పాకిస్థాన్ మీడియా వెల్లడించడం, పఠాన్ కోట్ దాడికి పాల్పడింది పాక్ కాదు ఇండియానే అనే ప్రేలాపనలు పేలడం లాంటి పరిణామాలు మోదీ అసమర్థత వల్ల కలిగినవేనని విమర్శించారు. -
'మోదీ పాకిస్థాన్ ముందు సాగిలపడ్డారు'
న్యూఢిల్లీ: పఠాన్కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై విచారణ జరిపేందుకు పాకిస్థాన్కు చెందిన ఐదుగురు సభ్యుల దర్యాప్తు బృందం రాకను ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. పాక్ విచారణ బృందం తక్షణమే స్వదేశానికి వెళ్లిపోవాలని ప్లకార్డులు, బ్యానర్లతో ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించింది. తమ పార్టీ కార్యకర్తల చర్యలను సమర్థిస్తూ ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'ప్రధాని మోదీ పాకిస్థాన్ ముందు సాగాలపడ్డారు. ఐఎస్ఐ అధికారులను విచారణకు ఆహ్వానించడంద్వారా ఆ దేశానికి పూర్తిగా లొంగిపోయారు'అని కేజ్రీవాల్ అన్నారు. భారత్ కు వ్యతిరేకంగా పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ(ఐఎస్ఐ) తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని, పఠాన్ కోట్ ఉగ్రదాడి కూడా ఆ సంస్థ కనుసన్నల్లో జరిగిందేనని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అలాంటి ఐఎస్ఐకి చెందినవారిని విచారణ పేరుతో దేశంలోకి, అది కూడా కీలకమైన ఎయిర్ బేస్ లోకి అనుమతించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆదివారం పాకిస్థాన్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న బృందానికి పాకిస్థాన్ హై కమిషన్, ఎన్ఐఏ అధికారులు స్వాగతం పలికారు. పాక్లోని పంజాబ్ రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక విభాగం అధిపతి మహ్మద్ తాహిర్ రాయ్ నేతృత్వంలో హాజరైన ఐదుగురు సభ్యుల బృందంలో లాహోర్లోని ఇంటెలిజెన్స్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మొహ్మద్ హర్షద్ అజీమ్ అర్షద్, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) అధికారి లెఫ్టినెంట్ కల్నల్ తన్వీర్ అహ్మద్, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఇర్ఫాన్ మిర్జా, గుజరాన్వాలా సీటీడీ దర్యాప్తు అధికారి షాహీద్ తన్వీర్ ఉన్నారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతోన్న అసెంబ్లీలో ఆప్ ఎమ్మెల్యేలు కొందరు ఫ్లకార్డులు, బ్యానర్లతో ఆందోళన నిర్వహించారు. దీంతో సభ కొద్దిసేపు నిలిచిపోయింది. పాక్ బృందం సోమవారం ఉదయం ఎన్ఐఏ కేంద్రకార్యాలయాన్ని సందర్శించింది. మంగళవారం నాడు పఠాన్కోట్లో పర్యటించనున్నది. పొరుగుదేశం నుంచి ఒక దర్యాప్తు బృందం ఉగ్రదాడి ఘటనపై భారత్లో దర్యాప్తు జరుపడం ఇదే తొలిసారి. పాక్ కేంద్రంగా పనిచేసే జైష్ఈ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ జనవరి రెండున గుజరాత్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై జరిపిన దాడిలో ఏడుగురు సైనికులు ప్రాణాలుకోల్పాయారు. కౌంటర్ ఆపరేషన్ లో భద్రతా బలగాలు ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. -
ఐఎస్ఐ వ్యవహారంపై అమెరికా నిఘా
వాషింగ్టన్ : పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలపై అమెరికా పూర్తిగా దృష్టిసారిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జాన్ కెర్రీ తెలిపారు. విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో కెర్రీ మాట్లాడుతూ... ‘ఉగ్రవాద సంస్థలతో ఐఎస్ఐ సంబంధాలపై దృష్టిసారిస్తున్నాం. వచ్చే వారంలో వాషింగ్టన్లో జరగనున్న అమెరికా-పాక్ సమావేశాల్లో ఈ అంశం చర్చకు రానుంది’ అని చెప్పారు. ప్రమాదకరమైన హఖానీ నెట్వర్క్పై కూడా అమెరికా నిఘా ఉంచింది. హఖానీ నెట్వర్క్ అల్ ఖైయిదాతో కలిసి పనిచేస్తుందనే ఆరోపణలున్నాయి. 2008లో కాబూల్లోని భారత కార్యాలయంపై జరిగిన దాడి సహా భారత్, అఫ్ఘానిస్తాన్ లలో దాడులకు పాల్పడ్డారు. -
ఉగ్రమూకలకు అండ ఐఎస్ఐనే..!
♦ ముంబై దాడులపై అప్రూవర్ హెడ్లీ నిర్ధారణ ♦ ఐఎస్ఐ నుంచి లష్కరే, జైషే, హిజ్బుల్కు ఆర్థిక, సైనిక, నైతిక సహకారం ♦ లష్కరే చీఫ్ లఖ్వీకి ఆదేశాలిచ్చింది ఐఎస్ఐ అధికారి బ్రిగేడియర్ రియాజ్ ♦ సిద్ధి వినాయక ఆలయం వద్ద కూడా రెక్కీ నిర్వహించా ♦ మొదట ‘తాజ్’లో రక్షణ రంగ శాస్త్రవేత్తల సదస్సుపై దాడికి ప్లాన్ చేశారు ♦ ఐఎస్ఐ, పాక్ ఆర్మీ.. రెండింటి కోసం పనిచేశా ముంబై: 26/11 ముంబై దాడుల కేసులో అప్రూవర్గా మారిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ(55).. ఆ దాడుల్లో పాక్ ప్రమేయాన్ని నిర్ధారించే సంచలన వాస్తవాలను వెల్లడిస్తున్నాడు. భారత ఆర్థిక రాజధాని ముంబైపై ముష్కరుల దాడికి అండదండలు అందించింది పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐనేనని,ఆ దాడులకు సంబంధించి లష్కరే తోయిబా చీఫ్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి ఆదేశాలిస్తూ, పర్యవేక్షించింది స్వయంగా ఐఎస్ఐ అధికారైన బ్రిగేడియర్ రియాజ్ అని వెల్లడించాడు. పాక్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద సంస్థలు లష్కరే, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్లకు ఆర్థిక, సైనిక, నైతిక సహకారం ఐఎస్ఐ నుంచే అందుతోందన్నాడు. ముంబై దాడులకు ముందు తాను ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక ఆలయం నేవల్ ఎయిర్ స్టేషన్ వద్ద కూడా రెక్కీ చేశానన్నాడు. ఆ రెండు చోట్ల రెక్కీకి లష్కరేలో తన బాస్ సాజిద్ మిర్ తనను ఆదేశించారని తెలిపాడు. ‘సిద్ధి వినాయక వీడియో తీయాలని ప్రత్యేకంగా చెప్పాడు’ అని వివరించాడు. తాను లష్కరేతో పాటు పాక్ ఆర్మీ , ఐఎస్ఐ కోసమూ పని చేశానన్నాడు. భారత సైన్యంలోని కీలక సమాచారాన్ని సంపాదించాలని, భారత సైనికులను తమ గూఢచారులుగా నియమించేందుకు ప్రయత్నించాలని ఐఎస్ఐ అధికారి మేజర్ ఇక్బాల్ తనను ఆదేశించారని వెల్లడించాడు. వరుసగా రెండో రోజు మంగళవారం ప్రత్యేక కోర్టు జడ్జికి వీడియో లింక్ ద్వారా 4 గంటల పాటు హెడ్లీ వాంగ్మూలం ఇచ్చారు. లష్కరే లఖ్వీ ఫొటో చూపగా, అది లఖ్వీదేనన్నాడు. ముంబై దాడుల కేసులో అమెరికాలో హెడ్లీ 35 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. దాడులతో ఐఎస్ఐకి , తమ సైన్యానికి కానీ, తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదంటూ పాకిస్తాన్ ఇన్నాళ్లూ చేసిన బుకాయింపుల నిజరూపం హెడ్లీ చెబుతున్న వివరాలతో తేటతెల్లం కానుంది. నేడూ వాంగ్మూలం కొనసాగనుంది. కాగా, ముంబై దాడుల దోషులను చట్టం ముందు నిలిపేందుకు పూర్తి సహకారం భారత్కు అందిస్తామని అమెరికా పేర్కొంది. హెడ్లీ చెప్పిన మరికొన్ని వివరాలు.. ► 2007 నవంబర్, డిసెంబర్లలో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్లో లష్కరే భేటీ ఏర్పాటు చేసింది. లష్కరే కీలక సభ్యులు సాజిద్ మిర్, అబూ కాఫా కూడా హాజరయ్యారు. ముంబైలో దాడులు చేయాలని నిర్ణయించారు. తాజ్ హోటల్ వద్ద రెక్కీ బాధ్యతను నాకు అప్పగించారు. త్వరలో తాజ్లో రక్షణ రంగ శాస్త్రవేత్తల సదస్సు జరగనుందని, సదస్సు లక్ష్యంగా దాడులు చేద్దామని సాజిద్ మిర్, కాఫా ప్రతిపాదించారు. హోటల్ భవన నమూనానూ రూపొందించారు. అయితే, దాడికి కావాల్సిన ఆయుధాలతో పాటు, దాడులకు పాల్పడే ఉగ్రవాదులను ముంబైలోకి చేరవేయడంలో సమస్యలు తలెత్తడంతో ఆ ప్రణాళికను విరమించుకున్నారు. సదస్సు ఎప్పుడు జరుగుతుందనే విషయంలో కచ్చితమైన సమాచారం లేకపోవడమూ మరో కారణం. ► ఐఎస్ఐ, లష్కరే సమన్వయంతో పనిచేస్తుంటాయి. నేను విన్న విషయాల ఆధారంగానే ఈ అభిప్రాయానికి వచ్చాను. ► ముంబై దాడుల బాధ్యత మొత్తం లష్కరే గ్రూప్ అంతటిది. అయితే, ఆ సంస్థ చీఫ్ లఖ్వీ కనుక దాడులకు సంబంధించిన ఆదేశాలు ఆయన నుంచి వచ్చి ఉండవచ్చు. ► ముంబైకి మొదటిసారి 2006, సెప్టెంబర్ 14న వచ్చాను. పలు ప్రాంతాలను సర్వే చేశాను. 2007లో పలుమార్లు హోటల్ తాజ్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద రెక్కీ నిర్వహించాను. 2008లో మహారాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం, నేవల్ ఎయిర్ స్టేషన్లపై రెక్కీ నిర్వహించాను. ఉగ్రవాదులు ఎక్కడెక్కడెక్క దిగాలో నేనే నిర్ణయించాను. ► పాక్ ఆక్రమిత కశ్మీర్ పనిచేస్తున్న యునెటైడ్ జీహాద్ కౌన్సిల్లో లష్కరే, జైషే, హిజ్బుల్, హర్కత్ తదితర ఉగ్రసంస్థలు భాగస్వాములు. ► పాక్ సైన్యంలోని అధికారులు కల్నల్ హమ్జా, కల్నల్ షా, సామిర్ అలీ నాకు బాగా తెలుసు. ► పాక్ మాజీ సైన్యాధికారి రెహ్మాన్ పాషాను 2003లో కలిశాను. అప్పుడు ఆయన లష్కరే కోసం పనిచేస్తున్నాడు. రెండేళ్ల తర్వాత అల్కాయిదాలో చేరారు. ఒక లష్కరే భేటీకి ప్రధాన వక్తగా వచ్చినప్పుడు జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్ను చూశాను. ► లష్కరేను నిషేధించిన అమెరికా నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయడంపై లఖ్వీ సాబ్తో, హఫీజ్ సయీద్ సాబ్తో చర్చించాను. కానీ ఐఎస్ఐ సహా పలు పాక్ ప్రభుత్వ సంస్థలు అందులో భాగం కావాల్సి వస్తుందన్న ఆలోచనతో ఆ ప్రయత్నాన్ని విరమించాం. ► డబ్బు కోసం మోసం చేశానని లాహోర్ పోలీస్ స్టేషన్లో నా భార్య ఫైజా 2007 డిసెంబర్లో నాపై కేసు వేసింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నానని, లష్కరేతో సన్నిహిత సంబంధాలున్నాయని 2008లో ఇస్లామాబాద్లోని అమెరికా ఎంబసీలో ఫిర్యాదు చేసింది. -
హలో.. ఐఎస్ఐలో చేరతావా?
భబువా: 'హలో.. హౌ ఆర్ యూ? వీ హావ్ ఏ గ్రేట్ ఆఫర్ ఫర్ యు. మీరు గనక మా సంస్థలో పనిచేస్తే ఊహించనంత డబ్బు, ఇతర సౌకర్యాలు కల్పిస్తాం' అంటూ కొద్దిరోజుల కిందట తన కొచ్చిన ఫోన్ కాల్ ను తేలికగా తీసుకున్నాడు బిహార్ లోని భబువాకు చెందిన ఇంటర్ విద్యార్థి ముఖేశ్ కుమార్. శుక్రవారం మరోసారి అదే కాల్. ఈ సారి ఆఫర్ అమౌంట్ ను రెట్టింపు చేసిన అవతలివాళ్లు.. తాము పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకు చెందినవాళ్లమని చెప్పారు. దీంతో కంగుతిన్న ముఖేశ్.. పోలీసులను ఆశ్రయించాడు. ఈ అనుమానిత ఫోన్ కాల్ పై కేసు నమోదుచేసుకున్న పోలీసులు విషయాన్ని కేంద్ర దర్యప్తు సంస్థలకు చేరవేశారు. 'సదరు ఫోన్ కాల్ పాక్ నుంచే వచ్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్నాం. ఇంటెలిజెన్స్ బ్యూరోతోపాటు ఇతర జాతీయ స్థలకు సమాచారం పంపాం. వారే తదుపరి చర్యలు తీసుకుంటారు' అని భబువా ఎస్సీ హర్ ప్రీత్ కౌర్ మీడియాకు తెలిపారు. భబువా పట్టణంలోని ఓ కాలేజీలో 12వ తరగతి చదువుతోన్న ముఖేశ్ నిరుపేద. చదువులకయ్యే ఖర్చుల కోసం బట్టల దుకాణంలో పార్ట్ టైమ్ పనిచేస్తుంటాడు. ఇతడి ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత, డబ్బు ఆశ చూపడంద్వారా ముఖేశ్ ను లొంగదీసుకునే ప్రయత్నం జరిగి ఉండొచ్చని స్థానిక పోలీసులు భావిస్తున్నారు. -
ఐఎస్ఐ కనుసన్నల్లోనే లష్కరే పనితీరు
* పాక్ ఆర్మీతో కలిసి ఉగ్ర సంస్థల ఏర్పాటు * ఐసిస్ కమాండర్ హఫీజ్ సయీద్ ఖాన్ వెల్లడి * కశ్మీర్లో ఐసిస్ విస్తరణ.. ఖలీఫాపై త్వరలోనే శుభవార్త వాషింగ్టన్: భారత్లో విధ్వంసమే లక్ష్యంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాతోపాటు పలు ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ, ఆ దేశ ఆర్మీ పూర్తిగా సహకారం అందిస్తున్నాయని మరోసారి వెల్లడైంది. కశ్మీర్లో దాడులు, భారత్లో అనిశ్చితి సృష్టించేందుకే.. పాక్ ఆర్మీతో కలసి ఐఎస్ఐ ఈ ఉగ్ర సంస్థలను సృష్టించిందని ఐసిస్ ఆన్లైన్ మేగజైన్ ‘దబిక్’ తెలిపింది. పాకిస్తాన్, అఫ్గాస్తాన్ల ఐసిస్ బాధ్యతను చూస్తున్న హఫీజ్ సయీద్ ఖాన్ అనే ఉగ్రనేత ‘దబిక్’కు ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించారు. ‘పాకిస్తాన్లో దుష్టశక్తులు.. మరీ ముఖ్యంగా ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆర్మీ.. తమ వ్యక్తిగత అవసరాలకోసం ఏ విధంగా ఉగ్రసంస్థలను సృష్టించి కశ్మీర్లో విధ్వంసాలకు పాల్పడిందో మనకు తెలుసు’ అని అన్నారు. ‘అల్లాకోసం, ముస్లింలకోసం కాకుండా.. వారి వ్యక్తిగత ఆసక్తుల కోసం కశ్మీర్ యువతను రెచ్చగొట్టార’ని విమర్శించారు. ఐఎస్ఐ చెప్పినట్లు వింటున్నందుకే.. కశ్మీర్లోని ఏ ప్రాంతంపైనా లష్కరే తోయిబాకు ఇంకా పట్టుచిక్కలేదన్నారు. ‘అధీనంలో ఉన్న పాకిస్తాన్లోనే అల్లా చట్టాన్ని అమలుచేయలేని వారు.. కశ్మీర్లో ఏ విధంగా అల్లా రాజ్యాన్ని ఏర్పాటు చేస్తార’ని ప్రశ్నించారు. తమను ఎవరు కాపాడతారా అని కశ్మీర్ ప్రజలు ఎదురుచూస్తుంటే.. పాకిస్తాన్ తన స్వలాభం కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందుకే కశ్మీర్లోని వివిధ ఉగ్రసంస్థల కార్యకర్తలు ఐసిస్లో చేరుతున్నారని..దీనివల్ల లోయలో ఐసిస్ విస్తరణకు మంచి అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతాల్లో ఖలీఫా రాజ్య స్థాపన గురించి ముస్లింలు త్వరలోనే ఓ శుభవార్త వింటారని సయీద్ తెలిపారు. అఫ్గానిస్తాన్ తాలిబాన్ చీఫ్ ముల్లా అఖ్తర్ మన్సూర్, అతని సహచరులకు కూడా ఐఎస్ఐతో సత్సంబంధాలున్నాయని సయీద్ తెలిపారు. ఇస్లామాబాద్, పెషావర్, క్వెట్టా వంటి ప్రాంతాల్లో అఫ్గాన్ తాలిబాన్ నేతలు స్వేచ్ఛగా తిరుగుతారని.. వారికి అక్కడ నివాసాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. మన్సూర్ సలహా మండలిలోనూ ఐఎస్ఐ అధికారులు సభ్యులుగా ఉన్నారని సయీద్ తెలిపారు. కొన్ని నెలల క్రితం తాలిబాన్ నాయకుడు హమీద్ గుల్ చనిపోయినపుడే ఈ విషయం బయటపడిందన్నారు. ఐఎస్ఐ.. తను సృష్టించిన ఉగ్రవాద సంస్థలను సమన్వయం చేసేందుకు రిటైర్డ్ జనరల్ అయిన హమీద్ను నియమించిందన్నారు. 2014 అక్టోబర్లో తాలిబాన్ సంస్థకు కు గుడ్బై చెప్పిన హఫీజ్ సయీద్ ఖాన్ మరో ఐదుగురు కమాండర్లతో కలిసి ఐసిస్లో చేరారు. -
‘ఐఎస్ఐతో జాగ్రత్త’
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ గూఢచర్యంపై అప్రమత్తంగా ఉండాలని రక్షణ శాఖను కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. రక్షణ శాఖ సమాచారం కోసం ఆర్మీ మాజీ అధికారులకు ఉద్యోగ అవకాశాలు, డబ్బు ఎరవేస్తూ ముగ్గులోకి దింపుతుందని ఇంటెలిజెన్స్ నివేదికల్ని ఉటంకిస్తూ అప్రమత్తం చేసింది. ఉత్తరభారత్కు చెందిన రిటైర్డు ఆర్మీ ఉద్యోగులో నకిలీ సంస్థ ఏర్పాటు చేసి మాజీ ఉద్యోగులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉందని తెలిపింది. -
‘గూఢచర్యం’పై అధికారి అరెస్ట్
ఎయిర్ఫోర్స్ అధికారికి పాక్ ఐఎస్ఐతో సంబంధాలు ♦ హనీట్రాప్లో పడి కీలక సమాచారం అప్పగించిన రంజిత్ ♦ పంజాబ్లో అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు న్యూఢిల్లీ: హనీట్రాప్లో పడి నిఘా వర్గాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ గూఢచార సంస్థ(ఐఎస్ఐ)కు చేరవేస్తున్నాడనే ఆరోపణలతో ఎయిర్ఫోర్స్ నుంచి తొలగించిన ఓ అధికారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని పంజాబ్లోని భటిండాలో ఎయిర్ఫోర్స్ తరఫున పనిచేస్తున్న రంజిత్ కేకేగా గుర్తించారు. రంజిత్ను సోమవారం పంజాబ్లో అరెస్ట్ చేసి రిమాండ్పై ఢిల్లీకి తీసుకొచ్చారు. మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ఇటీవలే ఎయిర్ఫోర్స్ రంజిత్ను విధుల నుంచి తొలగించింది. అనంతరం ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు, మిలటరీ ఇంటెలిజెన్స్, ఎయిర్ఫోర్స్ ఎల్యూ సంయుక్త ఆపరేషన్లో రంజిత్ను అరెస్ట్ చేశారు. రంజిత్ స్వస్థలం కేరళలోని మలప్పురం. 2010లో అతను భారత వైమానిక దళంలో చేరాడు. పాకిస్తాన్కు చెందిన నిఘా విభాగాలు హనీట్రాప్ పన్నినట్టు గుర్తించారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో మహిళల పేరిట నకిలీ ఖాతాలను సృష్టించి రక్షణ శాఖ అధికారులు, భద్రతా దళాలకు చెందిన సిబ్బందికి వల వేస్తున్నారు. ఆ తర్వాత వారిని గూఢచర్యంలోకి దించి తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లో దామినీ మెక్నాటీ పేరుతో ఒక మహిళ రంజిత్కు తారసపడింది. తాను యూకేకు చెందిన మీడియా సంస్థ ప్రతినిధిగా చెప్పుకున్న ఆమె.. తమ న్యూస్ మేగజైన్లో ప్రచురించే కథనం కోసం ఎయిర్ఫోర్స్కు సంబంధించిన సమాచారం కావాలని రంజిత్ను కోరింది. దీనికి ప్రతిగా తనకు డబ్బు కావాలని రంజిత్ కోరినట్టు అధికారులు తెలిపారు. ఆ తర్వాత అతను ఎయిర్ఫోర్స్కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆమెకు అప్పగించాడు. ఇటీవల వైమానిక దళం నిర్వహించిన కార్యక్రమాలు, విమానాల కదలికలు, బేస్ క్యాంపుల వివరాలు అందజేశాడు. దీనికి ప్రతిగా అతని బ్యాంకు అకౌంట్లో డబ్బు జమ అయ్యిందని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్(క్రైం) అలోక్కుమార్ వెల్లడించారు. రంజిత్ మొబైల్కు ఇంటర్నెట్ ప్రొటోకాల్ బేస్డ్ వాయిస్ ఓవర్ కాల్స్ వచ్చిందని, అందులో బ్రిటిష్ యాసలో మాట్లాడిన ఒక మహిళ తనను తాను దామిని మెక్నాటీగా పరిచయం చేసుకుని, అతడిని ఇంటర్వ్యూ కూడా చేసిందని, ఆ తర్వాత మరింత సమాచారం కావాలని కోరిందని చెప్పారు. రంజిత్ అప్పగించిన సమచారం వల్ల కలిగే నష్టం.. దేశ భద్రతకు ఎదురయ్యే ముప్పు గురించి ఇప్పుడు అధికారులు పరిశీలన జరుపుతున్నారు. -
ఐఎస్ఐకు మాజీ సైనికుడి గూఢచర్యం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ గూఢచారి సంస్థ (ఐఎస్ఐ) తరఫున గూఢచర్యం నెరపుతున్నట్లు ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎయిర్ఫోర్స్ అధికారి రంజిత్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్ఐ తీవ్రవాదులతో సంబంధాలున్నాయని అనుమానంతో రంజిత్ సింగ్ను సోమవారం పంజాబ్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి స్వస్థలం కేరళగా గుర్తించారు. కాగా పోలీసులు ఇవాళ రంజిత్ సింగ్ను స్థానిక కోర్టులో హాజరు పరిచారు. విచారణ నిమిత్తం అతడిని అయిదు రోజుల పాటు కస్టడీకి తీసుకోనున్నారు. అయిదేళ్లుగా ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పని చేస్తున్న రంజిత్ అధికారి పాకిస్థాన్ ఏజెన్సీలు పన్నిన వలలో చిక్కుకున్నాడు. సదరు సంస్థలు ఎరవేసిన ఓ యువతితో (హనీ ట్రాప్) అశ్లీల వీడియో చాటింగ్తో ఫిదా అయి.. కీలకమైన రహస్య సమాచారాన్ని ఆమెకు అందించాడు. గత మూడు నెలలుగా సాగుతున్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కూపీ లాగడంతో వెలుగులోకి వచ్చింది. కాగా యువతిని ఎరగావేసిన పాక్ సంస్థలు తమకు కావాల్సిన సమాచారం మొత్తం లాక్కున్నాయని తేలింది. ఎయిర్ఫోర్స్లో ఉండే కీలక నెట్వర్క్ వ్యవస్థ పనితీరు, అధికారులు పేర్లు, ఫోన్ నంబర్లు, బేస్ క్యాంప్ల వివరాలు, హెడ్ క్వార్టర్స్ అడ్రస్లు, వంతెనల వివరాలను రంజిత్.... ఆ యువతికి చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎయిర్ఫోర్స్ అధికారులు గతరాత్రి రంజిత్ను విధుల నుంచి తొలగించారు. అలాగే సైనికాధికారుల నుంచి రహస్యాలను సేకరిస్తున్న ‘గూఢచర్య’ రాకెట్కు సంబంధించి జమ్మూకశ్మీర్లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
మహిళా గూఢచారులతో భారత పురుషులకు ఎర!
భారత పురుషులకు ఎరవేసేందుకు పాక్ గూఢచార సంస్థ.. ఐఎస్ఐ కొత్త పంథాను ఎంచుకుంది. సోషల్ మీడియా ద్వారా మహిళా గూఢచారులను రంగంలోకి దింపుతోంది. గతంలో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై, ఆ రాష్ట్రంలో ఇతర లక్ష్యాలపై దాడి చేసేందుకు అప్పట్లో నేపాల్ ఐఎస్ఐ ప్రయోగ కేంద్రాలనుంచి మహిళా గూఢచారులను ఇండియాలోకి ప్రవేశపెట్టారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాలనే ఆ జిహాదీలు ఆయుధాలుగా వాడుకుంటూ ఇండియాలోని పురుషులకు ఎరవేస్తున్నారు. ఇటీవలి కాలంలో మహిళా గూఢచారుల కేసులు వెలుగు చూడటంతో పోలీసు నిఘా ముమ్మరం చేశారు. 2014 ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఫిరోజ్ పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ భారతీయులు కావడం వారి అనుమానాలకు మరింత బలాన్నిచ్చింది. నిందితులను పోలీసులు విచారించగా కొత్త కోణాలు వెలుగుచూశాయి. ఇండో పాక్ చెక్ పోస్టు దగ్గరి గుస్సేన్ వాలా ప్రాంతాన్నిమహిళా గూఢచారులు రెండుసార్లు సందర్శించినట్లు తెలిసింది. వీరిద్దరినీ విడివిడిగా ట్రాప్ చేసిన ఐఎస్ఐ ఏజెంట్ జయ మిశ్రాతో వీరికి సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఇద్దరు నిందితుల్లో ఒకరు మధ్యప్రదేశ్ భోపాల్ జిల్లాకు చెందిన 43 ఏళ్ల శివ్ నారాయణ్ చంద్రవంశం గానూ, మరొకరు 35ఏళ్ల అర్జున్ మాలవ్యగాను గుర్తించారు. ఈ నిందితులిద్దరూ ఐఎస్ఐ మహిళా ఏజెంట్ జయ మిశ్రాతో ఇంటర్నెట్ లో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫిరోజ్ పూర్ పోలీస్ సీనియర్ సూపరింటెండెంట్ చెబుతున్నారు. ఐఎస్ఐ ఏజెంటుగా ఉన్న ఆ మహిళా గూఢచారి లాహోర్ లో ఓ క్లినిక్ నిర్వహిస్తోందని, ఆమె నల్లతేళ్లతో తయారు చేసిన ఔషధాలను సమాజసేవ కోసం వినియోగిస్తోందని పోలీసుల దర్యాప్తులో తేలింది. సో... భారత పురుషులు మహిళల పేర్లు కనిపించగానే కనెక్ట్ అయిపోకుండా సామాజిక మాధ్యమాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే మరి. -
వీరజవానే గూఢచర్యానికి పాల్పడ్డాడా?
-
వీరజవానే గూఢచర్యానికి పాల్పడ్డాడా?
శ్రీనగర్: అతనో వీర జవాన్... భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సైనికుడు. దేశ సరిహద్దు ప్రాంతంలో శత్రువు కెదురొడ్డి వీరోచితంగా పోరాడిన యోధుడు. మరి అలాంటి యోధుడే.. ఇపుడు దేశద్రోహిగా మారిపోయాడా.. దేశానికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలను దేశం దాటించే ప్రయత్నం చేశాడా ..వీర జవాన్ కాస్తా గూఢచారిగా మారిపోయాడా.. జమ్ము కశ్మీర్లో శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. జమ్ము కశ్మీర్ కు చెందిన మాజీ సైనికుడు మున్వర్ అహ్మద్ మీర్ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థకు సమాచారం అందిస్తున్నాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ క్రైం బ్రాంచ్ , జమ్ము కశ్మీర్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. రాజౌరి జిల్లా నివాసి అయిన మీర్పై అధికార రహస్య చట్టం కింద కేసులు నమోదయ్యాయి. కొన్ని రహస్య ప్రతాలను, కీలక సమాచారానికి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకు చేరవేశాడని పోలీసులు భావిస్తున్నారు. కీలకమైన సమాచారాన్ని ఉగ్రవాద సంస్థకు అందించాడని తమ విచారణలో తేలిందని నిఘా విభాగం అధికారులు తెలిపారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కూడా అరెస్టు చేసినట్లు రాష్ట్ర డీజిపి వెల్లడించారు. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం వీరిని రిమాండ్ కోసం ఢిల్లీకి తరలించామన్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను మాజీ సైనికుడు అహ్మద్ మిర్ ఖండించాడు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తప్పుడు ఆరోపణలతో తనను అన్యాయంగా ఇరికించారని వాదిస్తున్నాడు. కాగా మాజీ సైనికుడు మిర్ అధికార పీడీపీలో చురుకైన కార్యకర్త అని తెలుస్తోంది. -
షాహిద్ ఆఫ్రిది, హీనాతో ఆ ఉగ్రవాది సోదరుడు..
న్యూఢిల్లీ: పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ భారత్లో చేపట్టిన భారీ రాకెట్కు సంబంధించి మరిన్ని వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ రాకెట్లో భాగంగా ఢిల్లీలో రెక్కీ నిర్వహించేందుకు వచ్చి అరెస్టయిన ఉగ్రవాది మహమ్మద్ ఎజాజ్ సోదరుడి ఫొటోలు తాజాగా వెలుగుచూశాయి. పాకిస్థాన్ జాతీయుడైన ఎజాజ్ సోదరుడు ఫవాద్ ఆ దేశానికి చెందిన ప్రముఖులతో దిగిన ఫొటోలు పోలీసులకు చిక్కాయి. ఫవాద్ పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది, ఆ దేశ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్తో సన్నిహితంగా మెలుగుతూ దిగిన ఫొటోలు వెలుగుచూశాయి. ఈ ఫొటోలు నిజమైనవా? కాదా? అన్నది ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నారు. ఉగ్రవాది మహమ్మద్ ఎజాజ్ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ధ్రువపత్రాలతో బంగ్లాదేశ్ మీదుగా భారత్కు వచ్చిన ఎజాజ్ ఈ ఏడాది మార్చ్, జూలై నెలల్లో రెండుసార్లు ఢిల్లీని సందర్శించాడు. ఈ సందర్భంగా పార్లమెంటు, రాజ్పథ్ ఎదురుగ్గా దిగిన ఫొటోలు పాకిస్థాన్కు మెయిల్ చేశాడు. ఢిల్లీలో రెక్కీ నిర్వహించేందుకు తనను ఐఎస్ఐ ఇక్కడికి పంపిందని అతడు పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు.